breaking news
Nalgonda
-
శుభాన్షు శుక్లాకు సెల్యూట్
చిట్యాల: అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండవ భారతీయుడుగా రికార్డు సృష్టించిన శుభాన్షు శుక్లాకు గురువారం చిట్యాలలోని ఆక్స్ఫోర్ట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ జాతీయ పతాకం చేతపూని సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పెద్ది నరేందర్ మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శుభాన్షు శుక్లా నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు నర్రా భిక్షంరెడ్డి, నమ్ముల ఆనంద్కుమార్, షేక్ షెమీమున్సిసా బేగం, పుల్లెంల సంతు, గణేష్, జ్యోతి, ధనలక్ష్మి, ఆసియా, మాధవి, మౌనిక, కీర్తి, లింగస్వామి పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
నల్లగొండ : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పోలీస్, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు చేపట్టిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రకాశం బజార్లో డిజిటల్ తరగతులతోపాటు, అన్ని సౌకర్యాలతో నూతన పాఠశాల నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయాల గురించి తెలిసివారు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, అదనపు ఎస్పీ రమేష్, డీఈఓ భిక్షపతి, డీఎస్పీ శివరాంరెడ్డి, సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ నల్లగొండలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ -
తనిఖీలతో బోధనకు ఆటంకం
బాధ్యతలు వీరికే.. పాఠశాలల తనిఖీలకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో పదేళ్లు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. వీరిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు రోజుకు రెండు పాఠశాలలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల్లో 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేయించాలనేది విద్యా శాఖ నిర్ణయం. అయితే అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఎంపిక చేయనుంది. ఇదిలా ఉంటే ఓ ఎస్జీటీ మరో ఎస్జీటీ మీద, ఒక స్కూల్ అసిస్టెంట్.. మరో స్కూల్ అసిస్టెంట్ మీద తనిఖీలు చేయడం సరైంది కాదని ఉపాధ్యాయులు గొనుక్కుంటున్నారు. నల్లగొండ: ఒకపక్క గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల ఏర్పాటు అవడం..మరోపక్క పట్టణాల్లోని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రతి గ్రామానికి బస్లు పంపుతూ ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తుండడంతో అధిక శాతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితిని అధిమించేందుకు రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలను రోజూ తనిఖీ చేయడం ద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతాయని భావించింది. అందుకు తనిఖీల బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిటీతో తనిఖీ బాధ్యతలకు ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. అయితే విద్యా శాఖ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయులు తనిఖీలు చేసేందుకు వెళ్తే బోధన కుంటుపడుతుందని అంటున్నారు. ఫ స్కూళ్ల పర్యవేక్షణకు టీచర్లకు బాధ్యతలు ఫ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ ఫ ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని సర్కారు యోచన ఫ వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు జీహెచ్ఎంలు 178 ఎల్ఎఫ్ఎల్ 164ఎస్ఏలు 2,278 ఎల్పీలు 97ఎస్జీటీలు 2,729 పీఈటీలు 151ఇతరులు 15 మొత్తం 5,612 -
భూభారతి అర్జీలను వెంటనే పరిష్కరించాలి
నల్లగొండ: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులపై సమీక్షిస్తామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో 45,313 దరఖాస్తులు వచ్చాయని వీటిని ఆగస్టు 14లోపు పరిష్కరిస్తామన్నారు. దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుదారుకు నోటీసు జారీచేసి విచారణ చేసిన తర్వాత వారం సమయం ఇచ్చి ఆ తర్వాత పరిష్కరించాలన్నారు. అదనపు ఇన్చార్జి కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల్లో 15వేలు మిస్సింగ్ సర్వే నంబర్లవే ఉన్నాయన్నారు. ఆర్డీఓలు అర్హత ఉన్న దరఖాస్తుల వివరాలు మాత్రమే భూభారతిలో నమోదు చేయాలన్నారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ఎమ్మార్వోలు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి
నార్కట్పల్లి : ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలోని బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్కు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ను సందర్శించి మాట్లాడారు. కాల్వ పనులను వేగవంతంగా పూర్తి చేస్తే రిజర్వాయర్ కింది లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పానగల్ ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్లోకి రెండు రోజులుగా నీరు విడుదలవుతుందని, మరో రెండు రోజుల్లో రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండనుందని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూములను అప్పగించిన రైతులకు పరిహారం చెల్లింపులలో జాప్యం చేయొద్దన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె, శ్రీనివాస్, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి, శ్రీనివాస్రెడ్డి,డిఈ వీఠలేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, వడ్డే భూపాల్రెడ్డి, నరేందర్రెడ్డి, దామెర ఉదయ్కుమార్, బొడిగె స్వామి ఉన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
సగటు వర్షపాతం.. 8.3 మిల్లీమీటర్లు
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 8.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చందంపేట మండలంలో 37.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుండ్లపల్లిలో 31.0, నేరెడుగొమ్ములో 29.5, పెద్దవూరలో 16.1, పీఏపల్లిలో 15.4, తిప్పర్తిలో 15.9, కేతేపల్లిలో 15.9, నకిరేకల్లో 14.3, దామరచర్లలో 13.6, మిర్యాలగూడలో10.4, శాలిగౌరా రంలో 11.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కట్టంగూరులో 7.3, నల్లగొండలో 3.7, కనగల్లో 3.6, మునుగోడులో 1.1, చండూరులో 3.9, చింతపల్లిలో 1.5, నాంపల్లిలో 0.2, గు ర్రంపోడు 3.0, అనుముల హాలియా 3.1, నిడమనూరులో 2.2, త్రిపురారంలో 3.4, మాడుగులపల్లిలో 4.7, వేముపల్లిలో 4.0, అడవిదేవులపల్లిలో 4.1, తిరుమలగిరి సాగర్లో 2.9, కొండమల్లెపల్లిలో 1.9, దేవరకొండలో 8.0 గుడిపల్లిలో 2.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దేవరకొండ డివిజన్లో అధిక వర్షం కురిసింది. ప్రతి పేషెంట్కు ‘ఆభా’ ఐడీ క్రియేట్ చేయాలి దేవరకొండ : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రతి పేషెంట్కు తప్పనిసరిగా ఆయుస్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఆభా) ఐడీ క్రియేట్ చేయాలని డీసీహెచ్ఎస్ మాతృనాయక్ అన్నారు. గురువారం దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆరోగ్యశ్రీ సిబ్బందితో వేర్వేరుగా సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసేవల కోసం ఆస్పత్రికి వచ్చేవారి పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రి ముందుందన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాష్, సిబ్బంది ఉన్నారు. రాజీవ్ యువ వికాసాన్ని ప్రారంభించాలినల్లగొండ టౌన్: ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే ప్రారంభించి అర్హులకు ఇవ్వాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అన్నారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఉపాధి కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. సమావేశంలో రవినాయక్, మల్లం మహేష్, పతని శ్రీను, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, మహ్మద్ ఆక్రమ్, పాలది కార్తీక్, వంశీ, ఏడుకొండలు, బొడ్డుపల్లి నరేష్, బూర్గు గోపి కృష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
విద్యార్థులు ‘ఇన్స్పైర్’ పొందేలా..
నల్లగొండ: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక ఆలోచనలు, సృజనాత్మకత వైపు మళ్లించి భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) మనక్ అవార్డు(2025–26)కు సంబంధించి.. పాఠశాలల్లోని విద్యార్థుల నుంచి ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తోంది. ఈ నెల 15న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 15 వరకు కొనసాగనుంది. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, రెసిడెన్షియల్, ఎయిడెడ్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇన్స్పైర్ మనక్ అవార్డుల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసేదిలా.. ఇన్స్పైర్ మనక్పై ఆసక్తి కలిగిన పాఠశాల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని విద్యా శాఖ కోరుతోంది. www.inspireawards.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాఠశాలలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళుతుంది. జిల్లా అథారిటీ ఆమోదిస్తే 24 గంటల్లోపు విద్యార్థికి సంబంధించిన మెయిల్ ఐడీకీ యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. అప్పుడు యూజర్ ఐడీకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. విద్యార్థి తన సమాచారం, బ్యాంకు అకౌంట్, ఐఎప్ఎస్సీ కోడ్, ఆధార్, విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టు సంక్షిప్త రిపోర్టు వెబ్సైట్లో నమోదు చేయాలి. విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం ఉంది. అయితే విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఆన్లైన్లో ప్రాజెక్టు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఐడియా బాక్సు ఏర్పాటు చేసుకోవాలి అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు వినూత్న ఆలోచనలను ఉపాధ్యాయులు గుర్తించేందుకు ఐడియా బాక్సు ఏర్పాటు చేసుకోవాలి. పరిసరాల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ వేదిక ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రతి పాఠశాల నుంచి కచ్చితంగా 5 ప్రాజెక్టులు నామినేషన్ చేసుకోవాలి. – వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి ఇన్స్పైర్ మనక్ ఒక వరం ఇన్స్పైర్ మనక్ విద్యార్థులకు ఒక వరం లాంటిది. శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుకునే విద్యార్థులకు ఎంతగానో దోహదం పడుతుంది. సామాజిక సమస్యలకు శాసీ్త్రయ రూపంలో పరిష్కారాలు చూపగలిగే సృజనాత్మక ప్రాజెక్టులను నమోదు చేయాలి. అందుకు సైన్స్ ఉపాధ్యాయులు సహకరించాలి. – భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారిఫ ఇన్స్పైర్ మనక్ అవార్డులకు మొదలైన దరఖాస్తులు ఫ చిన్నారులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు కార్యక్రమం ఫ 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అవకాశం ఫ సెప్టెంబర్ 15 వరకు గడువు గతంలో ఎంపికై నవి సంవత్సరం ప్రాజెక్టులు 2022–23 1432023–24 1392024–25 131 జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీలు విద్యార్థులకు తమకు వచ్చిన ఆలోచనలతో తయారు చేసిన ప్రాజెక్టులు ప్రదర్శించేందుకు ఎంపికై తే వారి అకౌంట్లలో రూ.10 వేలు జమచేస్తారు. అయితే వాటిని జిల్లా స్థాయి పోటీల్లో ప్రదర్శిస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికై తే రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించిన ఆరు ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి జాతీయ స్థాయి పంపుతారు. జాతీయ స్థాయి ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రదర్శించడంతోపాటు రాష్ట్రపతి భవన్లో కూడా ప్రత్యేక ప్రదర్శిస్తారు. అనంతరం సకురా ప్రోగ్రామ్ ద్వారా జపాన్ దేశంలోని పరిశోధన కేంద్రాలను సందర్శించేందుకు ఎంపికై న విద్యార్థులను పంపుతారు. -
చినుకు లేక.. మొలకెత్తక..
ఈయన పెద్దవూర మండలం గర్నెకుంటకు చెందిన చిట్టిమళ్ల సత్యం. ఈయన ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశారు. అప్పటినుంచి సరైన వర్షం పడకపోవడంతో చాలా విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తినవి కూడా ఎండలకు ఎండిపోతున్నాయి. ఎకరాకు మూడు ప్యాకెట్ల చొప్పున ఐదెకరాలకు 15 ప్యాకెట్ల పత్తి గింజలు వేశాడు. వాటితోపాటు అరక, కూలీలు మొత్తంగా రూ.22 వేలు వెచ్చించాడు. వర్షాల్లేక ఇప్పుడు నష్టపోయే పరిస్థితి వచ్చిందని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నాకు ఎకరంన్నర పొలం ఉంది. గ్రామంలోని మరో రైతుకు చెందిన 11 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఈనెల మొదట్లో వర్షాలు పడడంతో పత్తి విత్తనాలు నాటాను. ముందు మురిపించిన వాన తరువాత మొఖం చాటేసింది. దీంతో ఆ విత్తనాలు మొలకెత్తలేదు. ఇందుకోసం ఇప్పటికే రూ.2.30 లక్షలు అప్పు చేశాను. ఇప్పుడు మళ్లీ విత్తనాల పెట్టాలంటే మరో రూ.50 వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. – జినుక సైదులు. ఆకారం, శాలిగౌరారం పత్తి విత్తనాలు సగమే మొలకెత్తాయి ఆరెకరాల్లో పత్తి విత్తనాలు పెట్టాం. అందులో సగమే మొలకెత్తాయి. మిగతా సగం భూమిలో తేమలేక మొలవలేదు. 15 రోజుల నుంచి వర్షం లేదు. దున్నడం నుంచి విత్తనాలు విత్తే వరకు ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాం. మొలవని చోట్ల మళ్లీ విత్తనాలు పెట్టాల్సి వస్తుంది. ఈ ఏడాది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – ఐతగోని జంగమ్మ, రాంరెడ్డిపల్లి, మర్రిగూడ ఫ పత్తి విత్తనాలు వేసిన రైతుల్లో ఆందోళన ఫ చాలాచోట్ల మొలకె త్తని విత్తనాలు ఫ మొలకెత్తిన చోట వాడుబడుతున్నయ్ ఫ కాపాడుకునేందుకు కర్షకుల పాట్లు -
సూర్యాపేట: ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్, కానిస్టేబుల్ బ్లెస్సిన్ మృతి చెందారు. మరో పోలీసులకు గాయాలు కావడంతో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. దుర్గాపురం వద్దకు రాగానే ఒక్కసారిగా లారీ అదుపు తప్పి పోలీసులు ప్రయాణిస్తున్ను కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాద సమయంలో కారులోకి ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కారులో ముందు కూర్చోవడంతో ఎస్ అశోక్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ బ్లెస్సిన్ చనిపోయారు. ఇదిలా ఉండగా.. అంతకుముందే నిద్ర వస్తుంటే గంటన్నర పాటు రోడ్డు పక్కన కారు ఆపినట్టు క్షతగాత్రులు తెలిపారు. అనంతరం, బయలుదేరిన పదిహేను నిమిషాలకు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
బాల్య వివాహాలతో అనర్థాలు
మిర్యాలగూడ : బాల్య వివాహాలు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం మిర్యాలగూడ మండలంలోని దుబ్బతండా బాలికల గురుకుల పాఠశాలను ఆమె సందర్శించి బాలికా సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర మాట్లాడుతూ ఆడపిల్లలు 18 సంవత్సరాలు, అబ్బాయిలు 21 సంవత్సరాలు నిండాకే వివాహాలు చేసుకోవాలన్నారు. సమాజంలో ఎదురయ్యే స్యలను ధైర్యంగా ఎదుర్కొవాలన్నారు. బాలికలు రుతుక్రమ సమస్యలపై అవగాహన కలిగి ఉండి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ కృష్ణవేణి, సీడీపీఓ మమత, ఆయుర్వేధిక్ డాక్టర్ హేమాంజలి, జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత, ఎంఈఓ బాలు, ఎడ్యుకేషన్ ఆఫీసర్ సరస్వతి, వెంకన్న, వైద్యులు రవికుమార్, మోయిద్, ప్రిన్సిపాల్ ఉమాదేవి, గణేష్, అశ్రిత, కవిత, చినరాయుడు, కవిత, సక్కు, భవాని తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం త్రిపురారం : వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం త్రిపురారం ఎన్నెస్పీ క్యాంప్ ఆవరణలోని బాలికల వసతి గృహన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ భవనాన్ని పరిశీలించి కొన్ని గదుల పైకప్పు పెచ్చులు ఊడి ఉండడాన్ని గమనించి.. సురక్షితమైన భవనానికి మార్చాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, ఎస్ఐ నరేష్ ఉన్నారు.ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
యాంటీ డ్రగ్ సోల్జర్గా పనిచేయాలి
నల్లగొండ : మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్గా పనిచేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. డ్రగ్స్పై పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని కోరారు. యువత డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదు అయితే భవిష్యత్లో ఉద్యోగాలకు, ఏ ఇతర దేశాలకు కూడా వెళ్లే అవకాశం దొరకక జీవితం అంధకారం అవుతుందన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నెంబర్ (8712670266)కు తెలియజేయాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ సైదులు, వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఎన్ఎస్పీ భూముల సర్వే పరిశీలన
హాలియా : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామ పరిధిలో జరుగుతున్న ఎన్ఎస్పీ భూముల సర్వేను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అదనపు కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి ఆమె ఇబ్రహీంపేట గ్రామ పరిధిలోని ఎడమ కాల్వ యూటీ వద్ద, గ్రామ చివరలో ఎంత ఎన్ఎస్పీ భూమి ఉంది? ఏఏ సర్వే నంబర్లలో ఎన్ఎస్పీ భూములు ఉన్నాయి? అనే వివరాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, మండల ఇన్చార్జి తహసీల్దార్ రఘు, కమిషనర్ రామదుర్గారెడ్డి, సర్వేయర్ పోకల విజయ్కుమార్, ఆర్ఐ నవీన్కుమార్ తదితరులు ఉన్నారు. -
పంచాయతీలా.. పరిషత్లా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తప్పనిసరైంది. ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి.. తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. కానీ.. పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పాలక వర్గాలు పూర్తయి ఏడాదిన్నర అవుతుండగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయి సంవత్సరం దాటింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తారనేది చర్చనీయంశంగా మారింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులోనే ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కోర్టును ఆశ్రయించిన మాజీ సర్పంచ్లు పంచాయతీల్లో పాలక వర్గాల గడువు పూర్తయి ఏడాదిన్నర కావస్తోంది. దీంతో పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని, ఎన్నికలు నిర్వహించే వరకు పాత సర్పంచ్లను కొనసాగించాలంటూ నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మాజీ సర్పంచ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం గతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారిగా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దాంతో పాటు పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించనున్నందున ఇప్పటికే బ్యాలెట్ పేపర్లను ముద్రించి నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని షెడ్లలో భద్రపరిచారు. పోలింగ్ కోసం ఏపీ నుంచి తెప్పించిన బ్యాలెట్ బాక్సులకు మరమ్మతు చేయించి సిద్ధం చేసి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన వెంటనే సిబ్బందికి శిక్షణ ఇస్తే సరిపోనుంది. ముందుగా ఏ ఎన్నికలు? ఫ మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం ఫ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తర్జనభర్జన ఫ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జిల్లా యంత్రాంగం కసరత్తు ఫ ఇంకా తేలని బీసీ రిజర్వేషన్ల అంశం ఫ ఎన్నికలపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కోర్టులోనే బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోర్టు పరిధిలో ఈ సమస్య ఉన్నందున అది తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనేది వారి వాదన. అయితే విషయం కోర్టులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎన్నికలు పోతుందో అనేది వేచి చూడాల్సిందే. బీసీ రిజర్వేషన్ విషయంలో తీర్పు రాకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసైనా ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. మొదటిసారిగా నాలుగెకరాలకు పైబడి భూమి కలిగిన రైతులకు కూడా రైతుభరోసాను జమ చేసింది. దీన్ని అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులకు శిక్షణ కూడా పూర్తి పార్లమెంట్ ఎన్నికల తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారన్న సంకేతాలు రావడంతో జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పెట్టారు. ఎన్నికలు పార్టీ గుర్తుల ఆధారంగా నిర్వహించనున్నందున బ్యాలెట్ పేపర్లు తెచ్చి ఇప్పటికే ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచారు. పీఓ, ఏపీఓలకు శిక్షణ కూడా ఇచ్చారు. షెడ్యూల్ వస్తే మాత్రం ఓపీఓలకు కూడా డివిజన్ల వారీగా శిక్షణనివ్వడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు. -
రాష్ట్రానికి.. కేంద్రం రూ.11 లక్షల కోట్లు ఇచ్చింది
నల్లగొండ టూటౌన్ : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం 11 ఏళ్లల్లో రూ.11 లక్షల కోట్లు ఇచ్చిందని మహబూబ్నగర్ ఎంపీ, మాజీమంత్రి డి.కె.అరుణ అన్నారు. బుధవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, యూనివర్సిటీలు, రోడ్లు తదితర వాటి కోసం మోదీ ప్రభుత్వం అధిక నిధులు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నరేంద్రమోదీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. స్థానికసంస్థల ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడంలేదని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ తన పదవిని నిలుపుకోవడానికి ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఆ కాలంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి, పత్రికలను అణచి వేశారని, అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిజిటల్ మీడియాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 60 ఏళ్లు కుటుంబ పాలన కొనసాగిన దేశం అభివృద్ధి చెందలేదన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే నంబర్వన్గా నిలబెట్టుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, దర్శనం వేణు, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, రావెళ్ల కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.ఫ మహబూబ్నగర్ ఎంపీ డికె.అరుణ -
యాదగిరీశుడికి మరింత భద్రత
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మరింత భద్రత కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. - 8లోనార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి స్వామివారికి లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ఆవరణలో నిద్ర చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. పూజల్లో ప్రధాన అర్చకులు రామలింగేశ్వరశర్మ, సతీష్శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్శర్మ, ఈఓ నవీన్కుమార్ పాల్గొన్నారు. -
పెదా్దసుపత్రిలో వైద్య పరీక్షల్లేవ్!
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో రక్త పరీక్షలు నిలిచిపోయాయి. ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో సుమారు 45 రకాల రక్త పరీక్షలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం కొన్నిరకాల పరీక్షలను మాత్రమే చేస్తున్నారు. పరీక్షల కోసం రక్తంలో కలిపే రీఏజెంట్స్(కెమికల్స్) సరఫరా నిలిచిపోయిన కారణంగా పరీక్షలు చేయడం లేదు. ప్రస్తుతానికి కేవలం సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్షర్)తో పాటు మలేరియా తదితర పరీక్షక్షలు మాత్రమే చేస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్లో వేల రూపాయలు వెచ్చించి టెస్టులు చేయించుకుంటున్నారు. ప్రైవేట్లో పరీక్షలు చేయించుకోవాల్సిందే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోజూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇన్పేషంట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే వారి రోగ నిర్ధారణకు రక్త పరీక్షలు ప్రధానం. కానీ, తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో పరీక్షలు నిలిచిపోవడంవతో రోగులు బయటి డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలను చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తుత సీజన్లో డెంగీ పరీక్షలను నిర్ధారించడానికి అవసరమైన ఎలిసా పరీక్షలను చేయాల్సిన మిషన్ గత కొన్ని రోజులుగా మరమ్మతుకు గురైంది. దీంతో డెంగీ నిర్ధారణకు చేయాల్సిన ఎలిసా టెస్టులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. పీహెచ్సీల నుంచి నిలిచిన రక్త నమూనాలు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి రోజూ రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి టెస్ట్ల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి వాహనాల ద్వారా తీసుకొస్తారు. అక్కడ రక్త నమూనాలు ఇచ్చిన రోగులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరీక్షల ఫలితాలను సెల్ఫోన్కు పంపిస్తారు. రక్త పరీక్షల ఆధారంగా మెడికల్ ఆఫీసర్లు రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఇలా రోజూ వందల సంఖ్యలో రక్త నమూనాలను తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి వస్తాయి. ప్రస్తుతం టెస్టులు నిలిచిపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త నమూనాలు పంపించడం లేదు. రక్త పరీక్షలకు అంతరాయం ఏర్పడి రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ జీజీహెచ్లోని తెలంగాణ హబ్లో నిలిచిన బ్లెడ్ టెస్ట్లు ఫ రీఏజెంట్స్ సరఫరా లేకపోవడమే కారణం ఫ మరమ్మతుకు గురైన ‘ఎలీసా’ మిషన్ ఫ కొన్ని పరీక్షలు మాత్రమే చేస్తున్న సిబ్బందిత్వరలో అన్ని రకాల టెస్టులు చేస్తాం రక్త పరీక్షలు చేయడానికి అవసరమైన రీఎజెంట్స్ అయిపోయినందున కొన్ని పరీక్షలను చేయలేకపోతున్నాం. ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం. అవి సరఫరా కాగానే అన్ని రకాల టెస్టులు చేస్తాం. ఎలీసా పరీక్ష చేసే మిషన్ మరమ్మతుకు గురైంది. త్వరలో దాన్ని కూడా బాగు చేయించి టెస్టులు చేస్తాం. – డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం ఇన్చార్జి -
నల్లగొండకు నేడు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం నల్లగొండకు రానున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయానికి ఉదయం 10 గంట లకు చేరుకుంటారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళతారు.దరఖాస్తుకు నేడు చివరి గడువునల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్టు పద్ధతిన పీడియాట్రీషియన్(1), మెడికల్ ఆఫీసర్(4) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 26 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీడియాట్రిషన్ పోస్టుకు ఎండీ పీడియాట్రిషన్, మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అర్హత కలిగి ఉండాలలని.. 27న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు.ఇంటి నిర్మాణంలో నిబంధనలు పాటించాలిత్రిపురారం : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని హౌసింగ్ పీడీ రాజ్కుమార్ సూచించారు. బుధవారం త్రిపురారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. మండల వ్యాప్తంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లపై ఆరా తీశారు. ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయకుమారి, ఇన్చార్జి ఎంపీఓ కోడిరెక్క రాజేంద్రకుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలిదేవరకొండ : యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని దేవరకొండ ఏఎస్పీ మౌనిక కోరారు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం దేవరకొండ మండల పరిధిలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయన్నారు. విద్యార్ధులు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం వివిధ చట్టాలపై విద్యార్థులకు ఆమె అవగాహన కల్పించారు. సమావేశంలో సీఐ నర్సింహులు, ఎస్ఐ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.30వ తేదీ వరకు ఆసరా పింఛన్ల పంపిణీనల్లగొండ : ఆసరా పింఛన్లను ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసరా పింఛన్లను ఆయా పోస్టాపీస్లలో పొందాలని సూచించారు. పింఛనుదారులు మధ్య దళారీలను నమ్మవద్దని పేర్కొన్నారు.ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా శ్రీనివాస్నల్లగొండ టూటౌన్: ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం అధికారిగా అధ్యాపకుడు డి. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేరకు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి బుధవారం శ్రీనివాస్కు నియామక పత్రం అందజేశారు. -
రేషన్ షాపుల్లో పేరుకుపోతున్న బియ్యం
నల్లగొండ: గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం పోర్టబులిటీ విధానం అమలవుతుండటంతో పట్టణ ప్రాంతాలకు వలస పోయిన గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడే రేషన్ బియ్యం తీసుకుంటుండడంతో గ్రామాల్లోని రేషన్ షాపుల్లో బియ్యం మిగులుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని జూన్లోనే ఇస్తోంది. ఇప్పటికే రేషన్ షాపుల్లో దాదాపు 15 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. వాటిని వెనక్కి తీసుకుపోయే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో డీలర్లు దుకాణాల్లో స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. పాత బియ్యంతో పాటు మిగిలిన సన్న బియ్యం కూడా పురుగుపట్టే ప్రమాదం ఉందని వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మిగులుతున్న బియ్యం జిల్లాలో 994 రేషన్ షాపులున్నాయి. వాటి ద్వారా జిల్లాలో 4,84,216 కుటుంబాలకు ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. 3 నెలలకు సంబంధించి సన్న బియ్యం కోటాను ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ షాపులకు అలాట్ చేశారు. పంపిణీ ప్రక్రియ కూడా దాదాపు 80 శాతం పైచిలుకు పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఒక్కో షాపులో దాదాపుగా 10 నుంచి 20 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వచ్చే 2 నెలలు రేషన్ షాపులు బంద్ ఉంటుండడంతో బియ్యం పురుగు పట్టే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో షాపులకు మొత్తం కోటా కాకుండా తగ్గించి పంపాలని డీలర్లు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో షాపులకు కోటా తగ్గించి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ డీఎస్ఓ వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. ఫ గ్రామీణ రేషన్షాపుల్లో అత్యధిక నిల్వలు ఫ వలస వెళ్లినవారు పట్టణాల్లో తీసుకోవడమే కారణం ఫ మూడు నెలల సన్నబియ్యం కోటా కూడా మిగిలే అవకాశం ఫ పురుగు పడుతుందని డీలర్ల ఆవేదన ఫ అవసరాన్ని బట్టి పంపించాలని కోరుతున్న డీలర్లు -
మమ్మల్ని చులకనగా చూస్తున్నారు!
