breaking news
Nalgonda
-
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ఫ 11 కిలోల గంజాయి స్వాధీనంసూర్యాపేటటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కోదాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను శనివారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం దొరకుంట గ్రామానికి చెందిన అడప రాకేష్ పదిరోజుల క్రితం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో అతడిపై నమోదైన గంజాయి కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు సూర్యాపేట జిల్లా కోర్టుకు వచ్చాడు. అక్కడ అతడికి గంజాయి కేసులోనే వాయిదా గురించి వచ్చిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు కూడా గంజాయి కేసు వాయిదా గురించి వచ్చాడని తెలుసుకున్న రాకేష్ తనకు గంజాయి కావాలని అడిగగా.. జూన్ 29న ఒరిస్సా రాష్ట్రంలోని కల్మెల్లలోని శివమందిర్ గుడి వద్దకు రావాలని చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే జూన్ 28న రాకేష్ ఒరిస్సాకు వెళ్లి అతడిని కలిసి 11కిలోల గంజాయి రూ.11వేలకు కొనుగోలు చేశాడు. ఆ గంజాయిని దొరకుంట గ్రామానికి తీసుకొచ్చి గ్రామ శివారులో గల ఖాళీ స్థలంలో పొదల మధ్యన దాచిపెట్టాడు. ఆ గంజాయిని మరో వ్యక్తికి విక్రయించేందుకు గాను ఈ నెల 2న కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురానికి చెందిన వనపర్తి సాయి అలియాస్ సాయికుమార్ ఫోన్ చేశాడు. ఈ నెల 4న సాయికుమార్ గంజాయి కొనుగోలు చేసేందుకు రాకేష్ వద్దకు రాగా నమ్మదగిన సమాచారం మేరకు కోదాడ రూరల్ పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 11 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2.80 లక్షలు ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. అయితే రాకేష్పై 2023 సంవత్సరంలో గంజాయి కేసు నమోదయ్యిందని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సీఐ రజితారెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ హరిక్రిష్ణతో పాటు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. -
ఎనిమిది నెలల కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య
శాలిగౌరారం: మానసికస్థితి సరిగా లేని మహిళ తన ఎనిమిది నెలల కుమార్తెతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగమర్తి గ్రామానికి చెందిన సాయిని శంకరయ్య, వీరమ్మ దంపతుల కుమార్తె వాణి(23)ని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన సింగారపు మహేశ్కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. మహేశ్, వాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె పుట్టిన సమయంలోనే వాణి మానసిక స్థితి దెబ్బతినడంతో అనారోగ్యానికి గురైంది. దీంతో వాణిని ఆమె తల్లిదండ్రులు వైద్యం కోసం ఆస్పత్రుల్లో చూపిస్తున్నారు. ఈ క్రమంలో వాణి తరచూ తన తల్లిగారింటికి వచ్చి వెళ్తుండేది. నెల రోజుల క్రితం పెద్ద కుమార్తెను భర్త వద్ద ఉంచి చిన్న కుమార్తె హర్షిత(8 నెలలు)తో కలిసి వాణి వంగమర్తిలోని తల్లిగారింటికి వచ్చి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రానికి బయల్దేరి.. శనివారం వాణి తన చిన్న కుమార్తె హర్షితతో కలిసి ఇంటి వద్ద ఉండగా ఆమె తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లారు. వాణి తన కుమార్తెను తీసుకొని మధ్యాహ్నం సమయంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లొస్తానని చుట్టుపక్కల వారికి చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కానీ వాణి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లకుండా వంగమర్తి గ్రామ సమీపంలోని 365వ నంబర్ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లి హైవే పక్కన ఉన్న నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావిలో కుమార్తెతో పాటు దూకింది. మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చిన వాణి తల్లిదండ్రులు కుమార్తె ఇంట్లో కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వారిని అడిగారు. దీంతో వారు అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నానని చెప్పిందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అడుగగా అక్కడకు రాలేదని అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. ఆందోళనకు గురైన వాణి తల్లిదండ్రులు ఎన్నారం గ్రామానికి ఫోన్ చేసి వాణి వచ్చిందేమోనని ఆరా తీశారు. కానీ అక్కడకు కూడా వాణి రాలేదని చెప్పడంతో గ్రామంలో ఆరా తీయగా.. రెండు గంటల ముందు కుమార్తెతో కలిసి వాణి జాతీయ రహదారి వెంట మాధారంకలాన్ వైపు నడుచుకుంటూ వెళ్లిందని గ్రామస్తులు తెలిపారు. వాణి తల్లిదండ్రులతో పాటు స్థానికులు జాతీయ రహదారి వెంట గాలిస్తూ.. నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావిలో చూడగా అప్పటికే వాణి మృతిచెంది నీటిలో తేలియాడుతూ కనిపించింది. వాణి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని నకిరేకల్లోని ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి హర్షిత మృతదేహం కోసం తీవ్రంగా గాలించారు. అప్పటికే రాత్రి కావడంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాకపోవడంతో నిలిపివేశారు. రాత్రి వరకు చిన్నారి హర్షిత మృతదేహం లభ్యంకాలేదు. మృతురాలి తండ్రి సాయిని శంకరయ్య ఇచ్చిన ఫిపిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు వివరించారు. ఫ మతిస్థిమితం సరిగా లేక వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణం ఫ తల్లి మృతదేహం లభ్యం ఫ నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో ఘటన -
కుర్రి శ్రీనుకు నివాళులర్పించిన మంత్రి ఉత్తమ్
నకిరేకల్: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సభకు కారులో వెళ్లొస్తుండగా.. కట్టంగూర్ మండలం పామునగుండ్ల శివారులో లారీ ఢీకొట్టడంతో మఠంపల్లి మండలం కిందితండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కుర్రి శ్రీను మృతిచెందగా. అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ఏరియా ఆస్పత్రిలో ఉంచిన కుర్రి శ్రీను భౌతికకాయానికి శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నివాళులర్పించారు. ప్రభుత్వ పరంగా శ్రీను కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా తక్షణ సహాయం కింద సొంతంగా రూ.5లక్షలు అందజేశారు. మృతుడి భార్యకు ప్రభుత్వం ఉద్యోగం, అతడి పిల్లలకు విద్య అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. మృతుడు ఽశ్రీను అంత్యక్రియలను దగ్గరుండి చూసుకోవాలని ఆయన హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులకు సూచించారు. మంత్రి వెంట నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సతీమణి పుష్ప, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న తదితరులు ఉన్నారు. కిందితండాలో విషాదఛాయలు.. మఠంపల్లి: కుర్రి శ్రీను మృతితో కిందితండా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రాత్రి శ్రీను అంత్యక్రియలను అశ్రునయనాల మధ్యన పూర్తిచేశారు. కాగా అదే గ్రామానికి చెందిన వీరన్ననాయక్, మాలోతు శ్రీనునాయక్, బాబునాయక్, మేఘానాయక్, నాగేశ్వరరావునాయక్కు గాయాలు కావడంతో వారు చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు.. కట్టంగూర్: ఈ ప్రమాదానికి కారణమైన గుజరాత్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ జుగ్రాజ్సింగ్పై మృతుడి భార్య కుర్రి శ్రీదేవి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కట్టంగూర్ ఎస్ఐ రవీదర్ తెలిపారు. ఫ మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటన ఫ తక్షణ సహాయం కింద సొంతంగా రూ.5లక్షలు అందజేత ఫ హైదరాబాద్లో కాంగ్రెస్ సభకు వెళ్లొస్తుండగా కట్టంగూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను మృతి -
కూలి పనికి వెళ్తూ మృత్యుఒడికి..
భువనగిరిటౌన్: కూలి పని చేసే మహిళను ఆమె భర్త ద్విచక్ర వాహనంపై పని ప్రదేశంలో దించేందుకు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం మగ్ధూంపల్లికి చెందిన సిల్వేరు సత్యనారాయణ, మల్లమ్మ(45) భార్యాభర్తలు. సత్యనారాయణ బీబీనగర్లోనే ఓ కంపెనీలో పనిచేస్తుండగా.. మల్లమ్మ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శనివారం ఉదయం సత్యనారాయణ తన భార్య మల్లమ్మను భువనగిరిలో కూలీ పనికి వదిలేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. భువనగిరి పట్టణంలోని జంఖన్నగూడెం చౌరస్తా వద్ద మల్లమ్మ, సత్యనారాయణ ఆగగా.. నల్లగొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. సత్యనారాయణకు గాయాలయ్యాయి. వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానం కాగా.. ఒక కుమార్తె వివాహం చేశారు. మిగతా ఇద్దరు కుమార్తెలు పాఠశాల విద్య అభ్యసిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న భువనగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫ ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మహిళా కూలీ మృతి ఫ ఆమె భర్తకు గాయాలు -
బంధువుల దశదిన కర్మకు వెళ్లొస్తుండగా..
కట్టంగూర్: బంధువుల దశదిన కర్మకు ద్విచక్ర వాహనంపై వెళ్లొస్తున్న తల్లీకుమారుడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టి మృతి చెందారు. ఈ ఘటన కట్టంగూర్ మండలం కేంద్రం శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మన్సూరాబాద్కు చెందిన పిట్టల శంకరమ్మ(41), ఆమె కుమారుడు పిట్టల రజనీకాంత్(25) తమ బంధువుల దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి వచ్చారు. సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వెళ్తుండగా.. బయలుదేరారు. మార్గమధ్యలో కట్టంగూర్ మండల కేంద్రం శివారులోకి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన శంకరమ్మను నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల స్వగ్రామం శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామం కాగా.. వీరు బతుకుదెరువు నిమిత్తం 30 సంవత్సరాల క్రితమే హైదరాబాద్కు వలస వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. నిర్లక్ష్యంగా లారీని నిలిపిన డ్రైవర్.. లారీ డ్రైవర్ ఎలాంటి సిగ్నల్ లైట్లు వేయకుండా కట్టంగూర్ మండల కేంద్రం శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీని ఆపి సుమారు రెండు గంటల పాటు నిద్రించాడు. లారీని పూర్తిగా హైవే కిందకు దించకుండా సగ భాగం హైవే పైనే నిలుపడంతో.. రజనీకాంత్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి మరో వాహనం రావడంతో లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల్లీకుమారుడు ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలై మృతి చెందారు. ఫ రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి ఫ కట్టంగూర్ మండల కేంద్రం శివారులో ఘటన -
శ్మశానంలోనే ఆమె బతుకు బండి
మిర్యాలగూడ టౌన్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట గ్రామానికి చెందిన పత్తిపాటి ప్రకాశం, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వారికి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఊళ్లో కూలీ పనులు దొరక్కపోవడంతో 26 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మిర్యాలగూడ పట్టణానికి వలస వచ్చారు. తమకు తెలిసిన వారి ద్వారా మిర్యాలగూడ పట్టణంలోని హిందూ శ్మశానవాటికలో కూలీ పనికి కుదిరారు. ఇక్కడే కాటికాపరిగా స్థిరపడ్డారు. ఆ తర్వాత ఐదేళ్లకు అనారోగ్యంతో ప్రకాశం మృతిచెందాడు. అప్పటి నుంచి మణెమ్మనే కాటికాపరిగా పనిచేస్తోంది. తాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిల్లంచర్ల అనంతరాములే తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని, తన భర్త బతికి ఉన్నప్పి నుంచి కూడా అనంతరాములే తమకు జీతం ఇస్తున్నారని మణెమ్మ పేర్కొంది. మొదట్లో ప్రతినెల రూ.600 వరకు జీతం ఇచ్చేవారని, ఇప్పుడు రూ.1000 ఇస్తున్నారని తెలిపింది. తనకు కిడ్నీలో రాళ్లు వస్తే ఆపరేషన్ ఖర్చు కూడా ఆయనే భరించారని పేర్కొంది. వితంతు పింఛనే ఆధారం.. కరోనా సమయంలో ఎవరు కూడా మృతదేహాలను కాల్చేందుకు ముందుకు రాకపోవడంతో మణెమ్మనే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించింది. ఇప్పటికీ ఆమెకు సొంతిళ్లు కూడా లేదు. వితంతు పింఛన్ డబ్బులే కొంత మేరకు ఆమెకు ఆధారం. ఇంటి స్థలం మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను మణెమ్మ కోరుతోంది. శ్మశానవాటికలో పనిచేస్తూనే తన ఇద్దరు కుమారులు, కుమర్తెకు వివాహాలు చేసింది. మణెమ్మకు ఔట్సోర్సింగ్ కింద పారిశుద్ధ్య కార్మికులకు ఏవిధంగా వేతనాలు ఇస్తున్నారో అదే రీతిలో వేతనం ఇస్తే బాగుండేదని స్థానికులు అంటున్నారు. చీకటి పడిందంటే సాధారణంగా బయటకు వెళ్లేందుకు మహిళలు భయపడతారు. కానీ ఈ మహిళ రాత్రి, పగలు అనే తేడాలేకుండా శ్మశానంలోనే చితిమంటల మధ్య జీవనం సాగిస్తోంది. భర్త మృతి అనంతరం అతడి దారిలోనే కాటికాపరిగా పనిచేస్తూ బతుకు బండిని లాగుతోంది. మొదట్లో చాలా భయమేసింది మొదట్లో శవాన్ని దహనం చేస్తుంటే చాలా భయమేసేది. కానీ తర్వాత అలవాటుగా మారిపోయింది. నేను శవాలను దహనం చేయడం ఒక సేవగా భావిస్తున్నాను. నా పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి. పెద్ద కుమారుడు తాపీ మేసీ్త్రగా, చిన్న కుమారుడు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కోడళ్లు కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రభుత్వం కనీసం ఇంంటి స్థలం అయినా ఇచ్చి ఆదుకోవాలి. మున్సిపాలిటీ కార్మికులకు వచ్చే విధంగా వేతనమైనా ఇస్తే బాగుంటుంది. – పత్తిపాటి మణెమ్మ ఫ భర్త మృతి అనంతరం కాటికాపరిగా పనిచేస్తున్న మహిళ -
బైక్ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు
హాలియా: అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలోని 565వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మోరం నాగేశ్వరరావు అతడి భార్య లక్ష్మీపార్వతి, 18 నెలల కుమారుడు అభిరామ్తో కలిసి శనివారం బైక్పై తిరుమలగిరి(సాగర్) మండలంలోని రంగుండ్ల గ్రామంలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు కలిసి బైక్పై వెళ్తుండగా.. మార్గమధ్యలో అనుముల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోకి రాగానే హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు, అతడి భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. హాలియా సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ సాయిప్రశాంత్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సాగర్లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను మాచర్లకు తరలించారు. క్షతగాత్రుల బంధువు లక్ష్మీకాంత్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిపెన్పహాడ్: ఇంట్లో నీటి మోటారుకు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం చెట్లముకుందాపురం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చెట్లముకుందాపురం గ్రామానికి చెందిన మామిడి శ్రీనివాస్(54) తన ఇంట్లోని నీటి ట్యాంకు వద్ద మోటారు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అందరు ఉన్నా అనాథ శవంగా..
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి అందరు ఉన్నా అనాథయ్యాడు. వివరాలు.. భువనగిరి పట్టణంలోని రెడ్డివాడకు చెందిన పట్నం పవన్ (40) గత నెల 21న భార్య కల్పన, ఇద్దరు కుమార్తెలతో కలిసి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్ గ్రామంలోని తన అత్తగారింటికి బస్సులో బయల్దేరాడు. మార్గమధ్యలో జనగామలో పవన్ బస్సు దిగి.. తనకు పని ఉంది, చూసుకొని వస్తాను అని భార్యకు చెప్పాడు. కల్పన ఇద్దరు కుమార్తెలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. రెండు రోజులు గడిచినా భర్త ఇంటికి రాకపోవడంతో కల్పన భువనగిరిలోని పవన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఎంత వెతికినా పవన్ ఆచూకీ లభించకపోవడంతో ఐదు రోజుల అనంతరం జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ అప్పటికే జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద పవన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. జనగామ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో నాలుగు రోజులపాటు గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు భద్రపరిచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో కల్పన భర్త ఆచూకీ కోసం శుక్రవారం జనగామ పోలీస్ స్టేషన్కు వెళ్లగా.. గుర్తుతెలియని మృతదేహంగా పేర్కొని అంత్యక్రియలు నిర్వహించిన ఫొటోలు చూపించగా.. తన భర్త పవన్ మృతదేహామే అని ఆమె నిర్ధారించింది. అయితే కల్పన ఫిర్యాదు వెంట పవన్ ఫొటోను జతచేయకపోవడంతో మృతదేహం గుర్తింపులో ఆలస్యం జరిగిందని జనగామ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు శనివారం జనగామలో పవన్ మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఫ జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భువనగిరి వాసి ఫ 13రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు అందిన సమాచారం ఫ అప్పటికే గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించి అంత్యక్రియలు నిర్వహించిన జనగామ పోలీసులు -
రూ. 6 కోట్ల పనులకు ఆమోదం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం మున్సిపల్ అధికారులు రూ.15 కోట్లకు ప్రతిపాదనలు పంపగా రూ.6 కోట్ల పనులకు ఆమోదం లభించింది. త్వరలోనే రూ.6 కోట్లు నీలగిరి మున్సి పాలిటీకి మంజూరవుతాయని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలి పారు. మిగతా రూ.9 కోట్ల కోసం మరోసారి ప్రతిపానదలు పంపినట్లు పేర్కొన్నారు. యోగా సింధూర్ సభ పోస్టర్ ఆవిష్కరణనల్లగొండ టూటౌన్ : హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈనెల 6వ తేదీన నిర్వహించే యోగా సింధూర్ విజయోత్సవ సభ పోస్టర్లను శుక్రవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఆధ్వర్యంలో యోగా సింధూర్ సభ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో యోగా సింధూర్ అధ్యక్షుడు శివ దుర్గాప్రసాద్, ఎంవీ.గోనారెడ్డి, నారాయణ, శ్రీధర్, యోగా గురూజీ రాపోలు వెంకటేశ్వర్లు, ప్రవీణ్, భజరంగ్ప్రసాద్ పాల్గొన్నారు. 8 నుంచి పోస్టల్లో కొత్త సాఫ్ట్వేర్రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పోస్టల్ డివిజన్లోని నల్లగొండ, యదాద్రి భువనగిరి జిల్లాల్లో జూలై 8 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద నల్లగొండ డివిజన్లోని 2 హెడ్ ఆీఫీసులు, 37 సబ్ పోస్టాఫీస్లు, 392 పోస్టాఫీస్లు, 353 బ్రాంచ్ ఆఫీసుల్లో నూతనంగా ఐటీ 2.0 అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. జూలై 7 అన్ని పోస్టల్ కార్యాలయాల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని తెలిపారు. చెత్త రీసైక్లింగ్కు ‘రీకార్ట్’తో ఒప్పందం నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీకి చెందిన శేషమ్మగూడెంలోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పలను రీ సైక్లింగ్ చేసి శుభ్రం చేసేందుకు మున్సిపల్ అధికారులు హైదరాబాద్లోని రీకార్ట్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. కొన్ని నెలల నుంచి డంపింగ్ యార్డును శుభ్రం చేయించేందుకు పలు సంస్థలతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. దాంతో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాద్ అహ్మద్ గురువారం హైదరాబాద్లో రీకార్ట్ సంస్థతో చేసుకోవాల్సిన ఒప్పంద పత్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి చేయడంతో ఒప్పందం తుదిదశకు చేరుకుంది. ఒప్పంద పత్రాలపై సీడీఎంఏ శ్రీదేవి ఆమోద్ర వేయడమే మిగిలిపోయింది. ఆమె జపాన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రాగానే ఒప్పందం అమల్లోకి రానుంది. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను భాగాలుగా విడదీసి మొత్తం రీ సైక్లింగ్ చేసి శుభ్రం చేయనున్నారు. ఇక నుంచి చెత్త కుప్పలుగా పేరుకుపోకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలిహాలియా : ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం అన్నారు. టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా శుక్రవారం మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, కేజీబీవీలకు, ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని, గురుకుల పాఠశాలల పనివేళలు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతపల్లి రవీందర్, ఎస్కె సైయ్యద్ మీయా, జిల్లా కార్యదర్శి రమాదేవి, సరిత, వీరాసింగ్, మద్దెల ప్రసాద్, వెంకటేశ్వరరావు, సునీత, కోశాధికారి చంద్రయ్య ఉన్నారు. -
గురుకులాల్లో వసతులపై ఆరా
దేవరకొండ, కొండమల్లేపల్లి, డిండి, చందంపేట : దేవరకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ సంక్షేమ గురుకులాను సందర్శించి.. అక్కడి మౌలిక వసతులపై ఆరా తీశారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. శుక్రవారం దేవరకొండ మండలంలోని పెంచికల్పహాడ్, కొమ్మేపల్లి, కొండభీమనపల్లి, కొండమల్లేపల్లి, డిండి, చందంపేటలోని సాంఘిక, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో రికార్డులు పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, మెనూపై ఆరా తీశారు. కల్పిస్తున్న వసతుల వివరాలను ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, ఆర్సీఓలు బలరాంనాయక్, స్వప్న, విష్ణు, జోనల్ ఆఫీసర్ విద్యారాణి, ఆయా గురుకులాల ప్రిన్సిపాల్స్, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ దృష్టికి సమస్యలు ● పెంచికల్పహాడ్ పాఠశాలకు ఓహెచ్ఎస్ఆర్, విద్యార్థులకు సరిపడా బెడ్స్, అదనపు గదుల నిర్మాణం అవసరమని ప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ● కొమ్మేపల్లి, కొండభీమనపల్లి పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్లు, బెంచీలు, ఓహెచ్ఎస్ఆర్, ట్రాన్స్ఫార్మర్, టాయిలెట్స్ అవసరం ఉన్నట్లు ప్రిన్సిపాల్స్ కలెక్టర్కు వివరించారు. ● కొండమల్లేపల్లి ఎస్సీ గురుకుల కళాశాలలో బెడ్స్, ఓహెచ్ఎస్ఆర్, అదనపు టాయిలెట్స్ కావాలని ప్రిన్సిపాల్ కలెక్టర్కు విన్నవించారు. ● డిండి ఎస్సీ గురుకులంలో డ్రెయినేజీ, వాటర్ పైపులైన్ కోతుల బెడద తదితర సమస్యలు ఉన్నాయని.. ప్రహరిగోడకు సోలార్ పెన్షింగ్ కావాలని ఇప్పటి వరకే సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించాలని ప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ● చందంపేట మినీ గురుకులంలో డెర్మాటరి బ్లాక్ కావాలని, తాగునీటి సమస్య ఉందని ప్రిన్సిపాల్ కలెక్టర్కు విన్నవించారు. ఫ దేవరకొండ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సార్.. మినిస్ట్రీ ప్లీజ్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మంత్రి పదవుల కోసం మళ్లీ వినతులు మొదలయ్యాయి. హైదరాబాద్కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను పలువురు ఆశావహులు కలిసి విజ్ఞప్తులు చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్.. ఖర్గేను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు ఖర్గేను కలిసి విన్నవించకపోయినా గతంలోనే పార్టీని, సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో మూడో విడత కేబినెట్ విస్తరణలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న చర్చ సాగుతోంది. కేబినెట్లో ఇంకా మూడు మంత్రి పదవుల భర్తీకి అవకాశం ఉంది. దీంతో మూడోసారి మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. మంత్రి పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్కు వచ్చారు. మంత్రి పదవి ఆశిస్తున్న నేతలందరికి ఖర్గేతో భేటీ అయ్యేందుకు అవకాశం ఇచ్చారు. ఆయన్ని కలిసేందుకు రావాలంటూ వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం ఇచ్చారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు ఆయనతో భేటీ అయ్యారు. పార్టీకు తాము చేసిన సేవలు, ప్రతినిధులుగా తమకు ఉన్న అనుభవం, సామాజికంగా తమకు ఉన్న అనుకూల అంశాలను వివరించారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఆశావాహులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఆశావహులు మంత్రి పదవి కోసం మొదటినుంచి అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే మొదటి విడతలోనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మంత్రి పదవి ఆశించారు. అయితే, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మంత్రివర్గంలో బెర్తు దక్కింది. లంబాడా కోటాలో బాలునాయక్ కూడా మంత్రి పదవి ఆశించినా ఆయనకు కూడా దక్కలేదు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలోనూ వీరిద్దరికి బెర్త్ దక్కలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ఫ మంత్రి పదవి కోసం ఖర్గేను కలిసి విజ్ఞప్తి చేసిన బాలునాయక్ ఫ ఇదివరకే మంత్రి పదవి కావాలని కోరిన రాజగోపాల్రెడ్డి ఫ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ఆశావహులు ఫ మూడో విడత విస్తరణలో అవకాశం దక్కేదెవరికో.. మూడో విడతలోనైనా.. త్వరలో మూడో విడత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే చర్చ సాగుతోంది. రెండో విడత మంత్రి పదవులు దక్కని వారిని పీసీసీ అధ్యక్షుడితో పాటు మంత్రులు కూడా బుజ్జగించారు. మళ్లీ అవకాశం వస్తుందని చెప్పారు. మూడో విడతపై చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యేందుకు వచ్చారు. అదే సందర్భంలో మంత్రి పదవులను ఆశించిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమకు మూడో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు చేశారు. అందులో నల్లగొండ జిల్లా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా ఖర్గేను కలిసి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ప్రస్తుతం ఖర్గేతో సమావేశం కాకపోయినా, గతంలోనే అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో మూడో విడత విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్నది చర్చనీయాంశంగా మారింది. -
పట్టాలెక్కనున్న డబ్లింగ్ పనులు!
