breaking news
Nalgonda
-
సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా
నల్లగొండ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ రద్దు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలె పెట్టిందన్నారు. దాన్ని అమలు చేసేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నారని.. తెలంగాణలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణరెడ్డి మాట్లాడుతూ మహాధర్నాకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు వెళ్లేలా సమాయత్తం చేస్తామన్నారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి జాన్రెడ్డి, రాష్ట్ర నాయకుడు సుంకరి బిక్షంగౌడ్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, గౌరవ అధ్యక్షుడు సత్తయ్య, శ్రీనివాసరెడ్డి, యూసుఫ్పాష, మారం వెంకటరెడ్డి, సునీల్, శంకరయ్య, సువర్ణ, సత్తిరెడ్డి, గోపాల్, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ -
బీసీ లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ శిక్షణకు బీసీ లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని, గుర్తింపు పొందిన యూ నివర్సిటీ నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఆగస్టు 15లోగా దరఖాస్తులను జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని, పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్మర్రిగూడ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్పై సస్సెన్షన్ శివ స్వరూపారాణిపై వేటు పడింది. ప్రిన్సిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నారని.. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్కు ఫిర్యాదులు అందడంతో గత నెల 28న పాఠశాలలో డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ విచారణ చేపట్టి నివేదికను డైరెక్టర్కు అందచేశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎస్.శివస్వరూపరాణిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టీసీ సిబ్బందికి ప్రగతి చక్ర అవార్డులురామగిరి (నల్లగొండ) : విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆర్టీసీ సిబ్బందికి రీజియన్ స్థాయిలో ఏప్రిల్, మే, జూన్ నెలల ప్రగతిచక్ర అవార్డులను ఆర్ఎం జానిరెడ్డి శుక్రవారం నల్లగొండలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహిస్తేనే ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందన్నారు. రీజియన్ పరిధిలో 28 మంది సిబ్బందికి ప్రగతిచక్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం, అన్ని డిపోల మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుదారుల జాబితా విడుదలనల్లగొండ: మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేసే.. మోటరైజ్డ్ వాహనాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారి జాబితాను కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే.. ఈ నెల7 న సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించాలికనగల్ : విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం కనగల్ కాంప్లెక్స్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంప్లెక్స్ సమావేశాల్లో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొనాలన్నారు. అనంతరం పాఠశాలలో, కేజీబీవీలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ వి.పద్మ, కాంప్లెక్స్ హెచ్ఎం డి.విద్యాభార్గవి, కేజీబీవీ ఎస్ఓ స్వప్న పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి మహమ్మారిని తరిమికొట్టండిమిర్యాలగూడ అర్బన్ : డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్లను నిర్మూలించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవినాయక్, మల్లం మహేష్ కోరారు. జిల్లావ్యాప్త చైతన్య సైకిల్ యాత్రలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సైకిల్ యాత్రలో వారు మాట్లాడారు. మత్తుకు బానిసలుగా మారుతున్న యువత అగాయిత్యాలకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటోందన్నారు. ఆన్లైన్ యాప్ల వల్ల లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సైకిల్ యాత్ర సభ్యులు పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, సుధాకర్, శశిధర్, రాజేష్, సాయితేజ పాల్గొన్నారు. -
1600 మెగావాట్ల విద్యుత్
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని రెండు యూనిట్లలో ఉత్పత్తి సాక్షి ప్రతినిధి, నల్లగొండ, మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ద్వారా శుక్రవారం నుంచి 1600 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జనవరి నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పవర్ ప్లాంట్లోని రెండో యూనిట్ను జాతికి అంకితం చేశారు. దాంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్ విద్యుదుత్పత్తి చేస్తుండగా, శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క యూనిట్–1 నుంచి జాతికి అంకితం చేశారు. దాంతో మరో 800 మెగావాట్లు కలుపుకొని 1600 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్ విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. వైటీపీఎస్ యూనిట్ –1 ప్రారంభం అనంతరం రూ.970 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. మరో మూడు యూనిట్లను వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులు ఆదేశించారు. పవర్ ప్లాంట్ ద్వారా మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే స్టేజ్–1లోని రెండు యూనిట్లను పూర్తి చేయడంపై ఆయన వైటీపీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. పవర్ ప్లాంట్లో అన్ని సౌకర్యాలు బాగుండేలా.. అభివృద్ధి చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, ఆస్పత్రి నిర్మించి పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరిగేలా చూడాలన్నారు. పవర్ ప్లాంట్ ఆవరణలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాసితులకు ఉద్యోగాలిస్తున్నాం : మంత్రి ఉత్తమ్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భూములు పోయిన పరిహారంతోపాటు ఉద్యోగాలు ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ మంజూరు అయ్యిందని.. ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వైటీపీఎస్ వద్దకు రహదారుల పూర్తికి రూ.280 కోట్లు మంజూరు చేయడంతోపాటు.. క్లీయరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో పవర్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక బాధ్యతగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు నుంచి ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు. రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ వైటీపీఎస్లోని అన్ని విభాగాల్లో లాగ్బుక్ ఆన్లైన్లో నమోదు తప్పనిసరిగా చేయాలని, ప్రతి ఉద్యోగి కార్డుతోనే యాక్సెస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైటీపీఎ్స్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్రపవార్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖర్రెడ్డి, జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ కుమార్రాజు తదితరులు పాల్గొన్నారు.చివరి దశకు చేరుకున్న నాలుగో యూనిట్ పనులు పవర్ ప్లాంట్లోని 3, 4, 5 యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. నాలుగో యూనిట్ పనులు చివరి దశకు చేరుకున్నారు. గత ఏడాది నవంబర్లోనే నాలుగో బాయిలర్ లైటింగ్ (స్టీమ్ జనరేషన్) పనులు పూర్తికాగా, ప్లాంట్ సింక్రనైజేషన్కు సంబంధించి బాయిలర్ స్టీమ్ బ్లోయింగ్ ఆపరేషన్, నార్మలైజేషన్ పనులను ఈ నెల చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక యూనిట్–3 బాయిలర్ లైటింగ్ పనులు గత ఏడాది ఫిబ్రవరిలోనే పూర్తి కాగా, బాయిలర్ కెమికల్ క్లీనింగ్ కూడా పూర్తయింది. ఇక స్టీమ్ బ్లోయింగ్ ఆపరేషన్ పనులను గత నెల 22వ తేదీన ప్రారంభించారు. మొత్తానికి యూనిట్–3 సింక్రనైజేషన్ను వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి, అక్టోబర్లో కమర్షియల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా పనులను చేపట్టారు. యూనిట్–5 బాయిలర్ హైడ్రాలిక్ పరీక్ష పూర్తికాగా, బాయిలర్ లైటింగ్ పనులను ఈ నెలలోనే చేపట్టేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన టర్బైన్ నిర్మాణ పనులను ఇంకా కొనసాగుతున్నాయి. డిసెంబర్లో సింక్రనైజేషన్ పూర్తి చేసి, 2026లో ఫిబ్రవరిలో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ పేర్కొంది. ఫ ఈ ఏడాది జనవరిలో సీఎం చేతుల మీదుగా యూనిట్–2 ప్రారంభం ఫ శుక్రవారం యూనిట్–1ను జాతికి అంకితం చేసిన డిప్యూటీ సీఎం భట్టి ఫ వచ్చే ఏడాది జనవరి నాటికి మిగతా మూడు యూనిట్లు పూర్తి చేయాలని ఆదేశం ఫ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన ఫ పనులపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి సమీక్ష -
హామీలు అమలు చేయాల్సిందే
మిర్యాలగూడ టౌన్ : ఎన్నికల సమయంలో చేయూత పింఛనుదారులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు వరకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం మిర్యాగూడలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పింఛన్దారుల జిల్లా సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. తీవ్ర అంగవైకల్యం కలిగిన కండరాల క్షిణిత వ్యాధి గ్రహాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రూ.15 వేలు ఇస్తుంటే తెలంగాణలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మేరకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈనెల 13వ తేదీన హైదరాబాద్లో దివ్యాంగుల మహాగర్జనకు సంబంధించిన సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకన్నయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సమన్వయకర్త జానకిరామయ్య చౌదరి, రాష్ట్ర నేత అహ్మద్ఖాన్, అందె రాంబాబు, గడ్డం ఖాసీం, వెంకటాచారి, సైదులు, రాజేష్, చైతన్యరెడ్డి, ఇంద్రచౌదరి, శ్రీనివాస్, రామేశ్వరీ, లక్ష్మి, సువర్ణ, శంకర్, మధన్నాయక్, నాగరాజు, సైదులు, నర్సింహ, వెంకన్న పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
డుమ్మా కొట్టలేరు..!
నల్లగొండ : డుమ్మా టీచర్లకు ఇక చెక్ పడనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని విద్యాశాఖ తీసుకొచ్చింది. పాఠశాలలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు బోధించకుండా విధులకు గైర్హాజరతున్న ఉపాధ్యాయులను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. ఉపాధ్యాయుల హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని శుక్రవారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. సంబంధిత ఉద్యోగి సెల్ఫోన్లోనే టీజీఎఫ్ఆర్ఎస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి హాజరును నేరుగా ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. గత విద్యా సంవత్సరం నుంచి ఫేస్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించి పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేస్తున్నారు. అదే తరహాలో ఉపాధ్యాయుల హాజరును కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో 1483 ప్రభుత్వ, జిల్లా పరిషత్, యూఆర్ఎస్, కేజీవీబీలు, మోడల్ స్కూల్లు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 6,556 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల సమయ పాలనకు కొత్తగా ప్రవేశపెట్టి టీజీఎఫ్ఆర్ఎస్ యాప్ను సంబంధిత ఉద్యోగి స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేస్తారు. మొదటగా ఉద్యోగి వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. యాప్ ఇన్స్టాలేషన్ సమయంలోనే సంబంధిత కార్యాలయం, పాఠశాల ఆవరణ లాంగిట్యూడ్, లాటిట్యూడ్లను టెక్నీషియన్ అప్లోడ్ చేస్తారు. ఒక్కసారి లాగిన్ అయిన తరువాత యాప్ నిరంతరంగా వినియోగించవచ్చు. ఇక ఉద్యోగి ఉదయం నిర్దేశిత సమయానికి పాఠశాలకు వచ్చిన తర్వాత యాప్ను ఓపెన్ చేసి క్లాక్ ఇన్ అనే ఆప్షన్ నొక్కితే సదరు ఉద్యోగి వచ్చిన సమయం ఆన్లైన్లో సంబంధిత పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. పాఠశాలలో పని సమయం ముగిసిన తర్వాత క్లాక్ ఔట్ అనే ఆప్షన్పై టచ్ చేస్తే ఉద్యోగి కార్యాలయాన్ని విడిచి వెళ్లే సమయాన్ని, పని చేసిన గంటలను లెక్కించి తిరిగి సంబంధిత పర్యవేక్షణ అధికారి ఆన్లైన్లో చేరుతుంది. ఉత్తమ బోధనే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. విద్యార్థులకు ఉత్తమ బోధనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. చాలామంది పనిచేస్తున్న చోట నివాసం ఉండకుండా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ స్కూళ్లకు వేళకు చేరుకోవడం లేదు. ప్రధాపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటూ విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలకు ఉపాధ్యాయులు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఫేస్ రికగ్నిషన్ హాజరు నమోదు అమల్లోకి తెచ్చింది. ఇక విద్యార్థులకు మరింతగా నాణ్యమైన, ఉత్తమ బోధన అందనుందని పలువురు విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతిక ఇబ్బందులు అధిగమిస్తాం ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదులో మొదటిరోజు కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో కొందరు ఉపాధ్యాయులు హాజరు నమోదులో ఇబ్బందులు ఏర్పడ్డాయి. రెండుమూడు రోజుల్లో అవి పూర్తిగా పరిష్కారమవుతాయి. ప్రతి ఉపాధ్యాయుడు కచ్చితంగా ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4.15 గంటలకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేయాల్సిందే. అలా చేయకపోతే గైర్హాజర్ ఆన్లైన్లో చూపుతుంది. – భిక్షపతి, డీఈఓ ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలు ఫ హాజరు పక్కాగా ఉండేలా విద్యాశాఖ చర్యలు ఫ జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు ఫ 6,556 మంది ఉపాధ్యాయులు.. తొలిరోజు 3,854 మంది రిజిస్ట్రేషన్ ఫ మెరుగుపడనున్న విద్యా బోధనమొదటి రోజు 3854 మంది నమోదు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి తమ సెల్ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసి ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే మొదటి రోజు ఆయా పాఠశాలల్లో 3854 మంది ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ విధానం పూర్తయిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని టెక్నికల్ సమస్య వల్ల మొదటి రోజు 2,712 మంది ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు. రెండు మూడు రోజుల్లో సాంకేతిక సమస్యలను అధిగమించి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేలా విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. -
106 మంది బాల కార్మికులకు విముక్తి
నల్లగొండ : జూలై నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 106 మంది బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ శాఖతోపాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్ శాఖల అధికారుల సమన్వయంతో బృందాలుగా ఏర్పడి 106 మందికి విముక్తి కల్పించినట్లు వెల్లడించారు. వీరిలో 94 మంది బాలలు, 12 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, చత్తీస్గడ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. బాల కార్మికుల చేత ఎవరైనా పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికై నా బాల కార్మికుల సమాచారం తెలిస్తే డయల్– 100, 1098 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
248 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు
నల్లగొండ : విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టారు. జిల్లాలో ఎన్రోల్మెంట్ లేని పాఠశాలలు, విద్యార్థుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలనుంచి ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి అనుమతితో జిల్లాలో 248 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. స్కూల్ అసిస్టెంట్లను కాంప్లెక్స్ నుంచి నియోజకవర్గ పరిధిలో.. ఎస్జీటీను కాంప్లెక్స్ పరిధిలో అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు చేశాయని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో 69 మంది స్కూల్ అసిస్టెంట్లును, 179 మంది ఎస్జీటీలను సర్దుబాటు చేస్తూ డీఈఓ భిక్షపతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, మండల విద్యాధికారులు ఆయా ఉపాధ్యాయులను పాఠశాలల నుంచి రిలీవ్ చేయడంతో పాటు సర్దుబాటు చేసిన పాఠశాలల్లో రిపోర్టు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైన ఉపాధ్యాయులు జాయిన్ కాకపోతే సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
స్పీడ్ గన్ చూస్తోంది..
చౌటుప్పల్ రూరల్: వాహనాలను అతివేగంతో నడపడం వల్ల చోదకులు ప్రమాదాలకు గురవడమే కాకుండా ఎదుటివారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.ఈ నేపథ్యంలో వాహనాల వేగ నియంత్రణపై పోలీసులు దృష్టి సారించారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం పరిధిలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చెట్లమాటున స్పీడ్గన్లు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని రికార్డ్ చేశారు. పరిమితికి మించిన వేగంతో వెళ్తే వెంటనే వాహనదారుడి సెల్ఫోన్ లేదా, వాహనం నంబర్ ఆధారంగా ఎంత జరిమానా చెల్లించాలనే సమాచారం వస్తుంది. గంటకు 90 కి.మీ వేగం మించితే చలానా వస్తుందని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ విజయ్మోహన్ తెలిపారు. -
గత ప్రభుత్వ వైఫల్యంతోనే వైటీపీఎస్ పనుల్లో జాప్యం
మిర్యాలగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) యూనిట్–1లో విద్యుత్ ఉత్పత్తిని ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు లక్ష్మణ్కుమార్, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు. పవర్స్టేషన్లో మొత్తం ఐదు యూనిట్లు ఉండగా.. రెండో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ఈ ఏడాది జనవరి 21 సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక్కో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 800 మెగావాట్లు. ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, మిగతా మూడు యూనిట్లను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది జనవరి 26 నుంచి పూర్తిగా జాతికి అంకితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రెండేళ్లపాటు పర్యావరణ అనుమతులపై క్లియరెన్స్ తీసుకురాకపోవడంతోనే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సమయాన్ని నిర్దేశించుకోని అనుకున్న కార్యాచరణ ప్రకారం సంవత్సరం, నెల, వారానికి చేయాల్సిన పనులపై కేలెండర్ ప్రకారం ముందుకు వెళ్లామని చెప్పారు. సంవత్సర కాలంలోనే రెండు యూనిట్లు పూర్తి చేశామని తెలిపారు. విద్యుత్ ఉత్పాదనతోపాటు వైటీపీఎస్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల ఏర్పాటు, పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రి, అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బందికి క్వార్టర్స్ నిర్మిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళుతున్నట్టు చెప్పారు. రహదారులు దెబ్బతినకుండా సీసీ రోడ్డు పనులు మొదలుపెట్టామన్నారు. భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారాన్ని గాలికి వదిలేస్తే..తాము ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు, పునరావాస కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు కింద నష్టపోయిన కొందరు రైతులకు కూడా వైటీపీఎస్లో ఉద్యోగాలు, పరిహారం అందచేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖరరెడ్డి, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిత్తల్, జెన్కో సీఎండీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసుల దర్యాప్తునకు సాంకేతికత దోహదం
నల్లగొండ: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా కేసుల దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో క్లూస్ టీమ్కు కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరం జరిగిన ప్రదేశానికి క్లూస్ టీం త్వరగా చేరుకొని నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. వివిధ సాంకేతిక పరికరాల సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్ ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, ఆర్ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, నరసింహ, క్లూస్ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ శివ సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో జిల్లా విద్యార్థులు రాణించాలని తెలంగాణ యోగా సభ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట సింహాద్రి, ప్రధాన కార్యదర్శి రాయనబోయిన శ్రీను అన్నారు. తెలంగాణ యోగా సభ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలో జిల్లాస్థాయి యోగాసన ఎంపిక పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగంలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై నవారు ఈ నెల 7, 8 తేదీల్లో ఆదిలాబాద్లో జరగబోయే రాష్ట్రస్థాయి యోగా చాంపియన్ షిప్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనం నాగిరెడ్డి, నామిరెడ్డి సుష్మ, మంగ, మహేశ్వరీ, సునీత, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కొత్త దుకాణాలు లేనట్టే..!
టెండర్ డిపాజిట్ ధర పెంపు ? గతంలో టెండర్లో పాల్గొనాలంటే దరఖాస్తుకు రూ.2 లక్షలు డీడీ చెల్లించాలనే నిబంధన ఉంది. ఈ డబ్బు తిరిగి రాదు ప్రభుత్వానికే చెందుతుంది. అయితే ఈసారి దరఖాస్తుల ధరను మరింతగా పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది. దరఖాస్తు ఫారం ధరను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలిసింది.జనాభా లెక్కలు తేలితేనే అదనపు మద్యం షాపులు ఫ 2023లో ఉన్నవాటికే టెండర్లు పిలువనున్న ఎకై ్సజ్ శాఖ ఫ ఈ సారి కూడా ఆగస్టులోనే షెడ్యూల్ జారీకి అవకాశం ఫ దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే యోచన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈసారి అదనపు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు ఉన్న పాత దుకాణాలకు మాత్రమే త్వరలో టెండర్లు కోసం షెడ్యూల్ జారీ చేసేందుకు ఎకై ్సజ్ శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణంగా ఉన్న దుకాణాల కంటే అదనంగా పెంచాలంటే కొత్త జనాభా లెక్కలు రావాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున ప్రతి 5వేల మందికి ఒక మద్యం దుకాణం చొప్పున అధికారులు గతంలోనే పెంచారు. వాటి ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 155 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా షాపులకు అనుమతి ఇవ్వకుండా ఉన్న దుకాణాలకే టెండర్లు పిలువనున్నారు. క్లస్టర్ పరిధిలో షాపుల మార్పు.. నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి. ఒక్క వార్డుకు రెండు నుంచి మూడు లెక్కన కేటాయించారు. ఆయా క్లస్టర్ల పరిధిలో ఉన్న షాపులు ఏవైనా సక్రమంగా నడడవం లేదని, దరఖాస్తు చేసుకుంటే ఆ క్లస్టర్ పరిధిలోనే ఒకే స్లాబ్ విధానం ఉన్న ప్రాంతానికి మద్యం షాపును మార్చుకునేందుకు అనుమతి ఇస్తారు. సాధారణంగా జిల్లాలో క్లస్టర్ జనాభా స్లాబ్ను బట్టి షాపుల లైసెన్స్ ఫీజులను ఫీజులను ఖరారు చేశారు. 5 వేల జనాభా ఉంటే రూ.50 లక్షలు లైసెన్సు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 5 నుంచి 10 వేల జనాభా ఉన్న చోట రూ.55 లక్షలు, 10నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.60 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉంటే రూ.65 లక్షలు, లక్షకు జనాభా ఆపైన ఉంటే రూ.కోటి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా స్లాబ్ల విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 155 మద్యం షాపులు ఉండగా అందులో 95షాపులు మాత్రమే పది రెట్ల రెవెన్యూ దాటాయి. మిగిలినవి ఏడెనిమిది రెట్లు మాత్రమే అమ్మకాల లక్ష్యాన్ని దాటాయి. ఇంకా నాలుగు నెలలు గడువు ఉంది కాబట్టి అన్ని షాపులు పది రెట్ల అమ్మకాలను దాటే అవకావం ఉందని ఽఅధికారులు చెబుతున్నారు. ఏదైనా ఒక షాపులో ఆ మేరకు అమ్మకాలు జరక్కపోతే ఆ క్టస్టర్ పరిధిలో, అదే స్లాబ్ విధానం ఉన్న ప్రాంతానికి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 2023లో దరఖాస్తులు 7,057 రెండేళ్ల కిందట జిల్లాలోని 155 మద్యం షాపులకు టెండర్లు పిలువగా 7,057 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని షాపులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కనగల్ మండలం దర్వేశిపురం మద్యం దుకాణానికి 187 మంది పోటీ పడి దరఖాస్తు చేశారు. రాష్ట్రంలోనే ఈ దుకాణానికే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. పోటీపడిన వారిలో కొందరు ఐదారు దరఖాస్తు చేయగా, సింగిల్ టెండర్ వేసిన వ్యక్తికే డ్రాలో దక్కింది. ఈ సారి పెరగనున్న దరఖాస్తులు ఈసారి కూడా మద్యం షాపులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. గతంలో చాలా మంది టీంలుగా ఏర్పడి 10 నుంచి 20 షాపులకు టెండర్లు వేశారు. షాపులు వచ్చిన వారినుంచి రానివారు చాలా మంది కొన్నారు. దాంతో ఈసారి కూడా టెండర్లలో పాల్గొనేందుకు చాలామంది సిద్ధమవుతన్నారు. త్వరలో మద్యం షాపుల టెండర్ల షెడ్యూల్ జిల్లాలో త్వరలోనే మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. 2023లో ఆగస్టు 21న టెండర్లు పిలిచి డ్రా తీశారు. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల తెరిచారు. ప్రస్తుతం జిల్లాలోని 155 మద్యం షాపుల లైసెన్స్ గడవు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తిచేయాల్సి ఉంది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగస్టు నెలలోనే మొదలైతే అందుకు కనీసంగా మూడు నెలల సమయం పట్టనుంది. ఆ సమయంలో దుకాణాల టెండర్లు నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే గతంలో మాదిరిగానే టెండర్ల ప్రక్రియను ముందుగానే నిర్వహించాలని ఎకై ్సజ్ శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. -
అమ్మ పాలే ఆరోగ్యం
పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు అంశాలపై పూర్తి స్థాయిలో వివరిస్తాం. ఇందుకోసం అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన పరుస్తారు. కాన్పుకు దగ్గరలో ఉన్న గర్భిణులకు తల్లిపాల పాముఖ్యతను తెలియజేస్తాం. – కృష్ణవేణి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మిర్యాలగూడ టౌన్ : తల్లిపాలు అమృతంతో సమానం. శిశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తాపించడం తప్పనిసరి. తద్వారా తల్లిబిడ్డలకు ఎంతో శ్రేయస్కరం. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఇంటింటికి అంగన్వాడీ పేరుతో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేందుకు ఐసీడీఎస్ యంత్రాంగం సిద్ధమైంది. గ్రామాలు, పట్టణాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తల్లి పాల ప్రాముఖ్యతతోపాటు పిల్లలకు ఇవ్వాల్సిన అనుబంధ ఆహారంపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తారు. ముర్రుపాలు ఎంతో మేలు.. బిడ్డ పుట్టిన మొదటి గంటలోపే తల్లి ముర్రుపాలు కచ్చితంగా శిశువుకు తాపించాలి. ఈ పాలలో మాంసకృత్తులు పోటీన్లు, ఏ,సీ,డీ,ఈ,కే మిటమిన్లు, కొవ్వు, చక్కర పదార్థాలు, మినరల్స్ బిడ్డకు అందుతాయి. ఇవన్నీ బిడ్డలో రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఆరు మాసాల తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా తల్లిపాలు పట్టాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. దీంతో తల్లులు రోమ్ము క్యాన్సర్కు గురికారు. తల్లిపాలలో ఇనుము, కాల్షియం ఉండడంతో బిడ్డలో రక్తహీనత ఏర్పడదు. తల్లిపాలు సులభంగా జీర్ణం అవుతాయి. శిశువుకు మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తవు. పాలు పుష్కలంగా రావాలంటే గర్భం దాల్చినప్పటి నుంచే పోషక విలువలు ఉన్న ఆహారం పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు ఫ ఇంటింటికి అంగన్వాడీ సిబ్బంది ఫ తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన ఫ 7వ తేదీ వరకు కార్యక్రమంఐసీడీఎస్ ప్రాజెక్టులు 09అంగన్వాడీకేంద్రాలు 2,0937 నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 71,397గర్భిణులు 8,538బాలింతలు 6,595 -
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతల స్వీకరణ
రామగిరి(నల్లగొండ): జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డాక్టర్ ఎండి అబ్దుల్ హఫీజ్ ఖాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి మునుగోడు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం మునుగోడు ఎంపీడీఓ కార్యాలయంలో చండూరు డివిజన్ పరిధిలోని ఐదు మండలాల తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈలు, ఏపీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఇళ్ల నిర్మాణాలను సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రారంభించిన ఇళ్లు వారం రోజుల్లో బేస్మెంట్ పనులు పూర్తిచేయించి బిల్లులు చెల్లించాలన్నారు. నిర్మాణ పనులు ప్రారంభించడంతో నిర్లక్ష్యం వహించిన మర్రిగూడ ఎంపీడీఓకి షోకాజ్ నోటీసు జారీచేయాలని ఆదేశించారు. అనంతరం మునుగోడు పీహెచ్సీని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తన సెల్ఫోన్ లైట్ వేసుకుని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ప్రతినెలా వైద్యపరీక్షలు చేయాలన్నారు. ఆమె వెంట హౌసింగ్ పీడీ రాజ్కుమార్, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, మునుగోడు డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నృసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలు శాస్త్రరుక్తంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. ఇక ప్రాకరా మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. -
‘యంగ్ ఇండియా’ మోడల్గా నిలవాలి
ఫ 4న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భూమి పూజకు ఏర్పాట్లు చేయండి ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ: జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెం వద్ద రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం రాష్ట్రానికే మోడల్గా నిలవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నమూనా, నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణాలకు 4వ తేదీన భూమి పూజకు ఏర్పాట్లు చేయాలన్నారు. టీజీఈడబ్ల్యూఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి, కలెక్టర్లకు వివరించారు. భవన నిర్మాణాల్లో మార్పులుంటే నా దృష్టికి తేవాలని కలెక్టర్కు సూచించారు. బోధనేతర సిబ్బందికి ముందుగా వసతి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమీక్షలో అదనపు ఇన్చార్జి కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీఓ అశోక్రెడ్డి, టీజీఈడబ్ల్యూఐసీడీ డిప్యూటీ ఇంజనీర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యనందిస్తాం నల్లగొండ టౌన్: నర్సింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి భూమిపూజ చేసి మాట్లాడారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నర్సింగ్ కోర్సులు చేయడం ద్వారా భవిష్యత్తులో మెడికల్ టూరిజంలో అనేక ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నా. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎంహెచ్ఓ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రశాంతి పాల్గొన్నారు. -
4న ‘యంగ్ ఇండియా స్కూల్’కు శంకుస్థాపన
నల్లగొండ : జిల్లా కేంద్రంలో నిర్మించే య.ుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ఆగస్టు 4న భూమి పూజ చేయనున్నారు. అదే రోజు మినిస్టర్ క్యాంపు కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలపై సంబంధిత అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనాలను మంత్రి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. 22 ఎకరాల్లో 5,36,194 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో సుమారు రూ.200 కోట్ల అంచనాతో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేయనున్నామని మంత్రి వెల్లడించారు. భూమి పూజ తర్వాత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నల్లగొండకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమీక్షలో ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ పాల్గొన్నారు. నేడు మంత్రి కోమటిరెడ్డి రాక నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం నల్లగొండకు రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నల్లగొండ చేరుకొని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలువనున్నారు. 11 గంటలకు ఎస్ఎల్బీసీలో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఆ తరువాత ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ రోగులను కలుస్తారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షిస్తారు. యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలిస్తారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
1న వైటీపీఎస్కు డిప్యూటీ సీఎం, మంత్రుల రాక
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ (వైటీపీఎస్)కు ఆగస్టు 1న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రానున్నారు. పవర్ ప్లాంట్లోని యూనిట్–1ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీని ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. అనంతరం కృష్ణాతీరంలో జెన్కో టౌన్షిప్ కోసం భూమి పూజ చేయనున్నారు. ఉపాధి సిబ్బందికి వేతనాలు మంజూరుచిట్యాల : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలల వేతనాలు విడుదలయ్యాయి. ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఈ నెల 26న ‘సాక్షి’లో ‘ఉపాధి సిబ్బందికి వేతన ఇక్కట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వారికి మూడు నెలల వేతనాలను మంగళవారం రాత్రి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. యూరియా అక్రమ రవాణాపై విచారణచిట్యాల: మండలంలోని వెలిమినేడు గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన యూరియా అక్రమ రవాణా ఘటనపై బుధవారం జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి పి.శ్రావణ్కుమార్ విచారణ చేపట్టారు. వెలిమినేడు పీఏసీఎస్ కార్యాయంలోని సిబ్బందితో మాట్లాడి జరిగిన యూరియా రవాణాపై వివరాలను సేకరించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఏఓ గిరిబాబు ఉన్నారు. మున్సిపాలిటీ ఆదాయం పెంచుకోవాలి నల్లగొండ టూటౌన్ : అనుమతి లేకుండా చేపట్టే నిర్మాణాలు, నల్లా కనెక్షన్లు గుర్తించి వాటికి అనుమతులు ఇవ్వడంతో పాటు అసిస్మెంట్ చేయడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకోవాలని మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా బుధవారం నల్లగొండకు వచ్చిన ఆయన డంపింగ్యార్డు, పలు వార్డులకు వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరణపై ఆరా తీశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లతో సమావేశమై మాట్లాడారు. ప్రతి ఇంటికి అసిస్మెంట్ చేసి ఇంటి నంబర్ ఇవ్వాలని, ఇందుకు వార్డు ఆఫీసర్లు వార్డుల్లో తిరిగి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో 43 వేల భవనాలు ఉండగా, నల్లా కనెక్షన్లు తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కనెక్షన్లను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ర్యాంకు సాధించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ శివరాంరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రదీప్రెడ్డి, జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు పదోన్నతులు
నల్లగొండ : ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం.. అందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొమ్మిదేళ్ల తర్వాత పదోన్నతులు, ఆరేళ్ల తర్వాత బదిలీలను గత సంవత్సరం నిర్వహించారు. ఆ తరువాత ఏర్పడిన ఖాళీలను పదోన్నతుల ద్వారా ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. జూలై మాసం పూర్తి కావొస్తున్నందున ముందుగా పదోన్నతుల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారులు పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాను ఆన్లైన్లో ఉంచారు. ఆ జాబితాపై బుధ, గురువారాలో అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.. సంవత్సర కాలంలోనే మళ్లీ పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ సన్నద్ధం కావడంతో ఉపాధ్యాయుల్లో ఆనందం నెలకొంది. ఖాళీల ఆధారంగా.. జిల్లా పరిధిలో ఎస్జీటీలకు, మల్టీజోన్న్–2 పరిధిలో గెజిటెడ్ (జీహెచ్ఎం) ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. జిల్లాలో మొత్తంగా వివిధ కేటగిరిల్లో 304 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో జీహెచ్ఎంల ఖాళీలు 54 కాగా.. మిగతావి స్కూల్ అసిస్టెంట్లుగా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి సీనియారిటీ జాబితా సైతం రూపొందిస్తున్నారు. జూన్న్30వ తేదీ వరకు ఏర్పడిన ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 304 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. ఫ ఏడాది కాలంలోనే రెండోసారి అవకాశం ఫ ఆన్లైన్లో సీనియారిటీ జాబితా ఫ అభ్యంతరాలు స్వీకరిస్తున్న విద్యాశాఖ ఫ జిల్లాలో 304 మంది ప్రమోషన్ పొందే అవకాశం త్వరలో షెడ్యూల్ ప్రస్తుతం పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు ప్రక్రియ మొదలుపెట్టారు. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ సైతం విడుదల కానుండడంతో విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. సీనియారిటీతో పాటు వివిధ కేటగిరిల్లో ఖాళీలను గుర్తిస్తున్నారు. షెడ్యూల్ వెలువడితే 15 నుంచి 20 రోజులు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పదోన్నతులు, బదిలీలు ఇప్పుడు చేపడితే విద్యార్థులకు బోధనలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పలువులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
మర్రిగూడ : కేసుల దర్యాప్తు విషయంలో సమగ్ర విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ శరత్చంద్రపవార్ అన్నారు. బుధవారం మర్రిగూడ పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిసరాలపై ఎస్ఐ ఎం.కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కేసుల రికార్డులను పరిశీలించి రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్డెస్క్, స్టేషన్ రైటర్, లాక్అప్, ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి మాట్లాడారు. దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి చట్టప్రకారం శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం లేకుండా బాధితులకు న్యాయం చేయాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఐ కృష్ణారెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఎస్ఐ ఎం.కృష్ణారెడ్డి, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్రపవార్ -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం
డిండి : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్వేయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. బుధవారం డిండి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టు కింద సాగు చేసిన ప్రతి ఎకరాకు సరిపడా నీరందిస్తామన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. అంతకుముందు స్థానిక జెడ్పీహెచ్ఎస్లో ప్రహరి గోడను ప్రారంభించారు. ఎస్సీ గురుకుల పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. వీఏఎస్ ఫంక్షన్ హాల్లో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాెస్గౌడ్, ఎంపీడీఓ వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, రాజేష్రెడ్డి, గడ్డమీది సాయి, రాంకిరణ్, దామోద్రెడ్డి, తూం బుచ్చిరెడ్డి, శ్రీను, వెంకటేష్, సలయ్య తదితరులు పాల్గొన్నారు. -
యూరియా దందాపై విచారణ చేపట్టాలి
చిట్యాల : మండలంలోని వెలిమినేడు పీఏసీఎస్ ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్ దందాపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. చిట్యాలలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంటలకు యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతుంటే వెలిమినేడు పీఏసీఎస్ ద్వారా యూరియా బస్తాలను ప్రైవేట్ పరిశ్రమలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈ దందాలో కీలక వ్యక్తులను తప్పించి సొసైటీ అటెండర్పై నేరాన్ని మోపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు సహకరిస్తున్న ఆ సొసైటీ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల అయిలయ్య, పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మాజీ ఎంపీపీ కొలను సునిత వెంకటేష్గౌడ్, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన సత్తయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, మాజీ సర్పంచ్ మర్రి జలంధర్రెడ్డి, సాగర్ల భిక్షం, బాతరాజు రవీందర్, శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
అర్హులందరికీ రేషన్కార్డులు ఇస్తాం
చింతపల్లి : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం చింతపల్లిలో నూతన రేషన్కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతపల్లి మండలానికి 1,666 నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ రమాకాంత్ శర్మ, మార్కెట్ చైర్మన్ దొంతం సంజీవరెడ్డి, అంగిరేకుల నాగభూషణం, ఎరుకల వెంకటయ్యగౌడ్, ముచ్చర్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి చందంపేట : కేజీబీవీ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం నేరెడుగొమ్ము మండల కేంద్రంలోని కేజీబీవీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు కాసేపు పాఠాలు బోధించారు. వంట గదిని పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ ఉమాదేవి, ఎంపీడీఓ నీలిమ, ఎస్ఓ శ్వేత ఉన్నారు. -
‘ఉత్తి’పోతలేనా!
నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం మిర్యాలగూడ, నాగార్జునసాగర్ పరిధిలో కొత్తగా మంజూరైన ఎత్తిపోతల పథకాల పనులు సాగుతున్నాయి. పనుల్లో జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవం. నిధులు మంజూరు కాకపోవడంతో పనులు చేయడం ఆలస్యమవుతోంది. నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాపం. పనుల వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకుంటాం. – కర్నాకర్, ఎన్ఎస్పీ ఈఈ మిర్యాలగూడ : సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. వాటిలో అందులో నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఆరు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు. వీటి పనులు ప్రారంభించి ఐదేళ్లు దాటినా ఇప్పటివరకు 30 శాతం పనులు కూడా పూర్తికాలేదు. ఫలితంగా చివరి భూములకు నీరండం లేదు. ఎన్ఎస్పీ పరిధిలో.. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో చివరి భూములకు నీరందించేందుకు ఆరు ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టారు. ఎన్ఎస్పీ డివిజన్–1 పరిధిలో సాగర్ డ్యాం ఉండగా ఎన్ఎస్పీ డివిజన్–2 పరిధిలో ఐదు లిఫ్టులను మంజూరు చేశారు. అందులో నెల్లికల్, బొత్తలపాలెం– వాడపల్లి, దున్నపోతులగండి, వీర్లపాలెం, తోపుచర్ల లిఫ్టులు ఉన్నాయి. డివిజన్–3 పరిధిలో కేశవాపురం – కొండ్రపోల్ లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. ఈ ఆరు ఎత్తిపోతల పథకాల్లో 9 పంప్హౌజ్లు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేశవాపురం – కొండ్రపోల్ ఎత్తిపోతల వద్ద మాత్రమే ఒక పంప్హౌజ్ పూర్తయింది. నిధులు మంజూరులో జాప్యం ఎత్తిపోతల పథకాల పనులను ప్రారంభించినప్పటికీ పనుల పురోగతికి అనుగుణంగా నిధులు మంజూరు కాకపోవడంతో వాటి పనులు నిలిచిపోతున్నాయి. నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని రూ.664.80 కోట్లతో చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.131.420 కోట్ల పనులు జరిగాయి. ఇలా బొత్తలపాలెం, దున్నపోతలగండి, వీర్లపాలెం, తోపుచర్ల, కేశవాపురం – కొండ్రపోల్ ఎత్తిపోతల పథకాల పరిస్థితి కూడా అంతే ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఫ ఐదేళ్ల క్రితం ఆరు ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభం ఫ ఇప్పటి వరకు 30 శాతం కూడా పూర్తికాలే.. ఫ నిధుల లేమితో ముందుకు సాగని పనులు ఫ ఆయకట్టు చివరి భూములకు అందని నీరు ఎత్తిపోతల పథకాల వివరాలు ఇలా.. లిఫ్టు నిధులు ఆయకట్టు పనుల పురోగతి (రూ.కోట్లలో) నెల్లికల్ 664.80 24,624 24.34 శాతం బొత్తలపాలెం 229.25 8,610 11 శాతం వీర్లపాలెం 32.22 2500 10 శాతం తోపుచర్ల 9.3 315.98 10 శాతం దున్నపోతులగండి 219.9 12,239 12 శాతం కేశవాపురం 53 5875 30శాతం -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్ : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. గురుకులాల్లో ఫుడ్పాయిజన్తో విద్యార్థుల చనిపోతున్నా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, సైదానాయక్, కుంచం కావ్య, కోరె రమేష్, వెంకటేశ్, మారుపాక కిరణ్, ముస్కు రవీందర్, స్పందన, సిరి, జగదీష్, జగన్నాయక్, వీరన్న, రాకేష్, సాయి, నవదీప్, ప్రణయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ పేరుతో ప్రజలను భయపెట్టొద్దు
నల్లగొండ : ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ వ్యాధి పేరుతో ప్రజలను భయపెట్టవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశం మందిరంలో వైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. డెంగీ పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను భయపెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలా చేసిన ఆస్పత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోగులకు సరిపడా మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి వైద్యాధికారి సమీపంలోని పాఠశాల, హాస్టల్ను తప్పనిసరిగా సందర్శించి అవసరమైతే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఏఐ టీబీ ఎక్స్రే పరికరం కొనుగోలుకు ఆర్థిక సాయం
నల్లగొండ : నల్లగొండలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో టీబీ కేసులను నిర్ధారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొబైల్ టీబీ ఎక్స్రే పరికరం కొనుగోలు కోసం రూ.18 లక్షల చెక్కును మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణచౌదరి, ఉపాధ్యక్షుడు గంటా సంతోష్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, నల్లగొండ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి భద్రాద్రి తదితరులు పాల్గొన్నారు. -
మూసీ క్రస్ట్గేట్లు మూత
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గింది. దీంతో మంగళవారం ప్రాజెక్టు అధికారులు క్రస్ట్గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం 1,650 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో.. మంగళవారం ఉదయానికి 950 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ఐదు రోజులుగా తెరిచి ఉంచిన రెండు క్రస్ట్గేట్లను మంగళవారం ఉదయం పూర్తిగా మూసివేశారు. 645 అడుగుల (4.46 టీఎంసీలు) గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రం వరకు నీటిమట్టం 643.18 అడుగుల (.94 టీఎంసీలు) వద్ద ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 547 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 72 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. స్వస్థలాలకు వలస కార్మికులు చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్కాలనీ కృష్ణా తీరంలో నిర్బంధం నుంచి విముక్తి పొందిన వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపుతున్నారు. మొత్తం 28 మంది కార్మికులను బిహార్, ఛత్తీస్ఘడ్, పంజాబ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలోని వారివారి ప్రాంతాలకు మంగళవారం దేవరకొండ నుంచి బయల్దేరి వెళ్లినట్లు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తెలిపారు. 31న యోగాసన ఎంపిక పోటీలునల్లగొండ టూటౌన్ : జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నల్లగొండలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగానికి చెందిన ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోట సింహాద్రికుమార్, ప్రధాన కార్యదర్శి రాయనబోయిన శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు 31న ఉదయం 10 గంటలకు బోనపైడ్, ఆధార్కార్డులతో నల్లగొండలోని ఫణి విహార్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 91820 46383 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. టీటీసీ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలినల్లగొండ : టీటీసీ (టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్) లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని డీఈవో భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. www.bse .telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఆగస్టు 3వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పేపర్–1 (ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ థియరీ), మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పేపర్–2 (మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్), 3.30 గంటల నుంచి 4.30 వరకు పేపర్ –3 (మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్) పరీక్షలు ఉంటాయని తెలిపారు. -
టెయిల్పాండ్ నుంచి నీటి విడుదల
అడవిదేవులపల్లి : అడవిదేవులపల్లి గ్రామ సమీపంలో కృష్ణానదిపై ఉన్న టెయిల్పాండ్ నుంచి దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ వెంకటరమణ మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు జలాశయం నుంచి టెయిల్పాండ్కు 2,32,468 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో దిగువకు 2,38,727 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 75.50 (7.080 టీఎంసీలు)మీటర్లు కాగా.. ప్రస్తుతం 75.04(6,764 టీఎంసీలు) మీటర్ల మేరకు నీరు ఉందన్నారు. కార్యక్రమంలో టెయిల్పాండ్ అధికారులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, అవినాష్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
‘విదేశీ విద్య’కు మరింత ప్రోత్సాహం
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం సీట్లను పెంచింది. ఇప్పటి వరకు 210 సీట్లు ఉండగా.. 500 సీట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మరింత మంది షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు విదేశీ విద్య అందనుంది. 2013లో ప్రారంభం షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు 2013లో అప్పటి ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సిస్ విదేశీ విద్యానిధి పథకాన్ని ప్రవేశపట్టింది. ఈ పథకం కింద విదేశీ విద్య కోసం ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు చెల్లించింది. 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచారు. విదేశాల్లో చదివేందుకు సంబంధిత పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం కింద విదేశీ విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ఈ పాస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే ఆయా ప్రాధాన్యత ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తుంది. 72 మందికి అవకాశం అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం కింద ప్రతి సంవత్సరం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికే అవకాశం దక్కింది. 12 సంవత్సరాల్లో జిల్లా వ్యాప్తంగా 150 మంది దరఖాస్తు చేసుకోగా 72 మంది విదేశాల్లో చదువుకునేందుకు రికమండ్ చేశారు. వారిలో 71 మందికి ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. జిల్లాలో మొత్తం రూ.6.49 కోట్లను ఇప్పటి వరకు ప్రభుత్వం విదేశీ విద్య కోసం ఖర్చు చేసింది. దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు గడువు.. విదేశీ విద్యను అభ్యసించేందుకు 2025–26 సంవత్సరానికి సంబంధించి అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు చేసుకునేందుకు ఆగస్టు 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల శాఖ అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. అవకాశాన్ని అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం కింద విదేశాలకు వెళ్లిన విద్యార్థులుసంవత్సరం దరఖాస్తులు రిజెక్టు విదేశాలకు వెళ్లింది 2013–14 1 0 1 2014–15 5 0 5 2015–16 7 3 4 2016–17 14 6 8 2017–18 10 5 5 2018–19 4 1 3 2019–20 8 1 7 2020–21 4 1 3 2021–22 12 1 11 2022–23 33 20 13 2023–24 28 21 7 2024–25 18 13 5 మొత్తం 144 72 72 ఫ అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధికి గతంలో కంటే రెట్టింపు సీట్లు ఫ మరింత మందికి అందనున్న విదేశీ విద్య ఫ జిల్లాలో ఇప్పటి వరకు 72 మందికి అవకాశం -
సంక్షేమమే ప్రభుత్వ అభిమతం
కట్టంగూర్ : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ అభిమతమని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం కట్టంగూర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్తో కలిసి నూతన రేషన్కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. 52 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 84 శాతం మంది ప్రజలకు సన్నబియ్యం అందజేయటం దేశంలోనే చారిత్రాత్మకం అన్నారు. గతంలో రాష్ట్రంలో 89 లక్షల రేషన్కార్డులు ఉండగా ప్రస్తుతం 97 లక్షలకు పెరిగాయన్నారు. అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్కార్డులు అందిస్తామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రేషన్కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అర్హులు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయిటిపాముల ఎత్తిపోతల పథకం కింద పెండింగ్లో ఉన్న భూసేకరణ బిల్లులను మంజూరు చేయాలని, బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ కింద ఉన్న భూ సేకరణ నిధులు విడుదల చేయాలని ఆమె మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వర్రావు, మాజీ జెడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకబోయిన నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, డీటీ ఆల్బర్ట్ ఫ్రాంక్లిన్, ఆర్ఐ కుమార్రెడ్డి, శ్యామల శ్రీనివాస్, బెజవాడ సైదులు, ఐతగోని నర్సింహ్మ, వివిధశాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ పెద్దవూర : రాష్ట్రంలో రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ఇది కొనసాగుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవూర మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో కొత్తగా 62,155 మందికి నూతన రేషన్ కార్డులను మంజూరు చేశామని, 80,201 మంది పేర్లను నమోదు చేసినట్లు చేశామని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, సివిల్ సప్లయీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎంసీ చైర్మన్ టి.చంద్రశేఖర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్నాయక్, గడ్డంపల్లి వినయ్రెడ్డి, పబ్బు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
వర్షపాతం సాధారణమే!
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాపై వరుణుడు కరుణచూప లేదు. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షమే కురిసింది. ఇప్పటి వరకు 196.3 మిల్లీమీటర్ల సగటు వర్షం కురవాల్సి ఉండగా 188.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గత వారం అల్పపీడనం కారణంగా వర్షం కురిసినప్పటికీ చిరుజల్లులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కడా చెరువులు, కుంటలు నిండిన దాఖలాలు లేవు. ఆ వర్షంతో కేవలం మెట్టపంటలైన కంది, పత్తికి కొంత మేలు చేకూరింది. ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు కేవలం మర్రిగూడ మండలంలో మాత్రమే అత్యధిక వర్షం కురిసింది. ఆ మండలంలో 158.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 262.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 9 మండలాల్లో అధిక వర్షం జిల్లాలో ఇప్పటి వరకు 9 మండలాలల్లో అధిక వర్షం కురిసింది. చింతపల్లి, అడవిదేవులపల్లి, పెద్దవూర, పెద్దఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట, గుడిపల్లి మండలాల్లో సాధారణ వర్షం కంటే అధిక వర్షం కురిసింది. చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, శాలిగౌరారం, నకిరేకల్, మునుగోడు, గుర్రంపోడు, నిడమనూరు, దామరచర్ల, తిరుమలగిరిసాగర్, నేరెడుగొమ్ము, గట్టుప్పల్ మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. మిగిలిన 11 మండలాలైన కేతేపల్లి, తిప్పర్తి, నల్ల గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, అనుముల హాలియా, త్రిపురారం, మాడుగులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో సాధారణం కంటే తక్కువ అంటే లోటు వర్షపాతం నమోదైంది. 5,32,641 ఎకరాల్లో పత్తిసాగు సీజన్ మొదట్లో మురిపించిన వరుణుడు ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో సాగు అంచనాలు తగ్గాయి. ఈ సీజన్లో పత్తి సాగు అంచనా 6,25,276 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 5,32,641 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. వరినాట్లు కూడా ఊపందుకోలేదు. వరిసాగు అంచనా 5,45,620 ఎకరాలు కాగా.. అనుకూలమైన వర్షాలు కురవని కారణంగా ఇప్పటి వరకు కేవలం 1,25,284 ఎకరాల్లోనే రైతులు నాట్లు వేశారు. ఇటీవల మెట్ట పంటలకు అనుకూలమైన వర్షం కురవడంతో పత్తి, కంది పంటలు జీవం పోసుకున్నాయి. వరి సాగు ఊపందుకుంటుంది నాగార్జునసాగర్ ఆయకట్టు, వరదకాలువ, ఏఎమ్మార్పీ కాలువల పరిధిలో సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టుతో పాటు నాన్ఆయకట్టు కింద వరినాట్లు ఊపందుకుంటాయి. ఆగస్టు చివరి వరకు వరినాట్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే 2 లక్షల ఎకరాలకు సరిపడా నార్లు సిద్ధంగా ఉన్నాయి. – శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి కురవాల్సింది 196.3 మి.మీ, కురిసింది 188.7 మి.మీఫ ఇప్పటికీ 11 మండలాల్లో లోటు వర్షపాతం ఫ మర్రిగూడ మండలంలోనే అత్యధిక వర్షం ఫ సీజన్ మొదట్లో వర్షాభావంతో అంచనాలకు తగ్గిన పత్తిసాగు -
అలిగిన మంత్రి కోమటిరెడ్డి.. ఉత్తమ్పై ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ పర్యటన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్పోర్టుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. ఉదయం 10 గంటల వరకు రాలేదు. తమను ఉదయం 9 గంటలకే ఎయిర్పోర్టుకు రావాలని చెప్పిన ఉత్తమ్ 10 గంటలకు ఎలా వస్తాడంటూ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉత్తమ్కుమార్రెడ్డి ఆలస్యంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో తన పర్యటన రద్దు చేసుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచే అలిగి వెళ్లిపోయారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జునసాగర్కు హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ వెళ్లిపోయారు. -
తెరుచుకున్న సాగర్ గేట్లు.. క్రస్ట్ గేట్లు ఎత్తిన మంత్రులు
సాక్షి, నల్గొండ జిల్లా: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్లు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇవాళ ఉదయం (మంగళవారం) మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాగార్జునసాగర్ గేట్లను పైఎత్తి వరద నీటిని విడుదల చేశారు.కాగా, సోమవారం శ్రీశైలం జలాశయానికి మొత్తం 2,31,612 క్యూసెక్కుల వరద వస్తుండగా రాత్రి 10 గంటలకు ఐదు గేట్లను ఒక్కోటీ 10 అడుగుల మేర పైకెత్తి మొత్తం 2,01,229 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.8 అడుగుల వద్ద 203.4290 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 584.41 అడుగులకు చేరుకుంది.అలాగే గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 295.7 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం సాగర్లో విద్యుదుత్పత్తి ద్వారా 28,785 క్యూసెక్కులను తెలంగాణ దిగువకు విడుదల చేస్తుండగా.. కుడి ప్రధాన కాల్వ ద్వారా 5,394 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటోంది. ఎడమ ప్రధాన కాల్వ ద్వారా రెండు రాష్ట్రాల అవసరాలకు మరో 6,634 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
యాంత్రీకరణకు నిధులు
కమిటీల ద్వారా ఎంపిక.. అర్హులైన లబ్ధిదారుల నుంచి గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏఈఓల ద్వారా వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలోని వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో కమిటీ స్క్రూట్నీ చేసి జిల్లా వ్యవసాయ అధికారికి పంపుతుంది. అక్కడ జాబితాను తయారు చేసి కలెక్టర్ అనుమతితో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపికై న రైతులకు అక్టోబర్ చివరి నాటికి పరికరాలను అందించే విధంలా ప్రణాళిక రూపొందించారు. ఫ రూ.3.14 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఫ ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఫ అక్టోబర్ చివరివారంలో పరికరాలు అందజేసేలా జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక నల్లగొండ అగ్రికల్చర్ : రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేసే.. యాంత్రీకరణ పథకానికి నిధులు మంజూరయ్యాయి. పథఽకం అమలు కోసం జిల్లాకు రూ.3.14 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) పథకం కింద ఈ నిధులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. ఈ పథకం కోసం గత యాసంగిలోనే ప్రక్రియ ప్రారంభించినప్పటికీ మార్చి బడ్జెట్ ముగింపు సందర్భంగా ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల నిధులు రాలేదు. ప్రస్తుతం ముందస్తుగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పరికరాల కోసం నుంచి ఆగస్టు 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50 శాతం, జనరల్ కేటగిరి రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందించనున్నారు. ఫిబ్రవరిలోనే రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులను స్వీకరించింది. వాటితోపాటు ఆగస్టు 5 నుంచి తీసుకునే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి 21 నుంచి 27వ తేదీ వరకు ఎంపికై న రైతుల నుంచి సబ్సిడీ పోను పెట్టుబడి వాటాను డీడీల రూపంలో తీసుకోనున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 5 వరకు ఎంపికై న రైతులకు పరికరాల మంజూరీ ఉత్తర్వులను అందజేస్తారు. అక్టోబరు చివరి వారంలో లబ్ధిదారులకు పరికరాలను అందజేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. 15 రకాల పరికరాలు అందజేత.. యాంత్రికరణలో భాగంగా రోటోవేటర్, ఎంబీ ప్లగ్, అల్టివేటర్, డిస్క్ యారో, కేజీవీల్, బండ్ పార్మర్, రోడో పడ్లర్, పవర్ టిల్లర్, సీడ్ ఫ్రం పర్టిలైజర్ డ్రిల్, మాన్యువల్ స్ప్రేయర్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రే, పవర్ వీడర్, బ్రష్కట్టర్, స్ట్రా బేలర్స్ తదితర పరికరాలను రైతులకు సబ్సిడీపై అందజేయనున్నారు. రైతులు దరఖాస్తు చేసుకోవాలి... జిల్లాలోని అర్హులైన రైతులు వ్యవసాయ యాంత్రికరణ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందజేస్తాం. అక్టోబరు చివరి నాటికి పరికరాలను పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
నందికొండ.. నిండుకుండ
పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో సాగర్ జలాశయం.. నేడు గేట్ల ఎత్తివేత నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 585.00అడుగుల (297.7235 టీఎంసీలు)కు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడం, ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మంగళవారం క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇందు కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నాగార్జునసాగర్ రానున్నారు. మంత్రుల పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బీసీ గురుకుల మైదానంలో హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో మంత్రులు కృష్ణమ్మకు వాయినమిచ్చి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. 18 సంవత్సరాల తర్వాత ఈసారి జూలై మాసంలోనే క్రస్ట్ గేట్లు తెరుచుకుంటున్నాయి. శ్రీశైలానికి భారీగా వరద ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటకలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు మందుస్తుగానే జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు గల జలాశయాలు గరిష్టస్థాయి నీటిమట్టాలకు చేరాయి. అదనంగా వచ్చే వరదను శ్రీశైలం మీదుగా నాగార్జునసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి సోమవారం రాత్రి 2,10,920 క్యూసెక్కుల వరద వస్తోంది. కాగా, సోమవారం ఉదయం రెండు గేట్ల నుంచి, మధ్యాహ్నం 12గంటలకు మూడు గేట్లు, సాయంత్రం 4 గేట్లు, రాత్రి వరకు మొత్తం ఐదు గేట్లను 10 అడుగులు ఎత్తి స్పిల్వే మీదుగా 1,35,325 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,904 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో నాగార్జునసాగర్ జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.. సాగర్ విద్యుదుత్పాదన కేంద్రంలో ప్రస్తుతం పూర్తిస్థాయిలో విద్యుదుత్పాదన చేస్తున్నారు. ఆ నీరంతా టెయిల్పాండ్ ద్వారా పులిచింతల జలాశయానికి చేరుతోంది. ఇక, నిన్నటి వరకు కుడి కాల్వకు కేవలం 511 క్యూసెక్కుల నీటినే విడుదల చేశారు. మంగళవారం నుంయి ఐదు వేల క్యూసెక్కులకు పెంచారు. నదిలోకి వెళ్లవద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి సాగర్ క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున మత్స్యకారులు, రైతులు నదితీర ప్రాంతాలకు నదిలోకి వెళ్లవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నదిలో మోటర్లు ఉంటే వెంటనే తొలగించుకోవాలని, మత్స్యకారులు వలలు, పుట్టీలను ఒడ్డుకు చేర్చుకోవాలని సూచించారు. వరద కాల్వకు నీటి విడుదల పెద్దవూర : మండలంలోని పూల్యాతండా సమీపంలోని ఏఎమ్మార్పీ లోలెవల్ వరద కాలువకు గ్రావిటీ ద్వారా సోమవారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈఈ వి.వేణు మాట్లాడుతూ 85 కిలోమీటర్ల కాలువ కింద 42 డిస్ట్రిబ్యూటరీలు, 30 చెరువులు ఉన్నట్లు తెలిపారు. చెరువులను నింపి రైతులకు సాగునీటిని అందించనున్నట్లు వెల్లడించారు. మొదట 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు దశలవారీగా సాయంత్రానికి 300 క్యూసెక్కులకు పెంచారు. మంగళవారానికి 600 క్యూసెక్కులకు పెంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ ఎండీ. ఖదీర్ పాల్గొన్నారు. ఏఎమ్మార్పీ ఆయకట్టుకు కూడా..పెద్దఅడిశర్లపల్లి : ఏఎమ్మార్పీ డివిజన్ –4 పరిధిలో ఉన్న ఆయకట్టుకు సోమవారం ఏఎమ్మార్పీ అధికారులు నీటి విడుదల చేశారు. డి–5 నుంచి డి–18 వరకు ఆయకట్టు అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశారు. సాగర్ వెనుక జలాల నుంచి మూడు అత్యవసర మోటార్ల ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని ఏకేబీఆర్కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి ఉదయ సముద్రానికి 1100 క్యూసెక్కులు, హైదరాబాద్కు 520 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 45 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ నాగయ్య తెలిపారు. సాగర్ ఆయకట్టుకు నేడు నీటి విడుదల నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ఆయకట్టుకు మంగళవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. మంత్రులు ఉదయం 10గంటల వరకు సాగర్కు చేరుకుని 11 గంటలలోపు కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. గడిచిన 18 సంవత్సరాల్లో జూలై మాసంలో కాల్వలకు నీటిని విడుదల చేసిన సందర్భాలు లేవు. 2006లో జూలై 21, 2007లో జూలై 14న నీటిని విడుదల చేశామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. 10.38లక్షల ఎకరాల ఆయకట్టు నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద 10.39లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాలు, కృష్ణాజిల్లా 3,68,536 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,734 ఎకరాలకు సాగర్ నీరు అందనుంది. 2007 తర్వాత ఇప్పుడే.. గడిచిన 18 సంవత్సరాల కాలంలో ఏనాడూ ఇంత ముందస్తుగా సాగర్ జలాశయానికి వరద రాలేదు. కేవలం 2007లో ముందస్తుగా వరదలు వచ్చి జలాశయం గరిష్టస్థాయికి చేరడంతో జూలై 14వ తేదీన జలాశయం 587.80 అడుగులకు చేరడంతో క్రస్ట్గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తిరిగి ఈ ఏడాది రికార్డు స్తాయిలో వరద వచ్చి చేరడంతో జూలై మాసంలోనే గేట్లు ఎత్తాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫ ఎగువ నుంచి భారీగా వరద ఫ నేడు క్రస్ట్గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న మంత్రులు ఫ 18 ఏళ్ల తర్వాత జూలైలో తెరుచుకుంటున్న క్రస్ట్గేట్లు -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
త్రిపురారం : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన త్రిపురారం మండలంలోని కామారెడ్డిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డిగూడేనికి చెందిన గుండెబోయిన నాగయ్య(50) మాడుగులపల్లి మండలంలోని కన్నెకల్ గ్రామంలోని ఓ వైన్ షాపులో క్యాషియర్గా పని చేస్తున్నాడు. ఆదివారం నాగయ్య భార్య చెరువుగట్టుకు వెళ్లగా నాగయ్య ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడు. సోమవారం ఉదయం నాగయ్య వైన్ షాపునకు వెళ్లకపోవడంతో షాపు నుంచి అతడికి ఫోన్ చేశారు. స్పందించకపోవడంతో ఇంటి సమీపంలోని వారికి ఫోన్ చేసి నాగయ్య దగ్గరికి వెళ్లమని చెప్పారు. వారు వెళ్లి చూడగా అతను అపస్మారకస్థితిలో కనిపించాడు. గ్రామస్తులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్కు సమాచారం అందించారు. నాగయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. మృతుడి భార్య గుండెబోయిన నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ఫ పరారీలో మరో ఇద్దరు పెన్పహాడ్: గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు. ఈ సంఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణానికి చెందిన కొంచెం సాయిగణేష్, శాంతినగర్కు చెందిన పవన్, అమరగాని లోకేష్లు గంజాయికి అలవాటుపడ్డారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు వద్ద గంజాయి కొనుగోలు చేసి వారు తాగడంతో పాటు కావాల్సిన వారికి సరఫరా చేస్తున్నారు. అనంతారం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానం వచ్చి పోలీసులు వారి స్కూటీని ఆపి తనిఖీ చేశారు. కొంచెం సాయిగణేష్ వద్ద 100గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పవన్, లోకేష్లు పరారయ్యారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలుచిట్యాల: భార్యాభర్తల మద్య నెలకొన్న మనస్పర్థలతో మనస్థాపానికి గురైన భర్త సెల్ టవర్ ఎక్కాడు. ఈ సంఘటన చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టంపల్లి గ్రామానికి చెందిన అంతటి ఉపేందర్(40)కు మునుగోడు మండలం క్రిష్టపురం గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపేందర్ హైదరాబాద్లో స్ట్రీల్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పిట్టంపల్లి గ్రామానికి వచ్చారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య వివాదం రావడంతో మనస్థాపానికి గురైన ఉపేందర్ తన ఇంటి సమీపంలోని సెల్ టవర్ ఎక్కాడు. గ్రామస్తులు సర్దిచెప్పడంతో కిందకు దిగాడు. ● మనస్థాపంతో సెల్టవర్ ఎక్కిన భర్త -
సారూ.. మా గోడు ఆలకించరూ..!
నల్లగొండ : సారూ.. మా సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరుతూ పలువురు బాధితులు కలెక్టరేట్లో పిర్యాదులు సమర్పించారు. సోమవారం గ్రీవెన్స్డే సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్ల మంజూరు తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. వినతులు స్వీకరించిన కలెక్టర్ వాటి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి నాకు చిన్నప్పటి నుంచి కాళ్లు పని చేయడం లేదు. ఇన్నాళ్లూ మా నన్ను సాకింది. మా అమ్మ పెద్ద మనిషి. ఆమె పని చేయలేదు. ఇద్దరం ప్రభుత్వం ఇచ్చే పింఛన్తోనే జీవనం గడుపుతున్నాం. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – ఏర్పుల మల్లయ్య, చర్లపల్లి, దివ్యాంగుడు మా అమ్మకు పింఛన్ ఇప్పించండి మా నాన్న తుపాకుల రాములు స్వతంత్య్ర సమరయోధుడు. ఆయన చనిపోయి ఆరు నెలలైంది. మా నాన్న పింఛన్ మా అమ్మకు మంజూరు చేయాలని దరఖాస్తు చేసాం. ఆరు నెలలైనా ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ విషయంలో అధికారులు వెంటనే మా అమ్మ తుపాకుల నర్సమ్మకు పింఛన్ అందేలా చూడాలి. – లక్ష్మయ్య, మిర్యాలగూడ భూమి పట్టా చేసుకుని పట్టించుకోవడం లేదు నా మనవడు మమ్ములను సాదుతానని చెప్పి మా పేరున ఉన్న ఎకరం 10 గుంటల భూమి పట్టా చేయించుకుండు. ఇప్పుడు సాదడం లేదు. నా చిన్న కొడుకుకు మాటలు రావు. మేము ముగ్గురం ఆ భూమి మీదే ఆదారపడి జీవించాలి. నా పెద్ద కొడుకు కుమారుడైన శ్రీనివాస్ మమ్మల్ని సాదుతానని చెప్పి పట్టా చేయించుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. విషయం అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి. – జడల మట్టమ్మ, రామచంద్రు, నేతాపురం, తిరుమలగిరి సాగర్ మండలం ఫ గ్రీవెన్స్లో బాధితుల వినతి ఫ ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
నల్లగొండ టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై శ్రద్ధ పెట్టాలన్నారు. సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకు సాగునీటి విడుదల చేసేందుకు వెంటనే షెడ్యూల్ ప్రకటించాలన్నారు. నిరంతరం సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేసి పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, డబ్బికార్ మల్లేశ్, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, హశం తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
మూసీకి 1604 క్యూసెక్కుల వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. సోమవారం 1,604 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 1,281 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు కాగా 643.20 మేర అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 549 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 72 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. గేట్ల ద్వారా, కాల్వలకు కలిపి మొత్తం 1904 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుండి విడుదలవుతుంది. మూసీ రిర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.99 టీఎంసీల నీరు ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు. ఫ రెండు గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల -
నగదు అపహరించిన ముగ్గురి అరెస్ట్
చౌటుప్పల్ : సెకండ్హ్యాండ్లో కారు కొనేందుకని ఓ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నలుగురితో కలిసి చౌటుప్పల్కు వెళ్లగా అతను వెంట తెచ్చుకున్న నగదును వారు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఈనెల 26న చౌటుప్పల్ పట్టణంలో చోటుచేసుకోగా.. ముగ్గురు నిందితులు సోమవారం పోలీసులకు చిక్కారు. ఒకరు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను సీఐ మన్మథకుమార్ వెల్లడించారు. హైదరాబాద్లోని నాగోల్కు చెందిన వీరగంధం శ్రీనివాస్ అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్లో కార్లు కొనడం, అమ్మడం చేస్తుంటాడు. గత 20రోజుల క్రితం సెకండ్హ్యాండ్లో కార్లు కొనబడును, అమ్మబడును అని తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టును చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వేముల పుల్లారావు అలియాస్ శివ(38), కర్నూలు జిల్లా కల్లూరు మండలం శరీన్నగర్కు చెందిన కర్వాల సునీల్కుమార్(45), పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మిద్దె జగదీష్బాబు(46)తోపాటు బత్తుల సాంబశివరావు అనే వ్యక్తులు శ్రీనివాస్ను సంప్రదించారు. తమ వద్ద సెకండ్హ్యాండ్ కార్లు ఉన్నాయని, కావాలంటే చూపిస్తామని శ్రీనివాస్ను నమ్మబలికారు. అతను చేసేది అదే వ్యాపారం అయినందున కారు కొనుగోలుకు చేసేందుకు సిద్ధమేనని శ్రీనివాస్ వారితో చెప్పాడు. అందరూ కలిసి అద్దె కారులో చౌటుప్పల్కు.. సెకండ్హ్యాండ్లో కారును శ్రీనివాస్కు ఇప్పించేందుకుగాను పుల్లారావు, సునీల్కుమార్, జగదీష్బాబు, సాంబశివరావులు కలిసి ఈనెల 26న అద్దెకారులో నాగోల్కు చేరుకున్నారు. శ్రీనివాస్ను తమ వెంటబెట్టుకొని చౌటుప్పల్ పట్టణంలోని చిన్నకొండూర్రోడ్డులో ఉన్న మసీదు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అమ్మకానికి ఉన్న ఓ సెకండ్హ్యాండ్ కారును చూపించారు. సంబంధిత కారు యజమాని కొద్దిసేపటి తర్వాత వస్తానని చెప్పడంతో వీరంతా అద్దెకు తీసుకువచ్చిన కారులోనే కూర్చున్నారు. ఇంతలోనే శ్రీనివాస్కు ఫోన్ రావడంతో మాట్లాడుకుంటూ కారు దిగి బయటకు వెళ్లాడు. శ్రీనివాస్ తెచ్చిన రూ.4లక్షలు కారు డ్యాష్బోర్డులో ఉండగా.. ఇదే అదునుగా భావించిన మిగతా నలుగురు నిందితులు నగదును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. కొంత సేపటి తర్వాత శ్రీనివాస్ రాగా.. వీరు కనిపించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీస్స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సీఐ మన్మథకుమార్ విచారణ చేపట్టారు. ఆ క్రమంలో ధర్మోజిగూడెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు. వారి వద్ద రూ.4లక్షల నగదు, అద్దె కారు, 5గ్రాముల బంగారం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బత్తుల సాంబశివరావు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. నిందితులంతా గతంలో దొంగనోట్లు, దొంగ బంగారం కేసుల్లో వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ అయ్యారని చెప్పారు. పరారీలో మరొకరు రూ.4లక్షల నగదు, కారు, బంగారం, సెల్ఫోన్లు స్వాధీనం -
నవనీత.. సాగులో ఘనత
రెండు ఎకరాల విస్తీర్ణంలో అద్భుతాలు● పాలీహౌస్లలో సేంద్రియ పద్ధతుల్లో కీర సాగు ● కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు, మరో పది మందికి ఉపాధి ● ఆదర్శంగా నిలుస్తున్న పంగాల నవనీతతుర్కపల్లి : ఆమె సాధారణ గృహిణి. వ్యవసాయంపై ఉన్న మక్కువతో సేద్యంలోకి అడుగుపెట్టింది. పాలిహౌస్లు ఏర్పాటు చేసి ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం, చెర్రీ టమాట పండించి.. ఇప్పుడు కీరదోస సాగు చేస్తోంది. సేంద్రియ పద్ధతుల్లో మంచి దిగుబడి సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటునందించడమే కాకుండా మరో పది మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. పంగాల నవనీత. ఎకరాకు రూ.3లక్షల నుంచి రూ.4లక్షలుఏడాదికి రెండు విడతల్లో కీరదోస పండిస్తున్నారు. పంట వేసిన అనంతరం 25 రోజుల తరువాత కాత మొదలవుతుంది. ప్రతి రెండు, మూడు రోజులకోమారు దిగుబడి వస్తుంది. ఒక్క కాతకు 500 నుంచి 600 కిలోల దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.1.5 లక్షలు అవుతుంది. పెట్టుబడి, కూలీల ఖర్చులు పోనూ ఎకరానికి రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు లాభాలు పొందుతున్నారు. లాభాలు తగ్గడంతో కీరదోస వైపు దృష్టిఎరుపు, పసుపు రంగు క్యాప్సికం, చెర్రీ టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్ అమ్మకాలకు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు ఎదురవుతుండటం.. పెట్టుబడి, రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో లాభాలు తగ్గాయి. దీంతో వాటిని తొలగించి ఆ స్థానంలో ఏడాది క్రితం కీరదోస సాగు ప్రారంభించారు. రెండు ఎకరాల్లోని పాలిహౌస్ల్లో కీరదోస సాగు చేస్తున్నారు. స్థానిక మార్కెట్లతో పాటు హైదరాబాద్కు ఎగుమతిపండిన కీరదోసను భువనగిరితో పాటు హైదరాబాద్లోని బోయిన్పల్లి తదితర ప్రధాన మార్కెట్లకు తరలిస్తుంటారు. కిలోకు రూ.25నుంచి 30 వరకు ధర పలుకుతుందని.. పెట్టుబడి, రవాణా ఖర్చులు, మార్కెట్ను ముందుగానే అంచనా వేసుకుని సాగు చేయడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతున్నామని మహిళా రైతు నవనీత చెబుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో సాగుకీరదోస సాగులో ఆవుపేడతో పాటు ఇతర సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. చాలా మంది వ్యాపారులు తోట వద్దకు వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్తుంటారని నవనీత చెబుతున్నారు. అంతేకాకుండా నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. మొదట్లో క్యాప్సికమ్, చెర్రీ టమాట, కాలిఫ్లవర్ సాగు తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పంగాల నవనీత ఐదేళ్లుగా సాగులో రాణిస్తోంది. ఆమె భర్త బాలస్వామి వృత్తిరీత్యా ప్రైవేట్ అధ్యాపకుడు. వీరికి ఇద్దరు సంతానం. నవనీతకు వ్యవసాయం అంటే మొదటి నుంచి మక్కువ. వారికున్న నాలుగు ఎకరాల్లో సంప్రదాయ పంటలు సాగు చేస్తుండేవారు. ఆ పంటల ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా సొంత ఖర్చులతో రెండు ఎకరాల్లో ఐదేళ్ల క్రితం రెండు పాలిహౌస్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం, చెర్రీ టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్, దోసకాయ పండించేవారు. ఇందులో ఎరుపు, పసుపు క్యాప్సికంను హైదరాబాద్, బెంగళూర్, ముంబయికి ఎగుమతి చేసేవారు. చెర్రీ టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్ను స్థానిక మార్కెట్లతో పాటు హైదరాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్కు తరలించేవారు. మార్కెట్కు తరలించడానికి సిద్ధంగా ఉన్న కీరదోసకాయలు ఎక్కువ లాభాలు గడించవచ్చు కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నందుకు గర్వకారణంగా ఉంది. సేద్యంపై నేను చూపుతున్న శ్రద్ధ ఇతర మహిళలు, రైతులకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది. ఏ సాగులోనైనా ఆధునిక, సేంద్రియ పద్ధతులు అవలంబించడం వల్ల తక్కువ భూమిలోనూ ఎక్కువ లాభాలు గడించవచ్చు. సాగులో నా భర్త సహకారం ఎంతో ఉంది. – నవనీత, మహిళా రైతు -
నేడు ఎంజీయూకు విద్యా కమిషన్ బృందం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మంగళవారం విద్యా కమిషన్ బృందం రానుంది. కమిషన్ చైర్మన్ చైర్మన్ ఆకునూరి మురళితో పాటు కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వర్రావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, కె.జోష్ణ శివారెడ్డి ఎంజీ యూనివర్సిటీని సందర్శించనున్నారు. వారు ఉదయం 10.30 గంటలకు సెమినార్ హాల్కు చేరుకొని విద్యా అంశాలపై చర్చించనున్నారు. యూనివర్సిటీ అధ్యాపకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, విద్యార్థి సంఘాల నాయకులు, అప్పిలేటేడ్ కళాశాలల యాజమాన్యాలు, టీచింగ్, నాన్చీటింగ్ ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలతో విద్యా కమిషన్ బృందం సమావేశం కానుందని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి తెలిపారు. 30న జాబ్మేళానల్లగొండ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 30న ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ నుంచి ఏదేని డిగ్రీ, డిప్లొమా(అగ్రికల్చర్, హార్టికల్చర్) ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు వారి ఒరిజినల్స్, బయోడేటాతో జాబ్మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 78934 20435 ఫోన్లో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలిమిర్యాలగూడ : ప్రభుత్వ విద్యాలయాల్లో చదవే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈవో బొల్లారం భిక్షపతి అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులకు ఆయా పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం వంటగదిలోని ఆహార సామగ్రిని పరిశీలించి నాణ్యమైన భోజనం, తాగునీరు అందించాలన్నారు. ఫుడ్ పాయిజన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పార్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణరామగిరి(నల్లగొండ): స్వయం ఉపాధి కోర్సులను యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందాలని నల్లగొండ సెట్విన్ శిక్షణ సంస్థ కో ఆర్డినేటర్ ఎం.సరిత అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ నల్లగొండలోని శిక్షణ కేంద్రంలో 27 కోర్సుల్లో 50 శాతం ఫీజు రాయితీపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కోర్సుల్లో ప్రధానంగా కంపూటర్, బ్యూటీషియన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనంగ్, ప్లంబింగ్, డీటీపీ, ఎలక్ట్రీషియన్, టెక్స్టైల్ డిజైనింగ్, కుట్టు మిషన్ తదితర ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వయంగా ఉపాధి పొందవచ్చని, జాబ్మేళా కూడా నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 97050 41789, 08682 281101 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
కాల్వలకు హద్దుల నిర్ధారణ
నకిరేకల్ : ఏఎమ్మార్పీ డి–53 కాల్వ భూములకు అధికారులు హద్దులు ఏర్పాటు చేశారు. ఈనెల 21న ‘సాక్షి’లో ‘కాల్వకట్టలు కబ్జాల మయం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. నకిరేకల్ మండలం పాలెం గ్రామం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 291, 292లలో కబ్జాకు గురైన కాల్వలను సోమవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బోళ్ల శ్యాం, చిరంజీవి, ఇరిగేషన్ అదికారులు సాయికృష్ణ, వర్క ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పరిశీలించారు. కాల్వలకు ఇరువైపులా సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేశారు. కాల్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. -
హాస్టళ్ల అద్దె బకాయి!