నల్లగొండ టూటౌన్ : పట్టణాల్లో సమభావన సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించేందుకు వార్డుల్లో నియమించిన మెప్మా రిసోర్స్ పర్సన్లపై మెప్మా కార్యాలయంలో పని చేస్తున్న సీఓ (కమ్యూనిటీ ఆర్గనైజర్లు)లు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆర్పీలు మనోవేదన చెందుతున్నారు. నెలకు రూ.6వేల గౌరవ వేతనంతో పనిచేసే వారిపై చులకన భావంతో మాట్లాడుతూ హేళన చేయడం పరిపాటిగా మారిందని పలువురు ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలగిరి మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా విభాగం ఉద్యోగులు కార్యాలయం గడప దాటకుండా అన్ని పనులూ ఆర్పీలతోనే చేయిస్తూ వారిని ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల కర్ర పెత్తనం మెప్మా ఉద్యోగులు పట్టణాల్లో మహిళలను సమావేశ పర్చడం, వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడం, ఇప్పించిన రుణాలను తిరిగి చెల్లించేలా చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ అన్ని పనులు వార్డుల్లో ఉన్న మహిళా ఆర్పీలపై నెట్టివేసి మెప్మాలోని ఇద్దరు ఉద్యోగులు వారిపైనే కర్ర పెత్తనం చెలాయిస్తూ సూటి పోటి మాటలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలపై మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి ఐదు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా చిన్న పిల్లలను నిలబెట్టినట్లు నిలబెట్టి కారణాలు చెప్పండంటూ వికృత చేష్టలకు దిగుతున్నట్లు సమాచారం. మెప్మా కార్యాలయంలోని ఓ కీలక ఉద్యోగి మహిళా ఆర్పీలను ‘బొంద పెట్ట, దినం చెయ్య.. పిండాలు పెట్ట’ అని వ్యాఖ్యలు చేస్తూ వారిని మానసికంగా వేధిస్తున్నట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెప్మా కార్యాలయంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపాలిటీలోని ఓ ఇద్దరు, ముగ్గురు మెప్మా ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.పద్ధతి ప్రకారం వ్యవహరించాలి ఆర్పీలపై అమార్యాదగా మాట్లాడినా, పద్ధతి ప్రకారం వ్యవహరించకున్నా సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలి. తదుపరి విచారణ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – సయ్యద్ ముసాద్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఫ అన్ని పనులూ మాతోనే చేయిస్తున్నారని మెప్మా మహిళా ఆర్పీల మనోవేదన ఫ ఉద్యోగులు.. మాపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణ ఆర్పీపై పేపర్లు విసిరేసిన మెప్మా ఉద్యోగి.. ప్రతి పది మంది మహిళలు గ్రూపుగా ఏర్పడి బ్యాంకులో ఖాతా తెరుస్తారు. వారిని గ్రూప్గా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా మెప్మా ఉద్యోగులదే. సీఓలే వార్డులకు వెళ్లి వారికి రుణం ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. కానీ బ్యాంకు రుణం కోసం టూటౌన్ పరిధిలోని ఓ ఆర్పీ మెప్మా కార్యాలయానికి 8 మంది సభ్యులను తీసుకువచ్చి పేపర్లపై సంతకం చేయాలని కోరగా ఇద్దరు సభ్యులు తక్కువగా వచ్చారని, ఆలస్యంగా వచ్చారనే కారణంతో ఆర్పీపై సదరు సీఓ పేపర్లు విసిరికొట్టినట్లు చర్చ జరుగుతోంది. దాంతో ఆమె విలపిస్తూ వెళ్లిపోయినట్లు తెలిసింది. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజీలో కూడా రికార్డు అయినట్లు ఆర్పీలు చెబుతున్నారు. ఇటీవల టూటౌన్ పరిధిలోనే ఓ ఆర్పీకి తెలియకుండా సీఓ ఒక సంఘానికి బ్యాంకు రుణం ఇప్పించి చేతివాటం ప్రదర్శించినట్లు తెలిసింది. తన ప్రమేయం లేకుండా బ్యాంకు రుణం ఇప్పించడంతో సదరు ఆర్పీ మరో 20 మంది ఆర్పీలతో కలిసి విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా సీఓను మందలించినట్లు తెలిసింది. దాంతో సదరు సీఓ ఆ 20 మంది ఆర్పీలను టార్గెట్ చేసి బ్యాంకు రుణాల మంజూరు విషయంలో కొర్రీలు పెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సంక్షేమం.. గాడిన పడేనా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఏళ్ల తరబడి ఇన్చార్జి అధికారులతో నెట్టకొచ్చిన సంక్షేమ వసతిగృహాలకు ప్రభుత్వం కొత్తగా హాస్టల్ వెల్ఫేర్ అధికారులను నియమించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 13 హాస్టళ్లు మినహా అన్ని వసతి గృహాలకు అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పూర్తిస్థాయిలో లేక ఉన్నవారిలో ఒకొక్కరు రెండు మూడు హాస్టళ్లకు ఇన్చార్జిగా వ్యవహరించాల్సి వచ్చింది. వారు రోజూ హాస్టళ్లకు వెళ్లలేకపోవడంతో వంట మనుషులపైనే ఆధారపడాల్సి వచ్చేంది. దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడింది. వారు ఏమి చదువుతున్నారో కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయేది. హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రావడంతో వసతి గృహాలు గాడిలో పడతాయని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత నియామకాలు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రిటైర్డ్ అవ్వడమే తప్ప 20 ఏళ్లుగా కొత్తగా రిక్రూట్మెంట్ కాలేదు. దీంతో ఇప్పటి వరకు హాస్టళ్లు ఇన్చార్జిలతో కొనసాగాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 హాస్టళ్లు ఉండగా.. ఇప్పటివరకు 29 మంది మాత్రమే వార్డెన్లు ఉండేవారు. వారిలో ఒకొక్కరికి 2 నుంచి 3 హాస్టళ్ల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. బీసీ, ఎస్టీ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉండేది. ప్రతి వార్డెన్ రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం సమయాల్లో హాస్టల్కు వెళ్లి అన్నీ చూసుకోవాలి. మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో ఉండడంతో.. రెండు పూటల మాత్రం హాస్టల్కు వెళ్లాల్సిందే. కానీ ఒక్కో అధికారికి మూడు హాస్టళ్లను అప్పజెప్పడంతో ఆయన విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్మెంట్తో పోస్టులను భర్తీ చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు చాలా వరకు కొత్తగా అధికారులు వచ్చారు. ఎస్సీలో 31 మంది కొత్తగా అలాట్.. జిల్లాలో 61 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉండగా గతంలో 29 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉండేవారు. ప్రస్తుతం కొత్త రిక్రూట్మెంట్ ద్వారా 5వ జోన్కు ప్రభుత్వం 54 మంది అలాట్ చేసింది. వారిలో నల్లగొండ జిల్లాలో 31 మంది జాయిన్ అయ్యారు. మిగిలిన వారు జోన్ 5 పరిధిలోని యాదాద్రి, సూర్యాపేట, జనగాం జిల్లాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం దామరచర్ల మినహా అన్ని హాస్టళ్లకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. బీసీలో 13 మంది నియామకం జిల్లాలో 46 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉండగా మొన్నటి వరకు 27 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. కొత్తగా 13 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రావడంతో 40 హాస్టళ్లకు అధికారులు ఉన్నారు. ఆరు హాస్టళ్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో ఐదుగురి చేరిక జిల్లాలో 42 గిరిజన సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 14 ఆశ్రమ పాఠశాలలు. అయితే వీటి పరిధిలో ఆశ్రమ పాఠశాలల హెడ్మాస్టర్లే వార్డెన్లుగా వ్యవహరిస్తారు. మరో 17 హాస్టళ్లకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. 11 హాస్టళ్లకు అధికారులు లేరు. కొత్త రిక్రూట్మెంట్తో జిల్లాకు ఏడుగురిని అలాట్ చేయగా అందులో ఐదుగురు మాత్రమే విధుల్లో చేరారు. ఇద్దరు ఇప్పటికే ఇతర ఉద్యోగాల్లో ఉన్నందున వారు విధుల్లో చేరలేదు. దీంతో ఇంకా ఆరు హాస్టళ్లకు ప్రస్తుతం అధికారులు లేరు. ఏళ్ల తరబడి ఇన్చార్జిలతోనే సగం వసతిగృహాలు ఫ ప్రస్తుతం 13 మినహా అన్ని హాస్టళ్లకు సంక్షేమ అధికారుల నియమాకం ఫ పర్యవేక్షణ పెరుగుతుందని తల్లిదండ్రుల ఆశాభావం వంట మనుషులతోనే నిర్వహణ.. ఇన్చార్జి బాధ్యతలు ఉన్న చోట వెల్ఫేర్ అధికారి వంటకు సరిపడా బియ్యాన్ని, కిరాణా సామగ్రిని వంట మనుషులకు అప్పగించి వచ్చేవారు. దాంతో వారు వండి విద్యార్థులకు పెట్టేవారు. అధికారి రోజూ ఒక చోటకు వెళ్లాల్సి వచ్చేది. దీంతోపాటు కార్యాలయాల్లో సమావేశాలు, బిల్లులు పెట్టుకునేందుకు కూడా తిరగాల్సిందే. దీంతో వంట మనుషులే హాస్టల్ నిర్వహణ చూసేవారు. -
క్రీడా పాఠశాలల్లో ప్రవేశంతో ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : క్రీడా పాఠశాలల్లో ప్రవేశం పొందితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి మంగళవారం నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించడం ద్వారా ఎంతో పేరు వస్తుందన్నారు. ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఓ అక్బర్ అలీ, పీడీలు కుంభం నర్సిరెడ్డి, విమల, కవిత, నజీర్ పాల్గొన్నారు. -
పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
రామగిరి(నల్లగొండ) : పాలిసెట్ – 2025 కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభమైందని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.నరసింహ అన్నారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని.. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు జూన్ 26 నుంచి జూలై 1వ తేదీ వరకు కాలేజీ ఎంపికకు ఆన్లైన్లో ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. మహిళలు పొదుపుపై దృష్టి పెట్టాలిమునుగోడు : మహిళలు సమాఖ్య సంఘాల్లో చేరి తమ ఆదాయంలో కొంత నగదుని పొదుచేసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి సూచించారు. మంగళవారం మునుగోడులోని మహిళా సమాఖ్య భవనంలో నూతనంగా ఎన్నికై నా మహిళ సమాఖ్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కోశాధికారులకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్ధిక అభివృద్ధికి అనేక ప్రోత్సహాకాలు అందిస్తోందన్నారు. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం మోహన్రెడ్డి, ఎంపీడీఓ ఈ.విజయభాస్కర్, ఏపీఎం మేసేశ్వరావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు పంతంగి రాధ, కార్యదర్శి బోయపర్తి యాదమ్మ, సీసీలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలినాగార్జునాసాగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి కోరారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ సంస్థాగత జిల్లాస్థాయి సమావేశం మంగళవారం సాగర్లోని విజయవిహార్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలమైన నిర్మాణానికి పునాదులు వేయాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు చెల్లని నాణానికి బొమ్మాబొరుసు లాంటివని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కంకణాల నివేదితారెడ్డి, పిల్లి రామరాజుయాదవ్, మాదగోని శ్రీనివాస్గౌడ్, చనమోని రాములు, ఎస్కే బాబా, వీరారెడ్డి, రామదాసు, తంగరాజు, రాజు పాల్గొన్నారు. బాలికాసాధికారిత సాధించాలి గుర్రంపోడు : కేజీబీవీ విద్యార్థినులు బాగా చదువుకుని ప్రయోజకులై స్వశక్తితో ఎదిగి బాలికా సాధికారికతను సాధించే దిశగా ముందుకు సాగాలని జీసీడీఓ కె.అరుందతి ఆకాంక్షించారు. మంగళవారం గుర్రంపోడు కేజీబీవీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థిని కనీస సామర్థ్యాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధించాలని టీచర్లకు సూచించారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని.. విద్యార్థినులకు ఇబ్బంది కలగితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. కేర్ టేకర్ రోజూ స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఓ విజయశ్రీ, సిబ్బంది రాధా, సులోచన, కవిత, ఉమాదేవి, ధనలక్ష్మి, నేహదీప్తి, నీలవేణి, జ్యోతి, కేర్ టేకర్ స్వాతి, ప్రమీల పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ : 2025–26 విద్యా సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో మూడేళ్ల శిక్షణ కోసం జిల్లాలోని ఎస్సీ న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీడీ శశికళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31వ తేదీలోగా telanganaepass.cgg.gov.inలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. హార్డ్ కాపీని వారి బయోడేటా కుల, ఆధాయ ధ్రువీకరణపత్రాలు, డిగ్రీ మార్కుల జాబితా, బార్ కౌన్సిల్ నమోదు పత్రాలు జత చేసి ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. సందేహాలు, పూర్తి వివరాల కోసం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఇరాన్పై దాడిని ఖండించాలి
మిర్యాలగూడ అర్బన్ : ఇరాన్పై అమెరికా దాడులను ఖండించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు. ఇరాన్పై దాడులను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మండలంలోని యాద్గార్పల్లిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమెరికా ఇంటిలిజెన్స్ నిఘా వర్గాలు ఇరాన్ వద్ద అణుబాంబులు లేవని స్పష్టంగా చెప్పినప్పటికీ అమెరికా తమ ఆధిపత్యం కోసం ఇరాన్పై యుద్ధం చేస్తోందని మండిపడ్డారు. అనంతరం ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు వస్కుల మట్టయ్య, బంటు వెంకటేశ్వర్లు, డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, వినోద్నాయక్, వరలక్ష్మి, పరశురాములు, శ్రీనివాస్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు ఎకరాలున్నా.. రైతు భరోసా రాలే!
ఫ మహిళా రైతు ఆవేదన చందంపేట : చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన తుమ్మల మల్లమ్మకు 4 ఎకరాల భూమి ఉండగా పత్తి విత్తనాలు విత్తింది. గతంలో రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందింది. కానీ తాజాగా ఆమెకు రైతు భరోసా అందలేదు. తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని అందులో కూడా పత్తి సాగు చేస్తోంది. ఈ విషయమై ఆమె వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పకుండా.. ఆన్లైన్ నుంచి భూమి తొలగించారని చెబుతున్నారని మల్లమ్మ వాపోతోంది. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
నకిరేకల్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆమె నకిరేకల్లోని ఏరియా ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శోభారాణి అందుబాటులో లేకపోవడం, పలు గదులకు తాళాలు వేసి ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. క్వాజువాలిటీ, పురుషలు, మహిళ అత్యవసర వార్డులు, మందుల స్టాక్ను తనిఖీ చేశారు. ఇది పీహెచ్సీ కాదని ఏరియా ఆస్పత్రి అని.. డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం రూ.32 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మిస్తున్నందున, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వైద్య సేవలందించాలని సూచించారు. ఆమె వెంట నల్లగొండ ఆర్డీఓ యానాల అశోక్రెడ్డి ఉన్నారు. టీబీ నివారణపై దృష్టి పెట్టాలి నల్లగొండ : టీబీ (క్షయ) నివారణపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్న్ఫామె అధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శ్రద్ధ పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు టైపాయిడ్, డెంగీ తదితర వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని చెప్పారు. రైతులు ఎరువులకు ఇబ్బంది పడకుండా చూడాలని వ్యవసాయ అధికారిని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, జిల్లా అటవీశాఖాధికారి రాజశేఖర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఏఓ శ్రవణ్కుమార్, డీపీఓ వెంకయ్య, హార్టికల్చర్ డీడీ అనంతరెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
చదువుకోవాలని ఉంది.. కానీ పేదరికం అడ్డొచ్చింది!
యాదగిరిగుట్ట: ఆ బాలికకు చదువుకోవాలని ఉంది.. కానీ పేదరికం అడ్డొచ్చింది. కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో అమ్మమ్మతో కలసి భిక్షాటన చేస్తోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో భిక్షాటన చేస్తున్న ఆ బాలికను యాదగిరిగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ పలకరించి, చదివించేందుకు ప్రయత్నం చేశారు. మెదక్ జిల్లా అమీన్పూర్లోని టైలర్ కాలనీకి చెందిన పార్వతమ్మ, ఆమె 12 సంవత్సరాల మనుమరాలు శిరీషలు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. శిరీషకు చదువుకోవాలని ఉన్నా పేదరికంతో చదువుకు దూరమైంది. పొట్టకూటికోసం కొంత కాలంగా తన అమ్మమ్మ పార్వతమ్మతో కలసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వైకుంఠద్వారం వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ క్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటి సోమవారం అటుగా వెళ్తూ బాలికను గమనించి ఆమె వద్దకు వెళ్లారు. చదువుకోకుండా భిక్షాటన ఎందుకు చేస్తున్నావని శిరీషను అడిగారు. దీంతో శిరీష ఏడుస్తూ.. తనకు చదువుకోవాలని ఉన్నా డబ్బులు లేవని, పూటగడవడం కోసం అమ్మమ్మతో కలసి భిక్షాటన చేసేందుకు వచ్చానని చెప్పింది. దీంతో చలించిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటి.. భువనగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన అధికారులు.. శిరీషకు, ఆమె అమ్మమ్మకు కౌన్సెలింగ్ చేసి భువనగిరి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. బాలికకు సాయం చేసిన కానిస్టేబుల్ కోటిని ట్రాఫిక్ సీఐ కృష్ణ అభినందించారు. -
కొడుకు అన్నం పెట్టడం లేదు
నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెళ్లిల్లు అయినాయి. ఇద్దరు కొడుకులకు 22 ఎకరాల భూమిని పంచిచ్చాను. నా పేరున 2 ఎకరాల భూమి ఉంది. ఒక కొడుకు చనిపోయాడు. మరో కొడుకు ఊరిలో వ్యవసాయం చేస్తున్నాడు. నాకు ఇటీవల గుండె నొప్పి రావడంతో స్టంట్ వేసిండ్రు. నా కొడుకు నాకు అన్నం పెట్టడం లేదు. హైదరాబాద్లో ఉండే నా పెద్ద కూతురు వద్ద ఉంటున్నాను. ఊరిలోకి వెళ్లి నా పేరున ఉన్న భూమిని అమ్ముకందామన్నా అమ్ముకోనీయడం లేదు. నాకు న్యాయం చేయాలి. – దేవకమ్మ, నర్సర్లపల్లి, చింతపల్లి మండలం -
26 సార్లు ఫోన్చేసినా కలెక్టర్ స్పందించలే..!
నల్లగొండ: నకిరేకల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంపై కలెక్టర్తో చర్చించేందుకు 26 సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ప్రజావాణికి వచ్చానని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సమస్యలపై ఫోన్ చేసినా కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ బోయవాని శ్రీను అర్జీలను కలెక్టర్ చూసి దాటవేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే ప్రదీప్రెడ్డిపై అధికారులు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారన్నారు. తప్పుడు రిపోర్టులతో కేతేపల్లి పంచాయతీ సెక్రటరీపై వేటు వేశారన్నారు. చిన్నకాపర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలోని భవనాలను నేలమట్టం చేశారని ఆరోపించారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ నాయకులకే ఇస్తున్నారన్నారు. ఫ అందుకే ప్రజావాణికి వచ్చా.. ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
భూమి రిజిస్ట్రేషన్ కాకుండా ఆపండి
నా భర్త చిన్న లింగయ్యకు గ్రామంలో 7.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కూలి కోసం ఆంధ్రాలోని మచిలీపట్నం వెళ్లాడు. అక్కడే ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. నేను ఇక్కడే ఉంటు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి నా బాగోగులు పట్టించుకోలేదు. నా తమ్ముడే అన్ని చూసుకుంటున్నాడు. నా భర్త నాకు తెలియకుండా అన్నెపర్తిలో 3 ఎకరాల భూమిని ఇతరులకు విక్రయించాడు. మిగతా భూమిని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ భూమిని వేరే వారి పేర రిజిస్ట్రేషన్ చేయకుండా నిలుపుదల చేసి నాకు చెందేలా చూడాలి. – అంతటి లింగమ్మ, అన్నెపర్తి, నల్లగొండ మండలం -
కోడలు, కొడుకు పట్టించుకోవట్లేదు
మాకు నాగయ్య, శంకర్ అనే కొడుకులు ఉన్నారు. మాకున్న 3 ఎకరాల 25 గుంటల భూమిని 2012లో వారిద్దరికి పట్టాలు చేశాం. 2024లో నా చిన్న కొడుకు మరణించాడు. నా కొడుకు పేరున ఉన్న భూమిని నా కోడలు పౌతి పేరున పట్టా చేయించుకుంది. ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నాం. మా ఆరోగ్యం బాగలేదు. పెద్ద కొడుకు కాని, చిన్న కోడలు కాని పట్టించుకోవడం లేదు. మా పిల్లలకు ఇచ్చిన భూమిని తిరిగి మా పేర పట్టా చేసి న్యాయం చేయాలి. – చిట్టిమల్ల బుచ్చయ్య దంపతులు, నరసింహులపురం, నకిరేకల్ మండలం -
మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు
నల్లగొండ : యువతీ యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్య సాధనకు కృషిచేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం నల్లగొండలోని ఆదిత్య పాఠశాల విద్యార్థులతో కలిసి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతిఒక్కరూ డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల సమాజ నిర్మూలనే లక్ష్యం అనే అంశంపై ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాజశేఖర్రెడ్డి, రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్ హరిబాబు, ఎస్ఐలు సైదులు, సైదాబాబు, శంకర్, విద్యార్థులు తదితరలుఉ పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ శరత్చంద్ర పవార్ పోలీసు వృత్తి నైపుణ్యాలపై డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారుల, సిబ్బంది నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. డ్యూటీ మీట్లో గెలుపొందిన వారిని రేంజ్ మీట్కి పంపుతామన్నారు. కేసుల దర్యాప్తులో ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం లాంటి అంశాలలో పట్టు సాధించాలని సూచించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలి బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్లో ఆయన పాల్గొని 52 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఆదరించట్లేదు.. ఆదుకోండమ్మా
నల్లగొండ : కనిపెంచి పెద్ద చేశాం.. ఆస్తులు పంచిచ్చాం.. వృద్ధాప్యంలో ఉన్న మమ్ములను కన్న కొడుకులు సరిగా చూసుకోవడం లేదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి పలువురు వృద్ధులు తమ గోడు వినిపించారు. కన్నకొడుకులు ఆదరించట్లేదు.. మమ్ములను ఆదుకోండమ్మా అంటూ కలెక్టర్కు తమ సమస్యలను విన్నవించారు. వృద్ధులతోపాటు వివిధ సమస్యలను విన్నవించేందుకు జనం కూడా భారీగా వచ్చి ఫిర్యాదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డిలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫ ఆస్తులు పంచిచ్చినా కొడుకులు అన్నం పెట్టట్లేదు ఫ ప్రజావాణిలో గోడు వినిపించిన పలువురు వృద్ధులు ఫ కలెక్టర్కు ఫిర్యాదుల వెల్లువ -
రైతు భరోసా సంబరాలు నిర్వహించాలి
నల్లగొండ : ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులకు రైతు భరోసా ఇస్తున్నారని, దీనిపై పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సంబరాలు నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు రుణ మాఫీ, సన్న బియ్యం అందిస్తూ రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేశామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పనికిరాని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తున్నందుకు ముఖ్యమంతి, జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి, మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలిమిర్యాలగూడ : గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరగనుందని, దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో ఎస్ఎన్డీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సీపీఎం నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు సోమవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సమస్యలు తిష్టవేశాయని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, వినోద్నాయక్, శశిధర్రెడ్డి, రొండి శ్రీనివాస్, చౌగాని సీతారాములు, అయూబ్, గాదె పద్మ, సత్యనారాయణ పాల్గొన్నారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి అన్నారు. నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం బీజేవైఎం నాయకులు విద్యా రంగ సమస్యలు, మౌలిక సదుపాయాలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో బాలికలకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయకుండా విద్యార్థుల పట్ల వివక్ష చూపుతుందన్నారు. ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం బీజేవైఎం కార్యకర్తలు పోరాడాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ సవరణ చట్టాన్ని రద్దుచేయాలినల్లగొండ టౌన్ : కేంద్రం తీసుకొచ్చిన పెన్షనర్స్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవరణ చట్టం వల్ల పెన్షనర్స్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసా
రైతులతో మాట్లాడనున్న సీఎం ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. రైతు వేదికల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించే వీడియో కాన్పరెన్స్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలోని 93 రైతు వేదికల ద్వారా రైతులు ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని 93 రైతు వేదికల పరిధిలోని రైతులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రతి రైతు వేదికకు ఒక నోడల్ అధికారిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. -
సీజనల్ వ్యాధులను అరికడతాం
వ్యాధులు వ్యాపించే సీజన్ వర్షాకాలంలో దోమలు, ఈగల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాగునీరు కలుషితం అవుతుంది. ఈ కాలంలో పరిసరాలు అపరిశుభ్రంగా మారతాయి. దీని కారణంగా మలేరియా, డెంగీ, మెదడువాపు, పైలేరియా, చికున్గున్యా, డయేరియా, కలరా, టైపాయిడ్, స్వైన్ఫ్లూతోపాటు అనేక రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. వీటిని అధిగమించడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్నిరకాల చర్యలు చేపట్టింది. ఫ అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం ఫ వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం ఫ వైద్యసిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ‘వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అన్ని రకాల మందులను సిద్ధంగా ఉంచాం. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం’ అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకున్న చర్యలపై ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. –నల్లగొండ టౌన్ ప్రజలు జాగ్రత్తలు పాటించాలి వర్షాకాలంలో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. పరిసరాల్లో నీటి గుంతల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని వడబోసుకుని తాగాలి. వేడివేడి పదార్థాలు తినాలి. తాగునీటి ట్యాంకులో ఫ్లోరిన్ బిల్లలు వేసుకోవాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మున్సిపల్, పంచాయతీ సిబ్బంది సహకారం గ్రామాలు, పట్టణాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం మురుగు గుంతల్లో మట్టిని పోయించడానికి పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు పారిశుద్ధ్య పనుల కోసం ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించాం. పట్టణాల్లో దోమల నివారణకు మురుగు కాల్వల్లో పైరాత్రమ్ లిక్విడ్తోపాటు ఆబేగ్ టాబ్లెట్లను వేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. -
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
పాఠశాలల్లో ఎకో క్లబ్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం నల్లగొండ : పచ్చదనం పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా మొక్కల ప్రాధాన్యంతోపాటు వివిధ అంశాలపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులను పర్యావరణ సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో వారిని భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనిపై ఈ క్లబ్లను ఈ విద్యాసంవత్సరం నుంచి ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పిలవనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొత్త క్లబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఇవి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం ఈ సంవత్సరం పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి స్కూల్ నుంచి ఒక కమిటీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,483, ప్రైవేట్ స్కూళ్లు 369 ఉండగా ఆయా స్కూళ్లలో 1.86 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రతి పాఠశాల నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమంగా చేపట్టిన ఏడు అంశాలలో ఎకో క్లబ్లను భాగస్వామ్యం చేస్తారు. ఫ జూలై 29లోపు కమిటీలు వేయాలని ఆదేశం ఫ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పేరుతో ఏడు అంశాలపై ప్రచారం ఫ గతేడాది ఆశించిన స్థాయిలో రాని ఫలితాలు ఫ ఈ ఏడాది పక్కా కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం ప్రభుత్వ పాఠశాలలు 1,483విద్యార్థుల సంఖ్య 61,073 ప్రైవేట్ స్కూళ్లు 369విద్యార్థులు 1,25,572 వచ్చే నెలాఖరులోగా.. ఈ నెల 16 నుంచి వచ్చేనెల 29 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి టీచర్లను, పాఠశాల కమిటీ చైర్మన్ను క్లబ్లో భాగస్వాములు చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడు అంశాలకు సంబంధించిన యాక్టివిటీ ఫొటోలు, వీడియోలు తీసి ప్రత్యేక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అవగాహన కల్పించే ఏడు అంశాలు ఇవే.. ఇంధన పొదుపు నీటి పొదుపు సింగిల్ యూజ్ వాడొద్దు సుస్థిర ఆహార వ్యవస్థలు వృథాను అరికట్టడం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ఈ–వ్యర్థాలను తగ్గించడం. -
పేదల సొంతింటి కల సాకారం
నకిరేకల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి కళ్లలో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. నకిరేకల్లోని మినీ స్టేడియంలో ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇళ్ల ధ్రువ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆదాయంలో మిగులు రాష్టంగా ఉన్నా గత ప్రభుత్వం 8లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రచారం చేశారు తప్పితే పేదలకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. కాంగ్రెస్ ప్రజా పాలనలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యసాయాన్ని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఈ ఏడాది ఉగాది కానుకగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింది ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున గడిచిన తొమ్మిది రోజుల్లోనే రూ.9 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. గత ప్రభుత్వానికి, నేటి ప్రభుత్వానికి ప్రజలు తేడాను గమనించి కాంగ్రెస్ను దీవించాలని కోరారు. ఎమ్మెల్యే వీరేశం కోరిక మేరకు నకిరేకల్, రామన్నపేటలో తహసీల్దార్ కార్యాలయ భవనాలకు వారం రోజుల్లో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇళ్ల మంజూరులో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం : భువనగిరి ఎంపీ చామల భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పేదవారికి ఇళ్లు ఇవ్వడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలన్నారు. జిలా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా చేశామన్నారు. స్టీల్, సిమెంట్ తదితర సామగ్రి ధరల నియంత్రణకు మండల స్థాయిలో కమిటీలు వేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీలు శంకరనాయక్, నెల్లికంటి సత్యం, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, నాయణఅమిత్, ఆర్డీఓ యానాల అశోక్రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్కుమార్, జిల్లా పరిషత్ ఈసీఓ శ్రీనివాస్రావు, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, మున్సిపల్ చైర్ పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజిత, వైస్ చైర్పర్సన్ ఉమారాణి, మాజీ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, వివిధ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఫ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఫ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల దీవెనలుండాలి ఫ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫ నకిరేకల్లో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ నిబంధనలు సడలించాలి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలు సడలించాలని సూచించారు. ధరణి పోర్టల్తో రైతులు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. -
కుల వ్యవస్థపై పోరాడాలి
ఫ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు కట్టంగూర్ : సమాజంలోని పేదల ఐక్యతకు అడ్డుగోడగా ఉన్న కుల వ్యవస్థపై పోరాడాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం కట్టంగూర్ మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. దళితులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను నిర్వీర్యం చేశారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లబ్ధిదారునికి రుణం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగ యువతకు సబ్సిడీ ద్వారా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఆ సంఘం ప్రతినిధులు కొండేటి శ్రీను, పెంజర్ల సైదులు, రెవిడాల పరుశురాములు, కోడిరెక్క రాధిక, వంటెపాక కృష్ణ, విజయ్కుమార్, గాదె నర్సింహ, దైద శ్రీను, బోళ్లు రవీంద్రకుమార్, దండు రవి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు
నల్లగొండ టూటౌన్: క్రీడా పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశానికి స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24,25 తేదీల్లో విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి ఎం.డి అక్బర్అలీ ఒక ప్రకటనలో తెలిపారు. 24న బాలికలకు, 25న బాలురకు నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి వివరాలకు సెల్ : 8074487020 నంబర్ను సంప్రదించాలని కోరారు.స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదునల్లగొండ: ఉపాధ్యాయులకు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పి.వెంకులు అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించడం వల్ల ఆయా పాఠశాలల్లో బోధన స్తంభించిపోతుందన్నారు. మండల, ఉప విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులను నియమించి పాఠశాలల పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. శివన్నగూడ రిజర్వాయర్ పనులు అడ్డగింతమర్రిగూడ : శివన్నగూడ రిజర్వాయర్ పరిఽధిలో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు తమకు ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామ సమీపంలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు అందరితోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు నిర్వాసితులు ఉన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలి నల్లగొండ టూటౌన్: ఫుట్బాల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి అక్బర్ అలీ అన్నారు. ఈ నెల 28 నుంచి జూలై ఒకటవ తేదీ వరకు నిజామాబాద్లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఆదివారం ఔట్డోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.కర్తయ్య, ఫుట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు బండారు ప్రసాద్, గిరిబాబు, కవిత, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
భవిత.. భరోసా!