పెరుగనున్న రద్దీ బీబీనగర్ – నడికుడి రెండో లైన్ అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య రద్దీ పెరగనుంది. తిరుపతి, చైన్నె, ఖమ్మం తదితర ప్రాంతాలకు బీబీనగర్–నడికుడి–గుంటూరు మార్గం దగ్గరగా ఉండటం, డబ్లింగ్తో రైళ్ల వేగం పెరగనుండడంతో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీబీనగర్ – నడికుడి మార్గం సింగిల్ ట్రాక్ లేన్ కావడంతో ఒక రైలు వస్తే మరో రైలును ముందు స్టేషన్లో నిలిపేవారు. రెండో లేన్ అందుబాటులోకి వస్తే రైలు నిలిపే అవసరం ఉండదు. ప్రయాణికులకు వేచి ఉండే ఇబ్బందులు తొలగనున్నాయి. బీబీనగర్: బీబీనగర్ – నడికుడి డబ్లింగ్ పనులకు మోక్షం కలిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న సిక్రిందాబాద్ – నడికుడి – గుంటూరు రెండో లేన్ పనులకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూ సేకరణకు సంబంధించి ఈనెల 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టులో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో బీబీనగర్ మండలం గూడూరు నుంచి గుంటూరు జిల్లా నల్లపాడు వరకు డబ్లింగ్ పనులు జరుగనున్నాయి. ముందుగా నడికుడి మార్గంలో 48 కిలో మీటర్ల మేర రూ.647 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 ఎకరాలకు పైగా భూసేకరణకు రైల్వే శాఖ ఆదేశించినట్లు తెలిసింది. బీబీనగర్ మండల పరిధిలోని గూడూరులో 60 ఎకరాలు, భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి, బొల్లేపల్లి, నందనం, అనాజిపురం, పగిడిపల్లి, భువనగిరిలో 830 ఎకరాలకు పైగా భూమి సేకరించనున్నారు. 239 కిలో మీటర్లు.. బీబీనగర్–నడికుడి మధ్య రెండో రైల్వే లైన్ పనులకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలుపుతూ 2023లో దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. దీంతో 239 కిలో మీటర్లకు పైగా రెండో లైన్ నిర్మాణానికి రూ.2,853.23 కోట్లు కేటాయించింది. ఇందులో సివిల్ పనులకు రూ.1,947.44 కోట్లు, ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు రూ.588.17కోట్లు, సిగ్నలింగ్ టెలికాం పనులకు రూ.319.62 కోట్లు అంచనా వ్యయంగా చూపారు. 2024 పిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ ముగిసింది. తదుపరి కాంట్రాక్టర్ ఎంపిక, ఈసీసీ ఆమోదంతో ఒప్పందం జరగాల్సిన ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు నుంచి పనులు ప్రారంభంక ావచ్చని రైల్వే అధికారుల నుంచి సమాచారం. బీబీనగర్ – నడికుడి రెండో లేన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఫ భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ ఫ ఆగస్టు నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఫ తొలుత నడికుడి మార్గంలో పనులు -
ధాన్యం కొనుగోలుకు ముందస్తుగా సిద్ధం కావాలి
నల్లగొండ : వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకోవాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్లో వానాకాలం– 2025 సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. యాసంగిలో 2 వేల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం వచ్చిన 110 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేసే విషయంపై చర్చించారు. జిల్లాలోని 10 మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం రెండు మార్కెట్లకు మొబైల్ గ్రైన్ డ్రయ్యర్లు సమకూర్చిందన్నారు. వాటిని అన్ని మార్కెట్ యార్డ్లలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, డీఎస్ఓ వెంకటేశం, డీఎం హరీష్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీసీఓ పత్యానాయక్ పాల్గొన్నారు. -
సాగర్ నుంచి పాలేరుకు నీటి విడుదల
నాగార్జునసాగర్: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లో నీటి నిల్వ తగ్గినందున తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం సాగునీటి శాఖ అధికారులు ఎడమ కాల్వ ద్వారా పాలేరుకు నీటిని విడుదల చేశారు. మొదట వెయ్యి క్యూసెక్కులు విడుదల చేశారు. క్రమంగా పెంచుతూ మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నట్లుగా సాగర్ డ్యాం ఎస్ఈ మల్లికార్జున్ తెలిపారు. సాగర్ జలాశయంలో నీటి నిల్వలు ఇలా.. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 522.20 అడుగుల(153.3180 టీఎంసీలు) నీరు ఉంది. ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా 54,051 క్యూసెక్కుల నీరు సాగర్కు వచ్చి చేరుతోంది. -
సాగు చట్టాలపై రైతులకు అవగాహన ఉండాలి
గుర్రంపోడు, కనగల్, కట్టంగూర్ : సాగు చట్టాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని భూమి సునీల్ అన్నారు. లీప్స్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సాగు న్యాయ యాత్రలో భాగంగా శుక్రవారం గుర్రంపోడు, కనగల్, కట్టంగూర్ మండలం అయిటిపాముల రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహక కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. దుక్కి దున్నే నాటి నుంచి పంటను మార్కెట్లో అమ్మేదాకా రైతులు ఎదుర్కొనే సమస్యలు వాటి పరిష్కార మార్గాలను రైతులకు సూచించడమే ఆ సాగు న్యాయ యాత్ర ఉద్దేశమన్నారు. రైతులు అహర్నిషలు కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర దక్కడం లేదని.. పంట పెద్దపెద్ద కంపెనీలు, దళారుల పాలవుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులకు జరిగే మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిని తెలుసుకోవాలని సూచించారు. లీప్స్ సంస్థ ప్రెసిడెంట్ గున్న రాజేందర్రెడ్డి, రైతు కమిషన్ ఏఓ హరివెంకటప్రసాద్, లీప్ సంస్థ ప్రతినిధులు జీవన్, సందీప్, మల్లేష్, రవి, ప్రవీణ్, శ్రీనివాస్, కనగల్ తహసీల్దార్ బి.పద్మ, ఏఓ బెజవాడ అమరేందర్గౌడ్, ఏఈఓలు నవీన్, అభిలాష్రెడ్డి, -
ఓటరు జాబితాపై బీఎల్ఓలకు శిక్షణ
నల్లగొండ: కొత్త ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అందులో భాగంగా బీఎల్ఓలకు ఓటర్ల జాబితా తయారీ విధానంపై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈమేరకు జిల్లాలో గురువారం నుంచి ప్రారంభమైన శిక్షణ ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఓటర్ల జాబితాకు సంబంధించి బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి 18 సంవత్సరాలు నిండి ఉండి ఓటు నమోను చేసుకొని వారిని గుర్తించి ఓటరు నమోదు చేసుకునేవిధంగా వివరించడం, చనిపోయిన వారి పేర్లు కుటుంబసభ్యులకు తెలియజేసి జాబితా నుంచి తొలగించడం వంటివి చేయనున్నారు. త్వరలో స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్ 2026 జనవరి 1 తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే వారికి ఓటు హక్కు కల్పించేందుకు స్పెషల్ సమ్మరీ రివిజన్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ వెలువరించే అవకాశం ఉంది. దీంతో కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా బీఎల్ఓలకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించింది. ఫ మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రారంభమైన శిక్షణ ఫ ఈ నెల 17 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు -
హైకోర్టు జడ్జిగా కొండమడుగు వాసి
సాక్షి, యాదాద్రి, బీబీనగర్ : కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లాకు చెందిన పలువురు న్యాయవాదులు. తాము ఎంచుకున్న మార్గంలో నిరంతర శ్రమతో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి చేరుకున్నారు. బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన వాకిటి రామకృష్ణారెడ్డిని హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. త్వరలో ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం కానున్నారు. ఇప్పటికే ఆలేరుకు చెందిన కలాసికం సృజన, రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కూనూరు లక్ష్మణ్గౌడ్ హైకోర్టు న్యాయమూర్తులుగా సేవలందిస్తున్నారు. అంతకుముందు వలిగొండ మండలం నెమలికాల్వ గ్రామానికి చెందిన వంగాల ఈశ్వర్యయ్యగౌడ్ హైకోర్టు జడ్జిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. రామకృష్ణారెడ్డి కుటుంబ నేపథ్యం, న్యాయవాదిగా ప్రస్తానం వాకిటి రామకృష్ణారెడ్డి 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. బీబీనగర్ మండలం కొండమడుగు ఆయన స్వగ్రామం. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. అన్న, చెల్లి ఉన్నారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఆ తరువాత అనంతసేన్రెడ్డి అనే అడ్వకేట్ వద్ద జూనియర్గా పనిచేశారు. 2005 నుంచి సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టులతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రామకృష్ణారెడ్డి గతంలో బీబీనగర్ మండలంలోని అక్కన్న మాదన్న ఆలయ భూముల కేసులో హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో అనుకూల తీర్పువచ్చింది. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, కుటుంబ కేసులు వాదించడంలోనూ సమర్థులుగా పేరుంది. ఇప్పటి వరకు ఆయన వెయ్యి వరకు పిటిషన్లు దాఖలు చేశారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విద్యభ్యాసం రామకృష్ణారెడ్డి 1నుంచి 7వ తరగతి వరకు కొండమడుగు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివారు. 8నుంచి 10వ తరగతి వరకు బీబీనగర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని రెడ్డి కళాశాలలో పూర్తి చేశారు. న్యాయవాదిగా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశారు. రామకృష్ణారెడ్డిని హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ రామకృష్ణారెడ్డి పేరు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం ఫ యాదాద్రి జిల్లా నుంచి ఇప్పటికే హైకోర్టు జడ్జిలుగా సృజన, లక్ష్మణ్గౌడ్ -
విద్యుత్ స్టోర్ తనిఖీ
నల్లగొండ: నల్లగొండలోని విద్యుత్ స్టోర్ను టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ నరసింహులు గురువారం తనిఖీ చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి నిబంధనలు పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారని ఆరోపణలు రావడం, మిర్యాలగూడ నియోజకవర్గంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకుండా పెండింగ్లో ఉంచడంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో సీఎండీ ఆదేశాల మేరకు డైరెక్టర్ నర్సింహులుతోపాటు సీజీఎం రూరల్ బాలస్వామి నల్లగొండలోని విద్యుత్ స్టోర్ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఏఈ, ఏడీలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మిర్యాలగూడలో ఏఈలతో వ్యవసాయ కనెక్షన్ల పెండింగ్పై సమీక్షించారు. డైరెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే 59 ట్రాన్స్ఫార్మర్లు, 10 కిలోమీటర్ల మేర కండక్టర్ వైర్ మంజూరు చేశారు. ఫ నల్లగొండ, మిర్యాలగూడ ఏఈలతో టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ సమీక్ష ఫ మిర్యాలగూడకు 59 ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్ వైర్ మంజూరు -
పేరుకుపోతున్న వ్యర్థాలు
దేవరకొండ: దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులున్నాయి. ప్రతి నిత్యం గృహ, వాణిజ్య సముదాయాల నుంచి సుమారు 16 టన్నుల మేర చెత్తను పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది సేకరించి పట్టణ శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ డంపింగ్ యార్డులో ఇనుము, కాపర్ వంటి వాటి కోసం వచ్చే వారు వ్యర్థాలను తగలబెడుతుండడంతో ఈ దారి గుండా వెళ్లే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణం నుంచి ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు అత్యధికంగా వస్తుండడంతో డంపింగ్ యార్డులో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. -
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
నల్లగొండ: వర్షాకాల నేపథ్యంలో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులకు రెయిన్కోట్లు, కంటి అద్దాలు తరితర పరికరాలను పంపిణీ చేశారు. విధుల నిర్వహణలో ముగ్గురు హోం గార్డులు చనిపోగా బాధిత కుటుంబాలకు హోం గార్డ్స్ సంక్షేమ నిధుల నుంచి రూ.15వేలు, అనారోగ్యం కారణంగా మెడికల్ చికిత్స పొందిన ఐదుగురు హోం గార్డులకు రూ.10 వేలు, హోం గార్డ్ పిల్లల వివాహం కోసం ఇద్దరికి రూ.5 వేలు, మెరిట్ స్కాలర్షిప్ కింద ముగ్గురికి రూ.5 వేల చెక్ను ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ వృత్తి నైపుణ్యాలపై జోనల్ స్థాయి డ్యూటీ మీట్ నల్లగొండ: వరంగల్లో నిర్వహించనున్న రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నేపథ్యంలో యాదాద్రి జోనల్ స్థాయిలో కేసుల దర్యాప్తు, పోరెన్సీక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, నేర పరిశోధన ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవైర్నెస్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం అంశాలపై నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది జోనల్ స్థాయి డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో కేసుల దర్యాప్తు, నేర పరిశోధనలో ఎదురవుతున్న అంశాలపై సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై యాదాద్రి జోన్కు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, నరసింహాచారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
నెరవేరని సేంద్రియ ఎరువుల తయారీ విధానం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను తరలించేందుకు పట్టణ శివారులో గల రాంనగర్ బంధం వద్ద డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డుకు ప్రస్తుతం దిక్కు, మొక్కు లేకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. వివిధ ఆస్పత్రుల నుంచి సేకరించిన వ్యర్థాలు కూడా వీటిలో పడేయడంతో దుర్వాసన వస్తోంది. కలుషిత వ్యర్థాలకు నిప్పు పెడుతుండడంతో రాంనగర్, బంధం, ఈదులగూడెం ఏనే, బాధలాపురం, గుడూరు, అవంతిపురం, ఈదులగూడెం వరకు పొగ కమ్ముకుంటుంది. తడి చెత్త, పొడి చెత్తను సేకరించడంతో పాటు డంపింగ్ యార్డులోని సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు ‘వేస్ట్ వెంచర్’ సంస్థ 2013లో ముందుకు వచ్చింది. ఆ సంస్థ నిర్వాహకులు సెగ్రిగేషన్ చేసి విండ్రోస్ విధానంతో థర్మోఫిలిక్ ఆర్గానికి కంపోస్ట్ ద్వారా ఎరువులు తయారు చేశారు. రెండేళ్ల పాటు బాగానే నడిచినా.. తీరా ఆ సంస్థ చేతులెత్తేసింది. దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం డంపింగ్ యార్డులో చెత్తను కాల్చడం ద్వారా వెలువడుతున్న పొగ ఇళ్లను కమ్ముకుంటుంది. దుర్వాసన వెదజల్లుతుండటంతో తట్టుకోలేకపోతున్నాం. ఇళ్లలో ఉండలేకపోతున్నాం. ఈ డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించారు. – మలిఖార్జున్, 4వ వార్డు, ఈదులగూడెం -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పెద్దఅడిశర్లపల్లి : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. వైద్య సేవలకు అనుగుణంగా మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం పీఏపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి భూభారతిలో వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేశారు. వంట గదులు, పాఠశాల పరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థులకు అందించే భోజన సదుపాయాలపై ఆరా తీశారు. ఆమె వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ జయశ్రీ, సిబ్బంది తదితరులున్నారు. 5న ఉమ్మడి నల్లగొండ అండర్ 19 క్రికెట్ జట్టు ఎంపిక నల్లగొండ టౌన్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్ 19 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక చేయనున్నట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ అమీనుద్దిన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జట్టు ఎంపిక ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2006 తరువాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు 98857 17996 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. హౌస్ కీపింగ్ నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ రామగిరి(నల్లగొండ): నిడమనూరు కోర్టులో హౌస్ కీపింగ్ సర్వీసెస్ నిర్వహణకు ఆసక్తి గల సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 8వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.nalgonda.dcour-ts.go v.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. సీఎంఆర్ లక్ష్యాన్ని వారంలో పూర్తి చేయాలినల్లగొండ: సీఎంఆర్ లక్ష్యాన్ని వారంలోపు పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాలోని రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023– 24 రబీ సీఎంఆర్కు సంబంధించి ఇంకా 73 ఏసీకే లు చెల్లించాల్సి ఉందన్నారు. రైస్ మిల్లర్లు వారం రోజుల్లో చెల్లించడంతోపాటు, 2024– 25 రబీకి సంబంధించిన సీఎంఆర్ను సైతం వేగవంతం చేయాలన్నారు. పౌర సరఫరాల విభాగం డిప్యూటీ తహసీల్దార్లు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం నల్లగొండ అగ్రికల్చర్ : జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద జిల్లాలో అపరాలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ గురువారం తెలిపారు. పథకం కింద ఆయా పంటలకు అవసరమైన మినీ కిట్లు జిల్లాకు వచ్చినట్లు పేర్కొన్నారు. జొన్నల సాగు 100 ఎకరాల్లో ప్రోత్సహించడానికి అవసరమైన 100 కిట్లు, రాగుల సాగు 645 ఎకరాలకు అవసరమైన 645 మినీ కిట్లు, 250 ఎకరాల్లో మినుముల సాగుకు అవసరమైన 500 కిట్లు, 750 ఎకరాల్లో కంది సాగుకు అసరమైన 1500 మినీ కిట్లు జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. వాటిని మండలాల వారీగా కేటాయించి రైతులకు ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. -
చెల్లాచెదురుగా వ్యర్థాలు
చండూరు: చండూరు మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్యార్డును శిర్ధేపల్లి రోడ్డులో 1.9 ఎకరాల భూమిని కేటాయించారు. ప్రతిరోజు మూడు ట్రాక్టర్లు, ఒక ఆటో ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తను ఇష్టారీతిన వదిలేయడంతో వ్యర్థాలన్నీ చెల్లాచెదురుగా పడుతున్నాయి. చెత్తను కాల్చకుండా బయోమైనింగ్ చేయాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచి టెండర్లు పిలిచినా అది కార్యరూపం దాల్చలేదు. డంపింగ్ యార్డులో తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసి మున్సిపాలిటీ పరిధిలోని పార్కుల్లో మొక్కలకు ఎరువుగా వినియోగించేందుకు దాదాపు నాలుగు గదుల వైశాల్యంలో వర్మీ కంపోస్టు తయారీకి బెడ్లు తయారు చేసి వదిలేశారు. -
వ్యవసాయ భూములకు వ్యాపిస్తున్న మంటలు
నకిరేకల్: నకిరేకల్ మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను తరలించేందుకు నోముల– నెల్లిబండ శివారులో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల పంట పొలాలు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. చెత్తకు నిప్పు పెడుతుండటంతో వచ్చే పొగతో పంట పొలాలు దెబ్బతినడంతో పాటు, పశు గ్రాసం కాలిబూడిదవుతోందని రైతులు వాపోతున్నారు. వేసవిలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి చుట్టుపక్కల రైతులు వ్యవసాయ భూముల్లో ఉన్న పైప్లైన్ కాలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. డంపింగ్ యార్డు దారి వెంట ఉండటంతో నోముల, నెల్లిబండ గ్రామాల రైతులు తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాలంటే చెత్తకు పెడుతున్న నిప్పుతో వచ్చే పొగ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. -
మొక్కుబడిగా చెత్తసేకరణ
హాలియా : హాలియా మున్సిపాలిటీలో రోజుకు 8 టన్నుల చెత్త వెలువడుతోంది. 50 మంది కార్మికులు, 2 ట్రాక్టర్లు, 5 ఆటోల ద్వారా సేకరించి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్త కలపడంతో పాటు చికెన్, మటన్ మార్కెట్ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలనూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ యార్డుకు సమీపంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల, కేజీబీవీ పాఠశాల ఉండడంతో పేరుకుపోయిన వ్యర్థాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త తీసుకెళ్తున్నారే తప్పా.. ప్రాసెసింగ్ చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆదాయం సమకూర్చేందుకు అధికారులు చొరవ తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
అవినీతికి ఆస్కారం ఉండొద్దు
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్కుమార్.. మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాను ఉన్నతస్థానంలో నిలపాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకై క ప్రభుత్వం తమదే అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పదేళ్లు నిర్లక్ష్యానికి గురైందని.. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో త్వరలోనే పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ పనులను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని.. మేము వచ్చాకే నీటికేటాయింపులుచేసి నిధులు కూడా మంజూరు చేశామన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలతో పాటు లిప్టులు, హైలెవల్ కెనాల్ లైనింగ్కు రూ.400 కోట్లు మంజూరు చేశామన్నారు. అయిటిపాముల, గంధమల్ల రిజర్వాయర్లకు రూ.500 కోట్లు మంజూరు చేసి సీఎంతో పనులు ప్రారంభించామన్నారు. రాచకాల్వ మరమ్మతు పనులు చేయాలని ఎంపీ కిరణ్కుమార్రెడ్డి కోరారని వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. -
ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు
రామగిరి(నల్లగొండ) : వచ్చే మూడున్నర ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు వేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండలో రూ.6 కోట్లతో నిర్మించిన ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయాన్ని బుధవారం ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు నెలలో రూ.3 వేల కోట్లతో 10 ప్యాకేజీలకు టెండర్లు పిలుస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి రూ.1200 కోట్లు ఖర్చు చేశామన్నారు. టీజీపీఎస్సీ ద్వారా ఆర్అండ్బీ శాఖలో కొత్తగా ఏఈ పోస్టుల భర్తీ చేశామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువత స్వయంశక్తితో ఎదిగేందుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు బాలునాయక్, మందుల సామేల్, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్అండ్బీ ఎస్ఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి -
గోల్డ్ మెడల్స్కు విరాళాల స్వీకరణ
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి సబ్జెక్ట్ల వారీగా ఓవరాల్గా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సుమారు 30 బంగారు పతకాలు ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. దీని కోసం ఔత్సాహికుల నుంయి విరాళాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో బంగారు పతకానికి రూ.1.5 లక్షలు కళాశాల అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కరు ఎన్ని బంగారు పతకాలకై నా ఇవ్వవచ్చని తెలిపారు. విరాళం డిపాజిట్ చేసిన వారి పేరు మీద కానీ.. వారు సూచించిన వారి పేరు మీద ప్రతి విద్యా సంవత్సరం బంగారు పతకాలు ప్రధానం చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన కళాశాల స్థాపక దినోత్సవం రోజున బంగారు పతకాల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. వివరాలకు 98486 96776, 99898 97566 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానంనల్లగొండ : పోలీస్ శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన పలువురిని ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సన్మానించారు. వారికి పోలీస్శాఖ ద్వారా ఇవ్వాల్సిన ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఓ శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయంలో సాంకేతికను జోడించాలి నల్లగొండ టౌన్ : రైతులను ఆర్థికంగా బలో పేతం చెందాలంటే వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికను జోడించాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ కో ఆపరేటివ్ వారోత్సవాల్లో భాగంగా ఇంగ్లాండ్లోని మాంచస్టల్ రాష్ట్రంలో బుధవారం ప్రారంభమైన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కో ఆపరేటివ్ వ్యవస్థ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైతులు పంటల సాగుతో ఆయా దేశాల అభివృద్ధికి తమవంతు చేయూత అందిస్తున్నారన్నారు. రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి ఆదుకోవాలన్నారు. పాడి పరిశ్రమ, హార్టికల్చర్, సెరికల్చర్, పశు సంపదను పెంపొందించే అంశాలపై సహకార వ్యవస్థ దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలపై అవగాహన పెంచుకుని ఉమ్మడి జిల్లాలో సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. 4న ఫుట్బాల్ జిల్లా జట్టు ఎంపికనల్లగొండ టూటౌన్ : మంచిర్యాలలో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే జట్టును ఈనెల 4వ తేదీన నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో ఎంపిక చేయనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు బండారు ప్రసాద్ తెలిపారు. సెలక్షన్ పోటీల నిర్వహణపై బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 1 జనవరి 2010 నుంచి 31డిసెంబర్ 2012 మధ్య జన్మించిన బాలికలు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం తీసుకొని 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఎన్జీ కాలేజీకి రావాలని పేర్కొన్నారు. ఇక్కడి పోటీల్లో ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్ర స్థాయి పంపుతామన్నారు. వివరాలకు 8374542407 ఫోన్నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఓరుగంటి శ్రీనివాస్, కందికట్ల దాస్, బొడ్డుపల్లి సునీత, కట్ట వెంకట్, మందడి సురేందర్రెడ్డి, కొప్పు ప్రవీణ్గౌడ్ పాల్గొన్నారు. స్కూళ్లను తనిఖీ చేస్తాం నల్లగొండ : జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేస్తామని డీఈఓ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పించాలని ఆయన సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫాం, టై, బెల్టు, నోట్బుక్స్ అమ్మవద్దని, అధిక ఫీజులు వసూలు చేయవద్దని సూచించారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జగన్నాథుడి రథయాత్ర
చింతపల్లి : మండల కేంద్రం హరి నామస్మరణతో మార్మోగింది. భక్తుల నృత్యాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలతో జగన్నాథుడి రథయాత్ర బుధవారం వైభవంగా సాగింది. కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ సౌజన్యంతో సాయి సన్నిధి బాబా దేవాలయం ఆధ్వర్యంలో పూరి జగన్నాథుడి (శ్రీకష్ణుడు) రథయాత్ర చింతపల్లి మండల కేంద్రంలోని రాజా రాజేశ్వర దేవాలయం నుంచి సాయి సన్నిధి శ్రీకృష్ణ గోకులం వరకు నిర్వహించారు. రథయాత్రకు మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులకు నైవేద్యం సమర్పణ, మంగళహారతి అనంతరం భక్తులకు మహా ప్రసాదం అందజేశారు. -
నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆర్అండ్బీ శాఖ ద్వారా జిల్లాకు ఎక్కువ నిధులు తెచ్చామని.. భవిష్యత్లో మరిన్ని నిధులు తెస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. సంగెం బ్రిడ్జికి రూ.45 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఎస్డీఎఫ్ కింద ప్రతి ఎమ్మెల్యేకు వెంటనే రూ.5 కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో చేపట్టిన అదనపు బ్లాక్ నిర్మాణాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రగతిపై కలెక్టర్ల వివరణ సమావేశంలో ముందుగా నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్, యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు.. ఆయా జిల్లాలో నీటిపారుదల, విద్యా, వ్యవసాయం, వైద్యం, మహిళా శక్తి, సంక్షేమం తదితర అంశాల్లో ప్రగతి, చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులకు వివరించారు. -
కలుపుతీసి ఎరువు పెట్టుకుంటాం
ప్రస్తుతం కురుస్తున్న వర్షం పత్తి చేలకు మంచి పదును ఇచ్చింది. వర్షం తగ్గగానే వెంటనే పత్తి చేలో కలుపు తీసుకుని ఎరువులు పెట్టుకుంటాం. చేను వాడుబడుతున్న సమయంలో వర్షం రావడం వల్ల పత్తి మొక్కలకు ప్రాణం వచ్చింది. – పనస కాశయ్యగౌడ్, గుండ్లపల్లి, నల్లగొండ మండలం రైతులు సంతోషంగా ఉన్నారు అల్ప పీడనం కారణంగా జిల్లా అంతటా మంచి వర్షం కురిసింది. పత్తి చేలు వాడుతున్న దశలో వర్షం రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పదునైనందున చేలకు ఎరువులు పెట్టుకోవచ్చు. నార్లు పోసుకున్న రైతులు కూడా పొలాలు దున్నుకుని నాట్లు వేసుకునే అవకాశం ఉంది. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
ప్రజా ప్రభుత్వం.. సంక్షేమమే ధ్యేయం
పథకాల అమలు తీరును అధికారులు పర్యవేక్షించాలిఫ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఫ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై నల్లగొండ కలెక్టరేట్లో సమీక్ష ఫ హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫ ఆయా రంగాల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కలెక్టర్లు నల్లగొండ : అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై బుధవారం నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో కలిసి సమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా అర్హులకు మేలు జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రైతులకు సంబంధించిన అంశాలను మండలస్థాయి అధికారులతో జిల్లా అధికారులు రోజూ పర్యవేక్షించాలన్నారు. రైతు భరోసా, బీమా, ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా అభివృద్ధికి 15 రోజులకోసారి సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు కిరణ్కుమార్రెడ్డి, కుందూరు రఘువీర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు, నల్లగొండ ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. -
ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈఓ డాక్టర్ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ మొదటి సెమిస్టర్లో 21.76 శాతం, రెండవ సెమిస్టర్ 23.56 శాతం, మూడో సెమిస్టర్లో 31.08 శాతం, నాలుగో సెమిస్టర్లో 36.05 శాతం, ఐదవ సెమిస్టర్లో 37.03 శాతం, ఆరవ సెమిస్టర్లో 46.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజి స్ట్రార్ అల్వాల రవి, కోఆర్డినేటర్లు లక్ష్మీప్రభ, ప్రవళిక, భిక్షమయ్య పాల్గొన్నారు. -
సాగర్లో పెరుగుతున్న నీటిమట్టం
ఫ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటి విడుదల ఫ సాగర్ జలాశయానికి చేరుతున్న 50వేల క్యూసెక్కుల నీరు ఫ ఆయకట్టులో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలునాగార్జునసాగర్, మిర్యాలగూడ : కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మే నెలలోనే జూరాల ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో అక్కడి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా మంగళవారం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిత్యం సుమారు 50వేల క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి వస్తుండడంతో సాగర్ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో సాగర్ ఆయకట్టుకు ఈ ఏడాది ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ చివరి వారంలో నీటి విడుదలకు అవకాశం సాగర్ జలాశయ గరిష్టస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. జూన్ మొదటి వారంలో 511.80 అడుగులు (134.7466 టీఎంసీలు)గా ఉంది. బుధవారం నాటికి 517.60 అడుగులకు (144.9362టీఎంసీలు) చేరింది. సాగర్ నీటిమట్టం 540 అడుగులకు చేరి, ఎగువనగల జలాశయాలు గరిష్టస్థాయిలో ఉండి, నదిలో 70 నుంచి 100టీఎంసీల నీరు ఉంటే సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. సాగర్ కుడి, ఎడమ కాల్వల కింది 22,12,670 ఎకరాల ఆయకట్టు ఉంది. భూగర్భ జలాలు పెరిగి.. బోర్లు, బావులు, వాగుల ద్వారా మరో లక్ష ఎకరాలు సాగవుతుంది. కుడి, ఎడమ కాల్వల కింద సాగుకు 132 టీఎంసీల చొప్పున 264 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడు సార్లు ఆగస్టు మాసంలోనే ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. 2017లో అక్టోబర్ నెలలో విడుదల చేశారు. 2015, 2023 సంవత్సరాల్లో కృష్ణాబేసిన్కు వరదలు రాక జలాశయాలకు నీరు చేరకపోవడంతో కాల్వలకు నీరివ్వలేదు. ఈ ఏడాది ముందుగానే జలాశయాలకు నీరు చేరుతుండటంతో జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి.పదేళ్లుగా నీటి విడుదల వివరాలు ఇలా.. సంవత్సరం నీటిమట్టం విడుదల తేదీ 2014 515 ఆగస్టు 6 2015 510 నీటి విడుదల లేదు 2016 514 ఆగస్టు 26 2017 576 అక్టోబర్ 31 2018 555 ఆగస్టు 23 2019 556 ఆగస్టు 11 2020 556 ఆగస్టు 7 2021 585 ఆగస్టు 5 2022 555 ఆగస్టు 31 2023 506 నీటి విడుదల లేదు 2024 585 ఆగస్టు 2సాగు పనుల్లో ఆయకట్టు రైతులు సాగర్కు వరద వస్తుండడంతో సాగునీటి విడుదలకు ఢోకా ఉండదనే ధీమాతో ఆయకట్టు పరిధిలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని నార్లు పోసుకుంటున్నారు. వరద ఇలాగే వస్తే ఈ వానాకాలం సీజన్తోపాటు యాసంగి సీజన్లో కూడా గట్టెక్కినట్లేనని రైతులు భావిస్తున్నారు. సాగర్కు నీటి రాక మొదలైంది నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి సుమారు 50 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. నీటి రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నడూ లేని విధంగా ముందుగానే సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది. – మల్లికార్జున్, ఎస్ఈ, సాగర్డ్యాం -
14న రేషన్ కార్డుల పంపిణీ: ఉత్తమ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 14న కొత్త రేషన్కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై వృద్ధులు, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ ఈ విషయం వెల్లడించారు. 14న సాయంత్రం 6 గంటలకు తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగ సభలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులకోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 13లోగా పరిశీలించి, అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికలున్న చోట కొద్దిమందికి రేషన్ కార్డులు ఇచ్చిందే తప్ప అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్.. 44 కిలోమీటర్లలో 35 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే చేసి పనులు పునఃప్రారంభిస్తామన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: మంత్రి లక్ష్మణ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నిరకాలుగా అండగా ఉంటుందని మంత్రి లక్ష్మణ్కుమార్ తెలిపారు. ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, అలాకాకుండా తమ ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. వానాకాలంలో విద్యుత్తు సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రూ.1,200 కోట్లతో రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రూ.1,200 కోట్లతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణం చేపడతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. అధికారులు పథకాల అమలులో అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దన్నారు. -
చెత్తకుప్పలుగా ఓపెన్ ప్లాట్లు
దేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దేవరకొండ మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా దాదాపు 40వేల పైచిలుకు జనాభా ఉన్నట్లు అంచనా. నిత్యం దాదాపు 16టన్నుల చెత్తను మున్సిపల్ అధికారులు పట్టణంలోని సేకరిస్తున్నారు. 11 ఆటోలు, ట్రాక్టర్లు ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మొత్తం 77మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. అయినప్పటికీ ఓపెన్ ప్లాట్లు, ఖాళీ ప్రదేశాల్లో జనం చెత్త వేస్తున్నారు. చెత్తను బయట పడవేస్తే జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నా.. పట్టించుకోవడం లేదు. పట్టణంలోని శివారు కాలనీల్లో మురుగుకాల్వల నిర్మాణం లేకపోవడం.. డ్రెయినేజీలు ఉన్న చోట నిర్వహణ సరిగా లేకపోవడంతో పలు చోట్ల రోడ్లపైనే మురుగు పారుతోంది. దీంతో జనం దుర్వాజన, దోమలు, ఈగల బెడదతో అల్లాడుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. -
అరకొర సిబ్బందితో అంతంత మాత్రంగానే..