యజమానుల అప్పులపాలు ప్రభుత్వం ప్రతి నెలా అద్దె ఇస్తుందని యజమానులు హాస్టళ్లకు భవనాలు ఇచ్చారు. కానీ ఏడాదిన్నర నుంచి అద్దె రాకపోవడంతో ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భవనాల అద్దె మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొందరు ప్రతినెలా బ్యాంకులకు భవనాల ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం అద్దెలు చెల్లించపోవడంతో వారు అప్పుల పాలవుతున్నారు. మరోవైపు భవనంలో చిన్నపాటి మరమ్మతు వచ్చినా అద్దె రాలేదనే కారణంతో యజమానులు బాగు చేయించడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయమై ఎస్సీ డీడీ బి.శశికళను వివరణ కోరగా.. అద్దెకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అద్దె బకాయిలు రాగానే చెల్లిస్తామని పేర్కొన్నారు. నల్లగొండ : కళాశాల హాస్టల్ భవనాలకు అద్దె బకాయిలు పేరుకుపోతున్నాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం హాస్టల్ భవనాలకు అద్దెను చెల్లించకపోవడం వల్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనంలో చిన్న మరమ్మతు వచ్చిన యజమానులు చేయించడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు తప్పడం లేదు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 10 కళాశాల హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. వీటిలో నల్లగొండలో 5, దేవరకొండలో 2, మిర్యాలగూడలో 2, నకిరేకల్లో 1 హాస్టల్ ఉంది. వీటిలో 4 హాస్టళ్లు బాలికలకు, 6 హాస్టళ్లు బాలురవి ఉన్నాయి. ఈ హాస్టళ్లన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి ప్రతి నెలా రూ.4,28,783 అద్దె చెల్లిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నకు పైగా అద్దె చెల్లించపోవడంతో రూ.74,68,821 బకాయిలు పేరుకుపోయాయి. ఫ ఎస్సీ కళాశాల వసతి గృహాలకు కిరాయి చెల్లించని ప్రభుత్వం ఫ ఇబ్బందులు పడుతున్న యజమానులు, విద్యార్థులు -
రాష్ట్రంలో ప్రజారంజక పాలన
చందంపేట : రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లో నూతన రేషన్కార్డులు మంజూరైన లబ్ధిదారులకు ఆయన.. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్నాయక్తో కలిసి కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా జిల్లాతోపాటు దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి తన శాఖా నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ రూ.1800 కోట్లతో ఎదుళ్ల నుంచి డిండి ప్రాజెక్టు నీటిని మళ్లించి ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని అంబాభవాని, కంబాలపల్లి, పొగిళ్ల లిఫ్టు పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగునీరు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి సహకారంతో ఎస్ఎల్బీసీ పూర్తిచేసి ఈ ప్రాంతంలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ అర్హులైన వారు రేషన్కార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు దశలవారీగా కేటాయిస్తామన్నారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఊపందుకుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డదో రమణారెడ్డి, డీఎస్ఓ వెంకటేశం, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి చత్రునాయక్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డి.శైలజ, మార్కెట్ చైర్మన్ జమున, తహసీల్దార్లు శ్రీధర్బాబు, ఉమాదేవి, ఎంపీడీఓ లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీశైలంయాదవ్, వెంకటయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య, బద్యానాయక్, సర్వయ్య, గోవిందుయాదవ్, కిన్నెర హరికృష్ణ, బస్వారెడ్డి, గడ్డం వెంకటయ్య, మల్లారెడ్డి, అనంతగిరి తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ -
నృసింహుడి సన్నిధిలో కోలాహలం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరి క్షేత్రంలో ఆదివారం నిత్యపూజలు, భక్తుల రద్దీతో కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా శ్రీసుదర్శన నారసింహ హోమం, ఆ తరువాత గజవాహన సేవ, ఉత్సవమూర్తుల నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. రాత్రికి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
జాతీయస్థాయిలో రాణించాలి
నల్లగొండ : కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్ అధికారి భవేశ్మిశ్రా ఆకాంక్షించారు. వివిధ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 40 మంది నల్లగొండ్ర కేంద్రీయ విద్యాలయ విద్యార్థులను ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు సేంద్రియ పద్ధతిలో చేస్తున్న సాగుకు సంబంధించి మార్కెటింగ్పై రూపొందించిన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ నెల 28న సోమవారం జరగాల్సిన పోలీస్ గ్రీవెన్స్డే రద్దు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇతర కార్యక్రమాల వల్ల గ్రీవెన్స్డేను రద్దు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుర్యీ విషయాన్ని గమనించాలని సూచించారు. కొనసాగుతున్న మూసీ నీటి విడుదలకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆదివారం ప్రాజెక్టు రెండు క్రస్ట్గేట్లు పైకెత్తి ఉంచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒక్కో గేటును అడుగు మేర పైకెత్తి ఉంచి 1,286 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి 1,287 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టులో నీటి మట్టాన్ని 643.30 అడుగుల వద్ద నిలకడగా ఉంచుతున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 525 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా, ప్రధాన కాల్వలకు, సీపేజీ, లీకేజీల ద్వారా మొత్తం 1,885 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. మూసీ రిర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోవా మహాసభను జయప్రదం చేయాలి నల్లగొండ టౌన్: గోవాలోని శ్యామ్ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఆగస్టు 7వ తేదీన జరుగనున్న జాతీయ ఓబీసీ మహాసభలకు బీసీలు తరలివచ్చి జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు పిలుపునిచ్చారు. ఆదివారం బీసీ భవన్లో మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్ల సోమమల్లయ్య, గౌరవాధ్యక్షుడు కంది సూర్యనారాయణ, కార్యదర్శులు ఇంద్రయ్య, గంజి భిక్షమయ్య, ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, నల్లం మధుయాదవ్, కందుల వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు. పరీక్షలు ప్రశాంతంనల్లగొండ : గ్రామ పాలనాధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి ఆదివారం నల్లగొండలో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముసిగినట్లు జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు 300 మంది హాజరుకాగా, 78 మంది గైరాజరయ్యారని, గ్రామపాలన అధికారుల పరీక్షకు 110 మంది హాజరుకాగా, 19 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. నేత్రపర్వంగా నిత్యకల్యాణం భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో అదివారం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిత్యకల్యాణం కనుల పండువగతా నిర్వహించారు. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామర్చన తదితర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
ఇన్స్టా ప్రియుడి కోసం..బిడ్డను బస్స్టాండ్లో వదిలేసిన తల్లి.. ఆపై
సాక్షి,నల్గొండ: సోషల్ మీడియా వినియోగం మంచికి ఉపయోగిస్తే వరం.. అదే చెడుకి ఉపయోగిస్తే శాపం. అలాంటి సోషల్ మీడియా అతి వినియోగం కొందరిని పెడదారులు పట్టేలా చేస్తుంటే.. మరికొందరిని భావోద్వేగాలకు గురి చేస్తుంది. నిండు జీవితాల్ని చేజేతులా నాశనం చేసేలా ఉసిగొల్పుతోంది. తాజాగా నల్గొండ బస్టాండ్లో జరిగిన సంఘటనలో.. ఓ తల్లి ఇన్స్టాగ్రామ్లో ప్రియుడి మోజులో తన మాతృత్వాన్ని విస్మరించింది. కన్న కొడుకుని బస్టాండ్లో వదిలేసింది.అంతటితో ఆగలేదు.. ఇన్స్టా ప్రియుడితో కలిసి పరారయ్యింది. ఆ తర్వాత ఏమైందంటే జిల్లా పోలీసుల వివరాల మేరకు..ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడి కోసం అబం శుభం తెలియని పసిపిల్లాడిని బస్టాండ్లో వదిలేసి అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చిందో మహిళ.ఆదివారం తన కొడుకుని తీసుకుని నల్గొండ బస్టాండ్కు వచ్చింది. బస్టాండ్లోని ఓ ప్రదేశంలోని కూర్చొబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి..అప్పటికే తనకోసం ఎదురు చూస్తున్న ప్రియుడితో కలిసి వెళ్లింది.అయితే ఇప్పుడే వస్తానన్న అమ్మ రాకపోయే సరికి బాలుడిలో భయం మొదలైంది. అమ్మా.. అమ్మా అని పిలిచినా ఆలకించలేదు. దీంతో ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ సమయంలో ప్రయాణికులు బాలుడిని ఓదార్చి పోలీసులకు సమాచారం అందించారు. బస్టాండ్కు చేరుకున్న పోలీసులు బాలుడిని సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఆచూకీ తెలుసుకుని బాలుడిని తండ్రి చెంతకు చేర్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
అనర్హులకు ఇళ్లు ఇస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తాం
డిండి : ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు కేటాయిస్తే సంబంధిత అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం డిండి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గ్రామపంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించుకోలేని స్థితిలో ఉన్న వారికి స్వయం సహాయక సంఘం నుంచి రుణం ఇప్పించేలా చూడాలని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ను ఆదేశించారు. అంతకు ముందు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఎరువులు స్టాక్, రిజిస్టర్, ఈ పాస్ మిషన్ను పరిశీలించారు. స్థానిక ఐటీఐ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను పరిశీలించి కోర్సులు, అడ్మిషన్ల వివరాలను ప్రిన్సిపాల్ రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతిగృహం ఏర్పాటు చేసేందుకుగాను ఐదు ఎకరాల స్థలాన్ని చూడాలని తహసీల్దార్ శ్రీని వాస్గౌడ్కు సూచించారు. ఆమె వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి, చత్రునాయక్, ఎంపీడీఓ వెంకన్న ఉన్నారు. -
నిందితులకు శిక్షపడాలి : ఎస్పీ
నల్లగొండ : నిందితులకు శిక్షపడే విధంగా పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అదుపు చేయడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు. నేరం చేసే వాడికి శిక్ష పడాలి, నేరం చేయని వారికి రక్షణగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీలు నర్సింగరావు, శివ నాయుడు.. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసుల్లో చట్ట ప్రకారం నిందితులను సెర్చ్ చేసే విధానం, స్వాధీన పరుచుకున్న గంజాయిని సీజ్ చేయడం, నిందితులకు కోర్టులో శిక్ష ఎలా పడాలనే అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, రవి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
భవిష్యత్ తరాలకు మొక్కలు అవసరం
నల్లగొండ : భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్లను నరికి వేయడం, అడవుల నిర్మూలన తదితర కారణాల వల్ల కాలుష్యం పెరిగి మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందన్నారు. భావి పౌరులైన విద్యార్థులు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడమే కాకుండా, వాటికి సంరక్షించాలని సూచించారు. మహిళలు బాగా చదువుకోవాలని, చదువు ఒక్కటే సమస్యలకు పరిష్కార మార్గం అన్నారు. మహిళా డిగ్రీ కళాశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తెలిపారు. మార్చిలో డిజిటల్ తరగతులను ప్రారంభించామని, బయోటెక్నాలజీ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సర్కారు స్కూళ్లలో ‘సరిగమపదనిస’
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇకనుంచి సంగీత పాఠాలు నేర్పించనున్నారు. ఇందుకు గాను పీఎంశ్రీ (ప్రైం మినీస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద జిల్లాలో 42 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలోని 18 పాఠశాలల్లో సంగీత పాఠాలు నేర్పాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంగీతం నేర్పిస్తారు. ఎంపిక చేసిన పాఠశాలలకు ఇప్పటికే సంగీత వాయిద్య పరికరాలు పంపారు. అందులో డోలక్, తబల, హార్మోనియం, వయోలిన్ వంటివి ఉన్నాయి. కానీ.. సంగీత ఉపాధ్యాయుల నియామకంపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎంపికై న పాఠశాలలు ఇవే.. సంగీత పాఠాలు నేర్పేందుకు 18 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో 10 తెలంగాణ మోడల్ స్కూళ్లు (గుండ్లపల్లి, గుర్రంపోడు, నాంపల్లి, శాలిగౌరారం, మర్రిగూడ, కనగల్, నిడమనూరు, చింతపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి), 3 జెడ్పీహెచ్ఎస్లు (పెద్దవూర, హాలియా, దామరచర్ల), 3 కేజీబీవీలు (కట్టంగూర్, చందంపేట, పీఏపల్లి), 2 గిరిజన బాలికల గురుకుల పాఠశాలలు (దేవరకొండ, కొండమల్లేపల్లి) ఉన్నాయి. సంగీతంతో ఏకాగ్రత అయితే మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో ఇంటర్ వరకు విద్యనందిస్తున్నారు. దీంతో ఎక్కువగా ఆయా పాఠశాలలనే సంగీతం నేర్పించేందుకు ఎంపిక చేశారు. సంగీత సాధనతో విద్యార్థుల్లో జ్ఞానం, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. సంగీతం శ్రవణానందంగా ఉంటుంది కాబట్టి పిల్లలు వాటిని నేర్చుకునేందుకు ఆసక్తి చూపనున్నారని విద్యా శాఖ భావిస్తోంది. సంగీత ఉపాధ్యాయులు దొరికేనా.. ప్రభుత్వం విద్యార్థులకు సంగీత పాఠాలు నేర్పించాలని భావించడం శుభ పరిణామం. అందుకు సంబంధించి వాయిద్య పరికరాలను పాఠశాలలకు పంపించింది. ఒక టీచర్కు నాలుగు రకాల సంగీత పరికరాలపై ప్రావీణ్యం ఉండడం అరుదు. అలాంటి సందర్భంలో విద్యార్థులకు సంగీతం నేర్పాలంటే నాలుగు రకాల బోధకులు అవసరం. ఇలా సంగీత ఉపాధ్యాయులు దొరకడం కాస్త కష్టమే. ఆదేశాలు రావాల్సి ఉంది జిల్లాలో 18 పాఠశాలలకు వాయిద్య పరికరాలు వచ్చాయి. సంగీత బోధకుల నియామకం విషయంలో ఇంకా పైఅధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. వారిచ్చే ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటాం. – భిక్షపతి, డీఈఓ ఫ 18 పాఠశాలలను ఎంపిక చేసిన విద్యా శాఖ ఫ ఆయా పాఠశాలలకు చేరిన వాయిద్య పరికరాలు ఫ ఉపాధ్యాయుల నియామకంపై కొరవడిన స్పష్టత -
జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచందర్ను ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించింది. నాణ్యమైన విద్యనందించాలిమాడుగులపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం మాడుగులపల్లి మండలంలోని కుక్కడం కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని, పాఠశాల పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో ఎస్ఓ వసంత, సిబ్బంది సునీత ఉన్నారు. టీబీ వ్యాధి నివారణకు కృషినాగార్జునసాగర్ : టీబీ వ్యాధి నివారణకు జిల్లాలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి తెలిపారు. శుక్రవారం నాగార్జునసాగర్లోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్, బస్తీ దావఖానను ఆయన సందర్శించారు. అనంతరం దత్తత తీసుకున్న పేషంట్లకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. టీబీ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. చికిత్స తీసుకుంటే టీబీ పూర్తిస్థాయిలో నయమవుతుందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది గంగాబాయి, ఝాన్సీ, లింగయ్య, తిరుమలాచారి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. జీపీఓ పరీక్షకు ఏర్పాట్లు పూర్తినల్లగొండ : గ్రామ పాలనాధికారుల (జీపీఓ) నియామకానికి ఈనెల 27న ననల్లగొండలోని ఎన్జీ కాలేజీలో నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని.. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాని చేరుకోవాలని సూచించారు. లబ్ధిదారుల నమోదు పెంచాలిమిర్యాలగూడ టౌన్ : ప్రతి అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారుల నమోదును పెంచాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని వాసవి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారంపై పిల్లలకు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. పోషణ్ అభియాన్ డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ సతీష్ మాట్లాడుతూ పోషణ ట్రాకర్స్ యాప్లో సాంకేతిక లోపాల, సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ సీడీపీఓ ఆర్.మమత, సూపర్వైజర్ రాధిక, నాగమణి, లీలాకుమారి, పద్మ, వాణి, హేమాదేవి, మహ్మద్ నజీమాబేగం తదితరులున్నారు. -
గ్రామీణ రోడ్ల అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గ్రామీణ రోడ్లును హైబ్రీడ్ ఆన్యూటీ మోడ్లో (హ్యామ్) అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న రోడ్లను విస్తరిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు వాహనదారులు, ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక చొరవ హ్యామ్ పద్ధతిలో ఉమ్మడి జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి మొదటి మూడు ప్యాకేజీల్లోనే అవకాశం కల్పించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆర్అండ్బీ శాఖ మంత్రి కావడంతో జిల్లా రోడ్లను మొదటిలోనే అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ పద్ధతిలో 17 ప్యాకేజీలుగా రోడ్ల అభివృద్ది, విస్తరణ చేయనుండగా, అందులో మూడు ప్యాకేజీల్లో ఉమ్మడి జిల్లాలోని 60 రోడ్ల అభివృద్ధికి అవకాశం కల్పించారు. సర్కిల్–1లో ఐదు నియోజకవర్గాల్లో.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని నియోజకవర్గాలను రెండు సర్కిళ్లుగా విభజించి, రెండు ప్యాకేజీలుగా పనులను గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాను ప్రత్యేక ప్యాకేజీగా తీసుకున్నారు. మొదటి సర్కిల్లో రూ.302.45 కోట్లతో 18 రోడ్లను అబివృద్ధి చేయనున్నారు. నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 223.12 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపట్టనుండగా.. ఇందులో 38.4 కిలోమీటర్ల పొడవున డబుల్ రోడ్లుగా విస్తరించనున్నారు. సర్కిల్–2లో ఏడు నియోజకవర్గాలు.. నల్లగొండ సర్కిల్–2 పరిధిలో 26 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రూ.320.80 కోట్లతో 314.66 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక సర్కిల్ కింద రూ.389.73 కోట్ల వ్యయంతో 287.50 కిలోమీటర్ల పొడవునా 16 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఫ ఉమ్మడి జిల్లాలో 60 రహదారుల విస్తరణఫ హైబ్రీడ్ అన్యూటీ మోడ్లో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఫ రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ఫ టెండర్లను పిలిచేందుకు అధికారుల కసరత్తు -
మూసీ రెండు గేట్ల ఎత్తివేత
● 1,300 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ● పరీవాహక ప్రాంతాలు అప్రమత్తంకేతేపల్లి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. వారం రోజులుగా మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. గురువారం రాత్రి 1,423 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా శుక్రవారం ఉదయానికి 1,650 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల(4.46 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 643.50అడుగులు (4.07టీఎంసీలు) నీరు ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. శుక్రవారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సూర్యాపేట డివిజన్ ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ ఉదయం 10 గంటలకు మూసీ ప్రాజెక్టు 3, 8 నంబరు క్రస్ట్గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 1300 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. కుడి కాల్వకు 167 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 215 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ నీటి విడుదల నేపథ్యంలో దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావు, మూసీ ఏఈలు ఉదయ్, కీర్తి పాల్గొన్నారు. మొరాయించిన గేట్లు.. విద్యుత్ లోవోల్టేజీ సమస్య కారణంగా మూసీ గేట్లు మొరాయించాయి. మూసీ ప్రాజెక్టుకు సూర్యాపేట మండలం ఎర్కారం విద్యుత్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరపరా అవుతుంది. అయితే లోవోల్టేజీ సమస్య కారణంగా అధికారులు గేట్లు ఎత్తేందుకు స్విచ్ ఆన్ చేసినప్పటికీ గేట్లు పైకి లేవలేదు. దీంతో డ్యాం వద్ద అందుబాటులో ఉన్న జనరేటర్ సహాయంతో అధికారులు గేట్లను పైకెత్తారు. -
కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి స్వాధీనం
ఫ శ్రావణం.. శుభప్రదం చేనేత రుణాలు మాఫీచేయాలినల్లగొండ టౌన్ : చేనేత సహకార సంఘాల రుణాలను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం మాఫీ చేయాలని చేనేత సహకార సంఘాల సూర్యాపేట, నల్లగొండ జిల్లాల సమన్వయ కమిటీ అధ్యక్షుడు చిలుకూరి లక్ష్మీనరసయ్య కోరారు. శుక్రవారం నల్లగొండలోని పద్మశాలి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలలో నేసిన వస్త్రాలు నిలువలు పేరుకుపోయాయన్నారు. వాటిని ధాన్యం తరహాలో ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి టెస్కో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత కార్మికులకు రూ.5లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, సత్యనారాయణ, దత్త గణేష్, నల్ల సత్యనారాయణ, జల్లా నరసింహ, కర్నాటి యాదగిరి, పున్న వెంకటేశం, పుట్టబత్తుల శ్రీనివాస్, కడేరు భిక్షం తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ : మండలంలోని తడకమళ్ల గ్రామంలో సర్వే నంబర్ 719లో కబ్జాకు గురైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్స్టేషన్కు కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసుకోగా ఈనెల 22న ‘సాక్షి’లో ‘సబ్స్టేషన్ భూమి కబ్జా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. కబ్జాకు గురైన స్థలాన్ని గురువారం సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆ స్థలంలో ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్కుమార్ మాట్లాడుతూ సర్వే నంబర్ 719లో సబ్స్టేషన్కు కేటాయించిన భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించామని, 1.12 ఎకరాల భూమిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డును ఏర్పాటు చేశామని, ఎవరైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ జొన్నపాల కృష్ణయ్య, పోలీస్సిబ్బంది ఉన్నారు. -
భారీ వర్షాలు.. మూసీ గేట్లు ఓపెన్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రాజెక్ట్లు, నదులు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మూసీ వరద నీటితో నిండిపోయింది. దీంతో, అధికారులు.. ఈరోజు మూసీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.శుక్రవారం ఉదయం మూసీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. మూడో, ఎనిమిదో గేటును ఓపెన్ చేసి నీటికి దిగువకు విడుదల చేశారు అధికారులు. మూసీ రెండు గేట్ల ద్వారా 1293 క్యూసెక్కుల నీటి విడుదలవుతోంది. అయితే, ముందుగా రెండు గేటును తెరిచేందుకు అధికారులు ప్రయత్నించగా.. మొరాయించడంతో సమస్య ఎదురైంది. దీంతో, అధికారులు.. మూడో గేటును ఓపెన్ చేశారు. కాగా, మూసీ ప్రాజెక్ట్ గేట్లకు సంబంధించి గత వేసవిలోనే మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ చేయకపోవడంతో సమస్య తలెత్తింది. -
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
శాలిగౌరారం: జిల్లాలోని పీహెచ్సీలలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్య సిబ్బంది నిరంతరం కృషిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శాలిగౌరారంలోని పీహెచ్సీ, పీఏసీఎస్, ఎంపీడీఓ కార్యాలయాలు, కేజీబీవీని గురువారం తనిఖీ చేశారు. పలు విషయాలపై ఆరా తీశారు. అనంతరం అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్లు, పీఎం ఆవాస్ యోజన, వన మహోత్సవం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరువులు, యూరియా కృత్రి కొరత సృష్టించవద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ అశోక్రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, డీఏఓ శ్రవణ్కుమార్, తహసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఏఓ సౌమ్యశృతి, మండల వైద్యాధికారి సూర్యశిల్ప, సిబ్బంది ఉన్నారు. పాఠాలు బోధించిన కలెక్టర్.. శాలిగౌరారం మండలకేంద్రంలో గురువారం ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి.. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి వెళ్లి విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి గదికి వెళ్లి పాఠాలు బోధించారు. చాక్పీస్ తీసుకొని బోర్డుపై వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాలను రాస్తూ విద్యార్థుల విద్యా సామర్థాలను పరీక్షించింది. అనంతరం విద్యార్థులతో బోర్డుపై రాయిస్తూ సందేహాలను నివృత్తి చేశారు. తల్లిదండ్రుల కలలను నిజం చేసుకునేందుకు కష్టపడి చదవాలని సూచించారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
గ్రామం యూనిట్గా ఓటరు జాబితా
ఫ రూపకల్పనకు ఉన్నతాధికారుల ఆదేశాలు ఫ ఇప్పటికే మండలం యూనిట్గా పూర్తి ఫ ఎంపీడీఓల లాగిన్ నుంచి టీ పోల్లో అప్లోడ్ ఫ సిద్ధమవుతున్న పంచాయతీ అధికారులు కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా.. కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు సభ్యులు ఉంటే ఒకరి ఓటు ఒక వార్డులో, ఇంకొకరి ఓటు మరో వార్డులో ఉన్నాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈసారి గ్రామం యూనిట్గా ఓటరు జాబితా తయారీకి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నల్లగొండ: గ్రామం యూనిట్గా మళ్లీ ఓటరు జాబితా తయారు కానుంది. ఇప్పటికే మండలం యూనిట్గా అధికారులు ఓటరు జాబితా తయారు చేశారు. తాజాగా ఉన్నతస్థాయి అధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో వార్డుల వారీగా ఓటరు జాబితా తయారీకి పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల జాబితా ప్రకారం జిల్లాలో 10,53,920 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే మండలం యూనిట్గా.. ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారన్న సంకేతాలతో అప్పట్లో ఎన్నికల కమిషన్ సూచనలతో పంచాయతీరాజ్ శాఖ మండలాన్ని యూనిట్గా తీసుకుని ఓటరు జాబితాను సిద్ధ చేసింది. ఆయా గ్రామాల్లో వార్డుల వారీగా జాబితా తయారు చేసి మండలాల వారీగా ఎంపీడీఓలకు అందించారు. ఎంపీడీఓలు వారి లాగిన్ నుంచి టీ పోల్లో అప్లోడ్ చేసి పెట్టారు. అయితే గతంలో 2023లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా జాబితాను సిద్ధం చేశారు. ఇప్పుడు వార్డుల వారీగా.. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఓటరు జాబితా తయారు చేయాలని ప్రస్తుతం పంచాయతీ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి..వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇదంతా గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్వహించాలి. ఓటరు జాబితా సిద్ధమైన తర్వాత దాన్ని వారి లాగిన్ ద్వారా టీ పోల్లో అప్లోడ్ చేయాలి. ఎంపీడీఓలు దాన్ని పరిశీలించి డీపీఓకు పంపుతారు. మార్పులు, చేర్పులకూ అవకాశం జిల్లాలో మొత్తం 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో పార్లమెంట్ ఎన్నికల జాబితా ప్రకారం 10.53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇప్పటికే కొత్తగా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారితోపాటు మరికొందరు చనిపోయిన వారున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం వరకు కూడా ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. వీటన్నింటి ఆధారంగా గ్రామం యూనిట్గా మళ్లీ ఓటరు జాబితా సిద్ధం చేయనున్నారు. పంచాయతీలు 869వార్డుల సంఖ్య 7,494ఓటర్లు 10,53,920 ఆదేశాలు వచ్చాయి గ్రామం యూనిట్గా ఓటరు జాబితాను తయారు చేయాలని పైఅధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాను తయారు చేస్తాం. పంచాయతీల సిబ్బంది అంతా తప్పులకు ఆస్కారం లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలి. మరో రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తాం. – వెంకయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఈ జాబితాతోనే ‘పరిషత్’ పోరుకు.. ప్రస్తుతం గ్రామం యూనిట్గా తయారు చేసే ఓటరు జాబితాతోనే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరపనున్నట్టు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా గ్రామాల్లో మొదటి వార్డు మొదలు చివరి వార్డు వరకు ఓటరు జాబితాలో తప్పులు పోకుండా రూపొందించనున్నారు. -
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
చిట్యాల: అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో రోజూ లైబ్రరీ పీరియడ్లను కేటాయించి విద్యార్థులు అక్షర గుర్తింపు, ధ్వని గుర్తింపు, ధారళంగా చదివే విధంగా వారిలో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించాలని డీఈఓ బొల్లారం భిక్షపతి పేర్కొన్నారు. చిట్యాలలోని జెడ్పీహెచ్ఎస్లో గురువారం నిర్వహించిన ప్రభుత్వ ప్రాథమిక స్థాయి స్కూల్ క్లాంపెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు గణితంలో చతుర్విద ప్రక్రియలు సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరరీ) పరీశీలకుడు శ్రీధరాచార్యులు మాట్లాడుతూ విద్యార్థులల్లో పఠనాసక్తి పెంచాలన్నారు. ఈ సమావేశంలో ఎంఈఓ పానుగోతు సైదానాయక్, చిట్యాల, గుండ్రాంపలి స్కూల్ క్లాంపెక్స్ ప్రధానోపాధ్యాయులు మాధవి, వెంకట్రెడ్డి, ఆర్పీలు అశోక్రెడ్డి, అంజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ముగిసిన అథ్లెటిక్స్ మీట్
చలకుర్తిలోని నవోదయ విద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ మీట్ గురువారంతో ముగిసింది. పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 576.00 అడుగులు ఇన్ఫ్లో : 1,21,400 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 6,283 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 3,030 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : నిల్ ఎడమకాల్వ ద్వారా : 3,972 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 1,800 క్యూసెక్కులు వరద కాల్వకు : నిల్- 8లోనిండు కుండలా ఉన్న మూసీ ప్రాజెక్టు -
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్లగొండ: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని పేర్కొన్నారు. ఈ సమయంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని వాహనాలు నెమ్మదిగా నడపాలని సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద, శిథిల భవనాల కింద ఉండొద్దని పేర్కొన్నారు. రైతులు కరెంటు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాన్స్ఫార్మర్లు ముట్టుకోవద్దని తెలిపారు. వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు ఈతతోపాటు చేపలు పట్టడానికి వెళ్లవద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో ఆపదలో ఉంటే డయల్ 100కి కాల్ చేయాలని కోరారు. ఎంఆర్పీకే ఎరువులను విక్రయించాలికట్టంగూర్ : రైతులకు ఎంఆర్పీకే ఎరువులను విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) పి.శ్రవణ్కుమార్ దుకాణాదారులకు సూచించారు. గురువారం కట్టంగూర్లోని ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రశీదు బుక్లను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి పీఓఎస్ మిషన్ ఆన్లైన్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకుని మాట్లాడారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ గిరిప్రసాద్, ఏఈఓలు ఉన్నారు. రేపు కార్గిల్ విజయ్ దివస్నల్లగొండ: ఈ నెల 26న ఉదయం 11 గంటలకు నల్లగొండలోని మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించనున్నట్లు ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.పాపిరెడ్డి, జనరల్ సెక్రటరీ కె.వెంకటాచారి, ట్రెజరర్ కె.భాస్కర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వీరజవాన్లకు నివాళులర్పించిన అనంతరం మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. మాజీ సైనికులు, అమర జవాన్ల కుటుంబ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏటీసీ, ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులునల్లగొండ: నల్లగొండలోని ప్రభుత్వ బాలికల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ), ఐటీఐ కోర్సుల్లో 2025–26, 2027 సంవత్సరాలకు గాను ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల న్యూ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జంజిరాల వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత, ఫెయిల్ అయిన విద్యార్థులు iti.telangana.gov.in వెబ్సైట్లో వారి ఫోన్ నంబర్లతో ఈ నెల 31లోగా రిజిస్టర్ చేయించుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ బాలికల న్యూ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలని కోరారు. పశువ్యాధులతో జాగ్రత్తమాడుగులపల్లి: సీజనల్గా పశువులకు సోకే వ్యాధులతో పశువైద్యులు జాగ్రత్తంగా ఉంటూ రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పశువైద్యాధికారి రమేష్ అన్నారు. గురువారం మాడుగులపల్లి మండలం పాములపాడు, మాడుగులపల్లి పశువైద్యశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి మాట్లాడారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆస్పత్రికి వచ్చే రైతులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. పాడి రైతులు.. పశువైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఆయన వెంట మండల పశువైద్యాధికారి వినయ్కుమార్, విక్రమ్, శ్రీలత, నవీన్, మహబూబ్అలీ, జయమ్మ ఉన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలి
నకిరేకల్ : తెలంగాణలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలు అసంతృప్తిలో ఉన్నారని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు అధిక స్థానాలు గెలిచి సత్తాచాటాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ పిలుపునిచ్చారు. నకిరేకల్లోని సువర్ణ గార్డెన్లో గురువారం స్థానిక మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మోసం చేసే పనితప్ప మరొకటి లేదన్నారు. కేసీఆర్ పాలనలో దేశంలోనే ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందాయన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నా రు. జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్నారు. దమ్ముంటే నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నాయకులపై కక్షగట్టి అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాలన రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్, మార్కెట్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్రెడ్డి, రాచకొండ శ్రీనివాసగౌడ్, మాజీ జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, నాయకులు మారం వెంకట్రెడ్డి, సందినేని వేంకటేశ్వరరావు,సోమ యాదగిరి, పెండెం సదానందం,బుడుగల శ్రీనివాస్యాదవ్, పల్లే విజయ్, ౖదైద పరమేషం,సామ శ్రీనివాస్రెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే -
చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తులు
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి వారి ఆలయం గురువారం రాత్రి భక్తులతో పోటెత్తింది. అమావాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సాయంత్రం నుంచే ఆలయ సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి ఆలయంలో స్వామివారికి లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజలు కొనసాగాయి. భక్తులు స్వామివారి దర్శనానికి వర్షంలో కూడా బారులుదీరారు. వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పూజా కార్యక్రమాల్లో ఈఓ నవీన్కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, భక్తులు పాల్గొన్నారు. -
ఆగని కబ్జాల పరంపర
ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి పట్టణంలోని తాళ్లగడ్డలో ప్రభుత్వ భూముల కబ్జాలపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసేటప్పుడు మిగిలిన కొంత ఖాళీ స్థలాలను కొందరు ఆక్రమించుకుని అమ్ముకున్నారు. ప్రభుత్వం సర్వే చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. – బంటు లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్, తాళ్లగడ్డ హెచ్చరించి వదిలేశాం.. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తాళ్లగడ్డలో ప్రభుత్వ భూముల్లో చదును చేస్తున్న సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లాం. జేసీబీని స్వాధీనం చేసుకున్నాం. మరోసారి ప్రభుత్వ భూముల జోలికి వెళ్లబోమని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో హెచ్చరించి వదిలేశాం. లేఅవుట్ వేసిన తరువాత మిగిలిన ఖాళీ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపైనే ఉంటుంది. – సురేష్కుమార్, తహసీల్దార్, మిర్యాలగూడ మిర్యాలగూడలో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఫ చెరువులు, నాలాలకు ఆనుకుని ఖాళీ స్థలం ఉంటే ఖతమే.. ఫ నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మకాలు ఫ పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ భూముల కబ్జాల పరంపర కొనసాగుతోంది. పట్టణ శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. చెరువులు, నాలాలకు ఆనుకుని ఉన్న భూములను కొందరు ప్లాట్లుగా చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పందిర్లపల్లి చెరువుశిఖం భూములను చదును చేసి కబ్జా చేస్తున్న విషయం సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు పెద్దచెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను కాజేసేందుకు కొందరు యత్నిస్తున్నారు. రూ.కోటిన్నర విలువ చేసే భూములు మాయం తాళ్లగడ్డ చెరువుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. వాటికి నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించి రూ.లక్షలకు విక్రయించుకున్నారు. ఇందిరమ్మ కాలనీకి లేఅవుట్ చేసే సమయంలో క్రాస్ బిట్లు, స్థలాలు ఖాళీగా ఉండడంతో వాటికి పక్కన ఉన్న ఇంటి నంబర్కు బై నంబర్ వేసి పట్టా సర్టిఫికెట్లను సృష్టించి రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు విక్రయించారు. ఇలా సుమారు రూ.కోటిన్నర విలువ చేసే ప్రభుత్వ భూములు మాయమాయ్యాయి. అదేవిధంగా సర్వే నంబర్ 57, 58, 59లో 5, 6,7 ఇందిరమ్మ లేఅవుట్లలో సుమారు 22 ప్లాట్లను అనధికారికంగా విక్రయించుకున్నారు. తాళ్లగడ్డ నుంచి తడకమళ్లకు వెళ్లే ప్రధాన రహదారికి కుడి వైపున కాల్వను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ఓ రాజకీయ నాయకుడు మంగళవారం జేసీబీలతో చదును చేస్తుండగా రెవెన్యూ అధికారులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్లి అడ్డుకుని జేసీబీని స్వాధీనం చేసుకుని హెచ్చరించి వదిలేశారు. ఉన్నతాధికారి ఉన్నా.. మిర్యాలగూడ డివిజన్ను ప్రభుత్వం గుర్తించి ఐఏఎస్ స్థాయి అధికారిని సబ్ కలెక్టర్గా నియమించింది. ఉన్నతస్థాయి అధికారి ఉన్నప్పటికీ పట్టణ శివారులోని ప్రభుత్వ భూముల కబ్జాలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కళ్లెదుటే భూములను కాజేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కాంగ్రెస్ రూపొందించింది ముస్లిం రిజర్వేషన్ బిల్లు
చౌటుప్పల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది బీసీ రిజర్వేషన్ బిల్లు కాదని, అది పూర్తిగా ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల పేరుతో కేవలం ఒక మతానికి రిజర్వేషన్లు తీసుకురావడానికి బీజేపీ వ్యతిరేకమని పేర్కొన్నారు. 285 సెక్షన్ సవరణ చేసి పంపించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయకుండానే గవర్నర్కు పంపించిందని ఆరోపించారు. 42శాతం రిజర్వేషన్లో 10శాతం ముస్లింలకే దక్కతుందన్నారు. నిజమైన బీసీలకు కాకుండా మతానికి రిజర్వేషన్లు అందించే కాంగ్రెస్ పన్నాగాన్ని బీసీ సమాజం గుర్తించాలన్నారు. కాంగ్రెస్ కుట్రను బయటపెడుతున్న బీజేపీని కావాలని బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇచ్చేది, ఇస్తున్నది కేవలం బీజేపీ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా నిలువవని తెలిసే కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మండల, మున్సిపల్ కమిటీల అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పన, మాజీ సర్పంచ్లు రమనగోని దీపిక, రిక్కల సుధాకర్రెడ్డి, నాయకులు గుజ్జుల సురేందర్రెడ్డి, శాగ చంద్రశేఖర్రెడ్డి, పోలోజు శ్రీధర్బాబు, కంచర్ల గోవర్ధన్రెడ్డి, చినుకని మల్లేశం, బత్తుల జంగయ్య, మన్నె ప్రతాపరెడ్డి, ఊడుగు వెంకటేశం, కట్ట కృష్ణ, పిల్ల బుచ్చయ్య, కడారి అయిలయ్య తదితరులు ఉన్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండలం వంకమామిడి శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన రాధారపు మల్లేశ్, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మానస(20) డిగ్రీ పూర్తి చేసి భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో 20 రోజుల క్రితం చేరి కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది. ప్రతిరోజు ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో పోచంపల్లికి వచ్చి వెళ్తోంది. బుధవారం గ్రామానికి వచ్చే బస్సు రాకపోవడంతో భూదాన్పోచంపల్లిలో బైక్ మెకానిక్ పని నేర్చుకుంటున్న తన పెద్దనాన్న కుమారుడు రాధారపు బాలకృష్ణ బైక్పై వచ్చింది. తిరిగి రాత్రి ఇంటికి అతడి బైక్ పైనే వెళ్తుండగా.. వంకమామిడి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ పక్క నుంచి నెమ్మదిగా వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పడంతో మానస ఒక్కసారిగా వెనుకకు ఒరగగా, ఆమె తల టిప్పర్కు బలంగా తాకడంతో తల పగిలి అక్కడక్కడే మృతిచెందింది. బాలకృష్ణ బైక్ పైనుంచి కిందపడిపోగా.. అతడి కాలు, చెయ్యి విరిగింది. గాయపడిన బాలకృష్ణ వెంటనే ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పాడు. బాలకృష్ణను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మానస మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. కాగా గురువారం ఇరుపక్షాల పెద్దమనుషులు కూర్చొని మృతురాలి కుటుంబానికి టిప్పర్పై ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు రూ.1.65లక్షల పరిహారం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు. -
వరి నాట్లలో మెళకువలు
త్రిపురారం: వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభంకావడంతో నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేసుకుంటున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు సైతం పైనుంచి వరద వస్తుండడంతో మరికొన్ని రోజుల్లో సాగర్ కాలువకు నీటి విడుదల కూడా చేసే అవకాశం ఉండడంతో ఆయకట్టు పరిధిలో ఇప్పటికే రైతులు నారు పెంపకం చేపట్టారు. వరి నాట్లలో సరైన మెళకువలు, ఎరువుల యాజమాన్యం పాటించాలని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. సకాలంలో దుక్కులు, దమ్ము చేసుకోవాలి.. రైతులు ప్రధాన పొలాన్ని సకాలంలో మెత్తగా దుక్కి దున్నుకోవాలి. నీళ్లు పెట్టి దమ్ము కూడా చేసుకోవచ్చు. దీంతో పిచ్చి, కలుపు మొక్కలు పొలంలో కలిసిపోతాయి. తర్వాత పొలంలోని గట్లను సమానంగా సరి చేసుకోవాలి. పచ్చిరొట్ట పైర్లు ముందుగానే సాగు చేసుకున్న రైతులు నాట్లకు 15 రోజుల ముందే దమ్ము చేసుకొని భూమిని చదును చేసుకోవాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి రెండు రోజుల ముందే నీళ్లలో దమ్ము చేసి ఆ తర్వాత నాట్లు వేస్తే మంచిది. ఎరువుల యాజమాన్యం.. ఫ నత్రజని మూడు సమభాగాలుగా వేసి నాటుకు ముందు దమ్ములో, అంకురం దశలో, బురద పదునులో సమానంగా చల్లుకోవాలి. ఎరువులు చల్లిన 30 గంటల తర్వాత పొలానికి నీరు పెట్టడం ఉత్తమం. ఫ నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో గాని యూరియా రూపంలో లేదా నానో యూరియా రూపంలో అందించవచ్చు. శాస్త్రవేత్తల సూచనల మేరకు యూరియాను తక్కువగా వినియోగించుకోవాలి. ఫ 40 కిలోల యూరియా 10 కిలోల వేప పిండి, లేదా 250 కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. ఫ మట్టి పరీక్షల ఆధారంగా మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేసుకోవాలి. ఫ పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేసుకోవాలి. చెల్క నేలల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగభాగాన్ని వేసుకోవాలి. ఫ కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో గాని అంకురం ఏర్పడే దశలో గాని వేయకూడదు. పూర్తిగా దమ్ములో వేసుకోవాలి. ఫ ముదరు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫారసు కంటే 25 శాతం పెంచి 70 శాతం దమ్ములో, మిగతా 30 శాతం అంకురం దశలో వేయాలి. కాలి బాటలు సకాలంలో తీసుకోవాలి.నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటేనే నాటు త్వరగా కుదురుకుంటుంది. నాలుగు నుంచి ఆరు ఆకులు ఉన్న నారును ఉపయోగించాలి. దీర్ఘ, మధ్యకాలిక నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ప్రస్తుతం వానాకాలం సీజన్లో చదరపు మీటరుకు 40 కదుళ్లు ఉండేవిధంగా చూసుకోవాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20సె.మీ. కాలి బాటలు తీసుకోవాలి. కాలి బాటల వల్ల వరి పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేసుకోవచ్చు. కలుపు మందులు, ఎరువులు, పురుగు మందులు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. పైరు పరిస్థితిని తెలుసుకుంటానికి కాలి బాటలు తోడ్పడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ల సంఖ్యను నిర్ధారించుకోవాలి. భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేవిధంగా చూసుకోవాలి. ముదురు నారును నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి 4 నుంచి 5 మొక్కల చొప్పున నాటుకోవాలి. ఇవి చేయకూడదు. భాస్వరం ఎరువులతో కలిపి జింక్ సల్ఫేట్ను వేయకూడదు. కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలి. భాస్వరంలో జింకును కలిపి వేయడం వల్ల రసాయనిక చర్య జరిగి పంటకు ఫలితం ఉండదు. జింక్ సల్ఫేట్ ద్రావణంలో సైతం పురుగు, తెగుళ్ల మందులు కలపరాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలతో ఎరువులు, చీడపీడల నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం. ఫ కంపాసాగర్ కేవీకే సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు -
ద్విచక్ర వాహనం ఢీకొని..