‘ప్రత్యేక’ విద్యార్థులకు చేయూతనిస్తున్న భవిత కేంద్రాలు సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025నల్లగొండ: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భవిత కేంద్రాలు భరోసానిస్తున్నాయి. సాధారణ విద్యార్థుల తరహాలోనే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. మానసిక పరిపక్వత కార్యక్రమాలతో వారిలో ఆత్మస్థైర్యం పెంచేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. జిల్లాలోని భవిత కేంద్రాలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక శ్రద్ధచూపుతూ బుద్ధిమాంద్యం, ఇతర దివ్యాంగ, మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిత్యం సందర్శిస్తున్నారు. సమాజంలో గౌరవించబడేలా.. అన్ని అవయవాలు సవ్యంగా ఉంటేనే బతకడం కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కారణాలతో వైకల్యంతో జన్మించిన పిల్లల పరిస్థితి ఊహించలేనిది. అలాంటి వారిలో ఎక్కువగా మానసిక వైకల్యంతోపాటు ఇతర వైకల్యాలతో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అలాంటి పిల్లలు సాధారణ పిల్లల తరహాలోనే విద్యాబుద్ధులు నేర్చుకుని సమాజంలో అందరూ గౌరవించేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిత కేంద్రాలను ఏర్పాటు చేశాయి. జిల్లాలో ఉన్న భవిత కేంద్రాల్లో వసతులు కల్పించేందుకు కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ.కోటి 20 లక్షలు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే వివిధ సామగ్రి కొనుగోలు, వసతుల కల్పనకు రూ.72 లక్షలు విడుదల చేసి వివిధ పనులు చేపడుతున్నారు. న్యూస్రీల్అక్రమ డిప్యుటేషన్లు రద్దుచేయాలిఫ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి ఫ సాధారణ విద్యార్థుల తరహాలోనే విద్యాబోధన ఫ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి ఫ అందంగా ముస్తాబవుతున్న కేంద్రాలు ఫ కొన్నిచోట్ల కొనసాగుతున్న పనులు ప్రత్యేక పిల్లలకు చేయూతనివ్వాలి జిల్లాలో 700 మంది వరకు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలున్నట్లు గుర్తించాం. వారందరూ భవిత కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులను ఒప్పిస్తాం. సాధారణ విద్యార్థుల మాదిరిగానే వారికీ విద్యాబుద్ధులు నేర్పే దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రత్యేక పిల్లలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – ఇలా త్రిపాఠి, కలెక్టర్జిల్లాలో భవిత కేంద్రాలు 31‘ప్రత్యేక’ విద్యార్థుల సంఖ్య 459 -
ఒక్క పోస్టు.. ఇద్దరు ఎస్ఈలు
నల్లగొండ: నల్లగొండ విద్యుత్ శాఖలో వింత వ్యవహారం కొనసాగుతోంది. ట్రాన్స్కోలో ఇద్దరు ఎస్ఈలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒకరికి పదోన్నతి ఇచ్చి ఎస్ఈగా నియమించింది. ఆ తర్వాత పదోన్నతి తొలగించి మరో వ్యక్తిని బదిలీ చేసింది. దాంతో మొదటి అధికారి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని అదే సీటులో కూర్చొగా బదిలీపై వచ్చిన అధికారి కూడా పక్క రూమ్లో సీటు వేసుకుని మరో ఎస్ఈగా కొనసాగుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర సీఈ పరిధిలో ఉన్నప్పటికీ పది నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక పోస్టులో ఇద్దరు ఎస్ఈలు కొనసాగుతున్నారు. అసలేం జరిగిందంటే.. ట్రాన్స్కోలో నల్లగొండ డీఈగా పనిచేస్తున్న హరిప్రసాద్కు పీహెచ్సీ ఆర్థో కోటాలో ప్రభుత్వం 2022 నవంబర్లో ఎస్ఈగా పదోన్నతి కల్పించింది. ఆ తర్వాత ఆయనకు ఇచ్చిన పదోన్నతిలో పొరపాటు జరిగిందని అది పీహెచ్సీ హెచ్హెచ్కు ఇవ్వాల్సిందని హరిప్రసాద్కు ఇచ్చిన పదోన్నతిని ఆ శాఖ అధికారులు 2024 ఆగస్టు 14న రద్దు చేశారు. దీన్ని సవాలు చేస్తు హరిప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకుని ఎస్ఈగా కొనసాగుతున్నారు. అయితే హరిప్రసాద్ పదోన్నతిని రద్దుచేసిన వెంటనే నల్లగొండ ట్రాన్స్కో ఎస్ఈగా కె.నారాయణరెడ్డిని నల్లగొండకు బదిలీ చేశారు. దీంతో ఆయన విధుల్లో చేరినప్పటికీ ఎస్ఈ కుర్చీలో కూర్చొలేని పరిస్థితి. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న హరిప్రసాద్ సీట్లో కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. దీంతో బదిలీపై వచ్చిన నారాయణరెడ్డి పక్క గదిలో ప్రత్యేక కుర్చీ వేసుకుని కూర్చుంటున్నారు. ఫ విధుల్లో ఉండేది మాత్రం ఒక్కరే.. ఫ మరొకరు సంతకం పెట్టి జీతం తీసుకుంటున్న వైనం ఫ పట్టించుకోని ఉన్నతాధికారులు ఫ నల్లగొండ విద్యుత్ శాఖలో వింత వ్యవహారం పది నెలలుగా ఇదే పరిస్థితి.. పది నెలల నుంచి ట్రాన్స్కోలో వింత పరిస్థితి నెలకొంది. ట్రాన్స్కో ఎస్ఈగా ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. అయితేన హరిప్రసాద్ నేరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలు, ఇతర అన్ని ఫైళ్లను ఆయనే చూస్తుండగా పదోన్నతిపై వచ్చిన నారాయణరెడ్డి మాత్రం పది నెలల నుంచి కేవలం విధుల వస్తూ సంతకం పెట్టి వేతనం తీసుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయమై ట్రాన్స్కో సీఈ లతను వివరణ కోరగా ఈ అంశం నా పరిధిలో లేదని తెలిపారు. -
వివాహేతర సంబంధం: చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టి హత్య
నల్గొండ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో మహిళ భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య(35)కు ఇంకా వివాహం కాలేదు. జానయ్యకు అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. గతేడాది ఇదే విషయమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, జానయ్యకు మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీలు కూడా నడిచాయి. ఇదే విషయంపై జానయ్యపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అతడు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక కూడా జానయ్య ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి జానయ్యను అంతమొందించాలని ఆ మహిళ భర్త నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన భార్యతోనే జానయ్యను శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి పిలిపించాడు. ఇంటికి వచ్చిన జానయ్య కళ్లలో కారం చల్లి.. కాళ్లు, చేతులు కట్టేసి ఆ మహిళతోపాటు ఆమె భర్త కర్రలతో చితకబాదారు. అనంతరం మరికొందరితో కలసి ఇంటి పక్కన ఉన్న వీధిలో చెట్టుకు జానయ్యను తాళ్లతో కట్టేసి అతడి తల, కాళ్లు, చేతులు, మర్మాంగాలపై విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన జానయ్య అసస్మారకస్థితిలోకి వెళ్లాడు. చుట్టుపక్కల వారు గమనించి జానయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి జానయ్యను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై జానయ్య తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి
నల్లగొండ టూటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. శనివారం నల్లగొండలోని వీటీ కాలనీలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ముఖ్యమైనవని, అత్యధిక స్థానాలు కై వసం చేసుకునే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కటికం సత్తయ్యగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, చీర పంకజ్యాదవ్, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్రెడ్డి, ఐయితగాని యాదయ్య, దేప వెంకట్రెడ్డి వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి -
పంద్రాగస్టు నాటికి పరిష్కారం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూ భారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20 వరకు 17 రోజుల పాటు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,01,605 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 15 రకాల సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారంతో రెవెన్యూ సదస్సులు ముగియడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఆగస్టు 15లోగా అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 1,136 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,136 రెవెన్యూ గ్రామాల్లో భూ భారతి గ్రామసభలు నిర్వహించారు. మొత్తం 1,01,605 దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించారు. అయితే ఇందులో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లు, ఫౌతితో పాటు అసైన్డ్ భూముల సమస్యలు, పెండింగ్ మ్యుటేషన్పైనే దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ప్రారంభమైన దరఖాస్తుల పరిశీలన.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో పెద్ద ఎత్తున భూ సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ధరణిని రద్దు చేసి భూ భారతిని తీసుకొచ్చింది. అన్ని భూ సమస్యలను పరిష్కరించేలా భూ భారతిలో ఆప్షన్లను సిద్ధం చేసింది. 20వ తేదీ వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సదస్సులు ముగియడంతో అధికారులు దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజించి పరిశీలిస్తున్నారు. సాదాబైనామాలు పెండింగేనా..! ప్రభుత్వం అన్ని రకాల భూ సమస్యలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే సాదాబైనామాల విషయం హైకోర్టులో పెండింగ్లో ఉంది. అవి తప్ప మిగిలిన సమస్యలన్నింటికీ ఆగస్టు 15 నాటికి పరిష్కారం చూపనున్నారు. ఆలోగా సాదాబైనామాలను పరిష్కరించేలా హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే వాటిని కూడా పరిష్కరించే అవకాశం ఉంది. ఫ రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,01,605 దరఖాస్తులు ఫ వాటి పరిశీలన ప్రారంభించిన అధికారులు ఫ మండల స్థాయిలోనే కేటగిరీల వారీగా విభజన ఫ తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో ఆగస్టు 15 నాటికి పరిష్కరించేలా ప్రణాళిక దరఖాస్తుల వివరాలు జిల్లా దరఖాస్తులునల్లగొండ 42,534సూర్యాపేట 44,741యాదాద్రి 14,330మొత్తం 1,01,605ఆయా స్థాయిలో పరిష్కారం చిన్న చిన్న సమస్యలకు మండలస్థాయిలోనే తహసీల్దార్ నేతృత్వంలో పరిష్కరించి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఆర్డీఓ స్థాయిలో మ్యూటేషన్, ఫౌతిలను పరిష్కరిస్తారు. పెద్ద సమస్యలు ఉంటే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుంది. కలెక్టర్ స్థాయిలో కాని వాటిని సీసీఎల్కు పంపనున్నారు. సమస్యల విషయంలో బాధితులను పిలిపించి రికార్డులను పరిశీలించి కొన్నింటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది. మరికొన్నింటి విషయంలో దరఖాస్తుల ఆధారంగా వారికి నోటీసులు ఇచ్చి రెవెన్యూ బృందాలు గ్రామాలకు వెళ్లి క్షేత్రాస్థాయిలో అన్నీ పరిశీలించి అక్కడే పరిష్కరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
నకిరేకల్కు నేడు మంత్రుల రాక
నకిరేకల్ : నకిరేకల్కు ఆదివారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకటి శ్రీహరి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ఎంపీ కిరణ్కుమార్రెడ్డి రానున్నారు. నకిరేకల్ పట్టణంలో నిర్వహించేఉ సభలో నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఇందుకోసం పట్టణంలోని మినీ స్టేడియం మైదానాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. సేడ్డియంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, ఆర్డీఓ అశోక్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, తహసీల్దార్ జమురుద్దీన్, మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితాశ్రీనివాస్గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరావు తదితరులు ఉన్నారు. -
ఆదిలోనే విపత్తి
వర్షపాతం ఇలా.. జూన్ మాసంలో ఇప్పటివరకు 64.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 43.0 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. నైరుతి రుతు పవనాలు వచ్చే జూన్ మాసంలో కురిసే వర్షమే రైతులకు మంచి ఆధారం. ఈ నెలలోనే వర్షాలు లేకపోవడంతో సాగు కుంటుపడింది. ఫ జిల్లాలో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో పత్తి సాగు ఫ ముందస్తు వానలకు విత్తనాలు వేసిన రైతులు ఫ పక్షం రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఫ సగానికి పైగా మొలకెత్తని గింజలు ఫ అక్కడక్కడ వచ్చిన మొలకలు వాడు దశకు.. ఫ ఆందోళనలో కర్షకులు నల్లగొండ అగ్రికల్చర్, తిప్పర్తి : వర్షాభావ పరిస్థితులు పత్తి రైతుకు శాపంగా మారాయి. పక్షం రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో వేలాది ఎకరాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో మరోసారి విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అక్కడక్కడ వచ్చిన మొలకలు ఎండ వేడిమికి వాడు పడుతున్నాయి. సీజన్్ ప్రారంభంలోనే ప్రకృతి సహకరించడం పోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. 50 వేల ఎకరాల్లో పత్తి సాగు జిల్లాఓ వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల్లో పత్తి అగ్రస్థానంలో ఉంటుంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5,47,735 ఎకరాల్లో పత్తి సాగు కానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాలు సకాలంలో, సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు ఆశాభావంతో సాగు పనులపై దృష్టి సారించారు. మే చివరి వారంలో కురిసిన తొలకరి వానలు, జూలై మొదటి వారంలో కురిసిన మోస్తరు వర్షాలకు జిల్లా వ్యాప్తంగా రైతులు 50 వేలకుపైగా ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. ఆ తరువాత పక్షం రోజులుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడక్కడ అడపాదడపా జల్లులు మాత్రమే పడ్డాయి. దీంతో సగానికి పైగా విత్తనాలు మొలకెత్తలేదు. అక్కడక్కడ కొంత మేర మొలకెత్తాయి. పది రోజులుగా ఎండ తీవ్రత 35 డిగ్రీల పైన నమోదవుతోంది. వేడి గాలులు వీస్తుండడంతో గింజలు భూమిలోనే మాడిపోయే ప్రమాదం ఏర్పడింది. వచ్చిన మొలకలు సైతం ఎండ వేడికి వాడు పడుతుండటంతో కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. నేల గట్టిపడకుండా గుంటుకలు తోలుతున్నారు. మొలకెత్తని చోట మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి రెండోసారి వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చు పత్తి సాగు చేయడానికి రైతులు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెటుబడి పెట్టారు. దున్నకాలు మొదలుకొని విత్తనాలు వేసే వరకు ఎకరానికి రూ.15 వేలకు పైనే పెట్టుబడి పెట్టారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురువకపోతే ఇబ్బందులు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. తిప్పర్తి మండల కేంద్రం సమీపంలో ఓ రైతు తనకున్న ఐదెకరాల భూమిలో పది రోజుల క్రితం పత్తి విత్తనాలు విత్తుకున్నాడు. తర్వాత చిరుజల్లులు కురవగా కేవలం 30 శాతం మాత్రమే గింజలు మొలిచాయి. మిగతా గింజలు పాడైపోగా మొలిచిన గింజలు సైతం కొన్ని ఎండ తీవ్రతకు వాడిపోయాయి. దీంతోమరోసారి భూమిని దున్ని విత్తనాలు విత్తుకోవాలా..? లేదంటే గింజలు పాడైపోయిన చోట విత్తుకోవాలా.. ? అన్నది తేల్చుకోలేకపోతున్నాడు. ఇదే పరిస్థితి జిల్లాలోని చాలామంది రైతులకు ఎదురైంది.సాగు ఖర్చులు ఎకరానికి.. (రూల్లో)ఎరువులు 5,000 ఎరువు చల్లడం 1,000దున్నకాలకు 3,000 అచ్చు తోలుటకు 1,000 విత్తనాలు (రెండు ప్యాకెట్లు) 3,000 కూలీలకు 1,200కలుపు మందు 2,000 -
హోర్డింగ్లను తక్షణమే తొలగించాలి
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని నేషనల్ హైవే డివైడర్లపై అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ను వెంటనే తొలగించాలని ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.యుగంధర్ శనివారం మిర్యాలగూడ ఆర్అండ్బీ డీఈ శ్రీనివాస్ను ఆదేశించారు. ఈనెల 19న ‘సాక్షి’లో ‘హైవేపై అనధికారిక ప్రకటనలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన నేషనల్ హైవే –167, ఆర్అండ్బీ అధికారులు నేషనల్ హైవే పరిధిలోని డివైడర్ల మధ్య ఎలాంటి ప్రచార హోర్డింగ్స్ ఏర్పాటు చేయొద్దని, వాటి వల్ల వాహనదారుల దృష్టి మరలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. హైవే నిబంధనలు, రోడ్డు భద్రత దృష్ట్యా మున్సిపల్ అధికారులు ఎలాంటి టెండర్లు ఆహ్వానించవద్దని, ప్రస్తుతం ఉన్న బోర్డులను వెంటనే తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రకటన ఏజెన్సీలతో అవగాహన ఒప్పందం ఉంటే వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు. -
రైతు భరోసా రూ.592.55 కోట్లు జమ
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు భరోసా పథకం కింద జిల్లాలో శనివారం వరకు 4,97,280 మంది రైతులకు రూ.592.55 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు వ్యవసాయ సాగుకు పెట్టుబడికి వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తోందని పేర్కొన్నారు. విడతల వారీగా రోజూ కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులను జమ చేస్తోందని తెలిపారు. భవిత కేంద్రం ఆకట్టుకునేలా ఉందినల్లగొండ : నల్లగొండలోని భవిత కేంద్రం అందరిని ఆకట్టుకునేలా ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని భవిత కేంద్రం ఆధునీకరణ పనులను శనివారం ఆమె పరిశీలించిన మాట్లాడారు. ఆధుననీకరణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. భవిత కేంద్రం పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉందని కేంద్రంలో ఉన్న విద్యార్థుల వివరాలను ఎంఈఓ అరుంధతిని కలెక్టర్ అడిగారు. అనంతరం కలెక్టర్ సీ్త్ర శక్తి భవన్ను, ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ రోహిత్, ఏపీఎం వినోద ఉన్నారు. 24న జాబ్ మేళారామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీలో ఈ నెల 24న అప్రెంటిషిప్, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆర్.దస్రూనాయక్, ప్రిన్సిపాల్ ఎం.షీబా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పారా మెడికల్ కోర్సు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నాన్ పారామెడికల్ కోర్సు విద్యార్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ తేవాలని సూచించారు. బీఎల్ఓలకు శిక్షణ నివ్వాలినల్లగొండ : బీఎల్ఓలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి బూత్స్థాయి అధికారుల విధులు, బాధ్యతలు, కొత్త ఓటర్ల నమోదు, సవరణలపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాస్టర్ ట్రైనర్లకు ఈఆర్ఓలు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో సాగర్ నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
విజ్ఞానంతో సామాజిక అంతరాలు దూరం
భువనగిరిటౌన్: సమాజంలో విజ్ఞానం ద్వారా మాత్రమే సామాజిక అంతరాలు దూరమవుతాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన పూలే, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం స్థానిక వెటర్నరీ శాఖ సమావేశం హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పూలే, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే చోటు నాలెడ్జ్ సెంటర్ మాత్రమే అని అన్నారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్ల సామాజిక ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. నాలెడ్జ్ సెంటర్ ద్వారా భవిష్యత్ తరాలకు మంచి విజ్ఞానాన్ని అందించాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ.. సమాజంలో సామాజిక పరివర్తన తీసుకురావడం కోసం పూలే, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ నిత్యం దినపత్రికలు చదవాలని అన్నారు. నాలెడ్జ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కావాలని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ మాట్లాడుతూ.. నాలెడ్జ్ సెంటర్లను ప్రోత్సహించేందుకు తప్పకుండా సహకారం అందిస్తామని అన్నారు. నాలెడ్జ్ సెంటర్కు ప్రతిరోజు దినపత్రికలు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. బానోతు భాస్కర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ ఎస్. మల్లారెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ కౌన్సిలర్ ఈరపాక నర్సింహ, సంతోషిమాత దేవాలయ కమిటీ సభ్యుడు నాగరం శంకర్, మాజీ కౌన్సిలర్ బట్టుపల్లి అనురాధ, నిర్వాహకులు స్వరూప, సురుపంగ శివలింగం, దొడ్డి యాదగిరి, బొట్ల రమేష్, నాయకులు ఇటుకల దేవేందర్ మాదిగ, మేడి కోటేష్, రాము, అందె సాయి, రమేష్ కోటి, ఎస్. జైపాల్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. సత్తయ్య, లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాజునాయక్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్నాయక్, నర్సింహనాయక్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
నకిలీ విత్తనాల కేసులో నిందితుల రిమాండ్
సూర్యాపేటటౌన్: నకిలీ పత్తి విత్తనాల కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న ఆత్మకూరు(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రాం బస్ స్టేజీ వద్ద సీసీఎస్, ఆత్మకూరు(ఎస్) పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన తండా నగేష్తో పాటు మరో ముగ్గురిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న అరుణోదయ విత్తనాల తయారీ సంస్థ ఎండీ సాంబశివరావు, మరో నిందితుడు చెవుల నరసింహులును శనివారం ఏపీలోని కర్నూలు జిల్లా కొసగి మండలం పల్లిపాడు వద్ద వ్యవసాయ క్షేత్రంలో అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి విత్తనాలకు కలరింగ్ చేసే మిషన్, వేయింగ్ మిషన్, ప్యాకింగ్ హీట్ మిషన్, ఖాళీ ప్యాకెట్లు, రెండు కిలోల లూజ్ నకిలీ పత్తి విత్తనాలు, బొలేరో వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
కట్టంగూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో కాలం గడుపుతుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సీజన్లోనైనా రైతులకు రావాల్సిన రైతు భరోసా పూర్తిగా అందజేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి తెలంగాణ ఏమైనా సీఎం జాగీరా అని ప్రశ్నించారు. గోదావరి బేసిన్లో 1000 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి.. మిగతావి ఏపీ ఎన్ని నీళ్లయినా దోచుకుపోవచ్చని సీఎం చెప్పటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అజ్ఞానంతో తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం తన చిల్లర మాటలతో రాష్ట్ర ప్రజల ముందు పరువు తీసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములుయాదవ్, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పోగుల నర్సింహ, నోముల వెంకటేశ్వర్లు, శ్రీపాద రామకృష్ణాచారి, పోగుల నర్సింహ, అంజయ్య, మల్లేష్ ఉన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ప్రత్యేక టైం టేబుల్..
క్రమశిక్షణతో కూడిన విద్యను అందించే ఈ గురుకుల కళాశాలలో ప్రత్యేక టైం టేబుల్ను అమలు పరుస్తారు. ఉదయం 5 గంటలకే వీరి దినచర్య ప్రారంభిస్తారు. 6 నుంచి 7 గంటల వరకు వ్యాయామంతో కూడిన ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. 8 నుంచి 8.45 గంటల వరకు నిన్న జరిగిన అంశాలపై సమీక్ష ఉంటుంది. 8.45 నుంచి 9 గంటల వరకు ప్రార్థన, 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.20 వరకు తరగతులు నిర్వహిస్తారు. 2.20 వరకు భోజన విరామం ఉంటుంది. 2.20 నుంచి 5.30 వరకు సివిల్స్కు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తారు. దీనిలో వీరికి ఆంగ్ల భాషపై ప్రావీణ్యంతో పాటు రీజనింగ్ ఇతర అంశాలను నేర్పిస్తారు. ఆ తరువాత అల్పాహారం ఇచ్చి సాయంత్రం 6.30 గంటల వరకు క్రీడల్లో శిక్షణ ఇస్తారు. 6.30 నుంచి 7.30 మధ్య ర్రాతి భోజన సమయం ఉంటుంది. ఆ తరువాత 9.30 అకడమిక్ స్టడీ అవర్స్, 9.30 నుంచి 10.30 డిఫెన్స్ స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. డిఫెన్స్ అంశాలపై వారానికి ఒకసారి టెస్ట్ నిర్వహిస్తారు. -
మినీ శిల్పారామంలో నృత్య ప్రదర్శన
భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోని పెద్ద చెరువు వద్ద గల మినీ శిల్పారామంలో శనివారం ప్రత్యేక ఆఫీసర్ కిషన్రావు ఆధ్వర్యంలో చిన్నారులచే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. సందర్శకులు నృత్య ప్రదర్శనను తిలకించి ఆనందించారు. జలనారాయణస్వామికి మంగళహారతులు భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం రాత్రి జలనారాయణస్వామికి మంగళహారతుల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణం, మధ్యాహ్నం సుమారు 4వేల మందికి అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
ఆర్మీ డిగ్రీ కాలేజీని బీబీనగర్లోనే ఏర్పాటు చేయాలి
మోత్కూరు: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్కేసర్కు తరలించిన బీబీనగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలను తిరిగి బీబీనగర్లోనే ఏర్పాటు చేయాలని కళాశాల పేరెంట్స్ కమిటీ సెక్రటరీ ఎర్రవెల్లి నర్సయ్య ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు. భువనగిరి పట్టణానికి వచ్చిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి.. యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలను ఈ జిల్లాలోనే నిర్వహించాలని, ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్ పర్యవేక్షణలో ఎన్డీఏ, యూపీఎస్సీ తరగతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు నాణ్యమైన విద్య అందించకుండా జరుగుతున్న కుట్రలో భాగమే కళాశాల తరలింపు అని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పేరెంట్స్ కమిటీ జాయింట్ సెక్రటరీ డి. తిరుమలేష్, స్వరూపారాణి తదితరులు ఉన్నారు. ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు వినతి -
పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : ప్రముఖ పుణ్య క్షేత్రాలకు ఈ నెల 26, 27వ తేదీల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి తెలిపారు. నల్లగొండలో శనివారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి యాత్రీకుల కొరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుకింగ్ కోసం నల్లగొండ : 9160360707, దేవరకొండ : 7382833031, మిర్యాలగూడ : 9298008888, సూర్యాపేట : 7382836177, కోదాడ : 7780433533, యాదగిరిగుట్ట : 9885103165 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. డిపోల వారీగా బస్సుల వివరాలు... ఫ నల్లగొండ నుంచి అలంపూర్, బాచుపల్లి, శ్రీరంగపూర్, జటాప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం. ఫ దేవరకొండ నుంచి పంచదేవపహాడ్, మక్తల్, మన్యంకొండ, కురుమర్తి, గంగాపూరం, ఊర్కొండపేట, గుల్బర్గా (ఖజా గరీబ్ నవాబ్ దర్గా), హాల్కట్ట (షరీఫ్ దర్గా). ఫ మిర్యాలగూడ నుంచి ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, కొమురెల్లి. ఫ సూర్యాపేట నుంచి అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది, పెనుగొండ, ద్వారకా తిరుమల. ఫ కోదాడ నుంచి అలంపూర్, బాచుపల్లి, శ్రీరంగపూర్, జటాప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం. ఫ యాదగిరిగుట్ట నుంచి కొండపోచమ్మ, వరంగల్, కొండగట్టు, వేములవాడ, సిద్దులగుట్ట. -
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
నడిగూడెం: బైక్ అదుపుతప్పి గుంతలో పడడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మోతె మండలం మామిళ్లగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం నారాయణగూడేనికి చెందిన చింత శ్రీకాంత్(27) మునగాల నుంచి మోతె మీదుగా ఖమ్మంకు బైక్పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఖమ్మం–సూర్యాపేట రహదారిపై మోతె మండలం మామిళ్లగూడెం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో రహదారి వెంట ఉన్న గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొని..మర్రిగూడ: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన యాచారం శ్రీరాములు(55) అదే గ్రామానికి చెందిన బోయపల్లి శంకర్ వద్ద డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీరాములు శుక్రవారం సంగారెడ్డిలో డీసీఎంలో బొగ్గు లోడ్ చేసుకుని తిరిగి వస్తుండగా.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వచ్చి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీరాములు రెండో కుమారుడు కూడా 2నెలల క్రితం నాంపల్లి మండల కేంద్రం నుంచి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తండ్రి, కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్ట్నార్కట్పల్లి: వేర్వేరుగా చోరీలను పాల్పడిన ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసినట్లు సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 22న ఎల్లారెడ్డిగూడెంలో జరిగిన ద్విచక్ర వాహనం చోరీ కేసులో నల్లగొండ మండలం శేషమ్మగూడెం గ్రామానికి చెందిన గాదరి సూర్యను, ఈ నెల 12న చెర్వుగట్టులో కుట్టు మిషన్ చోరీ కేసు కేసులో అదే గ్రామానికి చెందిన కసార్ల శివకుమార్ను నార్కట్పల్లి ఫ్లైఓవర్ అరెస్ట్ చేసి నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ రాము, కానిస్టేబుళ్లు గిరిబాబు, సత్యనారాయణ, శివశంకర్, తిరుమల్ను జిల్లా ఎస్పీ అభినందించినట్లు పేర్కొన్నారు. బోర్వెల్ వాహనంలో డీజిల్ చోరీ నకిరేకల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బోర్వెల్ వాహనం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున నకిరేకల్ పట్టణంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వాసవీనగర్లో సామ శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. తన బోర్వెల్ వాహనాన్ని ఆ ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. అతడు కుటుంబంతో కలిసి స్థానిక పద్మానగర్ జంక్షన్ వద్ద నివాసముంటున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా కారులో బోర్వెల్ వాహనం వద్దకు వచ్చి డీజిల్ ట్యాంక్కు వేసిన తాళాలు పగులగొట్టి సుమారు 300 లీటర్ల డీజిల్ దొంగిలించి పరారయ్యారు. చుట్టుపక్కల వారు శ్రీనివాస్రెడ్డికి సమాచారం ఇవ్వడంతో అతడు వాహనం వద్దకు చేరుకుని పరిశీలించి, అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఉరేసుకుని యువకుడి బలవర్మణం
భూదాన్పోచంపల్లి: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పోచంపల్లి మండలం జూలూరులో శనివారం జరిగింది. వివరాలు.. జూలూరు గ్రామానికి చెందిన యాకరి యాదయ్య, సుశీల దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్ (30) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి వివాహం కాలేదు. శనివారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లి ఇంటికి వచ్చిన ప్రశాంత్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చేసరికి ప్రశాంత్ ఉరికి వేలాడుతుండటం గమనించి ఇరుగుపొరుగు వారి సహాయంతో ప్రశాంత్ను కిందికి దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. సమాుచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. ప్రశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
ఆదర్శం.. ఆ ఉపాధ్యాయులు
ఫ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా.. ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని మక్తా కొత్తగూడెం గ్రామానికి చెందిన మట్టపల్లి సైదులు ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన తన కుమారులైన గణ సాత్విక్, మంజిత్లను తాను పనిచేస్తున్న పాఠశాలలోనే శుక్రవారం చేర్పించారు. అనంతరం వారికి ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్, స్కూల్ యూనిఫాం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేందుకే తన ఇద్దరి కుమారులను ఈ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. అడ్డగూడూరు: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను తాము చదువు చెబుతున్న పాఠశాలల్లోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నరేష్కు కుమార్తె రిషక, కుమారుడు రిషిదేవ్ ఉన్నారు. శుక్రవారం కుమార్తె రిషికను అదే పాఠశాలలోని 3వ తరగతిలో, కుమారుడు రిష్దేవ్ 2తరగతిలో చేర్చించారు. గతంలో వీరు తిరుమలగిరి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో చదివేవారని, విద్యార్థులకు సంపూర్ణ మనో వికాసానికి దోహదపడే బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. -
స్వర్ణగిరి క్షేత్రంలో కుంకుమార్చన
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో శుక్రవారం అష్టోత్తర శత నామాలతో విశేష కుంకుమార్చన సేవ కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ఉదయం స్వామి వారికి సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామర్చన, సేవ, నిత్య కల్యాణమహోత్సవం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కర్పూర మంగళహారతులు సమర్పించారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలు సీజ్ గరిడేపల్లి: మండల పరిధిలోని చవ్వారిగూడెం గ్రామంలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మిర్యాలగూడ శివారులోని తుమ్మడం గ్రామానికి చెందిన కొంత మంది చవ్వారిగూడెం గ్రామం నుంచి అనుమతులు లేని విత్తన బస్తాలను ఆటోలో తీసుకెళ్తుండగా నేరేడుచర్ల పట్టణ శివారులో పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీయగా అనుమతులు లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈమేరకు గరిడేపల్లి మండలం వ్యవసాయ అధికారి ప్రీతమ్కుమార్, హుజూర్నగర్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో చెవ్వారిగూడెం గ్రామానికి వెళ్లి తిప్పన రాంరెడ్డికి చెందిన గోదాంలో తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా ఉన్న 150బస్తాల వరి విత్తనాలను సీజ్ చేశారు. కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్, గరిడేపల్లి ఏఎస్ఐ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా మహిళల సంచారం
మోత్కూరు : అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహిళలను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని ముశిపట్ల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గురువారం గ్రామంలో దొంగతనానికి రెక్కి నిర్వహిస్తున్న నలుగురు మహిళలను గ్రామస్తులు గుర్తించి పట్టుకొని ఆరా తీశారు. మధ్యాహ్న సమయంలో గ్రామంలో సంచరిస్తుండగా అనుమానం వచ్చిన పలువురు గ్రామస్తులు వారిని ప్రశ్నించి నిలదీశారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం బలపడింది. ఈ క్రమంలో వారు తప్పించుకునే ప్రయత్నం చేయగా గ్రామపంచాయతీ వద్దకు తీసుకెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నలుగురు మహిళలను విచారించారు. వరంగల్ జిల్లాకు చెందిన వాసులుగా గుర్తించారు. వరంగల్లోని రెడ్డినగర్, హన్మకొండ, కాజిపేట, మడికొండలకు చెందిన తుర్పతి మైసమ్మ, స్వాతి, శారద, సునీతగా పోలీసులు గుర్తించారు. వారిపై ఇప్పటికే నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్లు ప్రొబెషనరీ ఎస్ఐ నోయల్ రాజు తెలిపారు. వారిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఐ వెల్లడించారు. పుస్తెలతాడు చోరీనార్కట్పల్లి : మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ సంఘటన నార్కట్పల్లి మండలం మాధవ ఎడవల్లి సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోతనేనిపల్లికి కమ్మంపల్లి స్వామి, అతడి భార్య అండాలు టీవీఎస్ ఎక్సెల్పై నార్కట్పల్లికి వస్తుండగా వెనక నుంచి బైక్పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అండాలు మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లాడు. పుస్తెలతాడు రోల్డ్గోల్డ్ అయినా, దానికి పావుతులం బంగారం పుస్తె, పావుతులం బంగారు గుండ్లు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. స్వామి పోలీసులకు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ రైతు మృతిమోత్కూరు : పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని దాచారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు అండెం కరుణాకర్రెడ్డి గురువారం తన పొలంలో పనులు చేస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య బాలమణి, ఓ కుమార్తె ఉన్నారు. శుక్రవారం గ్రామంలో జరిగిన అంత్యక్రియలో కుమార్తె శృతి తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టింది. ఫ పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి బలవన్మరణం
బీబీనగర్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని జైనపల్లి గ్రామశివారులో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా రఘునాఽథ్పల్లి మండలం మండేలగూడెం గ్రామానికి చెందిన డ్యగాల కిరణ్(26) హైదరాబాద్లోని ఆమెజాన్ ఆన్లైన్ కొరియర్లో ఉద్యోగం చేస్తున్నాడు. కిరణ్ 3సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఖర్చులు బాగా పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో అమ్మాయి అతడి నుంచి దూరమైంది. దీంతో కిరణ్ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం తెల్లవారుజామున బీబీనగర్ సమీపంలోని జైనపల్లి గ్రామపరిధిలోకి చేరుకొని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామస్తులు గమనించి పోలీస్లకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భార్య సంపాదనపై ఆధారపడుతున్నానని మనస్తాపంఫఉరేసుకుని ఆత్మహత్య సంస్థాన్ నారాయణపురం: చేసిన అప్పులు తీర్చలేకపోవడంతోపాటు, భార్య సంపాదనపై ఆధారపడుతున్నానని మనస్తాపనకు గురైన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సర్వేల్ గ్రామంలో చేసుకుంది. ఎస్ఐ జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన మహ్మద్ సిద్దిక్(26) అఫీజాబేగంలు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సిద్దిక్ కారు కొనుగోలు చేసి నడిపించేవాడు. తిరిగి దానిని అమ్మివేసి, క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సంవత్సరం క్రితం అఫిజాబేగంకు సర్వే ల్ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఉద్యోగం రావడంతో వీరు సర్వేల్కు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అప్పులు ఎక్కువ కావడంతోపాటు, భార్య సంపాదనపై ఆధారపడుతున్నానని సిద్దిక్ మనస్తాపానికి గురయ్యా డు. భార్య శుక్రవారం పాఠశాలకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సిద్దిక్ ఉరివేసుకున్నాడు. ఆమె పాఠశాల నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా వేలాతున్నాడు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్భువనగిరి : బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన సెల్ ఫోన్ను అప్పగించి ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణానికి చెందిన యానూష్ శుక్రవారం నల్లగొండకు వెళ్లేందుకు భువనగిరి బస్టాండ్కు వచ్చి నల్లగొండ డిపోకు చెందిన సెమీ డీలక్స్ బస్సు ఎక్కాడు. యానూష్ తన సెల్ ఫోన్ను బస్సులో మర్చిపోయి నల్లగొండ బస్టాండ్లో దిగి వెళ్లిపోయాడు. బస్సులో సెల్ఫోన్ను గుర్తించిన కండక్టర్ సీఎస్ రెడ్డి భువనగిరి బస్టాండ్కు వచ్చిన తరువాత విషయాన్ని స్థానిక కంట్రోల్కు వివరించారు. ఫోన్ మరిచి వెళ్లిపోయిన బంధువుకు సామాజిక కార్యకర్త కడారి వెంకటేశం సమక్షంలో ఫోన్ను అప్పగించారు. బస్సులో మరిచిపోయిన సెల్ఫోన్ను అప్పగించిన కండక్టర్ను పలువురు అభినందించారు. -
సోషల్ సర్వీస్!
