Nalgonda
-
గొడుగులు చేతబట్టి ‘బడిబాట’
మర్రిగూడ : మండలంలోని దామెరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు సోమవారం ఎర్రటెండలో సైతం గొడుగులు చేతబట్టి వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమం చేపట్టారు. గొడుగుల నీడలో ఇల్లిళ్లు తిరిగి పిల్లలను ప్రభుత్వ బడిలోకే పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాద్యాయుడు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారన్నారు. దీనికితోడు ప్రస్తుతం అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వై.మంజులత, కొండ శ్రీనివాస్, సబావత్ వెంకట్కుమార్, మీనా, విద్యార్థులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనాలని రాస్తారోకో
పెద్దవూర : ధాన్యం వెంటనే కొనాలని కోరుతూ సోమవారం పెద్దవూర మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రం ఎదుట జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రమావత్ రవినాయక్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పదిరోజులు అవుతున్నా.. ఇప్పటివరకు కేవలం నాలుగు లారీల ధాన్యమే కొనుగోలు చేశారని తెలిపారు. ధాన్యంలో సరైన తేమశాతం వచ్చినా.. లారీలు రావడం లేదన్న సాకుతో బస్తాలు ఇవ్వడం లేదని, బస్తాలు ఇచ్చిన రైతుల ధాన్యం మిల్లులకు తరలింకాకే. మిగిలిన రైతులకు బస్తాలు ఇస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎప్పుడు వర్షం వస్తుందోనన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేసే ప్రయత్నం చేశారు. కలెక్టర్గాని, సబ్ కలెక్టర్గాని వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చేవరకు రాస్తారోకోను విరమింపజేసేది లేదని భీష్మించారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పిన రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు ఏరుకొండ నర్సింహ, శ్రీనివాస్రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశాం
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనతో పాటు, అదనపు కలెక్టర్, తహసీల్దార్లు, సీనియర్ అధికారులు కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను సందర్శించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపించడం, ధాన్యాన్ని వెంటనే ఆన్లోడ్ చేసే విధంగా చూస్తున్నామని పేర్కొన్నారు. మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ సమస్య లేకుండా చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల అన్ని సౌకర్యాలను తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణనల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 28 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు ఆయనకు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ.. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలినల్లగొండ టూటౌన్ : అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా చెరువులు, గుట్టలు తవ్వుతున్న మట్టి మాఫీయాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి సోమవారం ఎస్పీ శరత్చంద్ర పవార్కు ఫిర్యాదు చేశారు. జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోకుండా 30 నుంచి 40 అడుగులలోతు చెరువుల్లో మట్టి తవ్వుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మట్టి మాఫీయా టిప్పర్లు, ఇతర వాహనాలను వెంటనే సీజ్ చేయాలని కోరారు. బట్రాజ్ సంఘం జిల్లా కమిటీ ఎన్నికనల్లగొండ టౌన్ : బట్రాజ్ సంఘం జిల్లా నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సరస్వతి శంకర్రాజు, ప్రధాన కార్యదర్శిగా పిచ్చంరాజు, గౌరవ అధ్యక్షుడిగా బొల్లేపల్లి శ్రీనివాసరాజు, కోశాధికారిగా సత్యనారాయణరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ‘నీట్’కు ఏర్పాట్లు చేయాలి నల్లగొండ : వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎల్జిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి అధికారులకు సూచించారు. మే 3న నిర్వహించే నీట్ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో మాట్లాడారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పక్కాగా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2,318 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ఎన్జీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఎంజీయూ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ రమేష్, నీట్ జిల్లా కోఆర్డినేటర్, కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఓపెన్ పరీక్షలు ప్రారంభంనల్లగొండ : ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనట్లు డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 సెంటర్లలో నిర్వహించిన ఓపెన్ ఇంటర్ తెలుగు పరీక్షకు 1,759 మందికిగాను 1,512 మంది పరీక్ష రాశారని, 247 మంది గైర్హాజర్ అయ్యారని తెలిపారు. 8 సెంటర్లలో నిర్వహించిన ఓపెన్ టెన్త్ తెలుగు పరీక్షకు 1,334 మందికి 1,141 మంది పరీక్ష రాశారని 193 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. -
మహిళా బిల్లు అంతా బూటకం
మిర్యాలగూడ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లులు అంతా బూటకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి కేరళ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పోలీస్ పాలన సాగుతోందని, కార్మికుల పోరాటాలను పోలీసులతో అణిచి వేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వచ్చే నెల 1న మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, మల్లు గౌతంరెడ్డి, మంగారెడ్డి, రవినాయక్, బావండ్ల పాండు, పరుశురాములు, సీతారాములు, మసూద్, వరలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంచవద్దని, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 104 ఫిర్యాదులు రాగా, వాటిలో రెవెన్యూశాఖకు 70, ఇతర శాఖలకు సంబంధించినవి 34 వచ్చాయని తెలిపారు. ఈ నెల 28న రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు నల్లగొండకు రానున్నట్లు తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటలకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, అప్పీలేట్ అథారిటీ అధికారులకు ఆర్టీఐపై అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. సెక్షన్ 4(1)(బి) కింద వెల్లడించాల్సిన సమాచారాన్ని ముందుగానే నవీకరించి సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వచ్చిన ఆర్టీఐ దరఖాస్తుల వివరాలను నమోదు చేయాలని, లేనిపక్షంలో ‘నిల్’గా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీవోలు శ్రీదేవి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
అక్షయ తృతీయకు అంతంత మాత్రమే!
రామగిరి(నల్లగొండ) : అక్షయ తృతీయ వచ్చిందంటే బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి. హిందూ సంప్రదాయంలో బంగారం, వెండి కొనుగోలుకు అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజు. కానీ ఈ ఏడాది పసిడి ధరలు సామాన్యుడిని భయపెడుతుండడంతో ఈసారి కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది ఇదే సమయానికి తులం బంగారం లక్ష రూపాయలలోపే ఉండగా ఇప్పుడు ఆ ధర భారీగా పెరిగింది. లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని నగల షాపుకెళ్తే తులం బంగారం రావడం లేదు. 2025 అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.96,000 నుంచి రూ.97,000 మధ్య ఉంది. అంటే సుమారు లక్ష రూపాయలు ఉంటే ఒక తులం బంగారం కోనే వీలుండేది. కానీ ఇప్పుడు బంగారం, వెండి ధరలు పోటీపడి పెరుగుతుండడంతో ప్రజలు బంగారం కొనేందుకు ఆలోచిస్తున్నారు. ఫ ఈ ఏడాది తగ్గిన బంగారం విక్రయాలు ఫ ధరలు పెరగడంతో ఆసక్తి చూపని ప్రజలు -
ప్రగతి చక్రానికి బ్రేకులు
మిర్యాగూడ టౌన్ : ప్రగతి చక్రానికి బ్రేకులు పడుతున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ లక్ష్యంగా జాయంట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేపడుతున్నారు. ఆర్టీసీలో 2019 తరువాత ఇప్పుడు కార్మికులు సమ్మెలోకి దిగుతున్నారు. దీంతో బస్సులు డిపోల్లోనే నిలిచిపోనున్నాయి. ఏడేళ్ల క్రితం 54 రోజుల సమ్మెతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదగిరిగుట్ట, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డిపోలున్నాయి. వీటి పరిధిలో ఆర్టీసీ బస్సులు 329, అద్దె బస్సులు 235, ఎలక్ట్రికల్ బస్సులు 169 మొత్తం 733 బస్సులు ఉన్నాయి. డ్రైవర్లు 719 మంది, కండక్టర్లు 1012 మంది, గ్యారేజి సిబ్బంది 264 మంది మొత్తం 1,995 మంది పనిచేస్తున్నారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం ఖర్చులను తగ్గించుకునేందుకు టిమ్స్ డ్యూటీలు వేస్తోందని కార్మికులు అంటున్నారు. 12 నుంచి 16 గంటల వరకు డ్యూటీలు చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ‘మహాలక్ష్మి’ పథకం కింద ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండడంతో ఒక్కో బస్సులో సుమారు 100 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. దీని వల్ల డ్రైవర్లు, కండక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లకు టిమ్స్ ఇవ్వడంతో బస్సులు నడుపుతూ, టికెట్ల కొట్టడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని సంరక్షించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టారు. డిపోలు బస్సులు ఉద్యోగులు దేవరకొండ 106 352 కోదాడ 86 279 మిర్యాలగూడ 106 287 నల్లగొండ 154 307 నార్కట్పల్లి 27 99 సూర్యాపేట 159 327 యాదగిరిగుట్ట 95 344 సమ్మెలోకి ఆర్టీసీ కార్మికులు ఫ డిపోలకే పరిమితం కానున్న బస్సులు ఫ ప్రయాణికులకు తప్పని పాట్లుఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్తే ప్రస్తుతం ఉన్న అద్దె బస్సులను నడిపించేందుకు ప్రత్యేక చర్యలను చేపడతాం. అయితే కొంత మంది ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లో వీధులకు హాజరవుతారనే నమ్మకం ఉంది. వారి ద్వారా కూడా బస్సులను నడుపుతాం. ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం మేరకే చర్యలు చేపడతాం. – కొణతం జాన్రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం, నల్లగొండ -
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
నల్లగొండ : ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్)లో కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి పౌర సరఫరాలు, మార్కెటింగ్, డీఆర్డీఏ, రవాణా, కోఆపరేటివ్ తదితర శాఖల అధికారులు, మిల్లర్లతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండలను దృష్టిలో ఉంచుకుని పగలు, రాత్రి.. అవసరమైతే లైట్లు ఏర్పాటు చేసి ధాన్యం కాంటాలు వేయాలని, వారం పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్రాల సంఖ్య, లారీలను పెంచి రోజుకు 10 వేల మెట్రిక్ టన్నులు కొనాలన్నారు. రోడ్డు నిర్మాణంలో అవినీతికి ఆస్కారం లేదు నల్లగొండ నగరంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పార్కుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో అవకతవకలంటూ ఓ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరైతే.. భూసేకరణకే రూ.250 కోట్లు పోతుందని, పనులన్నీ నేషనల్ హైవే అధికారులు చూసుకుంటారని.. అందులో ఎవరి ప్రమేయం ఉండదని చెప్పారు. నీలగిరిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా కృష్ణా జలాలు అందించాలన్నారు. కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ బి.చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అశోక్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశం, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్కుమార్, రవాణా శాఖ అధికారి లావణ్య నాయకులు గుమ్మల మోహన్రెడ్డి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, జూకూరి రమేష్ పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
నాణ్యమైన విత్తనాలు అందిస్తాం
నల్లగొండ టౌన్ : వానాకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిసాత్మని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ ఉదయాతిద్య భవన్లో జిల్లాలోని విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగనుండగా, ఇందుకు దాదాపు 1.25 లక్షల క్వింటాళ్ల విత్తన అవసరం ఉందని అంచనా వేశామని, ఇందులో భాగంగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సుమారు 50 వేల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వరితో పాటు పెసర, మినుము, కంది వంటి పంటల విత్తనాల సరఫరాకు చర్యలు చేపట్టామన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలనే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాయితీ విత్తనాల పైనే దృష్టి పెట్టడం సరికాదని, రాయితీ లేని విత్తనాలను కూడా రైతులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వానాకాలానికి అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను కూడా సమయానికి సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి -
ఎస్బీఐ దేవరకొండ శాఖలో ఘరానా మోసం
నల్లగొండ : నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అగ్రికల్చర్(కమర్షియల్) బ్రాంచ్లో ఆర్థిక మోసానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.42 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్లో లెండల చక్రపాణి అనే వ్యక్తి ఐదేళ్లుగా కాంట్రాక్టు బేసిక్పై హౌస్కీపింగ్గా పనిచేస్తున్నాడు. అతడికి కంప్యూటర్ పరిజ్ఞానం తెలియడం వల్ల బ్యాంకు సిబ్బందికి కంప్యూటర్ పనుల్లో సాయం చేసేవాడు. దీంతో బ్యాంకు అంతర్గత వ్యవస్థ గురించి, ఖాతాల నిర్వహణపై అవగాహన ఏర్పడింది. ఈ క్రమంలో అతడికి సూర్యాపేట ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేసే పుట్ట వెంకటరామాంజనేయులుతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చక్రపాణి.. వెంకటరామాంజనేయులుతో కలిసి అక్రమంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వెంకటరామాంజనేయులు తన పరిధిలో ఉన్న ఎంఐఎస్(మేనేజ్మెంట్ ఇన్పర్మేషన్ సిస్టం) ద్వారా ఎస్బీఐలో గత కొన్నేళ్లుగా ఇన్యాక్టివ్గా ఉన్న 10 ఖాతాల వివరాలు సేకరించాడు. ఆ తర్వాత చక్రపాణి ఖాతాదారుల పేరు, చిరునామా, ఆధార్, పాన్ కార్డు, ఫొటో, సంతకాల వివరాలు సేకరించి నకిలీ ఆధార్, పాన్కార్డులు తయారు చేశాడు. బ్యాంకు ఉద్యోగుల లాగిన్ వివరాలు గమనించి రద్దీ సమయంలో కంప్యూటర్లో లాగిన్ అయి ఖాతాలకు కొత్త మొబైల్ నంబర్లు అప్లోడ్ చేశాడు. తర్వాత యోనో యాప్ ద్వారా కొత్త యూజర్ ఐడీ పాస్వర్డ్లు, పిన్ నంబర్లు సృష్టించాడు. మిర్యాలగూడకు చెందిన బ్యాంకు రికవరీ ఏజెంట్ కేతావత్ రామ్లాల్, దేవరకొండకు చెందిన ఫొటోగ్రాఫర్ మారేపల్లి శివ ద్వారా తెలిసిన వ్యక్తులకు ‘మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. నగదు ఇవ్వండి. ఇది లీగల్ వ్యవహారం’ అని చెప్పి, కమిషన్ ఆశ చూపి బ్యాంకు ఖాతాలు వివరాలు సేకరించారు. అనంతరం ఇన్యాక్టివ్ ఖాతాల్లోని రూ.2.65 కోట్ల నగదును ఇతర వ్యక్తుల నుంచి సేకరించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ మొత్తం డబ్బులో 45 శాతం చక్రపాణి, పుట్ట వెంకన్న రామాంజనేయులు, రామ్లాల్, మారేపల్లి శివకు 10 శాతం వాటాలు ముందే పంచుకున్నారు. ఇలా వెలుగులోకి వచ్చింది.. ఈ క్రమంలో నిందితులు హైదరాబాద్లోని కోఠి ఎస్బీఐ బ్రాంచ్లో నరేందర్ అనే వ్యక్తి ఖాతాకు అక్రమంగా కేవైసీ అప్డేట్ చేయగా.. ఆయన ఇటీవల బ్యాంకును సంప్రదించడంతో అసలు విష యం బయటపడింది. ఈ మోసం దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్ నుంచి జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. దేవరకొండ బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకటరాఘవపూడి ఈ నెల 13న దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ ఇన్యాక్టివ్ ఖాతాల నుంచి నగదు కొట్టేసిన కాంట్రాక్టు ఉద్యోగి ఫ నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురి అరెస్టు ఫ రూ.2.42 కోట్ల నగదు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్చంద్ర పవార్దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలతో వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేసి ప్రధాన నిందితుడు లెండల చక్రపాణితో పాటు అతడికి సహకరించిన సూర్యాపేట ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ పుట్ట వెంకటరామాంజనేయులు, మిర్యాలగూడకు చెందిన బ్యాంకు రికవరీ ఏజెంట్ కేతావత్ రామ్లాల్, దేవరకొండకు చెందిన ఫొటోగ్రాఫర్ మారేపల్లి శివను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.10 కోట్ల నగదు, బెనిఫిషరీ ఖాతాల నుంచి రూ.1.31 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. అదేవిధంగా ఆరు సెల్ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించిన దేవరకొండ డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ రాజు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
రైతుభరోసా రూ.267 కోట్లు జమ
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత రైతు భరోసా నిధులను మంగళవారం విడుదల చేసింది. జిల్లాలో 5,20,741 మంది రైతుల ఖాతాల్లో రూ.267.81 కోట్లు జమచేసింది. ఇప్పటి వరకు మొదటి, రెండవ విడతలు కలిపి 5,40,693 మంది రైతుల ఖాతాల్లో రూ.448,09,89,256 జమ చేసింది. రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ అయ్యింది. పౌష్టికాహారం అందించడమే లక్ష్యంరామగిరి(నల్లగొండ) : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే పోషణ్ పక్వాడ లక్ష్యమని ఐసీడీఎస్ జిల్లా అధికారి కృష్ణవేణి అన్నారు. పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లతో ఆమె సమావేశమై మాట్లాడారు. అంగన్వాడీ ప్రీస్కూల్ పిల్లల సంఖ్య పెంచాలన్నారు. తల్లులకు పోషకాహార విలువపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ నిర్మల, ఎంపీడీఓ యాకుబ్నాయక్, సూపర్వైజర్లు పద్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు బదిలీ ● నూతన డీఎస్పీగా తుమ్మ ఆనంద్రెడ్డి మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖరరాజును బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్ సీఐడీ డీఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంటలిజెన్స్ డీఎస్పీగా పని చేస్తున్న తుమ్మ ఆనంద్రెడ్డి మిర్యాలగూడ డీఎస్పీగా పంపారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సందర్భంగా బదిలీపై వెళుతున్న డీఎస్పీ కె.రాజశేఖరరాజు మాట్లాడుతూ.. మిర్యాలగూడ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడిలో సహకరించిన సీఐలు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా తుమ్మ ఆనంద్రెడ్డి గతంలో దేవరకొండ డీఎస్పీగా, హాలియా, మిర్యాలగూడ సీఐగా, హాలియా ఎస్ఐగా పనిచేసిన చేశారు. నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. విద్యార్థులకు పోటీలు నల్లగొండ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వకృత్త్వం, క్విజ్, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ మంగళశారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు 26వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించాలని సూచించారు. మేడేను జయప్రదం చేయాలినల్లగొండ టౌన్ : మేడేను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, ఇళ్ల అద్దెలు, ధరలు, విద్య, వైద్యం ఖర్చులు కార్మికులకు మోయలేని భారమయ్యాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికుల సంఘటితమై తమ బతుకులు మార్చుకోడానికి ఈ మేడేను ఉద్యమంలా జరుపుకోవాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, పోలే సత్యనారాయణ, భీమగాని గణేశ్, అద్దంకి నరసింహ, జంజరాల శ్రీనివాస్, సలివోజు సైదాచారి, గంజి రాజేష్, సుంకరబోయిన వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ.. మహిళా వ్యతిరేకి
ఫ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్రా నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని, పార్లమెంట్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్రా అన్నారు. మంగళవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారీశక్తి వందన్ 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూర్తి వివరాలు వెల్లడించినా కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ జరిగితే మహిళకు అన్ని చట్టసభల్లో అధిక సీట్లు లభిస్తాయన్నారు.తెలంగాణలో కూడా ప్రస్తుతం ఉన్న 17 సీట్ల లోక్సభ సీట్లు 25 వరకు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చకుండానే.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, కంకణాల నివేధిత, రేవతి, విజయలక్ష్మి, అరుణ పాల్గొన్నారు. -
రైతులకు రెండో విడత భరోసా
నల్లగొండ అగ్రికల్చర్ : అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న రెండో విడత రైతు భరోసా నిధులను సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. భూపాలపల్లి జిల్లా కాటారంలో జరగనున్న బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. మార్చి 23న ప్రభుత్వం మొదటి విడత కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. రెండో విడత నిధుల విడుదలలో కొంత జాప్యం జరగడంతో రైతులు ఆందోళన చెందినప్పటికీ, ప్రభుత్వం తాజా నిర్ణయంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరు నాటికి మూడవ విడత నిధులను కూడా జమ చేసి, ఈ సీజన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో రూ.268.57 కోట్లు ప్రభుత్వం మొదటి విడతలో 5,22,313 మంది రైతులకు రూ.268.57 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుతం ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తుందో స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం యాసంగి ధాన్యం విక్రయాల్లో బిజీగా ఉన్న రైతులు, త్వరలోనే వానాకాలం సీజన్కు సన్నద్ధం కానున్నారు. జూన్ మొదటి వారం నుంచి దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు వంటి పనులకు భారీగా పెట్టుబడి అవసరమవుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు రైతులకు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ఫ నేడు అన్నదాతల ఖాతాల్లోకిపెట్టుబడి సాయం ఫ నిధులు విడుదల చేస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు -
కాంగ్రెస్ పార్టీది చరిత్రాత్మక తప్పిదం
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి హాలియా : మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీది చారిత్రక తప్పిదమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకురాలు కంకణాల నివేదితరెడ్డి అన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ వ్యవహాశైలికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం హాలియా పట్టణంలో మహిళలు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతపై గంబీర ఉపన్యాసాలు చేసే ఇండియా కూటమి నాయకులు మహిళల హక్కుల, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఆడ్డుకుంన్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మహిళల ఆశలను వమ్ము చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళలు ఉన్నారు. -
సామాజిక విప్లవకారులు.. ఫూలే, అంబేడ్కర్
నల్లగొండ టౌన్ : సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావుఫూలే, అంబేడ్కర్ అని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.అబ్బాస్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన ఫూలే, అంబేడ్కర్ జన జాతర సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఫూలే, అంబేడ్కర్ భారతీయ సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం స్థాపనకు శాసీ్త్రయ దృక్పథంతో నిరంతరం పోరాడిన మహనీయులు అన్నారు. ఫూలే విద్యను.. సామాజిక విముక్తి సాధనంగా భావించి అణగారిన వర్గాల సాధికారతకు పునాది వేశారని, అంబేడ్కర్ రాజ్యాంగ రూపకర్తగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను సంస్థాగతంగా స్థాపించారని చెప్పారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ అవమానాలకు గురవుతున్న అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి అక్షరాలను ఆయుధంగా ఎంచుకుని ఫూలే, అంబేడ్కర్ చేసిన పోరాటం భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమన్నారు. కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది దర్శనం నరసింహ, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, రేముడాల పరుశరాములు, గాదె లింగస్వామి, నేలపట్ల సత్యనారాయణ, కొలగాని పర్వతాలు, ఎడ్ల సైదులు, మల్లెపాక వెంకన్న, మామిడి సైదులు, బకరం శ్రీనివాస్, మానుపాటి భిక్షమయ్య, రజియోద్దీన్, బోనగిరి దేవేందర్, పందుల సైదులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే మహిళా సాధికారత
నల్లగొండ : మహిళా సాధికారత కోసం పాటుపడిన ఏకై క పార్టీ కాంగ్రెస్ అని నేత అన్నారు. నల్లగొండలోని యాదవ సంఘం భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని ఆయన గుర్తు చేశారు. సోనియాగాంధీ యూపీఏ చైర్ పర్సన్గా దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారని చెప్పారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీలో మహిళలను అధ్యక్షులుగా చేశారా? ఇప్పుడు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీలో ఎంతమంది మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్నారని ప్రశ్నించారు. డీలిమిటేషన్లో మహిళల బిల్లులను తీసుకురావడం పెద్ద కుట్ర అని విమర్శించారు. 2023లో ఆమోదించిన మహిళా బిల్లును ఇప్పుడున్న సభ్యుల ఆధారంగా ఆమోదించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, రవీందర్రెడ్డి, తోటకూరి పరుశురాములు, ముంతాజ్ అలీ, చర్లపల్లి గౌతం పగిళ్ల రాజు, రవితేజ, సాగర్రెడ్డి, వేముల గోపీనాథ్, అశోక్, ఇంధనూరి శీను, పరశురాం, చకిలం ఫణికుమార్, శ్రీను నాగార్జునగౌడ్, శరత్, పరశురాం, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ -
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
గుర్రంపోడు : కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను గ్రహించిన ప్రజలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం గుర్రంపోడు మండలకేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచాయని, మిగిలిన రెండున్నరేళ్లలో చివరి ఏడాది ఎన్నికల ఏడాదిపోగా ఏడాదిన్నర సమయమే ఉందన్నారు. కార్యకర్తలు కొద్దిగా ఓపిక పట్టాలని, ఎన్ని వేధింపులకు గురిచేసినా భరించాలని.. బీఆర్ఎస్ అధికారం రాగానే వడ్డీతో సహా తీర్చుకుందామని చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ వాళ్లకే అర్థమైందన్నారు. అందుకే వారు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని, ఎస్ఎల్బీపీ టన్నెల్ బీఆర్ఎస్ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వితే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన టన్నెల్లో శవాలను కూడా తీయలేకపోయిందని ధ్వజమెత్తారు. ప్రమాద స్థలానికి టూరిస్టు ప్లేస్కు వచ్చినట్లు మంత్రులు విమానంలో చక్కర్లు కొట్టారని విమర్శించారు. అసెంబ్లీలో రుణమాఫీపై ప్రశ్నిస్తే ఇంకా ఏమీ లేదని అయిపోయిందన్నారని, రుణమాఫీ చేసింది కేవలం 40 శాతమేనని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తున్నారని, మళ్లీ సీఎంగా కేసీఆర్ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అంతకుముందు ఆయన తానేదార్పల్లి వద్ద కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి హరీష్రావుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రాజ్యసభ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రబాకర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, పల్లె రవికుమార్, ఎన్ఆర్ఐ అమెరికా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నాగులవంచ నర్సింహారావు, రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు -
రేణుకా ఎల్లమ్మకు పూజలు
కనగల్ : మండలంలోని దర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఆదివారం ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ ఎన్నికనల్లగొండ టూటౌన్ : అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ ఎన్నికలు ఆదివారం నల్లగొండలో నిర్వహించారు. అధ్యక్షుడిగా ఈసం మారయ్య, ప్రధాన కార్యదర్శిగా గోలి మల్లేష్, ఉపాధ్యక్షులుగా గాదరి సుందరయ్య, కూకుంట్ల ఫిలిప్స్ కుమార్, కోశాధికారిగా సింగం వెంకటయ్య, సహాయ కార్యదర్శులుగా రాసవల్ల శ్రీనివాస్, పెరమళ్ల వినయ్కుమార్, సాంస్కృతిక కార్యదర్శిగా ఈసం యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన బుచ్చిరాములు, గోలి మల్లేశానికి నూతన కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజను విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. పంచభూతాల కలయికే హిందుత్వంచౌటుప్పల్ : పంచభూతాల కలయికే హిందుత్వమని త్రైలింగ ప్రాంత సామాజిక సంఘటన సేవాప్రతి వాసుదేవానంద సరస్వతి తెలిపారు. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్స్టేషన్ ప్రాంగణంలో ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుదేవానంద సరస్వతి జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. హిందుత్వం అంటే సమానత్వమన్నారు. కులాలు ఏవైనా అందరూ కలిసిమెలిసి జీవనం సాగించమని చెప్పేదే హిందుత్వమని తెలిపారు. తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్ జిన్న సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పౌరులు సన్మార్గంలో నడవాలంటే హనుమాన్ చాలిసా చదవాలని, లేదంటే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాఖలకు వెళ్లాలని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రముఖ సామాజికవేత్త పర్వతం సంధ్యారాణి మాట్లాడుతూ.. మనిషికి నైతిక విలువలు ఎంతో అవసరమని తెలిపారు. ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నా నైతిక విలువలు, క్రమశిక్షణ లేకుంటే జీవితం వ్యర్ధమన్నారు. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు కేవీబీ.కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, సమ్మేళన సమితి ప్రధాన కార్యదర్శి కొసునం రాంరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాసులు, ప్రతినిధులు బడుగు శ్రీరాములు, పోలోజు రాజుచారి తదితరులు పాల్గొన్నారు. -
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
మోతె : జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం అన్నారు. ఆదివారం మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో ఏబీఆర్ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, బీసీలకు అందించాలన్నారు. విద్యకు అధిక బడ్జెట్ను కేటాయించి అందరికి ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. నేడు తెలంగాణలో ఎస్సీ మాదిగ కులస్తులు 40 నుంచి 50 లక్షల మంది ఉన్నారని, 80 ఏళ్ల నుంచి దళితుల పరిస్థితి హీనంగా ఉందని పేర్కొన్నారు. తళితులు మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు తొలగిస్తామనడం సబబు కాదన్నారు. దళితులు విద్యతోనే చైతన్యవంతులు కావాలని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం ఏపూరి సోమన్న కళా బృందంతో ఆటా, పాటా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడి లింగయ్య, నాయకులు పొడపంగి యలమంచి, పొడపంగి ముత్తయ్య, బక్కమ్మ కిష్టయ్య పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
సూర్యాపేటటౌన్ : ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట మండల పరిధిలోని కాసరాబాద్ రోడ్డులో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసరాబాద్ గ్రామానికి చెందిన కొల్లు సందీప్(28) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో పనులు ముగించుకొని మరో వ్యక్తితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. కాసరాబాద్ గ్రామ సపమీంలోకి రాగానే ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పోలీసులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యనల్లగొండ : వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండల పరిధిలోని మాందాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య(19)కు నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్కు చెందిన శివతో ఆరునెలల క్రితం వివాహమైంది. కాగా ఐశ్వర్య శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు ఐశ్వర్య తల్లిదండ్రులు ఆదివారం నల్లగొండ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ దేవరకొండ : గంజాయి కలిగిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మైనంపల్లి సమీపంలోని పల్లీ మిల్లులో బిహార్కు చెందిన ఇద్దరు యువకులు పని చేస్తున్నారు. శనివారం వారు దేవరకొండలోని రహదారి బంగ్లా సమీపంలో గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బైక్, ఆటోను ఢీకొట్టిన కారు