కనగల్: రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన కనగల్ మండలం దర్వేశిపురం గ్రామ స్టేజీ వద్ద గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చండూరు మండలం బంగారిగడ్డకు చెందిన షేక్ యాసిన్(75), హలీమా దంపతులు 20ఏళ్ల కిందట కనగల్ మండలం దర్వేశిపురం గ్రామానికి వలస వచ్చి గ్రామ స్టేజీ వద్ద మిఠాయి దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గురువారం యాసిన్ తన దుకాణం అవతలి వైపు రోడ్డు దాటుతుండగా.. నల్ల గొండ మండలం బుద్దారం గ్రామానికి చిలుకల అనిల్ ద్విచక్ర వాహనంపై వచ్చి యాసిన్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో యాసిన్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రషీద్ఖాన్ తెలిపారు. -
యాదగిరి మాడ వీధిలో ప్రసాద టిక్కెట్ కౌంటర్
యాదగిరిగుట్ట: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడ వీధిలోని అఖండ దీపారధన పక్కన నూతనంగా ప్రసాద టిక్కెట్ కౌంటర్ను ఏర్పా టు చేస్తున్నారు. సుమారు రూ.15లక్షలతో 6 టిక్కెట్ కౌంటర్లను 70 గజాల్లో నిర్మాణం చేశారు. ప్రత్యేక గదులు, షెడ్డు, భక్తులు టిక్కెట్ కొనుగోలు చేసేందుకు వీలుగా గ్రిల్స్ సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శివాలయానికి వెళ్లే మెట్ల దారిలో లడ్డూ, పులిహోర ప్రసాద టిక్కెట్ కౌంటర్లను గతంలో ఏర్పాటు చేశారు. భక్తులు మెట్ల మార్గంలో వెళ్లి టిక్కెట్ కొనుగోలు చేసి, తిరిగి మెట్లు ఎక్కి ప్రసాద విక్రయ కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని భక్తులు స్వామిని దర్శించుకొని నేరుగా అఖండఽ దీపారాధన పక్కన ఏర్పాటు చేసిన టిక్కెట్ కౌంటర్లో లడ్డూ, పులిహోర టిక్కెట్లు కొనుగోలు చేసి అక్కడి నుంచి ప్రసాద విక్రయశాలకు వెళ్లెందుకు వీలు కల్పించారు. ప్రసాదం కొనుగోలు చేసిన భక్తులు పక్కనే ఉన్న శివాలయానికి వెళ్లి, అక్కడి నుంచి బస్టాండ్కు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద టిక్కెట్ కౌంటర్ను శ్రావణమాసం మొదటి రోజు శుక్రవారం ప్రారంభించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ముగిసిన ‘నవోదయ’ అథ్లెటిక్స్ మీట్పెద్దవూర: పెద్దవూర మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ క్లస్టర్ లెవల్ అథ్లెటిక్స్ మీట్–2025 గురువారంతో ముగిసింది. రాష్ట్రంలోని తొమ్మిది జవహర్ నవోదయ విద్యాలయాల నుంచి 68 మంది బాలురు, 46 మంది బాలికలు కలిపి మొత్తం 114 మంది ఈ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొన్నారు. రన్నింగ్, వాకింగ్, హార్డిల్స్, లాంగ్ జంప్, హైజంప్, షాట్పుట్ వంటి మొత్తం 21 అథ్లెటిక్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన 25 మంది బాలికలు, 25 మంది బాలురను ఎంపిక చేసి ఈ నెల 27న కర్ణాటక రాష్ట్రం గదక్ జిల్లా మందరాగి జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగే రీజనల్ మీట్లో పంపించనున్నట్లు జేఎన్వీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె. శంకర్ తెలిపారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నార్కట్పల్లి : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని గోపాలయపల్లి, నార్కట్పల్లి, మాదవ ఎడవల్లి, ఏపీ లింగోటం చెరువులను నింపేందుకు తొలిసారిగా బుధవారం బి.వెల్లంల ప్రాజెక్టు కుడికాల్వ నీటి విడుదల చేశారు. ప్రాజెక్టులో భాగంగా గోపలాయపల్లి వరకు కొనసాగి నిలిచిన కుడి కాల్వ పనులను నార్కట్పల్లి చెరువు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర గోపాలయపల్లి, నార్కట్పల్లి, మాదవ ఎడవల్లి, ఏపీ లింగోటం గ్రామాల రైతులు సొంత ఖర్చుతో జేసీబీని పెట్టి పూర్తిచేసుకున్నారు. దీంతో ఈ కాల్వ ద్వారా చెరువులకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన బి.వెల్లంల ప్రాజెక్టును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ప్రత్యేక చొరవతో పూర్తిచేసుకుని నేడు సాగునీటిని అందుస్తున్నామని పేర్కొన్నారు. ఈ నాగులు గ్రామాల చెరువుల నిండితే వరి వంటకు సాఉనీటి ఇబ్బందులు ఉండవన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు భూ సేకరణ పూర్తిచేసేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈలు పిచ్చయ్య, విఠలేశ్వర్, ఏఈ నవిన్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, బండా సాగర్రెడ్డి, వడ్డే భూపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐతరాజు యాదయ్య, నాయకులు దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, పుల్లెంల అచ్చాలు, పాశం శ్రీనివాస్రెడ్డి, జేరిపోతుల భరత్, నేతగాని కృష్ణ, గోసుల భద్రచలం, దొండ రమేష్, సిద్దగోని స్వామి, పశుపతి, వెంకన్న, శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ఫ బి.వెల్లంల కుడికాల్వ ద్వారా తొలిసారి చెరువులకు నీటి విడుదల -
ఉమ్మడి జిల్లాలో 60 రోడ్ల అభివృద్ధికి అనుమతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ (హామ్) పథకం కింద 60 రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. పనులను రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. నల్లగొండ– 1 పరిధిలో 223.12 కిలోమీటర్ల పొడవున 18 రోడ్లను రూ.302.45 కోట్లతో విస్తరణ అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. అలాగే నల్లగొండ–2 పరిధిలో 314.66 కిలోమీటర్ల పొడవున రూ.320.80 కోట్లతో 26 రోడ్లను అభివృద్ధి విస్తరణ పనులను చేపట్టనుంది. యదాద్రి భువనగిరి జిల్లాలో 287.50 కిలోమీటర్ల పొడవున రూ.389.73 కోట్లతో 16 రోడ్ల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఓయూ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు రామగిరి(నల్లగొండ): ఉస్మానియా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషియాలజీ, ప్రభుత్వ పాలనాశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, సైకాలజీ, ఎంకాం, ఎమ్మెస్సీ గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతోపాటు ముప్పై కాంబినేషన్లలో డిగ్రీ కోర్సులు, తొమ్మిది రకాల డిప్లొమా కోర్సులు, యోగాలో సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 15 సెప్టెంబర్ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు www. oucde.net వెబ్సైట్తోపాటు సెల్ : 9398673736, 9866977741 నంబర్లను కా ర్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు. జనగామ జిల్లాకు నల్లగొండ ఇసుకనల్లగొండ : జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జిల్లా నుంచి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇచ్చేందుకు నిర్ణయించారు. బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. ఇసుక లేని జిల్లాలకు ఇసుక రీచ్లు ఉన్న జిల్లాల నుంచి ఇసుకను సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే శాలిగౌరారం మండలం వంగమర్తి, చిత్తలూరు ఇసుక రీచ్లలో కొత్తగా గుర్తించిన ప్రదేశం నుంచి 27 హెక్టార్లలో ఇసుక తీసేందుకు రాష్ట్ర టీజీఎండీసీకి ప్రతిపాదనలు పంపేందుకు తీర్మానించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా గనుల శాఖ సహాయ సంచాలకుడు శామ్యూల్ జాకబ్ పాల్గొన్నారు. గరిష్ట నీటిమట్టానికి చేరువగా ‘మూసీ’కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమం పెరుగుతూ గరిష్ట స్థాయికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి 1,799 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం (4.66 టీఎంసీలు) గల మూసీ ప్రాజెక్టు బుధవారం సాయంత్రం నాటికి 643 (3.91 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. కుడి కాల్వకు 262 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 307 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ రూపంలో 70 క్యూసెక్కుల నీరు వృథా అవుతుందని అధికారులు పేర్కొన్నారు. సమగ్ర వికాసానికి గ్రంథాలయాలు అవసరంనల్లగొండ : చిన్నారుల సమగ్ర వికాసానికి గ్రంథాలయాలు ఎంతో అవసరమని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. బుధవారం నల్లగొండలోని డైట్లో నిర్వహించిన కాంప్లెక్స్ స్థాయి ఉపాధ్యాయుల శిక్షణలో ఆయన మాట్లాడారు. పిల్లలు వివిధ పుస్తకాలు చదవడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారన్నారు. చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకోవాన్నారు. కార్యక్రమంలో ఆర్పీ నర్సింహమూర్తి, సెక్టోరియల్ అధికారి రామచంద్రయ్య పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలి
నార్కట్పల్లి : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నార్కట్పల్లిలోని నల్లగొండ ప్లైఓవర్ ఎస్హెచ్–2, గోపాలయపల్లి దేవాలయ ఆర్చి వద్ద గల ఎన్హెచ్ 65 బ్లాక్ స్పాట్స్ను బుధవారం ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. నార్కట్పల్లి ఫ్లై ఓవర్ వద్ద గల ఎస్హెచ్–2 రోడ్డుపై రాత్రి సమయంలో హోటల్స్, వివిద షాప్స్ల వద్ద వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డుకు ఇరువైపులా రోడ్డు పైన ఉన్న షాప్లను హోటల్స్ పక్కకు జరిపించాలని నేషనల్, స్టేట్ హైవేల ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ప్రమాదాల నివారణకు జీబ్రా లైన్లు, రేడియం స్టికర్లు, హైమాస్ట్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. వెంటనే స్పందించిన అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుంతలను పూడ్పించారు. కొన్ని దుకాణాలను రోడ్డుకు దూరంగా జరిపించారు. ఎస్పీ వెంట నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్, ఎన్హెచ్65 ప్రాజెక్టు మేనేజర్ నాగకృష్ణ, ఇంజనీర్ మధుకిరణ్, కన్సల్టెంట్ కిషన్రావు, ఎస్హెచ్–2 మెయింటెన్స్ మేనేజర్ షహదుల్లా, ఇంజనీర్ మధార్, ఏఎంవీఐ సోనిప్రియ, ఎకై ్సజ్ ఎస్ఐ విజయకుమార్, రిటైర్ సీఐ అంజయ్య ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఏటీసీని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
హాలియా : పట్టణంలో నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో మెషినరీలు ఏర్పాటు చేసినందుకు త్వరగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అధికారులను ఆదేశించారు. హాలియాలోని ఏటీసీ సెంటర్ను బుధవారం వారు పరిశీలించారు. ఏటీసీలో ఉన్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, బ్యాచ్ల వివరాలను ఏటీసీ ప్రిన్సిపాల్ మల్లిఖార్జున్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, రోబొటిక్ ఎక్స్లెన్సీ, యంత్ర సామగ్రిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అనంతరం ఐటీఐ కళాశాలలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. రేషన్కార్డులు, ఇళ్లు రాని వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కలెక్టర్కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్కుమార్, హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, ఇంచార్జ్ తహసీల్దార్ రఘు ఉన్నారు -
ముసురుతో పత్తి చేలకు జీవం
నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ముసురుతో కూడిన చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 54.4మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా దేవరకొండ మండలంలో 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత వారం రోజుల క్రితం వరకు జిల్లాలో సరైన వర్షాలు లేక పత్తి చేలు వాడుబట్టాయి. ఈక్రమంలో ఐదు రోజుల క్రితం కురిసిన వర్షం పత్తి చేలకు జీవం పోసింది. అదే అదునులో రైతులు పత్తి చేలకు ఎరువు చల్లుతూ.. కలుపు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో రెండు రోజుల నుంచి ముసురు పట్టడంతో పత్తిచేలు మరింత నిగనిగలాడుతున్నాయి. ముసురు తగ్గితే రైతులు ఎరువులు పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎరువు పెట్టుకున్న రైతులు కలుపులు తీసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో 6,40,567 ఎకరాల్లో పత్తి సాగుకానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 5,02,641 ఎకరాల్లో రైతులు పత్తిసాగు చేశారు. ఫ రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులు ఫ ఏపుగా పెరుగుతున్న చేలు ఫ ఎరువులు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న రైతులు ఫ జిల్లాలో 5 లక్షల ఎకరాలకుపైగా పత్తిసాగు ఎరువు పెట్టుకున్నాం ఐదు రోజుల క్రితం కురిసిన వర్షానికి పత్తి చేనుకు ఎరువు పెట్టుకున్నాం. ఇప్పుడు రెండు రోజుల నుంచి అదునైన వర్షం కురుస్తుండంతో పత్తి చేలు ఏపుగా పెరుగుతున్నాయి. ముసురుతో కూడిన వర్షం వల్ల పత్తిచేలకు ఎంతో మేలు జరుగుతుంది. – జానపాటి రాజేంద్రప్రసాద్, రైతు, గుండ్లపల్లి పంట అంచనా సాగువిస్తీర్ణం (ఎకరాల్లో..) పత్తి 6,40,567 5,02,641 వరి 5,25,350 65,284 జొన్న 500 55 కంది 10,000 1,545 పెసర 1,200 166 వర్షం తగ్గితే ఎరువులు పెట్టుకోవచ్చు ప్రస్తుతం కురుస్తున్న ముసురుతో కూడిన వర్షంతో మెట్టపంటలకు చాలా ప్రయోజకరంగా ఉంది. వర్షం తగ్గిన వెంటనే పత్తి చేలకు ఎరువులు పెట్టుకోవడానికి అనుకూలంగాా ఉంటుంది. ఇప్పటికే ఎరువులు పెట్టిన చేలు ఏపుగా పెరుగుతాయి. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి -
మహాలక్ష్మి పథకం.. మహిళలకు వరం
రామగిరి(నల్లగొండ): మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు వరంలాంటిదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం మైలురాయి దాటిన సందర్భంగా నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెట్రో రైలులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్లే ఢిల్లీలో తాను డిగ్రీ పూర్తిచేయగలిగానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ఎంతోమంది మహిళలకు చదువు, ఉద్యోగం, వ్యాపారపరంగా మేలు జరుగుతందన్నారు. ఉచిత బస్సుల్లో ఎక్కువమంది మహిళా కండక్టర్లు, డ్రైవర్లు ఉంటే బాగుంటుందన్నారు. ఇందుకు కృషిచేసిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. నల్లగొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ సుచరిత, నల్లగొండ డిపో మేనేజర్ శ్రీనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన మధుశ్రీ, దీక్షిత, కరుణప్రియ, శ్రీలక్ష్మి, ఎస్కే ఆఫ్రిన్లకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. అలాగే రెగ్యులర్గా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిన మహిళా ప్రయాణికులు మాధవి, జ్యోతి, గీత, ఉష, అనసూయను జ్ఞాపికలతో సన్మానించారు.ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
తడకమళ్లలో సబ్స్టేషన్ భూమి పరిశీలన
మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలోని 719 సర్వే నంబర్లో గల సబ్స్టేషన్ భూమి ఆక్రమణకు గురైన విషయం వాస్తవమేనని తహసీల్దార్ సురేష్ తెలిపారు. సబ్ స్టేషన్ భూమి కబ్జా శీర్షికన ఈనెల 22 సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. దీంతో బుధవారం తడకమళ్ల సబ్ స్టేషన్ స్థలాన్ని ఆర్ఐ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే ఈ భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డు సైతం ఏర్పాటు చేశామని, ఆ బోర్డును తొలగించి భూ కబ్జాకు పాల్పడ్డారన్నారు. ట్రాన్స్కో డీఈ శ్రీనివాసచారి మాట్లాడుతూ సబ్స్టేషన్ భూమి కబ్జాకు గురైన విషయంపై రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పూర్తి విచారణ అనంతరం భూమిని స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా గ్రామంలో ఈ భూమి కబ్జా గురించి చర్చ జరుగుతున్న సమయంలో మంగళవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సును దగ్ధం చేసిన సంఘటన సంచలనంగా మారింది. ఈ బస్సు దగ్ధం ఘటనలోనూ ఈ భూ కబ్జాదారుడే ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎక్కడ చూసినా దెబ్బతిన్న రోడ్లే..
