Nalgonda
-
సూర్యాపేట డీఎంహెచ్ఓ కార్యాలయంలో విచారణ
సూర్యాపేటటౌన్: క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న సూర్యాపేట జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బృందం సభ్యులు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పర్సనల్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్, డిప్యూటీ సీఎస్ పీసీపీ ఎన్డీటీ డాక్టర్ సుమిత్రా రాణి, డిపూఓ్యటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడ్మిన్ శ్వేతా మోహన్.. డీఎంహెచ్ఓ కోటాచలాన్ని విచారించారు. సూర్యాపేటలో నాలుగు ఆస్పత్రుల పర్మిషన్కు సంబంధించిన సర్టిఫికెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి పరిశీలన అనంతరం తీసుకునే చర్యల సంబంధిత వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవిచంద్రనాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిస్తామన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని ఇండస్ట్రీయల్ పార్కు వెనుక శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 42 నుంచి 45 ఏళ్ల మధ్యన ఉంటుందని, అతడి కుడి చేతిపై అనుశ్రీ అని పచ్చబొట్టు ఉందని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు వడదెబ్బతో లేదా ఇతర అనారోగ్యంతో మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేసినట్లు తెలిసింది. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిరాజాపేట: కడుపునొప్పితో బాధపడుతూ పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ ఘటన రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. చల్లూరు గ్రామానికి చెందిన గుంటి అశోక్(47) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ అతడు చికిత్స చేయించుకుంటున్నాడు. ఈ నెల 9వ తేదీ ఉదయం అశోక్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో భార్య మాధవి ఫోన్ చేయగా అశోక్ ఫోన్ ఎత్తలేదు. దీంతో ఆమె వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూసేసరికి అశోక్ పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో కనిపించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చి అశోక్ను హైదరాబాద్లోని గాంధీ ఆస్పకి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మైసయ్య తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భూ తగాదాలతో వ్యక్తిపై గొడ్డలితో దాడితాళ్లగడ్డ (సూర్యాపేట): భూ తగాదాలతో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన సూర్యాపేట మండలం తాళ్ల ఖమ్మంపహాడ్లో శనివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్ల ఖమ్మపహాడ్ గ్రామానికి చెందిన మిర్యాల శేఖర్రెడ్డి(47) గ్రామంలో తనకున్న ఒక గుంట స్థలంలో చెట్లను కొట్టేసి చదును చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఎస్కే గౌస్, ఎస్కే సమీర్, ఎస్కే మైమూద్, ఎస్కే మల్సూర్, ఎస్కే అమీరా, ఎస్కే మున్నాభి పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మిర్యాల శేఖర్రెడ్డిపై గొడ్డలి, మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శేఖర్రెడ్డిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి మిర్యాల అమృతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట రూరల్ ఎస్ఐ ఎన్. బాలునాయక్ తెలిపారు. -
యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధికంగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ముఖ మండపం, ప్రసాద విక్రయశాల, ఇతర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అధికంగా రావడంతో ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.42,32,003 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. నృసింహుడి సన్నిధిలో విశేష పూజలు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం చేపట్టారు. సాయంత్రం జోడు సేవలను మాడ వీధిలో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. 40వేలకు పైగా దర్శించుకున్న భక్తులు ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా సమయం -
ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా..?
● క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న ఈఓ వెంకట్రావ్ వేసవి సెలవుల్లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శనివారం సుమారు 40వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ వెంకట్రావ్ శనివారం క్యూలైన్లలో, మాఢ వీధుల్లో తిరుగుతూ భక్తుల సమస్యలు తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని భక్తులను అడిగారు. ఎండల తీవ్రతకు, ఉక్కపోతకు భక్తులు ఇబ్బందులుపడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వెంట్రావ్ పేర్కొన్నారు. కొండ కింద శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం వెంటనే ఏసీలు బిగించాలని అధికారులను ఆదేశించారు. వ్రత పూజల్లో పాల్గొనే భక్తులకు సామాగ్రీ, రవ్వ ప్రసాదంతో పాటు అదనంగా శ్రీస్వామి వారి శేష వస్త్రం (శెల్లా, కనుము) అందజేసేందుకు ఏర్పాటు చేయాలని ఆధికారులకు చెప్పారు. ఆయన వెంట డిప్యుటీ ఈఓ దోర్బాల భాస్కర్శర్మ ఉన్నారు. -
విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్త
కల్తీలను గుర్తించండిలా..● యూరియా, కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్ ఎరువులుగుళికలుగా ఉంటాయి. ● ఎరువులు ఇసుక రేణువుల రూపంలో, పొటాష్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి. ● 5 మి.లీ. నీటిలో చెంచా ఎరువు వేసి బాగా కలిపితే స్వచ్ఛమైన ద్రావణంగా తయారైతే నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియా, అమ్మోనియా క్లోరైడ్ ఎరువుల పరీక్షకు 10 మి.లీ. పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి. ● ఒక చెంచా యూరియాను ఐదు మి.లీ. పరిశుభ్రమైన నీటిలో వేసి కలిపితే అడుగున మట్టి చేరితే కల్తీగా గుర్తించాలి. కొన్ని కాంప్లెక్స్ ఎరువులను ఇలాగే పరీక్షిస్తే ఇసుక రేణువులు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినా కల్తీ ఎరువుగా గుర్తించాలి.పెద్దవూర: మరో పది హేను రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. రైతులు బోర్లు, బావుల కింద పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. కొందరు రైతులు పత్తి, మిరప విత్తనాలను సైతం కొనుగోలు చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని పెద్దవూర మండల వ్యవసాయాధికారి సందీప్కుమార్ సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలతో రైతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయని, వాటిని చూసి విత్తనాలు కొనుగోలు చేయొద్దని పేర్కొన్నారు. విత్తనాలు, పురుగుల మందు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. విత్తనాల ఎంపిక..● వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. ● విత్తనాల కొనుగోలు రశీదులపై నంబర్, విత్తన రకం, కొనుగోలు తేదీ, డీలర్, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. ● గడువు దాటిన విత్తనాలు, వదులుగా, చిరిగిన ప్యాకెట్లు కొనుగోలు చేయొద్దు. ● రశీదుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకాల పన్ను నంబర్, విక్రయదారుడి గ్రామం పేరు, సంతకం, విత్తన రకం, బ్యాచ్ నంబర్, గడువు తేదీ, తూకం, ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ● కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్ద తూకం వేయించాలి. ● మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయశాఖ అధికారి, శాస్త్రవేత్తలను సంప్రదించాలి. ● విత్తనాలు కొనుగోలు చేసిన రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు ఉంచుకోవాలి. ● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలక శాతం సంతృప్తికరంగా ఉన్న వాటినే విత్తనాలుగా వాడాలి. పురుగు మందుల ఎంపిక..● పంటలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగుల మందులు కొనుగోలు చేయాలి. ● అవసరానికి మించి కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన పురుగుల మందులను వాడొద్దు. ● పురుగు మందు డబ్బాలపై చక్రాకారంలో రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి. ● పురుగు మందులు రెండు, మూడు రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలు ధ్వంసం చేసి గుంతలో పూడ్చిపెట్టాలి. ● ఒక పంటకు వాడిన మందును మరో పంటకు శాస్త్రవేత్తల సూచనలతో వాడాలి. ఎరువుల ఎంపిక..● లైసెన్స్ కల్గిన దుకాణాల్లోనే ఎరువులు కొనాలి. బిల్లులు, ఖాళీ సంచులను పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ● మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులు మాత్రమే వాడాలి. చేతికుట్టుతో ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు కచ్చితంగా ఉండాలి. ● కొనుగోలు సమయంలో డీలర్ రికార్డులో రైతు సంతకం చేయాలి. ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వ్యవసాయ అధికారి సహకారంతో పరీక్షలకు పంపాలి. ● చిల్లులు పడి, చిరిగిన ఎరువుల బస్తాలు కొనుగోలు చేయొద్దు. ఇతర పదార్థాలు కలిస్తే ఆ ఎరువును కల్తీగా గుర్తించాలి. కంపెనీల ప్రకటనలు చూసి రైతులు మోసపోవద్దు -
వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాల అపహరణ
నకిరేకల్: వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె మెడలోని బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకలపట్టణంలోని వీటీ కాలనీలో నివాసముంటున్న స్థానిక పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు తల్లి లక్ష్మమ్మ ఇంటికి శనివారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అద్దెకు రూములు కావాలంటూ వచ్చారు. తమ ఇంట్లో అద్దెకు రూములు లేవని లక్ష్మమ్మ వారికి చెప్పింది. తాగడానికి మంచినీళ్లు కావాలని సదరు వ్యక్తులు ఆమెను అడిగారు. దీంతో మంచినీళ్లు ఇచ్చేందుకు లక్ష్మమ్మ ఇంట్లోకి వెళ్తుండగా.. ఆమైపె ఆ ఇద్దరు వ్యక్తులు దాడి చేసి కాళ్లు, చేతులు కట్టివేశారు. లక్ష్మమ్మ కేకలు వేయడంతో ఆమె నోట్లో గుడ్డలు పెట్టి మొహంపై పిడుగుద్దులు గుద్దారు. అనంతరం ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసులు, చేతులకు ఉన్న వెండి గాజులు లాక్కోని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత లక్ష్మమ్మ చేతి కట్లు విప్పుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే ఆమె కూమారుడు వెంకటేశ్వరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి తమ సిబ్బందితో లక్ష్మమ్మ ఇంటికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి క్లూస్టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల దాడిలో గాయపడిన లక్ష్మమ్మను నకిరేకల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మ మ్మను ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. వృద్ధ మహిళలే టార్గెట్.. వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తూ కొన్ని రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం నకిరేకల్ మండలం మర్రుర్ గ్రామంలో పుట్ట చంద్రమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి బయట కూర్చోని ఉండగా గుర్తుతెలియన ఇద్దరు యవకులు వచ్చి తన మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు అపహరించారు. -
సెలవుల్లో.. కంప్యూటర్ శిక్షణ
తాళ్లగడ్డ (సూర్యాపేట): ఒకప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు విద్యార్థులు, యువత తమకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ లేదా స్విమ్మింగ్, కరాటే, స్పోకెన్ ఇంగ్లిష్ వంటివి నేర్చుకునేవారు. మరికొందరు సంగీతం, వివిధ రకాల కళలను నేర్చుకునేవారు. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు వేసవి సెలవుల్లో కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ ఇప్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకనుగుణంగానే పట్టణాల్లో కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు విద్యార్థులు, యువతతో కళకళలాడుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల యువత, విద్యార్థులు వేసవి సెలవుల్లో ప్రతిరోజు వచ్చి కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లలో చేరి శిక్షణ పొందుతున్నారు. కొందరు ఉపాధి కోసం మరికొందరు ఉన్నత చదువుల కోసం, ఇంకొందరు ఉద్యోగోన్నతి కోసం కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్నారు. ఆకట్టుకుంటున్న నిర్వాహకులు..సూర్యాపేట పట్టణంలో కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ల సంఖ్య పెరగడంతో పోటీని తట్టుకునేందుకు పలువురు నిర్వాహకులు ఫీజులో రాయితీ కూడా కల్పిస్తున్నారు. వేసవి కాలం కావడంతో ఎక్కువగా యువత, చిన్నారులు శిక్షణకు వస్తుండటంతో బ్యాచ్కు 10 నుంచి 5 మంది చొప్పున, ప్రతిరోజు 10 బ్యాచ్ల వరకు నడుపుతున్నారు. నెల రోజులు పాటు ఇచ్చే శిక్షణకు గాను రూ.2000 వరకు తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందిన ఐఎస్ఓ సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు పలువురు నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులు, యువత క్రీడలతో సమానంగా పిల్లలకు నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులుకొన్ని కోర్సులకు మంచి డిమాండ్యువత కంప్యూటర్ కోర్సులో ఎంస్ ఆఫీస్ నేర్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ తర్వాత ఫొటోషాప్, డీటీపీ, టాలీ, ఆటో కాడ్ వంటి కోర్సులు నేర్చుకుంటున్నారు. వీటి తర్వాత పీజీడీసీఏ ఆరు నెలల కోర్సు కావడంతో అవసరం ఉన్న వారు మాత్రమే దానిని ఎంచుకుంటారు. శిక్షణ పొందిన వారు కొందరు ఇంటర్నెట్ సెంటర్లలో, కాలేజీలు, ఆస్పత్రుల్లో కంపూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.ఫోన్ వద్దని కంప్యూటర్ క్లాసులకు.. ఇంటి దగ్గర ఫోన్ వాడుతుండటంతో మా అమ్మానాన్నలు ఫోన్కి బదులుగా జీవితంలో ఉపయోగపడే కంప్యూటర్ నేర్చుకోమని ఇనిస్టిట్యూటల్లో జాయిన్ చేశారు. కంప్యూటర్ కొంతమేర నేర్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. – ఈషాన్, 8వ తరగతి, సూర్యాపేటఉపాధి పొందేందుకు ఉపయోగంవేసవి సెలవులను వృఽథా చేయకుండా ప్రస్తు తం సూర్యాపేట పట్ట ణంలోని ఈసీఎస్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో టాలీ నేర్చుకుంటున్నాను. కాల వ్యవధి లోగా టాలీపై పట్టుసాధించి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగంలో చేరాలనేదే నా లక్ష్యం.. – నసీర్, డిగ్రీ, సూర్యాపేట భవిష్యత్ కోసం.. నేను పదో తరగతి పూర్తి చేశాను. సూర్యాపేట పట్టణానికి 15 కిలోమీటర్ల దూరం ఉన్న గుంజలూరు నుంచి రోజూ వచ్చి కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. ఉన్నత చదువుల కోసం, భవిష్యత్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నాను. – ప్రదీప్, 10వ తరగతి, గుంజలూరుకంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలోనైనా కంప్యూటర్ అనుసంధానంగానే పనులు జరుగుతున్నాయి. గతంతో అవసరం ఉంటేనే కంప్యూటర్ నేర్చుకునేవారు.. కానీ నేడు కంప్యూటర్ నేర్చుకొని ఉండటం తప్పనిసరి. శిక్షణ అనంతరం కొంత మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాము. మా వద్ద శిక్షణ తీసుకున్న వారు కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. – ఎండీ మహ్మద్, కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు -
శిక్షణతో మెరుగైన బోధన అందించాలి
నల్లగొండ : వృత్తి నైపుణ్యం కోసం ఇస్తున్న శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన పద్ధతిలో బోధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆమె తనిఖీ చేసి మాట్లాడారు. రిసోర్స్ పర్సన్లకు, జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ ఈనెల 17 వరకు మొదటి విడత, 20 నుంచి 24 వరకు రెండవ విడత, 27 నుంచి 30 వరకు మూడవ విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు ఆయా పాఠశాలల పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతంలో శిక్షణ ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్లు నల్లగొండ ఎంఈఓ అరుంధతి, నకిరేకల్ ఎంఈఓ నాగయ్య, చిట్యాల ఎంఈఓ సైదయ్య పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
విత్తన సరఫరాలో డీలర్ల పాత్ర కీలకం
రామగిరి(నల్లగొండ) : రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ప్రధానమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్లగొండ సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడరాఉ. విత్తనం విషయంలో డీలర్లు రైతులను ప్రలోభాలకు గురి చేయవద్దన్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు రైతులకు ఇచ్చే విత్తనాలను అవసరమైతే వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో తనిఖీ చేయించుకోవాలని సూచించారు. దుకాణం ముందు ఎమ్మార్పీ ధరలకు విత్తనాలను అమ్మే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. కోరమండల్ కంపెనీ టెక్నికల్ స్టాఫ్ను పెంచాలని, వారు అందజేసే ఈ –పాస్లో ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే అధిగమించే విధంగా కృషి చేయాలన్నారు. గడిచిన యాసంగి సీజన్లో 5.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 5.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మాట్లాడుతూ వచ్చే వానాకాలం జిల్లాల్లో 11 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని.. అందుకు అనుగుణంగా విత్తనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతులమీదుగా వంద మంది విత్తన డీలర్లకు ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోరమండల్ కంపెనీ సీజీఎం వెంకటేశ్వర్లు, విత్తన డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, రామ్మూర్తి, రవి, రాజేందర్, హర్ష తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్శాఖ ముందస్తు సన్నద్ధం
మిర్యాలగూడ అర్బన్ : విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేలా విద్యుత్శాఖ ముందస్తు మరమ్మతులు చేపడుతోంది. రాబోయే వర్షాకాలంలో విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికా బద్ధమైన విధానాల ద్వారా లోపాలను సరి చేస్తోంది. ప్రతీ వేసవి కాలంలో విద్యుత్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ప్రస్తుతం ట్రాన్స్కో అధికారుల ఆధ్వర్యంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ సబ్స్టేషన్ల వారీగా సరఫరా వ్యవస్థను మెరుగు పర్చుతున్నారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 172 విద్యుత్ సబ్స్టేషన్లు.. జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 172 ఉండగా, 133 కేవీ సబ్స్టేషన్లు 16 ఉన్నాయి. ఆయా సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఉండేలా అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు. లోపాలను తెలుసుకునేందుకు ఇప్పటికే పూర్తిస్థాయి సర్వే నిర్వహించిన అధికారులు ప్రస్తుతం వ్యవస్థ మెరుగుదలకు కసరత్తు చేపట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయా ప్రాంతాల సబ్స్టేషన్ల విద్యుత్ సిబ్బంది గ్రూపులుగా విడిపోయి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా విద్యుత్ సబ్స్టేషన్ల ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహణ వ్యవస్థను పర్యవేక్షిస్తుండగా ఈ నెల చివరి వరకు పనులు పూర్తి అవుతాయని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేలా మరమ్మతులుఫ కరెంట్ తీగలను తాకుతున్న చెట్ల తొలగింపు ఫ వేలాడుతున్న విద్యుత్ తీగల బిగింపు ఫ శిథిలావస్థలో ఉన్న స్తంభాల మార్పు ఫ వచ్చే వానాకాలంలో ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక పకడ్బందీగా పనులు అంతరాయం లేకుండా విద్యు త్ సరఫరా చేసేందుకు పకడ్బందీ పనులు చేపడుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపడుతూ లోపాలను సవరిస్తున్నాం. సిబ్బంది సమన్వయంతో పని చేస్తే విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా కరెంట్ అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసచారి, ట్రాన్స్కో డీఈ, మిర్యాలగూడపాతవి తొలగించి.. కొత్తవి అమర్చుతూ.. విద్యుత్శాఖ ముందస్తు మరమ్మతుల్లో భాగంగా విద్యుత్ తీగలకు తగిలే చెట్టుకొమ్మలను తొలగిస్తున్నారు. వేలాడుతున్న విద్యుత్ తీగలను టైట్ చేస్తున్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని అమర్చుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద నిర్వహణ వ్వవస్థ మెరుగుదలకు అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. మరమ్మతులకు గురైన ప్యూజ్ బాక్స్లను తొలగించి కొత్త వాటిని అమర్చుతున్నారు. బలహీనంగా మారిన విద్యుత్ తీగల స్థానాల్లో సామర్థ్యం గల తీగలను బిగిస్తున్నారు. -
ఎస్సీ గురుకులాల్లో ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తులు
నల్లగొండ : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందడానికి ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈ నెల 20లోగా ఆన్లైన్ tgswreis.telanga na. go v.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని షెడ్యుల్డ్ కులాల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 7995010667 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగొద్దుకేతేపల్లి : రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల డీఎం జె.హరీష్ ఆదేశించారు. కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5.07 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం 17,729 టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.903 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట కేతేపల్లి ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఏఓ బి.పురుషోత్తం, ఆర్ఐ రాంచంద్రయ్య తదితరులు ఉన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ జిల్లా కమిటీ ఎన్నికనల్లగొండ టూటౌన్ : ప్రభుత్వ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ టీచర్స్ జిల్లా కమిటీని శనివారం నల్లగొండలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రూపవత్ రవినాయక్, ప్రధాన కార్యదర్శిగా రమావత్ శ్రీనునాయక్, ఉపాధ్యక్షులుగా రుపావత్ అనంతరాములు, వెంకటరెడ్డి, బ్రహ్మచారి, కోశాధికారిగా జిలకర భాస్కర్, కార్యదర్శులుగా ఆర్.వెన్నెల, పి.రూప, ఎం.అనితను ఎన్నుకున్నారు. పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతినల్లగొండ: నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. కోర్టు ఎదురుగా ఉన్న మెలోడీ భవనం స్థలాన్ని కేటాయించాలని విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, చలపతిరావు ఉన్నారు. జ్యూరీ మెంబర్గా మిర్యాలగూడ వాసిమిర్యాలగూడ : గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025 కమిటీలో జ్యూరీ మెంబర్గా మిర్యాలగూడకు చెందిన సీనియర్ జర్నలిస్టు వాకిటి మధును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గతంలో రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన ఆయన రాష్ట్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. మిర్యాలగూడ డివిజన్లో 1979 వరకు ఓ దినపత్రికలో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థలో మేనేజర్గా చేరారు. ఉద్యోగ విరమణ అనంతరం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అవార్డు జ్యూరీ సభ్యులుగా మధు ఎంపికపై స్థానిక జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. -
ఉత్తమ బోధనకు కేరాఫ్.. కేజీబీవీ
ఫ ఇంగ్లిష్ మీడియంలో బోధన.. సకల వసతులు ఫ ఆరో తరగతిలో అడ్మిషన్లు ప్రారంభం ఫ జిల్లాలో 27 విద్యాలయాలు కేతేపల్లి : పేద, వెనుకబడిన, మద్యలో బడిమానేసిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను నెలకొల్పింది. తల్లిదండ్రులు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనేదే వీటి లక్ష్యం. ఈ విద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారికి ఉత్తమ బోధనతోపాటు క్రమశిక్షణ, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సొంత భవనాల్లో ఉచిత వసతితో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించటం ఈ విద్యాలయాల ప్రత్యేకత. ఆరో తరగతిలో చేరితే ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అవకాశం ఉండటంతో ఈ విద్యాలయాల్లో చేరేందుకు బాలికలు ఆసక్తి చూపుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభించారు. ప్రతి తరగతిలో 40 మంది.. జిల్లాలో మొత్తం 27 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థినులు ఉంటారు. ఇప్పటికే ఆరో తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీలు ఉంటే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్లో ఎంపీహెచ్డబ్ల్యూ, సీఈసీ కోర్సుల్లో 40 మంది చొప్పున విద్యార్థినులకు ప్రవేశం ఉంటుంది. భవిష్యత్లో ఉపాధి పొందేలా.. కేజీబీవీల్లో విద్యార్థినులకు అన్ని వసతులు కల్పించడం, మెనూ ప్రకారం ఆహారం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందిస్తారు. ఇక్కడ ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. కేవలం చదువు మాత్రమే కాకుండా భవిష్యత్లో విద్యార్థినులు ఉపాధి పొందేలా కుట్లు, అల్లికలతో పాటు కంప్యూటర్ శిక్షణ, మార్షల్ ఆర్ట్స్పై తర్ఫీదు సైతం ఇస్తారు. వివిధ రకాల వృత్తి విద్యా కోర్సులు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాలు ఇలా.. కేజీబీవీలో ప్రవేశాలకు సంబంధించి మొదట తల్లిదండ్రులు లేని పేద విద్యార్థినులకు ప్రాధాన్యం ఉంటుంది. తర్వాత మిగిలిన విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల కోసం విద్యార్థినులు 5వ తరగత వరకు చదువుతున్న బోనఫైడ్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. -
సెలవుల్లో కంప్యూటర్ శిక్షణ
విద్యార్థులు, యువత వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. - 8లోరైతులకు ప్రయోజనం కేంద్ర పభుత్వ ఏఐఎప్ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలకు డ్రోన్లను సబ్సిడీపై అందజేయాలని నిర్ణయించాం. డ్రోన్ల ద్వారా మందులను తక్కువ ధరలో పిచికారీ చేయడం వల్ల రైతులకు ప్రయోజరం కలుగుంది. సంఘాలకు లాభాలు వస్తాయి. వానాకాలం సీజన్ వరకు డ్రోన్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – కుంభం శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ● -
అడ్డొస్తున్నాడని..
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని వెల్మకన్నె గ్రామానికి చెందిన మహిళ తన భర్తను హతమార్చింది. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.క్షేత్రపాలకుడికి పూజలు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని సుందరీమణులు దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ప్రధానాలయంలోని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కారు. అక్కడి నుంచి గర్భాలయంలోకి వెళ్లి స్వయంభూలకు పూజలు నిర్వహించారు. ఆలయ పారాయణీకుడు నల్లంథీఘల్ సీతారామచార్యులు స్వామివారి విశిష్టతను వారికి వివరించారు. అనంతరం చెంతనే ఉన్న ఆండాల్ అమ్మవారిని సుందరీమణులు దర్శించుకున్నారు. సుందరీమణులకు ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ డీఈఓ దోర్భల భాస్కర్శర్మ శ్రీస్వామివారి ప్రతిమతో పాటు లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం వారు ఉత్తర ప్రథమ ప్రాకార మండపానికి చేరుకున్నారు. అక్కడ కృష్ణశిలతో చెక్కిన యాలీ పిల్లర్లు, సింహం తదితర విగ్రహాలను పరిశీలించి తన్మయత్వం పొందారు. అంతకుముందు సుందరీమణులకు కూచిపూడి, భరత నాట్యం, కోలాటం కళాకారులు సంప్రదాయంగా స్వాగతం ఫలికారు. కోలాట బృందంతో కలిసి సుందరీమణులు కోలాటం ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెంపుల్.. సో బ్యూటిఫుల్ ఆలయంలో కలియదిరిగి పరిశీలించిన సుందరీమణులు.. టెంపుల్ సో బ్యూటీఫుల్ అని కితాబునిచ్చారు. అద్భుత కళాఖండం అంటూ కొనియాడారు. ఆలయ నిర్మాణ శైలిని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు వారికి వివరించారు. సుందరీమణుల పర్యటన సాయంత్రం 5గంటల నుంచి 7 గంటల వరకు రెండు గంటల పాటు కొనసాగింది. -
సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ): కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె.జానిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఈనెల 26 వరకు డీలక్స్, సూపర్ లక్జరీ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తించదని తెలిపారు. కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులునల్లగొండ : కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాల కోసం ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ రాజ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో 400 మార్కులకుపైగా సాధించిన జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, జెడ్పీహెచ్ఎస్లు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. సొంత జిల్లాలకు తహసీల్దార్లునల్లగొండ: ఎన్నికల విధుల్లో భాగంగా గతంలో బదిలీ అయిన తహసీల్దార్లను ప్రభుత్వం తిరిగి సొంత జిల్లాలకు పంపింది. ఈ మేరకు ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం మల్టీజోన్–2 పరిధిలోని జిల్లాలకు చెందిన తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. వారిలో ఇప్పుడు 44 మందిని బదిలీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 11 మంది తహసీల్దార్లు వారి జిల్లాలకు పంపగా, మరో ఏడుగురు బదిలీపై జిల్లాకు వచ్చారు. మొక్కల సంరక్షణపై శ్రద్ధచూపాలి కట్టంగూర్, శాలిగౌరారం : గ్రామ పంచాయతీ సిబ్బంది మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధచూపాలని డీఆర్డీఓ వై.శేఖర్రెడ్డి అన్నారు. గురువారం కట్టంగూర్ మండలం కురుమర్తి, నారెగూడెం, ఎరసానిగూడెం గ్రామాల్లో నర్సరీలతోపాటు శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో నర్సరీ, రైతులు సాగుచేస్తున్న మునగ తోటను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధి కూలీలకు రోజువారీగా రూ.307 తగ్గకుండా కూలి గిట్టుబాటు అయ్యేలా చూడాలని ఏపీఓ, ఉపాధి సిబ్బందికి సూచించారు. నారెగూడెం, ఎరసానిగూడెం గ్రామాల్లో గల నర్సరీల్లో మొక్కల పెంపకం సక్రమంగా లేకపోవటంతో జీపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఎంపీఓను ఆదేశించారు. నిమ్మ, కొబ్బరి, మామిడి, మునగ, డ్రాగన్ ప్రూట్ తోటల సాగులో ప్రభుత్వ రాయితీని పొందడంతోపాటు అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చన్నారు. ఆయన వెంట నకిరేకల్ క్లస్టర్ ఏపీడీ బీఎల్ నర్సింహారావు, ఎంపీఓలు చలపతి, సుధాకర్, ఏపీఓలు కడెం రాంమోహన్, జంగమ్మ, ఏపీఎం సైదులు, కార్యదర్శులు జయసుధ, పెద్దయ్య, ఈసీ శ్రీధర్ తదితరులు ఉన్నారు. స్వర్ణగిరీశుడికి తిరుపావడ సేవ భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తిరుపావడ సేవ వైభవంగా నిర్వహించారు. 450 కిలోల అన్నప్రసాదం, లడ్డూ, వడ తదితర పిండి వంటలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం నిర్వహించారు. -
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
హాలియా : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని టెస్టుల ద్వారా గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు వినియోగించుకోవచ్చన్నారు. గ్రామాల్లోకి కొత్తగా వచ్చే అనుమానితులతోపాటు గంజాయి ఇతర మాదకద్రవ్యాలు విక్రయించేవారి సమాచారాన్ని విలేజ్ పోలీస్ అధికారి అందించడం వల్ల నేరాలను నిరోధించవచ్చన్నారు. గ్రామంలో ప్రమాదాల నివారణకు విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, హాలియా సీఐ జనార్దన్ గౌడ్, ఎస్ఐ సతీష్రెడ్డి, వీపీఓ సరిత తదితరులు ఉన్నారు. ఫ ఎస్పీ శరతచంద్ర పవార్ -
‘ప్రత్యేక’ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
నల్లగొండ: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలోని భవిత కేంద్రాలపై గురువారం నల్లగొండ కలెక్టరేట్లో మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యేక విద్యార్థులకు కావాల్సిన అవసరాలపై సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భవిత కేంద్రాల్లో ఎలాంటి పనులు చేపట్టాలి, వారికి ఏమి అవసరం ఉన్నాయో వెంటనే గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్, రాజ్కుమార్, నల్లగొండ, చండూరు ఆర్డీఓలు అశోక్రెడ్డి, శ్రీదేవి, డీఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఇక్కత్కు, శిల్పకళకు ఫిదా..
సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు భూదాన్పోచంపల్లిలోని టూరిజం పార్క్లో సుందరీమణులుభూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్ట: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన సుందరీమణులు గురువారం సాయంత్రం యాదాద్రి జిల్లాలో పర్యటించారు. ఒక బృందం భూదాన్పోచంపల్లిని, మరో బృందం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించింది. నేతన్నల గొప్పదనం చూసి అబ్బురపడి.. ఆఫిక్రా దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులు భూదాన్పోచంపల్లిని సందర్శించారు. స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాటు చేసిన చేనేత థీమ్లో పాల్గొని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇక్కత్ వస్త్రాలను పరిశీలించి అబ్బురపడ్డారు. చేనేతల గొప్పతనం చూసి అందాలభామలు చప్పట్లు కొట్టారు. అలాగే ఇండో వెస్ట్రన్ ఇక్కత్ దుస్తులతో మోడల్స్ నిర్వహించిన ర్యాంప్ వాక్ చూపి మైమరిచిపోయారు. ప్రముఖ డిజైనర్ స్వాతి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో రూపొందించిన ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వస్త్రాలను ప్రముఖ మోడల్స్ ధరించి, ప్రముఖ కొరియోగ్రఫీ సుందర్ పర్యవేక్షణలో ప్రదర్శించిన రాంప్వాక్ వావ్ అన్పించింది. సుమారు 30 మంది మోడల్స్ ర్యాంప్వాక్ చేశారు. ఆకట్టుకున్న చేనేత స్టాళ్లు టూరిజం పార్కు ఆవరణలో పద్మశ్రీ గజం గోవర్థన్, జాతీయ అవార్డు గ్రహీత తడక రమేశ్, సాయిని భరత్, రాష్ట్ర అవార్డు గ్రహీతలు భోగ బాలయ్య, ఎన్నం మాధవిశివకుమార్, చేనేత టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, చేనేత సహకార సంఘంతో పాటు గద్వాల్, నారాయణపేట, సిద్ధిపేట గొల్లభామ చేనేత స్టాల్స్ ఏర్పాటు చేశారు.వీటిలో పోచంపల్లి ఇక్కత్తో పాటు తేలియారుమాళ్లు, గొల్లభామలు చీరలను చూసి ప్రపంచ సుందరీమణులు మురిసిపోయారు. సంప్రదాయ చీరకట్టుతో నృసింహుడి క్షేత్రానికి.. కరేబియన్ దీవులకు చెందిన తొమ్మిది మంది సుందరీమణులు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో శిల్ప కళను చూసి పరవశం పొందారు. సంప్రదాయ చీరకట్టు, లంగా ఓణీతో సాయంత్రం 5గంటలకు కొండపైన గల అతిథిగృహానికి చేరుకున్న సుందరీమణులు.. తొలుత అఖం దీపారాధన చేశారు. ఆ తరువాత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఫొటోకు పూజలు చేసి మీడియా గ్యాలరీ వద్ద అతిథులకు అభివాదం చేశారు. అలాగే బ్రహ్మోత్సవ మండపం వద్ద ఎల్ఈడీ స్క్రీన్లో శ్రీస్వామివారి కై ంకర్యాలను వీక్షించి ఫొటోలు దిగారు. ఇక్కత్ వస్త్రాలతో సన్మానం సుందరీమణులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఇక్కత్ శాలువాతో సన్మానించారు.ఫ జిల్లాలో రెండు బృందాలుగా పర్యటన ఫ ఒక టీం భూదాన్పోచంపల్లి, మరొకటి యాదగిరిగుట్ట ఆలయ సందర్శన ఫ ఇక్కత్ డిజైన్లు చూసి అబ్బురపడిన అందగత్తెలు ఫ యాదగిరిగుట్టలో నృసింహుడి దర్శనం, శిల్పకళను వీక్షించి పరవశం -
61.35 శాతం మందికే!
కార్డుదారులందరికీ అందని రేషన్ బియ్యం ఎప్పుడూ రాని సమస్య ఇప్పుడే ఎందుకు? పదేళ్ల నుంచి జిల్లాలో ధాన్యం అత్యధికంగా పండుతోంది. ఈ నాలుగైదేళ్లలో గణనీయంగా దిగుబడి పెరిగింది. ఇన్నేళ్ల కాలంలో ఏటా ఎంత ధాన్యం కొనుగోలు చేసినా, బియ్యం పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. జిల్లా యంత్రాంగానికి ధాన్యం ఎంత మార్కెట్కు వస్తుందన్న విషయం ముందుగానే తెలిసినా, ఇటు ధాన్యం లారీల కాంట్రాక్టు వ్యవహారంలో ఇష్టానుసారంగా వ్యవహరించడమే సమస్యకు కారణంగా తెలుస్తోంది. బియ్యం సరఫరాకు సరిపడా లారీలు ఉన్నాయా? లేదా? అనేది చూడకుండానే ధాన్యం సరఫరా కాంట్రాక్టు అప్పగించడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సన్న బియ్యం పంపిణీ సవాలక్ష్య సమస్యలతో సాగుతోంది. కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ గడువు ఈనెల 15వ తేదీతో ముగిసినా పూర్తి స్థాయిలో గోదాముల నుంచి రేషన్ షాపులకు చేరలేదు. చేరిన బియ్యం కూడా ప్రజలకు ఇంకా పూర్తి స్థాయిలో అందనేలేదు. బుధవారం వరకు 61.35 శాతం కార్డుదారులకే రేషన్ బియ్యం అందినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంలో మొదటి నెల నుంచే ఇబ్బందులే ఎదురవుతున్నాయి. రేషన్ పంపిణీ సమయం ముగిసినా.. ప్రతినెలా 30 తేదీ వరకే ఎఫ్సీఐ గోదాముల నుంచి బియ్యం రేషన్ షాపులకు చేరాలి. ఆ తరువాత ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపు డీలర్లు బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయాలి. అయితే ఈ నెలకు సంబంధించి ఏప్రిల్ 30 నాటికే బియ్యం రేషన్ షాపులకు చేరాల్సి ఉండగా, మే 15వ తేదీ వచ్చినా కూడా ఇంకా రేషన్ షాపులకు పూర్తి స్థాయిలో బియ్యం చేరకపోవడంతో కార్డుదారులకు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. ముందుచూపులేని అధికారులు జిల్లాలో ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అయితే రేషన్ బియ్యం సరఫరాకు, ధాన్యం సరఫరాకు సంబంధించి కాంట్రాక్టు పనులను అధికారులు ఒకరికే అప్పగించడం ఈ సమస్యకు కారణం అవుతోంది. ప్రతినెలా జిల్లాలో ప్రజలకు పంపిణీ చేసే దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఎఫ్సీఐ గోదాముల నుంచి రేషన్ షాపులకు పంపిణీ చేయాలి. ఈ పనులకు జిల్లాలో ఒక కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే పనులను అధికారులు అదే కాంట్రాక్టర్కు అప్పగించారు. బియ్యం పంపిణీలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాల్సిన అధికారులు చేతులెత్తేశారు. దీంతో 30వ తేదీ నాటికే షాపులకు చేరాల్సిన బియ్యం 15 రోజులు గడిచినా పూర్థిసాయిలో చేరలేదు. సమన్వయ లోపం.. లారీల సమస్య ఈ యాసంగి సీజన్లో 11,26,021 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 5,68,152 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొంటారని, మరో 5,57,869 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుందని సూచించింది. అయినా ఇటు పౌరసరఫరాల సంస్థ, అటు పౌరసరఫరాల శాఖ ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇప్పుడేమో బియ్యం పంపిణీకి ఉపయోగించే లారీలను కూడా ధాన్యం ట్రాన్స్ పోర్టుకు వినియోగిస్తున్నామని చెప్పి ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ధాన్యం విషయంలోనూ అదే దుస్థితి కొనుగోలు కేంద్రాలకు లారీలు సకాలంలో రాక ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కో కేంద్రానికి మూడు నాలుగు రోజులకు కూడా ఒక లారీ రాని పరిస్థితి ఇటీవల సాక్షి నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్లో వెల్లడైంది. ఒక్కో కేంద్రానికి రెండు చొప్పున లారీలు పెట్టాల్సి ఉన్నా, అవసరం మేరకు పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. పైగా మిల్లర్లు ధాన్యం త్వరగా దింపుకోవడం లేదనే సాకును చెబుతున్నారు. అదే నిజమైతే మిల్లర్లు త్వరగా ధాన్యాన్ని దింపుకునేలా చర్యలు చేపట్టడంలోనూ అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఫ బియ్యం సరఫరాకు సరిపడా కేటాయించని లారీలు ఫ పదిహేను రోజులు గడిచినా తప్పని ఎదురుచూపులు ఫ ఇబ్బందుల్లో రేషన్ కార్డుదారులుమండలాల సంఖ్య 33రేషన్ షాపులు 950కార్డుదారులు 4,74,681 లబ్ధిదారులు 13 లక్షలు బుధవారం వరకు బియ్యం తీసుకున్నవారు 2,91,233రేషన్ అందని కార్డులు 1,83,448 -
వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ
నకిరేకల్ : వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం మర్రూర్ గ్రామానికి చెందిన పుట్ట చంద్రమ్మ గురువారం తన ఇంటి బయట కూర్చోని ఉండగా.. ఇద్దరు యవకులు ఆమె వద్దకు వచ్చి మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కోని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసినట్లు ఎస్ఐ తెలిపారు. బస్సులో సీటు కోసం కొట్లాట యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులో సీటు కోసం కొట్టుకున్నారు. గురువారం ఉదయం 11గంటల సమయంలో స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్కు చెందిన భక్తులు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే సమయంలో కొండ పైన బస్టాండ్లోకి బస్సు రావడంతో సీట్ల కోసం ప్రయాణికులు పోటీ పడ్డారు. ఈ సమయంలో మహిళా భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఎస్పీఎఫ్ పోలీసులు, ఆలయ సిబ్బంది వారిని అడ్డుకొని పంపించారు. -
కంటైనర్ను ఢీకొట్టిన కారు.. భార్య మృతి
చివ్వెంల(సూర్యాపేట): ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టిన ఘటనలో భార్య మృతిచెందగా.. భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన భృగుమళ్ల హరీష్, అతని భార్య కళ్యాణి (32) కారులో ఖమ్మంకు వెళ్తుండగా మార్గమధ్యలో చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కళ్యాణి తలకు, చాతిలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో హరీష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హరీష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. భర్తకు గాయాలు -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
గట్టుప్పల్ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. ఈ ఘటన గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో ఈ నెల 10న చోటు చేసుకోగా.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి గురువారం విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వెల్మకన్నె గ్రామానికి చెందిన వల్ల పు మల్లేష్(37) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మల్లేష్ భార్య హేమలతతో అదే గ్రామానికి చెందిన రేవెల్లి నవీన్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం మల్లేష్కు తెలియడంతో హేమలతను మందలించాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి మల్లేష్ అడ్డొస్తున్నాడని అతడిని అంతమొందించాలని అతడి భార్య హేమలత, ఆమె ప్రియుడు నవీన్ నిర్ణయించుకున్నారు. మద్యం తాగించి.. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం మల్లేష్ నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో టైల్స్ పెట్టడానికి నవీన్ వచ్చాడు. అనంతరం వారిద్దరు కలిసి గ్రామంలో మద్యం తాగి తమ ఇళ్లకు వెళ్లారు. తిరిగి సాయంత్రం నవీన్ మల్లేష్ను పిలిచి ఫుల్లుగా మద్యం తాగించాడు. ఈ విషయాన్ని నవీన్ ఫోన్ ద్వారా హేమలతకు చెప్పాడు. రాత్రి 10.30 గంటలకు మల్లేష్ను నవీన్ బైక్పై ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో మల్లేష్ మంచంపై నిద్రకు ఉపక్రమించగానే నవీన్, హేమలత కలిసి టవల్తో మల్లేష్ ముఖంపై అదిమిపట్టి శ్వాస ఆడకుండా చేసి హతమార్చారు. మరుసటిరోజు తెల్లవారుజామున తన భర్త చనిపోయాడని హేమలత కేకలు వేస్తూ అత్తమామలకు, ఇరుగు పొరుగు వారికి చెప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హేమలతను ప్రశ్నించగా.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో హేమలత, ఆమె ప్రియుడు నవీన్ కలిసి పథకం ప్రకారమే మల్లేష్ హతమార్చినట్లు నిర్ధారణ కావడంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన చండూరు సీఐ ఆదిరెడ్డి, గట్టుప్పల్ ఎస్ఐ వెంకట్రెడ్డి, ఏఎస్ఐ ఆర్. అంజయ్య, పోలీస్ సిబ్బంది వి. రమేశ్, సుదర్శన్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య నిందితుల అరెస్ట్.. రిమాండ్కు తరలింపు వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
సీఎం రేవంత్రెడ్డి చొరవతోనే..
● ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి సీఎం రేవంత్రెడ్డి చొరవతోనే హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో అందంగా, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా నిలుస్తాయని అన్నారు. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు పోచంపల్లికి రావడం ద్వారా చేనేతకు మరింత వైభవం వస్తుందని అన్నారు. ప్రతిఒక్కరూ చేనేతను ఆదరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, మిస్ వరల్డ్ పోచంపల్లి ప్రోగ్రాం ఇన్చార్జి లక్ష్మి, రాచకొండ సీపీ సుధీర్బాబు, తెలంగాణ టూరిజం జనరల్ మేనేజర్ మందడి ఉపేందర్రెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, చింతకింది మల్లేశం, భువనగిరి డీసీపీ అక్షాంశ్యాదవ్, ఏసీపీ మధుసూదన్రెడ్డి, చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్రావు, ఇన్చార్జి తహసీల్దార్ నాగేశ్వర్రావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా.. ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు వలిగొండ: ఆటో బోల్తాపడి ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలిగొండ మండలం అక్కంపల్లి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచెనపల్లికి చెందిన లాడే సుధాకర్ (40), లాడే అంజాజీ ఇద్దరు కలిసి వాహన బ్యాటరీల వ్యాపారం నిమిత్తం గురువారం ఆటోలో చౌటుప్పల్కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వలిగొండ మండలం అక్కంపల్లి వద్ద ఆటో బోల్తా పడడంతో ఆటో నడుపుతున్న సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అంజాజీకి తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, అంజాజీకి వైద్యం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
యువకుడి ప్రాణం తీసిన చేపల వేట
కనగల్ : చేపల వేట యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పగిడిమర్రి గ్రామానికి చెందిన అబ్బిడి నాగర్జున్రెడ్డి(36) వ్యవసాయంతో పాటు మెటార్ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం పగిడిమర్రి గ్రామానికే చెందిన కొప్పుల ప్రవీణ్ బోరు మోటారు కాలిపోగా.. దానిని బయటకు తీసిన అనంతరం సమీపంలోనే ఉన్న నోములవారి కుంటలోకి నాగార్జున్రెడ్డి చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు కుంటలోకి దిగిన కొన్ని క్షణాల్లోనే నాగర్జున్రెడ్డి అందులో మునిగిపోయాడు. అక్కడే ఉన్న ప్రవీణ్ గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ఎంత వెతికినా కుంటలో నాగార్జున్రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది 4గంటల పాటు శ్రమించి నాగార్జున్రెడ్డి మృతదేహన్ని కుంటలో నుంచి బయటకు తీశారు. కరెంట్ షాక్తో మృతిచెందాడా..?నాగర్జున్రెడ్డితో పాటు మరో ఐదుగురు యువకులు కూడా చేపల వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు కరెంట్ సహాయంతో చేపలు పట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాగర్జున్రెడ్డి విద్యుదాఘాతానికి గురై మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుడికి ఈత వచ్చని, చిన్న కుంటలో మునిగిపోయే అవకాశమే లేదని గ్రామస్తులు, బంధువులు పేర్కొంటున్నారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు కరెంట్ సహాయంతో చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే వారం క్రితం గ్రామ పరిధిలోని కుంటల్లో కరెంట్ సహాయంతో చేపలు పడితే రూ.10వేల జరిమానా విధిస్తామని డప్పు చాటింపు కూడా వేయించినట్లు మాజీ సర్పంచ్ గోలి నర్సిరెడ్డి తెలిపారు. గ్రామంలో విషాధచాయలు..నాగర్జున్రెడ్డి మృతితో పగిడిమర్రి గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో నాగార్జున్రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి 3వ తరగతి చదివే కుమార్తె, 1వ తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. నాగార్జున్రెడ్డి భార్య కోమలి ఏడుస్తున్న తీరు చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. తహసీల్దార్ పద్మ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందించలేదని పోలీసులు తెలిపారు. కుంటలో మునిగి మృతి కనగల్ మండలం పగిడిమర్రిలో ఘటన -
పోచంపల్లి జరూర్ ఆనా..
● కలెక్టర్ హనుమంతరావు భూదాన్పోచంపల్లి: తెలంగాణతో పాటు పోచంపల్లికి జరూర్ ఆనా అని కలెక్టర్ హనుమంతరావు సుందరీమణులను కోరారు. హంపి థియేటర్ జరిగిన ర్యాంప్వాక్ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కత్ ప్రత్యేకమైన కళ అని, ఇది ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. 2021లో యునెస్కో చేనేత ఉత్తమ హెరిటేజ్ విలేజ్గా పోచంపల్లి అంతర్జాతీయ అవార్డు పొందిందని గుర్తు చేశారు. భూదానోద్యమానికి శ్రీకారం చుట్టి లక్షలాది మంది పేదలకు భూదానం చేసిన గొప్ప గ్రామమని కొనియాడారు. భూదాన్పోచంపల్లికి సుందరీమణుల సందర్శనతో చేనేతకు మరింత గుర్తింపురావడమే కాకుండా చేనేత కళాకారులకు కూడ మార్కెటింగ్ సదుపాయాలు పెరుగుతాయని అన్నారు. చేనేత కళను సజీవంగా నిలుపుతున్న చేనేత కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు. -
సౌదీఅరేబియాలో కోదాడ వాసి మృతి
కోదాడరూరల్: సౌదీఅరేబియాలో కోదాడ పట్టణానికి చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని కౌసర్నగర్కు చెందిన షేక్ తాజుద్దీన్(49) ఉపాధి కోసం పదేళ్ల కిందట సౌదీఅరేబియాకు వెళ్లాడు. అక్కడ దమామ్ పట్టణంలో నివాసముంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళ్తుండేవాడు. నెల రోజుల క్రితం సౌదీఅరేబియాలో తనకు పరిచయం ఉన్న కపిల్ పేరు మీద తాజుద్దీన్ లైసెన్స్ తీసుకొని కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. కొన్నిరోజుల తర్వాత షాపు లైసెన్స్ తన పేరు మీద ఉంది కావును షాపును తనకు అప్పగించి వెళ్లిపోవాలని కపిల్ తాజుద్దీన్ను బెదిరించసాగాడు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన తాజుద్దీన్ అనుమానాస్పదస్థితిలో కాలిపోయి చావుబతుకుల మధ్య ఉంటే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తాజుద్దీన్ మృతిచెందినట్లు అతడి స్నేహితులు ఫోన్ చేసి తాజుద్దీన్ కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తాజుద్దీన్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 3న అక్కడకు వెళ్లి..జనవరి 6న తాజుద్దీన్, అతడి భార్య షాజహాన్ కలిసి ఇండియాకు వచ్చారు. మార్చి 3న తిరిగి సౌదీఅరేబియాకు వెళ్లి రూ.10లక్షల అప్పులు తీసుకొచ్చి కూరగాయల షాపు పెట్టినట్లు తాజుద్దీన్ భార్య తెలిపారు. షాపు పెట్టిన తర్వాత కపిల్ షాపు తనకు అప్పగించాలని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు. వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి జైలుశిక్ష చివ్వెంల(సూర్యాపేట): వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయ మూర్తి పి. లక్ష్మీశారద గురువారం తీర్పు వెలువరించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం దాచారం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్రీనివాస్కు అదే మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామ శివారులో 14 గుంటల భూమి ఉంది. అందులో 2 గుంటల భూమిని 2005లో తుమ్మల పెన్పహాడ్ గ్రామానికే చెందిన సల్లగుండ్ల బజార్కు విక్రయించాడు. దాని పక్కనే మరో 3 గుంటల భూమిని 2020లో బోట్యా తండాకు చెందిన గుగులోతు బుజ్జ మ్మకు విక్రయించాడు. 2020 జూన్ 16న బుజ్జ మ్మకు విక్రయించిన భూమిని కొలిచేందుకు గ్రామానికి చెందిన కొంతమంది పెద్దమనుషులను తీసుకుని వెళ్లాడు. భూమిని కొలుస్తుండగా.. పక్కనే భూమి ఉన్న సల్లగుండ్ల బజార్, అతడి భార్య యల్లమ్మ, కుమారుడు పవన్, అల్లుడు ఎర్ర సుమన్ అక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నారు. తమకు విక్రయించిన భూమికి వాస్తు కోసం ఇంకా కొంత భూమి ఇవ్వాలని బొమ్మగాని శ్రీనివాస్తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో నల్లగుండ్ల బజార్ బొమ్మగాని శ్రీనివాస్ గుండైపె బలంగా గుద్దడంతో శ్రీనివాస్ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని అక్కడే ఉన్న పెద్దమనుషులు సూర్యాపేటలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ విఠల్రెడ్డి సల్లగండ్ల బజార్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపల్లి లింగయ్య వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడు సల్లగుండ్ల బజార్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సహకరించారు. గుండెపోటుతో సీపీఎం నేత చిట్యాల బుచ్చిరెడ్డి మృతిచౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు చిట్యాల బుచ్చిరెడ్డి గుండెపోటుతో గురువారం మృతిచెందారు. రామన్నపేట తాలుకాలో సీపీఎం నిర్మాణం కోసం ఆయన ఎంతో కృషిచేశారు. గీత కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారు. నక్సలైట్ల హిట్ లిస్ట్లో ఉన్నా కూడా ధైర్యంతో చౌటుప్పల్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. బుచ్చిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం పంతంగి గ్రామంలో నిర్వహించనున్నట్లు సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి రత్నం శ్రీకాంత్ తెలిపారు. బుచ్చిరెడ్డి మృతదేహానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డితో పాటు సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండీ సలీం, భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ పాషా తదితరులు నివాళులర్పించారు. -
వాన నీటిని ఒడిసి పడుతున్న రైతు
వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చండూరు మండలానికి చెందిన రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి ప్రయత్నం అభినందనీయమే. తనకున్న భూమిలో ఆరేళ్ల కిందటే భూగర్భ జలాలను పెంపొందించేందుకు కందకాలు తవ్వించారు. నాలుగు ఎకరాల్లో ఫాం పాండ్లు, నీటిని నీటి గుంతలు తవ్వించారు. ఎండలు మండుతున్నా ఆయన వ్యవసాయ క్షేత్రంలో నీటి నిల్వలు అలాగే ఉన్నాయి. ఆ నీటితోనే వ్యవసాయ క్షేత్రంలో మామిడి, సపోట, కొబ్బరి, సీతాఫలం, నిమ్మ తోటలు, జొన్న చేను సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా టమాట, కర్బూజ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, బీరకాయ వంటివి పండిస్తున్నారు. అంతేకాదు వేప, జామాయిల్, కానుగ చెట్లను సైతం పెంచుతున్నారు. ఇప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రం అంతా పచ్చదనంతో నిండిపోయింది. -
‘భూభారతి’కి విశేష స్పందన
గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఈనెల 5 నుంచి బుధవారం వరకు నిర్వహించిన రెవెనూ సదస్సుల్లో మొత్తం 1013 ధరఖాస్తులు వచ్చాయి. వాటిలో తెట్టెకుంట 1, అడివిబొల్లారం 8, మండలాపురం 5, నెల్లిబండ 4, చందంపల్లి 59, వల్లాభాపురం 3, పాలెం 56, తాటికల్ 42, గోరేంకలపల్లి 92, ఓగోడు 62, మంగళపల్లి 187, మర్రూర్ 41, చందుపట్ల 171, కడపర్తి 39, నకిరేకల్ 138, నోముల 105 దరఖాస్తులు వచ్చాయి. నకిరేకల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భూభారతి చట్టం అమలు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నకిరేకల్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన లభించింది. ఈనెల 5 తేదీన ప్రారంభమైన ఈ సదస్సులు బుధవారం ముగిశాయి. ఈ సదస్సులో రైతులు వివిధ భూ సమస్యలపై 1,722 దరఖాస్తులు పంపిణీ చేయగా.. 1,013 మంది అధికారులకు దరఖాస్తులను అందజేశారు. వీటిలో ప్రధానంగా మిస్సింగ్ సర్వేనంబర్, పీఓటీ, సాదాబైనామా తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను భూభారతి చట్టం ఆన్లైన్లో నమోదు చేశారు. వాటి విచారణ త్వరతగతిన పూర్తిచేసి జూన్ 1వ తేదీలోగా పరిష్కరించనున్నారు. కలెక్టర్ మానిటరింగ్.. భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నకిరేకల్ మండలాన్ని ఎంపిక చేసింది. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మండలాన్ని రెండు సెక్టార్లుగా విభజించారు. నకిరేకల్, కట్టంగూర్ తహసీల్దార్ల చెరో సెక్టార్కు అధికారులుగా నియమించి.. రెండు బృందాల ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 14వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ప్రతి గ్రామంలో సాయంత్రం 4 గంటల వరకు అధికారులు అక్కడే ఉండి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సదస్సులను కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి మానిటరింగ్ చేశారు. పలు రెవెన్యూ సదస్సులో కలెక్టర్, ఆర్డీఓ స్వయంగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. రైతులకు సహకరించేందుకు ఆయా గ్రామాల్లో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఉండి దరఖాస్తులను నింపి ప్రత్యేక పోర్టల్లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి జూన్ 1వ తేదీలోగా దరఖాస్తులు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించారు. ఫ పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న నకిరేకల్ మండలంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు ఫ మండల వ్యాప్తంగా భూ సమస్యలపై 1,013 దరఖాస్తులు ఫ జూన్ 1వ తేదీలోగా పరిష్కరించేలా ప్రణాళికదరఖాస్తుల విచారణ చేపడతాం మండల వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను విజయవంతంగా పూర్తి చేశాం. రైతులనుంచి ఎక్కువగా మిస్సింగ్ సర్వేనంబర్లు, సాధాబైనామా, భూముల విస్తీర్ణంలో మార్పులకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేసి.. వెంటనే విచారణ చేపడతాం. ఈ నెల 30వ తేదీలోగా అన్నింటినీ పరిష్కరిస్తాం. – జమీరుద్దీన్, తహసీల్దార్, నకిరేకల్ దరఖాస్తుల వివరాలు ఇలామిస్సింగ్ సర్వే నంబర్లు 479పెండింగ్ మ్యుటేషన్ 51డిజిటల్ సంతకం పెండింగ్ 12విస్తీర్ణంలో తేడాలు 66భూ వర్గీకరణ 26పేర్లలో తప్పుల సవరణ 09ప్రొహిబిటెడ్ ల్యాండ్ 04అసైన్డ్ల్యాండ్ 89ఇనాం భూములు 08పౌతి 29భూసేకరణ కింద 05ఇతర సమస్యలు 235మొత్తం 1,013 -
డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయాలి
నార్కట్పల్లి : డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నార్కట్పల్లి మండలం బి.వెల్లంల గ్రామంలో ఏర్పాటు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరితగతిన పూర్తిచేసి ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద డ్రైయినేజీ, విద్యుత్, తాగునీరు, రోడ్ల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని మొత్తం మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆస్పత్రిని తనిఖీ చేసి అక్కడి వైద్య సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, రోగులకు బెంచీలు కూడా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్కు సిబ్బంది వివరించడంతో తన నిధుల నుంచి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్లగొండ ఆర్డీఓ వై,అశోక్రెడ్డి,. తహసీల్దార్ వెంకటేశ్వర్రావు, డాక్టర్ విజయ్కుమార్, పలువురు అధికారులు,.సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కరువు నేలన జలసిరులు!
చెక్డ్యామ్లు, నీటి కుంటల్లో వర్షపు నీటి నిల్వ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీటికి నిలకడ నేర్పితే కరువుఛాయలు దరిచేరవు. వాన నీటిని ఒడిసిపడితే జీవ వైవిధ్యం అలరారుతుంది. ఈ తరహాలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం, వరద, వృథా నీటిని నిల్వ చేస్తూ చెక్డ్యామ్లు, నీటి కుంటలు, కందకాలు నిర్మించడం ద్వారా ఏ కాలమైనా నీటికి ఢోకా ఉండడం లేదు. వీటి నిర్మాణంతో సాగునీటి సమస్య నుంచి రైతులు బయటపడ్డారు. ఆయా ప్రాంతాల్లో పశుపక్ష్యాదులకు నిరంతరం నీరు దొరుకుతోంది. సమగ్ర నీటి సంరక్షణ చర్యలతో ఆయా పల్లెలు కరువును జయించాయి. అష్టకష్టాల నుంచి గట్టెక్కి.. సూర్యాపేట మండలంలో గతంలో వేసవి ప్రారంభంలోనే ఎండిన చెరువులు, అడుగంటిన బోరుబావులతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. తలాపున మూసీ నది ఉన్నా గుక్కెడు నీళ్లు దొరక్క, పంటలు పండని పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. గత ప్రభుత్వం మూసీ నది కింద 9 చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టి, ఆరింటిని పూర్తి చేసింది. టేకుమట్ల–2, రాయినిగూడెం–2, కాసారాబాద్–2 నిర్మాణం పూర్తి కాగా, ఝెడ్లపల్లి–1, కేటీ అన్నారం–1, కాసారాబాద్–1 నిర్మాణాలు పూర్తి కావొచ్చాయి. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలతో మండల పరిధిలోని భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు తాగునీటి సమస్య తగ్గిపోయింది. బోరు బావులు, ఊట బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటోంది. చెక్ డ్యామ్లలో నిల్వ ఉన్న నీటిని రైతులు మోటార్ల ద్వారా పొలాలకు తరలించుకుని పంటలు సాగుచేస్తున్నారు. చెక్ డ్యామ్లతో తీరిన నీటి సమస్య పెన్పహడ్ మండలంలో భూగర్భ జలాలు పెరిగేందుకు చెక్డ్యామ్లు దోహదపడుతున్నాయి. మండలంలోని దోసపహాడ్, అనాజీపురం, నాగులపహాడ్ గ్రామాల పరిధిలోని మూసీ నదిపై ఆరు చెక్ డ్యామ్లు నిర్మించారు. వీటి నిర్మాణంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. వ్యవసాయ ఆధారిత బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ప్రజలకు వేసవిలో తాగునీటి నీటి సరఫరాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ప్రతి వర్షపు చినుకు నీటిలో ఇంకేలా.. కరువు నేలలో జలాలను నిల్వ చేసి జీవం పోయడానికి పీఎం కృషి సంచాయ్ యోజన (పీఎంకేఎస్వై) పథకం కింద యాద్రాది భువనగిరి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం మండలాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని జనగాం, పుట్టపాక, వావిళ్లపల్లి, చిల్లాపురం, కొత్తగూడెం సహా 16 గ్రామాల్లో ఈ పథకాన్ని గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ ప్రతి వానచినుకు భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టారు. కొండలు, వాలు ప్రాంతాల్లో పైనుంచి వచ్చే నీటిని భూగర్భ జలంగా మార్చేలా చెక్డ్యామ్లు, ఊట చెరువులు నిర్మించారు. పొలాల నుంచి మట్టి కొట్టుకుపోకుండా అడ్డుగా రాతి కట్టలు, కందకాల తవ్వకం చేపట్టారు. ఇప్పటి వరకు 68 పనులు పూర్తి చేశారు.శ్యామ్ప్రసాద్రెడ్డి సూచనలతోనే నీటి సంరక్షణ రిటైర్డ్ ఇంజనీర్ మేరెడ్డి శ్యామ్ ప్రసాద్రెడ్డి సూచనలతోనే నీటి సంరక్షణకు చర్యలు చేపట్టా. ఒకసారి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అర్థమయ్యేలా చెప్పారు. దాంతో 50 ఎకరాల చుట్టూ కందకాలు తవ్వించా. ఐదెకరాలకు ఒకటి చొప్పున నీటి గుంతలను తవ్వించా. అంతకు ముందు మా భూమిలో జియాలజిస్టులు బోర్లు పడవన్నారు. ఇప్పుడు అదే భూమిలో 3 బోర్లు వేశా. భూగర్భ జలాలు పెరిగి, నీరు బాగా పోస్తున్నాయి. – పాల్వాయి సత్యనారాయణరెడ్డి, చండూరు ఫ పెరుగుతున్న భూగర్భ జలాలు ఫ వేసవిలోనూ బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు ఫ తాగు, సాగునీటి సమస్యకు చెక్ ఫ నీటి సంరక్షణతో కరువును జయిస్తున్న పల్లెలు -
కలెక్టరేట్లో అదనపు బ్లాక్ నిర్మాణానికి భూమిపూజ
నల్లగొండ : కలెక్టరేట్లో రూ.40 కోట్ల వ్యయంతో 82,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి, ప్లస్ టు విధానంలో అదనపు బ్లాక్ నిర్మాణానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని మౌలిక సదుపాయాలు, ఎలివేషన్, అత్యాధునిక డిజైన్లతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 250 సీట్ల సామర్థ్యం కలిగిన సమావేశ మందిరం సమీక్షలు, పెద్ద సమావేశాలకు సరిపోవడం లేదని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి దృష్టికి తీసుకుపోవడంతో అదనపు బ్లాక్ను మంజూరు చేయించారని తెలిపారు. నూతన అదనపు బ్లాకు నిర్మాణాన్ని పది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్కుమార్, రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు శ్రీధర్రెడ్డి, ఫణిజా, గణేష్, జిల్లా రెవెన్యూ ఇన్చార్జి అధికారి వై.అశోక్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల జాబితాపై విచారణ
నిడమనూరు : మండలంలోని నారమ్మగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. గ్రామంలో పలువురు అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని ఇటీవల స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం ఇన్చార్జి అదనపు కలెక్టర్తో పాటు ఎంపీడీవో రమేష్, పంచాయతీ రాజ్ ఏఈ సాయిప్రసాద్ విచారించారు. నిబంధనల ప్రకారం, నాలుగు చక్రాల వాహనం, పక్కా ఇల్లు, వ్యవసాయ భూమి వంటి అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విలేజ్ పోలీస్ వ్యవస్థతో మెరుగైన సేవలు నల్లగొండ : విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పోలీసు అధికారులు రోజూ వారికి కేటాయించిన గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను పైఅధికారులకు తెలియజేయాలన్నారు. ప్రజలు, పోలీసులకు సత్సంబంధాలు ఏర్పడితే నేర నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. సైబర్ నేరాలు, బెట్టింగ్, గేమింగ్ యాప్స్తో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. డ్రగ్స్తో వచ్చే అనర్థాలు, నేర నియంత్రణ, ఇతర అంశాలపై అవగాహన కల్పించిన ఏడుగురు గ్రామ పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. 29 నుంచి రైతులకు అవగాహనత్రిపురారం : విక్షిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 12వ వరకు జిల్లా వ్యాప్తంగా రైతులకు కృషి విజ్ఙాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్ ఆధ్వర్యంలో పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పిస్తామని కేవీకే కంపాసాగర్ ప్రోగాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కేవీకేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సులో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విక్షిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, విత్తన రకాలు, ఎంపిక వంటి అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
అందగత్తెలకు ఆతిథ్యం
పోచంపల్లికి 25 మంది అందాలభామలు ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచి, యునెస్కో అనుబంధ సంస్థచే ఉత్తమ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న భూదాన్పోచంపల్లిని గురువారం సాయంత్రం 6 గంటలకు 25 మంది సుందరీమణులు సందర్శిస్తారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో దారం నుంచి చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. వీరికి సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాలు, చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను వివరిస్తారు. అలాగే హాంఫి థియేటర్లో ప్రముఖ మోడల్స్చే నిర్వహించే ర్యాంప్ వాక్ను తిలకిస్తారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వాతి రూపొందించిన ఇండోవెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ కొనసాగనుంది. చేనేత ప్రాముఖ్యతను సుందరీమణులకు ప్రత్యేక యాంకర్స్ ద్వారా వివరిస్తారు. అలాగే పద్మశ్రీ గజం గోవర్ధన్, జాతీయ అవార్డు గ్రహీతలైన తడక రమేశ్, సాయిని భరత్, రాష్ట్ర అవార్డు గ్రహీతలు బోగ బాలయ్య, ఎన్నం మాధవి శివకుమార్, చేనేత సహకార సంఘం, పోచంపల్లి టై అండ్ డై అసోషియేషన్ల ఆధ్వర్యంలో పది స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పలు రకాల చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్నారు. నేడు పోచంపల్లి, యాదగిరిగుట్టలో మిస్వరల్డ్ పోటీదారుల పర్యటనసాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి : మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాని ఓ బృందం, భూదాన్పోచంపల్లిలో మరో బృందం సందడి చేయనుంది. వీరి పర్యటన కోసం టూరిజం శాఖతోపాటు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. నారసింహుడి క్షేత్రంలో ప్రత్యేక పూజలు పది మంది సుందరీమణుల బృందం గురువారం సాయంత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి రానుంది. వీరు ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి యాదగిరి కొండపైకి చేరుకుంటారు. కొండపైన అతిథి గృహం నుంచి ప్రత్యేక బ్యాటరీ వాహనాల్లో అఖండ దీపారాధన వద్దకు చేరుకుని దీపాలు వెలిగిస్తారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొంటారు. వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనం చేసి, శ్రీస్వామి వారి చిత్రపటాలు, లడ్డూ ప్రసాదాలను అందజేస్తారు. దర్శనం తర్వాత ముఖ మండపంలో పలు ప్రాంతాలను వీక్షిస్తారు. అనంతరం స్వర్ణ విమాన గోపురం వద్ద ఆలయమంతా కనిపించేలా ఫొటోలు దిగుతారు. సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ప్రధానాలయ ముఖ మండపం, మహా రాజగోపురాలను అలంకరించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం భక్తులకు కల్పించే బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో పాటు జోడు సేవలను రద్దు చేశారు. సుందరీమణులు వెళ్లిన తరువాత భక్తులకు శ్రీస్వామి వారి దర్శనాలను కొనసాగిస్తారు. ఫ శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న సుందరీమణులు ఫ టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియల పరిశీలన -
నాణ్యమైన విత్తనాలు అందించాలి
నల్లగొండ టౌన్ : రైతులకు వానాకాలం సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం ఎన్డీసీఎంఎస్లో పచ్చిరొట్ట విత్తనాల విక్రయాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామన్నారు. పిల్లి పెసర, జీలుగ, జనుము విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకందారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కలెక్టర్ను టీఎన్జీవోస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, బిజినెస్ మేనేజర్ నాగిల్ల మురళి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి జె.శేఖర్రెడ్డి, ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కార్మిక రంగం బలోపేతానికి కృషి చేయాలి
నాంపల్లి: కార్మిక రంగం బలోపేతానికి కేంద్రం కృషిచేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. నాంపల్లి మండలం వడ్డెపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ 15వ మండల మహాసభకు ఆయన హజరై పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు మద్దతు ధర కల్పించేందుకు గాను చట్టం తేచ్చేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికే రూ.లక్ష కోట్లు కేటాయించిందని, డిండి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికే రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసి డిండి ఎత్తిపోత పథకానికి నిధులు కేటాయించి ఈ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రయత్నం చేసిందన్నారు. అనంతరం మండల నూతన కమిటీని ఎనుకున్నారు. మండల కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవంగా సూదనబోయిన రమేష్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాగిపాణి ఆంజాచారి, రమేష్, జగన్, గిరి, రమా, కోరె సత్తయ్య, మహేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి -
టెండర్ల దశలోనే.. సుందరీకరణ!
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025అనుమతి లేని స్కూళ్లలో పిల్లలను చేర్పించవద్దునల్లగొండ : ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో పిల్లలను చేర్చవద్దని డీఈఓ భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తల్లిదండ్రులకు సూచించారు. నల్లగొండలోని జయ హైస్కూల్, ఎలైట్ స్కూల్, లిటిల్ స్కాలర్స్ హైస్కూల్, వేదాంత్ హైస్కూల్స్కు ప్రభుత్వ అనుమతి లేదని ఈ పాఠశాలల్లో పిల్లలను చేర్పించవద్దని పేర్కొన్నారు. జూన్ నాటికి మొక్కలు సిద్ధం చేయాలినాంపల్లి : జూన్ నెల నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. నాంపల్లి మండలంలోని దామెర గ్రామంలో నర్సరీని, పెద్దాపురంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్లో నిర్వహించే వనమహోత్సవం నాటికి మొక్కలు నాటేందుకు సిద్ధండా ఉండాలన్నారు. గ్రామాల్లో ఉపాధిహమీ కూలీలకు రోజూ రూ.307 కూలి వచ్చే విధంగా పనులను కల్పించాలని అధికారులు సూచించారు. పండ్ల తోటలను పెచుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించి పోత్సహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఏపీడీ యామిని, ఇందిరా, ఎంపీడీఓ శర్మ, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఏపీఎం వినోద్ తదితరులు ఉన్నారు. ఫిట్నెస్ లేకుండా వాహనాలు నడపొద్దునల్లగొండ : ఫిట్నెస్ లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవని డీటీసీ ఎన్.వాణి హెచ్చరించారు. మంగళవారం ఆర్టీఏ కార్యాలయంలో స్కూల్ బస్ యజమానులు, డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. 2011, జీఓ 35 ప్రకారం పాఠశాల, కళాశాలలకు వినియోగించే వాహనాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. బస్సుపై పాఠశాల పేరు, ఫోన్ నంబర్ ఉండాలని, డ్రైవరు, కండక్టర్లు యూనిఫాం ధరించాలని సూచించారు. విద్యార్థులను ఇంటి నుంచి పాఠశాలకు, పాఠశాల నుంచి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత యజమానులదే అన్నారు. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంవీఐ లావణ్య, చంద్రశేఖర్, ఏఎంఈవై సతీష్, సోని ప్రియ, ఉషశ్రీ, చిరంజీవి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. హనుమంతుడికి ఆకుపూజయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో చెరువుల సుందరీకరణ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కటకట ఉందనే ప్రచారం, గత ప్రభుత్వ హయాం నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు సరైన సమయంలో చెల్లింపులు జరపడం లేదనే కారణంగా కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉన్న 9 చెరువులను రూ.34 కోట్లతో సుందరీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. చెరువుల వద్ద సుందరీకరణ చేపట్టడం ద్వారా పట్టణాల అభివృద్ధికి, ప్రజల ఆహ్లాదానికి ఉపయోగ పడనుంది. ఇందుకోసం ప్రజారోగ్య శాఖ కార్యాలయ అధికారులు ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. త్వరలోనే ఈఎన్సీ నుంచి అనుమతి తీసుకొని మరోసారి టెండర్లు పిలిచేందుకు సంబంధితశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. మూడోసారి అయినా కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేనా అనే చర్చ లేకపోలేదు. తొమ్మిది చెరువుల సుందరీకరణ.. మున్సిపాలిటీల్లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొన్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ తరహాలో అంతటా చెరువులను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని 9 చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో రెండు చెరువుల చొప్పున మిగతా ఐదు మున్సిపాలిటీల్లో ఒక్కో చెరువును అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. కాగా నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. చిట్యాల మున్సిపాలిటీలో ఉన్న చిన్నది కాగా.. మిర్యాలగూడ పట్టణంలో 429 ఎకరాల పెద్ద చెరువును సుందరీకరించనున్నారు. చెరువు విస్తీర్ణం, కట్ట వెడల్పును బట్టి ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.34 కోట్లతో ప్రతిపాదనలు.. మున్సిపాలిటీలోని 9 చెరువులను అభివృద్ధి చేయడానికి ప్రజారోగ్య శాఖ అధికారులు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపినా అప్పటి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.34 కోట్లతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. అభివృద్ధిలో భాగంగా చెరువుల కట్టల వెడల్పు, గ్రీనరీ ఏర్పాటు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, బేంచీల ఏర్పాటు, గ్రీనరీ, లైటింగ్, పూల మొక్కల ఏర్పాటు, అంతా పచ్చగా ఉండేలా సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ప్రజలు రోజూ అక్కడికి వచ్చి గడిపేందుకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించనున్నారు. నాగార్జునకొండను సందర్శించిన బౌద్ధ భిక్షువులునాగార్జునసాగర్: బెంగళూరు సారా బౌద్ధవిహార్కు చెందిన బౌద్ధ భిక్షువులు మంగళవారం నాగార్జునకొండను సందర్శించారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా నవాంగ్ జుంగ్నే బౌద్ధ గురువు ఆధ్వర్యంలో సాగర్కు వచ్చారు. ఈ బృందం మొదటగా బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుని వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టూరిజం లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడ పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. బోధి వృక్షం కింద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. న్యూస్రీల్ ఆరేళ్లుగా.. అలాగే..!త్వరలోనే టెండర్లు పిలుస్తాం జిల్లాలోని మున్సిపాలిటీల్లో 9 చెరువులను గుర్తించి సుందరీకరించడానికి టెండర్లు పిలిచాం. రూ.34 కోట్లతో చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించా. గతంలో టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. త్వరలోనే మళ్లీ టెండర్లు పిలుస్తాం. – కందుకూరి వెంకటేశ్వర్లు, ప్రజారోగ్యశాఖ ఎస్ఈ సుందరీకరణ చేపట్టనున్న చెరువుల వివరాలు చెరువు మున్సిపాలిటీ నిధులు (రూ.కోట్లలో..) వల్లభరావు చెరువు నల్లగొండ 3.53మోతికుంట నల్లగొండ 0.61చిన్న చెరువు మిర్యాలగూడ 2.99పెద్ద చెరువు మిర్యాలగూడ 14.64బొమ్మరికుంట చిట్యాల 0.65శాగనకుంట చండూరు 2.64తుల్చమ్మకుంట దేవరకొండ 0.95రామసముద్రం హాలియా 5.95కలవోనికుంట నకిరేకల్ 1.87ఫ మున్సిపాలిటీల్లో 9 చెరువుల అభివృద్ధికి రూ.34 కోట్లతో ప్రణాళిక ఫ రెండుసార్లు టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు ఫ ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపు ఆలస్యమే కారణం ఫ మరోసారి టెండర్లు పిలవనున్న ప్రజారోగ్య శాఖ ఫ సుందరీకరణ పూర్తయితే పట్టణ ప్రజలకు దక్కనున్న ఆహ్లాదం -
దేశ వ్యాప్త సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు
నకిరేకల్: కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకిస్తూ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్లోని ఓ ఫంక్షన్ హాల్ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలుచేయడం లేదన్నారు. ఈ సమావేశంలో నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రబాకర్, ఆయా సంఘాల నాయకులు బొజ్జ చినవెంకులు, వంటేపాక వేంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, సింగం రేణుక, ఉయ్యాల సైదులు, గోర్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ఆకటు్టకోనున్న శిల్ప కళ
యాదగిరిగుట్ట : హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాలకు చెందిన 10మంది సుందరీమణులు గురువారం యాదగిరిగుట్టను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా నల్లరాతి శిల్పాలతో అద్భుతంగా రూపుదిద్దుకున్న యాదగిరీశుడి ఆలయాన్ని అందాల భామలు పరిశీలించి ఇక్కడే ఫొటో షూట్ నిర్వహించనున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా డాక్యుమెంటరీ చిత్రీకరించి విశ్వ వ్యాప్తంగా యాదగిరి క్షేత్ర ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎటు చూసినా ఆధ్యాత్మిక భావనే..యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంలో ఎటూ చూసినా అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తాయి. తూర్పు రాజగోపుర మహాద్వారం నుంచి ఆలయంలోని ప్రవేశించినప్పటి నుంచి సుందరీమణులను గొప్ప ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లనుంది. ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లే క్రమంలో మెట్లకు ఇరువైపులా గల శంకు చక్ర నామాలు, దశావతారాలు, హనుమంతుడు, గరుడ్మంతుడు, పంచనారసింహులు, రామానుజులు, యాదవ మహార్షి, ప్రహ్లాదుడు, మహా విష్ణువు, అష్టలక్ష్మి శిల్పాలతో ఆలయానికి ప్రత్యేక కళ వచ్చింది. మెట్లదారికి ఇరువైపులా చిన్న చిన్న ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇన్నర్, ఔటర్ ప్రాకారాల్లో ఏర్పాటు చేసిన యాలీ ఫిలర్లు, అష్టభుజి ప్రాకారాలు, సాలహారాల్లో పొందుపర్చిన దేవతామూర్తుల విగ్రహాలు, గర్భాలయం ముఖ మండపంపై ప్రహ్లాద చరిత్ర ఘట్టాలను పంచలోహ శిల్పాలు సుందరీమణులను ఆకట్టుకోనున్నాయి. ఆలయంలోని ప్రతి పిల్లర్కు ఒక్కో ఆళ్వారుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పెరి ఆళ్వార్, పెగయ్ ఆళ్వార్, భూదత్ ఆళ్వార్, మధురకవి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తిరుప్పాన్ ఆళ్వార్, నంబి ఆళ్వార్, పే ఆళ్వార్, కులసేఖర్ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తొండర పొడియా ఆళ్వార్, ఆండాల్ అమ్మవార్ల విగ్రహాలు, ఆళ్వార్ పిల్లర్ల పైన కాకతీయ శైలితో స్తంభాలను నెలకొల్పిన తీరు అందాల భామలను కనువిందు చేయనున్నాయి. రేపు యాదగిరిగుట్టకు రానున్న సుందరీమణులు -
జేఎల్ఎం జీత వ్యత్యాసాన్ని సరిచేసేందుకు చర్చలు
హుజూర్నగర్: విద్యుత్ సంస్థలోని 2023 బ్యాచ్ జేఎల్ఎం జీత వ్యత్యాసాన్ని సరిచేసేందుకు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం(టీఆర్వీకేఎస్) రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీజీఎస్పీడీసీఎల్ కార్యదర్శి పి. కరెంట్రావు తెలిపారు. మంగళవారం హుజూర్నగర్ విద్యుత్ డివిజన్ ఆధ్వర్యంలో మే డే పక్షోత్సవాలలో భాగంగా డీఈ కార్యాలయం ముందు యూనియన్ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్ల కన్వెర్షన్ కోసం యూనియన్ కృషిచేస్తుందని అన్నారు. త్వరలో జరగబోయే సబ్ ఇంజనీర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా మల్టీపుల్ ఛాయిస్లో ఇచ్చే విధంగా యాజమాన్యంతో మాట్లాడతామని చెప్పారు. ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పి. రమేష్బాబు, పి. మల్లికార్జున్, బి. విశ్వనాథచారి పాల్గొన్నారు. -
ఎండల్లో హాయ్.. హాయ్..