మోత్కూరు : మండలంలోని పాలడుగు గ్రామంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ఆటోను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. వలిగొండ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన ముక్కెర్ల చంద్రయ్య(70) బైక్పై మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో రోడ్డు దాటుతుండగా.. వలిగొండ నుంచి వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. అనంతరం కారు అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆటోను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చంద్రయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు -
నేటి నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
భువనగిరి : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలిసారిగా ఈ విద్యాసంవత్సరంలో ఓపెన్ విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పాఠాలు బోధించడం, రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగా పాఠ్యపుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు పరీక్షల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 8,835 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. 44 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 44 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఏర్పాట్లు పూర్తి.. పరీక్షల నిర్వహణ కోసం అన్ని కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాలలో విద్యుత్ సదుపాయం, తాగునీరు, ఫ్యాన్లతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలందించేందుకు పరీక్ష కేంద్రాలలో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారికి పరీక్ష కేంద్రాలలోకి అనుమతించనున్నారు. పరీక్ష కేంద్రాలలోకి సెల్ఫోన్లు అనుమతించబడదు.ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల వివరాలు ఇలా.. జిల్లా తరగతి హాజరుకానున్న పరీక్ష విద్యార్థులు కేంద్రాలు నల్లగొండ టెన్త్ 1,611 08 ఇంటర్ 2,226 10 సూర్యాపేట టెన్త్ 990 06 ఇంటర్ 2,012 11 యాదాద్రి టెన్త్ 569 04 ఇంటర్ 1,427 05 టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లాలో 44 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 8,835 మంది విద్యార్థులు -
అధిక వడ్డీ ఆశతో మోసపోయిన బాధితులు
కొండమల్లేపల్లి : అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి రెండు రోజుల క్రితం మృతిచెందగా.. అప్పు ఇచ్చిన బాధితులు ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల గ్రామానికి చెందిన వరికుప్పల శేఖర్ కొండమల్లేపల్లి మండల కేంద్రం సమీపంలోని దోనియాల గ్రామ శివారులో ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తన ఇంటికి సమీపంలోనే ఇస్తరాకులు తయారుచేసే కంపెనీని ఏర్పాటుచేసి వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆరేళ్ల నుండి అధిక వడ్డీ ఇస్తానని చెప్పి సన్నిహితులు, బంధువులు, స్నేహితుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. మొదట్లో అప్పు ఇచ్చిన వారికి వడ్డీలు బాగానే కట్టి నమ్మకం పెంచుకున్నాడు. దీంతో అమాయక ప్రజలు బయట రూ.2 వడ్డీకి బయట అప్పులు తెచ్చి శేఖర్కు అధిక వడ్డీకి ఇచ్చారు. ఈవిధంగా శేఖర్ సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం ఏడాది నుంచి ఇబ్బందులు.. అయితే శేఖర్ గత ఏడాది నుంచి అప్పులు ఇచ్చిన వారికి సక్రమంగా వడ్డీలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా మూడు నెలల క్రితం శేఖర్ గుండెకు స్టంట్ వేసినట్లు అతడి ఇంటి చుట్టుపక్కల వారి ద్వారా తెలిసింది. అప్పు ఇచ్చిన వారి నుంచి శేఖర్పై ఒత్తిడి పెరగడంతో డబ్బులు తెస్తానని కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లి రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు బెంగళూరుకు వెళ్లి శేఖర్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం కొండమల్లేపల్లికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో శేఖర్కు అప్పులిచ్చిన బాధితులంతా అతడి ఇంటి వద్దకు చేరుకొని ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. బాధితులు 50 మంది కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. ఇటీవల పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పడమటితండాకు చెందిన బాలాజీనాయక్, మధునాయక్ అధిక వడ్డీ ఆశచూపి ప్రజలను మోసం చేసిన ఘటన మరువక ముందే కొండమల్లేపల్లిలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు అవాక్కయ్యారు. అప్పు తీసుకున్న వ్యక్తి గుండెపోటుతో మృతి మృతుడి ఇంటి వద్ద ఎటూ పాలుపోని స్థితిలో బాధితులు -
వైభవంగా విశ్వశాంతి మహాయాగం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆదివారం విశ్వశాంతి మహాయాగం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం యాదగిరిగుట్ట ఆయల రిటైర్డ్ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు సమక్షంలో గణపతి పూజ జరిపించారు. అనంతరం 108 జంటలతో సుదర్శన నారసింహ విశ్వశాంతి మహాయాగం, 1008 మందితో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం జరిపించారు. కల్యాణోత్సవం తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమారు 3వేలకు పైగా భక్తులు ఆయా వేడుకల్లో పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించిన విశేష కార్యక్రమాలకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీలు, ట్రస్టు ప్రతినిధులు పూల రవీందర్, ఆకుల లలిత, డాక్టర్ పుంజాల వినయ్కుమార్, రుద్ర సంతోష్కుమార్, పలుగుల శ్రీనివాస్, పోతంశెట్టి అనిల్కుమార్, పుప్పాల నరసింహులు, సంగాని రజినికాంత్, తూడి జనార్దన్, కుమారస్వామి, ఆవుల సురేందర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. -
ఏనుగు నర్సింహారెడ్డి యువతకు ఆదర్శనీయుడు
చిట్యాల : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఐఏఎస్ హోదా పొందిన చిట్యాల పట్టణ వాసి ఏనుగు నర్సింహారెడ్డి నేటి యువతకు ఆదర్శనీయుడని రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ అన్నారు. ఆదివారం చిట్యాల పట్టణంలో ఏనుగు నర్సింహారెడ్డికి ప్రమోద సాహితి సంస్థ, ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జస్టిస్ కుకుడాల లక్ష్మణ్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం హాజరయ్యారు. ఈ సందర్భంగా కుకుడాల లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏనుగు నర్సింహారెడ్డి పేదరికంలో ఉండి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఐఏఎస్ స్థాయికి ఎదిగారన్నారు. ఆయన ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. సాహిత్య రంగంలోనూ రాణిస్తున్న నర్సింహారెడ్డి భవిష్యత్తులోనూ ఉన్నత స్థాయికి చేరుకుని మంచి గుర్తింపు పొందుతారని ఆకాంక్షించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ.. ఏనుగు నర్సింహారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన 19 పుస్తకాలను రచించడంతో పాటు మరో ఎన్నో సాహిత్య సమీక్షలను, కవిత్వాలను రాసి ఇరవై రెండు వరకు అవార్డులు పొందారని పేర్కొన్నారు. తెలుగు భాషే నిలబెట్టింది.. అనంతరం ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తనకు చిన్ననాడు చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువు చెప్పిన ఉపాధ్యాయుల ద్వారా తెలుగు భాషపై అభిమానం ఏర్పడిందన్నారు. తెలుగు భాష ద్వారానే సాహిత్య రంగంలో ఎన్నో పుస్తకాలు రాశానన్నారు. అంతేకాకుండా తెలుగు భాష ద్వారా గ్రూప్–2 రాసి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి ఇప్పుడు ఐఏఎస్ హోదాను పొందానని గుర్తుచేశారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా తనకు పౌర సన్మానం చేసిన ప్రమోద సాహితీ సంస్థతో పాటు తన చిన్ననాటి స్నేహితులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతారమేష్, వైస్ చైర్పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మీసైదులు, ప్రమోద సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్తో పాటు సాహితీవేత్తలు తండు కృష్ణకౌండిన్య, ఏభూషి నర్సింహ, సాగర్ల సత్తయ్య, సిలివేరు నర్సింహ, పాటి మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ -
అనుమానాస్పద స్థితిలో వాచ్మెన్ మృతి
కనగల్ : అనుమానాస్పద స్థితిలో వాచ్మెన్ మృతిచెందాడు. వివరాలు.. కనగల్ మండలం దర్వేశిపురం గ్రామ పరిధిలోని వేద ఫంక్షన్హాల్–2 లో ఇద్దరు వాచ్మెన్ల మధ్య పాత నూనె డబ్బాల విషయంలో శనివారం సాయంత్రం గొడవ జరిగింది. ఈ ఘటనలో కనగల్ గ్రామానికి చెందిన వాచ్మెన్ దొమ్మాటి సైదులు(56)పై గుర్రంపోడు మండలం గన్సిరాంతండాకు చెందిన మెగావత్ గోపీనాయక్ చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగి ఎవరి గదిలోకి వారు వెళ్లారు. కాగా ఆదివారం ఉదయం కడుపులో నొప్పి వస్తుందని సైదులు భార్యకు చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. చికిత్స నిమిత్తం అతడిని నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గోపినాయక్ దాడి కారణంగానే తన భర్త సైదులు మరణించాడని మృతుడి భార్య అక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండూరు సీఐ కే. ఆదిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఎస్. రామయ్య తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సైదులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. మృతుడితో గొడవపడిన గోపినాయక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
జి.ఎడవెల్లి వాగు పరిశీలన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కనగల్ మండల పరిధిలోని జి.ఎడవెల్లి వాగును శనివారం అధికారులు సందర్శించారు. అనుమతులు లేకుండా వాగులో నెల రోజుల నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతుండటంతో ‘తోడెయ్.. అమ్మెయ్’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ ఆదేశాల మేరకు వాగులో ఇసుక తవ్వకాలు జరిపిన స్థలాన్ని సీఐ ఆదిరెడ్డి, తహసీల్దార్ పద్మ, ఆర్ఐ సునీత, మైనింగ్ శాఖ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జి.యడవల్లి వాగు నుంచి ఇసుక తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేవని.. జేసీబీలతో అక్రమంగా తవ్వకాలు జరిపితే కఠిన తప్పవని హెచ్చరించారు. వాగు నుంచి అక్రమ రవాణా సాగించే దారుల్లో గుంతలు తీయిస్తామన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా.. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మెపాలని ఎస్పీ ఆదేశించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలిదేవరకొండ : కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కులకర్ణి విశ్వనాథ్ దిలీప్రావు అన్నారు. శనివారం ఆయన దేవరకొండ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కెవిఎస్.హరీష్బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్నేహ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమమహేష్, వనం జగదీష్, న్యాయవాదులు గాజుల ఆంజనేయులు, నెమ్మికంటి గౌరీశంకర్, నెమ్మికంటి రమాశంకర్, షౌకత్అలీ, ఇంద్ర వరప్రసాద్, అశోక్గౌడ్, రవి, శ్రీకాంత్, ఇద్దయ్య, గణేష్, ఆంజనేయులు, కృష్ణ, సురేష్, సాయి, శేఖర్ తదితరులున్నారు. -
ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలి
నల్లగొండ : యాసంగి ధాన్యం సేకరణకు రైస్ మిల్లర్లు సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి కోరారు. శనివారం ఆయన నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మిల్లర్లు.. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని, అయితే రైతుకు, మిల్లర్లకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. కొనుగోలు కేంద్రానికి రైతుకు మాత్రమే సంబంధం ఉంటుందని, ఈ విషయంలో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. తాలు, తరుగు సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని మిల్లర్లకు సూచించారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని కోరారు. నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు 4 లక్షలు ఎకరాల్లో బత్తాయి తోటలు ఉండేవని.. ఇప్పుడు 40 వేల ఎకరాలకు పడిపోయాయని.. రైతులు తిరిగి బత్తాయి సాగు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్చి 15వ తేదీ వరకు భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించామని తెలిపారు. సాదాబైనామా కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించామన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 330 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, గోపాల్, ఆదర్శ రైతు రామిరెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం మిర్యాలగూడ కార్యదర్శి శ్రీనివాస్, నల్లగొండ కార్యదర్శి భద్రాద్రి రాములు, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఏఓ శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
ఇంటి యజమానిగా మహిళలు 22.46 శాతమే..
ఫ ఓసీల్లో అత్యధికంగా వృద్ధులు ఫ నిరక్షరాస్యులు ఎస్సీల్లోనే అధికం ఫ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, కుల సర్వేలో వెల్లడి సామాజిక వర్గాల వారీగా ఇళ్లు.. జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు (బీసీల్లో, ఓసీలు అన్నీ కలిపి ఓసీల్లో కలిపి) నల్లగొండ 98,367 67,652 2,53,817 28948 62,854 5,11,638 సూర్యాపేట 75,102 49,525 1,75,323 22582 49,000 3,71,532 యాదాద్రి 48,753 15,494 1,57,310 8803 30,406 2,60,766 -
మహిళలను కించపరిచిన ప్రతిపక్షాలు
నకిరేకల్ : భారత ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించి మహిళలను కించపరిచాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి అన్నారు. శనివారం నకిరేకల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సగం జనాభా ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారని.. కానీ, కాంగ్రెస్ పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తే నాయకుల ఆటలు సాగవనే భయంతో అడ్డుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు గర్రె మురళి మోహన్, కిసాన్ మోర్చా నాయకుడు గోలి మధుసూధన్రెడ్డి, చినేని జాని, యానాల శంకర్రెడ్డి, పల్స శ్రీనుగౌడ్, యానాల శ్రీనివాస్రెడ్డి, చెనగాని రాములు, పందాల సైదులు, పెండెం పురుషోత్తం, గాయం మహేష్రెడ్డి, శ్రీకాంత్, ఏర్పుల అంజి తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి -
నిరక్షరాస్యులు ఎస్సీల్లో ఎక్కువ
ఉమ్మడి జిల్లాలో 15 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో నిరక్షరాస్యులు అత్యధికంగా ఎస్సీల్లోనే ఉన్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 31.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 46.9 శాతం మంది ఉన్నట్లు తేలింది. సూర్యాపేట జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 30.4 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 40.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 26.8 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 40.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. 15 ఏళ్ల పైబడిన వారిలో నిరక్షరాస్యుల శాతం ఇలా.. జిల్లా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 31.9 46.9 31.9 31.0 34.5 26.9 10.3 35.5 19.1 18.7 సూర్యాపేట 30.4 40.9 32.6 30.2 34.3 26.4 26.2 33.4 25.7 17.2 యాదాద్రి 26.8 40.9 28.6 26.1 30.2 22.6 9.7 29.7 18.7 20.0 -
కొనుగోళ్లలో కొర్రీలు పెట్టొద్దు
తిప్పర్తి : ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాలు, చెత్త పేరుతో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసినా మిల్లర్లు కోత విధిస్తున్నారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. మిల్లుల వద్ద లారీలను రెండు రోజులపాటు నిలిపివేసి.. ఆ తరువాత కోత విధిస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన చేస్తున్నట్లు తెలుసుకున్న తహసీల్దార్ రామకృష్ణ రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి.. కొనుగోళ్లు సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులతో మాట్లాడిన ఆర్డీఓ అశోక్రెడ్డి తిప్పర్తి కొనుగోలు కేంద్రం వద్ద ఆర్డీఓ అశోక్రెడ్డి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతుల రాశుల నుంచి ఒక బస్తా ధాన్యం తూర్పార బట్టి అందులో ఎంతశాతం తాలు వస్తుందో దాని ప్రకారం కొత విధించేలా మిల్లర్లతో మాట్లాడతామని తెలిపారు. -
విద్యుదుత్పత్తి కేంద్రంలో మాక్డ్రిల్
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జెన్కో ప్రధాన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో శనివారం అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్కో చీఫ్ ఇంజినీర్ మంగేష్కుమార్ మాట్లాడుతూ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, జోన్ డీఐజీ మాధవరావు ఉత్తర్వుల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాలను ఎలా అడ్డుకోవాలి, ప్రాణ, ఆస్థి నష్టం కలగకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే విషయంలో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు రఘురాం, రామకృష్ణారెడ్డి, జెన్కో డీఈ, ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ ప్రతాప్నాయుడు, ఆర్ఐ శ్రీనివాసరావు ఉన్నారు.జెన్కో ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న అగ్నిమాపక సిబ్బంది -
భానుడు @41 డిగ్రీలు
నల్లగొండ టౌన్ : భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ పట్టణంలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఉదయం 10 గంటల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు ఇళ్లకు పరిమితమై ఏసీలు, కూలర్ల ద్వారా సేదదీరుతున్నారు. ఈ నెలాఖరు వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అన్ని ప్రాథమిక, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దవాఖానాలు, అంగన్వాడీ కేంద్రాల్లో, ఉపాధి సిబ్బంది, ఆశా వర్కర్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు వడదెబ్బ బాధితులకు వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, సైలెన్ బాటిల్లు సిద్ధంగా ఉంచారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎక్కడైనా వేసవిలో వచ్చే జబ్బులు ప్రబలి ప్రజలు ఇబ్బంది పడితే వెంటనే ఆ బృందాలు ఆ గ్రామాలకు చేరుకుని వైద్య చికిత్స అందించనున్నారు. ఫ నల్లగొండ పట్టణంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదు ఫ పెరుగుతున్న ఎండలతో జనం బెంబేలు ఫ అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా వైద్యారోగ్య శాఖ ఈ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు ఇలా.. తేదీ డిగ్రీల సెల్సియస్ 2 36.5 8 37.5 14 38.5 15 39.5 16 40 -
జి.ఎడవెల్లి వాగులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
ఫ అర్ధరాత్రి వేళలో జేసీబీతో తోడేస్తున్న వ్యాపారులు ఫ అనుమతుల పేరుతో పగటి పూట కూడా రవాణా ఫ అధికార పార్టీ నాయకుడి అండతో రెచ్చిపోతున్న కొందరు ఫ చోద్యం చూస్తున్న పోలీస్ అధికారులుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : కనగల్ మండలంలో ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. కొందరు అర్ధరాత్రి వేళ జి.ఎడవెల్లి వాగును తోడేస్తున్నారు. ఇసుక తవ్వకంపై రైతులు, గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం ఇస్తున్నా ఓ రాజకీయ నాయకుడి ఒత్తిడితో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలలో సగం రోజులు ఇందే తంతు.. నెలలో 15 రోజుల వరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి 2 గంటల సమయంలో వాగులోకి జేసీబీని ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. అలాగే పగటి పూట కూడా అనుమతుల మాటున ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇదే విషయంపై పలుమార్లు పైస్థాయి అధికారులకు కూడా సమాచారం అందించినా వారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసుల వెనుకడుగు! ఒకవేళ పక్కా సమాచారంతో జేసీబీ, ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించినా ఎలాంటి కేసులు నమోదు చేయకుండా తమనే బెదిరిస్తున్నారని పోలీసులు వాపోతున్నారు. వదలమంటే సదరు నాయకుడు రంగంలోకి దిగి ట్రాక్టర్లు స్టేషన్కు తీసుకొచ్చిన మరుసటి రోజే రాజకీయ పైరవీలు చేసి దర్జాగా బయటకు తీసుకెళ్తున్నాడు. చేసేదేమీలేక స్టేషన్కు వచ్చిన ఇసుక ట్రాక్టర్లను బయటికి పంపిస్తున్నారు. దీంతో రైతులు, గ్రామస్తులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు పట్టుకునేది ఎందుకు, స్టేషన్ తీసుకువచ్చేది ఎందుకు, వదిలి పెట్టేది ఎందుకు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటల తర్వాత వాగులోకి జేసీబీని దింపి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నా దళారుల్లో మార్పు రావడం లేదు. రాజకీయ నాయకుల అండతో కొన్ని గంటల్లోనే బయటకు వచ్చి మళ్ళీ దందా మొదలుపెడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలి. – కందుల లక్ష్మయ్య, జి.ఎడవెల్లి ప్రస్తుతం కనగల్ ఎస్ఐగా పనిచేస్తున్న రాజీవ్రెడ్డి అందరి ఎస్ఐల మాదిరిగా కాకుండా వచ్చి రాగానే ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఎలాంటి రాజకీయ పైరవీలకు తావులేకుండా అనేక ట్రాక్టర్లు, జేసీబీలపై కేసులు నమోదు చేసి ఇసుక వ్యాపారుల్లో వణుకు పుట్టించారు. కానీ జి.ఎడవెల్లిలో మాత్రం ఇసుక అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికార పార్టీ ముఖ్య నేత కావడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ ఎస్ఐకి మంచి పేరు ఉన్నప్పటికీ.. ఒక్క జి.ఎడవెల్లి వాగు విషయంలో మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు గతంలో ఇక్కడ పనిచేసిన మరో ఎస్ఐ ఆ సదరు నేత తీరు వల్ల స్వచ్ఛందంగా వేరేవేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. జి.ఎడవల్లి వాగులో అక్రమ ఇసుక రవాణాపై సమాచారం వస్తోంది. ఇటీవలే ఒక జేసీబీ, ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేసి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశాం. అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో మాపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్న మాట వాస్తవమే. అయినప్పటికీ అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. – రాజీవ్రెడ్డి, ఎస్ఐ, కనగల్ -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
నల్లగొండ : కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున యాసంగి ధాన్యం వస్తున్నందున మిల్లర్లు జాప్యం చేయకుండా అన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లోని తన చాంబర్లో రైస్ మిల్లర్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, మరో 15 రోజుల్లో మరో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, తాలు, లారీలు తదితర కారణాలతో ఎలాంటి కొర్రీలు పెట్టవద్దన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి నోటిఫైడ్ లారీలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల జిల్లా మేనేజర్ను ఆదేశించారు. మిల్లర్ల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, బ్యాంకు గ్యారంటీ, మిల్లర్ అగ్రిమెంట్ సమర్పించని మిల్లర్లు వెంటనే అవి ఇవ్వాలని తెలిపారు. ఇప్పటివరకు మిల్లుల వారీగా దిగుమతి చేసుకున్న ధాన్యం వివరాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా అధికారులు వెంకటేశం, రాంపతినాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డీసీఓ పత్యానాయక్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అర్థరహితం
నల్లగొండ : పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్–భారత్ విభజనతో పోల్చడడం అర్థ రహిత మని జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ నల్లగొండలోని గడియారం సెంటర్లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పున్న కై లాష్ మాట్లాడుతూ బలిదానాలు, త్యాగాలను అవహేళన చేస్తున్న బీజేపీ తెలంగాణలో భూస్థాపితం కావడం ఖాయమన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్రెడ్డి లేవనెత్తిన వాటికి సమాధానాలు చెప్పకుండా ప్రధాని మోదీ, అమిత్సా కుట్ర పన్నుతున్నారన్నారు. ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకలు ముంతాజ్ అలీ, పెరిక వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి పరమేష్, నోముల జనార్దన్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, చింతమల్ల వెంకటయ్య, వేముల గోపినాథ్, తగుళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, సాగర్రెడ్డి, హరీష్, పల్లా రవితేజ, వెంకన్న, శ్రీను, అంజయ్య, అజీజ్ పాల్గొన్నారు. -
చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి అమావాస్య పూజలు కొనసాగాయి. ప్రధానంగా లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజ ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అమావాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. గట్టుపైన ట్రాఫిక్ జామ్ కాకుండా ఎస్ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకున్నారు. పూజ కార్యక్రమంలో చెర్వుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణ, ఈఓ మోహన్బాబు, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ వరాల రమేష్, వార్డు సభ్యులు శ్రీకాంత్, సాయి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
మిర్యాలగూడ : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ భద్రత వారోత్సవాల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఏఆర్సీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రికి తరలించిన వారికి రహవీర్ పథకం ద్వారా మొదటిసారి రూ.25వేలు, రెండవసారి రూ.50వేలు, మూడోసారి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందనుందన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలోని హైవేల వెంట ఉన్న మద్యం దుకాణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున వాటిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స విధానాలను ప్రదర్శించి అవగాహన కల్పించారు. ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పట్టణంలో ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ఉచిత పెరుగన్నం పంపిణీలో ఎస్పీ పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్రాజు, సీఐలు నాగభూషణ్, సోమనర్సయ్య, పీఎన్డీ.ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ జి.శిరీషనవీన్ పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తం చేస్తూ మున్సిపల్, గ్రామ స్థాయిలో నియమించిన కమిటీలు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. నల్లగొండ కలెక్టరేట్ నుంచి శుక్రవారం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, ఉపాధి కూలీలు, రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు, మున్సిపల్ శానిటరీ వర్కర్లు అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే టీపీలు ధరించి నీళ్ల బాటిల్, వెంట ఉంచుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈనెల 18న గ్రామస్థాయిలో వడగాల్పులపై అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. వడగాల్పులపై ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రతిరోజు నివేదిక పంపించాలని, అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పశువుల తొట్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ఓఆర్ఎస్ పాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. అత్యసరమైతే జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ప్రీ నంబర్ 18004251422 , వాట్సాప్ నంబర్ 6305951279కు తెలియజేయాలని సూచించారు. -
ఆర్టిజన్ల సమ్మె విరమణ
నల్లగొండ : విద్యుత్ శాఖలో పనిచేసే ఆర్టిజన్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పది రోజులుగా నల్లగొండలోని జిల్లా సర్కిల్ కార్యాలయం ముందు సమ్మె నిర్వహిస్తున్నారు. 10వ రోజు శుక్రవారం డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టిజన్ కార్మికుల సంఘం నేతలు ప్రకటించారు. చివరి రోజు సమ్మెలో నల్లగొండ జేఏసీ నాయకులు జిట్టబోయిన లింగస్వామి, కన్వీనర్ మద్ది శ్రీనివాష్, విశ్వకుమార్, గడ్డం మల్లేష్, పున్నకుమార్, వేణుగోపాల్రెడ్డి, జానయ్య, రమేష్, వెంకన్న, శేఖర్, లింగయ్య, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శిపై బదిలీ వేటుశాలిగౌరారం : శాలిగౌరారం పంచాయతీ కార్యదర్శి విజయ్కుమార్పై బదిలీ వేటు పడింది. ఎంపీడీఓపై మండల పంచాయతీ కార్యదర్శులు.. ఒకరిపై మరొకరు కలెక్టర్కు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో రెండురోజుల క్రితం అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేశారు. దీంతో కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించి శాలిగౌరారం పంచాయతీ కార్యదర్శి విజయ్కుమార్ను గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామపంచాయతీకి డిప్యూటేషన్పై పంపుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేయగా శుక్రవారం బయటికి వచ్చాయి. అదేవిధంగా గుర్రంపోడు మండలం పోచంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న జయకర్ను శాలిగౌరారం పంచాయతీ కార్యదర్శిగా డిప్యూటేషన్పై పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి చేస్తున్న అవినీతి, అక్రమాలతోపాటు ఆమె చూపుతున్న సామాజిక వివక్షను ప్రంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓ ప్రశ్నించినందుకే శాలిగౌరారం పంచాయతీ కార్యదర్శిపై డిప్యూటేషన్ వేటు వేశారని ఉద్యోగ, రాజకీయ, సామాజిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. శాలిగౌరారం ఇన్చార్జి ఎంపీడీఓగా రజితశాలిగౌరారం : శాలిగౌరారం ఇన్చార్జి ఎంపీడీఓగా నకిరేకల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓగా విధులు నిర్వర్తిస్తున్న జె.రజిత నియమితులయ్యారు. ఈ మేరకు జెడ్పీ సీఈఓ ఎన్.ప్రేమ్కరణ్రెడ్డి శుక్రవారం శాలిగౌరారం ఎంపీడీఓగా రజితకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాలిగౌ రారం ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతో రెండు రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి శుక్రవారం నుంచి సెలవుపై వెళ్లడంతో ఆమె స్థానంలో రజితకు ఎంపీడీఓగా బాధ్యతలు అప్పగించారు. బైపాస్ నిర్మాణంలో లోపాలను సరిదిద్దాలినల్లగొండ టూటౌన్ : పానగల్ బైపాస్ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులే గుర్తించారని, వీటిని వెంటనే సరిదిద్దాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి అన్నారు. నాణ్యత లేని మట్టితో హైవే నిర్మాణం చేపడుతున్నారని తాను చేసిన ఫిర్యాదుతో శుక్రవారం నల్లగొండకు వచ్చిన జాతీయ రహదారుల అథారిటీ చీఫ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్తో పాటు పలువురు అధికారులతో కలిసి ఆయన రోడ్డు పనులను పరిశీలించి మాట్లాడారు. అధికారులు శాంపిల్స్ సేకరించినట్లు వర్షిత్రెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కళ్లముందే రోడ్డు నిర్మాణం నాణ్యత లేకుండా జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. శాంపిల్స్ ల్యాబ్కు పంపించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని జాతీయ రహదారి అథారిటీ అధికారులు తెలిపినట్లు చెప్పారు. నాగం వెంట బీజేపీ సీనియర్ నాయకులు పోతెపాక సాంబయ్య తదితరులు ఉన్నారు. పాలిసెట్కు ఉచిత శిక్షణరామగిరి (నల్లగొండ) : పాలిసెట్కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఈనెల 20 నుంచి మే 11 వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.నరసింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. మే నెల 13న జరిగే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల కోసం నల్లగొండ ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 18, 19 తేదీల్లో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
రేషన్.. నో స్టాక్!