క్లాక్ టవర్ నుంచి రామగిరి వెళ్లే రోడ్డు, రామగిరి చౌరస్తా నుంచి ఎన్జీ కాలేజీ వెళ్లే రోడ్డు, బోయవాడ, విద్యుత్ శాఖ కార్యాలయం ముందు రోడ్డు, బొట్టుగూడ, దేవరకొండ రోడ్డు అంబేద్కర్ సర్కిల్, ఆర్పీ రోడ్డు, బహార్పేట, తులసి నగర్ రోడ్డు, క్లాక్ టవర్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద, సావర్కర్ నగర్ రోడ్డు, ఫ్లైఓవర్ వద్ద, పానగల్ రోడ్డు ఇలా ఎక్కడ చూసినా దెబ్బతిన్న రోడ్లతో ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. అయినా ఏ శాఖకు నీలగిరి మంటే పట్టణం పట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పరిశోధన.. బోధనలో ఓ భాగం
రామగిరి(నల్లగొండ): పరిశోధన బోధనలో భాగమని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ(నాగార్జున ప్రభుత్వ కళాశాల) స్థాపించి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మంగళవారం కాలేజీలో వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధ్యాపకులు బోధనకు పరిమితం కాకుండా పరిశోధనలో నిమగ్నం కావాలని తద్వారా సబంధిత సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుందన్నారు. స్వయం ప్రతిపత్తి కళాశాలలు పరిశోధనకు పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల హాజరుశాతం కేవలం 50 శాతమే ఉంటుందని, కనీసం 75 శాతం హాజరుశాతం ఉన్న విద్యార్థులకే ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని తెలంగాణ కళాశాల విద్య ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి అధ్యాపకుడు విధిగా హాజరు తీసుకోవాలని అన్నారు. రేమీడియల్ క్లాసులు తీసుకొని అధ్యాపకులు విద్యార్థులకు మెంటార్గా ఉండాలన్నారు. ఇతర అతిథులు మాట్లాడుతూ.. కళాశాలలో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉండడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. 70 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతులుగా తీర్చిదిద్దిన కళాశాలకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని పూర్వ విద్యార్థులను కోరారు. ఎన్జీ కళాశాలకు రానున్న కాలంలో న్యాక్–ఎ గ్రేడ్ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కళాశాల విద్య ఆర్జేడీ డాక్టర్ డీఎస్ఆర్. రాజేంద్రసింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రతి ఉద్యోగ ప్రకటనను గమనిస్తూ వాటికి సిద్ధం కావాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి ఏటా టాపర్గా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తామన్నారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి కళాశాల పేరు మీద రూ.1.5లక్షలు డిపాజిట్ చేస్తే వారి పేరు మీద లేదా వారు సూచించిన వారి పేరు మీద బంగారు పతకాలు ఇస్తామని తెలిపారు. అనంతరం 2021–2022 నుంచి 2023–24 వరకు వివిధ సబ్జెక్టులలో టాపర్గా నిలిచిన యూజీ, పీజీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ సీఓఈ డాక్టర్ జి. ఉపేందర్రెడ్డి, తెలంగాణ కళాశాల విద్య రిటైర్డ్ ఆర్జేడీ డాక్టర్ జి. యాదగిరి, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరాజు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ రాజారామ్, ఎన్జీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణప్రసాద్, రిటైర్డ్ అధ్యాపకులు డాక్టర్ లింగయ్య, డాక్టర్ లక్ష్మయ్య, మీనయ్య, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, సీఓఈ బత్తిని నాగరాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వైవీఆర్. ప్రసన్నకుమార్, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు డాక్టర్ మునిస్వామి, డాక్టర్ ఎ. మల్లేశం, సీహెచ్. సుధాకర్, ఎన్. కోటయ్య, శిరీష, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఘనంగా ఎన్జీ కాలేజీ వ్యవస్థాపక వేడుకలు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేత -
వలస కార్మికులను నిర్బంధించిన 8 మందిపై కేసు
నల్లగొండ, చందంపేట: ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను నేరెడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ ప్రాంతంలో నిర్బంధించి వెట్టిచాకిరి చేయిస్తున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ కేసు వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వెల్లడించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం బానాలకుంట గ్రామానికి చెందిన వడ్త్య జవహర్లాల్, పాయతండాకు చెందిన బాణావత్ రమేష్, ఏపీలోని అనకాపల్లి జిల్లాకు చెందిన మైనంపల్లి శివ, కారె సింహాచలం, వంక విశాఖ అలియాస్ ఇషాక్, నేరెడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీకి చెందిన ఏరిపల్లి బావోజి, తాతారావు, చాపల బంగారి, గుడిపల్లి మండలానికి చెందిన జబ్బార్ అలియాస్ జవహర్లాల్, రమేష్, శివ కుమ్మకై ్క హైదరాబాద్కు చెందిన రాజు, జగన్, విజయవాడకు చెందిన లోకేష్ను ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఈ ఏజెంట్లు ఒక్కో మనిషికి రూ.1500 చొప్పున కమిషన్ తీసుకుని, హైదరాబాద్, విజయవాడ నుంచి వలస కార్మికులకు రూ.15వేలు జీతం ఇస్తామని, రెండు రెండు గంటలు మాత్రమే పని, భోజనం, వసతి కల్పిస్తామని నమ్మబలికి వారిని దేవరకొండ, మల్లేపల్లి వరకు పంపుతారు. అక్కడి నుంచి వలస కార్మికుల సెల్ఫోన్లను నిందితులు తమ ఆధీనంలోకి తీసుకొని రాత్రివేళ బైక్లపై నేరెడుగొమ్ము మండలం బాణాలకుంట, వైజాగ్ కాలనీకి తరలించి వారితో చేపలు పట్టడం, వలలు లాగించడం చేయించేవారు. రెండు పూటలు మాత్రమే భోజనం పెట్టి, పనికి తగిన వేతనం ఇవ్వకపోగా.. వేతనం అడిగితే వేడి చేసిన సీకులతో వాతలు పెట్టేవారు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వకుండా ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న నేరేడుగొమ్ము పోలీసులు దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో ఈ నెల 12న స్పెషల్ ఆపరేషన్ చేపట్టి కార్మికులకు విముక్తి కల్పించారు. నిందితులపై నేరడుగొమ్ము పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 32 మంది వలస కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో నలుగురు బాలకార్మికులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఏజెంట్లు అయిన రాజు, జగన్, లోకేష్, వెంకన్నను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, డిండి, కొండమల్లేపల్లి సీఐలు, గుడిపల్లి, నేరడుగొమ్ము, గుర్రంపోడు ఎస్ఐలు, రెవెన్యూ, చైల్డ్ కేర్, సీడబ్ల్యూసీ బృందం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ -
విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన కారు
● మూడు గ్రామాలకు నిలిచిపోయిన కరెంట్ సరఫరానిడమనూరు: నిడమనూరు మండల కేంద్రం శివారులో సోమవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు నర్సింహులగూడెం వద్ద పంతులు పెంటోజీ పెట్రోల్ బంక్ ఎదుట 167వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న బారికేడ్లతో పాటు 11కేవీ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని రోడ్డు పక్కన ఆగిపోయింది. దీంతో శాఖాపురం, నర్సింహులగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి, మంగళవారం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పెట్రోల్ బంక్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను చూస్తే అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలకు మరమ్మతుల కారణంగా నిడమనూరు మండల కేంద్రంలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంగళవారం ఉదయం ఘటనాస్థలం నుంచి కారును పోలీసులు తరలించారు. కారు, మూడు బైక్లు ధ్వంసం.. భూదాన్పోచంపల్లి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు అజాగ్రత్తగా కారు నడపడంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన బైక్ల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారుతో పాటు మూడు బైక్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సోమవారం రాత్రి భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉడతల లోకేశ్యాదవ్, పోచంపల్లికి చెందిన సంజీవ సోమవారం రాత్రి ఫూటుగా మద్యం తాగారు. మద్యం మత్తులో రాత్రి 10.20గంటల సమయంలో కారులో పద్మానగర్ నుంచి పోచంపల్లి వైపు అతివేగంగా వస్తూ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మెయిన్ రోడ్డు పక్కన సూరేపల్లి భూషణ్ షాపు ఎదుట పార్కింగ్ చేసిన బైక్లను, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మూడు బైక్లు, కారు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత సదరు యువకులు మద్యం మత్తులో కారులో పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన లోకేష్పై చర్యలు తీసుకోవాలని బాధితుడు సూరెపల్లి భూషణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వేములపల్లి: బోరు బావి వద్ద విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గబావిగూడేనికి చెందిన నంద్యాల ఆదిరెడ్డి (58) మంగళవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని బోరు బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని రైతు నలబోతు వెంకన్న గమనించి దగ్గరుకు వెళ్లి చూడగా ఆదిరెడ్డి పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వేములపల్లి పోలీసులు తెలిపారు. -
కల్వర్టును ఢీకొని కారు దగ్ధం
కోదాడరూరల్: కల్వర్టును ఢీకొట్టిన కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ వై జంక్షన్ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాలు.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రోళ్లపూడికి చెందిన జి. అనిల్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీ పనిమీద మంగళవారం కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తూ.. మార్గమధ్యలో ఇద్దరి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో కోదాడ పట్టణ శివారులోని కొమరబండ వై జంక్షన్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అనిల్తో పాటు మరో ఇద్దరు ప్రయానికులు క్షేమంగా బయటపడ్డారు. అనిల్ కారును వెనక్కి తీస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి అథ్లెటిక్స్ పోటీలుపెద్దవూర: పెద్దవూర మండలం చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ క్లస్టర్ లెవల్ అథ్లెటిక్ మీట్–2025 నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 9 జేఎన్వీల నుంచి 57మంది బాలురు, 39 మంది బాలికలు ఈ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంటారని తెలిపారు. క్లస్టర్ లెవల్లో ఎంపికై న 25మంది బాలురు, 25మంది అమ్మాయిలు ఈ నెల 27వ తేదీన కర్ణాటక రాష్ట్రం గదక్ జిల్లా మందరాగి జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగే రీజనల్ మీట్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. -
బోధనా తీరు భేష్
మాది తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. ఎన్జీ కాలేజీలో 2020 నుంచి 2023 వరకు డిగ్రీ ఎంపీసీఎస్ చదువుకున్నాను. కళాశాలలో అధ్యాపకుల బోధన చాలా బాగుంది. అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు నాణ్యమైన బోధన అందించారు. ఫిజిక్స్, మాథ్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో టాపర్గా రావడంతో పాటు ఫిజికల్ సైన్స్ కోర్సులో ఓవరాల్ టాపర్గా నిలిచా. – జంతిక చిట్టిబాబు, ఎంపీసీఎస్ గర్వంగా ఉంది ఎన్జీ కాలేజీలో చదువుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. 2022 నుంచి 2024లో డిగ్రీ ఈహెచ్పీ గ్రూప్ చదివాను. అన్ని సబ్జెక్టుల్లో టాపర్ నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉంది. ఎన్జీ కాలేజీలో చదువుకోవాలనేది చాలా మంది విద్యార్థుల కోరిక. ఎంతో మందికి ఈ కళాశాల విద్యనందించింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన కళాశాల ప్రత్యేకత. – మసిరా ఫర్జా, ఈహెచ్పీ ● -
ఎరువుల కొరత లేదు : కలెక్టర్
నల్లగొండ : జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎరువుల ఫిర్యాదుల కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తే సంబంధిత ఎరువుల దుకాణం యజమానితోపాటు, ఆయా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ సాగు, విత్తనాలు, నాట్లు వేసే సమయంలో సైతం అవసరమైన ఎరువులను సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎరువులకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004251442కు ఫోన్ చేయాలని తెలిపారు. ఒకేసారి 30, 40 బస్తాల ఎరువులను తీసుకువెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఎరువుల షాపుల యజమానులు దుకాణం ముందు తప్పనిసరిగా ఎరువుల నిల్వ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్ పాల్గొన్నారు. వనమహోత్సవాన్ని వేగవంతం చేయాలి నల్లగొండ : వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈత చెట్లు ఎక్కువగా నాటాలని సూచించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుక, సామగ్రిపై నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారయణ్అమిత్, హౌసింగ్ పీడీ రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. -
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
రామగిరి(నల్లగొండ): నల్లగొండ ఎన్జీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో ఖాళీగా సబ్జెక్టులు బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఉపేందర్ తెలిపారు. బీబీఏ 3, బయోటెక్నాలజీ 1, బిజినెస్ అనాలటిక్స్ 1, వాణిజ్యశాస్త్రం 2, కంప్యూటర్ సైన్స్ 7, డాటసైన్స్ 1, ఎకనామిక్స్ 2, హిందీ 1, మ్యాథ్స్ 3, పిజిక్స్ 1, పొలిటికల్ సైన్స్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1, స్టాటిస్టిక్స్ 1, తెలుగు 6, ఉర్దూ 1, జువాలజీ 1 సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టు పీజీలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని, నెట్, సెట్, పీహెచ్డీ, బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా కళాశాలలె దరఖాస్తులు సమర్పించాలని, 28వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు ఓరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. జిల్లా గ్రంథాలయంలో దాశరథి జయంతిరామగిరి(నల్లగొండ) : జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడన్నారు. కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, సాహితీ మేఖల సంస్థ కార్యదర్శి పున్న అంజయ్య, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా నారాయణరెడ్డినల్లగొండ : పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా కాలం నారాయణరెడ్డి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఫణికుమార్ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో నారాయణరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దామోదర్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నర్సింహారెడ్డి, జితేందర్రెడ్డి, నరేష్, జానారెడ్డి, భిక్షంగౌడ్, నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. నేటి నుంచి ఆర్టీసీ డిపోల్లో సంబరాలురామగిరి(నల్లగొండ) : రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేసిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నల్లగొండ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు 10,31,28,640 మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసి రూ.502 కోట్ల లబ్ధి పొందినట్లు రీజనల్ మేనేజర్ జానిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఈ నెల 23న నల్లగొండ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల పరిధిలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామని, బస్సుల్లో రెగ్యులర్గా ప్రయాణించే ఐదుగురు మహిళలను గుర్తించి సన్మానిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులకు నేడు శిక్షణనల్లగొండ : జిల్లాలోని ప్రతి ప్రాథమిక పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున 100 మంది, ప్రైమరీ పాఠశాలల కాంప్లెక్స్ల నుంచి 200 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 23న నల్లగొండలోని డైట్ కాలేజీలో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రంథాలయాల నిర్వహణ, బాధ్యతలు, పఠన వ్యూహాలు, గ్రంథాలయ కమిటీల ఏర్పాటు, పుస్తకాల ఎంపిక తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. విదేశాల్లో విద్యకు దరఖాస్తులు నల్లగొండ : విదేశాల్లో విద్యనభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిది పథకం కింద 500 సీట్లు పెంచినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శశికళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల ఎస్సీ విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ లోగా tela nganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ముఖ గుర్తింపుతోనే పింఛన్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆసరా పింఛన్లను ఇక నుంచి ఫేస్ రికగ్నేషన్ (ముఖ గుర్తింపు) విధానంతో అందజేయనున్నారు. వేలి ముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా పెన్షన్లు ఇస్తున్న విధానంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరిస్తూ, సులభంగా పింఛన్ అందజేసేలా ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఫొటోలు తీసి, అప్లోడ్ చేసి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 24న పోస్టాఫీస్ల బీపీఎంలకు ఫేస్ రికగ్నేషన్ యాప్ అప్ లోడ్ చేసిన సెల్ఫోన్లు అందజేయనుంది. జూన్ నెలకు సంబంధించిన పింఛన్లు ఇంకా ఇవ్వలే దు. ఈనెల 24 తరువాత ఫేస్ రికగ్నేషన్ విధా నం ద్వారా పింఛన్లు అందజేయాలని నిర్ణయించారు. 4,58,677 మంది పెన్షనర్లు ప్రస్తుతం రాష్ట్రంలో 10 రకాల పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. ఆయా కేటగిరీల్లో పింఛన్లు పొందే వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,58,677 మంది ఉన్నారు. వారిలో వృద్ధాప్య పింఛన్దారులే అత్యధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పింఛన్దారులు 1,75,450 మంది ఉండగా, వితంతు 1,60,597 మంది, వికలాంగులు 54,110 మంది, ఒంటరి మ హిళలు 14,104 మంది ఉండగా, మిగతా వారు బీడీ వర్కర్స్, చేనేత, కల్లుగీత, హెచ్ఐవీ, ఫైలేరియా, డయాలసిస్ పేషెంట్లు పింఛన్లు పొందుతున్నారు. వేలిముద్రతో ఇబ్బందులు పింఛన్ పొందాలంటే కచ్చితంగా పోస్టాఫీసులకు వెళ్లి ఆయా అధికారుల వద్ద బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధులకు వేళ్లపై ముద్రలు చెరిగిపోయి స్కాన్ కాకపోవడంతో వారు పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు ఐరిష్లో కూడా ఒక్కోసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి వారు మండల, వార్డు అధికారులు ప్రత్యేకంగా రాసిచ్చిన పత్రం ద్వారా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధుల్లో కొందరు రోగాల బారిన పడి ఇంటికే పరిమితమైన సమయంలో పింఛన్లు పొందలేకపోతున్నారు. ఫ బయోమెట్రిక్ సమస్యకు చెక్ పెట్టేలా ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అందజేత ఫ 24న హైదరాబాద్లో సమావేశం.. బీపీఎంలకు సెల్ఫోన్లుఅందజేయనున్న ప్రభుత్వం ఫ ఈ నెల నుంచే కొత్త విధానంలో పింఛన్ల పంపిణీ ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4.58 లక్షల మంది పింఛన్దారులు పింఛన్లు సులభంగా అందేలా.. బయోమెట్రిక్ విధానంలో పింఛన్లు ఇవ్వడంలో తలెత్తుతున్న సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ యాప్ను తీసుకొస్తోంది. ప్రభుత్వం అందజేసే సెల్ఫోన్లో బీపీఎంలు పింఛన్దారుల పేర్లు, వివరాలను అప్లోడ్ చేస్తారు. యాప్ ద్వారా ఫొటో తీసిన వెంటనే పింఛన్దారుడి వివరాలు వస్తాయి. వారికి పింఛన్ చెల్లించినట్లు నమోదు చేసి.. పింఛన్ మొత్తం అందజేస్తారు. ఇక నడవలేని వారు, వివిధ రోగాలతో మంచాలకే పరిమితమైన వారికి చివరి రోజు ఇళ్లకు వెళ్లి ఫొటో తీసి పింఛన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రతి లబ్ధిదారుడికి సులభంగా పింఛన్ అందనుంది. జిల్లాల వారీగా పెన్షన్ల వివరాలు (2024 సెప్టెంబరు వరకు) కేటగిరీ నల్లగొండ సూర్యాపేట యాదాద్రి వృద్ధాప్య 77,525 57,689 40,236 వితంతు 80,466 36,983 43,148 వికలాంగులు 30,630 10,282 13,198 చేనేత 3,051 49 444 కల్లుగీత 7,918 285 627 హెచ్ఐవీ 2,098 – 2,304 ఫైలేరియా 1,086 231 51 డయాలసిస్ 195 53 113 ఒంటరి మహిళ 7,662 2,124 4,318 24వ తేదీన బీపీఎంకు శిక్షణ పింఛన్ల పంపిణీలో ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఈనెలలో ఇచ్చే పింఛన్లకు కొత్త విధానాన్ని వర్తింపజేయనున్నాం. ఈనెల 24వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం, శిక్షణ ఉంటుంది. అదేరోజు జిల్లాల్లోని బ్రాంచి పోస్టు మాస్టర్లకు (బీపీఎం) ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇన్స్టాల్ చేసిన సెల్ఫోన్లను అందజేయనుంది. నల్లగొండ జిల్లాలో 624 మంది బీపీఎం సెల్ఫోన్లు ఇస్తారు. వారు ఆ యాప్ను ఉపయోగించి పింఛన్లు పంపిణీ చేస్తారు. – శేఖర్రెడ్డి, డీఆర్డీఓ, నల్లగొండ -
సాగర్కు పెరిగిన వరద
నాగార్జునసాగర్ : కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో సాగర్ జలాశయానికి వరద పెరిగింది. ఎగువన ఉన్న జలాశయాలు పూర్తిస్థాయిలో నిండడంతో అదనంగా వచ్చే నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నాయి. శ్రీశైలం జలాశయ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలో ఉండడంతో ఒక క్రస్ట్గేటు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కుడి, ఎడమ విద్యుదుత్పాదనతో కలిసి శ్రీశైలం నుంచి సాగర్కు 94,755 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో సాగర్ నీటిమట్టం 570.20 అడుగుల (257.0774 టీఎంసీలు)కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో సాగర్ జలాశయం నుంచి ఎడమ 2,608 క్యూసెక్కులు, విద్యుతుత్పాదనకు 2,627 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీకి 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
రేవంత్రెడ్డి అన్ని వర్గాలను మోసం చేసిండు
నల్లగొండ టూటౌన్ : ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇలా అన్ని వర్గాలను మోసం చేశాడని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.9 వేల కోట్లు రైతుబంధు ఇచ్చి గొప్పలు చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఎగ్గొట్టిన రైతుబంధు గురించి కూడా చెప్పాలన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, పించన్ల పెంపు, మహిళలకు రూ.2500, విద్యార్థులకు స్కూటీలు, రైతు రుణమాఫీ, వంటి హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి డైవర్షన్ కింగ్ అని, దమ్ము ధైర్యం ఉంటే కులగణన వివరాలు బహిర్గతం చేయాలన్నారు. అంతకుముందు జరిగిన పార్టీ జిల్లా కార్యశాల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మనోహర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మాదగాని శ్రీనివాస్గౌడ్, గోలి మధుసూదన్రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, బండారు ప్రసాద్, పల్లెబోయిన శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి -
రెక్కీ చేసి.. పక్కా స్కెచ్ గీసి..
సూర్యాపేటటౌన్: ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ జరిగింది. 8 కిలోల బంగారం, ఆభరణాల తోపాటు రూ.18 లక్షల నగదును దొంగలు అపహరించారు. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ రూ.7.20 కోట్లు ఉంటుందని యజమాని అంటున్నారు. సూర్యాపేటకు చెందిన తెడ్ల కిషోర్ పట్టణంలోని ఎంజీ రోడ్డులో శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. కిషోర్ సోమవారం ఉదయం 9 గంటలకు దుకాణం తెరిచి లాకర్ గదిలోకి వెళ్లి చూడగా గోడకు పెద్ద రంధ్రం చేసి ఉంది. లాకర్ రూంకు ఉన్న షట్టర్ కట్ చేసి ఉంది. దీంతో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు.తెలిసినవారా.. ప్రొఫెషనల్ ముఠానా?దొంగలు పక్కా స్కెచ్తో బంగారం షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం దుకాణం మెయిన్ రోడ్డుకు ఉంటుంది. దొంగలు షాపు వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో నుంచి వచ్చి బాత్రూంలోకి వెళ్లి తలుపును కట్ చేసి అందులో నుంచి లాకర్ రూంలోకి వెళ్లారు. లాకర్ రూం షట్టర్ను గ్యాస్ కట్టర్తో తొలగించి లోనికి ప్రవేశించి బీరువాలో ఉన్న 8 కిలోల బంగారం, ఆభరణాలతోపాటు రూ.18 లక్షల నగదు అపహరించారు. ఈ చోరీని ప్రొఫెషనల్ దొంగల ముఠా చేసిందా లేక తెలిసిన వ్యక్తులే చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పకడ్బందీగా.. బాత్రూం నుంచి వెళితే లాకర్ గది వస్తుందని దొంగలకు ఎలా తెలుస్తుందని పోలీసులు ఆరా తీస్తున్నారు. బాత్రూంలో నుంచి లోపలికి ప్రవేశించే ముందు అక్కడున్న జగ్గుతో సీసీ కెమెరాను మూసేశారు. లాకర్ గదిలోని రెండు బీరువాల్లో ఒక్కోదాంట్లో 8 కిలోల చొప్పున 16 కిలోల బంగారం ఉండగా.. ఒక బీరువాలోని 8 కిలోల బంగారాన్ని మాత్రమే ఎత్తుకెళ్లారు. దొంగలు గ్యాస్ కట్టర్, రెండు సిలిండర్లను అక్కడే వదిలేశారు. సిలిండర్పై ఉన్న నంబర్ ఆధారంగా దాన్ని కోదాడలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బంగారం షాపు వెనకాల ఖాళీ స్థలంలో రెండు తులాల రింగ్, చెవి దుద్దులు పడిపోగా వాటిని స్వాధీనం చేసుకున్నారు.మూడు రోజులుగా రెక్కీముగ్గురు వ్యక్తులు మూడు రోజుల క్రితం దుకాణం పక్క సందులో ఉన్న బాలాజీ గ్రాండ్ హోటల్ సమీపంలో రూంను అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురు బంగారు షాపులో దొంగతనం చేసేందుకు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించినట్టు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆదివారం రాత్రి కూడా ఈ ముగ్గురు వ్యక్తులు రెండు గ్యాస్ సిలిండర్లు, కట్టర్ పట్టుకొని బాలాజీ గ్రాండ్ హోటల్ సందులో నుంచి నడుచుకుంటూ వెళ్లినట్టు తెలుస్తోంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అక్కడ ఆధారాలను సేకరించాయి. దొంగలు ఆదివారం రాత్రి 12.09 గంటలకు షాపులోపలికి వచ్చినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డయింది. బంగారు షాపును సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం పరిశీలించారు. కేసును ఛేదించడానికి ఐదు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దొంగలను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.సెక్యూరిటీ ఎందుకు లేదు..బంగారు షాపు యజమాని అంత పెద్ద మొత్తంలో షాపులో బంగారాన్ని పెట్టి కనీసం సెక్యూరిటీ గార్డ్ను కూడా పెట్టకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. లాకర్కు అలారం సిస్టం కూడా ఏర్పాటు చేసుకోలేదు. జ్యువెలరీ షాపు యజమాని కిషోర్ అక్కడికి సమీపంలో మరో దుకాణాన్ని ఏర్పాటుచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందులో భాగంగానే పెద్దమొత్తంలో బంగారం, ఆభరణాలు తీసుకొచ్చి ప్రస్తుత షాపులో పెట్టాడని అంటున్నారు. -
సబ్స్టేషన్ భూమి కబ్జా!
మిర్యాలగూడ : సబ్స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడు. ఆ భూమిలో పశువుల కోసం గడ్డిని పెంచుతున్నాడు. సదరు భూమి ఆక్రమణ విషయంలో ఘర్షణలు సైతం చోటుచేసుకుని కేసులు కూడా నమోదయ్యా యి. బహిరంగ మార్కెట్లో రూ.కోటిపైనే విలువ క లిగిన ఆ భూమిని కాపాడే విషయంలో అధికారులు మిన్నకుండి పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఓ నాయకుడి సహకారంతో.. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామ శివారులో సర్వే నంబర్ 719 లో 9.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1990కి ముందు ఆ ప్రాంతంలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు 3.20 ఎకరాలను సబ్స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్ శాఖకు కేటాయించారు. గ్రామానికి చెందిన ఐదుగురికి 25 గుంటల చొప్పున లావుణి పట్టాలు ఇచ్చారు. కేటాయించిన స్థలంలోని కొంత భాగంలో సబ్స్టేషన్ నిర్మించారు. మిగిలిన స్థలం చుట్టూ ట్రాన్స్కో అధికారులు ఎలాంటి హద్దురాళ్లు పాతకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో గత సంవత్సరం ఆ భూమిపై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్ను పడింది. అనుకున్నదే తడువుగా సదరు వ్యక్తి ఆ భూమిని కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. నేర చరిత్ర కలిగిన ఆ వ్యక్తి.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన (మాజీ సర్పంచ్) రాజకీయ నాయకుడితో కుమ్మకై ్క సబ్స్టేషన్ భూమిని కబ్జా చేశాడు. పక్కనే ఉన్న ఎన్ఎస్పీ కాల్వను సైతం ఆక్రమించుకుని సాగు చేస్తున్నాడు. అందుకు ప్రతిఫలంగా రూ.8 లక్షలు సదరు మాజీ సర్పంచ్కు ముట్టజెప్పినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్కడ 20 గుంటల భూమిని ప్రభుత్వ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు నాయకుడి చేత ఆ ఉత్తర్వులను సైతం రద్దు చేయించి ఆ భూమిని సైతం కబ్జా చేశాడు. ఇలా కబ్జా చేసిన రెండున్నర ఎకరాల చుట్టూ దర్జాగా కంచె వేసి పశువుల కోసం పచ్చి గడ్డిని పెంచుతున్నాడు. హద్దులు పరిశీలించి ఫిర్యాదు చేస్తాం తడకమళ్ల సబ్స్టేషన్ భూమి కబ్జాకు గురైన విషయం నా దృష్టికి వచ్చింది. సబ్స్టేషన్కు సంబధించిన భూమి హద్దులు పరిశీలించి కబ్జాపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అనంతరం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసాచారి, ట్రాన్స్కో డీఈ, మిర్యాలగూడ భూ కబ్జాపై విచారణ చేస్తాం మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామ శివారులో గల 719 సర్వే నంబర్లో సబ్ స్టేషన్కు కేటాయించిన భూమిలో 2.5 ఎకరాలు కబ్జాకు గురైనట్లు మాకు సమాచారం లేదు. ట్రాన్స్కో అధికారులు ఫిద్యుదు చేస్తే భూ కబ్జా విషయంపై సమగ్ర విచారణ జరిపి కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – సురేష్కుమార్, తహసీల్దార్, మిర్యాలగూడ కబ్జా చేశాడిలా.. సబ్స్టేషన్ స్థలాన్ని కాజేసేందుకు సదరు వ్యక్తి.. ఓ మండల నాయకుడితో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. ముందుగా గ్రామంలో ఓ కులస్తులతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారిని ఆ భూమిపైకి పంపి భూమిలో చెట్లను తొలగించడం, మడులుగా చేయడం వంటి పనులు చేయించాడు. విషయాన్ని తెలుసుకున్న గ్రామానికి చెందిన మరికొందరు ఆ భూమి తమదేనని వారితో గొడవలకు దిగారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలు కేసులు పెట్టుకున్నాయి. ఈ కేసులో సదరు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు తెలిసింది. దీంతో ఆ వ్యక్తి ఇరువర్గాలకు కొంత మొత్తం ముట్టజెప్పి ఆ భూమిని కబ్జా చేశాడు. ఇలా గ్రామంలో గొడవలు సృష్టించి సబ్స్టేషన్ స్థలాన్ని చాకచక్యంగా కబ్జా చేశాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకుని కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఫ తడకమళ్లలో రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఓ వ్యక్తి ఫ పట్టించుకోని రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు ఫ ఆ భూమి విలువ రూ.కోటిపైనే.. -
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
హాలియా : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఏఐసీసీ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సంపత్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్తో కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. సంస్ధాగతంగా కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా చేయాలని కోరారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి, పున్న కైలాష్, పసుపులేటి సైదయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, అంకతి సత్యం, కర్నాటి లింగారెడ్డి, కాకునూరి నారాయణగౌడ్, ఆంగోతు భగవాన్నాయక్, వెంపటి శ్రీనివాస్, గౌనీ రాజారమేష్యాదవ్, కుకుడాల ఆంజనేయులు, చంద్రశేఖర్, పగడాల నాగరాజు, బానుచందర్రెడ్డి తదితరులు ఉన్నారు. పార్టీని బలోపేతం చేయాలి దేవరకొండ : కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఇందుకుగాను గ్రామస్థాయి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం దేవరకొండలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన జరగిన నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎంపిక చేసే అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, మార్కెట్ చైర్మన్లు నాయిని మాధవ రెడ్డి, సంజీవ్రెడ్డి, నాసిర్అహ్మద్, ఎంఏ సిరాజ్ఖాన్, ఆలంపల్లి నర్సింహ, దూదిపాళ్ల వేణుధర్రెడ్డి, ముక్కమళ్ల వెంకటయ్య, రుక్మారెడ్డి, దేవేందర్ నాయక్, కిన్నెర హరికృష్ణ, కొర్ర రాంసింగ్ పాల్గొన్నారు. ఫ ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ -
ఆయకట్టులో అదునుదాటుతోంది!
మిర్యాలగూడ : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉంది సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు రైతులు పరిస్థితి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ సీజన్లో ముందస్తుగానే కృషానదికి వరద వచ్చింది. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండి.. సాగర్కు వరద వస్తుండడంతో ముందస్తుగానే సాగునీరు విడుదలవుతుందని ఆశించిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆయకట్టులో కొందరు రైతులు నార్లు పోసుకుని నాట్లు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బోర్లు, బావులు లేని రైతులు నీరు విడుదల చేశాక నారు పోసుకుని.. నాట్లు వేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. కానీ సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో అదును దాటిపోతోందని ఆవేదన చెందుతున్నారు. పాలేరుకు వెళ్తున్న జలాలు నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి జిల్లా అవసరాలకు కాకుండా ఖమ్మం జిల్లా అవసరాలను తీరుస్తున్నారు. నల్లగొండ జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటాయి. కానీ ఇక్కడ చెరువులను వదిలేసి ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్లో నీటిని నింపారు. రెండు రోజుల నుంచి మళ్లీ పాలేరుకు రోజూ 3 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కానీ ఇక్కడి మేజర్లకు ఎప్పుడు నీటిని విడుదల చేస్తారో చెప్పడం లేదు. సాగునీటి కోసం ఎదురుచూపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని రైతులకు ఎడమకాల్వ నీరే ఆధారం. బావులు, బోర్లు ఉన్నా.. కాల్వలో నీరు పారితేనే భూగర్భ జలాలు పెరిగి పంటలు పండుతాయి. కానీ ఆయకట్టులో ఈసారి వర్షాలు కూడా సరిగా లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో రైతులంతా కాల్వలకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. సాగర్కు వరద వస్తున్న ఈ తరుణంలో మేజర్ల ద్వారా నీటి విడుదల చేయాల్సి ఉన్నా.. తూములన్నీ బంద్చేసి నేరుగా ఖమ్మం జిల్లాకే నీరు తరలించుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి మేజర్లకు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.సాగు, తాగు అవసరాలకు పాలేరుకు విడుదల చేస్తున్నాం : ఎన్ఎస్పీ ఈఈ నీటి విడుదల విషయమై ఎన్ఎస్పీ ఈఈ వెంకటయ్యను వివరణ కోరగా.. ప్రభుత్వ ఆదేశానుసారం సాగు, తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లాలోని పాలేరుకు నీటిని తరలిస్తున్నామని తెలిపారు. రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయం నుంచి విడుదల చేస్తున్నామని.. ప్రాజెక్టుకు వరదనీరు వచ్చినా కొద్ది పాలేరుకు నీటి విడుదల పెంచుతామని పేర్కొన్నారు. ఎడమకాల్వకు సాగునీటి విషయంపై ప్రశ్నించగా ఆయకట్టు రైతులు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. మేజర్లు, మైనర్లు షట్టర్లు బంద్ చేశారు కదా అని అడగగా అది వాస్తవమేనని సమాధానం దాటవేశారు. ఫ సాగునీటి కోసం సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు రైతుల ఎదురుచూపు ఫ మేజర్లకు నీటి విడుదలపై స్పష్టత కరువు -
పోలీస్ గ్రీవెన్స్ డేలో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్చంద్ర పవార్ 38 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులపై సంబంధిత అధి కారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. బాధితుల సమస్య వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నేడు ఎన్జీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలురామగిరి(నల్లగొండ): నల్లగొండ ఎన్జీ కళాశాలలో మంగళవారం ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. కళాశాల స్థాపించి నేడు 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపనున్నారు.. ఇందుకోసం కళాశాల యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఎంజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి ముఖ్య అతిథితులుగా హాజరుకానున్నారు. తెలంగాణ కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్లు డీఎస్ఆర్.రాజేంద్రసింగ్, పి.బాలభాస్కర్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, కళాశాల పూర్వ విద్యార్థి జి.యాదగిరి, పూర్వ విద్యార్థులు వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2021–2022 నుంచి 2023–2024 విద్యా సంవత్సరం వరకు వివిధ సబ్జెక్టుల్లో టాపర్గా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రధానం చేయనున్నారు. ప్రకృతిని రక్షించడంప్రతి ఒక్కరి బాధ్యతనల్లగొండ : ప్రకృతిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కారాగార పర్యవేక్షణ అధికారి గౌర ప్రమోద్కుమార్ అన్నారు. ఆయన సోమవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా బంజరు భూముల్లో సీడ్ బాల్స్ (విత్తన బంతులు) వేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీడ్ బాల్స్ వేయడం ద్వారా పచ్చదనం పెంపుదల, మట్టి పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు ఈ బాద్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జైలర్ సీహెచ్.బాలకృష్ణ, డిప్యూటీ జైలర్ వెంకట్రెడ్డి, చింత వెంకటేశ్వర్లు, గిరిబాబు, సైదులు, నాగరాజు, రవి, శ్రావణ్, రాంబాబు పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టుకు జలకళ కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. మూసీ ఎగువన వర్షాలు కురుస్తుడటంతో ఆదివారం సాయంత్రం మూసీ ప్రాజెక్టుకు 880 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సోమవారం ఉదయానికి ఒక్కసారిగా 2443 క్యూసెక్కులకు పెరిగింది. మూసీ ప్రాజెక్టుకు ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్లో రావటం ఈ ఏడాది ఇదే మొదటిసారి. వానాకాలం పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 530 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 642.50 అడుగులకు (3.73 టీఎంసీలు) చేరుకుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో మరో రెండు అడుగుల నీరు చేరితే గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశముందని పేర్కొంటున్నారు. 28 మండలాల్లో మోస్తరు వర్షంనల్లగొండ అగ్రికల్చర్ : అల్పపీడన ద్రోణి కారణంగా నల్లగొండ జిల్లాలో 10 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా చిట్యాల మండలంలో 62.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నార్కట్పల్లి 35.9, కట్టంగూరు 33.1, శాలిగౌరారం 2.4, నకిరేకల్ 4.1, కేతేపల్లి 1.6, తిప్పర్తి 1.8, నల్లగొండ 6.3, కనగల్ 1.4, హాలియా 1.2, నిడమనూరు 6.6, త్రిపురారం 4.2, వేములపల్లి 7.2, మిర్యాలగూడ 7.7, దామరచర్ల 10.4, అడవిదేవులపల్లి 32.4, తిరుమలగిరి సాగర్ 3.1, పెద్దవూర 4.4, చింతపల్లి 0.4, గుర్రంపోడు 7.6, పీఏపల్లి 17.0, నేరేడుగొమ్ము 0.5, దేవరకొండ 2.3, గుండ్లపల్లి 31.5, చందంపేట 21.0, గుడిపల్లి 15.8, మునుగోడు 2.1, నాంపల్లి మండలంలో 3.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