సూర్యాపేట అర్బన్, నల్లగొండ టూటౌన్: వేసవి సెలవులను వృథా చేయకుండా చిన్నారులు ఏదో ఒక సాధనలో నిమగ్నమయ్యారు. కొందరు వేసవి క్రీడా శిబిరాలకు వెళ్లి తమకు ఇష్టమైన ఆటల్లో మెలకువలు నేర్చుకుంటుంటే, కొందరు అమ్మమ్మ వాళ్ల ఊళ్లకు చెరువులు, బావుల్లో ఈత నేర్చుకుంటున్నారు. పట్టణాల్లో ఉండే చిన్నారులు స్విమ్మింగ్ పూల్స్లో ఈత నేర్చుకుంటూ వేసవి సెలవులను సరదాగా గడుపుతున్నారు. సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో గల శివం స్విమ్మింగ్ పూల్లో ఉదయం 7.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఈత నేర్చుకుంటున్నారు. యువకులు కూడా వేసవి తాపానికి తాళలేక సాయంత్రం వేళ స్విమ్మింగ్ పూల్కు వచ్చి ఈత కొడుతున్నారు. ఉదయం 30 నుంచి 40 మంది, సాయంత్రం 60 నుంచి 70 మంది పిల్లలు ఈత నేర్చుకోవడానికి వస్తున్నారు. గంటకు రూ.80 నుంచి రూ.100 చెల్లిస్తున్నారు. నెల రోజులకు అయితే ఒక్కొక్కరికి రూ.2,000 వరకు స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు తీసుకుంటున్నారు. ప్రతిరోజు సాయంత్రమయ్యేసరికి ఈత కొలను చిన్నారులతో కళకళలాడుతూ కనిపిస్తోంది. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో గల స్విమ్మింగ్ పూల్లో సైతం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థులు, చిన్నారులు వచ్చి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటున్నా ఆత్మరక్షణ కోసం సూర్యాపేటలోని కుడకుడ రోడ్డులో గల శివం స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటున్నాను. 15 రోజుల నుంచి ఇక్కడకు వస్తున్నాను. మొదట గాలి ట్యూబ్ సహాయంతో ఈత కొట్టాను. ప్రస్తుతం కొంచెం కొంచెంగా ట్యూబ్ లేకుండా ఈత కొట్టగలుగుతున్నా. – సూర్యతేజ్ ఎంతో సరదాగా ఉంది వేసవి సెలవుల్లో ఈత నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది.. నేను 20 రోజులుగా స్విమ్మింగ్ పూల్కు వచ్చి మా నాన్న సహాయంతో ఈత నేర్చుకుంటున్నాను. ఈ వేసవి సెలవులు అయిపోయే లోపు ఈత నేర్చుకుంటా. ఎండ వేడికి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం భలే సరదాగా ఉంది. – వేదశ్రీఈత వల్ల ఎన్నో లాభాలు చిన్నపిల్లలకు ఈత నేర్పడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చెరువులు, బావుల దగ్గరికి వెళ్లినప్పుడు వాటిల్లో మునిగిపోకుండా కాపాడుకోవచ్చు. ప్రస్తుతం ఈతరాక అనేక మంది పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈత కొట్టే పిల్లలు శారీరకంగా కూడా ధృఢంగా ఉంటారు. పిల్లలకు ఈత నేర్పడం చాలా అవసరం. – లక్కరాజు ప్రవీణ్, స్నేహనగర్, సూర్యాపేటట్యూబ్లతో సాధన స్విమ్మింగ్ పూల్స్లో చిన్నారులు ట్యూబ్ల సహాయంతో ఈత సాధన చేస్తున్నారు. సూర్యాపేటలోని స్విమ్మింగ్ పూల్లో వీరికి శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు శిక్షకులను సైతం పూల్ నిర్వాహకులు నియమించారు. అదేవిధంగా ఇద్దరు అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. వీరు నిరంతరం పిల్లలు ఈత కొట్టే విధానాన్ని, ఎవరూ పూల్లో మునిగిపోకుండా పర్యవేక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా దుస్తులు మార్చుకోవడానికి నాలుగు గదులు కూడా ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్ పూల్స్లో ఈత నేర్చుకుంటూ సరదాగా గడుపుతున్న చిన్నారులు ఆత్మరక్షణ కోసం పిల్లలకు ఈత నేర్పిస్తున్నామంటున్న తల్లిదండ్రులు -
అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
భువనగిరిటౌన్: డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను భువనగిరి పట్టణంలోని నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద మంగళవారం పోలీసులు, బజరంగ్దళ్ నాయకులు పట్టుకున్నారు. ఏపీలోని కాకినాడ నుంచి డీసీఎంలో 16 గోవులను ఎక్కించి వాటి పైనుంచి కొబ్బరి పొట్టు కప్పి హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు భువనగిరి పట్టణ ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని చెక్పోస్ట్లు ఏర్పాటు చేయాలని, గోరక్ష చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బజరంగ్దళ్ భువనగిరి పట్టణ కన్వీనర్ నెమల నవీన్ కోరారు. సాంకేతిక కోర్సుల్లో ఉచిత శిక్షణభూదాన్పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో మేథా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 6 నెలల కాలవ్యవధి కల్గిన ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్సిస్టమ్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ కోర్సుకు ఐటీఐ లేదా ఏదేని డిప్లమా పాసై ఉండాలని అన్నారు. కంప్యూటర్ హార్డ్వేర్, సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ అండ్ సీసీ టీవీ టెక్నిషియన్ కోర్సుకు పదవ తరగతి విద్యార్హత కల్గి ఉండాలని అన్నారు. అలాగే టైలరింగ్ ఎంబ్రాయిడరీ, జర్ధోజీ క్విల్ట్ బ్యాగుల తయారీ కోర్సుకు మాత్రం 8వ తరగతి పాసైన వారు అర్హులని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనంతో కూడిన హాస్టల్ వసతి కూడా కల్పించబడుతుందని అన్నారు. అంతేకాక శిక్షణ పూర్తి చేసుకొన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. అయితే అభ్యర్థులు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య మయస్సు కల్గి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ నెల 16న సంస్థలో నిర్వహించే కౌన్సిలింగ్కు నేరుగా హాజరు కావలెయునని తెలిపారు. ఇతర వివరాలకు 9133908000, 9133908111 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. స్వర్ణగిరి క్షేత్రంలో వైభవంగా నిత్య కల్యాణంభువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో పద్మావతి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి నిత్య కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, దీపాలంకరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్
రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం నిర్వహించిన పాలిసెట్–2025 ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ పట్టణంలో 11 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగింది. మొత్తం 5,203 మంది విద్యార్థులకు గాను 2,472 మంది బాలురు, 2,278 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. 453 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కోఆర్డినేటర్, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ సిహెచ్.నర్సింహారావు తెలిపారు. -
మునుగోడు నుంచే విద్యుత్ సంస్కరణలు
చౌటుప్పల్ : నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం త్వరలోనే విద్యుత్ శాఖలో సంస్కరణలు తీసుకురానుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఆయా సంస్కరణలను మునుగోడు నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, విద్యుత్ అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ ముష్రాఫ్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.34 కోట్లు ఖర్చవుతాయని గుర్తించామని, వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్శాఖలో పనిచేసే అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని, ప్రజలను వేధించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో సమస్యలు పూర్తిగా పరిష్కారమవ్వాలన్నారు. సీఎండీ ముష్రాఫ్ మాట్లాడుతూ.. వ్యవసాయ పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మారుస్తామని తెలిపారు. వ్యవసాయ డీపీఆర్లకు ఏబీ స్విచ్లు పెంచుతామన్నారు. సమావేశంలో యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
తిప్పర్తి: నల్లగొండ కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి నిరుద్యోగ యువతను మోసం చేసిన ఇద్దరు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను తిప్పర్తి పోలీస్ స్టేషన్లో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఎండీ నసీర్ నల్లగొండ కోర్టులో అడ్వకేట్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. అదే కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న గాజుల జ్యోతి, నసీర్ కలిసి కోర్టుకు వచ్చే నిరుద్యోగ యువతకు కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి 31 మంది నుంచి రూ.10.32లక్షలు వసూలు చేశారు. తాను మోసపోయినట్లు గ్రహించిన తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందిన ఏపూరి హెబ్సిబా ఈ నెల 7వ తేదీన తిప్పర్తి పోలీస్ స్టేషన్లో వీరిద్దరిపై ఫిర్యాదు చేసింది. శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందుతులిద్దరిని మంగళవారం అదుపులో తీసుకున్నారు. వీరిపై తిప్పర్తి పోలీస్ స్టేషన్లో 4 కేసులు, నల్లగొండ వన్టౌన్లో 3 కేసులు మొత్తం 7 కేసులు నమొదయ్యాయి. వీరి నుంచి 2 సెల్ఫోన్లు, బైక్, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, తిప్పర్తి ఎస్ఐ సాయిప్రశాంత్, పోలీస్ సిబ్బందిని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యక్రమంలో శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐ సాయిప్రశాంత్, ఏఎస్ఐ లింగయ్య, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, రాజీవ్, రాంరెడ్డి, నాగరాజు, సూరిబాబు పాల్గొన్నారు. ఇద్దరి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు -
బయోమైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం
మిర్యాలగూడ టౌన్ : డంపింగ్ యార్డులో చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు త్వరలోనే బయోమైనింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాంనగర్ బంధం వద్ద ఉన్న డంపింగ్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డును పరిశుభ్రంగా ఉంచి పర్యటక కేంద్రంగా ఉండేలా చూడాలన్నారు. అదే విధంగా జడ్చర్ల–కోదాడ ప్రధాన రోడ్డు నుంచి డంపింగ్ యార్డు వరకు వెంటనే రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలో మొత్తం 9 మంది ఎన్ఎంఆర్లు ఉంటే వారిలో నలుగురు మృతి చెందారని, ఉన్న వారిని పర్మినెంట్ చేస్తామన్నారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గడువును ఈ నెల 31వ వరకు పొడిగించిందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ మహ్మద్ యూసుఫ్, ఆర్ఓ జ్ఞానేశ్వరీ, టీపీఎస్ అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, శంకర్, ఏఈ అనిల్, వినోద్, చరణ్ తేజ్, శ్వేతారెడ్డి తదితరులు ఉన్నారు. ఫ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ -
మట్టపల్లిలో వైభవంగా తిరుకల్యాణోత్సవం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవాన్ని సోమవారం తెల్లవారు జామున వైభవంగా నిర్వహించారు. అర్చకబృందం శ్రీస్వామి అమ్మవార్లకు జీలకర్రబెల్లం, యజ్ఞోపవీతం, తాళిబొట్టు,తలంబ్రాలను సమర్పించి నిండు వైశాఖ పౌర్ణమి వెన్నెలలో కల్యాణతంతు జరిపించారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి, రాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత ఉత్సవమూర్తులను గజ, సింహ, అశ్వ వాహనాలపై అశేషభక్తుల జయజయధ్వానాల నడుమ కల్యాణమండపం వరకు ఊరేగింపుగా తరలించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి యాదాద్రి కలెక్టర్ మంత్రిప్రగడ హనుమంతరావు, ఆలయ ధర్మకర్త నరసింహమూర్తిలు తెచ్చిన పట్టువస్త్రాలను ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్లు శ్రీస్వామివారికి సమర్పించారు. కాగా ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం అనంతరం కల్యాణమూర్తులకు శ్రీమన్నారాయణమూర్తి అలంకారంలో గరుడవాహన సేవను నిర్వహించారు. -
14 నుంచి ఎంజీయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 14 నుంచి డిగ్రీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్లాగ్ 1, 3, 5 పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గతంలో తీసుకున్న హాల్టికెట్ లేదా నూతన హాల్టికెట్తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారని తెలిపారు. కళాశాల గుర్తింపు కార్డు, ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో రావాలని పేర్కొన్నారు. పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల సమ్మె విరమణరామగిరి(నల్లగొండ) : తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ 40 రోజులుగా చేపట్టిన సమ్మెను సోమవారం విరమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మారం నాగేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్టారెడ్డి.. డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు పేర్కొన్నారు. సమ్మె విరమించడంతో యూనివర్సిటీ పరిధిలో పరీక్షలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల విషయంలో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి, ఉన్నత విద్యామండలి కృతజ్ఞతలు తెలిపారు. రహదారి వెంట విద్యుత్ కాంతులు● సుందరీమణుల కోసం కాకుండా.. నిత్యం వెలిగేలా చూడాలంటున్న ప్రజలు పెద్దవూర : బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రపంచ సుందరీమణులు ప్రపంచ పర్యాటక ప్రదేశమైన నాగార్జునసాగర్ బుద్ధవనం సందర్శనకు సోమవారం వచ్చారు. దీంతో అధికారులు హడావుడిగా మండల కేంద్రంలోని నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట డివైడర్ల పొడవునా సుమారు రూ.25 వేల వ్యయంతో రకరకాల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రోడ్డు వెంట పేరుకుపోయిన చెత్తాచెదారం, డివైడర్ల వెంట మొలిచిన పిచ్చిమొక్కలను పారిశుద్ద్య కార్మికుల చేత తొలగింపజేశారు. డివైడర్ల వెంట ప్రధాన రహదారి మధ్యలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలకు మరమ్మతు చేసి వెలిగించారు. ప్రపంచ సుందరీమణులు వచ్చినప్పుడే కాకుండా నిత్యం ప్రధాన రహదారి వెంట శుభ్రం చేసి విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని మండల కేంద్రంలో ప్రజలు అంటున్నారు. -
అర్బన్ దరఖాస్తులు.. రూరల్ పరిధిలోకి!
నల్లగొండ టూటౌన్ : నిరుద్యోగ యువత ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు నీలగిరి మున్సిపాలిటీకి చెందినవి నల్లగొండ ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్లాయి. నీలగిరి పట్టణానికి చెందిన 1200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన దరఖాస్తులు నల్లగొండ రూరల్ పరిధిలోకి వెళ్లడంతో వారికి రుణాల మంజూరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నీలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డులకు చెందిన యువత రాజీవ్ యువ వికాసం పథకం కింద ఉపాధి కల్పన కోసం రుణం వస్తదనే ఆశతో దరఖాస్తులు చేసుకున్నారు. నీలగిరి మున్సిపల్ లాగిన్లో నమోదు చేసుకున్న వారు 5,626 మంది ఉన్నారు. ఎంపీడీఓ లాగిన్లో పడిన వారిని కలుపుకుంటే 6826 దరఖాస్తులు అవుతాయి. ఆన్లైన్లో తప్పుగా నమోదు.. రాజీవ్ యువ వికాసం కింద రూ.50 వేలు అయితే బ్యాంకుతో సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా నేరుగా మున్సిపల్ కమిషనర్లకు పంపించి లబ్ధిదారులకు చెక్ రూపం ఇవ్వాలని నిర్ణయించారు. ఇది మంజూరైతే తిరిగి రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు. రూ.లక్ష దాటితే బ్యాంకు ద్వారా రుణాన్ని మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే రుణాల కోసం యువత మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంది. మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకునే సమయంలో జరిగిన తప్పుల వల్ల వారి దరఖాస్తులు నల్లగొండ రూరల్ పరిధిలోకి వెళ్లిపోయారు. దీని కారణంగా 1200 మందికి రాజీవ్యువ వికాసం కింద రుణం మంజూరయ్యే అవకాశం లేదు. దీన్ని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది వాటిని మున్సిపాలిటీకి బదిలీ చేయాలని ఎంపీడీఓ కార్యాలయ అధికారులను కోరినా వారి నుంచి స్పందన లేదు. ఇటు మున్సిపాలిటీ కానీ, అటు ఎంపీడీఓ కార్యాలయం అధికారులు గానీ దీని గురించి సీరియస్గా పట్టించుకోకపోవడంతో యువతకు రుణం మంజూరు కాకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విషయం చాలా మంది దరఖాస్తుదారులకు తెలియకపోవడంతో వారు రుణం వస్తదనే ఆశతోనే ఉన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్లిన దరఖాస్తులను మున్సిపాలిటీ లాగిన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ లాగిన్లోకి మార్పిస్తాం నల్లగొండ పట్టణానికి చెందిన యువత దరఖాస్తులు నల్లగొండ ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్లింది వాస్తవమే. ఎంపీడీఓతో మాట్లాడి వారి లాగిన్ నుంచి మున్సిపాలిటీ లాగిన్లోకి తీసుకువచ్చి అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తాం. – శ్రీనివాస్, మెప్మా టీఎంసీ ఫ 1200 మంది రాజీవ్ యువవికాసం దరఖాస్తుల మార్పు ఫ ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్లినట్లు నిర్ధారణ ఫ వాటిని మార్చకుంటే యువతకు రుణం రానట్టే.. -
నకిలీ విత్తనాలపై నజర్
నల్లగొండ అగ్రికల్చర్ : నకిలీ పత్తి విత్తన అమ్మక వ్యాపారులపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలపై కట్టడి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇటీవల ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రత్యేక టాస్క్పోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో ఎస్పీ, వ్యవసాయ శాఖ అధికారి రెవెన్యూ అధికారి సభ్యులుగా డివిజన్ స్థాయిలో డీఎస్పీ, ఆర్డీఓ, ఏడీఏ సభ్యులుగా, మండల స్థాయిలో ఎస్ఐ, తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి సభ్యులుగా కమిటీలను నియమించింది. ఈ కమిటీలు నకిలీ విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి దాడులు నిర్వహించనున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మిన, రవాణా చేసిన వారిపై కేసులను నమోదు చేసి చర్యలు తీసుకోనుంది. గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు.. జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాటి అమ్మకాలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ఏటా నిఘా పెట్టినా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు తమ అమ్మకాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఆ విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేసే రైతులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి నకిలీ విత్తనాల ఆటకట్టించేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. విత్తన వ్యాపారుల అండదండలతో.. జిల్లాలోని ప్రధానంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన విత్తన వ్యాపారులు.. దళారులకు అండగా నిలిచి నకిలీ విత్తన వ్యాపారులకు మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది. ఆయా వ్యాపారులు తమ కంపెనీ బ్రాండెడ్ విత్తనాల అమ్మకం పేరుతో నకిలీ విత్తనాలను దళారుల ద్వారా రైతులకు అంటకట్టడంలో భాగస్వాములవుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న వ్యాపార సంస్థలే ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో టాస్క్పోర్స్ కమిటీలు ఫ విత్తనాల అమ్మకంపై నిరంతరం నిఘా ఫ రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ సూచన దళారులను నమ్మి మోసపోవద్దు దళారుల మాటలు నమ్మి రైతులు రైతులు మోసపోవద్దు. 450 గ్రాముల బ్రాండెడ్ కంపెనీ విత్తన ధర రూ.901 మాత్రమే. దాని కన్నా ఎక్కువ ధర చెల్లించవద్దు. విత్తనాలు కొన్న వెంటనే రశీదు తీసుకోవాలి. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వ్యవసాయాదికారులకు సమాచారం అందించాలి. – శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బ్రాండెడ్ కవర్లలో నింపి.. గ్రామాల్లో ఎరువులు, విత్తనాల వ్యాపారులు ఏజెంట్లను నియమించుకుని నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా దేవరకొండ, నల్లగొండ, మునుగోడు, గుర్రంపోడు, హాలియా తదితర మండలాల్లో ఈ దందా కొనసాగుతోంది. మహబూబ్నగర్ జిల్లా బూత్నూరు, గద్వాల, ఏపీలోని గుంటూరు, పిడుగురాళ్ల, మాచర్ల తదితర ప్రాంతాల్లోని జిన్నింగ్ మిల్లుల నుంచి లూజ్ విత్తనాలు దళారులు కొనుగోలు చేసి వాటిని రంగురంగుల బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేసి బ్రాండెడ్ విత్తనాల పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన జర్మినేషన్ లేని విత్తనాలను కూడా ఆ బ్రాండెడ్ కంపెనీ కవర్లలో ప్యాక్ చేసి రైతులకు అంటగడుతున్నారు. బీటీ 3, గ్లైసెల్ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించినా.. ఆ విత్తనాలను కూడా రైతులకు అంటగడుతున్నారు. -
బుద్ధవనంలో సౌందర్య ధ్యానం..
నాగార్జునసాగర్: ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు సోమవారం నాగార్జునసాగర్లో సందడి చేశారు. నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో సోమవారం నిర్వహించిన బుద్ధ పూర్ణిమ వేడుకలకు మిస్ వరల్డ్ ఓసియానా గ్రూప్–4లోని 22 దేశాల సుందరీమణులు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్నారు. వారికి పర్యాటక శాఖ, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. విజయవిహార్ వెనుకభాగంలోని పార్కులో ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీపర్వతారామంలోని బుద్ధవనానికి చేరుకున్నారు. ముందుగా బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించి పూజలు చేశారు. మహాస్తూపం వద్ద వీరికి తెలంగాణ గిరిజన మహిళలు నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. 6.42 గంటలకు వారికి శిల్పాలను చూపిస్తూ ఆర్కియాలజిస్టు శివనాగిరెడ్డి బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు, తెలంగాణకు బౌద్ధమతంతో గల సంబంధం తదితర అంశాలను వివరించారు. మహాస్తూపంలోని పంచ ధ్యానబుద్ధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే కొద్దిసేపు ధ్యానం చేశారు. రాత్రి 7.08 గంటలకు బుద్ధ జయంతి కార్యక్రమాలలో భాగంగా బౌద్ధ భిక్షవులు నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం జాతకవనంలో కళాకారులు బుద్ధుడి చరిత్రను తెలియజేసే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డిన్నర్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంసీ.కోటిరెడ్డి, శంకర్నాయక్, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఐఏఎస్ అధికారి లక్ష్మి, మిర్యాలగూడ సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎస్పీలు రమేశ్, మౌనిక, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
నాగార్జున సాగర్లో మిస్ వరల్డ్ భామల సందడి
సాక్షి, నల్గొండ: ఇరవై రెండు దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో సందడి చేశారు. వారికి జానపద, గిరిజన నృత్య కళాకారులతో సుందరీమణులకు స్వాగతం పలికారు. బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని అందగత్తెలు సందర్శించారు. బుద్ధ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. నాగార్జున సాగర్ వాటర్ బ్యాక్ గ్రౌండ్లో స్పెషల్ ఫోటో షూట్లో కూడా పాల్గొననున్నారు. నాగార్జున సాగర్లో సుమారు నాలుగు గంటల పాటు పర్యటించనున్నారు. విందు అనంతరం హైదరాబాద్కు బయలుదేరనున్నారు.కాగా, రేపు(మంగళవారం) సాయంత్రం పోటీదారులు చార్మినార్ నుంచి లాడ్బజార్ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్ చేస్తారు. చార్మినార్ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్ కీ ఘోష్, పనీర్ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్ జామూన్ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు.ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్ స్టార్ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్కు ఆర్డర్ ఇచ్చారు.ఆసియా వంటకాలలో సుషీ (జపాన్), డిమ్సమ్ (చైనా), థాయ్ గ్రీన్ కర్రీ (థాయ్లాండ్) వంటివి, యూరోపియన్ వంటకాలైన ఇటాలియన్ పాస్తా, ఫ్రెంచ్ రాటటౌలీ, స్పానిష్ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్ టాకోస్, బ్రెజిలియన్ ఫెయిజోడా, అమెరికన్ బార్బెక్యూ రిబ్స్ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ డోరో వాట్, మొరాకన్ టాగిన్, హమ్ముస్తో పాటు మెడిటరేనియన్ ఫలాఫెల్, క్వినోవా సలాడ్ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్ వరల్డ్ లిమిటెడ్ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్లో జరిగే గలా డిన్నర్ సందర్భంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. -
అదరగొట్టిన ప్రగతి కళాశాల విద్యార్థులు
నల్లగొండ: ఈఏపీసెట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన కె. ఉజ్వల 314 ర్యాంకు, ఎం. షైని 1306, అరిబా తబస్సుమ్ 1363, పి. సింధు 1847, నబీహా మహీన్ 2812, బి. భవాని 3755, అమాతుల్ ముజీబ్ షెజాన్ 4294, ఎస్. చరణ్ 4768, కె. సమీర 5075, కె. యశ్వంత్ 5728, సుహాన ఫిర్దోస్ 5960, ఎన్. సాయిమిత్ర 7055, శ్రీలక్ష్మి 7100, వి. దీక్షిత 7464, పి. హాసిని 7561, బి. శిరీష 8031, కె. బాలాజి 8379, నిఖిల్ 8653, ఎస్. శ్రీకాంత్, 8785, కె. హాసిని 9304, ఎల్. నితిన్సాయి 9681, కె. శ్రేయారెడ్డి 9888 ర్యాంకు సాధించారు. 15వేల లోపు ర్యాంకులు 72 మంది విద్యార్థులకు, 25వేల లోపు ర్యాంకులు 153 మంది విద్యార్థులు సాధించినట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులను, అధ్యాపకులను కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి, డైరెక్టర్లు నరేంద్రబాబు, ఎన్. శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్రెడ్డి అభినందించారు. -
ఈఏపీసెట్లో ‘శ్రీచైతన్య’ ప్రభంజనం
ఖమ్మం సహకారనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదివారం అభినందించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో వి. కుషాల్ 28వ ర్యాంకు, వై. నిషాంత్ 61, డి. దుర్గా గుజిరి 222, ఏ. సాయితేజ 253, కె. విశావని వాగ్దేవి 301, బి. రిషిత 321, ఆర్. జోష్ణవ్ కుమార్ 334, కె. సాయిదివ్య వర్షిత 423, జి. సాయి ప్రణవి 491, కె. హాసిని 575, వి. ప్రణతి, కె.తేజస్విని 653, బి. ఈశ్వర్ గుప్తా 855, యు. వశిష్ఠ 908, బి. మనిశేషు 968, డి. శ్రీలేఖ 1195, పి. స్మైలికరెడ్డి 1262, కె. నిషాంత్రెడ్డి 1394, ఎల్. మనోహర్ 1422, జి. అలేఖ్య 1482వ ర్యాంకు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ బి. సాయిగీతిక, డీజీఎం సీహెచ్. చేతన్ మాధుర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ వర్మ, డీఎన్ జె. కృష్ణ, ఏజీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
సైన్యం పిలిస్తే.. వెళ్లడానికి సిద్ధం
పాకిస్తాన్తో తాడో పేడో తేల్చుకోవాలి – నర్సింగ్ మార్క్, మాజీ సైనికుడునల్లగొండ : పాకిస్తాన్ మొదటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడటం భారత దళాలు వారికి బుద్ధి చెప్పడం, తోక ముడిచి వెనుదిరగడం పాకిస్తాన్కు అలవాటే. పాకిస్తాన్తో ఇప్పటికై నా తాడోపేడో తేల్చుకోవాలని అంటున్నారు మాజీ సైనికుడు, సెక్షన్ కమాండర్ నర్సింగ్ మార్క్. తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం గ్రామానికి చెందిన నర్సింగ్ మార్క్ 1984లో ఆర్మీలోకి వెళ్లారు. మధ్యప్రదేశ్లోని సావ్గర్లో ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకుని జమ్ముకశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్, హైదరాబాద్, నేపాల్, కేరళ తదితర ప్రాంతాల్లో పని పని చేశారు. 2004లో రిటైర్ అయ్యారు. శత్రువు మీద గురి పెట్టడమే లక్ష్యం..చేతిలో తుపాకి ఎదురుగా ఉన్న శత్రువు మీద గురిపెట్టడం ఒకటే లక్ష్యంగా సైనికులు పోరాడుతారు. సైనికుడు లక్ష్యాన్ని చేధించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడు. పోరాడి వీరమరణం పొందుతాడే తప్ప శత్రువు చేతికి చిక్కే పరిస్థితి తెచ్చుకోరు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే యుద్ధంలో ‘జవాన్కు ఆఖరి గోలి ఆఖరి దుష్మన్’ అనే విధానం ఆఖరి తూటాతో శత్రువును నాశనం చేయడం.. అవకాశం లేకపోతే శత్రువుల చేతిలో చంపకుండా తనకు తానే కాల్చుకుని వీరమరణం పొందుతాడు తప్ప వెన్ను చూపడు. ఆ విధంగా ప్రతి సైనికుడు యుద్ధంలో పోరాడుతాడు. కార్గిల్ యుద్ధంలో సెక్షన్ కమాండర్గా పని చేశా..1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో నేను సెక్షన్ కమాండర్గా పని చేశా. హిమాలయాల్లో టైగర్ హిల్స్పై ఆరు నెలలు ఉన్నాం. మంచు పర్వతమిది. మంచినీళ్లు కూడా ఉండవు. మంచుని కరిగించుకుని తాగాలి. వంట చేసుకోవాలన్న అక్కడ ఉన్న మంచుగడ్డలను గిన్నెలో వేసి నీరుగా మార్చిన తర్వాతే వంట చేసుకోవాలి. ఒక్కోసారి తిండి లేకున్నా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ టైగర్ హిల్స్పై పైకి ఒకసారి వెళ్లామంటే ఆరు నెలలకు అవసరమైన అన్ని అహార పదార్థాలు, మెడిసిన్ తీసుకెళ్లాలి. అత్యవసరమైతే పైనుంచి హెలికాప్టర్లో వచ్చి పైనుంచి కిందకు వదులుతారు. సమాచార వ్యవస్థ కూడా అసలు ఉండదు. కార్గిల్ యుద్ధంలో శత్రువులు మా వైపు రాకుండా ముందే మైన్ ఎం14, ఎం16లను భూమిలో పాతిపెట్టేవాళ్లం. వెంట్రుక లాంటి వైర్లును అమర్చాం. అయితే శత్రువులు అటుగా ఆ మైన్లను దాటి వస్తే ఆ వైర్కు కాలు తగిలినా.. మైన్ మీద కాలు పెట్టినా అది పేలిపోతుంది. అలా శత్రువుల ఆట కట్టంచే వాళ్లం. మళ్లీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంపాకిస్తాన్తో మళ్లీ యుద్ధం జరిగిన సమయంలో.. నన్ను పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. నేను ట్రెయిన్డ్ జవాన్ను. ఎప్పుడైనా దేశం రక్షణ కోసం జరిగే యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంటాను. మాతో పాటు చాలా మంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారు.దేశసేవ చేయడం అదృష్టం – లక్క లింగారెడ్డి, మాజీ సైనికుడు పెద్దవూర : దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావించాలి. అది అందరికీ రాదు అని చెబుతున్నారు ఇండియన్ ఆర్మీలో 19 ఏళ్ల పాటు దేశానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన లక్క లింగారెడ్డి. పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన లింగారెడ్డి. తల్లింద్రులకు ఒక్క కుమారుడు. ఆర్మీలో చేరవద్దని తల్లిదండ్రులు ఎంత వద్దని వారించినా దేశానికి సేవ చేయాలన్న తలంపుతో 2003లో ఆర్మీలో చేరారు. 2022 డిసెంబర్లో రిటైర్ అయ్యారు. 19 ఏళ్లు సైన్యంలో పనిచేశా..ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ)లో ట్రైనింగ్ చేసి 47 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్లో పోస్టింగ్కు వెళ్లా. తన సర్వీసులో ఆరున్నర సంవత్సరాలు జమ్మూ కశ్మీర్లో పనిచేశా. మూడు సంవత్సరాలు ఉగ్రవాదులను ఏరివేసే స్పెషల్ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్(25 రాష్ట్రీయ రైఫిల్స్)లో పనిచేశా. ఆ సమయంలో ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నా. 19ఏళ్లు సైన్యంలో పని చేసి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వచ్చిన సమయంలో గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు రెండు కిలోమీటర్ల వరకు ఎదురొచ్చి కుంకుమ దిద్ది, హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. రెండు కిలోమీటర్లు పూలు చల్లుతూ బాణాసంచా కాల్చుతూ, నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఆ అనుభూతిని నేను జీవితంలో మరిచిపోలేను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ ధైర్యంగా, విరోచితంగా, సాంకేతికతతో పోరాడుతోంది. యుద్ధం వల్ల దేశానికి కొంత నష్టం జరిగినా భవిష్యత్లో ఉగ్రవాద సంఘటనలు జరగకుండా ఉంటాయి. యుద్ధ సమయంలో తన అవసరం ఉందని సైన్యం పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నా. దేశ సేవ చేసే అదృష్టం అందరికీ రాదు మాజీ సైనికులు నర్సింగ్ మార్క్, లక్క లింగారెడ్డి‘ఆపరేషన్ సిందూర్తో భారత జవాన్లు గట్టిగా పోరాడుతున్నారు. ఎప్పుడు యుద్ధం జరిగినా సైన్యం పిలస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉంటాం. దేశరక్షణ కోసం ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తుంటాం. దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావించాం. అది అందరికీ రాదని చెబుతున్నారు’ మాజీ సైనికులు నర్సింగ్ మార్క్, లక్క లింగారెడ్డి. ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వారు ‘సాక్షి’తో మాట్లాడారు. -
సత్తాచాటిన ‘గౌతమి’ విద్యార్థులు
నల్లగొండ: ఈఏపీసెట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. కళాశాలకు చెందిన ఎండీ. ఉజైర్ 165వ ర్యాంకు, యాస్మిన్ 435, భవ్యశ్రీ 737, ఆఫియా సదాఫ్ 1133, వి. గాయత్రి 1361, బుష్రా 1588, సుసన్నా 2090, షైలా అలీఖాన్ 2267, సాయి నిఖిల 3228, శృతి 3522, ప్రేమ్చందర్ 4541, మీనాక్షి 5166, రాజారెడ్డి 5183, హితశ్రీ 5391, ఆవుల శివాని 6246, అజయ్ 6355, అంజలి 6365, దీపిక 6448, సాత్విక్రెడ్డి 6512, పోలగాని దీపిక 7064, దీక్షితారెడ్డి 7230, శ్రీనిధి 7522, కృష్ణచైతన్య 7682, ఇర్ఫానా తబస్సుమ్ 9778, తితీక్ష 10,504, బొడ్డుపల్లి లలిత 10,684, నవ్య 10,789 ర్యాంకులు సాధించారు. 61 మంది విద్యార్థులు 20వేల లోపు ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్లు కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు. -
జయ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు
సూర్యాపేటటౌన్: ఈఏపీసెట్ ఫలితాల్లో సూర్యాపేటలోని జయ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం వెలువడిన ఎప్సెట్ ఫలితాల్లో కళాశాలకు చెందిన కె. ఉజ్వన్ 141వ ర్యాంకు, జి. తేజశ్రీ 266, సీహెచ్. హన్షితశ్రీ 695, టి. అమూల్య 913, బి. లాస్య 917, పి. అమిత్ సూర్య 1948, బి. శివమణి 2270, డి. జగదీష్ రాజు 2935, వై. ప్రదీప్ 3364, కె. సాయినందన్ 3977, జి. నవదీప్రెడ్డి 4003, సీహెచ్. కుశల్ రాజు 5044, సీహెచ్. అక్షయ భారతి 5583, కె. యామిని 5823, ఎం. హన్సిని 5843, వి. బిందుమాధవి 6002, ఎస్. నక్షత్ర 6630, కె. పవన్ కుమార్ 7280, జి. సాయిరాం 8325, ఆర్. ప్రియదర్శిని 8328, ఎం. సాద్విక 8361, సీహెచ్. వైశాలిని 8449, జె. కీర్తన 8989, ఎ. కిషోర్ 9502 ర్యాంకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను ప్రిన్సిపాల్, కళాశాల డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. -
గోమాత.. జాతీయ జెండాలతో గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయ కొండ చుట్టు ఆదివారం భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీస్వామి వారి జయంతి సందర్భంగా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ, ధర్మం కోసం అంటూ గోసేవ ఫౌండేషన్ నిర్వాహకులు గోమాతతో పాటు జాతీయ జెండాలు, కాషాయం జెండాలతో భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. 5వేలకు పైగా భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మెట్ల దారి మార్గంలో వెళ్లి శ్రీస్వామిని దర్శించుకున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎ.శరత్, ఈవో వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
‘ఆదర్శ’లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు
సద్వినియోగం చేసుకోవాలి ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా విద్యనిందిస్తుంది. క్రమశిక్షణతో పాటు అనుభవం కలి గిన అధ్యాపకులతో నాణ్య మైన బోధన ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్టియర్లో చేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మమత, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, కొర్లపహాడ్● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● 20వ తేదీ వరకు గడువు ● ఉమ్మడి జిల్లాలో 31 ఆదర్శ పాఠశాలలు ● ఒక్కో పాఠశాలకు 160 సీట్లుకేతేపల్లి, తిరుమలగిరి: ఇంటర్మీడియట్ ఆంగ్ల మాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరం. విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఆదర్శ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 31 పాఠశాలలుఉమ్మడి జిల్లాలో 31 ఆదర్శ పాఠశాలలు ఉండగా.. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ గ్రామంలో మాత్రమే ఆదర్శ పాఠశాల ఉంది. ప్రతి పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున 160 సీట్లు భర్తీ చేస్తారు. ఈ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధిస్తారు. ఎంపిక ప్రక్రియ ఇలా...పదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఎంపిక చేయనున్నారు. అల్పాదాయ వర్గాల వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26న దరఖాస్తులను పరిశీలించి ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఎంపికై న విద్యార్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు ఎంసెట్, నీట్, సీఏ, సీపీటీ కోచింగ్ కూడా ఇస్తారు. బాలికలకు హాస్టల్ సౌకర్యంఆదర్శ పాఠశాలలో చదివే బాలికలకు హాస్టల్ వసతి ఉంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ చదువుతున్న 100 మందికే ఈ అవకాశం ఉంది. హాస్టల్కు కనీసం మూడు కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండే గ్రామాల నుంచి వచ్చే వారు మాత్రమే హాస్టళ్లలో ఉండేందుకు అర్హులు. వీరి కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్, నర్సును నియమించారు. -
శాటిలైట్ టోల్ వసూలు ఇప్పట్లో లేనట్లే..