ఫ సోషల్ మీడియా ద్వారా గ్రామస్తుల బాగోగులు ఫ ‘మన ఊరు–మన గుజ్జ’ పేరుతో పేజీల నిర్వహణ ఫ పుష్కరకాలంగా కృషిచేస్తున్న యువకుడు శశికాంత్ ఫేస్బుక్... యూట్యూబ్... ఇన్స్టాగ్రామ్... వాట్సాప్... ఇలా సోషల్మీడియాను యువత సరదా కోసమో, వినోదం కోసమో వినియోగిస్తారనే భావన అనేక మందిలో ఉంటోంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం గుజ్జ గ్రామానికి చెందిన శ్రీరామోజు శశికాంత్ మాత్రం వీటి వినియోగంతో సామాజిక సేవ చేస్తున్నారు. డిగ్రీ చేసిన ఈయన ‘మన ఊరు–మన గుజ’ పేరుతో ఆయా వేదికల్లో పేజీలు నిర్వహిస్తూ గ్రామానికి, గ్రామస్తులకు సేవ చేస్తున్నారు. 12 ఏళ్లుగా అప్రతిహతంగా తన కృషిని కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆలోచన మాత్రమే తనదని, ఆచరణలో మాత్రం గ్రామం మొత్తం పాలుపంచుకుంటోందని శశికాంత్ చెబుతున్నారు – సాక్షి ప్రతినిధి, నల్లగొండగుజ్జ నుంచి దేశ విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు. వారితో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఎప్పటికప్పుడు ఊరి విశేషాలను చేరవేయడం.. అవసరమైతే వాళ్లూ ఓ చేయి వేసి చేయూత అందించేలా చేయడం ఈ ‘సోషల్ మీడియాల’ గొప్పదనం. గుజ్జ యువతలో సేవాదృక్పఽథాన్ని నింపేలా 2013 నుంచి ఈ ‘సామాజిక ఉద్యమం’ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గుజ్జ గ్రామస్తులకు ఊరిలో ఏం జరుగుతోంది? ఏయే పండుగలు ఎలా జరుగుతున్నాయి? తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఈ పేజ్లు అందిస్తున్నాయి. ఎందరో ఆపన్నులకు ఆసరాగా నిలిచి... ‘మన ఊరు – మన గుజ్జ్ఙ వేదికను శశికాంత్ ఆ గ్రామంలో ఉన్న, గ్రామం నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తుల సహకారంతో ముందుకు నడిపిస్తున్నారు. హఠాన్మరణం పొందిన వారి కుటుంబాలకు, అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రిల్లో వైద్యం అవసరమైన వారికి ఆర్థిక సహాయం, తోడ్పాటు అందేందుకు ఈ శ్రీమన ఊరు–మన గుజ్జ’ పేజీలు పనిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన గంగదేవి తిరుమలేష్ భార్య, నలుగురు పిల్లలకు, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నల్లగంటి చందుకు, మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆస్పత్రిలో చేరిన మంగ లింగమ్మకు వైద్యం కోసం, క్రికెట్లో ప్రతిభ కనబరుస్తున్న గోపరాజు సాయి అర్జున్కు అవసరమైన డబ్బు సమకూర్చడంలోనూ ఈ పేజీలు కీలకపాత్ర పోషించాయి. వీరితో పాటు గ్రామంలో ఉన్న వృద్ధులు, విద్యార్థుల కోసమూ అనేక సహాయ కార్యక్రమాలు వీటి ద్వారా జరుగుతున్నాయి. సంప్రదాయ, సంస్కృతులు చాటిచెప్పేలా..శశికాంత్ గుజ్జ గ్రామస్తులతో కలిసి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా సంప్రదాయ, సంస్కృతులు అందరికీ చాటిచెప్పడానికీ కృషిచేస్తున్నారు. వాటికి అద్దం పట్టేలా బతుకమ్మ పాటల పోటీల నిర్వహణ, గ్రామ చరిత్ర, గొప్పదనం వివరిస్తూ.. రెండు బతకమ్మ పాటలు రాసి, పాడించి చిత్రీకరణ చేయించారు. జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, వారి త్యాగాలు ఈ తరం యువతకు తెలిసేలా చేస్తూ వారిలో చైతన్యం నింపుతున్నారు. సేవ చేయాలన్న తపన, ఊరి కోసం పని చేయాలన్న సంకల్పం వారిలో పెరిగేందుకు కృషిచేస్తున్నారు. గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహణఈ సోషల్ మీడియా వేదిక ద్వారా పలువురిని ఆకర్షిస్తున్న శశికాంత్ వారితో గ్రామంలో అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ మహిళల స్వయం ఉపాధి, స్వయం సమృద్ధి కోసం అవసరమైన ప్రాథమిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో గుజ్జ రైతు వేదిక వద్ద స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తోట రాము సహకారంతో వృత్తి నైపుణ్యాల పెంపుదల, వివిధ పథకాల కింద రుణాలు పొందే అవకాశం, కుటీర పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్ సాయం పొందే విధానాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ వర్గాల్లో ఉన్నతంగా ఉన్న వారి సహాయ, సహకారంతో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతోనే సేవ గ్రామస్తుల సహకారంతోనే ‘మన ఊరు– మన గుజ్జ’ సోషల్ మీడియాను ప్రారంభించాను. గ్రామస్తులు ఒక్కొక్కరుగా చేరడంతో సోషల్ మీడియాలో గ్రామస్తులమంతా టీంగా ఏర్పడ్డాం. సహాయ, సహకారాల్లో గ్రామం మొత్తం భాగస్వామ్యమవుతోంది. రాష్ట ప్రభుత్వం గుర్తించి ప్రతి గ్రామ పంచాయతీకి సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేయాలన్నది నా ఆకాంక్ష. అవకాశం ఉన్న వారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మెరుగైన సేవలు అందిస్తాం. – శ్రీరామోజు శశికాంత్ -
22న ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలుర జూనియర్ ఫుట్బాల్ జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షుడు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1–1–2009 నుంచి 31–12–2011 మధ్య జన్మించిన యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లా వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో రిపోర్టు చేయాలని తెలిపారు. క్రీడాకారులు వారి ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, ఫుట్బాల్ కిట్ తో హాజరు కావాలని కోరారు. నల్లగొండలో ఎంపికై న జిల్లా జట్టు ఈనెల 28 నుంచి జూలై1వ తేదీ వరకు నిజామాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. మట్టపల్లిలో విశేష పూజలుమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం విశేషపూజలు కొనసాగాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ సేవను కృష్ణానది వద్ద ప్రహ్లాద ఘాట్కు తరలించి హారతి పూజలు నిర్వహించారు. -
ఇంటర్లోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి
నల్లగొండ : బాలికలు ఇంటర్ స్థాయిలోనే మంచి లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం ఆమె నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి సందర్భంగా మాట్లాడారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బైపీసీ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. ఏ పాఠశాల నుంచి వచ్చారని? పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయని ? జీవితంలో మీ ఆశయాలు ఏంటి? అని కలెక్టర్ ప్రశ్నించారు. ఇంజనీరింగ్లో మంచి కోర్సులు సంపాదించేందుకు, భవిష్యత్లో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన మెళకువలను బోర్డుపై రాసి వివరించారు. కళాశాలలో నూతన ప్రవేశాలు, విద్యార్థుల సంఖ్య, కళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రిన్సిపాల్ సుధారాణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటర్మీడియట్ బైపీసీ ఇంగ్లిష్ మీడియం విద్యార్థినులకు డిక్షనరీలను అందజేశారు. కళాశాలలో ఖాళీ స్థలంలో విద్యార్థినులు చదువుకునేందుకు గాను షెడ్ నిర్మాణానికై స్థలాన్ని పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తాం స్వయం సహాయక మహిళా సంఘాలు పరిశ్రమల యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె నల్లగొండలోని టీటీడీసీలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులు ఇందిరా మహిళా శక్తి సంఘాలుగా ఏర్పాటై వివిధ రకాల యూనిట్ల తో పరిశ్రమల ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే రుణాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఏపీడీ శ్రవణ్కుమార్, అలీప్ సంస్థ సెక్రటరీ పద్మజ, కమిటీ సభ్యురాలు పద్మావతి, సీనియర్ ప్రోగ్రాం అధికారి లక్ష్మీప్రియ, ప్రోగ్రాం ఆఫీసర్ శ్యాంసుందర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
భూ సమస్యలపై 42,534 దరఖాస్తులు
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు శుక్రవారంతో ముగిసాయి. వివిధ భూ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా 42,534 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కవగా మిస్సింగ్ సర్వే నంబర్లపై 14803 దరఖాస్తులు వచ్చాయి. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు ఈ నెల 3న ప్రారంభించారు. సదస్సుల నిర్వహణకు ప్రతి మండలంలో రెండు బృందాలనే ఏర్పాటు చేశారు. ఒక బృందానికి తహసీల్దార్, మరో బృందానికి డిప్యూటీ తహసీల్దార్ బాధ్యులుగా వ్యవహరించారు. రోజుకు రెండు గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. తమకున్న రకరకాల భూ సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. సదస్సుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. సదస్సులను ఎప్పటికప్పుడు కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్ఓ, ఆర్డీఓలు పర్యవేక్షించారు. రెవెన్యూ సదస్సులు, దరఖాస్తుల వివరాలు ఇలా.. జిల్లాలో మండలాలు 33 రెవెన్యూ గ్రామాలు 550వచ్చిన దరఖాస్తులు 42,534మిస్సింగ్ సర్వే నెంబర్లపై 14,803పెండింగ్ మ్యూటేషన్లు, కోర్డు ఆర్డర్లు అమలు చేయాలని 802డిజిటల్ సంతకం పెండింగ్పై 795పేరు, విస్తీర్ణం తప్పులపై 2,998నిషేధిత జాబితాపై 808అసైన్డ్ భూములపై 6,539ఫౌతిపై 1,400 భూ సేకరణపై 56 ఇతర సమస్యలపై 14,333 ఫ మిస్సింగ్ సర్వే నంబర్లపైనే అధికంగా.. ఫ ముగిసిన రెవెన్యూ సదస్సులు -
పేదలకు అండ.. ఎర్రజెండా
మిర్యాలగూడ : పేదలకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ మండల 9వ మహాసభలో ఆయన మాట్లాడారు. సీపీఐ ఏర్పడిన వంద సంవత్సరాల కాలంలో పేదల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడిందన్నారు. సీపీఐ చేసిన త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి పోరాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. స్థానిక ఫ్యాక్టరీల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, యాదాద్రి పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం అందించడంతోపాటు ప్లాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాద్యక్షుడు ఎండీ.సయ్యద్, మండల అధ్యక్షుడు ధీరావత్ లింగానాయక్, అంజనపెల్లి రామలింగం, జిల్లా యాదగిరి, నాయకులు జమ్మల కోటయ్య, శాంతి, పోలేపల్లి ఉదయ్, బుజ్జి లింగానాయక్, పోలేపల్లి మమత, లక్ష్మయ్య, రవి, అన్నపూర్ణ, నిర్మల, వెంకటయ్య పాల్గొన్నారు. -
కేతేపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
నల్లగొండ: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కేతేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వర్లు కేతేపల్లిలోని ఇంటి నంబర్ 2– 97/1 కు సరైన పత్రాలు లేకుండానే నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసి, విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానాన్ని వదిలి వెళ్లకూడదని సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. భూగర్భ శాస్త్రం.. అవకాశాల పెన్నిధి నల్లగొండ టూటౌన్: విద్యార్థుల బంగారు భవిష్యత్కు భూగర్భశాస్త్రం అవకాశాల పెన్నిధి అని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం ఎంజీ యూనివర్సిటీలోని భూగర్భ శాస్త్ర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన బ్రోచర్ను ఆయన విడుదల చేసి మాట్లాడారు. భూగర్భ శాస్త్రంలో రాణించిన విద్యార్థులకు జియాలజిస్ట్, హైడ్రోజియాలజిస్ట్, మైనింగ్ జియాలజిస్ట్, జియోసైంటిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, వై.ప్రశాంతి, కె.ప్రేమ్ సాగర్, ఆంజనేయులు, మధుసూదన్రెడ్డి, మచ్చేందర్ పాల్గొన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యత పాటించాలినాంపల్లి: కిష్టరాయిన్పల్లి రిజర్వాయర్ పనుల్లో నాణ్యత పాటించాలని నల్లగొండ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సంబంధిత అధికారులకు సూచించారు. నాంపల్లి మండలంలోని లక్ష్మణాపురం గ్రామంలో చేపట్టిన కిష్టరాయిన్పల్లి రిజర్వాయర్ పనులు, ప్రాజెక్ట్ పరిధిలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. త్వరలోనే రైతులందరి భూములకు పరిహారం అందేవిధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్లో ఏమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పనులకు ఆటంకం కలిగించొద్దని చెప్పారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్సీ, చండూర్ డివిజన్ ఇన్చార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి, డీఈ జాన్నాయక్, తహసీల్దార్ దేవసింగ్, సిబ్బంది ఉన్నారు. ఇబ్రహీంపేటలో ఎన్ఎస్పీ భూముల సర్వేహాలియా : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామ పరిధిలో ఉన్న ఎన్ఎస్పీ భూములను రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు శుక్రవారం సర్వే చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేశాల మేరకు హాలియా ఇన్చార్జ్ తహసీల్దార్ రఘు ఆధ్వర్యంలో మిర్యాలగూడ డివిజన్ సర్వేయర్ పోకల విజయ్తో పాటు మరో 9మంది సర్వేయర్లు కలిసి సర్వే చేపట్టారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 16, 17, 68, 72, 482, 484, 485, 486, 490, 491లలో ఉన్న సుమారు 105 ఎకరాల భూమిని సర్వే చేశారు. కాగా ఎన్ఎస్పీ భూములను సర్వే చేసే సమయంలో తమ భూముల సర్వే చేస్తున్నారని భావించిన సన్న, చిన్నకారు రైతులు సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటుండగా పోలీసులు, అధికారులు వారికి సర్ది చెప్పారు. ఎన్ఎస్పీ భూముల సర్వే పోలీసుల పహారా మధ్య జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హాలియా సీఐ సతీష్రెడ్డి నేతృత్వంలో పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. కార్యక్రమంలో హాలియా సీఐ సతీష్రెడ్డి, ఆర్ఐ నవీన్కుమార్, సర్వేయర్లు సైదులు, రామనర్సు, స్వప్న, రాణా ప్రతాప్, శ్రీనివాస్, ముత్తయ్య, జైహింద్, విప్లవ జ్యోతి, పోలీసులు తదితరులు ఉన్నారు. -
నార్కట్పల్లి డిపోకు పెరగని బస్సులు
బస్సులను పెంచేందుకు ఆదేశాలు రాలేదు నార్కట్పల్లి డిపోలో బస్సుల సంఖ్య పెంచాలని పైఅధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కొత్త రూట్లు ఏర్పాటు చేస్తే బస్సులను పెంచే ఆలోచన ఉంటుంది. నల్లగొండ డిపోలో సర్వీస్ అయిపోయిన బస్సులను తొలగించి ఎలక్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. నల్లగొండ డిపోలో కరెంట్ పనులు పూర్తయ్యాక చార్జింగ్ బస్సులను ప్రారంభిస్తాం. – శ్రీనాథ్, నార్కట్పల్లి ఇన్చార్జి డీఎం నార్కట్పల్లి : నిజాం కాలంలో ఏర్పాటైన నార్కట్పల్లి బస్సు డిపో.. నేడు అవసాన దశలో ఉంది. రెండేళ్ల క్రితం వరకు ఈ డిపోలో 67 బస్సులు ఉన్నాయి. వీటిలో 2 సూపర్ లగ్జరీ, 11 ఎక్స్ప్రెస్, 54 పల్లె వెలుగు సర్వీసులు ఉన్నాయి. డిపోలో ఉన్న కొన్ని సర్వీస్ల వల్ల నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు డిపోలోని బస్సులను జిల్లాలోని ఇతర డిపోలకు పంపారు. సిబ్బందిని సర్దుబాటు చేశారు. డిపో తొలగిస్తారనే ప్రచారం కూడా సాగడంతో.. ఆ పార్టీల నేతలు ఆందోళనలు చేయడంతో బస్సులను పూర్తిగా తొలగించకుండా కేవలం 15 బస్సులతో కొనసాగిస్తున్నారు. నల్లగొండ డిపో బస్సులు ఇక్కడికి వస్తాయని.. ఇటీవల నల్లగొండ డిపోకు దాదాపు 40 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. అక్కడ స్థలం లేక వాటిని నార్కట్పల్లి డిపోలు ఉంచారు. నల్లగొండలో చార్జింగ్ పాయింట్ ప్రారంభిస్తే.. నల్లగొండ డిపోలో స్థలం సరిపోదు. నల్లగొండ డిపోలో డీజిల్తో కొనసాగే సర్వీలను నార్కట్పల్లి డిపోకు పంపుతారని దాంతో నార్కట్పల్లి డిపోకు పూర్వ వైభవం వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. -
‘ఈవీ’లకు నో పవర్!
చార్జింగ్ సౌకర్యం లేక రోడ్డెక్కని ఎలక్ట్రిక్ బస్సులు తాత్కాలిక లైన్తో తలెత్తనున్న సమస్యలు నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డు సబ్స్టేషన్ నుంచి 133/11 కేవీ ప్రత్యేక లైన్ను డిపో వేయాల్సి ఉండగా.. ఆ విషయంలో కాంట్రాక్టు సంస్థ అలసత్వం ప్రదర్శిస్తోందని అధికారులే చెబుతున్నారు. అయితే బస్టాండ్ సమీపంలోని విద్యుత్ లైన్ నుంచి తాత్కాలికంగా డిపో వరకు లైన్ వేసేందుకు సిద్ధమయ్యారు. దానివల్ల మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం సుబాష్ విగ్రహం నుంచి వెళ్లే 133/11 కేవీ లైన్ పరిధిలో చాలా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఆయా ట్రాన్స్ఫార్మర్లలో ఎక్కడ సమస్య వచ్చినా, సబ్స్టేషన్లో ఎల్సీ తీసుకుంటారు. ఆ సమయంలో ఆర్టీసీ ఛార్జింగ్ యూనిట్కు కూడా విద్యుత్ నిలిచిపోతుంది. దీంతో బస్లకు ఛార్జింగ్ విషయంలో అంతరాయం ఏర్పడుతుంది. జనరేటర్ ఉన్నా కొంత సమయం వరకే వస్తుంది. అందుకే మెయిన్ సబ్స్టేషన్ నుంచి ప్రత్యేక్ లైన్ కోసం ఆర్టీసీ.. విద్యుత్ శాఖకు డబ్బులను చెల్లించింది. కానీ కాంట్రాక్టు సంస్థ ఆ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తోంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సు(ఈవీ)లకు చార్జింగ్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన చార్జింగ్ కోసం విద్యుత్ లైన్, సబ్స్టేషన్ నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఆ పనుల కోసం మూడు నెలల కిందటే టెండర్లు పిలిచినా కాంట్రాక్టు సంస్థ అలసత్వంతో ఈవీ బస్సులు రోడ్డెక్క లేదు. దీంతో నల్లగొండ డిపోకు కేటాయించిన 40 ఈవీ బస్లను నార్కట్పల్లి డిపోలో భద్రపరిచారు. సూర్యాపేట, నల్లగొండ డిపోలకు ఒకేసారి ఈవీ బస్లు వచ్చాయి. 11 కేవీ లైన్, సబ్స్టేషన్, ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణ బాధ్యతలను రెండుచోట్ల ఒకేసారి కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. సూర్యాపేటలో ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయి బస్లు రోడ్డెక్కగా, నల్లగొండలో మాత్రం పనుల్లో జాప్యం జరుగుతోంది. పనుల్లో ఎడతెగని జాప్యం ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీిసీ ఈవీ బస్లను తీసుకొస్తోంది. అందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట డిపోలకు ఎలక్ట్రిక్ బస్లను మంజూరు చేసింది. అందుకోసం ఈ రెండు డిపోల్లో ప్రత్యేకంగా 133/11 కేవీ లైన్, సబ్స్టేషన్ నిర్మించాల్సి ఉంది. వాటితోపాటు జనరేటర్ల ఏర్పాటు, ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఒకే కాంట్రాక్టర్ కాంట్రాక్టు పొందినప్పటికీ సూర్యాపేటలో పనులను ఎప్పుడో పూర్తి చేశారు. ఈ నెల 9వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూర్యాపేటలో ఈవీ బస్సులను ప్రారంభించారు. నల్లగొండ డిపోలో మాత్రం ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నా, ప్రత్యేక లైన్, సబ్స్టేషన్ పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. ఫ ప్రత్యేక లైన్, సబ్స్టేషన్ ఏర్పాటులో అలసత్వం ఫ నల్లగొండ డిపోకు 15 రోజుల క్రితం వచ్చిన 40 ఎలక్ట్రిక్ బస్సులు ఫ వాటిని నార్కట్పల్లి డిపోలోఉంచిన అధికారులు ఫ కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతో డిపో దాటని బస్సులు కాంట్రాక్ట్ సంస్థకు నోటీసులు ఇచ్చాం నల్లగొండ డిపో వద్దకు విద్యుత్ లైన్ ఏర్పాటు, సబ్స్టేషన్ నిర్మాణ పనుల విషయంలో జాప్యం చేస్తుండటంతో కాంట్రాక్ట్ సంస్థకు నోటీసులు ఇచ్చాం. హైదరాబాద్ రోడ్డు నుంచి స్తంభాలు వేసి, లైన్ ఏర్పాటు చేయడానికి సమయం పడుతుందని కాంట్రాక్ట్ సంస్థ అంటోంది. ప్రస్తుతం తాత్కాలికంగా సుభాష్ విగ్రహం వద్ద నుంచి వెళ్తున్న 133/11 కేవీ లైన్ నుంచి నుంచి ఆర్టీసీ డిపోకు లైన్ వేసే పనులు ప్రారంభిస్తామని చెప్పింది. ప్రత్యేకంగా లైన్ కావాలని ఆర్టీసీ అధికారులు అడిగారని.. ఆ పనులను కూడా త్వరలో ప్రారంభించి, రెండు నెలల్లో పూర్తయ్యేలా చూస్తామని కాంట్రాక్ట్ సంస్థ చెప్పింది. – వెంకటేశ్వర్లు, ట్రాన్స్కోఎస్ఈ, నల్లగొండ నెలాఖరు వరకు రోడ్డెక్కేది అనుమానమే ఎలక్ట్రిక్ బస్సులు జిల్లాకు చేరి 15 రోజులు కావస్తోంది. విద్యుత్ లైన్, సబ్స్టేషన్ పనులేవీ చేపట్టలేదు. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించి.. రాత్రింబవళ్లు పనిచేసినా ఈ నెలాఖరు వరకు కూడా అవి పూర్తికావు. బస్ డిపోలో ఇప్పటివరకు జనరేటర్లను ఏర్పాటు చేసి, ఛార్జింగ్ పాయింట్ల పనులను మాత్రమే చేపట్టారు. విద్యుత్ లైన్, సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తేనే వాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటివరకు బస్సులు డిపోకు పరిమితం కావాల్సిందే. -
శిశు మరణాలపై అవగాహన కల్పించాలి
నల్లగొండ: గ్రామీణ ప్రాంత మహిళల్లో శిశు మరణాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శిశు మరణాలపై శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ప్రసవాలకు మధ్య దూరం ఎక్కువగా లేకపోవడంతో శిశు మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంట వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టబోయే బిడ్డ సరైన విధంగా పుట్టకపోవడం, బరువు తక్కువగా ఉండడం, పుట్టిన తర్వాత మరణించేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించేలా, పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ మాతృనాయక్, కృష్ణవేణి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
‘బెస్ట్ అవైలబుల్’కు విద్యార్థుల ఎంపిక
నల్లగొండ: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసించేందుకు గిరిజన విద్యార్థుల ప్రవేశాలకు డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. శుక్రవారం పానగల్ రోడ్డులోని గిరిజన వసతి గృహంలో డ్రా నిర్వహించారు. జిల్లాలోని ఆరు ప్రైవేట్ పాఠశాలల్లో 34 మంది బాలబాలికలకు లాటరీ ద్వారా సీట్లు కేటాయించారు. మొత్తం 184 దరఖాస్తులు రాగా 34 సీట్లు మాత్రమే కేటాయించడంతో సీట్లు ఎందుకు తగ్గించారంటూ పిల్లల తల్లిదండ్రులు అధికారులను ప్రశ్నించారు. గతంలో వంద సీట్లు ఉండగా ప్రస్తుతం కోత విధించారని అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, ఏఓ పార్థసారధి, ఏటీడీఓ శ్రీనివాస్, రామకృష్ణ, ప్రవీణ్నాయక్, సక్రునాయక్ పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు.. నల్లగొండ: 2025– 26 సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1, 5 తరగతుల్లో ప్రవేశానికి శుక్రవారం నల్లగొండ ఉదయాదిత్య భవన్లో డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ లక్కీ డ్రా తీశారు. 1వ తరగతిలో ప్రవేశానికి 134 మంది విద్యార్థులు, 5వ తరగతిలో ప్రవేశానికి 137 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మిర్యాలగూడ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె దామరచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, మందుల స్టాక్ను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. సమయానుకూలంగా వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, వైద్యం కోసం వచ్చిన రోగులను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకోని వైద్యం అందించాలని, కేసులు సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి లేదా ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని ఆకస్మింగా తనిఖీ చేసి పిల్లలను పరిశీలించారు. అంతేకాక నిర్మాణంలో ఉన్న టాయ్లెట్స్ పనలను పరిశీలించారు. అంతకుముందు కేజీబీవీని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. ఆమె వెంట సబ్కలెక్టర్ నారాయణ్అమిత్, మండల ప్రత్యేకాధికారి పత్యానాయక్, డీఈఓ భిక్షపతి, అధికారులు ఉన్నారు. భవిత కేంద్రం పరిశీలన మిర్యాలగూడ : భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలందరినీ నమోదు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలకు కృత్యాధార పద్ధతుల్లో విద్యను అందిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యాశాఖ ద్వారా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఆమె వెంట డీఈఓ భిక్షపతి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా వెంకటరమణ
కోదాడరూరల్ : కోదాడ మండల పరిధిలోని కాపుగల్లుకు చెందిన ముత్తవరపు వెంకటరమణ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) వారు బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయనను ఎంపిక చేశారు. ఇండియాలో ఫార్మసీ ఎడ్యుకేషన్ను అభివృద్ధి చేయడం, నూతన కళాశాలల మంజూరుతో పాటు రెన్యువల్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించనున్నారు. కాపుగల్లుకు చెందిన ముత్తవరపు భాస్కర్రావు, కుమారి దంపతుల కుమారుడు వెంకటరమణ 10వ తరగతి వరకు కోదాడలో, ఇంటర్మీడియట్ విజయవాడలో, బీఫార్మసీ కర్ణాటకలో, ఎం ఫార్మసీ అన్నామలై యూనివర్సిటీలో, పీహెచ్డీ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆయన ప్రస్తుతం మొయినాబాద్లోని ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్గా, నేషనల్ ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు అభినందించారు. -
‘మిషన్ పరివర్తన్’తో.. యువతలో మార్పు
మత్తుకు దూరం చేసి.. కొలువులకు దగ్గర చేశాం ఫ ‘యువతేజం’తో వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఫ గంజాయి రహిత జిల్లాగా మార్చుడమే లక్ష్యంగా పని చేస్తున్నాం ఫ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ఫ ‘సాక్షి’తో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఫ ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి ప్రత్యేకంగా కేసులు ఫాలోఅప్ కేసులు నమోదు చేయడం, వదిలేయడం కాకుండా కేసులను ఫాలోఅప్ చేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించేలా కృషి చేస్తున్నా. ఇదే విషయాన్ని మా సిబ్బందికి చెబు తున్నా. తద్వారా ఛార్జిషీట్లు పక్కాగా నమోదు చేయడంతో కోర్టుల్లో శిక్షలు పడేలా చూస్తున్నాం. గతేడాది ఆరు నెలల్లో 6 కేసుల్లో, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 9 కేసుల్లో జీవిత కారాగార శిక్ష పడింది. యువతను దారిలో పెడుతున్నాం జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. జిల్లాకు వచ్చిన మొదట్లోనే ఈ విషయాన్ని గుర్తించా. అప్పుడే గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టా. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టాం. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల తరహాలో గంజాయి టెస్ట్ కిట్లను అందించి గంజాయికి బానిస అవుతున్న యువతను గుర్తించి దారిన పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాదాపు 400 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో సైకియాట్రిస్ట్లతో కౌన్సెలింగ్ ఇప్పించాం. గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే ప్రభావం వివరించి మార్పు తెచ్చాం. హెల్త్ క్యాంపులతో 20 మందికి అత్యవసర చికిత్స పోలీసు కుటుంబాల సంక్షేమం, ఆరోగ్యాగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించి అత్యవసర చికిత్స అవసరమైన వారిని గుర్తించి వైద్య సేవలు అందించాం. తద్వారా దాదాపు 20 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగాం. మిగతా వారికి వైద్య సహాయం అందించాం. చందంపేట మండలంలోని పోలేపల్లిలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించి గిరిజనులను ఆదుకున్నాం. -
సైబర్ మోసాలకు గురైతే ఫిర్యాదు చేయాలి
నల్లగొండ : సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని.. మోసపోయామని తెలిసిన వెంటనే 1930 నంబర్కు ఫోన్ద్వారా ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ వారియర్స్తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మెసేజ్లు ఓపెన్ చేయొద్దని సూచించారు. మోసపూరితమైన ఆన్లైన్ యాప్లలో అధిక వడ్డీ ఆశ చూపి, పెట్టుబడికి రెట్టిపు సొమ్ము వస్తాయని అనేక మంది అమాయకులను మోసం చేస్తున్న కేసులు నమోదు అవుతున్నాయని.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి
మిర్యాలగూడ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి అన్నారు. గురువారం మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1438 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని అందులో 229 హైస్కూల్స్, 117యూపీఎస్, 1100కి పైగా ప్రైమరీ స్కూల్స్, 27 కేజీబీవీలు, 17 మోడల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. ఆగస్టు 31తో అడ్మిషన్ల గడువు ముగుస్తుందని.. అప్పటిలోగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాలలు 24 ఉన్నట్లు గుర్తించామని వాటిని మూసివేస్తామని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పది పాఠశాలలను తిరిగి పునః ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆయన వెంట ఎంఈఓ బాలునాయక్ ఉన్నారు. -
ప్రైవేట్లో ఫీజుల దోపిడీ
నోటీసులతో సరిపెట్టుకుంటున్న అధికారులు.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నా వాటి అనుమతులు, ఇతర శాఖల పర్మీషన్లు విషయాలపై విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనుమతి లేని పాఠశాలలను గుర్తించి కేవలం నోటీసులు జారీ చేసి వదిలేస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం, ఫీజుల నియంత్రణ చేయకపోవడం, ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎల్కేజీకి రూ.40వేల పైమాటే.. ఫ అనుమతి లేకుండానే పాఠశాలల ఏర్పాటు ఫ ఒకే పర్మిషన్తో అనేక బ్రాంచ్లు ఫ పుస్తకాలు, యూనిఫాం, షూ స్కూల్లోనే అమ్మకం ఫ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు మిర్యాలగూడ : సేవా దృక్పథంతో ఉండాల్సిన విద్యా వ్యవస్థ వ్యాపార రంగంగా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పరడడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు. తాము పడ్డ కష్టం తమ పిల్లలు పడవద్దని, ఎంత ఖర్చయినా సరే మంచిగా చదివించాలనే తల్లిదండ్రుల కలలను ఆసరా చేసుకున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అందిన కాడికి దోచుకుంటున్నాయి. ప్లే, టెక్నో, సీబీఎస్ఈ, ఒలింపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ పేరిట తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయలు ఫీజులు గుంజుతున్నాయి. పైగా పాఠశాలల్లోనే పుస్తకాలు యూనిఫాం, టై, బెల్టులు కొనాలని నిబంధన పెట్టి వాటి పేరిట కూడా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం అనమానాలకు తావిస్తోంది. ట్యాగ్లు పెట్టి మరీ.. ప్రైవేట్ పాఠశాలలకు ప్లే, టెక్నో, సీబీఎస్ఈ, ఒలింపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ వంటి పేర్లతో కార్పొరేట్ ట్యాగ్లు పెట్టి మరీ దోపిడీ చేస్తున్నారు. వీటికి అనుమతులు లేకపోయినప్పటికీ అనధికారికంగా ట్యాగ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా క్లాస్లు బోధిస్తామని చెప్పి వాటి పేరిట వేలాది రూపాయలు గుంజుతున్నారు. వీటి కోసం ప్రత్యేక పుస్తకాలను తమ పాఠశాల పేరుతో ముద్రించి వాటిని కొనుగోలు చేసేలా తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తీరా పుస్తకాలను కొన్నాక ఆ పుస్తకాల సిలబస్ను బోధించే పాపాన పోవడం లేదు. జిల్లాలో 369 ప్రైవేట్ పాఠశాలలు.. జిల్లాలో 369 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అనుమతి లేకుండానే చాలా పాఠశాలు నడుస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో 1,25,572 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో బయటి మార్కెట్లో దొరికే వస్తువుల ధరలకు ప్రైవేట్ పాఠశాలల్లో లభించే వాటికి చాలా వ్యత్యాసం ఉంటోంది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు పుస్తకాలు, బూట్లు, యూనిఫాం, టై, బెల్టు, గుర్తింపు కార్డులు తదితర వాటి పేరుతో ఫీజులు కాకుండా రూ.4 నుచి రూ.10వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విక్రయించే పాఠ్య పుస్తకాలు మార్కెట్లో ఎక్కడా దొరకకపోవడంతో గత్యంతరం లేక వాటినే తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇతర పేర్లతో స్కూల్స్ నిర్వహణ ప్రైవేట్ పాఠశాలల్లో చాలా వరకు అనుమతులు ఉండడం లేదు. మూతపడ్డ పాఠశాల అనుమతుల పేరిట తమ సొంత పేరు పెట్టుకుని పాత పాఠశాల అనుమతితోనే కొనసాగిస్తున్నారు. ప్రతి మండలంలో ఇలా 10 నుంచి 15 పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, హాలియా ప్రాంతాల్లో బడా కార్పొరేట్ పాఠశాలలు వాటి బ్రాంచ్లను అనధికారికంగా ఏర్పాటు చేస్తున్నాయి. అంతేకాకుండా అనుమతులు లేకుండానే ప్లే గల్లిగల్లీలో స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు, ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో కూడా పాఠశాలలను నడిపిస్తున్నారు. కనీసం సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచుకోకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్కూల్ ఫీజు 20,000ఎల్కేజీ ఖర్చు ఇలా (సుమారు రూపాయల్లో..) టై, బెల్టు, యూనిఫాం 3,000అడ్మిషన్ ఫీజు 3,000 పుస్తకాలు4,000రవాణా చార్జీలు 15,000 నల్లగొండకు చెందిన ఓ చిరుద్యోగి తన కుమారుడిని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ చేయాలనుకున్నాడు. పాఠశాలకు వెళ్లి ఫీజు వివరాలు అడిగాడు. అడ్మిషన్ ఫీజు, స్కూల్ ఫీజు, పుస్తకాలు, టై, బెల్టు, యూనిఫాం, రవాణా చార్జీలు కలుపుకొని ఏడాదికి మొత్తం రూ.40వేలు అవుతాయని స్కూల్ యాజమాన్యం చెప్పింది. దీంతో అతడు ఎల్కేజీకే ఇంతా ఫీజా అని అవాక్కయ్యాడు. ఇలా జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా సాగుతోంది. అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతిలేని పాఠశాలలను సీజ్ చేయాలని ఇప్పటికే ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. ఎవరైనా పాఠశాలల పేర్లు మార్పడం కానీ, ఒకే పాఠశాలకు అనుమతి తీసుకోని అనేక బ్రాంచ్లు ఏర్పాటు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పుస్తకాలు, యూనిఫాంలు అదే పాఠశాలలో కొనాలన్న నిబంధన లేదు. కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తే ఉపేక్షించేది లేదు. – భిక్షపతి, డీఈఓ -
అమ్మా.. మొర ఆలకించరూ..
నల్లగొండ : ‘ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు. తిరిగితిరిగి అలసిపోతున్నాం. మీరే మా మొర ఆలకించి సమస్యలను పరిష్కరించాలి’ అంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎదుట పలువురు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇతర సమస్యలపై కలెక్టరేట్కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను సావదానంగా విన్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని ఆయా శాఖలకు పంపారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఏడేళ్ల నుంచి తిరుగుతున్నా.. పింఛన్ రావడం లేదు నేను దివ్యాంగుడిని. నడవలేను. నా సొంత పనులకు కూడా ఇతరులపై ఆధారపడాల్సిందే. ఏడేళ్ల నుంచి వికలాంగుల పింఛన్కు దరఖాస్తు చేసుకున్నా. అధికారులు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా నా సమస్యకు పరిష్కారం లభించలేదు. పింఛన్ పొందలేకపోతున్నా. పింఛన్ వస్తే నా కుటుంబ సభ్యులకు భారం తగ్గుతుంది. నాకు పింఛన్ ఇప్పించాలి. – మదు, చెరలతండా, నేరడుగొమ్ము మండలం -
రైతు భరోసా నిధులు విడుదల
నల్లగొండ అగ్రికల్చర్ : వానకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఎకరానికి రూ.6000 చొప్పున రైతు భరోసాను జమ చేయనుంది. జిల్లాలోని 4,36,944 మందికి సంబంధించి రూ.411,34,37,740 ట్రెజరీకి పంపించింది. సోమవారం సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బు జమవుతోంది. ఇప్పటి వరకు రెండెకరాలలోపు భూమి ఉన్న 3,03,059 మంది రైతుల ఖాతాల్లో రూ.180.09 కోట్లు జమయ్యాయి. పోలీస్ గ్రీవెన్స్ డేలో వినతుల స్వీకరణనల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ సోమవారం 45 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి.. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. ఐటీఐలో ప్రవేశాలకు నోటిఫికేషన్రామగిరి(నల్లగొండ) : ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయినట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జంజిరాల వెంకన్న తెలిపారు. జూన్ 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ మెమో, ఆధార్ కార్డు వివరాలు ఒకే విధంగా ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు www.ititelangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. 22న ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీలునల్లగొండ టూటౌన్ : చెస్ చాంపియన్ దివంగత మేకల అభినవ్ 35వ జయంతిని పురస్కరించుకొని ఈనెల 22న నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.కరుణాకర్రెడ్డి, విశ్వప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–7, 9, 11, 13, 15 బాల, బాలికలకు పోటీలు ఉంటాయని, 50మంది విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 9985423823 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలనల్లగొండ : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష పలితాలను సోమవారం ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జిల్లాలో మొదటి సంవత్సరంలో మొత్తం 7,617 మందికి 5196 ఉత్తీర్ణులై 68.22 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ 3,771 మందికి 2537 మంది ఉత్తీర్ణులై 67.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో మొదటి సంవత్సరం 925 మందికి 641 మంది(69.3 శాతం), ద్వితీయ సంవత్సరంలో 657 మందికి 402 మంది ఉత్తీర్ణులై 61.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉపాధి హామీ పనుల పరిశీలన తిప్పర్తి : ఉపాదిహామీ పథకం కింద మండలంలోని ఇండ్లూర్, తిప్పర్తి, యర్రగడ్డలగూడెం గ్రామాల్లో చేసిన పనులను ఉపాధిహామీ పథకం జాతీయ కమిటీ సభ్యుడు ఉమాశంకర్, ఏపీడీ నర్సింహారావు సోమవారం పరిశీలించారు. ఇంకుడు గుంతలు, బోర్ రీచార్జి గుంతలు అసంపూర్తిగా ఉండడంతో వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి, ఏపీఓ శిరీష, ఈసీ జుల్పేకర్ తదితరులు ఉన్నారు. -
యూరియా కోటాలో కోత!
సిఫారసు మేరకే యూరియా వాడాలి రైతులు ఆయా పంటలకు సిఫారసు మేరకే యూరియాను వాడాలి. యూరియాను అధిక మోతాదులో వాడటం వల్ల చీడపీడలు, తెగుళ్లు అధికమవుతాయి. రైతుల నానో యూరియాను వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రసాయన ఎరువులు తగ్గించకుని నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఫ మోతాదుకు మించి వాడకుండా చర్యలు ఫ రాయితీ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట ఫ భవిష్యత్లో పొంచి ఉన్న యూరియా కొరత ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలుగుర్రంపోడు : యూరియా కోటాను కేంద్రం తగ్గిస్తోంది. రైతులు అధిక మోతాదులో యూరియా వాడకాన్ని తగ్గించేలా.. రాయితీపై అందిస్తున్న యూరియా పక్కదాటి పట్టకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే.. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో భవిష్యత్లో యూరియా కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి. జిల్లాలో సాగయ్యే అన్ని పంటలకు కలుపుకుని లక్షా 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. కానీ 30 శాతం తక్కువగా యూరియా కేటాయిస్తున్నారు. సెప్టెంబర్ నాటికి 70 వేల మెట్రిక్ టన్నుల అవసరం. ఇప్పటి వరకు ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది. నల్లగొండ జిల్లాలో గోదాములు ఎక్కువగా ఉండడంతో యూరియా ఇక్కడికి ఎక్కువగా పంపుతున్నారు. తర్వాత ఇక్కడి నుంచి వేరే జిల్లాలకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జూలై నుంచి జిల్లాకు సరిపడా కోటా విడుదల అవుతుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఇప్పటికే 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా పాత నిల్వలు ఉండడంతో ప్రస్తుత వానాకాలం సీజన్కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అధికారులు భావిస్తున్నారు. ఓటీపీ, వేలిముద్రతోనే పంపిణీ వ్యవసాయశాఖ ఇటీవల ఎరువుల డీలర్లకు కొత్త ఈపాస్ యంత్రాలను పంపిణీ చేసింది. యూరియా కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా తమ సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీని డీలర్కు చెప్పడం లేదా వేలిముద్ర వేయడం ద్వారానే యూరియా, ఇతర ఎరువులు కొనాల్సి ఉంటుంది. దీంతో యూరియా పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ పక్కాగా ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అండగా ఉండేలా.. భారీగా రాయితీతో అందిస్తున్న యూరియా.. పక్కదారి పట్టి రసాయన పరిశ్రమలకు వాడుతుండటం వల్ల రాయితీ దుర్వినియోగం అవుతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నీమ్ కోటెడ్ యూరియాను వినియోగంలోకి తెచ్చింది. అధిక మోతాదులో వాడితే నష్టమే.. యూరియాతో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల ధరలు నాలిగింతలు అధికంగా ఉండటం, రసాయన ఎరువుల వాడకంపై సరైన అవగాహనలేకపోవడం వల్ల రైతులు యూరియాను విచ్చలవిడిగా వినియోగించి నష్టపోతున్నారు. ఎకరా వరికి రెండు బస్తాల యూరియా వాడాల్సి ఉండగా నాలుగు నుంచి ఆరు బస్తాల వరకు వాడుతున్నారు. యూరియాను వాడటం వల్ల పైరు పచ్చగా ఏపుగా ఉంటుంది. అధిక మోతాదులో వేసినప్పుడు తేలికగా నీటిలో కొట్టుకుని పోయి పైరుకు ఉపయోగపడదు. మొక్కలు సుకుమారంగా పెరగడం వల్ల చీడపీడలు, తెగుళ్ల బారిన పడతాయి. దీంతో పెట్టుబడి అధికమవుతుంది. వరి పైరు విపరీతంగా పెరిగి కోత సమయంలో పంట దిగుబడి పడిపోతుంది. పూత ఆలస్యంగా వచ్చి పంట కాలం పొడగించబడి దిగుబడి తగ్గుతుంది. వరిలో పూత దశ తర్వాత యూరియాను వేస్తే బియ్యపు గింజలో పొట్ట తెలుపు వచ్చి నూక ఎక్కువ అవుతుంది. అధిక మొత్తంగా యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. యూరియా వాడకంలో మెలకువలు ద్రవ రూప నానో యూరియా సాధారణ యూరియాతో సమానంగా పనిచేస్తుంది. నానో యూరియాను పిచికారీ చేయడం వల్ల వేగంగా మంచి ఫలితాలు వస్తాయి. రైతుకు బస్తాల భారం తగ్గుతుంది. మెట్ట పైర్లలో యూరియా వేసేటప్పుడు నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. మెట్టపైర్లలో యూరియాను చల్లడం కన్నా మొక్క మొదట్లో గుంట తీసి వేస్తే మంచిది. పైరుకు సిఫారసు చేసిన యూరియాను రెండు, మూడు దఫాలుగా వేసుకోవాలి. యూరియాతోపాటు వేప పిండి (50 కేజీల యూరియాకు 5 కిలోల వేపపిండి) వాడితే నత్రజని మొక్కలకు ఎక్కువ కాలం అంది చీడపీడల వ్యాప్తి తగ్గుతుంది. పైరును బట్టి సేంద్రియ ఎరువులు, రైబోజియం మొదలగు జీవన ఎరువులు వాడి యూరియా మోతాదును తగ్గించుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా నత్రజని ఉంటున్నందున యూరియాను జోడించి వాడకూడదు. -
పల్లెల్లో స్థానిక సందడి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమ వుతుండటంతో గ్రామాల్లో రాజకీయ నేతల్లో హడావుడి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసినా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడే పరిస్థితి నెలకొంది. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే స్థితిలో ప్రభుత్వం లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటన ఇందుకు ఊతం ఇస్తోంది. మొదట ప్రాదేశిక ఎన్నికలు మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాతే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే జూలై రెండో వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటే ఈ నెల చివరిలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ ఇస్తే వచ్చే నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది. ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రచారం జరగడంతోపాటు ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామ పంచాయతీల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఏర్పాట్లతో పాటు బ్యాలెట్ బాక్సులను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించి వాటికి మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచారు. గ్రామాలు, ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేశారు. బ్యాలెట్ పేపర్లను తెచ్చి ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచారు. ఎన్నికల సంఘం ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని యంత్రాంగం చెబుతోంది. బీసీ రిజర్వేషన్లు తేలకపోవడంతో వాయిదా.. బీసీ రిజర్వేషన్ల తేలకపోవడంతో గతంలో నిర్వహించాలనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయం ఇప్పటికీ కోర్టులో ఉంది. ఆ సమస్య ఎటూ తేలలేదు. కానీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు గత ఎన్నికల్లో జిల్లాలో 31 మండలాలు ఉండగా ఆ తరువాత రెండు మండలాలు (గట్టుప్పల్, గుడిపల్లి) కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో రెండు జెడ్పీటీసీ స్థానాలు పెరుగనున్నాయి. దీంతో జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 33కు చేరకుంది. అదే విధంగా జిల్లాలో గత ఎన్నికల సమయంలో 349 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇటీవల చేపట్టిన ఎంపీటీసీ స్థానాల పునర్విభజనలో మరో 3 పెరిగాయి. దీంతో ఎంపీటీసీల సంఖ్య 352 చేరింది. ఇక గ్రామ పంచాయతీలు గతంలో 844 ఉండగా.. కొత్తగా 24 పంచాయతీలు పెరిగాయి. దీంతో పంచాయతీలసంఖ్య 868కి చేరింది. జెడ్పీ చైర్మన్ మినహా మిగతా రిజర్వేషన్లు ఇక్కడే.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి ఆయా నియోజక వర్గాల వారీగా ఉన్న జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. వాటిని కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. అయితే పంపిన జాబితా ఆధారంగా రిజర్వేషన్లకు ప్రభుత్వం ఆమోదించి తిరిగి జిల్లాకు పంపుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ మాత్రమే రాష్ట్ర స్థాయిలో ప్రకటిస్తారు. ఫ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఫ మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఫ ఆ తరువాతే పంచాయతీలకు.. ఫ సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం ఫ గ్రామాల్లో మొదలైన రాజకీయ సందడి స్థానిక సంస్థల వివరాలు ఇలా.. జెడ్పీటీసీలు 33 ఎంపీటీసీలు 352 గ్రామ పంచాయతీలు 868 ఓటర్లు 10,78,335 సిద్ధమవుతున్న పార్టీలు జిల్లాలో రాజకీయ పార్టీలు స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజక వర్గాలుంటే సూర్యాపేట మినహా 11 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తాము అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అంతకుముందు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీజేపీకి జిల్లాలో ఎమ్మెల్యేలు లేకపోయినా ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. -
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం
నల్లగొండ, చింతపల్లి : వ్యవసాయాన్ని పండగ చేయడంలో భాగంగా రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం చింతపల్లి మండంలోని నెల్వలపల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతులు వాణిజ్య పంటలు పండించేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సోలార్ ద్వారా పంపుసెట్లు నిర్వహించుకునేలా చూడాలన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే విధంగా, నూతన సాంకేతికతపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రైతు వేదిక పక్కనే గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చూడాలని ఎమ్మెల్యే కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ పాల్గొన్నారు. మహిళా రైతుతో ముఖ్యమంత్రి ముఖాముఖి చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు బిక్కని రాణెమ్మ ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తనకు నాలుగెకరాల భూమి ఉందని.. సన్న వడ్లు వేశానని 8 పుట్ల దిగుబడి వచ్చిందని.. బోనస్ కింద రూ.15,000 తన ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. రూ.లక్షా 80 వేలు రుణమాఫీ అయ్యిందని.. రూ.17,100 రైతు భరోసా వచ్చిందని అందుకు రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ పిల్లలు బాగా చదువుకుంటున్నారని.. ప్రభుత్వం తమను ఇలాగే ఆదుకోవాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి.. రాణెమ్మతో మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించాలని చదితేనే భవిష్యత్ ఉంటుందన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్లో సీపీఎం శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మహమ్మద్ అబ్బాస్ అన్నారు. నల్లగొండలో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో సోమవారం వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడంతో కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, సయ్యద్ హాశం, దండెంపల్లి సత్తయ్య, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సలీం, కొండ అనురాధ, నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, కానుగు లింగస్వామి, పులెంల శ్రీకర్, తుమ్మల పద్మ, సరోజ, కొండ వెంకన్న, రాములు తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు
అయిటిపాముల గ్రామంలో సర్వే నంబర్ 937లో 3.31 ఎకరాల భూమి ఉంది. 2018లో భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంలో మా పేరు మీద ఉన్న భూమిని కంప్యూటర్ ఆపరేటర్తో కుమ్మకై ్క 1.30 ఎకరాల భూమిని కొప్పు పద్మ పేరు మీద ముక్కెర సైదులు అలియాస్ ప్రభు ఆన్లైన్లో నమోదు చేయించాడు. ఈ విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి తప్పుడు రికార్డులు సృష్టించిన విజయ్తో పాటు ముక్కెర సైదులు మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైంది. వారు జైలుకు వెళ్లి వచ్చారు. వారిలో ఒకరైన ముక్కెర సైదులు అలియాస్ ప్రభు అనే వ్యక్తి తన పేరును ముక్కెర వెంకట రమణగా మార్చుకుని గోపగాని జానయ్యతో కలిసి లేని భూమిని ఉన్నట్లుగా సృష్టించి ఆరు తప్పుడు డాక్యుమెంట్లతో సర్వే నెంబర్ 937,938లో 4.9 కుంటల భూమిని తన భార్య సైదమ్మ పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ భూమిలో 3.30 కుంటల భూమిని మరో వ్యక్తికి సైదమ్మ రిజిస్ట్రేషన్ చేసింది. అక్కడ భూమి లేకున్నా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – చెవుగోని శ్రీనివాస్, అయిటిపాముల, కట్టంగూర్ మండలం -
విద్యార్థులు తగ్గుతున్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం కలగడం లేదు. దీంతో ప్రభుత్వ స్కూళ్లకు మూసివేత ప్రమాదం పొంచి ఉంది. గడిచిన నాలుగేళ్లలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 310 వరకు స్కూళ్లు జీరో ఎన్రోల్మెంట్తో మూతపడ్డాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సర్దుబాటు చేయగా దాదాపు 1,980 స్కూళ్లు మూతపడ్డాయి. ఇక విద్యా సంవత్సరంలోనూ మరిన్ని స్కూళ్లపైనా మూసివేత కత్తి వేలాడుతోంది. – సాక్షి ప్రతినిధి, నల్లగొండసిద్దిపేటలో తెరుచుకున్నస్కూళ్లుసిద్దిపేట జిల్లాలో 12 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఈసారి తెరుచుకున్నాయి. అక్కన్నపేట మండలం రేగొండ ప్రాథమిక పాఠశాల గత ఏడాది జీరో ఎన్రోల్మెంట్తో మూతపడింది. టీచర్లు గ్రామంలో అవగాహన కల్పించి 35 మంది విద్యార్థులను చేర్పించారు. ఆ పాఠశాలను ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.అత్యధికంగా వరంగల్లో మూసివేత ⇒ 2024–25 విద్యా సంవత్సరంలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. 135 స్కూళ్లు విద్యార్థుల్లేక, తక్కువ మంది (పది మందిలోపే) విద్యార్థులు ఉండటంతో టీచర్లు, విద్యార్థుల సర్దుబాటుతో అవి మూత పడ్డాయి.⇒ ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 94 స్కూళ్లు మూతపడ్డాయి. నల్లగొండ జిల్లాలో 24, మంచిర్యాల జిల్లాలో 32, ఆసిఫాబాద్లో 34, నిర్మల్లో 48, నిజామాబాద్లో 38, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 89, కరీంనగర్ జిల్లాలో 50, రాజన్నసిరిసిల్లలో 18, జగిత్యాలలో 61, పెద్దపల్లిలో 29, హనుమకొండలో 41, మహబూబ్నగర్ జిల్లాలో 48, నాగర్కర్నూల్లో 15, వనపర్తిలో 33, గద్వాలలో 4, నారాయణపేటలో 37 స్కూళ్లు మూత పడ్డాయి. మూడేళ్లలో గణనీయంగా తగ్గిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతూనే ఉండగా, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గడిచిన మూడేళ్ల గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారమే 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,09,212 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 23,71,772కు తగ్గిపోయింది. అదే క్రమంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 37,26,220కి పెరిగింది.ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన విద్యార్థులు ఖమ్మం జిల్లాలోనూ రామలింగాలపల్లి క్రాస్ రోడ్డు, ఆలియాతండా, గంగారంతండా కొత్తతండా పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఓవరాల్గా చూస్తే ఈ మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లలోనూ రెట్టింపు స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022–23లో ప్రభుత్వ స్కూళ్లలో 1,08,715 మంది విద్యార్థులు ఉంటే వారి సంఖ్య 2024–25లో 1,10,934కు పెరిగింది. ప్రైవేట్ స్కూళ్లలో గతంలో 1,22,781 మంది ఉంటే 1,26,421కి పెరిగింది. ఏటేటా పెరుగుతున్న జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఏటేటా పెరుగుతోంది. అక్కడక్కడ బడిబాటలో టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి ఒకటీ రెండు మూత పడిన స్కూళ్లను తెరిపిస్తున్నా, వందల సంఖ్యలో మూత పడుతూనే ఉన్నాయి. ⇒ 2021–22 విద్యా సంవత్సరంలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 1,086 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపునకు దగ్గరైంది. ⇒ జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 2022–23 విద్యా సంవత్సరంలో 1,307కు పెరగగా, 2023–24 సంవత్సరంలో 1,745కు, 2024–25 సంవత్సరంలో వాటి సంఖ్య 1,980కి పెరిగింది. ⇒ ఈ నెల 19 వరకు నిర్వహించే బడిబాట తర్వాత వాటిల్లో ఎన్ని తెరుచుకుంటాయో, ఈసారి ఎన్ని స్కూళ్లు మూత పడతాయో త్వరలోనే తేలనుంది. -
నృసింహుడి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యారాధనలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, అర్చనలతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
నేడు రైతు నేస్తం
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలోని 93 రైతు వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ ఆదివాకం ఒక ప్రకటనలో కోరారు. సీఎం రేవంత్రెడ్డి పాల్గొనే ఈ వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో ముఖాముఖి ఉంటుందని, కలెక్టర్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కోర్టు కానిస్టేబుళ్లకు ఎస్పీ అభినందననల్లగొండ : జాతీయ మెగా లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 16,460 కేసులు పరిష్కరించడంతో కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో అభినందించారు. రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బంది కృషి చేశారని పేర్కొన్నారు. కక్షిదారులకు సమాచారం అందించి అవగాహన కల్పించి పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కరించడం అభినందనీయమని తెలిపారు. మందుల దుకాణాల్లో తనిఖీలు చేయాలని ఆదేశంనల్లగొండ టౌన్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మందుల దుకాణాల్లో తనిఖీ చేయాలని ఔషధ నియంత్రణ ఏడీ దాస్ ఆదివారం ఆదేశించారు. శనివారం ‘సాక్షి’లో ‘మత్తుమందు మాఫియా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి సమగ్ర నివేదిక అందించాలని నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. మత్తు మందులను విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రజకుల మహాధర్నాను జయప్రదం చేయాలినార్కట్పల్లి : తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చెరుకు పెద్దులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రజక, నాయీబ్రాహ్మణ వృత్తిదారుల ఉచిత విద్యుత్ పథకం పెండింగ్ (బకాయిలు) కరెంటు బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. ఏడాది కాలంగా ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి రజకులకు రూ.187 కోట్లు, నాయీ బ్రాహ్మణులకు రూ.43 కోట్లు పెండింగ్ ఉందన్నారు. వివిధ సమస్యలపై నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. జల దోపిడీకే బనకచర్ల ప్రాజెక్టుసూర్యాపేట : గోదావరి నది మిగులు జలాలు, వరద జలాల పేరుతో తెలంగాణ నికర జలాలను దోపిడీ చేసేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును రూపొందించిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర నాయకత్వం కృష్ణ, గోదారి నదులపై అడ్డగోలుగా ప్రాజెక్టు నిర్మించి తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా దోచుకెళ్లారని మళ్లీ ఇప్పుడు గోదావరి నది నుంచి 200 టీఎంసీల నీళ్లను తరలించుకెళ్లడానికి బనకచర్ల ప్రాజెక్టు మొదలు పెట్టారన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్టు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ధరావత్ వీరేష్ నాయక్, డీఎల్ సెల్ జిల్లా కార్యదర్శి బొజ్జ అనిల్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటశ్వరస్వామి దేవాలయం వద్ద అదివారం శ్రావణ నక్షత్రం సందర్భంగా భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధిఉత్సవ సేవ, రథోత్సవం నిర్వహించారు. -
చేప పిల్లల పంపిణీ ఉన్నట్లా లేనట్లా!
సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025నల్లగొండ టూటౌన్ : మత్స్యకారులకు ఉపాధి కల్పించడానికి చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీపై సందిగ్ధత నెలకొంది. జూన్ నెల వచ్చినా జిల్లాకు ఎన్ని చేప పిల్లలు కావాలన్న వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు. ప్రతి సంవత్సరం మే నెలలోనే ప్రతిపాదనలు పంపాలని జిల్లా మత్స్యశాఖ అధికారులను ఆదేశించేవారు. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఉచిత చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉచిత చేప పిల్లల పంపిణీ ఉన్నట్లా లేనట్లా అనే మీమాంస నెలకొంది. 1,160కి పైగా చెరువులు, కుంటలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ప్రాధాన్యం ఇవ్వడంలేదని తెలుస్తోంది. వానాకాలం గనుక భారీ వర్షాలు కురిస్తే ఆగస్టు నెల నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రతిపాదనలు ఊసేలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామ పంచాయతీ చెరువులు, కుంటలు కలిపి మొత్తం 1,160కి పైగానే ఉన్నాయి. వీటన్నింటిలో చేప పిల్లలు పోయాలంటే జిల్లాకు 5.90 కోట్ల చేప పిల్లలు అవసరం ఉంటుందని మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 249 మత్స్య సొసైటీలు.. జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 249 మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈ 249 సంఘాల్లో 28 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. సొసైటీల్లో సభ్యత్వం ఉన్న వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 60 వేల మందికి పైగా ఉచిత చేప పిల్లల ద్వారా జీవనోపాధి కలిగే అవకాశం ఉంటుంది. నాణ్యత లేని పిల్లలు.. మత్స్యకారులకు అందించే ఉచిత చేప పిల్లల పంపిణీలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా కాంట్రాక్టర్లు లాభపడుతున్నారు తప్పితే మత్స్యకారులకు ప్రయోజనం లేకుండా పోయిందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చెరువుల్లో చేప పిల్లలు పోయడానికి కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యమైన పిల్లలను తేకుండా మత్స్యకారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చేప పిల్లల లెక్కింపులో కూడా అక్రమాలకు పాల్పడుతూ ఇటు ప్రభుత్వాన్ని అటు మత్స్యకారుల కళ్లుగప్పి అందిన కాడికి దోచుకుంటున్నారనే విమర్శలు ప్రతి సంవత్సరం వస్తున్న విషయం తెలిసిందే. అక్రమాలు, నాణ్యమైన పిల్లలు సరఫరా చేయని కారణంగా ఉచిత చేప పిల్లలు కాకుండా తమకు నేరుగా నగదు అందించాలని మత్స్యకార సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరి ఉచిత చేప పిల్లల పథకాన్ని ఎత్తేస్తారా.. లేక నగదు పంపిణీ చేస్తారా..! అనే దానిపై ఎలాంటి సమాచారం మత్స్యశాఖ అధికారులు వద్ద కూడా లేదు. న్యూస్రీల్ఫ జిల్లాకు కావాల్సిన చేప పిల్లలు 5.90 కోట్లు ఫ ఇప్పటివరకు ప్రతిపాదనలు తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం ఫ అయోమయంలో మత్స్యకారులు -
సీజనల్ వ్యాధులను అరికట్టేదెలా..!
ఫ జిల్లా మలేరియా అధికారి, సీనియర్ ఎంటమాలజిస్ట్ పోస్టులు ఖాళీ ఫ సిబ్బందిపై కొరవడిన పర్యవేక్షణ ఫ కనిపించని వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నల్లగొండ టౌన్ : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టేది ఎవరనే ప్రశ్న జిల్లాలో తలెత్తుతోంది. ఆరు నెలలుగా మలేరియా అధికారి పోస్ట్ ఖాళీగా ఉంది. దాంతోపాటు అర్బన్ మలేరియా సీనియర్ ఎంటమాలజిస్ట్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. వర్షాకాలంలో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయి. ఈ వ్యాధులన్నింటిని అరికట్టాలంటే ప్రజల్లో జిల్లా మలేరియా విభాగం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంటుంది. దోమల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. దాంతోపాటు అర్బన్ మలేరియా సిబ్బంది ద్వారా నీటి కుంటలు, మురుగు కాల్వలు, పాడుబడిన నీటి గుంటల్లో దోమల నిర్మూలన కోసం మందులను స్ప్రే చేయాలి. డెంగీ, మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో బాధితుల ద్వారా రక్త నమూనాలను సేకరించి వ్యాధులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఆరు నెలల నుంచి ఇప్పటివరకు రెగ్యులర్ జిల్లా మలేరియా అధికారి పోస్టును ప్రభుత్వం భర్తీ చేయలేదు. జిల్లా మలేరియా ఇన్చార్జి అధికారిగా జిల్లా కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన జిల్లా మలేరియా అధికారిగా ఆ విభాగానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. అదనపు పనిభారం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నమోదవుతున్న మలేరియా కేసులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ డెంగీ మలేరియా కేసులు నమోదైనా మలేరియా సిబ్బంది అక్కడికి వెళ్లి వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అంతేగాక క్యాంపు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమై జిల్లాలో అక్కడక్కడ డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. కానీ జిల్లా మలేరియా అధికారి లేకపోవడం వల్ల ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే జిల్లా మలేరియా అధికారితో పాటు సీనియర్ ఎంటమాలజిస్టును నియమించి జిల్లాలో సీజనల్ వ్యాధులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
కథకు పుట్టినిల్లు నల్లగొండ
రామగిరి(నల్గొండ): ఆధునిక తెలుగు కథకు నల్లగొండ పుట్టినిల్లు అని సాహితీవేత్త డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కథా రచయిత డాక్టర్ సాగర్ల సత్తయ్య రచించిన ‘బర్కతి’ కథా సంపుటిని నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నల్లగొండ కథా పాఠశాల పేరుతో ఇటీవల నల్లగొండలో నూతన కథకులు చక్కని కథలు రాస్తుండడం అభినందనీయం అన్నారు. పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి , మునాస్ వెంకట్, తండు కృష్ణ కౌండిన్య, పగడాల నాగేందర్, బైరెడ్డి కృష్ణారెడ్డి, ఎలికట్టె శంకర్రావు, మేక నాగయ్య, ఎడ్ల సైదులు, శీలం భద్రయ్య, బండారు శంకర్, ముక్కామల జానకిరామ్, డాక్టర్ మెంతబోయిన సైదులు, కాసుల ఆంజనేయులు, కుకుడాల గోవర్ధన్, కోమటిరెడ్డి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న మోదీ
పెద్దవూర : కేంద్రంలో మోదీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్శరించి, పెట్టుబడిదారుల కొమ్ముకాస్తోందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లికంటి సత్యం విమర్శించారు. ఆదివారం పెద్దవూర మండలంలోని పులిచర్లలో నిర్వహించిన సీపీఐ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే ప్రాణంగా ప్రజలకు అండగా సీపీఐ జెండా నిలబడి పోరాడుతుందని పేర్కొన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వాటిని అదుపు చేయకుండా పేదవారి నడ్డివిరిచే విధంగా కేంద్రంలో పాలన సాగుతోందని మండిపడ్డారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్తా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గడ్డంపల్లి భిక్షంరెడ్డి, నాయకులు పొదిల నర్సింహ, లక్ష్మీపతి, రొయ్య రాములు, శోభన్బాబు, నాగార్జున, జయప్రకాశ్రెడ్డి, విజయానంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీలు.. మారాలిక!
పట్టణాల అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికసమస్యలు తీరేనా...? మున్సిపాలిటీలో గత ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని అప్పటి ప్రభుత్వ పెద్దలు, మున్సిపాలిటీల ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పినా కార్యాచరణలో కనపడలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆదేరీతిలో వందరోజుల ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని రూపొందించినా అది కూడా గతం మాదిరి కాకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వార్డులలో దీర్ఘకాలికంగా సమస్యలు వేదిస్తున్నా అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం వార్డుల్లో చేపట్టే పనులను పూర్తిచేసి ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఫ పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు ఫ పచ్చదనం పెంపునకు మొక్కల పంపిణీ ఫ తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సులు ఫ సెప్టెంబర్ 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణహాలియా, దేవరకొండ : మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, మెరుగు, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వంద రోజుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2వ తేదీ) నుంచి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. సెప్టెంబర్ 10వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు, దీర్ఘకాలికంగా నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. జూన్ 2వ తేదీ నుంచి వంద రోజులపాటు ఒక్కో కార్యక్రమం చేపట్టేలా కార్యాచరణ రచించింది. వందరోజుల యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా ఇప్పటికే జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోని వార్డు అధికారులకు బాధ్యతలు కేటాయించింది. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను నోట్ చేసుకుంటున్నారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి వాటిని పూర్తిస్థాయిలో తీర్చేలా బడ్జెట్ కేటాయించి పనులు పూర్తిచేసేలా చూడనున్నారు. వంద రోజుల కార్యాచరణలో చేపట్టే పనులు ఇలా.. ● రాబోయే సీజన్ను దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ● మున్సిపాలిటీలో తాగునీటి వనరులు శుభ్రం చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, క్లోరినేషన్ వేయడం, అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచనున్నారు. ● పచ్చదనం పెంపులో భాగంగా మొక్కలు నాటనున్నారు. ● ఇంకుడు గుంతలు లేని ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పిస్తారు. ● డ్రెయినేజీల్లో పూడికతీత, పారిఽశుద్ధ్య వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు మురికి వాడల్లో అధికారులు పర్యటించనున్నారు. ● ఆస్తి, నీటి, వాణిజ్య పన్నుల వసూళ్లపై వార్డు అధి కారులు ప్రత్యేక దృష్టిని సారించడంతో పాటు ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహిస్తారు. ● మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ● శిథిలావస్థలోకి చేరిన ఇళ్లను వార్డు ఆఫీసర్లు పూర్తిస్థాయిలో గుర్తించనున్నారు. ● ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం తొలగించడంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించనున్నారు. ● మున్సిపాలిటీల్లో నూతన సమభావన సంఘాల ఏర్పాటు గుర్తింపు, మహిళా సంఘాలకు వ్యక్తిగత రుణాలు ఇప్పించనున్నారు. ● చేతి వృత్తుల్లో భాగంగా జ్యూట్ బ్యాగుల తయారీ దారులను గుర్తించి వారికి రుణాలను ఇప్పిస్తారు. ● స్ట్రీట్ వెండర్స్ సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలి. ● పట్టణాల్లో కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఈ నెలాఖరు వరకు ఏర్పాటు చేయనున్నారు. ● తాగునీటి సరఫరా మెరుగుపర్చడం, పైపులైన్ లీకేజీలను గుర్తించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయనున్నారు. ● భువన్ యాప్లో ఇళ్ల లెక్క పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఇంటిని యాప్లో నమోదు చేయనున్నారు. ● ప్రైవేట్ ఆసుపత్రుల సహకారంతో కార్మికులకు వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. మందులు పంపిణీ చేయనున్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వారి ఖాతాల్లో జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. -
సామాన్యులకు అర్థమయ్యేలా శ్రీశ్రీ రచనలు
నాగార్జునసాగర్ : విప్లవ కవిగా సామాజిక సందేశాలతో సామాన్యులకు అర్థమ్యే రీతిలో సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు చేరవేసిన అభ్యుదయ కవి శ్రీశ్రీ అని ప్రముఖ గాయకుడు, కవి, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య అన్నారు. ఆదివారం మహాకవి శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా నందికొండ మున్సిపాలిటీలోని హిల్కాలనీలో దాసి సుదర్శన్ స్మారక చిత్రకళ నిలయంలో ఏర్పాటు చేసిన ‘సాహిత్యం–సమకాలీనత’ అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అసువులు బాసిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకవి గురజాడ భావజాలాన్ని, భాష, సాహిత్యాన్ని ముందుతరం వారికి తెలిపేందుకు వచ్చిన గొప్ప కవి శ్రీశ్రీ అన్నారు. కమ్యునిజం భావజాలంతో వచ్చే కవితైనా, కళ అయినా చిత్రకళ అయినా భావితరాలకు ఎర్రజెండాలా రెపరెపలాడుతూ ఉంటుందన్నారు. అనంతరం మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం శ్రీశ్రీ సొంత దస్తూరితో కార్టూన్లతో ఉన్నటు వంటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమూహ కవి, రచయిత ప్రభాకర్ కస్తూరి, కార్టునిస్ట్ నర్సింహ, రామలింగయ్య, రామ్మోహన్, రాజు, తిరుమల, స్వతంత్ర, కిరణ్మయి, పాండు, మున్నా, జగన్మోహన్, బాలీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
కల్నల్ సంతోష్బాబు త్యాగం వెలకట్టలేనిది
సూర్యాపేటటౌన్ : దేశం కోసం కల్నల్ సంతోష్బాబు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. కల్నల్ సంతోష్బాబు 5వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల సంతోష్బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆర్మీ జవాన్గా విరోచితంగా పోరాడి దేశ రక్షణలో అసువులు బాసిన సంతోష్బాబును నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కల్నల్ సంతోష్బాబు గారి త్యాగాన్ని స్మరించుకోవడం ఆ కుటుంబానికి ఓదార్పు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్బాబు కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు, ఆర్మీ జవాన్లు, విద్యార్థులు, పట్టణప్రముఖులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్ నుంచి ఆర్టీసీ డ్రైవర్గా
సంస్థాన్ నారాయణపురం: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా చేరి.. తొలి మహిళా బస్సు డ్రైవర్గా రికార్డు సొంతం చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన సరితనాయక్. మారుమూల గిరిజన తండాలో పుట్టి పెరిగిన సరిత ఇప్పటికే ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్సు చక్రం తిప్పి దేశంలోనే బస్సును నడిపిన మొదటి మహిళగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్గా విధుల్లో చేరారు. అమ్మా నాన్నలు రాంకోటి, రుక్కలు. సరిత కుటుంబంలో నలుగురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. అక్క దగ్గర ఉంటూ దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల చదివి, అక్కడ నుంచి 10వ తరగతి వరకు ఓపెన్ స్కూల్లో చదివింది. సరిత కొన్ని రోజులు దేవరకొండలో.. తర్వాత ఐదు సంవత్సరాలు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపింది. ఆటో నడుపుతున్న సందర్భంగా ఎదురైన ఇబ్బందులును ఎదుర్కోవడానికి పురుషుల మాదిరిగా వేషధారణ మార్చింది హైదారాబాద్లోని బంధువులు ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. తర్వాత కాలంలో హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. తెలంగాణలో ఉద్యోగం చేయాలని సరిత గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు విన్నవించింది. హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి , మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి వెంకట్రెడ్డి ఆమె హామీ ఇచ్చారు. తాజాగా ఆమె ఎంజీబీఎస్ డిపోల్ పోస్టింగ్ పొందారు. శనివారం ఆమె ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్స్టాప్ బస్సు నడిపారు. -
ఆటోలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పరిధిలోని కొత్తూరు(బొద్దుగుట్ట)కు చెందిన అందుగుల సైదులు మూడు నెలల క్రితం కొత్త ఆటో కొన్నాడు. తన ఆటోలో దివ్యాంగులకు ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాడు. గతంలో పాత ఆటో నడిపే సమయంలో ఓ దివ్యాంగుడు రోడ్డుపై ఎండలో నిలబడగా, అతడిని వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలని అడగానని.. దానికి అతడు తన వద్ద డబ్బులు లేవు అని చెప్పడంతో ఎంతో బాధ అనిపించిందని సైదులు పేర్కొన్నాడు. దీంతో అప్పటి నుంచి దివ్యాంగులజీ తన ఆటోలో వారిని గమ్యస్థానాలకు ఉచితంగానే చేరవేస్తున్నట్లు సైదులు తెలిపాడు. -
‘జయ’ విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థులు శనివారం వెలువడిన నీట్ ఫలితా ల్లో జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. కళాశాలకు చెందిన వి. నీతు 22,360, అవనీష్ 31,548, డి. వంశీ 80,101, జి. రాహుల్ 1,55,808, టి. తరుణ్ 1,61,298వ ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. 13 మంది విద్యార్థుల్లో ఐదుగురు మెడికల్ సీట్లు పొందినట్లు చెప్పారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. -
నృసింహుడి సన్నిధిలో భక్తుల సందడి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. రెండో శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ముఖ మండపం, మాడ వీధులు, కొండ కింద భక్తులు కిటకిటలాడారు. ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. 40వేలకు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.49,88,217 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. యాదగిరీశుడిని దర్శించుకున్న ఛత్తీస్గఢ్ పీఎస్సీ చైర్పర్సన్లక్ష్మీనరసింహస్వామిని ఛత్తీగఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(సీజీపీఎస్సీ) చైర్పర్సన్ రీటా శాండిల్య శనివారం దర్శించుకున్నారు. ఆమెకు అర్చకులు, తహసీల్దార్ గణేష్ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. రమణేశ్వరంలో నమక మంత్రాల ప్రవచనాలుభువనగిరి: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని రమణేశ్వరంలో గల శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీఠంలో శనివారం సిద్ధ గురు రమణానంద మహర్షి 66 నమక మంత్రాలపై ప్రవచించారు. అనంతరం మహాపీఠం ఆవరణంలో రుద్ర హవనం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బైక్లు చోరీ చేస్తున్న బాలుడి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: బైక్లు చోరీ చేస్తున్న బాలుడిని మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్టౌన్ సీఐ మోతీరాం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం చింతపల్లికి చెందిన నందిపాటి తరుణ్ మిర్యాలగూడలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. తన బైక్ను గత నెల 29న రాత్రి హాస్టల్లో పెట్టి నిద్రించాడు. మరుసటిరోజు చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. అటుగా బైక్పై వచ్చిన బాలుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బైక్లు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు గతంలోనూ హైదరాబాద్లో, ఏపీలోని పెనుగంచిప్రోలులో బైక్లు చోరీ చేశాడని, ఎస్ఆర్నగర్ పోలీసులు అతడి అరెస్ట్ చేసి నాంపల్లిలోని జువైనల్ కోర్టులో హాజరుపరిచే క్రమంలో కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయినట్లు సీఐ తెలిపారు. అతడి వద్ద నుంచి రూ.11.50 లక్షల విలువైన ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
నడిపించిన నాన్న
●ఆటో నడుపుతూ.. కొడుకును ఎంబీబీఎస్ చదివిస్తూ.. భువనగిరి : భువనగిరి పట్టణంలోని పహడీనగర్కు చెందిన షేక్ జహంగీర్, నసీం దంపతులకు కుమారుడు అద్నాన్, కుమార్తె ఉన్నారు. తన కొడుకును డాక్టర్ చేయాలని జహంగీర్ సంకల్పించాడు. వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలు భువనగిరి నుంచి చౌటుప్పల్కు వెళ్లి అక్కడ వెల్డింగ్ వర్క్షాపులో పనిచేస్తూ తమ పిల్లలను చదివిస్తూ, కుటుంబాన్ని పొషించాడు. కొన్ని సంవత్సరాల క్రితం వలిగొండ నుంచి భువనగిరికి బైక్పై వస్తుండగా అనాజీపురం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న అనంతరం ఆటో కొనుగోలు చేసి భువనగిరిలో నడుపుకుంటూ పిల్లల చదువును కొనసాగించాడు. పిల్లల చదువుల కోసం అప్పులు సైతం చేశాడు. ఇంటర్ పూర్తయిన వెంటనే నీట్ ర్యాంకు రాలేదు. రెండేళ్లు కోచింగ్ ఇప్పించాడు. అద్నాన్ 2023లో నీట్ ర్యాంకు సాధించి ప్రస్తుతం జనగాంలోని ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె ఓ ప్రైవేట్ కళాశాలలోనే బీటెక్ చదువుతోంది. పిల్లల చదువు కోసం రూ.లక్షలు అప్పు చేశాడు. అప్పులను తీర్చేందుకు ఆటో నడుతుతూనే ఉన్నాడు జహంగీర్. కొడుకు కలను నెరవేర్చి చౌటుప్పల్ : చౌటుప్పల్కు చెందిన వీరమళ్ల శ్రీమన్నారాయణ–విజయ దంపతులకు కుమారుడు దయాకర్, కుమార్తె రాజ్యలక్ష్మి ఉన్నారు. శ్రీమన్నానారాయణకు ఆరుగురు అన్నదమ్ముళ్లు. ఉమ్మడి కుటుంబంలో మొదలైన కష్టాలు వారికి ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. తాము అనుభవించిన కష్టాలు తమ బిడ్డలకు రావొద్దన్న ఆలోచనతో ఈ దంపతులు ఎంతో శ్రమించారు. ప్రస్తుతం గ్రామాల్లోని కిరాణా దుకాణాలకు మార్కెటింగ్ చేస్తున్నాడు. దయాకర్ చిన్నతనం నుంచి కోరుకున్న విధంగా డాక్టర్గా తీర్చిదిద్దాడు. తనకు వచ్చిన సంపాదనతో ఉన్నంతలోనే ఖర్చు చేసుకొని కొంత మొత్తాన్ని కుమారుడి ఎదుగుదల కోసం వెచ్చించాడు. అలా వైద్య విద్య పూర్తి చేసుకున్న దయాకర్ చౌటుప్పల్లోనే తల్లిదండ్రుల వద్ద ఉంటూనే స్థానికంగా ఉన్న నాలుగు పరిశ్రమల్లో ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం డాక్టర్గా మంచిస్థానంలోనే ఉన్నాడు. ఫ పిల్లల విజయాన్ని తమ గెలుపుగా భావిస్తున్న నాన్నలు ఫ సంతానాన్ని సమాజంలో ఉన్నతంగా నిలబెట్టేందుకు కృషి ఫ బిడ్డల ఆశలే ఆయువుగా.. వారి గెలుపే లక్ష్యంగా ముందుకు నేడు ఫాదర్స్ డేనాన్న ఎంతో శ్రమించారు మాది పేద కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. నన్ను చిన్నతం నుంచి హైదరాబాద్లోనే హాస్టల్ ఉంచి చదివించాడు. డాక్టర్ కావాలన్న నా చిన్ననాటి కోరికను నెరవేర్చేందుకు అమ్మానాన్నలు పడిన కష్టం ఎన్నటికీ మరువలేను. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా నాకు ఏ లోటూ రాకుండా చూశారు. చదువు పూర్తవ్వగా ప్రస్తుతం ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్గా పని చేస్తున్నాను. ఇకపై నా తల్లితండ్రులకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటాను. – వీరమళ్ల దయాకర్పెద్దవూర: మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన చినపాక లక్ష్మీనారాయణ–మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు రాకేష్, రితీష్ ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించిన లక్ష్మీనారాయణ ఆర్థిక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయాడు. కార్మిక నాయకుడిగా పనిచేస్తూ తన పిల్లలను చదివిస్తున్నాడు. దీంతో తన కుమారులనైనా ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చిన్నప్పటినుంచే చదువుతో కలిగే ప్రయోజనాలను వివరించేవాడు. చదువుకు పేదరికం అడ్డుకాదని, ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు.. ఆ అన్నదమ్ములు. గత విద్యాసంవత్సరంలో ఇద్దరూ ఒకేసారి ఎంబీబీఎస్లో సీట్లు సాధించారు. విద్యాభ్యాసాన్ని అంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీట్లు సాధించి తమ తండ్రికి బహుమతిగా ఇచ్చారు. చినపాక రాకేష్ ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాల మహేశ్వరంలో, రెండో కుమారుడు చినపాక రితీష్ ప్రభుత్వ మెడికల్ కళాశాల కుత్బుల్లాపూర్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వైద్యం అంటే వ్యాపారంగా మారిన నేపథ్యంలో మంచి డాక్టర్లుగా తయారై ప్రజలకు సేవ చేస్తామని వారు పేర్కొంటున్నారు. ముగ్గురు పిల్లలను డాక్టర్లు చేసిన నాన్న.. మిర్యాలగూడ : పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందని ఎస్కె.సుబాని తొలుత ప్రైవేట్ టీచర్గా పని చేశారు. తర్వాత కలెక్టరేట్లో ఉద్యోగం సాధించి డిప్యూటీ తహసీల్దార్ బాధ్యతలు నిర్వహించారు. నిబద్ధతతో పని చేసి పలుమార్లు ఉత్తమ అవార్డులను సైతం అందుకున్నారు. ఆయనకు తమ నలుగురు పిల్లలను డాక్టర్లను చేయాలన్న లక్ష్యంతో వారిని ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులు, ఒక కూతురు ప్రభుత్వ డాక్టర్లుగా కొనసాగుతుండగా మరో కుమారుడు ఎఫ్సీఐలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భార్య మహమూబాబేగంతో కలిసి ఎస్కె.సుబాని పిల్లలను సమాజంలో ఆదర్శంగా నిలిపారు. నాన్న ప్రోత్సాహంతోనే..మర్రిగూడ : మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్యాదవ్ ఆండాలు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పదో తరగతి పూర్తి చేసిన శ్రీనివాస్ వ్యవసాయం చేసుకుంటూ.. లారీ డ్రైవర్గా పనిచేశాడు. ప్రస్తుతం మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు. నలుగురు సంతానంలో పెద్ద కుమార్తె అయిన నక్క సంధ్య బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉద్యోగానికి సన్నద్ధమవుతోంది. రెండవ కుమార్తె స్వాతి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం మెట్రో పాలిటిన్ జలమండలి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. మూడవ కుమార్తె ప్రియాంక డిగ్రీ పూర్తి చేసి రాచకొండ కమిషనరేట్లో సివిల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. కుమారుడు సాయితేజ పెండెకంటి లా 4వ సంవత్సరం చదువుతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన స్వాతి, ప్రియాంక మాట్లాడుతూ తండ్రి ప్రోత్సాహంతోనే ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధించామని తెలిపారు. తల్లి లేని లోటు తెలియనీయకుండా.. మోత్కూరు: భార్య చనిపోయినప్పటికీ మరో వివాహం చేసుకోకుండా తన పిల్లలకు తల్లి లేని లోటు తెలియనీయకుండా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు మోత్కూరులోని అంబేద్కర్నగర్ కాలనీకి చెందిన కురుమిళ్ల రమేష్. రమేష్కు మంజులతో 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె శ్రీకళ, కుమారులు దేవేందర్, కరుణాకర్ ఉన్నారు. మంజుల అనారోగ్యంతో 18ఏళ్ల క్రితం మృతిచెందింది. పిల్లలు చిన్న వయస్సులోనే ఉండగానే భార్య చనిపోవడంతో రమేష్ తన బాధను దిగమింగుకుంటూ మేసీ్త్రగా పనిచేస్తూ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు శ్రీకళ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి సౌదీ అరేబియాలో నర్సింగ్ ఉద్యోగం చేస్తోంది. పెద్ద కుమారుడు దేవేందర్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు కరుణాకర్ డీఎంఎల్టీ కోర్సు చదువుతున్నాడు. తన పిల్లలకు తల్లి లేని లోటును తీర్చడంతో పాటు వారిని బాగా చదివించి ప్రయోజకులుగా చేస్తున్న రమేష్ను పలువురు అభినందిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ వైద్య విద్య -
ప్రభుత్వ విప్ ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య
యాదగిరిగుట్ట: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేసే వ్యక్తి గంధమల్ల రవి(30) శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్, మృతుడి భార్య నవిత తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి తన భార్య నవిత, పిల్లలతో కలిసి యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఇక్కడకు రాక ముందు రవి సైదాపురం గ్రామంలోనే హోటల్ నిర్వహిస్తుండేవాడు. మద్యానికి బానిసైన రవి గురించి అతడి భార్య నవిత బీర్ల ఐలయ్యకు చెబితే ఆయన తన ఇంట్లోనే సహయకుడిగా పనిచేయాలని, మద్యం తాగడం మానేయాలని సూచించారు. దీంతో యాదగిరిగుట్టలోని ఐలయ్య ఇంట్లో రవి పనిలో చేరి పిల్లలను చదివిస్తున్నాడు. హోం లోన్ కట్టలేక.. అయితే మూడేళ్ల క్రితం రవి ప్రైవేట్ బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకున్నాడు. ఈఎంఐలు సరిగ్గా కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు రవి ఇంటికి తాళం వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా సైదాపురం గ్రామంలో సైతం రవి పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో రవి మళ్లీ మద్యం తాగడం ప్రారంభించాడు. రెండు రోజుల క్రితం రవి ఇంటికి బ్యాంక్ అధికారులు ఈఎంఐ కట్టడం లేదని నోటీసులు అంటించి వెళ్లారు. ఫోన్ చేస్తే లిఫ్టు చేస్తలేడని.. శుక్రవారం రాత్రి 9గంటలకు రవికి భార్య నవిత ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో రవి తల్లికి నవిత ఫోన్ చేయగా.. రవి సైదాపురం వచ్చి వెంటనే యాదగిరిగుట్టకు వచ్చాడని ఆమె తెలిపింది. దీంతో మరోసారి ఫోన్ చేసినా రవి లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి నవిత బీర్ల ఐలయ్య ఇంటి పైన పెంట్ హౌజ్లోకి వెళ్లి చూడగా.. రవి శాలువాతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఆమె గన్మెన్లు, బీర్ల ఐలయ్యకు సమాచారం ఇచ్చింది. వారు వెంటనే రవిని భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రవి మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవి భౌతికకాయానికి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో బీర్ల ఐలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. పోస్టుమార్టం అనంతరం రవి మృతదేహాన్ని సొంత గ్రామమైన సైదాపురానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. రవి అంత్యక్రియలో బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు.. మద్యానికి బానిస కావడంతో పాటు అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు రవి భార్య నవిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు యాదరగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు. రవి భార్యతో పాటు కుటుంబ సభ్యులు వాగ్మూలం సైతం నమోదు చేశామని, ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపడుతున్నామన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో నిరాధారమైన ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. నాల్గో అంతస్తులో ఉరేసుకున్న సహాయకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య ఫిర్యాదు -
విషం తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
● సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులునాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని పైలాన్కాలనీలో గల జెన్కో కార్యాలయం వద్ద శనివారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ప్రాణాలను విజయపురిటౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీకి చెందిన జస్విత(28) భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శనివారం ఆమె కారులో ఒంటరిగా బయల్దేరి మధ్యాహ్నానానికి నాగార్జునసాగర్లోని పైలాన్కాలనీ జెన్కో కార్యాలయం వద్ద గల ఏటీఎం వద్దకు చేరుకుంది. అక్కడ తనతో పాటు తెచ్చుకున్న విషయం తాగి కారులోనే కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను విషం తాగినట్లు చెప్పింది. హైదరాబాద్లోనే ఉంటున్న జస్విత తండ్రి సూర్య కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వారు నాగార్జునసాగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సంపత్ తన సిబ్బందితో కలిసి టెక్నాలజీ సహాయంతో జస్విత ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని కారులో అపప్మారకస్థితిలో ఉన్న ఆమెను స్థానిక కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. సకాలంలో స్పందించిన పోలీసులకు జస్విత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
నీట్ లో సత్తాచాటిన ‘ప్రగతి’ విద్యార్థులు
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో సత్తాచాటారు. కళాశాలకు చెందిన కె. ఉజ్వల జాతీయ స్థాయిలో 501 మార్కులు, కె. ఇందు 428, ఎం. అశ్రిత 427, ఎం.శైని 407, అరిబా తబస్సుమ్ 385, మహీన్ 379 మార్కులు సాధించారని కాలేజీ చైర్మన్ చందాకృష్ణమూర్తి తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను డైరెక్టర్లు ఎ. నరేందర్బాబు, ఎన్. శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్రెడ్డి అభినందించారు. ‘గౌతమి’ విద్యార్థుల ప్రతిభ నీట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎండీ ఉజేర్కు 519 మార్కులు, పావని 472, యాస్మిన్ 467, పసుపులేటి లేఖన 428, అలీఖాన్ 397, తస్నీమ్ 385, హీబామైరుక్కు 347 మార్కులు పొందారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, రఘుపాల్రెడ్డి, వెంకటరమణారెడ్డి అభినందించారు. అదేవిధంగా జోసా మొదటి రౌండ్ కౌన్సెలింగ్లో కళాశాలకు చెందిన ఆర్. శ్రీకర్ ఐఐటీ ధన్బాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీటు సాధించాడని, తేజస్వినికి ఎన్ఐటీ కాంచిపురంలో ఈసీఈ, ఎం. శివాజీకి ఎన్ఐటీ అగర్తలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీట్లు పొందినట్లు యాజమాన్యం పేర్కొన్నారు. ‘జాస్రిత’ ప్రభంజనం నల్లగొండ : నీట్లో నల్ల గొండలోని జాస్రిత అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆఫియా సదాఫ్ 429మార్కులు, ఫహాద్ 416, రుమానా మారియ 412, వర్షిత 410, మారియ్ 410, సిరి 403 మార్కులు సాధించారు. ఆర్షియా తబస్సుమ్ 401, పల్లవి 381, అక్షర 380, దానియా 380, ఫరియా మేహవీష్ 377, బృందా 371, అనన్య శరోణ్ 360, రేష్మ 348, దీక్షిత 344, అక్షిత 331 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. -
డిగ్రీలో ప్రవేశాలకు 23లోగా దరఖాస్తు చేసుకోవాలి
నల్లగొండ: నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశానికి ఇంటర్ పూర్తి చేసినవారు ఈ నెల 23లోగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో శనివారం ఆమె డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సులకు దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి, ఇంటర్ మార్కుల మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, 5 పాస్ ఫొటోలతో పాటుగా జనవరి 2025 తర్వాత పొందిన తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుకు జతచేసి నేరుగా కళాశాలలో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణికర్ష, కళాశాల అడ్మిషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ‘రైతు నేస్తం’ వీక్షించేలా ఏర్పాట్లు చేయాలి నల్లగొండ: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులంతా వీక్షించేలా రైతు వేదికల్లో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాట్ల విషయమై శనివారం ఆమె వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నల్లగొండ కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని 140 రైతు వేదికల్లో 32 వీడియో కాన్ఫరెన్స్కు అనుగుణంగా ఉన్నాయన్నారు. ప్రతి రైతు వేదికను మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలు, పూలతో అలంకరించాలన్నారు. రైతువేదికల్లో జరిగే రైతు నేస్తానికి సంబంధిత అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నడిపించిన నాన్న..
పిల్లలను పక్షి వలే తన రెక్కలతో కాపాడుతూ.. వారి కష్టసుఖాల్లో నేనున్నానంటూ వెన్నుతట్టి నడిపించేది నాన్న. పిల్లల విజయాన్ని తన గెలుపుగా భావించి వారి కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు నాన్న. పిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు తాను కొవ్వొత్తిలా కరుగుతాడు నాన్న. ఓర్పుకు మారుపేరు.. మార్పుకు మార్గదర్శి.. నీతికి నిదర్శనం.. మన ప్రగతికి సోపానం నాన్నే. నేడు ఫాదర్స్డే సందర్భంగా ప్రత్యేక కథనాలు 8లో -
హోటళ్ల యజమానులు నిబంధనలు పాటించాలి
నల్లగొండ: హోటల్స్, దాబాలు, రెస్టారెంట్ల యజమానులు నిబంధనలు పాటించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో దాబా హోటళ్ల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో హైవేపై ఉన్న హోటల్స్, దాబాలు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దొంగతనాలు, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. దాబాల వద్ద వాహనదారులు ఆగే సమయంలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నియంత్రణకు హైవేపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. హోటల్స్ వద్ద సరైన పార్కింగ్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని దాబా హోటళ్ల యజమానులను ఆదేశించారు. దాబాల వద్దకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిపోయే వాహనదారుల వివరాలు తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్కు అప్పగించాలన్నారు. దాబాలు, రెస్టారెంట్లలో మద్యం, గంజాయి విక్రయించడం, సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, ఎస్బీ సీఐ రాము, ఎస్ఐ సైదులు, హోటళ్ల యజమానులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలుకట్టంగూర్ : ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ప్రాంతీయ ఉద్యాన అధికారి శ్వేత అన్నారు. శనివారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో చెరుకు లక్ష్మి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. ఆయిల్ పామ్ అధిక దిగుబడులు ఇస్తుందని, మార్కెట్ సంబంధం లేకుండా కంపెనీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఎకరం ఆయిల్ పామ్ సాగుతో రూ.1.25 లక్షలు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పతంజలి ఫుడ్స్ నల్లగొండ జిల్లా మేనేజర్ నర్రా రవీందర్రెడ్డి, చిట్యాల డివిజన్ అధికారి వినయ్కుమార్, రామదాసు, శీను, ప్రసాద్ ఉన్నారు. యాదగిరీశుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం నిత్యారాధనలో భాగంగా శ్రీస్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా సాగింది. ప్రభాతవేళ స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవా హన సేవ, స్వామి,అమ్మవార్ల నిత్యకల్యాణం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. ముఖ మండపంలో బ్రహ్మోత్సవం నిర్వహించారు. -
డ్రైవింగ్ ట్రాక్.. తరలింపు!
కలెక్టరేట్ విస్తరణకు ఆర్టీఏ డ్రైవింగ్ ట్రాక్ తొలగించాలని నిర్ణయం దండంపల్లికి మార్చేలా.. ప్రస్తుతం కలెక్టరేట్ వెనుక భాగంలో రూ.33 కోట్లతో కలెక్టరేట్ అదనపు భవనాన్ని నిర్మిస్తున్నారు. రెండు నెలల కిందట జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అప్పటి నుంచి ఆ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని చదును చేస్తున్నారు. అందులో భాగంగా కలెక్టరేట్కు ఆర్టీఏ కార్యాలయానికి మధ్య ఉన్న ప్రహరీని తొలగించారు. దాంతోపాటు ఆర్టీఏ కార్యాలయంలోని డ్రైవింగ్ టెస్టులు నిర్వహించే ట్రాక్ను కూడా అక్కడ నుంచి తొలగించి ఆ స్థలాన్ని కూడా కలెక్టరేట్కు వినియోగించేలా పక్కనే చదును చేస్తున్నారు. ట్రాక్ కోసం అధికారులు ఇప్పటికే నల్లగొండ పట్టణ సమీపంలోని హైదరాబాద్ రోడ్డులో, అలాగే దండెంపల్లిలో స్థలాలను పరిశీలించారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్థలం లిటిగేషన్లో ఉండటంతో దండెంపల్లిలో గతంలో కోళ్ల పరిశ్రమ కోసం ఇచ్చిన స్థలం సమీపంలోనే టెస్టింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కలెక్టరేట్ విస్తరణలో రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ మార్పు తప్పేలా లేదు. కలెక్టరేట్ విస్తరణలో భాగంగా కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఆర్టీఏ కార్యాలయంలోని ట్రాక్ ఉన్న స్థలంలో కలెక్టరేట్ అదనపు బ్లాక్ను నిర్మించాలని జిల్లా యంత్రాంగం ఇటీవల నిర్ణయించింది. ఇందుకు జిల్లా మంత్రులు శంకుస్థాపన చేశారు. దీంతో చదును చేసే పనులను కూడా ప్రారంభించారు. ఇప్పటికే ఆర్టీఏ కార్యాలయం ప్రహరీని తొలగించారు. ట్రాక్ కూడా అక్కడ నుంచి తొలగించాల్సి వస్తోంది. ఊరి చివరలో ఉన్న దండెంపల్లికి ట్రాక్ను మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఆర్టీఏ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్టుల కోసం వచ్చే వారికి భవిష్యత్లో తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. పదేళ్ల క్రితం నుంచి ఒకేచోట.. ఆర్టీఏ కార్యాలయం గతంలో హైదరాబాద్ రోడ్డులో ప్రైవేట్ భవనంలో ఉండేది. మరోవైపు ట్రాక్ మాత్రం ప్రస్తుతం ఉన్న ఆర్టీఏ కార్యాలయ ఆవరణలో ఉండేది. దీంతో వాహనదారులు రెండు చోట్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వెనుక భాగంలోని ప్రభుత్వ స్థలంలో పదేళ్ల కిందట సొంత భవనాన్ని నిర్మించారు. దీంతో లైసెన్స్ల కోసం కార్యాలయ పనితోపాటు డ్రైవింగ్ టెస్టులు ఒకేచోటకు రావడంతో ఇబ్బందులు తప్పాయి. ప్రస్తుతం మళ్లీ కలెక్టరేట్ విస్తరణలో ఆర్టీఏ కార్యాలయం మార్చాల్సి వస్తుందడంతో జనాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ట్రాక్ తరలిస్తే ఇబ్బందులే.. డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ను దండెంపల్లిలో ఏర్పాటు చేసి, రవాణా కార్యాలయాన్ని మాత్రం అక్కడే ఉంచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్ ఇతరత్రా కార్యాలయ పనులకోసం కలెక్టరేట్ వెనుక ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. ఇక ట్రాక్ను దండెంపల్లికి తరలిస్తే డ్రైవింగ్ టెస్టు కోసం అక్కడికి వెళ్లాల్సిందే. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆర్టీఏ కార్యాలయానికి రావడమే కష్టం. అలాంటిది ఒక పనికోసం ఇటు ఆర్టీఏ కార్యాలయానికి, అటు దండంపల్లికి వెళ్లి టెస్టింగ్లు చేయాలంటే మరింత ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ టెస్టుల కోసం ప్రతినెలా వచ్చే వందల మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాబోతోంది. ట్రాక్ వరకు స్థలాన్ని వదిలేయాలంటున్న ఆర్టీఏ సిబ్బంది ఆర్టీఏ కార్యాలయానికి గతంలోనే సొంత భవనం నిర్మించారు. స్థలం కూడా సరిపోను ఉంది. కలెక్టరేట్ విస్తరణలో కార్లు, ఇతర వాహనాలకు సంబంధించి డ్రైవింగ్ టెస్టు నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న ట్రాక్ను వదిలేస్తే తమకు ఇబ్బందులు ఉండవని రవాణా శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఆ ట్రాక్ స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయానికి ఉంచాలని కోరుతున్నారు. కావాలంటే ట్రాక్ పక్కనుంచి ఆర్టీఏ కార్యాలయం వరకు వెనుకవైపు ఉన్న స్థలాన్ని తీసుకోవాలని, ట్రాక్ను అక్కడే ఉంచాలంటున్నారు. ఫ నల్లగొండ సమీపంలో దండెంపల్లిలో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఫ అదే జరిగితే.. లైసెన్స్ కోసం కార్యాలయానికి, టెస్టులకు దండెంపల్లి వెళ్లాల్సిందే.. ఫ వాహనదారులకు ఇబ్బందులే.. ఫ ట్రాక్ వరకు స్థలాన్ని వదిలేయాలంటున్న ఆర్టీఏ సిబ్బంది -
కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేయాలి
ఫ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సమష్టిగా కృషిచేయాలని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వస్తుందన్నారు. ఈ సందర్భంగా వివిధ పదవుల్లో నియమించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రంలో భాగంగా దేవరకొండ రోడ్డులో ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని లైన్వాడ కాలనీలో గల కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, నాయకురాళ్లు దుబ్బ రూప, నాగమణి, జాన్, సుజాత, రాజ్యలక్ష్మి, సురెడ్డి సరస్వతి పాల్గొన్నారు. -
21,660 కేసులు పరిష్కారం
రామగిరి(నల్లగొండ): జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించి జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాజీమార్గమే రాజమార్గం అన్ని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసి 38 సివిల్, 15,837 క్రిమినలు, 85 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 28 బ్యాంకు కేసులు, 25 సైబర్ క్రైమ్ కేసులు, 80 ట్రాన్స్కో, 5,567 ట్రాఫిక్ చలాన్ కేసులతో కలిపి మొత్తం 21,660 (పెండింగ్, ప్రీ లిటిగేషన్) కేసులు పరిష్కరించామన్నారు. ప్రమాద బీమా కేసుల్లో బాధితులకు రూ.4,75,29,000 నష్టపరిహారం ఇప్పించగా రూ.30,21,000 బ్యాంకు కేసులలో రుణపరిహారం అందజేశారు. సైబర్ క్రైం కేసులో రికవరీ డబ్బులు రూ.2,03,112 అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి పి.పురుషోత్తమ్రావు, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నగేష్, ఇతర న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన జడ్జి నాగరాజు ఫ 12 ప్రత్యేక బెంచ్లలో లోక్అదాలత్ -
ఎంజీ యూనివర్సిటీలో రక్తదాన శిబిరం
నల్లగొండ టూటౌన్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ పరిధిలోని ఎంజీ యూనివర్సిటీలో రక్తదాన శిబిరరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పాల్గొని రక్తదానం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్త దానం చేయండి.. మనిషి ప్రాణాలను నిలబెట్టండని సూచించారు. అనంతరం పలువురు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్, బి.వీరస్వామి, జి.సుధాకర్, అల్వాల రవి, మద్దిలేటి పసుపుల, రూప, తిరుమల, సత్తిరెడ్డి, ఆంజనేయులు, మాధురి తదితరులు పాల్గొన్నారు. -
కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
మోత్కూరు : మోత్కూరు పట్టణానికి చెందిన దాసరి వెంకన్న జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరావత్ తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా తన కుమారుడు రాహుల్ను శుక్రవారం మోత్కూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థి సంపూర్ణ మనో వికాసానికి దోహదపడే బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందని వెంకన్న చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీపిరెడ్డి గోపాల్రెడ్డి విద్యార్థి రాహుల్కు అడ్మిషన్ అందజేశారు. కాగా, రాహుల్ 5వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివాడు. -
నిజాయితీ చాటుకున్నకండక్టర్
చిట్యాల: బస్సులో ప్రయాణికురాలు మరచిపోయిన హ్యాండ్బ్యాగ్ను భద్రపరిచి తిరిగి ఆమెకు అందజేసి తన నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్ జంగయ్య. వివరాలు.. నల్లగొండ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎల్లారెడ్డిగూడెం నుంచి చిట్యాలకు వస్తున్న యువతి తన హ్యాడ్బ్యాగ్ను మరిచిపోయి చిట్యాల బస్టాండ్లో దిగి వెళ్లిపోయింది. అనంతరం ఆ యువతి కార్గో సెంటర్ నిర్వాహకుడు పొలిమెర దశరథ ద్వారా కండక్టర్కు సమాచారం అందించింది. దీంతో హ్యాండ్బ్యాగును కండక్టర్ తీసుకుని తన వద్ద భద్రపరుచుకున్నాడు. వెంటనే రామన్నపేటకు వచ్చిన యువతికి కండక్టర్ జంగయ్య ఆహ్యాండ్బ్యాగు అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. -
ట్రాన్స్కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ విజేత నల్లగొండ
హన్మకొండ: తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025–2026 శుక్రవారం ముగిసింది. కబడ్డీ ఫైనల్లో నల్లగొండ, వరంగల్ జట్లు పోటీపడగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్ జట్టు ద్వితీయ స్థానం, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలిచాయి. కబడ్డీ పోటీల్లో 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్లో 9 జట్లు పాల్గొన్నాయి. బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరంగల్, మహబూబ్నగర్ జట్లు పోటీ పడగా వరంగల్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల జట్టు విజేతగా నిలిచింది. మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో, నల్లగొండ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. -
రైళ్లలో చోరీకి పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
నల్లగొండ: నల్లగొండ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపారు. శుక్రవారం రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడ్ గ్రామానికి చెందిన జమ్మిగుంపుల శ్రీకాంత్ అనే యువకుడు నల్లగొండ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. విచారించిన అనంతరం నిందితుడి వద్ద నుంచి 20 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్, రూ.4930 స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ రమణ, రైల్వే పోలీసులు పాల్గొన్నారు. ఫ ఫోన్, బంగారం, నగదు స్వాధీనం -
సైనిక్ గురుకుల కళాశాల విద్యార్థిని ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా ఎంపిక
బీబీనగర్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల 2021–2024 బ్యాచ్ విద్యార్థిని వి.కావ్య ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా ఎంపికయ్యారు.ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 28వ తేదీన దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ కార్యాలయానికి వెళ్లి విధుల్లో చేరనున్నారు. కళాశాల నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్కు ఎంపికై న మొదటి విద్యార్థి కావ్య అని ప్రిన్సిపాల్ తెలిపారు. కావ్యను ప్రన్సిపాల్ శ్రీలత, కళాశాల కార్యదర్శి వర్షిణి, సహాయ కార్యదర్శి పీఎస్ఆర్ శర్మ, ఉప కార్యదర్శి రజిని, అధ్యాపకులు అభినందించారు. వాట్సాప్ గ్రూపులో తప్పుడు పోస్టు చేసిన వారిపై కేసుమోత్కూరు : మండలంలోని ముశిపట్ల గ్రామ వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ నాయకులపై తప్పుడు పోస్టు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి.నాగరాజు తెలిపారు. వివరాలు.. ఈ నెల 6వ తేదీన మావూరి ముచ్చట్లు (ముశిపట్ల) గ్రూపులో కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నేర్లకంటి శ్రీనివాస్, బోనగిరి హరీష్ పోస్టు చేశారు. ఆ గ్రామానికి చెందిన నిమ్మల రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భవన నిర్మాణ కూలీ మృతివలిగొండ : భవన నిర్మాణ పనికి వెళ్లిన వ్యక్తి పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని వేములకొండలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నపాక బాబు అనే వ్యక్తి రామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులకు దినసరి కూలీగా వెళ్తున్నాడు. చిన్నపాక బాబు గురువారం వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో భవన నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. బైక్ ఢీకొని సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణంచివ్వెంల(సూర్యాపేట) : బైక్ ఢీకొట్టడంతో జర్నలిస్ట్ మృతి చెందాడు. ఈ సంఘటన చివ్వెంల మండల కేంద్రంలో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చెరుపల్లి సత్యం (70) మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద రహదారి దాటుతుండగా మోతె నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యం, తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సత్యంను సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాటిచెట్టు ఎక్కడం ఇక సులువే..
ఆత్మకూరు(ఎం): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కామునిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు రాగటి ఆనంద్ శ్రీకోకోనట్ కై ్లంబర్శ్రీ (కొబ్బరిచెట్లు ఎక్కే పరికరం) సహాయంతో తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో దీనిని తయారు చేయించి తీసుకొచ్చాడు. యూట్యూబ్లో చూసి తెచ్చుకున్నానని, ఈ పరికరం ఐదు కిలోల బరువు ఉంటుందని, దీని ధర రూ.10,600 ఉందని ఆనంద్ చెప్పాడు. ఒక చెట్టు నుంచి మరో చెట్టు వరకు మోకును తీసుకెళ్లినట్టే సులభంగా తీసుకెళ్లవచ్చని, గీత కార్మికులకు రక్షణగా ఉంటుందని వివరించాడు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
వలిగొండ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన వలిగొండ మండలంలోని అక్కంపెల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన అనిల్ (35) అనే వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్డులో టోల్గేటు వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా పని ముగించుకుని రామన్నపేట మండలంలోని పల్లివాడలో బంధువుల ఇంటికి తన మోటారు సైకిల్పై వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో పడి మోటారు సైకిల్ అదుపుతప్పి అనిల్ కిందపడిపోయారు. అంతలో వెనుక నుంచి వస్తున్న లారీ అనిల్ కాలి పైనుంచి వెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అనిల్ను వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గీత కార్మికుడికి తీవ్ర గాయాలు నకిరేకల్ : తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో అకస్మాత్తుగా చెట్టు కూలిపోవడంతో ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. చందుపట్లకు చెందిన కొప్పు పెద్ద శ్రీను(44) గీత కార్మికుడు రోజువారీ మాదిరిగా తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కుతున్న క్రమంలో గాలి రావడంతో అది కూలిపోయి కిందపడి గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనును కుటుంబ సభ్యులు నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండు ట్రాక్టర్లు ఢీకొని డ్రైవర్కు.. వేములపల్లి: రెండు ట్రాక్టర్లు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం వేములపల్లి మండలంలోని మొల్కపట్నం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపెంట గ్రామం నుంచి మిర్యాలగూడ వైపు ఇసుక లోడ్తో అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్.. కారును తప్పించబోయి మిర్యాలగూడ నుంచి రావులపెంట వైపు ఇసుకను అన్లోడ్ చేసి వెళ్తున్న మరో ట్రాక్టర్ను మొల్కపట్నం గ్రామ శివారు వద్ద ఢీకొట్టింది. దీంతో ఇసుక లోడ్తో ఉన్న ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ చంటికి తీవ్ర గాయాలయ్యాయి. మరొక ట్రాక్టర్ డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. రెండు ట్రాక్టర్లు రావులపెంట గ్రామానికి చెందినవే. స్థానికులు 108 వాహనం సహాయంతో తీవ్ర గాయాలపాలైన చంటిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంటకు పైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
మత్తు మందుల మాఫియా!
నల్లగొండ పట్టణానికి చెందిన యువకుడు ప్రణీత్కుమార్ (పేరు మార్చాం) ఇంజనీరింగ్ పూర్తి చేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ యువకుడు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై చిన్నచిన్న గొడవలు చేస్తున్నాడు. అతడికి గంజాయి దొరకపోవడంతో.. మందుల దుకాణాల్లో దొరికే మత్తు ఇంజక్షన్లు కొనుగోలు చేస్తూ రోజూ వాడుతున్నాడు. ప్రకాశం బజార్లోని ఒక మందుల దుకాణంలో రోజూ మత్తు ఇంజక్షన్ కొనుగోలు చేస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనతో వెల్లడైంది. ఇప్పుడు అతని ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలయ్యాడు. చేతికొచ్చిన కొడుకు.. తమని ఆదుకుంటాడని భావించిన తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చాడు. మత్తు మందుల మాఫియా కారణంగానే తమ కుమారుడు అనారోగ్యం పాలయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ.. జిల్లాలో మత్తు మందుల విచ్చలవిడి విక్రయంతో జరుతున్న తీరు. ఇతరుల సర్టిఫికెట్లతో వ్యాపారం.. ఉమ్మడి జిల్లాలో సుమారు రెండు వందలకు పైగా ఔషధ నియంత్రణ శాఖ ద్వారా లైసెన్స్ను పొందిన దుకాణాలు ఉన్నాయి. ఇవి కాక.. అనుమతులు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మరో 50 వరకు వరకు ఉంటాయి. మందుల దుకాణాలను నిర్వహించే వ్యాపారులు కచ్చితంగా డీ పార్మసీ లేదా ఎం.ఫార్మసీ సర్టిఫికెట్ పొందిన వారై ఉండాలి. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సగం దుకాణదారులు ఫార్మసీ సర్టిఫికెట్లు ఉన్న వ్యక్తులకు నెలకు కొంత మొత్త ఇస్తూ.. వారి సర్టిఫికెట్లతో లైసెన్స్ను పొంది వ్యాపారం చేస్తున్నారు. దీంతో వారికి డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్ అర్థం కాక.. ఇష్టం వచ్చిన మందులను అమ్మి రోగుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇకడబ్రాండెడ్ కంపెనీల మందుల పేరుతో జనరిక్ మందులను కొందరు మందులను అంటగట్టి వారి జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి.ఫ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే మత్తు ఇంజక్షన్ల విక్రయం ఫ ఇష్టానుసారంగా వాడుతున్న యువత ఫ నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఔషధ నియంత్రణ శాఖ అధికారులు -
ఇక్కడే ఆయిల్పామ్ ఫ్యాక్టరీ
అనుముల మండలం యాచారంలో 30 ఎకరాల్లో నిరాణానికి అడుగులు ఫ ఇన్నాళ్లూ విజయవాడ అంభాపురం ఫ్యాక్టరీనే దిక్కు ఫ మంత్రి తుమ్మల చర్యలతో దిగొచ్చిన పతంజలి సంస్థ ఫ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 15 వేల ఎకరాల్లో పంటసాగు ఫ తీరనున్న ఆయిల్పామ్ రైతుల కష్టాలు యాచారం గ్రామంలో ఫ్యాక్టరీ.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో కలిపి 15,800 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగువుతోంది. నల్లగొండలోనే 70 శాతం పంట సాగవుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ ఇక్కడే ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. అనుముల మండలంలోని యాచారం గ్రామంలో అనువైన రేట్లకు భూమి లభించడంతో పంతంజలి సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంది. 30 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. ప్రస్తుతానికి 20 ఎకరాలు రైతుల నుంచి కొనుగోలు చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎక్కువ మొత్తంలోనే భూముల సేకరించారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భూమి పూజ చేసేందుకు సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఆయిల్పామ్ సాగుచేస్తున్న రైతుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. అనుముల మండలంలోని యాచారం గ్రామంలో పంతంజలి సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంది. ఇన్నాళ్లూ స్థానికంగా ఫ్యాక్టరీ లేక రెండు జిల్లాల్లో పంట సాగుచేస్తున్న రైతులు విజయవాడలోని అంభాపురం ఫ్యాకర్టీ పైనే ఆధారపడ్డారు. ఇక్కడ సాగుచేస్తున్న పంటను రైతులు ఏపీకి రవాణా చేసి అమ్ముకోవడం కష్టమైంది. అప్పటి ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం మూడేళ్ల క్రితమే నల్లగొండ జిల్లాలో ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉంది. కానీ భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయని పతంజలి సంస్థకు చెందిన జిల్లా ప్రతినిధులు జాప్యం చేశారు. గతేడాది నల్లగొండలో జరిగిన సమావేశంలో అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫ్యాక్టరీ నిర్మించకపోవడంపై పతంజలి అధికారులపై మండిపడ్డారు. రెండు నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ రద్దు చేస్తామని, యాదాద్రి జిల్లా తరహాలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో దిగొచ్చిన పతంజలి సంస్థ నాలుగైదు నెలల నుంచి స్థల సేకరణ కోసం అన్ని చోట్ల విచారణ చేపట్టింది. ఎట్టకేలకు స్థలాన్ని ఫైనల్ చేశారు. పంట దిగుబడి ఐదు వేల టన్నులు.. టార్గెట్ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పది నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల్లో పంట సాగు చేయాల్సి ఉంది. కానీ ఫ్యాక్టరీ లేకపోవడంతో రైతులు ఆసక్తి చూపలేదు. పైగా ఇక్కడ పండిన పంటను రైతులు సొంత ఖర్చులతో విజయవాడలోని అంభాపురం ఫ్యా క్టరీకి తీసుకెళ్లడం భారంగా మారింది. మొక్కలను మట్టితో నింపేందుకు అయ్యే ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వచ్చేది. పంటల సాగును ప్రోత్సహించాల్సిన పతంజలి సంస్థ వివిధ రకాల ఖర్చులన్నీ రైతుల పైన మోపడంతో రైతులు ఆసక్తి చూపలేకపోయారు. రైతులకు ప్రయోజనం జిల్లాలో పతాంజలి సంస్థ అయిల్పాం ఫ్యాక్టరి నిర్మాణం పూర్తి చేస్తే.. రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. రవాణా ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున రైతులు ఆయిల్పామ్ సాగుకు ముందుకురావాలి. రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఆయిల్పామ్ సాగు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. – పి.అనంతరెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి ధర తగ్గినా రైతులకు లాభమే.. దేశ, విదేశాల్లో ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉంది. ఎకరా వరిసాగుకు ఉపయోగించే నీళ్లతో నాలుగు ఎకరాలు ఆయిల్పాం సాగు చేయవచ్చు. పైగా డ్రిప్, మొక్కలకు రాయితీ లభిస్తుంది. పామాయిల్ ఎగుమతి, దిగుమతులను కేంద్ర ప్రభుత్వం బేరీజు వేస్తుంది. డిమాండ్ను బట్టి ప్రతి నెల రేట్లను నిర్ణయిస్తుంది. ఇటీవల ఆయిల్పాం ఎగుమతి, దిగుమతుల పైన సుంకాలను కేంద్రం తగ్గించింది. దీంతో టన్ను ధర రూ.13000 పడిపోయింది. ప్రస్తుతం టన్ను ధర రూ.18,778 కాగా గత నెలలో రూ.20 వేలు పలికింది. అయితే రూ.15 వేల వరకు అయిన రైతులకు నష్టం ఉండదని, ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పతంజలి సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ ఏడాది నల్లగొండ జిల్లాలో 6,500 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 3 వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
కొత్త రేషన్ కార్డులకు.. మూడు నెలల తర్వాతే బియ్యం
నల్లగొండ : కొత్తగా రేషన్ కార్డులు మంజూరవుతున్న వారికి మూడు నెలల తర్వాతే బియ్యం అందనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యాన్ని జూన్లోనే ఒకే సారి ఇస్తుడడంతో.. మే 20వ తేదీ తర్వాత కార్డులు పొందిన వారికి సెప్టెంబర్లోనే సన్నబియ్యం అందనున్నాయి. గతంలో ఉన్న కార్డులతోపాటు అయితే మే 20వ తేదీ కంటే ముందు కార్డులు పొందిన వారికి కోటా ప్రకారం ప్రభుత్వం బియ్యం విడుదల చేసింది. కానీ ఆ తర్వాత కార్డులు పొందిన వారికి కోటా ఇవ్వకపోవడంతో.. వారంతా మూడు నెలలపాటు ఆగాల్సిందే. జిల్లాలో 4,84,216 రేషన్కార్డులు ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే వారికి ప్రభుత్వం కార్డులను మంజూరు చేస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి అన్ని స్థాయిలో పరిశీలన పూర్తయ్యాక కార్డులు జారీ చేస్తోంది. ఈ ప్రక్రియను ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించింది. ఇలా మే 20వ తేదీ వరకు జిల్లాలో కొత్తవి, పాతవి కలిపి మొత్తం 4,84,216 రేషన్కార్డులు ఉన్నారు. అయితే వీటికి సంబంధించి 26 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం మూడు నెలల కోసం అలాట్ చేసింది. ఆయా కార్డుదారులకు ప్రస్తుతం బియ్యం పంపిణీ కొనసాగుతోంది. 60 శాతం కోటా పంపిణీ పూర్తి మూడు మాసాలకు సంబంధించి బియ్యం పంపిణీని ఈ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు 80 శాతం బియ్యం సరఫరా అయ్యాయి. అందులో 60 శాతం బియ్యం శుక్రవారం సాయంత్రానికి రేషన్కార్డుదారులకు పంపిణీ చేశారు. 41,806 మంది కొత్తగా దరఖాస్తు.. జిల్లాలో ప్రస్తుతం 41,806 మంది కొత్త రేషన్కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 819 రిజక్ట్ అయ్యాయి. 31,530 కార్డులు అప్రూవల్ అయ్యాయి. ఇందులో పరిశీలన కోసం 9,422 కార్డులు ఉండగా.. తహసీల్దార్ లాగిన్లో 498, డీఎస్వో లాగిన్లో 195 ఉన్నాయి. ఇవి కూడా ఆయా స్థాయిల్లో అప్రూవల్ కానున్నాయి. అయితే మే 20వ తేదీ తర్వాత సుమారు 20 వేల కొత్త కార్డులు జారీ అయ్యాయి. వారందరికీ సెప్టెంబర్లోనే బియ్యం అందనున్నాయి. మూడు మాసాలకు సంబంధించిన బియ్యం ఇప్పటికే అలాట్ చేసినందున మే 20 తర్వాత వచ్చిన కార్డులకు సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు డీఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ మే 20వ తేదీ తర్వాత మంజూరైన కార్డులకు సెప్టెంబర్లో కోటా ఫ సుమారు 20 వేల మంది మూడు నెలలు ఆగాల్సిందే ఫ ప్రస్తుత కోటా 60 శాతం పంపిణీ పూర్తి -
ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి
తిప్పర్తి : రైతులు ఉద్యాన పంటలు సాగుచేసి అధిక లాభాలను పొందాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం తిప్పర్తి మండలం అంతయ్యగూడం గ్రామంలో రైతు సిరిగిరి కమలాకర్రెడ్డి సాగు చేస్తున్న అంజీర పంటను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు.. పంట ఎక్కడ అమ్ముతున్నారు.. మార్కెట్ ఎలా ఉంది.. నీటి సౌకర్యం ఉందా, ఫాం పాండ్ నిర్మించుకున్నారా.. బ్రాండింగ్.. మార్కెటింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు అంజీర పంటను బ్రాండింగ్ చేసేందుకు పరిశీలించామన్నారు. స్థానిక స్వయం సహాయక మహిళా సంఘాల సహకారంతో వీలైతే ఒక రైతు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా మార్కెటింగ్ చేయించాలని ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా రైతు కమలాకర్రెడ్డి, సుగుణమ్మ దంపతులను సన్మానించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ.. తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి అనంతరెడ్డి, తహసీల్దార్ పరుశురాం, ఎంపీడీఓ వెంటేశ్వర్రెడ్డి, ఏఓ సన్నిరాజు, శ్రీనివాస్రెడ్డి రైతులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
క్షయ స్క్రీనింగ్ పరీక్షలు పెంచాలి
నల్లగొండ : క్షయ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు పెంచాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన క్షయ (టీబీ) ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025– 26 నాటికి క్షయ రహిత జిల్లాగా మార్చాలన్నారు. పరీక్షలను వేగవంతం చేసి క్షయ రోగులను గుర్తించి వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా టీబీ పరీక్షలు చేయాలని సూచించారు. టీబీ సోకిన వారికి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి ఇస్తుందని.. టీబీ రోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలో 3 వేల క్షయ కేసులు ఉన్నాయన్నారు. టీబీ నివారణకు ప్రచార కార్యక్రమాలు చేపట్టి ఇంత వరకు 67 శిబిరాలను నిర్వహించి 13 వేల మందికి క్షయ పరీక్షలు చేసామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, ఇన్చార్జి జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, బ్లేస్సి ఎస్తర్ తదితరులు పాల్గొన్నారు. ఫ స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ -
పనిచేసే వారికి పార్టీ పదవులు
నకిరేకల్ : కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి చేసే వారందరికీ పార్టీ పదవుల్లో సుముచిత స్థానం దక్కుతుందని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య, క్రీడల యువజన సర్వీస్ల శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లా ఇన్చార్జి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శుక్రవారం సాయంత్రం తొలిసారి ఆయన నకిరేకల్ వచ్చారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ స్థాయి నుంచి నేడు మంత్రిగా ఎదిగానని.. అదే పార్టీ గొప్పతనం అన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ నేతృత్వంలో ప్రజలు, నాయకుల మధ్యే పార్టీ కమిటీల ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. తొలిసారిగా కార్యకర్తలు, నాయకుల సమక్షంలో జిల్లా, మండల, పట్టణ, గ్రామ అధ్యక్షులను, ఇతర కమిటీలను ఎన్నుకోనున్నామని చెప్పారు. ప్రతి పదవికి మూడు పేర్లు తీసుకుని ఎన్నిక చేసేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. పనిచేసే వారంతా పార్టీ పదవుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ కమిటీల నియమకం చేస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, పార్టీ జిమ్లే పరిశీలకుడు నాసర జయబాబా, మార్కెట్, మున్సిపల్ చైర్ పర్సన్లు గుత్తా మంజుల మాధవరెడ్డి, చౌగోని రజితా శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, ఏసుపాదం, వెంకన్న, సుక్కయ్య, ఉశయ్య, శ్రీని వాస్, గంగధర్రావు, కొండయ్య, నర్సింహ, యాదగిరి, మల్లికార్జున్, పన్నాల రాఘవరెడ్డి, సత్తయ్య, సుందర్, నకిరెకంటి నరేందర్ పాల్గొన్నారు. ఫ రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
నేడు జాతీయ లోక్ అదాలత్
రామగిరి(నల్లగొండ) : జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు తెలిపారు. జూన్ 9 నుంచి 14 వరకు చెక్ బౌన్స్ కేసులకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో సివిల్, రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ వాహన ప్రమాద, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, భూ వివాదాలు, సైబర్ క్రైం కేసులు, ఇతర సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాంమునుగోడు : కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని కల్వకుంట్ల, కిష్టాపురం గ్రామాల్లో శుక్రవారం ఆయన పలు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనపటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, ఎంపీఓ స్వరూపరాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మాజీ సర్పంచ్లు పగిళ్ల భిక్షం, నందిపాటి రాధారమేష్, నాయకులు బొందు రవి తదితరులు పాల్గొన్నారు. పథకాలపై ఆవగాహన కల్పించాలినాంపల్లి : ప్రభుత్వం అందిస్తున్న పథకలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. నాంపల్లిలోని సీ్త్రశక్తి భవనంలో మహిళా సమాఖ్య, వీఓల శిక్షణ కార్యక్రమనికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులకు పశువుల షెడ్లు, ఇండుకు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, అరుణ్కుమార్, ఏపీఎం వినోద్కుమార్, ఏపీఓ వెంకటేష్, సీసీలు తదితరులు ఉన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలివేములపల్లి : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు వేణుగోపాల్రెడ్డి, కేస రవి, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ అరుంధతి, టీడీ ఆఫీసర్ కల్యాణ్చక్రవర్తి, డాక్టర్ సుచరిత, సీనియర్ అసిస్టెంట్ సోమ్లానాయక్, సూపర్వైజర్ శాంతమ్మ, గీతావాణి, అరుణ, నరేష్ పాల్గొన్నారు. 15న ఉచిత వైద్యశిబిరంనల్లగొండ టౌన్ : పట్టణంలోని నర్రా రాఘవరెడ్డి స్మారక ప్రజావైద్యశాల భవనంలో ఎంవీఎన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ట్రస్టు కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ శిబిరానికి డాక్టర్ గోపాలం శ్రీమన్నారాయణ హాజరై రోగులకు ఉచితంగా షుగర్, బీపీ పరీక్షలు చేస్తారని, ఫిట్స్, పక్షవాతం రోగులకు కూడా పరీక్షలు చేస్తారని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్ ఉంది.. కాటన్, సెమికాటన్, సిల్క్తో అనేక వైరెటీలలో ఇక్కత్ వస్త్రాలు తయారు చేయడం గొప్ప విషయమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కొనియాడారు. గురువారం ఆయన తన సతీమణి సుధా డెబ్బార్మతో కలిసి భూదాన్పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కులోని చేనేత కాన్ఫరెన్స్ హాలులో చేనేత కార్మికులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. దేశంలో ఏ మూలకుపోయినా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరిస్తున్నారని అభినందించారు. పోచంపల్లి ఇక్కత్, కంచి, ఒడిశా తదితర చేనేత వస్త్రాలలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గుర్తింపు ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ కల్చర్ ఎక్చేంజ్లో చేనేత వస్త్రాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేనికై తే పేరుంటుందో వాటికి నకిలీల బెడద దేనికై తే పేరుంటుందో దానికి నకిలీల బెడద ఉంటుందని, దాంతోనే పోచంపల్లి ఇక్కత్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్పదనం అర్థమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రింట్ఫొటోకు, పెయింటింగ్ ఫొటోకు తేడా ఉన్నట్లే మిల్లులో తయారైన వస్త్రానికి, మగ్గంపైన తయారైన వస్త్రానికి ఉన్న తేడా, నాణ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎప్పుడైనా చేనేత వస్త్రాలను మిల్లులో తయారైన వస్త్రంతో పోల్చుకోవద్దని సూచించారు. ప్రస్తుతం మార్కెటింగ్, డుప్లికేషన్ పెద్ద సమస్యగా మారిందన్నారు. పోచంపల్లికి వచ్చి ప్రత్యక్షంగా వస్త్రాల తయారీని చూడడం ఎంతో ఆనందంగా ఉందని, మళ్లీ పోచంపల్లికి వస్తానని పేర్కొన్నారు. జూనియర్ కాలేజీకి కంప్యూటర్ ల్యాబ్ మంజూరు.. చేనేత నాయకుడు తడక వెంకటేశం ఇచ్చిన వినతి మేరకు గవర్నర్ స్పందిస్తూ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కంప్యూటర్ ల్యాబ్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాఽధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు గర్దాస్ ఉపేందర్, కుంట్లగూడెంకు చెందిన భాగ్యలక్ష్మి, వనం యాదగిరికు నేతన్న బీమా, కూర పాటి నిర్మల, పొట్టబత్తిని సుగుణ, దోర్నాల ధనుంజయ్యకు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఫ ప్రపంచం, దేశంలో ఏ మూలకెళ్లినా ఇక్కత్ వస్త్రాలు ధరిస్తున్నారు ఫ చేనేత డిజైన్ల అభివృద్ధి, ఉపాధి కల్పనకు సహకరిస్తా ఫ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఫ సతీమణితో కలిసి భూదాన్పోచంపల్లి సందర్శన చేనేత గృహాల సందర్శన గవర్నర్ పోచంపల్లికి రాగానే తొలుత చేనేత కార్మికులు పెండెం కృష్ణ, భారత మధు, భారత భాస్కర్ గృహాలను సందర్శించారు. వారు గవర్నర్ దంపతులకు బొట్టుపెట్టి ఇంట్లోకి స్వాగతం పలికారు. ఎన్నేళ్ల నుంచి ఈ వృత్తిని చేస్తున్నారని, ఎంత గిట్టుబాటు అవుతుందని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టూరిజం పార్కులోని మ్యుజియంను సందర్శించారు. అక్కడ కొకూన్స్, నూలు, నూలువడకడం, చిటికికట్టడం, ఆసుపోయడం, రంగులద్దకం, మగ్గాలపై వస్త్రాలను తయారు చేయడం ప్రక్రియలన్నింటినీ నిశితంగా పరిశీలించారు. అలాగే పోచంపల్లి ఇక్కత్, తేలియా చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఇక్కత్డిజైన్లను చూసి చేనేతకళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. గవర్నర్ స్వయంగా మగ్గం నేసి అబ్బురపర్చారు. అనంతరం పోచంపల్లి చేనేత ప్రాముఖ్య ఏవీని తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జాయింట్ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, ఇందుమతి, ఆర్డీడీ పద్మ, డీసీపీ అక్షాంశ్యాదవ్, ఏడీ శ్రీనివాసరావు, ఏడీఎం కళింగరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్థన్, గజం అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖాబాబురావు, చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్రెడ్డి, తహసిల్దార్ పి.శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూధన్రెడ్డి, చేనేతనాయకులు తడక వెంకటేశం, తడక రమేశ్, భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, అంకం పాండు పాల్గొన్నారు. -
నా రాజీనామా ప్రచారం అబద్ధం
నల్లగొండ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తనకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని, అయితే తనకు ఆ పదవి తగదని సీనియర్లకు అవకాశం ఇవ్వాలని పీసీసీ అధ్యఽక్షుడిని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు గతంలో ఉమ్మడి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని, అందుకే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. అవకాశం ఉంటే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడిని, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలను కోరినట్లు చెప్పారు. అవకాశం లేకపోతే కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. కోమటిరెడ్డికి దూరం అవుతున్నానంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అఽధికారంలో లేకున్నా పార్టీని అంటిపెట్టుకొని ఉంటానని, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. గత పది సంవత్సరాలు పార్టీ అధికారంలో లేకపోయినా, ఎవరు ఉన్నా, లేకున్నా తాను కార్యకర్తల వెంట ఉన్నానన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. గుమ్మల మోహన్రెడ్డిది న్యాయబద్ధమైన కోరిక అని అన్నారు. ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుకోవడంలో తప్పులేదని, ఈ విషయంలో గతంలో కూడా హామీ ఇచ్చారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నాయకులు కత్తుల కోటి, జూలకంటి వెంకట్రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, పోలె జయకుమార్, జహంగీర్ పాల్గొన్నారు. ఫ అవకాశం ఉంటే అధ్యక్ష పదవి ఇవ్వాలని అడిగా ఫ పదవి లేకపోయినా కార్యకర్తగా ఉంటా ఫ కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు మోహన్రెడ్డి -
ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ను ఇటీవల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రిగా నియమించిన విషయం విదితమే. ఇప్పటివరకు నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావును కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డిలకు ఈ సారి ఇన్చార్జి మంత్రి బాధ్యతలు అప్పగించలేదు.రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణనల్లగొండ అగ్రికల్చర్: కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు వానాకాలం సీజన్ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవన్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా పొందుతున్న రైతులు బ్యాంకు అకౌంట్ను మార్చుకోవాలనుకునేందుకు కూడా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత వ్యవసాయ విస్తరణాధికా రులకు పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ను అందజేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మైనర్లతో వెట్టిచాకిరీ చేయించడం నేరంరామగిరి(నల్లగొండ): మైనర్లతో వెట్టిచాకిరీ చేయించడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు అన్నారు. గురువారం నల్లగొండలోని జిల్లా న్యాయ సేవా సదన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడి బయట ఉన్న బాలలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలన్నారు. బాల కార్మిక నిర్మూలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి కృష్ణవేణి, లేబర్ అధికారి అరుణకుమారి, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ భీమార్జున్రెడ్డి, గణేష్ పాల్గొన్నారు.వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారిగా తిరుపతిరావునల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారిగా డాక్టర్ తిరుపతిరావు నియామకమయ్యారు. శుక్రవారం ఉద్యోగ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగా.. ఆయన గతంతో కూడా మాస్ మీడియా అధికారిగా పనిచేశారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధిత చట్టం, గర్భవి చ్చిత్తి చట్టం, బాల్యవివాహాల నిషేధిత చట్టం, పొగాకు, గుట్కా ఉత్పత్తుల నిషేధిత చట్టాలను అమలు చేయడంతో కీలక పాత్ర పోషించారు. ఈమేరకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మాస్ మీడియా అధికారిగా అవార్డు అందుకున్నారు.గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంనల్లగొండ, రామగిరి : నల్లగొండలోని డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాతత్వ శాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం, సామాన్య శాస్త్ర బోధనా పద్ధతులు, గణిత శాస్త్ర బోధనా పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు, తెలుగు భాష బోధన పద్ధతులు, ఆరోగ్య, వ్యాయామ విద్య, దృశ్య కళలు, కళా విద్య సబ్జెక్టులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు బయోడేటాతో పాటు జీరాక్స్ సర్టిఫికెట్లను జతపరచి ఈనెల 19 లోపు డైట్ కళాశాలలో సమర్పించాలని తెలిపారు.ప్రభుత్వ బీఈడీ కళాశాలలో..నల్లగొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. ఈనెల19 లోపు దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9948215991 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
విద్యార్థులను క్రమం తప్పకుండా తీసుకురావాలి
గుర్రంపోడు : తల్లిదండ్రులు విద్యార్థులను క్రమంతప్పకుండా భవిత కేంద్రానికి తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలో భవిత విద్యావనరుల కేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులతో ముచ్చటించారు. ఒక్కో విద్యార్థి పేరు అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్రానికి కలెక్టర్ రెండు పెంపుడు కుక్కలను తెప్పించారు. పిల్లలు వాటితో ఆడుకుంటూ ఉత్సాహంగా ఉండటాన్ని గమనించారు. కుక్కకు పేరు ఏమి పెడతారని పిల్లలను ప్రశ్నించగా.. వారు మ్యాంగో అని పెడతామని పేర్కొన్నారు. కేంద్రానికి ఇంకా ఏమేం కావాలో ఐఈఆర్పీ శారదను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మోడల్ స్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. కేజీబీవీలో వంట గదులు, వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎంపీడీఓ మంజుల, ఎంఈఓ నోముల యాదగిరి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాగిణి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ విజయశ్రీ, ఏఈ రవికుమార్ తదితరులున్నారు. ఫకలెక్టర్ ఇలా త్రిపాఠి -
చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.63,09,560
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం ఆలయ సిబ్బంది లెక్కించారు. 79 రోజులకు గాను రూ.63,09,560 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి నవీన్కుమార్ వెల్లడించారు. అన్నదానానికిగాను రూ.49,512 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకురాలు సుమతి, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, నర్సిరెడ్డి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
సాగర్ క్రస్ట్గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశ యం రేడియల్ క్రస్ట్గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం చేశారు. గత నెలలోనే క్రస్ట్ గేట్లకు సీల్స్ వేయడం బోల్ట్నట్స్ బిగింపు, వెల్డింగ్ పనులు పూర్తిచేశారు. రెండు రోజులుగా గేట్లకు సంబంధించి డ్రై ట్రయల్ రన్ పనులు కొనసాగిస్తున్నారు. వర్షాకాలానికి ముందే అన్ని గేట్ల పనితీరును పూర్తిగా పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ చర్యలు ప్రారంభించారు. గేట్లను ఎత్తి, దింపేందుకు వినియోగించే ఇనుపతాళ్లకు కార్డియమ్ కంపౌండ్ చేయడంతో పాటు గ్రీసింగ్, బేరింగ్ల చెకింగ్ పనులు చేస్తున్నారు. ఒక్కోగేటు పనితీరును పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం 1, 2 గేట్ల పనులు పూర్తి చేశామని, ఈ మాసాంతం లోపే 26 రేడియల్ క్రస్ట్ గేట్ల పనులు ముమ్మరం చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. -
వెల్నెస్ సెంటర్లో మందుల్లేవ్!
గంటల తరబడి నిరీక్షణ.. ప్రస్తుతం వెల్నెస్ సెంటర్లోని ఫార్మసీలో ఒక్క ఫార్మసిస్టు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వైద్యులకు చూపించుకున్న వారు మందులు తీసుకోవాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కొన్ని కుర్చీలు మాత్రమే ఉండడం, ఫ్యాన్లు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అదనంగా ఫార్మసిస్టులను నియమించి ఇబ్బందులు తొలగించాలని వెల్నెస్ సెంటర్కు వచ్చే రోగులు కోరుతున్నారు. నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని వెల్నెస్ సెంటర్లో మందుల కొరత ఏర్పడింది. గత పదిహేను రోజులుగా కేవలం రెండు, మూడు రకాల మందులు మాత్రమే ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు మందులు ఇచ్చేందుకు గత ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రతి రోజు సుమారు 200 నుంచి 500 మంది వరకు హెల్త్కార్టు కలిగిన వారు వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, కీళ్లు, మోకాళ్ల నొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వెల్నెస్ సెంటర్లో నెలనెలా ఉచితంగా ట్యాబ్లెట్లు తీసుకువెళ్తుంటారు. గత పదిహేను రోజులుగా ట్యాబ్లెట్లు, ఇతర సిరప్లు లేని కారణంగా కేవలం ఒకటి, రెండు ట్యాబ్లెట్లు ఇచ్చి పంపుతున్నారు. ట్యాబ్లెట్లు వచ్చిన తరువాత అందిస్తామని, ఫోన్ చేసి రావాలని సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే అనేక ఇబ్బందులు పడుతున్నారు. మందుల గురించి అడిగితే ఆరోగ్య శ్రీ ట్రస్టుకు ఇండెంట్ పెట్టామని వెల్నెస్ సెంటర్ బాధ్యులు పేర్కొంటున్నారు.ఫ అందుబాటులో ఉన్నవి రెండు, మూడు రకాల మందులు మాత్రమే ఫ నెల ప్రారంభం నుంచి కొరత ఫ ఇబ్బందులు పడుతున్న దీర్ఘకాలిక రోగులు ఫ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఇండెంట్ పెట్టిన అధికారులు ఇండెంట్ పంపించాం మందుల సరఫరాలో కొంత జాప్యం జరిగింది. వెల్నెస్ సెంటర్లో అవసరమైన మందుల కోసం ఇండెంట్ పంపించాం. రెండు, మూడు రోజుల్లో సరఫరా చేస్తారు. సరఫరా కాగానే మిగతా మందులను రోగులకు అందిస్తాం. – డాక్టర్ లావణ్య, వెల్నెస్ సెంటర్ ఇన్చార్జ్ -
అక్షర లోగిలిలో ఆనంద పండుగ
‘ప్రైవేటు పాఠశాలల బస్సులు గ్రామంలోకి రావొద్దు’ తిప్పర్తి : పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తిప్పర్తి మండలంలోని రామలింగాలగూడెం మాజీ సర్పంచ్ ముత్తినేని శ్రీదేవిశ్యాంసుందర్, గ్రామపెద్దలు కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1నుంచి 5వ తరగతి వరకు పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేయించాలని, గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దంటూ గ్రామ స్టేజీ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నల్లగొండ: వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలను పూలు, మామిడి తోరణాలతో అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత తోటి స్నేహితులు కలవడంతో విద్యార్థులు కబుర్లు చెప్పుకుంటూ.. ఉపాధ్యాయులు చెప్పే విశేషాలు వింటూ గడిపారు. మొదటి రోజు కావడంతో జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. జిల్లాలో 1,483 పాఠశాలు ఉండగా వాటి పరిధిలో 15 శాతం విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. పండుగ వాతావరణంలో.. విద్యాశాఖ పాఠశాలలు పునఃప్రారంభానికి ముందు నుంచే బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేవిధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే డీఈఓ భిక్షపతి ఆదేశాల మేరకు విద్యార్థులు మొదటి రోజు పాఠశాలలకు వస్తున్నందున తరగతి గదులను శుభ్రపరచడం, మామిడి తోరణాలు, బెలూన్లతో అలంకరించి పండగ వాతావరణంలో ప్రారంభించారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు స్కూల్ యూనిఫాం అందజేశారు. పలు పాఠశాలల్లో వినూత్నంగా ఇలా.. ● నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మావిడాకులు కట్టి అందంగా అలంకరించారు. ● ఖతాల్ గూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు చాక్లెట్లు పంపిణీ చేసి స్వాగతం పలికారు. ● పెద్దవూరలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో హౌజింగ్ పీడీ, మండల ప్రత్యేకాధికారి ఎస్పీ రాజ్కుమార్ కేక్ కట్ చేసి ఉపాధ్యాయులు, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ● నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో పాఠశాల గేట్ ఎదుట రిబ్బన్ కట్ చేసి పాఠశాలను పునఃప్రారంభించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.ఫ పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పూలు, మామిడి తోరణాలతో అలంకరణ ఫ పుష్పగుచ్ఛాలు అందజేసి విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు ఫ మొదటిరోజు 15 శాతం మంది మాత్రమే హాజరు ఫ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్తోపాటు స్కూల్ యూనిఫాం పంపిణీ -
సాగర్ కుడి కాల్వ మా అధీనంలోనే..
నాగార్జునసాగర్: సాగర్ ప్రాజెక్టు కుడివైపు (కృష్ణానదికి ఆవలివైపు) ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న ఆనకట్ట, కుడి కాల్వ తమ అధీనంలోనే ఉండాలని, కుడికాల్వ గేట్లను తామే నిర్వహించుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ఎస్పీఎఫ్ (ప్రత్యేక రక్షణ దళం) డీజీపీకి లేఖ ఇచ్చినట్టు తెలిసింది. నాగార్జునసాగర్ డ్యాంపై ఏపీ వైపు ప్రస్తుతం సీఆర్పీఎఫ్ బలగాలు పహారాలో ఉన్నాయి.తెలంగాణ వైపు సీఆర్పీఎఫ్ బలగాలు డ్యాం భద్రతను ఉపసంహరించుకొని ఏప్రిల్లో వెళ్లిపోయాయి. ఇరు రాష్ట్రాల మధ్య కేఆర్ఎంబీ సమక్షంలో గతంలో జరిగిన సమావేశంలో.. ఏపీ వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు జూన్ నెలాఖరులోగా వెళ్లిపోతాయని ఏపీ ప్రభుత్వం చెప్పింది. వాస్తవంగా సీఆర్పీఎఫ్ బలగాలు వెళ్లిపోగానే సాగర్ డ్యాం మొత్తం తెలంగాణకు చెందిన ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) పర్యవేక్షణలో ఉంటుంది.అయితే, ఏపీ వైపు సీఆర్పీఎఫ్ బలగాలు ఉపసంహరించుకోగానే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీఎఫ్ డీజీపీకి లేఖ ఇచ్చినట్టు తెలిసింది. సొంత బలగాల ఏర్పాటుతో పాటు కుడి కాల్వ గేట్లను తామే నిర్వహించుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణారివర్ బోర్డుకు కూడా తెలిపింది. దీని ప్రకారం నాగార్జునసాగర్ కుడివైపున గల ప్రాజెక్టు భూభాగం పూర్తిగా తమ (ఏపీ)అధీనంలోనే ఉండాలని, కుడి కాల్వ గేట్లపై తెలంగాణ ప్రభుత్వ సాగునీటి అధికారుల అజమాయిషీ ఉండరాదని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. -
బడికి వేళాయే..
నేడు పాఠశాలలు పునః ప్రారంభం ఫ ప్రభుత్వ స్కూళ్లను ముస్తాబు చేయించిన విద్యాశాఖ ఫ వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన బాలలు.. ఇక బడికి పయనం నల్లగొండ : బడి గంట వేళయింది. ఇన్ని రోజులు వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల కింద 1483 పాఠశాలలు ఉన్నాయి. అవి గురువారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికే శుభ్రపరిచి ప్రారంభానికి సిద్ధం చేశారు. పాఠశాలలు పునః ప్రారంభాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పటికే ఆయా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాలలను తోరణాలు, బెలూన్లతో ఆలంకరించనున్నారు. పుస్తకాలు, యూనిఫామ్ సిద్ధం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదవే విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే యూనిఫామ్తోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే వాటిని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆయా పాఠశాలలకు చేర్చారు. మొదటి రోజే విద్యార్థులకు వాటిని అందించనున్నారు.కొండమల్లేపల్లి పాఠశాల ప్రత్యేకం కొండమల్లేపల్లి : జిల్లాలో కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ పాఠశాలలో విద్యనభ్యసించడానికి విద్యార్థులు పోటీ పడుతుంటారు. కొండమల్లేపల్లి నాలుగు రోడ్ల కూడలి కావడం, చుట్టుపక్క మండలాల నుంచి కూడా అడ్మిషన్లు రావడమే కాక ఉత్తమ బోధన, పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించడం, ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఉన్నత స్థానాల్లో ఉండడం కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు నమోదు కలిగిన పాఠశాలగా కొండమల్లేపల్లికి పేరు సాధించింది. కొండమల్లేపల్లి జెడ్పీహెచ్ఎస్లో గత సంవత్సరం 956 మంది విద్యార్థులు ఉన్నారు. 54 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో విద్యను బోధిస్తున్నారు. క్రమ శిక్షణకు మారుపేరుగా ఉన్న ఈ పాఠశాలలో పలు పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించడం ఉపాధ్యాయుల ఉత్తమ బోధనకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ పాఠశాల సైన్స్ ప్రయోగాలు, కంప్యూటర్ ల్యాబ్లు, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ కూడా ఉండడంతో పాఠశాలలో చేరడానికి విద్యార్థులు పోటీ పడుతుంటారు. జిల్లాలోనే అత్యధిక విద్యార్థుల నమోదు ఈ పాఠశాలలో ఉండడంతో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం కూడా ఈ పాఠశాల అభివృద్ధికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. -
స్కూల్కు నడుచుకుంటూ వెళ్లే వాడిని
మాడ్గులపల్లి: మాది చిరుమర్తి గ్రామం. నేను మా గ్రామం నుంచి ఆగామోత్కూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు రోజూ టిఫిన్ బాక్స్ పట్టుకోని నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఆ పాఠశాల నిజాం కాలం నాడు కట్టించింది. ఆ పాఠశాలలో నేను పదో తరగతి వరకు చదువుకున్నాను. పదో తరగతి వార్షిక పరీక్షలో నేను మండల ఫస్ట్ ర్యాంకు సాధించాను. పాఠశాలలో నా స్నేహితులతో కలిసి బాగా ఆడుకునేవాడిని. ఆగామోత్కూర్ పాఠశాలలో చదువుకున్న వారు నేడు ఆయా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అదేవిధంగా టీచర్లు, ఎంఈఓలు, విద్యా శాఖ డైరెక్టర్లు కూడా అయ్యారు. ఫ ఎన్.శంకర్, సినీ డైరెక్టర్ -
ఇందిరమ్మ ఇళ్ల పనుల జాబితా సమర్పించాలి
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల పనులు ఏస్థాయిలో ఉన్నాయో జాబితాలను సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె తన చాంబర్లో ఇందిరమ్మ ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భవిత కేంద్రాల నిర్మాణం, ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు స్థానిక వాగుల నుంచి నేరుగా ఇసుకను తీసుకోవద్దని, ముందుగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఆయా మండలాల వారీగా ఇసుక లభ్యమయ్యే వనరుల జాబితా సమర్పించాలని జిల్లా మైనింగ్ అధికారిని ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనుల వివరాలను సమర్పించాలని జిల్లా ఇరిగేషన్ అధికారికి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా మైనింగ్ అధికారి శామ్యూల్ జాకబ్, గృహ నిర్మాణ సంస్థ ిపీడీ రాజ్కుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
నార్కట్పల్లి : భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నార్కట్పల్లి మండలంలోని ఏపీ లింగోటం గ్రామంలో నిర్వహించిన రెవవెన్యూ సదస్సుకు ఆమె హాజరై రైతులతో మాట్లాడి.. భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలు రైతులు దరఖాస్తు చేసుకోవాలని, ఒకవేళ రెవెన్యూ సదస్సులకు హాజరు కాలేకపోతే ఈనెల 20వ తేదీ వరకు నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా చట్ట ప్రకారం వెసులుబాటు ఉంటే రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరావు, అధికారులు ఉన్నారు. -
ఊరూరా.. అంగన్వాడీ బాట
మిర్యాలగూడ టౌన్ : రెండున్నరేళ్లు నిండిన పిల్లలను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరుతూ ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంగన్వాడీల్లో పిల్ల పెంపే లక్ష్యంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈనెల 17వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ, సహయ కమిటీ బృందాలు పిల్లల నమోదును పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనముల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు, కొండమల్లేపల్లి, నకిరేకల్ ప్రాజెక్టుల పరిధిలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు ఇలా.. ● అంగన్వాడీలు, ఎన్జీఓ సంఘాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోషణ్ అభియాన్ సిబ్బంది ర్యాలీల నిర్వహణ. ● పట్టణ, గ్రామీణ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం. ● పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను వివరించి వారిని ప్రోత్సహించడం. ● అంగన్వాడీ కేంద్రాల్లో చదువు పూర్తయిన పిల్లలకు సర్టిఫికెట్లు అందించి. వారు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించడం. ● స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమం పేరుతో కేంద్రాలను శుభ్రం చేయడం. ● అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో మొక్కలను నాటడం. ● సామూహిక అక్షరభ్యాసం నిర్వహించడం. ● పిల్లలకు పాఠాలు, టైం టెబుల్, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తదితర అంశాలపై అవగాహన కల్పించడం. ● స్టడి మెటీరియల్ను పంపిణీ చేయడం. ఫ 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఫ రెండున్నరేళ్లు దాటిన పిల్లలు అంగన్వాడీలో చేర్పించేలా ప్రణాళిక -
గుణాత్మక విద్య అందిస్తాం
ఫ ఉపాధ్యాయులకు వేసవిలో వృత్యంతర శిక్షణ పూర్తి చేశాం ఫ ఈసారి అన్ని పాఠశాలల్లో ఏఐ బోధన ఫ విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా బడిబాట నిర్వహిస్తున్నాం ఫ విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపడతాం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈఓ భిక్షపతి నల్లగొండ : ‘ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తాం. నూతన పద్ధతిలో సాంకేతికతతో కూడిన బోధన చేసే విధంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చాం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది నుంచి అన్ని స్కూళ్లలో ఏఐ బోధన ప్రారంభిస్తాం’ అని డీఈఓ భిక్షపతి అన్నారు. గురువారం పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పాఠశాలలు పునః ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కేజీవీబీ, మోడల్ స్కూళ్లలో ఇప్పటికే శుద్ధీకరణ పనులు చేయించాం. శానిటేషన్తో పాటు మధ్యాహ్న భోజన వంట పాత్రలు శుభ్రం చేయించాం. బడి ఈడు పిల్లలందర్ని బడిలో చేర్పించే విధంగా జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. గతంలో కంటే ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాం. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి పిల్లలు అధిక సంఖ్యలో చేరే విధంగా చర్యలు తీసుకుంటారు. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాం.. పాఠశాల తెరిచిన రోజునే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, నోట్బుక్స్ అందజేస్తాం. పాఠశాలలు ప్రారంభమైన మొదటి పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తాం. మొదటి రోజున ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాలి. తోరణాలు, బెలున్లతో పాఠశాలను అలంకరించుకుని గ్రామంలోని ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువతను ఆహ్వనించి సమావేశం నిర్వహించాలి. ఏ పాఠశాలోనైతే జీరో ఎన్రోల్మెంట్ ఉందో, తక్కువ విద్యార్థులు ఉన్నారో ఆ పాఠశాల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, సీఆర్పీలు ఆ పాఠశాలలను తిరిగి తెరిచే విధంగా చర్యలు తీసుకుంటారు. 13వ తేదీన సామూహిక అక్షరాబ్యాసం.. 13వ తేదీన బాలసభ నిర్వహించి సామూహిక అక్షరాబ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాంస్క్రతిక కార్యక్రమాలతో పాటు విద్యపై అవగాహన, డ్రాయింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16వ తేదీన పాఠశాలలో లెర్నింగ్ ఇంప్రూమెంట్ నేర్పిస్తారు. అదే విధంగా ఫన్ స్టోరీలు నేర్పిస్తారు. 17వ తేదీన పాఠశాలల్లో గర్ల్స్ చైల్డ్ పంక్షన్ నిర్వహిస్తున్నాం. యాక్టివిటీ విధానంలో బోధన జరిగేలా ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఎన్రోల్మెంట్ ఎక్కువగా అయిన పాఠశాలల్లో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాం. అన్ని పాఠశాలల్లో ఏఐ అమలు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ ఆమోదంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఏఐ పాఠాలు అమలు చేయబోతున్నాం. ఇది పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సంవత్సరం పదో తరగతి విద్యార్థుల తరహాలోనే ఈ సారి 6వ తరగతి నుంచే విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ అవర్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. కలెక్టర్ ఇలా త్రిపాఠి సలహాలు, సూచనలతో రాష్ట్ర స్థాయిలో ఇచ్చే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతాం. -
68,70,800 మొక్కలు నాటడమే లక్ష్యం
నల్లగొండ : వనమహోత్సవం కింద జిల్లాలో 68,70,800 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ వెల్లడించారు. వనమహోత్సవ కార్యక్రమంపూ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నాటనున్న 68,70,800 మొక్కల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు 39,51,700 వ్యవసాయ శాఖ 7,66,000, ఉద్యాన శాఖ 6,38,000, మున్సిపాలిటీలు 8,20,00 మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ వన మహోత్సవం కింద ఆయా శాఖలు వారికి నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించడమే కాకుండా, జియో ట్యాగింగ్ చేయాలని, నర్సరీలను మ్యాచింగ్, బ్యాచింగ్ చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ ప్రతి పాఠశాలలో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జెడ్పీ ఇన్చార్జి సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, ఎకై ్సజ్ అధికారి సంతోష్, డీఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఫ స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ -
12 నుంచి ‘ఇగ్నో’ పరీక్షలు
రామగిరి(నల్లగొండ) : జూన్ 12వ తేదీ నుంచి ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ్మారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంటల వరకు నల్లగొండలోని కాకతీయ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రానికి అర గంట ముందే అభ్యర్థులు రావాలని సూచించారు. ‘భగీరథ’ పనుల పరిశీలనఅడవిదేవులపల్లి : అడవిదేవులపల్లి మండలంలో ఉపాధి హామ పథకం చేపట్టిన ‘జల సంచాయి–జల భగీరథ’ పనులను బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. దాంతోపాటు కేంద్ర బృందం సభ్యులు అడవిదేవులపల్లి, ఉల్సాయిపాలెం, కొత్తనందికొండ, మొల్కచర్ల, బాల్నేపల్లి, చిట్యాల తదితర గ్రామాల్లో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను 18 ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీడబ్ల్యూసీ ఇంజనీర్ సంతోష్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన సాగింది. కేంద్ర బృందం వెంట క్లస్టర్ ఏపీడీ బాలకృష్ణ, ఎంపీడీఓ మాతంగి రమేష్, ఎంపీఓ సూరానాయక్, టెక్నికల్ అసిస్టెంట్లు చారి, రాధ, వినోద్ తదితరులు ఉన్నారు. రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారంతిప్పర్తి : రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం తిప్పర్తి మండలంలోని సర్వారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన రైతుల సమస్యలు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 3వ తేదీ నుంచి సదస్సులు నిర్వహిస్తున్నామని.. ఇప్పటి వరకు 15వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తిప్పర్తి మండలంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయని.. మండల వ్యాప్తంగా మొత్తం 939 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లపైఅప్రమత్తత అవసరంమర్రిగూడ : ప్రజలకు సైబర్ నేరగాళ్లపై అపమ్రత్తంగా ఉండాలని దేవరకొండ ఏఎస్పీ మౌనిక అన్నారు. బుధవారం మర్రిగూడ పోలీస్స్టేషన్ను ఆమె సందర్శించి రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువర్గాలను పిలిపించి భూములకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ కార్యాలయంలో పరిష్కరించుకోవాలని సూచించారు. దారి సమస్యలు ఉంటే సర్వేయర్ ద్వారా హద్దురాళ్లు పెట్టుకుని తగాదాలకు తావు లేకుండా ఉండాలన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు 1930 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నాంపల్లి సీఐ డి.రాజు, ఎస్ఐ ఎం.కృష్ణారెడ్డి, సిబ్బంది సైదులు, వాహిద్, సత్యనారాయణ, శిరీష, గీత, రత్నం, కోటేష్, హుస్సేన్ ఉన్నారు. ఆయిల్పామ్ గెలల సేకరణ కేంద్రం ప్రారంభం కనగల్ : కనగల్ మండల కేంద్రంలో ఆయిల్పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనగల్ మండలంలో రైతులు 350 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును చేస్తున్నారని తెలిపారు. 2021 – 22 సంవత్సరం నుంచి ఎన్ఎంఈఓపీ కింద 80 శాతం రాయితీపై ఆయిల్పామ్ మొక్కలు అందిస్తున్నామన్నారు. నాలుగు సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చుల కింద ఎకరాకు రూ.4,200 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తామని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పతాంజలి ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ శివాజీ పాల్గొన్నారు. -
భూభారతి మాకు ఎన్నికల రెఫరెండమే!
మిర్యాలగూడ: భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలు అందజేశారు. భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.రాబోయే ఎన్నికల్లో భూభారతి చట్టం కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం లాంటిదని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 22 మండలాల్లో 22 రెవెన్యూ గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ సమస్యలు పరిష్కరించామని చెప్పారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తులను ఆగస్టు 15 లోపు పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ధరణి ద్వారా వచ్చిన 9.26 లక్షల దరఖాస్తులను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. 6 వేల మంది సర్వేయర్లను, 10,956 మంది వీఆర్వో, వీఆర్ఏలను త్వరలోనే నియమిస్తామని వెల్లడించారు.వేగంగా నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి: ఉత్తమ్కుమార్రెడ్డిఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తకుమార్రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను, లిఫ్టులను పూర్తిచేసి తీరుతామని చెప్పారు. సాగర్ ఎడమకాల్వ మరమ్మతులకు రూ.67 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బు రూ.15,181 కోట్లను 12 లక్షల మంది రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్న అక్కసుతోనే బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రోడ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ తదితరులు పాల్గొన్నారు. -
పది రోజుల్లో భవనాలకు నిధులు
మిర్యాలగూడ : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచనల మేరకు పది రోజుల్లో సబ్ కలెక్టర్, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్థలం కేటాయింపుతోపాటు భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, ఆర్అండ్పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ, భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నీటిపారుదల శాఖమంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి పొంగులేటి మాట్లాడారు. పేదోడి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అప్పుల తెలంగాణగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడ్తున్నామని చెప్పారు. ఇంటి స్థలం ఉన్న వారికి నాలుగు విడతల్లో రూ.5లక్షలు చెల్లిస్తామన్నారు. ఇస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ప్రొసీడింగ్స్ అందజేశారు. పేదల అభ్యున్నతే లక్ష్యం – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మంజూరు పత్రాలు అందుకునే లబ్ధిదారుల మొఖాలు చూస్తే సంతోషంగా ఉందన్నారు. పేదలందరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. ఫ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీబడిబాట పోస్టర్ ఆవిష్కరణ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పోస్టర్, కరపత్రాలను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం దీరావత్ ధర్మానాయక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్ రవినాయక్, ఉపాధ్యాయులు కొర్ర కృష్ణకాంత్నాయక్, తావుర్యా, అనిత, జ్యోతి, ధనలక్ష్మి, స్పందన, భవాని, మీనా, రేణుక పాల్గొన్నారు. -
కోతుల దాడి.. వృద్ధుడికి తీవ్ర గాయాలు
మోత్కూరు : కోతుల దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన కొంపెల్లి భిక్షమయ్య(75) తన ఇంటి ఆవరణలో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కోతుల గుంపు వచ్చి అతడిపై దాడికి పాల్పడ్డాయి. అతడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. భిక్షమయ్య కుటుంబ సభ్యులు గమనించి కోతులను తరిమేసి అతడిని మోత్కూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజులుగా గ్రామంలో కోతుల సంచారం పెరగడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, కోతుల బెడద నుంచి రక్షించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. -
కాంగ్రెస్ కమిటీలో అగ్రస్థానం
ఫ ఉపాధ్యక్షులుగా ముగ్గురు ఫ ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం దక్కింది. పార్టీ ఉపాధ్యక్ష పదవుల్లో ముగ్గురిని నియమించగా, ప్రధాన కార్యదర్శులు ఐదుగురికి స్థానం లభించింది. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్రెడ్డి, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్రెడ్డి నియమితులయ్యారు. కొండేటి మల్లయ్య ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గుమ్ముల మోహన్రెడ్డి నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బొజ్జ సంధ్యారెడ్డి, దైద రవీందర్, చనగాని దయాకర్, వి.రామారావుగౌడ్, చకిలం రాజేశ్వర్రావుకు అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే, ఇందులో గుమ్ముల మోహన్రెడ్డి, కొండేటి మల్లయ్య, చనగాని దయాకర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారే కావడం గమనార్హం. ఈ నియామకాలతో వారు డీసీసీ అధ్యక్ష పదవికి దూరం అయినట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వినతుల స్వీకరణనల్లగొండ : గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ 35 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి.. చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. నేటి నుంచి ‘అమ్మ మాట –అంగన్వాడీ బాట’నల్లగొండ : ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ మంగళవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. మూడేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ బడిలో చేర్పించే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. 10న అంగన్వాడీ కేంద్రాల అలంకరణ, తల్లిదండ్రులు పిల్లలతో సెల్ఫీ దిగడం, 11న ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల్ని అంగన్వాడీలో చేర్చకోవడం, 12వ తేదీ నుంచి 16 వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ కిచెన్ గార్డెన్ల అభివృద్ధి, పౌష్టికాహార ప్రాముఖ్యత తెలియజేయడం, 17వ తేదీన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని పేర్కొన్నారు. హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ : ప్రభుత్వ వికలాంగుల బాలుర కళాశాల వసతి గృహంలో దివ్యాంగులు, అంధులు, బధిర విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ అధికారి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హత, తదితర వివరాల కోసం 9154759888 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. 30వ తేదీ వరకు బియ్యం పంపిణీనల్లగొండ : జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో జూన్, జూలై, ఆగస్టు (3 నెలలు)లకు సంబంధించిన సన్న బియాన్ని ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డుదారులు సన్నబియ్యం పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ నెల 30 వరకు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఉపకరణాలకు దరఖాస్తులునల్లగొండ : శారీరక, బధిర, అంధ, మానసిక దివ్యాంగుల్లో అర్హులైన వారి నుంచి ఉపకరణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిఽశు వికలాంగుల సంక్షేమ అధికారి కృష్ణవేణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈ నెల 18 వరకు ఆన్లైన్ వెబ్సైట్ ్టటౌ bmms. cgg.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత, తదితర వివరాలకు 9441032444 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
నల్లగొండకేవీ నిధులు!
సాగర్ ఎడమకాల్వ మరమ్మతును పట్టించుకోని ప్రభుత్వం మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా 10.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ కాల్వ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ఏపీలోని కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ 0 కి.మీ నుంచి ఎడమకాల్వ పొడవు 179 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ కాల్వపైన మేజర్లు, మైనర్లు ద్వారా పొలాలకు నీరందుతుంది. లక్షల ఎకరాలకు నీరందించే ఈ కాల్వ మరమ్మతుల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వారి సొంత జిల్లాల పరిధిలో ఎడమకాల్వ మరమ్మతులకు నిధులు విడుదల చేయించుకున్నారు. కానీ.. అసలు కాల్వ మొదటి భాగం అయిన నల్లగొండ జిల్లా పరిధిలో మరమ్మతులకు మాత్రం నిధులు ఇవ్వలేదు. దీంతో నల్లగొండ జిల్లా పరిధిలో మెయిన్ కెనాల్తోపాటు మేజర్లు, మైనర్లు ఆనవాలు కోల్పోయే పరిస్థితి దాపురించింది. చివరి భూములకు అందని నీరు సాగర్ ఎడమకాల్వకు గతంలో చేపట్టిన ఆధునీకరణలో భాగంగా ఇరువైపులా 90శాతం మేర సీసీ లైనింగ్ చేశారు. కొన్నిచోట్ల వదిలేశారు. ఎడమకాల్వకు 14వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ, కట్టలు బలహీనంగా ఉండడంతో 11వేల క్యూసెక్కుల లోపు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ఎడమకాల్వ కింద మేజర్లు, మైనర్ల పరిధిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. నల్లగొండ జిల్లా పరిధిలో ప్రధానంగా వజీరాబాద్, కిష్టాపురం, ముల్కలకాల్వ మేజర్ పరిధిలో కాల్వ కట్టలు బలహీనంగా ఉన్నాయి. సీసీ లైనింగ్ ఏర్పాటు చేయకపోవడంతో నీటి విడుదల కారణంగా కోతకు గురవుతున్నాయి. కాల్వకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడంలేదు. దీంతో చివరి భూములకు ప్రతి సీజన్లో నీరందకుండా పోతోంది. ఈ సీజన్లో కూడా అదే పరిస్థితి దాపురించింది. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో నిధులు.. ● ఎడమకాల్వ పరిధిలోని నల్లగొండ మినహా సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో ఉన్న కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సూర్యాపేట జిల్లాలో కాల్వల అత్యవసర మరమ్మతుల కోసం రూ.1.26కోట్ల నిధులు కేటాయించారు. కాల్వలో ఇరువైపులా ఉన్న కంపచెట్లు తొలగించి లైనింగ్ ఏర్పాటు చేసి దెబ్బతిన్న తూములకు, షట్టర్లకు మరమ్మతులు చేస్తున్నారు. పెన్పహాడ్ మండలం దోసపాడు వద్ద కాల్వ 74కి.మీ నుంచి నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం రంగుల వంతెన 133కి.మీ వరకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఆ పరిధిలోని 24 మేజర్ కాల్వలు, తూములకు పాత షట్టర్లను తొలగించి కొత్త షట్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ● ఖమ్మం జిల్లాలో ఎడమకాల్వలో ముళ్ల కంప తొలగింపునకు నిధులు మంజూరయ్యాయి. వైరా, పాలేరు, లంకసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వలకు శాశ్వత మరమ్మతులు చేపడుతున్నారు. క్రాస్ రెగ్యులేటర్ షట్టర్ల మరమ్మతుకు టెండర్లు పూర్తి చేశారు. ఖమ్మం, కల్లూరు సర్కిల్లో 15 ఎత్తిపోతల మరమ్మతులకు 1.50కోట్లు మంజూరయ్యాయి. పాలేరు ప్రధాన కాల్వపై కొట్టుకపోయిన్ అండర్ టన్నెల్ మరమ్మతులకు రూ.14కోట్లు కేటాయించారు. ఫ ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకే నిధులు కేటాయింపు.. ఫ నల్లగొండలో ఆనవాలు కోల్పోతున్న మెయిన్ కెనాల్, మేజర్, మైనర్ కాల్వలు ఫ సాగునీటి విడుదలపై ప్రభావంప్రభుత్వానికి ప్రతిపాదించాం నల్లగొండ జిల్లా పరిధిలో ఎడమకాల్వ, మేజర్లు, మైనర్ల కట్టలకు మరమ్మతులు చేసేందుకు ఎస్టిమేట్లు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదించాం. నిధులు మంజూరు కాకపోవడంతో ఈ వేసవిలో పనులు చేపట్టలేకపోయాం. నిధులు మంజూరైతే వెంటనే పనులు ప్రారంభిస్తాం. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో నిధులు మంజూరయ్యాయన్న విషయం మా దృష్టికి రాలేదు. సాగునీరు వృథా కాకుండా, చివరి భూములకు నీరందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. – అజయ్కుమార్, ఎన్ఎస్పీ, సీఈ పొంచి ఉన్న ముప్పు ఇటీవల మిర్యాలగూడలో ఉమ్మడి జిల్లా నీటి పారుదలపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్షించారు. ఎడమకాల్వ మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు ఆ జాడ చేయలేదు. త్వరలోనే సాగర్కు వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉండగా వానాకాలం సీజన్ పంటలు సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటిని విడుదల చేస్తే ఎడమకాల్వ పరిధిలోని కాల్వకట్టలకు ఎక్కడ, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
మిర్యాలగూడ టౌన్ : భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తుండడంతో.. మనస్తాపానికి గురైన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని జంకుతండాకు చెందిన బుడిగపాక నరేష్, శోభ దంపతుల కుమార్తె దివ్య(23) మిర్యాలగూడ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తుండగా.. యాద్గార్పల్లి గ్రామానికి చెందిన బొంత నాగరాజు, లక్ష్మి దంపతుల కుమారుడు బొంత వెంకటేష్తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఇరువురు వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె లాస్య, కుమారుడు తరుణ్కుమార్ ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా యాద్గార్పల్లి గ్రామానికే చెందిన మహిళతో వెంకటేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి దివ్య భర్తను నిలదీసింది. దీంతో ‘నీవు కట్నం ఏమైనా తెచ్చావా.. నీవు తక్కువ కులం దానివి’ అంటూ దివ్యను కొంతకాలంగా వెంకటేష్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే విషయమై సోమవారం భార్యాభర్తల మధ్య మరో సారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన దివ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. -
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో నవీన్కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
సమస్యలపై ప్రశ్నించేది కమ్యూనిస్టులే..
చింతపల్లి : ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాలను ప్రశ్నించేది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర నగర్లో నిర్వహించిన సీపీఐ 14వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. మొదటి శత్రువు ముస్లింలు, రెండవ శత్రువు క్రైస్తవులు, మూడవ శత్రువు కమ్యూనిస్టులు అంటూ బీజేపీ నాయకులు మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. రాష్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులనుంచి బయటకు రావడం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్రెడ్డి, అంజయ్యనాయక్, కలకొండ కాంతయ్య, ఉజ్జిని యుగేందర్రావు, పోలె వెంకటయ్య, ఉజ్జిని అంజల్రావు, చెల్లం పాండురంగారావు, కొలుకులపల్లి కొండలు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలి
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేసి మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. సోమవారం నీలగిరి మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న సమయంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి ప్రతి విభాగానికి వెళ్లి అక్కడ ఉన్న ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడారు. ఇంజనీరింగ్ విభాగానికి వెళ్లిన మంత్రి అక్కడి ఈఈ, ఏఈలతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో సీడీపీ, ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన 180 పంచాయతీరాజ్ పనుల్లో నాణ్యత లేవంటూ వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇన్చార్జి అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ్కు ఫోన్లో ఆదేశించారు. రెవెన్యూ విభాగంలో ఆస్తి పన్ను వసూలు, గతంలో జరిగిన అక్రమాలపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీదాలు ఇస్తున్నారా.. లేదా అని ఆరాశీశారు. అక్కడ వివిధ రికార్డులను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు.ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ నీలగిరి మున్సిపల్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