రెండు విడతలుగా ‘స్థానిక’ పోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా నిర్వహించే ఎంపీటీపీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అనధికారికంగా జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. జిల్లాలో 33 మండలాలు.. జిల్లాలో మొత్తం 33 మండలాలు ఉన్నాయి. మండలాల పరిధిలో 33 జెడ్పీటీసీలను, 353 ఎంపీటీసీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకు మొత్తం 1,925 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి మొత్తం 11,550 మంది సిబ్బంది అవసరం ఉండగా, 9,588 మంది సిద్ధంగా ఉన్నారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున సిబ్బంది సమస్య తొలగిపోనుంది. గతంలోనే సంసిద్ధం.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారన్న చర్చ జరిగింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకొని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. దాంతో అప్పట్లోనే జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మండలాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. బ్యాలెట్ పేపర్లను కూడా తీసుకొచ్చి ఎస్పీ కార్యాలయంలో భద్ర పరిచింది. బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేసి ఉంచింది. ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. పోలింగ్ సిబ్బంది శిక్షణ మాత్రం ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా ఆ శిక్షణ చేపట్టడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఫ ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఫ ఆ తరువాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఫ ఈ నెలాఖరుకు లేదంటే ఆగస్టు మొదటివారంలో షెడ్యూల్ ఫ ఎన్నికల నిర్వహణకు అన్నీ సిద్ధం చేస్తున్న యంత్రాంగం అన్నీ సరి చూసుకోవాలని ఆదేశాలు.. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల చివరలో లేదంటే ఆగస్టు మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి అధికారులు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. దీంతో స్టేషనరీ, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులతో పాటు సిబ్బంది నియామకాల విషయంలో అధికారులు తనమునకలయ్యారు. గతంలో చేసిన ఏర్పాట్లను సమీక్షించుకొని మిగతా అవసరాలపైనా దృష్టి పెట్టారు. ఎక్కడెక్కడ ఏమేం తక్కువగా ఉన్నాయి.. ఏ మేరకు అవసరం ఉన్నయో గుర్తించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జెడ్పీ సీఈఓ శ్రీనివాస్రావు తెలిపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ సిబ్బంది, ఆర్వోల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
సంస్థాన్ నారాయణపురం: ఎదరుగా వస్తున్న డీసీఎంను తప్పింబోయి ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ అటవీ ప్రాంతంలోని కడిలబావితండాలో సోమవారం జరిగింది. పోలీసులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం పీపుల్పహాడ్ గ్రామానికి చెందిన దండుగుల రంజిత్ (32) కంప్రెషర్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కంప్రెషర్ పని నిమిత్తం ట్రాక్టర్ను తీసుకొని సోమవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి వెళ్తుండగా.. రాచకొండ ప్రాంతంలో కడీలబావితండా పరిధిలో మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎంను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రంజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్ తెలిపారు రంజిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బోరు బండి పైనుంచి పడి.. రామగిరి(నల్లగొండ): బోరు బండి పైనుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన నల్ల గొండ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగిరి విలా స్లో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన అనిల్ కకాడియా బోర్ బండి మీద కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగిరి విలాస్లో బోర్ వేసిన అనంతరం ఒంటిపై ఉన్న దుమ్మును శుభ్రం చేసుకునే క్రమంలో విశాల్ వర్కాడే అనే వ్యక్తి ఎయిర్ పైపును అనిల్ కకాడియా వెనుక నుంచి పెట్టగా అతడు ప్రమాదవశాత్తు బోర్ బండి పైనుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అనిల్ కకాడియాను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్ను వార్కడే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు. -
భారీ చోరీ కలకలం
సూర్యాపేటలో జ్యువెలరీ షాపును కొల్లగొట్టిన దుండగులుసూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యువెలరీ షాపులో ఆదివారం రాత్రి జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. దొంగలు జ్యువెలరీ షాపునకు కన్నం వేసి 8కిలోల బంగారం చోరీచేయడంతో బంగారం షాపు నిర్వాహకులతో పాటు పట్టణంలో ఇతర వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. సూర్యాపేట పట్టణంలో ప్రధాన రోడ్డు అయిన ఎంజీ రోడ్డులోని శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో దొంగతనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ కూడా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఇంత పెద్ద దొంగతనం జరగలేదు. 2011లో సూర్యాపేటలోని పూల సెంటర్ రోడ్డులో ఓ బంగారం షాపులో కిలో బంగారాన్ని అప్పట్లో దొంగలు ఎత్తుకుపోయారు. అప్పటి నుంచి అంత పెద్ద మొత్తంలో దొంగతనాలు జరగలేదు. తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏకంగా ఎనిమిది కిలోల బంగారం చోరీకి గురికావడం కలకలం సృష్టించింది. భారీ దొంగతనం కేసు పోలీసులకు సవాల్గా మారింది. జిల్లా కేంద్రంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదు. రాత్రి వేళల్లో సైతం పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త షాపు పెట్టేందుకు ఎక్కువ మొత్తంలో కొనుగోలు సూర్యాపేటకు చెందిన తెడ్ల కిషోర్ పదమూడు సంవత్సరాలుగా బంగారం వ్యాపారం చేస్తున్నాడు. మొదటగా జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో బంగారం షాపు నిర్వహిస్తుండగా ఆ తర్వాత ఐదేళ్ల క్రితం షాపును ఎంజీ రోడ్డుకు మార్చాడు. ఎక్కువగా ముంబై, హైదరాబాద్ నుంచి బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇటీవల మరో బంగారం షాపు పెట్టేందుకు భారీగా బంగారం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ బంగారాన్ని షాపులోని లాకర్ రూంలో గల అల్మారాలో భద్రపరిచాడు. ప్రస్తుతం శ్రీసాయి జ్యువెలరీ షాపు నిర్వహిస్తున్న మడిగె అద్దెకు తీసుకున్నది. తాను సొంతంగా కొత్తగా భవనాన్ని నిర్మించాడు. వచ్చే నెలలో ఈ షాపును తన సొంత భవనంలోకి మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కొత్త షాపులో పెట్టేందుకు సుమారు 16కిలోలకు పైగా బంగారం కొనుగోలు చేసినట్టు వ్యాపారి కిషోర్ చెబుతున్నాడు. కొనుగోలు చేసిన రెండు వారాలకే చోరీ.. షాపు నిర్వాహకుడు కిషోర్ అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేసి తీసుకువచ్చి షాపులో పెట్టిన రెండు వారాలకే దొంగతనం జరగడం గమనార్హం. ఇది తెలిసిన వారి పనేనా అనే అనుమానం కలుగుతోంది. పది రోజుల క్రితమే లాకర్ మార్పు.. ఇంతకాలం నడిపించిన షాపులో ఉన్న లాకర్ను పది రోజుల క్రితమే తన సొంత భవనంలో మార్చాడు. అయితే ఆ షాపు ఇంకా ఓపెన్ కాకపోవడంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన బంగారాన్ని షాపులోని లాకర్ గదిలో అల్మారాలను ఏర్పాటు చేసుకొని ఆ గదికి షెట్టర్ చేయించాడు. మరో పది రోజుల్లో షాపు మార్చాక బంగారం తీసుకెళ్లొచ్చనే భావనతో యజమాని ఉన్నాడు. ఇంతలోనే చోరీ జరగడంతో లబోదిబోమంటున్నాడు. బంగారం 16కిలోలకు పైగా ఉండగా అందులో ఎనిమిది కిలోల బంగారం, రూ.18లక్షల నగదును మాత్రమే ఎత్తుకెళ్లారు. వెండిని ముట్టుకోలేదు. అలాగే షాపులో నుంచి లాకర్ గదికి వచ్చే డోర్ను వెనుకాల నుంచి గడియ పెట్టి పరారయ్యారు. ఫ రూ.కోట్లు విలువ చేసే బంగారం అపహరణఫ విషయం తెలియడంతో ఉలిక్కిపడ్డ వ్యాపారులు ఫ ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద దొంగతనం ఇదే.. ఫ చర్చనీయాంశంగా చోరీ ఘటనకన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు చాలా కాలంగా బంగారం షాపు నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో బంగారం దొంగలు ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కొత్త షాపులోకి మంచి డిజైన్లతో కూడిన ఆభరణాలు, బంగారు బిస్కెట్లు తీసుకొస్తే వాటిని దొంగలు ఎత్తుకుపోవడంతో తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. దొంగతనం సమాచారం తెలిసిన ప్రజలు షాపు వద్దకు గుంపులు గుంపులుగా వచ్చారు. విలపిస్తున్న షాపు యజమానితో పాటు కుటుంబ సభ్యులను పలువురు ఓదార్చారు. -
గరుడ టికెట్తో శీఘ్ర దర్శనం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేలా ఆలయాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళ రూ.300 టికెట్తో బ్రేక్ దర్శనం పేరిట ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు. ఇదే మాదిరిగా ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారిని అంతరాలయంలో దర్శించుకునే విధంగా గరుడ టికెట్ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవాణి ట్రస్టు తరహాలో..తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం భక్తులకు శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.10,500 టికెట్ను అందిస్తున్నారు. ఇదే తరహాలో యాదగిరిగుట్టలో సైతం ఒక్కో భక్తుడికి రూ.5,000తో గరుడ టికెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రముఖులు, ఎన్ఆర్ఐలు, విదేశీయులతో పాటు సామాన్య భక్తులు సైతం క్యూలైన్లలో గంటల తరబడి నిల్చునేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ గరుడ టికెట్ను ప్రవేశపెడితే తొందరగా, సులవుగా దర్శనం కావడంతో పాటు దేవాలయానికి ఆదాయం సైతం పెరగనుంది. ఈ టికెట్ కొనుగోలు చేసే భక్తులకు 5 అభిషేకం లడ్డూలు, కిలో పులిహోర ప్రసాదాన్ని సైతం అందజేయనున్నారు. అంతేకాకుండా ఆశీర్వచనం సైతం చేయనున్నారు. గరుడ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు ఉదయం ఆలయం తెరిచినప్పటి నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా అంతరాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. తిరుమల శ్రీవాణి ట్రస్టు తరహాలో యాదగిరిగుట్టలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు ఒక్కో టికెట్ ధర రూ.5వేలువ్రత టికెట్ల ధర పెంపు..యాదగిరిగుట్ట ఆలయంలో భక్తులు సత్యనారాయణస్వామి వ్రతం జరిపించేందుకు గాను ప్రస్తుతం టికెట్ ధర రూ.800 ఉండగా.. దానిని రూ.1,000కి పెంచుతూ ఆలయ ఈఓ వెంకట్రావ్ ఇటీవల నిర్ణయించారు. ఈ రూ.1000 టికెట్ కొనుగోలు చేస్తే.. ప్రస్తుతం సత్యనారాయణ వ్రతం జరిపించడానికి ఆలయం తరఫున భక్తులకు అందజేస్తున్న వ్రత సామగ్రితో పాటు స్వామివారి ప్రతిమ, శెల్లా, కనుమను అదనంగా ఇవ్వనున్నారు. ప్రతి రోజు వ్రత మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు బ్యాచ్ల్లో 350 నుంచి 450 వ్రతాలు జరుగుతాయి. ఆదివారాలు, సెలవు రోజుల్లో మరో 100 వ్రతాలు అదనం. ప్రస్తుతం రూ.800 టిక్కెట్తో రోజుకు రూ.3లక్షల వరకు ఆదాయం వస్తుండగా.. రూ.1000కి ధర పెంచడంతో అదనంగా మరో రూ.90వేలు రోజుకు ఆదాయం అదనంగా రానుంది. -
రూ.20కే రూ. 2లక్షల బీమా
భువనగిరిటౌన్: కేంద్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్బీవై)ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా సంవత్సరానికి రూ.20 కట్టడం ద్వారా రూ.2లక్షల బీమా పొందవచ్చు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఈ బీమాకు అర్హులు. అయితే ఇందు కోసం ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు ఉంటే.. ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఖాతా ఉంటే.. ఆ ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథకంలో చేరడానికి అర్హులు అవుతారు. ఎన్ఆర్ఐలు కూడా ఈ పథకంలో చేరేందుకు అర్హులు. కానీ క్లెయిమ్ మాత్రం లబ్ధిదారుడికి లేదా నామినీకి భారత కరెన్సీలో చెల్లిస్తారు. ప్రీమియం ఎంత చెల్లించాలి అంటే..పీఎంఎస్బీవై పథకంలో వార్షిక ప్రీమియంగా కేవలం రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ తర్వాత ఆటోమెటిక్గా బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియంను కట్ చేస్తారు. దీని కాలపరిమితి ఒక సంవత్సరం. ఏటా దీనిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఒకటి లేదా అంత కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పథకంలో చేరినట్లయితే.. క్లెయిమ్ సమయంలో కేవలం ఒక బ్యాంకు అకౌంట్కు మాత్రమే బీమా చెల్లిస్తారు. అంటే ఇతర బ్యాంకు అకౌంట్ల ద్వారా చెల్లించిన ప్రీమియాన్ని కోల్పోవాయినట్లే అవుతుంది. బీమా క్లెయిమ్ చేస్తే ప్రీమియం మారుతూ ఉంటుంది. ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే మొదటి మూడేళ్లలో ప్రీమియంలో ఎలాంటి మార్పులు ఉండవు. బ్యాంకులు ఈ పాలసీకి సంబంధించిన ఎలాంటి పాలసీ సర్టిఫికెట్లు జారీ చేయవు. బీమా వర్తించే సందర్భాలు..సహజ విపత్తుల వల్ల జరిగిన ప్రమాదాల వల్ల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం వర్తిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి కూడా ఎలాంటి బీమా ప్రయోజనం లభించదు. ఒకవేళ చందాదారుడు హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ లభిస్తుంది. ప్రమాదవశాత్తు చందాదారుడు మరణిస్తే, మరణాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించాలి. అప్పుడు మాత్రమే పీఎంఎస్బీవై పథకం కింద క్లెయిమ్ మంజూరు అవుతుంది. ఒకవేళ రోడ్డు, రైలు, ఏదైనా వాహన ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావడం లాంటి మరణాలు సంభవిస్తే.. వాటిని పోలీసుల ధ్రువీకరించాలి. అలాగే పాము కాటు, చెట్టుపై నుంచి కిందపడి చనిపోతే.. ఆ మరణాలను వైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అప్పుడే మాత్రమే ఈ పథకం ద్వారా క్లెయిమ్ లభిస్తుంది. చందాదారుడు మరణించిన సందర్భంలో అభ్యర్థన నమోదు పత్రం ప్రకారం నామినీ క్లెయిమ్ కోసం దాఖలు చేయవచ్చు. ఒకవేళ నామినీ పేరును అభ్యర్థన నమోదు పత్రంలో తెలుపకపోతే అప్పుడు చందాదారుని చట్టపరమైన వారసుడు క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. మరణించిన వారి తరఫు క్లెయిమ్లు నామినీ, చట్టపరమైన వారసుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. అదే వైకల్యం తాలూకా క్లెయిమ్లు మాత్రం చందాదారుడి బ్యాంకు ఖాతాలో జమవుతాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో భవిష్యత్తుకు భరోసానిస్తున్న కేంద్ర ప్రభుత్వంలబ్ధి పొందేది ఇలా..ఈ బీమా పథకంలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైనా బాధిత కుటుంబానికి లేదా నామినీకి రూ.2,00,000 అందిస్తారు. ఒక వేళ పాలసీదారుడు పాక్షిక వైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం అందిస్తారు. ప్రమాదంలో రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా లేదా రెండు చేతులు లేదా కాళ్లు కోల్పోయినా.. దానిని శాశ్వత వైకల్యంగా గుర్తించి రూ.2 లక్షలు పరిహారంగా అందిస్తారు. ఒక కాలు లేదా ఒక చెయ్యి, ఒక కంటి చూపు కోల్పోతే మాత్రం దానిని పాక్షిక వైకల్యంగా గుర్తించి రూ.లక్ష రూపాయలు పరిహారంగా ఇస్తారు. -
ఉచితాలతో ఆరి్థక వ్యవస్థ చిన్నాభిన్నం
నల్లగొండ: ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పనిచేసే కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదన్నారు. ప్రజలు ఉచితాల పథకాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. దేశంలో వ్యవసాయమే ప్రధానమైందని, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పని వైపు ప్రజలను మళ్లించి ఉచితాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి ఖర్చే అవినీతికి మూలం దేశంలో అవినీతి పేరుకుపోయిందనే వాదన ఉంది. ఎన్నికల్లో విచ్చలవిడిగా పార్టీలు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నాయి. ఆ తర్వాత ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించడానికి అవినీతికి పాల్పడుతున్నారు. దీనిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ చొరవచూపాలి. రాజకీయ నాయకులే కాదు.. కొందరు అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ఇంజనీరింగ్ శాఖలో ఇష్టమొచ్చినట్లు ఎస్టిమేట్ వేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. నాయకుల భాష మారాలి రాజకీయ నాయకులు మాట్లాడే భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వారు వాడే భాషతో భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారనేది ఆలోచించాలి. రాజకీయ నాయకులంటే ఇప్పటికే ప్రజలు ఈసడించుకుంటున్నారు. రాజకీయ నాయకులు గౌరవంగా మాట్లాడాలి. బనకచర్లను ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ఒప్పందం ప్రకారమే చేసుకోవాలి. ఎమ్మెల్సీలు మల్లన్న, కవిత ఫిర్యాదులపై రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారన్నారు. పెద్దల సభను గౌరవించాల్సిన అవసరం అందరికి ఉంది. దూషణలు, దాడులు సరికావన్నారు. సాగర్ ఎడమ కాల్వకు ముందే నీటి విడుదల చేయడం వల్ల రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. పనిచేసే కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు అధికార, ప్రతిపక్షాలు వాడే భాష మార్చుకోవాలి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
విపత్తు నిర్వహణ సంస్థలను అప్రమత్తం చేయాలి
నల్లగొండ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థలను రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల సరఫరాపై అధికారులకు పలు సూచనలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల ద్వారా సక్రమ నీటి నిర్వహణ, రేషన్ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
వలస కార్మికులకు శ్రమ దోపిడీ నుంచి విముక్తి
చందంపేట: వారంతా అమాయక కూలీలు.. కూలీ నాలి చేసుకుంటూ రోజు గడిపే వారు. వారికి పనులు కల్పిస్తామంటూ కొందరు మాయమాటలతో నమ్మించి.. వారి శ్రమను వాడుకుంటూ.. వేతనాలు ఇవ్వడం లేదు. తిరిగి సొంతూరికి కూడా వెళ్లన్వికుండా దాడులు చేస్తూ.. కనీసం వారి కుటుంబీకులతో ఫోన్లో కూడా మాట్లాడనివ్వ లేదు. గత రెండేళ్లుగా సాగుతున్న ఈ శ్రమదోపిడీ దందా గుట్టును రట్టు చేశారు పోలీసులు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో స్పెషల్ కార్డన్ సెర్చ్ చేపట్టగా శ్రమ దోపిడీతో రెండేళ్లుగా నరకం అనుభవిస్తున్న వలస కార్మికులకు విముక్తి లభించింది. అయితే కొందరికి మాత్రమే విముక్తి లభించగా.. మరికొందరి కోసం పోలీసుల విచారణ కొనసాగుతోంది. రెండేళ్లుగా గుట్టుగా.. నేరేడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీలో చేపల వేట నిర్వహిస్తున్న పలువురు మత్స్యకారులు ఈ ప్రాంతంలో పనులు చేసేందుకు గాను ఒడిషా, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చిన వారిని సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలోని ఓ అటవీ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసి వారితో పనులు చేయించుకుంటున్నారు. చేపలు పట్టేందుకు వీరితో పనులు చేయించుకుంటూ వారికి వేతనం ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. కేవలం అన్నం మాత్రమే పెట్టి వెట్టి చేయించుకున్నారు. రెండేళ్లుగా ఇలా వారు నరకయాతన అనుభవిస్తున్నారు. తిరిగి వెళ్లనివ్వకుండా.. వైజాగ్కాలనీలో పనిచేసే వలస కార్మికులు తిరిగి వారి సొంత ప్రాంతానికి వెళ్లే మార్గం చూపించకుండా.. సాగర్ వెనుక జలాల్లో అటవీ ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసి వారిని అక్కడే ఉంచి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడనివ్వకుండా బలవంతంగా పనులు చేయించి హింసించారు. డబ్బులు అడిగితే వారిపై దాడులకు పాల్పడ్డారు. పోలీసుల దాడులతో బట్టబయలు వలస కార్మికుల వెట్టి చాకిరీ విషయం దేవరకొండ పోలీసుల దృష్టికి రావడంతో ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో ఆది, సోమవారం ఆ ప్రాంతాలను గుర్తించి, 30 మంది వలస కార్మికులను దేవరకొండకు తరలించారు. వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా వంద మంది వరకు కూలీలు వచ్చినట్లు సమాచారం ఉండడం.. కొంత మంది మాత్రమే దొరకడంతో మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఓ కార్మికుడి అంత్యక్రియలూ ఇక్కడే.. నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన కార్మికుడు తన స్వగ్రామానికి వెళ్తానని తనను ఇక్కడికి తీసుకొచ్చిన వారిని అడిగాడు. వారికి తెలియకుండా తన స్వగ్రామానికి వెళ్లే ప్రయత్నంలో పెద్దమునిగల్ గ్రామ అటవీ ప్రాంతంలో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. అతని మృతదేహాన్ని కనీసం స్వగ్రామానికి కూడా పంపకుండా.. వైజాగ్ కాలనీలోనే అంత్యక్రియలు నిర్వహించారు.ఫ సాగర్ బ్యాక్ వాటర్ అటవీ ప్రాంతంలోని స్థావరంలో బందీలుగా ఇతర రాష్ట్రాల కార్మికులు ఫ వారి చేత చేపలు పట్టే పనులు చేయిస్తూ.. వేతనాలు ఇవ్వని వైనం ఫ సొంతూరికి వెళ్లలేక.. వేతనాలు లేక చితికిపోయిన కార్మికులు ఫ పోలీసుల తనిఖీతో బయటపడ్డ కార్మికులు -
కొండగడప విద్యార్థినికి ప్రశంసలు
మోత్కూరు: మోత్కూ రు మున్సిపాలిటీలోని కొండగడప గ్రామానికి చెందిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని దొండ స్వాతి ప్రముఖ సాహితీవేత్తల నుంచి ప్రశంసలు అందుకుంది. స్వాతి చదువుతో పాటు విద్యార్థి దశనుంచే రచనలు, వ్యాసాలు రాస్తూ పేరుగడించారు. ఆమె రాసిన వ్యాసం చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ సూర్య ధనుంజయ్, ప్రసిద్ధ సాహితీవేత్త ముదిగొండ శివప్రసాద్, నలిమిల భాస్కర్, ఆట్టం దత్తయ్య వ్యాసాల సరసన చోటు దక్కడంతో ఆమెకు సత్కరించారు.ఆదివారం హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ పటేల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు స్వాతిని శాలువాతో సన్మానించి అభినందించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మద్దిరాల: రోడ్డు ప్ర మాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటు ంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం కుక్కడం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజగానితండాకు చెందిన లాకవత్ రవీందర్ బతుకుదెరువు కొరకు హైదరాబాద్కు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం హైదరాబాద్లోని అన్నోజిగూడలో బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హైదరాబాద్లోనే ఓ హాస్పిటల్లో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి కృష్ణారెడ్డి, పాపయ్య, శ్రీనివాస్, ధనుంజయ్య, సతీష్ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. వారి నుంచి రూ. 8,440 నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ సైదులు తెలిపారు. -
కీడొచ్చి.. వర్షాలు కురుస్తలేవని..
నల్లగొండ జిల్లా: గ్రామానికి కీడు వచ్చిందని.. అందుకే వర్షాలు కురుస్తలేవని ప్రజలంతా ఊరు విడిచి వనవాసం వెళ్లిన సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని తక్కెళ్లపహాడ్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామంలో రెండు నెలల్లో ఎనిమిది మంది వివి« ద కారణాలతో మృతి చెందారు. గ్రామంలో ఒకరు మృతి చెందగా, అతడి దశదినకర్మ పూర్తికాక ముందే మరొకరు మృతి చెందడం రెండు నెలలుగా జరుగుతోంది. దీనికి తోడు వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో గ్రామ రైతులు పత్తితోపాటు ఇతర మెట్ట, వరి పంటలను సాగుచేశారు. వర్షాలు కురవకపోవడంతో పత్తి విత్తనాలు మొలకెత్తక రెండు, మూడుసార్లు పత్తి గింజలను విత్తారు. బోరుబావుల్లో సరిపడా నీళ్లు అందక భూములు తడవక పోవడంతో వరినార్లు ముదిరిపోతున్నాయి. గ్రామంలో వరుస మరణాలు జరగడం.. వర్షాలు కురవకపోవడానికి కీడే కారణమని భావించిన గ్రామస్తులు ఒక్కరోజు ఊరు విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం శనివా రం రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. అందరూ ఊరు విడిచి వెళ్లాలని, గ్రామంలో ఒక్కరు కూడా ఇంట్లో పొయ్యి వెలిగించొద్దని, కిరాణ, మద్యం బెల్టు దుకాణాలు తెరవొద్దని, కోళ్లు, మేకలను కోయొద్దని దండోరా వేయించారు. ఊరు విడిచి వెళ్లకున్నా, దుకాణాలు తెరిచినా రూ.5 వేలు, గ్రామంలో కోళ్లు, మేకలు కోసి మాంసం విక్రయిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తామని దండోరా వేయించారు. దీంతో గ్రామస్తులంతా ఆదివారం ఉదయం 6 గంటలకే గ్రామాన్ని విడిచి చెట్లకిందకు వనవాసం వెళ్లి అక్కడే వంటలు చేసుకొని ఆరగించి సాయంత్రం 6 గంటలకు ఇళ్లకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చెక్క కర్రలతో ఏర్పాటు చేసిన మంట నుంచి ప్రజలు నిప్పు కొనుగోలు చేసి తమ ఇళ్లలోకి తీసుకెళ్లిన తర్వాతే ఇంట్లో పొయ్యి వెలిగించుకొని వంట చేసుకోవాలని హుకుం జారీ చేయడంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో పాటించక తప్పలేదు. -
ప్రభుత్వ బడికి పూర్వ వైభవం
గుర్రంపోడు : గతేడాది వెలవెలబోయిన గుర్రంపోడు మండలంలోని నడికూడ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం విద్యార్థులతో కళకళలాడుతోంది. ఉపాధ్యాయుల అంకితభావం, పట్టుదలతో ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది పాఠశాలకు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయుడు కాళం నారాయణరెడ్డి విధుల్లో చేరగానే విద్యార్థుల సంఖ్యను పెంచాలనే సంకల్పంతో తోటి ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, యువతతో కలిసి చర్చించారు. వేసవి సెలవులకు ముందే పెద్ద ఎత్తున ముందస్తు బడిబాట నిర్వహించి ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల ఇళ్లకు ఒకటికి నాలుగుసార్లు వెళ్లి వారిని మెప్పించారు. గ్రామపెద్దలు, యువతను తీసుకుని వెళ్లి వారితో తమ ఊరి బడిలో తమ పిల్లలను చదివించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 85 మందికి చేరింది. ఖాళీగా ప్రైవేట్ స్కూల్ బస్సులు గతంలో ఈ గ్రామం నుంచి గుర్రంపోడు, కొప్పోలు, హాలియా, వెల్మగూడెం గ్రామాల ప్రైవేట్ పాఠశాలల బస్సులు నడిచేవి. గ్రామస్తులు, యువత ముందుగా ప్రైవేట్ బస్సుల్లో విద్యార్థులు వెళ్లకుండా నిలువరించారు. పిల్లలంతా గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలలో చేరేలా సహకరించారు. దీంతో ఆ పాఠశాల ప్రస్తుతం కొత్త కళను సంతరించుకుంది. ఫ 30 నుంచి 85కు చేరిన విద్యార్థుల సంఖ్య ఫ సత్ఫలితాన్నిచ్చిన ముందస్తు బడిబాట ఫ ఉపాధ్యాయులకు సహకరించిన గ్రామ యువత తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడతాం గత ఏడాది పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులందరికీ గురుకుల సీట్లు వచ్చేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. గ్రామంలో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు రాని గురుకుల సీట్లు మా పాఠశాలకు రావడాన్ని తల్లిదండ్రులకు వివరించాం. ప్రైవేట్ విద్యార్థుల కంటె తమ పాఠశాల విద్యార్థులే బాగా చదువుతాని చాలెంజ్ చేశాం. తాము విద్యార్థులపై ఎలా శ్రద్ధ తీసుకుంటున్నామో వారు అర్థం చేసుకున్నారు. మా నమ్మకం ఉంచి పాఠశాలలో చేర్పించిన తల్లిందండ్రుల నమ్మకం నిలబెట్టేలా మరింత బాధ్యతతో పనిచేస్తున్నాం. – కాళం నారాయణరెడ్డి, హెచ్ఎం -
పారిశుద్ధ్య సామగ్రి సరఫరాకు టెండర్ల ఆహ్వానం
నల్లగొండ : జిల్లాలోని 868 గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు అవసరమయ్యే సామగ్రిని గ్రామ పంచాయతీలకు సరఫరా చేసేందుకు ఆసక్తి గల వారి నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీల్డ్ టెండర్లను ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8074172060 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంరామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకనామిక్స్ 1, కామర్స్ 2, బాటని 1, మైక్రోబయాలజి 1, జువాలజి 3, ఫిజిక్స్ 3, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్ 6, హిందీ 1, తెలుగు 4, హిస్టరీ (ఉర్దూ) 1, పోలిటికల్ సైన్స్ (ఉర్దూ) 1 సబ్జెక్టులు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత పీజీలో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు అభ్యర్థులు 50 శాతం మార్కులు ఉండాలని తెలిపారు. పీహెచ్డీ, నెట్, సెట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని, ఈ నెల 22 నుంచి 25 వరకు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 98490 00244, 94409 12000 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. నేడు దొడ్డా నారాయణరావు సంతాప సభ చిలుకూరు: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డా నారాయణరావు సంతాప సభ సోమవారం చిలుకూరులోని జరగనుందని సీపీఐ నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దొడ్డా నారాయణరావు శిలాఫలకాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు. ఈ సంతాప సభకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం ఎమ్మెల్యే కూనంనేని సాంశివరావు తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రైవేట్ టీచర్లుకు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం (టీపీటీఎల్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు విజయ్కుమార్ రాష్ట్ర ప్రభుతాన్ని కోరారు. ఆదివారం తిరుమలగిరిలో ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవకాశం కల్పించాలన్నారు. ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కల్పించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆ ఫోరం జిల్లా అధ్యక్షుడు నర్సింహారావు, మండల అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బండారి కిరణ్, కోశాధికారి దరావత్ భిక్షం, గౌరవ అధ్యక్షుడు పాలబిందెల శేఖర్, సహాయ కార్యదర్శి జి.వెంకన్న, బి.భిక్షం, వెంకన్న పాల్గొన్నారు. -
చెరిగిపోతున్న చెరువు ఆనవాళ్లు!
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025మిర్యాలగూడ : కబ్జాదారుల చెరలో చిక్కి చెరువులు ఆనవాలు కోల్పోతున్నాయి. చెరువుల ఆక్రమణపై ఇటీవల కలెక్టర్ సమీక్షించి చెరువలు కబ్జాకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఫలితంగా చెరువు భూములు నివాస సముదాయాలు, వ్యవసాయ భూములుగా మారుతున్నాయి. చెరువులో నీరు తగ్గడమే తరువాయి కబ్జాదారులు అందులో మట్టిపోసి ఆక్రమించుకుంటున్నారు. దీంతో చెరువులపై ఆధారపడిన మత్స్యకారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్యాలగూడలో అధికంగా.. మిర్యాలగూడ నియోజకవర్గంలోని చెరువు భూములు ప్రస్తుతం కబ్జాకు గురవుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని పందిర్లపల్లి చెరువు సర్వే నంబర్ 32లో, మిర్యాలగూడ శివారులోని సర్వే నంబర్ 118 కలుపుకుని సుమారు 480 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఇప్పటికే సగానికి పైగా కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని గతంలోనే ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు స్పందించి హద్దురాళ్లు ఏర్పాటు చేసి కబ్జా కాకుండా అడ్డుకున్నారు. ప్రస్తుత మళ్లీ ఆక్రమణకు తెరలేపారు. హద్దురాళ్లను తొలగించి చెరువు భూముల్లో మట్టి పోసి వ్యవసాయ భూమిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫ మిర్యాలగూడ మండలంలోని రుద్రారం గ్రామంలోని రుద్రప్ప చెరువు సర్వే నంబర్ 117లో 310 ఎకరాలు ఉండగా అందులో 140 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గతంలో వెలుగులోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు కబ్జాకు గురవుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అక్రమాలకు తెరలేపారు ఇలా.. పందిర్లపల్లి చెరువు పక్కన సర్వే నంబర్ 116, 117లో ఎకరన్నర పట్టా భూమి ఉండగా.. దానికే ఆనుకుని సర్వే నంబర్ 118లో 203.26 ఎకరాల చెరువు శిఖం ఉంది. దాంతోపాటు సర్వే నంబర్ 114లో 128.38ఎకరాల బంచరాయి భూములు ఉన్నాయి. ఆ భూమి అంతా కబ్జా గురైంది. అయితే చెరువు పక్కన పట్టా భూమి ఉన్న వారు ఆ భూమిని ఎప్పుడో అమ్మేసుకుని శిఖం, బంజరు భూములను కబ్జా చేస్తున్నారు. వీరంతా ధనవంతులు కావడం, అధికార అండ ఉండడంతో ఆక్రమణ యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పందిర్లపల్లి చెరువును సుందరీకరణ చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటింగ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ భూములను కబ్జా చేసేందుకు తెర లేపారు. బంజరు, శిఖం భూముల గుండా పోవాల్సిన నెక్లెస్ రోడ్డును మార్చేసి చెరువు సమీపం నుంచి తీయడంతో అక్రమార్కులకు కబ్జాకు అవకాశం దొరికింది. న్యూస్రీల్ఫ కబ్జాకు గురవుతున్న చెరువు భూములు ఫ సాగు భూములను ప్లాట్లుగా మారుస్తున్న ఆక్రమణదారులు ఫ చోద్యం చూస్తున్న అధికారులు ఫ ఉపాధి కోల్పోతామని మత్స్యకారుల ఆవేదన అధికారుల అలసత్వం సాగు, తాగునీటికి జీవనాధారంగా ఉన్న చెరువులు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అలసత్వం కారణంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. చెరువు ఆక్రమణపై కలెక్టర్, సబ్ కలెక్టర్కు ఫిర్యాదులు అందినా ఫలితం ఉండడం లేదు. అధికారుల కనుసన్నల్లోనే ఈ కబ్జాల పరంపరం కొనసాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చెరువు భూముల కబ్జాలను అరికట్టాలని కోరుతున్నారు. -
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: నిత్యారాధనలు, భక్తజనులతో ఆదివారం యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ప్రభాతవేళ స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. ఆ తరువాత గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళాలతో అర్చించారు. ఇక ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. అదే విధంగా ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు, సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వారబంధనం చేశారు. -
కాల్వకట్టలు కబ్జామయం!
ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి మా పాలెం గ్రామంలోని ఊరకుంటలోకి డీ–53 కాల్వ నుంచి నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం చెరువులోకి వచ్చే కాల్వ కబ్జాకు గురైంది. కాల్వ ఆనవాళ్లు లేకుండా పోయింది. కాల్వ భూములు ఆక్రమణకు గురికాకుండా అధికారులు అడ్డుకట్ట వేఆయలి. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలి. నోముల కృష్టయ్య, రైతు, పాలెం, నకిరేకల్ మండలం కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పాలెం గ్రామంలో ఏఎమ్మార్పీ కాల్వను ఇరు వైపులా ఉన్న రైతులు కబ్జాకు పాల్పడినట్లు గుర్తించాం. రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో కాల్వ వెంట ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తాం. ఏఎమ్మార్పీ కాల్వ భూములను ఆక్రమించే వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతాం. – పి.యాదగిరి, తహసీల్దార్, నకిరేకల్ నకిరేకల్: మండల పరిధిలోని ఎస్ఎల్బీసీ (ఏఎమ్మార్పీ) కాల్వలు కబ్జాకు గురువుతున్నాయి. కాల్వలకు ఇరువైపులా భూమిని ఆక్రమించుకుంటున్న కొందరు రైతులు తమ పట్ట భూముల్లో కలుపుకుంటూ కాల్వ గట్టు వెంట ఎగువ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి దారిలేకుండా చేస్తున్నారు. నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో పాలెం–నోముల వైపు ఉన్న డీ–53 కాల్వకు ఇరువైపులా ఉన్న భూములను ఆక్రమణకు గురయ్యాయని వాటిని కాపాడాలని ఇటీవల గ్రామానికి చెందిన పలువురు రైతులు జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన అధికారులు విచారణ చేయగా కాల్వ భూములు ఆక్రమణకు గురైనట్టుగా నిర్ధారించడంతో కబ్జాల పర్వం వెలుగులోకి వచ్చింది. కాల్వల నిర్మాణం ఇలా.. జిల్లాలో 136 కిలోమీటర్ల పొడవు ప్రవహించే ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు నకిరేకల్ మండలం చివరిగా ఉంది. నల్లగొండ మున్సిపల్ పరిధిలోని పానగల్ ఉదయ సముద్రం నుంచి నకిరేకల్ మండలం నడిగూడెం వద్ద ఉన్న మూసీ రిజర్వాయర్లో ఈ ఏఎమ్మార్పీ కాల్వ కలుస్తుంది. ఈ కాల్వ పరిధిలో నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి మండలాల్లో మొత్తం 30వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. డీ–40 నుంచి చివరి డిస్ట్రిబ్యూటరీ డీ–55వరకు మొత్తం 16 డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఈ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ కాల్వ నిర్మించారు. ఈ కాల్వ పరిధిలోని చెరువులు, కుంటలను నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోర్లలో సమృద్ధిగా నీరు లభిస్తుంది. ఆనవాళ్లు కోల్పోతున్న మైనర్లు 25 ఏళ్ల క్రితం ఏఎమ్మార్పీ కాల్వలను తవ్వారు. అప్పట్లో కాల్వల కోసం అధికారులు పెద్ద ఎత్తున భూసేకరణ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం కూడా చెల్లించారు. పానగల్ ఉదయ సముద్రం నుంచి కట్టంగూర్ మండలం అయిటిపాముల చెరువు మీదుగా నకిరేకల్ మండలం సరిహద్దులో ఉన్న మూసీ రిజర్వాయర్ వరకు నకిరేకల్, కట్టంగూర్ మండలాల్లో వంద కిలోమీటర్లపైనే కాల్వలు విస్తరించి ఉన్నాయి. ప్రధాన కాల్వతో పాటు సమీపంలోని చెరువులు, కుంటలు నింపేందుకు మైనర్ కాల్వలు నిర్మించారు. అయితే ప్రధాన కాల్వ పక్కన భూములతోపాటు, మైనర్ కాల్వలకు ఇరువైపులా ఉన్న రైతులు కాల్వల భూములను ఆక్రమించారు. నకిరేకల్ మండలం పాలెం, కేతేపల్లి మండలం గుడివాడ చెరువుకు నీరు తీసుకెళ్లే డీ–53 కాల్వకు ఇరువైపులా భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ ఆనవాళ్లు లేకుండా చేశారు. ఫలితంగా దిగువన ఉన్న చెరువులు, కుంటల్లో నీటి సరఫరాకు ఆటంకంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ కాల్వదారులను పొలంలో కలిపేసుకుంటున్న రైతులు ఫ ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వతోపాటు మైనర్ల కట్టలూ ఆక్రమణ ఫ కాల్వల వెంట దారిలేకుండా చేస్తున్న వైనం ఫ కాల్వ భూములను కాపాడాలని కలెక్టర్కు రైతుల వినతి ఫ పాలెంలో ఆక్రమణలు గుర్తించిన అధికారులు -
యువతరం.. సాహిత్యంలో రాణించాలి
రామగిరి(నల్లగొండ) : యువతరం సాహిత్యంలో రాణించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. నల్లగొండలోని టీఎస్యూటీఎఫ్ భవన్లో ఆదివారం తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో యువకవి సమ్మేళనం, సాహిత్య సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజాన్ని అధ్యయనం చేయకుండా కవిత్వం రాయడం వల్ల సరైన కవిత్వం రాదన్నారు. యువత అక్షరాన్ని ఆయుధంగా మార్చుకుని సమాజాన్ని సంస్కరించడానికి తమవంతు కర్తవ్యం నిర్వహించాలన్నారు. కవి, రచయిత, మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మహాప్రస్థానం పుస్తక పరిచయంపై మాట్లాడుతూ మహాప్రస్థానం యువకులకు లాంగ్ మార్చ్ లాంటిదన్నారు. అనంతరం కవి, రచయిత తెలంగాణ సాహితి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ హసేన రాసిన కవితా సంపుటి ‘నువ్వే ఒక సమూహం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 30 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు, కవులు ఈ సభలో పాల్గొని కవితా పఠనం చేశారు. అనంతరం యువకవులకు జ్ఞాపిక, మహాప్రస్థానం పుస్తకాన్ని బహుకరించి సత్కరించారు. ఉత్తమ కవితలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, మట్టికవి డాక్టర్ బెల్లి యాదయ్య, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ నర్రా ప్రవీణ్రెడ్డి, బాల సాహితీవేత్త పుప్పాల కృష్ణమూర్తి, పెరుమాళ్ల ఆనంద్, ఏభూషి నరసింహ, బైరెడ్డి కృష్ణారెడ్డి, మాదగాని శంకరయ్య, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, బీమార్జున్రెడ్డి, డాక్టర్ సాగర్ల సత్తయ్య, బూర్గు గోపికృష్ణ, పుప్పాల మట్టయ్య, బండారు శంకర్, టి.ఉప్పలయ్య, పగిడిపాటి నరసింహ, గేర నరసింహ, ఆందోజు నాగభూషణం, దాసరి ప్రభాకర్, దాసరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
మూసీకి 866 క్యూసెక్కుల ఇన్ఫ్లో
కేతేపల్లి : ఎగువన వర్షాలు కురుస్తుండటంతో మూసీ ప్రాజెక్టుకు ఆదివారం ఇన్ఫ్లో పెరిగింది. శనివారం సాయంత్రం మూసీ రిజర్వాయర్కు 243 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో ఆదివారానికి 866 క్యూసెక్కులకు పెరిగింది. మూసీ ప్రాజెకు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 641.50 అడుగులకు చేరుకుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పేర్కున్నారు. వానాకాలం పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 231 క్యూసెక్కుల చొప్పున మొత్తం 462 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నెలకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది
ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ సహకారంతో మా ఇంట్లో ఏర్పాటు చేసిన సోలార్ ఆఫ్గ్రిడ్ కోఆపరేటివ్ సిస్టమ్తో నెలకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది. నాలుగు నెలలుగా రూ.6 వేల ఆదాయం వచ్చింది. సోలార్ ప్లేట్ల క్లీనింగ్, సిబ్బందికి సహకరించడం తప్ప ఎలాంటి రిస్క్ లేదు. సోలార్ ప్యానల్కు కోతుల బెడద లేకుండా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. –ముక్కెర అనిత, అయిటిపాముల మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద సాయం ప్రభుత్వ ద్వారా అయితే యూనిట్కు రూ.3 నుంచి రూ.4 వరకు ఆదాయం లభిస్తుంది. స్వబాగ్ ల్యాబ్ వారు యూనిట్కు రూ.16.50 చెల్లిస్తున్నారు. అదనంగా సోలార్ ప్యానల్ యూనిట్ల సంఖ్య పెంచుకుంటే మహిళలు ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది. మధ్య తరగతి కుటుంబాలకు ఇది చాలా పెద్ద సహాయం. – చెవుగోని సైదమ్మ, ఎఫ్పీఓ చైర్మన్, అయిటిపాములసోలార్ ప్యానెల్తో డైరెక్ట్గా బ్యాటరీ చార్జింగ్ సోలార్ విద్యుత్ బ్యాటరీ దేశంలోనే ఇది మొదటి పైలెట్ ప్రాజెక్ట్. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్కు బదులుగా ఈ బ్యాటరీలను వాడవచ్చు. పర్యావరణ పరి రక్షణకు, వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. భవిష్యత్లో మరిన్ని స్వచ్ఛ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మేమే బ్యాటరీలను కొనుగోలు చేసి మహిళలకు ప్రతినెలా రూ.2 వేలు చెల్లిస్తున్నాం. – జి. సుధాకర్బాబు, సీఈఓ స్వబాగ్ ల్యాబ్స్ -
ఘాట్ రోడ్డుకు తొలగుతున్న అడ్డంకులు?