చౌటుప్పల్ రూరల్: జాతీయ రహదారులపై టోల్ వసూలుకు శాటిలైట్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు మే 1వ తేదీ నుంచి అమలు చేస్తారని మొదట్లో అనుకున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టోల్ వసూలుకు కచ్చితమైన సొంత నావిగేషన్ ఉపగ్రహాలు మరిన్ని అందుబాటులోకి వచ్చే వరకు ఈ ప్రక్రియ జాప్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులు వెల్లడించారు. జీపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్)ను సొంతంగా రూపొందించింది. అయితే ఈ టెక్నాలజీని ఇస్రో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతే శాటిలైట్ విధానంలో టోల్ వసూలు చేసేందుకు కేంద్రం సన్నాహలు చేస్తోంది. ఈ వ్యవస్థను మొదటగా దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ఏడాది ఆగస్టు నుంచి పైలెట్ ప్రాజెక్ట్గా అమలు చేయనున్నారు. అక్కడ ఈ విధానం విజయవంతంగా అమలు జరిగిన తర్వాత దేశంలోని జాతీయ రహదారుల అన్నింటికి అమలు చేయనున్నారు. మొదటగా భారీ వాహనాలకు శాటిలైట్ టోల్ వసూలు విధానం అమలు చేసి తర్వాత కార్లు, మిగతా వాహనాలకు ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిసింది. 2027 నుండి అన్నిరకాల వాహనాలకు శాటిలైట్ విధానం అమలు చేయనున్నారు. ఈ విధానం అమలు కోసం ఫాస్టాగ్ స్థానంలో నావిగేషన్ చిప్ను వాహనాలకు బిగించనున్నారు. కార్లకు ఈ చిప్ జీపీఎస్ కోసం రూ.4వేల వరకు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని ఫాస్టాగ్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. నావిగేషన్ ఉపగ్రహాలు అందుబాటులోకి వచ్చే వరకు వాయిదా పూర్తిస్థాయిలో అభివృద్ధికాని ఐఆర్ఎన్ఎస్ఎస్ టెక్నాలజీ -
రేపటి నుంచి టీచర్లకువృత్యంతర శిక్షణ
నల్లగొండ : ఉపాధ్యాయులకు రేపటి నుంచి వృత్యంతర శిక్షణ నిర్వహించనున్నారు. మొదటి విడత శిక్షణ 13 నుంచి 17వ తేదీవరకు, రెండో విడత శిక్షణ 20 నుంచి 24 వరకు, మూడో విడత ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల ఇన్చార్జిలు, జిల్లా రీసోర్స్ పర్సన్ల సంసిద్ధత సమావేశం సోమవారం నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు రోజూ ఉదయం 9.30 గంటలకు శిక్షణ తరగతులకు హాజరు కావాలని డీఈఓ భిక్షపతి కోరారు. డిజిటల్ ఎడ్యుకేషన్, కాంటెంట్ ఎన్రిచ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, లైఫ్ స్కిల్లింగ్ అవుట్కమ్స్ తదితర విషయాలపై శిక్షణనిస్తారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్పెన్స్, డైట్ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. కార్యక్రమాలకు డీఈఓ డైరెక్టర్గా, కోర్సు కోఆర్డినేటర్లుగా డైట్ కాలేజీ ప్రిన్సిపాల్, క్వాలిటీ కోఆర్డినేటర్గా సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తారు. బడి బాట కార్యక్రమం నిర్వహించే విధానంపై చర్చించి ఎన్రోల్మెంట్పై తగిన చర్యలు తీసుకునేలా శిక్షణలో తెలియజేస్తారు. ఇక.. మండలస్థాయిలో ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కవితా సంపుటి ఆవిష్కరణ రామగిరి (నల్లగొండ): తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలకు నల్లగొండ పుట్టినిల్లుగా నిలిచిందని సాహితీవేత్త మునాసు వెంకట్ అన్నారు. శీలం భద్రయ్య రచించిన ముస్తాదు కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భద్రయ్య చక్కని భావనా శక్తితో శిల్ప సౌందర్యం కలిగిన కవితలు రాశారని అభినందించారు. యోగా గురువు మాదగాని శంకరయ్య తొలి ప్రతి స్వీకరించారు. కార్యక్రమంలో పెరుమాళ్ల ఆనంద్, మోత్కూరు నరహరి, తండు కృష్ణ కౌండిన్య, సాగర్ల సత్తయ్య, పొడిచేటి శంకర్, చిత్రకారులు బొల్లెద్దు కిశోర్కుమార్, కవులు నరసింహ, అరుణ జ్యోతి, రామకృష్ణ, యాదగిరి, రమేష్, గణేశ్, దాసరి శ్రీరాములు, భీమార్జున్రెడ్డి పాల్గొన్నారు. యాదవులు అన్ని రంగాల్లో రాణించాలి నల్లగొండ టౌన్ : యాదవులు రాజకీయ, విద్య, ఉద్యోగాలతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని హైకోర్టు న్యాయవాది చలకాని వెంకన్నయాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక యాదవభవన్లో యాదవ విద్యావంతుల వేదిక ఆద్వర్యంలో యాదవులకు నిర్వహించిన రాజకీయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అగ్రవర్ణాలు యాదవులను రాజకీయంగా అణచివేతకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పిల్లి రామరాజు, చీర పంకజ్యాదవ్, గోపాలకృష్ణ, శ్రీనివాస్, ఎల్వీ యాదవ్, అన్ని వేణు, దుడుకు లక్ష్మీనారాయణ, రేణుక, అల్లి సుభాష్, నాగరాజు, నడ్డి బాలరాజు, అల్లి సైదులు, బాలరాజు, బి.రమాదేవి ఉన్నారు. -
సాగర్కు సుందరీమణులు
నేడు బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్వరల్డ్ పోటీదారుల బృందం టూర్ షెడ్యూల్ ఇలా.. ● మధ్యాహ్నం 1.00 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరుతారు. ● 3 గంటలకు చింతపల్లి సమీపంలోని వెల్లంకి గెస్ట్ హౌజ్కు చేరుకుని 3.30 గంటల వరకు అక్కడ సేదదీరుతారు. ● 4.30కు నాగార్జునసాగర్ విజయ విహార్కు చేరుకుంటారు. ● సాయంత్రం 5 గంటల వరకు విజయవిహార్లో ఫ్రెష్ అప్ అవుతారు. ● 5.30 వరకు టీ, ప్రధాన ద్వారం వద్ద ఫొటో షూట్లో పాల్గొంటారు. ● 5.45 వరకు విజయ విహార్ నుంచి బుద్ధవనం చేరుకుంటారు. ● 6 గంటల వరకు అక్కడ ఫొటో సెషన్ ఉంటుంది. ● 6.10కి స్వాగత నృత్యం నడుమ మహాస్థూపం వద్దకు చేరుకుంటారు. ● 6.20 వరకు మహాస్థూపం విషేశాలను గైడెడ్ టూర్ శివనాగిరెడ్డి వారికి వివరిస్తారు. ● 6.30 వరకు బుద్ధశాసన వద్ద ప్రపంచ సుందరీమణుల ధ్యానం చేస్తారు. ● 6.40 నుంచి 6.50 వరకు బుద్ధవనంపై సంక్షిప్త ఉపన్యాసం ఉంటుంది. ● 6.50 నుంచి 7 గంటల వరకు జాతకవనంలో గడుపుతారు. ● రాత్రి 7 నుంచి 7.45 వరకు జాతకవనం వద్ద డిన్నర్ చేస్తారు. ● 7.45 నుంచి 8.45 వరకు వెల్లంకి గెస్ట్కు చేరుకుంటారు. ● 9 గంటల వరకు అక్కడ సేదతీరుతారు. ● 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. నాగార్జునసాగర్ : హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారుల బృందం సోమవారం నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శించనుంది. వారి రాక సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన సుందరీమణులు బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ముందుగా వీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి చింతపల్లి సమీపంలో ఉన్న వెల్లంకి అతిథి గృహం వద్ద కాసేపు ఆగుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయవిహార్ చేరుకుంటారు. అక్కడ ఫోటో సెషన్ తర్వాత బుద్ధవనం చేరుకుంటారు. ఈ సందర్భంగా సుమారు 24 మంది లంబాడా కళాకారులు వారికి లంబాడా నృత్యంతో స్వాగతం పలకనున్నారు. మహా స్థూపం వద్ద స్వాగతం అనంతరం స్థూపం కనిపించేలా ఫోటో సెషన్ ఉంటుంది. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేశారు. మహాస్థూపంలో సుందరీమణుల ధాన్యం సుందరీమణులు మహాస్థూపంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడి విశేషాలను పురావస్తు శాఖ ప్రతినిధులు వారికి వివరిస్తారు. అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం, తర్వాత ఇక్కడే 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహా బోధి పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతకవనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం ప్రాముఖ్యతను పురావస్తు, టూరిజమ్ ప్రతినిధి శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతక వనం సందర్శన అనంతరం బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్న నేపథ్యంలో తెలంగాణ పర్యాటక అంతా నాగార్జునసాగర్లో ఆయా ప్రాంతాలను సిద్ధం చేసింది. బౌద్ధ పర్యాటక క్షేత్రమైన నాగార్జునసాగర్లోని బుద్ధవనం చారిత్రక ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజేసేలా ఏర్పాట్లు చేసింది. పపంచ సుందరీమణులు సేదదీరేందుకు నాగార్జునసాగర్లోని విజయవిహార్ అతిథి గృహాన్ని తీర్చిదిద్దింది. టైల్స్, బెడ్లు, కర్టెన్స్, కుర్చీలు, టేబుల్స్ అన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసింది. బుద్ధవనం, విజయ విహార్ అతిథి గృహాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సిద్ధం చేశారు. సుందరీమణులు ఇక్కడే డిన్నర్ చేయనున్నందున వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే భోజనాలు తీసుకురానున్నారు.ఫ పర్యటనకు అంతా సిద్ధం చేసిన పర్యాటక శాఖ ఫ లంబాడా నృత్యంతో వారికి స్వాగతం ఫ విజయవిహార్లో విడిది.. బుద్ధవనంలో ధ్యానం చేసేందుకు ఏర్పాట్లు -
అంతర్జాతీయ స్థాయిలో భద్రత
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లో జరిగే బుద్ధపూర్ణిమకు హాజరవుతున్న ప్రపంచ సుందరీమణులకు అంతర్జాతీయ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతపల్లి సమీపంలోని వెల్లంకి అతిథి గృహం నుంచి నాగార్జునసాగర్ వరకు రహదారి వెంట పూర్తి స్థాయిలో రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ, ముగ్గురు ఏఎస్పీలు, పది మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 120 మంది ఎస్ఐలతోపాటు పలువురు ఏఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. విజయవిహార్, వెల్లంకి గెస్ట్ హౌస్తోపాటు బుద్ధవనంలో మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అడుగడుగునా నిఘా విభాగాలు కూడా పనిచేస్తాయని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వీవీఐపీలకు, ఉన్నతాధికారులకు, మీడియాకు వేరువేరుగా పాసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రపంచ సుందరీమణులు తిరిగే ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం ఎల్లో కలర్ పాసులు కలిగిన వారు మాత్రమే ఈ ప్రాంతంలో అనుమతిస్తామన్నారు. పోలీసులు అధికారులు, ఇతర శాఖల అధికారులకు ఆరెంజ్ కలర్ పాసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రవేశద్వారాల వద్ద విధులు నిర్వర్తించే వారితో పాటు వీఐపీలకు, బయటి వ్యక్తులకు గ్రీన్ కలర్ పాస్లు, మీడియాకు వైట్కలర్ పాసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఎక్కడా ట్రాఫిక్ మళ్లించకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
డిండి వాసికి 66వ ర్యాంకు
డిండి: డిండి మండల కేంద్రానికి చెందిన వంగాల కవిత, ప్రభాకర్రెడ్డి దంపతుల కుమారుడు వంగాల ప్రణీత్రెడ్డి ఆదివారం వెలువడిన ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 66వ ర్యాంకు సాధించాడు. ప్రణీత్రెడ్డి హైదరాబాద్లోని మన్సూరాబాద్లో గల నారాయణ కళాశాలలో ఇంటర్ చదివాడు. వంగాల ప్రభాకర్రెడ్డి విద్యుత్ ఏఈగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఏదో ఒక ప్రొడక్ట్ తయారుచేసి అతి తక్కువ ధరకు దేశ ప్రజలకు అందించి తన వంతు సమాజానికి ఉపయోగపడాలన్నదే లక్ష్యమని ప్రణీత్రెడ్డి తెలిపారు. ఈఏపీసెట్లో ప్రణీత్రెడ్డి మంచి ర్యాంకు సాధించిడం ఎంతో ఆనందంగా ఉందని అతడి తల్లిదండ్రులు కవిత, ప్రభాకర్రెడ్డి తెలిపారు. -
సంతోష్బాబు ఎంతో జాలి కలవాడు
సంతోష్బాబు 2016లో లెఫ్టినెంట్ కల్నల్గా, 2017లో కల్నల్గా పదోన్నతి పొందాడు. ఎక్కడ ఉన్నా రోజూ నాతో తప్పనిసరిగా మాట్లాడేవాడు. కొడుకుగా ఎంతటి పెద్దస్థానంలో ఉన్నా ఎప్పుడూ నాకు ఏదైనా పని చెప్తావా, నేనేమైనా సహాయం చేయాలా అమ్మ అని అడిగేవాడు. జాలి, దయ కలవాడు. 2020 జూన్ 14వ తేదీన మాకు మధ్యాహ్నం రెండు గంటలకు పిడుగులాంటి వార్త తెలిసింది. సంతోష్ ఇక లేడు అనే వార్తను టీవీలో చూస్తుండగానే వందల మంది మా ఇంటికి వచ్చారు. దేశం కోసం నా కొడుకు ప్రాణం అంకితం అయిందని గర్వపడ్డ క్షణాలు ఇంకా నా కళ్ల ముందు మెదలాడుతూనే ఉన్నాయి. -
నెల్లికల్ లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలి
మిర్యాలగూడ : నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూసేకరణ పూర్తయినందున బిల్లుల చెల్లింపు, తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్రెడ్డిలతో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి భూసేకరణ పేపర్ నోటిఫికేషన్ ఇదివరకే జారీ చేశామని.. దానికి సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిడమనూరు ట్యాంకుకు ఓటీ ద్వారా నీళ్లు నింపేందుకు ప్రణాళిక రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వీర్లపాలెం భూసేకరణతోపాటు రెండు లిఫ్టులకు ఇదివరకే ఎంజాయ్మెంట్ సర్వే పూర్తయినందున తదుపరి ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న లిఫ్ట్ పనులు, భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్, ఇరిగేషన్ ఎస్ఈ మల్లికార్జున్, ఈఈ కరుణాకర్, డీఈ కేశవ్ పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
లైసెన్స్డ్ సర్వేయర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్డ్ సర్వేయర్లు రాబోతున్నారు. ఇప్పటివరకు ఉన్న వారిలో అర్హత కలిగిన ప్రైవేట్ సర్వేయర్లతోపాటు కొత్త వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారికి లైసెన్స్లు జారీ చేయనున్నారు. ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ భారతి అమలులో వారి సేవలను వినియోగించుకుని భూ సమస్యలు పరిష్కరించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 500 మందికి సర్వేయర్లుగా త్వరలోనే ప్రత్యేక శిక్షణ ప్రారంభించబోతోంది. 26 నుంచి శిక్షణ భూభారతి అమలులో భాగంగా రాష్ట్రంలో ఐదు వేల మందికి సర్వేయర్లుగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. అర్హులైన వారు ఈ నెల 17వ తేదీలోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్లు సూచించారు. 60 శాతం మార్కులతో, గణితం సబ్జెక్టుగా కలిగిన ఇంటర్ పూర్తయినవారు, ఐటీఐ (డ్రాఫ్ట్మెన్ సివిల్), డిప్లొ మా, బీటెక్ సివిల్, తత్సమాన అర్హతలు కలిగిన పాత సర్వేయర్లతోపాటు, కొత్త అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా దరఖాస్తు చేసుకున్న వారికి మే 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. రెవెన్యూ పరిపాలనకు తోడుగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖ ద్వారా ఈ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇందులో నల్లగొండ జిల్లాలోనే 200 మంది, సూర్యాపేట జిల్లాలో 150 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో 150 మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. మూడు దశల్లో శిక్షణ, పరీక్షలు సర్వేయర్లకు మూడు దశల్లో శిక్షణ ఇస్తారు. థియరీ, టిప్పన్ ప్లాటింగ్, క్షేత్ర స్థాయి (ఫీల్డ్) విషయాల్లో శిక్షణ ఉంటుంది. ఆ తరువాత 40 రోజుల పాటు మండల సర్వేయర్ కింద ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తర్వాత జిల్లా స్థాయిలో వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. అది పాసైతే లైసెన్స్ కోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన వారు సర్వే చేసేందుకు అర్హులు. వారు చేసే సర్వేకు అధికారిక గుర్తింపు ఉంటుంది. భూ భారతి చట్టం అమలులోనూ సర్వే పనుల కోసం వారి సేవలను పరిగణనలోకి తీసుకోనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చి న భూభారతి చట్టం అమలుకు అర్హులైన సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ప్రత్యే క శిక్షణ ఇచ్చి, లైసెన్స్లు జారీ చేస్తుంది. కాబట్టి జిల్లాలో ఉన్న అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 17లోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. – నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అర్హత కలిగిన ప్రైవేట్ సర్వేయర్లకు లైసెన్స్లు ఫ మ్యాథ్స్తో ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసినవారికి అవకాశం ఫ భూ భారతి చట్టం అమలులో భాగంగా వారికి ప్రత్యేక శిక్షణ ఫ ఉమ్మడి జిల్లాలో దాదాపు 500 మందికి అవకాశం ఫ భూ సర్వేకు తొలగనున్న అడ్డంకులు తీరనున్న సర్వేయర్ల కొరత జిల్లాలో ఇక సర్వేయర్ల కొరత తీరనుంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 33 మండలాల పరిధిలో 17 మంది ప్రభుత్వ సర్వేయర్లు, ముగ్గురు డిప్యూటీ సర్వేయర్లు, ఆరుగురు కమ్యూనిటీ సర్వేయర్లు మొత్తం 26 మంది మాత్రమే ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు ఉండగా, 15 మంది మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. యాదాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వివిధ పథకాల కింద భూసేకరణ చేపట్టే పనులకు వారే సర్వే చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం అయ్యేంది. సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల సమయం పట్టేది. మరోవైపు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా అనేక రకాల భూ సమస్యలు తలెత్తాయి. ఒకరి భూమి మరొకరికి పేరున పడటం, హద్దులు చెరిగిపోయాయి. దీంతో చాలా మంది సర్వేకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే వ్యవసాయ భూములు కూడా రియల్ ఎస్టేట్గా మారిపోతున్నాయి. ఈ క్రమంలో నాలా కన్వర్షన్ కోసం అనేక దరఖాస్తులు వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో సర్వేయర్ల కొరత వల్ల సర్వేలో తీవ్ర జాప్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్హత కలిగిన వారికి శిక్షణ ఇచ్చి, లైసెన్స్ జారీ చేయడం ద్వారా సర్వేయర్లుగా గుర్తింపు ఇవ్వబోతోంది. దీంతో సర్వే సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. -
633.50 అడుగులకు మూసీ నీటిమట్టం
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో శనివారం ప్రాజెక్టులోకి 450 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోతో శనివారం సాయంత్రం నాటికి నీటిమట్టం 633.50 అడుగులకు (1.96 టీఎంసీలు) చేరుకుంది. ఏప్రిల్లో మూసీ కాల్వలకు నీటి విడుదల నిలిపి వేసే నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం 622 అడుగులుగా ఉంది. నాటి నుంచి అకాల వర్షాల ప్రభావం, హైదరాబాద్ నుంచి వచ్చే నీటితో ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతూ నీటిమట్టం 633.5 అడుగులకు చేరుకుంది. నెలరోజుల్లో దాదాపు 12 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. -
31వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి
రామగిరి(నల్లగొండ) : డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ రెండవ, నాలుగు, ఆరవ సెమిస్టర్ విద్యార్థులు మే 31వ తేదీలోగా పరీక్ష ఫీజులు చెల్లించాలని ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ అంతటి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో కోరారు. పరీక్షల షెడ్యూల్ విడుదలైందని.. ఆరో సెమిస్టర్ జూన్ 20 నుంచి 25 వరకు, నాలుగో సెమిస్టర్ జూన్ 26 నుంచి జూలై 2 వరకు, రెండవ సెమిస్టర్ పరీక్షలు జూలై 4 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. -
దేశ సైనికులకు మనోధైర్యం కల్పించాలి
మునుగోడు: పాకిస్థాన్తో యుద్ధం చేస్తున్న భారత సైనికులకు దేవుళ్లు మనోధైర్యం కల్పించాలని, భారత్ విజయం సాధించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ ఆకాంక్షించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న కేదారేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు శనివారం మహేష్కుమార్గౌడ్.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో కలిసి హాజరయ్యారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆలయ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో డోలువాయిద్యాలు, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా దేవతలు దీవించాలని కోరుకున్నానని చెప్పారు. గ్రామాల్లో నిర్వహించే దేవాలయ ఉత్సవాల వల్ల ఆ గ్రామ ప్రజలు అందరిలో ఐక్యత పెరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం గ్రామాల్లోని దేవాలయాల అభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్నేత తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సందర్శన ఇటీవల అత్యాధునిక హంగులతో మరమ్మతులు చేసినా మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాని పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి తేనీటి విందు ఇచ్చారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడిని, శాసనమండలి చైర్మన్ గుత్తాను సన్మానించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ -
Miss World 2025: నల్గొండకు సుందరాంగులొస్తారని..
నల్గొండ: ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు శనివారం నుంచి హైదరాబాద్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. వారు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 12 నాగార్జునసాగర్, 15న యాదగిరి క్షేత్రాన్ని, భూదాన్పోచంపల్లిలోపర్యటిస్తారు. వీరి రాకకోసం ఆయా చోట్ల పర్యాటకశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.నేటి నుంచి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్న పోటీదారులు12న నాగార్జునసాగర్, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రాకమూడు ప్రాంతాలకు మూడు బృందాలుగా..విస్తృత ఏర్పాట్లు చేస్తున్న పర్యాటక శాఖబుద్ధుడి చెంతకు..నాగార్జునసాగర్ : ప్రపంచ సుందరీమణులు ఈనెల 12వ తేదీన నాగార్జునసాగర్కు రానున్నారు.మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి చింతపల్లి సమీపంలోని వెంకటంపేట స్టేజీ వద్దనున్న వెల్లంకి అతిథి గృహం వద్ద 15 నుంచి 30 నిమిషాలు గడపనున్నారు. అక్కడి నుంచి నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని.. వారికి కేటాయించిన గదుల్లో ముస్తాబవుతారు.విజయ విహార్ ఎదుట ఈవెంట్ మేనేజర్ సూచనల మేరకు మీడియా కోసం ఫొటోలు దిగుతారు. ఆ తర్వాత విజయ విహార్ వెనకభాగంలో సాగర తీరాన 30 నిమిషాల పాటు ఫొటో షూట్ ఉంటుంది. అక్కడి నుంచి వారు వచ్చిన బస్సుల్లోనే బయలుదేరి బుద్ధవనం చేరుకుంటారు. 12న బుద్దపూర్ణిమ కావడంతో బుద్ధుడి పాదుకల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మహాసూ్థపం వద్దకు వెళ్తారు. చివరి మెట్ల మీదునుంచి పైకెక్కి ఫొటో షూట్లో పాల్గొంటారు. వారినుంచి వంద అడుగుల దూరంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన గిరిజనుల నృత్యం ఉంటుంది. మహాస్థూపం చుట్టూ ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఎంపిక చేసిన వాటి గురించి టూర్ గైడ్ శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. మహాసూ్తపంలోని అష్టబుద్ధుల వద్ద క్యాండిల్స్ వెలిగిస్తారు. అక్కడే వారికి కేటాయించిన సీట్లలో కూర్చుని మూడు నిమిషాలు ధ్యానం చేస్తారు. అక్కడే మరో ఐదు నిమిషాల పాటు మాంగ్స్ చాటింగ్లో పాల్గొంటారు. ఐదు నిమిషాల పాటు బుద్ధజయంతి గురించి తెలుసుకుంటారు.అక్కడి నుంచి మెట్లు దిగి జాతక పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆసీనులవుతారు. బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. అక్కడే బుద్ధచరితపై డ్రామా ఉంటుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్లో పాల్గొని హైదరాబాద్ బయలు దేరతారు. వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే భోజనాలను తీసుకురానున్నారు.పోచంపల్లిలో ‘ఇక్కత్ థీమ్’భూదాన్పోచంపల్లి : ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, ఉత్తమ పర్యాటక గ్రామంగా యునెస్కో అనుబంధ సంస్థచే అంతర్జాతీయ అవార్డు పొందిన భూదాన్పోచంపల్లికి ఈనెల 15న మిస్వరల్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారు. వారి రాకకోసం స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టూరిజం బస్సులో 25 మంది సుందరీమణుల బృందం సా యంత్రం 6 గంటలకు పోచంపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ రెండు గంటల గడిపి తిరిగి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వెళ్తారు. అడుగడుగునా ఇక్కత్ థీమ్ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మిస్వరల్డ్ కంటెస్టెంట్లకు టూరిజం ప్రధాన ద్వారం నుంచి లోపలి మ్యూజియం వరకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకుతారు. వారికి బొట్టుపెట్టి, పూలమాలలు వేసి సత్కరిస్తారు. టూరిజం లోపలి ద్వారం వద్ద ముగ్గుల్లో అలంకరించే టెర్రాకోట్ కుండలను ముద్దుగుమ్మలు పరిశీలిస్తారు. లోపలి గచ్చు ప్రాంతంలో మెహందీ వేయడాన్ని తిలకిస్తారు. అందాలభామలు కోరితే వారికి కూడా మెహందీ వేస్తారు. ఇక్కడే లైవ్ మ్యూజికల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మ్యూజియంలోకి వెళ్తారు.మ్యూజియం లోపల ఏర్పాటు చేసిన మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఇందుకోసం రెండు మగ్గాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి కాన్ఫరెన్స్ హాల్లో స్నాక్ రిఫ్రెష్మెంట్ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి మ్యూజియం బయటికి వస్తూ టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిని తిలకిస్తారు. మరోపక్క తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన మన బతుకమ్మను తిలకిస్తారు. ఇక్కడే కొందరూ మహిళలు బతుకమ్మను పేర్చుతూ పాటలు పాడుతారు.అక్కడ నుంచి హంపి థియేటర్కు చేరుకుంటారు. అక్కడ వీవీఐపీలతో పాటు సుందరీమణులు సోఫాల్లో కూర్చుని కార్యక్రమాలను అరగంటపాటు తిలకిస్తారు. ఇక్కడ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వాతిచే రూపొందించిన ఇండో – వెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలతో మోడల్స్ నిర్వహించే ర్యాంప్వాక్ను తిలకిస్తారు. తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, పోచంపల్లి ఇక్కత్ ప్రాముఖ్యతను ఏవీ ప్రదర్శనను సైతం తిలకిస్తారు. అవసరం అనుకొంటే మిస్వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఫొటోలు కూడా దిగుతారు. టూరిజం ప్రాంగణం ఇరువైపులా పల్లె వాతావరణం ప్రతిబింబించే గుడిసెల సెట్లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్ను పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్న 10 స్టాల్స్లో పోచంపల్లి ఇక్కత్ స్టాల్స్ ఏడు, మిగతావి గద్వాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కొకూన్స్ నుంచి వస్త్రం వరకు ఎలా తయారవుతుందో చేనేత మహిళలు వీరికి వివరిస్తారు.రెండో ప్రధాన ద్వారం వద్ద పూలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాబ్స్ అలంకరణను తిలకిస్తారు. అక్కడి నుంచి తిరిగి బస్సులో హైదరాబాద్ వెళ్తారు.యాదగిరీశుడి దర్శనంయాదగిరిగుట్ట : మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4గంటలకు యాదగిరి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి 10 మంది సుందరీమణుల బృందం ప్రత్యేక వాహనాల్లో కొండపైన గల అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ కలెక్టర్, ఆలయ ఈఓ వారికి స్వాగతం పలుకుతారు. అతిథి గృహం నుంచి బ్యాటరీ వాహనాల్లో తూర్పు మాఢవీధిలో ఉన్న అఖండ దీపారాధన చెంతకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి భజన, కోలాట బృందాలు వారి ముందు నడుస్తాయి. కూచిపూడి, భరట నాట్యం కళాకారుల స్వాగతం నడుమ వారు తూర్పు ద్వారం నుంచి తిరువీధుల్లో వెళ్తారు. అక్కడ ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలుకుతారు. త్రితల ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి మొదటగా ఆంజనేయస్వామిని, అక్కడే ఉన్న గండబేరుండ నరసింహస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి, గర్భాలయంలో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. గర్భాలయం నుంచి పక్కనే ఉన్న ఆండాళ్ అమ్మవారిని దర్శించుకొని, ముఖ మండపంలోకి వస్తారు. అక్కడ సువర్ణ పుష్పార్చన ఉత్సవ మూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొంటారు. ముఖమండపంలోనే సుందరీమణులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేస్తారు. పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాకార మండపాలు, మాఢ వీధులను చూసి, అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకొని, తిరిగి అతిథి గృహానికి వస్తారు.సుందరీమణులకు ప్రత్యేక ప్రసాదంయాదగిరిశుడిని దర్శించుకునేందుకు వస్తున్న సుందరీమణుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేయించనున్నారు. శ్రీస్వామి వారి లడ్డూ, పులిహోర ప్రసాదంతో పాటు సిర, కట్టె పొంగలి వంటి ప్రసాదాలను తయారు చేయించనున్నారు. ప్రసాదాలను అతిథి గృహంలోనే సుందరీమణులకు అందిస్తారు. అరటి, మామిడి తోరణాలతో..ప్రపంచ సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానాలయ ముఖమండపం, తూర్పు రాజగోపురం వద్ద రంగురంగుల పూలు, అరటి, మామిడి తోరణాలతో అలంకరించనున్నారు. రాత్రి సమయంలో శ్రీస్వామి వారి ఆలయం అద్భుతంగా కనిపించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్, డీసీపీలు ఈఓతో చర్చించారు. ఇక పాక్ – ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతతల నేపథ్యంలో సుందరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. -
ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీగా రాజ్కుమార్
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్గా హౌజింగ్ పీడీ రాజ్కుమార్ను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి ఎస్సీ సంక్షేమశాఖ ఇన్చార్జి డీడీగా కొనసాగారు. ఆయన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఓఎస్డీగా వెళ్లడంతో ఆ బాధ్యతలను రాజ్కుమార్కు అప్పగించారు. ఏర్పాట్ల పరిశీలన నాగార్జునసాగర్ : ఈ నెల 12న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నాగార్జునసాగర్ సందర్శనకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ఎమ్మెల్యే జయవీర్రెడ్డి పరిశీలించారు. బుద్దపూర్ణిమ సందర్భంగా ప్రపంచ సుందరీమణులు బుద్దవనంలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీంతో విజయ విహార్ అతిథి గృహం, బుద్దవనంలో ఏర్పాట్లపై సమీక్షించారు. మెడికల్ వార్డు ఏర్పాటు నాగార్జునసాగర్ : ఈ నెల 12న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నాగార్జునసాగర్ సందర్శనకు రానున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండేలా హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక మెడికల్ వార్డును ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వుల మేరకు ఐదు పడకలతో అత్యవసర చికిత్స నిమిత్తం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 12 హ్యాండ్ బాల్ జిల్లా జట్టు ఎంపికనకిరేకల్ : హ్యాండ్ బాల్ అసోసియేసిన్ ఆధ్వర్యంలో ఈనెల 12న నకిరేకల్ మండలం మంగళపల్లిలో జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో ఉదయం 12 గంటలకు జూనియర్ బాల బాలికల హ్యండ్ బాల్ జిల్లా జట్టు సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రదాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య తెలిపారు. ఈ సెలక్షన్స్లో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఎంపికై న జిల్లా జట్టు జూన్ 4 నుంచి 6 వరకు నకిరేకల్మండలం మంగళపల్లి జడ్పీ హైస్కుల్లో జరిగే 47 వతెలంగాణ రాష్ట్ర స్దాయి జూనియర్ బాల బాలికల హ్యండ్ బాల్ చాంపియన్ షీప్లో పాల్గొంటుందని తెలిపారు. ఈక్రీడల్లో పాల్గొనే వారు 1 జనవరి 2006 నుంచి 31 డిసెండర్ 2009 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. -
నీలగిరికి రింగ్ రోడ్డు!