రాష్ట్ర కోటా కింద ఇవ్వాల్సిన బియ్యం జిల్లాలో సరిపడా లేకపోవడంతో పౌర సరఫరాల శాఖ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యాన్ని అలాట్ చేసింది. మూడు వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఆ రెండు జిల్లాల నుంచి నల్లగొండ జిల్లాకు అలాట్ చేశారు. స్టేట్ కోటా కూడా దాదాపు 70 శాతం వరకు పూర్తయింది. 30 శాతం బియ్యం రావాల్సి ఉంది. మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకే నెలలో ఇస్తుండటంతో రేషన్ షాపుల వద్ద నిల్వలు ఉండడం లేదు. నల్లగొండ : రేషన్ దుకాణాల్లో బియ్యం లేవు. జిల్లా వ్యాప్తంగా చాలా దుకాణాల వద్ద డీలర్లు నోస్టాక్ బోర్డులు పెట్టారు. రేషన్ సరఫరాలో కేంద్రానికి సంబంధిన కోటా పూర్తికాగా.. రాష్ట్ర కోటా మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో రేషన్ దుకాణాలకు చేరలేదు. అధికారులు ఇతర జిల్లాలను నుంచి తెప్పించడంలో జాప్యం కారణంగా జిల్లాలో లబ్ధిదారులకు సమయానికి బియ్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. 30వ తేదీ వరకు పంపిణీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఈ నెలలోనే వస్తోంది. ప్రతి నెలా 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఈ నెలలో 30వ తేదీ వరకు బియ్యం ఇవ్వనుంది. అయితే బియ్యం పంపిణీలో సమస్యలు ఎదురవుతున్నాయి. బియ్యం పంపిణీలో ప్రభుత్వం రేషన్ పోర్టబులిటీ విధానం అమలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా కార్డుదారుడు రేషన్ పొందవచ్చు. దీనివల్ల కొన్ని షాపుల్లో కోటాకు మించి బియ్యం ఉండగా.. కొన్ని షాపులు బియ్యం లేక మూసివేస్తున్నారు. 5,39,864 ఆహారభద్రత కార్డులు జిల్లాలో మొత్తం 5,39,864 ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద 3,02,674 కార్డులుండగా.. స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కింద 2,37,190 కార్డులు ఉన్నాయి. కేంద్రానికి సంబంధించిన కార్డులకు సెంట్రల్ గవర్నమెంట్ గోదాముల నుంచి, స్టేట్ కోటా కింద ఉన్న కార్డులకు రాష్ట్ర గోదాముల నుంచి ప్రతి నెలా బియ్యాన్ని రేషన్ షాపులకు తరలిస్తారు. కేంద్రానికి సంబంధించి కార్డుల కోటా బియ్యాన్ని ఇప్పటికే ఆయా గోదాముల నుంచి రేషన్ షాపులకు అందించారు. అయితే స్టేట్ కార్డులకు సంబంధించి ఇంకా పూర్తి కోటా రవాణా కాలేదు. రాష్ట్రం యూనిట్గా చేసుకుని ఎక్కడైతే బియ్యం అవసరమో, ఏ జిల్లాలో బియ్యం ఉంటాయో ఆ జిల్లాల నుంచి అవసరమున్న జిల్లాలకు బియ్యం రవాణా చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ కోటా కింద నల్లగొండ జిల్లాకు.. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు బియ్యం అలాట్ చేశారు. ఇప్పటికే అక్కడి నుంచి సగం వరకు రవాణా పూర్తయింది. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం తెచ్చి లబ్ధిదారులకు అందుబాటులో ఉంచుతాం. ఈ నెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తాం. – నాగేశ్వర్రావు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ నల్లగొండ ఫ రేషన్షాపుల్లో నిండుకున్న బియ్యం నిల్వలు ఫ దుకాణాలకు నోస్టాక్ బోర్డు తగిలించిన డీలర్లు ఫ బియ్యం సరఫరాలో పౌరసరఫరాల శాఖ జాప్యం ఫ లబ్ధిదారులకు సకాలంలో అందని బియ్యం -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు
● కలెక్టర్ చంద్రశేఖర్ కనగల్ : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. కనగల్ మండలంలోని జి.యడవల్లి, కనగల్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం రాత్రి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. మిల్లర్లు ధాన్యం దిగమతి ఆలస్యం చేయొద్దన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాలు సమస్య పరిష్కారం కోసం శుక్రవారం రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పద్మ, ఏఓ బెజవాడ అమరేందర్గౌడ్, ఎస్ఐ రాజీవ్రెడ్డి సర్పంచ్ వెంకటేశం, సీసీలు విజయ్కుమారి, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
భూదానంతో ఘన కీర్తి
వెదిరె రాంచంద్రారెడ్డి భూదానంతో పోచంపల్లికి, దేశానికి ఘన కీర్తి వచ్చిందని ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి అన్నారు. - 8లోప్రతిభ ఉన్నా అవకాశాలు లేక వెనుకబడిపోయిన వనితలకు ఇప్పుడు ఒక వేదిక లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం ఒక చట్టపరమైన నిర్ణయమే కాదు ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న అతివల ఆశలకు వెలుగునిచ్చిన చరిత్రాత్మక క్షణం. ఈ బిల్లు నారీమణులకు గౌరవం.. స్వరం.. రాజకీయంగా సమాన హక్కులు కల్పిస్తుంది. ఒకఅమ్మ.. ఒక అక్క.. ఒక కూతురు.. దేశం కోసం చట్టాలను రూపొం దించే స్థాయికి చేరిన శుభతరుణం. దేశ ప్రజాస్వా మ్యాన్ని సమానత్వంతో నింపడమే కాకుండా సగభాగమైన వారికి చట్టపరమైన హక్కు ఇచ్చిన అపూర్వ సందర్భం ఇది. నారీ.. చట్ట సభల్లో సవారీవాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ అధికంగా ఉంటుంది. -
యాదాద్రిలో బీసీలు అధికం
జిల్లాల వారీగా జనాభాతో పోల్చితే యాదాద్రి భువనగిరి జిల్లాలోనే బీసీల శాతం ఎక్కువగా ఉన్నారు. సంఖ్యా పరంగా మాత్రం నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో సంఖ్యా పరంగా ఎక్కువే అయినా మొత్తం జనాభాలో బీసీలు 54 శాతం ఉండగా, సూర్యాపేటలో 52 శాతం ఉన్నారు. ఇక యాదాద్రిలో అత్యధికంగా 63 శాతం మంది బీసీలు ఉన్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక జనాభా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా జనాభా ఉంది. అన్ని సామాజిక వర్గాల్లోనూ ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా అన్ని సామాజిక వర్గాల్లోనూ తక్కువే. టాయిలెట్ సదుపాయం ఉన్న కుటుంబాల శాతం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 69.8 79.7 88.5 86 91 94.3 86.6 92.6 93.8 సూర్యాపేట 68.7 73 84.6 81.9 85.7 87 83.7 88.7 92.8 యాదాద్రి 86.4 88.4 93.8 90.7 95.2 98.5 93.4 92.1 95.9 -
బీసీల తరువాత ఎస్సీలే అత్యధికం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీలే అత్యధికంగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తం జనాభా 34,80,057 కాగా, అందులో బీసీలు 19,48,993 మంది ఉన్నట్లు తేలింది. ఎస్సీలు 6,90,680 మంది ఉండగా, ఎస్టీలు 4,32,976 మంది ఉన్నారు. ఓసీలు 4,07,408 మంది ఉన్నారు. ఇక బీసీ, ఓసీల్లోని ముస్లింలు 1,91,334 మంది ఉన్నట్లు తేలింది. అందులో బీసీ ముస్లింలే అత్యధికంగా ఉండగా, ఓసీల్లో ముస్లింలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నల్లగొండ జిల్లాలో బీసీ ముస్లింలు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. -
లింగ వివక్షలో తేడాలు
సామాజిక వర్గాల పరంగా చూస్తే లింగ నిష్పత్తిలో చాలా తేడాలు ఉన్నాయి. కొన్ని సామాజిక వర్గాల్లో ప్రతి వేయి మంది పురుషులకు మహిళల సంఖ్య తక్కువగా ఉండగా.. కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం జనాభా పరంగా చూస్తే మాత్ర లింగ నిష్పత్తి తక్కువే ఉన్నట్లు తేలింది. ప్రతి వేయి మందికి నల్లగొండలో 969 మంది మహిళలు, సూర్యాపేటలో 989 మంది, యాదాద్రిలో 974 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అదే ఓసీల్లో చూస్తే మాత్రం మూడు జిల్లాల్లో మహిళ నిష్పత్తి ఎక్కువగా ఉంది. సామాజికవర్గాల వారీగా.. సొంతిళ్లు కలిగిన వారి శాతం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 84.4 80.0 81.2 79.8 81.9 74.3 84.9 65.1 83.2 సూర్యాపేట 79.5 70.2 73.7 70.4 76.0 57.0 76.2 61.2 76.8 యాదాద్రి 73.8 72.2 72.7 69.7 73.4 62.1 75.2 55.9 76.9 ఇళ్లు లేని వారి శాతం నల్లగొండ 6.1 6.3 3.5 4.5 3.3 2.1 3.6 2.2 2.1 సూర్యాపేట 7.5 9.2 5.8 6.9 5.6 5.7 5.8 5 3.4 యాదాద్రి 6.1 6.2 4.0 5.1 3.7 2.3 3.8 3.9 3.3 -
సొంతిళ్లు ఉన్న వారిలో బీసీ–ఈ వారే తక్కువ
జిల్లాలోని మొత్తం నివాస సముదాయాల్లో సొంతిళ్లు కలిగిన వారిలో బీసీ–ఈ వారే తక్కువగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో బీసీ–సీ వారు ఉన్నారు. సొంతిళ్లు కలిగిన వారిలో మూడు జిల్లాల్లోనూ ఎస్సీలు, ఓసీలే ఎక్కువ ఇళ్లు కలిగి ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సొంతిళ్లు లేని వారిలో ఎస్టీలే అత్యధికంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 9.2 శాతం ఎస్టీలకు సొంతిళ్లు లేవు. అదే జిల్లాలో 7.5 శాతం ఎస్సీలకు సొంతిళ్లు లేవు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోనూ ఎస్టీలకు సొంతిళ్లు లేవు. 15 ఏళ్ల పైబడిన వారిలో నిరుద్యోగులుగా ఉన్న వారు జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 6.5 9.5 10.2 10.0 11.2 7.7 9.8 9.5 13.4 సూర్యాపేట 7.3 10.0 10.7 10.3 11.3 6.6 10.6 10.2 14.1 యాదాద్రి 9.0 12.2 12.3 11.7 12.8 10.5 12.2 10.6 14.7 -
ఉమ్మడి జిల్లాలో తేలిన బీసీల లెక్క
సాక్షి ప్రతినిధి, నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కులాల వారీ జనాభా లెక్కలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే (ఎస్ఈఈఈపీఎస్–2024) ప్రకారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఎంత మంది బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారనే లెక్కలు ఉపకులాల వారీగా వెల్లడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వెనుకబడిన వర్గాలు (బీసీ) 56 శాతం ఉండగా, ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 12.45 శాతం, ఓసీలు 11.70 శాతం ఉన్నారు. ఇక, అటు బీసీల్లోనూ, ఓసీల్లోనూ ఉన్న ముస్లిం మైనార్టీలు 5.50 శాతం ఉన్నారు. అయితే, గతంలో ఎప్పుడు జనాభా లెక్కలు జరిగినా కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు మాత్రమే వెల్లడించేవారు కానీ, ఈసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే అనంతరం తొలిసారి ఉపకులాల వారీగా బీసీ, ఓసీల లెక్కలు కూడా స్పష్టంగా తేలడం గమనార్హం. సామాజికవర్గాల వారీగా జనాభా జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఓసీ అన్నీ కలిపి (బీసీలో ఓసీలో కలిపి) నల్లగొండ 3,14,670 2,29,625 7,86,788 94,613 1,78,043 16,03,739 సూర్యాపేట 2,21,989 1,50,665 5,01,982 66,277 1,31,376 10,72,289 యాదాద్రి 1,54,021 52,686 4,80,978 30,444 85,900 8,04,029 సామాజికవర్గాల వారీగా గ్రామీణ జనాభా నల్లగొండ 259196 216296 615509 36296 120982 1248279 సూర్యాపేట 176461 134204 380959 36817 88875 817316 యాదాద్రి 129245 50575 386267 15,641 71303 653031 సామాజిక వర్గాల వారీగా పట్టణ జనాభా నల్లగొండ 55474 13329 171279 58317 57061 355460 సూర్యాపేట 45528 16461 121023 29460 42501 254973 యాదాద్రి 24776 2111 94711 14803 14597 150998 -
కొత్తగా పార్లమెంట్ స్థానం ఏర్పాటుపై చర్చ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో కొత్తగా పార్లమెంట్ స్థానం ఏర్పాటుపై చర్చ కొనసాగుతోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాట య్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దానిని జిల్లా కేంద్రమైన సూర్యాపేట కేంద్రంగానే ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఆరు అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి కొత్త జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 12 నుంచి 18కి చేరనుండగా, ఖమ్మం, వరంగల్లోని మూడు స్థానాలను కలపుకొని కొత్త లోక్సభ స్థానాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ వర్గాల విశ్లేషణ కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ, లోక్సభ స్థానాలను పెంచేందుకు బిల్లును రూపొందించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోనూ నియోజకవర్గాల పునర్విభజనపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాలు ఉండగా, పునర్విభజన అనంతరం సూర్యాపేట కేంద్రంగా మూడో లోక్సభ నియోజకవర్గం ఏర్పాటు కానుందనే విశ్లేషణ రాజకీయవర్గాల్లో సాగుతోంది. మరోవైపు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రెండేసి చొప్పున కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మారనున్న లోక్సభ స్థానాల పరిధి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే స్థానంతోపాటు ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల పరిధులు మారే అవకాశం ఉంది. మరోవైపు నల్లగొండ పార్లమెంట్ స్థానంలో నల్లగొండ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలతోనే సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇక సూర్యాపేట జిల్లాలోని అసెంబ్లీ స్థానాలతోపాటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసే అసెంబ్లీ స్థానాలు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని రెండు నియోజకవర్గాలను కలుపుకొని కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం నల్లగొండ లోక్సభ పరిధిలో కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలున్నాయి. ఇవి కాకుండా నల్లగొండలో నల్లగొండ అర్బన్, రూరల్ నియోజకవర్గాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. నల్లగొండ పట్టణంతోపాటు రూరల్ మండలం కలుపుకుని నల్లగొండ అర్బన్ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారనే చర్చ ఉంది. మరోవైపు కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలతో నల్లగొండ రూరల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయవచ్చనే చర్చ సాగుతోంది. ఇక మిర్యాలగూడ, హుజూర్నగర్లోని కొన్ని మండలాలలను కలుపుకొని మరో నియోజకవర్గం ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే ఆ కొత్త నియోజకవర్గంతోపాటు నల్లగొండ అర్బన్, నల్లగొండ రూరల్, మిర్యాలగూడ, నకిరేకల్, నాగార్జునసాగర్, దేవరకొండతో నల్లగొండ లోక్సభ స్థానాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సూర్యాపేటలోనూ అర్బన్ నియోజకవర్గం ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట టౌన్తో పాటు రూరల్ మండలాన్ని కలుపుకొని సూర్యాపేట అర్బన్ నియోజకవర్గంగా, సూర్యాపేట రూరల్ నియోజకవర్గాన్ని ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్పహాడ్, ప్రస్తుతం కోదాడలోని మోతె మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తుంగతుర్తి నియోజవర్గంలోని నాగారాన్ని కూడా నియోజక వర్గం చేస్తారనే చర్చ జరుగుతోంది. దీంతో కొత్తగా ఏర్పాటు చేయబోయే సూర్యాపేట లోక్సభ పరిధిలోకి సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి, నాగారం, వరంగల్, ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలతో సూర్యాపేట లోక్సభ స్థానం ఏర్పడొచ్చన్న చర్చ సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిఫ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలతో నూతన నియోజకవర్గం ఫ సూర్యాపేట కేంద్రంగా ఏర్పడే అవకాశం ఫ ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఆరు అసెంబ్లీ స్థానాలు ఫ ప్రతి జిల్లాలో రెండుచొప్పున ఏర్పాటు రాష్ట్రంలో కొత్తగా 9 లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడున్న 17 స్థానాలు 26కు పెరుగనున్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు, దక్షిణ తెలంగాణలో రెండు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రెండు లోక్ సభస్థానాలు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణలో ఒకటి సూర్యాపేట కేంద్రంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. భువనగిరి లోక్సభ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, భువనగిరి, మునుగోడు, ఉమ్మడి వరంగల్లోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఉన్నాయి. భువనగిరి పరిధిలోనుంచి ఆ రెండింటిని తొలగించి కొత్తగా ఏర్పాటు చేసే అసెంబ్లీ స్థానాలతోనే సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మోత్కూరు, అడ్డగూడురు, ఆత్మకూరు, గుండాల, వలిగొండ మండలాలతో మోత్కూరును అసెంబ్లీ నియోజకవర్గంగా చేస్తారన్న చర్చ సాగుతోంది. చౌటుప్పల్, నారాయణపూర్, పోచంపల్లి, రామన్నపేట కలుపుకొని చౌటుప్పల్ లేదా రామన్నపేటను నియోజకవర్గం చేసే అవకాశం ఉంది. దీంతో వాటిని భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. -
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవాలి
నకిరేకల్ : రోడ్డు ప్రమాదాల నివారణ.. భద్రతా చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తేవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్ సూచించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం రాత్రి ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ వారోత్సవాల సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. జాతీయ రహదారుౖలపై నిత్యం ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని గుర్తించి అక్కడ అండర్ పాస్ల నిర్మాణానికి ప్రణాళిలకు రూపొందిస్తే సీఎం రేవంత్రెడ్డితో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఎవరైన మోటార్ సైకిల్పై వస్తే హెల్మెట్ లేకుండా రావొద్దని ఈ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గ్రామ సభ తీర్మానాలు చేసి డీజీపీకి సమర్చించడం గొప్ప నిర్ణయమన్నారు. నకిరేకల్లో స్థలం చూస్తే ఇక్కడి ఎమ్మెల్యే వీరేశం కోరిన విధంగా మహనీయుల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల సమస్య పరిష్కారం కోసం చేపట్టే కార్యక్రమాల్లో వార్డు మెంబర్ నుంచి పైస్థాయి వరకు అందరిని, అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేయాలని పోలీస్ శాఖ పక్షాన సీఎంతో చర్చించామన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలందరు చైతన్యం కలిగి ఉండాలన్నారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 18 వరకు జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత కార్యక్రమాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. జిల్లా జాతీయ రహదారిపై ఈ సంవత్సరం జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ చౌహాన్, ఎమ్మెల్యేలు మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పాడిపరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అమిత్రెడ్డి, సూర్యాపేట ఎస్పీ నరసింహ, ఇన్చార్జి అదనపు కలెక్టర్ యానాల అశోక్రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, రోడ్డు భద్రత ప్రత్యేక అధికారి పోలిశెట్టి అంజయ్య, డీసీసీ అధ్యక్షుడు పున్న కేలాష్నేత, రాష్ట్ర నాయకులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల,చౌగోని రజితా, స్దానిక సీఐలు హరిబాబు, కొండల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రమాదాలు జరిగే చోటఅండర్ పాస్లు నిర్మిస్తాం ఫ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలి
నార్కట్పల్లి : విద్యార్థుల్లోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రతిభా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని డీఈఓ భిక్షపతి అన్నారు. నార్కట్పల్లిలో జెడ్పీహెచ్ స్కూల్ కాంప్లెక్స్లో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ప్రతిభా పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డీఈఓ బహుమతులు అందజేసి మాట్లాడారు. 32 మంది విద్యార్థులు ప్రతిభా పోటీల్లో విజేతలుగా నిలువడం సంతోషించదగిన విషయమన్నారు. ఈ సందర్భంగా ప్రతిభా బహుమతుల కింద రూ.10 వేల ఆర్థికసాయం చేసిన కై రంకొండ రామకృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కూకుట్ల నరసింహ, హెడ్మాస్టర్ డి.రాములు, రహీమున్నీసా బేగం, శరత్, రవీందర్రెడ్డి, అరుణ, స్వప్న, నరేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. హెటెరోలో ఉద్యోగాలకు 18న ఇంటర్వ్యూనల్లగొండ : హైదరాబాద్లోని హెటెరో ఫార్ములేషన్స్ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 18న నల్లగొండలోని టీజీఎంఆర్జేసీ బాలుర కళాశాలలో అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ (స్పెషల్ డ్రైవ్) నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ అబ్దుల్ కయ్యూం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అర్హత, నెల వారి వేతనం తదితర పూర్తి వివరాలకు సెల్ : 8121043322 నంబర్కు సంప్రదించాలని కోరారు. సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచిరామగిరి (నల్లగొండ) : సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి అని కవి, విమర్శకుడు డాక్టర్ పగడాల నాగేందర్ అన్నారు. నల్లగొండ ఎన్జీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఎం.ఏ తెలుగు విద్యార్థులకు ఆస్తిత్వ ఉద్యమాలు ఆరంభ వికాసాలు అనే అంశంపై బుధవారం నాగేందర్ విస్తృతోపన్యాసం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ్త్రవాద, దళిత, బహుజన, ముస్లిం మైనార్టీ, ప్రాంతీయ అస్తిత్వ వాదాలు కేవలం తాత్కాలిక ఉద్యమాలు కావని, అవి సమాజంలో పాతుకుపోయిన అసమానతలపై చేసే నిరంతర పోరాటాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, తెలుగు విభాగం అధ్యక్షుడు డాక్టర్ వెల్దండి శ్రీధర్, డాక్టర్ వాస భూపాల్, డాక్టర్ టంగుటూరి సైదులు, అంజయ్య, లింగస్వామి, శ్రవణ్ కుమార్, వనజ అధ్యాపకులు పాల్గొన్నారు. కొలతల ప్రకారం ఉపాధి పనులు చేయాలినకిరేకల్ : ఉపాధి హామీ పనుల్లో రోజువారి వేతనం రూ.307 రావాలంటే కొలతల ప్రకారం పని చేయాలని డీఆర్డీఓ వై.శేఖర్రెడ్డి అన్నారు. నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పని ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. కాల్వ పూడక తీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, నర్సరీని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీఎం రమణయ్య ఉన్నారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు వైభవంగా నిర్వహించారు. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. -
ఆదాయం అంతంతే..
నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగర విస్తరణ, అభివృద్ధికి తగ్గట్టుగా కార్పొరేషన్ ఆదాయం పెరగడం లేదు. నగరంలో శివారు కాలనీలు పెరగడంతో పాటు ఆయా కాలనీల్లో ఐదారు అంతస్తుల భవన నిర్మిస్తున్నారు. వీటికితోడు ఇటీవల కాలంలో షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా వెలిశాయి. దీంతో కార్పొరేషన్ సేవలతోపాటు కార్పొరేషన్కు ఖర్చులు కూడా భారీగానే పెరిగిపోయాయి. కానీ దానికి తగ్గట్టుగా ఆస్తి పన్ను వసూలు కావడంలేదని, తద్వారా ఆదాయం అంతంత మాత్రంగానే సమకూరుతుందనే చర్చ కొనసాగుతోంది. నగరంలో 44 వేల భవనాలు.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 వార్డుల్లో 44 వేలకుపైగానే భవనాలకు ఇంటి నంబర్లు ఉన్నాయి. ఈ భవనాల ద్వారా అనుకున్న స్థాయిలో ఆస్తి పన్ను ద్వారా ఆదాయం సమకూరడంలేదు. గత కొన్నేళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్కు ఆస్తి పన్ను ద్వారా కచ్చితంగా రావాల్సిన ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. 44వేల భవనాలకు దాదాపుగా రూ.30 కోట్ల వరకు ఆస్తి పన్ను ద్వారా ఆదాయం రావాల్సి ఉంది. కానీ ప్రసుతం ఆస్తి పన్ను ద్వారా రూ.18 కోట్లు మాత్రమే వస్తుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవలందిస్తున్న కార్పొరేషన్ అదే స్థాయిలో ఆదాయం కూడా రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్కు ఇటీవల కొత్తగా జేసీబీలు, ర్యాడర్, ఇతర వాహణాల కొనుగోలు చేయడం, వాటి నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. పెరిగిన ఖర్చులకు ఆదాయం పెంచుకునే దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. యంత్రాంగం దృష్టి సారిస్తే మేలు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నీలగిరి నగరంలోని వాణిజ్య సముదాయాలు, షాపింగ్ కాంప్లెంక్స్లు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు, కార్ల షోరూంల భవనాలను రీ మదింపు (అసెస్మెంట్) చేస్తే ఆస్తి పన్ను రూ.18 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కార్పొరేషన్ యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నాలుగైదు అంతస్తుల భవనాలు ఉన్నవారిలో కొందరు ఒక అంతస్తుకు, రెండస్తులకు మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ రోడ్లో ఓ బైక్ షోరూం భవనం ఐదు అంతస్తులు ఉండగా కేవలం రూ.10 వేలు మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. అదేవిధగాం ఇదే రోడ్లో మరో బైక్ షోరూం వారు అన్ని అంతస్తులకు చెల్లించకుండా మూడు అంతస్తులకు రూ.లక్ష మాత్రమే వస్తుంది. ఆయా బైక్ షోరూం భవనాలకు ఏడాదికి వాస్తవ ఆస్తి పన్ను రూ.3 లక్షల వరకు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా బోయవాడలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఐదంతస్తుల భవనం ఉండగా కేవలం రెండంతస్తులకే ఆస్తిపన్ను చెల్లిస్తున్నట్లు తెలిసింది. రామాలయం సమీపంలోని ఓ కార్పొరేట్ మాల్ భవనం, దానికి సమీపంలోనే ఉన్న మరో షాపింగ్ కాంప్లెక్స్, ఎన్జీ కాలేజీ సమీపంలో ఉన్న ఓ మాల్ భవనం, ఎల్వీ బంక్ సమీపంలో ఉన్న మరో రెండు భవనాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందున రెట్టింపు ఆస్తి పన్ను వేసే అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కటి రెండు కాదు కార్పొరేట్ మాల్స్, పాత భవనాల స్థానంలో కొత్తగా నిర్మించిన దుకాణాలకు రీ మదింపు చేసే దిశగా కార్పొరేషన్ యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది. ఫ నీలగిరి కార్పొరేషన్ ఆదాయం పెరగట్లే..! ఫ వసూలు కావాల్సిన ఆస్తి పన్ను రూ.30 కోట్లు ఫ 44 వేల భవనాలున్నా.. రూ.18 కోట్లే వసూలు ఫ మళ్లీ మదింపు చేస్తేనే దండిగా ఆదాయం -
రెండో విడత రైతు భరోసా ఏదీ!
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్కు సంబంధించిన రెండో విడత రైతు భరోసా నిధుల జమపై ప్రభుత్వం నేటికీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. మొదటి విడతలో ఎకరంన్నర భూమి ఉన్న రైతులందరికీ మార్చి 22వ తేదీన రూ.6 వేల చొప్పున ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి రెండో విడత నిధులను జమ చేసి ఈ నెలాఖరు వరకు మూడు విడతలో రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాలకు నిధులు జమ చేస్తామని ప్రకటించింది. అసలు రెండో విడత రైతు భరోసా నిధులు జమ చేస్తుందో చేయదోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి వానాకాలం, యాసంగి సీజన్కు కలిపి రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతో ఎకరాకు సంవత్సరానికి రెండు సీజన్లకు కలిపి రూ.12 వేలు చొప్పున జమ చేస్తానని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున గత యాసంగి సీజన్లో 2025 జనవరి 26న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి మొదటి విడతలో ఎకరంన్నర భూమి ఉన్న రైతులందరికీ రూ.268.57కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రెండో విడత, మూడో విడత భరోసా నిధులను తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ నెల 13 నుంచే రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే రైతుల ఖాతాల్లో జమచేస్తాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఫ 13 నుంచి జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఫ ఇప్పటి వరకురాని స్పష్టత ఫ మొదటి విడతలో రూ.268.57 కోట్లు జమ ఫ ఎదురుచూపుల్లో రైతాంగం -
విచారణ నివేదికను కలెక్టర్కు అందజేస్తాం
శాలిగౌరారం : శాలిగౌరారం ఎంపీడీఓపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి నివేదికను కలెక్టర్కు అందజేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి తెలిపారు. కార్యాలయ సిబ్బంది నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శాలిగౌరారం ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిపై బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి శంకర్నాయక్, డీఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి శేఖర్రెడ్డిలతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులతో విడివిడిగా మాట్లాడగా ఎంపీడీఓ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను వివరించారు. కొంతమంది చెప్పలేక లిఖితపూర్వకంగా ఇవ్వనున్నట్లు విచారణ అధికారి దృష్టికి తీసుకురావడంతో సరేనన్నట్లు సమాచారం. అనంతరం మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓపై అదనపు కలెక్టర్కు వినతిపత్రాన్ని కూడా అందజేసినట్లు తెలుస్తుంది. అనంతరం ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిని కూడా విడిగా విచారించారు. ఇదిలా ఉండగా గ్రామసభలో శాలిగౌరారం పంచాయతీ కార్యదర్శి విజయ్కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఎంపీడీఓ నివేదిక అందజేశారు. ఈ సంఘటనలపై అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా కార్యదర్శి, ఎంపీడీఓలతోపాటు పంచాయతీ పాలకవర్గాన్ని విచారించారు. అనంతరం అదనపు కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిపై వచ్చిన ఆరోపణలతో పాటు పరస్పర ఫిర్యాదులపై విచారణ జరిపామన్నారు. ఫ అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి -
ఈసారైనా ఉందా..