నల్లగొండ: లతీఫ్సాహెబ్ గుట్టపైకి నిర్మించే ఘాట్ రోడ్ల విషయంలో ఎదురైన అడ్డంకులను తొలగించే చర్యలు మొదలయ్యాయి. మత పెద్దలు అడుగుతున్న విధంగా 26 ఎకరాల భూమికి ఫెన్సింగ్ నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రోడ్డు నిర్మాణ అనుకూలత విషయంలోనూ టెక్నికల్ రిపోర్టును మత పెద్దల ముందుంచి ఒప్పించాలని అధికారులు భావిస్తున్నారు. నల్లగొండ పట్టణం నడిబొడ్డున ఉన్న లతీఫ్సాహెబ్ గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మించాలని కొన్ని సంవత్సరాలుగా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని మత పెద్దలు, మైనార్టీ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అదేవిధంగా బ్రహ్మంగారి గుట్టకు ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయాలని 25 సంవత్సరాల నుంచి అక్కడి ప్రజల నుంచి డిమాండ్ ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రెండు ఘాట్రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించారు. ఘాట్ రోడ్డు పనులు ప్రారంభించే సమయంలో కొందరు నేతల అభ్యంతరంతో అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రతి ఏటా ఉర్సుకు భారీగా భక్తులు.. ప్రతి సంవత్సరం లతీఫ్సాహెబ్ గుట్ట వద్ద ఉర్సు సాగుతుంది. నెల రోజుల పాటు ఉర్సు జరుగుతుంది. ప్రతి ఏటా భక్తులు పెరుగుతున్నారు. గుట్టపైకి వెళ్లాలంటే మెట్ల ద్వారా వెళ్లాలి. వృద్ధులు, చిన్నారులు గుట్టపైకి వెళ్లడం చాలా కష్టం. దీంతో ఘాట్ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటు లతీఫ్సాబ్గుట్టపైకి, అటు బ్రహం గుట్టపైకి రోడ్లు వేర్వేరుగా ఘాట్రోడ్లు నిర్మించడానికి మంత్రి రూ.140 కోట్లు మంజూరు చేయించారు. ఆ రోడ్డు నిర్మాణ పనులు ప్రభుత్వం ఆర్అండ్బికి అప్పగించింది. గుట్ట వెనుక భాగం నుంచే రోడ్లు నిర్మించేందకు టెక్నికల్ అధికారులు సూచించిన ప్రకారం టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే సమయంలో కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆదిలోనే ఆగిపోయాయి. గుట్ట ముందు నుంచి ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయాలని మత పెద్దల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. టెక్నికల్ పరంగా ముందు వైపు నుంచి సాధ్యం కాదని వెనుక వైపు నుంచే 3.75 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్లకు అధికారులు ప్లాన్ ఇచ్చారు. ఈ విషయంలో తలెత్తిన అపోహలు తొలగించేందుకు ఇదివరకే జిల్లా ఎస్పీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మత పెద్దల ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. త్వరలోనే మరోమారు మత పెద్దలతో భేటీ అయ్యేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఘాట్ రోడ్డు నిర్మాణంతో పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుంది. ఉర్సు సందర్బంలో లతీఫ్సాహెబ్ గుట్టపైకి వెళ్లే భక్తులు.. ఘాట్ రోడ్డు ఏర్పాటైతే నిత్యం వెళ్లవచ్చు. దుకాణాలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉన్నందున వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా దర్గాకు ఆదాయం పెరగనుంది. ఫ మత పెద్దలు అడుగుతున్న విధంగా 26 ఎకరాలకు ఫెన్సింగ్! ఫ లతీఫ్సాహెబ్ గుట్ట ముందు వైపు నుంచి ఘాట్ రోడ్డుకు లేని అనుకూలత ఫ టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగానే ఒప్పించేలా కసరత్తు ఫ త్వరలో మత పెద్దలతో మరోసారి భేటీ -
నిందితులకు శిక్ష పడాలి
నల్లగొండ : ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్షపడేలా చేసినప్పుడే నేరాలు తగ్గుతాయన్నారు. కేసు తుదిదశలో సాక్షులు, నిందితులు, బాధితులు సమయానికి కోర్టులో హాజరుపరిచేలా చూసుకోవాలన్నారు. ఈ ఏడాది ఒకరికి ఉరి శిక్ష, 10 మందికి జీవిత ఖైదు, వివిధ కేసుల్లో 75 మందికి జైలు శిక్షలు పడ్డాయన్నారు. అనంతరం పలువురికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీసీఆర్బీ డీఎస్పీ రవి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీవాణి, అఖిల, జవహర్లాల్, రంజిత్ కుమార్, డీసీఆర్బీ సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ వెంకట్రెడ్డి, కోర్టు డ్యూటీ లైజెనింగ్ ఆఫీసర్ నరేందర్, కోర్టు డ్యూటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పలువురు ఎస్ఐల బదిలీనల్లగొండ: జిల్లాలో పలువురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ అటాచ్లో ఉన్న కె.రాజివ్రెడ్డి కనగల్కు, కనగల్లో పనిచేస్తున్న పి.విష్ణుమూర్తి నల్లగొండ సీసీఎస్కు, పీఎస్ఐ ఎం.సంజీవరెడ్డిని వీఆర్ నల్లగొండ, గట్టుప్పల్ పీఎస్కు అటాచ్ చేశారు. సీసీఎస్ నల్లగొండ, గట్టుప్పల్ అటాచ్లో ఉన్న జి.వెంకట్రెడ్డిని సీసీఎస్కు బదిలీ చేశారు. వీఆర్లో ఉన్న సిహెచ్.బాలకృష్ణను డిండి పీఎస్కు బదిలీ చేయగా, డిండిలో ఉన్న బి.రాజును డీఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అధిక మొత్తం వసూలు చేయొద్దుమిర్యాలగూడ అర్బన్ : మీసేవ కేంద్రాల్లో నిర్ణిత చార్జి కాకుండా అధిక మొత్తం వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ చల్లా దుర్గారావు అన్నారు. శనివారం మిర్యాగూడ పట్టణంలోని 7, దామరచర్ల మండల కేంద్రంలోని రెండు మీసేవ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం మీసేవ కేంద్రం నిర్వహిచాలని, అధిక వసూళ్లు, ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందింతే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్ఎస్పీ క్యాంపులోని ప్రభుత్వ ఈ–సేవ కేంద్రంలో బయటి వ్యక్తి సేవలు అందిస్తుండటంతో అతడిని బయటకు పంపించారు. ఇకపై ఇలాంటివి పునారావృతం కావొద్దన్నారు. మిగతా అన్నిచోట్లా నిబంధనల మేరకే సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. -
సోలార్ ప్యానెల్తో నేరుగా చార్జింగ్
కట్టంగూర్ : పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్వబాగ్ ల్యాబ్స్కు కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈ డబ్బులతో స్వబాగ్ ల్యాబ్స్ వారు స్వచ్ఛ శక్తి కేంద్రం, మహిళా సంఘాలతో రెండు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకొని అర్హులైన 50 మంది మహిళల ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. మహిళలు వారంలో ఒకటి లేదా రెండుమార్లు సోలార్ ప్యానల్స్ను శుభ్రపరిచి ఆదాయం పొందుతున్నారు. నాలుగు నెలలుగా ప్రతి మహిళ బ్యాంక్ అకౌంట్లో ఒకటో తేదీన సంస్థ వారు రూ.2 వేలు జమ చేస్తున్నారు. మహిళలు సోలార్ ప్లేట్ల క్లీనింగ్, సిబ్బందికి సహకరిస్తే సరిపోతుంది. ఇంటిపై ఏర్పాటుచేసిన రెండు సోలార్ ప్యానల్స్తో నేరుగా బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. ఒక్కో బ్యాటరీ చార్జ్ కావడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. బ్యాటరీ 100 శాతం చార్జ్ అవగానే ఆటోమెటిక్గా చార్జింగ్ ఆగిపోతుంది. స్వబాగ్ ల్యాబ్ వారు ఐఓటీ ద్వారా బ్యాటరీ చార్జింగ్ను తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్లి మరో బ్యాటరీ అమర్చి చార్జింగ్ అయిన బ్యాటరీని స్వచ్ఛశక్తి కేంద్రం వద్దకు తరలిస్తారు. ఒక్కో బ్యాటరీ రెండు యూనిట్లు విద్యుత్ను స్టోరేజీ చేసుకుంటుంది. స్వబాగ్ ల్యాబ్ వారు యూనిట్కు రూ.16.50 చొప్పున మహిళలకు చెల్లిస్తున్నారు. -
శ్రమిస్తే.. విజయం సొంతం
ఫ పాఠశాల స్థాయి నుంచే సివిల్స్పై ఆసక్తి పెంచుకున్న ఫ ఉన్నతాధికారిగా సేవలందించాలనే తపన ఫ స్వతహాగానే సివిల్స్కు ప్రిపరేషన్ ఫ యువత ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలి ఫ భూవివాదాల్లో పోలీసుల జోక్యం సహించను ఫ డ్రగ్స్ నివారణకు అవగాహన సదస్సులు భువనగిరి డీసీపీ అక్షాంశ్యాదవ్ మాది ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా. మా నాన్న అజాబ్సింగ్ యాదవ్. ఆగ్రా యూనివర్సిటీలో జాగ్రఫీ ప్రొఫెసర్. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచే ఉన్నత చదువులపై నాకు ఆసక్తి పెరిగింది. సివిల్ సర్వీస్ పరీక్ష రాయాలని పాఠశాల స్థాయి నుంచే ఆలోచన ఉంది. నాకు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటీవలే నాకు వివాహమైంది. నా భార్య రోష్నీ స్వస్థలం ఢిల్లీ. ఆమె రిపబ్లిక్ టీవీలో ఉద్యోగం చేస్తున్నారు. గ్రేహౌండ్స్లో మొదటి పోస్టింగ్ ఐపీఎస్ శిక్షణ పూర్తయిన తర్వాత నన్ను తెలంగాణ క్యాడర్కు కేటాయించారు. ఆదిలాబాద్లో ట్రైనీ అధికారిగా కొన్ని రోజులు పనిచేశాను. భద్రాచలంలో గ్రేహౌండ్స్ ఏఎస్పీగా తొలిసారిగా విధుల్లో చేరాను. అక్కడ ఏడాది పని చేసిన తర్వాత అప్పటి గవర్నర్ తమిళిసై వద్ద ఏడీసీగా పనిచేశాను. పదినెలల తర్వాత హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేశాను. నేను అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సినీ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ సందర్శన, తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ సంవత్సరం మార్చిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి జోన్ డీసీపీగా వచ్చాను. ప్రజలు తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తాను. ఇక్కడి ప్రజలు సహృదయులు. అన్ని విధాలా పోలీస్ శాఖకు సహకరిస్తారు. పోలీస్ స్టేషన్లలో ల్యాండ్ సెటిల్మెంట్లపై నిఘా పెట్టాం. సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చాం. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ ముమ్మరం చేశాం. రోడ్డు యాక్సిడెంట్లను నిరోధించడం, డ్రగ్స్ నివారణకు అవగాహన చర్యలు చేపట్టడం, కార్డన్ సెర్చ్, నాకాబంది నిర్వహిస్తున్నాం. మహిళలపై జరుగుతున్న దాడుల కేసులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సీసీ కెమెరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, జీరో ఎఫ్ఐఆర్ కేసుల నమోదుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. యూత్ గోల్ ఇదే.. యువత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తే తప్పక విజయం లభిస్తుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. సమాజంలో ఉత్తమ సిటిజన్గా ఎదగాలి. ఆడపిల్లలను గౌరవించాలి. మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.కోచింగ్కు వెళ్లకుండానే.. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ చదివాను. 2015లో డిగ్రీ పూర్తి కాగానే జాగ్రఫీలో పీజీ చేస్తూనే సివిల్స్కు సన్నద్ధమయ్యాను. కోచింగ్కు వెళ్లకుండానే స్వతహాగానే ప్రిపేర్ అయ్యాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించిన బుక్స్ చదివి నోట్స్ తయారు చేసుకున్నా. పుస్తక పఠనం సివిల్స్ సాఽధించడానికి నాకు ఎంతగానో తోడ్పడింది. జాగ్రఫీతో పాటు సివిల్స్కు అవసరమయ్యే పుస్తకాలు చదివాను. తొలి ప్రయత్నంలో 2017లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కానీ, సక్సెస్ కాలేకపోయాను. రెండవసారి ప్రయత్నం చేశాను. 2019లో సివిల్స్ సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యాను. ఇక్కడి ప్రజలు సహృదయులు -
చిట్టి మనసు.. తల్లడిల్లి..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గురుకుల విద్యా సంస్థలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. గతేడాది ఏకంగా 48 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం నెలన్నర వ్యవధిలోనే దాదాపు 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు కేజీబీవీ విద్యార్థులుండగా..ఒక వారం వ్యవధిలోనే నలుగురు మరణించడం చర్చనీయాంశమవుతోంది. ఒంటరితనం..ఒత్తిడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల సొసైటీలతో పాటు విద్యాశాఖ పరిధిలోని జనరల్ గురుకుల సొసైటీ పరిధిలో 1,038 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 4.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇవిగాకుండా విద్యాశాఖ పరిధిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ 600 వరకు ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులకు వసతితో కూడిన ఉచిత బోధన ఉంటుంది. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లల్ని వీటిల్లో చేరుస్తుంటారు. అయితే..ఇంటిపై బెంగ, హాస్టళ్లలో ఒంటరితనం, చదువు నేపథ్యంలో మానసిక ఒత్తిడికి లోనై కొందరు ప్రాణాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుండగా..మరికొన్ని చోట్ల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది వేధింపులు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు విద్యార్థుల ఆత్మహత్యలు నివారించే దిశగా సరైన చర్యలు చేపట్టడం లేదని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ఘటనలకు సంబంధించి ప్రభుత్వం ఏకంగా 20 మంది ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయడం గమనార్హం. బలహీన మనస్తత్వం..కౌన్సెలింగ్ అంతంత మాత్రం! విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ.. ఎక్కువ మంది బలహీనమైన మనస్తత్వం (వీక్ మైండెడ్) కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి దూరంగా ఉంటున్నామనే ఆలోచనలు, ఇతర విద్యార్థులతో పోటీ పడి చదవగలమా అనే ఆత్మన్యూనత భావం... బోధన, అభ్యసన కార్యక్రమాల ఒత్తిడి వారిని ప్రతికూల ఆలోచనలకు ప్రేరేపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవసరమైన కౌన్సెలింగ్ సరిగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ.. బీసీ గురుకుల సొసైటీలో జిల్లా కేంద్రంగా వీక్ మైండెడ్ విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయి. పాఠశాల, కళాశాలలో వీక్ మైండ్ ఉన్న విద్యార్థులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ విద్యార్థులను జిల్లా కేంద్రానికి పంపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎస్సీ గురుకుల సొసైటీలో ‘ప్రాజెక్టు మిత్ర’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు మరింత ముమ్మరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. వారంలోనే నలుగురు..! ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 10 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా, సుమారు వారం వ్యవధిలోనే నలుగురు మరణించారు. » ఈ నెల 13వ తేదీన మహబూబ్నగర్ జిల్లా మల్దకల్ మండలంలోని ఉలిగేపల్లి గ్రామానికి చెందిన కురువ క్రిష్టన్న, సవారమ్మ దంపతుల కుమారుడైన హరికృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. » 14న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల వసతి గృహంలో ఊరబాయి సంధ్య (11) అనే విద్యార్థిని హాస్టల్ భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. » ఈ నెల 15న సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూష మహాలక్ష్మి తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. » ఈ నెల 19వ తేదీ ఉదయం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న సంతోష్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. » జూన్ నెలాఖరులో రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. » ఆసిఫాబాద్లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. » ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన మూడు నెలల్లో ఆరుగురు ఆత్మహత్య చేసుకోగా వీరిలో ముగ్గురు గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూషా మహాలక్ష్మి ఈ నెల 15న తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. చదువుల్లో టాపర్. 9వ తరగతిలో తానే టాపర్. 10వ తరగతిలో కూడా టాపర్గా నిలుస్తానని మాకు చెప్పింది. ఆమె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి..’ అని తనూష తల్లిదండ్రులు వెంకన్న, వసుంధర డిమాండ్ చేశారు.పరిస్థితిని చక్కదిద్దుతున్నాం.. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత బాధాకరం. గురుకులాల వరకు పరిశీలిస్తే.. దీర్ఘకాల వేసవి సెలవుల తర్వాత తిరిగి రావడం.. రెండునెలల పాటు తమకు ఇష్టం వచ్చినట్లుగా కాలం గడిపి..ఒక్కసారిగా ఆ వాతావరణానికి దూరం కావడం విద్యార్థులకు కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిస్థితిని సరిదిద్దే విధంగా గురుకులాల్లో చర్యలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు, తోబుట్టువులతో మాట్లాడేందుకు వీలుగా ‘ఫోన్మిత్ర’ అందుబాటులోకి తెచ్చాం. అన్ని సొసైటీల్లో ఇలా ఫోన్లను ఏర్పాటు చేశాం. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు విద్యార్థులను చైతన్యపరిచేలా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. –అలగు వర్షిణి, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిటీచర్లు, సిబ్బందిని ఎడ్యుకేట్ చేయాలి... గురుకుల విద్యా సంస్థల్లో చదివే పిల్లల వయసు 18 ఏళ్లలోపే ఉంటుంది. ఎదిగీ ఎదగని వయసు కాబట్టి పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని..వారితో సందర్భోచితంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, గురుకుల సిబ్బందిపై ఉంది. ముఖ్యంగా విద్యార్థుల్లో అభద్రతా భావాన్ని తొలగించి, మానసికంగా బలపరిచే బాధ్యత ఉపాధ్యాయులు, సిబ్బంది తీసుకోవాలి. పిల్లలు అన్యమనస్కంగా ఉంటున్నట్లు, చురుగ్గా లేనట్టు గమనిస్తే..వెంటనే సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ఆత్మహత్యలు నివారించవచ్చు. – విశేష్, సైకాలజిస్ట్ -
పదేళ్లు సీఎంననడం అభ్యంతరకరం
నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిపై మరోమారు విరుచుకు పడ్డారు. మరో పదేళ్ల పాటు తానే సీఎంనని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై రాజగోపాల్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’.. అని రాజగోపాల్రెడ్డి ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి. -
బ్యాంకు రుణాలపై అవగాహన అవసరం
చిట్యాల : ప్రతిఒక్కరికి సైబర్ మోసాలు, బ్యాంకు రుణాలు, ఆర్థికాంశాలపై అవగాహన అవసరమని లీడ్ బ్యాంకు స్టేట్ ఆఫీసర్ గోమతి, జిల్లా మేనేజర్ శ్రామిక్ పేర్కొన్నారు. శుక్రవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో జన సురక్ష, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎస్బీఐ ద్వారా అందిస్తున్న సురక్ష, బీమా యోజన, జీవనజ్యోతి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు అధికారులు ప్రమోద్, లింగారెడ్డి, చిట్యాల ఎస్బీఐ మేనేజర్ జయరాజ్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం అధికారులు డి.సైదులు, ఎం.స్వాతిక, సీఎస్పీ అధికారులు మల్లేష్, మాజీ సర్పంచ్ సుంకరి యాదగిరి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. -
అంతటా వర్షం.. ‘మెట్ట’కు జీవం
నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా జిల్లా వ్యాప్తంగా ముసురుతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో 21.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మర్రిగూడ మండలంలో 75.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కట్టంగూర్ మండలంలో 3.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వివిధ మండలాల్లో వాడుపడుతున్న పత్తి, కంది, పెసర పంటలకు జీవం పోసినట్లయ్యింది. ఈ వానాకాలం సీజన్లో 6,25,452 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 4,32,641 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే కంది 15 వేల ఎకరాలకు గాను 541 ఎకరాల్లో, పెసర వెయ్యి ఎకరాలకు గాను కేవలం 10 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. జిల్లాలో కొన్ని మండలాల్లో లోటు, మరికొన్ని మండలాల్లో అతిలోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవని కారణంగా జిల్లాలో చాలా మండలాల్లో సాగుచేసిన మెట్టపంటలైన పత్తి, కంది, పెసర చేలు వాడుబట్టి చనిపోయే స్థితిలో జిల్లా అంతటా ముసురుతో కూడిన మోస్తరు వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు పెట్టుకునేందుకు సిద్ధం గురువారం మోస్తరు వర్షం కురవడంవతో రైతులు పత్తి, కంది చేలకు ఎరువులు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికు గుంటుకలు తోలుకుని, డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సిద్ధంగా ఉంచుకున్న రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వర్షం కురవడంతో చేలకు ఎరువులు పెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. నత్తనడకన వరినాట్లు ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాలో ఇప్పటి వరకు సరైన వర్షం కురవలేదు. దీనికితోడు నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీటి విడుదల లేని కారణంగా వరినాట్లు నత్తనడకన సాగుతున్నాయి. కేవలం నాన్ఆయకట్టు ప్రాంతంలో మాత్రమే రైతులు ఇప్పటి వరకు కేవలం 34,284 ఎకరాల్లో వరినాట్లు వేసుకున్నారు. గత వానాకాలం సీజన్లో జూలే రెండో వారం వరకు 43,260 ఎకరాల్లో వరినాట్లు వేసుకున్నారు. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది 10 వేల ఎకరాలు తక్కువ వరినాట్లు వేశారు. నాన్ఆయకట్టులో పెద్దగా నాట్లు పడలేదు. ఆయకట్టులో కొన్నిచోట్ల వరినాట్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. సాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేస్తేనే ఆయకట్టులో వరినాట్లు ఊపందుకోనున్నాయి. వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో..) మండలం వర్షపాతం మర్రిగూడ 75.4 గుండ్లపల్లి 44.6 తిరుమలగిరిసాగర్ 43.1 చింతపల్లి 41.6 మిర్యాలగూడ 34 నిడమనూరు 33.8 చిట్యాల 4.9 నార్కట్పల్లి 3.9 కట్టంగూర్ 3.1 శాలిగౌరారం 23.7 నకిరేకల్ 22.2 కేతేపల్లి 4.3 తిప్పర్తి 8.3 నల్లగొండ 19.7 కనగల్ 15.2 మునుగోడు 24.0 చండూరు 8.8 నాంపల్లి 4.4 గుర్రంపోడు 17.3 అనుముల హాలియా 26.1 త్రిపురారం 26.3 మాడుగుపల్లి 11.0 వేములపల్లి 28.9 దామరచర్ల 21.5 అడవిదేవులపల్లి 3.3 పెద్దవూర 26.7 పీఏపల్లి 17.8 నేరెడుగొమ్ము 6.0 కొండమల్లేపల్లి 22.0 దేవరకొండ 21.5 చందంపేట 3.5 గట్టుప్పల్ 28.3 గుడిపల్లి 21.5 ఫ జిల్లాలో 21.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు ఫ అత్యధికంగా మర్రిగూడలో 75.4 మి.మీ. ఫ అత్యల్పంగా కట్టంగూర్లో 3.1 మి.మీ. ఫ వాడుతున్న పత్తి, కంది, పెసర చేలకు ఊతం -
సాగు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
కేతేపల్లి: వ్యవసాయం చేసే ప్రతి రైతు సాగు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని భూచట్టాల నిపుణుడు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ అన్నారు. లీఫ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సాగు న్యాయ యాత్రలో భాగంగా శుక్రవారం కేతేపల్లిలోని రైతు వేదికలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సవస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు భూమి, వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించటం కోసమే తాము సాగు న్యాయ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రైతుల భూసమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భూమి ఉండి పాసు పుస్తకం లేకపోయినా, రికార్డుల్లో వివరాలు తప్పుగా నమోదైనా, ఇతర ఏ భూసమస్య ఉన్నా ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సదస్సులో భూదాన్బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి, ఓఎస్డీ శ్రీహరి వెంకటప్రసాద్, కేతేపల్లి ఏఓ బి.పురుషోత్తం, ఆర్ఐ వెంకన్న, ఏఈఓలు బాలరాజు, నాగరాజు, ఉమేష్, లీఫ్స్ సంస్థ ప్రతినిధులు జీవన్, అభిలాష్, రవి, ప్రవీణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫ వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ -
ప్రతి ఎకరాకు సాగునీరందించడమే లక్ష్యం
కేతేపల్లి: ప్రతి ఎకరాకు సాగు నీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. వానాకాలం పంటల సాగుకు గాను శుక్రవారం ఆయన కుడి కాల్వ ఆయకట్టుకు మూసీ ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వాయర్లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉండడంతో వానాకాలంలో రైతులు వరినాట్లు వేసుకునేందుకు సాగుకు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. కాల్వలకు వదిలిన నీరు వృథా కాకుండా చివరి ఆయకట్టు భూములకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండు సీజన్లలో 60 వేల ఎకరాల భూములకు సాగు నీరందించే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి అంశాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్రెడ్డి, మూసీ ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్రెడ్డి, కేతేపల్లి తహీసీల్దార్ రమాదేవి, ఏఈలు మమత, స్వప్న, మధు, నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మందడి వెంకట్రాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోట మల్లికార్జునరావు, మాజీ ఎంపీపీ పి.శేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్యాదవ్, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ఫ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫ మూసీ కుడి కాల్వకు నీటి విడుదల -
పరిషత్ పోరుకు ఇబ్బందే!
నల్లగొండ: జిల్లా పరిషత్ ఎన్నికలకు గెజిటెడ్ అధికారుల కొరత ఇబ్బందిగా మారనుంది. గత ఫిబ్రవరి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో అటు గ్రామ, ఇటు జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో జిల్లా పరిషత్ అధికారులు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతంలో జెడ్పీటీసీ ఎన్నికలకు ఆర్ఓలుగా నియమించిన గెజిటెడ్ ఆఫీసర్లు కొందరు పదవీ విరమణ పొందడంతో ఎన్నికలకు సిబ్బంది కొరత ఏర్పడింది. వెతుకులాటలో అధికారులు.. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం.. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతోపాటు ఎన్నికల సిబ్బందిని నియమించింది. అయితే జెడ్పీటీసీ స్థానాల ఎన్నికకు మండల ప్రత్యేక అధికారులనే రిటర్నింగ్ అధికారులుగా నియమించింది. నాలుగు ఎంపీటీసీలకు ఒక ఆర్ఓను గెజిటెడ్ హెడ్మాస్టర్లను ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ ఇతర శాఖలకు సంబంధించిన ఇంజనీర్లను, గెజిటెడ్ అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. వారికి ఫిబ్రవరిలోనే శిక్షణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం చందంపేట, మరికొన్ని మండలాల్లో గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఎంఈఓలు రిటైర్ అయ్యారు. వారి స్థానంలో తిరిగి గెజిటెడ్ అధికారులను నియమించేందుకు ఆ స్థాయిలో ఇన్చార్జ్లను వెతుకుతున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎంపిక చేసిన ఆర్ఓ అధికారులను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వినియోగించకపోవడం వల్ల గెజిటెడ్ అధికారుల కొరత నెలకొంది. ఒక్క జిల్లాలోనే అవసరానికి మించి.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు మొత్తం 24,888 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 22,257 మంది మాత్రమే ఉన్నారు. అయితే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అవసరానికి మించి బ్యాలెట్ బాక్స్లు ఉన్నాయి. అలాగే ఒక్క సూర్యాపేట జిల్లాలో మాత్రమే ఎన్నికల సిబ్బంది అవసరానికి మించి ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా నల్లగొండ సూర్యాపేట యాదాద్రి జెడ్పీటీసీలు 33 23 17 ఎంపీటీసీలు 353 235 178 పోలింగ్కేంద్రాలు 1,925 1,273 994 కావాల్సిన బ్యాలెట్బాక్స్లు 2,406 1,592 1,934 ప్రస్తుతం ఉన్న బాక్స్లు 5,876 1,842 1,650 అవసరమున్న సిబ్బంది 11,550 6,616 6,719 ప్రస్తుతం ఉన్నది 9,588 6994 5,677 ఫ వేధిస్తోన్న గెజిటెడ్ అధికారుల కొరత ఫ గతంలో శిక్షణ పొందినవారిలో రిటైరైన కొందరు ఫ కొత్త వారిని వెతుకుతున్న యంత్రాంగం ఫ ఉమ్మడి జిల్లాలో అవసరమున్న సిబ్బంది 24,888 మంది ఫ ప్రస్తుతం ఉన్నది 22,257 మంది మాత్రమే.. రెండు విడతల్లో ఎన్నికలైతే.. సరిపోతారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహిస్తే పోలింగ్ సిబ్బంది కొరత ఉండదు. మొదటి విడత ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది రెండో విడతకు కూడా కొందర్ని ఉపయోగించవచ్చు. ఎన్నికలకు సంబంధిచి ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ పూర్తయింది. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉన్నాయి. – శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ, నల్లగొండ -
జలవిద్యుత్పై అధికారులకు దిశానిర్దేశం
నాగార్జునసాగర్: రాష్ట్రంలోని హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టుల్లోని అన్ని యూనిట్లను వినియోగంలోకి తేవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నాగార్జునసాగర్ జెన్కో పవర్హౌస్లో.. హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు అధికారులు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఆయా ప్రాజెక్టుల వారీగా ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన సమయం ప్రకారం ప్రాజెక్టులను పూర్తిచేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని, ఇందుకొక క్యాలండర్ను రూపొందించాలన్నారు. ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో దాని ప్రకారం ప్రతివారం సమీక్షించాలని చెప్పారు. సంవత్సర కాలంలోనే 2,000 మెగావాట్ల పవర్ డిమాండ్ పెరిగిందన్నారు. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని పవర్ సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రపంచంలో వస్తున్న నూతన సాంకేతికతపై సిబ్బందికి అప్డేట్ అయ్యేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. జెన్కో సీఎండీ మొదలుకుని, కింది స్థాయి వరకు కొత్త టెక్నాలజీపై మూడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గడిచిన ఏడాది కాలంలో జెన్కో సిబ్బంది ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం వల్ల ఎలాంటి బ్రేక్ డౌన్లు, విద్యుత్ కోతలు లేవని, అందుకు ఆ శాఖలోని అధికారులు, సిబ్బందిని అభినందించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర జెన్కో సీఎండీ హరీష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, నారాయణఅమిత్, హైడల్ డైరెక్టర్ పి.బాలరాజు, సీఈలు నారాయణ, మంగేష్కుమార్నాయక్, ఎస్ఈలు వెంకటరమణ, ఓఅండ్ఎండీ ఎస్ఈ రఘురాం, సివిల్ ఎస్ఈ డి.రామకృష్ణారెడ్డి, ఈఈ ఉపేందర్, అధికారులు పాల్గొన్నారు. ఫ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేయాలి ఫ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచన ఫ సాగర్ జెన్కో పవర్హౌస్లో అధికారులతో సమీక్ష -
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
హాలియా : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హాలియాలోని లక్ష్మీనర్సింహ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు వివిధ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రవణ్కుమార్, డీపీఎంలు రామలింగయ్య, వీరయ్య, ఏపీఎంలు కళావతి, లలిత, అశోక్కుమార్, లక్ష్మీనారాయణ, నరసింహ, యాదయ్య, ఆర్ఎం శ్రీలేఖ, సీసీ నరసింహాచారి, సైదయ్య, యాదయ్య, తంగమణి, బాలునాయక్, విజయ్కుమార్ పాల్గొన్నారు. రెండు గంటల పాటు నిరీక్షణ ఈ కార్యక్రమం అధికారికంగా మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి రావాల్సి ఉండగా సాగర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనకు వెళ్లారు. మరోపక్క జిల్లాస్థాయి ముఖ్య అధికారులు హాజరు కాలేదు. అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో ఫంక్షన్ హాల్లోకి వచ్చిన మహిళలు బయటకు వెళ్లకుండా కిందిస్థాయి అధికారులు గేటుకు తాళం వేశారు. దీంతో రెండు గంటల పాటు నిరీక్షించిన మహిళలు అసహనానికి గురై తాము వెళ్లిపోతామని అధికారులతో చెప్పడంతో కొందరిని బయటకు పంపారు. ఆ తరువాత జిల్లాస్థాయి అధికారులు రావడంతో కార్యక్రమం సజావుగా కొనసాగింది. ఫ డీఆర్డీఓ శేఖర్రెడ్డి -
సృజనాత్మకత వెలికితీతకే ‘ఇన్స్పైర్ మనక్’
నల్లగొండ: విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత శక్తిని వెలికితీసేందుకే ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని డీఈఓ భిక్షపతి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని డైట్ కళాశాలలో ఇన్స్పైర్ మనక్ అవార్డుల ఆన్లైన్ నామినేషన్పై సైన్స్ ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాల విద్యార్థుల నుంచి సేకరించిన 5 ప్రాజెక్టులను ఆగస్టు 6లోగా ఇన్స్పైర్ యాప్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఇన్స్పైర్ అవార్ుడ్స పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో నవమి ఫౌండేషన్ శ్రవణ్, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, సైన్స్, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ‘చేనేత భరోసా’ ఇవ్వాలినల్లగొండ టౌన్ : జియోట్యాగింగ్ కలిగిన చేనేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకం కింద రుణాలు ఇవ్వాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22, 23, 24 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గంజి నాగరాజు, దండెంపల్లి సత్తయ్య, కందగట్ల గణేష్, జెల్లా నర్సింహ, చెరుకు సైదులు, శ్రీరంగం, వనం గణేష్, ఏలె శ్రీనివాస్, గంజి రాజేష్, రాపోలు వెంకన్న, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. రోస్టర్ పాయింట్లు, ప్రమోషన్లు వేర్వేరుగా ఉండాలినల్లగొండ టౌన్ : రోస్టర్ పాయింట్లు, ప్రమోషన్లు వేర్వేరుగా ఉండాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని టీఎన్జీవోస్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లపై ఎస్సీ ఉద్యోగులు అందరూ సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మొదట రాష్ట్ర అడహక్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న శంకర్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లయ్య, జిల్లా అధ్యక్షుడు శంకర్, ఉపాధ్యక్షులు స్వామి, నందిగామ సైదులు, అసోసియేట్ అధ్యక్షుడు రాకేష్, ప్రధాన కార్యదర్శి కిరణ్, జాయింట్ సెక్రటరీ నీత, ఆర్గనైజింగ్ సెక్రటరీ బెనర్జీ, కోశాధికారి శాంతయ్య తదితరులు పాల్గొన్నారు. 22న ఎన్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవంరామగిరి(నల్లగొండ): ఈ నెల 22న ఎన్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కళాశాలలో విద్యనభ్యసించి అనేకమంది విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడినట్లు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. -
ఒక్కో నీటిచుక్క ఎంతో విలువైనది
ఫ ఈఎన్సీ శ్రీనివాస్ నాగార్జునసాగర్ : వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీటి యాజమాన్యానికి చక్కటి ప్రణా ళిక అవసరమని.. ఒక్కో నీటిచుక్క విలువైనదని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ అన్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో కొనసాగుతున్న కాల్వల మరమ్మతు, ప్రాజెక్టులో పనులపై గురువారం హిల్కాలనీలోని విజయవిహార్ సమావేశ మందిరంలో నల్లగొండ చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్తో కలిసి సమీక్షించారు. అంతకుముందు సాగర్ ప్రధాన డ్యాంతోపాటు గ్యాలరీలు, గేట్లు, స్పిల్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిధుల వినియోగం, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఏ క్షణాన ఆదేశాలు వచ్చినా కాల్వలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.. అందుకు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డ్యాం ఇన్చార్జి ఎస్ఈ మల్లికార్జున్, ఇంజనీర్లు పాల్గొన్నారు. -
విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకోవాలి
నల్లగొండ : సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు వారిని సొంత పిల్లలుగా చూసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో పేస్ రికగ్నేషన్ యాప్ను అమలు చేస్తామని తెలిపారు. వార్డెన్ల ఫేస్ రికగ్నెషన్ యాప్లో హాజరుకాకపోతే వారి జీతాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు వార్డెన్లు హాస్టల్లో ఉండాలని, తప్పనిసరిగా మెనూ పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావద్దన్నారు. ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైతే సంబంధిత అధికారులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు అశోక్రెడ్డి, శ్రీదేవి, రమణారెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. ఇళ్ల కేటాయింపులో విమర్శలకు తావివ్వొద్దు మిర్యాలగూడ : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. గురువారం దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఇంటి గ్రౌండింగ్ మొదలుకోని నిర్మాణం పూర్తయ్యేంతవరకు పూర్తి పారదర్శకత ఉండాలన్నారు. నిబంధనలకు లోబడి నిర్మించుకున్న వారికి మాత్రమే బిల్లులు చెల్లింపు ఉంటుందన్నారు. ఆమె వెంట ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్కుమార్, డీసీఓ పత్యానాయక్, తహసీల్దార్ జవహర్లాల్ తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
స్వచ్ఛ సర్వేక్షణ్లో నీలగిరికి 355వ ర్యాంక్
నల్లగొండ టూటౌన్ : కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీల స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను గురువారం ప్రకటించింది. మూడు లక్షలలోపు జనాభా కేటగిరిలో నీలగిరి మున్సిపాలిటీ 355వ ర్యాంకు సాధించింది. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో 56వ ర్యాంకు సొంతం చేసుకుంది. చెత్త ప్రాసెసింగ్, ఇంటింటి చెత్త సేకరణలో మెరుగైన ఫలితాన్ని రాబట్టింది. డంపింగ్ యా ర్డులో చెత్త రీసైక్లింగ్ పెండింగ్ కారణంగా జాతీయస్థాయి ర్యాంకులో కాస్త వెనుకబడింది. ఉమ్మడి జిల్లాలో పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణలో ప్రతి సంవత్సరం ముందంజలో నిలుస్తున్నప్పటికీ, డంపింగ్ యార్డ్ చెత్త కారణంగా ఆశించిన స్థాయిలో ర్యాంకు సాధించలేకపోయింది. నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ రఘువర్ధన్ సస్పెన్షన్నల్లగొండ : నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ రఘువర్ధన్పై సస్పెన్షన్ వేటు పడింది. చిట్యాలకు చెందిన ఓ బాలిక పేరున ఉన్న 121 గజాల భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన విషయంలో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సబ్ రిజిస్ట్రార్ 2పైన కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినా.. పాత పద్ధతిలోనే అక్రమాలు జరుగుతుండడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు ఎంపీడీఓలకు పోస్టింగ్ ఆర్డర్లునల్లగొండ : ఇతర జిల్లాల నుంచి నల్లగొండకు బదిలీపై వచ్చిన నలుగురు ఎంపీడీఓలకు గురువారం జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరావు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చిన బి.యాకుబ్నాయక్ను నల్లగొండ ఎంపీడీఓగా, డి.జితేందర్రెడ్డిని వేములపల్లి ఎంపీడీఓగా, సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన జె.వెంకటేశ్వర్రావును నకిరేకల్ ఎంపీడీఓగా, సంగారెడ్డి నుంచి వచ్చిన ఎస్.సుధాకర్ను తిప్పర్తి ఎంపీడీఓగా నియమించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షులు కొప్పు రాంబాబు, ఇతర అధికారులు ఉన్నారు. చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.22,90,630నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు విచ్చేసి స్వామి వారికి మొక్కుబడిగా 34 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీలను గురువారం లెక్కించారు. మొత్తం 22,90,630 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ నవీన్కుమార్ తెలిపారు. అన్నదానం హుండీని లెక్కించగా రూ65,120 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, నర్సిరెడ్డి, రాజయ్య, వెంకటయ్య, రాజలక్ష్మి, వంశీ, నరేష్, చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి, డైరెక్టర్లు మారుపాక ప్రభాకర్రెడ్డి, పసునూరి శ్రీనివాస్, వంపు శివశంకర్, రాధారపు భిక్షపతి, బొబ్బలి దేవేందర్, మేక వెంకట్రెడ్డి, కృష్ణయ్య, కొండేటి వేణు, యాదయ్య, యాదగిరి, శ్రీను, శంకరయ్య, మల్లేష్ పాల్గొన్నారు. సైకిల్ యాత్రను జయప్రదం చేయాలినల్లగొండ టౌన్ : డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్, లోన్ యాప్లను అరికట్టాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ కోరారు. సైకిల్యాత్ర కరపత్రాలను గురువారం నల్లగొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సైకిల్ యాత్ర ఈ నెల 24 నుంచి నకిరేకల్లో ప్రారంభమై, ఆగస్టు 2న మిర్యాలగూడలో ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు వడ్డగాని మహేష్, కట్ట లింగస్వామి, బి.లింగరాజు, అలివేలు పాల్గొన్నారు. -
వడ్డీ వచ్చేసింది!