రెండు బైపాస్లు, ఒక హైవే కలుపుకొని నిర్మాణంఎన్హెచ్ బైపాస్కు భూసేకరణ.. జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నార్కట్పల్లి – అద్దంకి జాతీయ రహదారికి మాచర్ల – నకిరేకల్ జాతీయ రహదారిని అనుసంధానించేలా గత ఏడాది ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించి మూడు ప్రతిపాదనలను సిద్ధం చేయగా, మూడో ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పానగల్ నుంచి నార్కట్పల్లి– అద్దంకి హైవే వెంట మర్రిగూడ బైపాస్ జంక్షన్ వరకు వచ్చి, అక్కడ నుంచి మర్రిగూడ శివారు ప్రాంతం మీదుగా దేవరకొండ రోడ్డు అక్కడ నుంచి ఎస్ఎల్బీసీ ప్రాంతంలో సాగర్ రోడ్డుకు కలిపే 3వ ఆప్షన్ అలైన్మెంట్ను ఎన్హెచ్ఏఐ అధికారులు ఓకే చేశారు. 15.5 కిలోమీటర్ల పొడవునా నాలుగు లేన్లుగా ఈ రోడ్డును నిర్మించేందుకు టెండర్లు పిలిచి ఖరారు చేశారు. ప్రస్తుతం భూసేకరణకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. అది పూర్తి కాగానే రోడ్డు నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కానుంది.సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీలగిరి పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు రాబోతోంది. ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఒక బైపాస్ను నిర్మించేందుకు చర్యలు చేపట్టగా, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మరో బైపాస్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. దీంతో పట్టణానికి ఒకవైపు నార్కట్పల్లి – అద్దంకి జాతీయ రహదారి ఉండగా, మరోవైపు జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో బైపాస్ రానుండగా, ఇంకోవైపు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మరో బైపాస్ వేయడం ద్వారా పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు రానుంది. ఇందులో భాగంగా రూ.250 కోట్లతో బైపాస్ను నిర్మించేందుకు ఆర్అండ్బీ ప్రతిపాదనలను పంపించింది. నాగార్జునసాగర్ రోడ్డులోని మెడికల్ కాలేజీ సమీపం నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు ఈ బైపాస్ను నిర్మించనుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే తదుపరి కార్యాయరణ చేపట్టనుంది. ఈ రెండు బైపాస్లు పూర్తయితే పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు రానుంది. రింగ్ రోడ్డు నిర్మాణం మంత్రి లక్ష్యం నల్లగొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రోడ్లు భవనాల శాఖను చూస్తున్నారు. పట్టణానికి రింగ్ రోడ్డు వేయాలన్నది ఆయన లక్ష్యం. అందులో భాగంగానే ఆయన మంత్రి అయినప్పటి నుంచి పట్టణానికి రింగ్ రోడ్డు వేస్తానని చెబుతూ వచ్చారు. అయితే పట్టణం మధ్యలో నుంచి మాచర్ల – నకిరేకల్ జాతీయ రహదారిని గతంలో ప్రతిపాదించారు. పట్టణం వెలుపల ఇటు నకిరేకల్ వైపు, అటు మాచర్ల వైపు రోడ్డు పూర్తయిపోయింది. పట్టణంలో జాతీయ రహదారి వేయాలంటే పట్టణంలో విస్తరణ పనులు చేయాల్సి ఉంది. ఆ విస్తరణలో పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇళ్లు కోల్పోవాల్సి వస్తోంది. మరోవైపు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాతీయ రహదారిని(ఎన్హెచ్) మార్చాలని ప్రజలు, వివిధ పార్టీల నేతలు పట్టుబట్టారు. దీంతో ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులతో మాట్లాడి, పట్టణం బయటనుంచి వెళ్లేలా చూడాలని కోరడంతో అందుకు ఎన్హెచ్ఏఐ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పానగల్ నుంచి నార్కట్పల్లి– అద్దంకి హైవే వెంట మర్రిగూడ బైపాస్ జంక్షన్ మీదుగా, దేవరకొండ రోడ్డు, అక్కడ నుంచి ఎస్ఎల్బీసీ ప్రాంతంలో సాగర్ రోడ్డుకు బైపాస్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఓకే చెబితేనే రింగ్.. ఇక రెండో బైపాస్ రోడ్డును సాగర్ రింగ్ రోడ్డునుంచి అనిశెట్టి దుప్పలపల్లి వద్ద నార్కట్పల్లి – అద్దంకి జాతీయ రహదారికి కలిపేలా ఆర్ ఆండ్ బీ శాఖ కొత్త బైపాస్ను ప్రతిపాదించింది. 10.5 కిలోమీటర్ల పొడవునా దీనిని నాలుగు లేన్లుగా నిర్మించనున్నారు. రూ.250 కోట్లతో చేపట్టే ఈ రహదారి ప్రతిపాదలకు ప్రభుత్వం ఒకే చెబితే నల్లగొండకు రింగ్ రోడ్డు కల సాకారం కానుంది. జాతీయ రహదారుల మధ్య బైపాస్ రోడ్డుకు ఇప్పటికే టెండర్లు మర్రిగూడ ఫ్లై ఓవర్ నుంచి మెడికల్ కాలేజీ వరకు త్వరలో పనులు మెడికల్ కాలేజీ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు మరో బైపాస్ ఈ రోడ్డుకు రూ.250 కోట్లతో ప్రతిపాదనలు పంపిన ఆర్అండ్బీ ప్రభుత్వ ఆమోదం లభించగానే తదుపరి కార్యాచరణ -
నెట్బాల్ జిల్లా జట్టు ఎంపిక
నేటి నుంచి కల్యాణోత్సవాలు మట్టపల్లి క్షేత్రంలో శనివారం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ అధికంగా ఉంటుంది.స్వస్తి వాచనంతో శ్రీకారం యాదగిరిగుట్టలో శ్రీనృసింహ స్వామి జయంతి ఉత్సవాలను శుక్రవారం స్వస్తి వాచనంతో ప్రారంభించారు. - 10లోనాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్కాలనీ సెయింట్జోసెఫ్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి సబ్ జూనియర్ నెట్బాల్ ఎంపిక పోటీలు ముగిశాయి. జిల్లా నెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జె.కిరణ్కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఎంపిక పోటీల్లో 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. సబ్ జూనియర్ నెట్బాల్ అండర్–16 బాలికల విభాగంలో ఎంపికై న వారిలో జె.సుప్లవిరాజ్, ఎండీ.సభానూర్, బి.కీర్తన, బి.మహేశ్వరి, ఎస్కే రిజ్వానా, బి.కరుణ, ఎస్కే మహేకె, జె.దీక్షిత, ఆర్.సింధు, ఏ ఐశ్వర్య, సింధు, పూజ, బాలుర విభాగంలో పృద్వీరాజ్, వెంకటసాయి, నిఖిలేష్, నజీర్, మధు, చైతన్య, సత్యసాయి, కళ్యాణ్, సాత్విక్, కమల్తేజ్, కృష్ణ, బాలు ఉన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 16, 17, 18 తేదీల్లో జనగాం జిల్లా బతుకమ్మ కుంట క్రీడా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ నెట్బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిస్టర్ లలిత, నాయకులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మస్తుగా ‘ముందస్తు’ ఆదాయం
ఎర్లీబర్డ్ ద్వారా ఏడు మున్సిపాలిటీల్లో రూ.14.28 కోట్ల పన్ను వసూలు నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీలకు ముందస్తు ఆదాయం భారీగానే వచ్చింది. జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలు ఉండగా నందికొండ మున్సిపాలిటీ మినహయిస్తే మిగతా ఏడు చోట్ల ఐదు శాతం రాయితీపై ప్రజలు రూ.14.28 కోట్ల ఆస్తి పన్ను చెల్లించారు. మున్సిపాలిటీల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈనెల 7వ తేదీ వరకు ఎర్లీ బర్డ్ కింద 2025–26 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం రాయితీ కల్పించిన విషయం తెలిసిందే. దాంతో జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆస్తి పన్ను ద్వారా ఆదాయం రాబట్టారు. మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు ఇద్దరు ఉద్యోగులను పంపించి ఆస్తి పన్ను వసూలు అయ్యే విధంగా దృష్టి సారించి సక్సెస్ అయ్యారు. రూ. 14.28 కోట్లు వసూలు... జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 37 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్లీబర్డ్ కింద ముందస్తు పన్ను వసూలు చేయాలని నిర్ణయించి టార్గెట్ పెట్టుకొని పని చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో సెలవుల రోజుల్లో కూడా ఉద్యోగులు వాణిజ్య భవనాల ఆస్తి పన్ను వసూలు చేసేందుకు ప్రత్యేక చొరవ చూపారు. దాంతో వారు పెట్టుకున్న లక్ష్యానికి దగ్గరగా ఏడు మున్సిపాలిటీలు రూ.14.28 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేశాయి. వార్డు ఆఫీసర్లు రావడంతో... రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లను నియమించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు మున్సిపాలిటీల్లో సిబ్బంది లేక నానా తంటాలు పడేవారు. వార్డు ఆఫీసర్ల నియామకంతో మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీరిపోయింది. కొత్తగా వచ్చిన వార్డు ఆపీసర్లను వార్డుకు ఒకరి చొప్పున నియమించారు. వీరంతా వార్డుల్లో ఆస్తి పన్ను ఎక్కువ శాతం వసూలు అయ్యేందుకు చొరవ తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్తి పన్ను వసూలు కోసమే వార్డుల్లో తిరగడంతో పన్ను వసూలు సులభమైంది. మున్సిపాలిటీల్లో పన్ను డిమాండ్, ఎర్లీబర్డ్లో పన్ను వసూలు (రూ.కోట్లలో..) మున్సిపాలిటీ భవనాలు డిమాండ్ వసూలు నల్లగొండ 43,281 17.60 7.45 మిర్యాలగూడ 26,699 22.59 3.22 దేవరకొండ 7234 2.26 0.86 చిట్యాల 3207 1.40 0.42 చండూరు 3685 69.92 0.17 (లక్షలు) (లక్షలు) హాలియా 5890 2.15 0.66 నకిరేకల్ 9110 7.00 1.50 -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
నాంపల్లి : రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నాంపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు ఇబ్బంఇ పెడుతున్నారని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయాలని, ట్రక్షిట్ కూడా తీసుకొచ్చి రైతులకు వెంటనే డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ్, ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ దేవ్సింగ్, గట్టుపల్లి నర్సిరెడ్డి, నితీష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నేటి నుంచి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్న పోటీదారులు 12న నాగార్జునసాగర్, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రాక మూడు ప్రాంతాలకు మూడు బృందాలుగా.. విస్తృత ఏర్పాట్లు చేస్తున్న పర్యాటక శాఖ
ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు శనివారం నుంచి హైదరాబాద్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. వారు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 12 నాగార్జునసాగర్, 15న యాదగిరి క్షేత్రాన్ని, భూదాన్పోచంపల్లిలోపర్యటిస్తారు. వీరి రాకకోసం ఆయా చోట్ల పర్యాటకశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.సుందరీమణులకు ప్రత్యేక ప్రసాదం యాదగిరిశుడిని దర్శించుకునేందుకు వస్తున్న సుందరీమణుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేయించనున్నారు. శ్రీస్వామి వారి లడ్డూ, పులిహోర ప్రసాదంతో పాటు సిర, కట్టె పొంగలి వంటి ప్రసాదాలను తయారు చేయించనున్నారు. ప్రసాదాలను అతిథి గృహంలోనే సుందరీమణులకు అందిస్తారు. యాదగిరీశుడి దర్శనం యాదగిరిగుట్ట : మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4గంటలకు యాదగిరి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి 10 మంది సుందరీమణుల బృందం ప్రత్యేక వాహనాల్లో కొండపైన గల అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ కలెక్టర్, ఆలయ ఈఓ వారికి స్వాగతం పలుకుతారు. ● అతిథి గృహం నుంచి బ్యాటరీ వాహనాల్లో తూర్పు మాఢవీధిలో ఉన్న అఖండ దీపారాధన చెంతకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి భజన, కోలాట బృందాలు వారి ముందు నడుస్తాయి. కూచిపూడి, భరట నాట్యం కళాకారుల స్వాగతం నడుమ వారు తూర్పు ద్వారం నుంచి తిరువీధుల్లో వెళ్తారు. అక్కడ ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలుకుతారు. ● త్రితల ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి మొదటగా ఆంజనేయస్వామిని, అక్కడే ఉన్న గండబేరుండ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ● అక్కడి నుంచి స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి, గర్భాలయంలో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ● గర్భాలయం నుంచి పక్కనే ఉన్న ఆండాళ్ అమ్మవారిని దర్శించుకొని, ముఖ మండపంలోకి వస్తారు. అక్కడ సువర్ణ పుష్పార్చన ఉత్సవ మూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొంటారు. ముఖమండపంలోనే సుందరీమణులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేస్తారు. ● పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాకార మండపాలు, మాఢ వీధులను చూసి, అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకొని, తిరిగి అతిథి గృహానికి వస్తారు. అరటి, మామిడి తోరణాలతో.. ప్రపంచ సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానాలయ ముఖమండపం, తూర్పు రాజగోపురం వద్ద రంగురంగుల పూలు, అరటి, మామిడి తోరణాలతో అలంకరించనున్నారు. రాత్రి సమయంలో శ్రీస్వామి వారి ఆలయం అద్భుతంగా కనిపించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్, డీసీపీలు ఈఓతో చర్చించారు. ఇక పాక్ – ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతతల నేపథ్యంలో సుందరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నాగార్జునసాగర్ : ప్రపంచ సుందరీమణులు ఈనెల 12వ తేదీన నాగార్జునసాగర్కు రానున్నారు. ● మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి చింతపల్లి సమీపంలోని వెంకటంపేట స్టేజీ వద్దనున్న వెల్లంకి అతిథి గృహం వద్ద 15 నుంచి 30 నిమిషాలు గడపనున్నారు. ● అక్కడి నుంచి నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని.. వారికి కేటాయించిన గదుల్లో ముస్తాబవుతారు. ● విజయ విహార్ ఎదుట ఈవెంట్ మేనేజర్ సూచనల మేరకు మీడియా కోసం ఫొటోలు దిగుతారు. ● ఆ తర్వాత విజయ విహార్ వెనకభాగంలో సాగర తీరాన 30 నిమిషాల పాటు ఫొటో షూట్ ఉంటుంది. ● అక్కడి నుంచి వారు వచ్చిన బస్సుల్లోనే బయలుదేరి బుద్ధవనం చేరుకుంటారు. 12న బుద్దపూర్ణిమ కావడంతో బుద్ధుడి పాదుకల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మహాస్థూపం వద్దకు వెళ్తారు. చివరి మెట్ల మీదునుంచి పైకెక్కి ఫొటో షూట్లో పాల్గొంటారు. వారినుంచి వంద అడుగుల దూరంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన గిరిజనుల నృత్యం ఉంటుంది. ● మహాస్థూపం చుట్టూ ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఎంపిక చేసిన వాటి గురించి టూర్ గైడ్ శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. ● మహాస్తూపంలోని అష్టబుద్ధుల వద్ద క్యాండిల్స్ వెలిగిస్తారు. అక్కడే వారికి కేటాయించిన సీట్లలో కూర్చుని మూడు నిమిషాలు ధ్యానం చేస్తారు. అక్కడే మరో ఐదు నిమిషాల పాటు మాంగ్స్ చాటింగ్లో పాల్గొంటారు. ఐదు నిమిషాల పాటు బుద్ధజయంతి గురించి తెలుసుకుంటారు. ● అక్కడి నుంచి మెట్లు దిగి జాతక పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆసీనులవుతారు. బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. అక్కడే బుద్ధచరితపై డ్రామా ఉంటుంది. ● అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్లో పాల్గొని హైదరాబాద్ బయలు దేరతారు. వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే భోజనాలను తీసుకురానున్నారు. భూదాన్పోచంపల్లి : ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, ఉత్తమ పర్యాటక గ్రామంగా యునెస్కో అనుబంధ సంస్థచే అంతర్జాతీయ అవార్డు పొందిన భూదాన్పోచంపల్లికి ఈనెల 15న మిస్వరల్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారు. వారి రాకకోసం స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టూరిజం బస్సులో 25 మంది సుందరీమణుల బృందం సా యంత్రం 6 గంటలకు పోచంపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ రెండు గంటల గడిపి తిరిగి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వెళ్తారు. అడుగడుగునా ఇక్కత్ థీమ్ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ● మిస్వరల్డ్ కంటెస్టెంట్లకు టూరిజం ప్రధాన ద్వారం నుంచి లోపలి మ్యూజియం వరకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకుతారు. వారికి బొట్టుపెట్టి, పూలమాలలు వేసి సత్కరిస్తారు. ● టూరిజం లోపలి ద్వారం వద్ద ముగ్గుల్లో అలంకరించే టెర్రాకోట్ కుండలను ముద్దుగుమ్మలు పరిశీలిస్తారు. లోపలి గచ్చు ప్రాంతంలో మెహందీ వేయడాన్ని తిలకిస్తారు. అందాలభామలు కోరితే వారికి కూడా మెహందీ వేస్తారు. ఇక్కడే లైవ్ మ్యూజికల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మ్యూజియంలోకి వెళ్తారు. ● మ్యూజియం లోపల ఏర్పాటు చేసిన మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఇందుకోసం రెండు మగ్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ● అక్కడి నుంచి కాన్ఫరెన్స్ హాల్లో స్నాక్ రిఫ్రెష్మెంట్ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి మ్యూజియం బయటికి వస్తూ టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిని తిలకిస్తారు. మరోపక్క తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన మన బతుకమ్మను తిలకిస్తారు. ఇక్కడే కొందరూ మహిళలు బతుకమ్మను పేర్చుతూ పాటలు పాడుతారు. ● అక్కడ నుంచి హంపి థియేటర్కు చేరుకుంటారు. అక్కడ వీవీఐపీలతో పాటు సుందరీమణులు సోఫాల్లో కూర్చుని కార్యక్రమాలను అరగంటపాటు తిలకిస్తారు. ఇక్కడ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వాతిచే రూపొందించిన ఇండో – వెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలతో మోడల్స్ నిర్వహించే ర్యాంప్వాక్ను తిలకిస్తారు. ● తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, పోచంపల్లి ఇక్కత్ ప్రాముఖ్యతను ఏవీ ప్రదర్శనను సైతం తిలకిస్తారు. అవసరం అనుకొంటే మిస్వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఫొటోలు కూడా దిగుతారు. ● టూరిజం ప్రాంగణం ఇరువైపులా పల్లె వాతావరణం ప్రతిబింబించే గుడిసెల సెట్లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్ను పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్న 10 స్టాల్స్లో పోచంపల్లి ఇక్కత్ స్టాల్స్ ఏడు, మిగతావి గద్వాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కొకూన్స్ నుంచి వస్త్రం వరకు ఎలా తయారవుతుందో చేనేత మహిళలు వీరికి వివరిస్తారు. ● రెండో ప్రధాన ద్వారం వద్ద పూలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాబ్స్ అలంకరణను తిలకిస్తారు. అక్కడి నుంచి తిరిగి బస్సులో హైదరాబాద్ వెళ్తారు. పోచంపల్లిలో ‘ఇక్కత్ థీమ్’బుద్ధుడి చెంతకు..హైదరాబాద్కు చేరుకున్న మిస్ వరల్డ్ పోటీదారులు -
మంత్రి ఉత్తమ్ ఓఎస్డీగా ప్రేమ్కరణ్రెడ్డి
నల్లగొండ : రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్రెడ్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నల్లగొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (జెడ్పీ సీఈఓ) నంద్యాల ప్రేమ్కరణ్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో జిలాల్లో పలు మండలాల్లో ఎంపీడీఓగా పనిచేశారు. జెడ్పీ ఇన్చార్జి సీఈఓగా శ్రీనివాసరావునల్లగొండ : నల్లగొండ జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఓఎస్డీగా నియమితులు కావడంతో జెడ్పీ ఇన్చార్జి సీఈఓగా డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గురువారం ఆయన ఇన్చార్జి బాధ్యతలను స్వీకరించారు. పోలీస్ కుటుంబాల పిల్లలకు సమ్మర్ క్యాంపు నల్లగొండ : పోలీస్ కుటుంబ సభ్యుల పిల్లలకు మెగా సమ్మర్ క్యాంప్ను జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యార్థులకు ఆటవిడుపుగా సమ్మర్ క్యాంప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ క్యాంపులో 100 మంది విద్యార్థులకు నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఆటలు, యోగా వల్ల పిల్లలకు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐలు సూరప్పనాయుడు, సంతోష్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐ రాజీవ్, అశోక్,ి ఈటి.నాగరాజు, కరాటే మాస్టర్ వంశీ, యోగా మాస్టర్ కిషన్ కుమార్ పాల్గొన్నారు. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులునల్లగొండ : భూ భారతి చట్టం – 2025 అమలులో భాగంగా లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17లోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో కోరారు. శిక్షణ శిబిరాలు ఈ నెల 26 నుంచి జూలై 26 వరకు నిర్వహిస్తామని తెలిపారు. టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలుకేతేపల్లి : జాతీయ రహదారిపై కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులో గల టోల్ప్లాజా వద్ద గురువారం జిల్లా ఎన్ఫోర్స్, ఎకై ్సజ్శాఖ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని జిల్లా పోలీసులకు అందిన సమాచారంతో చండూరు, నల్లగొండ, నకిరేకల్ డివిజన్లకు చెందిన దాదాపు 50 మంది పోలీసులు టోల్ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎలాంటి గంజాయి పట్టుబడ లేదని తెలిసింది. లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించొద్దు గుర్రంపోడు : లైసెన్స్ లేని వారు విత్తనాలను విక్రయించొద్దని జిల్లా వ్యవసాయాధికారి పి.శ్రవణ్కుమార్ అన్నారు. గురువారం గుర్రంపోడు, కొప్పోలులో ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు డీలర్ల వద్ద నుంచి మాత్రమే పత్తి విత్తనాలు కొనుగోలు చేసి రశీదులు పొంది భద్రపర్చుకోవాలని సూచించారు. ఎరువుల దుకాణాల్లో స్టాక్ను పరిశీలించి మండలంలో 473 మెట్రిక్ టన్నుల యూరియా, 147 మెట్రిక్ టన్నుల డీఏపీ, 43 మెట్రిక్ టన్నుల సింగిల్ సూపర్ పాస్పేట్ అందుబాటులో ఉందని తెలిపారు. ఆయన వెంట ఏఓ కంచర్ల మాధవరెడ్డి, ఏఈఓలు ఉన్నారు. -
సందిగ్ధంలో డిగ్రీ విద్యార్థులు!
భువనగిరి: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరి ధిలో ఈనెల 14నుంచి జరగాల్సిన పరీక్షలపై విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేసే వరకు పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు మరో సారి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు తెలియజేసేందుకు శుక్రవారం వారితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ కళాశాలలు యాజమాన్యాలు కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మంత్రులు, ఉన్నత విద్యామండలి అధికారులను కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో గత నెల 1నుంచి జరగాల్సిన ప్రాక్టికల్స్, 11నుంచి ప్రారంభం కావాల్సిన సబ్జెక్ట్ పరీక్షలను నిర్వహించబోమని చేతులెత్తేశాయి. కాగా ఈ నెల 14నుంచి 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఈ నెల 6న షెడ్యూల్ విడుదల చేశారు. కానీ, పరీక్షలు నిర్వహించే పరిస్థితుల్లో తాము లేమని ప్రైవేట్ కళాశాలలు మరోసారి స్పష్టం చేయడంతో పరీక్షలు ప్రారంభం అవుతాయా.. లేదోనని విద్యార్థుల్లో సందిగ్ధం నెలకొంది. ఉన్నత చదువులకు ఇబ్బందులు ఫీజు బకాయిలు, పరీక్షలకు ముడిపెట్టవద్దని యూనివర్సిటీ అధికారులు కళాశాలల యాజమాన్యాలకు నచ్చజెబుతున్నా సేసేమిరా అంటున్నాయి. పీజీ ఇతర ఉన్నత చదువుల ప్రవేశాలకు డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు కీలకం. డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు త్వరగా రాస్తే వివిధ రకాల ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావచ్చన్న ఆశతో విద్యార్థులు ఉన్నారు. కానీ, తాజా పరిణామాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. విధిలేని పరిస్థితుల్లోనే నిర్ణయం గత కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదు. దీంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారింది. విధిలేని పరిస్థితుల్లోనే పరీక్షల నిర్వహణకు ముందుకు రావడం లేదు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించి రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. –బి.సూర్యనారాయణరెడ్డి, తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుఫ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎంజీయూ ఫ బహిష్కరిస్తున్నట్లు మరోసారి ప్రకటించిన ప్రైవేట్ కాలేజీలు ఫ ఆందోళనలో 15 వేల మంది విద్యార్థులు 59 ప్రైవేట్ కళాశాలలు మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 72 కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ 9, ఎయిడెడ్ 2, అటానమస్ 2, ప్రైవేట్ కళాశాలలు 59 వరకు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ , తృతీయ సంవత్సరం విద్యార్థులు 15 వేల వరకు ఉన్నారు. వీరంతా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. -
భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా..!
కోదాడ: కాశ్మీర్ లోయలో అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులను మట్టికరిపించి, ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి మాజీ సైనికుడిగా తాను సెల్యూట్ చేస్తున్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యాక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. పీఓకేలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనేక సంవత్సరాలుగా స్ధావరాలను ఏర్పాటు చేసుకొని కాశ్మీర్ లోయలో అలజడులను సృష్టిస్తున్నారని అన్నారు. భారత సైన్యం ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించి ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించడం అభినందనీయన్నారు. తాను గతంలో భారత వైమానికదళంలో మిగ్ పైలెట్గా పనిచేసిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చే ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని, భారత్ సైన్యం ముందు పాకిస్తాన్ ఆటలు సాగవని ఆయన అన్నారు. ఈ సమయంలో దేశం మొత్తం సైన్యానికి అండగా నిలవాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఫ మాజీ సైనికునాగా ఆపరేషన్ సిందూర్ను స్వాగతిస్తున్నా ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
బస్తాలు సర్దుబాటు చేస్తున్నాం
నల్లగొండ : జిల్లాలో బస్తాల కొరత వాస్తవమేనని.. అయినప్పటికీ సర్దుబాటు చేస్తున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ హరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ‘సాక్షి’లో ‘గోనె సంచుల గోల్మాల్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. గన్నీ బ్యాగులు కొత్తవి, పాతవి మిల్లర్ల నుంచి తీసుకుని పంపిణీ చేస్తామని.. అయితే రంద్రాలున్న బస్తాలను తిరిగి పంపాలని కేంద్రాల నిర్వాహకులకు చెప్పామని పేర్కొన్నారు. గన్నీ బ్యాగుల సరఫరాలో కొత్త బ్యాగులతో పాటు పాతవి కూడా సరఫరా చేయాలనే నిబంధన ఉందని తెలిపారు. ఫ పౌర సరఫరాల శాఖ డీఎం హరీష్ -
ఏపీ ప్రభుత్వ దౌర్జన్యంపై జర్నలిస్టుల నిరసన
నల్లగొండ టూటౌన్ : సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డి ఇంటిపై ఏపీ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేయించడాన్ని ఖండిస్తూ జర్నలిస్టులు నల్లగొండ పెద్ద గడియారం సెంటర్లో గురువారం ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి బ్యూరో ఇన్చార్జి చింతకింది గణేష్, ఎడిషన్ ఇన్చార్జి బొడ్డు జనార్దన్రెడ్డి మాట్లాడుతూ తప్పులను ఎత్తిచూపితే ఏపీ ప్రభుత్వం పోలీసులతో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై దాడులు చేయించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను ఏకంచేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వాస్తవాలను వెలికితీసి పత్రికల్లో రాస్తే ఏపీ ప్రభుత్వం కక్షకట్టి అక్రమ కేసులు పెట్టి వేధించడం మానుకోవాలని హితవుపలికారు. సాక్షి టీవీ ప్రతినిధి పాశం అశోక్రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెలికితీస్తున్న సాక్షి మీడియాపై, సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై దాడులు చేయించడం దారుణమైన విషయమన్నారు. జర్నలిస్టు సంఘాల బాధ్యులు చంద్రశేఖర్రెడ్డి, గుండగోని జయశంకర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. వాస్తవాలను వెలికితీస్తే ప్రభుత్వం బెదిరించే ఽవిధంగా దాడులు, అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. అక్రమ కేసులు, దాడులను జర్నలిస్టు సంఘాలు ఉపేక్షించవన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఫయిమ్, రాతికింది అంజయ్య, మాదురి యాదయ్య, గాదె రమేష్, జర్నలిస్టులు కట్టా సుధాకర్, జిల్లా యాదయ్య, మీసాల శ్రీనివాస్, ఆవుల లక్ష్మయ్య, వంగాల శ్రీనివాసరెడ్డి, తుమ్మనగోటి వెంకట్, రాంప్రసాద్, శేఖర్, మధు, రవి, వేణు, శివశంకర్, నవీన్రెడ్డి, రషీద్, ఫొటో జర్నలిస్టులు కంది భజరంగ్ ప్రసాద్, కంది శ్రీనివాస్, భవాని ప్రసాద్, బత్తుల శ్రీనివాస్గౌడ్, సాక్షి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ నల్లగొండ గడియారం సెంటర్లో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు బోల్తా
తిప్పర్తి: అతివేగంగా వస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. అనంతరం ఆ కారుపై విద్యుత్ స్తంభం విరిగి పడింది. ఈ ఘటన తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో గుంటూరుకు వెళ్లి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నారు. మార్గమధ్యలో తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. కారు ఢీకొన్న వేగానికి విద్యుత్ స్తంభం విరిగి కారుపై పడిపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. కారుపై విరిగిపడిన విద్యుత్ స్తంభం -
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో ద్వితీయ స్థానం
గుర్రంపోడు : ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ తర్వాత నల్లగొండ జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. మంగళవారం లారీల సమస్య ఎక్కువగా ఉన్న గుర్రంపోడు, కొప్పోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు లారీలను సరిపడా పంపేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.లారీలు సరిపడా లేకపోతే అదనంగా స్థానికంగా లారీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి దళారీలు ధాన్యం తీసుకువస్తే కేసులు నమోదు చేస్తున్నామని, మిల్లర్లు ఇబ్బందులు పెడితే వారిపై చర్యలకు వెనుకాడబోమని అన్నారు. తనతోపాటు పౌరసరఫరాల అధికారులు, అదనపు కలెక్టర్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొప్పోలు కేంద్రంలో రికార్డులను పరిశీలించిన కలెక్టర్.. సంతృప్తిని వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ మంజుల, వ్యవసాయ అధికారి మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. ఎర్రబెల్లి చెరువును పరిశీలించిన కలెక్టర్నిడమనూరు : మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో గల శనిగకుంట చెరువు, ఊట్కూరు గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. ఊట్కూర్ కొనుగోలు కేంద్రంలో వారం రోజుల్లోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్వాకులను ఆదేశించారు. ఎర్రబెల్లి శనిగకుంట చెరువుకు ఎగువన ఎర్రబెల్లి గ్రామ శివారులో ఏఎమ్మార్పీ లోలెవల్ కెనాల్ ప్రవహిస్తోంది. ఈ కెనాల్ నుంచి శనిగకుంట చెరువును నింపడానికి ఎత్తపోతల పథకం నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను రెవెన్యూ, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం ఈ కెనాల్కు అనుబంధంగా స్థానిక రైతులు కుంటను ఏర్పాటు చేసుకుని మోటార్ల ద్వారా సాగు నీటిని మళ్లిస్తున్నారు. చెరువును మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేసి, సాగునీరందిచాలని దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ నేపథ్యంలో కలెక్టర్ చెరువును పరిశీలించారు. కలెక్టర్ వెంట నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, సర్వేయర్ పోకల విజయ్, కృష్ణయ్య, ఆర్ఐ సందీప్, ఐబీ డీఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి అనర్హుడు
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి అనర్హుడని, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి విమర్శించారు. మంగళవారం సూర్యాపేటలో జగదీష్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలన చేతకాని రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంగా ఏర్పడినప్పుడే తెలంగాణ అప్పులతో మొదలైందని, అయినా పదేండ్లు కేసీఆర్ చేసిన అభివృద్ధి పాలన చూడలేదా అని అన్నారు. ఆదాయ వ్యయాల్లో కేసీఆర్కు, రేవంత్ కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. రేవంత్ మాట్లాడిన ప్రతిమాట అబద్దమని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని బట్టే కేసీఆర్ హామీలిచ్చారని చెప్పారు. రేవంత్రెడ్డి అడ్డగోలు హామీలిచ్చి అమలు చేతకాక ఇప్పుడు చేతులెత్తేసిండని విమర్శించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. గాలిమోటర్లో తిరిగి.. అప్పులు పుడతలేవంటున్నరని, సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తుందని చెప్పారు. హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
ఇల్లు ఇప్పించండి సారూ..
చందంపేట : అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. గత ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూం ఇళ్లు తమకు వస్తాయని అనుకుంటే డ్రాలో వీరి పేరు రాలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లు అయినా వస్తాయి అనుకుంటే జాబితాలో ఆ నిరుపేద కుటుంబాల పేర్లు లేకుండా పోయాయి. చందంపేట మండల కేంద్రానికి చెందిన ఇరగదిండ్ల యశోద–ఎల్లయ్య దంపతులకు నలుగురు కుమారులు. ఇందులో ముగ్గురికి వివాహం కాగా వారికి 8 మంది సంతానం. ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రెండు గదుల స్లాబ్, రెండు గదుల రేకులతో కూడిన ఇంట్లో నివాసం ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హులుగా గుర్తించినప్పటికీ డ్రాలో వీరికి డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని ఆశించారు. కానీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో వీరి పేరు లేదు. ముగ్గురు అన్నదమ్ములకు వేర్వేరుగా తెల్ల రేషన్కార్డులు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో వీరి పేరు లేదు. ఇంతమంది ఒకే ఇంట్లో ఉండడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కనికరించి తమకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు. ఒకే ఇంట్లో 16 మంది నివాసం ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో లేని నిరుపేదల పేర్లుఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి నాకు నలుగురు కొడుకులు. అందులో ముగ్గురు కొడుకలకు పెళ్లి అయ్యింది. ఆ ముగ్గురు కొడుకులకు కలిపి 8 మంది పిల్లలు ఉన్నారు. మొత్తం 16 మంది ఒకే ఇంట్లో నివసిస్తున్నాం. మా కొడుకులు లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం నా భర్త చనిపోతే నేను కూలి పనికి పోయి జీవిస్తున్నా. ఇప్పుడున్న ప్రభుత్వం నా కుమారులకు ఇళ్లను కేటాయించాలి. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో మా కుమారుల పేర్లు లేవు. అధికారులు కనికరించి ఇళ్లు కేటాయించాలి. – ఇరగదిండ్ల యశోద -
ప్రభుత్వ భూమి ఆరకమణ
గట్టుప్పల్ : ఆనాటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా 25 ఏళ్లుగా ప్రభుత్వ భూమి నిరుపయోగంగా మారింది. ఆ భూమిపై కన్నేసిన పక్కన వ్యవసాయ భూమి కలిగిన ఓ వ్యకి ఎకరం వరకు ఆక్రమించుకున్నాడు. కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఆక్రమణకు గురికావడంపై ఆ గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన భూమిని కాపాడాలని రెవెన్యూ అధికారుల చుట్టూ నెలలుగా తిరుగుతూనే ఉన్నారు. అయితే అనేక కారణాలు చూపిస్తూ అధికారులు కాలయాపన చేస్తున్నారు తప్ప పట్టించుకోవడం లేదని యువకులు ఆరోపిస్తున్నారు. గట్టుప్పల్ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న వెల్మకన్నె గ్రామంలో 1999 సంవత్సరంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రైవేట్ వ్యక్తులు నుంచి ప్రధాన రహదారికి ఆనుకుని ప్రభుత్వం ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆనాడు హద్దురాళ్లు నిర్ణయించి పేదలకు పంచేందుకు ప్లాట్లను కూడా అధికారులు చేశారు. కానీ గ్రామంలో సఖ్యత లేకపోవడంతో వాయిదాలు పడుతూ వచ్చింది. అధికారుల తప్పిదం..ఆనాడు ప్రధాన రహదారి వెంట సర్వే నంబర్ 56, 57లలో ఆరు ఎకరాలను రెవెన్యూ అధికారులు గుర్తించి ప్రతిపాదనలు పంపిస్తే.. ప్రభుత్వం ఆ భూమిని కొనుగోలు చేసింది. అధికారులు మాత్రం 55 సర్వే నంబర్లోని 6 ఎకరాలను పేదలకు పొజిషన్ చూపించారు. కొనుగోలు చేసింది ఓ సర్వే నంబర్ కాగా.. పొజిషన్ మరో సర్వే నంబర్ అనే విషయం ఆనాడు పేదలకు తెలియక ఇదే భూమి కదా అని ఒప్పుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగింది. అయితే ఇదే భూమి పక్కనే ఉన్న ఓ రైతు వేరే సర్వే నంబర్ భూమిని పట్టా చేయించుకుని 55 సర్వే నంబర్లోని పేదలకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్నాడు. దీంతో గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఎలా ఆక్రమించుకుంటారని గ్రామ యువకులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే తహసీల్దార్, ఆర్డీఓ కలెక్టర్లకు ఆ యువకులు వినతి పత్రాలు అందజేశారు.ఫిర్యాదు చేసిన యువకులు గ్రామ యువకుల ఫిర్యాదు మేరకు జనవరి నెలలో తహసీల్దార్ రాములు ఆ భూమిలో సర్వేయర్తో నేరుగా సర్వే చేయించారు. ఆరు ఎకరాల భూమిలో 10 గుంటల వరకు దేవాలయానికి పోను మిగిలిన భూమిలో ఎకరం వరకు ఆక్రమణకు గురైందని అధికారులు తేల్చారు. భూమి ఆక్రమించిన రైతుకు నోటీసులు ఇస్తే సమయానికి హాజరు కాలేదని తహసీల్దారు చెబుతున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు గతంలో కొనుగోలు గ్రామంలో సఖ్యత లేకపోవడంతో పట్టాలు ఇవ్వని అధికారులు ఇదే అదనుగా భూమిని ఆక్రమించిన ఓ వ్యక్తి ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు -
అనుమతి లేని పాఠశాలల ప్రచారానికి బ్రేక్
విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దు. పిల్లలను పాఠశాలల్లో చేర్పించేటప్పుడు ఆ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతి ఉందా.. లేదా అని నిర్ధారించుకున్న తర్వాత చేర్పించాలి. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. – భిక్షపతి, డీఈఓనల్లగొండ: జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటూ విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. వాటిని గుర్తించిన విద్యాశాఖ పాఠశాలల ప్రచారానికి బ్రేక్ వేస్తూ ప్రకటన చేసింది. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దంటూ ప్రకటన విడుదల చేసింది. జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించుకునేందుకు పాఠశాలలకు సెలవులు రాకముందు నుంచే టీచర్లను ఊళ్లలోకి పంపి కాన్వసింగ్ నిర్వహిస్తున్నాయి. ఒక్కో ఉపాధ్యాయునికి టార్గెట్ ఇస్తూ యాజమాన్యలు గ్రామాల్లోకి పంపుతున్నాయి. కొన్ని పాఠశాలలు పదో తరగతి ఫలితాల తర్వాత విస్తృత ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మభ్య పెట్టి పాఠశాలల్లో చేర్పించే పనిలో ఉన్నాయి. అనుమతి లేని పాఠశాలలు ఇవే..జిల్లాలోని పలు అనుమతి లేని పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించుకుంటున్నాయి. దీంతో కొందరు విద్యాశాఖకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన డీఈఓ భిక్షపతి నల్లగొండ పట్టణంలోని రవీంద్రగర్లో గల జయ హైస్కూల్, హాలియాలోని శ్రీచైతన్య హైస్కూల్, దేవరకొండలోని శ్రీచైతన్య హైస్కూళ్లకు అనుమతి లేదంటూ ప్రకటన విడుదల చేశారు. మూడు పాఠశాలలకు అనుమతి లేదని విద్యాశాఖ ప్రకటన -
తాటిచెట్టు పైనుంచి పడి గాయాలు
మునగాల: కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మునగాల మండలం నారాయణగూడెంలో జరిగింది. వివరాలు.. నారాయణగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు కాసాని వెంకటేశ్వర్లు తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. మోకు తెగిపోయి చెట్టు పైనుంచి కిందపడ్డాడు. అతడి కుడి కాలు విరగగా, తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వెంకటేశ్వర్లును ఆటోలో కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్కు తరలించారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి ప్రభుత్వం, తోడ్పాటునివ్వాలని గ్రామస్తులు కోరతున్నారు. రసాయన వ్యర్థాల శాంపిల్స్ సేకరణచివ్వెంల(సూర్యాపేట): లారీల్లో రసాయనిక వ్యర్థాలు తీసుకొచ్చి సోమవారం రాత్రి చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన రహదారి పక్కన వదిలిపెట్టారు. మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రోడ్డు పక్కన పారబోసిన రసాయనిక వ్యర్థాల శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. వ్యర్థాలు వదిలిన లారీలను స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఎగుమతికి లారీలేవీ?
ధాన్యం లిఫ్ట్ కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల నిరీక్షణతూకం వేసిన ధాన్యం బస్తాలు కల్లాల్లోనే.. ● లారీల కొరతతో కొన్నిచోట్ల కాంటాలు కూడా వేయడం లేదు ● 750 లారీలకు.. రోజూ నడుస్తున్నవి 150 లారీలే.. ● లారీలు లేని వారికి ధాన్యం ఎగుమతి కాంట్రాక్టులు ● ధాన్యం ఎగుమతి అయినా.. మిల్లుల వద్ద కూడా కొర్రీలు ● పంట అమ్ముకునేందుకు రైతులకు సవాలక్ష కష్టాలుపక్షం రోజులుగా నిరీక్షణ కొప్పోలు ధాన్యం కొనుగోలు కేంద్రానికి 200 బస్తాల ధాన్యం తెచ్చి పక్షం రోజులుగా ఎదురుచూస్తున్నా. లారీల సరిపడా రాక కాంటా వేయడం ఆలస్యం అవుతోంది. పట్టాల ఖర్చు భారమవుతోంది. అడపాదడపా కురిసే అకాల వర్షం, గాలి దుమారానికి పట్టాలు లేచి పోకుండా రాశిని కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది. – జెల్లా రాజయ్య, కొప్పోలు, గుర్రంపోడు బస్తాకు 3 కిలోలు కోతతూకం వేసేప్పుడు 40 కిలోల బస్తాకు కిలో ఎక్కువగా జోకుతున్నారు. ధాన్యం మిల్లుకుపోయిన తర్వాత తాలు పేర అక్కడ మిల్లర్ 2 కిలోలు కోత పెడుతుండు. లేదంటే ధాన్యం దించుకోవడం లేదు. కోతకు ఒప్పుకుంటేనే ట్రక్షీట్ ఇస్తున్నారు. – సత్తయ్య, నల్లగొండ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. అధికారుల అజమాయిషీ లేకపోవడంతో ధాన్యం కల్లాలకు తెచ్చిన రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నిర్ధేశిత తేమ శాతం వచ్చినా తూకం వేయక, వేసినా కూడా లారీలు రాక రోజుల తరబడి ఆ కళ్లాల వద్దే పడిగాపులు కాయాల్సిన వస్తోంది. కొన్ని చోట్ల లారీ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో రైతులే వాహనాలను పెట్టుకొని ధాన్యం తరలించాల్సి వస్తోంది. ఆ తరువాత ట్రక్ షీట్ ఆలస్యంగా రావడం, చివరకు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు రావడం కూడా 20 రోజులపైనే పడుతోంది. కొర్రీలు పెట్టి కోత విధిస్తున్నారుకల్లాలలో తూకం వేసేప్పుడు బస్తాకు కిలో అధికంగా తూకం వేస్తుండగా, తూకం వేసిన ధాన్యం మిల్లరు వద్దకు తీసుకెళ్లాక, ధాన్యం బాగలేదంటూ దిగుమతి చేసుకోకుండా కొర్రీలు పెడుతున్నారు. దీంతో సంబందిత కొనుగోలు కేంద్రానికి మిల్లర్లు ఫలానా రైతు ధాన్యం బాగలేదని చెప్పడం, దీంతో నిర్వాహకులు నీ ధాన్యం బాగలేదంట.. బస్తాకు 2 కిలోలు మిల్లర్లు కోత వేస్తారట.. లేదంటే నీ ఇష్టం అని చెబుతుండటంతో రైతులు అందుకు అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా 40 కిలోల బస్తాకే 3 కిలోల చొప్పున రైతును దోపిడీ చేస్తున్నారు. అందుకు ఒప్పుకుంటేనే ట్రక్ షీట్ రైతుకు అందుతోంది. అప్పుడే ఆ ట్రక్ షీట్ ఆధారంగా రైతు ఎంత విక్రయించారన్న వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. లేదంటే ధాన్యం వెనక్కి పంపిస్తామంటూ బెదిరిస్తున్నారు. మిల్లర్లు ఆడిందే ఆట..మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. అసలే కాంట్రాక్టర్లు కొద్దిపాటి లారీలను ధాన్యం రవాణాకు పంపిస్తున్నారు. అయితే ధాన్యం దిగుమతి చేసుకోలేమంటూ నల్లగొండ చుట్టుపక్కల ఉన్న మిల్లర్లు రెండు మూడు రోజులు కొర్రీలు పెట్ట డంతో నల్లగొండ ధాన్యాన్ని మిర్యాలగూడ, దేవరకొండ మిల్లులకు తరలించినట్లు సమాచారం. అంటే ఇటు ట్రాన్స్పోర్టు ఛార్జీలు కూడా ప్రభుత్వంపై అదనంగా పడుతున్నాయి. మొత్తంగా ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అధికారుల అజమాయిషీ పక్కాగా లేకపోవడంతో మిల్లర్లు చెప్పిందే వినాల్సి వస్తోంది. కాగా, రోజుకు ఒక్కో కల్లానికి రెండు చొప్పున నల్లగొండ జిల్లాలోని 375 కేంద్రాలకు దాదాపు 700 లారీలను పంపించాల్సి ఉన్నా రెండు మూడు రోజులకు ఒకటి చొప్పున 150 లారీలు కూడా రాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో లారీ కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయిలో లారీలు లేకున్నా టెండర్లు దక్కించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.● కట్టంగూరు మండలం అయిటిపాముల కేంద్రంలో రెండు రోజుల కిందట కాంటా వేసిన ధాన్యాన్ని మంగళవారం ఒక లారీలో తరలించారు. రోజుకు ఐదు లారీల ధాన్యం తరలించాల్సి ఉండగా ఒకటి, రెండు లారీలే వస్తున్నాయి. ● శాలిగౌరారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సోమవారం తూకం వేసిన 12,700 బస్తాల ధాన్యం.. లారీలు రాకపోవడంతో మంగళవారం సాయంత్రం వరకు ఎగుమతులు కాలేదు. అందులో ిపీఏసీఎస్ ఆధ్వర్యంలో 8,900 బస్తాలు, ఎఫ్ిపీఓ ఆధ్వర్యంలో 3,800 బస్తాల ధాన్యం నిల్వలు ఉన్నాయి. అందులో శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలోని పీఏసీఎస్ కేంద్రంలోనే అత్యధికంగా 4వేల బస్తాలు నిల్వ ఉన్నాయి. ● చందంపేట మండలంలోని పోలేపల్లి స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 20 రోజుల నుంచి సరిగ్గా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. నిర్దేశిత తేమ శాతం వచ్చినా జాప్యం చేస్తున్నారు. లారీల కొరత కారణంగానే ఆలస్యం చేస్తున్నారు. మిల్లు వద్ద ఒక లారీని అన్లోడ్ చేయాలంటే మూడు రోజులు పడుతోందని చెబుతున్నారు. ● గుర్రంపోడు మండలంలో లారీల కొరతతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 90 శాతం ధాన్యం తేమశాతం వచ్చినా లారీలు రాకపోవడంతో కాంటాలు వేయడం లేదు. ఒక్క కొప్పోలు కేంద్రంలోనే 40 లారీల ధాన్యం కొనుగోళ్లుకు సిద్ధంగా ఉంది. రోజు నాలుగైదు లారీలు రావాల్సి ఉండగా ఒకటి, రెండు మాత్రమే వస్తుండటంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. లారీల సమస్యకు ఇవీ ఉదాహరణలు -
బావిలో పడి బాలుడు మృతి
వలిగొండ: సరదాగా ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం ఎం. తుర్కపల్లిలో సోమవారం జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎం. తుర్కపల్లికి చెందిన బట్టు సుధాకర్ చిన్న కుమారుడు బట్టు చరణ్(12) చెవిటి, మూగవాడు. సోమవారం మధ్యాహ్నం సుధాకర్ సోదరుడి కుమారుడు బట్టు గౌతంతో కలిసి చరణ్ ఎం. తుర్కపల్లి గ్రామానికే చెందిన తుమ్మల బాల్రెడ్డి వ్యవసాయ బావి వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరికి ఈత రాకపోవడంతో బావి ఒడ్డున స్నానం చేస్తుండగా చరణ్ కాలుజారి బావిలో పడిపోయాడు. భయంతో ఇంటికి వెళ్లిన గౌతం ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. సాయంత్రం వరకు చరణ్ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. చరణ్ బావిలో పడిన విషయాన్ని గౌతం కుటుంబ సభ్యులకు చెప్పడంతో బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటార్లతో నీటిని తోడుతుండగా చరణ్ మృతదేహం లభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం చరణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. మట్టి తరలిస్తున్న టిప్పర్ల పట్టివేతహుజూర్నగర్: అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టకున్నారు. వివరాలు.. చిలుకూరు మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి కొందరు అక్రమార్కులు టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నాలుగు మట్టి టిప్పర్లను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. మట్టి టిప్పర్లను పట్టకున్న విషయాన్ని మైనింగ్ అధికారులకు తెలియజేశామని, వారు జరిమాన విధిస్తారని చెప్పారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామ సమీపంలో 365వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు.. కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్ఎల్బీసీ కాలనీకి చెందిన మాదగాని లోకేశ్(24), కట్టంగూర్ మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దోనిబావి గ్రామానికి చెందిన రాచకొండ నిఖిల్(21) స్నేహితులు. లోకేశ్ ఐటీఐ పూర్తిచేసి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారుచేసే కంపెనీలో అంప్రెంటీస్ చేస్తున్నాడు. నిఖిల్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. లోకేశ్ మంగళవారం హైదరాబాద్ నుంచి బైక్పై పెద్దోనిబావి గ్రామానికి వచ్చి నిఖిల్ను పిలుచుకొని నకిరేకల్ మీదుగా 365వ నంబర్ జాతీయ రహదారిపై అర్వపల్లి వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకేశ్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్పై వెనుక కూర్చున్న రాచకొండ నిఖిల్కు తీవ్రగాయాలు కావడంతో పాటు కారును నడుపుతున్న మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన దేశగాని విఠల్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిఖిల్, విఠల్ను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని, మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. ఇద్దరు యువకులు దుర్మరణం -
రేణుకా ఎల్లమ్మకు అభిషేకాలు
కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం మహిళా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అలంకరించారు. అర్చకులు అమ్మవారికి హారతి ఇచ్చారు. సఖి కేంద్రం తనిఖీ నల్లగొండ: జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ ఉమాదేవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం అందించే సేవలు, కేంద్రంలో నమోదవుతున్న కేసుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని సిబ్బందికి సూచించారు. అవసరమైతే మహిళా కమిషన్ సహాయాన్ని కూడా కోరవచ్చని సిబ్బందికి తెలిపారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సఖీ సిబ్బంది వరుణ శ్రీ, సునీత, గీత, నాగమణి ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీగా శేఖర్రెడ్డినల్లగొండ: ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీగా డీఆర్డీఓ శేఖర్రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేసిన మాన్యనాయక్ గత నెల 30న పదవీ విరమణ చేశారు. 13న పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షరామగిరి(నల్లగొండ) : పాలిసెట్–2025 ఎంట్రెన్స్ పరీక్ష ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్. నరసింహారావు తెలిపారు. మొత్తం 5203 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలో మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలన్నారు. ఒక నిమిషం నిబంధన వర్తిస్తుందని, 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని వివరించారు. పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులు హెచ్బీ పెన్సిల్, బ్లూ, బ్లాక్ బాల్పెన్, ఎరైజర్, రైటింగ్ ప్యాడ్ తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలన్నారు. ఇన్చార్జ్ సీపీఓగా సామ్యేల్నల్లగొండ: భువనగిరి సీపీఓ సామ్యేల్కు నల్ల గొండ ఇన్చార్జ్ సీపీఓగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సామ్యేల్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు. కాగా నల్లగొండ సీపీఓగా పనిచేసిన మాన్యనాయక్ గత నెల 30న పదవీ విరమణ చేశారు. శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి● డీఈఓ భిక్షపతి తిప్పర్తి : విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, స్పీడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ విద్య, సాంస్క్రతిక కార్యక్రమాలు, పెయింటింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్పై శిక్షణ ఇస్తారని తెలిపారు. వివిధ కస్తూరిబా పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థినులు ఈ శిక్షణలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ నెల 19 వరకు శిక్షణ శిబిరం జరుగనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జీఈసీఓ అరుంధతి, ఎంఈఓ నర్సింహనాయక్, ఎస్ఓ రాజరాజేశ్వరీ ఉన్నారు. -
ఈదురుగాలులకు ఒరిగిన ధ్వజ స్తంభం
మిర్యాలగూడ: దామరచర్ల మండలం వాడపల్లిలో మంగళవారం భారీ ఈదురుగాలులతో కూడి వర్షం కురవగా.. గ్రామ శివారులోని పురాతన శ్రీలక్ష్మీనృసింహస్వామి, మీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు లక్ష్మీనృసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం ఒక పక్కకు ఒరిగింది. శివాలయంలోని భారీ చెట్లు నేలకొరిగాయి. ఆలయ పునరుద్ధరణలో భాగంగా 1995లో ఇండియా సిమెంట్స్ కంపెనీ యాజమాన్యం ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్లు కొందూటి సిద్ధయ్య, పొదిల శ్రీనివాస్ తెలిపారు. విశిష్టమైన ఆలయాలు దెబ్బతినడం పట్ల అర్చకులు నాగేంద్రప్రసాద్శర్మ, సాంబశివరావుశర్మ, రామానుజాచార్యులు, గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. -
జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక
నకిరేకల్: జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు నకిరేకల్ మండలం మంగళపల్లికి చెందిన కొప్పుల శ్రీజ ఎంపికైంది. ఇంటర్మీ డియట్ పూర్తిచేసిన శ్రీజ ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి చాంపియన్షిప్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో శ్రీజ పాల్గొంటుందని తెలిపారు. -
రైల్వే వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి
రామగిరి(నల్లగొండ): రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించే విధానాలను వ్యతిరేకించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ జిల్లా నాయకులు మంగళవారం నలగొండ రైల్వే స్టేషన్ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ దేశంలో రైల్వే వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైల్వే రంగంలో భద్రతా చర్యలు పెంచాలని, ప్రమాదాలు అరికట్టాలని ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రైవేటీకరణ వల్ల సరుకు రవాణా చార్జీలు పెరగడంతో వస్తువుల రేట్లు పెరుగుతాయన్నారు. ప్రయాణికుల భద్రత కోసం సరైన చర్యలు చేపట్టాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్యాసింజర్ రైళ్లు పెంచాలని, రైళ్లల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, పల్లె నగేష్, అవుట రవీందర్, నకరెకంటి సత్తయ్య, లింగస్వామి, వెంకన్న, రాధాకష్ణ పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ రాబడి రూ.39.18 కోట్లు
నల్లగొండ టూటౌన్ : ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్) ద్వారా జిల్లాలోని మున్సిపాలిటీలకు దండీగా ఆదాయం సమకూరింది. గతంలో వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దాంతో జిల్లాలోని నీలగిరి, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఫీజు రూపంలో రూ.39.18 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం ఏడు మున్సిపాలిటీల పరిధిలో 12,336 మంది దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ చేయించుకున్నారు. నందికొండ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ లేని విషయం తెలిసిందే. గత నెల ఏప్రిల్ నెలాఖరుతో ఎల్ఆర్ఎస్ గడువు ముగియగా మరో మూడు రోజులు ప్రభుత్వం పెంచడంతో ఈనెల 3వ తేదీతో ముగిసింది. నీలగిరి మున్సిపాలిటీలో భారీగా.. జిల్లాలో ఏడు మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ ద్వారా నీలగిరి మున్సిపాలిటీ ఆదాయంలో టాప్లో నిలిచింది. ఏడు మున్సిపాలిటీలకు కలిపి రూ.39.18 కోట్ల ఆదాయం రాగా.. నీలగిరి మున్సిపాలిటీకి ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.20.87 కోట్లు వచ్చింది. పెండింగ్ దరఖాస్తులు ఎక్కువే.. ఏడు మున్సిపాలిటీల్లో పెండింగ్ జాబితాలో ఉన్న దరఖాస్తులు భారీగానే ఉన్నా యి. అయితే ఈ మున్సిపాలిటీల్లో మొత్తం 13,428 దరఖాస్తులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. కొన్ని సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వం ఎఫ్టీఎల్ పరిధిలో చేర్చింది. దీని కారణంగా వేలాది మంది దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. ఆయా కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేకపోవడం ఇతర కారణాలతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి.మున్సిపాలిటీలకు సమకూరిన ఆదాయం (రూ.కోట్లలో..) మున్సిపాలిటీ ఆదాయం నీలగిరి 20.87 నకిరేకల్ 1.95 చిట్యాల 1.06హాలియా 1.35మిర్యాలగూడ 12.22 దేవరకొండ 0.82 చండూరు 0.91ఫ మున్సిపాలిటీలకు భారీగా సమకూరిన ఆదాయం ఫ రూ.20.87 కోట్లతో నీలగిరి టాప్ ఫ ముగిసిన ఎల్ఆర్ఎస్ గడువురాయితీ లేకుండా ఎల్ఆర్ఎస్ చేయించుకోవచ్చు ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీ గడువు ముగిసింది. గడువు ముగిసినా రాయితీ లేకుండా ఎల్ఆర్ఎస్ చేయించుకోవచ్చు. వెయ్యి రూపాయలు చెల్లించి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారు ప్లాట్ డాక్యుమెంట్పై ఉన్న విలువలో 14 శాతం చెల్లించి ఎల్ఆర్ఎస్ చేయించకోవచ్చు. – కృష్ణవేణి, టౌన్ప్లానింగ్ ఏసీపీ -
ఉద్యోగాలు ఇప్పించకపోతే చావే శరణ్యం..
దామరచర్ల మండలంలో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు 2015లో 186 మంది రైతులు 920 ఎకరాల భూమి ఇచ్చారు. భూసేకరణ సమయంలో కలెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓలతో పాటు నాయకులు కూడా వచ్చి భూములు ఇచ్చే రైతులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రైతులు సంతోషంగా భూములు ఇచ్చారు. భూమి తీసుకుని పదేళ్లు అవుతున్నా ఉద్యోగాలపై ఎవరూ సమాధానం చెప్పడం లేదంటూ వీర్లపాలెం గ్రామానికి చెందిన 50 మంది రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగం ఇప్పించకపోతే మాకు చావే శరణ్యమని వాపోయారు. – థర్మల్ పవర్ ప్లాంట్కు భూములు ఇచ్చిన రైతులు మూడు చక్రాల ఎలక్ట్రికల్ వాహనం ఇప్పించాలి నల్లగొండలోని గొల్లగూడెం ప్రాంతానికి చెందిన జక్కల లింగయ్య చిన్న తనంలోనే పోలియో వచ్చి నడవలేని స్థితిలో ఉన్నాడు. తన అన్న దగ్గరనే ఉంటూ పింఛన్తో జీవనం సాగిస్తున్నాడు. ఎక్కడికై నా వెళ్లడానికి మూడు చక్రాల చార్జింగ్ బండి ఇప్పించాలని కలెక్టర్ను కోరాడు. – జక్కల లింగయ్య, నల్లగొండ -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్చంద్ర పవార్ 35 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆయా కేసుల పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి.. చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. గోదాముల్లో తూకం వేశాకే ఇవ్వాలని వినతినల్లగొండ : గోదాముల్లో బియ్యం తూకం వేసిన తర్వాతనే రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేయాలని కోరుతూ రేషన్ డీలర్లు సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు మాట్లాడుతూ బియ్యం తూకం వేయకుండా బస్తాల లెక్కన ఇవ్వడం వల్ల తరుగు వస్తోందన్నారు. డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని గోదాములకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, సర్వయ్య, డీలర్లు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు ప్రారంభంనకిరేకల్ : భూ భారతి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న నకిరేకల్ మండలంలో సోమవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. తాటికల్ శివారులోని తెట్టెకుంట, గొల్లగూడెం శివారులోని అడివిబొల్లారం గ్రామాల్లో అధికారులు సదస్సులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతులు వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. భూ భారతి చట్టంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. తెట్టెకుంటలో ఒకటి, అడివిబొల్లారంలో 8 దరఖాస్తులు వచ్చాయి. ఆయా కార్యక్రమాల్లో నకిరేకల్, కట్టంగూరు తహసీల్దార్లు జమురుద్దీన్, ప్రసాద్నాయక్, డీటీ రామకృష్ణ, ఆర్ఐలు చిరంజీవి, మధు, రజనీకాంత్, అరవింద్, మోదిల్ పాష, తేజ, రాజు పాల్గొన్నారు. రెమ్యునరేషన్ను చెల్లించాలి నల్లగొండ : గతేడాది నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ కులగణన సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు రెమ్యునరేషన్ ఇవ్వాలని టీఎస్యూటీఎఫ్ ఆద్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు రెమ్యునరేషన్ ఇవ్వడంలో జాప్యం చేయడం శోచనీయమన్నారు. వారం రోజుల్లోగా రెమ్యునరేషన్ చెల్లించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్రెడ్డి, కోశాధికారి వడ్త్యా రాజు, ఎడ్ల సైదులు, శ్రీనివాస్రెడ్డి, గేర నర్సింహ, నలపరాజు వెంకన్న, ఎ.చిన్నవెంకన్న, కొమర్రాజు సైదులు, మధుసూదన్, రాగి రాకేష్ పాల్గొన్నారు. -
రైతులకు విశిష్ట కార్డులు
నల్లగొండ అగ్రికల్చర్: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసంది. ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో రైతుల పేర్లు నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ సోమవారం ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.5 లక్షల పైచిలుకు రైతులు ఉన్నట్టు ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఈ గుర్తింపు కార్డే కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రామాణికం కానుంది. పదకొండు అంకెలతో కూడిన కార్డు జారీ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంతోపాటు రైతు వేదికల్లో రైతుల పేర్లు నమోదు చేయనున్నారు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాసుపుస్తకంలోని భూ యజమాన్య వివరాల వివరాల నమోదు ద్వారా రైతుకు 11 అంకెలు గల గుర్తింపు కార్డును కేటాయిస్తారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలైన పీఎం కిసాన్ పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన తదితర పథకాలు అమలు చేస్తుంది. సరైన గణాంకాలు, ధ్రువీకరణ పత్రాలు, నమోదు వివరాలులేని కారణంగా రైతులకు సకాలంలో పథకాలు అందడం లేదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించి ఈ పథకాన్ని ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ కార్డులు వచ్చిన రైతులకు కేంద్రం అమలు చేసే కిసాన్ బీమా పథకాలు వర్తిస్తాయి. ఏఈఓలకు శిక్షణ పూర్తి ఇప్పటికే మండల వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ కార్యక్రమంపై శిక్షణను ఇచ్చారు. విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు భూ యాజమాన్య పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ ఫోన్ నంబర్లతో మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణాధికారి కార్యాలయాల వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారుకు ఓటీపీ వస్తుంది. దాని ధ్రువీకరణ ద్వారా రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్లో తదుపరి విడత నిధులు విడుదలకు దీనినే ప్రామాణికంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని రైతు వేదికల్లోనూ మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారుల పేర్ల నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.ఫ కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించేలా శ్రీకారం ఫ 11 అంకెలతో జారీ చేయనున్న గుర్తింపు కార్డులు ఫ పట్టాదారు పాస్బుక్, ఆధార్, సెల్ నంబర్కు లింకు ఫ రైతుల పేర్ల నమోదు ప్రారంభంరాష్ట్ర పథకాలకు సంబంధం లేదు రాష్ట్రంలో అమలయ్యే రైతు భరోసా, రుణమాఫీ పథకాలకు రైతు విశిష్ట కార్డులకు ఎలాంటి సంబంధం ఉండదు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదుకు రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యజమాని వివరాలే ప్రామాణికంగా ఉంటాయి. విశిష్ట కార్డు కోసం రైతులు విధిగా పేర్లు నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ, నల్లగొండ -
కొత్త కారు్డదారులకు రేషన్
నల్లగొండ : కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ఈ నెల నుంచే బియ్యం అందనున్నాయి. జిల్లాలో కొత్తగా 8,750 ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలను చేర్చేందుకు గతంలో మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుని డీఎస్ఓ పెండింగ్ అని చూపించిన వాటిని కూడా ఓకే చేసింది. దీంతో కొత్తగా 61,247 మంది లబ్ధిదారులు పెరిగారు. కొత్త లబ్ధిదారులకు ఈ నెల రేషన్ కోటా కింద 3674.82 క్వింటాళ్ల సన్న బియ్యం విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. రేషన్ కార్డుల కోసం సుమారు లక్ష వరకు దరఖాస్తులురాగా.. కేవలం 8,750 మందికి మాత్రమే ప్రస్తుతం కార్డులు వచ్చాయి. దీంతో మిగతా దరఖాస్తుదారులు తమకు రేషన్ కార్డు వస్తుందో.. రాదోనని ఆందోళన చెందుతున్నారు.మిగతా వారికి ఎప్పుడో?కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం బీసీ కులగణనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేసి కొద్దిమందికే ఇవ్వడంతో మిగిలిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే మిగిలిన దరఖాస్తులు పరిశీలించి ఎప్పుడు కార్డులు ఇచ్చి బియ్యం కోటా కేటాయిస్తారో, అలాగే పిల్లల పేర్లు ఎక్కించేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలోనూ అయోమయ పరిస్థితి నెలకొంది.ఎన్నికల హామీ మేరకు..2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీ మేరకు అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ప్రజాపాలనతోపాటు ఆన్లైన్లో కూడా దరఖాస్తులు స్వీకరించింది. ప్రజా పాలనలో 50 వేల మంది పైచిలుకు రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా మరికొందరు పిల్లల పేర్లు కార్డులో ఎక్కించేందుకు కూడా చాలా మంది దరఖాస్తులు చేశారు. ఆ తర్వాత బీసీ కులగణన సందర్భంలో 30 వేల వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంతో దాదాపు 19వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.కులగణన సమయంలో వచ్చిన దరఖాస్తుల సర్వే..రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ బీసీ కులగణన సందర్భంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వం సర్వే చేసినట్లు తెలిసింది. దీంతో జిల్లాలో కేవలం 8,750 కొత్త దరఖాస్తుదారులకు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు మంజూరు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి రేషన్కార్డుల కోసం అర్హులు ఎదురుచూశారు. ఇప్పుడు కొందరికే మంజూరు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.యాడ్ అయిన 61,247 యూనిట్లువారికి ఈ నెల నుంచే బియ్యం పంపిణీసుమారు లక్ష దరఖాస్తులు.. కొందరికే కార్డులిచ్చిన ప్రభుత్వంఅర్హులకు తప్పని ఎదురుచూపులు జిల్లాలో రేషన్ కార్డుల వివరాలు..కొత్తగా వచ్చిన కార్డులు 8,750 యాడ్ అయిన యూనిట్లు 61,247వీరికి కేటాయించిన బియ్యం 3674.82 (క్వింటాళ్లు)గతంలో ఉన్న కార్డులు 4,66,061గతంలో ఉన్న యూనిట్లు 13,85,506కేటాయించిన బియ్యం 8,877.999(మెట్రిక్ టన్నులు)దరఖాస్తులు పరిశీలిస్తాంకొత్త కార్డులకు ఈ నెల నుంచే సన్న బియ్యం కోటా కేటాయించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగతా దరఖాస్తులు పరిశీలించి కార్డులు అందజేస్తాం. ఆ తర్వాత వారికి కూడా బియ్యం పంపిణీ చేస్తాం.– వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ -
అనర్హులకు ఇళ్లు కేటాయించొద్దు
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ : అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు అనర్హులు కేటాయించకుండా.. మండల ప్రత్యేక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికార, రాజకీయ ఒత్తిళ్లకు లోను కావొద్దన్నారు. రాజీవ్ యువవికాసం పథకం లక్ష్యాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొననున్న మహిళలు ఈ నెల 12న నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని సందర్శిస్తున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రపంచ సుందరీమణుల సాగర్ సందర్శన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానం పలకాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్కుమార్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఆర్డీఓలు వై.అశోక్రెడ్డి, శ్రీదేవి జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నా కుటుంబాన్ని ఆదుకోండి..
ఆరు మాసాల క్రితం బాలు భార్య కిడ్నీ వ్యాధితో చనిపోయింది. ఆమెకు చికిత్స కోసం అప్పు తెచ్చి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాడు. సీఎం రిలీఫ్ పండ్ కింద దరఖాస్తు చేసుకుంటే రూ.60 వేలు వచ్చాయి. నాది పేద కుటుంబమని.. నాకు ముగ్గురు ఆడ పిల్లలు, ఒక బాబు. అందరూ చదువుతున్నారని.. కుటుంబం గడవడం కూడా ఇబ్బందికరంగా ఉందని.. వైద్య ఖర్చులకు అయిన డబ్బులు ఇప్పించాలని కోరాడు. – బాలు, దేవరకొండ ఇళ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు.. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తప్పుల తడకగా చేశారని.. అర్హులకు గాకుండా ఇప్పటికే ఇళ్లు ఉన్న వారికే ఇళ్లు మంజూరని తిరుమలగిరిసాగర్ మండలం చిల్లాపురం గ్రామస్తులు పలువురు కలెక్టరేట్ వచ్చారు. కూలినాలి చేసి జీవించే వాళ్లమని.. ఇందిరమ్మ ఇంటికి అర్హులమని.. గ్రామంలో రీ సర్వే చేసి అర్హులకు ఇళ్లు ఇప్పించాలని కలెక్టర్కు విన్నవించారు. – తిరుమలగిరిసాగర్ మండలం చిల్లాపురం గ్రామస్తులు -
సస్యశ్యామలం చేస్తాం
మిర్యాలగూడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులంతా సహకరించాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సాగునీటి, పౌరసరఫరాల శాఖ (వరి ధాన్యం సేకరణ, సన్న బియ్యం పంపిణీ) పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా తెలంగాణ గీతం ఆలపిస్తుండగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులంతా గౌరవ సూచికంగా లేచి నిలబడ్డారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.94వేల కోట్లు ఖర్చు చేసిందని, ఆ నిధులతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చన్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ గత ప్రభుత్వం ట్రిబ్యునల్తో ఒప్పందం చేసుకుందని, సాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న 811 టీఎంసీల నీటిని 512 టీఎంసీలు ఏపీకి, 298 టీఎంసీలు తెలంగాణకు కేటాయించేలా గత ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ రీ ఓపెన్ చేసి పునఃపరిశీలన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తోందని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను తామే పూర్తి చేస్తామని, నిర్లక్ష్యానికి గురైన డిండి ప్రాజెక్టుకు గాను రూ.1,800 కోట్లు కేటాయించామన్నారు. పోయిన వానాకాలంలో ప్రతి గింజను కొనుగోలు చేశామని, సన్న రకం ధాన్యానికి బోనస్ ఇచ్చామని, ఈ యాసంగిలో కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం పథకం తెచ్చామన్నారు. సాగునీటి పనుల పురోగతిపై మంత్రి అసంతృప్తి సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో సాగునీటి పనుల పురోగతిపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ల పనుల పురోగతిని వివరిస్తుండగా చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్ను పిలిచి పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందని మంత్రి ప్రశ్నించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టిసారించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షించాలన్నారు. ఈ సమావేశంలో భారీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఎంపీలు కుందూరు రఘువీర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, బాలునాయక్, కుంభం అనిల్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్నంద్లాల్, భూసేకరణ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్కృష్ణారెడ్డి, నీటి పారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్, అడిషనల్ డీజీపీ చౌహాన్, తెలంగాణ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ శ్రీనివాస్రావు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశానికి కోదాడ, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, సూర్యాపేట ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, అద్దంకి దయాకర్ హాజరు కాలేదు. మాది పేదల ప్రభుత్వం – ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజా ప్రభుత్వమని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అన్నింటి కంటే సన్న బియ్యం పంపిణీ పథకం తమకు నచ్చిందన్నారు. పదేళ్ల పాటు ఫాంహౌస్లో పడుకున్న కేసీఆర్ కాంగ్రెస్ను విలన్గా చూపించడం అతని అసహనానికి నిదర్శనమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి రూ.150 కోట్లు కేటాయించామన్నారు. జూన్లో టెండర్లు పిలిచి జూలైలో పనులను ప్రారంభిస్తామన్నారు. ఫ అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలి ఫ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఫ ఇరిగేషన్, సివిల్ సప్లయ్శాఖపై మిర్యాలగూడలో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం ఫ హాజరైన మండలి చైర్మన్ గుత్తా, మంత్రి కోమటిరెడ్డి తదితరులు ఎడమకాల్వ మరమ్మతులకు నిధులివ్వాలి – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ సాగర్ ఎడమకాల్వ మరమ్మతుకు నిధులు కేటాయించాలని అన్నారు. ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్కు రూ.440కోట్లు మంజూరు చేశారని, మరో 3, 4 కిలోమీటర్లు ప్రధాన కాల్వ లైనింగ్ పెంచితే 2లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఏపీ నుంచి నల్లగొండకు అక్రమంగా వస్తున్న ధాన్యం రవాణాలను అరికట్టాలని అధికారులకు సూచించారు. -
నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
నకిరేకల్: భూ భారతి చట్టం–2025 అమలులో భాగంగా నకిరేకల్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని, మండలంలో సోమవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నకిరేకల్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సదస్సుల నిర్వహణకు రెండు టీంలను నియమిస్తున్నామన్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సులు జరపాలన్నారు. ఈ సదస్సుల్లో రైతులను భాగస్వాములను చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ అశోక్రెడ్డి, నకిరేకల్ తహసీల్దార్ జమీరుద్దీన్, కట్టంగూర్ తహసీల్దార్ ప్రసాద్నాయక్, రెవెన్యూ అదికారులు పాల్గొన్నారు. సదస్సుల షెడ్యూల్.. 5న అడవిబొల్లారం, తెట్టెకుంట, 6న మండలాపురం, నెల్లిబండ, 7న చందంపల్లి, వల్లాబాపురం, 8న పాలెం, తాటికల్, 9న ఓగోడు, గోరెంకలపల్లి, 12న మంగళపల్లి, మర్రూరు, 13న చందుపట్ల, కడపర్తి, 14న నోముల, నకిరేకల్ పట్టణంలో సదస్సులు నిర్వహించనున్నారు. ఫ భూ భారతి పైలట్ ప్రాజెక్టుగా నకిరేకల్ మండలం ఎంపిక ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి -
రైతుల ముంగిటకు శాస్త్రవేత్తలు
ఫ పంటల సాగుపై ముందస్తు అవగాహన కల్పించేలా వినూత్న కార్యక్రమం ఫ రసాయన ఎరువుల వాడకం తగ్గించడమే లక్ష్యం ఫ కార్యాచరణ సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ ఫ నేటి నుంచి జూన్ 13 వరకు అవగాహన సదస్సులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించే గ్రామాలు త్రిపురారం: కంపాసాగర్, బాబుసాయిపేట, పెద్దదేవులపల్లి, మాటూర్, రాగడప, బెజ్జికల్ అనుముల: తిమ్మాపురం, నాయుడుపాలెం, ఇబ్రాహీంపేట, చల్మరెడ్డిగూడెం, హజారిగూడెం, మదారిగూడెం, పాలెం నిడమనూరు: బంకాపురం, తుమ్మడం, నిడమనూరు, శాఖాపురం, వెనిగండ్ల, బొక్కమంతలపాడు, గుంటిపల్లి, వల్లభాపురం మిర్యాలగూడ: జప్తివీరప్పగూడెం తిప్పర్తి: తిప్పలమ్మగూడెం తిరుమలగిరి సాగర్: నెల్లికల్ త్రిపురారం : వచ్చే వానాకాలం సీజన్లో వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులపై గ్రామీణ రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా రైతు ముంగిటకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వెళ్లే అవగాహన కల్పించేందుకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం (ఈ నెల 5వ తేదీ) నుంచి జూన్ 13వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్యవిద్యాలయం, కేవీకే కంపాసాగర్, వరి పరిశోధన స్థానం కంపాసాగర్ శాస్త్రవేత్తలు మండల వ్యవసాయ అధికారులతో కలిసి గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఇదీ.. ప్రధానోద్దేశం భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, యూరియా వాడకాన్ని తగ్గంచుకోవడం, పురుగు మందుల వాడకంతో చీడపీడల నివారణ మార్గాలు, విత్తానాభివృద్ధి, నీటి యాజమాన్య పద్ధతులను వివరించడం ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. అలాగే, సమీకృత, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, యాంత్రీకరణ, వ్యవసాయ శాఖ పథకాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారు. -
ఉద్యమాలతోనే సంక్షేమ పథకాలు
తిప్పర్తి: కమ్యూనిస్టుల ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఆదివారం తిప్పిర్తి మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో సీపీఎం సీనియర్ నేత నన్నూరి అంజిరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. అనంతరం వీరారెడ్డి మాట్లాడుతూ పేదల కోసం నన్నూరి అంజిరెడ్డి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన ఆశయాల సాధనకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి, నాయకులు మన్నెం భిక్షం, భీమగాని గణేష్, ఆకిటి లింగయ్య, మంత్రాల మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. నారసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు, భారీగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు నిజాభిషేకం చేసి సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు గావించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. మట్టపల్లిలో 10 నుంచి తిరుకల్యాణోత్సవాలు మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈనెల 10 నుంచి 15వరకు జరగనున్న తిరుకల్యాణోత్సవాల వాల్పోస్టర్లను ఆదివారం ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసా చార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
మద్యపానం.. బహిరంగం!
పోలీస్ పెట్రోలింగ్ పెంచాలి జిల్లా కేంద్రంలో రాత్రి 9 గంటలు తాటిందంటే వైన్స్ వద్ద బహిరంగంగా కొందరు మద్యం తాగుతూ రోడ్డు మీద వచ్చిపోయే వారిపై తూలుతున్నా వారిని ఎవరూ ఏమీ అనే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్జీ కాలేజీ మైదానంతోపాటు పట్టణంలో ఉన్న పార్కుల్లోనూ రాత్రిపూట మద్యం సేవిస్తున్న పరిస్థితి. పోలీసులు ఒక పక్క మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నా.. మెయిన్రోడ్డు మీద ఉన్న వైన్స్ సిట్టింగ్ల వద్ద మందుబాబులను కంట్రోల్ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైన్స్ల వద్ద సిట్టింగ్ల సమీపంలో, బహిరంగ ప్రదేశాలతోపాటు పార్కుల్లో కూడా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించి మందుబాబుల బెడద నుంచి రక్షణ కల్పించాలని పట్టణ వాసులు అంటున్నారు. వైన్స్ల ముందు రోడ్లమీదే తాగుతున్న మందుబాబులు నల్లగొండ: జిల్లాలో మందుబాబుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుండడం తప్ప మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజూ పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడం వల్ల వైన్స్లు ఉన్న ప్రాంతాల్లో మందుబాబులు రోడ్ల మీదనే మద్యపానం చేసేస్తున్నారు. వైన్స్లకు చెందని పర్మిట్ రూమ్లు బార్లను తలపించేలా కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆయా చోట్ల రోడ్ల మీదకు రావాలంటే జంకుతున్నారు. పట్టణ శివారు ప్రాంతాలతోపాటు పార్కుల్లోనూ రాత్రివేళల్లో మద్యం సేవించి అక్కడే బాటిళ్లు పడేస్తున్నారు. ఫలితంగా ఉదయం పాదచారులకు, వాకింగ్కు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ‘సాక్షి’ విజిట్లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. రాత్రయిందంటే హల్చల్ రాత్రయిందంటే చాలు కొందరు మందుబాబులు హల్చల్ సృష్టిస్తున్నారు. పట్టణాల్లో మద్యం కొనుగోలు చేసి శివారు ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడ రోడ్ల వెంట, చెట్ల వెంట కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ముఖ్యంగా వైన్స్లు పట్టణంలోని ప్రధాన రోడ్లలోనే ఉన్నాయి. అన్నింటికి సిట్టింగ్ రూమ్ల పర్మిషన్ కూడా ఉంది. కానీ సిట్టింగ్లన్నీ బార్లను తలపించేలా నిండిపోతున్నాయి. ఈ క్రమంలో కొందరు వాటిల్లో కూర్చోకుండా ప్రధాన రోడ్ల మీదకు వచ్చి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్నారు. మరికొన్ని చోట్ల రాత్రి 8 అయితే వైన్స్ల వద్ద ఉన్న రోడ్లపైనే నిలబడే మద్యం తాగేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ రోడ్డులోని ఒక వైన్స్లో సిట్టింగ్ ఉన్నప్పటికీ రాత్రి 9 గంటల తర్వాత రోడ్డు మీదకు వచ్చి బహిరంగంగా మద్యం తాగుతున్నారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న మరో 2 వైన్స్ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇళ్ల మధ్య వైన్స్లు, సిట్టింగ్లు ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, మహిళలు రాత్రి పూట బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఫ శివారు ప్రాంతాలు, పార్కులు, రోడ్లపై విచ్చలవిడిగా.. ఫ మద్యం మత్తులో కొందరి హల్చల్ ఫ ప్రజలకు తప్పని ఇబ్బందులు -
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి
నకిరేకల్ : గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు దివ్యాంగులకు 5 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోలి ప్రభాకర్ కోరారు. ఆదివారం నకిరేకల్ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో జరిగిన దివ్యాంగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 8 శాతం మంది దివ్యాంగులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో కృష్ణమాచారి, నరేందర్, వంటెపాక వెంకన్న, పుట్ట నాగమణి, మాధవి పాల్గొన్నారు. -
Nalgonda: రాపిడో రయ్ రయ్!
మనం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే బస్సులేదా ఆటో, సొంత వాహనం అవసరం. కానీ ఇప్పుడు రాపిడో యాప్లో బుక్ చేసుకుంటే వాహనం మన ముందుకొచ్చి ఆగుతుంది. గమ్య స్థానానికి చేర్చుతుంది. ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన ఇలాంటి బైక్ ట్యాక్సీ సర్వీసులు ఇప్పుడు జిల్లా కేంద్రాలకు విస్తరించాయి. వీటి రాకతో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం రాపిడో యాప్లో బైక్, ఆటో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతోంది. (నల్లగొండ), సూర్యాపేట టౌన్ : భువనగిరి టౌన్ ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, భువనగిరిలో ‘రాపిడో’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా పట్టణాల పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు రాపిడో యాప్ ద్వారా ఆటో, బైక్ బుక్ చేసుకుంటే చాలు మన ఇంటి దగ్గరకే ఆటో, బైక్ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటాయి. అందుకు ముందుగా మనం చేయవలసిందల్లా మన సెల్ఫోన్లోని ‘ప్లే స్టోర్’ నుంచి ‘రాపిడో’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం కొన్ని ఆప్షన్స్ పూరించాక అది మన సేవలకు సిద్ధమవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే యాప్ ఓపెన్ చేస్తే వెళ్లే లోకేషన్ అడుగుతుంది. దాన్ని పూరించాక, ప్రయాణ చార్జీని తెలుపుతుంది. మనకు సమ్మతమైతే వెంటనే ఓకే ఆప్షన్ నొక్కగానే వాహనం మన దగ్గరకు ఎన్ని నిమిషాల్లో చేరుకుంటుందో తెలియజేస్తుంది. వాహనం రాగానే మనల్ని పికప్ చేసుకుని, గమ్య స్థానానికి చేరుస్తుంది. ఇది పట్టణ ప్రజల రవాణా సౌకర్యార్థం, నిరుద్యోగుల ఉపాధికి బాసటగా నిలుస్తోంది.నల్లగొండలో 90 వాహనాలు⇒ నల్లగొండ పట్టణంలో రాపిడోలో 90 వరకు వాహనాలు నడుస్తున్నాయి. పట్టణం పరిధిలో ప్రస్తుతం కేశరాజుపల్లి, ఎస్ఎల్బీసీ, కతాల్గూడ, పానగల్లు, ఎంజీ యూనివర్సిటీ వరకు ఈ సేవలు కొనసాగుతున్నాయి. డిమాండ్ పెరిగితే ఇంకా విస్తరించే అవకాశం ఉంది.⇒ రాపిడో సర్వీసులు భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ పట్టణాల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. వీటి రాకతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైన సేవలు అందుతున్నాయి. యాదిరిగుట్ట నుంచి ఎయిమ్స్ వరకు ఆటో, బైక్ సెలవు అందుబాటులో రావడంతో పాటు, బీబీనగర్ ఎయిమ్స్ నుంచి కార్లు కూడా అందుబాటులో వచ్చాయి. ⇒ సూర్యాపేటలో ప్రస్తుతం రాపిడోలో 30 బైక్లు, 20 గాఆటో ట్యాక్సీలు నడిపిస్తున్నారు. గతంలో సూర్యాపేట పట్టణం పరిసర ప్రాంతాలు చుట్టూ ఆరు కిలోమీటర్ల వరకు రాపిడో ట్యాక్సీలు నడిపించారు. ఇప్పడు జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా ట్యాక్సీలు నడిస్తున్నారు. దీంతో ప్రయణికులు వారు వెళ్లే ప్రాంతానికి రాపిడో బుక్ చేసుకుంటున్నారు. యువతకు ఉపాధి అవకాశంరాపిడో యాప్ ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందుతోంది. ముఖ్యంగా చిన్నచిన్న ఉద్యోగాలు లేదా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే యువత పార్టైంగా రాపిడో యాప్ ద్వారా ప్రయాణికులను చేరవేసి ఆదాయం పొందుతోంది. ముందుగా యువత రాపిడో కెప్టెన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని వాహన వివరాలు, లైసెన్స్, మొబైల్ నంబర్లను పొందుపర్చాలి. ఎవరైతే ప్రయాణికుడిగా దగ్గరగా ఉంటారో వారికి మెసేజ్ వెళ్లడంతో క్షణాల్లో అక్కడి వెళ్లి ప్రయాణికుడిని గమ్యస్థలం చేరుస్తున్నారు. ఫుల్టైం పని చేసేవారు రోజుకు రూ.700 నుంచి రూ.1000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే వీరంతా ఆ డబ్బును వారంలో రెండుసార్లు మాత్రమే తమ ఖాతా నుంచి డ్రా చేసుకోవాల్సిరోజూ మూడు, నాలుగు రైడ్లునేను ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాను. నాకున్న బైక్ను రాపిడో యాప్లో యాడ్ చేశాను. నల్లగొండలో రోజూ మూడు నుంచి నాలుగు రైడ్లకు వెళ్తున్నా. ప్రస్తుతం రూ.200 నుంచి రూ.400 వరకు వస్తున్నాయి. రాపిడో సేవలు అందుబాటులో ఉన్నా చాలా మందికి తెలియకపోవడంతో సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. – రమేష్, రైడర్, నల్లగొండ -
సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి
నల్లగొండ : నీట్ రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం రామగిరి మహిళా డిగ్రీ కళాశాల, ఎంజీ యూనివర్సిటీలో పరీక్ష కేంద్రాలను ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీట్ పరీక్షకు మొత్తం 2087 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షరాసే అభ్యర్థులు ఉదయం 11 గంటలకు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రం ప్రధాన గేట్లను మూసివేస్తామని.. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. కలెక్టర్ వెంట ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాజ్కుమార్, అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, నీట్ నోడల్ ఆఫీసర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఉన్నారు. ఎంజీ యూనివర్సిటీలో రవాణా సౌకర్యం పరీక్షకు వచ్చే అభ్యర్థుల కోసం మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రధాన గేట్ నుంచి లోపల వరకు రవాణా సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రధాన గేటు నుంచి పరీక్ష కేంద్రాల వరకు దూరం ఎక్కువగా ఉన్నందున అభ్యర్థులు ఇబ్బంది పడకుండా వాహన సదుపాయం కల్పించాలమని పేర్కొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో విఫలం
నల్లగొండ టూటౌన్ : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. శనివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు సీనియర్ మంత్రులు ఉండి ఏ ఒక్క రోజు కూడా కొనుగోలు కేంద్రాలను సందర్శించలేదన్నారు. కుల గణన చేస్తామని ప్రధాని మోదీ ప్రకటిస్తే తెలంగాణను మోడల్గా తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఎన్నికల సమయంలోనే మంత్రి వెంకట్రెడ్డికి ఎస్ఎల్బీసీ గుర్తుకు వస్తుందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశాభివృద్ధిలో వాజ్పేయ్ పాత్ర కీలకం దేశాభివృద్ధిలో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయ్ కీలక పాత్ర పోషించారని ఎంపీ రఘునందన్రావు అన్నారు. వాజ్పేయ్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. అనంతరం వాజ్పేయిని కలిసిన జిల్లాకు చెందిన వ్యక్తులను ఘనంగా సన్మానించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, గోలి మధుసూదన్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్, వీరారెడ్డి, సాదినేని శ్రీనివాసరావు, పోతేపాక లింగస్వామి, వీరారెడ్డి, భాగ్యమ్మ, గడ్డం మహేష్, కాశమ్మ, రవి, తదితరులు పాల్గొన్నారు. ఫ మెదక్ ఎంపీ రఘునందన్రావు -
ప్రతిపాదనలు పకడ్బందీగా ఉండాలి
దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గంలో దర్తి ఆబ ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ప్రతిపాదనలు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయంలో దర్తీ ఆబ జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకానికి నియోజకవర్గంలో 29 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సివిల్ పనులపై ఎక్కువగా దృష్టి పెడతామని, పనులు శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపాదిత పనులకు ఈనెల 13లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు, అంగన్వాడీ, పంచాయతీరాజ్, వైద్యం, విద్య, గ్రామీణాభివృద్ధి ద్వారా పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ తండాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఆర్డీఓ రమణారెడ్డి, పంచాయితీరాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఎంపీడీఓ డానియల్, సుచరిత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రెండు రోజులు అలర్ట్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వచ్చే రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయయి. ఎండల తీవ్రత పెరగడంతోపాటు.. వచ్చే రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పగటి వేలల్లో బయటకు రావద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేశారు. మార్చిలోనే మొదలైన ఎండలు ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చిలోనే మొదలైన ఎండలు ఏప్రిల్ చివరి నాటికి అధికమయ్యాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని, అయితే ఆది, సోమవారం తర్వాత ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజలకు సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే టోపీ ధరించడం, తలకు తువాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, నీడ ప్రదేశాల్లో మాత్రమే ఉండాలని, ఎక్కువ మోతాదులో మంచినీరు, మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు చేసుకోవాలని చెప్పారు. ఉపాధి కూలీలు ఉదయమే పని చేయాలి ఉపాధి కూలీలు ఉదయం వేళల్లో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పని ప్రదేశంలో షామియానాలు ఏర్పాటు చేసుకోవాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ నివారణ ఔషధాలు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటివి గమనించాలని, శరీరంలో అధిక ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండిపోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఫ ఇప్పటికే 43 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు ఫ రానున్న రెండు రోజులు మరింత పెరగనున్న ఎండల తీవ్రత ఫ ఉరుములు, మెరుపులతో వర్షాలు కూడా కురుస్తాయంటున్న వాతావరణ శాఖ ఫ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న కలెక్టర్ శనివారం ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటిన గ్రామాలు ఇవే మండలం గ్రామం ఉష్ణోగ్రత దామరచర్ల దామరచర్ల 43.8మాడుగులపల్లి మాడుగులపల్లి 43.7దామరచర్ల తిమ్మాపూర్ 43.6మిర్యాలగూడ టేక్యాతండా 43.4త్రిపురారం మాటూరు 43.3అడవిదేవులపల్లి ముల్కచర్ల 43.2నార్కట్పల్లి నార్కట్పల్లి 43తిరుమలగిరిసాగర్ తిరుమలగిరిసాగర్ 43మోతె మామిళ్లగూడెం 43.1 -
బస్టాండ్లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ బస్టాండ్లల్లో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కొణతం జానిరెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడ ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. అనంతరం డిపోలోని సిబ్బంది పనితీరుతో పాటు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్లో ప్రస్తుతం మంచినీటి సమస్య లేదని, కొన్ని ఫ్యాన్లు తిరగడం లేదని వాటికి వెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు. బస్టాండ్లో ఉన్న కార్గో కేంద్రాన్ని బస్పాస్ కౌంటర్ వైపు మర్చేందుకు స్థలాన్ని పరిశీలించామన్నారు. ఆయన వెంట ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజయ్య, డిపో మేనేజర్ రామ్మోహన్రెడ్డి ఉన్నారు. అరుణాచలానికి ప్రత్యేక బస్సులురామగిరి(నల్లగొండ) : పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరిప్రదర్శన కోసం మే 10 తేదీ సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్లు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి తెలిపారు. రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్లే భక్తులకు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 92980 08888 ఫోన్ నంబర్ను, అన్ని సమీప బస్స్టేషన్లలో సంప్రదించవచ్చని తెలిపారు. డీటీసీ మోటార్ సైకిళ్ల తరలింపునల్లగొండ : జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో అన్క్లెయిమ్డ్, అబాన్డెడ్ వాహనాల కింద కేసులు నమోదైన 73 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రానికి (డీటీసీ) తరలించినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత వాహనాల యజమానులు పోలీస్స్టేషన్లో వారి వాహనాల డాక్యుమెంట్లు చూపించి తమ బైక్లను తీసుకెళ్లాలని తెలిపారు. లేకపోతే ఆరు నెలల కాల వ్యవధిలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి బహిరంగ వేలం వేస్తామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సూరప్పనాయుడు ఫోన్ నంబర్ను 8712670170 సంప్రదించాలని సూచించారు. తరగతుల పర్యవేక్షణనల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రిపరేషన్ కోసం నిర్వహిస్తున్న తరగతులను శనివారం ఇంటర్ బోర్డు అధికారి భీమ్సింగ్.. డీఐఈఓ దస్రూనాయక్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సుధారాణి, ధనరాజ్, హేమ్లానాయక్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారం ధాన్యం తేవాలి
మునుగోడు : రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధలన ప్రకారం తీసుకురావాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి సూచించారు. శనివారం మండలంలోని కొరటికల్, పలివెల, కిష్టాపురం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు తీసుకొచ్చే ధాన్యం 17శాతానికి మించి తేమ ఉండకూడదన్నారు. అలాగే ధాన్యంలో ఏమైనా తాలు ఉంటే తూరుపాలపట్టాలన్నారు. నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు పంపించి వారం రోజుల లోపే రైతులకు డబ్బులు అందేలా చొరవచూపాలని ఆదేశించారు. అంతేకాకుండా తూకంలో ఎలాంటి మోసాలకు పాల్పడకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు పరివేక్షించాలని సూచించారు. ఆయన వెంట ఏపీఎం మైశేశ్వర్రావు, సీసీలు శ్రీనివాస్, శంకర్, మల్లేశ్వరి, వీఓఏలు, కమిటీ సభ్యులు ఉన్నారు. -
వైద్యసేవలు మెరుగయ్యాయి..
కాన్పుల సంఖ్య పెంచాలి జిల్లాలోని అన్ని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. ఆ దిశగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని కేంద్రాల్లో వైద్యులకు, సిబ్బందికి ఆదేశాలను జారీ చేశాం. అన్ని కేంద్రాల్లో కాన్పుల సంఖ్య పెంచాలని సూచించాం. వైద్యసిబ్బందికి ప్రజలు కూడా సహకరించాలి. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగయ్యాయి. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన కలెక్టర్ అన్ని కేంద్రాల్లో సిబ్బంది పనితీరు మెరుగుపడాలని, నిత్యం ప్రజలకు అందుడాటులో ఉంటూ వైద్యసేవలను అందించాలని ఆదేశిస్తున్నారు. దీనికితోడు డీఎంహెచ్ఓ కూడా తనిఖీలు చేస్తూ వైద్యాధికారులతో నిత్యం సమీక్షలను నిర్వహిస్తున్నారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. వైద్యులు, సిబ్బంది పీహెచ్సీలకు వచ్చే రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వైద్యులు, సిబ్బంది పనితీరు మెరుగుపడింది. 24 గంటలు, 12 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులతోపాటుగా ఏఎన్ఎంలు, ఇతర సిబ్బంది ఉదయం 9గంటలకే కేంద్రాలకు చేరుకుని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గతం కంటే సేవలు మెరుగు.. గతంలో కొన్ని కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా గైర్హాజరు కావడం, సమయపాలన పాటించకపోవడంతో సరైన వైద్యం ప్రజలకు అందని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓలు ప్రత్యేక దృష్టిసారించడంతో పరిస్థితి దానికి భిన్నంగా మారింది. కలెక్టర్ నిరంతర తనిఖీలతో వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పు వచ్చింది. దీంతో సకాలంలో విధులకు హాజరవుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో ప్రసవాలు, ఏఎన్సీ నమోదు, ఓపి సేవలు, రక్త పరీక్షలు గణనీయంగా పెరిగాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా అన్ని కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతోంది. మొత్తం మీద అధికారులు పరుగులు పెడుతూ వైద్యులను సిబ్బందిని పరుగులు పెట్టిస్తుండడంతో అన్ని ప్రాథధమిక ఆరోగ్య కేంద్రాల్లోలో వైద్యసేవలు మెరుగయ్యాయి. ఈ చిత్రం మునుగోడు పీహెచ్సీలో మందుల కోసం క్యూకట్టిన జనం. ఈ పీహెచ్సీలో గతేడాది మార్చిలో 3,200 మందికి ఓపీ సేవలు అందించారు. ఇద్దరు మహిళలకు డెలివరీ చేశారు. 120 ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు కాగా, 150 మంది నుంచి బ్లడ్శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ ఏడాది మార్చి నెలలో 3,756 మందికి అవుట్ పేషెంట్లకు సేవలను అందించారు. ముగ్గురికి డెలివరీలు చేయగా 180 మందికి ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు చేశారు. 224 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్కు పంపించినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబతున్నాయి. ఇలా జిల్లాలోని పీహెచ్సీల్లో వైద్యసేవలు మెరుగుపడ్డాయి. ఫ ప్రజారోగ్యంపై కలెక్టర్ ప్రత్యేక ఫోకస్ ఫ ఆస్పత్రుల్లో తనిఖీలు.. వైద్యులతో సమీక్షలు ఫ మారుతున్న సిబ్బంది తీరు -
ఉపాధి సిబ్బంది వేతన వెతలు
ఉద్యోగుల వినతులు సకాలంలో వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని గురువారం ఉపాధి హామీ పనుల పరిశీలనకు వచ్చిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజనకు ఉద్యోగులంతా వినతిపత్రం సమర్పించారు. నాలుగు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నామని వేతనాలు ఇప్పించాలని కోరారు. అంతకుముందే కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చి.. వేతనాలు ఇవ్వకపోతే విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండ : ఉపాధి హామీ పథకం(ఈజీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. సంవత్సర కాలంగా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈజీఎస్ పనుల నిర్వహణకు సంబంధించి కరెంట్ బిల్లులు, నెట్ బిల్లులు, ఇతర ప్రింటింగ్ ఖర్చులతో పాటు ఎంపీడీఓ వాహనాల బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఈజీఎస్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీఆర్డీఓకు కూడా వేతనం అందలేదు. డీఆర్డీఏలో సెర్ప్, ఎన్ఆర్ఈజీఎస్ రెండు కళ్లు లాంటివని చెబుతున్న ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తూ ప్రతి నెల వేతనాలు ఇస్తోంది. కానీ ఎన్ఆర్ఈజీఎస్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం వేతనాలు సకాలంలో ఇవ్వడంల లేదు. ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపుతుందని ఉపాధి హామీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనుల్లో 6 శాతం అడ్మిన్ ఖర్చులకు.. ప్రతి సంవత్సరం ఉపాధి హామీలో చేపట్టిన పనులకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో 6 శాతం అడ్మిన్ ఖర్చు కింద కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ డబ్బుతోనే ఎంపీడీఓల వాహనాలు, నెట్ బిల్లు, కరెంట్ బిల్లుతో పాటు కార్యాలయ నిర్వహణ మండల, జిల్లా, గ్రామ స్థాయిలో ఈజీఎస్ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 2024–25లో ఉపాధి హామీ కింద జిల్లాలో పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేశారు. దాదాపు రూ.1200 కోట్ల వరకు ప్రతిపాదనలు పంపారు. అందులో 90 శాతం పైచిలుకు పనులు కూడా చేపట్టారు. అయితే ఇందులో ఆరు శాతం నిధులు ఈజేఎస్ నిర్వహణ, వేతనాల కోసం కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు వేతనాలు మాత్రం చెల్లించలేదు. ఫ నాలుగు మాసాలుగా అందని జీతాలు ఫ ఏడాదిగా విడుదలకాని వాహనాలు, కరెంట్, నెట్ బిల్లులు ఫ వేతనాలివ్వాలని అధికారులకు వినతులు ఉపాధి హామీ సిబ్బంది ఇలా.. ఏపీడీలు 3 ఈసీలు 28 ఏపీఓలు 27 పీల్డ్ అసిస్టెంట్లు 640 కంప్యూటర్ ఆపరేటర్లు 68 -
ఇళ్ల నిర్మాణంపై శ్రద్ధ చూపాలి
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాలకు కనీసం 500 ఇళ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాబితాలో ఎవరైనా అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేస్తామన్నారు. లిస్ట్–1, లిస్ట్–2, లిస్ట్–3 లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలన్నారు. పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 31వ తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్కుమార్, అదనపు ఎస్పీ రమేష్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మన దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు
రజాకార్ సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ, ‘యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ డాక్యుమెంటరీ దర్శకుడు విజయ్కుమార్ను వరించిన పురస్కారంచిట్యాల, భూదాన్పోచంపల్లి : ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సినీ దర్శకులు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. చిట్యాల పట్టణానికి చెందిన యాట సత్యనారాయణ, భూదాన్పోచంపల్లికి చెందిన బడుగు విజయ్కుమార్లకు ఈ పురస్కారం దక్కింది. తెలంగాణలో జరిగిన రజాకార్ల దుశ్చర్యలపై, సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటంపై రూపొందిన చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భువనగిరి చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. మొదటిసారి దర్శకత్వం వహించిన వారి కేటగిరీలో యాట సత్యనారాయణ ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. అదేవిధంగా స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్కుమార్ ‘యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ దర్శకుడి కేటగిరీలో దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే15వ ఫిల్మ్ ఫెస్టివల్లో 200 చిత్రాలను ప్రదర్శించగా 25 చిత్రాలు వివిధ కేటగిరీలలో పురస్కారానికి ఎంపికయ్యాయి. అందులో ఉత్తమ దర్శకులుగా యాట సత్యనారాయణ, బడుగు విజయ్కుమార్ ఎంపికయ్యారు. యా ట సత్యనారాయణ గురువారం రాత్రి జరిగిన ఫి ల్మ్ ఫెస్టివల్లోనే పురస్కారం అందుకోగా.. బడు గు విజయ్కుమార్ శనివారం అందుకోనున్నారు. -
ఎనిమిది మంది వైద్యులపై కలెక్టర్కు నివేదిక
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని ఈ నెల 1న సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో విధులకు గైర్హాజరైన ఎనిమిది మంది వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పూర్తి నివేదికను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందించారు. ఆస్పత్రిని తనిఖీ చేసే సమయంలో డాక్టర్లు స్పందన, భానుప్రసాద్, వీరజ, ప్రజ్ఞరెడ్డి, ప్రసూన, రోహిత్, సంతోష్కుమార్, విజయ్కుమార్ విధులు రాలేదు. వీరు విధులకు సరిగా హాజరుకాకపోవడంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు వారికోసం వేచి ఉన్నట్లు గుర్తించామని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ నివేదికలో పేర్కొన్నారు. కులగణన చరిత్రాత్మక నిర్ణయంనల్లగొండ టూటౌన్ : బీసీ కులగణన చేపట్టాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పూలే విగ్రహం వద్ద ప్రధానమంత్రి మోదీ ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పిట్టల శ్రీనివాస్, ఏరుకొండ హరి, కనకయ్య, మిరియాల యాదగిరి, ఆవుల మధు, కోటి, శేఖర్, చింత ముత్యాల్రావు, పబ్బు నరేందర్, వెంకటేశ్వర్లు, పిన్నింటి నరేందర్రెడ్డి, గడ్డం మహేష్, పకీరు మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాభారతి నిర్మించాలి రామగిరి(నల్లగొండ): జిల్లా కేంద్రంలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కళాభారతి నిర్మాణం వెంటనే చేపట్టాలని నల్లగొండకు చెందిన పలువురు కవులు, కళాకారులు సామాజికవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నల్లగొండలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సాహితీ మేఖల జిల్లా అధ్యక్షుడు పున్న అంజయ్య, కోమలి కళా సమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య మాట్లాడుతూ కళాభారతి నిర్మాణం కోసం గత ప్రభుత్వం కళాభారతి కోసం రూ.90 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ తండు కష్ణ కౌండిన్య, ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు బండారు శంకర్, కవితా దోస్తాన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ప్రముఖ కథా రచయిత శీలం భద్రయ్య, సామాజికవేత్తలు పన్నాల గోపాల్ రెడ్డి, భీమార్జున్ రెడ్డి సాహిత్య నాట్యమండలి అధ్యక్షుడు రంగనాయకులు, జనరంజని కళావాహిని అధ్యక్షుడు గజవెల్లి సత్యం కవులు డాక్టర్ సాగర్ల సత్తయ్య, శీలం భద్రయ్య, కోమటి మధుసూదన్, రావిరాల అంజయ్య, కళాకారులు రఘు, ఏం లక్ష్మీనరసింహారావు, భాస్కర్, రమేష్, గంటెకంపు గణేశ్ పాల్గొన్నారు. -
నీట్ పరీక్షకు ఏడు కేంద్రాలు
నల్లగొండ : నీట్ పరీక్షకు జిల్లా కేంద్రంలోని ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నీట్పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నాలుగు కేంద్రాలు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో, ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, కేంద్రియ విద్యాలయంలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 2087 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమన్నారు. పెన్ను కూడా కేంద్రంలోనే ఇస్తారు.. నీట్ రాసే విద్యార్థులు పెన్ను కూడా పరీక్ష కేంద్రంలోనే ఇస్తారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఆభరణాలు, భారీ దుస్తులు, బూట్లు వేసుకుని రావొద్దని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, జామెట్రి బాక్సులు, మొబైల్స్, బ్లూటూత్, వాలెట్, రిస్ట్వాచ్, కెమెరా, బెల్ట్, గగూల్స్, ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్, రైటింగ్ ప్యాడ్, లాగ్ టేబుల్, కాలిక్యులేటర్ వంటివి పరీక్ష కేంద్రంలోని అనుమతించమని తెలిపారు. అభ్యర్థులు ఇటీవల దిగిన కలర్ పాస్ పోర్ట్సైజ్ ఫొటో ఒకటి, పోస్టుకార్డు సైజ్ కలర్ ఫొటో, గుర్తింపు కోసం డ్రైవింగ్లైసెన్స్, ఆధార్కార్డు, కళాశాల జారీ చేసిన గుర్తింపుకార్డు, ఇతర ఏదేని గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. ఏర్పాట్లు పూర్తి చేశాం నీట్ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని తెలిపారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్కుమార్, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫ నిమిషం ఆలస్యమైనా అనుమతించం ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మధుసూదన్రెడ్డి.. నా ఆత్మీయుడు
నల్లగొండ : కష్ట, సుఖాల్లో నా వెన్నంటి ఉన్న ఏదుళ్ల మధుసూదన్రెడ్డి నాకు ఆత్మీయుడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన మధుసూదన్రెడ్డి ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభలో మంత్రి మాట్లాడారు. మధుసూదన్రెడ్డితో తన అనుబంధం 30 ఏళ్లు అని, ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం తన వెన్నంటి ఉన్నాడని పేర్కొన్నారు. తన వ్యక్తిగత సహాయకుడిగా రోజూ వందలాదిమంది సమస్యలను ఓపికతో విని తన దృష్టికి తీసుకొచ్చేవాడన్నారు. ఉద్యోగిగా పదవి విరమణ పొందినా.. తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు మధుసూదన్రెడ్డి తనకు అండగా ఉంటాడని పేర్కొన్నారు. అనంతరం మధుసూదన్ రెడ్డి–జ్యోతి దంపతులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, ఆర్డీఓ అశోక్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, అబ్బగోని రమేష్గౌడ్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మధుసూదన్రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి పాల్గొన్నారు. ఫ అన్ని వేళలా నా వెన్నంటి ఉన్నాడు ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
‘హస్తం’లో సంస్థాగతం
గ్రామ, మండల, బ్లాక్, జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే సమన్వయకర్తలను టీపీసీసీ నియమించింది. గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కోసం పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశాలు ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. ఇందులో బ్లాక్ అధ్యక్షుల ఎంపికపై సమన్వయకర్తలు పార్టీ నేతలతో చర్చించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశాలను ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి పేర్లపై ఆ సమావేశాల్లో చర్చిస్తారు. ఆ తర్వాత 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండల స్థాయి నాయకుల సమావేశాలను నిర్వహించి గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి పేర్లపై చర్చిస్తారు. జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ముగ్గురి పేర్లను, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఐదుగురి పేర్లను పార్టీ అధిష్ఠానానికి ప్రతిపాదించనున్నారు. అయితే, గ్రామ పార్టీ అధ్యక్షులను మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చర్యలు చేపట్టనున్నారు. రెండు జిల్లాల్లో ఆశావహులు ఎక్కువే.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతల్లో ఎక్కువే ఉన్నారు. ప్రస్తుత నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, రాష్ట్ర నేతలు కొండేటి మల్లయ్య, పున్నా కై లాస్నేత, చనగాని దయాకర్ పేర్లు పదవి ఆశిస్తున్న వారి జాబితాలో ప్రధానంగా ఉన్నాయి. ఈ నలుగురు నేతల అనుచరులు మాత్రం తమ నాయకుడికే పదవి ఇవ్వాలని ఎవరికివారు కోరుతున్నారు. మరోవైపు.. పార్టీలు మారిన వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తోంది. సూర్యాపేట జిల్లాలోనూ అధ్యక్ష పదవి కోసం ఐదుగురు నేతలు పోటీపడుతున్నారు. జిల్లాలో సీనియర్ నేతలతో పాటు రాష్ట్రస్థాయి పదవులు కలిగిన నేతలు కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. అందులో చకిలం రాజేశ్వర్రావు, తండు శ్రీనివాస్ యాదవ్, అన్నెపర్తి జ్ఞానసుందర్, ప్రస్తుత అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ ఉండగా.. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి కూడా డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. డీసీసీ పీఠం ఎవరికో... ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఈసారి జిల్లా అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. నల్లగొండ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షుడు శంకర్నాయక్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. పీసీసీ నియమించిన ఇద్దరు సమన్వయకర్తలైన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, మరో నేత నజీర్ అహ్మద్, సూర్యాపేట జిల్లా సమన్వయకర్త ఎమ్మెల్యే మురళినాయక్ ఇటీవల జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి గురించి పూర్తి వివరాలు సేకరించారు. ఆ జాబితాను టీపీసీసీకి పంపించనున్నారు. ఫ ఇప్పటికే సమన్వయకర్తలను నియమించిన టీపీసీసీ ఫ వారి ఆధ్వర్యంలోనే జిల్లా స్థాయి సమావేశాల నిర్వహణ ఫ డీసీసీ అధ్యక్ష పదవికి ముగ్గురి పేర్లు ప్రతిపాదన ఫ పోటీలో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ఫ 20వ తేదీ వరకు పూర్తికానున్న సంస్థాగత ఎన్నికల ప్రక్రియ -
పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగించాలి
రామగిరి(నల్లగొండ): పాలిసెట్–2025 దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించాలని పాలిటెక్నిక్ ఎస్సీ, ఎస్టీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ కోరారు. పాలిసెట్ దరఖాస్తులకు లేట్ ఫీజుతో ఏప్రిల్ 21 చివరి తేదీ గా నిర్ణయించి.. టెన్త్ ఫలితాలు ఇటీవలే విడుదలవడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. మే 13న ఎంట్రెన్స్ ఉన్నందున గడువు పొడిగించి మరింతమంది విద్యార్థులు పరీక్ష రాసేలా చూడాలని అధికారులను కోరారు.20వరకు ప్రక్రియ పూర్తికాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సమన్వయకర్తలు ఈ నెల 20వ తేదీ వరకు పూర్తిచేయాల్సి ఉంది. గ్రామ కమిటీలు, మండల కమిటీలతోపాటు బ్లాక్ కమిటీలను కూడా.. సమావేశాలు నిర్వహించి జాబితాలను టీపీసీసీకి పంపించాల్సి ఉంటుంది. ఈసారి పార్టీ విధేయులకే పదవులు దక్కుతాయని టీపీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఎల్కతుర్తి సభతో కాంగ్రెస్ నేతల్లో వణుకు: మాజీ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండ టూటౌన్: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతల్లో వణుకు పుడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నివాసంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందన్నారు. శాసనసభ నిబంధనలను గాలికి వదిలేసి బూతులు మాట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పాలకులకే దక్కిందన్నారు. గత పదేళ్లలో ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధిపై ప్రజల్లోనే చర్చకు పెడుదామని, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, ఎన్.భాస్కర్రావు తదితరులు ఉన్నారు. -
కాలుష్య రహిత చెరువులుగా మార్చాలి
క్యాంపస్ సమాచారంనల్లగొండ టూటౌన్: నానో పార్టికల్స్ సహాయంలో నీటిలోని పెస్టిసైడ్స్ను తొలగించి నీటిని కాలుష్యరహితంగా మార్చి చెరువుల్లో ఉండే జీవరాశులను కాపాడేందుకు కృషి చేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో రీసెర్చ్ స్కాలర్ వి.శ్రీధర్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై. ప్రశాంతి ఆధ్వర్యంలో ‘కిటాలసిస్ అండ్ బయోలాజికల్ అప్లికేషన్స్ ఆఫ్ మెటల్ ఆకై ్సడ్ నానో పార్టికల్స్’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు. పీహెచ్డీ పూర్తి చేసిన శ్రీధర్ను వీసీ చాంబర్లో వీసీ, రిజిస్ట్రార్ అల్వాల రవి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వసంత, రూప, రమేష్, జ్యోతి, కళ్యాణి, శ్రీధర్రావు, శంకరాచారి, అమరేందర్, తిరుపతి, అభిలాష, శ్వేత, మహతి, పరిమళ తదితరులు పాల్గొన్నారు. బీఈడీ ఒకటవ, మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూ నివర్సిటీ పరిధిలో బీఈడీ ఒకటవ, మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ గురువారం విడుదల చేశారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చామని, విద్యార్థులు వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సీఓఈ డాక్టర్ ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ శాసీ్త్రయ సదస్సుకు ఎంపిక నల్లగొండ టూటౌన్: నానో సాంకేతికత, జీవరసాయన శాస్త్ర పరిశోధనల్లో విశేష కృషి చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం. రాంచందర్గౌడ్ మలేషియాలో జూన్లో జరిగే అంతర్జాతీయ శాసీ్త్రయ సదస్సుకు ఎంపికయ్యారు. ‘నానోకణాలు, జీవ అణువుల మధ్య జీవ భౌతిక పరస్పర చర్యలు’ అనే అంశంపై రాంచందర్గౌడ్ రచించిన పరిశోధనా వ్యాసాన్ని ఈ సదస్సులో పాల్గొని వివరించనున్నారు. ఆయన పరిశోధనలు మానవ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే దిశగా, నూతన ఆవిష్కరణలకు దోహదపడేలా ఉన్నట్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లు తెలిపారు. రాంచందర్గౌడ్కు వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి అభినందనలు తెలియజేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్
నల్లగొండ: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను నల్లగొండ వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు గురువారం నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ చౌరస్తా వద్ద అరెస్ట్ చేశారు. వన్ టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడకు చెందిన ధర్మాడి దుర్గాప్రసాద్, కాకినాడ జిల్లా తడలరేవు మండలం గాడిమొగ్గ గ్రామానికి చెందిన పాసిల సత్యనారాయణ, అదే గ్రామానికి చెందిన కామాడి శ్రీనివాస్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. వీరు 2024 అక్టోబర్లో కాకినాడ నుంచి రైలులో నల్లగొండకు వచ్చి పట్టణంలోని అల్కాపురి కాలనీకి చెందిన పాశం జనార్దన్రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడి 2 బంగారు చైన్లు, రూ.40వేలు నగదు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా 2024 డిసెంబర్లో నల్లగొండ పట్టణంలోని మహిళా ప్రాంగణం వద్ద నివాసముంటున్న బోయిని కరుణాకర్ ఇంటి ముందు పార్కింగ్ చేసిన పల్సర్ బైక్ను దొంగిలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దొంగిలించిన పల్సర్ బైక్పై కాకినాడ నుంచి నల్లగొండకు వచ్చి అక్కలాయిగూడెం ప్రాంతంలో నివాసముంటున్న జెట్టి నాగరాజు ఇంట్లో 12 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి కాళ్ల కడియాలు, రూ.1,25,000 నగదు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరిలో పాసిల సత్యనారాయణ, కామాడి శ్రీనివాస్ను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 గ్రాముల బంగారు గొలుసు, పల్సర్ బైక్, 50 తులాల వెండి కాళ్ల కడియాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ధర్మాడి దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ధర్మాడి దుర్గాప్రసాద్పై 50 చోరీ కేసులు, పాసిల సత్యనారాయణ మీద 16 చోరీ కేసులు, కామాడి శ్రీనివాస్పై 3 కేసులు తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల పరిధిలో నమోదైనట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకున్న సీసీఎస్ సీఐ డానియల్ కుమార్, ఎస్ఐ శివకుమార్, సిబ్బంది విష్ణు, నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ గోపాల్రావు, హెడ్కానిస్టేబుల్ శివరామకృష్ణ, శ్రీకాంత్, అంజాద్, గాంధీని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు. -
1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత
నాగార్జునసాగర్: బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ఈ నెల 12న నాగార్జునసాగర్ సందర్శనకు ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో 1200 నుంచి 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్లీ జోన్–2 ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన నాగార్జునసాగర్లోని విజయ్విహార్ అతిథి గృహం, బుద్ధవనాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ను 30 నుంచి 40 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ బృందం ముందుగా విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని అక్కడి నుంచి బుద్ధవనం సందర్శనకు వెళ్తారని పేర్కొన్నారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేసి జాతకవనంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. సుమారు మూడున్నర గంటల పాటు మిస్ వరల్డ్ పోటీదారులు సాగర్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా నిరసనలకు దిగి ఈ పర్యటనకు అంతరాయం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్ఐలు సంపత్, వీరబాబు, వీరశేఖర్, సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ -
కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలి
● రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజనచిట్యాల: ఉపాధి హామీ కూలీలకు రోజువారీగా వేతనం గిట్టుబాటు అయ్యేలా అధికారులు పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని తిరులనాథస్వామి ఆలయ గుట్టపై ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కందకం తవ్వకం పనులు, వన నర్సరీలను గురువారం ఆమె జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు, రోజుకు వస్తున్న వేతన వివరాలు, సమస్యలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నర్సరీల్లో నీడనిచ్చే, పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో తాము సొంత డబ్బులతో పనులు చేయాల్సి వస్తోందని ఆమెకు పలువురు కార్యదర్శులు వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్కుమార్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీపీఓ వెంకయ్య, తహసీల్దార్ క్రిష్ణనాయక్, ఎంపీడీఓ జయలక్ష్మీ, ఏపీఓ శ్రీలత, ఉపాధి సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు. ఉపాధి పనులను నిర్లక్ష్యం చేయొద్దు నార్కట్పల్లి: ఉపాధి హామీ పనులను నిర్లక్ష్యం చేయకుండా పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అన్నారు. నార్కట్పల్లిలో ఉపాధి పనులు, కంపోస్ట్ షెడ్, బ్రాహ్మణ వెల్లంలలో బృహత్ పల్లె ప్రకృతి వనం, మాదవ ఎడవల్లిలో పామ్పాండ్ పనులను గురువారం ఆమె పరిశీలించారు. అడిషనల్ పీడీ నవీన్, ఎంపీడీఓ ఉమేష్, ఎంపీఓ సుధాకర్, ఏపీఓ యాదయ్య, కార్యదర్శులు ఉన్నారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్యమర్రిగూడ : ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రా మంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. శివన్నగూడ గ్రామానికి చెందిన ఐతరాజు సత్తయ్య, రాములమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. రెండో కుమారుడు ఐతరాజు మహేష్(32) మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మహేష్ తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మహేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాణి, కుమార్తె ఉంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి తెలిపారు. -
బరిసె మెడపై కోసుకుపోయి వ్యక్తి దుర్మరణం
దంతాలపల్లి: ప్రమాదవశాత్తు పామాయిల్ చెట్టును చెక్కే బరిసె గొంతుకు కోసుకుపోయి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఏనకుంటతండా గ్రామానికి చెందిన బానోత్ రమేశ్(40) తన భార్య సునీతతో కలిసి గురువారం ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం వచ్చారు. ఆ గ్రామానికి చెందిన పెల్లి దామోదర్రెడ్డి తన పామాయిల్ తోటలో పనిచేయడానికి బరిసెను పదును పెట్టించుకుని ద్విచక్ర వాహనంపై పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నాడు. గ్రామ సమీపంలో రెండు బైక్లు ఎదురుపడ్డాయి. ఎదురుగా వస్తున్న రమేశ్(40) గొంతుకు బరిసె కోసుకుపోవడంతో బైక్ పైనుంచి పడిపోయాడు. తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని రమేశ్ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రమేశ్కు ఇద్దరు కుమార్తెలు దీప్తి, దీపిక ఉన్నారు. మృతదేహంతో ఆందోళన రమేశ్ మృతి విషయం తెలుసుకున్న తండావాసులు మృతదేహాన్ని దామోదర్రెడ్డి ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. తొర్రూరు సీఐ గణేష్, దంతాలపల్లి ఎస్ఐ, నర్సింహులపేట ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల్లో సామాజిక నేపథ్యాల కారణంగా కులాల రిజర్వేషన్ అమల్లో ఉందని, ఈ అంతరాన్ని ఎలా తొలగిస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. ముందుగా కుల గణన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. గురువారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన అమలు చేస్తామని హామీనిచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల విషయంలో సవతి తల్లి ప్రేమను చూపుతోందన్నారు. సోనియా లేకుండా తెలంగాణ వచ్చేది కాదు..తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం అర్థరహితమన్నారు. కేసీఆర్ స్వయంగా ఎన్నోసార్లు సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ పోరాటాన్ని కూడా కాదనలేమన్నారు. అందుకే ప్రజలు పదేళ్లు అధికారాన్ని కూడా ఇచ్చారన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో కేసీఆర్ పాత్ర, సోనియాగాంధీ పాత్ర, సుష్మా స్వరాజ్ పాత్రను విస్మరించలేమన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తవుతుంది..ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి అనుమానం వద్దని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిల ఆధ్వర్యంలో పూర్తవుతుందన్నారు. టన్నెల్ ప్రమాదం వల్ల కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని కానీ, ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిపుణులు ఏవిధంగా పూర్తి చేయాలనేది చెప్పాల్సి ఉందన్నారు. వెలుపలి నుంచి ప్రాజెక్టు చేపడితే పర్యావరణ అనుమతులు అవసరం కాబట్టి కేంద్ర సహకారం కూడా ప్రాజెక్టు పూర్తి అవసరం ఉందని గుత్తా చెప్పుకొచ్చారు. ఏఎమ్మార్పీ కాలువ పెంచాలి..ఏఎమ్మార్పీ హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ.442 కోట్లు ఇచ్చిందని సుఖేందర్రెడ్డి చెప్పారు. కెనాల్లో 4వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుందని, లైనింగ్ పనులు పూర్తయితే పెరుగుతుందన్నారు. కాబట్టి కాలువును రెండు మీటర్ల వెడల్పు పెంచి లైనింగ్ పనులు చేస్తే మేలు జరుగుతుందని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ ఆలోచించాలన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ అనడం సరైంది కాదు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలిపాకిస్తాన్తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రథమ కర్తవ్యమని సుఖేందర్రెడ్డి అన్నారు. పాకిస్తాన్ తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులను అప్పగిస్తే కొంతవరకు ఉద్రిక్తతను అరికట్టవచ్చన్నారు. పాకిస్తాన్ మంత్రుల ప్రకటనలను చూస్తే పరిష్కారం దిశగా లేవని కవింపు చర్యలుగా ఉన్నాయని గుత్తా పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి, ఉగ్రవాద దేశంగా పేరుపడిన పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటే తన చావును తాను కొని తెచ్చుకోవడమేనని అన్నారు. -
‘మట్టికాళ్ల ముట్టడి’ పుస్తకావిష్కరణ
మిర్యాలగూడ: ప్రముఖ కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కస్తూరి ప్రభాకర్ పదవీ విరమణ సందర్భంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రాసిన ‘మట్టికాళ్ల ముట్టడి’ పుస్తకంతో పాటు మధనం, ప్రభాకర చలనం పుస్తకాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్నాయక్, గోరేటి వెంకన్న, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ తదితరులు ఆవిష్కరించారు. ప్రభాకర్ కవిగా, రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అనేక సేవలు అందించారని, ఉద్యోగ విరమణ తర్వాత కూడా తన సేవలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, ప్రముఖ కార్టూనిస్ట్ నర్సింహ, మాజీ జెడ్పీ చైర్మన్ సీడీ. రవికుమార్, మానవ హక్కుల వేదిక నాయకుడు పి. సుబ్బారావు, భువనగిరి ఎంఈఓ నాగవర్ధన్రెడ్డి, సాహితీవేత్తలు ఉప్పల పద్మ, పెరుమాళ్ల ఆనంద్, సాగర్ల సత్తయ్య, పందుల సైదులు, నాయకులు నూకల వేణుగోపాల్రెడ్డి, చిలుకూరు బాలు తదితరులు పాల్గొన్నారు. -
సుందరీమణుల రాక కోసం..