నకిరేకల్ : నకిరేకల్ మున్సిఫాలిటిలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. రోజూ చెత్తను తరలించేందుకు రెండు ట్రాక్టర్లు, ఆరు ఆటోలు వినియోగిస్తున్నారు. మొత్తం 71 మంది పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. వీరు డ్రెయినేజీలను శుభ్రం చేయడం పాటు.. వాహనాల ద్వారా ఇంటింటా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేయడం లేదు. దీంతో కొన్ని వీధుల్లో నెలల తరబడి డ్రెయినేజీల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం లేదు. చాలా చోట్ల రోడ్లు వెంట చెత్త కూడా దర్శనమిస్తోంది. -
దుర్గందం వెదజల్లుతున్న మిర్యాలగూడ వీధులు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం వార్డు 48 ఉన్నాయి. మొత్తం 278 కార్మికులు 18 ట్రాక్టర్లు, 48 ఆటోల ద్వారా రోజూ రోజూ 50 మెట్రిక్ టన్నులు చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయినా మున్సిపాలిటీలో రోడ్లు, వీధుల వెంట చెత్త కుప్పలు.. కుప్పలుగా కనిపిస్తోంది. చెత్తను పూర్తిగా తరలించకుండా కొన్ని చోట్ల చెత్తను అక్కడే కాలుస్తున్నారు. దీంతో దుర్వాసన, పొగతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాలనీల్లోని ఖాళీ స్థలాల్లోనూ చెత్త వేస్తుండడంతో దోమల బెడద పెరిగి జనం అలాఅలడుతున్నారు. ఇక డ్రెయినేజీలు పూడికతో నిండిపోయాయి. ప్రధాన నాలాలు ఇటీవల కొంత పూడిక తీసినా.. వీధుల్లోని మురుగుకాల్వలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్ఘంధం వెదజల్లుతున్నాయి. -
వైద్య వృత్తి పవిత్రమైనది
నల్లగొండ : సమాజంలో వృత్తి వైద్య పవిత్రమైనదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నేషనల్ డాక్టర్స్డే సందర్భంగా మంగళవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఉత్తమ సేవలందించిన డాక్టర్లను శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ఆపద సమయంలో ఆపద్బాందవుల్లా కనిపించే వైద్యులను ప్రజలు గౌరవిస్తారన్నారు. మనిషికి ఎంత సంపద ఉన్నా అనుభవించే ఆరోగ్యం లేకపోతే వృథా అన్నారు. అనారోగ్యంతో బాధపడే వారిని కాపాడే శక్తి కేవలం వైద్యులకే ఉందన్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి అందరి మన్ననలను పొందాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
చిట్టీల వ్యాపారి అరెస్ట్
చిట్టీలు కట్టించుకుని మోసం చేసి పారిపోయిన చిట్టీల వ్యాపారిని మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. - 8లోహాలియాలో చెత్త కంపు హాలియా : హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా చెత్త సేకరణ కోసం 51 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. చెత్త సేకరణకు ఆరు ఆటోలు, మూడు ట్రాక్టర్లు ఉన్నాయి. అయినా పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం చెత్తచెదారంతో పేరుకుపోయింది. రోజూ చెత్తను సేకరిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారే తప్ప.. నివాసాల వద్దకు వచ్చి సేకరించడం లేదు. దీంతో ఇళ్లలో పేరుకుపోయిన చెత్తను జనం బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్నారు. ఈ చెత్తను తీయకపోవడంతో ఆ ప్రాంతాలు పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇక వానాకాలంలో చిన్నపాటి వర్షానికే పట్టణంలోని డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఖాళీ స్థలాల్లో మురుగు నిలిచి, పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి దోమలు విజృంబిస్తున్నాయి. ఇక ఇళ్ల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో కొత్త డ్రెయినేజీల నిర్మాణం ఊసే లేకపోవడంతో మురుగు రోడ్లపై పారుతోంది. దీంతో దుర్ఘందంలో జనం అల్లాడుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట కనీసం బ్లీచింగ్ ఫౌడర్, కెమికల్ స్ప్రే కూడా చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీలను రోజూ శుభ్రం చేయడంతో పాటు వార్డుల్లో పెరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
మిర్యాలగూడ : కార్మికుల హక్కుల సాధనకు ఈనెల 9న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మార్కెండేయ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సీఐటీయూ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల సమస్యలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. కొత్త చట్టాల వల్ల కార్మికులకు కనీస వేతనం అందదని, శ్రమకు తగ్గ వేతనం రాదని, శ్రమ దోపిడీకి గురవుతారని అన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఈనెల 5న అన్ని మండల కేంద్రాల్లో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించాలని, 9వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపాలన్నారు. 9న చేపట్టే సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, తిరుపతి రామ్మూర్తి, బావండ్ల పాండు, రవినాయక్, రొండి శ్రీనివాస్, దయానంద్, కేశవులు, పార్వతి, సైదులు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
నేడు నల్లగొండకు మంత్రుల రాక
● ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమీక్షనల్లగొండ : నల్లగొండకు బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్రెడ్డి, శాసనమండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి రానున్నారు. నల్లగొండలోని కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై వారు సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రుల సమీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. సమీక్షించే అంశాలపై నోట్స్ తయారీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తదితర ఏర్పాట్లలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ప్రారంభించనున్న ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ బి.వెంకటేశ్వరరావు, ఈఈ శ్రీధర్రెడ్డి, డీఈ ఫణిజ, గణేష్కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పుణ్య, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ పాల్గొన్నారు. పోర్చుగల్లో ఉద్యోగాలకు దరఖాస్తులునల్లగొండ : తెలంగాణ ఓవర్సిస్ మ్యాన్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో పోర్చుగల్లో ప్రైవేట్ ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోర్చుగల్లో ఖాళీగా ఉన్న ఎప్అండ్బీ మేనేజర్, హౌజ్ కీపర్, వెయిటర్, మెయిన్టెయిన్స్ టెక్నిషియన్, ఎగ్జిక్యూటివ్ టెక్నిషియన్, కుక్, కిచెన్ అసిస్టెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కోఆర్డినేటర్ తదితర ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు tom com.resume@gmail.com వెబ్సైట్కు రెజ్యూమ్లను పంపాలని పేర్కొన్నారు. అర్హత, తదితర పూర్తి వివరాలకు 9440052592, 9440049937 ఫోన్ం నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. పథకాలను వినియోగించుకోవాలిడిండి : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి సూచించారు. మంగళవారం డిండి మండల మహిళ సమాఖ్య సంఘాల నూతన కార్యవర్గాలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్లు, డ్రోన్లు, ప్రమాద బీమా, పేదరిక నిర్మాలన తదతర అంశాలపై నూతన మహిళ సంఘ బంధాల సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీఎం పురుషోత్తం పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులునల్లగొండ : అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్యాలకు సంబంధించిన కోర్సుల్లో నాలుగు రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నిజాంఅలీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 30 సంవత్సరాల వరకు వయసు కలిగిన, డిగ్రీలో ఉత్తీర్ణులైన ఎంబీసీ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాని పొందాలని తెలిపారు. tgobmms. cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణపత్రాలను జతచేసి ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నల్లగొండ కలెక్టరేట్లోని బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు టీచింగ్ డైరీ రాయాలినాంపల్లి : ప్రతి ఉపాధ్యాయుడు టీచింగ్ డైరీ రాయాలని డీఈఓ భిక్షపతి అన్నారు. మంగళవారం ఆయన నాంపల్లి జెడ్పీహెచ్ఎస్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. బోధనోపకరణాలు ఉపయోగించి బోధించడంతో పాటు పాఠ్య ప్రణాళికలను తయారు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధన తీరు పరిశీలించారు. విద్యార్థుల చేత స్వయంగా బోర్డుపై ఉన్న అడిషన్స్ను చదివించారు. అనంతరం భవిత కేంద్రం, ప్రైమరీ స్కూల్ను తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంఈఓ మల్లికార్జునరావు ఉన్నారు. -
శరవేగంగా నెల్లికల్లు ఎత్తిపోతల పనులు
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : నెల్లికల్లు ఎత్తిపోతల పనులు శరవేగంగా సాగుతున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మొత్తం 11 గ్రామాల్లోని 24,624 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె నెల్లికల్ ఎత్తిపోతల పథకం పంప్హౌజ్, పైపులైన్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షం వల్ల పనులు ఆగిపోకుండా ముందే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులను భద్రతను సైతం దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రెస్సర్ మెయిన్(పైప్లైన్)కు సంబంధించి భూసేకరణ అవార్డు పాస్ చేసి.. చెల్లింపులు చేస్తున్నామన్నారు. కెనాల్కు సంబంధించి సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట మిర్యాలగూడెం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ప్రాజెక్టు డీఈ సీతారాం, ఏఈ రవి, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాసరావు, ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మాతా, శిశు మరణాలు తగ్గాయ్!
మరణాల సంఖ్య తగ్గుతుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిరకాల వైద్య సదుపాయాలున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. గర్భిణుల్లో కూడా చైతన్యం వచ్చింది. మంచి పౌష్టికాహారం తీసుకుని వైద్యుల సలహాలు పాటిస్తున్నారు. తద్వారా మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుతుంది. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ నల్లగొండ టౌన్: వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలతో జిల్లాలో మాతా, శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టింది. ఆరేళ్ల క్రితం వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతోపాటు సకాలంలో వైద్యం అందకపోవడంతో మాతా, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండేది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో అన్నిరకాల మౌలిక సదుపాయలు కల్పించింది. ప్రత్యేక వైద్యులను నియమించింది. దీనికితోడు నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబందంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి నిష్ణాతులైన ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులను నియమించింది. వైద్య పరీక్షల కోసం అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన ఐసీయూ, కేఎంసీతోపాటు అన్ని విభాగాలను ఏర్పాటుచేసి వైద్యసేవలను మెరుగుపర్చింది. ఫలితంగా ఆరేళ్లుగా మాతా శిశు మరణాల సంఖ్య ఏటేటా తగ్గుముఖం పట్టింది. వాట్సప్ గ్రూప్లో వివరాలు జిల్లాలోని మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రులకు ప్రసవాల కోసం వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అత్యవసర చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. రెఫర్ చేసిన వెంటనే ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఎంసీహెచ్ వాట్సప్ గ్రూప్లో గర్భిణుల వివరాలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అందించాల్సిన వైద్యం వివరాలను నమోదు చేస్తున్నారు. ఆ వాట్సప్ గ్రూప్లో ఎంసీహెచ్ ఇన్చార్జి, గైనిక్ హెచ్వోడీ, చిన్నపిల్లల విభాగం ఇన్చార్జి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, ఇతర విభాగాల ఇన్చార్జిలు ఉంటారు. దీనివల్ల వెంటనే వైద్యులు అలర్ట్ అయ్యి రోగి రాగానే సకాలంలో వైద్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కూడా అందించలేని పరిస్థితి ఉంటే వారిని హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేసిన వెంటనే రాష్ట్ర స్థాయిలో ఎంసీహెచ్ వాట్సప్ గ్రూప్లో రోగి వివరాలు నమోదు చేస్తున్నారు. వెంటనే ఆయా ఆసుపత్రుల అధికారులను అప్రమత్తం చేసి సకాలంలో వైద్యం అందేలా చూస్తున్నారు. సత్ఫలితాలిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలు గర్భం దాల్చిన నుంచి తల్లీబిడ్డ ఇల్లు చేరేవరకు పర్యవేక్షణ వాట్సప్ గ్రూప్లో రెఫరల్ కేసుల వివరాలు తగిన చికిత్స అందిస్తున్న వైద్యులు మాతా, శిశు మరణాల వివరాలు.. సంవత్సరం మాత శిశు 2018–19 14 3352019–20 18 3952020–21 08 3292021–22 26 3102022–23 13 3172023–24 12 2162024–25 10 221గర్భిణుల నమోదు నుంచే పర్యవేక్షణ మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం తర్వాత తల్లిబిడ్డలను ఇంటికి చేర్చే వరకు వైద్య ఆరోగ్య శాఖ నిత్యం పర్యవేక్షిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు.. గర్భిణుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వారిని పరీక్షల నిమిత్తం ప్రతినెలా ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. టీకాలు వేయించడం రక్తహీనత అధికమించేందుకు మందులను ఇప్పించడం పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. నెలలు నిండగానే 102 వాహనంలో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళుతున్నారు. కాన్పు జరిగిన అనంతరం తల్లిబిడ్డను ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేరుస్తున్నారు. నిత్య పర్యవేక్షణతో మాతా శిశుమరణాల సంఖ్య తగ్గిందని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. -
సమాజ సేవలో భాగస్వాములు కావాలి
నల్లగొండ : ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం సమాజ సేవలో భాగస్వాములు కావాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కోరారు. మంగళవారం నల్లగొండలో నార్కట్పల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.ఇస్మాయిల్ పదవీవిరమణ సన్మానసభలో ఆయన మాట్లాడారు. 42 సంవత్సరాలుగా ఇస్మాయిల్ అధ్యాపక వృత్తిలో అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. వృత్తిపై నిబద్ధత గల వ్యక్తి ఎండి ఇస్మాయిల్ అని కొనియాడారు. అనంతరం ఇస్మాయిల్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో డీఐఈఓ దస్రూనాయక్, టీజీఓ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎండీ.ముజుముద్దీన్, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ముగిసిన రేషన్ పంపిణీ
నల్లగొండ : మూడు మాసాల రేషన్ పంపిణీ సోమవారంతో ముగిసింది. జిల్లాలో 85 శాతం మంది రేస్షాపుల ద్వారా సన్న బియ్యం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనివిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంత ప్రజలు రేషన్షాపులకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్లోనే ఇచ్చింది. ఆ కోటా పంపిణీ ముగియడంతో రెండు నెలలపాటు రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 1న మళ్లీ ఓపెన్ జూన్, జులై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం కోటా జూన్ మాసంలోనే రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేశారు. ఆ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. జిల్లాలో 85 శాతం కార్డుదారులు జిల్లాలో రేషన్ తీసుకున్నారు. అయితే బియ్యం పంపిణీలో పోర్టబులిటీ ఉన్నందున ఇతర జిల్లాల్లో కూడా నల్లగొండ జిల్లాకు సంబంధించిన కార్డుదారులు 10 శాతం వరకు బియ్యం తీసుకుని ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలల కోటా జూన్లో ఇచ్చినందున జూలై, ఆగస్టు నెలల్లో రేషన్షాపుల్లో మూత పడనున్నాయి. సెప్టెంబరు 1 నుంచి మళ్లీ రేషన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఫ సన్న బియ్యం తీసుకున్న 85 శాతం లబ్ధిదారులు ఫ రెండు నెలలపాటు మూతపడనున్న రేషన్ షాపులు రేషన్ పంపిణీ ఇలా.. రేషన్ దుకాణాలు 994మొత్తం కార్డులు 4,84,210 బియ్యం తీసుకున్నవారు 4,10,284 -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్డేలో సందర్భంగా కలెక్టరేట్కు బాధితులు తరలి వచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ వినతులు స్వీకరించారు. మొత్తం 122 మంది ఫిర్యాదులు అందించగా 67 రెవెన్యూ శాఖకు, మిగతావి ఇతర శాఖలకు సంబంధించినవి వచ్చాయి. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖలకు పంపారు.ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఫ గ్రీవెన్స్డేలో వినతుల స్వీకరణ -
అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారు
నల్లగొండ : సాగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు అనర్హులకు ఇస్తున్నారని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పథకాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ డేలో ఆయన అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నీ అనర్హులకే అందుతున్నాయన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కలుగడం లేదన్నారు. అధికారులు ఏకపక్షంగా కాంగ్రెస్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. సాగర్ నియోజక వర్గంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఫోన్ చేసినా స్పందించడం లేదని.. నాయకులతో కలిసి నేరుగా మొర పెట్టుకుందామని వచ్చినా కలెక్టర్ అదుబాటులో లేరని అన్నారు. ప్రభుత్వం ఎవరిదైనా.. పేదల న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆయన వెంట అనుముల శ్రీనివాస్రెడ్డి, శ్యామ్సుందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ -
పేదల డాక్టర్.. రంగారెడ్డి
ఫ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే ఆయన తపన ఫ సూర్యాపేటలో ఆస్పత్రి నెలకొల్పిన తొలుత రూ.5కే వైద్య సేవలు ఫ ప్రస్తుతం రూ.20లకే ఓపీ ఫ పూర్వవిద్యార్థుల సేవాసమితి ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలునేడు డాక్టర్స్డే సూర్యాపేట అర్బన్: పేద రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తి కష్టపడి చదవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పేదలకు వైద్యం అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఆస్పత్రి ఏర్పాటు చేసుకొని నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందిస్తూ పేదల వైద్యుడిగా పేరుగాంచారు. పూర్వ విద్యార్థుల సేవా సమితి ఏర్పాటు చేసి వైద్య శిబిరాలతో పాటు అనేక సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూర్యాపేట పట్టణంలోని ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ రంగారెడ్డి. నేడు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యుడి జీవిత విశేషాలు, వైద్య రంగంలో చేస్తున్న సేవలు ఆయన మాటల్లోనే.. -
మా కూతురి నుంచి రక్షించండి
నా కుమార్తె సామ అరుణ, భర్త ఆనంద్రెడ్డికి గిప్టుడీడ్ కింద 5 ఎకరాల 20 గుంటల భూమి ఇచ్చాం. అందులో ఇల్లు నిర్మించుకుని నివాసముంటూ మూడేళ్ల నుంచి మాపై దాడులు చేస్తూ.. మానసికంగా, శారీరకంగా బాధలు పెడుతోంది. మా తోటలో ఉన్న మమ్మల్ని కొట్టి చంపుతానని బెదిరిస్తోంది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం. నా చిన్నల్లుడికి అమ్మిన భూమిని కూడా సాగు చేయకుండా అడ్డుకుంటోంది. మా కూతురు నుంచి రక్షణ కల్పించి గిఫ్ట్డీడ్ రద్దు చేయాలి. – నారాయణరెడ్డి–మణెమ్మ దంపతులు, ఎరెడ్లగూడెం, గుర్రంపోడు మండలం -
అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2025 సంవత్సరానికి అర్హత గల ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు natio nalawardstoteachers.education.gov.inలో వెబ్సైట్ ద్వారా నెల 13వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలు వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ చేసిన కాపీని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఏడాదిలో డీసీసీబీ టర్నోవర్ పెరిగింది నల్లగొండ అగ్రికల్చర్ : డీసీసీబీలో తమ పాలకవర్గం ఏర్పడిన సంవత్సరం కాలంలో ఎన్నడూ లేని విధంగా రూ.598.16 కోట్లుకు టర్నోవర్ పెరిగి మొత్తం రూ.2940.29 కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పాలకవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం డీసీసీబీలో కేక్ కట్చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన వెంటనే పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచామన్నారు. పంట రుణాల బడ్జెట్ను రూ.100 కోట్లకు తెచ్చామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు, సొసైటీలకు గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తున్న పాలకవర్గం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పాశం సంపత్రెడ్డి, కొండా సైదయ్య, ఇరిగినేని అంజయ్య, గుడిపాటి సైదయ్య, దనావత్ జయరాం, బంటు శ్రీనివాస్, సుష్మ, కొమ్ము కరుణ, కె.వీరస్వామి, సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, డీజీఎంలు, ఏజీఎంలు సిబ్బంది పాల్గొన్నారు. మతోన్మాద విధానాలపై పోరాడాలిహాలియా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హాలియా పట్టణంలో నిర్వహించిన సీపీఎం సాగర్ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల జీవితాలను నడిరోడ్డుకు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును అమలు చేయాలన్నారు. అనంతరం ‘మతం – మతతత్వం’ అనే క్లాసును పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, ‘పార్టీ నిర్మాణం, పని పద్ధతులు, శాఖల నిర్మాణం’ అనే క్లాసును సీపీఎం జిల్లా వర్గసభ్యుడు చిన్నపాక లక్ష్మినారాయణ బోధించారు. కార్యక్రమంలో కొండేటి శ్రీను, అవుతా సైదయ్య, దైద శ్రీను, కందుకూరి కోటేష్, రామచంద్రయ్య, జటావత్ రవినాయక్, కత్తి లింగారెడ్డి, బషీర్, సోమయ్య, కొప్పు వెంకన్న, వేములకొండ పుల్లయ్య, చంద్రశేఖర్, కారంపూడి ధనమ్మ, కోరె రమేష్, వెంకటేశ్వర్లు, యశోద, రాజమ్మ తదితరులు ఉన్నారు. ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఖమ్మంపాటి శంకర్ నల్లగొండ: కేరళ రాష్ట్రం కోజికోడ్లో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 18వ మహాసభలకు కేంద్ర కమిటీ సభ్యుడిగా జిల్లాకు చెందిన ఖమ్మంపాటి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ జిల్లా నుంచి ఆలిండియా మహాసభలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
నల్లగొండ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్పై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరాధరణకు గురైన, వెట్టి చాకిరికి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని చేరదీయడానికి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్ల పరిధిలో మూడు బృందాలను ఏర్పాటు చేసి ఆపరేషన్ ముష్కాన్ నిర్వహించాలన్నారు. సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కృష్ణవేణి, ఏహెచ్టీయూ ఎస్ఐ రంగారెడ్డి పాల్గొన్నారు. -
మూడేళ్లుగా.. ఫీజులివ్వలే!
నల్లగొండ : పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) లక్ష్యం నీరుగారుతోంది. మూడేళ్ల నుంచి ఆ స్కీం కింద నిధులు విడుదల చేయకపోవడంతో రూ.రూ.6,81,58,732 బకాయిలు పేరుకుపోయాయి. దీంతో బెస్ట్ అవైలబుల్ కింద ఎంపికై న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పేద విద్యార్థులకు బుక్స్, నోట్బుక్స్, యూనిఫాం ఇవ్వలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు దాపురించింది. జిల్లాలో 12 పాఠశాలలు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద జిల్లాలో 12 ప్రైవేట్ పాఠశాలలు విద్యనందిస్తున్నాయి. వీటిలో 5 నుంచి 10వ తరగతి వరకు 1,325 మంది విద్యార్థులకు చదువుకుంటున్నారు. ప్రభుత్వం డే స్కాలర్ కింద ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.28 వేలు, రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.42 వేలు చెల్లిస్తుంది. విద్యార్థులకు యూనిఫాం, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, షూ కూడా సదరు పాఠశాలలే ఇవ్వాలి. ప్రతి విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం పాఠశాలలకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ మూడేళ్లుగా నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఆయా ప్రైవేట్ పాఠశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూనిఫాం, నోట్బుక్స్, షూ ఇవ్వలేమని వాటిని పిల్లలే తెచ్చుకోవాలని చెబుతున్నాయి. ధర్నాకు దిగిన తల్లిదండ్రులు బెస్ట్ అవైలబుల్ కింద ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం మూడేళ్ల నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా ప్రైవేట్ పాఠశాలలు షూ, యూనిఫాం, నోట్బుక్స్ విషయంలో తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. నేటికీ నిధుల విడుదల విషయంలో స్పష్టత లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఫ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం ఇవ్వలేమంటున్న ప్రైవేట్ పాఠశాలలు ఫ ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులుబెస్ట్ అవైలబుల్ స్కూళ్లు 12చదివే విద్యార్థులు 1,325డే స్కాలర్కు ఏడాదికి చెల్లించేది రూ.28 వేలు రెసిడెన్షియల్కు రూ.42 వేలు 2022–23లో బకాయి రూ. 70,70,852 2023–24లో రూ.2,91,67,8802024–25లో రూ.3,19,20,000 మొత్తం బిల్లులు రూ.6,81,58,732బిల్లులు ట్రెజరీకు పంపాం బెస్ట్ అవైలబుల్ స్కీంకు సంబంధించి ఆయా ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించాల్సిన బిల్లులను ట్రెజరీకి పంపాం. రాష్ట్రస్థాయిలో ఇవి పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు త్వరలోనే విడుదలవుతాయి. తల్లిదండ్రులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఈ విషయంపై వినతిపత్రాలు ఇచ్చారు. వాటిని పైఅధికారులకు పంపుతాం. – శశికళ, ఎస్సీ అభివృద్ధిశాఖ డీడీ, నల్లగొండ -
కమలం చీఫ్ మనోడే..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో ఆయనొక్కరే రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మంగళవారం ఆయన ఎన్నిక లాంఛనేమే కావడంతో జిల్లాలోని ఆయన బంధువులు, కోదాడ ప్రాంతంతోపాటు జిల్లా బీజేపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. హైదరాబాద్లో స్థిర నివాసం రాంచందర్రావు తల్లిదండ్రులు కోదాడ ప్రాంతానికి చెందిన వారే. తండ్రి ప్రొఫెసర్ ఎన్వీఆర్ లక్ష్మీనారాయణరావు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందినవారే. లక్ష్మీనారాయణరావు బాల్యం ఇక్కడే గడిచింది. ఉన్నత విద్యాభ్యాసం తరువాత ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా సేవలందించారు. రాంచందర్రావు చిన్నతనంలోనే తండ్రి లక్ష్మీనారాయణరావు, తల్లి రాఘవసీతమ్మ హైదరాబాద్లో స్థిరపడ్డారు. దీంతో రాంచందర్రావు బాల్యం, చదువు అంతా హైదరాబాద్లోనే కొనసాగింది. గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న సమయంలో నల్లబండగూడెంలో వారి కుటుంబం నివసించిన ఇల్లు ప్రస్తుత శిథిలావస్థకు చేరుకుంది. రాంచందర్రావు అమ్మమ్మ ఊరు కూడా కోదాడ పక్కనే ఉన్న అనంతగిరి మండల కేంద్రమే. అక్కడ రాంచందర్రావు తరఫు బంధువులు ఉన్నారు. కుటుంబంలో పెద్దవాడు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావుకు ఇద్దరు సోదరులు. వారిలో పెద్ద తమ్ముడు ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు. ఆయన జేఎన్టీయూ రిజిస్ట్రార్గా, వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం రాయపూర్ ఎన్ఐటీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీకి ఇన్ఛార్జి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. రెండో తమ్ముడు హేమచందర్ అమెరికాలో స్ధిరపడ్డాడు. రాంచందర్రావు బాబాయి కుమారుడు రాఘవరావు కోదాడలో చిన్న పిల్లల వైద్యశాలను నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రాంచందర్రావు ఫ ఆయన సొంతూరు కోదాడ మండలం నల్లబండగూడెంఅంచెలంచెలుగా ఎదిగిన రాంచందర్రావు రాంచందర్రావు విద్యార్థి దశనుండే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించిన ఆయన 1980–85 కాలంలో యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు. న్యాయ విద్య పూర్తయిన తరువాత హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే బీజేపీ నాయకుడిగా ఎదిగారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం కాబోతున్నారు. ఆయనకు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం ఉండటంతో మంచి వక్తగా పేరుపొందారు. ఇప్పటికీ కోదాడ ప్రాంతంలో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆయన తరచుగా హజరవుతుంటారు. -
‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
నేరేడుచర్ల(నల్గొండ): ప్రియుడికి వీడియో కాల్ చేస్తే స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె మృతికి ప్రియుడే కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని(35) తన భర్తతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నివాసముంటోంది. వీరికి ఒక కుమార్తె సంతానం. బోడలదిన్నె గ్రామానికే చెందిన కందుకూరి సురేష్రెడ్డి కూడా ఎల్బీనగర్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అశ్విని, సురేష్రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల అశ్విని, సురేష్రెడ్డి మధ్య దూరం పెరగడంతో.. నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్రెడ్డికి వీడియో కాల్ చేసి ‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని చెప్పింది. దీనికి తాను రానని సురేష్రెడ్డి సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చి సురేష్రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా ఆమె ఆపస్మారక స్థితిలో ఉండటం చూసి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతదేహంతో ఆందోళన..అశ్విని మృతికి సురేష్రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
ఆర్ఎంపీ వివాహేతర సంబంధం.. జ్యోతిని కారులో తీసుకెళ్లి..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను పక్కాగా ప్లాన్ ప్రకారం ఓ ఆర్ఎంపీ హత్య చేశాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే పూడ్చిపెట్టేందుకు యత్నం చేశాడు. కానీ, పోలీసులు రంగం ప్రవేశం చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడ్ మండలంలో మహేష్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక జునూతలలో జ్యోతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో, ఒత్తిడికి గురైన మహేష్.. జ్యోతిని అడ్డుతొలంగిచుకోవాలని చూశాడు. తాజాగా ఆమెతో మాట్లాడిన మహేష్.. బయటకు తీసుకెళ్లే నెపంతో దేవరకొండ నుంచి బాధితురాలిని తీసుకుని కారులో బయలుదేరాడు.అనంతరం, మార్గ మధ్యంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఆగ్రహానికి లోనైన మహేష్.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును బలవంతంగా ఆమెతో తాగించాడు. జ్యోతిని హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్.. ఆమెకు విషపు ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. జ్యోతి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే.. ఆమెను మట్టిలో పూడ్చిపెట్టాలని అనుకున్నాడు. అయితే, మహేష్ వెళ్తున్న కారుపై అనుమానం వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు.. అతడిని వెంబడించారు. కారును ఆపి పరిశీలించగా.. కొన ఊపిరితో ఉన్న జ్యోతిని చూసి వెంటనే.. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే జ్యోతి మృతి చెందింది. అనంతరం, నిందితుడు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. -
కార్మిక చట్టాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం
హాలియా : ఎందరో బలిదానాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా సంస్కరణలు చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ఆరోపించారు. ఆదివారం హాలియా పట్టణంలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సాగర్ నియోజకవర్గ సీఐటీయూ విస్తృత జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోరాడి సాఽధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి 44కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడులుగా కుందించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తగ్గిస్తూ సామాజ్యవాదులు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు అవుతా సైదులు, నాయకులు ఎస్కె బషీర్, వెంకటమ్మ, లక్ష్మమ్మ, నర్సారెడ్డి, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, సయ్యద్ హుసెన్, చిరంజీవి, వేణుగోపాల్, సైదిరెడ్డి, నన్నే సాహెబ్, శ్రీను, అనూష తదితరులు ఉన్నారు. -
నిరుపేదలకు వరంలా ప్రజా ప్రభుత్వం
మాడుగులపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వరంలా మారిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మాపురం, కన్నెకల్, గోపాలపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం స్థానిక అధికారులు, నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. నిరుద్యోగులకు 60వేల ఉద్యోగాలు, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, రైతులకు రైతు భరోసా, రుణమాఫీ చేశారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదవాడికి ఇళ్లు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ఎవరూ అఽధైర్య పడవద్దన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదిరెడ్డి, భాస్కర్రెడ్డి, బోడ యాదయ్య, కొత్త దశరధ, గద్దల శేఖర్, రామాంజిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, కొండ భాస్కర్, కొండేటి శంకర్, హౌసింగ్ ఏఈ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు హరికృష్ణ, నాగరమణి, ఇందిరమ్మ, లబ్ధిదారులు యాదయ్య, శంకర్, రేణుక, నాగయ్య పాల్గొన్నారు. -
పేదల పక్షాన సీపీఐ నిరంతర పోరాటం
డిండి : దేశంలో పేదరికం ఉన్నంత కాలం ప్రజల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఈడెన్ గార్డెన్లో నిర్వహించిన సీపీఐ మండల 15వ మహాసభకు ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సీపీఐ నాయకత్వం వహించిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్మరించి పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తుందని ఆయన ఆరోపించారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటరమణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మైనొద్దిన్, జిల్లా సమితి సభ్యుడు తూం బుచ్చిరెడ్డి, మండల కార్యదర్శి కనకాచారి, మండల సహాయ కార్యదర్శులు విజేందర్రెడ్డి, శైలేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మిర్యాలగూడ వాసికి గౌరవ డాక్టరేట్
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని హనుమాన్పేటకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పగిడిమర్రి గోవ ర్ధనాచారి చేస్తున్న సామాజిక వైద్య సేవలను గుర్తించిన ఏషియా వేదిక ఇంటరర్నేషనల్ కల్చర్ అండ్ రిసేర్చ్ స్ఫూర్తి అకాడమి సంస్థ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈ మేరకు ఈనెల శనివారం హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రముఖ డాక్టర్ సుదర్శన్గౌడ్, గూడూరు చెన్నారెడ్డి, వందేమాతరం బృందం నుంచి గోవర్ధనాచారి ఈ వార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను 40ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నానని, పేదలకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తాను చేస్తున్న వైద్య సేవలను గుర్తించిన ఏషియా వేదిక ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ రిసేర్చ్ స్ఫూర్తి ఆకాడమి సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. -
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
హాలియా : మండలంలోని నాయుడుపాలెంలో ఆదివారం సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి లబ్దిదారుడు ఓగిరాల శ్రీధర్కు సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఓగిరాల శ్రీధర్ తల్లి ఓగిరాల లీలావతికి మంజూరైన రూ. 90వేల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమె కుమారుడు ఓగిరాల శ్రీధర్కు ఎమ్మెల్యే జయవీర్రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ రామారావు, డాక్టర్ శ్రీధర్, మాజీ ఎంపీటీసీ అంజమ్మ, సర్ధార్, యడవెల్లి రాంబాబు, తేరా హనుమంతు, మున్సుబ్ తదితరులు ఉన్నారు. విద్యాశాఖ కమిషనర్కు వినతిమిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడలోని ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల దోపిడీని నియంత్రించాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్లో పాఠశాలల విద్యాశాఖ కమిషనన్ నవీన్ నికోలస్ను కలిసి బీసీ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని పలు పాఠశాలలు విద్యా హక్కు చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీడయ్య యాదవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమల గిరి అశోక్, ఉపేందర్, శ్రీనివాస్, రాజు, సైదయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నికచింతపల్లి : మండలంలోని నరసర్లపల్లి గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు నల్ల కాశయ్య మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల సురేందర్ మాదిగ, ఉపాధ్యక్షుడు నల్ల మధు మాదిగ, పల్లె మొగులాన్ మాదిగ, ప్రధాన కార్యదర్శులు నల్ల సైదులు మాదిగ, నల్ల విష్ణు మాదిగ, కార్యదర్శి ఎలిమినేటి సైదులు మాదిగ, నల్ల వెంకటయ్య మాదిగ కార్యవర్గసభ్యుడు నక్క శివ మాదిగ, కోశాధికారి నల్ల రమేష్, మాదిగ, గౌరవ అధ్యక్షుడు పల్లె కృష్ణ మాదిగ, సహాయ కార్యదర్శి నల్ల గణేష్ మాదిగ, సంస్కృత కార్యదర్శి నక్క నరేందర్ మాదిగ, సోషల్ మీడియా గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల, గిరి మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్పదినల్లగొండ టౌన్: ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్పదని ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి కన్వీనర్, న్యాయవాది పాశం నరేష్రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లారు. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు బానిసలుగా బతకాల్సిన రోజులు వస్తాయన్నారు. సనాతన ధర్మం అంటూ మనిషిని మనిషిగా చూడని మనుధర్మాన్ని అమల్లోకి తెచ్చే కుట్ర జరుగుతోందన్నారు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో తిప్పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గాదె లింగస్వామి, వంటెపాక యాదగిరి, కత్తుల జగన్కుమార్, కె.పర్వతాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్రెడ్డి, ఎండీ కుతుబుద్దిన్, పందుల సైదులు, కొండ లలితక్క, ఎండి రఫీ, వెంకులు, షరీఫుద్దీన్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం
కొండమల్లేపల్లి : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎదుళ్ల ఎల్లయ్య మాదిగ అన్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చింతకుంట్ల గ్రామంలో 400 మంది ఓటర్లు ఉన్న మాదిగలకు కనీసం ఒక్క ఇల్లు రాకపోవడం శోచనీయమన్నారు. మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ అగ్రకుల నాయకులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ మేరకు ఎస్సీ కమిషన్ను సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షులు వస్కుల శ్రీనివాస్మాదిగ, ఎదుళ్ల భిక్షమయ్య, మారపాక రాములు, పంది అంజయ్య, పంది యాదయ్య పాల్గొన్నారు. -
వీధుల్లో పారుతున్న మురుగు
పెద్దవూర : మండలంలోని జయరాంతండాలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. తండాలోని చాలా వీధుల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ మురుగు కాల్వలను నిర్మించలేదు. దీంతో ఇళ్ల నుంచి వ్యర్థాలతో కూడిన నీరు వీధుల వెంట పారుతూ చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా సీసీ రోడ్లపై మోకాళ్లలోతులో నీరు నిల్వ ఉంటుంది. మురుగు కాల్వలను నిర్మించకపోవడంతో సీసీ రోడ్లపై నీరు నిలిచి మురికికూపంగా తయారై వీధులన్ని కంపుకొడుతున్నాయి. ఇవి దోమలకు నిలయాలుగా మారి విషజ్వరాలకు కారణభూతం అవుతున్నాయి. వర్షాలు లేని సమయంలోనే ఇలా ఉంటే వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికి కష్టంగా ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సీసీ రోడ్ల వెంట మురికి కాల్వలను నిర్మించి వీధులలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని తండావాసులు కోరుతున్నారు.పాఠశాలలోకి వెళ్లేదెలా..నిడమనూరు : మండలంలోని ఆదర్శ పాఠశాల ప్రధాన గేటు ఎదుట మురుగునీరు ప్రవనిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుంది. దీంతో విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కొన్ని మీటర్ల దూరంలో ఆదర్శ పాఠశాల హాస్టల్ ఉంది. దీంతో విద్యార్థులు వాసన భరించలేకపోతున్నారు. వర్షం వస్తే మురుగు ప్రవాహం పెరిగిపోయి పాఠశాలలోకి ప్రవాహించే అవకాశం ఉంది. హాస్టల్ మెస్ కూడా పరిసరాల్లోనే ఉంది.పలు కాలనీల్లో నుంచి వచ్చే డ్రెయినేజీ మరుగు, వర్షపు నీరంతా ఆ పాఠశాల ముందునుంచే సమీపంలోని వాగులో కలుస్తాయి. కాల్వకు సీసీ లైనింగ్ లేకపోవడంతో మురుగు అంతా నిలిచిపోయి తీవ్ర దుర్గంధంగా మారింది. ఇప్పటికై న అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
రోడ్డు పక్కన దుర్గంధం
కొండమల్లేపల్లి : పారాబాయిల్డ్ రైస్ మిల్లు నుంచి విడుదలైన మురుగు నీరు మొత్తం కూడా రోడ్డు పక్కన నిలవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామపంచాయతీలో ఓ రైస్ మిల్లు నుంచి విడుదలైన మురుగు నీరు మొత్తం నిల్వ ఉండడంతో కొండమల్లేపల్లి నుంచి నల్లగొండకు వెళ్లే వాహనదారులకు విపరీతమైన దుర్వాసన రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వడ్లను ఉడకబెట్టిన నీరు మొత్తం కూడా ఇలా బయటికి వదలడంతో ఆ దుర్గందాన్ని భరించలేక వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు స్పందించి సదరు మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిచేయాలి
త్రిపురారం : రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వీరపెల్లి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం త్రిపురారం మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రెండో మండల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రైతుల పక్షాణ చేస్తున్న పోరాటాలను అనచివేస్తు రైతలకు నష్టం చేసే నల్ల చట్టాలను తీసుకవచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం మండల రైతు సంఘం అధ్యక్షుడు కొప్పు వెంకన్న, సీపీఎం మండల కార్యదర్శి దైద శ్రీను, కందిమళ్ల వీరారెడ్డి, వెంకటయ్య, రాములు, రామచంద్రు కోటయ్య పాల్గొన్నారు. -
సోములు విగ్రహావిష్కరణ
మిర్యాలగూడ : పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉబ్బపల్లి సోములు కాంస్య విగ్రహాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉబ్బపల్లి సోములు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. వ్యక్తిగతంగా సోములు తనకు దగ్గరి మిత్రుడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్ఎస్ నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, మగ్ధుమ్పాషా, మట్టపల్లి సైదయ్యయాదవ్, ఇలియాస్ఖాన్, మెరుగు రోశయ్య, మాజీద్, రామలింగయ్యయాదవ్, శ్రీనివాస్యాదవ్, రామస్వామి, దైవ వెంకటేష్, పీసీకే ప్రసాద్, విష్ణు, సోముసుందర్ పాల్గొన్నారు. -
‘కస్తూరిబా’లో ప్రవేశాల జోరు
తిరుమలగిరి(నాగార్జునసాగర్): ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలంటే తల్లిదండ్రులు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ప్రశ్నార్థకమేనా? అనే పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కానీ అందుకు బిన్నంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు మాత్రం రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆ పాఠశాలలు విద్యార్థులతో నిండపోతుండటంతో అక్కడ అడ్మిషన్ కావాలంటే తీవ్రంగా కష్టపడాల్సిందే. పాఠశాలలు ప్రారంభమైన మూడు రోజులకే అడ్మిషన్లు పూర్తవ్వడంతో అధికారులు అడ్మిషన్లు పుల్..అడ్మిషన్లు లేవు అని బోర్డు పెడుతున్నారంటే కేజీబీవీ పాఠశాలలకు ఏ స్థాయిలో ఆదరణ పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ పాఠశాలలో అడ్మిషన్ మాదిరిగా ఇక్కడ పేరున్న నాయకులతో పైరవీలు చేయిస్తున్నా సీటు మాత్రం దొరకట్లేదు. ప్రభుత్వం తరగతికి 40మంది విద్యార్థులే అని పరిమితి విధించడంతో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. ఆంగ్లమాధ్యమంలో బోధన తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 265 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐదు కొత్త మండలు తిరుమలగిరి(సాగర్), నేరేడుగొమ్ము, మల్లేపల్లి, మాడుగులపల్లి, అడవిదేవులపల్లి మండలాల్లోని పాఠశాలల్లో పూరి ్తస్థాయిలో ఆంగ్లమాధ్యమంలో బోధన అందిస్తున్నారు. జిల్లాలోని మిగతా 22 పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లమాధ్యమంలో బోధన కొనసాగుతుంది. దీంతో ఈ పాఠశాలలకు బాగా డిమాండ్ పెరిగింది. పదో తరగతి ఫలితాల్లో కూడా వందశాతం ఉత్తీర్ణతతో పాటు, ఉత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో కస్తూరిబా గాంధీ విద్యాలయాలకు విద్యార్థులు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. నాణ్యమైన పౌష్టికాహారం పేద విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం మెస్ చార్జీల కింద రూ. 1225 చెల్లిస్తుండగా, ఈ ఏడాది రూ. 1740 చొప్పున చెల్లిస్తుంది. నెలకు రెండుసార్లు మాంసం, ఐదు సార్లు చికెన్, వారం రోజులు గుడ్లు, శాఖహారులకు మిల్మేకర్ అందిస్తున్నారు. రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నారు. నమ్మకంతోనే ఆదరణ ఉత్తమ ఫలితాలు రావ డం, సక్రమంగా మెనూ ను అందిస్తుండటంతో కేజీబీవీ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. దీనికి తోడు ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. సీట్లు పూర్తయినా విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం వస్తుండటంతో అయిపోయినట్లు బోర్డు పెట్టాం. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తున్నాం. – కవిత, ఎస్ఓ, తిరుమలగిరి కేజీబీవీ తిరుమలగిరి కేజీబీవీలో నో అడ్మిషన్ బోర్డు కొన్నేళ్లుగా ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధన పూర్తిస్థాయిలో ఆంగ్ల బోధన అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల పైరవీలు -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
మిర్యాలగూడ అర్బన్ : జూలై 9న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లు గౌతమ్రెడ్డి, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రామ్మూర్తి కోరారు. ఆదివారం స్థానిక ఎప్సీఐ వద్ద సివిల్ సప్లయ్ హమాలి కార్మికులకు సార్వత్రిక సమ్మె కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను తుంగలో తొక్కి నాలుగు నల్ల లేబర్ చట్టాలను తీసుకవచ్చిందని ఆరోపించారు. ఈ నాలుగు చట్టాల వలన కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు. ఈ సమ్మెలో పాల్గొనేందుకు కార్మికులందరు పనులను బంద్ చేసి సమ్మెలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమలో యూనియన్ నాయకులు అంజన్రావు, బాలకృష్ణ తదితరులున్నారు. -
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పెద్దవూర : మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో 2009–10 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా పదహేను ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఒకరికొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అపురూప క్షణాలను సెల్ఫోన్లో బందించుకున్నారు. అనంతరం నాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాటి హెచ్ఎం సలికంటి వెంకటయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాసచారి, కర్ణ సైదిరెడ్డి, పాకాల నర్సింహ్మా, కర్ణ రాణి, షర్ఫుద్దీన్, నరేందర్, విద్యార్థులు కేతావత్ రంగానాయక్, హనుమా, వేణు, నరేష్, సత్యనారాయణ, నగేష్, కృష్ణమూర్తి, గణేష్, సీతారామయ్య, లావణ్య, సరిత, అనిత, మౌనిక, స్వాతి, రోజా, రవికుమార్, నరహరి, నాగు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం
నల్లగొండ: ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్రెడ్డి అన్నారు. ఆది వారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగం పటిష్ట పరచడంలో టీఎస్ యూటీఎఫ్ సభ్యులు ముందుండాలని పిలుపునిచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్ పుస్తకాలు సకాలంలో అందించినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. పీఆర్సీ గడువు తీరినందున పీఆర్సీ రిపోర్టు వెంటనే తెప్పించుకొని అమలు పరచాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి , ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు, ప్రతినిధులు నర్రా శేఖర్రెడ్డి, బి.అరుణ, వడ్త్యా రాజు, ఎడ్ల సైదులు, రామలింగయ్య, గేర నరసింహ, యాట మధుసూదన్రెడ్డి, రమాదేవి, నలపరాజు వెంకన్న, చినవెంకన్న, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, మధుసూదన్రెడ్డి, నర్సింహమూర్తి, భానుప్రకాష్, గిరి యాదగిరి, యరనాగుల సైదులు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఫ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి -
జనగణనకు సన్నద్ధం
నల్లగొండ: జనగణనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027 మార్చి ఒకటి నాటికి రెండు దశల్లో జిల్లాలో జనాభా లెక్కలు సేకరించనున్నారు. తొలి దశలో ఇళ్ల జాబితాను వెలువరించి రెండో దశలో జనగణన చేపట్టనున్నారు. చివరగా 2011లో దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు చేపట్టారు. మరలా 2021లో నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా జనగణన చేపట్టలేదు. దీంతో పదేళ్లకు ఒకసారి చేపట్టాల్సిన జనగణన ప్రక్రియ నాలుగేళ్లు ఆలస్యమైంది. జనగణన చేపట్టేందుకు ఇటీవల ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం జనగణనకు సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈసారి జనగణనతోపాటే కులగణన, జాతీయ పౌర పట్టిక (నేషనల్ సివిల్ రిజిస్టర్) ఒకేసారి చేపట్టాలని నిర్ణయించింది. కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ.. జనగణనకు సంబంధించి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీఆర్ఓ, సీపీఓతో సహా రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరో అధికారితో జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్ జనగణన అధికారిగా వ్యవహరిస్తే అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ సహాయకుడిగా ఉంటారు. ఎన్యుమరేటర్లను ఉపాధ్యాయులనే నియమిస్తారు. అయితే నియమించిన ఎన్యుమరేటర్లంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రశ్నావళి ఆధారంగా జనగణన చేపట్టనున్నారు. వచ్చే ఏడాదే ఎన్యుమరేటర్ల నియామకం అయితే 2026లోనే ఎన్యుమరేటర్లను నియమించి వారికి శిక్షణనివ్వనున్నారు. 150 గృహాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున నియమించి శిక్షణ ఇవ్వనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమిస్తారు. వీరంతా మొదట వారికి అప్పగించిన గ్రామాల్లో ఇళ్లను గుర్తిస్తారు. వారి పరిధిలో ఎన్ని గృహాలున్నాయి. ఆ గృహాల్లో ఎన్ని కుటుంబాలు నివశిస్తున్నాయనేది పూర్తి డేటాను మొదట సేకరిస్తారు. ఆ తర్వాత ఇంటింటికీ తిరిగి జనాభా వివరాలు సేకరిస్తారు. 2027 సంవత్సరంలో పూర్తికానున్న ప్రక్రియ 2026లో ఎన్యుమరేటర్ల నియామకంతో పాటు జనగణన ఏ విధంగా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 2027 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఇంటింటికీ వెళ్లి జనగణన నిర్వహిస్తారు. 2027 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి 12గంటలలోపు పుట్టిన వారిని లెక్కలోకి తీసుకుంటారు. ఆ తర్వాత జన్మించిన వారిని పరిగణనలోకి తీసుకోరు. మార్చి 1 వరకు జనగణన ప్రక్రియ ముగియనుంది. గతంలో నేరుగా ఇంటింటికి వెళ్లి మాన్యువల్గా జనగణన చేపట్టగా ఈసారి జనగణన వివరాలు మొత్తం మొబైల్ యాప్లో నమోదు చేయనున్నారు. ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఫ కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు ఫ రెండు దశల్లో కొనసాగనున్న ప్రక్రియ ఫ తొలి విడతలో ఇళ్ల జాబితా గుర్తింపు ఫ మలి దశలో జనాభా వివరాల సేకరణ ఫ ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులుజిల్లా వివరాలు ఇలా.. భౌగోళిక విస్తీర్ణం 7,128 కి.మీ. రెవెన్యూ గ్రామాలు 566మండలాలు 33మున్సిపాలిటీలు 08పంచాయతీలు 869జనాభా (2011లెక్కల ప్రకారం) 16,18,416పురుషులు 8,18,306మహిళలు 8,00,110 కుటుంబాలు 4,01,728 -
శుభాన్షు శుక్లాకు సెల్యూట్
చిట్యాల: అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండవ భారతీయుడుగా రికార్డు సృష్టించిన శుభాన్షు శుక్లాకు గురువారం చిట్యాలలోని ఆక్స్ఫోర్ట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ జాతీయ పతాకం చేతపూని సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పెద్ది నరేందర్ మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శుభాన్షు శుక్లా నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు నర్రా భిక్షంరెడ్డి, నమ్ముల ఆనంద్కుమార్, షేక్ షెమీమున్సిసా బేగం, పుల్లెంల సంతు, గణేష్, జ్యోతి, ధనలక్ష్మి, ఆసియా, మాధవి, మౌనిక, కీర్తి, లింగస్వామి పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
నల్లగొండ : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పోలీస్, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు చేపట్టిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రకాశం బజార్లో డిజిటల్ తరగతులతోపాటు, అన్ని సౌకర్యాలతో నూతన పాఠశాల నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయాల గురించి తెలిసివారు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, అదనపు ఎస్పీ రమేష్, డీఈఓ భిక్షపతి, డీఎస్పీ శివరాంరెడ్డి, సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ నల్లగొండలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ -
తనిఖీలతో బోధనకు ఆటంకం
బాధ్యతలు వీరికే.. పాఠశాలల తనిఖీలకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో పదేళ్లు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. వీరిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు రోజుకు రెండు పాఠశాలలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల్లో 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేయించాలనేది విద్యా శాఖ నిర్ణయం. అయితే అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఎంపిక చేయనుంది. ఇదిలా ఉంటే ఓ ఎస్జీటీ మరో ఎస్జీటీ మీద, ఒక స్కూల్ అసిస్టెంట్.. మరో స్కూల్ అసిస్టెంట్ మీద తనిఖీలు చేయడం సరైంది కాదని ఉపాధ్యాయులు గొనుక్కుంటున్నారు. నల్లగొండ: ఒకపక్క గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల ఏర్పాటు అవడం..మరోపక్క పట్టణాల్లోని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రతి గ్రామానికి బస్లు పంపుతూ ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తుండడంతో అధిక శాతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితిని అధిమించేందుకు రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలను రోజూ తనిఖీ చేయడం ద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతాయని భావించింది. అందుకు తనిఖీల బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిటీతో తనిఖీ బాధ్యతలకు ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. అయితే విద్యా శాఖ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయులు తనిఖీలు చేసేందుకు వెళ్తే బోధన కుంటుపడుతుందని అంటున్నారు. ఫ స్కూళ్ల పర్యవేక్షణకు టీచర్లకు బాధ్యతలు ఫ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ ఫ ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని సర్కారు యోచన ఫ వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు జీహెచ్ఎంలు 178 ఎల్ఎఫ్ఎల్ 164ఎస్ఏలు 2,278 ఎల్పీలు 97ఎస్జీటీలు 2,729 పీఈటీలు 151ఇతరులు 15 మొత్తం 5,612 -
భూభారతి అర్జీలను వెంటనే పరిష్కరించాలి
నల్లగొండ: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులపై సమీక్షిస్తామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో 45,313 దరఖాస్తులు వచ్చాయని వీటిని ఆగస్టు 14లోపు పరిష్కరిస్తామన్నారు. దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుదారుకు నోటీసు జారీచేసి విచారణ చేసిన తర్వాత వారం సమయం ఇచ్చి ఆ తర్వాత పరిష్కరించాలన్నారు. అదనపు ఇన్చార్జి కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల్లో 15వేలు మిస్సింగ్ సర్వే నంబర్లవే ఉన్నాయన్నారు. ఆర్డీఓలు అర్హత ఉన్న దరఖాస్తుల వివరాలు మాత్రమే భూభారతిలో నమోదు చేయాలన్నారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ఎమ్మార్వోలు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి
నార్కట్పల్లి : ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలోని బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్కు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ను సందర్శించి మాట్లాడారు. కాల్వ పనులను వేగవంతంగా పూర్తి చేస్తే రిజర్వాయర్ కింది లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పానగల్ ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్లోకి రెండు రోజులుగా నీరు విడుదలవుతుందని, మరో రెండు రోజుల్లో రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండనుందని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూములను అప్పగించిన రైతులకు పరిహారం చెల్లింపులలో జాప్యం చేయొద్దన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె, శ్రీనివాస్, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి, శ్రీనివాస్రెడ్డి,డిఈ వీఠలేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, వడ్డే భూపాల్రెడ్డి, నరేందర్రెడ్డి, దామెర ఉదయ్కుమార్, బొడిగె స్వామి ఉన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
సగటు వర్షపాతం.. 8.3 మిల్లీమీటర్లు
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 8.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చందంపేట మండలంలో 37.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుండ్లపల్లిలో 31.0, నేరెడుగొమ్ములో 29.5, పెద్దవూరలో 16.1, పీఏపల్లిలో 15.4, తిప్పర్తిలో 15.9, కేతేపల్లిలో 15.9, నకిరేకల్లో 14.3, దామరచర్లలో 13.6, మిర్యాలగూడలో10.4, శాలిగౌరా రంలో 11.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కట్టంగూరులో 7.3, నల్లగొండలో 3.7, కనగల్లో 3.6, మునుగోడులో 1.1, చండూరులో 3.9, చింతపల్లిలో 1.5, నాంపల్లిలో 0.2, గు ర్రంపోడు 3.0, అనుముల హాలియా 3.1, నిడమనూరులో 2.2, త్రిపురారంలో 3.4, మాడుగులపల్లిలో 4.7, వేముపల్లిలో 4.0, అడవిదేవులపల్లిలో 4.1, తిరుమలగిరి సాగర్లో 2.9, కొండమల్లెపల్లిలో 1.9, దేవరకొండలో 8.0 గుడిపల్లిలో 2.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దేవరకొండ డివిజన్లో అధిక వర్షం కురిసింది. ప్రతి పేషెంట్కు ‘ఆభా’ ఐడీ క్రియేట్ చేయాలి దేవరకొండ : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రతి పేషెంట్కు తప్పనిసరిగా ఆయుస్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఆభా) ఐడీ క్రియేట్ చేయాలని డీసీహెచ్ఎస్ మాతృనాయక్ అన్నారు. గురువారం దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆరోగ్యశ్రీ సిబ్బందితో వేర్వేరుగా సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసేవల కోసం ఆస్పత్రికి వచ్చేవారి పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రి ముందుందన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాష్, సిబ్బంది ఉన్నారు. రాజీవ్ యువ వికాసాన్ని ప్రారంభించాలినల్లగొండ టౌన్: ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే ప్రారంభించి అర్హులకు ఇవ్వాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అన్నారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఉపాధి కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. సమావేశంలో రవినాయక్, మల్లం మహేష్, పతని శ్రీను, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, మహ్మద్ ఆక్రమ్, పాలది కార్తీక్, వంశీ, ఏడుకొండలు, బొడ్డుపల్లి నరేష్, బూర్గు గోపి కృష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
విద్యార్థులు ‘ఇన్స్పైర్’ పొందేలా..
నల్లగొండ: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక ఆలోచనలు, సృజనాత్మకత వైపు మళ్లించి భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) మనక్ అవార్డు(2025–26)కు సంబంధించి.. పాఠశాలల్లోని విద్యార్థుల నుంచి ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తోంది. ఈ నెల 15న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 15 వరకు కొనసాగనుంది. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, రెసిడెన్షియల్, ఎయిడెడ్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇన్స్పైర్ మనక్ అవార్డుల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసేదిలా.. ఇన్స్పైర్ మనక్పై ఆసక్తి కలిగిన పాఠశాల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని విద్యా శాఖ కోరుతోంది. www.inspireawards.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాఠశాలలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళుతుంది. జిల్లా అథారిటీ ఆమోదిస్తే 24 గంటల్లోపు విద్యార్థికి సంబంధించిన మెయిల్ ఐడీకీ యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. అప్పుడు యూజర్ ఐడీకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. విద్యార్థి తన సమాచారం, బ్యాంకు అకౌంట్, ఐఎప్ఎస్సీ కోడ్, ఆధార్, విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టు సంక్షిప్త రిపోర్టు వెబ్సైట్లో నమోదు చేయాలి. విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం ఉంది. అయితే విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఆన్లైన్లో ప్రాజెక్టు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఐడియా బాక్సు ఏర్పాటు చేసుకోవాలి అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు వినూత్న ఆలోచనలను ఉపాధ్యాయులు గుర్తించేందుకు ఐడియా బాక్సు ఏర్పాటు చేసుకోవాలి. పరిసరాల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ వేదిక ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రతి పాఠశాల నుంచి కచ్చితంగా 5 ప్రాజెక్టులు నామినేషన్ చేసుకోవాలి. – వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి ఇన్స్పైర్ మనక్ ఒక వరం ఇన్స్పైర్ మనక్ విద్యార్థులకు ఒక వరం లాంటిది. శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుకునే విద్యార్థులకు ఎంతగానో దోహదం పడుతుంది. సామాజిక సమస్యలకు శాసీ్త్రయ రూపంలో పరిష్కారాలు చూపగలిగే సృజనాత్మక ప్రాజెక్టులను నమోదు చేయాలి. అందుకు సైన్స్ ఉపాధ్యాయులు సహకరించాలి. – భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారిఫ ఇన్స్పైర్ మనక్ అవార్డులకు మొదలైన దరఖాస్తులు ఫ చిన్నారులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు కార్యక్రమం ఫ 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అవకాశం ఫ సెప్టెంబర్ 15 వరకు గడువు గతంలో ఎంపికై నవి సంవత్సరం ప్రాజెక్టులు 2022–23 1432023–24 1392024–25 131 జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీలు విద్యార్థులకు తమకు వచ్చిన ఆలోచనలతో తయారు చేసిన ప్రాజెక్టులు ప్రదర్శించేందుకు ఎంపికై తే వారి అకౌంట్లలో రూ.10 వేలు జమచేస్తారు. అయితే వాటిని జిల్లా స్థాయి పోటీల్లో ప్రదర్శిస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికై తే రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించిన ఆరు ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి జాతీయ స్థాయి పంపుతారు. జాతీయ స్థాయి ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రదర్శించడంతోపాటు రాష్ట్రపతి భవన్లో కూడా ప్రత్యేక ప్రదర్శిస్తారు. అనంతరం సకురా ప్రోగ్రామ్ ద్వారా జపాన్ దేశంలోని పరిశోధన కేంద్రాలను సందర్శించేందుకు ఎంపికై న విద్యార్థులను పంపుతారు. -
చినుకు లేక.. మొలకెత్తక..
ఈయన పెద్దవూర మండలం గర్నెకుంటకు చెందిన చిట్టిమళ్ల సత్యం. ఈయన ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశారు. అప్పటినుంచి సరైన వర్షం పడకపోవడంతో చాలా విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తినవి కూడా ఎండలకు ఎండిపోతున్నాయి. ఎకరాకు మూడు ప్యాకెట్ల చొప్పున ఐదెకరాలకు 15 ప్యాకెట్ల పత్తి గింజలు వేశాడు. వాటితోపాటు అరక, కూలీలు మొత్తంగా రూ.22 వేలు వెచ్చించాడు. వర్షాల్లేక ఇప్పుడు నష్టపోయే పరిస్థితి వచ్చిందని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నాకు ఎకరంన్నర పొలం ఉంది. గ్రామంలోని మరో రైతుకు చెందిన 11 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఈనెల మొదట్లో వర్షాలు పడడంతో పత్తి విత్తనాలు నాటాను. ముందు మురిపించిన వాన తరువాత మొఖం చాటేసింది. దీంతో ఆ విత్తనాలు మొలకెత్తలేదు. ఇందుకోసం ఇప్పటికే రూ.2.30 లక్షలు అప్పు చేశాను. ఇప్పుడు మళ్లీ విత్తనాల పెట్టాలంటే మరో రూ.50 వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. – జినుక సైదులు. ఆకారం, శాలిగౌరారం పత్తి విత్తనాలు సగమే మొలకెత్తాయి ఆరెకరాల్లో పత్తి విత్తనాలు పెట్టాం. అందులో సగమే మొలకెత్తాయి. మిగతా సగం భూమిలో తేమలేక మొలవలేదు. 15 రోజుల నుంచి వర్షం లేదు. దున్నడం నుంచి విత్తనాలు విత్తే వరకు ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాం. మొలవని చోట్ల మళ్లీ విత్తనాలు పెట్టాల్సి వస్తుంది. ఈ ఏడాది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – ఐతగోని జంగమ్మ, రాంరెడ్డిపల్లి, మర్రిగూడ ఫ పత్తి విత్తనాలు వేసిన రైతుల్లో ఆందోళన ఫ చాలాచోట్ల మొలకె త్తని విత్తనాలు ఫ మొలకెత్తిన చోట వాడుబడుతున్నయ్ ఫ కాపాడుకునేందుకు కర్షకుల పాట్లు -
సూర్యాపేట: ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్, కానిస్టేబుల్ బ్లెస్సిన్ మృతి చెందారు. మరో పోలీసులకు గాయాలు కావడంతో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. దుర్గాపురం వద్దకు రాగానే ఒక్కసారిగా లారీ అదుపు తప్పి పోలీసులు ప్రయాణిస్తున్ను కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాద సమయంలో కారులోకి ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కారులో ముందు కూర్చోవడంతో ఎస్ అశోక్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ బ్లెస్సిన్ చనిపోయారు. ఇదిలా ఉండగా.. అంతకుముందే నిద్ర వస్తుంటే గంటన్నర పాటు రోడ్డు పక్కన కారు ఆపినట్టు క్షతగాత్రులు తెలిపారు. అనంతరం, బయలుదేరిన పదిహేను నిమిషాలకు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
బాల్య వివాహాలతో అనర్థాలు
మిర్యాలగూడ : బాల్య వివాహాలు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం మిర్యాలగూడ మండలంలోని దుబ్బతండా బాలికల గురుకుల పాఠశాలను ఆమె సందర్శించి బాలికా సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర మాట్లాడుతూ ఆడపిల్లలు 18 సంవత్సరాలు, అబ్బాయిలు 21 సంవత్సరాలు నిండాకే వివాహాలు చేసుకోవాలన్నారు. సమాజంలో ఎదురయ్యే స్యలను ధైర్యంగా ఎదుర్కొవాలన్నారు. బాలికలు రుతుక్రమ సమస్యలపై అవగాహన కలిగి ఉండి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ కృష్ణవేణి, సీడీపీఓ మమత, ఆయుర్వేధిక్ డాక్టర్ హేమాంజలి, జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత, ఎంఈఓ బాలు, ఎడ్యుకేషన్ ఆఫీసర్ సరస్వతి, వెంకన్న, వైద్యులు రవికుమార్, మోయిద్, ప్రిన్సిపాల్ ఉమాదేవి, గణేష్, అశ్రిత, కవిత, చినరాయుడు, కవిత, సక్కు, భవాని తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం త్రిపురారం : వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం త్రిపురారం ఎన్నెస్పీ క్యాంప్ ఆవరణలోని బాలికల వసతి గృహన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ భవనాన్ని పరిశీలించి కొన్ని గదుల పైకప్పు పెచ్చులు ఊడి ఉండడాన్ని గమనించి.. సురక్షితమైన భవనానికి మార్చాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, ఎస్ఐ నరేష్ ఉన్నారు.ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
యాంటీ డ్రగ్ సోల్జర్గా పనిచేయాలి
నల్లగొండ : మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్గా పనిచేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. డ్రగ్స్పై పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని కోరారు. యువత డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదు అయితే భవిష్యత్లో ఉద్యోగాలకు, ఏ ఇతర దేశాలకు కూడా వెళ్లే అవకాశం దొరకక జీవితం అంధకారం అవుతుందన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నెంబర్ (8712670266)కు తెలియజేయాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ సైదులు, వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఎన్ఎస్పీ భూముల సర్వే పరిశీలన
హాలియా : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామ పరిధిలో జరుగుతున్న ఎన్ఎస్పీ భూముల సర్వేను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అదనపు కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి ఆమె ఇబ్రహీంపేట గ్రామ పరిధిలోని ఎడమ కాల్వ యూటీ వద్ద, గ్రామ చివరలో ఎంత ఎన్ఎస్పీ భూమి ఉంది? ఏఏ సర్వే నంబర్లలో ఎన్ఎస్పీ భూములు ఉన్నాయి? అనే వివరాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, మండల ఇన్చార్జి తహసీల్దార్ రఘు, కమిషనర్ రామదుర్గారెడ్డి, సర్వేయర్ పోకల విజయ్కుమార్, ఆర్ఐ నవీన్కుమార్ తదితరులు ఉన్నారు. -
పంచాయతీలా.. పరిషత్లా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తప్పనిసరైంది. ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి.. తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. కానీ.. పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పాలక వర్గాలు పూర్తయి ఏడాదిన్నర అవుతుండగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయి సంవత్సరం దాటింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తారనేది చర్చనీయంశంగా మారింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులోనే ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కోర్టును ఆశ్రయించిన మాజీ సర్పంచ్లు పంచాయతీల్లో పాలక వర్గాల గడువు పూర్తయి ఏడాదిన్నర కావస్తోంది. దీంతో పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని, ఎన్నికలు నిర్వహించే వరకు పాత సర్పంచ్లను కొనసాగించాలంటూ నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మాజీ సర్పంచ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం గతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారిగా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దాంతో పాటు పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించనున్నందున ఇప్పటికే బ్యాలెట్ పేపర్లను ముద్రించి నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని షెడ్లలో భద్రపరిచారు. పోలింగ్ కోసం ఏపీ నుంచి తెప్పించిన బ్యాలెట్ బాక్సులకు మరమ్మతు చేయించి సిద్ధం చేసి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన వెంటనే సిబ్బందికి శిక్షణ ఇస్తే సరిపోనుంది. ముందుగా ఏ ఎన్నికలు? ఫ మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం ఫ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తర్జనభర్జన ఫ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జిల్లా యంత్రాంగం కసరత్తు ఫ ఇంకా తేలని బీసీ రిజర్వేషన్ల అంశం ఫ ఎన్నికలపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కోర్టులోనే బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోర్టు పరిధిలో ఈ సమస్య ఉన్నందున అది తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనేది వారి వాదన. అయితే విషయం కోర్టులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎన్నికలు పోతుందో అనేది వేచి చూడాల్సిందే. బీసీ రిజర్వేషన్ విషయంలో తీర్పు రాకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసైనా ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. మొదటిసారిగా నాలుగెకరాలకు పైబడి భూమి కలిగిన రైతులకు కూడా రైతుభరోసాను జమ చేసింది. దీన్ని అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులకు శిక్షణ కూడా పూర్తి పార్లమెంట్ ఎన్నికల తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారన్న సంకేతాలు రావడంతో జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పెట్టారు. ఎన్నికలు పార్టీ గుర్తుల ఆధారంగా నిర్వహించనున్నందున బ్యాలెట్ పేపర్లు తెచ్చి ఇప్పటికే ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచారు. పీఓ, ఏపీఓలకు శిక్షణ కూడా ఇచ్చారు. షెడ్యూల్ వస్తే మాత్రం ఓపీఓలకు కూడా డివిజన్ల వారీగా శిక్షణనివ్వడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు. -
రాష్ట్రానికి.. కేంద్రం రూ.11 లక్షల కోట్లు ఇచ్చింది
నల్లగొండ టూటౌన్ : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం 11 ఏళ్లల్లో రూ.11 లక్షల కోట్లు ఇచ్చిందని మహబూబ్నగర్ ఎంపీ, మాజీమంత్రి డి.కె.అరుణ అన్నారు. బుధవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, యూనివర్సిటీలు, రోడ్లు తదితర వాటి కోసం మోదీ ప్రభుత్వం అధిక నిధులు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నరేంద్రమోదీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. స్థానికసంస్థల ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడంలేదని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ తన పదవిని నిలుపుకోవడానికి ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఆ కాలంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి, పత్రికలను అణచి వేశారని, అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిజిటల్ మీడియాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 60 ఏళ్లు కుటుంబ పాలన కొనసాగిన దేశం అభివృద్ధి చెందలేదన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే నంబర్వన్గా నిలబెట్టుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, దర్శనం వేణు, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, రావెళ్ల కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.ఫ మహబూబ్నగర్ ఎంపీ డికె.అరుణ -
యాదగిరీశుడికి మరింత భద్రత
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మరింత భద్రత కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. - 8లోనార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి స్వామివారికి లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ఆవరణలో నిద్ర చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. పూజల్లో ప్రధాన అర్చకులు రామలింగేశ్వరశర్మ, సతీష్శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్శర్మ, ఈఓ నవీన్కుమార్ పాల్గొన్నారు. -
పెదా్దసుపత్రిలో వైద్య పరీక్షల్లేవ్!
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో రక్త పరీక్షలు నిలిచిపోయాయి. ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో సుమారు 45 రకాల రక్త పరీక్షలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం కొన్నిరకాల పరీక్షలను మాత్రమే చేస్తున్నారు. పరీక్షల కోసం రక్తంలో కలిపే రీఏజెంట్స్(కెమికల్స్) సరఫరా నిలిచిపోయిన కారణంగా పరీక్షలు చేయడం లేదు. ప్రస్తుతానికి కేవలం సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్షర్)తో పాటు మలేరియా తదితర పరీక్షక్షలు మాత్రమే చేస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్లో వేల రూపాయలు వెచ్చించి టెస్టులు చేయించుకుంటున్నారు. ప్రైవేట్లో పరీక్షలు చేయించుకోవాల్సిందే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోజూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇన్పేషంట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే వారి రోగ నిర్ధారణకు రక్త పరీక్షలు ప్రధానం. కానీ, తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో పరీక్షలు నిలిచిపోవడంవతో రోగులు బయటి డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలను చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తుత సీజన్లో డెంగీ పరీక్షలను నిర్ధారించడానికి అవసరమైన ఎలిసా పరీక్షలను చేయాల్సిన మిషన్ గత కొన్ని రోజులుగా మరమ్మతుకు గురైంది. దీంతో డెంగీ నిర్ధారణకు చేయాల్సిన ఎలిసా టెస్టులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. పీహెచ్సీల నుంచి నిలిచిన రక్త నమూనాలు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి రోజూ రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి టెస్ట్ల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి వాహనాల ద్వారా తీసుకొస్తారు. అక్కడ రక్త నమూనాలు ఇచ్చిన రోగులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరీక్షల ఫలితాలను సెల్ఫోన్కు పంపిస్తారు. రక్త పరీక్షల ఆధారంగా మెడికల్ ఆఫీసర్లు రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఇలా రోజూ వందల సంఖ్యలో రక్త నమూనాలను తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి వస్తాయి. ప్రస్తుతం టెస్టులు నిలిచిపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త నమూనాలు పంపించడం లేదు. రక్త పరీక్షలకు అంతరాయం ఏర్పడి రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ జీజీహెచ్లోని తెలంగాణ హబ్లో నిలిచిన బ్లెడ్ టెస్ట్లు ఫ రీఏజెంట్స్ సరఫరా లేకపోవడమే కారణం ఫ మరమ్మతుకు గురైన ‘ఎలీసా’ మిషన్ ఫ కొన్ని పరీక్షలు మాత్రమే చేస్తున్న సిబ్బందిత్వరలో అన్ని రకాల టెస్టులు చేస్తాం రక్త పరీక్షలు చేయడానికి అవసరమైన రీఎజెంట్స్ అయిపోయినందున కొన్ని పరీక్షలను చేయలేకపోతున్నాం. ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం. అవి సరఫరా కాగానే అన్ని రకాల టెస్టులు చేస్తాం. ఎలీసా పరీక్ష చేసే మిషన్ మరమ్మతుకు గురైంది. త్వరలో దాన్ని కూడా బాగు చేయించి టెస్టులు చేస్తాం. – డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం ఇన్చార్జి -
నల్లగొండకు నేడు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం నల్లగొండకు రానున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయానికి ఉదయం 10 గంట లకు చేరుకుంటారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళతారు.దరఖాస్తుకు నేడు చివరి గడువునల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్టు పద్ధతిన పీడియాట్రీషియన్(1), మెడికల్ ఆఫీసర్(4) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 26 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీడియాట్రిషన్ పోస్టుకు ఎండీ పీడియాట్రిషన్, మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అర్హత కలిగి ఉండాలలని.. 27న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు.ఇంటి నిర్మాణంలో నిబంధనలు పాటించాలిత్రిపురారం : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని హౌసింగ్ పీడీ రాజ్కుమార్ సూచించారు. బుధవారం త్రిపురారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. మండల వ్యాప్తంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లపై ఆరా తీశారు. ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయకుమారి, ఇన్చార్జి ఎంపీఓ కోడిరెక్క రాజేంద్రకుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలిదేవరకొండ : యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని దేవరకొండ ఏఎస్పీ మౌనిక కోరారు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం దేవరకొండ మండల పరిధిలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయన్నారు. విద్యార్ధులు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం వివిధ చట్టాలపై విద్యార్థులకు ఆమె అవగాహన కల్పించారు. సమావేశంలో సీఐ నర్సింహులు, ఎస్ఐ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.30వ తేదీ వరకు ఆసరా పింఛన్ల పంపిణీనల్లగొండ : ఆసరా పింఛన్లను ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసరా పింఛన్లను ఆయా పోస్టాపీస్లలో పొందాలని సూచించారు. పింఛనుదారులు మధ్య దళారీలను నమ్మవద్దని పేర్కొన్నారు.ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా శ్రీనివాస్నల్లగొండ టూటౌన్: ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం అధికారిగా అధ్యాపకుడు డి. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేరకు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి బుధవారం శ్రీనివాస్కు నియామక పత్రం అందజేశారు. -
రేషన్ షాపుల్లో పేరుకుపోతున్న బియ్యం
నల్లగొండ: గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం పోర్టబులిటీ విధానం అమలవుతుండటంతో పట్టణ ప్రాంతాలకు వలస పోయిన గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడే రేషన్ బియ్యం తీసుకుంటుండడంతో గ్రామాల్లోని రేషన్ షాపుల్లో బియ్యం మిగులుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని జూన్లోనే ఇస్తోంది. ఇప్పటికే రేషన్ షాపుల్లో దాదాపు 15 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. వాటిని వెనక్కి తీసుకుపోయే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో డీలర్లు దుకాణాల్లో స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. పాత బియ్యంతో పాటు మిగిలిన సన్న బియ్యం కూడా పురుగుపట్టే ప్రమాదం ఉందని వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మిగులుతున్న బియ్యం జిల్లాలో 994 రేషన్ షాపులున్నాయి. వాటి ద్వారా జిల్లాలో 4,84,216 కుటుంబాలకు ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. 3 నెలలకు సంబంధించి సన్న బియ్యం కోటాను ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ షాపులకు అలాట్ చేశారు. పంపిణీ ప్రక్రియ కూడా దాదాపు 80 శాతం పైచిలుకు పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఒక్కో షాపులో దాదాపుగా 10 నుంచి 20 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వచ్చే 2 నెలలు రేషన్ షాపులు బంద్ ఉంటుండడంతో బియ్యం పురుగు పట్టే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో షాపులకు మొత్తం కోటా కాకుండా తగ్గించి పంపాలని డీలర్లు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో షాపులకు కోటా తగ్గించి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ డీఎస్ఓ వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. ఫ గ్రామీణ రేషన్షాపుల్లో అత్యధిక నిల్వలు ఫ వలస వెళ్లినవారు పట్టణాల్లో తీసుకోవడమే కారణం ఫ మూడు నెలల సన్నబియ్యం కోటా కూడా మిగిలే అవకాశం ఫ పురుగు పడుతుందని డీలర్ల ఆవేదన ఫ అవసరాన్ని బట్టి పంపించాలని కోరుతున్న డీలర్లు -
మమ్మల్ని చులకనగా చూస్తున్నారు!
నల్లగొండ టూటౌన్ : పట్టణాల్లో సమభావన సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించేందుకు వార్డుల్లో నియమించిన మెప్మా రిసోర్స్ పర్సన్లపై మెప్మా కార్యాలయంలో పని చేస్తున్న సీఓ (కమ్యూనిటీ ఆర్గనైజర్లు)లు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆర్పీలు మనోవేదన చెందుతున్నారు. నెలకు రూ.6వేల గౌరవ వేతనంతో పనిచేసే వారిపై చులకన భావంతో మాట్లాడుతూ హేళన చేయడం పరిపాటిగా మారిందని పలువురు ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలగిరి మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా విభాగం ఉద్యోగులు కార్యాలయం గడప దాటకుండా అన్ని పనులూ ఆర్పీలతోనే చేయిస్తూ వారిని ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల కర్ర పెత్తనం మెప్మా ఉద్యోగులు పట్టణాల్లో మహిళలను సమావేశ పర్చడం, వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడం, ఇప్పించిన రుణాలను తిరిగి చెల్లించేలా చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ అన్ని పనులు వార్డుల్లో ఉన్న మహిళా ఆర్పీలపై నెట్టివేసి మెప్మాలోని ఇద్దరు ఉద్యోగులు వారిపైనే కర్ర పెత్తనం చెలాయిస్తూ సూటి పోటి మాటలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలపై మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి ఐదు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా చిన్న పిల్లలను నిలబెట్టినట్లు నిలబెట్టి కారణాలు చెప్పండంటూ వికృత చేష్టలకు దిగుతున్నట్లు సమాచారం. మెప్మా కార్యాలయంలోని ఓ కీలక ఉద్యోగి మహిళా ఆర్పీలను ‘బొంద పెట్ట, దినం చెయ్య.. పిండాలు పెట్ట’ అని వ్యాఖ్యలు చేస్తూ వారిని మానసికంగా వేధిస్తున్నట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెప్మా కార్యాలయంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపాలిటీలోని ఓ ఇద్దరు, ముగ్గురు మెప్మా ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.పద్ధతి ప్రకారం వ్యవహరించాలి ఆర్పీలపై అమార్యాదగా మాట్లాడినా, పద్ధతి ప్రకారం వ్యవహరించకున్నా సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలి. తదుపరి విచారణ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – సయ్యద్ ముసాద్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఫ అన్ని పనులూ మాతోనే చేయిస్తున్నారని మెప్మా మహిళా ఆర్పీల మనోవేదన ఫ ఉద్యోగులు.. మాపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణ ఆర్పీపై పేపర్లు విసిరేసిన మెప్మా ఉద్యోగి.. ప్రతి పది మంది మహిళలు గ్రూపుగా ఏర్పడి బ్యాంకులో ఖాతా తెరుస్తారు. వారిని గ్రూప్గా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా మెప్మా ఉద్యోగులదే. సీఓలే వార్డులకు వెళ్లి వారికి రుణం ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. కానీ బ్యాంకు రుణం కోసం టూటౌన్ పరిధిలోని ఓ ఆర్పీ మెప్మా కార్యాలయానికి 8 మంది సభ్యులను తీసుకువచ్చి పేపర్లపై సంతకం చేయాలని కోరగా ఇద్దరు సభ్యులు తక్కువగా వచ్చారని, ఆలస్యంగా వచ్చారనే కారణంతో ఆర్పీపై సదరు సీఓ పేపర్లు విసిరికొట్టినట్లు చర్చ జరుగుతోంది. దాంతో ఆమె విలపిస్తూ వెళ్లిపోయినట్లు తెలిసింది. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజీలో కూడా రికార్డు అయినట్లు ఆర్పీలు చెబుతున్నారు. ఇటీవల టూటౌన్ పరిధిలోనే ఓ ఆర్పీకి తెలియకుండా సీఓ ఒక సంఘానికి బ్యాంకు రుణం ఇప్పించి చేతివాటం ప్రదర్శించినట్లు తెలిసింది. తన ప్రమేయం లేకుండా బ్యాంకు రుణం ఇప్పించడంతో సదరు ఆర్పీ మరో 20 మంది ఆర్పీలతో కలిసి విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా సీఓను మందలించినట్లు తెలిసింది. దాంతో సదరు సీఓ ఆ 20 మంది ఆర్పీలను టార్గెట్ చేసి బ్యాంకు రుణాల మంజూరు విషయంలో కొర్రీలు పెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సంక్షేమం.. గాడిన పడేనా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఏళ్ల తరబడి ఇన్చార్జి అధికారులతో నెట్టకొచ్చిన సంక్షేమ వసతిగృహాలకు ప్రభుత్వం కొత్తగా హాస్టల్ వెల్ఫేర్ అధికారులను నియమించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 13 హాస్టళ్లు మినహా అన్ని వసతి గృహాలకు అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పూర్తిస్థాయిలో లేక ఉన్నవారిలో ఒకొక్కరు రెండు మూడు హాస్టళ్లకు ఇన్చార్జిగా వ్యవహరించాల్సి వచ్చింది. వారు రోజూ హాస్టళ్లకు వెళ్లలేకపోవడంతో వంట మనుషులపైనే ఆధారపడాల్సి వచ్చేంది. దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడింది. వారు ఏమి చదువుతున్నారో కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయేది. హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రావడంతో వసతి గృహాలు గాడిలో పడతాయని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత నియామకాలు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రిటైర్డ్ అవ్వడమే తప్ప 20 ఏళ్లుగా కొత్తగా రిక్రూట్మెంట్ కాలేదు. దీంతో ఇప్పటి వరకు హాస్టళ్లు ఇన్చార్జిలతో కొనసాగాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 హాస్టళ్లు ఉండగా.. ఇప్పటివరకు 29 మంది మాత్రమే వార్డెన్లు ఉండేవారు. వారిలో ఒకొక్కరికి 2 నుంచి 3 హాస్టళ్ల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. బీసీ, ఎస్టీ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉండేది. ప్రతి వార్డెన్ రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం సమయాల్లో హాస్టల్కు వెళ్లి అన్నీ చూసుకోవాలి. మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో ఉండడంతో.. రెండు పూటల మాత్రం హాస్టల్కు వెళ్లాల్సిందే. కానీ ఒక్కో అధికారికి మూడు హాస్టళ్లను అప్పజెప్పడంతో ఆయన విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్మెంట్తో పోస్టులను భర్తీ చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు చాలా వరకు కొత్తగా అధికారులు వచ్చారు. ఎస్సీలో 31 మంది కొత్తగా అలాట్.. జిల్లాలో 61 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉండగా గతంలో 29 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉండేవారు. ప్రస్తుతం కొత్త రిక్రూట్మెంట్ ద్వారా 5వ జోన్కు ప్రభుత్వం 54 మంది అలాట్ చేసింది. వారిలో నల్లగొండ జిల్లాలో 31 మంది జాయిన్ అయ్యారు. మిగిలిన వారు జోన్ 5 పరిధిలోని యాదాద్రి, సూర్యాపేట, జనగాం జిల్లాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం దామరచర్ల మినహా అన్ని హాస్టళ్లకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. బీసీలో 13 మంది నియామకం జిల్లాలో 46 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉండగా మొన్నటి వరకు 27 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. కొత్తగా 13 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రావడంతో 40 హాస్టళ్లకు అధికారులు ఉన్నారు. ఆరు హాస్టళ్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో ఐదుగురి చేరిక జిల్లాలో 42 గిరిజన సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 14 ఆశ్రమ పాఠశాలలు. అయితే వీటి పరిధిలో ఆశ్రమ పాఠశాలల హెడ్మాస్టర్లే వార్డెన్లుగా వ్యవహరిస్తారు. మరో 17 హాస్టళ్లకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. 11 హాస్టళ్లకు అధికారులు లేరు. కొత్త రిక్రూట్మెంట్తో జిల్లాకు ఏడుగురిని అలాట్ చేయగా అందులో ఐదుగురు మాత్రమే విధుల్లో చేరారు. ఇద్దరు ఇప్పటికే ఇతర ఉద్యోగాల్లో ఉన్నందున వారు విధుల్లో చేరలేదు. దీంతో ఇంకా ఆరు హాస్టళ్లకు ప్రస్తుతం అధికారులు లేరు. ఏళ్ల తరబడి ఇన్చార్జిలతోనే సగం వసతిగృహాలు ఫ ప్రస్తుతం 13 మినహా అన్ని హాస్టళ్లకు సంక్షేమ అధికారుల నియమాకం ఫ పర్యవేక్షణ పెరుగుతుందని తల్లిదండ్రుల ఆశాభావం వంట మనుషులతోనే నిర్వహణ.. ఇన్చార్జి బాధ్యతలు ఉన్న చోట వెల్ఫేర్ అధికారి వంటకు సరిపడా బియ్యాన్ని, కిరాణా సామగ్రిని వంట మనుషులకు అప్పగించి వచ్చేవారు. దాంతో వారు వండి విద్యార్థులకు పెట్టేవారు. అధికారి రోజూ ఒక చోటకు వెళ్లాల్సి వచ్చేది. దీంతోపాటు కార్యాలయాల్లో సమావేశాలు, బిల్లులు పెట్టుకునేందుకు కూడా తిరగాల్సిందే. దీంతో వంట మనుషులే హాస్టల్ నిర్వహణ చూసేవారు. -
క్రీడా పాఠశాలల్లో ప్రవేశంతో ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : క్రీడా పాఠశాలల్లో ప్రవేశం పొందితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి మంగళవారం నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించడం ద్వారా ఎంతో పేరు వస్తుందన్నారు. ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఓ అక్బర్ అలీ, పీడీలు కుంభం నర్సిరెడ్డి, విమల, కవిత, నజీర్ పాల్గొన్నారు. -
పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
రామగిరి(నల్లగొండ) : పాలిసెట్ – 2025 కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభమైందని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.నరసింహ అన్నారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని.. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు జూన్ 26 నుంచి జూలై 1వ తేదీ వరకు కాలేజీ ఎంపికకు ఆన్లైన్లో ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. మహిళలు పొదుపుపై దృష్టి పెట్టాలిమునుగోడు : మహిళలు సమాఖ్య సంఘాల్లో చేరి తమ ఆదాయంలో కొంత నగదుని పొదుచేసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి సూచించారు. మంగళవారం మునుగోడులోని మహిళా సమాఖ్య భవనంలో నూతనంగా ఎన్నికై నా మహిళ సమాఖ్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కోశాధికారులకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్ధిక అభివృద్ధికి అనేక ప్రోత్సహాకాలు అందిస్తోందన్నారు. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం మోహన్రెడ్డి, ఎంపీడీఓ ఈ.విజయభాస్కర్, ఏపీఎం మేసేశ్వరావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు పంతంగి రాధ, కార్యదర్శి బోయపర్తి యాదమ్మ, సీసీలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలినాగార్జునాసాగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి కోరారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ సంస్థాగత జిల్లాస్థాయి సమావేశం మంగళవారం సాగర్లోని విజయవిహార్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలమైన నిర్మాణానికి పునాదులు వేయాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు చెల్లని నాణానికి బొమ్మాబొరుసు లాంటివని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కంకణాల నివేదితారెడ్డి, పిల్లి రామరాజుయాదవ్, మాదగోని శ్రీనివాస్గౌడ్, చనమోని రాములు, ఎస్కే బాబా, వీరారెడ్డి, రామదాసు, తంగరాజు, రాజు పాల్గొన్నారు. బాలికాసాధికారిత సాధించాలి గుర్రంపోడు : కేజీబీవీ విద్యార్థినులు బాగా చదువుకుని ప్రయోజకులై స్వశక్తితో ఎదిగి బాలికా సాధికారికతను సాధించే దిశగా ముందుకు సాగాలని జీసీడీఓ కె.అరుందతి ఆకాంక్షించారు. మంగళవారం గుర్రంపోడు కేజీబీవీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థిని కనీస సామర్థ్యాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధించాలని టీచర్లకు సూచించారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని.. విద్యార్థినులకు ఇబ్బంది కలగితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. కేర్ టేకర్ రోజూ స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఓ విజయశ్రీ, సిబ్బంది రాధా, సులోచన, కవిత, ఉమాదేవి, ధనలక్ష్మి, నేహదీప్తి, నీలవేణి, జ్యోతి, కేర్ టేకర్ స్వాతి, ప్రమీల పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ : 2025–26 విద్యా సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో మూడేళ్ల శిక్షణ కోసం జిల్లాలోని ఎస్సీ న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీడీ శశికళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31వ తేదీలోగా telanganaepass.cgg.gov.inలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. హార్డ్ కాపీని వారి బయోడేటా కుల, ఆధాయ ధ్రువీకరణపత్రాలు, డిగ్రీ మార్కుల జాబితా, బార్ కౌన్సిల్ నమోదు పత్రాలు జత చేసి ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. సందేహాలు, పూర్తి వివరాల కోసం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఇరాన్పై దాడిని ఖండించాలి
మిర్యాలగూడ అర్బన్ : ఇరాన్పై అమెరికా దాడులను ఖండించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు. ఇరాన్పై దాడులను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మండలంలోని యాద్గార్పల్లిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమెరికా ఇంటిలిజెన్స్ నిఘా వర్గాలు ఇరాన్ వద్ద అణుబాంబులు లేవని స్పష్టంగా చెప్పినప్పటికీ అమెరికా తమ ఆధిపత్యం కోసం ఇరాన్పై యుద్ధం చేస్తోందని మండిపడ్డారు. అనంతరం ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు వస్కుల మట్టయ్య, బంటు వెంకటేశ్వర్లు, డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, వినోద్నాయక్, వరలక్ష్మి, పరశురాములు, శ్రీనివాస్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు ఎకరాలున్నా.. రైతు భరోసా రాలే!
ఫ మహిళా రైతు ఆవేదన చందంపేట : చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన తుమ్మల మల్లమ్మకు 4 ఎకరాల భూమి ఉండగా పత్తి విత్తనాలు విత్తింది. గతంలో రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందింది. కానీ తాజాగా ఆమెకు రైతు భరోసా అందలేదు. తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని అందులో కూడా పత్తి సాగు చేస్తోంది. ఈ విషయమై ఆమె వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పకుండా.. ఆన్లైన్ నుంచి భూమి తొలగించారని చెబుతున్నారని మల్లమ్మ వాపోతోంది. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
నకిరేకల్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆమె నకిరేకల్లోని ఏరియా ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శోభారాణి అందుబాటులో లేకపోవడం, పలు గదులకు తాళాలు వేసి ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. క్వాజువాలిటీ, పురుషలు, మహిళ అత్యవసర వార్డులు, మందుల స్టాక్ను తనిఖీ చేశారు. ఇది పీహెచ్సీ కాదని ఏరియా ఆస్పత్రి అని.. డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం రూ.32 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మిస్తున్నందున, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వైద్య సేవలందించాలని సూచించారు. ఆమె వెంట నల్లగొండ ఆర్డీఓ యానాల అశోక్రెడ్డి ఉన్నారు. టీబీ నివారణపై దృష్టి పెట్టాలి నల్లగొండ : టీబీ (క్షయ) నివారణపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్న్ఫామె అధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శ్రద్ధ పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు టైపాయిడ్, డెంగీ తదితర వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని చెప్పారు. రైతులు ఎరువులకు ఇబ్బంది పడకుండా చూడాలని వ్యవసాయ అధికారిని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, జిల్లా అటవీశాఖాధికారి రాజశేఖర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఏఓ శ్రవణ్కుమార్, డీపీఓ వెంకయ్య, హార్టికల్చర్ డీడీ అనంతరెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
చదువుకోవాలని ఉంది.. కానీ పేదరికం అడ్డొచ్చింది!
యాదగిరిగుట్ట: ఆ బాలికకు చదువుకోవాలని ఉంది.. కానీ పేదరికం అడ్డొచ్చింది. కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో అమ్మమ్మతో కలసి భిక్షాటన చేస్తోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో భిక్షాటన చేస్తున్న ఆ బాలికను యాదగిరిగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ పలకరించి, చదివించేందుకు ప్రయత్నం చేశారు. మెదక్ జిల్లా అమీన్పూర్లోని టైలర్ కాలనీకి చెందిన పార్వతమ్మ, ఆమె 12 సంవత్సరాల మనుమరాలు శిరీషలు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. శిరీషకు చదువుకోవాలని ఉన్నా పేదరికంతో చదువుకు దూరమైంది. పొట్టకూటికోసం కొంత కాలంగా తన అమ్మమ్మ పార్వతమ్మతో కలసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వైకుంఠద్వారం వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ క్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటి సోమవారం అటుగా వెళ్తూ బాలికను గమనించి ఆమె వద్దకు వెళ్లారు. చదువుకోకుండా భిక్షాటన ఎందుకు చేస్తున్నావని శిరీషను అడిగారు. దీంతో శిరీష ఏడుస్తూ.. తనకు చదువుకోవాలని ఉన్నా డబ్బులు లేవని, పూటగడవడం కోసం అమ్మమ్మతో కలసి భిక్షాటన చేసేందుకు వచ్చానని చెప్పింది. దీంతో చలించిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటి.. భువనగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన అధికారులు.. శిరీషకు, ఆమె అమ్మమ్మకు కౌన్సెలింగ్ చేసి భువనగిరి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. బాలికకు సాయం చేసిన కానిస్టేబుల్ కోటిని ట్రాఫిక్ సీఐ కృష్ణ అభినందించారు. -
కొడుకు అన్నం పెట్టడం లేదు
నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెళ్లిల్లు అయినాయి. ఇద్దరు కొడుకులకు 22 ఎకరాల భూమిని పంచిచ్చాను. నా పేరున 2 ఎకరాల భూమి ఉంది. ఒక కొడుకు చనిపోయాడు. మరో కొడుకు ఊరిలో వ్యవసాయం చేస్తున్నాడు. నాకు ఇటీవల గుండె నొప్పి రావడంతో స్టంట్ వేసిండ్రు. నా కొడుకు నాకు అన్నం పెట్టడం లేదు. హైదరాబాద్లో ఉండే నా పెద్ద కూతురు వద్ద ఉంటున్నాను. ఊరిలోకి వెళ్లి నా పేరున ఉన్న భూమిని అమ్ముకందామన్నా అమ్ముకోనీయడం లేదు. నాకు న్యాయం చేయాలి. – దేవకమ్మ, నర్సర్లపల్లి, చింతపల్లి మండలం -
26 సార్లు ఫోన్చేసినా కలెక్టర్ స్పందించలే..!
నల్లగొండ: నకిరేకల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంపై కలెక్టర్తో చర్చించేందుకు 26 సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ప్రజావాణికి వచ్చానని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సమస్యలపై ఫోన్ చేసినా కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ బోయవాని శ్రీను అర్జీలను కలెక్టర్ చూసి దాటవేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే ప్రదీప్రెడ్డిపై అధికారులు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారన్నారు. తప్పుడు రిపోర్టులతో కేతేపల్లి పంచాయతీ సెక్రటరీపై వేటు వేశారన్నారు. చిన్నకాపర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలోని భవనాలను నేలమట్టం చేశారని ఆరోపించారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ నాయకులకే ఇస్తున్నారన్నారు. ఫ అందుకే ప్రజావాణికి వచ్చా.. ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
భూమి రిజిస్ట్రేషన్ కాకుండా ఆపండి
నా భర్త చిన్న లింగయ్యకు గ్రామంలో 7.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కూలి కోసం ఆంధ్రాలోని మచిలీపట్నం వెళ్లాడు. అక్కడే ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. నేను ఇక్కడే ఉంటు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి నా బాగోగులు పట్టించుకోలేదు. నా తమ్ముడే అన్ని చూసుకుంటున్నాడు. నా భర్త నాకు తెలియకుండా అన్నెపర్తిలో 3 ఎకరాల భూమిని ఇతరులకు విక్రయించాడు. మిగతా భూమిని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ భూమిని వేరే వారి పేర రిజిస్ట్రేషన్ చేయకుండా నిలుపుదల చేసి నాకు చెందేలా చూడాలి. – అంతటి లింగమ్మ, అన్నెపర్తి, నల్లగొండ మండలం -
కోడలు, కొడుకు పట్టించుకోవట్లేదు
మాకు నాగయ్య, శంకర్ అనే కొడుకులు ఉన్నారు. మాకున్న 3 ఎకరాల 25 గుంటల భూమిని 2012లో వారిద్దరికి పట్టాలు చేశాం. 2024లో నా చిన్న కొడుకు మరణించాడు. నా కొడుకు పేరున ఉన్న భూమిని నా కోడలు పౌతి పేరున పట్టా చేయించుకుంది. ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నాం. మా ఆరోగ్యం బాగలేదు. పెద్ద కొడుకు కాని, చిన్న కోడలు కాని పట్టించుకోవడం లేదు. మా పిల్లలకు ఇచ్చిన భూమిని తిరిగి మా పేర పట్టా చేసి న్యాయం చేయాలి. – చిట్టిమల్ల బుచ్చయ్య దంపతులు, నరసింహులపురం, నకిరేకల్ మండలం -
మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు
నల్లగొండ : యువతీ యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్య సాధనకు కృషిచేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం నల్లగొండలోని ఆదిత్య పాఠశాల విద్యార్థులతో కలిసి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతిఒక్కరూ డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల సమాజ నిర్మూలనే లక్ష్యం అనే అంశంపై ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాజశేఖర్రెడ్డి, రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్ హరిబాబు, ఎస్ఐలు సైదులు, సైదాబాబు, శంకర్, విద్యార్థులు తదితరలుఉ పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ శరత్చంద్ర పవార్ పోలీసు వృత్తి నైపుణ్యాలపై డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారుల, సిబ్బంది నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. డ్యూటీ మీట్లో గెలుపొందిన వారిని రేంజ్ మీట్కి పంపుతామన్నారు. కేసుల దర్యాప్తులో ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం లాంటి అంశాలలో పట్టు సాధించాలని సూచించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలి బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్లో ఆయన పాల్గొని 52 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఆదరించట్లేదు.. ఆదుకోండమ్మా
నల్లగొండ : కనిపెంచి పెద్ద చేశాం.. ఆస్తులు పంచిచ్చాం.. వృద్ధాప్యంలో ఉన్న మమ్ములను కన్న కొడుకులు సరిగా చూసుకోవడం లేదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి పలువురు వృద్ధులు తమ గోడు వినిపించారు. కన్నకొడుకులు ఆదరించట్లేదు.. మమ్ములను ఆదుకోండమ్మా అంటూ కలెక్టర్కు తమ సమస్యలను విన్నవించారు. వృద్ధులతోపాటు వివిధ సమస్యలను విన్నవించేందుకు జనం కూడా భారీగా వచ్చి ఫిర్యాదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డిలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫ ఆస్తులు పంచిచ్చినా కొడుకులు అన్నం పెట్టట్లేదు ఫ ప్రజావాణిలో గోడు వినిపించిన పలువురు వృద్ధులు ఫ కలెక్టర్కు ఫిర్యాదుల వెల్లువ -
రైతు భరోసా సంబరాలు నిర్వహించాలి
నల్లగొండ : ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులకు రైతు భరోసా ఇస్తున్నారని, దీనిపై పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సంబరాలు నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు రుణ మాఫీ, సన్న బియ్యం అందిస్తూ రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేశామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పనికిరాని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తున్నందుకు ముఖ్యమంతి, జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి, మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలిమిర్యాలగూడ : గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరగనుందని, దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో ఎస్ఎన్డీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సీపీఎం నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు సోమవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సమస్యలు తిష్టవేశాయని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, వినోద్నాయక్, శశిధర్రెడ్డి, రొండి శ్రీనివాస్, చౌగాని సీతారాములు, అయూబ్, గాదె పద్మ, సత్యనారాయణ పాల్గొన్నారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి అన్నారు. నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం బీజేవైఎం నాయకులు విద్యా రంగ సమస్యలు, మౌలిక సదుపాయాలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో బాలికలకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయకుండా విద్యార్థుల పట్ల వివక్ష చూపుతుందన్నారు. ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం బీజేవైఎం కార్యకర్తలు పోరాడాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ సవరణ చట్టాన్ని రద్దుచేయాలినల్లగొండ టౌన్ : కేంద్రం తీసుకొచ్చిన పెన్షనర్స్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవరణ చట్టం వల్ల పెన్షనర్స్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసా
రైతులతో మాట్లాడనున్న సీఎం ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. రైతు వేదికల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించే వీడియో కాన్పరెన్స్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలోని 93 రైతు వేదికల ద్వారా రైతులు ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని 93 రైతు వేదికల పరిధిలోని రైతులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రతి రైతు వేదికకు ఒక నోడల్ అధికారిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. -
సీజనల్ వ్యాధులను అరికడతాం
వ్యాధులు వ్యాపించే సీజన్ వర్షాకాలంలో దోమలు, ఈగల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాగునీరు కలుషితం అవుతుంది. ఈ కాలంలో పరిసరాలు అపరిశుభ్రంగా మారతాయి. దీని కారణంగా మలేరియా, డెంగీ, మెదడువాపు, పైలేరియా, చికున్గున్యా, డయేరియా, కలరా, టైపాయిడ్, స్వైన్ఫ్లూతోపాటు అనేక రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. వీటిని అధిగమించడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్నిరకాల చర్యలు చేపట్టింది. ఫ అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం ఫ వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం ఫ వైద్యసిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ‘వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అన్ని రకాల మందులను సిద్ధంగా ఉంచాం. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం’ అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకున్న చర్యలపై ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. –నల్లగొండ టౌన్ ప్రజలు జాగ్రత్తలు పాటించాలి వర్షాకాలంలో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. పరిసరాల్లో నీటి గుంతల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని వడబోసుకుని తాగాలి. వేడివేడి పదార్థాలు తినాలి. తాగునీటి ట్యాంకులో ఫ్లోరిన్ బిల్లలు వేసుకోవాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మున్సిపల్, పంచాయతీ సిబ్బంది సహకారం గ్రామాలు, పట్టణాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం మురుగు గుంతల్లో మట్టిని పోయించడానికి పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు పారిశుద్ధ్య పనుల కోసం ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించాం. పట్టణాల్లో దోమల నివారణకు మురుగు కాల్వల్లో పైరాత్రమ్ లిక్విడ్తోపాటు ఆబేగ్ టాబ్లెట్లను వేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. -
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
పాఠశాలల్లో ఎకో క్లబ్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం నల్లగొండ : పచ్చదనం పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా మొక్కల ప్రాధాన్యంతోపాటు వివిధ అంశాలపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులను పర్యావరణ సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో వారిని భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనిపై ఈ క్లబ్లను ఈ విద్యాసంవత్సరం నుంచి ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పిలవనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొత్త క్లబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఇవి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం ఈ సంవత్సరం పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి స్కూల్ నుంచి ఒక కమిటీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,483, ప్రైవేట్ స్కూళ్లు 369 ఉండగా ఆయా స్కూళ్లలో 1.86 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రతి పాఠశాల నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమంగా చేపట్టిన ఏడు అంశాలలో ఎకో క్లబ్లను భాగస్వామ్యం చేస్తారు. ఫ జూలై 29లోపు కమిటీలు వేయాలని ఆదేశం ఫ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పేరుతో ఏడు అంశాలపై ప్రచారం ఫ గతేడాది ఆశించిన స్థాయిలో రాని ఫలితాలు ఫ ఈ ఏడాది పక్కా కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం ప్రభుత్వ పాఠశాలలు 1,483విద్యార్థుల సంఖ్య 61,073 ప్రైవేట్ స్కూళ్లు 369విద్యార్థులు 1,25,572 వచ్చే నెలాఖరులోగా.. ఈ నెల 16 నుంచి వచ్చేనెల 29 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి టీచర్లను, పాఠశాల కమిటీ చైర్మన్ను క్లబ్లో భాగస్వాములు చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడు అంశాలకు సంబంధించిన యాక్టివిటీ ఫొటోలు, వీడియోలు తీసి ప్రత్యేక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అవగాహన కల్పించే ఏడు అంశాలు ఇవే.. ఇంధన పొదుపు నీటి పొదుపు సింగిల్ యూజ్ వాడొద్దు సుస్థిర ఆహార వ్యవస్థలు వృథాను అరికట్టడం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ఈ–వ్యర్థాలను తగ్గించడం. -
పేదల సొంతింటి కల సాకారం
నకిరేకల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి కళ్లలో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. నకిరేకల్లోని మినీ స్టేడియంలో ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇళ్ల ధ్రువ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆదాయంలో మిగులు రాష్టంగా ఉన్నా గత ప్రభుత్వం 8లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రచారం చేశారు తప్పితే పేదలకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. కాంగ్రెస్ ప్రజా పాలనలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యసాయాన్ని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఈ ఏడాది ఉగాది కానుకగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింది ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున గడిచిన తొమ్మిది రోజుల్లోనే రూ.9 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. గత ప్రభుత్వానికి, నేటి ప్రభుత్వానికి ప్రజలు తేడాను గమనించి కాంగ్రెస్ను దీవించాలని కోరారు. ఎమ్మెల్యే వీరేశం కోరిక మేరకు నకిరేకల్, రామన్నపేటలో తహసీల్దార్ కార్యాలయ భవనాలకు వారం రోజుల్లో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇళ్ల మంజూరులో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం : భువనగిరి ఎంపీ చామల భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పేదవారికి ఇళ్లు ఇవ్వడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలన్నారు. జిలా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా చేశామన్నారు. స్టీల్, సిమెంట్ తదితర సామగ్రి ధరల నియంత్రణకు మండల స్థాయిలో కమిటీలు వేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీలు శంకరనాయక్, నెల్లికంటి సత్యం, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, నాయణఅమిత్, ఆర్డీఓ యానాల అశోక్రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్కుమార్, జిల్లా పరిషత్ ఈసీఓ శ్రీనివాస్రావు, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, మున్సిపల్ చైర్ పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజిత, వైస్ చైర్పర్సన్ ఉమారాణి, మాజీ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, వివిధ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఫ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఫ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల దీవెనలుండాలి ఫ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫ నకిరేకల్లో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ నిబంధనలు సడలించాలి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలు సడలించాలని సూచించారు. ధరణి పోర్టల్తో రైతులు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. -
కుల వ్యవస్థపై పోరాడాలి
ఫ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు కట్టంగూర్ : సమాజంలోని పేదల ఐక్యతకు అడ్డుగోడగా ఉన్న కుల వ్యవస్థపై పోరాడాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం కట్టంగూర్ మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. దళితులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను నిర్వీర్యం చేశారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లబ్ధిదారునికి రుణం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగ యువతకు సబ్సిడీ ద్వారా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఆ సంఘం ప్రతినిధులు కొండేటి శ్రీను, పెంజర్ల సైదులు, రెవిడాల పరుశురాములు, కోడిరెక్క రాధిక, వంటెపాక కృష్ణ, విజయ్కుమార్, గాదె నర్సింహ, దైద శ్రీను, బోళ్లు రవీంద్రకుమార్, దండు రవి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు
నల్లగొండ టూటౌన్: క్రీడా పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశానికి స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24,25 తేదీల్లో విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి ఎం.డి అక్బర్అలీ ఒక ప్రకటనలో తెలిపారు. 24న బాలికలకు, 25న బాలురకు నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి వివరాలకు సెల్ : 8074487020 నంబర్ను సంప్రదించాలని కోరారు.స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదునల్లగొండ: ఉపాధ్యాయులకు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పి.వెంకులు అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించడం వల్ల ఆయా పాఠశాలల్లో బోధన స్తంభించిపోతుందన్నారు. మండల, ఉప విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులను నియమించి పాఠశాలల పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. శివన్నగూడ రిజర్వాయర్ పనులు అడ్డగింతమర్రిగూడ : శివన్నగూడ రిజర్వాయర్ పరిఽధిలో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు తమకు ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామ సమీపంలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు అందరితోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు నిర్వాసితులు ఉన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలి నల్లగొండ టూటౌన్: ఫుట్బాల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి అక్బర్ అలీ అన్నారు. ఈ నెల 28 నుంచి జూలై ఒకటవ తేదీ వరకు నిజామాబాద్లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఆదివారం ఔట్డోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.కర్తయ్య, ఫుట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు బండారు ప్రసాద్, గిరిబాబు, కవిత, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
భవిత.. భరోసా!
‘ప్రత్యేక’ విద్యార్థులకు చేయూతనిస్తున్న భవిత కేంద్రాలు సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025నల్లగొండ: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భవిత కేంద్రాలు భరోసానిస్తున్నాయి. సాధారణ విద్యార్థుల తరహాలోనే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. మానసిక పరిపక్వత కార్యక్రమాలతో వారిలో ఆత్మస్థైర్యం పెంచేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. జిల్లాలోని భవిత కేంద్రాలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక శ్రద్ధచూపుతూ బుద్ధిమాంద్యం, ఇతర దివ్యాంగ, మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిత్యం సందర్శిస్తున్నారు. సమాజంలో గౌరవించబడేలా.. అన్ని అవయవాలు సవ్యంగా ఉంటేనే బతకడం కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కారణాలతో వైకల్యంతో జన్మించిన పిల్లల పరిస్థితి ఊహించలేనిది. అలాంటి వారిలో ఎక్కువగా మానసిక వైకల్యంతోపాటు ఇతర వైకల్యాలతో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అలాంటి పిల్లలు సాధారణ పిల్లల తరహాలోనే విద్యాబుద్ధులు నేర్చుకుని సమాజంలో అందరూ గౌరవించేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిత కేంద్రాలను ఏర్పాటు చేశాయి. జిల్లాలో ఉన్న భవిత కేంద్రాల్లో వసతులు కల్పించేందుకు కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ.కోటి 20 లక్షలు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే వివిధ సామగ్రి కొనుగోలు, వసతుల కల్పనకు రూ.72 లక్షలు విడుదల చేసి వివిధ పనులు చేపడుతున్నారు. న్యూస్రీల్అక్రమ డిప్యుటేషన్లు రద్దుచేయాలిఫ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి ఫ సాధారణ విద్యార్థుల తరహాలోనే విద్యాబోధన ఫ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి ఫ అందంగా ముస్తాబవుతున్న కేంద్రాలు ఫ కొన్నిచోట్ల కొనసాగుతున్న పనులు ప్రత్యేక పిల్లలకు చేయూతనివ్వాలి జిల్లాలో 700 మంది వరకు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలున్నట్లు గుర్తించాం. వారందరూ భవిత కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులను ఒప్పిస్తాం. సాధారణ విద్యార్థుల మాదిరిగానే వారికీ విద్యాబుద్ధులు నేర్పే దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రత్యేక పిల్లలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – ఇలా త్రిపాఠి, కలెక్టర్జిల్లాలో భవిత కేంద్రాలు 31‘ప్రత్యేక’ విద్యార్థుల సంఖ్య 459 -
ఒక్క పోస్టు.. ఇద్దరు ఎస్ఈలు
నల్లగొండ: నల్లగొండ విద్యుత్ శాఖలో వింత వ్యవహారం కొనసాగుతోంది. ట్రాన్స్కోలో ఇద్దరు ఎస్ఈలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒకరికి పదోన్నతి ఇచ్చి ఎస్ఈగా నియమించింది. ఆ తర్వాత పదోన్నతి తొలగించి మరో వ్యక్తిని బదిలీ చేసింది. దాంతో మొదటి అధికారి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని అదే సీటులో కూర్చొగా బదిలీపై వచ్చిన అధికారి కూడా పక్క రూమ్లో సీటు వేసుకుని మరో ఎస్ఈగా కొనసాగుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర సీఈ పరిధిలో ఉన్నప్పటికీ పది నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక పోస్టులో ఇద్దరు ఎస్ఈలు కొనసాగుతున్నారు. అసలేం జరిగిందంటే.. ట్రాన్స్కోలో నల్లగొండ డీఈగా పనిచేస్తున్న హరిప్రసాద్కు పీహెచ్సీ ఆర్థో కోటాలో ప్రభుత్వం 2022 నవంబర్లో ఎస్ఈగా పదోన్నతి కల్పించింది. ఆ తర్వాత ఆయనకు ఇచ్చిన పదోన్నతిలో పొరపాటు జరిగిందని అది పీహెచ్సీ హెచ్హెచ్కు ఇవ్వాల్సిందని హరిప్రసాద్కు ఇచ్చిన పదోన్నతిని ఆ శాఖ అధికారులు 2024 ఆగస్టు 14న రద్దు చేశారు. దీన్ని సవాలు చేస్తు హరిప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకుని ఎస్ఈగా కొనసాగుతున్నారు. అయితే హరిప్రసాద్ పదోన్నతిని రద్దుచేసిన వెంటనే నల్లగొండ ట్రాన్స్కో ఎస్ఈగా కె.నారాయణరెడ్డిని నల్లగొండకు బదిలీ చేశారు. దీంతో ఆయన విధుల్లో చేరినప్పటికీ ఎస్ఈ కుర్చీలో కూర్చొలేని పరిస్థితి. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న హరిప్రసాద్ సీట్లో కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. దీంతో బదిలీపై వచ్చిన నారాయణరెడ్డి పక్క గదిలో ప్రత్యేక కుర్చీ వేసుకుని కూర్చుంటున్నారు. ఫ విధుల్లో ఉండేది మాత్రం ఒక్కరే.. ఫ మరొకరు సంతకం పెట్టి జీతం తీసుకుంటున్న వైనం ఫ పట్టించుకోని ఉన్నతాధికారులు ఫ నల్లగొండ విద్యుత్ శాఖలో వింత వ్యవహారం పది నెలలుగా ఇదే పరిస్థితి.. పది నెలల నుంచి ట్రాన్స్కోలో వింత పరిస్థితి నెలకొంది. ట్రాన్స్కో ఎస్ఈగా ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. అయితేన హరిప్రసాద్ నేరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలు, ఇతర అన్ని ఫైళ్లను ఆయనే చూస్తుండగా పదోన్నతిపై వచ్చిన నారాయణరెడ్డి మాత్రం పది నెలల నుంచి కేవలం విధుల వస్తూ సంతకం పెట్టి వేతనం తీసుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయమై ట్రాన్స్కో సీఈ లతను వివరణ కోరగా ఈ అంశం నా పరిధిలో లేదని తెలిపారు. -
వివాహేతర సంబంధం: చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టి హత్య
నల్గొండ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో మహిళ భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య(35)కు ఇంకా వివాహం కాలేదు. జానయ్యకు అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. గతేడాది ఇదే విషయమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, జానయ్యకు మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీలు కూడా నడిచాయి. ఇదే విషయంపై జానయ్యపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అతడు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక కూడా జానయ్య ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి జానయ్యను అంతమొందించాలని ఆ మహిళ భర్త నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన భార్యతోనే జానయ్యను శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి పిలిపించాడు. ఇంటికి వచ్చిన జానయ్య కళ్లలో కారం చల్లి.. కాళ్లు, చేతులు కట్టేసి ఆ మహిళతోపాటు ఆమె భర్త కర్రలతో చితకబాదారు. అనంతరం మరికొందరితో కలసి ఇంటి పక్కన ఉన్న వీధిలో చెట్టుకు జానయ్యను తాళ్లతో కట్టేసి అతడి తల, కాళ్లు, చేతులు, మర్మాంగాలపై విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన జానయ్య అసస్మారకస్థితిలోకి వెళ్లాడు. చుట్టుపక్కల వారు గమనించి జానయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి జానయ్యను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై జానయ్య తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి
నల్లగొండ టూటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. శనివారం నల్లగొండలోని వీటీ కాలనీలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ముఖ్యమైనవని, అత్యధిక స్థానాలు కై వసం చేసుకునే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కటికం సత్తయ్యగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, చీర పంకజ్యాదవ్, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్రెడ్డి, ఐయితగాని యాదయ్య, దేప వెంకట్రెడ్డి వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి -
పంద్రాగస్టు నాటికి పరిష్కారం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూ భారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20 వరకు 17 రోజుల పాటు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,01,605 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 15 రకాల సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారంతో రెవెన్యూ సదస్సులు ముగియడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఆగస్టు 15లోగా అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 1,136 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,136 రెవెన్యూ గ్రామాల్లో భూ భారతి గ్రామసభలు నిర్వహించారు. మొత్తం 1,01,605 దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించారు. అయితే ఇందులో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లు, ఫౌతితో పాటు అసైన్డ్ భూముల సమస్యలు, పెండింగ్ మ్యుటేషన్పైనే దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ప్రారంభమైన దరఖాస్తుల పరిశీలన.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో పెద్ద ఎత్తున భూ సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ధరణిని రద్దు చేసి భూ భారతిని తీసుకొచ్చింది. అన్ని భూ సమస్యలను పరిష్కరించేలా భూ భారతిలో ఆప్షన్లను సిద్ధం చేసింది. 20వ తేదీ వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సదస్సులు ముగియడంతో అధికారులు దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజించి పరిశీలిస్తున్నారు. సాదాబైనామాలు పెండింగేనా..! ప్రభుత్వం అన్ని రకాల భూ సమస్యలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే సాదాబైనామాల విషయం హైకోర్టులో పెండింగ్లో ఉంది. అవి తప్ప మిగిలిన సమస్యలన్నింటికీ ఆగస్టు 15 నాటికి పరిష్కారం చూపనున్నారు. ఆలోగా సాదాబైనామాలను పరిష్కరించేలా హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే వాటిని కూడా పరిష్కరించే అవకాశం ఉంది. ఫ రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,01,605 దరఖాస్తులు ఫ వాటి పరిశీలన ప్రారంభించిన అధికారులు ఫ మండల స్థాయిలోనే కేటగిరీల వారీగా విభజన ఫ తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో ఆగస్టు 15 నాటికి పరిష్కరించేలా ప్రణాళిక దరఖాస్తుల వివరాలు జిల్లా దరఖాస్తులునల్లగొండ 42,534సూర్యాపేట 44,741యాదాద్రి 14,330మొత్తం 1,01,605ఆయా స్థాయిలో పరిష్కారం చిన్న చిన్న సమస్యలకు మండలస్థాయిలోనే తహసీల్దార్ నేతృత్వంలో పరిష్కరించి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఆర్డీఓ స్థాయిలో మ్యూటేషన్, ఫౌతిలను పరిష్కరిస్తారు. పెద్ద సమస్యలు ఉంటే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుంది. కలెక్టర్ స్థాయిలో కాని వాటిని సీసీఎల్కు పంపనున్నారు. సమస్యల విషయంలో బాధితులను పిలిపించి రికార్డులను పరిశీలించి కొన్నింటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది. మరికొన్నింటి విషయంలో దరఖాస్తుల ఆధారంగా వారికి నోటీసులు ఇచ్చి రెవెన్యూ బృందాలు గ్రామాలకు వెళ్లి క్షేత్రాస్థాయిలో అన్నీ పరిశీలించి అక్కడే పరిష్కరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
నకిరేకల్కు నేడు మంత్రుల రాక
నకిరేకల్ : నకిరేకల్కు ఆదివారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకటి శ్రీహరి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ఎంపీ కిరణ్కుమార్రెడ్డి రానున్నారు. నకిరేకల్ పట్టణంలో నిర్వహించేఉ సభలో నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఇందుకోసం పట్టణంలోని మినీ స్టేడియం మైదానాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. సేడ్డియంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, ఆర్డీఓ అశోక్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, తహసీల్దార్ జమురుద్దీన్, మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితాశ్రీనివాస్గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరావు తదితరులు ఉన్నారు. -
ఆదిలోనే విపత్తి
వర్షపాతం ఇలా.. జూన్ మాసంలో ఇప్పటివరకు 64.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 43.0 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. నైరుతి రుతు పవనాలు వచ్చే జూన్ మాసంలో కురిసే వర్షమే రైతులకు మంచి ఆధారం. ఈ నెలలోనే వర్షాలు లేకపోవడంతో సాగు కుంటుపడింది. ఫ జిల్లాలో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో పత్తి సాగు ఫ ముందస్తు వానలకు విత్తనాలు వేసిన రైతులు ఫ పక్షం రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఫ సగానికి పైగా మొలకెత్తని గింజలు ఫ అక్కడక్కడ వచ్చిన మొలకలు వాడు దశకు.. ఫ ఆందోళనలో కర్షకులు నల్లగొండ అగ్రికల్చర్, తిప్పర్తి : వర్షాభావ పరిస్థితులు పత్తి రైతుకు శాపంగా మారాయి. పక్షం రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో వేలాది ఎకరాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో మరోసారి విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అక్కడక్కడ వచ్చిన మొలకలు ఎండ వేడిమికి వాడు పడుతున్నాయి. సీజన్్ ప్రారంభంలోనే ప్రకృతి సహకరించడం పోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. 50 వేల ఎకరాల్లో పత్తి సాగు జిల్లాఓ వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల్లో పత్తి అగ్రస్థానంలో ఉంటుంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5,47,735 ఎకరాల్లో పత్తి సాగు కానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాలు సకాలంలో, సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు ఆశాభావంతో సాగు పనులపై దృష్టి సారించారు. మే చివరి వారంలో కురిసిన తొలకరి వానలు, జూలై మొదటి వారంలో కురిసిన మోస్తరు వర్షాలకు జిల్లా వ్యాప్తంగా రైతులు 50 వేలకుపైగా ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. ఆ తరువాత పక్షం రోజులుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడక్కడ అడపాదడపా జల్లులు మాత్రమే పడ్డాయి. దీంతో సగానికి పైగా విత్తనాలు మొలకెత్తలేదు. అక్కడక్కడ కొంత మేర మొలకెత్తాయి. పది రోజులుగా ఎండ తీవ్రత 35 డిగ్రీల పైన నమోదవుతోంది. వేడి గాలులు వీస్తుండడంతో గింజలు భూమిలోనే మాడిపోయే ప్రమాదం ఏర్పడింది. వచ్చిన మొలకలు సైతం ఎండ వేడికి వాడు పడుతుండటంతో కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. నేల గట్టిపడకుండా గుంటుకలు తోలుతున్నారు. మొలకెత్తని చోట మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి రెండోసారి వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చు పత్తి సాగు చేయడానికి రైతులు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెటుబడి పెట్టారు. దున్నకాలు మొదలుకొని విత్తనాలు వేసే వరకు ఎకరానికి రూ.15 వేలకు పైనే పెట్టుబడి పెట్టారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురువకపోతే ఇబ్బందులు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. తిప్పర్తి మండల కేంద్రం సమీపంలో ఓ రైతు తనకున్న ఐదెకరాల భూమిలో పది రోజుల క్రితం పత్తి విత్తనాలు విత్తుకున్నాడు. తర్వాత చిరుజల్లులు కురవగా కేవలం 30 శాతం మాత్రమే గింజలు మొలిచాయి. మిగతా గింజలు పాడైపోగా మొలిచిన గింజలు సైతం కొన్ని ఎండ తీవ్రతకు వాడిపోయాయి. దీంతోమరోసారి భూమిని దున్ని విత్తనాలు విత్తుకోవాలా..? లేదంటే గింజలు పాడైపోయిన చోట విత్తుకోవాలా.. ? అన్నది తేల్చుకోలేకపోతున్నాడు. ఇదే పరిస్థితి జిల్లాలోని చాలామంది రైతులకు ఎదురైంది.సాగు ఖర్చులు ఎకరానికి.. (రూల్లో)ఎరువులు 5,000 ఎరువు చల్లడం 1,000దున్నకాలకు 3,000 అచ్చు తోలుటకు 1,000 విత్తనాలు (రెండు ప్యాకెట్లు) 3,000 కూలీలకు 1,200కలుపు మందు 2,000 -
హోర్డింగ్లను తక్షణమే తొలగించాలి
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని నేషనల్ హైవే డివైడర్లపై అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ను వెంటనే తొలగించాలని ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.యుగంధర్ శనివారం మిర్యాలగూడ ఆర్అండ్బీ డీఈ శ్రీనివాస్ను ఆదేశించారు. ఈనెల 19న ‘సాక్షి’లో ‘హైవేపై అనధికారిక ప్రకటనలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన నేషనల్ హైవే –167, ఆర్అండ్బీ అధికారులు నేషనల్ హైవే పరిధిలోని డివైడర్ల మధ్య ఎలాంటి ప్రచార హోర్డింగ్స్ ఏర్పాటు చేయొద్దని, వాటి వల్ల వాహనదారుల దృష్టి మరలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. హైవే నిబంధనలు, రోడ్డు భద్రత దృష్ట్యా మున్సిపల్ అధికారులు ఎలాంటి టెండర్లు ఆహ్వానించవద్దని, ప్రస్తుతం ఉన్న బోర్డులను వెంటనే తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రకటన ఏజెన్సీలతో అవగాహన ఒప్పందం ఉంటే వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు. -
రైతు భరోసా రూ.592.55 కోట్లు జమ
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు భరోసా పథకం కింద జిల్లాలో శనివారం వరకు 4,97,280 మంది రైతులకు రూ.592.55 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు వ్యవసాయ సాగుకు పెట్టుబడికి వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తోందని పేర్కొన్నారు. విడతల వారీగా రోజూ కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులను జమ చేస్తోందని తెలిపారు. భవిత కేంద్రం ఆకట్టుకునేలా ఉందినల్లగొండ : నల్లగొండలోని భవిత కేంద్రం అందరిని ఆకట్టుకునేలా ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని భవిత కేంద్రం ఆధునీకరణ పనులను శనివారం ఆమె పరిశీలించిన మాట్లాడారు. ఆధుననీకరణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. భవిత కేంద్రం పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉందని కేంద్రంలో ఉన్న విద్యార్థుల వివరాలను ఎంఈఓ అరుంధతిని కలెక్టర్ అడిగారు. అనంతరం కలెక్టర్ సీ్త్ర శక్తి భవన్ను, ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ రోహిత్, ఏపీఎం వినోద ఉన్నారు. 24న జాబ్ మేళారామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీలో ఈ నెల 24న అప్రెంటిషిప్, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆర్.దస్రూనాయక్, ప్రిన్సిపాల్ ఎం.షీబా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పారా మెడికల్ కోర్సు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నాన్ పారామెడికల్ కోర్సు విద్యార్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ తేవాలని సూచించారు. బీఎల్ఓలకు శిక్షణ నివ్వాలినల్లగొండ : బీఎల్ఓలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి బూత్స్థాయి అధికారుల విధులు, బాధ్యతలు, కొత్త ఓటర్ల నమోదు, సవరణలపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాస్టర్ ట్రైనర్లకు ఈఆర్ఓలు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో సాగర్ నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
విజ్ఞానంతో సామాజిక అంతరాలు దూరం
భువనగిరిటౌన్: సమాజంలో విజ్ఞానం ద్వారా మాత్రమే సామాజిక అంతరాలు దూరమవుతాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన పూలే, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం స్థానిక వెటర్నరీ శాఖ సమావేశం హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పూలే, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే చోటు నాలెడ్జ్ సెంటర్ మాత్రమే అని అన్నారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్ల సామాజిక ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. నాలెడ్జ్ సెంటర్ ద్వారా భవిష్యత్ తరాలకు మంచి విజ్ఞానాన్ని అందించాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ.. సమాజంలో సామాజిక పరివర్తన తీసుకురావడం కోసం పూలే, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ నిత్యం దినపత్రికలు చదవాలని అన్నారు. నాలెడ్జ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కావాలని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ మాట్లాడుతూ.. నాలెడ్జ్ సెంటర్లను ప్రోత్సహించేందుకు తప్పకుండా సహకారం అందిస్తామని అన్నారు. నాలెడ్జ్ సెంటర్కు ప్రతిరోజు దినపత్రికలు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. బానోతు భాస్కర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ ఎస్. మల్లారెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ కౌన్సిలర్ ఈరపాక నర్సింహ, సంతోషిమాత దేవాలయ కమిటీ సభ్యుడు నాగరం శంకర్, మాజీ కౌన్సిలర్ బట్టుపల్లి అనురాధ, నిర్వాహకులు స్వరూప, సురుపంగ శివలింగం, దొడ్డి యాదగిరి, బొట్ల రమేష్, నాయకులు ఇటుకల దేవేందర్ మాదిగ, మేడి కోటేష్, రాము, అందె సాయి, రమేష్ కోటి, ఎస్. జైపాల్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. సత్తయ్య, లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాజునాయక్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్నాయక్, నర్సింహనాయక్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
నకిలీ విత్తనాల కేసులో నిందితుల రిమాండ్
సూర్యాపేటటౌన్: నకిలీ పత్తి విత్తనాల కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న ఆత్మకూరు(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రాం బస్ స్టేజీ వద్ద సీసీఎస్, ఆత్మకూరు(ఎస్) పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన తండా నగేష్తో పాటు మరో ముగ్గురిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న అరుణోదయ విత్తనాల తయారీ సంస్థ ఎండీ సాంబశివరావు, మరో నిందితుడు చెవుల నరసింహులును శనివారం ఏపీలోని కర్నూలు జిల్లా కొసగి మండలం పల్లిపాడు వద్ద వ్యవసాయ క్షేత్రంలో అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి విత్తనాలకు కలరింగ్ చేసే మిషన్, వేయింగ్ మిషన్, ప్యాకింగ్ హీట్ మిషన్, ఖాళీ ప్యాకెట్లు, రెండు కిలోల లూజ్ నకిలీ పత్తి విత్తనాలు, బొలేరో వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
కట్టంగూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో కాలం గడుపుతుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సీజన్లోనైనా రైతులకు రావాల్సిన రైతు భరోసా పూర్తిగా అందజేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి తెలంగాణ ఏమైనా సీఎం జాగీరా అని ప్రశ్నించారు. గోదావరి బేసిన్లో 1000 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి.. మిగతావి ఏపీ ఎన్ని నీళ్లయినా దోచుకుపోవచ్చని సీఎం చెప్పటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అజ్ఞానంతో తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం తన చిల్లర మాటలతో రాష్ట్ర ప్రజల ముందు పరువు తీసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములుయాదవ్, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పోగుల నర్సింహ, నోముల వెంకటేశ్వర్లు, శ్రీపాద రామకృష్ణాచారి, పోగుల నర్సింహ, అంజయ్య, మల్లేష్ ఉన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ప్రత్యేక టైం టేబుల్..
క్రమశిక్షణతో కూడిన విద్యను అందించే ఈ గురుకుల కళాశాలలో ప్రత్యేక టైం టేబుల్ను అమలు పరుస్తారు. ఉదయం 5 గంటలకే వీరి దినచర్య ప్రారంభిస్తారు. 6 నుంచి 7 గంటల వరకు వ్యాయామంతో కూడిన ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. 8 నుంచి 8.45 గంటల వరకు నిన్న జరిగిన అంశాలపై సమీక్ష ఉంటుంది. 8.45 నుంచి 9 గంటల వరకు ప్రార్థన, 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.20 వరకు తరగతులు నిర్వహిస్తారు. 2.20 వరకు భోజన విరామం ఉంటుంది. 2.20 నుంచి 5.30 వరకు సివిల్స్కు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తారు. దీనిలో వీరికి ఆంగ్ల భాషపై ప్రావీణ్యంతో పాటు రీజనింగ్ ఇతర అంశాలను నేర్పిస్తారు. ఆ తరువాత అల్పాహారం ఇచ్చి సాయంత్రం 6.30 గంటల వరకు క్రీడల్లో శిక్షణ ఇస్తారు. 6.30 నుంచి 7.30 మధ్య ర్రాతి భోజన సమయం ఉంటుంది. ఆ తరువాత 9.30 అకడమిక్ స్టడీ అవర్స్, 9.30 నుంచి 10.30 డిఫెన్స్ స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. డిఫెన్స్ అంశాలపై వారానికి ఒకసారి టెస్ట్ నిర్వహిస్తారు. -
మినీ శిల్పారామంలో నృత్య ప్రదర్శన
భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోని పెద్ద చెరువు వద్ద గల మినీ శిల్పారామంలో శనివారం ప్రత్యేక ఆఫీసర్ కిషన్రావు ఆధ్వర్యంలో చిన్నారులచే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. సందర్శకులు నృత్య ప్రదర్శనను తిలకించి ఆనందించారు. జలనారాయణస్వామికి మంగళహారతులు భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం రాత్రి జలనారాయణస్వామికి మంగళహారతుల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణం, మధ్యాహ్నం సుమారు 4వేల మందికి అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
ఆర్మీ డిగ్రీ కాలేజీని బీబీనగర్లోనే ఏర్పాటు చేయాలి
మోత్కూరు: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్కేసర్కు తరలించిన బీబీనగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలను తిరిగి బీబీనగర్లోనే ఏర్పాటు చేయాలని కళాశాల పేరెంట్స్ కమిటీ సెక్రటరీ ఎర్రవెల్లి నర్సయ్య ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు. భువనగిరి పట్టణానికి వచ్చిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి.. యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలను ఈ జిల్లాలోనే నిర్వహించాలని, ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్ పర్యవేక్షణలో ఎన్డీఏ, యూపీఎస్సీ తరగతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు నాణ్యమైన విద్య అందించకుండా జరుగుతున్న కుట్రలో భాగమే కళాశాల తరలింపు అని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పేరెంట్స్ కమిటీ జాయింట్ సెక్రటరీ డి. తిరుమలేష్, స్వరూపారాణి తదితరులు ఉన్నారు. ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు వినతి -
పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : ప్రముఖ పుణ్య క్షేత్రాలకు ఈ నెల 26, 27వ తేదీల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి తెలిపారు. నల్లగొండలో శనివారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి యాత్రీకుల కొరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుకింగ్ కోసం నల్లగొండ : 9160360707, దేవరకొండ : 7382833031, మిర్యాలగూడ : 9298008888, సూర్యాపేట : 7382836177, కోదాడ : 7780433533, యాదగిరిగుట్ట : 9885103165 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. డిపోల వారీగా బస్సుల వివరాలు... ఫ నల్లగొండ నుంచి అలంపూర్, బాచుపల్లి, శ్రీరంగపూర్, జటాప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం. ఫ దేవరకొండ నుంచి పంచదేవపహాడ్, మక్తల్, మన్యంకొండ, కురుమర్తి, గంగాపూరం, ఊర్కొండపేట, గుల్బర్గా (ఖజా గరీబ్ నవాబ్ దర్గా), హాల్కట్ట (షరీఫ్ దర్గా). ఫ మిర్యాలగూడ నుంచి ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, కొమురెల్లి. ఫ సూర్యాపేట నుంచి అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది, పెనుగొండ, ద్వారకా తిరుమల. ఫ కోదాడ నుంచి అలంపూర్, బాచుపల్లి, శ్రీరంగపూర్, జటాప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం. ఫ యాదగిరిగుట్ట నుంచి కొండపోచమ్మ, వరంగల్, కొండగట్టు, వేములవాడ, సిద్దులగుట్ట. -
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
నడిగూడెం: బైక్ అదుపుతప్పి గుంతలో పడడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మోతె మండలం మామిళ్లగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం నారాయణగూడేనికి చెందిన చింత శ్రీకాంత్(27) మునగాల నుంచి మోతె మీదుగా ఖమ్మంకు బైక్పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఖమ్మం–సూర్యాపేట రహదారిపై మోతె మండలం మామిళ్లగూడెం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో రహదారి వెంట ఉన్న గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొని..మర్రిగూడ: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన యాచారం శ్రీరాములు(55) అదే గ్రామానికి చెందిన బోయపల్లి శంకర్ వద్ద డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీరాములు శుక్రవారం సంగారెడ్డిలో డీసీఎంలో బొగ్గు లోడ్ చేసుకుని తిరిగి వస్తుండగా.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వచ్చి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీరాములు రెండో కుమారుడు కూడా 2నెలల క్రితం నాంపల్లి మండల కేంద్రం నుంచి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తండ్రి, కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్ట్నార్కట్పల్లి: వేర్వేరుగా చోరీలను పాల్పడిన ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసినట్లు సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 22న ఎల్లారెడ్డిగూడెంలో జరిగిన ద్విచక్ర వాహనం చోరీ కేసులో నల్లగొండ మండలం శేషమ్మగూడెం గ్రామానికి చెందిన గాదరి సూర్యను, ఈ నెల 12న చెర్వుగట్టులో కుట్టు మిషన్ చోరీ కేసు కేసులో అదే గ్రామానికి చెందిన కసార్ల శివకుమార్ను నార్కట్పల్లి ఫ్లైఓవర్ అరెస్ట్ చేసి నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ రాము, కానిస్టేబుళ్లు గిరిబాబు, సత్యనారాయణ, శివశంకర్, తిరుమల్ను జిల్లా ఎస్పీ అభినందించినట్లు పేర్కొన్నారు. బోర్వెల్ వాహనంలో డీజిల్ చోరీ నకిరేకల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బోర్వెల్ వాహనం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున నకిరేకల్ పట్టణంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వాసవీనగర్లో సామ శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. తన బోర్వెల్ వాహనాన్ని ఆ ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. అతడు కుటుంబంతో కలిసి స్థానిక పద్మానగర్ జంక్షన్ వద్ద నివాసముంటున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా కారులో బోర్వెల్ వాహనం వద్దకు వచ్చి డీజిల్ ట్యాంక్కు వేసిన తాళాలు పగులగొట్టి సుమారు 300 లీటర్ల డీజిల్ దొంగిలించి పరారయ్యారు. చుట్టుపక్కల వారు శ్రీనివాస్రెడ్డికి సమాచారం ఇవ్వడంతో అతడు వాహనం వద్దకు చేరుకుని పరిశీలించి, అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఉరేసుకుని యువకుడి బలవర్మణం
భూదాన్పోచంపల్లి: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పోచంపల్లి మండలం జూలూరులో శనివారం జరిగింది. వివరాలు.. జూలూరు గ్రామానికి చెందిన యాకరి యాదయ్య, సుశీల దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్ (30) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి వివాహం కాలేదు. శనివారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లి ఇంటికి వచ్చిన ప్రశాంత్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చేసరికి ప్రశాంత్ ఉరికి వేలాడుతుండటం గమనించి ఇరుగుపొరుగు వారి సహాయంతో ప్రశాంత్ను కిందికి దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. సమాుచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. ప్రశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
ఆదర్శం.. ఆ ఉపాధ్యాయులు
ఫ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా.. ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని మక్తా కొత్తగూడెం గ్రామానికి చెందిన మట్టపల్లి సైదులు ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన తన కుమారులైన గణ సాత్విక్, మంజిత్లను తాను పనిచేస్తున్న పాఠశాలలోనే శుక్రవారం చేర్పించారు. అనంతరం వారికి ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్, స్కూల్ యూనిఫాం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేందుకే తన ఇద్దరి కుమారులను ఈ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. అడ్డగూడూరు: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను తాము చదువు చెబుతున్న పాఠశాలల్లోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నరేష్కు కుమార్తె రిషక, కుమారుడు రిషిదేవ్ ఉన్నారు. శుక్రవారం కుమార్తె రిషికను అదే పాఠశాలలోని 3వ తరగతిలో, కుమారుడు రిష్దేవ్ 2తరగతిలో చేర్చించారు. గతంలో వీరు తిరుమలగిరి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో చదివేవారని, విద్యార్థులకు సంపూర్ణ మనో వికాసానికి దోహదపడే బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. -
స్వర్ణగిరి క్షేత్రంలో కుంకుమార్చన
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో శుక్రవారం అష్టోత్తర శత నామాలతో విశేష కుంకుమార్చన సేవ కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ఉదయం స్వామి వారికి సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామర్చన, సేవ, నిత్య కల్యాణమహోత్సవం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కర్పూర మంగళహారతులు సమర్పించారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలు సీజ్ గరిడేపల్లి: మండల పరిధిలోని చవ్వారిగూడెం గ్రామంలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మిర్యాలగూడ శివారులోని తుమ్మడం గ్రామానికి చెందిన కొంత మంది చవ్వారిగూడెం గ్రామం నుంచి అనుమతులు లేని విత్తన బస్తాలను ఆటోలో తీసుకెళ్తుండగా నేరేడుచర్ల పట్టణ శివారులో పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీయగా అనుమతులు లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈమేరకు గరిడేపల్లి మండలం వ్యవసాయ అధికారి ప్రీతమ్కుమార్, హుజూర్నగర్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో చెవ్వారిగూడెం గ్రామానికి వెళ్లి తిప్పన రాంరెడ్డికి చెందిన గోదాంలో తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా ఉన్న 150బస్తాల వరి విత్తనాలను సీజ్ చేశారు. కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్, గరిడేపల్లి ఏఎస్ఐ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా మహిళల సంచారం
మోత్కూరు : అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహిళలను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని ముశిపట్ల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గురువారం గ్రామంలో దొంగతనానికి రెక్కి నిర్వహిస్తున్న నలుగురు మహిళలను గ్రామస్తులు గుర్తించి పట్టుకొని ఆరా తీశారు. మధ్యాహ్న సమయంలో గ్రామంలో సంచరిస్తుండగా అనుమానం వచ్చిన పలువురు గ్రామస్తులు వారిని ప్రశ్నించి నిలదీశారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం బలపడింది. ఈ క్రమంలో వారు తప్పించుకునే ప్రయత్నం చేయగా గ్రామపంచాయతీ వద్దకు తీసుకెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నలుగురు మహిళలను విచారించారు. వరంగల్ జిల్లాకు చెందిన వాసులుగా గుర్తించారు. వరంగల్లోని రెడ్డినగర్, హన్మకొండ, కాజిపేట, మడికొండలకు చెందిన తుర్పతి మైసమ్మ, స్వాతి, శారద, సునీతగా పోలీసులు గుర్తించారు. వారిపై ఇప్పటికే నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్లు ప్రొబెషనరీ ఎస్ఐ నోయల్ రాజు తెలిపారు. వారిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఐ వెల్లడించారు. పుస్తెలతాడు చోరీనార్కట్పల్లి : మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ సంఘటన నార్కట్పల్లి మండలం మాధవ ఎడవల్లి సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోతనేనిపల్లికి కమ్మంపల్లి స్వామి, అతడి భార్య అండాలు టీవీఎస్ ఎక్సెల్పై నార్కట్పల్లికి వస్తుండగా వెనక నుంచి బైక్పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అండాలు మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లాడు. పుస్తెలతాడు రోల్డ్గోల్డ్ అయినా, దానికి పావుతులం బంగారం పుస్తె, పావుతులం బంగారు గుండ్లు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. స్వామి పోలీసులకు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ రైతు మృతిమోత్కూరు : పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని దాచారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు అండెం కరుణాకర్రెడ్డి గురువారం తన పొలంలో పనులు చేస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య బాలమణి, ఓ కుమార్తె ఉన్నారు. శుక్రవారం గ్రామంలో జరిగిన అంత్యక్రియలో కుమార్తె శృతి తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టింది. ఫ పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి బలవన్మరణం
బీబీనగర్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని జైనపల్లి గ్రామశివారులో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా రఘునాఽథ్పల్లి మండలం మండేలగూడెం గ్రామానికి చెందిన డ్యగాల కిరణ్(26) హైదరాబాద్లోని ఆమెజాన్ ఆన్లైన్ కొరియర్లో ఉద్యోగం చేస్తున్నాడు. కిరణ్ 3సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఖర్చులు బాగా పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో అమ్మాయి అతడి నుంచి దూరమైంది. దీంతో కిరణ్ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం తెల్లవారుజామున బీబీనగర్ సమీపంలోని జైనపల్లి గ్రామపరిధిలోకి చేరుకొని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామస్తులు గమనించి పోలీస్లకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భార్య సంపాదనపై ఆధారపడుతున్నానని మనస్తాపంఫఉరేసుకుని ఆత్మహత్య సంస్థాన్ నారాయణపురం: చేసిన అప్పులు తీర్చలేకపోవడంతోపాటు, భార్య సంపాదనపై ఆధారపడుతున్నానని మనస్తాపనకు గురైన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సర్వేల్ గ్రామంలో చేసుకుంది. ఎస్ఐ జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన మహ్మద్ సిద్దిక్(26) అఫీజాబేగంలు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సిద్దిక్ కారు కొనుగోలు చేసి నడిపించేవాడు. తిరిగి దానిని అమ్మివేసి, క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సంవత్సరం క్రితం అఫిజాబేగంకు సర్వే ల్ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఉద్యోగం రావడంతో వీరు సర్వేల్కు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అప్పులు ఎక్కువ కావడంతోపాటు, భార్య సంపాదనపై ఆధారపడుతున్నానని సిద్దిక్ మనస్తాపానికి గురయ్యా డు. భార్య శుక్రవారం పాఠశాలకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సిద్దిక్ ఉరివేసుకున్నాడు. ఆమె పాఠశాల నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా వేలాతున్నాడు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్భువనగిరి : బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన సెల్ ఫోన్ను అప్పగించి ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణానికి చెందిన యానూష్ శుక్రవారం నల్లగొండకు వెళ్లేందుకు భువనగిరి బస్టాండ్కు వచ్చి నల్లగొండ డిపోకు చెందిన సెమీ డీలక్స్ బస్సు ఎక్కాడు. యానూష్ తన సెల్ ఫోన్ను బస్సులో మర్చిపోయి నల్లగొండ బస్టాండ్లో దిగి వెళ్లిపోయాడు. బస్సులో సెల్ఫోన్ను గుర్తించిన కండక్టర్ సీఎస్ రెడ్డి భువనగిరి బస్టాండ్కు వచ్చిన తరువాత విషయాన్ని స్థానిక కంట్రోల్కు వివరించారు. ఫోన్ మరిచి వెళ్లిపోయిన బంధువుకు సామాజిక కార్యకర్త కడారి వెంకటేశం సమక్షంలో ఫోన్ను అప్పగించారు. బస్సులో మరిచిపోయిన సెల్ఫోన్ను అప్పగించిన కండక్టర్ను పలువురు అభినందించారు. -
సోషల్ సర్వీస్!
ఫ సోషల్ మీడియా ద్వారా గ్రామస్తుల బాగోగులు ఫ ‘మన ఊరు–మన గుజ్జ’ పేరుతో పేజీల నిర్వహణ ఫ పుష్కరకాలంగా కృషిచేస్తున్న యువకుడు శశికాంత్ ఫేస్బుక్... యూట్యూబ్... ఇన్స్టాగ్రామ్... వాట్సాప్... ఇలా సోషల్మీడియాను యువత సరదా కోసమో, వినోదం కోసమో వినియోగిస్తారనే భావన అనేక మందిలో ఉంటోంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం గుజ్జ గ్రామానికి చెందిన శ్రీరామోజు శశికాంత్ మాత్రం వీటి వినియోగంతో సామాజిక సేవ చేస్తున్నారు. డిగ్రీ చేసిన ఈయన ‘మన ఊరు–మన గుజ’ పేరుతో ఆయా వేదికల్లో పేజీలు నిర్వహిస్తూ గ్రామానికి, గ్రామస్తులకు సేవ చేస్తున్నారు. 12 ఏళ్లుగా అప్రతిహతంగా తన కృషిని కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆలోచన మాత్రమే తనదని, ఆచరణలో మాత్రం గ్రామం మొత్తం పాలుపంచుకుంటోందని శశికాంత్ చెబుతున్నారు – సాక్షి ప్రతినిధి, నల్లగొండగుజ్జ నుంచి దేశ విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు. వారితో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఎప్పటికప్పుడు ఊరి విశేషాలను చేరవేయడం.. అవసరమైతే వాళ్లూ ఓ చేయి వేసి చేయూత అందించేలా చేయడం ఈ ‘సోషల్ మీడియాల’ గొప్పదనం. గుజ్జ యువతలో సేవాదృక్పఽథాన్ని నింపేలా 2013 నుంచి ఈ ‘సామాజిక ఉద్యమం’ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గుజ్జ గ్రామస్తులకు ఊరిలో ఏం జరుగుతోంది? ఏయే పండుగలు ఎలా జరుగుతున్నాయి? తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఈ పేజ్లు అందిస్తున్నాయి. ఎందరో ఆపన్నులకు ఆసరాగా నిలిచి... ‘మన ఊరు – మన గుజ్జ్ఙ వేదికను శశికాంత్ ఆ గ్రామంలో ఉన్న, గ్రామం నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తుల సహకారంతో ముందుకు నడిపిస్తున్నారు. హఠాన్మరణం పొందిన వారి కుటుంబాలకు, అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రిల్లో వైద్యం అవసరమైన వారికి ఆర్థిక సహాయం, తోడ్పాటు అందేందుకు ఈ శ్రీమన ఊరు–మన గుజ్జ’ పేజీలు పనిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన గంగదేవి తిరుమలేష్ భార్య, నలుగురు పిల్లలకు, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నల్లగంటి చందుకు, మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆస్పత్రిలో చేరిన మంగ లింగమ్మకు వైద్యం కోసం, క్రికెట్లో ప్రతిభ కనబరుస్తున్న గోపరాజు సాయి అర్జున్కు అవసరమైన డబ్బు సమకూర్చడంలోనూ ఈ పేజీలు కీలకపాత్ర పోషించాయి. వీరితో పాటు గ్రామంలో ఉన్న వృద్ధులు, విద్యార్థుల కోసమూ అనేక సహాయ కార్యక్రమాలు వీటి ద్వారా జరుగుతున్నాయి. సంప్రదాయ, సంస్కృతులు చాటిచెప్పేలా..శశికాంత్ గుజ్జ గ్రామస్తులతో కలిసి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా సంప్రదాయ, సంస్కృతులు అందరికీ చాటిచెప్పడానికీ కృషిచేస్తున్నారు. వాటికి అద్దం పట్టేలా బతుకమ్మ పాటల పోటీల నిర్వహణ, గ్రామ చరిత్ర, గొప్పదనం వివరిస్తూ.. రెండు బతకమ్మ పాటలు రాసి, పాడించి చిత్రీకరణ చేయించారు. జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, వారి త్యాగాలు ఈ తరం యువతకు తెలిసేలా చేస్తూ వారిలో చైతన్యం నింపుతున్నారు. సేవ చేయాలన్న తపన, ఊరి కోసం పని చేయాలన్న సంకల్పం వారిలో పెరిగేందుకు కృషిచేస్తున్నారు. గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహణఈ సోషల్ మీడియా వేదిక ద్వారా పలువురిని ఆకర్షిస్తున్న శశికాంత్ వారితో గ్రామంలో అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ మహిళల స్వయం ఉపాధి, స్వయం సమృద్ధి కోసం అవసరమైన ప్రాథమిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో గుజ్జ రైతు వేదిక వద్ద స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తోట రాము సహకారంతో వృత్తి నైపుణ్యాల పెంపుదల, వివిధ పథకాల కింద రుణాలు పొందే అవకాశం, కుటీర పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్ సాయం పొందే విధానాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ వర్గాల్లో ఉన్నతంగా ఉన్న వారి సహాయ, సహకారంతో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతోనే సేవ గ్రామస్తుల సహకారంతోనే ‘మన ఊరు– మన గుజ్జ’ సోషల్ మీడియాను ప్రారంభించాను. గ్రామస్తులు ఒక్కొక్కరుగా చేరడంతో సోషల్ మీడియాలో గ్రామస్తులమంతా టీంగా ఏర్పడ్డాం. సహాయ, సహకారాల్లో గ్రామం మొత్తం భాగస్వామ్యమవుతోంది. రాష్ట ప్రభుత్వం గుర్తించి ప్రతి గ్రామ పంచాయతీకి సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేయాలన్నది నా ఆకాంక్ష. అవకాశం ఉన్న వారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మెరుగైన సేవలు అందిస్తాం. – శ్రీరామోజు శశికాంత్ -
22న ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలుర జూనియర్ ఫుట్బాల్ జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షుడు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1–1–2009 నుంచి 31–12–2011 మధ్య జన్మించిన యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లా వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో రిపోర్టు చేయాలని తెలిపారు. క్రీడాకారులు వారి ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, ఫుట్బాల్ కిట్ తో హాజరు కావాలని కోరారు. నల్లగొండలో ఎంపికై న జిల్లా జట్టు ఈనెల 28 నుంచి జూలై1వ తేదీ వరకు నిజామాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. మట్టపల్లిలో విశేష పూజలుమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం విశేషపూజలు కొనసాగాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ సేవను కృష్ణానది వద్ద ప్రహ్లాద ఘాట్కు తరలించి హారతి పూజలు నిర్వహించారు. -
ఇంటర్లోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి
నల్లగొండ : బాలికలు ఇంటర్ స్థాయిలోనే మంచి లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం ఆమె నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి సందర్భంగా మాట్లాడారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బైపీసీ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. ఏ పాఠశాల నుంచి వచ్చారని? పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయని ? జీవితంలో మీ ఆశయాలు ఏంటి? అని కలెక్టర్ ప్రశ్నించారు. ఇంజనీరింగ్లో మంచి కోర్సులు సంపాదించేందుకు, భవిష్యత్లో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన మెళకువలను బోర్డుపై రాసి వివరించారు. కళాశాలలో నూతన ప్రవేశాలు, విద్యార్థుల సంఖ్య, కళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రిన్సిపాల్ సుధారాణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటర్మీడియట్ బైపీసీ ఇంగ్లిష్ మీడియం విద్యార్థినులకు డిక్షనరీలను అందజేశారు. కళాశాలలో ఖాళీ స్థలంలో విద్యార్థినులు చదువుకునేందుకు గాను షెడ్ నిర్మాణానికై స్థలాన్ని పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తాం స్వయం సహాయక మహిళా సంఘాలు పరిశ్రమల యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె నల్లగొండలోని టీటీడీసీలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులు ఇందిరా మహిళా శక్తి సంఘాలుగా ఏర్పాటై వివిధ రకాల యూనిట్ల తో పరిశ్రమల ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే రుణాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఏపీడీ శ్రవణ్కుమార్, అలీప్ సంస్థ సెక్రటరీ పద్మజ, కమిటీ సభ్యురాలు పద్మావతి, సీనియర్ ప్రోగ్రాం అధికారి లక్ష్మీప్రియ, ప్రోగ్రాం ఆఫీసర్ శ్యాంసుందర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
భూ సమస్యలపై 42,534 దరఖాస్తులు
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు శుక్రవారంతో ముగిసాయి. వివిధ భూ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా 42,534 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కవగా మిస్సింగ్ సర్వే నంబర్లపై 14803 దరఖాస్తులు వచ్చాయి. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు ఈ నెల 3న ప్రారంభించారు. సదస్సుల నిర్వహణకు ప్రతి మండలంలో రెండు బృందాలనే ఏర్పాటు చేశారు. ఒక బృందానికి తహసీల్దార్, మరో బృందానికి డిప్యూటీ తహసీల్దార్ బాధ్యులుగా వ్యవహరించారు. రోజుకు రెండు గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. తమకున్న రకరకాల భూ సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. సదస్సుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. సదస్సులను ఎప్పటికప్పుడు కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్ఓ, ఆర్డీఓలు పర్యవేక్షించారు. రెవెన్యూ సదస్సులు, దరఖాస్తుల వివరాలు ఇలా.. జిల్లాలో మండలాలు 33 రెవెన్యూ గ్రామాలు 550వచ్చిన దరఖాస్తులు 42,534మిస్సింగ్ సర్వే నెంబర్లపై 14,803పెండింగ్ మ్యూటేషన్లు, కోర్డు ఆర్డర్లు అమలు చేయాలని 802డిజిటల్ సంతకం పెండింగ్పై 795పేరు, విస్తీర్ణం తప్పులపై 2,998నిషేధిత జాబితాపై 808అసైన్డ్ భూములపై 6,539ఫౌతిపై 1,400 భూ సేకరణపై 56 ఇతర సమస్యలపై 14,333 ఫ మిస్సింగ్ సర్వే నంబర్లపైనే అధికంగా.. ఫ ముగిసిన రెవెన్యూ సదస్సులు -
పేదలకు అండ.. ఎర్రజెండా
మిర్యాలగూడ : పేదలకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ మండల 9వ మహాసభలో ఆయన మాట్లాడారు. సీపీఐ ఏర్పడిన వంద సంవత్సరాల కాలంలో పేదల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడిందన్నారు. సీపీఐ చేసిన త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి పోరాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. స్థానిక ఫ్యాక్టరీల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, యాదాద్రి పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం అందించడంతోపాటు ప్లాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాద్యక్షుడు ఎండీ.సయ్యద్, మండల అధ్యక్షుడు ధీరావత్ లింగానాయక్, అంజనపెల్లి రామలింగం, జిల్లా యాదగిరి, నాయకులు జమ్మల కోటయ్య, శాంతి, పోలేపల్లి ఉదయ్, బుజ్జి లింగానాయక్, పోలేపల్లి మమత, లక్ష్మయ్య, రవి, అన్నపూర్ణ, నిర్మల, వెంకటయ్య పాల్గొన్నారు. -
కేతేపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
నల్లగొండ: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కేతేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వర్లు కేతేపల్లిలోని ఇంటి నంబర్ 2– 97/1 కు సరైన పత్రాలు లేకుండానే నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసి, విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానాన్ని వదిలి వెళ్లకూడదని సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. భూగర్భ శాస్త్రం.. అవకాశాల పెన్నిధి నల్లగొండ టూటౌన్: విద్యార్థుల బంగారు భవిష్యత్కు భూగర్భశాస్త్రం అవకాశాల పెన్నిధి అని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం ఎంజీ యూనివర్సిటీలోని భూగర్భ శాస్త్ర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన బ్రోచర్ను ఆయన విడుదల చేసి మాట్లాడారు. భూగర్భ శాస్త్రంలో రాణించిన విద్యార్థులకు జియాలజిస్ట్, హైడ్రోజియాలజిస్ట్, మైనింగ్ జియాలజిస్ట్, జియోసైంటిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, వై.ప్రశాంతి, కె.ప్రేమ్ సాగర్, ఆంజనేయులు, మధుసూదన్రెడ్డి, మచ్చేందర్ పాల్గొన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యత పాటించాలినాంపల్లి: కిష్టరాయిన్పల్లి రిజర్వాయర్ పనుల్లో నాణ్యత పాటించాలని నల్లగొండ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సంబంధిత అధికారులకు సూచించారు. నాంపల్లి మండలంలోని లక్ష్మణాపురం గ్రామంలో చేపట్టిన కిష్టరాయిన్పల్లి రిజర్వాయర్ పనులు, ప్రాజెక్ట్ పరిధిలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. త్వరలోనే రైతులందరి భూములకు పరిహారం అందేవిధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్లో ఏమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పనులకు ఆటంకం కలిగించొద్దని చెప్పారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్సీ, చండూర్ డివిజన్ ఇన్చార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి, డీఈ జాన్నాయక్, తహసీల్దార్ దేవసింగ్, సిబ్బంది ఉన్నారు. ఇబ్రహీంపేటలో ఎన్ఎస్పీ భూముల సర్వేహాలియా : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామ పరిధిలో ఉన్న ఎన్ఎస్పీ భూములను రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు శుక్రవారం సర్వే చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేశాల మేరకు హాలియా ఇన్చార్జ్ తహసీల్దార్ రఘు ఆధ్వర్యంలో మిర్యాలగూడ డివిజన్ సర్వేయర్ పోకల విజయ్తో పాటు మరో 9మంది సర్వేయర్లు కలిసి సర్వే చేపట్టారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 16, 17, 68, 72, 482, 484, 485, 486, 490, 491లలో ఉన్న సుమారు 105 ఎకరాల భూమిని సర్వే చేశారు. కాగా ఎన్ఎస్పీ భూములను సర్వే చేసే సమయంలో తమ భూముల సర్వే చేస్తున్నారని భావించిన సన్న, చిన్నకారు రైతులు సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటుండగా పోలీసులు, అధికారులు వారికి సర్ది చెప్పారు. ఎన్ఎస్పీ భూముల సర్వే పోలీసుల పహారా మధ్య జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హాలియా సీఐ సతీష్రెడ్డి నేతృత్వంలో పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. కార్యక్రమంలో హాలియా సీఐ సతీష్రెడ్డి, ఆర్ఐ నవీన్కుమార్, సర్వేయర్లు సైదులు, రామనర్సు, స్వప్న, రాణా ప్రతాప్, శ్రీనివాస్, ముత్తయ్య, జైహింద్, విప్లవ జ్యోతి, పోలీసులు తదితరులు ఉన్నారు. -
నార్కట్పల్లి డిపోకు పెరగని బస్సులు
బస్సులను పెంచేందుకు ఆదేశాలు రాలేదు నార్కట్పల్లి డిపోలో బస్సుల సంఖ్య పెంచాలని పైఅధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కొత్త రూట్లు ఏర్పాటు చేస్తే బస్సులను పెంచే ఆలోచన ఉంటుంది. నల్లగొండ డిపోలో సర్వీస్ అయిపోయిన బస్సులను తొలగించి ఎలక్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. నల్లగొండ డిపోలో కరెంట్ పనులు పూర్తయ్యాక చార్జింగ్ బస్సులను ప్రారంభిస్తాం. – శ్రీనాథ్, నార్కట్పల్లి ఇన్చార్జి డీఎం నార్కట్పల్లి : నిజాం కాలంలో ఏర్పాటైన నార్కట్పల్లి బస్సు డిపో.. నేడు అవసాన దశలో ఉంది. రెండేళ్ల క్రితం వరకు ఈ డిపోలో 67 బస్సులు ఉన్నాయి. వీటిలో 2 సూపర్ లగ్జరీ, 11 ఎక్స్ప్రెస్, 54 పల్లె వెలుగు సర్వీసులు ఉన్నాయి. డిపోలో ఉన్న కొన్ని సర్వీస్ల వల్ల నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు డిపోలోని బస్సులను జిల్లాలోని ఇతర డిపోలకు పంపారు. సిబ్బందిని సర్దుబాటు చేశారు. డిపో తొలగిస్తారనే ప్రచారం కూడా సాగడంతో.. ఆ పార్టీల నేతలు ఆందోళనలు చేయడంతో బస్సులను పూర్తిగా తొలగించకుండా కేవలం 15 బస్సులతో కొనసాగిస్తున్నారు. నల్లగొండ డిపో బస్సులు ఇక్కడికి వస్తాయని.. ఇటీవల నల్లగొండ డిపోకు దాదాపు 40 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. అక్కడ స్థలం లేక వాటిని నార్కట్పల్లి డిపోలు ఉంచారు. నల్లగొండలో చార్జింగ్ పాయింట్ ప్రారంభిస్తే.. నల్లగొండ డిపోలో స్థలం సరిపోదు. నల్లగొండ డిపోలో డీజిల్తో కొనసాగే సర్వీలను నార్కట్పల్లి డిపోకు పంపుతారని దాంతో నార్కట్పల్లి డిపోకు పూర్వ వైభవం వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. -
‘ఈవీ’లకు నో పవర్!
చార్జింగ్ సౌకర్యం లేక రోడ్డెక్కని ఎలక్ట్రిక్ బస్సులు తాత్కాలిక లైన్తో తలెత్తనున్న సమస్యలు నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డు సబ్స్టేషన్ నుంచి 133/11 కేవీ ప్రత్యేక లైన్ను డిపో వేయాల్సి ఉండగా.. ఆ విషయంలో కాంట్రాక్టు సంస్థ అలసత్వం ప్రదర్శిస్తోందని అధికారులే చెబుతున్నారు. అయితే బస్టాండ్ సమీపంలోని విద్యుత్ లైన్ నుంచి తాత్కాలికంగా డిపో వరకు లైన్ వేసేందుకు సిద్ధమయ్యారు. దానివల్ల మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం సుబాష్ విగ్రహం నుంచి వెళ్లే 133/11 కేవీ లైన్ పరిధిలో చాలా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఆయా ట్రాన్స్ఫార్మర్లలో ఎక్కడ సమస్య వచ్చినా, సబ్స్టేషన్లో ఎల్సీ తీసుకుంటారు. ఆ సమయంలో ఆర్టీసీ ఛార్జింగ్ యూనిట్కు కూడా విద్యుత్ నిలిచిపోతుంది. దీంతో బస్లకు ఛార్జింగ్ విషయంలో అంతరాయం ఏర్పడుతుంది. జనరేటర్ ఉన్నా కొంత సమయం వరకే వస్తుంది. అందుకే మెయిన్ సబ్స్టేషన్ నుంచి ప్రత్యేక్ లైన్ కోసం ఆర్టీసీ.. విద్యుత్ శాఖకు డబ్బులను చెల్లించింది. కానీ కాంట్రాక్టు సంస్థ ఆ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తోంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సు(ఈవీ)లకు చార్జింగ్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన చార్జింగ్ కోసం విద్యుత్ లైన్, సబ్స్టేషన్ నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఆ పనుల కోసం మూడు నెలల కిందటే టెండర్లు పిలిచినా కాంట్రాక్టు సంస్థ అలసత్వంతో ఈవీ బస్సులు రోడ్డెక్క లేదు. దీంతో నల్లగొండ డిపోకు కేటాయించిన 40 ఈవీ బస్లను నార్కట్పల్లి డిపోలో భద్రపరిచారు. సూర్యాపేట, నల్లగొండ డిపోలకు ఒకేసారి ఈవీ బస్లు వచ్చాయి. 11 కేవీ లైన్, సబ్స్టేషన్, ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణ బాధ్యతలను రెండుచోట్ల ఒకేసారి కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. సూర్యాపేటలో ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయి బస్లు రోడ్డెక్కగా, నల్లగొండలో మాత్రం పనుల్లో జాప్యం జరుగుతోంది. పనుల్లో ఎడతెగని జాప్యం ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీిసీ ఈవీ బస్లను తీసుకొస్తోంది. అందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట డిపోలకు ఎలక్ట్రిక్ బస్లను మంజూరు చేసింది. అందుకోసం ఈ రెండు డిపోల్లో ప్రత్యేకంగా 133/11 కేవీ లైన్, సబ్స్టేషన్ నిర్మించాల్సి ఉంది. వాటితోపాటు జనరేటర్ల ఏర్పాటు, ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఒకే కాంట్రాక్టర్ కాంట్రాక్టు పొందినప్పటికీ సూర్యాపేటలో పనులను ఎప్పుడో పూర్తి చేశారు. ఈ నెల 9వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూర్యాపేటలో ఈవీ బస్సులను ప్రారంభించారు. నల్లగొండ డిపోలో మాత్రం ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నా, ప్రత్యేక లైన్, సబ్స్టేషన్ పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. ఫ ప్రత్యేక లైన్, సబ్స్టేషన్ ఏర్పాటులో అలసత్వం ఫ నల్లగొండ డిపోకు 15 రోజుల క్రితం వచ్చిన 40 ఎలక్ట్రిక్ బస్సులు ఫ వాటిని నార్కట్పల్లి డిపోలోఉంచిన అధికారులు ఫ కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతో డిపో దాటని బస్సులు కాంట్రాక్ట్ సంస్థకు నోటీసులు ఇచ్చాం నల్లగొండ డిపో వద్దకు విద్యుత్ లైన్ ఏర్పాటు, సబ్స్టేషన్ నిర్మాణ పనుల విషయంలో జాప్యం చేస్తుండటంతో కాంట్రాక్ట్ సంస్థకు నోటీసులు ఇచ్చాం. హైదరాబాద్ రోడ్డు నుంచి స్తంభాలు వేసి, లైన్ ఏర్పాటు చేయడానికి సమయం పడుతుందని కాంట్రాక్ట్ సంస్థ అంటోంది. ప్రస్తుతం తాత్కాలికంగా సుభాష్ విగ్రహం వద్ద నుంచి వెళ్తున్న 133/11 కేవీ లైన్ నుంచి నుంచి ఆర్టీసీ డిపోకు లైన్ వేసే పనులు ప్రారంభిస్తామని చెప్పింది. ప్రత్యేకంగా లైన్ కావాలని ఆర్టీసీ అధికారులు అడిగారని.. ఆ పనులను కూడా త్వరలో ప్రారంభించి, రెండు నెలల్లో పూర్తయ్యేలా చూస్తామని కాంట్రాక్ట్ సంస్థ చెప్పింది. – వెంకటేశ్వర్లు, ట్రాన్స్కోఎస్ఈ, నల్లగొండ నెలాఖరు వరకు రోడ్డెక్కేది అనుమానమే ఎలక్ట్రిక్ బస్సులు జిల్లాకు చేరి 15 రోజులు కావస్తోంది. విద్యుత్ లైన్, సబ్స్టేషన్ పనులేవీ చేపట్టలేదు. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించి.. రాత్రింబవళ్లు పనిచేసినా ఈ నెలాఖరు వరకు కూడా అవి పూర్తికావు. బస్ డిపోలో ఇప్పటివరకు జనరేటర్లను ఏర్పాటు చేసి, ఛార్జింగ్ పాయింట్ల పనులను మాత్రమే చేపట్టారు. విద్యుత్ లైన్, సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తేనే వాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటివరకు బస్సులు డిపోకు పరిమితం కావాల్సిందే. -
శిశు మరణాలపై అవగాహన కల్పించాలి
నల్లగొండ: గ్రామీణ ప్రాంత మహిళల్లో శిశు మరణాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శిశు మరణాలపై శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ప్రసవాలకు మధ్య దూరం ఎక్కువగా లేకపోవడంతో శిశు మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంట వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టబోయే బిడ్డ సరైన విధంగా పుట్టకపోవడం, బరువు తక్కువగా ఉండడం, పుట్టిన తర్వాత మరణించేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించేలా, పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ మాతృనాయక్, కృష్ణవేణి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
‘బెస్ట్ అవైలబుల్’కు విద్యార్థుల ఎంపిక
నల్లగొండ: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసించేందుకు గిరిజన విద్యార్థుల ప్రవేశాలకు డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. శుక్రవారం పానగల్ రోడ్డులోని గిరిజన వసతి గృహంలో డ్రా నిర్వహించారు. జిల్లాలోని ఆరు ప్రైవేట్ పాఠశాలల్లో 34 మంది బాలబాలికలకు లాటరీ ద్వారా సీట్లు కేటాయించారు. మొత్తం 184 దరఖాస్తులు రాగా 34 సీట్లు మాత్రమే కేటాయించడంతో సీట్లు ఎందుకు తగ్గించారంటూ పిల్లల తల్లిదండ్రులు అధికారులను ప్రశ్నించారు. గతంలో వంద సీట్లు ఉండగా ప్రస్తుతం కోత విధించారని అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, ఏఓ పార్థసారధి, ఏటీడీఓ శ్రీనివాస్, రామకృష్ణ, ప్రవీణ్నాయక్, సక్రునాయక్ పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు.. నల్లగొండ: 2025– 26 సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1, 5 తరగతుల్లో ప్రవేశానికి శుక్రవారం నల్లగొండ ఉదయాదిత్య భవన్లో డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ లక్కీ డ్రా తీశారు. 1వ తరగతిలో ప్రవేశానికి 134 మంది విద్యార్థులు, 5వ తరగతిలో ప్రవేశానికి 137 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మిర్యాలగూడ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె దామరచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, మందుల స్టాక్ను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. సమయానుకూలంగా వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, వైద్యం కోసం వచ్చిన రోగులను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకోని వైద్యం అందించాలని, కేసులు సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి లేదా ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని ఆకస్మింగా తనిఖీ చేసి పిల్లలను పరిశీలించారు. అంతేకాక నిర్మాణంలో ఉన్న టాయ్లెట్స్ పనలను పరిశీలించారు. అంతకుముందు కేజీబీవీని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. ఆమె వెంట సబ్కలెక్టర్ నారాయణ్అమిత్, మండల ప్రత్యేకాధికారి పత్యానాయక్, డీఈఓ భిక్షపతి, అధికారులు ఉన్నారు. భవిత కేంద్రం పరిశీలన మిర్యాలగూడ : భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలందరినీ నమోదు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలకు కృత్యాధార పద్ధతుల్లో విద్యను అందిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యాశాఖ ద్వారా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఆమె వెంట డీఈఓ భిక్షపతి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా వెంకటరమణ
కోదాడరూరల్ : కోదాడ మండల పరిధిలోని కాపుగల్లుకు చెందిన ముత్తవరపు వెంకటరమణ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) వారు బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయనను ఎంపిక చేశారు. ఇండియాలో ఫార్మసీ ఎడ్యుకేషన్ను అభివృద్ధి చేయడం, నూతన కళాశాలల మంజూరుతో పాటు రెన్యువల్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించనున్నారు. కాపుగల్లుకు చెందిన ముత్తవరపు భాస్కర్రావు, కుమారి దంపతుల కుమారుడు వెంకటరమణ 10వ తరగతి వరకు కోదాడలో, ఇంటర్మీడియట్ విజయవాడలో, బీఫార్మసీ కర్ణాటకలో, ఎం ఫార్మసీ అన్నామలై యూనివర్సిటీలో, పీహెచ్డీ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆయన ప్రస్తుతం మొయినాబాద్లోని ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్గా, నేషనల్ ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు అభినందించారు. -
‘మిషన్ పరివర్తన్’తో.. యువతలో మార్పు
మత్తుకు దూరం చేసి.. కొలువులకు దగ్గర చేశాం ఫ ‘యువతేజం’తో వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఫ గంజాయి రహిత జిల్లాగా మార్చుడమే లక్ష్యంగా పని చేస్తున్నాం ఫ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ఫ ‘సాక్షి’తో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఫ ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి ప్రత్యేకంగా కేసులు ఫాలోఅప్ కేసులు నమోదు చేయడం, వదిలేయడం కాకుండా కేసులను ఫాలోఅప్ చేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించేలా కృషి చేస్తున్నా. ఇదే విషయాన్ని మా సిబ్బందికి చెబు తున్నా. తద్వారా ఛార్జిషీట్లు పక్కాగా నమోదు చేయడంతో కోర్టుల్లో శిక్షలు పడేలా చూస్తున్నాం. గతేడాది ఆరు నెలల్లో 6 కేసుల్లో, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 9 కేసుల్లో జీవిత కారాగార శిక్ష పడింది. యువతను దారిలో పెడుతున్నాం జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. జిల్లాకు వచ్చిన మొదట్లోనే ఈ విషయాన్ని గుర్తించా. అప్పుడే గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టా. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టాం. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల తరహాలో గంజాయి టెస్ట్ కిట్లను అందించి గంజాయికి బానిస అవుతున్న యువతను గుర్తించి దారిన పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాదాపు 400 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో సైకియాట్రిస్ట్లతో కౌన్సెలింగ్ ఇప్పించాం. గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే ప్రభావం వివరించి మార్పు తెచ్చాం. హెల్త్ క్యాంపులతో 20 మందికి అత్యవసర చికిత్స పోలీసు కుటుంబాల సంక్షేమం, ఆరోగ్యాగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించి అత్యవసర చికిత్స అవసరమైన వారిని గుర్తించి వైద్య సేవలు అందించాం. తద్వారా దాదాపు 20 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగాం. మిగతా వారికి వైద్య సహాయం అందించాం. చందంపేట మండలంలోని పోలేపల్లిలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించి గిరిజనులను ఆదుకున్నాం. -
సైబర్ మోసాలకు గురైతే ఫిర్యాదు చేయాలి
నల్లగొండ : సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని.. మోసపోయామని తెలిసిన వెంటనే 1930 నంబర్కు ఫోన్ద్వారా ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ వారియర్స్తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మెసేజ్లు ఓపెన్ చేయొద్దని సూచించారు. మోసపూరితమైన ఆన్లైన్ యాప్లలో అధిక వడ్డీ ఆశ చూపి, పెట్టుబడికి రెట్టిపు సొమ్ము వస్తాయని అనేక మంది అమాయకులను మోసం చేస్తున్న కేసులు నమోదు అవుతున్నాయని.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి
మిర్యాలగూడ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి అన్నారు. గురువారం మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1438 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని అందులో 229 హైస్కూల్స్, 117యూపీఎస్, 1100కి పైగా ప్రైమరీ స్కూల్స్, 27 కేజీబీవీలు, 17 మోడల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. ఆగస్టు 31తో అడ్మిషన్ల గడువు ముగుస్తుందని.. అప్పటిలోగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాలలు 24 ఉన్నట్లు గుర్తించామని వాటిని మూసివేస్తామని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పది పాఠశాలలను తిరిగి పునః ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆయన వెంట ఎంఈఓ బాలునాయక్ ఉన్నారు. -
ప్రైవేట్లో ఫీజుల దోపిడీ
నోటీసులతో సరిపెట్టుకుంటున్న అధికారులు.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నా వాటి అనుమతులు, ఇతర శాఖల పర్మీషన్లు విషయాలపై విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనుమతి లేని పాఠశాలలను గుర్తించి కేవలం నోటీసులు జారీ చేసి వదిలేస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం, ఫీజుల నియంత్రణ చేయకపోవడం, ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎల్కేజీకి రూ.40వేల పైమాటే.. ఫ అనుమతి లేకుండానే పాఠశాలల ఏర్పాటు ఫ ఒకే పర్మిషన్తో అనేక బ్రాంచ్లు ఫ పుస్తకాలు, యూనిఫాం, షూ స్కూల్లోనే అమ్మకం ఫ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు మిర్యాలగూడ : సేవా దృక్పథంతో ఉండాల్సిన విద్యా వ్యవస్థ వ్యాపార రంగంగా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పరడడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు. తాము పడ్డ కష్టం తమ పిల్లలు పడవద్దని, ఎంత ఖర్చయినా సరే మంచిగా చదివించాలనే తల్లిదండ్రుల కలలను ఆసరా చేసుకున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అందిన కాడికి దోచుకుంటున్నాయి. ప్లే, టెక్నో, సీబీఎస్ఈ, ఒలింపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ పేరిట తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయలు ఫీజులు గుంజుతున్నాయి. పైగా పాఠశాలల్లోనే పుస్తకాలు యూనిఫాం, టై, బెల్టులు కొనాలని నిబంధన పెట్టి వాటి పేరిట కూడా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం అనమానాలకు తావిస్తోంది. ట్యాగ్లు పెట్టి మరీ.. ప్రైవేట్ పాఠశాలలకు ప్లే, టెక్నో, సీబీఎస్ఈ, ఒలింపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ వంటి పేర్లతో కార్పొరేట్ ట్యాగ్లు పెట్టి మరీ దోపిడీ చేస్తున్నారు. వీటికి అనుమతులు లేకపోయినప్పటికీ అనధికారికంగా ట్యాగ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా క్లాస్లు బోధిస్తామని చెప్పి వాటి పేరిట వేలాది రూపాయలు గుంజుతున్నారు. వీటి కోసం ప్రత్యేక పుస్తకాలను తమ పాఠశాల పేరుతో ముద్రించి వాటిని కొనుగోలు చేసేలా తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తీరా పుస్తకాలను కొన్నాక ఆ పుస్తకాల సిలబస్ను బోధించే పాపాన పోవడం లేదు. జిల్లాలో 369 ప్రైవేట్ పాఠశాలలు.. జిల్లాలో 369 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అనుమతి లేకుండానే చాలా పాఠశాలు నడుస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో 1,25,572 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో బయటి మార్కెట్లో దొరికే వస్తువుల ధరలకు ప్రైవేట్ పాఠశాలల్లో లభించే వాటికి చాలా వ్యత్యాసం ఉంటోంది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు పుస్తకాలు, బూట్లు, యూనిఫాం, టై, బెల్టు, గుర్తింపు కార్డులు తదితర వాటి పేరుతో ఫీజులు కాకుండా రూ.4 నుచి రూ.10వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విక్రయించే పాఠ్య పుస్తకాలు మార్కెట్లో ఎక్కడా దొరకకపోవడంతో గత్యంతరం లేక వాటినే తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇతర పేర్లతో స్కూల్స్ నిర్వహణ ప్రైవేట్ పాఠశాలల్లో చాలా వరకు అనుమతులు ఉండడం లేదు. మూతపడ్డ పాఠశాల అనుమతుల పేరిట తమ సొంత పేరు పెట్టుకుని పాత పాఠశాల అనుమతితోనే కొనసాగిస్తున్నారు. ప్రతి మండలంలో ఇలా 10 నుంచి 15 పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, హాలియా ప్రాంతాల్లో బడా కార్పొరేట్ పాఠశాలలు వాటి బ్రాంచ్లను అనధికారికంగా ఏర్పాటు చేస్తున్నాయి. అంతేకాకుండా అనుమతులు లేకుండానే ప్లే గల్లిగల్లీలో స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు, ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో కూడా పాఠశాలలను నడిపిస్తున్నారు. కనీసం సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచుకోకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్కూల్ ఫీజు 20,000ఎల్కేజీ ఖర్చు ఇలా (సుమారు రూపాయల్లో..) టై, బెల్టు, యూనిఫాం 3,000అడ్మిషన్ ఫీజు 3,000 పుస్తకాలు4,000రవాణా చార్జీలు 15,000 నల్లగొండకు చెందిన ఓ చిరుద్యోగి తన కుమారుడిని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ చేయాలనుకున్నాడు. పాఠశాలకు వెళ్లి ఫీజు వివరాలు అడిగాడు. అడ్మిషన్ ఫీజు, స్కూల్ ఫీజు, పుస్తకాలు, టై, బెల్టు, యూనిఫాం, రవాణా చార్జీలు కలుపుకొని ఏడాదికి మొత్తం రూ.40వేలు అవుతాయని స్కూల్ యాజమాన్యం చెప్పింది. దీంతో అతడు ఎల్కేజీకే ఇంతా ఫీజా అని అవాక్కయ్యాడు. ఇలా జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా సాగుతోంది. అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతిలేని పాఠశాలలను సీజ్ చేయాలని ఇప్పటికే ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. ఎవరైనా పాఠశాలల పేర్లు మార్పడం కానీ, ఒకే పాఠశాలకు అనుమతి తీసుకోని అనేక బ్రాంచ్లు ఏర్పాటు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పుస్తకాలు, యూనిఫాంలు అదే పాఠశాలలో కొనాలన్న నిబంధన లేదు. కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తే ఉపేక్షించేది లేదు. – భిక్షపతి, డీఈఓ -
అమ్మా.. మొర ఆలకించరూ..
నల్లగొండ : ‘ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు. తిరిగితిరిగి అలసిపోతున్నాం. మీరే మా మొర ఆలకించి సమస్యలను పరిష్కరించాలి’ అంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎదుట పలువురు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇతర సమస్యలపై కలెక్టరేట్కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను సావదానంగా విన్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని ఆయా శాఖలకు పంపారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఏడేళ్ల నుంచి తిరుగుతున్నా.. పింఛన్ రావడం లేదు నేను దివ్యాంగుడిని. నడవలేను. నా సొంత పనులకు కూడా ఇతరులపై ఆధారపడాల్సిందే. ఏడేళ్ల నుంచి వికలాంగుల పింఛన్కు దరఖాస్తు చేసుకున్నా. అధికారులు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా నా సమస్యకు పరిష్కారం లభించలేదు. పింఛన్ పొందలేకపోతున్నా. పింఛన్ వస్తే నా కుటుంబ సభ్యులకు భారం తగ్గుతుంది. నాకు పింఛన్ ఇప్పించాలి. – మదు, చెరలతండా, నేరడుగొమ్ము మండలం -
గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్లో సీపీఎం శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మహమ్మద్ అబ్బాస్ అన్నారు. నల్లగొండలో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో సోమవారం వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడంతో కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, సయ్యద్ హాశం, దండెంపల్లి సత్తయ్య, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సలీం, కొండ అనురాధ, నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, కానుగు లింగస్వామి, పులెంల శ్రీకర్, తుమ్మల పద్మ, సరోజ, కొండ వెంకన్న, రాములు తదితరులు పాల్గొన్నారు.