మూడేళ్లుగా అందని వడ్డీ మూడేళ్ల నుంచి మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు అందడం లేదు. తీసుకున్న రుణాన్ని బ్యాంకుల్లో సకాలంలో చెల్లించిన వెంటనే ప్రభుత్వం ఆ మహిళా సంఘాలకు వడ్డీ చెల్లించాలి. కానీ మూడేళ్లుగా వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర పూర్తయింది. దీంతో ప్రభుత్వం వాటిని విడతల వారీగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలోని ఆయా సంఘాలకు రూ.38.63 కోట్లు విడుదల చేసింది. అయితే జిల్లాల్లో మహిళ సంఘాలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికి సకాలంలో ఆయా రుణాలను వడ్డీతో సహా చెల్లించిన సంఘాలు 41 వేలకుపైగా ఉన్నాయి. ఆయా సంఘాలకు ఇప్పుడు వడ్డీ బకాయిలు అందనున్నాయి. మూడేళ్ల తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ బకాయి విడుదల సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు మంజూరయ్యాయి. మూడేళ్లుగా రుణాలు తీసుకొని అసలు, వడ్డీ సక్రమంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళల సంఘాలకు రూ.38.63 కోట్లు విడుదల చేసింది. విడుదలైన వడ్డీ బకాయిల్లో నల్లగొండ జిల్లాలోని మహిళ సంఘాలకు రూ.20.80 కోట్లు, సూర్యాపేటకు 5.43 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ.12.40 కోట్లు ఇచ్చేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆ వడ్డీ బకాయిలను ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబురాల ముగింపు సమావేశంలో శుక్రవారం అందజేసేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఆయా మహిళ సంఘాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. రుణాలు సక్రమంగా చెల్లించిన సంఘాలకే.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 70 వేల వరకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు, వారు చేసే వ్యాపారాలు ఇతరత్రా పనులకు పోత్సాహం అందించేందుకు ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తోంది. అయితే బ్యాంకులనుంచి రుణాలను తీసుకున్న సంఘాలు ఆ రుణాలను క్రమం తప్పకుండా ప్రతి నెలా వడ్డీతో సహా బ్యాంకుల్లో చెల్లించాలి. అలా చెల్లించిన మహిళా సంఘాలకే ప్రభుత్వం ఆ వడ్డీని తిరిగి మహిళా సంఘాల ఖాతాలో జమ చేస్తుంది. ఇలా నల్లగొండ జిల్లాలో 19,390, సూర్యాపేటలో 10,603, యాదాద్రి జిల్లాలో 11,209 సంఘాలు సక్రమంగా రుణాలు చెల్లించాయి. ఆయా సంఘాలన్నింటికీ ప్రభుత్వం వడ్డీ బకాయిలను విడుదల చేసింది. ఫ ఉమ్మడి జిల్లాకు రూ.38.63 కోట్లు కేటాయింపు ఫ మహిళా సంఘాల హర్షం ఫ ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పంపిణీ వడ్డీ పంపిణీ వివరాలు ఇలా.. జిల్లా వడ్డీ పొందే వచ్చిన మొత్తం సంఘాలు (రూ.కోట్లలో)నల్లగొండ 19,390 20.80 సూర్యాపేట 10,603 5.43 యాదాద్రి 11,209 12.40 మొత్తం 41,202 38.63 -
ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలి
మిర్యాలగూడ : వానాకాలం సీజన్ ప్రారంభమైనందున సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయకట్టు పరిధిలో రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటికే దుక్కులు దున్ని, నార్లు పోసుకుని.. నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు, కాల్వలు ఎండిపోయి ఉన్నాయని, నీటి విడుదల చేసి చెరువులు, కుంటలు, కాల్వలు ఎండిపోయి ఉన్నాయని, నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని దీనివల్ల భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. నీటి విడుదలపై తక్షణమే స్పష్టమైన ప్రకటక చేయాలని, షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవినాయక్, తిరుపతి రామ్మూర్తి, అప్పారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి -
9,23,449 ఎకరాలకు నీరు
ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రణాళిక ఖరారు వరద పెరిగితే 20వ తేదీ నుంచి నీటి విడుదల ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉండటంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు వస్తున్న వరదనీరు (ఇన్ఫ్లో) 60 వేల క్యూసెక్కుల వరకు తగ్గిపోయింది. ఈ నాలుగైదు రోజుల్లో వర్షాలు పెరిగి శ్రీశైలం నుంచి సాగర్కు ఇన్ప్లో ఎక్కువగా ఉంటే ఈ నెల 20వ తేదీ నుంచి ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వానాకాలం సీజన్లో ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదల ప్రణాళికను రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ ఖరారు చేసింది. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ, ఆసిఫ్నహర్, డిండి, ఎస్సారెస్పీ స్టేజ్– 2, మూసీ, ఎత్తిపోతల పథకాల కింద వానాకాలంలో మొత్తం 9,23,449 ఎకరాల్లో పంటల సాగుకు నీటిని విడుదల చేసేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిని వృథా చేయకుండా ఆన్అండ్ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆయా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లాలోని సాగునీటి పారుదల శాఖ అధికారులు షెడ్యూల్ ఖరారు చేసి నీటిని విడుదల చేయనున్నారు. నీటి కేటాయింపులు ఇలా.. ● నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద నల్లగొండ జిల్లాలో1,44,727 ఎకరాల ఆయకట్టు ఉండగా.. వానాకాలం సాగకు 16.50 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇక ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ కింద 2,76,461 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 28 టీఎంసీల నీటికి ఇవ్వనున్నారు. ● ఆసిఫ్నహర్ కింద 15,245 ఎకరాలకు 1.5 టీఎంసీల నీరు కేటాయించారు. ● డిండి ప్రాజెక్టు కింద 12,975 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించిన కమిటీ వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది నిర్ణయించాలని స్పష్టం చేసింది. నీటి కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ● సూర్యాపేట జిల్లాలో సాగర్ ఎడమకాల్వ కింద ఎత్తిపోతల పథకాలతో కలుపుకుని 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉండగా వానాకాలం సాగుకు 18 టీఎంసీల నీటిని కేటాయించింది. ● ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద సూర్యాపేట జిల్లాలో 2,14,080 ఎకరాలకు నీటిని ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది ఖరారు చేయాలని సూచించింది. ● మూసీ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు 4.28 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించింది. ఫ సాగర్, మూసీ, ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ, ఎత్తిపోతల పథకాల కింద నీరు ఫ ఆన్ ఆఫ్ పద్ధతిలో నీరివ్వాలని సూచించిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ ఫ ఎస్సారెస్పీ, డిండి కింద ఇన్ఫ్లో ఆధారంగా నీటి విడుదల ఫ సాగర్కు ఇన్ఫ్లో పెరిగితే ఈ నెల 20న, లేదంటే ఆగస్టు 1న ఎడమకాల్వకు నీరు -
విద్యతోనే మెరుగైన జీవితం
నిడమనూరు : విద్యతోనే మెరుగైన జీవితం, ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిడమనూరు కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం సాయంత్రం ఆమె సందర్శించారు. రాత్రి 8.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఈ సందదర్భంగా విద్యార్థినులతో ముచ్చటించారు. తాను ఉత్తరప్రదేశ్ లక్నో నుంచి నల్లగొండకు కలెక్టరుగా వచ్చానని.. చదువుకుంటే ఎక్కడికై నా వెళ్లవచ్చని, ఏదైనా సాధించవచ్చని చెప్పారు. పాఠశాల గోడపై ఉన్న హిందీ స్లోగన్స్ను విద్యార్థినులతో చదివించారు. పలు ప్రశ్నలు అడిగి చాక్లెట్లు ఇచ్చారు. 9వ, 10వ తరగతి విద్యార్థినులు తమ సహచర 6వ, 7వ, 8వ తరగతి చిన్నారుల ఆరోగ్యం, విద్యలో సలహాలు అందిస్తూ, మంచిగా చూసుకుంటే.. 9వ, 10వ తరగతి విద్యార్థులను డిసెంబరు 25న హైదరాబాద్ టూర్కు పంపుతానని, ఇంటర్లో ప్రథమ ర్యాంకు సాధిస్తే విమానం ఎక్కే అవకాశం కల్పిస్తానని చెప్పారు. విద్యాలయంలో మరమ్మతు పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఏఈకి సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, ఎండీఓ వెంకటేషం, ఎంఈఓ ఎల్.వెంకన్న, పంచాయతీ కార్యదర్శి మధు తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
భూ భారతి సమస్యలు పరిష్కరించాలి
చండూరు : భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయడంతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె చండూరు ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీదేవితో సమావేశమయ్యారు. రేషన్కార్డుల పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని ఆదేశించారు. చెర్లగూడం రిజర్వాయర్ బాధితులు ఇటీవల పనులను నిలిపివేసిన విషయంపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ ఏఓ పద్మ, డీటీ పరమేష్, ఇన్చార్జి తహసీల్దార్ నిర్మల, ఆర్ఐ ప్రసన్న ఉన్నారు. -
‘స్థానిక’ స్థానాలు ఖరారు
జిల్లాలో 33 చొప్పున జెడ్పీటీసీలు, ఎంపీపీలు, 353 ఎంపీటీసీలు ఆర్డినెన్స్పై ఉత్కంఠ! స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అర్డినెన్స్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ ఆమోదిస్తారా.. లేక తిప్పిపంపుతారా అన్న చర్చ సాగుతోంది. ఒక వేళ గవర్నర్ ఆమోదిస్తే దాని ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు కానున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల వారీగా స్థానాలను ఖరారు చేసి జాబితాలను వెల్లడించింది. దీంతోపాటు స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు సైతం అందాయి. పెరిగిన నాలుగు ఎంపీటీసీ స్థానాలు జిల్లాలో 2019లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 31 చొప్పున జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు మండలాలు పెరిగాయి. దీంతో ఎంపీపీ, జెడ్పీ స్థానాల సంఖ్య 33కు చేరింది. ఇక గతంలో 349 ఎంపీటీసీ స్థానాలుండగా ఎంపీటీసీ నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా 4 స్థానాలు పెరిగాయి. ఆ ఎంపీసీటీల సంఖ్య 353క చేరింది. పెరిగిన స్థానాలన్నింటిని జిల్లా అధికారులు జాబితాను ప్రభుత్వానికి పంపడంతో ప్రభుత్వం వాటిని నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యంత్రాంగానికి ఆదేశాలు.. స్థానిక సంస్థల స్థానాలు ఖరారు కావడంతో ఇక గ్రామాల్లో ఎన్నికల సమరభేరీ మోగనుంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అఽధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు కావాల్సిన మెటీరియల్, అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో, డీపీవోలు, పోలీస్శాఖకు ఆదేశాలు అందాయి. ఫ కొత్తగా పెరిగిన 4 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు ఫ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఫ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు -
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
నల్లగొండ టౌన్ : జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్పామ్ ప్యాక్టరీ నిర్మించాలని కోరారు. కరువు పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడం కోసం ఆనాడు కేసీఆర్ డిండి ఎత్తిపోతల పథకానికి హడావుడిగా శంకుస్థాపన చేశారని చెప్పారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా, ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదించకుండా, ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈ నెల 15న దేవరకొండలో నిర్వహించిన సీపీఐ జిల్లా మహాసభలో తను జిల్లా కార్యదర్శిగా, సహాయ కార్యదర్శులుగా పల్లా దేవేందర్రెడ్డి, లొడింగి శ్రవణ్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. మునుగోడులో కిష్టాపురం, గట్టుప్పల్, చిట్యాల మండలంలోని వెలిమినేడు ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఫార్మ కంపెనీలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారని దీన్ని అడ్డుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్రెడ్డి, లొడంగి శ్రవణ్కుమార్, పబ్బు వీరస్వామి, నర్సింహ, రామచంద్రం, రామలింగయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
దరఖాస్తు గడువు పొడిగింపు
నల్లగొండ : జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు –2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించినట్లు డీఈఓ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు nationalawardstoteachers.ed ucation.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 17లోగా రిజిస్ట్రేషన్, 20లోగా ఫైనల్ సబ్మిషన్ చేయాలని పేర్కొన్నారు. పైనల్ సబ్మిషన్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తగిన ఆధారాలు జతపరిచి వారి ఫొటోలు, వీడియో పెన్డ్రైవ్లో వేసి మూడు ప్రతులు ఎంఈఓ ద్వారా డీఈవో కార్యాలయంలో ఈ నెల 22లోగా సమర్పించాలని సూచించారు. భూ సర్వేకు రైతులు సహకరించాలిచందంపేట : భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ సర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. బుధవారం చందంపేట మండలంలోని అచ్చంపేటపట్టి గ్రామంలో నిర్వహించిన భూ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ఆర్జీలు పెట్టుకున్న రైతులకు సంబంధించి వ్యవసాయ భూములను క్షేత్రస్థాయిలో సర్వేయర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని, సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండాలన్నారు. త్వరలోనే బొల్లారం, కంబాలపల్లి, పొగిళ్ల, రేకులగడ్డ, చిత్రియాల గ్రామాల్లో సర్వే నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీధర్బాబు, ఆర్ఐ సురేష్, హబీబ్, అనిల్ ఉన్నారు. ఆదర్శ హాస్టల్ తనిఖీమర్రిగూడ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల హాస్టల్ను డీఈఓ భిక్షపతి బుధవారం తనిఖీ చేశారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో సోమవారం 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా సిబ్బంది వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఈ విషయంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విచారణ నివేదికను కలెక్టర్కు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం చండూరు ఆర్డీఓ వి.శ్రీదేవి సైతం హాస్టల్ను తనిఖీ చేసి వంట సామగ్రిని పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ జి.చినమునయ్య, ఎస్ఓ జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. అమృత్ పనులు త్వరగా పూర్తి చేయాలినల్లగొండ టూటౌన్ : అమృత్ పథకం ద్వారా చేపడుతున్న తాగునీటి ట్యాంక్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సీడీఎంఏ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ పి.శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నీలగిరి పట్టణంలో అమృత్ స్కీం ద్వారా చేపడుతున్న తాగునీటి ట్యాంకుల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పనుల్లో నాణ్యత ఉండేలా ప్రజారోగ్య శాఖ మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ప్రజారోగ్య శాఖ ఈఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈఈ మనోహర్, ఏఈ నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి
మిర్యాలగూడ : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నారాయణ్అమిత్, డీఎస్పీ రాజశేఖర్రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీ, విద్యుత్, రోడ్లు తదితర సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఐదు వార్డుల చొప్పున ఆయా కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, చిరు వ్యాపారుల సమస్యలు, రోడ్డు మీద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2వేల ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు గాను ఇసుక కొరతను నివారించేందుకు స్యాండ్ బజార్ ఏర్పాటు చేసి ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అర్హులందరికీ రేషన్కార్డులు మంజూరయ్యాయని, రెండు రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు. అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
లీజు పూర్తి.. గుంతలు అసంపూర్తి!
మిర్యాలగూడ : దామరచర్లలోని నార్కట్పల్లి– అద్దంకి రహదారి వెంట ఓ సిమెంట్స్ పరిశ్రమయాజమాన్యం మైనింగ్ నిర్వహించిన ప్రాంతంలో గుంతలు పూడ్చకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. సదరు పరిశ్రమ రహదారికి వంద అడుగుల దూరంలో వాడపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని అటవీ, ప్రభుత్వ భూముల్లో నాపరాయి తవ్వకాల కోసం 35 ఏండ్ల క్రితం లీజుకు తీసుకుని.. 25 ఏళ్లపాటు తవ్వకాలు జరిపి మైనింగ్ నిర్వహించింది. 8 సంవత్సరాల క్రితం లీజు గడువు పూర్తికాగా మైనింగ్ నిలిపివేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గనుల ప్రదేశాలను మట్టితో పూడ్చి చెట్లను నాటి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ గుంతలను అలాగే వదిలేయడంతో ప్రస్తుతం అవి ప్రమాదకరంగా మారాయి. సుమారు వంద అడుగుల లోతు వరకు గోతులు ఉండడంతో వాటిలో నీరు చేరాయి. పశువులు, మూగ జీవాలు అందులోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నాయి. హైవే పక్కన గుంతలు ఉండడంతో అవి కనిపించకుండా చుట్టూ నాపరాయి గోడను నిర్మించారు. స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేయగా అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పూడ్చకుండా వదిలేసిన గుంతలు -
సీఎం రేవంత్రెడ్డివి అబద్ధపు ప్రచారాలు
రామగిరి(నల్లగొండ) : సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తుంగతుర్తి సభలో రేవంత్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ దురుద్దేశంతో మాట్లాడారన్నారు. కేసీఆర్, కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడడం తగదదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6.47 లక్షల రేషన్కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. సభలో రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల మీద ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చీకటి ఒప్పందాల కోసం మోదీని కలుస్తారని.. కానీ బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు అడగడం లేదన్నారు. జగదీశ్రెడ్డి మీద వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను పారించిన ఘనత కేసీఆర్దే అన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తక్షణమే సాగర్ ఎడమ కాల్వకు నీరిచ్చి నారుమళ్లను కాపాడాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నాయరకులు నిరంజన్ వలి, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, కటికం సత్తయ్యగౌడ్, పంకజ్ యాదవ్, ప్రసన్నరాజ్ పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ -
బామ్మర్ది భార్యతో బావ వివాహేతర సంబంధం..!
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: భర్త వేధింపులతో విసిగిపోయిన మహిళ తన సోదరుడు, ప్రియుడితో కలిసి అతడిని కారుతో ఢీకొట్టించి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు ఈ ఘటనపై అనుమానంతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. అసలు జరిగింది ఇదీ..ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేసేవాడు. స్వామి భార్య స్వాతి కూడా భువనగిరి హౌసింగ్బోర్డు కాలనీలో ఎస్ఎన్ మోటార్స్లో పనిచేసేది. ఆ పక్కనే మార్బుల్ దుకాణంలో పనిచేసే తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్తో స్వాతికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత స్వాతి పనిచేసే ఎస్ఎన్ మోటార్స్ మూతపడింది. ఈ క్రమంలో స్వాతి పల్లెర్ల గ్రామానికి వచ్చి ఇంటికే పరిమితమైంది. కొన్ని రోజుల తర్వాత స్వామికి భువనగిరి నుంచి మోత్కూరుకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో స్వామి తన భార్య స్వాతిని తాను పనిచేసే ట్రాక్టర్ షోరూంలోనే ఉద్యోగంలో చేర్పించాడు. గొడవలు ఇలా..స్వాతి సోదరుడు మహేశ్కు ఇద్దరు భార్యలు. మహేష్ మొదటి భార్యతో స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహేష్కు తెలియడంతో తన బావ స్వామిపై కోపం పెంచుకున్నాడు. స్వామికి వరుసకు సోదరి అయిన తన భార్యతో సంబంధం పెట్టుకున్న విషయాన్ని మహేష్ స్వాతితో చెప్పాడు. దీంతో స్వాతి తన భర్త స్వామిని నిలదీసింది. నన్నే నిలదీస్తావా అంటూ స్వామి స్వాతిని మానసికంగా, శారీరకంగా వేధించడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో స్వామి, స్వాతి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఫిబ్రవరిలో పని నిమిత్తం మోత్కూరుకు వెళ్లిన సాయికుమార్కు అక్కడ స్వాతి కలిసింది. తన భర్త వేధిస్తున్న విషయాన్ని స్వాతి సాయికుమార్కు వివరించింది. సాయికుమార్ స్వాతిని ఓదార్చాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అక్క స్వాతి, సాయికుమార్ వివాహేతర సంబంధానికి మహేష్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని స్వాతి, మహేష్ నిర్ణయించుకున్నారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటుస్వామిని హత్య చేయడానికి సాయికుమార్, స్వాతి, మహేష్ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలలుగా వాట్సాప్ గ్రూపులోనే మాట్లాడుకుని తర్వాత కాల్స్ డిలీట్ చేసేవారు. స్వాతి తన ప్రియుడు సాయికుమార్ నంబర్ను కూడా సెల్ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు. కారు అద్దెకు తీసుకుని..ఈ నెల 13న తన భర్త స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేష్కు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై భువనగిరిలో నిఘా పెట్టారు. స్వామిని హత్య చేయడానికి పథకం ప్రకారం సాయికుమార్.. తన స్నేహితుడైన భువనగిరి పట్టణంలోని తాతానగర్కు చెందిన చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును సెల్ప్ డ్రైవింగ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ తన స్నేహితుడు మద్దికుంట వీరబాబుతో కలిసి బైక్పై పల్లెర్ల గ్రామానికి బయల్దేరాడు. స్వామిని సాయికుమార్ కారులో వెంబడించాడు. రాత్రి 11.15 గంటల సమయంలో మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ శివారులోకి రాగానే కారుతో బైక్ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయారు. రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొట్డడంతో స్వామి అక్కడిక్కడే మృతిచెందగా.. బైక్పై వెనుక కూర్చున్న వీరబాబుకు గాయాలయ్యాయి. కారు అతివేగంగా వెళ్లి బైక్ను ఢీకొట్టిన అనంతరం కంట్రోల్ కాలేదు. రోడ్డు కిందకు 50 మీటర్ల వరకు దూసుకుపోయింది. అక్కడ ఫెన్సింగ్ కడీలకు తగిలి ముందుకు కదలకుండా ఆగిపోయింది. సాయికుమార్కు çస్వల్పంగా గాయాలయ్యాయి. స్వామిని హత్య చేసేందుకు ప్లాన్ అమలు చేస్తున్న సమయంలో మహేష్, స్వాతి, సాయికుమార్ వాట్సాప్ గ్రూప్ కాల్లో మాట్లాడుకున్నారు. వాట్సాప్ కాల్లో స్వామిని కారుతో ఢీకొట్టి చంపేశామన్న విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న స్వాతి తమ్ముడు మహేశ్ ద్విచక్ర వాహనంపై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాయికుమార్, రామలింగస్వామిని బైక్పై ఎక్కించుకుని భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. ఆస్పత్రికి వచ్చిన భార్య, బావమరిది ఘటనా స్థలంలో స్వామి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా ఫోన్లో విషయం తెలుసుకున్న స్వాతి, మహేష్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.నిందితుల అరెస్ట్గుంటి సాయికుమార్, స్వాతి, పొట్టెపాక మహేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు భునగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ తెలిపారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ శంకర్గౌడ్, మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్యాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కారుతో.. కదిలిన డొంకరోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్యాదవ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారులో ముందు భాగం దెబ్బతినడంతో కారు నంబర్ ఆధారంగా కారు యజమానికి ఫోన్ చేసి విచారించగా.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం కారు అద్దెకు తీసుకెళ్లాడని సమాచారం ఇచ్చాడు. దీంతో సాయికుమార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. సాయికుమార్ సెల్ఫోన్ చెక్ చేయగా స్వాతి నంబర్ కనిపించింది. దీంతో స్వాతిని తీసుకొచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే నిందితులు స్వామి కాళ్లు, చేతులు విరిచి దివ్యాంగుడిని చేయాలనుకున్నారని తెలిసింది. అయితే అదికాస్త వికటించి అతడు మృతిచెందాడు. -
డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డికి ఉత్తమ అవార్డు
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రాష్ట్రంలోనే మంచి ఫలితాలు సాధించడంతో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మంగళవారం హైదరాబాద్లో ఉత్తమ అవార్డు అందజేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలోనే నల్లగొండ డీసీసీబీని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ప్రసంసించారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శంకర్రావు, రవీందర్రావు, సురేంద్రమోహన్, ఉదయభాస్కర్ ఉన్నారు. 17న జాబ్ మేళానల్లగొండ : నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 17న ఉదయం 10.30 గంటలకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులు నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, బయోడేటాతో జాబ్మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. అర్హత, వేతనం తదితర పూర్తి వివరాలకు 7893420435 ఫోన్నంబర్ను సంప్రదించాలని సూచించారు. 19న పాత వస్తువుల వేలం నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో పాత వస్తువులను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు వేలం వేస్తున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో ఐరన్ లీడింగ్ చైన్లు, కార్పేట్లు, హెల్మెట్లు, పర్నిచర్, కంప్యూటర్లు, ప్రింటర్లను వేలం వేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారు వివరాలకు వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సంతోష్ 8712670169 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిచేయాలినల్లగొండ : నిర్దేశించిన సమయంలో మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు. నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన ఎంపీడీఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనమహోత్సవం కింద గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, నర్సరీలను చేపట్టడం వంటి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. స్వచ్ఛభారత్ కింద పారిశుద్ధ్యం, ఇందిరమ్మ ఇళ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ, వర్మి కంపోస్ట్ తయారీ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ పీడీ రజ్ కుమార్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీపీఓ వెంకయ్య, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు రాకపోతే ఇంటికెళ్లి తీసుకొస్తారుమర్రిగూడ: మర్రిగూడ మండలంలోని దామెరబీనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయుడు కొండ శ్రీనివాస్.. బడికిరాని విద్యార్థుల ఇంటికి వెళ్లి బైక్ తీసుకొస్తారు. విద్యార్థులు గైర్హాజరైతే చాలు వారి ఇంటివెళ్లి రాకపోవడానికి కారణాలు ఏమిటో తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని స్వయంగా బైక్పై ఎక్కించుకొని వస్తుంటారు. ఈ పాఠశాలలో మొత్తం 89 మందివిద్యార్థులు ఉన్నారు. మంగళవారం ముగ్గురు బడికి రాకపోవడంతో హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయుడు ఇద్దరు కలిసి వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పి బైక్పై తీసుకొచ్చారు. స్కూల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడమే లక్ష్యంగా తనవంతు కృషి చేస్తున్నట్లు హెచ్ఎం తెలిపారు. -
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
నల్లగొండ టూటౌన్ : మహిళలు వ్యాపారాలతో ఆర్థిక సాధికారత సాధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో స్వయం సహాయక మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలపై వారికి అవగాహన కల్పించారు. నిబద్ధతతో వ్యాపారాలను ఏర్పాటు చేసి సమాజంలో పెద్ద వ్యాపార వేత్తలుగా మహిళలు రాణించవచ్చన్నారు. వ్యాపారాల నిర్వహణకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయన్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం, శిక్షణ అందిస్తుందని తెలిపారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బీజేపీవి మతోన్మాద రాజకీయాలు
దేవరకొండ : రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ.. మతోన్మాద రాజకీయాలను రెచ్చగొడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం దేవరకొండలోని మందడి నర్సింహ్మారెడ్డి ప్రాంగణంలో నిర్వహించిన సీపీఐ 23వ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసమానతలు లేని సమాజం నిర్మించడమే కమ్యూనిస్టుల లక్ష్యమని అన్నారు. కమ్యూనిజానికి అంతం లేదని.. మానవ సమాజం ఉన్నంత వరకు కమ్యూనిజం ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ లాంటి ఇతర బూర్జువా పార్టీలు వారి ప్రాంతాలకు మాత్రమే పరిమితమని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో 2026మార్చి వరకు మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరకు చెప్పడం దుర్మార్గమన్నారు. కమ్యూనిస్టులంతా ఒకతాటి పైకి వస్తే దోపిడీ వర్గాల రాజ్యాన్ని కూల్చవచ్చన్నారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందాలని ఆకాంక్షించారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిజాన్ని అంతం చేయాలని చేస్తున్న కుట్రలు సమంజసం కాదన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అంతకుముందు సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పల్లా దేవేందర్రెడ్డి, వెంకటేవ్వర్లు, బొల్లె మంజుల అధ్యక్షతన వహించిన ఈ మహాసభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్రావు, ఉజ్జిని యాదగిరిరావు, కాంతయ్య, అంజయ్యనాయక్, పల్లె నర్సింహ, శ్రవణ్కుమార్, వీరస్వామి, అంజాచారి, వెంకటరమణ, నర్సింహ పాల్గొన్నారు. ఫ అసమానతలు లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫ దేవరకొండలో సీపీఐ జిల్లా మహాసభ -
నీటి వృథాను అరికట్టాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫ మద్రాస్ ఐఐటీ బృందంతో సమావేశం నల్లగొండ : నీటి వృథాను అరికట్టి.. ప్రయోగాత్మక పద్ధతి ద్వారా సక్రమ నీటి నిర్వహణకు ముందుకొచ్చిన మద్రాస్ ఐఐటీ బృందానికి అన్ని శాఖల అధికారులు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మద్రాస్ ఐఐటీ బృందం, తాగునీటి సరపరా, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇతర శాఖలు ఐఐటీ బృందానికి సహకరించాలని ఆదేశించారు. బృందం సభ్యులు మాట్లాడుతూ తాగునీటి వృథాను అరికట్టేలా ‘ఐ ట్యాంక్’ యాప్ను రూపొందించి వినియోగిస్తున్నట్లు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీపీఓ వెంకయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఎం.శాంతకుమారి, మద్రాస్ ఐఐటీ బందం ప్రతినిధి సాయి తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీలకు కాంగ్రెస్ పెద్దపీట
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ అన్నారు. మతాల పేరుతో, కులాల పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతుందని, పదేళ్లు పేదలకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. మంగళవారం నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ పట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు దర్గా ఘాట్ రోడ్డుకు నిధులు మంజూరు చేశారని, దీనిపై ఇతర పార్టీలు రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పిస్తుందని, హఫీజ్ఖాన్కు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డిలు మాట్లాడుతూ.. 25 సంవత్సరాలుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ మధ్య కొంతమంది మతం, కులం పేరుతో గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ఏ సమస్య ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఘాట్రోడ్డుపై అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ వర్గాల్లో ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడంతో పాటు పార్టీని గెలిపించుకున్నామని, అందుకే మైనార్టీలు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నూతనంగా నియామకమైన హఫీజ్ఖాన్, నాయకులు డాక్టర్ ఎ.ఎ.ఖాన్, ఇంతియాజ్ హుస్సేన్, జూకూరి రమేష్, వంగూరి లక్ష్మయ్య, సమద్, ఇంతియాజ్ అలీ, అమేర్, ఇబ్రహీం, అజ్జు తదితరులు పాల్గొన్నారు. ఫ దుర్గా ఘాట్రోడ్డుపై రాజకీయాలు సరికాదు ఫ ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ -
‘బుద్ధుడితో నా ప్రయాణం’ నాటక ప్రదర్శన
రామగిరి(నల్లగొండ) : బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నల్లగొండ పట్టణంలోని అలకాపురి కాలనీలోని కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘బుద్ధుడితో నా ప్రయాణం’ నాటికను ప్రదర్శించారు. ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొని నాటకాన్ని తిలకించారు. కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంకు హరి, నామ వెంకటేశ్వర్లు, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ మండల ఆంజనేయులు, కన్వీనర్ నూనె విష్ణు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొత్త నగేష్, కోశాధికారి గోలి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో ఎందుకిలా..?
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సస్పెన్షన్నల్లగొండ : దేవరకొండ మండలం కమలాపూర్ (ముదిగొండ) గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) ఎ.వేదాద్రిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. హెచ్ఎం పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థులను అనారోగ్యం పాలయ్యారని తేలినందున సీసీఏ రూల్స్ ప్రకారం తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని, క్రమశిక్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యేవరకు అమలులో ఉంటాయని తెలిపారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట వద్ద బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంధ్య(11) పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, అదే రోజు దేవరకొండలోని ఆశ్రమ పాఠశాలలో 40 మంది, మర్రిగూడలోని మోడల్ స్కూల్లోని బాలికల హాస్టల్లో 18 మంది విద్యార్థినులు ఫుడ్పాయిజన్తో ఆస్పత్రి పాలయ్యారు. ఇవే కాకుండా మంగళవారం తెలవారుజామున నడిగూడెంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తనూష మహాలక్ష్మి క్లాస్రూమ్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో గురుకులాల్లో అసలు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే తమ పిల్లల బాగోగులపై ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే కారణమా? తూప్రాన్పేట బీసీ గురుకుల పాఠశాలలో సంధ్య ఆత్మహత్య చేసుకోవడం వెనుక సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతోపాటు భద్రతపరమైన లోపాలు ఉన్నట్లు తెలిసింది. నాలుగంతస్తులు ఉన్న ఆ భవనంపైకి వెళ్లేందుకు ఉన్న మెట్ల వద్ద కనీసం గేటు కూడా లేకపోవడంతోనే ఆ బాలిక భవనంపైకి కిందకి దూకినట్లు అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. వందల మంది విద్యార్థులు ఉండే గురుకులాల్లో, అందులోనూ బాలికల గురుకులాల్లో కనీస భద్రత చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాత్రి వేళలలో పర్యవేక్షించాల్సిన సిబ్బంది కూడా పట్టించుకోకపోవడం వల్లే ఆ సంఘటన జరిగినట్లు తెలిసింది. డ్యూటీల సమయంలో మెళకువతో ఉండాల్సి ఉన్నా వారు నిద్రపోవడం వల్లే బాలిక భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లు సమాచారం. ఇక నడిగూడెం కేజీబీవీలో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఇదే పరిస్థితి నెలకొంది. పైగా తరగతి గదికి తాళం వేయలేదని, దాంతో బాలిక తరగతి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, వార్డెన్లు సరిగ్గా పట్టించుకోకపోవడం, అందుబాటులో ఉండకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లేని భోజనంతో ఆసుపత్రులపాలు గురుకులాలతోపాటు సంక్షేమ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపం, అందుబాటులో ఉండకపోవడం, భోజనం నాణ్యతను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. దేవరకొండ, మర్రిగూడ పాఠశాలల్లో ఈ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో భోజనం నాణ్యతను పట్టించుకునే వారే లేరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు మండల కేంద్రంలో విద్యార్థులకు వండి పెడుతున్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని పలుమార్లు హాస్టల్ తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యే, జిల్లా అధికారులకు విద్యార్థులు మొర పెట్టుకున్నారు. అయినా భోజనంలో మార్పు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా అంతటా ఉంది.ఏడాది కాలంలో జరిగిన పలు ఘటనలు ఇవీ.. ● డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గతేడాది జూన్ 3, 4, 5 తేదీల్లో 16 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పటికే అవే గదుల్లో విద్యార్థినులు ఉండాల్సి వస్తోంది. ● గతేడాది దేవరకొండ మండలం కొండభీమనపల్లి బీసీ గురుకులంలో నిద్రిస్తున్న 13 మంది విద్యార్థులను ఎలుకలు కరవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ● పీఏపల్లి మండలంలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో గతేడాది డిసెంబరులో బియ్యం సరిగాలేక, అన్నం సరిగా ఉడకకపోవడంతో విద్యార్థినులు భోజనం చేయలేదు. దీంతో నలుగురు విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. ఫ ఫుడ్ పాయిజన్తో పలువురు ఆస్పత్రి పాలు ఫ పట్టింపులేని సిబ్బంది, అందుబాటులో ఉండని ప్రిన్సిపాళ్లు ఫ కనిపించని ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఫ వరుస సంఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన