breaking news
Nalgonda
-
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
తిరుమలగిరి(సాగర్) : తిరుమలగిరి మండల పరిధిలోని జువ్విచెట్టుతండా గ్రామ పంచాయతీకి చెందిన సపావత్ శ్రీను(36) అదృశ్యమైనట్లు ఎస్ఐ వీరశేఖర్ బుధవారం తెలిపారు. శ్రీను ఈ నెల 13వ తేదీన ఉదయం వేళ గ్రామ శివారులోని పెద్దవాగులో చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగిరాలేదని చెప్పారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. బుధవారం శ్రీను తండ్రి సీర ఇచ్చిన ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శ్రీను గురించిన ఆచూకీ తెలిసిన వారు 87126 70199 నంబర్కు సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు. -
సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో ‘జయ’ విద్యార్థుల ప్రభంజనం
సూర్యాపేటటౌన్ : ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఏఎస్ రావు 35వ సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు 14 మంది అత్యత్తుమ ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. బుధవారం పాఠశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. 9వ తరగతిలో 21 ర్యాంకులు ప్రకటించగా అందులో ఆరుగురు, 10వ తరగతిలో 20 ర్యాంకులు ప్రకటించగా అందులో ఎనిమిది మంది జయ పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. 9వ తరగతి నుంచి వై. వీక్షణ, 10వ తరగతి నుంచి వి. వైష్ణవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. -
గంజి శ్రీరేఖకు డాక్టరేట్
రామగిరి (నల్లగొండ): నల్లగొండ పట్టణానికి చెందిన గంజి శ్రీరేఖకు ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం డాక్టరేట్ ప్రకటించింది. శ్రీరేఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో డాక్టర్ జి. విద్యాసాగర్ మార్గదర్శకత్వంలో ‘ఇంపాక్ట్ ఆఫ్ హెచ్ఆర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ డబ్ల్యూ.ఎస్.ఆర్.టి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. దీంతో ఆమెకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది. శ్రీరేఖను ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు, తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, వెంకటరమణ, భర్త అమర్నాథ్ అభినందించారు. -
కారు ఢీకొని వ్యక్తి, ఐదు మేకలు మృతి
తుంగతుర్తి : కారు ఢీకొని వ్యక్తితో పాటు ఐదు మేకలు మృతిచెందాయి. ఈ ఘటన తుంగతుర్తి మండలం కొత్తగూడెం టోల్గేట్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన విరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన కంచం వీరన్న(40) తన వ్యవసాయ క్షేత్రానికి మేకలను తోలుకొని వెళ్తుండగా.. అదే సమయంలో మద్దిరాల నుంచి హైదరాబాద్ వైపు కారులో వెళ్తున్న జస్వాల్ నిశాన్ అతివేగంగా వచ్చి కొత్తగూడెం టోల్గేట్ సమీపంలో వీరన్నతో పాటు మేకలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వీరన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఐదు మేకలు మృతిచెందగా.. మరో మూడు మేకలకు గాయాలయ్యాయి. వీరన్నను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్భువనగిరి : మండలంలోని పెంచికల్పహాడ్ గ్రామంలో మంగళవారం చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన సిలువేరు ఎల్లయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించనట్లు బుధవారం పోలీసులు తెలిపారు. కాగా ఎల్లయ్య నివాసానికి మంగళవారం చిన్నారి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే గ్రామానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. మాంజా నుంచి తప్పించుకోవడం ఇలా.. మాడుగులపల్లి : సంక్రాంతి సందర్భంగా కొందరు చైనా మాంజాతో పతంగులు ఎగురవేస్తూ మనుషులు, పక్షుల ప్రాణాలను తీస్తున్నారు. అయితే చైనా మాంజా నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. బుధవారం నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలోని టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు.. ద్విచక్ర వాహనంపై గుంటూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న రసూల్ అనే వ్యక్తి హెల్మెట్కు, షర్ట్ బటన్కు మధ్య కర్చీఫ్ను రక్షణ కవచంలా కట్టుకోని కనిపించాడు. ఎందుకిలా కట్టుకున్నావని పోలీసులు రసూల్ను ఆరా తీయగా.. మాంజా దారం గొంతుకు తగలకుండా ఉండేందుకు ఇలా కట్టుకున్నట్లు చెప్పాడు. చైనా మాంజా తగలకుండా తీసుకున్న జాగ్రత్తల పట్ల రసూల్ను ఎస్ఐ కృష్ణయ్య, పోలీసు సిబ్బంది అభినందించారు. ఇతర వాహనదారులు కూడా చైనా మాంజా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
వేపచెట్టుకు డ్రోన్తో రసాయనాలు స్ప్రే
ఆత్మకూరు(ఎం) : చాలా చోట్ల వేప చెట్లకు వైరస్ సోకడంతో ఆకులు రాలి చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఆత్మకూరు(ఎం) మండల పరిధిలోని రహీంఖాన్పేట గ్రామానికి చెందిన రైతు దుంప శివరాజు తన వ్యవసాయ పొలంలోని వేప చెట్లను కాపాడుకునేందుకు రసాయన మందును డ్రోన్ సహాయంతో పిచికారీ చేస్తున్నాడు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్టు అధికారులకు తెలియజేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో తానే స్వయంగా తెలుసుకుని డ్రోన్ ద్వారా రసాయన మందు పిచికారీ చేస్తున్నట్లు రైతు పేర్కొన్నాడు. గిరిజన నాయకులతో మాజీ మంత్రి సమావేశంనాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని విజయ విహార్లో మాజీ మంత్రి రవీంద్రనాయక్ బుధవారం గిరిజన నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు–గిరిజనుల పాత్ర, గిరిజనులు ఎదురొటున్న సమస్యలపై ఆయన చర్చించారు. త్వరలో నాగార్జునసాగర్ నుంచి ఢిల్లీవరకు బంజారా రథయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంత గిరిజనులంతా యాత్రకు మద్దతు తెలుపాలని అన్నారు. ఈ కార్యరక్రమంలో రమావత్ దినేష్నాయక్, గోపినాయక్, సర్దార్నాయక్, బాలునాయక్, రాములనాయక్, నరేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతుల్లో వరి సాగు
బొమ్మలరామారం : బొమ్మలరామారం మండలంలోని ప్యారారం గ్రామానికి చెందిన చిమ్ముల మధుసూదన్రెడ్డి సేంద్రియ వ్యవసాయంతో పాటు వరి సాగులో డ్రమ్ సీడర్, విత్తనాలను వెదజల్లే ఆధునిక విధానాలు అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అంతేకాకుండా డ్రోన్ ద్వారా ఎరువులు పిచికారీ చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ పనిచేస్తూ పెట్టుబడి ఖర్చులు ఆదా చేసుకుంటున్నారు. నాలుగేళ్లుగా వెదజల్లే విధానంలోనే సాగుబొమ్మలరామారం మండలంలో ఎక్కువ మంది రైతులు సాంప్రదాయ విధానంలోనే వరి సాగు చేస్తుండగా.. చిమ్ముల మధుసూదన్రెడ్డి మాత్రం అందరి కంటే భిన్నంగా వ్యవసాయం చేస్తున్నారు. ఆయన గత నాలుగేళ్లుగా తనకున్న 10 ఎకరాల్లో వెదజల్లే విధానంలోనే వరి సాగు చేస్తూ అధిక దిగుబడులు ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్ సహాయంతో పురుగు మందులు పిచికారీ చేయిస్తున్నారు. అదేవిధంగా రైతుల నుంచి పశువుల పెంట కొనుగోలు చేసి సాగుకు ముందే పొలాల్లో వేసుకుని పూర్తిగా సేంద్రియ విధానంలో వరి సాగు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కరువువ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించకపోవడంతో డ్రమ్ సీడర్, వెదజల్లే విధానాలను గురించి వారికి తెలియడం లేదు. దీంతో రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. వెదజల్లే విధానంలో రైతు మధుసూదన్రెడ్డి వేసిన వరి చేనుడ్రోన్ సహాయంతో పురుగు మందు పిచికారీ చేయిస్తున్న మధుసూదన్రెడ్డి నాలుగేళ్లుగా వెదజల్లే విధానంతో అధిక దిగుబడులు పొందుతున్న రైతు మధుసూదన్రెడ్డి డ్రోన్ ద్వారా రసాయనాలు పిచికారీ చేస్తూ పలువురికి ఆదర్శం -
పల్లెల్లో క్రీడాపోటీలు
యాదగిరిగుట్ట: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కొత్తగా గెలిచిన సర్పంచ్ల ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేలా ఊరూ వాడా ఈ పోటీలు రసవత్తరంగా సాగాయి. ప్రధానంగా కబడ్డీ, ఖోఖో, క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించి బహుమతులు, పారితోషికాలు అందించారు. కనుమ వరకు కూడా వీటిని నిర్వహించనున్నారు. గెలుపోటములు ప్రధానం కాకుండా యువతలో ఉత్సాహం నింపేందుకు ఈ పోటీలు చేపట్టారు. -
ఎద్దులతోనే ఎవుసం
ఫ యంత్రాలు లేకుండా సేంద్రియ ఎరువులతో సాగు ఫ విభిన్న పంటలు సాగు చేస్తున్న అడ్డగూడూరు రైతు సురేష్ ఫ దేశీయ విత్తనాలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు అడ్డగూడూరు : యంత్రాల వినియోగం లేకుండా ఎద్దులతో అరకదున్ని సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తున్నాడు అడ్డగూడూరుకు చెందిన యువ రైతు తుప్పతి సురేష్. డిగ్రీ వరకు చదువుకున్న ఈ రైతు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఐదేళ్లుగా పాడి ఆవులు సాకుతూ దేశీయ వరి విత్తనాలు ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. యూట్యూబ్లో ‘సురేష్ ఫార్మర్ చానల్’ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. విభిన్న పంటలు అంతరించి పోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణంతోపాటు నీటి, భూసారాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో యువ రైతు సురేష్ ముందుకు సాగుతున్నాడు. పంటల సాగులో యంత్రాలు వచ్చాక పశువుల పెంపకం తగ్గిపోయింది. వీటివాడకాన్ని పునరుద్ధరించాలన్న తలంపుతో ఎద్దులతోనే వ్యవసాయం చేస్తున్నాడు. ఈ రైతుకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఇందులో రెండు ఎకరాల్లో దేశీయఽ వరి విత్తనాలైన బురూపి, కుకర్, రత్నం చోడి, నారాయణ కామిణి పంటను పండిస్తున్నాడు. 30 గుంటల్లో కొర్రలు, 30 గుంటల విస్తీర్ణంలో సజ్జలు, 2 ఎకరాల్లో దేశవాళీ వేరుశనగ, 30 గుంటల్లో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు. పంటలను స్థానికంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లలో విక్రయిస్తున్నాడు. డ్రాగన్ఫ్రూట్ను మాత్రం స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయిస్తున్నాడు. వ్యవసాయంలో పాడి కూడా ప్రధానమైనదే. దీనికోసం రూ.2 లక్షలతో సాహివాలు జాతికి చెందిన రెండు ఆవులు, గిర్ జాతికి చెందిన ఒక ఆవు, ఒంగోలు జాతికి చెందిన ఒక ఆవు కొనుగోలు చేసి సాకుతున్నాడు. వాటి ద్వారా వచ్చే పేడ, మూత్రాన్ని పంటలకు సేంద్రియ ఎరువుగా వాడుతున్నాడు. వీటి నుంచి వచ్చే పాల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నాడు. ఆవులకు కలిగిన లేగదూడలకు తిరుపతి, మంగ, గౌరి పేర్లు పెట్టి వాటిని తన బిడ్డలుగా భావిస్తూ సాకుతున్నాడు. -
సీఎం కప్ క్రీడలతో ప్రతిభ వెలుగులోకి..
● కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : సీఎం కప్ క్రీడాపోటీలతో క్రీడాకారుల ప్రతిభ వెలికితీయొచ్చని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 17 నుంచి సీఎం కప్ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయికి క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో సీఎం కప్ పోటీలు ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల క్రీడాకారులను ప్రోత్సహించాలని ఎంఈఓలు, పీఈటీలతో కోరారు. ఈ పోటీల్లో అందరినీ భాగస్వాములు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, మల్లారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హపీజ్ఖాన్, కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, అబ్బగోని రమేష్గౌడ్, గుమ్మల మోహన్రెడ్డి, మీర్ అక్బర్అలీ పాల్గొన్నారు. డబుల్ బెడ్రూంలు పంపిణీ చేయాలిమిర్యాలగూడ : మిర్యాలగూడలో వృథాగా పడి ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లకు మరమ్మతు చేయించి మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటివరకు పేదలకు ఇళ్లు అందించకపోవడం దురదృష్టకరమన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పుడు పేదల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈనెల 19న నల్లగొండలో జరిగే నిరసన ప్రదర్శనకు, ఈనెల 25న హైదరాబాద్లో జరిగే ఐద్వా జాతీయ మహాసభలకు మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, పాదూరి శశిధర్రెడ్డి, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రొండి శ్రీనివాస్, పరుశురాములు, వినోద్నాయక్, రామ్మూర్తి, గోవర్ధన, ఊర్మిళ, సత్యనారాయణరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. గోదా కల్యాణం
రామగిరి(నల్లగొండ) : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నల్లగొండలోని రామగిరి రామాలయంలో గోదాదేవీ, రంగనాథ స్వామి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి దంపతులు, బుర్రి శ్రీనివాస్రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఆలయాల్లో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, కల్యాణ మంగళారతులు నిర్వహించారు. భక్తులు తిరుప్పావై పారాయణం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
వైభవంగా ‘భోగి’ బోనాలు
మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో బుధవారం భోగి బోనాలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్దంగా బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి, గౌడ కులస్తులు కంఠమహేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించారు. ఆలయాల వద్ద బోనాలతో ప్రదక్షిణలు నిర్వహించారు. మోత్కూరు కొత్త బస్టాండ్లోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద, బిక్కేరు చెంత, అమ్మనబోలు రోడ్డు పక్కన కంఠ మహేశ్వర స్వామి ఆలయాల వద్ద బోనాలను మహిళలు సమర్పించారు. శివసత్తుల పూనకాలతో డప్పు చప్పుళ్లతో బాణసంచా పేలుస్తూ బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. -
సంబరాల సంక్రాంతి
సాక్షి, నెట్వర్క్ : ముంగిట్లో భోగిమంటలు.. వాకిట్లో ముగ్గులు.. పసుపుకుంకుమలు అద్దుకున్న గొబ్బెమ్మలు.. హరిదాసుల కీర్తలనలు.. డూడూ బసవన్నల విన్యాసాలు.. పిండివంటల ఘుమఘుమలు.. పిల్లలు, యువతుల కేరింతలు.. నింగికెగిరిన పతంగులు.. ఇలా పల్లెలన్నీ సంక్రాంతి శోభనుసంతరించుకున్నాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా బుధవారం భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేకువజామునే భోగిమంటలు వేసి భోగిభాగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకున్నారు. పిల్లలతల పై భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందజేశారు. గురువారం సంక్రాంతి పండుగను జరుపుకోనుననారు. సంక్రాంతి రోజు చేయాల్సింది ఇదే.. శ్రీమన్నారాయణుడి ప్రత్యక్షరూపం సూర్యభగవానుడు. సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి. సూర్యుడు సంక్రమణం జరిగే సమయంలో పూజలు చేస్తే పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు. సంక్రాంతి రోజు మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు, దేవతలకు దానాలు చేయాలి. ఫ అంబరాన్నంటిన భోగి వేడుకలు ఫ రంగవల్లులతో ఆకట్టుకున్న లోగిళ్లు ఫ హరిదాసుల సంకీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు ఫ బంధుమిత్రులు, ఆడపడుచుల రాకతో మురిసిన పల్లె, పట్నం -
బసవన్నలతో భుక్తి
ఆత్మకూర్(ఎస్) (సూర్యాపేట) : మండలంలోని ఏనుబాముల గ్రామానికి చెందిన బత్తుల వెంకట్రాములు గంగిరెద్దులను ఆడించడమే వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నాడు. దాంతో ఇతడి పేరే గంగిరెద్దుల వెంకట్రాములుగా మారిపోయింది. వెంకట్రాములుతో పాటు అతడి కుటుంబ సభ్యులు సైతం తాతల కాలం నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. సంక్రాంతితో పాటు ఇతర రోజులలోకూడా గంగిరెద్దులను ఆడిస్తూ మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్తుంటారు. శుభ, అశుభ కార్యాలకు సైతం వీరిని ఆహ్వానిస్తుంటారు. దశదిన కార్యాలకు, కొందరు పెద్ద రైతులు, భూస్వాములు అందించే కొడే దూడలను తీసుకొచ్చి తమ వద్దే ఉంచుకొని ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. దూడలను గంగిరెద్దుగా మార్చేందుకు రెండు, మూడేళ్ల పాటు శిక్షణ ఇచ్చి ఆ తరువాత రంగంలోకి దింపుతారు. గంగిరెద్దులను వెంకట్రాములు కుటుంబం దైవంలా భావిస్తుంటారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు, మూడురోజులుగా వివిధ గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తున్నారు. -
బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు వివరాలు సమర్పించాలి
నార్కట్పల్లి: బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు కింద సేకరించిన భూమి, చెల్లింపు వివరాలన్నీ వెంటనే సమర్పించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్, పంపు హౌ్స్ను పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడారు. బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్ ద్వారా అందిస్తున్న సాగునీరు, ఇప్పటివరకు అయిన పనులు, పెండింగ్ భూ సేకరణ, భూసేకరణకు చేసిన చెల్లింపులు తదితర వివరాలను ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ బద్రును అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ పనులు, వాటికి చేసిన చెల్లింపులు, నిధుల పెండింగ్ వివరాలు ఇవ్వాలని సంబంఽధిత అధికారులకు చెప్పారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డీఓ అశోక్రెడ్డి, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ చంద్ర, డీఈలు పిచ్చయ్య, మారం శ్రీనివాస్ ఉన్నారు. -
డీఎల్ఐ భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలి
డిండి: డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్ఐ) లో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల నిర్మాణానికి భూ సేకరణ, పునరావాస సమస్యలను అధిగమించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై నీటి పారుదల శాఖ అతిథి గృహంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ ఈఈలు డిండి లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి నీటి తరలింపు, రిజర్వాయర్ల నిర్మాణ వివరాలను కలెక్టర్కు వివరించారు. 3లక్షల 41 వేల ఎకరాలకు సాగునీరందించే డిండి ప్రాజెక్టు పనులకు రూ. 6190 కోట్లు కేటాయించారని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ తదితర పనులకు ఇప్పటి వరకు రూ.4450 కోట్లు చెల్లింపులు జరిగాయని తెలిపారు. ప్రాజెక్టు పనులు 7 ప్యాకేజీలో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. డిండి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను సర్పంచ్ రవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు ఆయన స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీఓ వెంకన్నకు సూచించారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
60ఏళ్లుగా పతంగుల తయారీలో ‘సాహు’ కుటుంబం
భువనగిరి: సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది గాలిపటాలు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వీటిని ఎగురవేస్తుంటారు. ఆరుదశాబ్దాలుగా ఈ పంతంగుల తయారీనే వృత్తిగా మలుచుకుంది భువనగిరికి చెందిన ఓ కుటుంబం. పట్టణంలోని సమ్మద్ చౌరస్తా సమీపంలో సాహు లక్ష్మీనారాయణ కుటుంబం 1963లో ఇంట్లోనే పతంగుల తయారీకి శ్రీకారం చుట్టింది. పతంగుల తయారీలో ఎన్నోమార్పులు వచ్చినా నేటికి సంప్రదాయ రీతిలో పేపర్, వెదురు కర్రలతో తయారు చేసి విక్రయిస్తున్నారు. గాలిపటాల తయారీకి అవసరమైన ముడిసరుకును హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు. ఏటా డిసెంబర్, జనవరి నెలల్లోనే పతంగుల సీజన్ వస్తుంది. దీనికోసం ఆగస్టు నుంచే పతంగులను తయారీకి శ్రీకారం చుడుతారు. నవంబర్కు వరకు తయారు చేసినవాటిని మార్కెట్లోకి తెస్తారు. ప్రతి సీజన్లో సుమారు 1,500 నుంచి రెండు వేల వరకు పతంగులను వివిధ డిజైన్లలో తయారు చేస్తారు. సీజన్లో పట్టణంలో నాలుగు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో డిజైన్, సైజులను బట్టి ఒక్కో పతంగికి రూ.10 నుంచి రూ.50 వరకు విక్రయిస్తుంటారు. ఎన్నో రకాల కవర్ పతంగులు వచ్చినప్పటికీ పేపర్ పతంగులకు మంచి డిమాండ్ ఉంటుంది. సీజన్కు 5 నెలల ముందు తయారు చేయడం ప్రారంభిస్తాం. ఇంట్లో అందరికీ పతంగులు తయారు చేయడం వచ్చు. ప్రస్తుతం మనవరాళ్లు కూడా తయారు చేస్తున్నారు. స్వయంగా తయారు చేసి విక్రయించడం ద్వారా కూలి డబ్బులు లాభంగా ఉంటుంది. – లక్ష్మీనారాయణ, పతంగుల తయారీదారుడు, భువనగిరి -
బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి
నల్లగొండ: ఆర్టీసీ బస్సు, ఆటో డ్రైవర్లకు పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరగడానికి మానవ తప్పిదాలే కారణమన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, సీట్బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆర్టీసీ బస్సు, ఆటో డ్రైవర్లు వాహనాలను బాధ్యతాయుతంగా నడపాలన్నారు. అనంతరం ఎరైవ్ ఎలైవ్ పేరుతో ప్రయాణికుల ప్రాణ భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ప్రమాద రహిత ప్రయాణానికి సహకరిస్తామని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సైదులు, ఆర్టీసీ డిప్యూటీ రిజినల్ మేనేజర్ రాంరెడ్డి, డీఏం వెంకటరమణ, అంజయ్య పాల్గొన్నారు. సమయపాలన పాటించాలి మర్రిగూడ: వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలోని యూపీహెచ్సీ, సీహెచ్సీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా ఆరోగ్య మహిళా కేంద్రం, డయాలసిస్ యూనిట్, ఫార్మసీ, ల్యాబ్ను పరిశీలించి ఆరోగ్య కేంద్రాలను సమీక్షించారు. వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్నాయక్, షాలిని, దీపక్ తదితరులున్నారు. కాలుష్యాన్ని పరిశీలించిన ఈఈ చిట్యాల: పట్టణంలోని రైస్ మిల్లుల నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని ఇటీవల పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకన్న చిట్యాల పట్టణంలోని చంద్రపురి కాలనీ, ఆదర్శనగర్, ముత్యాలమ్మగూడెంలలో రైస్ మిల్లుల నుంచి వెదజల్లుతున్న కాలుష్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య కారక పరిశ్రమలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాదయ్య, సంజీవ, ఎల్లేష్, యాదగిరి, శ్రీనివాస్, యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. -
దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలి
శాలిగౌరారం: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కందాల ప్రమీల అన్నారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న జీపు ప్రచార యాత్రను మంగళవారం ఆమె శాలిగౌరారం మండల కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు, వీబీ జీ రాంజీ చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సంస్కరణ బిల్లుల రద్దుకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షుడు బొజ్జ చినవెంకులు, చలకాని మల్లయ్య, ఆంజనేయులు, జగన్, జ్యోతిబస్, వెంకన్న, రామచంద్రు, నర్సింహ, ఇస్మాయిల్, సత్తెమ్మ పాల్గొన్నారు. -
పండుగొచ్చింది
పల్లెగూటికి..పిండి వంటలకు కేరాఫ్ తాళ్లగడ్డఆనందం.. ఆరోగ్యంహరిదాసు.. భాగ్యలక్ష్మిఫ 30 ఏళ్లుగా ఇదే వృత్తిగా జీవనం భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతం పిండివంటలకు కేరాఫ్గా నిలిచింది. తాళ్లగడ్డకు చెందిన శ్రీరాముల అంజమ్మ కుటుంబం 30 ఏళ్లుగా పిండి వంటలు తయారు చేస్తూ విక్రయిస్తోంది. అంజమ్మ మొదట్లో కారపూస చేసి విక్రయించేది. ఆమె చేసిన పిండి వంటలు బాగుండడంతో గిరాకీ పెరగడం ప్రారంభమైంది. దాంతో ఆమె కూడా అన్నిరకాల పిండి వంటలను తయారు చేయడం మొదలు పెట్టారు. అంజమ్మ కుమారులు, మనుమళ్లు సైతం నాలుగు దుకాణాలు ఏర్పాటు చేసి పిండి వంటలను తయారు చేసి విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాల వారు సైతం వచ్చి తీసుకెళ్తుంటారు. కొందరు ఆర్డర్లు ఇచ్చి మరీ పిండి వంటలు చేయించి తీసుకెళ్తుంటారు. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే గిరాకీ అధికంగా ఉంటుంది. కారపూస, సకినాలు, చెకోడీలు, బూందీ, లడ్డూలు, అరిసెలు, కట్టె గారెలు, పూర్ణాలు, గవ్వలు, మైసూర్పాక్ ఇలా అన్ని రకాల పిడి వంటలు వీరు తయారు చేసి కిలోల చొప్పున విక్రయిస్తున్నారు.ఫ మూడు రోజులు సందడే.. సందడి ఫ తొలిరోజు భోగి మంటలు, భోగిపండ్లు ప్రత్యేకం ఫ రంగవల్లులతో కళకళలాడనున్న లోగిళ్లు సూర్యాపేటటౌన్, రామగిరి(నల్లగొండ) : సంక్రాంతి పండుగకు చిన్నారులు, యువత పతంగులను ఉత్సాహంగా ఎగురవేస్తుంటారు. వీటిని ఎగురవేయడంలోనూ ఆరోగ్యపరమైన కారణాలతోపాటు, శాసీ్త్రయత కూడా దాగి ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు మకర సంక్రాంతి రోజున గాలిపటం ఎగురవేశాడని, అది ఇంద్రలోకానికి చేరిందని చెప్పుకుంటారు. అదేవిధంగా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ఆకాశం వైపు చూస్తూ పతంగులు ఎగురవేయడం సూర్యారాధనకు గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా పతంగులు ఎగురవేయడం వల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది. ఎముకలు బలపడతాయి. విటమిన్ ఈ సరఫరా పెరుగుతుంది. చలి తగ్గే సమయంలో సూర్యకిరణాలు శరీరానికి అందడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గాలిపటాలు ఎగురవేసే క్రమంలో వారు దానివైపు చూసే తీక్షణ చూపు చిన్నారుల కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇదిలా ఉండగా.. దుకాణాల్లో కొన్నవే కాకుండా కొంతమంది చిన్నారులు గాలిపటాలను వారే సొంతంగా తయారు చేసుకుంటుంటారు. చతురస్రం, దీర్ఘచతురస్రం ఆకారంలో పేపర్లను కత్తిరించుకొని అందంగా తీర్చిదిద్దుతుంటారు. దీని ద్వారా గణితంలోని జ్యామితి, ఆకారాలు వారికి తెలుస్తాయి. సూర్యాపేటలో గంగిరెద్దును ఆడిస్తున్న దృశ్యంఫ ప్రతి ధనుర్మాసంలో హరిదాసు వేషధారణ ఫ ప్రభాత సమయంలో ప్రజలను మేల్కొలుపుతున్న మహిళ రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన అయ్యోరి మురళి గతంలో ప్రతి ధనుర్మాసంలో హరిదాసు వేషధారణతో సంకీర్తనలు, పాశురాలు పాడుతూ ప్రతి గడప ముందుకు వచ్చేవాడు. ఉదయం నాలుగు గంటల నుంచి తెల్లవారే వరకు గ్రామంలో సంచరిస్తూ తన మధురమైన గాత్రంతో ప్రజలను మేల్కొలిపేవాడు. మూడేళ్ల క్రితం ఆయన హఠాన్మరణంతో ఆ గ్రామం చిన్నబోయినట్లయింది. దాంతో తండ్రి వృత్తిని తానే స్వీకరించింది భాగ్యలక్ష్మి. ధనుర్మాసం రావడంతోటే తెల్లవారుజామున ప్రతి ఇంటికి వెళ్లి తన శ్రావ్యమైన గొంతుతో పాశురాలు, సంకీర్తనలు పాడుతూ ఇంటిల్లిపాదినీ మేల్కొలుపుతుంది భాగ్యలక్ష్మి. ఆమె సంకీర్తనలు విన్న రాజాపేట ప్రజలు ఆమె తండ్రి మురళిని గుర్తుతెచ్చుకోకుండా ఉండలేరు. మురళికి ఒక్కగానొక్క కుమార్తె అయిన రేపాక భాగ్యక్ష్మి తన తండ్రితోపాటే పాటలు, సంకీర్తనలు సంకీర్తనలు పాడుతూ తిరిగేది. తండ్రి తదనంతరం ప్రతి ధనుర్మాసంలో ఉదయంపూట గ్రామంలోని కాలనీల్లో మహిళా హరిదాసు వేషధారణతో సంచరిస్తూ తండ్రి పాడిన పాటలను మైక్ ద్వారా వినిపించడమే కాకుండా తన గాత్రంతో తండ్రి చదివే పద్యాలను చదువుతూ ప్రజలకు మేల్కొలపడాన్ని వృత్తిగా స్వీకరించింది. పండగ రోజుల్లో గ్రామ ప్రజలు ఇచ్చిన కానుకలను స్వీరిస్తూ వారికి ఆశీర్వచనాలు తెలియజేస్తుంది. పురుషులకు తీసిపోకుండా పౌరోహిత్యం మురళి కుమార్తె భాగ్యలక్ష్మి తన తండ్రి బాటలోనే నడుస్తుంది. మురళి బతికున్న రోజుల్లో శుభాకార్యాలు నిర్వహించేవాడు. అతని ఒక్కగానొక్క కుమార్తె భాగ్యలక్ష్మి తండ్రిలాగా పౌరహిత్యం నేర్చుకుంది. పురుషులకు తీసిపోకుండా చక్కటి ఉచ్చారణతో మంత్రాలు చదువుతూ వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, వినాయక విగ్రహ ప్రతిష్ఠలు, సత్యనారాయణ వ్రతాలు వంటివి నిర్వహిస్తోంది. గ్రామ ప్రజలు కూడా ఆమె తండ్రిని ఆదరించినట్లే ఆమెనూ ఆదరించడం విశేషం. చిన్నారులకు జ్ఞానం కలగాలని భోగి పండ్లు పోస్తారుఫ కాండూరి వెంకటాచార్యులు, గుట్ట ఆలయ ప్రధాన అర్చకుడు యాదగిరిగుట్ట : భగవంతుడి అనుగ్రహం ఉండాలని ధనుర్మాసంలో గోదాదేవి పూజలు చేస్తుంది. ఇందులో భాగంగానే అమ్మవారు కృష్ణ పరమాత్మను అత్యంత పవిత్రంగా భావించి వర్షాలు బాగా పడాలని, ఆరోగ్యం బాగుండాలని, పంటలుబాగా పండాలని వేడుకుంటూ గోదాదేవి అమ్మవారు వ్రతాన్ని ఆచరిస్తుంది. మకరంలో సూర్యుడు సాయంత్రం 8.45గంటలకు ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. ఈ సమయంలో చిన్న పిల్లలకు కొత్త పంటల నుంచి వచ్చిన బియ్యం, నువ్వులు, పైసలు, రేగు పండ్లు శ్రీస్వామి వారి పాదాల వద్ద పెట్టి పిల్లల నెత్తిపై పోస్తారు. చిన్నారులకు జ్ఞానం కలుగాలని భదిరికా (రేగుపండ్లు) ఫలాలను భోగి రోజున పోస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభం అవుతుంది. మంచి వెలుతురును ఇచ్చే పండుగనే సంక్రాంతిగా జరుపుకుంటాం. ఈశ్వర తత్వం కలిగిన గోవును పూజించే సమయమే సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యనారాయణుడిని ధాన్యం చేస్తే చాలా బాగుంటుంది. విశాలమైన ప్రదేశంలోనే పతంగులను ఎగురవేసేందుకు పిల్లలకు అవకాశమివ్వాలి. దారం తెగి చెట్లు, ఇళ్లపై పడితే వారిని అక్కడకు వెళ్లనీయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో భవనాలపై గాలిపటాలు ఎగరవేయకుండా జాగ్రత్తపడాలి. చైనా మాంజా వాడకుండా చూడాలి. విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు సమీపంలో పతంగులను ఎగురవేయొద్దు. మూడు రోజుల పండుగ సంక్రాంతికి పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే పనిలో రైతులు.. ఇళ్ల లోగిళ్లలో రంగవల్లులు వేస్తూ యువతులు.. పిండివంటల తయారీలో మహిళలు.. గాలిపటాల ఎగురవేతలో చిన్నారులు.. ఆటల పోటీల్లో యువకులు.. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా మారారు. మరో పక్క బంధుమిత్రుల రాక.. కొత్త కోడళ్లు, అల్లుళ్ల సందడితో పండుగ కళ ఉట్టిపడుతోంది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో ఊర్లన్నీ సందడిగా మారాయి. బుధవారం భోగి సందర్భంగా భోగి మంటలు వేస్తారు. చిన్నారులకు భోగి పళ్లు పోస్తారు. -
దద్దరిల్లిన పంతంగి టోల్ప్లాజా.. మరో రికార్డు!
సాక్షి, యాదాద్రి: సంక్రాంతి నేపథ్యంలో చౌటుప్పల్ (మం) పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈసారి సంక్రాంతికి నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు వెళ్లినట్టు టోల్ సిబ్బంది చెబుతున్నారు.మరోవైపు.. కొందరు పోకిరీలు టోల్ ప్లాజాల వద్ద విచ్చలవిడిగా అత్యవరస సైరన్స్(పోలీస్, అంబులెన్స్) దుర్వినియోగం చేస్తున్నారు. సైరన్తో న్యూసెన్స్ చేస్తున్నారు. టోల్ రుసుము తప్పించుకునేందుకు కొందరు పోకిరీలు ఇలా సైరన్ మోగిస్తూ హంగామా చేస్తున్నట్టు టోల్ సిబ్బంది గుర్తించారు. వీఐపీల్లా బిల్డప్ ఇస్తూ టోల్ ప్లాజా నిర్వాహకులకు టోకరా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైరన్ చప్పుడుతో మిగతా వాహనదారులను హడలెత్తిస్తున్నారు.మూడు రోజులుగా సైరన్లతో పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్లను దాటుకుంటూ వందలాది వాహనాలు వెళ్లినట్టు సిబ్బంది చెబుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే బామ్మర్దిని, మంత్రి గారి బంధువును అంటూ ఫేక్ వీఐపీలు టోల్ సిబ్బందిని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో, పోకిరీల సైరన్స్ పోలీసులకు సవాల్గా మారాయి. -
Nalgonda: వామ్మో.. పూర్తిగా తిన్న తర్వాత..
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ పట్టణంలోని ప్రసాద్ ఉడిపి హోటల్ దారుణం జరిగింది. సాంబారులో జెర్రీ కనిపించింది. పూర్తిగా తిన్న తర్వాత సాంబారులో జెర్రీని గమనించిన ఓ వ్యక్తి.. హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. భారీగా రేట్లు తీసుకోవడమే కాదని.. ప్రజల ప్రాణాలను లెక్కలోకి తీసుకోవాలని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల విజయవాడ సూర్యారావుపేటలోని కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనంలో జెర్రి రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్ అండ్ అడల్ట్ట్రేషన్ కేసు నమోదు చేసి హోటల్ను సీజ్ చేశారు.మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రెస్టారెంట్, హోటల్ నిర్వాహకుల నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుల తరబడి నిల్వచేసిన పదార్థాలు.. కుళ్లిన ఆహారాన్ని నిబంధనలు అతిక్రమించి విక్రయిస్తున్నారు. అధికారుల తనిఖీల్లోనూ వాస్తవాలు బట్టబయలవుతున్నాయి. కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. -
సోలార్ వినియోగదారులకు షాక్!
కోదాడ : సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఓ వైపు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుండగా.. మరోవైపు వినియోగదారుడిపై అధిక భారం మోపుతూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) గుట్టుచప్పుడు కాకుండా సోలార్ బిల్లంగ్లో మార్పులు చేసింది. పథకం ప్రారంభంలో ఉన్న నెట్ మీటరింగ్కు బదులు నెట్ బిల్లింగ్ను అమలు చేస్తోంది. దీని లోగుట్టు అర్ధంకాక వినియోగదారుడు భారీగా నష్టపోతున్నాడు. సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు ఇదేమిటని ప్రశ్నిస్తే అదంతా మాకు తెలియదు.. రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే బిల్లింగ్ విధానంలో మార్పు వచ్చిందని స్థానిక విద్యుత్శాఖ అధికారులు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇంటి అవసరాలకు అవసరమయ్యే విద్యుత్ను సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ అనే పథకాన్ని గత సంవత్సరం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే అయ్యే ఖర్చు సుమారు రూ.2లక్షల్లో సబ్సిడీ కింద రూ.78వేలు కేంద్ర ప్రభుత్వం వినియోగదారుడి అకౌంట్లో వేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వమే బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేసింది. దీంతో పలువురు ఈ పథకం ద్వారా తమ ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో నెట్ మీటరింగ్ విధానం అమలు చేసేవారు గత అక్టోబర్ నుంచి దీన్ని నెట్ బిల్లింగ్గా మార్చారు. సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్టాప్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారుడు వాటి ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ను విద్యుత్ సంస్థకు సరఫరా చేస్తాడు. దీన్ని ఎక్స్పోర్ట్ విద్యుత్ అంటారు. అదే సమయంలో వినియోగదారుడు విద్యుత్ సంస్థ నుంచి తన ఇంటి అవసరాలకు వాడుకుంటాడు. దీన్ని ఇంపోర్ట్ విద్యుత్ అంటారు. గతంలో వినియోగదారుడు వాడుకున్న విద్యుత్కు తన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్లో నుంచి తీసేసి మిగిలిన యూనిట్లకు బిల్లు వసూలు చేసేవారు. ఉదాహరణకు వినియోగదారుడు ఒక నెల 300 యూనిట్ల విద్యుత్ వాడుకుంటే.. అతడు తన సోలార్ ప్యానల్స్ ద్వారా 200 యూనిట్లు ఉత్పత్తి చేశాడనుకుంటే దాన్ని అతను వాడుకున్న 300 యూనిట్ల నుంచి తీసివేసి మిగిలిన 100 యూనిట్లకు బిల్లు వసూలు చేసేవారు. దీన్నే నెట్ మీటరింగ్ అంటారు. అమ్మబొతే అడవి.. కొనబోతే కొరివి విద్యుత్ సంస్థ వినియోగదారుడికి 200 యూనిట్ల వరకు యూనిట్ రూ.5 చొప్పున, 200 నుంచి 300 యూనిట్ల వరకు రూ.6, 300 యూనిట్లు దాటితే సుమారు రూ.7 వరకు వసూలు చేస్తుంది. ఒక వినియోగదారుడు 300 యూనిట్లు వాడుకుంటే దానికి విద్యుత్ సంస్థ రూ.7 చొప్పున రూ.2100 వసూలు చేస్తుంది. సోలార్ ప్యానల్స్ ద్వారా వినియోగదారుడు 200 యూనిట్లు ఉత్పత్తి చేస్తే దానికి యూనిట్కు రూ.5.25 చొప్పున రూ.1050 మాత్రమే ఇస్తుంది. అంటే తన విద్యుత్ను యూనిట్కు రూ.7 అమ్ముతున్న సంస్థ వినియోగదారుడి విద్యుత్కు మాత్రం యూనిట్కు రూ.5.25 మాత్రమే ఇస్తుంది. దీన్నె నెట్ బిల్లింగ్ అంటారు. నెట్ మీటరింగ్ విధానంలో వాడుకున్న విద్యుత్ 300 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ 200 యూనిట్లు ముందుగానే తీసేవేస్తే మిగిలిన వంద యూనిట్లకు స్లాబ్ ప్రకారం రూ.5 వసూలు చేయాలి. దీని కోసమే నెట్ బిల్లింగ్ విధానాన్ని టీజీఎస్పీడీసీఎల్ అమలు చేస్తుందని వినయోగదారులు ఆరోపిస్తున్నారు. గతంలో నెట్ మీటరింగ్ విధానం అమలు దానిని ప్రసుత్తం నెట్ బిల్లింగ్ విధానంలోకి మార్చిన టీజీఎస్పీడీసీఎల్ ఇంపోర్ట్కు ఎక్కువ ఛార్జీ వసూలు ఎక్స్పోర్ట్కు తక్కువ ధర చెల్లింపుఅధికారులు ఏమంటున్నారంటే.. సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు గృహజ్యోతి పథకాన్ని వినయోగించుకోవడం వల్ల సంస్థకు భారీ నష్టం జరుగుతుంది. దీంతో సంస్థ ఉన్నతాధికారులు బిల్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లోనే మార్చారు. దీనిలో మా ప్రమేయం ఏమిలేదని స్థానిక విద్యుత్ అధికారులు అంటున్నారు. -
చలికాలం జీవాల పెంపకంలో జాగ్రత్తలు
22 వరకు అమ్మతల్లి టీకాలుపశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో పశువైద్య సిబ్బంది ఈ నెల 22వ తేదీ వరకు జీవాలకు అమ్మతల్లి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి రైతు ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టీకాలు వేయించకపోతే జీవాలు మరణించి రైతులు, కాపరులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.త్రిపురారం : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ ఉంది. దీంతో జీవాలు, పశువులు జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. జీవాలు, పశువులు వ్యాదుల బారిన పశు పోషకులు, జీవాల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని త్రిపురారం మండల పశువైద్యాధికారి నాగేందర్ సూచిస్తున్నారు. చలికాలం జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. 1. జలుబు, దగ్గు : తీవ్రమైన చలి ఉన్నప్పుడు జీవాలకు జలుబు, దగ్గు సోకితే తుమ్ములతో పాటు కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, చీమిడి పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రిముల ద్వారా సోకే అంటువ్యాధులతో పాటు ఆహారం ద్వారా శ్యాసకోశంలోకి వచ్చే కణాలు, నూనె పదార్థాలు, శ్వాసకోశాన్ని చికాకు పెట్టే ఇతర పదార్థాలు జలుబు, దగ్గుకు కారణమవుతాయి. జీవాల పాకలు ఇరుకుగా ఉండటం.. గాలి, వెలుతురు సరిగా లేకపోవడం.. పాకల్లో తేమ, తడి ఎక్కువగా ఉండడం.. కాలుష్యం, దుమ్ము వాతావరణంలో అకస్మాతుగా వచ్చే మార్పులు ఈ జబ్బుకు కారణమవుతాయి. వ్యాధి నివారణకు పాకలోకి గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. వాతావరణం సరిగా లేనప్పుడు జీవాలను బయటకు వదలకూడదు. పాకలను శుభ్రంగా ఉంచాలి. జబ్బులు సోకిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలి. ఒకవేళ జీవం చనిపోతే పోస్టుమార్టం ద్వారా వ్యాధి నిర్ధారించుకొని మందలో మిగిలిన జీవాలకు వెంటనే చికిత్స చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు ముందు జాగ్రత్త టీకాలు వేయించుకోవాలి. 2. దొమ్మ రోగం : పశువుల్లో దొమ్మ రోగం వ్యాప్తికి పలు రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, పరాన్న జీవులు కారణం. కంటేజియస్ కాప్రెస్ ప్లూరో నిమోనియా అనే వైరస్ కారణంగా మేకలకు మాత్రమే వచ్చే వ్యాధి ఇది. ఈ వ్యాధి సోకిన జీవాలకు తీవ్రమైన జ్వరం ఉంటుంది. వేగంగా శ్వాస పీల్చుకోవడం, ఎగ శ్వాస, ముక్కు నుంచి నీరు, చీమిడి కారడం, ఆకలి లేకపోవడంతో జీవాలు రోజురోజుకు నీరసించిపోతాయి. కల్లు ఎర్రబడి నీరుగారడం, వీపు భాగం వంగి ఉండడం, తల, మెడ ముందుకు సాగినట్లు కనిపిస్తాయి. ముక్కు రంధ్రాలు వెడల్పు అవుతాయి. త్వరగా చికిత్స చేయించకపోతే ఊపిరితిత్తులు వాచి వాటికి చీము పట్టే ప్రమాదం ఉంటుంది. ఈ లక్షణాలు అమ్మతల్లి వీవీఆర్ మొదలైన జబ్బుల్లో కూడా కనిపిస్తాయి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం, శుభ్రమైన నీటిని అందిస్తూ ఎప్పటికప్పుడు టీకాలు వేయించాలి. -
ఆస్తి కోసం అంత్యక్రియలు నిలిపివేత
శాలిగౌరారం : ఆస్తి తగాదాతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిలిపివేశారు. రెండు రోజులుగా ఇంటిముందు మృతదేహంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన అయితగోని పెంటయ్య, అక్కులయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీరు తల్లిదండ్రులు సంపాందించిన 12 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక్కొక్కరు 6 ఎకరాలు చొప్పున సమానంగా పంచుకున్నారు. పెంటయ్యకు ఇద్దరు కుమారులు రవీందర్, జానయ్యతో పాటు కుమార్తె ఉన్నారు. అక్కులయ్యకు సంతానం లేరు. దీంతో అక్కులయ్య అతడి భార్య శాంతమ్మ(65)ను పెంటయ్య ఇద్దరు కుమారులు చూసుకునేవారు. అక్కులయ్య తన భాగానికి చెందిన 6 ఎకరాల భూమిని అన్న కుమారులైన రవీందర్, జానయ్యకు 3 ఎకరాల చొప్పున పంచి ఇచ్చాడు. అక్కులయ్య భార్య శాంతమ్మ తల్లిగారి గ్రామం కూడా ఆకారం కావడంతో శాంతమ్మకు ఆమె తల్లిదండ్రులు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అందులో ప్రస్తుతం శాంతమ్మ పేరున 5.15 ఎకరాల భూమి పట్టా ఉండగా.. 2.25 ఎకరాల భూమి ఇతరుల పేరున పట్టా కలిగి ఉంది. ఇదిలా ఉండగా నాలుగు సంవత్సరాల క్రితం అక్కులయ్య అన్న కుమారుల్లో చిన్న కుమారుడు జానయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి అక్కులయ్య–శాంతమ్మ దంపతులు పెద్ద కుమారుడైన రవీందర్ వద్ద ఉంటున్నారు. దీంతో శాంతమ్మ తన పేరున ఉన్న 5.15 ఎకరాల భూమిలో 5 ఎకరాలను రవీందర్ కుమారులైన శ్రవణ్కుమార్కు 2 ఎకరాలు, లవకుమార్కు 3 ఎకరాలు పట్టా మార్పిడి చేసేందుకు గత సంవత్సరం ఫిబ్రవరిలో స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లింది. దీంతో విషయం తెలుసుకున్న జానయ్య భార్య, కుమారుడు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కులయ్య–శాంతమ్మ దంపతులతో పాటు రవీందర్ కుటుంబ సభ్యులతో గొడవ పడటంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్లో శాంతమ్మ తనకున్న 5.15 ఎకరాల భూమిలో నుంచి రవీందర్ కుమారులకు 5 ఎకరాలు రిజిష్ట్రేషన్ చేసింది. దీంతో రవీందర్, జానయ్య కుటుంబ సభ్యుల మధ్య భూతగాదాలు జరుగుతూనే ఉన్నాయి. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో ఘటన అనారోగ్యంతో శాంతమ్మ మృతి రవీందర్ ఇంటి వద్ద ఉంటున్న అక్కులయ్య–శాంతమ్మ దంపతుల్లో శాంతమ్మ అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు రవీందర్ ప్రయత్నించగా జానయ్య కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. శాంతమ్మ ఆస్తి నుంచి తమ వాటా సమానంగా పంపిణీ జరిగే వరకు అంత్యక్రియలు జరుగనీయమన్నారు. రాత్రి కావడంతో శాంతమ్మ అంత్యక్రియలు నిలిచిపోయాయి. సోమవారం కూడా పరిస్థితి అలాగే మారడంతో గొడవకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సైదులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శాలిగౌరారం, కట్టంగూర్ ఎస్ఐల నేతృత్వంలో 10 మంది పోలీసులు శాంతమ్మ మృతదేహం బందోబస్తు నిర్వహించారు. గ్రామపెద్దలు నచ్చజెప్పినా వినలేదు. సోమవారం రాత్రి వరకు శాంతమ్మ మృతదేహం రవీందర్ ఇంటిముందే ఉంది. అయితే జానయ్య కుమారుడు ఉమేశ్.. శాంతమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని శాంతమ్మ మృతదేహాన్ని సోమవారం రాత్రి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సరైన పద్ధతులతో నల్ల తామర నివారణ
గుర్రంపోడు : నాలుగేళ్లుగా మిరుపలో నల్ల తామర తెగులు తీవ్రంగా ఉంటోందని, దీని ఉనికిని సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ప్రాంతీయ ఉద్యానవన అధికారి కె. మురళి అన్నారు. సోమవారం గుర్రంపోడు మండలంలోని చేపూరు, మొసంగి గ్రామాల్లో మిరుప తోటలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. అధిక నత్రజని ఎరువులను వేసుకోకుండా సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా అందించాలన్నారు. నల్ల తామర పురుగుకు కలుపు మొక్కలు ఆవాసాలుగా ఉంటాయి కాబట్టి పొలం గట్టు మీద ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలన్నారు. పురుగులు బెట్ట పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉన్నందున భూమిలో తగినంత తేమతో పురుగు ఉధృతిని నివారించవచ్చున్నారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బెవరియా బెసినియా లేదా లెకానిసిలియం లెకాని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. చివరి అస్త్రంగా సయాంట్రానిలిప్రోల్ 1.2 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.32 మి.లీ. లేదా ఫిఫ్రోనోల్ 80 డబ్లుజీ 0.2 గ్రాములు లేదా పిప్రోనిల్ మరియు ఇమిడా క్లోఫ్రిడ్ 0.2 గ్రాములు లేదా స్పైనటోరం ఒక మిల్లీలీటరు ఒక లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేయాలని సూచించారు. -
అటవీ సంపద కొల్లగొట్టేందుకే మావోల హత్య
చౌటుప్పల్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న అటవీ సంపదను కొల్లగొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై హత్యాకాండ మొదలు పెట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. అడవులకు, గిరిజనులకు, ఆదివాసీలకు రక్షణగా ఉన్న మావోయిస్టులను లేకుండా చేయడం ద్వారా విస్తారమైన ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం చౌటుప్పల్లో సీపీఎం మున్సిపల్ కమిటీ విస్త్రతస్థాయి సమావేశానికి జాన్వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ చింతల భూపాల్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారని, పేదలను ఉపాధికి దూరం చేసేందుకే ఉపాధి హామీ పథకం పేరు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల పక్షాన పనిచేసే సీపీఎం అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోశిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
షార్ట్ సర్క్యూట్తో ప్రింటింగ్ ప్రెస్ దగ్ధం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండల కేంద్రంలోని సమతా ప్రింటింగ్ ప్రెస్లో సోమవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రింటింగ్ మిషన్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, కౌంటర్లో ఉన్న రూ.4500 కాలిబూడిదయ్యాయి. రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లుదుకాణ యజమాని గుండు కిరణ్కుమార్ తెలిపారు. ఇంట్లో సామగ్రి..నార్కట్పల్లి : మండలంలోని మాధవఎడవెల్లి గ్రామానికి చెందిన ఎడమ మల్లేష్ ఇంట్లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సామగ్రి కాలిపోయాయి. ఇంట్లోని విద్యుత్ వైర్లకు మంటలు రావడంతో బీరువా, బీరువాలో ఉన్న విలువైన సర్టిఫికెట్లు, రూ.70 వేల నగదు, మంచం మీద సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు మల్లేష్ తెలిపారు. వ్యక్తి కిడ్నాప్నకు యత్నం.. నలుగురిపై కేసు నమోదుమోటకొండూర్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని బెదిరించి కారులో ఎక్కించుకెళ్లిన నలుగురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోమవారం మోటకొండూర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ హజీమ్ తన భార్య షేక్ హసీనా బేగంతో కలిసి బైక్పై వెళ్తుండగా.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు బైక్ను ఆపి హజీమ్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. హజీమ్ భార్య హసీనా బేగం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. చౌటుప్పల్ సమీపంలో పోలీసులు కారును పట్టుకుని హజీమ్ను కిడ్నాప్ చేసిన పీసరి నవీన్రెడ్డి, పీసరి మల్లారెడ్డి, తుమ్మల వెంకట్రెడ్డి, ముత్తినేని సందీప్కుమార్ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు నలుగురిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.. చోరీ కేసులో ముగ్గురు రోహింగ్యాల అరెస్టు రామగిరి(నల్లగొండ) : చోరీ కేసులో బర్మా దేశానికి చెందిన ముగ్గురు రోహింగ్యాలను నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. బర్మా దేశానికి చెందిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం, మహ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, ఖైసర్, నూర్ ఖాసీం 2012లో ఇండియాకు శరణార్ధులుగా వచ్చి హైదరాబాద్లోని బాలాపూర్లో నివసిస్తున్నారు. వీరు ఈ నెల 7న హైదరాబాద్ నుంచి వచ్చి నల్లగొండ పట్టణ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న నిధి పాలిమర్ కంపెనీలో పైపుల తయారీకి వినియోగించే విలువైన వస్తువులను దొంగిలించి కంపెనీ దగ్గరలో చెట్ల పొదల్లో ఉంచి వెళ్లారు. హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం ఆదివారం అర్ధరాత్రి నల్ల గొండకు వచ్చి దొంగిలించిన వస్తువులను ఆటోలో తరలిస్తుండగా.. చర్లపల్లి శివారులో టూటౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్ఐ సైదాబాబు పట్టుకున్నారు. మిగతా నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.60లక్షల విలువైన 40 ఇత్తడి సైజర్లు, 35 అమరాన్ బ్యాటరీలు, యూపీఎస్ కేబుల్, 50 కేజీల కాపర్ వైరు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
బెట్టింగ్లకు అలవాటుపడి చోరీలు
నకిరేకల్ : ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను సోమవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన మహేష్ తాను పండించిన పత్తిని అమ్మేందుకు గాను ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన జటంగి బుచ్చయ్య ట్రాక్టర్లో లోడు చేశాడు. మరుసటి రోజు ఉదయం మార్కెట్కు తీసుకెళ్లి పత్తిని అమ్ముదామనుకుని ట్రాక్టర్ను అదే గ్రామానికి చెందిన ప్రదీప్రెడ్డి ఇంటి సమీపంలో పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి పత్తి లోడు ట్రాక్టర్ కనింపించలేదు. దీంతో వీరబోయిన మహేష్ కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంధువుతో కలిసి.. అయితే కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన నూకల కోటేష్ ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతుండేవాడు. 2019లో మాడుగులపల్లి, వేములపల్లి, కేతేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాక్టర్లు చోరీ చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా కోటేష్ మళ్లీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తన బంధువు అయిన సూర్యాపేటకు చెందిన ఆడెపు సాయికుమార్తో కలిసి తిరిగి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఈ నెల 8వ తేదీ రాత్రి కేతేపల్లి మండల కేంద్రంలో వీరబోయిన మహేష్ పత్తి లోడు ట్రాక్టర్ను చోరీ చేసి సూర్యాపేటకు తరలించారు. ట్రాక్టర్లోని కొంత పత్తిని సూర్యాపేట శివారులోని బాలెంలోని కాటన్ మిల్లులో అమ్మగా రూ.72,475 నగదు వచ్చాయి. మిగిలిన పత్తిని సోమవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల వద్ద గల కాటన్ మిల్లుకు తీసుకెళ్తుండగా.. కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో పోలీసులు పట్టుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులు కోటేష్, సాయికుమార్పై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ.50వేల నగదు, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, కేతేపల్లి ఎస్ఐ సతీష్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారని డీఎస్పీ పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్టు -
ఎంజీయూ హాకీ జట్టు కోచ్గా లింగస్వామి
రామన్నపేట : మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) హాకీ జట్టు కోచ్గా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రాపోలు లింగస్వామి నియమితులయ్యారు. ఈ నెల 18వ తేదీ వరకు తమిళనాడు రాజధాని చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీ మైదానంలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాపియన్షిప్లో పాల్గొనే ఎంజీయూ హాకీ జట్టుకు ఆయన కోచ్గా వ్యవహరించనున్నారు. లింగస్వామి నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో హాకీలో రాణించి ఎంజీయూ జట్టుకు ఎంపికై రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అతడి ప్రతిభను గుర్తించి హాకీ అసోసియేషన్, యూనివర్సిటీ క్రీడా విభాగం వారు కోచ్ బాధ్యతలను అప్పగించారు. లింగస్వామికి పలువురు అభినందనలు తెలిపారు. -
అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నారు
మేము ముగ్గురు సోదరులం. మా తండ్రి పేరు మీద 7.36 ఎకరాల భూమిని మూడు బాగాలుగా చేసుకుని 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. నాకు తెలియకుండా నాకు రావాల్సిన భూమిని నా సోదరులు నర్సిరెడ్డి, యాదగిరిరెడ్డి వారి పేరు మీదకు మార్చుకున్నారు. నాకు 75 సంవత్సరాలు, నడవలేను. ఇద్దరు కూతుళ్లు, పెద్ద కూతురు అంధురాలు, రెండో కూతురికి 23 ఏళ్ల క్రితం వివాహమైంది. నా భార్య కూడా వృద్ధురాలు. నా అంధురాలైన కూతురితో కలిసి వ్యవసాయం చేయించుకుంటున్నా. అధికారులు విచారణ చేసి మాకు న్యాయం చేయాలి. – పబ్బతిరెడ్డి లక్ష్మారెడ్డి, అప్పాజిపేట(మిర్లోనిగూడెం), నల్లగొండ మండలం -
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
నల్లగొండ : గణతంత్ర దినోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యార్థులతో సాంస్క్రతిక కార్యక్రమాలు, వివిధ శాఖల అభివృద్ధి తెలిపే శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉత్తమ ఉద్యోగులకు ఇచ్చే అవార్డుల జాబితాను ఈనెల 20వ తేదీలోగా పంపించాలన్నారు. 30 ప్రభుత్వ శాఖలు అద్దె భవనాల్లో ఉన్నట్లు గుర్తించామని, వాటిని ప్రభుత్వ భవనాల్లో సర్దుబాటు చేస్తామన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా రైతులను చైతన్యం చేయాలని, రైతులందరికీ భూసార ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని ఆదేశించారు. పంటల మార్పిడి విధానం పై అవగాహన కల్పించి వ్యవసాయ యాంత్ర పరికరాలను రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ పూర్తయిన రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, దేవరకొండ, చండూరు ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఆర్ఓ, ఏఆర్ఓ, నోడల్ అధికారులు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలను గుర్తించామన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మెటీరియల్ను సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంతో వీడియో కాన్ఫరెన్స్.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో భాగంగా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 6 పాఠశాలలను నిర్మించేందుకు భూములను గుర్తించామని కలెక్టర్ చంద్రశేఖర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల పాఠశాల పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన నాలుగు పాఠశాలల టెండర్లు పూర్తయ్యాయని వివరించారు. -
వివేకానంద.. యువతకు ఆదర్శం
మర్రిగూడ(చింతపల్లి) : స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శప్రాయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సోమవారం మాల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహాన్ని ఆయన, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డితో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. స్వామి వివేకానంద యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, కర్తవ్య బోధనను పెంపొందించారని అన్నారు. వివేకానంద బోధనలు ఈ తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. విద్య, సంస్కృతి, జాతీయభావం పరిరక్షణలో స్వామి వివేకానంద ఆలోచలను ఎప్పటికీ ఆచరణీయమన్నారు. ప్రతి విద్యార్థి ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ను సిరిసిల్లలో ఓడించే బాధ్యత నాదే బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తే సిరిసిల్లలో కేటీఆర్ను గెలవకుండా చేస్తానని ఎంపీ రఘునందన్రావు అన్నారు. చింతపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. కేటీఆర్కు ఉద్యమాలు చేయడం చేతకాదని ఆయన సొంత చెల్లె కవిత చెప్పిందని అన్నారు. హైదరాబాద్ని అభివృద్ధి చేశామని కేటీఆర్ చెప్పుకుంటున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే బీజేపీ నాలుగు సీట్లు ఎక్కువ గెలిచి చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. వాస్తవాలు విస్మరించి గ్రౌండ్రిపోర్ట్కు విరుద్ధంగా కేటీఆర్ బీజేపీకి బలం లేదని విమర్శించడం ఆయన అవగాహన రాహిత్యమన్నారు. అధికారం కోల్పోయాక తన మీడియా సంస్థల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. ఫ మెదక్ ఎంపీ రఘునందన్రావు -
జీజీహెచ్లో అరుదైన శస్త్ర చికిత్స
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో వైద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మి (40) కడుపునొప్పితో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. పరీక్షంచిన వైద్యులు ఆమె రక్తహీనత, కడుపులో 6 నెలల గర్భంతో సమానమైన పరిమాణంలో గడ్డ(కణితి) ఉన్నట్లు గుర్తించారు. సోమవారం ప్రొఫెసర్ డాక్టర్ స్వరూపారాణి బృందం డాక్టర్ విద్యాభార్గవి, డాక్టర్ నిఖిత, డాక్టర్ ప్రఖ్య, అనస్తియా బృందం డాక్టర్ నేహా, డాక్టర్ శ్వేత, నర్సింగ్ సిబ్బంది సుధాక, పద్మ, రఘు.. లక్ష్మికి శ్రస్త చికిత్స చేసి కిలోన్నర కణితితో కూడిన గర్భసంచిని తొలగించారని తెలిపారు. ప్రస్తుతం పేషంట్ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మారంటూ రైతు నిరసనకొండమల్లేపల్లి : తనకు నకిలీ విత్తనాలు అమ్మారంటూ ఓ రైతు మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల మన గ్రోమోర్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశాడు. చింతపల్లి మండలంలోని వెంకటంపేటకు చెందిన ఓ రైతు 10 రోజుల క్రితం కొండమల్లేపల్లిలోని మన గ్రోమోర్ దుకాణంలో వరి విత్తనాలు కొనుగోలు చేసి తన పొలంలో నారు చల్లాడు. ఐదు రోజులు గడిచినా మొలకెత్తకపోవడంతో రైతు ఆందోళన చెంది సోమవారం మన గ్రోమోర్ వద్దకు వచ్చి నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఏఓ జానకి రాములు అక్కడకు వచ్చి రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం రైతుకు వరి విత్తనాల బస్తాలు తిరిగి ఇప్పించడంతో రైతు నిరసన విరమించాడు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసినపుడు రశీదు తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని కళాకారులు చేపట్టిన కూచిపూడి, భరత నాట్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కొండకు దిగువన ఉన్న వైకుంఠద్వారం వద్ద ప్రత్యేక వేదికపై కళాకారులు కూచిపూడి, భరత నాట్యం, సంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. -
మమ్మల్ని ఆదుకోండి సారూ..
నల్లగొండ : మమ్మల్ని ఆదుకోండి సారూ.. అంటూ పలువురు బాధితులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. సోమవారం గ్రీవెన్స్డే సందర్భంగా కలెక్టరేట్కు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ ఫిర్యాదులు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నా కూతురు వరలక్ష్మీ 9వ తరగతి చదువుతున్న సమయంలో రెండేళ్ల క్రితం స్కూల్లో మెట్లపై నుంచి పడి మెదడుకు దెబ్బ తగిలింది. అప్పట్లో సదరం సర్టిఫికెట్ 30 శాతం ఇచ్చారు. ప్రస్తుతం ఉస్మానియాలో బ్రెయిన్ ఆపరేషన్ అయింది. సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. గతంలో ఉన్న సర్టిఫికెట్ ఆన్లైన్లో చూపుతున్నందున వికలాంగుల పింఛన్కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. పెన్షన్ ఇప్పించి న్యాయం చేయాలి. – నాగమ్మ, పోతిరెడ్డిపల్లి, పీఏపల్లి మండలం నిరుపేద కుటుంబానికి చెందిన మహిళను. నాకు ఆస్తి పాస్తులు లేవు. సదరం సర్టిఫికెట్ కూడా ఉంది. చేతికర్రలతో నడుస్తున్నాను. ఇప్పుడు నడవలేకపోతున్నాను. బ్యాటరీ సైకిల్ ఇప్పించాలి. – కుందూరు పద్మ, దుగ్గిరాల, త్రిపురారం మండలం ఫ ప్రజావాణిలో బాధితుల విన్నపం ఫ ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ చంద్రశేఖర్ -
విద్యుత్ వినియోగదారులకు ‘భట్టి’ లేఖ
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి, వ్యవసాయ ఉచితవిద్యుత్ లబ్ధిదారులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు పంపింది. ఉచితంగా విద్యుత్ పొందుతున్న వినియోగదారుడి పేరున లేఖలు రాసి విద్యుత్ అధికారులతో అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో పరిధిలోని ఉచిత విద్యుత్ వినియోగదారులకు విద్యుత్శాఖ అధికారులు లేఖలు అందజేస్తున్నారు. ఉచిత విద్యుత్ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది.. ఆ డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవాలని లేఖలో సూచించింది. భవిష్యతులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తామని, సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపింది. 2,49,309 మంది గృహజ్యోతి లబ్ధిదారులు జిల్లాలో ఉచిత విద్యుత్ పొందే వినియోగదారులు 2,49,309 మంది ఉన్నారు. ఇందులో నల్లగొండ డివిజన్ పరిధిలో 1,20,339, మిర్యాలగూడ డివిజన్లో 78,623, దేవరకొండ డివిజన్లో 50,347 మంది ఉన్నారు. వీరితోపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పొందుతున్న వారు జిల్లాలో 2,44,622 మంది ఉన్నారు. వీరందరికి ప్రభుత్వం నుంచి వినియోగదారుడి పేరు, సర్వీస్ నెంబర్ ముద్రించి లేఖలు అందిస్తున్నారు. ఆ లేఖను విద్యుత్ సిబ్బంది, అధికారులు కలిసి వినియోగదారుల ఇంటికి వెళ్లి చదివి వినిపిస్తున్నారు.ఫ గృహజ్యోతి, వ్యవసాయ విద్యుత్ వినయోగదారుల పేరున లేఖలు పంపిన డిప్యూటీ సీఎం ఫ ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్న విద్యుత్శాఖ సిబ్బంది -
ముసాయిదా జాబితాపై పలు ఫిర్యాదులను పక్కనపెట్టిన అధికారులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఓటర్ల జాబితాపై వెల్లువెత్తిన అభ్యంతరాలు చాలావరకు పరిష్కారానికి నోచుకోలేదు. ఈనెల 1వ తేదీన మున్సిపాలిటీ వారీగా ప్రకటించిన ఓటర్ల ముసాయి జాబితాలపై ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. ఓటు హక్కు పక్క వార్డులో ఉందని, తాము ఉంటున్న వార్డుకు మార్చాలని, ఇంటి నంబర్లు మార్చాలంటూ అభ్యంతరాలు పలువురు వ్యక్తం చేశారు. అయితే అందులో కొన్నింటిని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి, పరిష్కరించారు. మరికొన్నింటిని మాత్రం తిరస్కరించారు. ఇలా జిల్లాలో ఐదు వందలకు పైగా అభ్యంతరాలు తిరస్కారానికి గురయ్యాయి. ఇక, ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో నకిరేకల్ మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్కల తేలింది. 18 మున్సిపాలిటీల్లో మొత్తం 6,68,437 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ఇందులో పురుషులు 3,23,647 మంది, మహిళలు 3,44,661 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 129 మంది ఉన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను, 16న ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. 16న ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రకటించారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. అలాగే ఫొటోలతో కూడిన ఓటర్ల జాబి తాలను సిద్ధం చేసిన అధికారులు వాటిని కూడా ప్రదర్శించనున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేశారు. ఫొటోలో కూడిన జాబితాల్లో పొరపాట్లు దొర్లితే వాటిని సరి చేసేందుకు మూడు రోజుల సమయం ఇచ్చారు. వాటన్నింటిని సరిచేసి, ఈ నెల 16న ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను అధికారులు మున్సిపాలిటీ వార్డుల వారిగా ప్రచురించనున్నారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్దం కావడంతో ఎన్నికల సంఘం ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ఈ నెల 16న ప్రకటించనుంది. ఆ తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 17, 18 తేదీల్లోనే షెడ్యూల్ రావచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా ఓటర్ల వివరాలు.. మున్సిపాలిటీ పురుషులు మహిళలు ట్రాన్స్జెండర్ మొత్తం నల్లగొండ 68,874 73,507 56 1,42,437 మిర్యాలగూడ 45,128 47,878 14 93,020 దేవరకొండ 11,629 12,200 1 23,830 హాలియా 6,270 6,529 2 12,801 నందికొండ 6,475 7,027 1 13,503 చండూరు 5,652 5,717 1 11,370 చిట్యాల 5,930 6,188 1 12,118 సూర్యాపేట 52,170 56,664 14 1,08,848 కోదాడ 28,069 30,520 12 58,601 హుజూర్నగర్ 14,257 15,731 8 29,996 నేరేడుచర్ల 6,629 7,116 1 13,746 తిరుమలగిరి 7,638 7817 0 15,455 భువనగిరి 23,037 24,793 1 47,831 చౌటుప్పల్ 13,553 13,663 0 27,216 యాదగిరిగుట్ట 6,760 7,046 16 13,822 పోచంపల్లి 7,799 8,028 0 15,827 మోత్కూర్ 7,106 7,277 0 14,383 ఆలేరు 6,671 6,960 1 13,632 మొత్తం 3,23,647 3,44,661 129 6,68,437 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే నల్లగొండలోని మున్సిపాలిటీల పరిధిలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. నల్లగొండలో నకిరేకల్ మినహా మిగతా ఏడు మున్సిపాలిటీల్లో 3,09,080 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,49,958 మంది పురుషులు, 1,59,046 మంది మహిళలు, 76 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 2,26,646 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,08,763 మంది పురుషులు, 1,17,848 మంది మహిళలు, 35 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 1,32,711 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 64,926 మంది పురుషులు, 67,767 మంది మహిళలు, 18 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఫ 18 మున్సిపాలిటీల్లో ఓటరు తుది జాబితా ప్రకటన ఫ ఉమ్మడి జిల్లాలో 6,68,437 మంది మున్సిపల్ ఓటర్లు ఫ నేడు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల ఫ 16వ తేదీన ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితా ప్రదర్శన -
నల్లగొండలో భారీ దోపిడీకి పాల్పడ్డ రోహింగ్యాలు
నల్లగొండ: నల్లగొండలో రోహింగ్యాలు హల్చల్ చేశారు. నల్లగొండ సమీపంలో ఉన్న ఓ పైపుల కంపెనీలో చోరీకి పాల్పడ్డారు. బ్యాటరీలతో పాటు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు రోహింగ్యాలు. ఈ చోరీకి పాల్పడిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫీక్ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. అరవై లక్షల విలువైన సామాగ్రితో పాటు ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరు 2012-2013లో హైదరాబాద్ నగరానికి వచ్చారని, గతంలో ఓ కేసుకు సంబంధించి జైలుకు వెళ్లొచ్చారని, అయినప్పటికీ తీరు మారలేదని పోలీసులు అంటున్నారు. ఈ దొంగతనం కేసులో మరో నలుగురు రోహింగ్యాలు పరారీ అయినట్లు సమాచారం. -
ఉద్యోగం వదిలి ఉపాధి కల్పించే స్థాయికి..
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చేనేత కుటుంబానికి చెందిన సాయిని భరత్(33) ఎంటెక్ పూర్తి చేసి ఆరేళ్లపాటు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. తన తల్లిదండ్రులు చేస్తున్న కులవృత్తిని పదికాలాల పాటు సజీవంగా ఉంచాలని ఉద్యోగానికి గుడ్బై చెప్పి చేనేత వృత్తిని ఎంచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ చిన్న, లఘు, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కళా పునర్వి పేరిట హ్యాండ్లూమ్ నెలకొల్పి 80 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఎన్నో అవార్డులు సొంతం – 2022లో చేనేతలో నూతన ఆవిష్కరణలు, ఉపాధి కల్పనకు గాను బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డు అందుకున్నాడు. – 2018లో చేనేతలో డిజైనింగ్లో నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నాడు – 2018లో ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డు – 2014లో చిన్న మగ్గంపై జాతయ నాయకుల కళాఖండాలను రూపొందించినందుకు లిమ్కా బుక్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. -
గ్రామానికి సేవ చేసేందుకే
అడవిదేవులపల్లి : గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. బీటెక్ చదివి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న నన్ను సర్పంచ్గా పోటీ చేయమని స్థానికులు కోరడంతో ఉద్యోగం వదిలేసి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నా. గతంలో నా తండ్రి సూర్యానాయక్ ఉమ్మడి మొల్కచర్ల సర్పంచ్గా పని చేసినందుకు గ్రామ సమస్యలపై నాకు చిన్ననాటి నుంచి పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తా. పదవీ కాలం పూర్తయ్యే సరికి శాశ్వతంగా గుర్తుండేలా నా వంతుగా అభివృద్ధి చేసి చూపిస్తా. – మూడావత్ సేవానాయక్, మొల్కచర్ల సర్పంచ్ పెద్దఅడిశర్లపల్లి : ప్రస్తుతం కొండమల్లేపల్లిలో డిగ్రీ చదువుతున్నా. 24 ఏళ్లకే సర్పంచ్గా ఎన్నికయ్యా. రానున్న రోజుల్లో మల్లాపురం గ్రామంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. సమస్యలను ఒక్కొక్కటిగా తీసుకొని అధికారులు, వార్డు సభ్యులు, ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తా. ముఖ్యంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తా. – కొలుకులపల్లి చందన, మల్లాపురం సర్పంచ్ -
ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ హడావుడి
చిట్యాల: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు హడావుడి చేస్తున్నారు తప్పితే గత రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. చిట్యాల మున్సిపాలిటీలోని ఏడవ వార్డులో ఆదివారం ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నేరవేర్చలేదని, మళ్లీ మాయ మాటలతో మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. ప్రజలకు రావాల్సిన రైతుబంధు, రైతు భరోసా, ఆసరా పింఛన్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు చిట్యాల మున్సిపాలిటీలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, నాయకులు కొలను వెంకటేష్, కందాటి రమేష్రెడ్డి, జిట్ట శేఖర్, బొల్గూరి సైదులు, మేడి ఉపేందర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
సమాజాభివృద్ధిలో తోడ్పాటు
హాలియా : నూతనంగా ఏర్పడ్డ కుపాసిపల్లి గ్రామపంచాయతీని అనుముల మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో విద్యనభ్యసించాను. బహుజన వాదిగా, విద్యార్థుల సమస్యలపై కొంతకాలంగా పనిచేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నా. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా సీసీ రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీల నిర్మాణం, లైబ్రరీ ఏర్పాటు చేయటమై నా ముందున్న లక్ష్యం. ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చి మా గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా అభివృద్ధి చేయడమే నా ముందున్న లక్ష్యం. – పెరుమాళ్ల వేణుగోపాల్, కుపాసిపల్లి సర్పంచ్ -
నిధులు దుర్వినియోగం కాకుండా..
భువనగిరి: నేను వ్యవసాయం చేస్తున్నా. పెంచికల్పహాడ్ గ్రామంలో సర్పంచ్ బరిలో యువత ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ప్రోత్సహించారు. అయితే అమలుకు సాధ్యంకాని పనుల విషయంలో ముందుగానే హామీ ఇవ్వలేనని సూటిగా చెప్పా. అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటిక, పంచాయతీ భవన నిర్మాణ పనులు పూర్తి చేయిస్తా. అవసరమైన చోట్ల సీసీ రోడ్డు నిర్మాణాలు, అండర్ డ్రెయినేజీ నిర్మాణాలు చేపడుతా. గ్రామాభివృద్ధి కోసం వచ్చే నిధులు దుర్వినియోగం కాకుండా పనిచేస్తా. – మల్లికార్జున్రెడ్డి, సర్పంచ్, పెంచికల్పహాడ్, భువనగిరి మండలం -
పల్లెపాలనలో యువ తరంగాలు
ఫ సర్పంచ్గా ఎన్నికై గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న యువత ఫ ఇచ్చిన హామీలపై దృష్టి ఫ ప్రణాళికలు రూపొందించుకుని పక్కాగా అమలు చేస్తామంటున్న నవయువ సర్పంచ్లు నేడు జాతీయ యువజన దినోత్సవంకొండమల్లేపల్లి : ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన నేను 26 ఏళ్ల వయసులోనే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇటీవల జరిగిన కొండమల్లేపల్లి మండలం గుర్రపుతండా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాను. డెత్ సర్టిఫికెట్లు తీయడం, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించడం వితంతు పెన్షన్లు ఇప్పించడంతో తమ తండాలో ఆడ బిడ్డ పుడితే రూ.1,016, అమ్మాయి వివాహానికి కల్యాణ కానుకగా రూ.2,016 ఇస్తాను. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. – రమావత్ సేవానాయక్, గుర్రపుతండా సర్పంచ్ ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో యువత ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇంజనీరింగ్, సాంకేతిక విద్యతోపాటు, ఇతర ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుని గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. సోమవారం వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువ సర్పంచ్లు గ్రామాభివృద్ధికి రూపొందించుకున్న ప్రణాళికలు, వాటి అమలుకు తీసుకుబోయే కార్యాచరణ వారి మాటల్లోనే.. -
సేంద్రియ సాగులో రాణిస్తూ..
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిళ్లపాటి గోవర్ధన్రెడ్డి తన వ్యవసాయ భూమిలో సేంద్రియ వ్యవసాయ సాగు చేస్తూ రాణిస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్లో అర్ధశాస్త్రం పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలుగా భూ ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతరించి పోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణాన్ని, భూమి, నీరు పరిరక్షించుకోవడం, తగ్గిపోతున్న భూసారాన్ని కాపాడాలనే లక్ష్యంతో దేశవాళి వరి విత్తనాల వరి సాగు చేపట్టారు. తనకున్న 3 ఎకరాల విస్తీర్ణంతో పాటు మరికొంత కౌలుకు భూమి తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అదేవిధంగా 20 గుంటల విస్తీర్ణంలో 23 రకాల దేశవాళీ వరి విత్తనాల సాగు చేస్తున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్లో పుడమి పుత్ర పురస్కారం అందుకున్నారు. -
తెలంగాణ సాయుధ పోరాట యోధుడి వందవ బర్త్ డే
గరిడేపల్లి: గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరఽయోధుడు బండా పుల్లారెడ్డికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు ఆదివారం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆయన భార్య కాంతమ్మ, విజయలక్ష్మి, చంద్రశేఖర్రెడ్డి, లలిత, మురళీధర్రెడ్డి, ప్రశాంతి, పుల్లమ్మ, చంద్రమ్మ, జానకమ్మ, కోటమ్మ, ధనమ్మ, కృష్ణ, చంద్రమ్మ, రాములయ్య, సీతారామరెడ్డి పాల్గొన్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న ఆరుగురిపై కేసుసూర్యాపేటటౌన్ : సూర్యాపేటలో చైనా మాంజా విక్రయాలపై ఆదివారం ఎస్ఐలు శివతేజ్, మహేందర్నాథ్, ఏడుకొండలు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. -
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
తిప్పర్తి: యువత స్వయం ఉపాధి కోసం ప్రోత్సహిస్తా. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. గ్రామస్తులు ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, నిరంతరం వారి వెంట ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తా. గ్రామంలో ఇప్పటికే సమస్యలు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించాం. తాగు నీరు, విద్యుత్, డ్రెయినేజీ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తా. – హేమలత, పజ్జూరు సర్పంచ్ -
అమ్మా.. నాకు దిక్కెవరు
ఖమ్మంక్రైం : చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లితోనే తన జీవితం, తల్లి వెంటే తాను అన్నట్టుగా గడిపాడు. తినడానికి తిండి, ఉండడానికి గూడు కూడా లేదు. దీంతో తన కొడుకు పస్తులుండకుండా ఆ తల్లి నిత్యం భిక్షాటన చేస్తూ బాలుడి కడుపు నింపేది. అయితే ఆ చిన్నారిపై విధి వక్రించింది. యాచనతో తన కడుపు నింపే తల్లిని కూడా దూరం చేసింది. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. కోదాడకు చెందిన మోతె లక్ష్మి( 40), లక్ష్మణ్ దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగించేవారు. ఐదేళ్ల క్రితం లక్ష్మణ్ అనారోగ్యంతో మృతిచెందడంతో కుమారుడు కిట్టూను పోషించేందుకు లక్ష్మి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో కొడుకుతో సహా ఖమ్మం వచ్చి కూలి పనులు చేస్తూ కాలం గడుపుతుండగా ఆమె కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో భిక్షాటన చేస్తూ కిట్టూను పోషించేది. కాగా, ఆమె పరిస్థితి విషమించి ఆదివారం ఖమ్మం రైల్వే స్టేషన్లో తనువు చాలించింది. ఈ విషయం తెలియని తొమ్మిదేళ్ల కిట్టూ తల్లిని ఎంత లేపినా లేవకపోవడంతో బిగ్గరగా రోదిస్తుండగా ప్రయాణికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అప్పటికే లక్ష్మి మృతిచెందింది. పక్కనే కూర్చుని రోదిస్తున్న కిట్టూను వివరాలు అడగగా తన పేరు, వివరాలు తెలిపాడు. తనకు ఒక మేనత్త ఉందని, ఆమె ఆచూకీ తెలియదని చెప్పాడు. దీంతో బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించిన పోలీసులు బంధువుల ఆచూకీ కోసం కోదాడ పోలీసులను సంప్రదించారు. అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు సాయంతో మృతదేహన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ● తల్లి మృతదేహం వద్ద బాలుడి రోదన -
40 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
తుంగతుర్తి : మండల పరిధిలోని వెలుగుపల్లి జెడ్పీహెచ్ఎస్లో 1984 –85 బ్యాచ్కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు రంగారెడ్డి, అహల్య ప్రభాకర్ రెడ్డి, విమల శ్రీనివాస్రెడ్డి, పూర్వ విద్యార్థులు మైదం నారాయణ, ఎస్కే జానీ హనుమంతురెడ్డి, విట్టల్రెడ్డి, సోమరాజు, అల్లం శ్రీను, వెంకన్న, బీజాల ఇంద్ర, భారతి, మాలతి, శ్రీలక్ష్మీ, ఆయూష భాను, పద్మ, కళమ్మ, వినోద పాల్గొన్నారు. -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారంతో పాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామానికి వెళ్లే వారు యాదగిరీశుడిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ముఖ మండపం క్యూలైన్, ప్రసాద విక్రయశాల వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపించింది. శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామివారిని 35వేలమందికి పైగా భక్తులు దర్శించుకోగా.. నిత్యాదాయం రూ.39,22,539 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఆలయ ముఖ మండపంలో క్యూలైన్లో ఉన్న భక్తులు -
● వ్యవసాయం, ఉపాధి రంగాల్లో రాణిస్తున్న యువత ● నచ్చిన పనులు చేస్తూ విజయ తీరాలకు
యువతా మేలుకో.. నిద్ర నుంచి మేల్కొని గమ్యం చేరే వరకు విశ్రమించకు అనే స్వామి వివేకానంద సూక్తిని నిజం చేస్తూ యువత ముందుకు సాగుతోంది. వ్యవసాయ రంగాల్లో, కుల వృత్తుల్లో నైపుణ్యం ప్రదర్శిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విభిన్న రంగాల్లో విజయం సాధించిన వారిపై ప్రత్యేక కథనాలు. హుజూర్నగర్ : మండలంలోని అంజలీపురం గ్రామానికి చెందిన గొర్రె అశోక్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన యువ సృష్టికర్తగా గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ ఇండియా అవార్డ్స్ సీజన్–2లో టెక్ లీడ్ సోషల్ ఇన్నోవేషన్ విభాగంలో ఎంపికై గత నెలలో జాతీయ అవార్డు అందుకున్నాడు. డిస్టెన్స్లో డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావడంతో వారికి చేదోడు వాదోడుగా ఉండాలని చిన్నతనం నుంచే భావించాడు. అందులో భాగంగా వ్యవసాయ పరికరాల తయారీపై దృష్టి సారించి పత్తి, మిరప పంటల్లో విత్తనాలు వేసే యంత్రం, కలుపు తీసే యంత్రం, పురుగుల మందు పిచికారీ యంత్రాలను రూపొందించాడు. ఆతర్వాత రూరల్ రైజ్ అగ్రినరీ అనే స్టార్టప్ కంపెనీ ప్రారంభించాడు. పరికరాలను తయారు చేసి తక్కువ ధరలో రైతులకు అందుబాటులోకి తెచ్చాడు.. ఈనేపథ్యంలో అతని ప్రతిభను గుర్తించిన ఫోర్బ్స్ ఇండియా ఇటీవల అశోక్ను జాతీయ స్థాయి అవార్డుతో సత్కరించింది. -
హామీల అమలే లక్ష్యం
చౌటుప్పల్ : మాది చౌటుప్పల్ మండలం పీపల్పహాడ్ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు పులనగారి నాగేశ్వరి సర్పంచ్గా విజయం సాధించింది. కేవలం 28ఏళ్ల వయస్సున్న ఆమె పోటీ చేసిన తొలిసారే సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. నాకు వివాహం జరిగినప్పటికీ చదువును మాత్రం ఆపలేదు. ఉస్మానియా కళాశాలలో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉండి ఎంఎస్సీ జియో కెమిస్ట్రీ పూర్తి చేశా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను బలోపేతం చేయడమే నా కర్తవ్యం. – పులనగారి నాగేశ్వరి, పీపల్పహాడ్ సర్పంచ్ -
45 ఏళ్ల ఆత్మీయ సమ్మేళనం
పెద్దఅడిశర్లపల్లి : గుడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1980–81 పదో తరగతి బ్యాచ్ ఆదివారం ఆ పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుతం వివిధ స్థాయిల్లో వీరు సుమారు 45 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకుని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. వారి హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యను బోధించిన నాటి ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, మల్లయ్య, మాధవరెడ్డి, నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం అన్నారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు వడ్లపల్లి చంద్రారెడ్డి, విడియాల వెంకటేశ్వర్లు, పాశం శ్రీనివాస్రెడ్డి, సామ వెంకటేశ్వర్రెడ్డి, సముద్రాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క రోజే 40 వేలకుపైగా..
హైవేపై సాఫీగా వాహనాల రాకపోకలు చిట్యాల, నకిరేకల్, కేతేపల్లి : సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు ఆదివారం వాహనాల రద్దీ కొనసాగింది. పండగకు స్వస్థలాలకు వెళ్లేవారి వాహనాలతో 65వ నంబరు జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో 18 నుంచి 20 వేల వాహనాలు కొర్లపహాడ్ టోల్ప్లాజా నుంచి రాకపోకలు సాగిస్తుండగా ఆదివారం ఒక్కరోజే దాదాపు 40 వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ అధికారులు పేర్కొన్నారు. అయితే.. హైవేపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించాయి. కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్కు అంతరాయం కాకుండా చర్యలు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ట్రాఫిక్ పోలీసులను రప్పించి వాహనదారులకు సూచనలు చేస్తూ టోల్ప్లాజా వద్ద వాహనాలు నిలవకుండా చూశారు. హైవేపై ట్రాఫిక్జాం ఏర్పడుతుండడంతో పలువురు ప్రయాణికులు తమ కుటుంబసభ్యులతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు చిట్యాల మీదుగా ఆదివారం బైక్లపై ప్రయాణించారు. ప్రజలు రోడ్డు దాటేలా.. చిట్యాలలోని బస్స్టేషన్, పాల కేంద్రం, రైల్వేస్టేషన్ రోడ్డు ఎదురుగా ప్రజలు రోడ్డును దాటేందుకుగాను తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతాల్లో పోలీసులతో పాటు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్డు దాటేందుకుగాను ప్రజలకు సహకరించారు. ప్రమాదాలు జరిగితే వెంటనే తగిన ప్రథమ చికిత్స అందించేందుకుగాను చిట్యాలలోని పాలకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పికెట్లో ప్రత్యేకంగా ప్రభుత్వ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. పట్టణంలోని కాలనీల నుంచి హైవే సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు, ద్విచక్ర వాహనాలు నేరుగా హైవే మీదకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కాగా.. మండలంలోని పెద్దకాపర్తి శివారులో ఆదివారం మధ్యాహ్నం హైవే రోడ్డు మధ్యలో కొన్ని చెట్లకు ప్రమాదవశాత్తు నిప్పుంటుకుంది. గుర్తించిన పోలీసులు వెంటనే మంటలను ఆర్పివేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిన సిగరెట్ పీకను పడేయటంతో మంటలు లేచినట్లు తెలుస్తోంది. రెండు రెట్లు పెరిగిన వాహనాలు సాధారణ రోజుల్లో వచ్చే వాహనాల కంటే ఆదివారం రెండురెట్ల వాహనాలు రావటంతో కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఉన్న 12 కౌంటర్లకు గాను 7 కౌంటర్లను విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు కేటాయించారు. విజయవాడ వైపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాహనాల రద్దీ తగ్గుముఖం పట్టగా సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్ వైపునకు వాహనాల రద్దీ పెరిగింది. వాహనాల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం టోల్ నిర్వాహకులు, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. టోల్ అధికారులు, ఇతర సిబ్బంది, కేతేపల్లి ఎస్ఐ యు.సతీష్ టోల్ప్లాజా వద్దనే మకాం వేశారు. ట్రాఫిక్ను పరిశీలించిన ఏఎస్పీ రమేష్ జాతీయ రహదారిపై ట్రాపిక్ అంతరాయం జరగకుండా తగిన ముందస్తు చర్యలను తీసుకున్నట్లు ఏఎస్పీ రమేష్ తెలిపారు. చిట్యాల మండలంలోని చిట్యాల, పెద్దకాపర్తి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డ్రోన్ కెమెరాల ద్వారా హైవేపై ట్రాఫిక్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణతో పాటు వాహనాలు వేగంగా వెళ్లేందుకుగాను పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్ ఉన్నారు. ఫ ట్రాఫిక్ నియంత్రించిన పోలీసులు ఫ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పర్యవేక్షణ ఫ ద్విచక్ర వాహనాలపై ఎక్కువ సంఖ్యలో వెళ్లిన ప్రజలు ఫ కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద వాహనాల బారులు -
బహిరంగ సభను జయప్రదం చేయాలి
దేవరకొండ : ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న సీపీఐ బహిరంగసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం దేవరకొండలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిందని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎర్ర జెండా ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలను అసెంబ్లీ, పార్లమెంట్లోనూ గలమెత్తిన పార్టీ సీపీఐ అన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు దేవరకొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు పల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, కనకాచారి, పల్లె నర్సింహ, తూం బుచ్చిరెడ్డి, దేప సుదర్శన్రెడ్డి, వెంకటయ్య, వెంకటరమణ, జయరాములు, నూనె రామస్వామి, వలమల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పద్మానగర్ జంక్షన్ మూసివేత
హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారిపై బాక్ల్ స్పాట్గా ఉన్న నకిరేకల్ పట్టణ శివారులోని పద్మానగర్ జంక్షన్ క్రాసింగ్ను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. సంక్రాంతి పండుగు నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండడం.. ఈ జంక్షన్ వద్ద రోడ్డు క్రాసింగ్ చేస్తూ నకిరేకల్ నుంచి హైదారాబాద్ వైపునకు ఆర్టీసీ బస్సులతో పాటు, ఇతర వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి. రోడ్డు క్రాసింగ్ చేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందుస్తుగా స్థానిక పోలీసులు ఈ రోడ్డు క్రాసింగ్ను మూసివేయించారు. నకిరేకల్ నుంచి నల్లగొండ, హైదరాబాద్ వైపునకు వేళ్లే వాహనదారులు చీమలగడ్డ అండర్ పాసింగ్ నుంచి తాటికల్ రోడు అండర్ పాసింగ్ సర్వీస్ రోడ్ల గుండా హైవే పైకి మళ్లీంచారు. పద్మానగర్ కాలనీ వాసులు నకిరేకల్కు రావాలన్నా చందంపల్లి ఫ్లైవర్ వంతెన పైనుంచి రావాలని నకిరేకల్ సీఐ వెంకటేశం సూచించారు. -
రైతు వేదికల నిర్వహణ భారం
నల్లగొండ అగ్రికల్చర్ : గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికలు నిర్వహణ భారంగా మారింది. కానీ మూడు సంవత్సరాలుగా వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కావడం లేదు. నెలనెలా చేతి నుంచే డబ్బులను వెచ్చించాల్సి వస్తుందని వ్యవసాయ విస్తరణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 140 వేదికలకు గాను ఇప్పటి వరకు సుమారు రూ.3 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఆ నిధులు రాకపోవడంతో వేదికల నిర్వహణ విషయంలో ఏఈఓలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 140 రైతు వేదికలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ను ఏర్పాటు చేసి ఒక్కోదానికి రూ.22 లక్షలు ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా 140 రైతు వేదికలను నిర్మించింది. వారం వారం వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణనిస్తు సీజన్లో పంటల వారీగా సాగులో మెళకువలను తెలియజేయాలనేది రైతు వేదికల లక్ష్యం. ఈ వేదికల నిర్వహణ బాధ్యతలను క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించింది. వేదికల నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.9 వేల చొప్పున నిధులను కూడా విడుదల చేసింది. ఆ నిధులతో వేదికను శుభ్రం చేయించడం, ఇతర కార్యక్రమాలు చేపట్టేవారు. ఆ 9 వేల రూపాయలు చాలక వ్యవసాయ విస్తరణ అధికారులకు అదనంగా చేతి నుంచి ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే ఏఈఓలు చేతి నుంచి ఖర్చు పెడుతూ నిధులు వచ్చినప్పుడు తీసుకునేవారు. ప్రతి వారం వీడియో కాన్పరెన్స్లు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం జిల్లాలోని రైతు వేదికల ద్వారా వీడియో కాన్పరెన్స్లు నిర్వహిస్తోంది. రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరవుతున్నారు. వారికి ప్రతివారం స్నాక్స్, బిస్కెట్లు, టీ తదితర ఖర్చులకు నిధులు లేకపోవడంతో అదనంగా తామే భరించాల్సి వస్తోందని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. రైతు వేదికల నిర్వహణ నిధులు ప్రభుత్వం విడుదల చేయగానే వ్యవసాయ విస్తరణ అధికారుల ఖాతాల్లో జమ చేస్తాం. నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. – శ్రవణ్కుమార్, డీఏవో, నల్లగొండఫ మూడేళ్లుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం ఫ సుమారు రూ.3 కోట్లమేర పెండింగ్ ఫ ఏఈఓలపై తప్పని భారంవివరం ఖర్చు.పరిశుభ్రతకు 3,000 శిక్షణకు 2500 స్టేషనరీ 1000 కరెంట్ బిల్లు 1000 మరమ్మతులు 1000 తాగునీరు 500 మొత్తం 9,000 -
డ్రాయింగ్ పరీక్ష ప్రశాంతం
నల్లగొండ టూటౌన్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు రెండవ రోజు ఆదివారం నల్లగొండలో డ్రాయింగ్ లోయర్ అండ్ హైయర్, టైలరింగ్ హైయర్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఉదయం జరిగిన పరీక్షకు 875 మంది అభ్యర్థులు హాజరు కాగా 241 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 993 మందికి గాను 760 మంది హాజరు కాగా, 233 మంది గైర్హాజరైనట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్గా కార్తీక్హాలియా : హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామానికి చెందిన తగుళ్ల కార్తీక్ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి 16 వరకు హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాలో జరిగే అండర్–19 జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించనున్నారు. తనను ప్రోత్సహించిన అనుముల స్పోర్ట్ క్లబ్ కబడ్డీ కోచ్ కాకునూరి రాము, నరేష్, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి డోమినిక్, పీడీ వెంకటరామిరెడ్డి, రమేష్గౌడ్కి కార్తీక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాత పింఛన్ కోసం పోరాటంనల్లగొండ : పాత పింఛన్ విధానం కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని ఆలిండియా న్యూ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎన్పీఎస్ఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. బుధవారం నల్లగొండలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకంలో ఉన్నారని తెలిపారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్య పింఛను పథకం ప్రారంభం అయ్యిందన్నారు. సీపీఎస్లో ఉన్న ఉద్యోగికి ఆర్థిక, సామాజిక భద్రత కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. శివన్నగూడెం పనుల అడ్డగింతమర్రిగూడ : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని శివన్నగూడెంలో నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు ఆదివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పనులను నడవనీయమని హెచ్చరించారు. ప్రజాకవి అలిశెట్టి జయంతిరామగిరి(నల్లగొండ): సమాజాన్ని ప్రభావితం చేసే ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవులు అరుదుగా ఉంటారని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్కుమార్ అన్నారు. నల్లగొండ ఎన్జీ కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు పున్నమి అంజయ్య, నర్సింహ, లింగస్వామి, అంజయ్య, గిరి, రాములు, లింగమూర్తి, కొండ కృష్ణ, జగదీష్, శ్రీనివాసరావు, కలీం, మహ్మద్ పాషా, శంకరయ్య పాల్గొన్నారు. -
చైనా మాంజాకు చెక్ పెట్టేలా..
నల్లగొండ : జనవరి నెలలో ప్రధాన పండుగైన సంక్రాంతి వస్తుందంటే పిల్లలకు గుర్తుకు వచ్చేది గాలిపటాలు (పతంగులు)ఎగురవేయడమే. పిల్లలే కాదు పెద్దలు కూడా సంతోషంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పక్కనోడి గాలిపటాన్ని పడేయాలని తెగ ఆసక్తి చూపిస్తారు. అయితే గాలిపటాలను ఎగురవేసేందుకు సంప్రదాయ దారాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉన్నా అది బలంగా లేక తెగిపోతుందని కొందరు నిషేధిత చైనా మాంజాను వినియోగిస్తుంటారు. ఈ మాంజా మనుషులు, జంతువులు, పక్షులకు ముప్పు తెచ్చిపెడుతోంది. నిషేధిత చైనా మాంజాను కొందరు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా మాంజా వినియోగించొద్దని, మీ సరదా కోసం ఇతరుల ప్రాణాల మీదకు తేవొద్దని పోలీసులు అంటున్నారు. నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగం వద్దని సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. చాటుమాటుగా ఎవరైనా అమ్మితే తమకు సమచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా కొందరు వ్యాపారులు చైనా మాంజాను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే చైనా మాంజా విక్రయించకుండా, వాడకుండా దుకాణదారులు, వియోగదారులను కట్టడి చేస్తే ప్రమాదాలు జరగవని ప్రజలు అంటున్నారు. ఫ సోషల్ మీడియా ద్వారా ముమ్మర ప్రచారం ఫ గాలిపటాలు ఎగురవేసేందుకు సంప్రదాయ దారం వాడాలి ఫ నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే సమాచారం ఇవ్వండి ఫ పేర్లు గోప్యంగా ఉంచుతామంటున్న పోలీసులు -
టోల్ప్లాజాల వద్ద కొనసాగుతున్న రద్దీ.. వాహనదారుల ఆగ్రహం!
సాక్షి, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారి-65పై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి ఇప్పటికే లక్షలాదిగా పట్నంవాసులు ఏపీకి తరలి వెళ్లారు. ఇవాళ రాత్రి వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. లక్షలాదిగా వాహనాలు ఏపీ వైపు వెళ్లడంతో టోల్ ప్లాజా నిర్వాహకులకు సైతం భారీగా ఆదాయం వస్తోంది. మరోవైపు.. ఆదాయం వస్తున్నా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని వాహనదారులు మండిపడుతున్నారు. -
నల్లగొండ: కొర్లపహాడ్ వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం
నల్లగొండ: జిల్లాలోని కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. కొర్లపహాడ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి, ముందు వెళ్తోన్న వాహనాన్ని తిరువూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ముందు వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్గా బ్రే్క్ వేయడంతో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బస్సులు మెల్లగానే వెళ్తూ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. పలువురు స్వల్ప గాయాలతోనే బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
వాహనదారులు హెల్మెట్ ధరించాలి
మిర్యాలగూడ అర్బన్ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) చేపట్టిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసులు చేపట్టిన నో హెల్మెట్ – నో పెట్రోల్ కార్యక్రమం విజయవంతమైందన్నారు. హెల్మెట్లను ఇళ్లలో గోడలకు, స్కూటీ డిక్కీల్లో పెట్టకుండా తలకు ధరించి వాహనం నడపాలన్నారు. సబ్కలెక్టర్ అమిత్ నారాయణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బీఎల్ఆర్ ఏ పని తలపెట్టినా పూర్తి అంకితభావంతో చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే బీఎల్ఆర్ మాట్లాడుతూ మానవ ప్రయత్నంగా ప్రస్తుతం 500 మందికి హెల్మెట్లు పంచినట్లు చెప్పారు. శివరాత్రి వరకు పట్టణంలో అందరికీ హెల్మెట్లు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐలు ప్రసాద్, నాగభూషణం, సోమనర్సయ్య, ఎన్ఐలు నాయకులు నూకల వేణుగోపాల్రెడ్డి, గాయం ఉపేందర్రెడ్డి, పొదిల శ్రీనివాస్, కొమ్మన నాగలక్ష్మి పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
చిరునామా ఆధారం
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లోని ఇటీవల అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 9న ముగిసింది. వార్డుల వారీగా రాజకీయ పార్టీలు, స్థానిక ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలపై మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పరిశీలిన ప్రారంభించారు. పరిశీలన పూర్తిచేసి చిరునామా ఆధారంగా తుది ఓటరు జాబితాను తయారు చేయనున్నారు. ఫిర్యాదులను క్రోడీకరించి.. వార్డుల్లో ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు క్రోడీకరించి వార్డుల హద్దులు, కాలనీల్లో ఉన్న ఓటర్లు, ఓటరు కార్డుపై ఉన్న చిరునామా ఆధారంగా పరిశీలిస్తున్నారు. పరిశీలన పూర్తి చేసి ఈ నెల 12న వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. 13న పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రదర్శిస్తారు. దాంతో పాటు టీ పోల్ యాప్లో జాబితాను అప్లోడ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 16న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. నీలగిరిలో అధికారిక ఆదేశాలు అందితేనే.. నీలగిరి కార్పొరేషన్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ కోసం కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించిన అధికారులు తుది ఓటరు జాబితాను ప్రదర్శించకుండా నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. నీలగిరి కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే. ఈ బిల్లు రాష్ట్ర గవర్నర్ వద్దకు చేరగా గెజిట్ విడుదల కావాల్సి ఉంది. ఈ నెల 12 లేదా 13న గవర్నర్ నుంచి గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఒక వేళ జాప్యం జరిగితే సంక్రాంతి తరువాత విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అందుకే మున్సిపల్ ఉన్నతాధికారులు తుది ఓటరు జాబితా ప్రకటనను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఆదేశాలు రాకపోవడంతో ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారమే ఓటరు జాబితా రూపొందించే పనులను అధికారులు చేస్తున్నారు. ఫ మున్సిపాలిటీల్లో ఓటరు తుది జాబితా రూపకల్పన ఫ ముగిసిన అభ్యంతరాల స్వీకరణ ఫ 16న ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితా ప్రకటన ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. ఈ నెల 12న వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు జాబితాను ప్రదర్శిస్తాం. ఎన్నికల నిబంధనల ప్రకరమే ఓటరు జాబితాను ప్రచురిస్తున్నాం. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ -
రైతు భరోసా రాదాయే..
యాసంగి సీజన్ రైతు భరోసా సకాలంలో ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీపై అప్పు చేయాల్సి వచ్చింది. వెంటనే భరోసా సాయాన్ని అందించాలి. – పనస కాశయ్యగౌడ్, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం నల్లగొండ అగ్రికల్చర్ : రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గత యాసంగి సీజన్లో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జనవరి 26న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాసంగి సీజన్ గత నవంబర్లో ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు సీజన్ ముగియనుంది. కానీ ఇప్పటి వరకు యాసంగి సీజన్ రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. 6,57,229 ఎకరాల్లో సాగు యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 6,57,229 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా చేసింది. అందులో వరి 5,64,678 ఎకరాల్లో సాగువుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా వరినాట్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. పెట్టుబడుల కోసం అప్పులు యాసంగి సీజన్లో రైతు భరోసా అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకర్లు కూడా పంట రుణాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రైతులు అధిక వడ్డీపై అప్పులను తీసుకొచ్చి యాసంగి పంటలు సాగు చేస్తున్నారు. 5,65,803 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులున్నారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.738 కోట్ల 67 లక్షల 60 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఎ లాంటి ప్రకటనా చేయకపోవడంతో రైతులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతుల భరోసాను వెంటనే జమ చేయాలని కోరుతున్నారు. ఫ యాసంగి సీజన్ ముగుస్తున్నా అందని సాయం ఫ పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు -
వీ బీ జీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామసభలు
● డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నల్లగొండ : కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న వీ బీ జీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తు ఈ నెల 20 నుంచి 30 వరకు గ్రామసభలు నిర్వహించి.. ఆ చట్టానికి వ్యతిరేకంగా తీర్మాణాలు చేయాలని నిర్ణయించామని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ తెలిపారు. శనివారం నల్లగొండలోని యాదవ సంఘం భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మార్చి పేదలకు మరణ శాసనం రాసిందని ధ్వజమెత్తారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీజీరామ్జీ చట్టంలో పని దినాలు పెరిగినా కూలీలకు ప్రయోజనం లేదన్నారు. పనులు దొరక్క ప్రజలు.. పట్టణాలకు పోతే గ్రామాల్లో ఉన్న ఆస్తులను కార్పొరేట్లకు అప్పచెప్పాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పాత ఉపాధి హామి చట్టం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్తగా తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా జిల్లాలో ఫిబ్రవరి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని.. ఈ సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీను, ఎండీ.ముంతాజ్ అలీ, కన్నారావు, వెంకటయ్య, గౌతమ్, శివ, వెంకట్గౌడ్ పాల్గొన్నారు. -
భారీగానే.. గౌరవం!
సాక్షి ప్రతినిది, నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్లో మేయర్ అయ్యే రూ.65 వేల గౌరవ వేతనం అందనుంది. నీలగిరి మున్సిపాలిటీ.. కార్పొరేషన్ కావడంతో ఆ మేరకు ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు ప్రయోజనాలు లభించనున్నాయి. కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్కు, కార్పొరేటర్లకు కూడా గౌరవ వేతనాలు భారీగా లభించనున్నాయి. కార్పొరేషన్ పరిధిలో వివిధ శాఖల్లో పనిచేసే దాదాపు 2 వేల మంది ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కూడా పెద్ద మొత్తంలో పెరగనుంది. భారీగా ఆర్థిక ప్రయోజనం మేయర్ అయ్యే వారికి పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు మున్సిపాలిటీలో చైర్మన్గా ఉన్న వారికి నెలకు రూ.19,500 గౌరవ వేతనం ఉంది. ఇప్పుడు కార్పొషన్లో మేయర్ అయ్యే వారికి నెలకు రూ.65 వేల వేతనం లభించనుంది. ఇక మున్సిపల్ వైస్ చైర్మన్కు నెలకు రూ.9,750 గౌరవ వేతనం ఉండగా.. డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యే వారికి నెలకు రూ.32,500 గౌరవ వేతనం లభించనుంది. కార్పొరేటర్లకు రూ.7,800 వేతనం ఇప్పటి వరకు మున్సిపల్ కౌన్సిలర్గా పని చేసిన వారికి నెలకు రూ.4,550 గౌరవ వేతనం ఉండేది. నల్లగొండ కార్పొరేషన్ కావడంతో కౌన్సిలర్ స్థానం కార్పొరేటర్గా మారనుంది. దీంతో కార్పొరేటర్గా గెలిచే వారికి ప్రతి నెలా గౌరవ వేతనం రూ.7500 లభించనుంది. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపొందే 48 మంది కార్పొరేటర్లకు ఇది వర్తించనుంది. కార్పొరేషన్ పరిధిలో రూ.2 లక్షలకుపైగా జనాభా ఉంటే కార్పొరేషన్ పరిధిలో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెరగనుంది. ప్రస్తుతం నల్లగొండ 2,43,615 జనాభాతో కార్పొరేషన్గా అవతరించబోతోంది. దీంతో కార్పొరేషన్ పరిధిలో పనిచేసే దాదాపు రెండు వేల మంది ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెరగనుంది. ప్రధానంగా కలెక్టరేట్ పరిధిలో 500 మంది వరకు ఉద్యోగులు ఉండగా, జిల్లా వైద్యారోగ్య శాఖ, ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల, వ్యవసాయ, సంక్షేమ, విద్య, పోలీసు ఇతరత్రా అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని వివిధ శాఖల కార్యాలయాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం 50 వేలకు పైగా జనాభా కలిగిన మున్సిపాలిటీలో వారికి 13 శాతం హెచ్ఆర్ఏ వస్తోంది. ఇక కార్పొరేషన్ కానుండడంతో ఇక్కడ 17 శాతం హెచ్ఆర్ఏ లభించనుంది. దీంతో ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఫ నీలగిరి కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులకు పెరగనున్న గౌరవ వేతనాలు ఫ ఉద్యోగుల హెచ్ఆర్ఏ కూడా 17 శాతానికి పెరుగుదల ఫ రెండు వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం -
పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్టడీ సర్కిల్స్లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శశికళ, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.నర్సింహారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్టడీ సర్కిల్లో ప్రవేశాలకు పోటీ పరీక్షలో అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పరీక్ష హాల్ టికెట్లు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని.. పోటీ పరీక్ష ఫిబ్రవరి 8న ఉదయం 11 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరుగుతుందని తెలిపారు. అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 20 నుంచి జూలై 19, 2026 శిక్షణలో కొనసాగుతారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 84650 35932, 96031 67257 ఫోన్ నంబర్లఅను సంప్రదించాలని సూచించారు. పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీనే ప్రామాణికంరామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ అన్నారు. మండలంలోని మేళ్ల దుప్పలపల్లిలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్ తరహాలో ప్రభుత్వం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రశాంతంగా టీసీసీ పరీక్షలునల్లగొండ టూటౌన్ : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో నిర్వహించిన వివిధ టెక్నికల్ కోర్సు పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. ఉదయం నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ అండ్ హైయర్, టైలరింగ్ లోయర్ అండ్ హైయర్ పరీక్షలకు 1,378 మందికి గాను 1,049 మంది హాజరయ్యారని, 329 మంది గైర్వాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 1,047 మంది అభ్యర్థులు హాజరు కాగా, 331 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. ఏసీబీ దాడులపై ముందే సమాచారం!నల్లగొండ : అవినీతికి పాల్పడిన వారిని అరికట్టాల్సిన ఏసీబీ వారే ముందస్తు దాడులు జరుగుతున్నాయనే సమాచారం ఇచ్చి వారినుంచి డబ్బులు వసూలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లగొండ ఏసీబీలో పనిచేస్తున్న ఒక సీఐ, ఒక హోంగార్డు ఈ తతంగానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాంపల్లి, మఠంపల్లి, గరిడేపల్లిలో గతంలో పనిచేసిన ఎస్ఐలపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దానిపై ముందే వారికి మీపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయంటూ సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. మఠంపల్లి ఎస్ఐకి ఏసీబీ ట్రాప్ సమాచారం ముందే ఇచ్చి రూ.10 లక్షలకు సెటిల్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులే ముందే సమాచారం లీక్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం విస్మయం గొల్పుతోంది. -
నిరాటోత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవికి నిరాటోత్సవాలను అర్చకులు ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ నీరాటోత్సవాల్లో శ్రీస్వామి వారి నిత్య కల్యాణ సేవతో పాటు గోదాదేవిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాఢ వీధుల్లో అమ్మవారి సేవతో పాటు శ్రీస్వామి వారి గజవాహన సేవను ఊరేగించారు.మధ్యాహ్నం ఉత్సవ మండపంలో అమ్మవారికి కట్టెపొంగళిని ఆరగింపుగా పెట్టారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14 రాత్రి ఆలయంలో గోదాదేవి అమ్మవారి కల్యాణోత్సవం, 15 ఉదయం 11.45గంటలకు వడి బియ్యం సమర్పించే వేడుకలను నిర్వహిస్తున్నామని అర్చకులు వెల్లడించారు. -
సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
నల్లగొండ టూటౌన్ : ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టర్ ఎదుట నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, జిల్లాకార్యదర్శి అద్దంకి రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి వెంకన్న, ఉమ్మడి జిల్లా కన్వీనర్ అప్పల మధు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జోగు అంజన్న, షేక్ చాంద్పాషా, చింత స్వామి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ కలెక్టరేట్ ఎదుట ఉద్యమకారుల దీక్ష -
చెర్వుగట్టులో దుకాణాల నిర్వహణకు టెండర్లు
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి ఆలయంలో దుకాణాలతో పాటు వివిధ పనుల నిర్వహణ హక్కుల కోసం శనివారం బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈఓ కార్యాలయంలో వీటిని నిర్వహించారు. కొండపైన టోల్గేట్ నిర్వహణ, కొబ్బరిచిప్పల సేకరణ, టాయిటెట్ బ్లాక్ నిర్వహణ, కొండకింద కూల్డ్రింక్స్ షాపు, హోటల్, అమ్మవారి వస్త్రాల సేకరణ, క్యారీ బ్యాగుల విక్రయం, నందిసర్కిల్ వద్ద షాప్ నంబర్– 2, షాప్ నంబర్– 4, షాప్ నంబర్– 5, షాప్ నంబర్– 6, ఆవులకు పచ్చిగడ్డి అమ్ముకునే హక్కు కోసం వేలం నిర్వహించారు. టెండర్ల నిర్వహణ ద్వారా ఆలయానికి రూ.1,87,34,528 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది రూ.1,21,36,777 రాగా ప్రస్తుతం వేసిన టెండర్లకు రూ. 65,97,751 అధికంగా వచ్చిందని ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. కార్యక్రమంలో చెర్వుగట్టు సర్పంచ్ నేతకాని కృష్ణయ్య, దేవాలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరఽశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఆలయానికి రూ.1.87 కోట్ల ఆదాయం -
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు.. మంత్రి కోమటిరెడ్డి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా, ఛానెల్స్లో మహిళా అధికారులపై పనికట్టుకుని వార్తలు ప్రసారం చేయడాన్ని, రాయడాన్ని ఖండిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర వార్తలు వస్తే ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడతారు. బాధ పడుతారని ఆలోచన చేయాలంటూ హితవు పలికారు. ఇదే సమయంలో తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అధికారుల బదిలీలు సీఎం, సీఎస్ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు. ఐఏఎస్, IPS కావాలంటే ఎంతో కష్టపడాలి. ఐఏఎస్ అధికారులకు సెలవులు ఉండవు. ఐఏఎస్, IPS అధికారుల బదిలీలు సర్వసాధారణం. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్న.. మీకు కుటుంబాలు ఉంటాయి. రాసే వారికి భార్య పిల్లలు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయి.. మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో సీఎం పై విమర్శలు వచ్చాయి.. లిమిట్ లేకుండా పోయింది.ఆ ఐఏఎస్ అధికారి స్థానంలో ఉండి మీరు ఆలోచన చేసుకోండి. మహిళలు ఉద్యోగాలు చేయడమే తప్పా!. మంత్రుల ఇళ్లలో ఇబ్బందులు పెట్టి.. మహిళా అధికారులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు. మమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనుకుంటే వేసుకోంది. ఫోన్ మాట్లాడకపోతే.. ఫోన్ ఎత్తకపోతే అసత్య వార్తలు రాస్తారా?. ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే అధికారులతో రివ్యూ ఎప్పుడు చేయాలి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా... ఇలాంటి వార్తల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎదుటివాడు బాధపడితే స్పందించే గుణం నాది. నాలాంటి వాడిని ఏడుపిస్తా అనుకుంటే ఏడిపించండి. ఇప్పటికే కొడుకును కోల్పోయి ఏడుస్తున్నాను.సినిమాపై క్లారిటీ.. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను. పుష్పా సినిమా వివాదం తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం బంద్ చేసాను. రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతి ఫైల్ నా దగ్గరకి రాలేదు. నాకు తెలియకుండానే రెండు సినిమాల జీవోలు వచ్చాయి. నేను సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టలేదు.. పెట్ట దల్చుకోలేదు. నిప్పులాగా బతికిన వాడిని ఇలా మానసికంగా బాధ పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్లను దేవుడే శిక్షిస్తాడు. జిల్లా మంత్రిగా రివ్యూ పెడితే అధికారులు పక్కన కూర్చోవడం తప్పా?. ఎన్నో విమర్శలు వచ్చినా ఆరుసార్లు గెలిచాను. వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
జిల్లా స్థాయి ఆంగ్ల ప్రతిభా పోటీలు
రామగిరి(నల్లగొండ): పట్టణంలోని డైట్ కళాశాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఆంగ్ల ప్రతిభ పోటీలను శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భాషా నైపుణ్యాలు అభివృద్ధి పరిచే కార్యక్రమంగా ఒలంపియాడ్, ఎడ్యుటాక్ అంశాలతో ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె.నర్సింహ, ఎల్టా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నరేందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎండీ.అబ్బాస్, ప్రధాన కార్యదర్శి కె.బాలరాజు, ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ఎం.అనిల్కుమార్, కోశాధికారి ఏ.రాధాకిషన్, ఎన్.విష్ణు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు పెంచాలి
తిప్పర్తి : పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం తిప్పర్తి పీహెచ్సీని ఆయన సందర్శించారు. రికార్డులు పరిశీలించి, మందుల పంపిణీ, వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని పేషంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, వైద్యులు మమత, నవనీత, షాబుద్దిన్ పాల్గొన్నారు. జీజీహెచ్లో హెల్ప్ డెస్క్నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో రోగుల కోసం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఇటీవల బాధ్యతలను స్వీకరించిన సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహారావు నేత రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వైద్యం పొందడంలో ఆలస్యం కాకుండా సకాలంలో రోగులకు వైద్యం అందాలనే లక్ష్యంతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం, అత్యవసర విభాగం, అవుట్ పేషంట్ రోగుల విభాగాల్లో శుక్రవారం హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయించారు. హెల్ప్ డెస్క్లలో సిబ్బంది ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఇక ఎంసీహెచ్ వద్ద పాదరక్షలు విడిచేందుకు ప్రత్యేకంగా స్టాండ్లను ఏర్పాటు చేయించి.. అక్కడ ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. అత్యవసర విభాగం గేటు వద్ద ప్రత్యేకంగా సీసీ కెమరాలను ఏర్పాటు చేయించారు. రోగులకు అందించే డైట్ వివరాలను ప్రతి వార్డులో డిస్ప్లే చేయాలని, రోగులకు స్కానింగ్, ఇతర పరీక్షల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. నార్కట్పల్లి ఎస్ఐ ఎస్పీ ఆఫీస్కు అటాచ్నార్కట్పల్లి : నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ను ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో ఆయనను వీఆర్కు అటాచ్ చేసినట్లు తెలిసింది. ఆయన స్థానంలో చిట్యాల ఎస్ఐ రవికుమార్కు.. నార్కట్పల్లి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. -
సంక్రాంతికి వస్తున్నాయ్
రైతుల చెంతకు యాంత్రీకరణ పరికరాలు నల్లగొండ అగ్రికల్చర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన(2018)లో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాంత్రీకరణ పథకం అమలు చేసి రైతులకు సబ్సిడీపై పరికరాలను అందించాలని నిర్ణయించింది. 2024 సంవత్సరానికి గాను జిల్లాకు 1.81 కోట్ల నిధులను కేటాయించింది. 2025 మార్చి 31లోగా పరకరాలను పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పరికరాల పంపిణీకి మోక్షం లభించలేదు. తిరిగి 2025 సంవత్సరానికి గాను పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.8 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం వాటా ఉంటుంది. గతంలోనే కొందరిని ఎంపిక చేయగా.. ప్రస్తుతం మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్ ఇచ్చేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. సబ్సిడీ ఇలా.. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు ఇచ్చే సబ్సిడీలో ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు పరికరం ధరలో 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రైతు ఎంపిక చేసుకున్న కంపెనీ ధరలో సబ్సిడీ పోను మిగతా వాటా డబ్బులను రైతు డీడీ రూపంలో దరఖాస్తుతో అందించాల్సి ఉంటుంది. పరికరాలు ఇవే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం యాంత్రీకరణ పరికరాలను పెద్ద సంఖ్యలో కేటాయించింది. పవర్ టిల్లర్లు 50, బ్రష్కట్టర్స్ 83, పవర్టిల్లర్లు 58, మేజ్సెల్లర్స్ 20, స్ట్రాబెల్లర్స్ 90, చేతిపంపులు 8,289, పవర్ స్ప్రేయర్స్ 1,047, రోటోవేటర్స్ 463, విత్తనాలు, ఎరువులు వేసే పరికరాలు 107, ట్రాక్టర్ పనిముట్లు 475, బండ్ ఫార్మర్స్ 45 జిల్లాకు కేటాయించింది. ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ ఆయా నియోజకవర్గ, మండలాల వారీగా పరికరాలను కేటాయించి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పండుగ తరువాత పంపిణీ చేసేలా.. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను జిల్లాలో సంక్రాంతి పండుగ తరువాత పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల లబ్ధిదారుల ఎంపిక చేసింది. అయితే దాదాపు 10 వేల వరకు పరికరాలు ఉండగా.. ఐదు వేలలోపే దరఖాస్తులు రావడంతో.. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరణ చేపట్టారు. పండుగలోపు ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళికను తయారు చేసింది. శుక్రవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరికరాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. పండుగ తరువాత జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పరికరాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది.సబ్సిడీపై అందించే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి. సంక్రాంతి పండుగ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రైతులు తమ పరిధిలోని వ్యవసాయాధికారులను సంప్రదించి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ ఫ జిల్లాకు రూ.8 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఫ కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ఫ పండుగ తర్వాత పంపిణీకి సన్నాహాలు -
చెర్వుగట్టులో సౌకర్యాలు కల్పించాలి
నార్కట్పల్లి : చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం దేవాలయ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్యం, నీరు, బారికేడ్లు, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎక్కువ శాతం సిబ్బందిని కేటాయించాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు గట్టు పైకి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయానికి రూ.వంద కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని, వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డితో శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు కొనసాగించాలని తెలిపారు. హయత్నగర్ నుంచి నేరుగా చెర్వుగట్టుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఆర్డీఓ అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఈఓ మోహన్బాబు, సర్పంచ్ నేతగాని కృష్ణ, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంపీ కిరణ్కుమార్రెడ్డి -
క్రీడలతో ఓర్పు
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : క్రీడలు శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఓర్పును ఇస్తాయని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్లో ఐదు రోజులపాటు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్–2025 ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు.. ఒక ఉద్యోగం కాదని, బాధ్యత అని చెప్పారు. దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొని విధులు నిర్వహించే పోలీసులకు స్పోర్ట్స్ మీట్ నూతన ఉత్తేజాన్ని కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంతర్గత దారులు అస్తవ్యస్తం
హాలియా : హాలియా మున్సిపాలిటీలోని శివారు ప్రాంతాల్లో అంతర్గత రహదారులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పట్టణంలోని సాయినగర్ కాలనీ, వీబీ నగర్ కాలనీ, శాంతినగర్, గంగారెడ్డినగర్, అనుముల వారిగూడెం ప్రాంతాల్లో సీసీ రోడ్లు లేక ఆయా కాలనీలో నేటికి మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితేచాలు.. మట్టి రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా నడవలేని స్ధితికి చేరుతుండడంతో ప్రజలకు బాధలు తప్పడం లేదు. వర్షాకాలంలో వర్షపునీరంతా మట్టి రోడ్డు గుంతల్లోకి చేరడం వల్ల రోడ్లన్నీ చిత్తడిచిత్తడిగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చండూరు : మున్సిపాలిటీలో రోడ్లు మురుగుకాల్వలను తలపిస్తున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక ఇళ్లలోని నీరు వీధుల్లో పారుతోంది. దీంతో అంతర్గత రహదారులన్నీ కంపుకొడుతున్నాయి. మున్సిపాలిటీలో మెత్తం 15 కిలో మీటర్ల మేర అంతర్గత రోడ్లు ఉండగా అందులో 8 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు. 7 కిలోమీటర్లు మట్టి రోడ్లే ఉన్నాయి. ఈ మట్టి రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం, ప్రజలు, మున్సిపాలిటీ సిబ్బంది అప్పుడప్పుడు తవ్వి వదిలేయడంతో ఆ రోడ్లపై ప్రయాణం ప్రజలకు నరకప్రాయంగా మారింది. మెయిన్ రోడ్డు పనులు త్వరగా చేయకపోవడం, పాత డ్రెయినేజీ మూసి వేయడంతో మురుగు అంతా రోడ్లపై ప్రవహిస్తోంది. మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు అస్తవ్యస్థంగా మారాయి. ప్రధానంగా తాళ్లగడ్డలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం తీసిన గుంతలను సరిగా పూడ్చకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో సరిగా సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాలకు రోడ్లు బురద మయంగా మారుతున్నాయి. సీతారాంపురం–బంగారుగడ్డకు వెళ్లేందుకు బిడ్జి నిర్మాణం చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు వేయలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం చేసిన మిల్లర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆరుగురు మిల్లర్లు రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం చేశారు. తమవద్ద ధాన్యం ఉందని, అధికారులే సీఎంఆర్ తీసుకోవడం లేదని బుకాయించిన మిల్లర్ల బండారం బయట పడింది. అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆరు మిల్లుల్లో ధాన్యం లేదని తేలిపోయింది. వారిపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్)యాక్ట్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన మిల్లర్లపై చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా మిల్లర్లకు సంబంధించిన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లపై చర్యలు చేపట్టేందుకు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2016 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లను గుర్తించడం, వారు ఎగ్గొట్టిన ధాన్యం పరిమాణం, దాని విలువ తేల్చడంతోపాటు వెంటనే ఆయా మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసేందుకు పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ అండ్ టాస్క్ఫోర్స్ విభాగం చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ డీఎస్ఓ వెంకటేశ్వర్లును స్పెషల్ ఆఫీసర్గా, రిటైర్డ్ తహసీల్దార్ ఎస్.ప్రభాకర్, డీపీఓ ఎస్.రాజ్కుమార్, ఇన్స్పెక్టర్ సైదులుతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ధాన్యం ఎగ్గొట్టిన మిల్లులకు సంబంధించిన వ్యవహారాలను, చేపట్టాల్సిన తదుపరి చర్యలను పర్యవేక్షించనున్నారు. నల్లగొండలో 57 వేల మెట్రిక్ టన్నులు పక్కదారి ప్రభుత్వానికి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ఇవ్వాల్సిన ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. సీఎంఆర్ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం కాకినాడ పోర్టుకు తరలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు జిల్లాలోని ఆరు మిల్లులపై విచారణకు ఆదేశించారు. దీనిపై ఏర్పాటు చేసిన అధికారులు కమిటీ రంగంలోకి దిగింది. 2022–23 యాసంగి సీజనన్కు సంబంధించి చిట్యాలలోని వరలక్ష్మి మిల్ 59,538 క్వింటాళ్లు, నల్లగొండలోని రామ్లక్ష్మణ్ 78,110 క్వింటాళ్లు, మునుగోడులోని మురళీమనోహర్ ఆగ్రోఫుడ్ 4500 క్వింటాళ్లు, నల్లగొండ ఆర్జాలబావి సమీపంలోని సుమాంజలి 67,662 క్వింటాళ్లు, గౌతమి ఇండస్ట్రీస్ 1,59,803 క్వింటాళ్లు, నల్లగొండలోని కనకమహాలకి్ష్మ్ పార్బాయిల్డ్ మిల్లు 80,260 క్వింటాళ్లు మొత్తంగా 44,987 మెట్రిక్ టన్నుల వేలం ధాన్యం లేనట్లు తేలింది. దానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యం కూడా లేవని తేలింది. పైగా అది ప్రభుత్వం వేలం వేసిన ధాన్యం. ఆ ధాన్యం లేకపోగా, కనీసం బియ్యం కూడా మిల్లుల్లో లేదని కమిటీ తేల్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖకు నివేదించింది. మరోవైపు మరికొన్ని మిల్లుల్లోనూ మరో 12 వేల మెట్రిక్ టన్నులు, మొత్తంగా 57 వేల మెట్రిక్ ధాన్యం లేదని దీంతో తదుపరి చర్యలపై యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ధాన్యం మాయం చేసిన మిల్లర్ల విషయంలో తదుపరి కార్యాచరణపై త్వరలోనే పౌర సరఫరాల శాఖ సబ్ కమటీ భేటీ కానుంది. ఈ నెలాఖరులో నిర్వహించే ఆ సమావేశంలో ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లనుంచి రికవరీ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దీంతో జిల్లాలోనూ అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు చేపడతారు. ఫ అధికారులే సీఎంఆర్ తీసుకోవడం లేదంటూ వాదనఫ కానీ.. ఆరు మిల్లుల్లో ధాన్యం లేదని తేల్చిన అధికారుల కమిటీఫ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వారిపై చర్యలకు సన్నద్ధం ఫ ఆయా మిల్లర్ల ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపివేత ఫ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయనున్న పౌరసరఫరాల శాఖ ఫ సబ్కమిటీ భేటీ అనంతరం మిల్లర్లపై చర్యలకు సిఫారసు -
సంక్రాంతి ఎఫెక్ట్.. పంతంగి, కూకట్పల్లిలో ఫుల్ ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. రేపటి నుంచే విద్యా సంస్థలకు సెలవులు కావడంతో సిటీ జనం.. పల్లెబాట పట్టారు. సొంతూరికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో.. బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో బయలుదేరుతున్నారు.దీంతో, కూకట్పల్లి-మియాపూర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్, కార్లతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఏర్పడింది. #Nalgonda In view of the Sankranti festival rush, traffic congestion has increased significantly on the Hyderabad-Vijayawada National Highway (NH-65). Specifically, there is a heavy influx of vehicles at the Pantangi Toll Plaza.@NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE pic.twitter.com/lFCYHMMhDD— Akalankam Seshu (@ienalgonda) January 9, 2026 -
మేయర్.. ఏ కేటగిరీకి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్లో మేయర్ రిజర్వేషన్పై ఉత్కంఠ నెలకొంది. ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ దక్కుతుంది.. ఎవరు మేయర్ అవుతారనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణాయక విధానాలపై రాజకీయ పార్టీల్లోనూ సర్వత్రా చర్చ జరుగుతోంది. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా అవతరించిన నేపథ్యంలో తొలి మేయర్గా ఎవరు కానున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ కూడా ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల చేసి ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతారనే చర్చ జరుగుతుంది. ఈలోగా వారం పది రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. దీంతో రిజర్వేషన్లు మారుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో నల్లగొండ కార్పొరేషన్కు తొలి మేయర్ పదవి ఏ కేటగిరీకి రిజర్వు అవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గతంలో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ఇలా.. నల్లగొండ మున్సిపాలిటీకి 1995లో చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వు కావడంతో బీజేపీ నుంచి బోయినపల్లి కృష్ణారెడ్డి చైర్మన్ అయ్యారు. ఆ తరువాత 2000లో బీసీ జనరల్ అయింది. అప్పుడు పుల్లెంల వెంకట్నారాయణగౌడ్ కాంగ్రెస్ నుంచి చైర్మన్ అయ్యారు. అప్పట్లో 32 వార్డులు ఉండేవి. ఆ తర్వాత 2005లో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ తిరిగి జనరల్ అయింది. అప్పుడు కూడా పుల్లెంల వెంకట నారాయణ గౌడ్కే చైర్మన్ పదవి దక్కింది. ఆ సమయంలో 36 వార్డులు ఉండేవి. ఆ తర్వాత 2014లో రిజర్వేషన్ జనరల్ మహిళకు అయింది. అయితే బీసీ మహిళ అయిన బొడ్డుపల్లి లక్ష్మి కాంగ్రెస్ నుంచి చైర్మన్ అయ్యారు. అప్పట్లో 40 వార్డులు ఉండేవి. ఆ తరువాత 2020లో ఓసీ జనరల్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మందడి సైదిరెడ్డి చైర్మన్ అయ్యారు. అప్పుడు 48 వార్డులు అయ్యాయి. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బుర్రి శ్రీనివాస్రెడ్డి చైర్మన్ అయ్యారు. రాజకీయ పార్టీల్లో చర్చ మొదటిసారి కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రిజర్వేషన్ల మార్పు తప్పనిసరి అనే సంకేతాలు రావడంతో మొదట ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చ సాగుతోంది. మొన్నటి వరకు పాత రిజర్వేషన్లు ఉంటాయని అంతా భావించారు. తాజాగా రిజర్వేషన్లు మారుతాయనే అంశం స్పష్టం కావడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏదేమైనా మొదటిసారి మేయర్ రిజర్వేషన్ ఎవర్ని వరించనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నల్లగొండ కార్పొరేషన్ రిజర్వేషన్పై ఉత్కంఠ ఫ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే విధానంపైనే సర్వత్రా చర్చ ఫ రాష్ట్ర స్థాయిలోనే ఖరారు చేయనున్న సర్కారు ఫ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఆసక్తి ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీ కాాకుండా 9 కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలోనే కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. డివిజన్లు, వార్డులు మాత్రం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పరిధిలోనే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అయితే నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయింది. దీంతో రాష్ట్ర యూనిట్ రిజర్వేషన్లు ఖరారు చేయనుండటంతో ఈ రిజర్వేషన్ మారనుంది. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయంపైనే నల్లగొండ మేయర్ రిజర్వేషన్ జరగనుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ జోరుగా సాగుతుంది. మేయర్గా మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నందున మొదట జనరల్కు అవకాశం ఇస్తారా.. లేక బీసీలకా, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం దక్కుతుందా అనేది ఉత్కంఠ నెలకొంది. -
పేరుకుపోతున్న మురుగు
చండూరు : చండూరు మున్సిపాలిటీలో 10 వార్డుల్లో 7వ వార్డులోని ఒకేఒక్క కాలనీ తప్ప అంతటా 8.29 కిలోమీటర్ల ఓపెన్ డ్రెయినేజీ వ్యవస్ధ ఉంది. డ్రెయినేజీలు శ్రుభం చేసేందుకు వార్డుకు ఇద్దరు చొప్పున 20 మందిని నియమించారు. వీరికితోడు ఐదుగురు వాహన డ్రైవర్లు ఉన్నారు. అయితే సరిపడా సిబ్బంది లేక వారానికోసారి మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. అంతటా ఓపెన్ డ్రెయినేజీలు కావడంతో అందులో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాఽలు పడేస్తున్నారు. వర్షాకాలంలో డ్రెయినేజీలు నిండి మురుగునీరు రోడ్లు, వీధుల్లో పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
ప్రమాదకరంగా ఓపెన్ డ్రెయినేజీలు
చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలోని పలు వార్డులో ఓపెన్ డ్రెయినేజీలపై పైకప్పులు లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. వ్యవసాయ మార్కెట్ ప్రహరీకి అనుకుని భువనగిరి రోడ్డు నుంచి హైవే వరకు ఇటీవల పైకప్పు లేకుండా వెడల్పుగా ఓపెన్ డ్రెయినేజీని నిర్మించారు. ఈ రోడ్డులో రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఇబ్బందులు తప్పడం లేదు. ఏడాది కాలంలో 10వ వార్డులో ఎల్లమ్మగుడి సమీపం, వేణుగోపాల స్వామి వెంచర్లోని ఓపెన్ డ్రెయినేజీల్లో ప్రమాదవశాత్తు పడి ఎండి.జావీద్, మేకల భిక్షం మృతిచెందారు. ఓపెన్ డ్రెయినేజీలపై స్లాబ్ వేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎనిమిది వార్డుల్లోనే డ్రెయినేజీలు
దేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు అంతర్గత రోడ్లపై పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా కేవలం 8 వార్డుల్లోనే అంతర్గత డ్రెయినేజీ నిర్మాణం చేపట్టారు. మరికొన్ని చోట్ల ఓపెన్ డ్రెయినేజీలు ఉన్నాయి. ఓపెన్ డ్రెయినేజీలు ఉన్నచోట వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరదనీటితో రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. ప్రస్తుతం పట్టణంలోని పలు చోట్ల నూతనంగా చేపట్టిన డ్రెయినేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. -
మ్యాన్హోల్ నిర్మాణం అస్తవ్యస్తం
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలోని కాలనీలు డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్ల వెంట వేసిన డ్రెయినేజీ పైపులు.. ఇళ్ల నుంచి వచ్చే మురుగు పైపుల కంటే మ్యాన్హోల్స్ ఎత్తులో నిర్మించారు. దీంతో మురుగునీరు వాటిలోకి పోలేని పరిస్థితి. మూడున్నరేళ్ల క్రితం హిల్కాలనీ, పైలాన్ కాలనీలో 70శాతం సీసీ రోడ్లు వేయడంతో చాలా వరకు డ్రెయినేజీలు పూడిపోయినా వాటిని పునరుద్ధరించలేదు. సాగర్ డ్యాం కాలనీలు ఎత్తులో ఉండడంతో డ్రెయినేజీల నిర్మాణం సాధ్యపడడం లేదు. దీంతో ఆయా కాలనీల్లోని వీధుల్లో మురుగు ప్రవహిస్తోంది. -
మురుగుమయం.. దోమలకు నిలయం
హాలియా : హాలియా మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో ఓపెన్ డ్రెయినేజీలు నిండిపోయి వరదంతా కాలనీలను ముంచెత్తుతోంది. పట్టణంలోని పలు వార్డులో డ్రెయియినేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బంది 15 రోజలకోసారి తొలగిస్తుండడంతో దుర్గంధంగా మారి దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. శాంతినగర్లో డ్రెయినేజీ కాల్వలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు వీధుల్లోనే పారుతోందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. -
నీలగిరిని స్మార్ట్ సిటీగా మారుస్తా..
నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ పదవిని కాంగ్రెస్ కై వసం చేసుకునేలా అధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని అన్నేశ్వరమ్మ గుట్ట వద్ద అమృత్–2 పథకం కింద రూ.1.45కోట్లతో నిర్మించిన తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. అనంతరం రూ.3.14కోట్లతో చేపట్టిన వల్లభరావు చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన, లెప్రసీ కాలనీలో రూ.3కోట్లతో సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. లతీఫ్సాబ్గుట్ట వద్ద రూ.50లక్షలతో నిర్మించిన పబ్లిక్ హెల్త్ ఎస్ఈ–2 యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి నల్లగొండ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, అబ్బగోని రమేష్, వంగూరి లక్ష్మయ్య, నారగోని నవీన్కుమార్గౌడ్, కమిషన్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం రామగిరి(నల్లగొండ): రైతులకు నాణ్యమైన విద్యు త్ అందించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం దోనకల్లులో నిర్మించిన 33 కేవీ సబ్స్టేషన్ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, కోమటిరెడ్డి పృథ్వీధర్రెడ్డి, దోనకల్, పాతూరు సర్పంచ్లు కొత్తపల్లి సునితమధు, దోటి పద్మపరమేశ్ పాల్గొన్నారు. ఫ తొలి మేయర్గా కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను సుమారు 500పైగా ఉన్న ఓపెన్ డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా మారాయి. బంగారుగడ్డ, హనుమాన్పేటలో ప్రధాన నాలాలు కొన్నిచోట్ల ఆక్రమణకు గురై రెండు ఫీట్ల మేరకే ఉన్నాయి. బంగారుగడ్డ నుంచి వచ్చే ప్రధాన నాలాలోకి సమీప గృహాల వారు మరుగుదొడ్ల పైపులు వదిలివేయడంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నాలాలు చాలాచోట్ల ధ్వంసం కావడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీలు లేక ప్రమాదకరంగా మారాయి. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. -
వేధిస్తున్న సిబ్బంది కొరత
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీలో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పట్టణంలో మొత్తం 20 వార్డుల్లో మెయిన్ రోడ్డులో బాబాసాహెబ్గూడెం నుంచి పటేల్నగర్ వరకు అండర్ గ్రౌండ్ డ్రెయినీజీ నిర్మించారు. మిగతా అన్ని వార్డుల్లో ఓపెన్ డ్రెయినేజీలే ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది 71 మంది ఉన్నారు. జనాభా పరంగా మరో 20 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. సిబ్బంది కొరతతో అన్ని వార్డుల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని వార్డుల్లో డ్రెయినేజీల్లో ముగురు పేరుకుపోయి దుర్వాసనమయంగా మారాయి. -
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం
నల్లగొండ : రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఏ.సురేంద్రమోహన్ అన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి వ్యవసాయ, హార్టికల్చర్, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలను అందించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనన్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ప్రభుత్వ స్థలం ఉంటే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో యాసంగి పంటలకు యూరియా కొరత లేదని, ఫర్టిలైజర్ యాప్ ద్వారా అందరికీ అందుతుందన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, డీసీఓ పత్య నాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, హార్టికల్చర్ అధికారి సుభాషిని తదితరులు పాల్గొన్నారు. పారదర్శకతకోసమే యూరియా బుకింగ్ యాప్ నకిరేకల్ : రైతులకు యూరియా సరఫరాలో పారదర్శకత కోసమే యూరియా బుకింగ్ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ చెప్పారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని ఓ ఎరువుల దుకాణంలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. పట్టాకాని రైతులు కూడా యూరియా పొందవచ్చన్నారు. రెండు దఫాలుగా ఇచ్చే విధంగా చూడాలని పలువురు రైతులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ -
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
సూర్యాపేటటౌన్ : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని జాకీర్హుస్సేన్ నగర్కు చెందిన ధరావత్ చాంప్లా(50) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. బుధవారం సాయంత్రం కొత్త వ్యవసాయ మార్కెట్లో చెట్టుకు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మృతుడి కుమారుడు రాహుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. చెట్టుపై నుంచి పడి మృతిపెన్పహాడ్ : చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండల కేంద్రానికి చెందిన దాసరి కోటయ్య(50) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మచారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో చెట్టు కొమ్మలను మిషన్తో తొలగిస్తుండగా.. ప్రమాదశాత్తు జారి కిందపడి తీవ్రంగా గాపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాదాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. చికిత్స పొందుతూ నవజాత శిశువు మృతిభువనగిరి(బీబీనగర్): బీబీనగర్ మండలం పడమటిసోమారం మంలోని లింగ బసవేశ్వరస్వామి దేవాలయం వద్ద ఈ నెల 6న గుర్తుతెలియని మహిళ నవజాత ఆడ శివువును వదిలి వెళ్లగా.. గ్రామస్తులు గుర్తించి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం శిశువు మృతి చెందింది. శిశువు చలిలో ఉండటం వల్ల హార్ట్బీట్ తగ్గిందని, సీపీఆర్ చేసినప్పటికీ శిశువు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హాకీ పోటీలకు ఎంపికై న రామన్నపేట విద్యార్థిరామన్నపేట : తమిళనాడులో ఈనెల 12 నుంచి జరిగే విశ్వవిద్యాలయాల జాతీయస్థాయి హాకీ పోటీల్లో రామన్నపేట డిగ్రీ కళాశాల విద్యార్థి నోముల సాయికుమార్ పాల్గొననున్నాడు. గురువారం ఎంపిక ప్రక్రియలో సాయికుమార్ పాల్గొని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికయ్యాడు. ఆ జట్టు తరఫున ఆడనున్నాడు. -
నత్తనడకన అండర్పాస్ల నిర్మాణం
ఫ తూప్రాన్పేట నుంచి రెడ్డిబావి వరకు అన్ని జంక్షన్లను పోలీసులు నియంత్రణలోకి తీసుకుని ఇష్టానుసారంగా వాహనాలు హైవే పైకి వెళ్లకుండా చేస్తే వాహనాల రద్దీని నియంత్రించవచ్చు. ఫ సర్వీస్ రోడ్లు, అండర్పాస్లు ఉన్న గ్రామాల్లో జంక్షన్లను మూసివేయాలి. ఫ చౌటుప్పల్లోని తహసీల్దార్ కార్యాలయం ముందున్న దర్గా వద్ద రాంగ్రూట్లో వాహనాల రాకపోకలు ఆపేయాలి. ఫ స్థానికులు ఫుట్ఓవర్ బ్రిడ్జిల మీదుగా హైవే దాటేలా చూడాలి. ఫ హైవేకు, సర్వీస్ రోడ్డుకు మధ్యన బారికేడ్లు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మీదుగా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి వాహనాలు బారులుదీరుతాయి. ప్రస్తుతం ఈ హైవేపై చౌటుప్పల్, చిట్యాల పట్టణ కేంద్రాల్లో చేపట్టిన అండర్పాస్ బ్రిడ్జిల నిర్మాణం నత్తనడకన సాగుతుండడంతో ఈ ఏడాది సమస్య మరింత జఠిలంగా మారే అవకాశాలు ఉన్నాయి. చౌటుప్పల్, చిట్యాల : హైవేపై చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో గతేడాది జూలైలో అండర్పాస్ బ్రిడ్జి పనులు చేపట్టారు. వాహనాలను మళ్లించేందుకు నవోదయ టాకీస్ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల విస్తరణ పనులు మొదలుపెట్టారు. ఏడాదిన్నర అవుతున్నా 40శాతం కూడా పనులు పూర్తవ్వలేదు. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు వాహనాలను సర్వీస్ రోడ్ల మీదుగా మళ్లించే అవకాశాలు ఉండగా.. ఇప్పటికే సర్వీస్ రోడ్లు విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదే రోడ్ల మీదుగా వాహనాలను పంపిస్తే మాత్రం ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉంది. ప్రమాదకరంగా రోడ్డు అంచులు సర్వీస్ రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో హైవేకు, సర్వీస్ రోడ్డుకు మధ్యన ఉన్న ఇనుప గ్రిల్స్ను తొలగించారు. సర్వీస్ రోడ్డుతో పోలిస్తే హైవే ఒకటి నుంచి రెండు ఫీట్ల ఎత్తులో ఉంది. వాహనదారులు ఏమాత్రం రోడ్డు చివరకు వెళ్లినా సర్వీస్ రోడ్డులోకి వాహనం బోల్తా పడే అవకాశం ఉంది. చిట్యాలలోనూ నెమ్మదిగా.. చిట్యాల పట్టణంలోనూ పాల శీతలీకరణ కేంద్రం నుంచి ఎస్బీఐ వరకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు 30 శాతం పనులు మాత్రమే జరిగాయి. అదేవిధంగా పెద్దకాపర్తి వద్ద కూడా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో సర్వీస్ రోడ్డు గుండా వెళ్లే వాహనాదారులకు ఇబ్బందులు ఏర్పడి ట్రాఫిక్ జాం అవుతోంది. చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను సర్వీస్ రోడ్డు మీదుగా విజయవాడ వైపు పంపిస్తున్నారు. దీంతో దుమ్ము, ధూళితో సర్వీస్ రోడ్డులోని దుకాణాదారులతో పాటు దిచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ● చిట్యాల పట్టణంలోని రైల్వే అండర్పాస్ వద్ద రోడ్డు దెబ్బతినటంతో పాటు నీరు ఉబికి వస్తుంది. ● చిట్యాల నుంచి ఆటోనగర్, ఉరుమడ్ల రోడ్డు నుంచి బస్టాండ్కు వచ్చేందుకు స్థానికులు రాంగ్రూట్లో రాకపోకలు కొనసాగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ● చిట్యాల మండల పరిధిలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పలు చోట్ల ధ్వంసమైంది. ● హైవేకి ఇరువైపులా హోటల్స్, దాబాలు, టిఫిన్ సెంటర్లు టీ పాయింట్లు ఉండగా.. అక్కడ ఆగిన వాహనదారులు ఒక్కసారిగా హైవే మీదకు వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ● హైవేపై ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలను నిలిపి డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటుండడంతో అజాగ్రత్తగా వచ్చే వాహనదారులు వాటిని ఢీకొంటున్నారు. ● ప్రమాదాల నివారణకు, పండుగ రద్దీని నియంత్రించేందుకు చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ప్రత్యేక పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. చిట్యాల : సర్వీస్ రోడ్డులో ఎదురెదురుగా వెళ్తున్న వాహనాలుచౌటుప్పల్ : బస్టాండ్ ఎదుట ప్రమాదకరంగా హైదరాబాద్–విజయవాడ హైవే అంచుచౌటుప్పల్ : వ్యవసాయ మార్కెట్ వద్ద అసంపూర్తిగా సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు ఫ విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై తరచూ ట్రాఫిక్ జాంతో వాహనాల బారులు ఫ సంక్రాంతికి వెళ్లే నగరవాసులకు తప్పని తిప్పలు -
భారత ఆర్థిక వ్యవస్థను మార్చడం సవాల్తో కూడినది
రామగిరి(నల్లగొండ): భారత ఆర్థిక వ్యవస్థను 40 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం సవాల్తో కూడినదని హైదరాబాద్లోని ఐసీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధాకర్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో సోషల్ సైన్స్ ఆధ్వర్యంలో ఐసీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్సీ, పీఎం ఉషా ఆర్థిక సహకారంతో ‘వికసిత్ భారత్–2047 స్ట్రాటజీస్ అండ్ ఛాలెంజెస్’ అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సులో వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనా వ్యాసాలు సమర్పించారు. అనంతరం సావనీర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ ప్రొఫెసర్ సీహెచ్. కృష్ణారెడ్డి, అంబేద్కర్ యూనివర్సిటీ అడిషనల్ సీఓఈ కె. కృష్ణారెడ్డి, మునుస్వామి. మల్లేశం, బట్టు కిరీటం, నర్సింగ్ కోటయ్య, వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాస్, అకాడమిక్ కో ఆర్డినేటర్ బి. నాగరాజు, జ్యోత్స్న, హబీబ్, దినేష్, అంకుష్, నాగరాజు, హస్రత్ బేగం తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికమోత్కూరు : మహారాష్ట్రలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన సీహెచ్. శ్రవణ్కుమార్, మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మనోజ్ ఎంపికయ్యారు. వరంగల్ జిల్లాలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో వారు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు షూటింగ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోత్కూరు యాదయ్య గురువారం పేర్కొన్నారు. -
జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న తుమ్మడం సర్పంచ్
నిడమనూరు : మహారాష్ట్రలోని పుణేలో జరుగుతున్న మహిళా స్నేహపూర్వక పంచాయతీల జాతీయ సదస్సులో గురువారం నిడమనూరు మండలం తుమ్మడం గ్రామ సర్పంచ్ బుర్రి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సు విశేషాలను ఆయన విలేకరులతో పంచుకున్నారు. గ్రామ పంచాయతీల్లో మహిళలకు కల్పిస్తున్న అవకాశాలపై 2024–25 సంవత్సరానికి గాను ఉత్తమ గ్రామ పంచాయతీగా తుమ్మడం గ్రామ పంచాయతీ ఎన్నికై ందని, దీంతో కొత్తగా సర్పంచ్గా ఎన్నికై న తనకు పుణేలో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందడంతో అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నలుగురు సర్పంచులు, నలుగురు ఎంపీడీఓలు, స్థానిక సంస్థల స్పెషల్ సెక్రటరీ జాన్ వెస్లీ ఈ సదస్సుకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. -
మద్యం షాపు ఎదుట విద్యార్థుల ధర్నా
పెద్దఅడిశర్లపల్లి : నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో పాఠశాలకు సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం పాఠశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మద్యం షాపు ఎదుట ధర్నా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను వెంటనే మరో చోటుకు తరలించాలన్నారు. ఈ ధర్నాలో విద్యార్థులతో పాటు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, పలువురు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఫ పాఠశాల సమీపంలో నుంచి తొలగించాలని డిమాండ్ -
హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు : మంత్రి
చిట్యాల: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. చిట్యాల పట్టణంలో హైవేపై జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను గురువారం కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, హైవే పీడీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిట్యాల పట్టణంలో హైవేపై జరుగుతున్న పనులను నిలిపివేసి, జాతీయ రహదారిపై తాత్కాలిక మరమ్మతులు చేసి వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. ఎన్హెచ్–65ను 8 లైన్లుగా మార్చేందుకు డీపీఆర్ సిద్ధం చేశామని, మార్చిలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ప్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్ట్ హైవే రహదారిని నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట డీటీసీ వాణి, చిట్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చినమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను పాలకులుగా నిలబెడతాం
యాదగిరిగుట్ట: బీసీల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో బీసీలను పాలకులుగా నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో మన ఆలోచన సాధన సమితి(మాస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జనాభా ధామాషా ప్రకారం బీసీలకు వాటా దక్కించుకోవడం, రాజకీయ అధికారం అంతిమ లక్ష్యంగా శిబిరాలు నడుస్తున్నాయన్నారు. తెలంగాణలో గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు బీసీ నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా మాస్ ముందుకు కదులుతుందన్నారు. మెజార్టీ ప్రజలకు రావాల్సిన రాజ్యాధికారం అందకుండా పోతుందని, పాలకులుగా కావాల్సిన వారు పాలితులుగానే ఉంటున్నారన్నారు. బీసీలంతా సైనికులుగా తయారై రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలన్నారు. రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ ఉద్యమం తీవ్రమైతుందని అన్నారు. దానిని ఆపటం ఎవరితరం కాదని పేర్కొన్నారు. బీసీ ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా నడిపించేందుకు బీసీలందరూ ఒక్కతాటి పైకి తీసుకురావాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిజంగా కాంగ్రెస్కు బీసీలపై ప్రేమ ఉంటే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు బీసీలంటే చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు, గౌరవ అధ్యక్షుడు గడ్డం నర్సింహగౌడ్, పూస నర్సింహా బెస్త, సలహా మండలి సభ్యుడు తడక యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్ల ఆంజనేయులుగౌడ్, పంతంగి విట్టలయ్యగౌడ్, అధికార ప్రతినిధులు మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర, ఆవుల వెంకట్యాదవ్, సంగెం రమేశ్వర్ నేత, కోరంగి దుర్గారాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బచ్చనబోయిన శ్రీనివాసులు, గోద మల్లికార్జున్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి గునిగంటి చంద్రశేఖర్గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శులు పెద్దవురా బ్రహ్మయ్య రజక, కొంపోజు నరహరిచారి, జక్కుల బాలరాజు యాదవ్, శ్రీకాంత్ గంగపుత్ర, నక్క కాాశినాథ్, చుక్కల సత్యనారాయణ, పవన్కుమార్, మరోజు రాజుచారి, నిమ్మల సత్యం, పెండం లక్ష్మణ్, వడ్డేపల్లి దశరథ సాగర్, కై రంకొండ నర్సింగ్, తిప్పరి లింబాద్రి, మురళీచారి, దశరథ్ రజక, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
సూక్ష్మపోషకాల లోపాన్ని నివారిస్తే అధిక దిగుబడులు
త్రిపురారం : పంటల పెరుగుదలకు సూక్ష్మపోషకాల అవసరం ఎంతగానో ఉంటుంది. సూక్ష్మపోషకాల లోపం వలన నేలలు చౌడుగా మారి పంటల దిగుబడులపై ప్రభావం చూపుతుంది. రైతులు సాధ్యమైనంత మేర ఎరువులు వేసుకొని పంటలపై సూక్ష్మపోషకాల ప్రభావం లేకుండా చూసుకోవాలి. సరైన సమయంలో చర్యలు చేపడితే సూక్ష్మపోషకాల లోపాన్ని అధిగమించవచ్చని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. ఫ జింకు లోపం : జింకు లోపం ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అపరాల్లో అధికంగా కనిపిస్తుంది. వరిలో జింక్ లోపం భాస్వరం ఎక్కువగా వేసిన పొలాలు, చౌడు నేలలు, మాగకుండా సేంద్రీయ పదార్థాలు అధికంగా వినియోగించిన పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపం వలన వరి నాటిన 2 నుంచి 4 వారాల్లో మొక్కపై నుంచి 3 లేదా 4 ఆకుల నడుమ ఈను తెల్లగా పాలిపోతుంది. ఆ తర్తా ఆకు కొనభాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు భాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిపార్లు ఏవిధమైన లోపాలు కనిపించకున్నా.. నత్రజని, భాస్వరం, తగినంత మోతాదులో వేసినప్పటికీ పైరు ఏపుగా పెరగదు. మొక్కజొన్నలో జింకు లోపం వల్ల లేత ఆకుల నడుమ ఈనెకు సమాంతరంగా తెలుపు లేదా పసుపు చారలు ఏర్పడి మొక్కలు గిడసబారిపోతాయి. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎరుపు రంగులోకి మారి మచ్చలు ఏర్పడతాయి. పప్పుధాన్యాల్లో జింకు లోపం వల్ల మొక్కలు గిడసబారిపోతాయి. లేత ఆకుపచ్చ మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కనువులు దగ్గరగా ఉండి మొక్కల పెరుగుదల ఆలస్యంగా పెరుగుతుంది. ఫ నివారణ చర్యలు సాధారణ నేల్లో మూడు పంటలకు ఒకసారి.. కొత్తగా ఆయకట్టు కింద సాగుచేసే నేలల్లో, చౌడు, ఉప్ప నేలల్లో రెండు పంటలకు ఒకసారి ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను వేయాలి. పంటలో జింకు లోపం గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ను కలిపి ఆకులు మొత్తం తడిసేలా ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని 2 నుంచి 3 సార్లు ఐదు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వరి పండించే నేలల్లో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి పంటకు ముందు వేస్తే జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. ఫ ఇనుము లోపం : ఇనుము లోపం సున్నం అధికంగా ఉండే నేలల్లో లేదా సాగు నీటిలో కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అధికంగా ఉండే సందర్భాల్లో కనిపిస్తుంది. ఇనుము లోపం వరిలో మెట్ట నారు మడుల్లో నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఆకుల ఈనెల మధ్యభాగం పత్రహరితాన్ని కోల్పోయి పసుపుగా మారుతాయి. లోపం తీవ్రమయ్యే కొద్ది ఆకు క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోతాయి. ఇతర పంటల్లో కూడా ఇదే విధమైన లక్షణాలు లేత ఆకుల్లో కనిపించి మొక్క పెరుగుదల కుంటుపడుతుంది. నివారణ చర్యలు పంటల్లో ఇనుము లోపం గుర్తించినప్పుడు లీటరు నీటికి 10 గ్రాముల అన్నబేదిని ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి మొక్క మొత్తం తడిసేలా 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ఫ బోరాన్ లోపం : వరిలో బోరాన్ లోపం వల్ల లేత ఆకులు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. నేలల్లో బోరాన్ ఎక్కువైనప్పుడు ఆకులపై చివరన మచ్చలు వచ్చి ఎండిపోతాయి. బోరాన్ లోప స్థాయి లేదా విషమ స్థాయి మధ్య వ్యత్యాసం తక్కువ కావున బోరాన్ లోపం నిర్ధారించిన తర్వాత మాత్రమే నేలలకు లేదా పంటలకు బోరాన్ను అందించాలి. పత్తి పండించే నేలల్లో కూడా బోరాన్ లోపం కనిపిస్తుంది. పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల్లో బోరాన్ లోపం సర్వ సాధారణంగా ఉంటుంది. ఫ నివారణ చర్యలుబోరాన్ లోపం నివారణకు ఎకరాకు రెండు కిలోల బోరాక్స్ను ఆఖరి దుక్కిలో వేయడంతో పాటు రెండుసార్లు 0.15 శాతం బోరాక్స్ను 60 లేదా 90 రోజులకు పిచికారీ చేయాలి. పొద్దుతిరుగుడు పూవ్వులల్లో మధ్యభాగం గింజ కట్టదు. వేరుశనగలో గింజ మధ్యభాగం తోడుకోదు. ఈ లోపాన్ని నివారించడానికి 0.1 శాతం బోరిక్ ఆమ్లాన్ని ఒక లీటరు నీటికి కలిపి పంట వేసిన 30 నుంచి 45 రోజుల తర్వాత రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువుల వినియోగించడం పెంచడం వల్ల భూమిలో సూక్ష్మపోషకాల లోపాన్ని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. నేలలోనే కాకుండా పంటపై కూడా లోపాలను సరిచేసుకోవచ్చు. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి ఉపఝెగించడం వల్ల భూమిలో సారం తగ్గిపోతుందని రైతులు గమనించాలి. ఫ కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు -
మొదలైన సంక్రాంతి రద్దీ
కోదాడరూరల్ : సంక్రాంతికి వారం రోజులు ముందు నుంచే ఏపీ వైపు వాహనాల రద్దీ మొదలైంది. గురువారం హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. కోదాడ మండలం కొమరబండ వై జంక్షన్ నుంచి రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్రోడ్ వరకు క్రాసింగ్ల వద్ద పోలీసులు ఇప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేశారు. కోదాడలోని కట్టకమ్ముగూడెం క్రాసింగ్ను మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న కొమరబండ వైజంక్షన్, రామాపురం క్రాస్రోడ్ వద్ద ట్రాఫిక్జామ్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురి దుర్మరణం
నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం(జనవరి 9వ తేదీ) తెల్లవారజామాను మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ట్యాంకర్, డీసీఎం ఢీకొని స్పాట్లోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కోచింగ్ లేకుండానే గ్రూప్–1 విజయం..
యాదాద్రి భువనగిరి జిల్లా: రిటైర్డ్ డీజీపీ అయిన తన తాత నుంచి స్ఫూర్తి పొంది గ్రూప్–1 ఉద్యోగం సాధించినట్లు పోచంపల్లి మున్సిపాలిటీ ట్రైనీ కమిషనర్ అన్నంబొట్ల లలిత శ్రావణి తెలిపారు. తాత చేసిన సేవలు, ప్రజలచే ఆయన పొందిన మన్ననలను చూసి డిగ్రీ పూర్తవ్వగానే గ్రూప్–1 సాధించి గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్గా ఎంపికైనట్లు ఆమె పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా గత వారం రోజులుగా పోచంపల్లి మున్సిపల్ కార్యాలయంలో పరిపాలన అంశాలను అధ్యయనం చేస్తున్న ఆమె.. తాను విజేతగా నిలవడానికి పడిన కష్టం గురించి సాక్షికి వివరించింది.మాది హైదరాబాద్లోని మలక్పేట. మా నాన్న వెంకట్రామ్మోహన్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్, అమ్మ లక్ష్మి గృహిణి. మేము ఇద్దరం సంతానం. తమ్ముడు ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి చదువులో ఫస్టే. గౌతమ్ మోడల్ స్కూల్లో ఎస్సెస్సీ(10/10 జీపీఏ), దిల్సుఖ్నగర్లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటరీ్మడియట్ (972/1000) పూర్తి చేశాను. ఆ తర్వాత ఎంసెట్, జేఈఈ వైపు వెళ్లకుండా కోఠి ఉమెన్స్ కాలేజీలో చేరి 2019లో బీఏ డిగ్రీ పూర్తి చేశాను.ఇంటర్లో నిర్ణయం తీసుకున్నామా తాత బలిజపల్లి శంకర్శాస్త్రి కేరళ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ. ఆయన తన సర్వీసులో చేసిన సేవలు, పొందిన అవార్డులు, ప్రజలచే పొందిన ప్రసంశలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నేను కూడా ఆయన లాగే ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజాసేవ చేయాలని ఇంటర్లో ఉండగానే నిశ్చయించుకున్నాను. డిగ్రీ అయిపోగానే యూపీఏస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాను. ఈలోగా 2022లో టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో దానికి దరఖాస్తు చేసి ప్రిలిమ్స్ పాసయ్యాను. మెయిన్స్ సమయంలో పేపర్ లీక్ అయ్యిందనే కారణంతో ఆ నోటిఫికేషన్ రద్దయ్యింది. ఆ తర్వాత మళ్లీ నోటిఫికేషన్ వేశారు. కానీ కొందరు కోర్టుకు వెళ్లడంతో మళ్లీ ఆగిపోయింది. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం మూడోసారి గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి కోచింగ్కు వెళ్లకుండా స్వతహాగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఏడాది పాటు ప్రిపేర్ అయ్యాను. ప్రిపరేషన్ సమయంలో శుభకార్యాలు, సెల్ఫోన్కు దూరంగా ఉండి మొదటి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయిలో 151వ ర్యాంకు సాధించి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. నేను కష్టపడ్డ తీరు చూసి ఏదో ఒక జాబ్ కొడతా అని నా తల్లిదండ్రులకు చాలా నమ్మకం ఉండేది. వారి విశ్వాసాన్ని నిలబెట్టాను. ప్రజలకు నేరుగా సేవ చేసే ఉద్యోగం వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. విజయం సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అనవసర విషయాలు వదిలేసి లక్ష్యం వైపు దృష్టిపెడితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.పోచంపల్లి ఎంతో ప్రత్యేకంఅంతర్జాతీయంగా పేరున్న పోచంపల్లి మున్సిపాలిటీకి ట్రైనీ మున్సిపల్ కమిషనర్గా రావడం అదృష్టంగా భావిస్తున్నా. భూదానోద్యమ చరిత్ర, ఇక్కత్ చేనేత వస్త్రాలు, చేనేత కళాకారుల గొప్పదనం, కుల వృత్తులు ఇలా పోచంపల్లిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. -
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
నల్లగొండ : రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న వివిధ రకాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. భూ భారతి, భూ రికార్డులు, భూమి వివాదాలు, రెవెన్యూ సదస్సుల్లో సాదాబైనామాపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కారం చూపాలన్నారు. భూ సంబంధ వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా.. ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటివరకు 61 శాతం పూర్తయిందని.. దీన్ని 75 శాతానికి తీసుకెళ్లేందుకు నిత్యం బీఎల్ఓలతో సమీక్షించాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి వివరించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ఓటరు జాబితా ప్రకటిస్తామన్నారు. సమావేవంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, అదికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి
ఫ మాజీ మంత్రి కేటీఆర్ చిట్యాల : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మంలో జరిగే కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యలో చిట్యాలలో ఆయన కాసేపు ఆగారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కారులోంచి పార్టీ నాయకులకు అభివాదం చేస్తూ పార్టీ గెలుపుకోసం కష్టించి పనిచేయాలని సూచించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ను గెలిపిస్తామంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, పార్టీ మండల ప్రధానకార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మెండె సైదులు, కూరెళ్ల లింగస్వామి, కొలను వెంకటేష్, బొబ్బల శివశంకర్రెడ్డి, కందాటి రమేష్రెడ్డి, కొలను సతీష్, బోయపల్లి శ్రీను, అర్రూరి శ్రీశైలం, రాచకొండ క్రిష్టయ్య, దేవరపల్లి సత్తిరెడ్డి, బొంతల రామక్రిష్ణారెడ్డి, కన్నెబోయిన శ్రీశైలం, ఆగు అశోక్, జిట్ట శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు వెంట చెత్త కుప్పలు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలుగా దర్శనం ఇస్తోంది. కొంత మంది వ్యాపారులు చెత్త సేకరణ చేసే ఆటోలు, ట్రాక్టర్లలో వేయకుండా రోడ్లపైనే పడవేస్తున్నారు. ఇక ఈదులగూడెం, రామచంద్రగూడెం, విద్యానగర్లో రోడ్లపైనే పశువులను కట్టేయడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. మొత్తం 278 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజూ 50 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డు చెత్తతో నిండిపోవడంతో ఇటీవల రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. -
చెత్త రీసైక్లింగ్ మొదలు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో చెత్త పడేస్తున్నారు. కొద్ది మంది మాత్రమే మున్సిపల్ వాహనాలకు ఇస్తున్నారు. రోడ్ల వెంట వేసిన చెత్తను పందులు చిందర వందర చేస్తుండడంతో దుర్వాసన వస్తోంది. 48 వార్డుల నుంచి రోజుకు 100 మెట్రిక్ టన్నుల చెత్తను శేషమ్మగూడెంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డులో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో నానా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డంపింగ్ యార్డ్లో చెత్త కుప్పలను రీసైక్లింగ్ మిషన్ను ఇటీవల బిగించారు. ఇప్పటికే చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ పనులు మొదలు పెట్టారు. చెత్త రీసైక్లింగ్కు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే ఇక్కడ సమస్య తీరనుంది. -
నేడు ఎన్ఎస్ఎస్ వలంటీర్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : కేరళ రాష్ట్రంలో ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరానికి –2026 ఎన్ఎస్ఎస్ వలంటీర్లను గురువారం ఎంపిక చేయనున్నట్లు ఎంజీ యూనివర్సిటీ జాతీయ సమన్వయకర్త మారం వెంకటరమణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో వలంటీర్ల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఎంపికలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్, హిందీ, నాయకత్వ లక్షణాలు, కల్చరల్ అంశాల్లో ప్రతిభ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరిక మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జి రేబెల్లి రోహిత్పాటు మరో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్దార్ధ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, పెద్ది శ్రీనివాస్గౌడ్, పద్మశెట్టి కోటేశ్వర్రావు, పిన్నబోయిన శ్రీనివాస్యదవ్, లింగంపల్లి చిరంజీవి, ఎండీ.షోయబ్, పునాటి లక్ష్మీనారాయణ, కోల రామస్వామి, సత్యనారాయణ, నాగభూషణం, దినేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. అలరించిన త్యాగరాజ కీర్తనలు రామగిరి(నల్లగొండ): త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను నల్లగొండ పట్టణంలోని రామాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు ఆలపించిన త్యాగరాజ స్వామి కీర్తనలు ప్రేక్షకులను అలరించాయి. పి.రవిశంకర్, ఎన్సి.పద్మ, జానకిరామనాథన్, గోవర్ధనం మానస, ఎన్వి.జానకి, గరిమెళ్ల శ్వేత కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో త్యాగరాజ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఎం.జనార్దనాచార్య, ఎంపీ.ఆచార్యచారి, చకిలం వేణుగోపాల్రావు, ముడుంబ లక్ష్మినాథ్, అనంతాచార్యులు, అక్కినేపల్లి శ్రీనివాసరావు, ప్రసాదరావు, రమాదేవి, జానకి పాల్గొన్నారు. -
చెత్తకుండీలుగా ఓపెన్ ప్లాట్లు..