భూదాన్పోచంపల్లి: హైదరాబాద్ వేదికగా ఈ నెల 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు పోచంపల్లితో పాటు నాగార్జునసాగర్ను సందర్శించనున్నారు. వారి రాక కోసం సాగర్లోని బుద్ధవనం, పోచంపల్లిలోని టూరిజం పార్కు తదిత పర్యాటక ప్రాంతాలను అధికారుల ప్రత్యేంగా ముస్తాబు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 140 దేశాలకు చెందిన సుందరీమణులను బృందాలుగా విభజించి తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన వారసత్వ ప్రదేశాలు, దేవాలయాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించే విధంగా అధికారులు రూట్మ్యాప్ తయారు చేశారు. అందులో భాగంగానే ఈ నెల 15న సుమారు 40దేశాలకు చెందిన అందాల భామల బృందం పోచంపల్లిని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా ఇక్కడి టూరిజం పార్కులోని ఇంటీయర్తో పాటు బయటి ప్రాంగణమంతా రంగులు వేస్తూ సుందరీకరణ చేస్తున్నారు. మ్యూజియం, హాప్లి థియేటర్, గెస్ట్ రూంలను అందంగా అలంకరిస్తున్నారు. చేనేత సంస్కృతి ఉట్టిపడేలా.. పోచంపల్లికి వచ్చే అందాల భామలకు చేనేత థీమ్ ప్రతిబించేలా అధికారులు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. పది రోజుల క్రితం అప్పటి పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించి అధికారులకు, ఈవెంట్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అందుకనుగుణంగా చేనేత మ్యూజియంలోని గోడలకు పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట, గద్వాల వస్త్రాలతో అలంకరించనున్నారు. అంతేకాక టూరిజం ప్రాంగణంలో ఆయా చేనేత వస్త్రాల తయారీ విధానాలను లైవ్ డెమాన్స్ట్రేషన్తో పాటు చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక మహిళలచే అందాల భామలకు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హాంప్లి థియేటర్ వద్ద నిర్వహించే చేనేత కార్మికుల ముఖాముఖి కార్యక్రమంలో కనీసం మూడు వందల మంది స్థానికులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే స్థానిక యువతులచే చేనేత ఇక్కత్ వస్త్రాలను ధరించి ర్యాంప్వాక్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు గంటల పాటు ప్రోగ్రాం.. 15వ తేదీ ఉదయం యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం సుందరీమణులు సాయంత్రం పోచంపల్లికి వస్తారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఇక్కడ సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల వరకు కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. వారం క్రితం టూరిజం అధికారులు యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి రూట్లలో టూరిజం బస్సులను నడిపి రోడ్డు మార్గం ఎలా ఉందని ట్రయల్ రన్ నిర్వహించారు. ముస్తాబవుతున్న సాగర్లోని బుద్ధవనం, పోచంపల్లిలోని టూరిజం పార్కు చేనేత థీమ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్న అధికారులుసుందరంగా బుద్ధవనం నాగార్జునసాగర్: మరో అందాల భామల బృందం ఈ నెల 12న బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని నాగార్జునసాగర్ను సందర్శించనున్నారు. ఇందు కోసం గత నెల రోజులుగా సాగర్ తీరాన గల విజయవిహార్ అతిథి గృహం, బుద్దవనంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుద్ధవనంలో పచ్చదనంతో కూడిన ప్రకృతి అందాలు ఇనుమడింపజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుద్ధవనం ప్రవేశ ద్వారం నుంచి మహాస్థూపం వరకు విద్యుత్ వెలుగులతో చూపరులను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. తపోవనం, స్థూపవనం, జాతక మార్పు తదితర ప్రదేశాలను అన్నింటిని పరిశుభ్రం చేశారు. విదేశీయులు కాసేపు సేదతీరేలా విజయవిహార్ను ఆధునీకరిస్తున్నారు. ఏర్పాట్లను చూసేందుకు వారానికి ఓమారు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం ఐజీ, జిల్లా ఎస్పీతో కలిసి సాగర్ను సందర్శించారు. -
తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో ఉద్రిక్తత!
గుంటూరు, సాక్షి: తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను తెలంగాణ అధికారులు ఆపేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణ అధికారుల చర్యతో.. పల్నాడు జిల్లా తంగెడ వద్ద కృష్ణానది వారధిపై భారీ స్థాయిలో ధాన్యం లారీలు ఆగిపోయాయి. తమను అనుమతించాలంటూ బ్రిడ్జిపై అడ్డంగా లారీలు పెట్టి ఆంధ్రా లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రతిగా తెలంగాణ నుంచి వస్తున్న లారీలను సైతం వాళ్లు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో నాలుగు గంటలుకు పైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాడపల్లి బ్రిడ్జి వద్ద ఐదు లారీలను పోలీసులు అదుపులోకి తీసుకుని సీజ్ చేయడం, అందుకు కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పడమే ఈ మొత్తం పర్యవసనానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతలపై ఇరు రాష్ట్రాల అధికారులు స్పందించాల్సి ఉంది. -
ఏదుళ్ల మధుసూదన్రెడ్డికి సన్మానం
నల్లగొండ: డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తూ బుధవారం పదవీ విరమణ పొందిన ఏదుళ్ల మధుసూదన్రెడ్డిని డీఈఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు డీఈఓ భిక్షపతి సన్మాన పత్రం అందజేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ిపీఏగానూ సేవలు అందించిన ఏదుళ్ల మధుసూదన్రెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని అన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో ఉండాలని డీఈఓ ఆకాంక్షించారు. డీఈఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఏదుళ్ల మధుసూదన్రెడ్డి, జ్యోతి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, విద్యాశాఖ ఏడీ రమాచారి, ఏసీజీఈ యూసుఫ్ షరీఫ్, ఏఎంఓ రామచంద్రయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సత్తెమ్మ, డీసీసీబీ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, యేసు ఆదినారాయణ, సూపరింటెండెంట్ మోహన్, మధుసూదన్రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు సీసీ లైనింగ్
నల్లగొండ, గుర్రంపోడు: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ప్రధాన కాల్వ సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.442 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి పరిపాలనా అనుమతులు సైతం ఇస్తూ బుధవారం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ 23.500 కిలోమీటర్ల నుంచి మూసీ వరకు గల 136.150 కిలోమీటర్ల లైనింగ్కు 113 కిలోమీటర్ల మేర కాల్వ సిమెంట్ కాంక్రీట్ చేయనున్నారు. ఇటీవలే అధికారులు ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేస్తూ తాజాగా పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయితే నేరుగా కృష్ణాజలాలు అందే 23వ కిలోమీటర్ కామన్ పాయింట్ నుంచి ప్రధాన కాల్వకు సీసీ లైనింగ్ పనులు మొదలవుతాయి. బిడ్లుగా విభజించి త్వరలో టెండర్లు పిలువనున్నారు. కాల్వకు నీటి విడుదల జరగని జూలైలోగా కాల్వ సీసీ లైనింగ్ పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎట్టకేలకు సీసీ లైనింగ్ .. 1984లో తవ్విన ప్రధాన కాల్వకు దశాబ్దాలు గడిచినా కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో కాల్వగట్టు శిథిలమై నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయింది. 3వేల క్యూసెక్కుల సామర్థ్యం గల ప్రధాన కాల్వలో 1,200 క్యూసెక్కుల నీటి ప్రవాహ కొనసాగుతుండగా మధ్యలోనే లీకేజీలతో చివరకు నీరు చేరే సరికి సగానికి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెంటనే లైనింగ్ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలకు విన్నవించారు. దీంతో ఎట్టకేలకు లైనింగ్ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. లైనింగ్ పూర్తయితే 3వేల క్యూసెక్కుల నీటితో 1.5 టీఎంసీల నీటి సామర్థ్యం పానగల్ రిజర్వాయర్ను నిండడానికి పది, పదిహేను రోజులే పట్టనుంది. ప్రధాన కాల్వ సీసీ లైనింగ్ వల్ల సుమారు 2.20లక్షల ఎకరాల్లోని ఏఎమ్మార్పీ ఆయకట్టు చివరి భూములకు కూడా సాగు నీరందుతుందని అధికారులు భావిస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ పాలనా ఉత్తర్వులు ఇచ్చినందుకు గాను సీఎం అనుముల రేవంత్రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూ.442 కోట్ల నిధులతో పరిపాలనా అనుమతులు ఉత్తర్వులు జారీ చేసిన నీటిపారుదల శాఖ త్వరలోనే టెండర్లకు ఆహ్వానం సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి -
ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత
మోటకొండూర్: మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో మంగళవారం సాయంత్రం రియాక్టర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. తమకు న్యాయం చేయాలని మృతులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో బుధవారం ఉదయం పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. కాటేపల్లి ప్రధాన రోడ్డు పక్కన టెంట్ వేసుకుని ఆందోళనకు దిగారు. నాలుగు గంటల పాటు మోత్కూరు–రాయిగిరి రోడ్డును దిగ్భందించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. బాధిత కుటుంబాలను భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వేర్వేరుగా వచ్చి పరామర్శించారు. తగిన న్యాయం చేయటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కంపెనీలో పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలించారు. మృతులకు రూ.కోటి నష్టపరిహారం.. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ యాజమాన్యంతో భువనగిరిలోని ఓ హోటల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్, పలువురు నాయకులు చర్చలు జరిపారు. దీంతో పరిశ్రమ యాజమాన్యం మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.కోటి నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.50లక్షలు, మిగతా రూ.50లక్షలు తర్వాత చెల్లిస్తామని ఒప్పుకున్నారు. గాయపడిన వారికి తక్షణ సహాయం కింద రూ.5లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని, తిరిగి వారు పనిలో చేరేవరకు పూర్తి జీతం, అంగవైక్యం సంభవిస్తే తగిన న్యాయం చేస్తామని ఒప్పుకున్నారు. దీంతో ఆందోళన విరమించారు. రెండు మృతదేహాల వెలికితీత.. రియాక్టర్ పేలుడు ధాటికి మాంసం ముద్దలుగా మారి శిథిలాల కింద చిక్కుకున్న మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన చెన్నోజి దేవిచరణ్, కాటేపల్లి గ్రామానికి చెందిన గునుగుంట్ల సందీప్ మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పోలీసులు వెలికితీసి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సందీప్ తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ప్రొడక్షన్ మేనేజర్ శ్రీకాంత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపారు. న్యాయం చేయాలని బాధితుల కుటుంబ సభ్యుల ఆందోళన మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తామని యాజమాన్యం హామీ క్షతగాత్రులకు రూ.5లక్షల ఆర్థికసాయంనరేష్ అంత్యక్రియలు పూర్తిఆత్మకూరు(ఎం): ఈ ఘటనలో మృతిచెందిన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన కల్వల నరేష్(32) అంత్యక్రియలను మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నరేష్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘పది’లో జయ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
సూర్యాపేటటౌన్: పదో తరగతి ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు 587 మార్కులు, 15 మంది విద్యార్థులు 580పైగా మార్కులు, 52 మంది విద్యార్థులు 570పైగా మార్కులు, 106 మంది విద్యార్థులు 560 పైగా, 154 మంది విద్యార్థులు 550పైగా మార్కులు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ తెలిపారు. వి. హాసిని, కె. శ్రేష్ట, ఎం. అనన్య, ఎం. శ్రీదేవి 587 మార్కులు, కె. శరణ్య 586 మార్కులు, లోకేష్ 585, సాయి చర్విత, శ్రీజ 584 మార్కులు, చాణక్య, హర్షవర్దని 583 మార్కులు, రేవంత్రెడ్డి, మన్విత, ప్రగతి, వేద 580 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు అభినందించారు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
● కాంగ్రెస్ నల్లగొండ జిల్లా పరిశీలకుడు, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి నల్లగొండ: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మక్తల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నల్లగొండ జిల్లా పరిశీలకుడు వాకటి శ్రీహరి అన్నారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే వారికే రానున్న ఎన్నికల్లో, పదవుల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు జూకూరి రమేష్, అంకతి సత్యం, మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
● 14 బైక్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్నల్లగొండ: బైక్లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం వాడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 14 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన నలమాల ఎర్రబ్బాయి అలియాస్ లూథర్, అదే గ్రామానికి చెందిన గంజి అంకమరావు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపహాడ్ గ్రామానికి చెందిన వట్టిపల్లి శ్రీకాంత్ ముఠాగా ఏర్పడి బైక్లు చోరీ చేసి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. నలమాద ఎర్రబాబు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, దామరచర్ల, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు ఏపీలోని మార్టూరు, పొన్నూరులో ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, వైన్స్లు, రాత్రివేళ ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్లను చోరీ చేసి వాటిని గంజి అంకమరావు, మట్టిపల్లి శ్రీకాంత్తో కలిసి తక్కువ ధరకు విక్రయించేవాడు. బుధవారం ఉదయం వాడపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్రబ్బాయి, అంకమరావు చోరీ చేసిన బైక్లను అమ్మడానికి దామరచర్ల నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా.. అనుమానం వచ్చి ఎస్ఐ వారిని పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు మట్టిపల్లి శ్రీకాంత్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు, ఏడు పల్సర్ బైక్లు, ఒక షైన్ బైక్ను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.26.50 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ముగ్గురు నిందితులపై వాడపల్లి పోలీస్ స్టేషన్లో 3, నల్లగొండ వన్టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషనల్లో ఒక్కోటి చొప్పున, నార్కట్పల్లి పీఎస్లో 2, ఇబ్రహీంపట్నం పీఎస్లో 1, ఏపీలోని మార్టూర్ పీఎస్లో 2, పొన్నూరు పీఎస్లో 1, రాజమండ్రిలో 1 కేసు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. మొత్తం 22 బైక్లు దొంగిలించినట్లుగా నిందితులు అంగీకరించారని, మిగతా వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ తెలిపారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, సీసీఎస్ సీఐ డానియేల్, వాడపల్లి ఎస్ఐ ఎ. శ్రీకాంత్రెడ్డి, పోలీస్ సిబ్బంది సతీష్, భాస్కర్, వెంకటేశ్వర్లు, రషీద్, సీసీఎస్ సిబ్బంది విష్ణువర్ధనగిరి, రాంప్రసాద్, పుష్పగిరి, శ్రీనివాస్రెడ్డిని ఎస్పీ అభినందించారు. -
గుట్ట ఈఓగా వెంకట్రావ్ బాధ్యతల స్వీకరణ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈఓగా వెంకట్రావ్ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా వెంకట్రావ్ను దేవాదాయశాఖ డైరెక్టర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. అదనంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా బాధ్యతలు అప్పగించింది. బుధవారం సాయంత్రం గర్భాలయంలో స్వయంభూలను దర్శించుకున్న అనంతరం ఈఓ చాంబర్లో బాధ్యతలు స్కీరించారు. ఆలయ రికార్డులను, పత్రాలను బదిలీ అయిన భాస్కర్రావు నూతన ఈఓకు అప్పగించారు. నూతన ఈఓ, బదిలీపై వెళ్తున్న భాస్కర్రావును అర్చకులు, ఆలయ ఉద్యోగులు సన్మానించారు. అనంతరం నూతన ఈఓ క్యూలైన్లో నిల్చున్న భక్తులను పలకరించారు. దర్శనానికి ఎక్కడి నుంచి వచ్చారు, క్యూలైన్లలో ఎలా ఉందని తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ పనులు, నూతన నిర్మాణాలు, పూజలకు సంబంధించిన అంశాలను అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, పాత ఈఓ భాస్కర్రావు, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా భాస్కర్రావుకు ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు తప్పదు
గట్టుప్పల్: ప్రజా వ్యతిరేక విధానాలు అవలబించే ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదని సీపీఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన అమరవీరుల సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెట్టుబడిదారులు, భూ స్వాములకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతు న్నాయన్నారు. కూలీలు, కార్మికుల హక్కుల కోసం ఎర్రజెండా అలుపులేకుండా పోరాడుతోందన్నారు. ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకూ ఎర్రజెండాను అంతం చేయడం ఎవ్వరి తరం కాదన్నారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడతోందని విమర్శించారు. మే 1 నుంచి 8వ తేదీ వరకు కార్మిక వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. అంతకుముందు అమరవీరుల చిత్రపటాలకు పార్టీ నాయకులు కలిసి నివాళులు అర్పించారు. జాన్వెస్లీ రాక సందర్భంగా గట్టుప్పల్లో నిర్వహించిన ర్యాలీలో కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. ఆ పార్టీ మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నాయకులు కట్ట నర్సింహ, సుర్కంటి శ్రీనివాస్రెడ్డి, బండ శ్రీశైలం, చాపల మారయ్య, శంకర్, నాంపల్లి చంద్రమౌళి, రవీందర్రెడ్డి, కర్నాటి సుధాకర్, పెద్దులు, దోనూరి నర్సిరెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలిసంస్థాన్ నారాయణపురం: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో వెంటనే శాంతియుతంగా చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సంస్థాన్ నారాయణపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కర్రి గుట్టల్లో ఆదివాసీలను చుట్టుముట్టి చంపుతున్నారని, కర్రిగుట్టల్లో సహజ ఖనిజాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే నివేదికను బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై పెట్టాలన్నారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఉన్నారు. అంతకుముందు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
అక్షయ తృతీయపై పసిడి ధరల ప్రభావం
రామగిరి(నల్లగొండ): అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు. ఈ సారి అక్షయ తృతీయకు రోహిణి నక్షత్రం కలిసి వస్తున్నా.. పసిడి ధర తులం రూ.లక్షకు చేరువలో ఉండడంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా ఈసారి బంగారం కొనుగోళ్లు పది శాతం మాత్రమే జరిగినట్టు అమ్మకందారులు చెబుతున్నారు. గతేడాది అక్షయ తృతీయ సమయంలో బంగారం ధర తులానికి సుమారు రూ.60 నుంచి రూ.65 వేల వరకు ఉంది. ప్రస్తుతం రూ.98 వేలు ఉంది. గత ఏడాది రేటుతో పోల్చితే 40 నుంచి 45 శాతం మేర వ్యత్యాసం కనిపిస్తోంది. ఫ రూ.లక్షకు చేరువగా తులం బంగారం ఫ అధిక ధర కారణంగా తగ్గిన కొనుగోళ్లుఅక్షయ తృతీయ అంటే సెంటిమెంట్ అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం సెంటిమెంట్. ఏటా అక్షయ తృతీయకు బంగారం కొంటాము. ఈ సారి బంగారం ధర ఎక్కువగా ఉండడంతో చాలా తక్కువ కొనుగోలు చేశాం. – మల్లికా, నల్లగొండ -
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం పొలం కుమార్ను హతమార్చిన కేసులో నిందితులు వేల్పుల సంతోష్, వేల్పుల శైలజను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. కొన్నిరోజులుగా కుమార్తో శైలజ సన్నిహితంగా ఉండడాన్ని చూసి వివాహేతర ఉందని సంతోష్ అనుమానించాడు. పద్ధతి మార్చుకోవాలని శైలజను మందలించాడు. అయితే తన వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె చెప్పడంతో కుమార్పై సంతోష్ కోపం పెంచుకున్నాడు. అయితే బంధువుల వద్ద శైలజతో సంబంధం ఉందని కుమార్ చెబుతున్నాడు. శైలజకు కూడా ఫోన్లు చేస్తుండడంతో కుమార్ను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈక్రమంలో సోమవారం మాట్లాడుకుందాం రమ్మని కుమార్కు ఫోన్చేసి చెప్పడంతో వ్యవసాయమార్కెట్కు కారులో చేరుకున్నాడు. ఈలోగా పెద్దపల్లికి వచ్చిన సంతోష్.. జెండా వద్ద ఓ కత్తిని కొనుగోలు చేసి భార్య శైలజకు కుమార్ను చంపుదామనే విషయాన్ని చెప్పాడు. శైలజ దొంగతుర్తి నుంచి బస్సులో పెద్దపల్లికి చేరుకోగా.. ఆమెను బైక్పై తీసుకుని మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కుమార్, సంతోష్ గొడవపడ్డారు. ఆ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తి తీసి మెడ, చాతి, ముఖంపై పొడిచి చంపారు. కుమార్ చనిపోయాడని నిర్ధారించుకుని నిందితులు పరారయ్యారు. ఈమేరకు నిందితులైన భార్యాభర్తలు సంతోష్, శైలజు దొంగతుర్తిలో ఉన్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు.వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..! -
మాటకు కట్టుబడి పనిచేస్తాం
శాలిగౌరారం : ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. శాలిగౌరారంలో మంగళవారం భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకే భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అధికారులే గ్రామాలకు వస్తారని రైతులు వారికున్న భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూభారతి చట్టంలో 80 శాతం భూ సమస్యలు తహసీల్దార్ వద్దనే పరిష్కారమవుతాయన్నారు. కాంగ్రెస్ది ప్రజా ప్రభుత్వమని రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, భూభారతి చట్టం వంటి అనేక ప్రతిష్టాత్మక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. రికార్డుల సవరణకు అవకాశం : కలెక్టర్ ఇలా త్రిపాఠి భూభారతి చట్టంలో రికార్డుల సవరణకు అవకాశం ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. భూములకు సంబందించిన రికార్డులను ప్రతీ సంవత్సరం డిసెంబర్ 31న గ్రామపంచాయతీ పరిధిలో ప్రదర్శిస్తామని.. ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చని తెలిపారు. రైతులు భూ సమస్యలపై అడిగిన సందేహాలను కలెక్టర్ వేదికపై ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డుపై విశదీకరిస్తూ అవగాహన కల్పించారు. ఆ సమయంలో కొందరు రైతులు తమ భూ సమస్యలను అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని చెప్పే క్రమంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో వేదికపై ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే రైతుల సమస్యలను పరి ష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఆర్డీఓ అశోక్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మాన్యానాయక్, తహసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, వైస్చైర్మన్ నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, చామల మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
సారూ మొర ఆలకించరూ..
ఆస్తులు తీసుకుని అన్నం పెట్టడం లేదు చందంపేట మండలం గాగిల్లపురం గ్రామానికి చెందిన నక్క ముత్యాలు నలుగురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. ముత్యాలు భార్య 20 సంవత్సరాల క్రితం చనిపోయింది. పిల్లలందరి పెళ్లిల్లు అయ్యాయి. 20 ఎకరాలు భూమిని నలుగురు కొడుకులకు నాలుగు ఎకరాల చొప్పున్న రిజిస్ట్రేషన్ చేశాడు. నాలుగు ఎకరాలు ముత్యాలు పేరున ఉంది. నలుగురు కొడుకులు హైదరాబాద్ హస్తినాపురంలో వివిధ పనులు చేస్తూ జీవిస్తున్నారు. చనిపోయిన దగ్గర నుంచి ముత్యాలు గొర్రెలు సాదుకుంటూ జీవనం సాగించాడు. రెండేళ్ల నుంచి ఆరోగ్యం సహకరించక నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కొడుకులు ముత్యాలును పట్టించుకోవడం లేదు. ముత్యాలు పేరున ఉన్న ఉన్న భూమి అమ్ముకుందామంటే అడ్డుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. చచ్చేటోనివి భూమి అమ్ముకుంటావా.. చావరాదు అంటున్నారని ముత్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొడుకులు తిండి పెట్టకపోవడంతో చేతికి ఉన్న 60 తులాల వెండి కడియాలను అమ్ముకుని బతుకుతున్నానని వాపోయాడు. కొడుకులు తన బాగోగులు చూసేలా చూడాలని కోరుతూ వినతి పత్రం సమర్పించాడు. నల్లగొండ : ఆస్తులు సంపాదించి పంచి ఇచ్చినా కొడుకులు బువ్వ పెట్టడం లేదని.. ఇంటిని తన పేరు రిజిస్టర్ చేసుకున్న మనుమడు పట్టించుకోవడం లేదని.. భూమి సమస్య ఉందని.. అర్హత ఉన్నా పింఛన్ మంజూరు కాలేదేని ఇలా.. ప్రజావాణిలో బాధితులు అధికారులకు మొర పెట్టుకున్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్డేలో ఇన్చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్కుమార్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దాదాపు 33 మంది వినతులు సమర్పించగా ఇందులో 14 రెవెన్యూకు, 19 వివిధ శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా ఇన్చార్జి అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలను నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులు ఏస్థాయిలో పరిష్కారం అవుతాయో వెంటనే అక్కడికి పంపాలన్నారు. కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఫొటోలు...29ఎన్ఎల్సి305–230098.మనవడు ఇల్లు తీసుకుని అన్నం పెడతలేడు చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన జంపాల అంజమ్మ నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో నివాసం ఉంటుంది. అంజమ్మ కొడుకు గోపాల్ 24 సంవత్సరాల క్రితం కండరాల క్షీణత వ్యాధితో నడవలేని పరిస్థితికి వెళ్లిపోయాడు. అంజమ్మ బిడ్డ మంగమ్మతో పాటు అల్లుడు కూడా చనిపోతే మనవడు గడ్డం జానీని అంజమ్మే సాకింది. తనను, నడవలేని స్థితిలో ఉన్న కొడుకును తనే చూసుకుంటానంటే చెప్పడంతో అంజమ్మ పేరున ఉన్న ఇంటిని మనవడి పేరున రిజిస్ట్రర్ చేసింది. ఇప్పుడు మనవడు వారిని చూసుకోవడం లేదు. ఇదేంటని అడిగితే వారిని బెదిరిస్తున్నాడు. మనవడు మమ్ములను సాదేలా చూడాలని.. లేనిపక్షంలో గిఫ్ట్ డీడీ కింద రిజిస్ట్రేషన్ చేసిన ఇంటిని తన పేరుమీదకు మార్చాలని కోరుతూ అంజమ్మ.. నడవలేని స్థితిలో ఉన్న తన కొడుకు గోపాల్తో కలిసి వచ్చి అదనపు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది. ఫ గ్రీవెన్స్ డేలో పలువురి ఫిర్యాదు -
మేం చెప్పినోళ్లకే ఇవ్వాలి!
పథకాల లబ్ధిదారుల జాబితా తయారీలో పంచాయతీ కార్యదర్శులపై నాయకుల ఒత్తిడి మిర్యాలగూడ : పభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడంలో వారధులుగా పని చేసే పంచాయతీ కార్యదర్శులపై నాయకుల ఒత్తిడి పెరుగుతోంది. సంక్షేమ పథకాల అమలులో గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నారు. అయితే గ్రామాల్లో నాయకులు కొందరు తాము చెప్పిన పేర్లు మాత్రమే లబ్ధిదారుల లి్స్ట్లో చేర్చాలని కార్యదర్శులపై బెదిరింపులకు దిగుతున్నారు. తమ మాట వినకపోతే దాడులు సైతం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు సాగుతోందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. నాయకుల తీరుతో అర్హులకు పథకాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ధీరావత్తండాలో కార్యదర్శిపై దాడి మిర్యాలగూడ మండలం ధీరావత్తండాలో సోమవారం ఇరిగేషన్ ఏఈ రామకృష్ణతో కలిసి పంచాయతీ కార్యదర్శి కోల సాయికుమార్ ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ నాయకుడు తాను చెప్పిన పేర్లు ఎందుకు లిస్ట్లో చేర్చలేదని కార్యదర్శిని బెదిరించాడు. తాను ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇరిగేషన్ ఏఈతో కలిసి సర్వే చేస్తున్నానని, అర్హుల జాబితా తయారీ విషయం తనకు సంబంధం లేదని సదరు కార్యదర్శి చెప్పాడు. అయినా ఆ నాయకుడు వినకుండా పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన గ్రామస్తులు వారించినా వినకుండా కార్యదర్శిపై దుర్భాషలాడాడు. దీంతో దాడికి పాల్పడిన నాయకుడిపై పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ మిర్యాలగూడ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.తాను చెప్పిన పేర్లు చేర్చలేదని దాడి చేశాడు గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా నేను ఇరిగేషన్ ఏఈతో కలిసి పాల్గొన్నాను. అయితే గ్రామానికి చెందిన ఓ నాయకుడు తాను చెప్పిన పేర్లు ఎందుకు లిస్ట్లో చేర్చలేదని నాపై దుర్భాషలాడి దాడి చేశాడు. దాడికి పాల్పడిన వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. – కోల సాయికుమార్, పంచాయతీ కార్యదర్శి, ధీరావత్తండారక్షణ కల్పించాలి నిస్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై నాయకులు దాడులు చేయడం హేయమైన చర్య. ఉన్నతాధికారుల ఆదేశానుసారమే లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నాం. స్థానిక నాయకుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం. ప్రతి గ్రామపంచాయతీలో ఇలాంటి ఒత్తిడిలు అధికమయ్యాయి. ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలి. – కోడిరెక్క శైలజ, టీపీఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుకఠిన చర్యలు తీసుకోవాలి కార్యదర్శిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసుశాఖ చర్యలు తీసుకోవాలి. దాడి జరిగిన వెంటనే రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం. పథకాల లబ్ధిదారులకు సంబంధించిన జాబితా ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. కార్యదర్శిపై జరిగిన దాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – రాఘవరావు, డీఎల్పీఓ ఫ నేతలకు నచ్చినట్లు పనిచేయకపోతే బెదిరింపులు ఫ ధీరావత్తండాలో కార్యదర్శిపై దాడి చేసిన ఓ పార్టీ నాయకుడు ఫ రక్షణ కరువైందంటున్న పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే పని ఒత్తిడి.. మరోవైపు దాడులు గ్రామాల్లో సర్పంచ్ల పాలన ముగియడంతో బాధ్యతంతా పంచాయతీ కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీదిలైట్ల ఏర్పాటు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడడంవంటి అనేక పనులను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. పంచాయతీలకు నిధులు సరిగా రాకపోయినా అప్పులు తీసుకొచ్చి మరీ గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబసర్వే, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సర్వేలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా వంటి పథకాలకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంత ఒత్తిడిలో పని చేస్తున్నా.. ఇప్పుడు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక విషయంలో గ్రామాల్లో నాయకుల తీరుతో ఆందోళన చెందుతున్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై బెదిరింపులు ఆపాలని కోరుతున్నారు. -
అంబేడ్కర్, పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం
నల్లగొండ టౌన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, విద్యా వ్యాప్తి, కుల వివక్షత నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయులు అంబేడ్కర్, పూలే ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ప్రొపెసర్ ఖాసీం అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే, అంబేడ్కర్ జన జాతరలో ఆయన మాట్లాడారు. అంతకుముందు పూలే, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు వర్గాల విద్యాభివృద్ధికి పూలే సతీమణి సావిత్రీబాయి పూలే ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్బాబు, ఏపూరి సోమన్న, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, పాలడుగు నాగార్జున, దుడుకు లక్ష్మీనారాయణ, తాళ్లపల్లి రవి, ఆయా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎండలకు వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్
నల్లగొండ టౌన్ : ఈ వేసవిలో భానుడు భగ్గుమంటున్నాడు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దావాఖానాల్లో ఇప్పటికే 2.5 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. జిల్లా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్లో మారో 2 లక్షల ప్యాకెట్లు సిద్ధంగా ఉంచింది. దాంతో పాటుగా అంగన్వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ మేట్లు, ఆశ వర్కర్లు వద్ద కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. వడదెబ్బ బాధితులకు అత్యవర సేవలను అందించడానికి అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, సెలెన్ బాటిళ్లను సిద్దం చేసింది. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజల్లో అవగాహన కల్పించడానికి చర్యలను చేపట్టింది. వెంటనే వైద్యం అందించేలా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేశారు. అందులో వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. జిల్లాలో ఎక్కడైనా వేసవిలో వచ్చే జబ్బులు ప్రభలి ప్రజలు ఇబ్బందులు పడితే వెంటనే ఆ టీం ఆ గ్రామానికి చేరుకుని వారికి అవసరమైన వైద్య చికిత్సలను అందించనుంది. అదే విధంగా వైద్యా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి సమాచారం అందిన వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ బృందంలోని సభ్యులను ఆయా ప్రాంతాలకు పంపించనున్నారు. వైద్యులు అందుబాటులో ఉందాల్సిందే.. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ సెంటర్లు, పల్లె, పట్టణ దావాఖానాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. సమయపాలన పాటించడంతో పాటు పనిచేసే చోటే ఉండాలనే స్పష్టం చేసింది, వేసలో వచ్చే అన్ని రకాల జబ్బులను అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.ఫ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాల నిర్వహణ ఫ అందుబాటులో 2.5 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఫ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ఫ నిత్యం అందుబాటులో ఉండాలని వైద్యులు, సిబ్బందికి ఆదేశాలు వేసవిలో జాగ్రత్తగా ఉండాలి ఎండలు పెరుగున్న నేపథ్యంలో వచ్చే వ్యాధులను అరికట్టడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వం సిద్ధంగా ఉంది. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా వారికి అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందబాటులో ఉంచాం. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించాం. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల పోలీస్స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పన్ను చెల్లింపునకు అంతరాయంనల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్యాలయంలో ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్ను చెల్లించేందుకు వచ్చిన ప్రజలు సర్వర్ల మొరాయింపుతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సంవత్సరం ఆస్తి పన్ను ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లిస్తే ప్రభుత్వం ఐదు శాతం రాయితీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రాయితీపై ఆస్తి పన్ను చెల్లించడానికి ఇక రెండు రోజులే సమయం ఉండడంతో ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. సర్వర్లు పని చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచే సర్వర్ల సమస్య తలెత్తడంతో పన్నులు చెల్లించే అవకాశంలేక కొందరు వేచి చూడగా, మరికొందరు వెనుదిరిగి వెళ్లిపోయారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంమఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం పూర్తిచేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యపాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. స్వర్ణగిరీశుడికి సహస్రనామార్చన భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం ఉదయం సహస్రనామార్చన వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, నిత్యకల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి సేవ కార్యక్రమాలు నిర్వహించారు.