2022లో పింఛన్ కోసం వచ్చిన 300 మంది దివ్యాంగుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వారంతా సదరం సర్టిపికెట్లతో దరఖాస్తు చేసుకున్నా చిన్నచిన్న పొరపాట్ల కారణంగా అవి తిరస్కరణకు గురైనట్లు తెలిసింది. ఆ తర్వాత వాటిని సరిచేసుకున్నా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో అనేక మంది దివ్యాంగులు కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్కు వస్తూనే ఉన్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆసరా పింఛన్ల కోసం అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ ఆప్షన్ను కూడా ప్రభుత్వం నాలుగేళ్లుగా బంద్ చేసింది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ హామీ మాట దేవుడెరుగు అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీంతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. 2022 ఆగస్టు నుంచి ఆగిన ‘ఆసరా’ రాష్ట్ర వ్యాప్తంగా 2022 ఆగస్టు నుంచి కొత్తగా ఆసరా పింఛన్ల మంజూరును ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటికే జిల్లాలో చాలామంది దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో వాటిని తిరస్కరిచింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే పోర్టల్ను క్లోజ్ చేయడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో నాలుగేళ్ల నుంచి దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇస్తున్నారు తప్ప.. మంజూరు కావడం లేదు. ఇలా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలోనే ఆరు వేల మందికిపైగా ప్రజలు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అర్హులైన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఎన్నికల హామీ నెరవేరుతుందా..! ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఎన్నికల హామీలో భాగంగా పింఛన్ల పెంపును అమలు చేయడంతో పాటు కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందిస్తారని కోటి ఆశలతో ఉన్నారు. ప్రభుత్వం తప్పకుండా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.ఫ నాలుగేళ్లుగా ఎదురుచూపులు ఫ 2022 నుంచి నిలిచిన కొత్త పింఛన్ల మంజూరు ఫ పోర్టల్ను పూర్తిగా మూసేసిన ప్రభుత్వం ఫ వచ్చిన దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేయలేని పరిస్థితి ఫ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అర్హులు ఫ జూన్లో ఇస్తామని ప్రభుత్వ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు జిల్లాలో ప్రస్తుతం పింఛన్ల వివరాలు వృద్ధాప్య 70,031 దివ్యాంగ 29,830 వితంతు 77,620 చేనేత 2,836 గీత కార్మిక 7,553 ఒంటరి మహిళ 7,498 మొత్తం 1,95,368 -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
తిప్పర్తి : కొనుగోలు కేంద్రాల్లో జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం తిప్పర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని నిర్ధేశిత తేమ శాతం వచ్చాక సీరియల్ ప్రకారం కాంటాలు వేసి మిల్లులకు పంపాలన్నారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 426 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 286 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలన తిప్పర్తి మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూం ఇళ్లను కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఇళ్ల పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
నకిరేకల్లో నేడు ‘అరైవ్ అలైవ్’
● హాజరుకానున్న డీజీపీ శివధర్రెడ్డినకిరేకల్ : ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై పోలీస్శాఖ ఆధ్వర్యంలో బుధవారం నకిరేకల్ మినీ స్టేడియంలో ‘అరైవ్–అలైవ్’ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి 65వ నంబర్ జాతీయ రహదారి వెళ్తున్నందు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా డీసీపీ శివధర్రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరుకానున్నారు. ఈ సభ ఏర్పాట్లను మంగళవారం రాత్రి డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు హరిబాబు, కొండల్రెడ్డి పరిశీలించారు. గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులురామగిరి (నల్లగొండ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలైన సీఓఈ, రెగ్యులర్ జూనియర్ కాలేజీలు, వృత్తి విద్య, సైనిక కళాశాలల్లో ఇంటర్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్సీఓ ఎస్.విద్యావాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. rjcet.tela ngana.gov.in లేదా tgswreis.telanga na.gov.in వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 15న ఉదయం 10 గం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవంనకిరేకల్ : టీఎస్ యూటీఎఫ్ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం నకిరేకల్ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో యూటీఎఫ్ పాత్ర కీలకమన్నారు. ఉపాద్యాయులంతా సంఘంలో చేరి సంఘ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్రెడ్డి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు తాటిపాముల నర్సింహమూర్తి, స్టడీ సర్కిల్ కన్వీనర్ ఆర్.రాకేష్కుమార్, కేతేపల్లి, శాలిగౌరారం, నకిరేకల్ మండలాల ప్రధాన కార్యదర్శులు పి.జయసాగర్, కె.రవికుమార్, ఈ.హరికృష్ణ, నాయకులు పండుగ తిరుమలయ్య, బి.వేణుగోపాల్, వి.శ్రీనివాస్, చక్రపాణి, బి.శ్రీనివాస్, కిషోర్, ఎం.మల్లేష్, రామకృష్ణరెడ్డి, లింగాల నగేష్, శ్యామయ్య తదితరులు పాల్గొన్నారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు చేశారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన జరిపారు. ఇక శ్రీస్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్యన నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
వ్యవసాయ సంక్షోభంపై సమరశీల ఉద్యమాలు
నల్లగొండ టౌన్ : భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సమరశీల రైతాంగ ఉద్యమాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండలోని ఏచూరి గార్డెన్లో రైతు సంఘం నల్లగొండ జిల్లా 24వ మహాసభలో వారు మాట్లాడారు. పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేరలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలు యాప్, యూరియా అమ్మకం యాప్లు తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. పండించిన ప్రతి గింజకూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, వి.వెంకటేశ్వర్లు, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, దేవిరెడ్డి అశోక్రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, మల్లయ్య, కత్తి శ్రీనివాస్రెడ్డి, అయితరాజు నరసింహ, మారయ్య, ముత్తిలింగం, నలపరాజు సైదులు, నర్సిరెడ్డి, జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
హిందువుల ఐక్యతతోనే దేశాభివృద్ధి
మిర్యాలగూడ టౌన్ : దేశం కోసం, ధర్మం కోసం, సంఘం అభివృద్ధి కోసం హిందువులంతా ఐక్యతతో ముందుకు సాగితే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో నిర్వహించిన హింధూ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ హింధూ ఐక్యమత్యాన్ని బలోపేతం చేయాలన్నారు. వీర బ్రహ్మంద్రస్వామి పీఠాధిపతి విశ్వబ్రహ్మ వీరధర్మజ స్వామిజీ మాట్లాడుతూ హిందువుల ఐక్యతను దెబ్బతీసేందుకు అనేక మంది ప్రయత్నించినా సనాతన ధర్మాన్ని ఏమాత్రం కదలించలేకపోయారని చెప్పారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత మహిళా ప్రముఖ్ డాక్టర్ కళ్లెం స్వప్న, నగర కార్యవాహా సుధాకర్, గూడూరు శ్రీనివాస్రావు, తిప్పన వెంకటేశ్వర్రెడ్డి, బొలిశెట్టి భిక్షపతి, సంపత్కుమార్, జయరాజ్, మునగాల మట్టారెడ్డి, బంటు గిరి, సాధినేని శ్రీనివాస్రావు, తుమ్మలపల్లి హన్మంతరెడ్డి, అశోక్రెడ్డి తదితరులున్నారు. ఫ ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ -
రాజ్యాంగం.. పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం
తిప్పర్తి : అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ కాంస్య విగ్రహాలను మంగళవారం ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఓ వ్యక్తి అభివృద్ధి చెందాలంటే చదువు తప్పనిసరి అని చెప్పారని పేర్కొన్నారు. అందరికీ ఓటు హక్కు, చదువు కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని అందరూ చదువుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తిప్పర్తి మండలంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, రూ.పది కోట్లతో మండల కేంద్రంలో సుందరీకరణ పనులు చేపట్టామని తెలిపారు. ఏఎమ్మార్పీ క్వాలకు రూ.450 కోట్లతో లైనింగ్ పనులు చేపట్టామని, ఆ పనులు పూర్తయితే చివరి భూములకు నీరు అందుతుందన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ సభకు తిప్పర్తి సర్పంచ్ బద్దం రజితసుదీర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీదర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఆర్అండ్బీ డీఈ గణేష్, ఏఈ గౌస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యాంసుందర్, నాయకులు పాశం సంపత్రెడ్డి పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ తిప్పర్తి సర్కిల్లో అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల ఆవిష్కరణ -
అంగన్వాడీలకు ‘స్మార్ట్’ కళ
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు అన్ని ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. అంగన్వాడీలకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రం తెరిచినప్పటి నుంచి మూసి వేసేంత వరకు అన్ని వివరాలు నమోదు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల ద్వారా అందించే సంక్షేమ పథకాల సమగ్ర సమాచారం యాప్లలో నిక్షిప్తం చేస్తాం. – రేఖల మమత, సీడీపీఓ, మిర్యాలగూడ మిర్యాలగూడ టౌన్ : పిల్లలకు ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించడంతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేయడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులు, లబ్ధిదారులు, పౌష్టికాహారం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే విషయంలో ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు అందించింది. ప్రతి అంగన్వాడీ కార్యకర్తతోపాటు సూపర్వైజర్లు, డీపీపీఓలు, పైఅధికారులకు కూడా ఫోన్లు పంపిణీ చేసింది. అన్ని వివరాలను మోబైల్ యాప్లోనే అప్లోడ్ చేయాలని ఆదేశించింది. అన్ని ఫీచర్లతో కూడిన ఫోన్లు.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా రైస్, దాల్, గ్రీన్ వెజిటెబుల్, ఉడకబెట్టిన కోడిగుడ్డు, పాలు అందిస్తున్నారు. పౌష్టికాహారం పంపిణీలో పారదర్శకత కోసం వీటి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పోషణ్ ట్రాకర్’ యాప్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘ఎన్హెచ్టీఎస్’ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇచ్చి 2 జీబీ ర్యామ్ ఫోన్లలో సాంకేతిక సమస్య వస్తుండడంతో ప్రస్తుతం 4జీబీ ర్యామ్తో అన్ని ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లను ఇందుకోసం అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేసింది. ప్రస్తుతం అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లకు ప్రభుత్వమే రీచార్జ్ చేయిస్తుంది. యాప్లో నమోదు చేయాల్సిన అంశాలు ● అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పౌష్టికాహారం వివరాలు. ● గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలు. ● అంగన్వాడీ కేంద్రాలు తెరిచే సమయం, మూసివేసే సమయం. ● పిల్లల బరువు, ఎత్తు, పిల్లల రక్తహీనత ఉంటే అందుకు గల కారణాలు నమోదు. ● అంగన్వాడీల గృహా సందర్శన నమోదు. ● అన్నీ రకాల రిజిస్టర్లు వివరాలు. ● పిల్లలకు అందించే బాలామృతం, మురుకులుతో పాటు ఆరోగ్యలక్ష్మి పథకం వివరాలు. ● బ్ధిదారుల ఫెస్ రికగ్నిషన్ హాజరు. ● ఐసీడీఎస్కు సంబంధించిన వివరాలు, కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను నమోదు చేయించాల్సి ఉంటుంది. ఫ మొబైల్ ఫోన్లు పంపిణీ చేసినప్రభుత్వం ఫ సమగ్ర సమాచారం ఇక యాప్లోనే నిక్షిప్తం ఫ పౌష్టికాహార పంపిణీలో పారదర్శకతే లక్ష్యం ఫ వివరాల నమోదు ఇక సులభం -
కోటిన్నర కట్నం కోసం మధు మాస్టర్ ప్లాన్!
నల్గొండ జిల్లా : తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినంటూ నమ్మించి పెళ్లి పేరుతో యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.కోటిన్నర కట్నం పొందాలని చూసిన మోసగాడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన పనస వెంకటయ్య, సుజాత దంపతుల కుమారుడు పనస మధు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) ఉద్యోగినని నమ్మించి నల్లగొండకు చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో యువతి కుటుంబ సభ్యులు భారీ కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ సాకుతో మధు యువతిని హైదరాబాద్కు పిలి పించాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. మధు అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, అతడు చూపించిన ఐడీ కార్డు నకిలీదని, కట్నం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మధు తన స్నేహితులను సైతం తాను ఎఫ్సీఐ ఉద్యోగినంటూ నమ్మించినట్లు సమాచారం. మధుతో పాటు అతడి తల్లిదండ్రులు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
భార్యతో అక్రమ సంబంధం.. స్నేహితుడిని చంపిన భర్త!
చివ్వెంల(సూర్యాపేట) : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడిని హత్య చేసిన వ్యక్తిని, అతడికి సహకరించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సూర్యాపేట రూరల్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన రత్నావత్ మణిభార్గవ్, రత్నావత్ సాయిదుర్గ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు స్నేహితులు. సాయిదుర్గ భార్య సాయిశ్రీతో మణిభార్గవ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో మణిభార్గవ్కు ఈ నెల 9న రాత్రి సాయిదుర్గ ఫోన్ చేసి గ్రామ శివారులోని అడవికుంట చెరువు వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో మణిభార్గవ్ చెరువు వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడి చేరుకున్న సాయిదుర్గ, అతడి భార్య సాయిశ్రీ కలిసి మణిభార్గవ్తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మణిభార్గవ్ను సాయిదుర్గ కిందపడేసి ఛాతిపై బలంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆటో స్టార్ట్ చేసే తాడును మణిభార్గవ్ మెడకు గట్టిగా బిగించడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దురాజ్పల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్కు వెళ్తున్న సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
నల్లగొండ : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియామాలు పాటించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాంగా సోమవారం నల్లగొండలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ఉంటున్నారు. జిల్లాలో ఉన్న ఐదు నేషనల్ హైవేలు, రెండు స్టేట్ హైవేలపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత మీద రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రచార రథాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన వారందరి చేత రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, డీటీఓ లావణ్య, వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఆర్టీఏ మెంబర్ ఆదిరెడ్డి, ఎంపీఐలు కొండయ్య, భాస్కర్రెడ్డి, చిరంజీవి, గోపీనాథ్, ఉషశ్రీ, సోనుప్రియ, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ముగిసిన టెన్త్ పరీక్షలు
నల్లగొండ : పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మార్చి 14న ప్రారంభమైన పరీక్షలు నెలరోజుల పాటు కొనసాగాయి. చివరి రోజు జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 19,698 మంది రెగ్యులర్ విద్యార్థులకు 19,661 మంది పరీక్ష రాశారు. 37 మంది గైర్హాజరయ్యారు. 13 మంది ప్రైవేట్ విద్యార్థులకు 12 మంది పరీక్ష రాయగా ఒకరు పరీక్షకు హాజరు కాలేదని డీఈఓ భిక్షపతి తెలిపారు. పరీక్షలు ముగియడంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు కేరింతలు కొడుతూ కనిపించారు. హాస్టల్లో ఉండే విద్యార్థులు తమ లగేజీని సద్దుకొని ఇంటిబాట పట్టారు. -
న్యాయవ్యవస్థ బలోపేతానికి కృషి
రామగిరి(నల్లగొండ) : న్యాయ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, జిల్లా మొదటి అదనపు జడ్జి జి.సంపూర్ణఆనంద్ను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా జడ్జి ఎం.నాగరాజు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయవాదులతో ఉన్న అనుబంధం మర్చిపోలేనిది అన్నారు. ఎక్కడ పనిచేసినా సత్వర న్యాయం అందేందుకు కృషి చేస్తానన్నారు. మానవతా దక్పదం ఉన్నచోట న్యాయం, ధర్మం నిలబడుతుందన్నారు. లోక్ అదాలత్లో నల్లగొండ జిల్లాకు మంచి స్థానం రావడంలో అధికారులు, న్యాయవాదులు అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు. జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి జి.సంపూర్ణ ఆనంద్ మాట్లాడుతూ న్యాయవాదులు అందించిన సహకారంతోనే ఇక్కడ సుదీర్ఘకాలం పని చేయగలిగాని చెప్పారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్కుమార్, ప్రధాన కార్యదర్శి బచ్చనబోయిన అశోక్ కుమార్, న్యాయవాదులు రామచందర్రావు, మునగాల నారాయణరావు, నూకల నరసింహారెడ్డి, అమరేందర్రెడ్డి, జి.జవహర్లాల్, మేడ మోహన్రెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి.స్వామిగౌడ్, నూకల సంధ్యారాణి, సహాయ కార్యదర్శి సూరేపల్లి అమరావతి, కోశాధికారి ఎండీ.ఫిరోజ్, గేమ్స్ సెక్రటరీ ప్రసన్నకుమార్, నగేష్, గుర్రం వెంకట్రెడ్డి, పులిజాల కార్తీక్, రామకష్ణ, సుమశ్రీ, భాగ్యమ్మ, పందుల సైదులు, దువ్వ గీత, ఎం.ప్రగతి, కేఎన్.కుమార్ పాల్గొన్నారు. ఫ న్యాయమూర్తి ఎం.నాగరాజు -
పోషణ పక్వాడను విజయవంతం చేస్తాం
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టే పోషణ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. పక్షం రోజుల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో అందరిని భాగస్వామ్యం చేయడంతో పాటు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలను తీసుకుంటాం. పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యం, వ్యయామం, పరిశుభ్రత, ఇతరత్రా విషయాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. – కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారి నల్లగొండ -
ఆరోగ్యానికి ‘పోషణ’ బాటలు
మిర్యాలగూడ టౌన్ : తల్లి పిల్లల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వాలు ‘పోషణ పక్షోత్సవాలు’ (పోషణ పక్వాడ) నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ప్రధాన లక్ష్యంతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్, పోషణ్ ట్రాకర్, ఆరోగ్యలక్ష్మి వంటి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీప్రజా పాలన–ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా ఈనెల 9వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తల్లీబిడ్డ ఆరోగ్యం, వారికి పౌష్టికాహారం ఇవ్వడం వంటి కార్యక్రమాలను అంగన్వాడీ టీచర్లు చేపడుతూ.. సంబంధిత యాప్లో వివరాలను నమోదు చేస్తున్నారు. పోషణ కార్యక్రమాల్లో కొన్ని ఇలా.. ఫ పిల్లల పోషణపై ప్రధాన చర్చ జరిగేలా టాక్ షోలు, చర్చలు, సభలను నిర్వహిస్తారు. ఫ తల్లిపాలపై అవగాహన కల్పిస్తారు. ఫ అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మమ్మ, నానమ్మలతో పోషణ కథలను చెప్పిస్తారు. ఫ గర్భిణులు పిల్లల కోసం ప్రత్యేక పోషణ, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు. ఫ చిరు ధాన్యాలతో ఆహారపదార్థాలను తయారు చేయడం, వాటిని ప్రదర్శించడం. ఫ పెషణ మేళా, క్విజ్ పోటీలు, పూర్వ ప్రాథమిక విద్యపై ప్రచారం. ఫ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్, సంసిద్ధత కార్యకలాపాలు, గ్రాడ్యుయేషన్ డే ఫ నో స్క్రీన్ అవర్, ఫ్యామిలీ ఫ్లే టైంపై ప్రచారం, బహిరంగ ఆటలు, శారీరక కార్యక్రమాలు, క్రీడలు, ఇతర కార్యక్రమాలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు తీసి యాప్లో నమోదు చేస్తారు. ఫ 23వ తేదీ వరకు అంగన్వాడీల్లో పోషణ పక్షోత్సవాలు ఫ పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించడమే లక్ష్యం ఫ వేసవి దృష్ట్యా తగు జాగ్రత్తలతో కార్యక్రమం నిర్వహణప్రాజెక్టులు 9 కేంద్రాలు 2093 0 నుంచి మూడేళల్లోపు పిల్లలు 49,620 3 నుంచి 6 ఏళ్లలోపు 36,181 గర్భిణులు 10051 బాలింతలు 6001 -
నేడు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ
నల్లగొండ : తిప్పర్తి జంక్షన్లో సుందరీకరణ పనుల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాలను మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఎంజీయూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలునల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 113 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేశారు. ఎంజీ యూనివర్సిటీలో 113 మంది ఉద్యోగులకు సంబంధించిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రూ.99 లక్షల జీఎస్టీ చెల్లించకపోవడంతో జీఎస్టీ అధికారులు యూనివర్సిటీ అధికారులకు, ఏజెన్సీకి నోటీస్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో తర్జనభర్జన పడిన యూనివర్సిటీ అధికారులు తాత్కాలికంగా మరో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా 113 మంది ఉద్యోగులకు వేతనాలను విడుదల చేశారు. యువికాకు కేవీఎస్ విద్యార్థి ఎంపికరామగిరి(నల్లగొండ) : నల్లగొండ కేంద్రియ విద్యాలయంలో (కేవీఎస్) 10వ తరగతి చదువుతున్న పున్న సుధీష్ణ ఇస్రో ప్రతిష్టాత్మక యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ (యువికా–2026)కు ఎంపికయ్యారు. మే 10వ తేదీ నుంచి హైదరాబాద్లోని ఎన్ఆర్ఎస్సీలో జరిగే కార్యక్రమంలో సుధీష్ణ పాల్గొంటారు. ఈ సందర్భంగా సోమవారం కేవీఎస్ ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం, దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా కేవలం 300 నుంచి 350 మంది విద్యార్థులు మాత్రమే యువికాకు ఎంపికవుతారని తెలిపారు. మహా శివుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు, భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వ తీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆయా పూజల్లో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను ఆయన స్వీకరించి మొత్తం 71 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు ధ్యాన్యం కొనుగోలు కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్టళ్ల తనిఖీల్లో భాగంగా ఎంఎస్ఓలు, ఆర్సీఓలు, ప్రిన్సిపాళ్లు, ఆయా విభాగాల నుంచి నివేదికలు సమర్పించాలన్నారు. పంచాయతీల్లో కుక్కల సంఖ్యపై సమాచారం సేకరించాలన్నారు. ఈ నెల 15 నుంచి కలెక్టరేట్ సిబ్బంది హెల్మెట్ ధరించి కార్యాలయానికి రావాలన్నారు. హెల్మెట్ లేని వారికి కార్యాలయంలోకి అనుమతించమన్నారు. గ్రీవెన్స్కు దరఖాస్తులు సమర్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర అశోక్రెడ్డి, ఆర్డీఓలు శ్రీదేవి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఉద్యోగం ఇప్పించండి సారూ..
నల్లగొండ : మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డకు చెందిన సుంకోజు వెంకటాచారి–కళావతి దంపతుల కుమార్తె శివాని పుట్టుకతో లోకోమోటో వ్యాధి (ఎదుగుదల లేని)తో బాధ పడుతోంది. లోపాన్ని లెక్క చేయకుండా శివాని తండ్రి సహకారంతో ఎంకాం వరకు చదువుకుంది. తండ్రి బైక్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మిర్యాలగూడలో ప్రైవేట్ జాబ్ చేస్తోంది. కాగా తనకు ఏదేని ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణితో శివాని తండ్రితో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేసింది. -
వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలి
నల్లగొండ : జీవవిచ్ఛిన్నకర వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణపై దృషి్ట్ సారించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ, చందనపల్లి డంపింగ్ యార్డుల్లోని ఘన వ్యర్థాల రీసైక్లింగ్పై దృష్టి కేంద్రీకరిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యం ఇందుకు సహకరించాలని సూచించారు. డంపింగ్ యార్డ్ నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పరిశ్రమలు కనీసం 6 శాతం ఆర్డీఎఫ్ (రిప్యూజ్ డైరెవ్డ్ ఫ్యూయల్) వినియోగం చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, పరిశ్రమల మేనేజర్ సతీష్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్రెడ్డి, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
Telangana: వేడుక ఏదైనా.. బౌన్సర్ పక్కా!
బౌన్సర్లు.. సినీ తారలు, బడా పారిశ్రామికవేత్తల పక్కన మాత్రమే కనిపించేవారు. నగరాల్లో పబ్బులు, క్లబ్బుల్లోనే వీరి హడావుడి ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరైనసెలబ్రిటీ బయట అడుగు పెట్టినా,వేడుకై నా, ప్రారంభోత్సమైనా వీరిని నియమించుకోవడం సర్వసాధారణమైంది. అయితే, నగరాల్లోనే ఎక్కువగా కనిపించే ఈ కల్చర్ కొన్నాళ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకూ విస్తరించింది.నల్లగొండ టూటౌన్ : ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు, శుభకార్యాలను అట్టహాసంగా జరుపుకుంటున్నారు. శుభకార్యం చిన్నదైనా, పెద్దదైనా బంధుమిత్రుల ముందు తమ స్థాయిని ప్రదర్శించుకోవడానికి కొందరు ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించుకుంటున్నారు. వేడుకలో కొత్తదనం చూపించేలా, తోపులాట జరిగినా అదుపు చేసేలా పదుల సంఖ్యలో బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది. ఏ వేడుకలో చూసినా నల్లకోటు, దృఢమైన శరీరంతో కనిపించే బౌన్సర్లు సందడి చేస్తున్నారు. సంపన్న కుటుంబాల వారి వేడుకల్లో ఫంక్షన్ హాల్ గేటు నుంచి వేదిక వరకు వీరి హడావుడి కనిపిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు పోలీసుల బందోబస్తుతో పాటు బౌన్సర్ల సేవలను వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీలు పెట్టే బహిరంగ సభలకూ బౌన్సర్లను వినియోగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహిరంగ సభలకు సైతం బౌన్సర్లను వినియోగించారు. వివిధ పట్టణాల్లో షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు ప్రారంభించేందుకు సినీనటులు, మంత్రులు వచ్చే సందర్భంలోనూ బౌన్సర్లను పెడుతున్నారు.బౌన్సర్కు రూ.1500 బౌన్సర్ల వినియోగం పెరగడంతో సంబంధిత ఏజెన్సీలకు మంచి ఆదరణ లభిస్తోంది. యువతకు కూడా ఇదొక ఉపాధిగా మారింది. పదవ తరగతి వరకు చదివిన వారు కూడా ఈ రంగంలో ఉపాధి పొందవచ్చు. బౌన్సర్లు ప్రతిరోజూ జిమ్లలో వ్యాయామాలు చేస్తూ, డైట్ పాటిస్తూ తమ శరీర ఆకృతిని కాపాడుకుంటున్నారు. ఫంక్షన్ల నిర్వాహకులు ఒక్కో బౌన్సర్కు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. అందులో కొంత సెక్యూరిటీ సంస్థ కమీషన్గా తీసుకుంటుంది. అయితే నల్లగొండ జిల్లాలో పురుషులు మాత్రమే బౌన్సర్లుగా సేవలందిస్తున్నారు. మహిళా బౌన్సర్లు లేరు. ఏదైనా వేడుకకు మహిళా బౌన్సర్లు కావాలని కోరితే హైదరాబాద్ నుంచి పిలిపిస్తామని సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.ఆడంబరం కాకుండా.. అవసరం కోసం కేవలం ఆడంబరమే కాకుండా, అవసరం కోసం వీరిని నియమించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వేడుకల్లో స్టేజీ మీదకు వెళ్లే సమయంలో తోపులాట జరగకుండా, అతిథులు క్రమ పద్ధతిలో వెళ్లేందుకు బౌన్స ర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకుల సొంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ శుభకార్యం చేసుకునేవారు సొంతంగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు.బౌన్సర్లకు డిమాండ్ ఉంది శుభకార్యాలు జరుపుకునేవారు బౌన్సర్ల కోసం మా సంస్థను ఆశ్రయిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించుకోవడానికి బౌన్సర్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఆలయాల వద్ద కూడా మా బౌన్సర్ల సేవలు అందిస్తున్నాం. రాజకీయ పార్టీల సభలకు కూడా పంపిస్తున్నాం. దీంతో బౌన్సర్లకు డిమాండ్ పెరిగింది.– జానీపాషా, సురక్ష సెక్యూరిటీ అండ్ బౌన్సర్ సర్వీసెస్, నల్లగొండ -
గ్రామానికి కీడుసోకిందని..
ఫ వనవాసం వెళ్లిన కట్టంగూర్ వాసులు కట్టంగూర్ : గ్రామానికి కీడుసోకిందని ప్రజలంతా వనభోజనానికి వెళ్లారు. ఈ సంఘటన కట్టంగూరు మండల కేంద్రంలో ఆదివారం చోటచేసుకుంది. ఏడాది కాలంగా కట్టంగూర్లో వృద్ధులతో పాటు యువకులు వరుసగా మరణిస్తుండటంతో గ్రామ పెద్దలు పురోహితుడిని సంప్రదించారు. గ్రామానికి కీడు సోకిందని గ్రామస్తులంతా ఒక రోజు ఊరు విడిచి వనవాసం వెళ్లాలని పురోహితుడు సూచించాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామస్తులంతా ఇళ్లకు తాళం వేసి సకుటుంబ సమేతంగా వనభోజనాలకు వెళ్లారు. సంప్రదాయంగా వ్యవసాయ బావుల వద్ద వంటలు చేసుకొని అక్కడే భోజనం చేసి సాయంత్రం ఇళ్లకు తిరిగివచ్చారు. -
సమ్మెలో ఆర్టిజన్లు.. సేవలకు అంతరాయం
గట్టుప్పల్ : తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఆరు రోజులుగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. దీంతో పల్లెల్లో ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయం పరిష్కరించేందుకు ఆ శాఖ లైన్మెన్లు, అసిస్టెంట్ లైన్మెన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఉన్న విధులకు తోడు.. సబ్స్టేషన్ ఆపరేటర్, గ్రామాల్లో ఫ్యూజ్లు వేయడం, బ్రేక్డౌన్ సమస్యల పరి ష్కారం, విద్యుత్ బిల్లులు వసూలు వంటి పనులు వారే చేపట్టాల్సి వస్తోంది. దీంతో వినియోగదారులకు సరైన సేవలు అందడం లేదు. జిల్లాలో 535 మంది ఆర్టిజన్ కార్మికులు జిల్లా వ్యాప్తంగా 535 మంది ఆర్టిజన్ కార్మికులు 25 ఏళ్లుగా విద్యుత్ రంగంలో పని చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆనాడు కేసీఆర్ వీరిని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆనాటి నుంచి ప్రభుత్వమే వారికి వేతనాలు ఇస్తోంది. కానీ అప్పటి నుంచి వారికి ప్రమోషనన్స్ లేవు, ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింప చేయలేదు. దీంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది కార్మికులు రిటైర్డ్ అయ్యారు. వారికి ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందలేదు. ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ తమకు ఏపీఎస్ఈబీ రూల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయాలని, ప్రమోషన్స్ ఇవ్వాలని తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 535 మంది ఆర్టిజన్ కార్మికులు ఈనెల 8వ తేదీ నుంచి సమ్మెకు దిగారు. దీంతో విద్యుత్ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఫ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె చేస్తామంటున్న ఆర్టిజన్లు ఫ అదనపు విధులు నిర్వహిస్తున్న లైన్మన్లు, అసిస్టెంట్ లైన్మన్లు ఫ విద్యుత్ సరఫరాలో అంతరాయంతో.. వినియోగదారులకు ఇబ్బందులు -
పోస్టల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా
రామగిరి(నల్లగొండ) : పోస్టల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సౌత్ ఇండియా సెక్రటరీ చలపతిగిరి అన్నారు. పోస్టల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ పట్టణంలో అంబేద్కర్ జయంతి నిర్వచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ సెక్రటరీ కొడంగల్ యాదయ్య, హైదరాబాద్ రీజియన్ సెక్రటరీ గోవర్ధన్, హెడ్ పోస్ట్మాస్టర్ స్వర్ణలత, శంకర్నాయక్, తోడేటి వీరస్వామి, ప్రసాద్, అరుణకుమారి, నగేష్, బెల్లం రామస్వామి, వెంకటయ్య, యాదయ్య, లక్ష్మీనరసింహ, కవిత, మారయ్య, అంకులయ్య తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారంగా మారుతున్న విద్యారంగం
నార్కట్పల్లి : దేశంలో విద్యారంగం వ్యాపారంగా మారుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ, సీపీఎం మండల కమిటీ సభ్యుడు కల్లూరి యాదగిరి స్మారక స్తూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అందరికీ విద్య ఉచితంగా అందించాలని సీపీఎం పోరాటం చేస్తోందన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని అన్నారు. నేటి యువత డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు రాక కూలీలుగా మారుతున్నారన్నారు. అనంతరం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాలే నేటి ప్రభుత్వాలకు ఎజెండాలుగా మారుతున్నాయని, పేదలకు గుండె బలం కమ్యూనిస్టులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి ఐలయ్య, దండు నాగరాజు, కందాల ప్రమీల, సయ్యద్ హాశం, జిట్ట సరోజ, జిట్ట నగేష్, చింతపల్లి బయ్యన్న, ఎస్సార్ వెంకటేశ్వర్లు, ఇల్లందుల లింగస్వామి, బత్తుల అనంతరెడ్డి, చెరుకు పెద్దులు, కుమ్మరి శంకర్, దండు రవి, కొప్పు శ్రవణ్ పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
శాలిగౌరారం : రైతులను ఇబ్బంది పెడితే.. మిల్లులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) వెంకటేశ్ హెచ్చరించారు. శాలిగౌరారం మండలంలోని వల్లాల సాయిబాలాజీ పార్బాయిల్డ్ రైస్మిల్లు వద్ద ధాన్యంలో తాలు ఉందంటూ మిల్లు యజమానులు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో ఆదివారం ‘సాక్షి’లో ‘ఆదిలోనే మిల్లర్ల అడ్డంకులు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఆదేశానుసారం సాయిబాలాజీ రైస్మిల్లును డీఎస్ఓ వెంకటేశ్ ఆదివారం సిబ్బందితో కలిసి సందర్శించారు. రైస్మిల్లు వద్ద నిలిచిపోయిన లారీలను లోపలికి పంపించి ధాన్యం దిగుమతి చేయించారు. ఆయన వెంట డీటీ సీఎస్ జ్యోతి, నల్లగొండ ఆర్ఐ కుమార్రెడ్డి ఉన్నారు. -
ఆదిలోనే మిల్లర్ల అడ్డంకులు
ఫ తాలు పేరిట కొర్రీలు.. ఫ ధాన్యం దిగుమతి చేసుకోకుండా నిలిపివేత ఫ మిల్లుల వద్ద ఆగిపోయిన లారీలుశాలిగౌరారం : ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు ఆ పంటల దిగుబడులను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామంటే అరంభంలోనే అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. శాలిగౌరారం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైన మొదటి రోజే.. అడ్డంకులు ఎదురయ్యాయి. తాలు ఉందంటూ లారీల్లోని ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోకుండా నిలిపివేశారు. దీంతో రెండురోజులుగా మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలను నిలిపివేశారు. దీంతో కేంద్రంలో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 15 కేంద్రాలు ప్రారంభం శాలిగౌరారం మండలంలో 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను.. ఇప్పటికే 15 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మరో ఐదు కేంద్రాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. శాలిగౌరారం, శాలిలింగోటం, తక్కెళ్లపహాడ్ కేంద్రాల నుంచి కాంటా వేసిన 8 లారీల ధాన్యం అదేరోజు సాయంత్రం ట్యాగింగ్ చేసిన మిల్లులకు పంపారు. మిల్లుల వద్దకు చేరుకున్న లారీలను సంబంధిత మిల్లుల యజమానులు ధాన్యంలో తాలు ఉందని కొర్రీలు పెట్టి దిగుమతి చేసుకోలేదు. దీంతో లారీలు రెండు రోజులుగా మిల్లుల వద్ద నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు జరిగిన తొలిరోజే కొర్రీలు మొదలయ్యాయంటే తర్వాత రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
అటవీ భూముల్లో సాగు చేయొద్దు
చందంపేట : అనుమతి లేకుండా అటవీ భూముల్లో సాగు చేయొద్దని ఎఫ్ఆర్ఓలు సుమన్, భాస్కర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని గువ్వలగుట్ట గ్రామంలో ప్రజలకు అటవీ భూముల సంరక్షణపై అటవీ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ సుమన్ మాట్లాడుతూ అక్రమంగా కలపను తరలించినా, చెట్లను నరికినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అటవీ జంతువుల సంరక్షణకు సహకరించాలని, అటవీ జంతువులను వేటాడినా, చంపినా శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ బీసన్న, ఎస్ఐ లోకేష్, సర్పంచ్ సైదమ్మహన్మా, బీట్ ఫాసర్లు తదితరులు పాల్గొన్నారు. సుందరీకరణ పనుల పరిశీలనతిప్పర్తి : తిప్పర్తి మండల కేంద్రంలో చేపడుతున్న సుందరీకణ పనులను ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాల ఆవిష్కరణ, ఫౌంటేయిన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఈ గౌస్, ప్రసాద్, సిబ్బంది సైదులు తదితరులు ఉన్నారు. -
జ్యూస్ కంటే.. పండ్లు బెటర్
ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎండకు తట్టుకోలేక చాలా మంది ఎక్కువ మోతాదులో కొబ్బరి నీరు తాగుతున్నారు. దానివల్ల డీ హైడ్రేషన్ వచ్చే ప్రమాదముంది. ఒక గ్లాస్కు మించి కొబ్బరి నీరు తాగవద్దు. ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒక లీటర్ నీటిలో కలుపుకుని తాగితే డీ హైడ్రేషన్ నుంచి బయట పడతారు. ప్రూట్ జ్యూస్ కంటే పండ్లు తినడం మంచిది. వేసవిలో హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చెమట బయటకు వెళ్లి డీ హైడ్రేషన్ వచ్చే ప్రమాదముంది. హెవీగా ఎక్సర్సైజ్ చేయడం తగ్గించాలి. లిక్విడ్ ఓఆర్ఎస్ తాగడం మానాలి. – డాక్టర్ అనిల్, ఎండీ, జనరల్ మెడిసిన్ -
కుడికాల్వకు నీటి నిలిపివేత
ఫ మరో రెండు రోజుల్లో ఎడమకాల్వకు కూడా.. నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ కుడికాల్వకు శనివారం నీటిని నిలిపివేశారు. ఎడమ కాల్వకు మరో రెండు రోజుల్లో నీటిని నిలిపివేయనున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో కుడి కాల్వకు సుమారు 190టీఎంసీల నీటిని విడుదల చేశారు. అలాగే ఎడమ కాల్వకు 150 టీఎంసీల నీటిని వదిలారు. గత ఏడాది వానాకాలం సీజన్ పూర్తయ్యే వరకు వరదలు కొనసాగాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే కాల్వలద్వారా పొలాలకు తరలించడంతో పాటు చెరువులు నింపారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 528.40 అడుగులుండగా 165.0408టీఎంసీల నిల్వలున్నాయి. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీనల్లగొండ : మహిళా శిశు, వికలాంగుల, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. జిల్లాలో దివ్యాంగులకు 112 రెట్రో ఫిట్టర్ మోటర్ వెహికల్స్ మంజూరు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, వార్డెన్ వెంకటరెడ్డి, బాలయ్య, నవీన్, సునీల్, కొత్త వెంకన్న పాల్గొన్నారు. రైస్ మిల్లుల్లో తనిఖీలుచండూరు : రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేశారనే సమాచారంతో రైస్మిల్లులు, అనుమానిత ప్రదేశాల్లో శనివారం పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ఒకవేళ ఈ దందాలో రేషన్ డీలర్ల పాత్ర ఉంటే వారి డీలర్షిప్ రద్దు చేసేందుకు సిఫారసు చేస్తామని తెలిపారు. తరుచూ ఈ దందాలో పట్టుపడేవారిపై పీడీ యాక్ట్ నమోదుచేసి జైలుకు పంపుతామన్నారు. -
రోగులకు మెరుగైన చికిత్స అందించాలి
నల్లగొండ : మత్తు పదార్థాల బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మత్తు విముక్తి విభాగాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రోగులకు సూచించారు. రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, కౌన్సెలింగ్తో పాటు, చికిత్స అందిస్తూ శ్రద్ధగా చూసుకుంటున్నామని ఇన్చార్జి వైద్యుడు అనిల్ తెలిపారు. త్వరలోనే ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్, డీఎస్పీ శివరాంరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ నరసింహారావు, ఇన్చార్జి డాక్టర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. -
భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించాలి
చిట్యాల : రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై సంబంధిత శాఖల అధికారులు ఆడిట్ నిర్వహించాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. చిట్యాల మండలం బొంగొనిచెర్వు పరిధిలోని పేలుడు జరిగిన నోష్ ల్యాబ్స్ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పేలుడు జరిగిన తీరును ఆ పరిశ్రమ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల పాటించకపోవటంతోనే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కార్మికులపై పరిశ్రమల నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తక్షణ మెరుగైన వైద్య సహాయంతో పాటు, పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నోష్ ల్యాబ్స్లో గాయపడి చికిత్స పొందుతున్న లక్ష్మణ్కుమార్, వెంకటేశ్వర్లుకు మెరుగైన వైద్యం అందించాలని పరిశ్రమ నిర్వాహకులను కోరారు. ఆయన వెంట లొడంగి శ్రవణ్కుమార్, బొడిగె సైదులుగౌడ్, ఎండీ.అక్బర్, జిల్లా సత్యం, జిల్లా లక్ష్మయ్య, బొబ్బలి శంకర్రెడ్డి, సీమ అంజయ్య, దేవేందర్, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫూలే ఆశయాలను భావితరాలకు అందించాలి
నల్లగొండ : మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను భావితరాలకు తీసుకెళ్లాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం జ్యోతిరావుఫూలే ‘ద్వి శతాబ్ది’ ఉత్సవాల సందర్భంగా ఫూలే విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం, నాణ్యమైన విద్య కోసం కృషి చేసిన వ్యక్తి ఫూలే అని కొనియాడారు. నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావుఫూలే సంఘసంస్కర్త మాత్రమే కాదని, మహిళా చదువు కోసం పోరాటం చేసిన వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవ, తహసీల్దార్ పరశురాం, చోల్లేటి ప్రభాకర్, పున్న కై లాష్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మరగోని నవీన్గౌడ్, అడిషనల్ ఎస్పీ రమేష్, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్రెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, కొండూరు సత్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ, వెంకన్నగౌడ్, చొల్లేటి రమేష్, మిర్యాల యాదగిరి, పంకజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి
మిర్యాలగూడ అర్బన్ : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దుతు తెలిపి మాట్లాడారు. కార్మికులందరికీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, అన్ని అర్హతలు కలిగి ఉండి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్న వారిని ఆర్టిజన్లు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతంరెడ్డి, రవినాయక్, మంగారెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి -
సాగర్లో డయాబెటీస్ సదస్సు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ విజయవిహార్లో జాతీయస్థాయి డయాబెటీస్ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రీసెర్చ్ సొసైటీ ఫర్ది స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా(ఆర్ఎస్ఎస్డీఐ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ వార్షిక డయాబెటీస్ సదస్సు (టీజీఆర్ఎస్ఎస్డీఐ–2026) సాగర్లోని టీఎస్టీడీసీ రిసార్ట్స్ విజయవిహార్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఏప్రిల్ 12వరకు కొనసాగుతుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పించడంతోపాటు వైద్యుల శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఈ సదస్సు ప్రదాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా వైద్యులు, నిపుణులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొనున్నారని పేర్కొన్నారు. శనివారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి హాజరుకానున్నారు. -
పలువురు జడ్జిల బదిలీ
● జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వసంత్ రామగిరి(నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు వికారాబాద్ కోర్టుకు బదిలీ కాగా.. ఆయన స్థానంలో కొత్తగూడెం నుంచి పి.వసంత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. నల్లగొండ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి జి.సంపూర్ణ ఆనంద్ రంగారెడ్డి జిల్లా కోర్టుకు బదిలీ అయ్యారు. నల్లగొండ కోర్టు నాలుగవ అదనపు జడ్జి కె.కవిత ఇదే కోర్టులో మొదటి అదనపు జడ్జిగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జడ్జి ఎం.కిరణ్మయి నల్లగొండ నాలుగవ అదనపు కోర్టు జడ్జిగా వచ్చారు. ఆదిలాబాద్ నుంచి జడ్జి పి.శివరామ్ప్రసాద్ సూర్యాపేట మొదటి అదనపు జడ్జిగా వచ్చారు. 19న ‘మోడల్’ ప్రవేశపరీక్షనల్లగొండ : జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్లో 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో, 7 నుంచి 10వ తరగతులకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్టికెట్లను ఈ నెల 10 నుంచి www.tgms.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 6వ తరగతికి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10వ తరగతులకు ప్రవేశపరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 13 నుంచి ‘అరైవ్ అలైవ్’నల్లగొండ : ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత ప్రత్యేక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన శుక్రవారం ఆయన పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల అమలు, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించమే లక్ష్యంగా పని చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై ప్రచారం చేయాలన్నారు. డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు నిర్వహించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాల తనిఖీలు చేయాలని సూచించారు. -
రైలు కూత!
అన్ని జిల్లా కేంద్రాలకు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మూడు జిల్లా కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ ఉండగా, సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూడా రైల్వే కల నెరవేరబోతోంది. అందుకు అవసరమైన పనులకు 2026–27 రైల్వే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్కు సంబంధించిన సమగ్ర కేటాయింపుల వివరాలతో కూడిన నివేదికను ఇటీవల కేంద్రం దక్షిణ మధ్య రైల్వేకు అందించింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా చేపట్టే రైల్వే లైన్ల సర్వేలు, కొత్త లైన్లకు సంబంధించిన అంశాలను పేర్కొంది. వాటికి కొంత మేర నిధులు కేటాయించింది. ఆ ప్రాజెక్టులు ఆచరణ రూపం దాల్చితే సూర్యాపేటతో పాటు దేవరకొండ వంటి ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ లభించనుంది. కీలక ప్రాజెక్టులకు నిధులు సూర్యాపేటను కలుపుతూ చేపట్టే విశాఖపట్టణం – విజయవాడ – శంషాబాద్ లైన్తో పాటు నల్లగొండ, దేవరకొండను కలుపుతూ చేపట్టే విశాఖపట్టణం – విజయవాడ – కర్నూల్కు సెమీహైస్పీడ్/హైస్పీడ్ రైల్వే కారిడార్ ఫైనల్ లొకేషన్ సర్వేకు ఈసారి బడ్జెట్లో రూ.4.71 కోట్లు కేటాయించింది. ఇది పూర్తయ్యాక డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించనుంది. శంషాబాద్ – విశాఖపట్టణం లైన్ శంషాబాద్ నుంచి గట్టుప్పల్ మీదుగా చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట మీదుగా జగ్గయ్యపేట, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, తుని నుంచి విశాఖపట్టణం చేరనుంది. ఇక మరోలైన్ విశాఖపట్టణం నుంచి విజయవాడ, జగ్గయ్యపేట మీదుగా సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల మీదుగా కర్నూల్కు ఏర్పాటు చేయనున్నారు. 942 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ రూట్లో సెమీ హైస్పీడ్ / హైస్పీడ్ రైల్ గంటకు 220 కిలోమీటర్ల వేగంగంతో ప్రయాణించనుంది. అంటే నాలుగు గంటల్లో శంషాబాద్ నుంచి విశాఖపట్టణం చేరనుంది. దాదాపు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మాచర్ల – నల్లగొండకు 92 కిలోమీటర్ల పొడవునా కొత్త రైల్వే లైన్ వేసేందుకు రూ.458.46 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. 133 కిలోమీటర్లు ఉన్న డోర్నకల్ –మిర్యాలగూడ లైన్ అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించింది. ఈ లైన్ నిఘా, ట్రాఫిక్ సర్వే కోసం బడ్జెట్లో రూ.37 లక్షలు కేటాయించింది. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలో అదనపు బాక్స్ బ్రిడ్జీలు, నల్లగొండ, మిర్యాలగూడ స్టేషన్లలో వికలాంగుల కోసం సదుపాయాల కల్పన, ప్లాట్ఫామ్ల విస్తరణ, ఎస్కలేటర్లకు నిధులను కేటాయించింది. ఎఫ్ఎల్ఎస్ పూర్తయిన డోర్నకల్ – గద్వాల లైన్డోర్నకల్ – గద్వాల రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేను (ఎఫ్ఎల్ఎస్) కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 2023 చేపట్టిన ఎఫ్ఎల్ఎస్ మార్చి నెలలో పూర్తయిందని, ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. 296 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ లైన్కు సంబంధించిన డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) కూడా చివరి దశకు చేరుకుంది. ఒకటీ రెండు నెలల్లో ఆ నివేదిక రైల్వే బోర్డుకు చేరనుంది. రూ.5,330 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ లైన్ నిర్మాణం ఆచరణలోకి వస్తే డోర్నకల్ నుంచి కూసుమంచి మీదుగా పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ లేదా నాంపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాలకు చేరనుంది. వీటిల్లో ఈ రైల్వే లైన్ ఆచరణ రూపం దాల్చినా జిల్లాలో ఇంతవరకు రైల్వే కనెకట్టివిటీ లేని ప్రాంతాలకు రైల్వే సదుపాయం లభించనుంది.ఫ ఇప్పటికే నల్లగొండ, భువనగిరికి రైల్వే కనెక్టివిటీ ఫ ఇక సూర్యాపేటకూ రైలు సౌకర్యం ఫ కొత్త రూట్లలోనూ రైల్వే లైన్లు ఫ డోర్నకల్ – గద్వాల ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి ఫ మాచర్ల – నల్లగొండ లైన్కు రూ.458.46 కోట్లు కేటాయింపు ఫ డోర్నకల్–మిర్యాలగూడ అంశాన్ని పేర్కొన్న రైల్వే శాఖ ఫ 2026–27 బడ్జెట్ వివరాలు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే -
బస్షెల్టర్ ముందే చిరు వ్యాపారం
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో బస్షెల్టర్ లేక ప్రయాణికులు పాట్లు పడుతున్నారు. విజయవాడ, హైదరాబాద్, నల్లగొండ వెళ్లే ప్రయాణికుల కోసం పాత ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ముందు చిన్న బస్షెల్టర్ ఉన్నా.. దాని చుట్టూ చిరు వ్యాపారుల బండ్లు పెట్టడంతో ఉపగయోగం లేకుండా పోయింది. పట్టణంలో ఈ కూడలికి బస్టాండ్ కిలోమిటర్ దూరంలో ఉన్నా.. ప్రయాణికులు మాత్రం బస్సుల కోసం ఇక్కడే నిరీక్షిస్తున్నారు. ఇక్కడ నీడ లేదు, కూర్చోవడానికి వసతులు లేవు. బస్సులు వచ్చేంత వరకు నిలబడాల్సిందే. ఈ సెంటర్లో బస్ షెల్టర్లు నిర్మిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని పట్టణవాసులు అంటున్నారు. -
ధాన్యం కల్లంలా.. సర్వీస్ రోడ్డు
కేతేపల్లి : కేతేపల్లి మండలంలో కేతేపల్లి, కొర్లపహాడ్, చీకటిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల్లో సర్వీసు రోడ్ల వెంట బస్షెల్టర్లు నిర్మించారు. హైవే వెళ్లే ఇతర వాహనాలకు ఆటంకం కలుగకుండా బస్షెల్టర్ల ముందు బస్బేలు సైతం ఏర్పాటు చేశారు. కానీ, డ్రైవర్లు హైవేపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో బస్సుల కోసం జనం రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ నిలబడుతున్నారు. ఇక పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు గంటల తరబడి ఎండలో ఎండుతూ, వర్షానికి తడుస్తూ రోడ్డుపైనే నిరీక్షిస్తున్నారు. ఆయా గ్రామాల్లో బస్షెల్టర్లు నిరుపయోగంగా ఉండటంతో రైతులు ధాన్యం ఆరబోసేందుకు కల్లాలుగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల మాసం విక్రయదారులు, యాచకులకు అడ్డాగా మారాయి. -
ప్రధాన కూడలి.. నిలువ నీడ లేదు
పెద్దవూర : నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారితో పాటు జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారికి సైతం మండల కేంద్రం ప్రధాన కూడలిగా ఉంది. అనుముల మండలం ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలన్నా పెద్దవూరకు వచ్చి వెళ్తుంటారు. ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి బస్సులు పెద్దవూర మీదుగా వెళ్తుంటాయి. దీంతో ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా పెద్దవూరకు రావాల్సి ఉంటుంది. ఇరవై సంవత్సరాల క్రితం పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద బస్షెల్టర్ ఉండేది. రోడ్డు విస్తరణలో భాగంగా దాన్ని అధికారులు తొలగించారు. అప్పటినుంచి ప్రయాణికుల కష్టాలు మొదలయ్యాయి. బస్షెల్టర్ నిర్మించకపోవడంతో ఎండలకు ఎండుతూ, వానలకు తడుస్తూ ప్రజలు రోడ్ల వెంట నిరీక్షిస్తుంటారు. బస్సులు రోడ్డు పక్కనే ఆపుతుండటంతో ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి బస్టాండ్ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
నల్లగొండ : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ప్రహరి గోడలు, ఫుడ్ స్టోరేజ్ గోడౌన్లు, అమ్మ ఆదర్శ పాఠశాల భవనాలు, తదితర నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అన్ని భవనాల్లో తాగునీటి సౌకర్యం, హాస్టళ్లు, పాఠశాలల్లో టాయిలెట్స్, కిచెన్లు, తాగునీటి సదుపాయాలు, ఆర్ఓ ప్లాంట్లు సమర్థంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. పనులు నాణ్యతగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీరు ఇబ్బంది లేకుండా బోర్లకు ఏమైనా మరమ్మతులు చేయించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేదంపై అవగాహన కల్పించాలినల్లగొండ టౌన్ : ప్రజలు సహజ వైద్య విధానాల వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను సూచించారు. శ్రీప్రజా పాలన– ప్రగతి ప్రణాళికశ్రీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన హోమియోపతి డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద, యునాని, హోమియోపతి విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం హోమియోపతి పితామహుడు డాక్టర్ సామ్యూల్ హానీమన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హోమియోపతి నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పోషకాహారం, తాజా పండ్లు తీసుకోవాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే ఇతరులకు సేవ చేయగలుగుతారని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, ఆయుష్ ఇన్చార్జి డాక్టర్ సుహాసిని, డాక్టర్ ముబీన్ పర్వీన్, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఆయుష్ డిపార్ట్మెంట్ డీపీఎం కళ్యాణ్, డాక్టర్లు, ఫార్మసిస్టులు, యోగా సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
‘మహిళా శక్తి’కి ఇంధనం
నల్లగొండ : రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా, వ్యాపార రంగంలోనూ సత్తాచాటేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిర మహిళా శక్తి పథకం కింద జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు పెట్రోల్ బంకులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బంకు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా.. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. ఎస్ఎల్బీసీలో రూ.3.50 కోట్లతో తొలి బంకు నల్లగొండ నియోజకవర్గానికి మంజూరైన పెట్రోల్ బంకును జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద మెడికల్ కాలేజీని ఆనుకుని 1.20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో సుమారు రూ.3.50 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. దీని నిర్వహణ బాధ్యతలను తీసుకునేందుకు నీలగిరి మహిళా జిల్లా సమైక్య ముందుకు రావడంతో ప్రభుత్వం వారికి భూమిని కేటాయించింది. గతేడాది అక్టోబర్ 13న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ బంకు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రధానమైన ఇంధన ట్యాంకర్లను తీసుకొచ్చి భూమిలో అమర్చారు. అయితే ఈ బంకులో కేవలం పెట్రోలు, డీజిల్ అమ్మకాలకే పరిమితం కాకుండా ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) చార్జింగ్ స్టేషన్లను కూడా అందుబాటులోకి తేనున్నారు. అంతేకాకుండా, స్థానిక మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయాల కోసం, ఇతర వ్యాపారాల కోసం ఇక్కడ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. మిగతా ఐదు చోట్లా సర్వం సిద్ధం మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో బంకుల ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు భూసేకరణ పూర్తి చేసి, డీఆర్డీఓకు నివేదికలు అందజేశారు. ఈ ఐదు బంకుల ఏర్పాటుకు భారత్ పెట్రోలియం కంపెనీ ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆ సంస్థ అధికారులు సేకరించిన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ ఐదు బంకుల పనులు కూడా ప్రారంభం కానున్నాయి.మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు ఫ నల్లగొండ జిల్లాకు ఆరు బంకులు మంజూరు ఫ ఎస్ఎల్బీసీ వద్ద ముమ్మరంగా బంకు నిర్మాణ పనులు ఫ మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో పూర్తయిన భూసేకరణమిగతా బంకులు ఏర్పాటయ్యే ప్రాంతాలు ఇవే.. నియోజకవర్గం గ్రామం మిర్యాలగూడ తడకమళ్ల నాగార్జునసాగర్ కొత్తపల్లి (అనుముల) దేవరకొండ దేవరకొండ పట్టణం నకిరేకల్ కట్టంగూర్ మునుగోడు ఉడతలపల్లి (చండూరు) -
11న జ్యోతిరావు ఫూలే జయంతి
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు నల్లగొండలోని క్లాక్ టవర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు, అధికారులు హాజరు కావాలని కోరారు. నిస్వార్థ సేవకుడు.. నర్రా రాఘవరెడ్డిఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ చిట్యాల : పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడిన నిస్వార్థ సేవకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ బస్స్టేజీ వద్ద ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల పక్షపాతిగా అసెంబ్లీలో పాలకులకు తన వాణి వినిపించిన రాఘవరెడ్డి లాంటి నాయకులు నేడు కరువయ్యారన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాఘవరెడ్డి చేసిన ప్రజాసేవ మరువలేనిదన్నారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, మల్లు లక్ష్మి, నారి ఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, మల్లం మహేష్, పెంజర్ల సైదులు, చింతపల్లి భయ్యన్న, మండల నాయకులు రాచమడ్ల శ్యాంసుందర్, శీలా రాజయ్య, అర్రూరీ శ్రీను, ఐతరాజు నర్సింహ, కల్లూరి కుమారస్వామి, మెట్టు నర్సింహామ, నరేష్ పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలిమాడుగులపల్లి : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం మాడుగులపల్లి మండలం పాములపాడు పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, ల్యాబ్ను పరిశీలించి మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు జరిగేలా చూడాలన్నారు. లెప్రసీ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, క్షయ జబ్బు ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించాలన్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత వంటి వాటిపై అవగాహన కల్పించాలన్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు, ఉపాధిహామీ పనుల వద్దకు వెళ్లి రైతులకు, కూలీలకు వడదెబ్బ పట్ల అవగాహన కల్పిచి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ దీప, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ వేణుగోపాల్రెడ్డి, డీటీసీఓ కల్యాణ్ చక్రవర్తి, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఎ.సత్యనారాయణ, డాక్టర్ పి.ప్రశాంత్బాబు ఉన్నారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలినల్లగొండ టౌన్ : విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండలో గురువారం ఆర్టిజన్ కార్మికులు చేపట్టన ధర్నా వద్దకు వెళ్లి మద్దతు తెలిపిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించి సమ్మెను నిలిపివేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి, శ్రవణ్ కుమార్, పబ్బు వీరస్వామి, జిట్టబోయిన లింగస్వామి, గుండ లింగారెడ్డి, పెరిక శేఖర్, వేణుగోపాల్రెడ్డి, పెరమాళ్ల మురళి, అద్దంకి వెంకన్న, లతీఫ్, విజయ్, ఉమాదేవి, నాగమణి, రమ్య పాల్గొన్నారు. -
‘పీఎన్జీ’ పనులు వేగవంతం చేయాలి
నల్లగొండ : జిల్లాలో కొనసాగుతున్న పైపులైన్ సహజ వాయువు (పీఎన్జీ) విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం నల్లగొండలోని తన చాంబర్లో పౌర సరఫరాలు, పరిశ్రమలు, పంచాయతీ రాజ్, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ సంక్షోభం కారణంగా వాణిజ్య విభాగంలో ఎల్పీజీ లభ్యతపై ప్రభావం పడుతున్నందున, పీఎన్జీ సరఫరాను విస్తరించడం అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్వర్క్లను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా పీఎన్జీ నెట్వర్క్ విస్తరణ పనుల కొనసాగింపునకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. తాగునీటి సరఫరా మాదిరిగానే ఇంటింటికీ గ్యాస్ పైప్ లైన్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ వంశీకృష్ణ మాట్లాడుతూ మెగా సిటీ గ్యాస్ ప్రాజెక్టు వలిగొండ నుంచి నార్కట్పల్లి వరకు విస్తరించిందన్నారు. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ట్యాంక్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నార్కట్పల్లి నుంచి నల్లగొండ వరకు పైప్లైన్ ద్వారా 5 గ్రామాలను కలుపుతూ టాప్ ఆప్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఏఎస్పీ రమేష్, పౌరసరపాల శాఖ అధికారి వెంకటేష్, జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి, పంచాయతీ రాజ్ అధికారి శేఖర్రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
విద్యార్థుల సంఖ్య పెంచేలా..
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా వచ్చే విద్యాసంవత్సరంలో అధిక సంఖ్యలో అడ్మిషన్లు పెంచేందుకుగాను ముందస్తుగా గ్రామాల్లో బడిబాట కార్యక్రమం చేపట్టాం. మండల వ్యాప్తంగా ఇప్పటికే 20 అడ్మిషన్లు అయ్యాయి. ఉదయం పాఠశాల పూర్తికాగానే ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నాం. – తరి రాములు, ఎంఈఓ, పెద్దవూర పెద్దవూర : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో విద్యా శాఖ ముందస్తుగా బడిబాట కార్యక్రమం చేపట్టింది. రానున్న 2026–27 విద్యాసంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని మందస్తుగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉపాద్యాయులు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి తిరుగుతూ పిల్లలను సర్కారు బడుల్లోకి పంపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. పాఠశాలల్లో చేర్పించేందుకు బడిఈడు పిల్లలను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా బడి బయట ఉన్న డ్రాపౌట్ పిల్లలను తిరిగి బడిబాట పట్టించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వలస కార్మికుల పిల్లలపై ప్రత్యేక దృష్టి ఐదేళ్లు నిండిన చిన్నారులను నేరుగా మొదటి తరగతిలో చేర్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వలస కార్మికుల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో మొత్తం సుమారు 1,424 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ప్రాథమిక స్థాయిలోనే ఎక్కువ నమోదు జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ బడులు ప్రైవేటు పాఠశాలలకు పోటీగా రూపుదిద్దుకున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ప్రచారం ఇలా.. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించడంతో పాటు, ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమ బోధన అందుబాటులోకి వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, పోషకాహారంతో కూడిన మధ్యహ్న భోజనం వంటి సౌకర్యాలు అందిస్తున్నామని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో మండలస్థాయి అధికారులు ప్రతిరోజూ పురోగతిని సమీక్షిస్తున్నారు. జూన్12న పాఠశాలల పున:ప్రారంభమయ్యే నాటికి కనీసం 10–15శాతం అదనపు అడ్మిషన్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు గ్రామాల్లో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ సర్కారు బడుల వైపు తల్లిదండ్రులను మళ్లిస్తున్నారు. విద్యా శాఖ ముందస్తు ‘బడిబాట’ ఫ సర్కారు బడులను బలోపేతం చేయడమే లక్ష్యం ఫ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్న టీచర్లు ఫ జిల్లాలో మొత్తం 1,424 పాఠశాలలు పాఠశాలల వివరాలు ప్రాథమిక 980ప్రాథమికోన్నత 185ఉన్నత 259విద్యార్థులు 1.38 లక్షలు -
ఇంప్లాంట్స్లో గోల్మాల్!
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సల కోసం అవసరమైన వివిధ రకాల ఇంప్లాంట్స్ సరఫరా కోసం నిర్వహించిన టెండర్లలో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రికి ఇంప్లాంట్స్ సరఫరా కోసం అర్హులైన కాంట్రాక్టర్ల నుంచి జిల్లా పర్చేజింగ్ కమిటీ నెలరోజుల క్రితం టెండర్లు ఆహ్వానించింది. వాస్తవానికి ఆ టెండర్లను ఇ–ప్రొక్రూర్మెంట్ పద్ధతిని నిర్వహించాల్సి ఉండగా అధికారులు మాన్యువల్గా నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియలో సుమారు నలుగురు ఽకాంట్రాక్టర్లు తమ టెండర్ ఫారాల్లో తమ ధరలు కోట్ చేసి సమర్పించారు. పది రోజుల క్రితం టెండర్లను తెరిచిన అధికారులు తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్కు ఇంప్లాంట్స్ సరఫరాకు ఆర్డర్స్ను అందించాల్సి ఉన్నా.. నేటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో టెండర్లలో ఏదో గోల్మాల్ జరిగినట్టు చర్చ జరుగుతోంది. ఫలితంగా ఆస్పత్రికి సకాలంలో ఇంప్లాంట్స్ సరఫరా లేకపోవడం వల్ల ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలకు ఆటంకం ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే జాప్యం ఇంప్లాంట్స్ సరఫరా కోసం పిలిచిన టెండర్లకు రాజకీయ రంగు పులుముకుంది. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. అన్ని అర్హతలు ఉన్నా కాంట్రాక్టర్లకు కాదని ఇప్పటి వరకు ఇంప్లాంట్స్ను సరఫరా చేసిన కాంట్రాక్టర్కే తిరిగి అప్పగించాలని అధికార పార్టీ నేతలు..అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి అర్హులైన కాంట్రాక్టర్కు ఇంప్లాంట్స్ సరఫరాకు ఆర్డర్స్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఫ టెండర్లు పూర్తయి నెల రోజులు ఫ నేటికీ కాంట్రాక్టర్ను ఎంపిక చేయని జిల్లా పర్చేజింగ్ కమిటీ ఫ పాత కాంట్రాక్టర్కే ఇవ్వాలని అధికార పార్టీ నేతల ఒత్తిడి ఫ నల్లగొండ జీజీహెచ్కి నిలిచిన ఇంప్లాంట్స్ సరఫరా ఫ ఇబ్బందుల్లో ఆర్థోపెడిక్ రోగులు ఇంప్లాంట్స్ సరఫరాకు కాంట్రాక్టర్ ఎంపిక విషయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా పర్చేజింగ్ కమిటీదే తుది నిర్ణయం. ఎంపికలో మా ప్రమేయం ఏమి ఉండదు. ప్రభుత్వ నిబంధనల మేరకు కమిటీ ఎంపిక చేస్తుంది. – డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
శాలిగౌరారం పీహెచ్సీపై కలెక్టర్కు నివేదిక
శాలిగౌరారం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో చెత్తకుప్పను తలపించేలా ఉన్న మెడికల్ స్టోర్ రూమ్ను సిబ్బంది గురువారం శుభ్రపరిచారు. ఆరుబయట ఉన్న లక్షల రూపాయల విలువ కలిగిన సూదిమందుల స్టాక్ను స్టోర్రూమ్లో భద్రపరిచారు. సాక్షి దినపత్రికలో గురువారం ‘శాలిగౌరారం పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి సంబంధిత జిల్లా ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై నివేదిక అందజేయాలని మండల వైద్యాధికారిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో మండల వైద్యాధికారి పీహెచ్సీకి వచ్చి కిందిస్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టోర్రూమ్ను శుభ్రం చేయించారు. గడువుదాటిన సూదిమందులు, నిరుపయోగ వస్తువులను బయటపడేశారు. పీహెచ్సీ వరండాలో ఉన్న రూ.లక్షల విలువైన సూది మందులను మెడికల్ స్టోర్రూమ్లో భద్రపరిచారు. అనంతరం ఘటనకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్తోపాటు సంబంధిత ఉన్నతాధికారులకు అందజేశారు. -
విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం
మునుగోడు : రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఎనలేని కృషిచేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు మండలం పులిపలుపుల ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.25వేల నుంచి రూ. 15వేల నగదు ప్రోత్సాహకాలు అందిస్తానన్నారు. మునుగోడు ప్రాంతానికి సాగునీరు అందించేందుకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డిపై కొట్లాడి బి.వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు తెచ్చి పూర్తిచేసి ఇటీవలే సీఎం రేవంత్రెడ్డితో నీటిని నింపితే ప్రతిపక్ష నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. త్వరలో మునుగోడు మండలంలోని కాల్వలు తవ్వించి సాగు నీరు పారిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్రెడ్డి, చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, పాఠశాల హెచ్ఎం కళావతి, సర్పంచ్లు కమ్మంపాటి జ్యోతి వెంకటేష్, దాసరి గోవర్ధన్, ఉపాధ్యాయులు యూసుఫ్పాషా, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు. ఫ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
సాక్షి, నల్లగొండ జిల్లా: పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. తిప్పర్తి సమీపంలో గేదెను ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్లో సమస్య తలెత్తింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. నల్లగొండ-మిర్యాలగూడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కాగా, ఇటీవల హన్మకొండ జిల్లాలో సికింద్రాబాద్- హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు మరమత్తులు చేపట్టిన అనంతరం వేరే ఇంజన్తో సహా రైలును ఉప్పల్ రైల్వే స్టేషన్కు తరలించారు. -
క్యాన్సర్ రహిత సమాజం దిశగా..
జిల్లాలోని కిషోర బాలికల తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు హెచ్పీవీ టీకాలు వేయించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలను అందుబాటులో ఉంచాం. – పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నల్లగొండ టౌన్ : మహిళలను పట్టి పీడిస్తున్న వివిధ రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ టీకాలు వేయడం ద్వారా మహిళల్లో వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార, ఇతర క్యాన్సర్లను అరికట్టవచ్చు. 14 నుంచి 15 ఏళ్ల వయసు గల కిషోర బాలికలకు ఈ టీకాలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా హైస్కూళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో 20 వేల మంది 14–15 సంవత్సరాల కిషోర బాలికలు నమోదై ఉన్నారు. వారికి హెచ్పీవీ వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. ఆస్పత్రుల్లో టీకాలు జిల్లాకు ఇటీవల 3,600 హెచ్పీవీ వ్యాక్సిన్ యూనిట్లను ప్రభుత్వం సరఫరా చేసింది. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, మర్రిగూడ ఏరియా ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్పీవీ టీకాలను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున టీకాలను వేసే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. పరీక్షలు ముగియగానే టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 429 మంది యుక్త వయసు కిషోర బాలికలకు టీకాలు వేశారు. మిగిలిన వారికి టీకాలు వేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. మెడికల్ ఆఫీసర్లకు అవగాహన జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు, ఏజెంట్లకు హెచ్పీవీ టీకాల కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ అవగాహన కల్పించింది. వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే హెచ్పీవీ టీకాలను వేయాలని నిర్ణయించినప్పటికి కేంద్రం నుంచి టీకాలు సరఫరా కావడంతో జాప్యం జరిగింది. కేంద్రం పూర్తిస్థాయిలో టీకాలను సరఫరా చేయగానే కిషోర బాలికలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నారు. ఫ కిశోర బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఫ జిల్లాకు చేరిన 3,600 యూనిట్లు ఫ టెన్త్ పరీక్షలు ముగియగానే వ్యాక్సినేషన్ ఫ కార్యాచరణ సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ -
సౌండ్ చేస్తే.. తుక్కు తుక్కే..!
● నల్లగొండలో అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లు ధ్వంసంనల్లగొండ : ట్రాఫిక్ నిబంధనల అమలు, శబ్ద, వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టి అధిక శబ్దం కలిగించే 72 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా నల్లగొండ ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ వాహనాలకు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లు అమర్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కంపెనీ ద్వారా అందించిన ఒరిజినల్ సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు రాఘవరావు, మహాలక్ష్మయ్య, రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు సైదులు, సైదాబాబు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారికి కలెక్టర్ భరోసా
నల్లగొండ : కలెక్టర్ చంద్రశేఖర్ ఓ చిన్నారికి భరోసాగా నిలిచారు. కనగల్ మండలం జి.చెన్నారం గ్రామానికి చెందిన చంద్రమౌళి కుమార్తె స్వాతిక (10) గతంలో జరిగిన ఓ ప్రమాదంలో ఒక కాలు కోల్పోయింది. తన కుమార్తెకు కృత్రిమ కాలు అమర్చి, తాను ఉపాధి పొందేందుకు మూడు చక్రాల బండి అందించాలని తండ్రి చంద్రమౌళి బుధవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ చిన్నారి స్వాతికకు కృత్రిమ కాలు ఏర్పాటుకు సాయం చేసేందుకు అంగీకరించడంతో పాటు, చంద్రమౌళి జీవనోపాధి కోసం మూడు చక్రాల బండిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిస్సహాయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. స్వాతికకు అవసరమైన వైద్య సహాయం అందించి ఆమె సాధారణ జీవనాన్ని పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు బాధ్యతగా పనిచేయాలి పథకాల అమలులో అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జనగణనలో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఎన్యుమరేషన్ ప్రక్రియను తప్పులు లేకుండా చేయాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, వార్డుల వారీగా సెన్సస్ నిర్వహించాలని తెలిపారు. స్లమ్ ప్రాంతాలను వేరు చేసి మ్యాపింగ్ చేయాలని.. ఏవైనా సందేహాలు ఉంటే సీపీఓను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 166 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని.. మిగతా కేంద్రాలను కూడా వెంటనే తెరవాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలన్నారు. సాదా బైనామా పై వచ్చిన దరఖాస్తులనువెంటనే పరిష్కరించాలన్నారు. సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, సీపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కొన్ని మండలాల్లో పొంచి ఉన్న ప్రమాదం
జిల్లా వ్యాప్తంగా చూస్తే ఫిబ్రవరి కంటే మార్చి నెలలో భూగర్భ జలాల తగ్గుదల స్వల్పంగానే కనిపిస్తున్నప్పటికీ.. పలు మండలాల్లో మాత్రం ఈనెల, వచ్చే నెలలో భారీగా భూగర్భ జలాలు భారీగా పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. జిల్లాలో 33 మండలాల్లో ఫిబ్రవరి నెలతో పోల్చితే మార్చి నెలలో దాదాపు అంతటా భూగర్భ జలాలు పడిపోయాయి. ఇక 8 మండలాల్లో మీటరు కంటే ఎక్కువగా లోతులోకి భూగర్భ జలాలు వెళ్లాయి. అందులో అత్యధికంగా కొండమల్లేపల్లిలో వేగంగా భూగర్భ జలాలు పడిపోయాయి. అక్కడ ఫిబ్రవరి నెలలో 3.28 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు.. మార్చి నెలలో 7.75 మీటర్లకు పడిపోయాయి. కొండమల్లేపల్లిమిర్యాలగూడవేములపల్లినార్కట్పల్లికట్టంగూరుగుడిపల్లిగుండ్లపల్లిచింతపల్లి0.551.361.42.835.873.283.224.447.877.757.919.437.007.1211.00ఈ సంవత్సరంలో పలు మండలాల్లో భూగర్భ జలాల తగ్గుదల ఇలా (మీటర్లలో..)7.99మార్చి -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
నల్లగొండ, కనగల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందికి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన కనగల్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. జి.ఎడవల్లి, కురంపల్లి, నల్లగొండ మండలంలోని జీకెఅన్నారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా చోట్ల మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని క్షేత్రస్థాయిలో కలెక్టర్తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్, పౌరసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ రెవెన్యూ అధికారులందరూ ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్, హమాలీ, ఇతర సౌకర్యాల సమస్య లేకుండా చూస్తామన్నారు. ఎండాకాలం కావడంతో నిర్ధేశిత ధాన్యం తేమ శాతం వస్తుందని.. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే రాత్రి సమయంలో లైట్లు ఏర్పాటు చేసి కాంటాలు వేయాలన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మిస్తామన్నారు. రూ.450 కోట్లతో ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ పద్మ, సర్పంచ్లు మురళీధర్గౌడ్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ నల్లగొండ, కనగల్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం -
రైతులకు సంఘం అవసరం
బత్తాయి రైతుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఓ సంఘం అవసరమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026- 8లోసాక్షి ప్రతినిఽధి, నల్లగొండ : వేసవిలో ఎండలు మండుతుండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జిల్లాలో ఫిబ్రవరి నెలలో భూగర్భ జలాలు 5.96 మీటర్ల పైన ఉండగా.. మార్చి నెలాఖరులో 6.69 మీటర్ల లోతుకు పోయాయి. అంటే 0.73 మీటర్లకు భూగర్భ జలాలు తగ్గాయి. 8 మండలాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వచ్చే రెండు నెలల్లో జిల్లా అంతటా భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కానీ, గతేడాది మార్చి నెలాఖరుతో పోల్చితే ఈ ఏడాది మార్చి నెలాఖరుకు భూగర్భ జలాలు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. గతేడాది కంటే ఇప్పుడు 1.44 మీటర్లు పైకే.. గత సంవత్సరం మార్చిలో జిల్లాలో సగటున 8.13 మీటర్లలోతులో ఉన్న భూగర్భ జలాలు ఉండగా.. ఈ ఏడాది మార్చిలో 6.69 మీటర్లపైనే ఉన్నాయి. అంటే 1.44 మీటర్ల పైకే భూగర్భ జలం ఉంది. జిల్లాలో ఈసారి అత్యధిక వర్షపాతం నమోదైంది. సగటును మించి వర్షాలు కురిశాయి. గత సంవత్సరం మే నెలలోనే వర్షాలు ప్రారంభమై 2025 డిసెంబర్ వరకు కురిశాయి. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీరు చేరింది. దానికి తోడు ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం, సాగర్ కూడా నిండటంతో కృష్ణా జలాలతో చెరువులు నింపారు. దీంతో భూగర్భ జలాలు గతేడాది కంటే ఎక్కువగా ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఐదు మండలాల్లో తగ్గుదల ● అడవిదేవులపల్లి మండలంలో గతేడాది మార్చిలో 3.40 మీటర్లపైన ఉన్న భూగర్భ జలాలు ఈ మార్చి నెలాఖరుకు 4.84 మీటర్లకు పడిపోయాయి. ● కొండమల్లేపల్లిలో గతేడాది 5.06 మీటర్ల వద్ద భూగర్భ జలాలు ఉండగా, ప్రస్తుతం అవి 7.75 మీటర్ల లోతుకు పడిపోయాయి. ● మిర్యాలగూడ మండలంలో గతేడాది 0.47 మీటర్లపైన భూగర్భ జలాలు ఉండగా, ప్రస్తుతం అవి 3.22 మీటర్ల లోతులో ఉన్నాయి. ● నకిరేకల్లో గత సంవత్సరం 7.0 మీటర్ల లోతులో నీరు ఉండగా, ఇప్పుడది 8.05 మీటర్లకు పడిపోయింది. ● వేములపల్లి మండలంలో గత సంవత్సరం 3.86 మీటర్ల పైన ఉన్న భూగర్భ జలాలు, ఇప్పుడు 4.44 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. జిల్లాలో మొత్తం 1,417 చెరువులు ఉన్నాయి. ఇందులో 821 చెరువుల్లో 25 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. మరో 290 చెరువుల్లో 25 నుంచి 50 శాతం నిల్వ ఉంది. 271 చెరువుల్లో 50 నుంచి 75 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. మరో 35 చెరువుల్లో ఇంకా 75 నుంచి 100 శాతం నీటితో నిండుకుండలా ఉన్నాయి. దీనివల్ల ఈసారి మార్చి నెలాఖరు నాటికి భూగర్భ జలాలు పెద్దగా తగ్గలేదు.ఫ ఫిబ్రవరి పోల్చితే.. మార్చి నెలాఖరుకు పడిపోయిన జలాలు ఫ ఎనిమిది మండలాల్లో ప్రమాద ఘంటికలు ఫ వచ్చే రెండు నెలల్లో జిల్లా అంతటా తగ్గే అవకాశం ఫ గతేడాది మార్చితో పోల్చితే మాత్రం కాస్త మెరుగే.. -
ఎంజీయూలో జీఎస్టీ అధికారుల తనిఖీ
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ప్రభుత్వానికి రూ.99 లక్షల జీఎస్టీ ఎగ్గొట్టిన వ్యవహారంలో బుధవారం స్టేట్ జీఎస్టీ అధికారులు యూనివర్సిటీలో తనిఖీలు చేశారు. ఈనెల 7వ తేదీన ‘సాక్షి’లో ‘రూ. 99 లక్షల జీఎస్టీ ఎగనామం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రాష్ట్ర జీఎస్టీ అధికారులు స్పందించారు. బుధవారం జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వినయ్కుమార్ బృందం యూనివర్సిటీకి వచ్చి 113 మంది ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, 18 జీఎస్టీ చెల్లింపులు, యూనివర్సిటీ చెల్లించిన 2 శాతం జీఎస్టీ చెల్లింపుల పత్రాలను పరిశీలించారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ చెల్లించాల్సిన 16 శాతం జీఎస్టీకి సంబధించిన రూ.99 లక్షల వివరాలను సంబంధిత యూనివర్సిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జీఎస్టీ అధికారులు దీనిని సీరియస్గా తీసుకొని నోటీస్లు జారీ చేయడంతో సంబంధిత ఔట్సోర్సింగ్ ఏజెన్సీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలిసింది. దాంతోనే రాష్ట్ర జీఎస్టీ అధికారులు వచ్చి తెలుసుకున్న పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేధించనున్నట్లు తెలిసింది. వైజాగ్కాలనీలో ఎకో టూరిజం● ఎమ్మెల్యే బాలునాయక్ చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్కాలనీ సమీపంలో ఎకో టూరిజం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన టీఏసీ సమావేశంలో పాల్గొని పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించానని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలిపెద్దవూర : ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీఓ) శ్రీనివాస్ అన్నారు. బుధవారం పెద్దవూర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, ఎస్టీ రెగ్యులర్ హాస్టల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు పట్టికలను, పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. పదో తరగతి సమ్మెటీవ్ అసెస్మెంట్–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం డీటీడీఓ శ్రీనివాస్ను ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఆయన వెంట ఏసీఎంఓ డివి.నాయక్, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం డి.బాలోజీ, హెచ్డబ్ల్యూఓ కొల్లు బాలకృష్ణ, ఉపాధ్యాయులు కూన్రెడ్డి రాంరెడ్డి, బి.కృష్ణ, ఎండీ.షబ్బీర్, శ్రీనునాయక్, సురేందర్, షాహీన్బేగం, జహేదాబేగం, సైదులు, శాంతి, రామయ్య, ఏఎన్ఎం జ్యోతి, సిబ్బంది కమలమ్మ, నాగేందర్, సాంభయ్య, రాములమ్మ తదితరులు ఉన్నారు. ఏఎమ్మార్పీ డి–8, 9 కాలువకు నీటి విడుదలపెద్దవూర: రైతుల అభ్యర్థన మేరకు ఏఎమ్మార్పీ డి–8, 9 కాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు. ఏఎమ్మార్పీ పరిధిలోని డి–8, 9 కాలువకు యాసంగి సీజన్లో వారబంధీ గడువు ఈ నెల 2వ తేదీతో ముగిసింది. ఈ కాల్వ పరిధిలో పంటలు చేతికిరాకపోవడంతో రైతులంతా కాలువకు నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని ఏఎమ్మార్పీ ఉన్నతాధికారులకు విన్నవించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఏఎమ్మార్పీ ఏఈ జీవేష్ బుధవారం వరి చేలను ఏఈఓలతో కలిసి పరిశీలించి నీటి అవసరం ఉన్నదని నివేదించారు. దీంతో సాయంత్రం నుంచి ఏఎమ్మార్పీ డి–8, 9 కాలువకు నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు విన్నవించిన వారిలో రైతులు దాసరి శ్రీను, కొండల్, లక్ష్మారెడ్డి, అంజి, అంజిరెడ్డి, సూర్య తదితరులు ఉన్నారు. -
మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా బుధవారం మాన్యంచెల్కలో రూ.కోటీ 91 లక్షల వ్యయంతో నిర్మించిన పట్టణ పాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ నిధులతో పాటు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షలు అందించి మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. పట్టణంలో ప్రతీక్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సంయుక్తంగా మూడెకరాల స్థలంలో కంటి ఆస్పత్రిని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మాన్యంచెల్క జంక్షన్ను ఆధునీకరించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ అమీర్అలీ, ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, కార్పొరేటర్ కుందూరు దీపిక ప్రవీణ్కుమార్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నర్సింహారావు నేత, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘కార్పొరేట్’కు కొమ్ముకాస్తున్న కేంద్రం
మర్రిగూడ : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ సంపదను దోచిపెడుతోందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుందన్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, అప్పులు వంటి అంశాలతో దేశం తీవ్ర సంక్షోభంలో నెట్టబడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈదుల భిక్షంరెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, నాయకులు కల్లెట్ల లింగయ్య, చలం పాండు, ఎరుకల నిరంజన్, జక్కల అంయ్య, మాద సత్యం, బొల్లం యాదయ్య, రామిడి భూపతిరెడ్డి, కొట్టం యాదయ్య, బాలకిషన్, అల్వాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు పునరుత్థానం అద్భుత ఘట్టంరామగిరి (నల్లగొండ) : క్రీస్తు పునరుత్థానం అద్భుత ఘట్టమని నల్లగొండ బిషప్ ధమన్కుమార్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలో సోమవారం ఈస్టర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తుకు పూజా బలిని సమర్పించి మాట్లాడారు. అనంతరం అనాథలకు అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో ఫాదర్ బాలరాజు, బాలశౌరి, రాయప్ప, సిస్టర్ రమ్య, గాబ్రియల్, జోసెఫ్ రోజీ, పసల శౌరయ్య, టీఎస్ క్రిష్టోఫర్, జేమ్స్ పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. విద్యార్థికి గాయం
మోత్కూరు : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అనాజిపురం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ బునాది గుంతలు తవ్వి పనులను మధ్యలోనే వదిలేశాడు. కాగా సోమవారం విరామం సమయంలో 1వ తరగతి విద్యార్థి చింత రిత్విక్ ఆడుకుంటూ బునాది గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఉపాధ్యాయులు, స్థానికులు గమనించి విద్యార్థిని మోత్కూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై ఎంఈఓ సత్యనారాయణను వివరణ కోరగా.. కాంట్రాక్టర్తో మాట్లాడి త్వరితగతిన ప్రహరీ నిర్మాణం చేసేలా చూస్తానని తెలిపారు. -
బీజేపీ నాయకులపై కేసు కొట్టివేత
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని పానగల్ సమీపంలో అద్దంకి–నార్కట్పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని 2018లో ధర్నా చేసిన 12 మంది బీజేపీ నాయకులపై నల్ల గొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ధర్నా చేశారని టూటౌన్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీంతో 8 ఏళ్లుగా బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, మిర్యాల గిరి, జంజిరాల వెంకన్న, భీమనపల్లి శ్రీకాంత్, చింత యాదగిరి తదితరులపై ఈ కేసు కొనసాగింది. సోమవారం వీరందరిపై కేసును కొట్టివేస్తూ జిల్లా కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య పెన్పహాడ్ : ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని చీదెళ్ల గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చీదెళ్ల గ్రామానికి చెందిన గొబ్బి కాంతయ్య(53) ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన వ్యవసాయ పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ గోపికృష్ణ తెలిపారు. -
మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధ్యయనం
భూదాన్పోచంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపడుతున్న నేపథ్యంలో మానవ హక్కుల వేదిక, క్లైమెట్ ఫ్రంట్ సంస్థ, మూసీ పరిరక్షణ సమితి సంస్థకు చెందిన 14 మంది ప్రతినిధుల బృందం సోమవారం భూదాన్పోచంపల్లి పరిధిలో మూసీ పరీవాహక గ్రామాల్లోని కాలువలు, చెరువులు, పంట పొలాలను సందర్శించారు. జూలూరు గ్రామంలో రైతులు, గీత కార్మికులు, మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల సమన్యయ కమిటీ సభ్యులు వసంతలక్ష్మి, జీవన్కుమార్ మాట్లాడుతూ.. మూసీ కాలువలు, చెరువుల్లోని నీరంతా పచ్చగా ఉండి దుర్వాసన వస్తోందన్నారు. మూసీ కాలుష్య నీటితో పండించే పంటలు, చేపలు తినడానికి పనికిరావని తెలిపారు. ప్రభుత్వం మూసీ సుందరీకరణకు కేటాయించిన బడ్జెట్లో రూ.2వేల కోట్లు గ్రామ వ్యవస్థలకు కేటాయించాలన్నారు. అలాగే శిథిలావస్థకు చేరిన కత్వలు, కాలువలను ఆధునీకరించాలని, కాలుష్యంతో కూడిన చెరువులను పూడికతీసి పరిశుభ్రపర్చాలని కోరారు. అలాగే గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా చేయాలని, మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నాన్నారు. మూసీ పునరుద్ధరణను గౌరెల్లి నుంచి సోలిపేట మూసీ సాగునీటి డ్యాం వరకు పొడిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్బాబు, నగర కమిటీ సభ్యులు రోహిత్, శ్రావ్య, ప్రొఫెసర్ శ్రీధర్, బాలయ్య, ఆకాశ్, రుచిత్, అభిషేక్, గ్రామస్తులు దిండు బాలరాజు, చిలువేరు అయిలయ్య, బస్వయ్య, అయిలయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించగా రెవెన్యూ శాఖకు 61, ఇతర శాఖలకు 52తో కలిపి మొత్తం 113 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభమైనందున మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల్లో యుద్ధ ప్రాతిపదికన టీ–ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం పూర్తిచేయాలన్నారు. ఈనెల 14న నిర్వహించే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వకృత్త్వ పోటీలు నిర్వహించాలన్నారు. పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఎఫ్ఓ రాజశేఖర్, దేవరకొండ, చండూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రమణారెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలపై కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ప్రస్తుత యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభమైనందున కొనుగోళ్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9963407064కు రైతులు ఫోన్ చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లోని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం రబీలో రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలకు గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 కనీసం మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు. సన్నధాన్యానికి ప్రోత్సాహంగా క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్లో 24 గంటల పాటు విధులు నిర్వహించేలా సిబ్బందిని నియమించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రాంపతి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలి
భూదాన్పోచంపల్లి : మూసీ పరీవాహక మండలాల రైతులకు గోదావరి జలాలను అందించి మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. సోమవారం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని జీబీఆర్ గార్డెన్స్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా 3వ మహాసభలను లాంఛనంగా ప్రారంభించారు. మొదటిరోజు శ్రీమూసీ ప్రక్షాళన–గోదావరి జలాల సాధనశ్రీ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మూసీ చుట్టూ రసాయన వ్యర్థాలు వదులుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మూసీ సుందరీకరణపై ఉన్న శ్రద్ధ.. ప్రక్షాళనపై లేదని విమర్శించారు. బస్వాపూర్ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరందించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల సాధన కొరకు రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, ప్రజలు పోరాటాలకు సిద్ధ కావాలని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ జహాంగీర్ మాట్లాడుతూ.. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి షామీర్పేట, ఏదులాబాద్ మీదుగా చెరువులను నింపుతూ పిలాయిపల్లి కాలువలోకి గోదావరి జలాలను వదిలితే ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందని అన్నారు. గోదావరి జలాల సాధన కొరకు రాజకీయాలకతీతంగా రైతులను చైతన్యం చేస్తూ ఉద్యమకార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం మూసీ వేదిక గౌరవ అధ్యక్షుడు పిట్టల శ్రీశైలం మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మూసీ డంపింగ్యార్డుగా మారిందని విమర్శించారు. మూసీ విషపు జలాలతో ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, చర్మ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని, ఇటు పంటలు, పాడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. వెంటనే మూసీ కాలువల కత్వల పైన ఈటీపీలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రైతు సంఘం నాయకుడు గూడురు అంజిరెడ్డి, న్యాయవాది కొత్త బుచ్చిరెడ్డి, కోట రాంచంద్రారెడ్డి, మంచాల మధు, పగిళ్ల లింగారెడ్డి, దుబ్బాక జగన్, అందెల జ్యోతి, నెల్లికంటి జంగయ్య, వడ్డేపల్లి యాదగిరి, సామ జంగారెడ్డి, పుష్పలత, నోముల కృష్ణారెడ్డి, కోట అశోక్, బుగ్గ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి -
బంగారం దుకాణంలో చోరీకి యత్నం
ఆలేరు : బంగారు ఆభరణాలు కొనేందుకు వచ్చి, బంగారం దుకాణం యజమానిని ఏమార్చి చోరీకి యత్నించాడు ఓ దొంగ. అతడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆలేరు పట్టణంలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాప్ సమీపంలో సంపత్చౌదరి అనే వ్యక్తి భవానీ జ్యువెల్లరీ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అబ్బాస్అలీ జ్యువెల్లరీ షాపు వద్దకు వచ్చాడు. తనకు బంగారు కావాలని యజమాని సంపత్చౌదరికి చెప్పాడు. దీంతో యజమాని వివిధ రకాల ఆభరణాలను టేబుల్ పైన పెట్టాడు. ఇంకా ఏమైనా ఆభరణాలు ఉంటే చూపెట్టమంటూ షాపు యజ మానిని మాటలతో ఏమార్చాడు. ఈ క్రమంలో సుమారు మూడున్నర తులాల బంగారు గొలుసును జేబులో వేసుకొని షాపు నుంచి హడావిడిగా బయటకు వచ్చి పారిపోతుండగా.. యజమాని గమనించి కేకలు వేశాడు. స్థానికులు అప్రమత్తమై పారిపోతున్న అబ్బాస్ అలీని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. జ్యువెల్లరీ షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు ఎస్ఐ వినయ్ తెలిపారు. దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగింత ఆలేరు పట్టణంలో ఘటన -
లక్షల
ఎంజీయూలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాకంనల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ సంస్థ ఏకంగా రూ.99 లక్షల జీఎస్టీ చెల్లించకుండా ఎగనామం పెట్టింది. యూనివర్సిటీకి ఈ ఏజెన్సీ సంస్థ జూనియర్ అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డ్స్, డైనింగ్ హాల్స్ హెల్పర్లు, స్టోర్ కీపర్లు మొత్తంగా 113 మందిని కేటాయించగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సిబ్బందిని కేటాయించినందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా ఈ ఏజెన్సీ సంస్థ రూ.99 లక్షలు జీస్టీ ఎగ్గొడుతున్నా యూనివర్సిటీ అధికారుల్లో చలనం లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. అన్నీ తెలిసిన సందరు అధికారులు జీఎస్టీకి చెల్లించాల్సిన రూ.99 లక్షల విషయాన్ని దాచి పెడుతుండడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీఎస్టీ చెల్లించాలని పలు మార్లు జీస్టీ అధికారులు యూనివర్సిటీతోపాటు ఏజెన్సీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా స్పందించడంలేదని తెలుస్తోంది. జీఎస్టీ అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో యూనివర్సిటీ అధికారులు.. వర్కర్లకు ఇవ్వాల్సిన జీతాలు రెండు నెలలుగా ఏజెన్సీకి ఇవ్వకుండా నిలిపివేశారు. దాంతో వర్కర్లు, ఇతర ఉద్యోగులు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారుల బాధ్యతారాహిత్యం.. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్కర్ల కోసం టెండర్లు పిలిచిన సమయంలోనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ సంస్థ జీఎస్టీ సంస్థ నుంచి బకాయిలు లేనట్లు ఎన్ఓసీ సమర్పించాల్సి ఉంటుంది. కానీ సదరు యూనివర్సిటీ అధికారులు ఈ నిబంధనలు పట్టించుకోకుండా సదరు ఏజెన్సీ సంస్థకు టెండరు అప్పగించారు. మూడు నాలుగేళ్లుగా జీస్టీ చెల్లించడంలేదని జీఎస్టీ అధికారులు యూనివర్సిటీ అధికారులకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని కారణంగానే సదరు ఏజన్సీ సంస్థ ఏకంగా రూ.99 లక్షల జీస్టీ ఎగ్గొట్టింది. ఒక్కో ఉద్యోగికి 18 శాతం యూనివర్సిటీ జీఎస్టీ చెల్లించాల్సి ఉండగా, యూనివర్సిటీ నేరుగా 2 శాతం, ఏజెన్సీ ద్వారా 16 శాతం చెల్లించాల్సి ఉంది. ఈ 16 శాతం డబ్బులను ఏజెన్సీ సంస్థ స్వాహా చేసినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. యూనివర్సిటీలోని కొందరు అధికారులు ఏజెన్సీ సంస్థతో అంటకాగి ముడుపులు పుచ్చుకొని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టకుండా సహకరించినట్లు తెలిసింది. జీఎస్టీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీలో ఏ అధికారికి నోటీసులు వెళ్లినా కూడా ఏజెన్సీ సంస్థకు జీతాలు, జీఎస్టీ చెల్లింపు అతడిదే పూర్తి బాధ్యత ఉంటుంది. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లినా, రిటైర్డ్ అయినా కూడా వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఉద్యోగులను, వర్కర్లను సరఫరా చేస్తున్న ఏజెన్సీకి ప్రతినెలా 16 శాతం జీఎస్టీ చెల్లించాం. జీఎస్టీ చెల్లించలేదని జీఎస్టీ కార్యాలయం నుంచి నోటీస్ వచ్చి మాట వాస్తవమే. ఏజెన్సీ యజమానికి కూడా నోటీస్ ఇచ్చాం. జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత ఏజెన్సీదే. – అంజిరెడ్డి, ఎంజీయూ రిజిస్ట్రార్ ఫ దాచిపెడుతున్న యూనివర్సిటీ అధికారులు ఫ రెండు నెలలుగా వర్కర్లకు జీతాలు ఇవ్వని ఏజెన్సీ -
ఎన్నికల ప్రక్రియలో మార్పు రావాలి
రామగిరి (నల్లగొండ) : ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ఆయన రచించిన ఏడుకోలల బాయి ఎన్నికల శతకంపై నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో సోమవారం సృజన సాహితీ ఆధ్వర్యంలో పద్యగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కవులు తమకు కేటాయించిన శతకంలోని పద్యాలను పాడారు. ఈ సందర్భంగా ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కవిత్వాన్ని జీవితంలో భాగంగా భావిస్తానన్నారు. తాను సంప్రదాయ పద్యాన్ని ఎంచుకొని ఆధునిక వస్తువు ఎన్నికల తీరుపై శతకాన్ని రచించానన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్య మాట్లాడుతూ.. ఏనుగు లక్ష్మణకవి సంస్కృత కావ్యం సుభాషిత రత్నావళిని తెలుగులో అనువదించారని, ఇప్పుడు ఏనుగు నరసింహారెడ్డి సామాన్యుల హృదయాలలోని భావాలను పద్య కవిత్వంగా ఏడుకోలల బాయి శతకాన్ని రాయడం ఎన్నికల స్వరూపాన్ని మార్చాలనేది ఉద్దేశమన్నారు. ప్రాచీన పద్యం ద్వారా వర్తమాన సమస్య ఎన్నికల వ్యవస్థ గురించి చెప్పడం వినూత్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెరుమాళ్ల ఆనంద్ మాట్లాడుతూ.. ఐదు శతాబ్దాల క్రితమే వేమన పద్య ప్రక్రియ ద్వారా ఆనాటి సమాజంలోని తప్పులను ఎత్తిచూపి సామాజిక సంస్కరణకు దోహదపడ్డారని, ఇప్పుడు సీస పద్యాలతో భారత ఎన్నికల్లోని లొసుగులను నరసింహారెడ్డి ఎత్తిచూపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తండు కృష్ణకౌండిన్య, తూర్పు మల్లారెడ్డి కనకటి రామకృష్ణ, సాగర్ల సత్తయ్య, బండారు శంకర్, ఇడికోజు శ్రీనివాసాచారి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, నర్రా సుఖేందర్రెడ్డి, సి. అనితకుమారి, శీల అవిలేను, బరిగెల శ్రవణ్, గడ్డం శ్రీను, కాసుల ఆంజనేయులు, బైరెడ్డి కృష్ణారెడ్డి, బక్క పిచ్చయ్య, మామిడి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి -
‘బైపాస్’ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలో బైపాస్ నిర్మాణంలో నాసిరకం మట్టిని ఉపయోగిస్తూ నిధుల దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మట్టి మాఫియా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండకు కేంద్ర ప్రభుత్వం రూ.530 కోట్లతో బైపాస్ మంజూరు చేస్తే నిర్మాణ విషయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. నిబంధనలకు పాతర వేసిన కాంట్రాక్టర్కు మంత్రి, అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. రోడ్డు నిర్మాణంలో ఎక్కడ ఎర్రమట్టి ఉపయోగించడం లేదన్నారు. కంచనపల్లి, దోమలపల్లి, బుద్దారం, అనంతారం గ్రామాల్లోని చెరువుల నుంచి రూ.140 కోట్ల విలువైన నాసిరకం మట్టి తెచ్చి రోడ్డు నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతెపాక సాంబయ్య, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, దాయం భూపాల్రెడ్డి, చింత ముత్యాల్రావు, పోతెపాక లింగస్వామి, గుర్రం వెంకట్రెడ్డి, రావెళ్ల కాశమ్మ, వంగూరి రాఖీ, పాలకూరి రవిగౌడ్, పురుషోత్తం పాల్గొన్నారు. -
దాడి కేసులో నిందితుడి రిమాండ్
మేళ్లచెరువు : యువకుడిపై దాడి చేసి అతడి బైక్, సెల్ఫోన్ లాక్కోని పరారైన వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు స్థానిక ఎస్ఐ పరమేష్ తెలిపారు. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన నవీన్ ఈ నెల 4వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మండల కేంద్రంలోని ఓ దాబాలో భోజనం చేసి వచ్చాడు. అదే సమయంలో చందమల్ల శ్రీకాంత్ అలియాస్ చిక్కుల శ్రీకాంత్ నవీన్ వద్దకు వచ్చి అకారణంగా అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో నవీన్పై కర్రలతో శ్రీకాంత్ దాడి చేసి బైక్, సెల్ఫోన్ లాక్కోని అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటిరోజు ఉదయం నవీన్ కుటుంబ సభ్యులు అతడి ఒంటిపై గాయాలను గమనించి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. శ్రీకాంత్ను అతడి ఇంట్లో సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిపై 7 కేసులు ఉన్నాయని, దీంతో అతడిపై రౌడీషీట్ తెరిచినట్లు పేర్కొన్నారు. లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు అడ్డగూడూరు : ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన వంట మాస్టర్ వేల్పుల నర్సయ్య, జెట్ట తండాకు చెందిన సరిత కలిసి మోత్కూరు మండలంలో ఓ ఫంక్షన్లో వంట చేసి బైక్పై తిరిగి తిరుమలగిరికి వెళ్తున్నారు. మార్గమధ్యలో అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామ శివారులోని నూనె మిల్లు సమీపంలో రోడ్డు పక్కనే ఆపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. -
విద్యుదాఘాతానికి గురైన గర్భిణి
● 108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్తండాకు చెందిన బి. నిఖిత ఐదు నెలల గర్భిణి. సోమవారం ఇంట్లో బోరు మోటారు స్విచ్ ఆన్ చేస్తుండగా ఆమె విద్యుదాఘాతానికి గురైంది. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆమెను అంబులెన్స్లో ఎక్కించుకొని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిఖిత పరిస్థితి నిలకడగా ఉందని 108 అంబులెన్స్ పైలెట్ పి. సైదులు, మెడికల్ టెక్నీషియన్ సీహెచ్. వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యుత్ తీగలు తగిలి గడ్డి లోడు దగ్ధం● మంటలు ఆర్పివేసిన పోలీస్ కానిస్టేబుళ్లు మఠంపల్లి : మండలంలోని కాల్వపల్లితండాకు చెందిన రైతు బానోతు రూప్లానాయక్ సోమవారం తన వ్యవసాయ పొలం నుంచి వరి గడ్డిని ట్రాక్టర్లో లోడు చేసుకుని ఇంటికి తీసుకొస్తుండగా కరెంట్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. గడ్డి దగ్ధమవుతుండడంతో వెంటనే రైతు మఠంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసు కానిస్టేబుళ్లు విజయ్, రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సమీపంలోని వ్యవసాయ బోరుతో పాటు బావి నుంచి బకెట్లతో నీటిని తీసుకొచ్చి మంటలు ఆర్పివేశారు. ఫైరింజన్ కోసం వేచి చూడకుండా మంటలు ఆర్పివేసిన కానిస్టేబుళ్లను గ్రామస్తులు అభినందించారు. జూదరుల అరెస్ట్త్రిపురారం : మండలంలోని కామరెడ్డిగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై సోమవారం త్రిపురారం పోలీసులు దాడి చేసి ముగ్గురు జూదరులను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారయ్యారు. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామరెడ్డిగూడెం గ్రామ శివారులోని కుంట సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి కామెల్ల లక్ష్మణ్, గోగుల చందన్, పల్లపు శ్రీనును అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన దోరెపల్లి శేఖర్, రెమిడాల దుర్గయ్య, రెమిడాల మహేందర్, నర్సింగ్ విజయ్ పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.600 నగదు, మూడు సెల్ఫోన్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందండి
రామగిరి (నల్లగొండ), కనగల్ : రైతులు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి కోరారు. సోమవారం నల్లగొండ మండల పరిధిలోని తొరగల్, ఎం.దుప్పలపల్లి, కొత్తపల్లి, అప్పాజీపేట, నర్సింగ్భట్ల, కుదావన్పూర్, చిన్న సూరారంతోపాటు కనగల్ మండలం కనగల్, తేలకంటిగూడెం, పర్వతగిరి, చర్లగౌరారం, ఏమిరెడ్డిగూడెం, లింగాలగూడెం, దోరెపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ కల్పిస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంటాలు వేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, నల్లగొండ ఎంపీడీఓ యాకూబ్, ఏఓ శ్రీనివాస్, ఏపీఎం వినోద, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఐకేపీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్రకట్టంగూర్ : ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలం పిట్టంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీల సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. బీజేపీ కూటమి ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరు తొలగించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు ఇవ్వాలని షరతు పెట్టడంతో భవిష్యత్లో ఉపాధి హామీ పనులు కనుమరగయ్యే ప్రమాదం ఉందన్నారు. కూలీలకు ఉపాధి పనులను దూరం చేసి వారి పొట్టగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కారింగు రమణ, వంగా మహేశ్వరి, నవనీత, లక్ష్మి, తోటకూరి యాదమ్మ పాల్గొన్నారు. -
ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి
కోదాడ : ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సూచించారు. సోమవారం ఆయన కోదాడ ఆర్టీసీ బస్టాండ్, డిపోను తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న సేవలను పరిశీలించారు. వేసవిలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండే విధంగా చూడాలన్నారు. ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ చేసి తదనుగుణంగా సేవలందించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం జానిరెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ సుచరిత, డీఎం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి -
కామినేని ఆస్పత్రికి వృద్ధురాలి మృతదేహం అప్పగింత
నకిరేకల్ : నకిరేకల్లోని పన్నాలగూడెంలో నివాసముంటున్న కనుకుంట్ల సుశీల(70) గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందింది. కాగా స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆమె నేత్రాలు సేకరించారు. సోమవారం సుశీల మృతదేహాన్ని కూడా ఆమె భర్త శంకర్రెడ్డి, కుమారులు సుధీర్రెడ్డి, నవీన్రెడ్డి, విద్యాసాగర్రెడ్డి అంగీకారంతో నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరేశం సతీమణి పుష్ప, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్, క్లబ్ ప్రతినిధులు రాంమోహన్నావు, ఎర్ర శంభులింగారెడ్డి, సూర్యచంద్రరావు, పైళ్ల శశిధర్రెడ్డి తదితరులు ఉన్నారు. సుశీల భౌతికకాయానికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితా శ్రీనివాస్గౌడ్, స్థానిక కౌన్సిలర్ కందాల భిక్షంరెడ్డి, సీపీఎం నేతలు వంటేపాక వెంకటేశ్వర్లు, బొజ్జ చిన వెంకులు, వంటేపాక కృష్ణ నివాళులర్పించారు. -
డ్రగ్స్, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, యాదాద్రి : డ్రగ్స్, సైబర్ నేరాలను అదుపు చేయడంలో పోలీసులు మరింత అప్డేట్ కావాలని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరిలో భరోసా కేంద్రం, జిల్లా పోలీస్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు అన్నివిభాగాల్లో 15 సంవత్సరాల ముందున్నారన్నారు. దానిని కొనసాగిస్తూ సాంకేతికంగా ఎదగాలన్నారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో డీజీపీ శివధర్రెడ్డి, అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మొక్కలు నాటారు. అంతకు ముందు భరోసా కేంద్రంలో పోలీసుల గౌరవ వందనం డీజీపీ స్వీకరించారు. భరోసా కేంద్రంలో సిబ్బందితో మాట్లాడి సూచనలు చేశారు. జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్రెడ్డి, అదనపు డీజీపీ మహేష్ భగవత్లకు ఎస్పీ మెమొంటోలు అందజేశారు. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న డీజీపీ యాదాద్రి భువనగిరి జిల్లాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో బీబీనగర్ పోలీస్ స్టేషన్లో దొంగ రివాల్వర్ చోరి చేశాడని, యాదగిరిగుట్ట దేవస్థానం ఆలయంలో దొంగతనం కేసులు తనకు ఎప్పుడు గుర్తుకు వస్తాయన్నారు. అప్పటి పోలీసులు కలిసికట్టుగా పనిచేసి దొంగలను పట్టుకుని రికవరీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లు అన్నారు. అన్నిచోట్ల పనిచేయడం వేరు.. ఇక్కడ పనిచేయడం వేరన్నారు. ఎస్పీగా, రాచకొండ కమిషనర్గా జిల్లాతో ఉన్న అనుబంధాన్ని పోలీస్ అధికారులతో పంచుకున్నారు. సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, డీఎస్సీలు రవీందర్, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్నాయుడు, ఇన్స్పెక్టర్ రమేష్కుమార్, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఫ డీజీపీ శివధర్రెడ్డి -
హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి
ప్రారంభమవుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నల్లగొండ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. పది రోజుల క్రితమే కోతలు ప్రారంభమై పెద్ద ఎత్తున ధాన్యం కల్లాలకు వస్తుండడంతో.. అధికారులు కొనుగోలు కేంద్రాలను తెరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 401 కేంద్రాలను తెరవాలని నిర్ణయించిన అధికారులు ఆదివారం వరకు 16 కేంద్రాలను ప్రారంభించారు. కానీ కాంటాలు మాత్రం ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి యాసంగి సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మిల్లు నేరుగా కొనుగోలు చేస్తాయని, మిగిలిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వస్తుందని లెక్కలు వేశారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 401 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత యాసంగి కంటే ఈసారి అధికంగా దాన్యం వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 2న సందర్భంగా చిట్యాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆదివారం నల్లగొండలోని ఆర్జాలబావిలో కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వేచి చూసే ధోరణిలో యంత్రాంగం గత యాసంగి సీజన్్లో ఏర్పాటు చేసిన చోటనే ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో రైతులు ముందుగానే ఆయా ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించి ఆరబెడుతున్నారు. ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉంటుండటంతో నిర్దేశిత తేమ శాతం త్వరగా వచ్చేస్తోంది. అయినా జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ప్రారంభించడంలో వేచి చూసే ధోరణిలో ఉంది. రైతులకు తప్పని పడిగాపులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నా.. క్షత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 16 కేంద్రాలు ప్రారంభించినా.. కాంటాలు మాత్రం వేయడం లేదు. చాలా కేంద్రాల వద్దకు ఇంకా టార్పాలిన్లు, తేమ, తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు కూడా రాలేదు. రైతులకు అవసరమైన నీడ, తాగునీటి వసతి కూడా కల్పించలేదు. దీంతో రైతులు రోజూ కేంద్రాల వద్ద తమ ధాన్యం ఆరబెట్టి.. సాయంత్రం కుప్పగా చేస్తూ.. రాశుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాతావరణంలో మార్పులు సంభవించి వర్షం కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఫ ఈ సీజన్లో 401 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం ఫ ఇప్పటివరకు 16 కేంద్రాలు ప్రారంభం ఫ ఆర్జాలబావిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్, కలెక్టర్ -
వేసవిలో జాగ్రత్తలు పాటించాలి
నకిరేకల్ : వేసవిలో వడదెబ్బ ప్రభావాన్ని తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నకిరేకల్ మండలం నెల్లిబండలో వడదెబ్బతో శనివారం బుడిగె శంకరయ్య(60) మృతిచెందినట్లు ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైంది. దీనిపై ఆదివారం మండల వైద్యాధికారి పి.వెంకటేషం, సిబ్బంది శ్యాంసుందర్, శివాణి, లత నెల్లి బండను సందర్శించి శంకరయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారని తెలిపారు. శంకరయ్య మరణంపై ఆదివారం కలెక్టర్కు, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్కు నివేదిక సమర్పించామని, ఆయన వడదెబ్బతోనే మృతి చెందినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. వడదెబ్బ నుంచి ప్రజలు రక్షణ పొందేలా.. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎండదెబ్బ లక్షణాలు ముందుగానే గుర్తించి సమీప ఆరోగ్య కేంద్రాలకు పంపే విధంగా జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎండ దెబ్బను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను అందుబాటులో పెట్టామని వివరించారు. ప్రజలు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వృద్ధులు, రైతులు, కూలీలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫ డీఎంహెచ్ఓ శ్రీనివాస్ -
మహనీయుడు జగ్జీవన్రామ్
నల్లగొండ : సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ అని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జగ్జీవన్రామ్ విగ్రహానికి కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. అణగారిన వర్గాల ఆశా కిరణం బాబు జగ్జీవన్రామ్ అన్నారు. జగ్జీవన్రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, చొల్లేటి ప్రభాకర్, పున్న కై లాస్ నేత, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, మారుపాక నరేందర్, పెరిక షణ్ముఖకుమార్, పాలడుగు నాగరాజు, కవితా రాణి, గోలి ఏడుకొండలు, పెరిక స్వాతి, శ్రీని వాసరావు, కత్తుల షణ్ముఖ కుమార్, జగన్ కుమార్, బుర్ర సుధాకర్, కత్తుల సంజీవయ్య, అవుట రవీందర్, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి పాల్గొన్నారు. -
నార్ముల్కు నవశకం
ప్రభుత్వం వారంలోగా ఎన్వోసీ ఇవ్వడానికి సంసిద్ధత తెలిపింది. సీఎం రేవంత్రెడ్డితో ఇటీవల జరిగిన సమావేశంలో ఎన్డీడీబీ, ఢిల్లీ మదర్ డెయిరీ ప్రతినిధులకు ఎన్వోసీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈనెలలోనే ఎన్డీడీబీ టేకోవర్ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. – గుడిపాటి మధుసూదన్రెడ్డి, నార్ముల్ చైర్మన్ సాక్షి, యాదాద్రి : నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ (నార్ముల్) కష్టాలు తీరే సమయం వచ్చేసింది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన నార్ముల్ను కాపాడేందుకు ప్రభుత్వం.. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి.. ఎన్డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, ఢిల్లీ మదర్ డెయిరీ చైర్మన్ జయతీర్థాచారితో ఇటీవల హైదరాబాద్ సమావేశం అయ్యారు. 15ఏళ్ల పాటు డెయిరీని అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం వేలాది మంది డెయిరీ రైతులకు శుభవార్తే అని చెప్పవచ్చు. ఏటా రూ.5కోట్ల గుడ్విల్ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీడీబీ, ఢిల్లీ మదర్ డెయిరీ నార్ముల్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నార్ముల్కు ఏటా ఎన్డీడీబీ రూ.5 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు రూ.25 కోట్ల గుడ్ విల్ ఇస్తుంది. ఈ డబ్బులతో రైతులకు బోనస్, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. అయితే నార్ముల్ పాల సేకరణకు 2లక్షల లీటర్లకు పెంచాలి. పాలు, పాల ఉత్పత్తులను మాత్రం ఎన్డీడీబీ ఆధ్వర్యంలో ఢిల్లీ మదర్ డెయిరీ నిర్వహించనుంది. లీటర్ పాలకు రూ.6.50 కమీషన్ చెల్లిస్తారు. తద్వారా నార్ముల్కు నెలకు రూ.2.కోట్ల ఆదాయం లభించనుంది. ఆరుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీ నష్టాల్లో కూరుకుపోయిన నార్ముల్ను గాడిన పెట్టడానికి ఆరుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఎన్డీడీబీ నుంచి ఇద్దరు, ఢిల్లీ మదర్ డెయిరీ నుంచి ఇద్దరు, నార్ముల్ నుంచి చైర్మన్, ఎండీ ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే మొత్తం డెయిరీ వ్యవహారాలు జరగనున్నాయి. ఎన్డీడీబీ నుంచి రూ.50కోట్లు ఒప్పందం ప్రకారం నార్ముల్ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఎన్డీడీబీ దశల వారీగా రూ.50 కోట్లు ఇవ్వనుంది. 50 వేల మంది రైతులు, 311 రిజిస్టర్ సొసైటీలు, రోజు 50 వేల లీటర్ల పాల అమ్మకాలు ఉన్నాయి. ప్రధానంగా రైతులకు ఇవ్వాల్సిన 9 పాల సేకరణ బిల్లుల మొత్తం రూ.25 కోట్లు, బ్యాంకు అప్పులు రూ.26 కోట్లు, ఉద్యోగుల జీతాలు రూ.4 కోట్లు, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.6 కోట్ల వరకు ఉన్నాయి. వీటన్నింటిని ఎన్డీడీబీ ఇచ్చే రూ.50 కోట్లతో సర్దుబాటు చేస్తారు. 30 శాతం వేతనాలు కట్ డెయిరీలో ప్రస్తుతం అవసరానికి మించిన ఉద్యోగులు ఉన్నారని గుర్తించారు. వీరిని తగ్గించుకోవాలన్నది తాజా నిర్ణయం. 300 మంది ఉద్యోగులు అవసరం ఉండగా, 500కు పైగా ఉద్యోగులు ఎందుకన్నది చర్చిస్తున్నారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కట్ చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. తక్కువ వేతనంతో పనిచేసే వారు ఉంటారు. లేదంటే వారే స్వచ్ఛందంగా తప్పుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఎన్వోసీ ఇవ్వగానే టేకోవర్ ప్రస్తుతం నార్ముల్ను టేకోవర్ చేయడానికి ఎన్డీబీబీ సిద్ధమైంది. హయత్నగర్లోని నార్ముల్ డెయిరీ ప్లాంటు భూములు 73 ఎకరాలు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న చిల్లింగ్ సెంటర్ల భూములు, చిట్యాల భూములపై ఎన్డీడీబీకి ప్రభుత్వం ఎన్వోసీ ఇవ్వాలి. సీఎం రేవంత్రెడ్డి ఈ మేరకు అంగీకారం తెలిపారు. ఎన్వోసీ ఇస్తే డెయిరీ ప్లాంటును విస్తరించడం, భువనగిరిలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంటును పునురుద్ధరించడం, చిల్లింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తారు. డెయిరీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నది మరో ప్రధాన నిర్ణయం. ఇటీవల భువనగిరి, సూర్యాపేట మిల్క్చిల్లింగ్ సెంటర్లలో రూ.45 లక్షల అక్రమాలు వెలుగుచూశాయి. మూతబడిన సొసైటీల పేరున డెయిరీకి పాలు పోసినట్లు రికార్డులు సృష్టించిన వ్యవహారంలో భువనగిరిలో రూ.40 లక్షలు, సూర్యాపేటలో రూ.5 లక్షల అక్రమాలు వెలుగు చూశాయి. బాధ్యులైన ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈ ఒప్పందంతో నార్ముల్లో అక్రమాలకు అడ్డకట్ట పడనుంది. -
7న సీనియర్ క్రికెట్ జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో అండర్– 25 సీనియర్ క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేన్ జిల్లా కార్యదర్శి అమీనుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న జట్టు త్వరలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ పోటీలో పాల్గొంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ వెంట బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, రెండు పాస్ పోర్ట్సైజ్ ఫొటోలు తీసుకొని ఉదయం 9 గంటలకు నల్లగొండలోని మేకల అబినవ్ స్టేడియానికి రావాలని సూచించారు. రెండు రేషన్ షాపులు సీజ్డిండి : మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, వావిల్కొల్ గ్రామాల్లోని రేషన్ షాపులను దేవరకొండ డీటీసీఎస్ మోబీన్ ఆదివారం సీజ్ చేసారు. వివరాల ప్రకారం మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన రేషన్ డీలర్ కొన్ని నెలల నుంచి రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా వారికి కొంత మేర నగదు అందజేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నాడని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో బ్రాహ్మణపల్లి రేషన్ షాపుతోపాటు అదే డీలర్ ఇన్చార్జిగా నిర్వహిస్తున్న వావిల్కొల్ రేషన్ షాపుల్లో తనిఖీలు చేశారు. దీంతో రెండు షాపుల్లో నిల్వ ఉన్న సరుకుల్లో తేడాలు రావడంతో సదరు డీలర్పై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీటీసీఎస్ పేర్కొన్నారు. రేషన్ బియ్యం పంపీణీలో అవకతవకలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిద్ధాంతం కలిగిన పార్టీలకే ఆదరణమోత్కూరు : సైద్ధాంతిక సిద్ధాంతం కలిగిన పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం మోత్కూరులో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసినప్పుడే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాగలుగుతుందన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలన్నారు. బీజేపీ మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు చాడ మంజులరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, ప్రశిక్షణ ప్రభారి గౌరు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గూదె మధుసూదన్, నాయకులు కె.నాగార్జున్రెడ్డి, బయ్యని చంద్రశేఖర్, ఏనుగు జితేందర్రెడ్డి, పోచం సోమయ్య, సజ్జనం మనోహర్, చేకూరి మల్లేశం, కూరాకుల వెంకన్న, సైదులు, ఏనుగు జితేందర్రెడ్డి, సజ్జనం మనోహర్, రమణ, సోమేశ్వరి, రేణుక, రాము, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రాయితీ పొందు
ముందస్తుగా చెల్లించు..నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించనుంది. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని భవన యజమానులకు రాయితీ ఇవ్వనున్నారు. ఐదు శాతం రాయితీ ఇస్తుండడంతో ఎక్కువ మంది ముందస్తుగా తమ ఆస్తిపన్ను చెల్లించడానికి మొగ్గు చూపుతున్నారు. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి తద్వారా ఏప్రిల్ మాసంలోనే ఎక్కువ శాతం ఆస్తి పన్ను వసూలు చేసుకోవాలని మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. బకాయిలతో సహ చెల్లిస్తేనే రాయితీ వర్తిపు.. పట్టణాలు, నగరంలోని నివాసాలు, బహుళ వాణిజ్య భవనాలకు గతంలో ఎలాంటి ఆస్తి పన్ను బకాయిలు లేని వారు మాత్రమే ఐదు శాతం రాయితీకి అర్హులు అవుతారు. 2026 మార్చి 31లోపు రూపాయి కూడా ఆస్తి పన్ను బకాయి ఉండకూడదు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆస్తి పన్నును ఈనెల 30వ తేదీలోగా పూర్తిగా చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం రాయితీ ఇస్తారు. బకాయి ఉన్న వారు బకాయితో సహ చెల్లిస్తే ఈ ఏడాదికి సంబంధించిన పన్నులో ఐదు శాతం రాయితీ వర్తిస్తుంది. ఆస్తి పన్ను ఆలస్యంగా చెల్లిస్తే అపరాధ రుసుం పడుతుండడంతో.. ప్రజలు ఈ ఐదు శాతం రాయితీ వినియోగించుకుంటే లబ్ధి పొందవచ్చు. నీలగిరి కార్పొరేషన్ టార్గెట్ రూ.8.50 కోట్లు నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 44వేల భవనాలు ఉన్నాయి. సంవత్సరానికి ఆస్తి పన్ను డిమాండ్ సుమారు రూ.18 కోట్ల వరకు ఉండగా, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 19 వేలకు పైగా భవనాలు ఉండగా రూ.25 కోట్లకు పైగా ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. జిల్లాలో నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ మున్సిపాలిటీలు మాత్రమే పెద్దవి. మిగతా నాలుగు మున్సిపాలిటీలు చిన్నవి మాత్రమే. నీలగిరిలో ఈ ముందస్తు పన్ను రాయితీలో బాగంగా ఒక్క నెలలోనే రూ. 8.50 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ దాటితే అపరాద రుసుం.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ప్రతి ఆరు నెలలకు సంబంధించిన ఆస్తి పన్నును మొదటి మూడు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించకుంటే ఆస్తి పన్నుపై అపరాధ రుసుం పడుతుంది. అదే విధంగా అక్టోబర్ నుంచి మరుసటి ఏడాది మార్చికి సంబంధించిన ఆరు నెలల ఆస్తి పన్నును డిసెంబర్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం ఆస్తి పన్ను చెల్లించని వారు అపరాధ రుసుంతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి గడువు ప్రకారం చెల్లించకపోతే ఆటోమెటిక్గా కంప్యూటర్లో అపరాధ రుసుంతో జనరేట్ అవుతుంది. దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోంది. అపరాద రుసుం పడకుండా ఉండాలంటే ఏప్రిల్ నెలలోనే ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందవచ్చు. ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం మినహాయింపు ఫ మున్సిపాలిటీలు, నగరంలో ఈ నెలాఖరు వరకు చెల్లించేవారికి వర్తింపు ఫ జూన్ దాటితే అపరాధ రుసుంతో కట్టాల్సిందే.. ఫ భవన యజమానులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు -
ఫిట్నెస్ నాయక్
ఆయన ఓ ప్రజాప్రతినిధి.. నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఆయన ఎన్ని పనులున్నా.. రోజూ వ్యాయామం మిస్ చేయరు. వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవంటున్నారు ఎమ్మెల్సీ శంకర్నాయక్. కార్య కర్తలకు కూడా ఆయన ఇదే సూచిస్తారు.ఫ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ శంకర్నాయక్ ప్రత్యేక శ్రద్ధ ఫ సోషల్ మీడియాలో ఆయన ఫిట్నెస్ వీడియోలకు యూత్ ఫిదా ఫ మితాహారం, ఆరు గంటలు నిద్ర ఆయన హెల్త్ సీక్రెట్మిర్యాలగూడ : ఎమ్మెల్సీ శంకర్నాయక్ రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ తొలుత జాగింగ్ చేస్తారు. 16 రకాల యోగాసనాలను వేస్తారు. ముఖ్యంగా వజ్రాసనం, కపాలభాతి వంటి ఆసనాలు వేస్తారు. తరువాత వెయిట్ లిఫ్టింగ్, డిప్స్తోపాటు వాలీబాల్, కబడ్డీ ఆడుతారు. చిన్నప్పటి నుంచే .. ఎమ్మెల్సీ శంకర్నాయక్కు చిన్నప్పటి నుంచే క్రీడలతోపాటు వ్యాయామంపై ఆసక్తి. ఆయనతోపాటు ఇద్దరు కుమారులు సైతం నిత్యం వ్యాయామం చేస్తారు. శంకర్నాయక్ ఏదైనా పాఠశాలకు వెళ్లిన సందర్భంలో విద్యార్థులకు సైతం వ్యాయామం, శరీర దారుఢ్యానికి దోహదపడే అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇటీవల ఆయన వ్యాయామం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చూసిన యువత.. ‘ఫిట్నెస్ నాయక్’ అని కితాబిస్తున్నారు. ఆహార నియమాలు ఇవే.. శంకర్నాయక్ ఉదయం అల్పాహారంగా జొన్న గటక, రాగి సంకటి తీసుకుంటారు. మధ్యాహ్నం మిత భోజనం, రాత్రి జొన్నరొట్టె మాత్రమే తీసుకుంటారు. మాంసాహారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. మద్యానికి, ధూమపానానికి దూరంగా ఉంటారు. నిత్యం ఆరుగంటలు తప్పకుండా నిద్రిస్తానని ఆహారం, నిద్ర నియమాలు పాటిస్తుండడంతో తాను ఆరోగ్యంగా ఉంటున్నానని చెబుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా శంకర్నాయక్కు ఆసక్తి ఉంది. పాఠశాలలో చదివే రోజుల్లో నాటకాలు వేసేవారు. ఇటీవల శాసన సభ్యులు, శాసనమండలి సభ్యుల సాంస్కృతికోత్సవంలో కట్టప్ప వేషధారణ ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రుల అభినందనలు అందుకున్నారు. -
కక్షిదారులకు సత్వర న్యాయం
దేవరకొండ : కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని జిల్లా జడ్జి ఎం.నాగరాజు అన్నారు. దేవరకొండ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బార్ అసోసియేషన్, బీఎస్ ఎన్ఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె.అనిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.వి.ఎస్ హరీష్బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్నేహ, డీఎస్పీ శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమమహేష్, వనం జగదీష్, గాజుల ఆంజనేయులు, నెమ్మికంటి రమాశంకర్, షౌకత్అలీ, శివకుమార్, వీరబాబు, గిరిధర్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యం ఉంటేనే ఉపాధి అవకాశాలు
నల్లగొండ టూటౌన్ : నైపుణ్యాలు గల విద్యార్థులకు విస్తృత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం యూనివర్సిటీలో నిర్వహించిన జాబ్ మేళాకు 700 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జాబ్మేళాలో 100 మందికిపైగా అభ్యర్థులు ఉద్యోగాలు పొందారని తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ హరీష్కుమార్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, ప్రదీప్రెడ్డి, భాస్కర్, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్మీ లెఫ్టినెంట్గా సుధాకర్
నల్లగొండ : నల్లగొండ ఎన్జీ కాలేజీ ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చిలుముల సుధాకర్ నేషనల్ కేడెట్ కాప్స్ (ఎన్సీసీ)లో అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ (ఏఎన్ఓ)గా అర్హత సాధించారు. లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీ ఆఫీసర్ ర్యాంకు పొందాడు. ఈయన మహారాష్ట్రలోని నాగపూర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జనవరి 5 నుంచి ఏప్రిల్ 4 వరకు సైనిక శిక్షణను పూర్తి చేశాడు. ఈ శిక్షణలో ఫైరింగ్, వెపన్ హ్యాండ్లింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాల్లో శిక్షణ పొందాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు సుధాకర్కు శుభాకాంక్షలు తెలిపారు. -
బైపాస్ నిర్మాణంలో అన్నీ అవకతవకలే..
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి నల్లగొండ టూటౌన్ : కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన నల్లగొండ బైపాస్ రోడ్డు నిర్మాణంలో అడుగడుగునా అవకతవకలు, నాసిరకం పనులు కనిపిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ సమీపంలోని బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ఆయన బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. నిబందనలకు విరుద్ధంగా పనులు సాగుతున్నా మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవడం లేదని, కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. గ్రావెల్ (ఎర్రమట్టి)తో నిర్మాణం చేయాలనే నిబంధన ఉన్నా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. కంచనపల్లి, దోమలపల్లి, పానగల్ ఉదయ సముద్రం, బుద్ధారం, అనంతారం, సాగర్ రోడ్డులో ఉన్న చెరువుల నుంచి మట్టి దందా చేసి పర్యావరణానికి నష్టం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాధగోని శ్రీనివాస్గౌడ్, పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, కార్పొరేటర్లు దాసరి సాయి, రామగిరి అఖిల్రావు, వంగూరి రాఖి, ఫకీర్ మోహన్రెడ్డి, చింతా ముత్యాలరావు, దాసోజు యాదగిరాచారి, గాలి శ్రీనివాస్, ఆవుల మధు, ఆకునూరి సత్యనారాయణ, పాలకూరి రవి, శివరామకృష్ణ, శ్రీనివాస్రెడ్డి, అనిల్, గడ్డం శాంతిస్వరూప్ పాల్గొన్నారు. -
ఫిన్లాండ్ పర్యటనకు ఉపాధ్యాయుడి ఎంపిక
పెద్దవూర : ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన ఫిన్లాండ్ దేశ పర్యటనకు పెద్దవూర మండలం ఏనెమీదిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తూడి వెంకట్రెడ్డి ఎంపికయ్యారు. మన రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ ‘టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ను చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన 28 మంది ఉపాధ్యాయులను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. వీరు ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఫిన్లాండ్లో పర్యటించనున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, గుణాత్మక విద్య ద్వారా విద్యార్థుల ప్రగతి, రిసోర్స్ పర్సన్గా అనుభవం, పాఠ్యపుస్తకాలు, కరదీపికల రూపకల్పన, వర్క్షాపుల్లో భాగస్వామ్యం, వినూత్న బోధన నైపుణ్యాలు మరియు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డుల ఆధారంగా వెంకట్రెడ్డిని ఎంపిక చేశారు. కాగా, గత ఫిబ్రవరిలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో ఈయన యోగా విభాగంలో రాష్ట్రం తరపున జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ నిపుణుడిగా, లైఫ్ స్కిల్ కోచ్గా సేవలు అందిస్తూనే.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. వెంకట్రెడ్డి ఎంపికపై జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి, ఎంఈఓ తరి రాము, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
వృద్ధ తల్లిదండ్రులకు ఊరట
వృద్ధాప్యంలో అమ్మానాన్నల పోషణ బాధ్యత పిల్లలదే.. నల్లగొండ : కని, పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను కొందరు వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదు. వారి పోషణ తమకు భారంగా భారంగా భావిస్తున్నారు. తమను కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఎందరో తల్లిదండ్రులు వయో వృద్ధుల ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటి అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరంటల్ సపోర్ట్ యాక్ట్ –2026ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. ఇది పిల్లల నిర్లక్ష్యానికి గురయ్యే తల్లిదండ్రులకు అండగా నిలవనున్నది. తల్లిదండ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకే.. పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పింఛన్లు ఆసరాగా నిలుస్తున్నాయి. కానీ ఉద్యోగం చేసే సంతానం ఉన్న వారికి పెన్షన్ రాక పోగా, కొంత మంది కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకోక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు తల్లిదండ్రుల మద్దతు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే నిరాదరణకు గురవుతున్న ఎంతో మంది తల్లిదండ్రులకు మేలు కలుగుతుంది. విశ్రాంత ఉద్యోగులకూ కష్టాలే.. ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన పెన్షనర్లలో చాలా మంది తమ సంతానం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలా వచ్చే పింఛన్ డబ్బుల కోసం వేధించే వారు కూడా ఉన్నారు. కొందరైతే తల్లి లేదా తండ్రి బ్యాంక్ పాస్ పుస్తకం, ఏటీఎం కార్డులను తమ వద్దనే ఉంచుకొని వారి పింఛన్ ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తున్నారు. మరి కొందరు తల్లిదండ్రులు డబ్బులు డ్రా చేయగానే వారిని బెదిరించి లాక్కుటున్నారు.నూతన చట్టం ప్రకారం తమను పిల్లలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగుతుంది. విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలితే సదరు ఉద్యోగి జీతం నుంచి 15 శాతం లేదా గరిష్టంగా రూ.10వేలు (ఏది తక్కువైతే అది) కోత విధిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఒకవేళ ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ఆ కోత మొత్తాన్ని అందరి జీతాల నుంచి సమానంగా వసూలు చేస్తారు. ఈ నిబంధనలు ప్రభుత్వ శాఖలతో పాటు కార్పొరేషన్లు, బోర్డులు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే వారందరికీ వర్తిస్తాయి. అయితే పూర్తిగా పిల్లలపైనే ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. పెన్షన్, ఇతర ఆదాయ వనరులు ఉన్న తల్లిదండ్రులకు వర్తించదు. బాధిత తల్లిదండ్రులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా గడువు విధించడం ఈ చట్టంలోని మరొక ముఖ్యమైన అంశం. ఒకవేళ కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ను కలిసే వెసులుబాటును కూడ కల్పించారు. ఫ నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల వేతనం నుంచి 15శాతం కోత ఫ ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోనే పరిష్కారానికి చర్యలు ఫ పేరంటల్ సపోర్ట్ యాక్ట్తో వృద్ధులకు భరోసా -
దేవరకొండలో ‘ఇంటింటికీ సీపీఐ’
దేవరకొండ : దేవరకొండ పట్టణంలో శుక్రవారం ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి ప్రజలను కలిసి మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు దాటిందని గుర్తు చేశారు. దేశాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి విముక్తి చేసి సమసమాజ స్థాపనకు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ సీపీఐ అన్నారు. భవిష్యత్లో ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీకి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నాయకులు పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, రమావత్ అంజయ్యనాయక్, కాంతయ్య, పల్లా దేవేందర్రెడ్డి, తూం బుచ్చిరెడ్డి, సుదర్శన్రెడ్డి, కనకాచారి తదితరులున్నారు. రేణుకా ఎల్లమ్మకు మొక్కుబడి కల్యాణంనల్లగొండ : కనగల్ మండలంలోని దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయంలో అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారికి మొక్కుబడి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి, సిబ్బంది చంద్రయ్య, ఉపేందర్రెడ్డి, రాజయ్య, నాగరాజు, ఆంజనేయులు, అర్చకులు గాదే దామోదర్రావు, ఫణికుమార్, శ్రీనివాసచారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి పేదలకు వరంమిర్యాలగూడ : ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని తన కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సీఎం సహాయ నిధి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి తక్షణ సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మాలి కాంతారెడ్డి, బొంగర్ల సుకన్య వినోద్ పాల్గొన్నారు. సహకార ఉద్యోగుల సస్పెన్షన్మోత్కూరు : మోత్కూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ గదిలో రాత్రివేళ ఉద్యోగులు మద్యం సేవించడం వాస్తవమని తేలడంతో సస్పెన్షన్కు గురయ్యారు. ఉద్యోగులు పెండెం నరహరి, ఎస్కె.యాకూబ్, సీహెచ్.కృష్ణలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా సహకార అధికారి జి.మురళీరమణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. -
ప్రాణాలను కాపాడడంలో గోల్డెన్ అవర్ కీలకం
భువనగిరి : పిల్లల్లో గాయాల వల్ల కలిగే మరణాలను తగ్గించడంలో గోల్డెన్ అవర్ కీలక పాత్ర పోషిస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ అమిత అగర్వాల్, మెడికల్ సూపరింటెండెంట్ లక్కిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎయిమ్స్లో నిర్వహించిన పిడియాట్రిక్ ట్రామా రిససిటేషన్ మాడ్యూల్ వర్క్షాప్లో వారు మాట్లాడారు. అనంతరం డాక్టర్ నేహఠాకూర్ రాయ్ పర్యవేక్షణలో డాక్టర్ దేబాసిస్ దాస్ చేతన్ గినిగిరి, అరవింద్ అనందల్ సుమారు 40 మంది నర్సులకు శ్వాసనాళ నిర్వహణ, షాక్ రిససిటెషన్, పాయింట్ ఆఫ్ కేర్, అల్ట్రాసౌండ్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ఎయిమ్స్కు చెందిన సీనియర్ రెసిడెంట్లు డాక్టర్ అనన్య శ్రియం, చేతన్ ఎన్ ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా వారిని అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కోతలు ముమ్మరం..
ఫ ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఫ పది రోజుల నుంచి కల్లాల్లోధాన్యం పోస్తున్న రైతులు ఫ కొనుగోళ్లకు తప్పనిఎదురుచూపులుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. యాసంగి వరి కోతలు పది రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. రైతులు ధాన్యం తీసుకొచ్చి కల్లాల్లో పోస్తున్నారు. గతేడాది యాసంగిలో మార్చి 25వ తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.. ఈసారి ఏప్రిల్ నెల వచ్చినా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. రా రైస్, బాయిల్డ్ రైస్ విషయంలో సమస్యల కారణంగానే ఇంకా కేంద్రాలను ప్రారంభించడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్లాలకు భారీగా ధాన్యం గత యాసంగి సీజన్్లో ఏర్పాటు చేసిన చోటనే ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో రైతులు ముందుగానే ఆయా ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించి ఆరబెడుతున్నారు. ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉంటుండటంతో నిర్దేశిత తేమ శాతం త్వరగా వచ్చేస్తోంది. అయినా జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. ఒక్క చిట్యాల మండలంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం బుధవారం ఒకచోట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు. అయితే అక్కడ కూడా ఇంకా కొనుగోళ్లు చేపట్టలేదు. మిల్లర్లతో అధికారులకు కుదరని సయోధ్య ఈసారి యాసంగి సీజన్లో పూర్తిగా రా రైస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రా రైస్ ఇవ్వాలనే నిబంధన విధించింది. అయితే సాధారణంగా యాసంగి సీజన్లో రా రైస్ పూర్తి స్థాయిలో రావని, మిల్లింగ్ సమయంలో నూక అధికంగా వచ్చి, తాము నష్టపోవాల్సి వస్తుందని మిల్లర్లు అంటున్నారు. ఈసారికి బాయిల్డ్ రైస్ తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం ఈసారి బాయిల్డ్ రైస్ తీసుకోకపోతే తాము ధాన్యం దిగుమతి చేసుకోమని మిల్లర్లు చెబుతున్నారు. అయితే దీనిపై జిల్లా స్థాయిలో అధికారులు మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిల్లర్లతో అధికారుల చర్చలు అధికారులు ప్రభుత్వం విధించిన నిబంధనను మిల్లర్లకు వివరించి ధాన్యం దిగుమతి చేసుకోవాలని చెబుతున్నారు. అయితే మిల్లర్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. సీఎంఆర్ కింద రారైస్ ఇస్తే నూక అధికంగా వచ్చి తాము నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందేనని మిల్లర్లను ఒప్పించేందుకు చర్చలు కొనసాగిస్తున్నారు. మిల్లర్లు కూడా ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో ధాన్యం దిగుమతి విషయంలో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నెల 6వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతుల మీదుగా నల్లగొండ, తిప్పర్తిలో కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మిల్లర్లతో చర్చలు సఫలం కాకపోవడంతో 6వ తేదీన కేంద్రాలు, కొనుగోళ్లు ప్రారంభం అవుతాయా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో రైతులు మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. మహిళా భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళహారతులను నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని మంగళవాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన పూజలు.. నిజాభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్రనామార్చన, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో ముగిశాయి. -
సుందరీకరణ పనులు పునః ప్రారంభం
తిప్పర్తి : తిప్పర్తి మండల కేంద్రంలో సుందరీకరణ పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. రూ.9 కోట్ల చేపట్టనున్న సుందరీకరణ పనులను 2024 సెప్టెంబర్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. అప్పట్లోనే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఆ తర్వాత నిలిపివేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి అదనంగా రూ.5 కోట్లు మంజూరు చేయించడంతో సుందరీకణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలో రోడ్ల విస్తరణ, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, డివైడర్ ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్తో కూడలిలో బాబు జగ్జీవన్రామ్, డాక్టర్ బిఆర్అంబేద్కర్ కాంస్య విగ్రహాలు, పౌంటేయిన్ ఏర్పాటు తదితర పనులు చేపట్టి సుందరంగా మార్చనున్నారు. జగ్జీవన్రాం, అంబేద్కర్ల కాంస్య విగ్రహాలను ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. -
సమస్యల పరిష్కారానికే ‘ప్రజాపాలన’
తిప్పర్తి : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన గ్రామసభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అంతజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలతోపాటు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేస్తుందన్నారు. తిప్పర్తి మండలంలో రూ.60లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. రూ.6 కోట్లతో జూనియర్ కళాశాల, రూ.26 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ నిర్మాణానికి రూ.70 లక్షలు, కాల్వల మరమ్మతులకు రూ.3.50 కోట్లు మంజూరు చేశామన్నారు. నెల రోజుల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తిచేసి గృహ ప్రవేశాలను చేయనున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ సొంతంగా రూ.20వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మండల కేంద్రానికి త్వరలో ముఖ్యమంత్రిని తీసుకొస్తానన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలో 352 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. సర్పంచ్లు, అధికారుల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. సర్పంచ్ బద్ధం రజితసుధీర్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, సర్పంచ్ ముత్తినేని శ్యాంసుందర్, నాయకులు ఊట్కూరి సందీప్రెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ జానయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఫ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఫ తిప్పర్తి గ్రామ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
మద్దతు ధర చెల్లించాలని రైతుల ఆందోళన
వేములపల్లి : తాము ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ గరిష్ట మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులోని రైస్ మిల్లు ఎదుట ఆందోళన చేపట్టారు. కొద్ది రోజులుగా క్వింటా ధాన్యాన్ని రూ.2,700 నుంచి రూ.2,600కు కొనుగోలు చేసిన మిల్లర్లు సిండికేట్గా మారి ధరను తగ్గించి రూ.2,500లకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ పీఎన్డీ.ప్రసాద్, వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు రైస్ మిల్లుల వద్దకు వెళ్లి మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని రూ.2,600కు తగ్గకుండా కొనుగోలు చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పదో తరగతి పరీక్షకు 45 మంది గైర్హాజరునల్లగొండ : జిల్లాలో ఏర్పాటు చేసిన 106 పరీక్ష కేంద్రాల్లో గురువారం పదో తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 19,698 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 19,659 మంది పరీక్ష రాయగా 39 మంది గైర్హాజరయ్యారు. అలాగే 103 మంది ప్రైవేటు విద్యార్థులకు 97 మంది పరీక్ష రాయగా ఆరుగురు గైర్హాజరయ్యారని డీఈఓ భిక్షపతి తెలిపారు. -
సమాచారం అందించాలి
నకిలీ విత్తనాలు అమ్మకుండా దుకాణాలు, వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తాం. నకిలీ విత్తనాలు అమ్మేవారి సమాచారాన్ని టాస్క్పోర్స్ అధికారులకు తెలిపాలి. బార్కోడ్ ఉన్న ప్యాకెట్లు మాత్రమే కొనాలి. తప్పక రశీదు తీసుకుని దాన్ని సీజన్ ముగిసే వరకు దగ్గర పెట్టుకోవాలి. గతంలో నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడిన వారు తిరిగి అమ్మితే పీడీ యాక్టు ప్రయోగిస్తాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది
చిట్యాల : రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ పంచాయతీ ఆవరణలో ఆ గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీభిక్షం అధ్యక్షతన గురువారం జరిగిన గ్రామసభకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్తో కలిసి హాజరై మాట్లాడారు. నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల మ ందికిపైగా ఆసరా పింఛన్లు, నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. తన పదవీకాలం మరో ఇరవై నెలలు ఉందని.. ఆలోపు గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరింపజేయిస్తానన్నారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో రెండున్నరేళ్లుగా కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతారమేష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమాలలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, ఎంపీడీఓ జయలక్ష్మి, తహసీల్దార్ విజయ, ఏఓ గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ నర్రా వినోదమోహన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాస్ నేత, గ్రామ ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, నాయకులు పల్లపు బుద్దుడు, పోలగోని స్వామి, చెరుకు సైదులు, పోలగోని నర్సింహ, ఉయ్యాల లింగయ్య, జన్నపాల శ్రీను, పాకాల దినేష్, గంగాపురం రాము తదితరులు పాల్గొన్నారు. ఫ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
నేరాల నియంత్రణే పోలీస్ శాఖ లక్ష్యం : ఎస్పీ
నార్కట్పల్లి : నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా గురువారం నార్కట్పల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాల ఏర్పాటు చాలా ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా గ్రామ ప్రవేశ ద్వారాలు, ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం సులభతరమవుతుందన్నారు. యువత మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమేష్, సర్పంచ్ జేరిపొత్తుల భరత్, కార్యదర్శి రవికుమార్, ఉప సర్పంచ్ శిరీష, సట్టు సత్తయ్య, పుల్లెంల శ్రీనివాస్, ఎస్బీ సీఐ రాము, నార్కట్పలి్ల్ సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణు, మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
జవాబుదారీగా పనిచేస్తేనే గుర్తింపు
శాలిగౌరారం : ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేసినప్పుడే ప్రజల నుంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన శాలిగౌరారం మండలంలోని వల్లాల, అడ్లూరు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ సంస్థలను తనఖీ చేశారు. మొదటగా వల్లాల గ్రామంలో వన నర్సరీని పరిశీలించారు. నర్సరీ నిర్వాహణ, మొక్కల పెంపకం, వనమహోత్సవ కార్యక్రమ ప్రణాళికలు తదితర అంశాలను సంబంధిత అంశాలను అడిగి తెలుసుకున్నారు. చెరువులో ఉపాధిహామీ పథకం కింద రూ.6 లక్షల అంచనాతో కూలీలకు 3వేల పనిదినాలు కల్పించేందుకు చేపట్టిన ఫిష్పాండ్లను పరిశీలించారు. ఉపాధి పనులు జరిగేచోట కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యాలను కల్పించాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డిని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో గల ప్రభుత్వ మోడల్స్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి స్కూల్లో బోధనాతీరు, మధ్యాహ్న భోజన నాణ్యత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కట్టెలపొయ్యిపై వంటలు చేయడాన్ని గమనించిన కలెక్టర్ వంటకు గ్యాస్ వినియోగించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. అనంతరం అడ్లూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనఖీ చేశారు. అక్కడ గర్భిణులు, బాలింతలతో మాట్లాడి పౌష్టికాహార పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. వీఓ భవనాలు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట లక్ష్మివెంకట్రెడ్డి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూం ఇళ్ల పరిస్థితిని, మిషన్ భగీరథ నీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు, సీడీపీఓ ఆస్రాఅంజుమ్, సర్పంచ్లు భూపతి తిరుపతమ్మ, కట్ట లక్ష్మి, పీఆర్ఏఈ భరత్చంద్ర, ఏపీఓ జంగమ్మ, ఏపీఎం శంకరయ్య, పంచాయతీ కార్యదర్శులు కృష్ణయ్య, నరేందర్ ఉన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్