దేవరకొండ : దేవరకొండ పట్టణంలోని పలు కాలనీల్లోని ఓపెన్ ప్లాట్లు చెత్తకుండీలుగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ రోజూ 16 టన్నుల చెత్తను ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించి పట్టణ శివారులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మున్సిపాలిటీలో 130 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాల్సి ఉండగా.. కేవలం 64 మంది విధులు నిర్వహిస్తున్నారు. దీంతో చెత్త సేకరణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పట్టణ శివారు ప్రాంతంలోని డంపింగ్ యార్డులో చెత్త రిసైక్లింగ్ యూనిట్ ఇంకా ప్రారంభం కాలేదు. -
చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్లగొండ : జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఇటీవల వివిధ రకాల చోరీలకు పాల్పడిన దుండగులను బుధవారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలకు దూరంగా ఉండి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. నేరస్తుల కదలికపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. నేరస్తులు ప్రవర్తన మార్చుకోకపోతే.. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, రౌడీషీట్, బైండోవర్ కేసులు, కఠిన చట్టాల కింద అరెస్ట్, రిమాండ్ వంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
పట్టణాలు అపరిశుభ్రం
మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ అస్తవ్యస్తం చండూరు : చండూరు మున్సిపాలిటీలో చెత్త నిర్వాహణ వ్యవస్థ సరిగాలేదు. చెత్త సేకరణకు 3 ట్రాక్టర్లు, 2 ఆటోలు ఉన్నాయి. మెత్తం 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రోజు విడిచి రోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. చెత్తను శిర్ధేపల్లి రోడ్డులోని డంపింగ్ యార్డులో వేస్తున్నారు. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసేందుకు, కంపోస్ట్ ఎరువు తయారీకి షెడ్లు నిర్మించారు. కానీ వాటిని నిరుపయోగంగా వదిలేశారు. ఫ అంతటా రోజువిడిచి రోజు చెత్త సేకరణ ఫ అయినా చాలా చోట్ల వీధుల్లో దర్శనమిస్తున్న చెత్తాచెదారం ఫ నల్లగొండ డంపింగ్ యార్డులోనే రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభం ఫ మిగతా చోట్ల చెత్తకు నిప్పు పెడుతున్న సిబ్బంది ఫ పొగ, దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీ 20 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో రోజూ చెత్తను తరలించేందుకు రెండు ట్రాక్టర్లు, ఆరు ట్రాలీ ఆటోలు వినియోగిస్తున్నారు. సిబ్బంది 71 మంది విధులు నిర్వహిస్తున్నారు. రోజూ టన్ను పైనే చెత్తను డంపింగ్ యార్డు తరిస్తున్నారు. నెల్లిబండ–నోముల శివారులోని డంపింగ్ యార్డులో కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. డంపింగ్ యార్డులో పారబోసి నిప్పుపెడుతుండటంతో పొగ, దూమ్ముతో పంట పొలాలు దెబ్బతినండంతో పాటు, పశువు గ్రాసం కూడా కాలిపోతోందని రైతులు వాపోతున్నారు. హాలియా : హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులకు గానే ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ 7 టన్నుల చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. 51 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజు విడిచి రోజు చెత్త సేకరణ సేకరిస్తుండడంతో వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. డంపింగ్ యార్డు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరం ఉండటమే చెత్త సేకరణకు ప్రధాన సమస్యగా మారింది. చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలో రోజుకు 10 టన్నులకు పైగానే చెత్తను సేకరించి శివనేనిగూడెం రోడ్డులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్యార్డు 1వ వార్డుకు సమీపంలో ఉండటంతో పొగతో, దుర్వాసనతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విలీన గ్రామం వెంకటాపురం(ఆరవ వార్డు)లో చెత్తను సేకరించి ఆ వార్డు శివారులోని గుంతలో పారబోస్తున్నారు. ప్రస్తుతం డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం సమస్య వేధిస్తుంది. -
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన
నల్లగొండ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని పోప్పాల్ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని పాటిస్తే భవిష్యత్లో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్బెల్ట్ వినియోగించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ సైదులు, రిటైర్డ్ సీఐ అంజయ్య, ప్రిన్సిపాల్ రవి, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితాపై నివేదిక ఇవ్వాలి
నల్లగొండ : మున్సిపాలిటీల్లో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై సంబంధిత మున్సిపల్, మండలాల ప్రత్యేక అధికారులు సమీక్షించి తనకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని నిర్దేశించిన ప్రొఫార్మలో నివేదిక సమర్పించాలని సూచించారు. నూతన సర్పంచ్లకు శిక్షణ ఇచ్చేందుకు నల్లగొండలో రెండు వేదికలను గుర్తించామని తెలిపారు. ఇకనుంచి నెలకోసారి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వేర్వేరుగా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎంఈఓలు పాఠశాలలను తనిఖీ చేయాలి నల్లగొండ : ఎంఈఓలు వారి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను నెలకోసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అమలు చేస్తున్న పీఎం శ్రీ పాఠశాలలు, టాయిలెట్స్ అంశాలపై విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తు అనుమతి లేకుండా ఉపాధ్యాయులు, ఎంఈఓలు సెలవుపై వెళ్లవద్దన్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడంలో భాగంగా హెడ్మాస్టర్లతో తరచూ సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలకు మంజూరు చేసిన నిధులన్నీ సద్వినియోగమయ్యాలా చూడాలన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి పాఠశాలలో వాల్ను ఏర్పాటు చేసి వారికి నచ్చిన విధంగా బొమ్మలు వేసేలా చూడాలన్నారు. తల్లిదండ్రుల సమావేశాలను అర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, ఎంఈఓలు అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా
నల్లగొండ టౌన్ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్లు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆశ వర్కర్లు డ్యూటీలకే పరిమితం కాకుండా ప్రభుత్వం నిర్వహించే అనేక రకాల పథకాలను ప్రజల దగ్గరికి చేర్చే పనిలో కూడా ఉన్నారన్నారు. అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మహేశ్వరి, వెంకటమ్మ, ఏర్పుల యాదయ్య, అవుట రవీందర్, అనురాధ, కవిత, సైదమ్మ, స్వర్ణ, శైలు, ధనమ్మ, సుజాత, పద్మ, మంజుల, సౌజన్య, వెంకటమ్మ, విమల, పుష్పలత పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లు -
అక్రమ పట్టా రద్దు చేయాలి..
నాకు నలుగురు కుమార్తెలు. నా పేరున ఉన్న 7 ఎకరాల 18 కుంటల భూమిని నాకు తెలియకుండానే పెద్ద కూతురు మోదుగు విజయ 3.32 ఎకరాలు, 4వ కూతురు యాట జయలక్ష్మి 3.22 ఎకరాలు అక్రమంగా పట్టా చేయించుకున్నారు. ఆ పట్టాను రద్దు చేయాలని గతంలో ఆర్డీఓకు విన్నవించాం. ఏడు నెలలు గడిచింది. అయినా సమస్యలు పరిష్కారం కాలేదు. మీరే న్యాయం చేయాలని కలెక్టర్ను కోరింది. స్పందించిన కలెక్టర్ ఆ పట్టాను బ్లాక్లో పెట్టి ఫైల్ పుటప్ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. – సుశీలమ్మ, పెర్కకొండారం, శాలిగౌరారం మండలం నాకు ముగ్గురు ఆడ పిల్లలు. నా భర్త రాజశేఖర్ ఇటీవల చనిపోయాడు. ఆయన పేరున, మా అత్తగారి పేరున భూమి ఉంది. నా భర్త చనిపోవడంతో మా అత్త, ఆడపడుచులు నన్ను వారింటికి రావద్దని వెళ్లగొట్టారు. ముగ్గురు ఆడ పిల్లల్లో ఓ పాపకు 7 నెలలు. భూమి ఇవ్వకుండా.. ఇంటిని రానివ్వకపోతే నేను ఎలా బతకాలి. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి. – గాదరి శృతి, బాలింత, బొడంగిపర్తి, చండూరు మండలం -
కల్వర్టుల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు
నల్లగొండ : జిల్లాలోని మైనర్, మేజర్ కల్వర్టుల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్అండ్బీ శాఖకు సంబందించి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి నుంచి నల్లగొండకు వచ్చే ఆర్అండ్బీ రోడ్డులో 14/912 కిలోమీటర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.10 కోట్లు అదే రోడ్డులోని 22/727 కిలోమీటర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ. 4.90 కోట్లు, 23/8–10 కిలోమీటర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.5.20 కోట్లు, 24/477 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.85 కోట్లు, 27/273 కి.మీ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.95 కోట్లును ప్రభుత్వం విడుదల చేసింది. వాటిని పనులను వెంటనే ప్రారంభించాలని చీఫ్ ఇంజనీర్కు ఆదేశాలు అందాయి. నేడు ఫుడ్ లైసెన్స్ మేళానల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీన నల్లగొండలో ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఫుడ్సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకొని తమ వ్యాపార సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. హోటల్స్, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, బేకరీలు, కిరణాదుకాణాలు, మాంసం, చేపలు విక్రయ కేంద్రాలు, పాల, పాల ఉత్పత్తుల వ్యాపారులు, ఫుడ్ స్టాల్స్, వీధి ఆహార విక్రేతలు, క్యాటరింగ్ చేసే వ్యాపారులు తప్పకుండా ఈ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈనెల 6న నల్లగొండలోని బీటీఎస్ ఫారెస్ట్ ఆఫీస్ రోడ్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి మేళా ఉంటుందని తెలిపారు. ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి నకిరేకల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల రద్దుకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. లేబర్ కోడ్స్, జాతీయ విత్తనం, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ నకిరేకల్లోని నర్రా రాఘవరెడ్డి స్మారక భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పార్లమెంట్ శీతాకాాల సమావేశాల్లో అప్రజాస్వామికమైన ఐదు చట్టాలను చేసి రైతులకు, కార్మికులకు, ప్రజలకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. రైతు సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందాల ప్రమీల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన వెంకులు, చింతపల్లి బయ్యన్న, జిట్టి నగేష్, పెంజర్ల సైదులు, రాచకొండ వెంకన్న, వంటెపాక వెంకటేశ్వర్లు, బొమ్మకంటి కొమరయ్య, సిలివేరు ప్రభాకర్, అంబటి చిరంజీవి, మల్లం మహేష్, కాశీరాం, బొల్లికొండ లింగయ్య, జిట్ల సరోజ, చింతపల్లి లూర్దు, కోట లింగయ్య, సాకుంట్ల నర్సింహ, వంటెపాక కృష్ణ పాల్గొన్నారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రద్దు చేయబడిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళాలతో సహస్రనామార్చన చేశారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపించిన అర్చకులు, ఉత్సవమూర్తుల నిత్య తిరుకల్యాణాన్ని నేత్రపర్వంగా చేపట్టారు. వీటితో పాటు బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవోత్సవం తదితర పూజలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
లోకల్ లారీలకు లోడింగ్ ఇవ్వాలి
చిట్యాల : స్థానికంగా ఉన్న లారీలకు లోడింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలోని ఎంపీఎల్ లాజిస్టిక్ ఎదుట లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిట్యాల లారీ అసోసియేషన్ పరిధిలో చాలా మంది జీవనోపాధి పొందుతున్నారని.. ఇలాంటి సమయంలో ఎంపీఎల్ పరిశ్రమ యాజమాన్యం తమ లారీలకు అవకాశం కల్పించకపోవటంతో జీవనోపాధి కష్టమవుతుందని, లారీల నెలవారి ఈఎంఐలు కట్టె పరిస్థితి కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు లారీలకు రవాణా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీఎల్ లాజిస్టిక్ డైరెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ వస్తువుల రవాణాకు అనుమతులున్నాయని ఆ మేరకు సోమవారం గోదుమల లోడుతో వచ్చిన రైల్వే వ్యాగన్ల నుంచి పరిశ్రమకు చెందిన టిప్పర్లలో రవాణా చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక లారీలకు రవాణా కల్పించే వరకు ఆందోళన కొనసాగిస్తామని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు పరిశ్రమ ఎదుట భీష్మించారు. దీంతో చిట్యాల ఎస్ఐ రవికుమార్ అక్కడికి చేరుకుని భద్రతను పర్యవేక్షించారు. సోమవారం రాత్రి పరిశ్రమ యాజమాన్యంతో.. లారీ యజమానులకు ఒప్పందం కుదిరింది. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు జమాండ్ల శ్రీనివాస్రెడ్డి, అధ్యక్షుడు పాటి దివాకర్రెడ్డి, ప్రధానకార్యదర్శి అక్కెనపల్లి గణేష్, కోశాధికారి గురిజ జంగయ్య, కంచర్ల యాదయ్య, వెంకన్న, బొడ్డు యాదయ్య, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీఎల్ పరిశ్రమ ఎదుట లారీ ఓనర్లు, డ్రైవర్ల ధర్నా యాజమాన్యంతో చర్చలు సఫలం -
నా భూమిని ఆక్రమించారు
గ్రామంలో సర్వే నెంబర్ 257లో 10 గుంటల భూమి ఉంది. గ్రామానికి చెందిన మెగావత్ రాయమల్లు నా భూమిని ఆక్రమించుకుని నన్ను బెదిరిస్తున్నాడు. నాకు పక్షవాతం వచ్చి నడవలేకపోతున్నాను. గతంలో అధికారులను కలిసినా నాకు న్యాయం జరగలేదు. నా భూమి నాకు ఇప్పించాలి. – ఖాజా, పంగవానికుంట, అనుముల మండలం నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో పని చేస్తున్నాం. మాకు ఏడు నెలల నుంచి జీతాలు రాలేదు. ఈ విషయమై అడిగితే కళాశాల ప్రిన్సిపాల్ను మాకు సంబంధం లేదని చెబుతున్నారు. ఏజెన్సీ వారు రేపు, మాపు అంటూ ఏడు నెలలుగా జరుపుతున్నారు. కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉంది. జీతాలు ఇప్పించాలి. – శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది, మెడికల్ కళాశాల, నల్లగొండ -
వెల్నెస్.. మందులు లెస్!
నాలుగు నెలల నుంచి పూర్తిగా మందులు ఇవ్వడం లేదు. బీపీ, షుగర్ మందులు కూడా లేవు. డాక్టర్ రాసిన మందుల్లో సగం కూడా ఇవ్వలేదు. రెండు గంటలు కూర్చున్నా రెండు మూడు ట్యాబ్లెట్లు ఇచ్చి మిగతావి లేవని చెపుతున్నారు. మిగతా వాటిని బయట కొనాల్సివస్తోంది. – అనంతరెడ్డి, పెద్దసూరారంనల్లగొండ టౌన్ : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని వెల్నెస్ సెంటర్లో మందుల కొరత తీరడం లేదు. నాలుగు నెలులుగా పూర్తిస్థాయిలో మందులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ డాక్టర్ సూచించిన ప్రిస్కిప్షన్లోని సగం మందులు కూడా ఇవ్వడం లేదు. కనీసం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, జ్వ రం, జలుబు తదితర రోగాలకు సంబంధించిన మందులు కూడా లేవు. వెల్నెస్ సెంటర్ నిర్వహణను గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చేపట్టగా.. కొన్ని నెలలుగా డీఎంఈ పరిధిలోకి వచ్చింది. అప్పటినుంచి మందులు పూర్తిస్థాయిలో రావడం లేదని తెలుస్తోంది. ప్రైవేట్ దుకాణాల్లో కొనాల్సిందే.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన హెల్త్కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు నల్లగొండలోని వెల్నెస్ సెంటర్కు రోజూ వందల మంది వస్తుంటారు. ఇక్కడ కేవలం జనరల్ మెడిసిన్, డెంటల్ వైద్య సేవలతో పాటు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. ఇతర వ్యాధులకు సంబంధించిన బయట వైద్యులు పరీక్షించి రాసిన మందులను కూడా అందజేస్తారు. కానీ గత నాలుగు నెలలుగా వెల్నెస్ సెంటర్లో మందులు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల హెల్త్కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మందులు లేకపోవడంతో ప్రైవేట్ మందుల దుకాణాల్లో వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. గంటల తరబడి తప్పని నిరీక్షణ వెల్నెస్ సెంటర్కు వచ్చే కార్డుదారులలో ఎక్కువ మంది వృద్ధులు ఉంటారు. వారికి డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్లోని మందులను తీసుకోవడానికి రెండు నుంచి మూడు గంటల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. ఫార్మసీలో ముగ్గురు సిబ్బందికిగాను ఒక్క ఫార్మసిస్టు మాత్రమే విధులు నిర్వహిస్తోంది. ఆమెఒక్కో కార్డుదారుకు మందులు ఇవ్వాలంటే పది నుంచి ఇరవై నిమిషాల సమయం పడుతుంది. దీంతో మందుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అయినా కేవలం సగం మందులే ఇస్తుండడంతో వాటిని తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఫ వెల్నెస్ సెంటర్లో నాలుగు నెలలుగా మందుల కొరత ఫ దీర్ఘకాలిక రోగులకు తప్పని అవస్థలు -
గోడు వినండి.. గోస తీర్చండి
నల్లగొండ : మా గోడు విని.. మా సమస్యలు పరిష్కరించాలని పలువురు బాధితులు కలెక్టర్కు మొర పెట్టుకున్నారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ వినతులు స్వీకరించారు. భూములు అక్రమంగా పట్టా చేయించుకున్నారని, పింఛన్లు రావడం లేదని తదితర సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. సమస్యలను విన్న కలెక్టర్ వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫ గ్రీవెన్స్కు తరలి వచ్చిన బాధితులు ఫ ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ చంద్రశేఖర్ -
ఓట్లు అక్కడ!
మేము ఇక్కడ.. మున్సిపాలిటీల్లో ఎందుకిలా? ఫ తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా ఫ ఒక వార్డులో నివాసం ఉంటే.. మరో వార్డులో ఓట్లు ఫ ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు వార్డుల్లోకి.. ఫ సరిచేయాలంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులుతప్పుల తడకగా మున్సిపల్ ఓటర్ల జాబితా రూపొందించారంటూ రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల నేతలతో ముసాయిదా ఓటరు జాబితాపై సోమవారం మున్సిపల్ కమిషనర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఒక వార్డులో ఓట్లు మరో వార్డులోకి వెళ్లాయని వాటిని సరి చేయాలంటూ కమిషనర్ల దృష్టికి తీసుకురాగా వార్డు హద్దుల ప్రకారం ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల కోసం విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారింది. ఒక వార్డులో నివాసం ఉంటే మరో వార్డులోకి ఓట్లు మారిపోయాయి. ఒకే ఇంట్లోని వ్యక్తుల ఓట్లు వేర్వేరు వార్డుల్లోకి వెళ్లిపోయాయి. పలుచోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, వాటిని సరి చేయాలంటూ కమిషనర్లకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. 18 మున్సిపాలిటీలు.. 1556 ఫిర్యాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఇంకా ముగియలేదు. దీంతో నికిరేకల్ మినహా.. మిగతా 18 మున్సిపాలిటీల్లో ఈ నెల 1వ తేదీన వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రచురించారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అధికారులు అభ్యంతరాల స్వీకరణ చేపట్టారు. దీంతో ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు. ఒక వార్డులో ఓటర్లను, మరో వార్డులో చూపించడంతో కొందరి పేర్లు తప్పుగా దొర్లడం, మరికొందరి ఓట్లే కనిపించకుండా పోవడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందజేశారు. సోమవారం సాయంత్రం వరకు 1,556 ఫిర్యాదులు మున్సిపల్ కమిషనర్లకు అందాయి. చిట్యాల మున్సిపాలిటీలో అత్యధికం ఉమ్మడి జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా అభ్యంతరాలు వచ్చాయి. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పులపై 258 ఫిర్యాదులు అందాయి. ఆ తరువాత అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో 238 ఫిర్యాదులు వచ్చాయి. వాటితోపాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ తమ వార్డులు మారిపోయాయని, తాము ఒక చోట ఉంటే మరొక వార్డులో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఇక తక్కువగా అభ్యంతరాలు మోత్కూర్ మున్సిపాలిటీలో (రెండే) వచ్చాయి. పలు చోట్ల ఓట్లు గల్లంతైనా వాటిపై అధికారులు ఫిర్యాదులు తీసుకోవడం లేదని ఓటర్లు వాపోయారు. -
అమ్మ భాష మెరిసేలా..
పిల్లల్లో తెలుగు పఠనాసక్తిని పెంచేందుకు ఆచార్యులగూడెం జెడ్పీహెచ్ఎస్ సిబ్బంది నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. - 8లోఈ ఫొటోలోని వ్యక్తి కొలిశెట్టి శ్రీకాంత్. సూర్యాపేట మున్సిపాలిటీలోని 16వ వార్డు శ్రీరామ్నగర్లో నివాసం ఉంటారు. ఇంట్లో ఐదుగురు ఉంటారు. గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 16వ వార్డులోనే ఓట్లు వేశారు. ఇప్పుడు కుటుంబంలోని ఐదుగురి ఓట్లు 32వ వార్డులోకి మారాయి. తమ ఓట్లను మరో వార్డులోకి ఎలా మార్చుతారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ ఫిర్యాదుల సంఖ్య నల్లగొండ 139 నేరేడుచర్ల 98 హాలియా 105 దేవరకొండ 64 చండూరు 26 మిర్యాలగూడ 106 తిరుమలగిరి 17 మోత్కూర్ 02 హుజూర్నగర్ 197 ఆలేరు 23 భువనగిరి 45 పోచంపల్లి 21 కోదాడ 131 సూర్యాపేట 238 నందికొండ 18 చిట్యాల 258 చౌటుప్పల్ 12 యాదగిరిగుట్ట 56మున్సిపాలిటీల వారీగా వచ్చిన ఫిర్యాదులు ఇలా -
రూటు మారిన ఓటు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా తప్పులతడకగా రూపొందించారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ అనేక పొరపాట్లు దొర్లాయి. నివాసం ఒక వార్డులో ఉంటే, ఓట్లు మరో వార్డులోకి వెళ్లాయి. ఒకే ఇంట్లో కొందరి ఓట్లు ఒక వార్డు పరిధిలో.. మరికొందరివి మరో వార్డు పరిధిలోకి వెళ్లాయి. మరికొన్ని చోట్ల అసలు ఓట్లే లేకుండా పోయాయి. దీంతో ఓటర్లంతా ఫిర్యాదులతో మున్సిపల్ కార్యాలయాల బాట పట్టారు. కార్పొరేషన్, పెద్ద మున్సిపాలిటీల్లో వందల కొద్దీ తప్పిదాలు చోటు చేసుకోగా, చిన్న మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఓటర్ల జాబితాలో తప్పులపై సుమారు 6 వేల ఫిర్యాదులు అధికారులకు అందాయి. దీంతో వాటిని పరిష్కరించేందుకు తల పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లగొండలోనే అత్యధిక ఫిర్యాదులు ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లాయంటూ ఎనిమిది ఉమ్మడి జిల్లాల పరిధిలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 5,406 ఫిర్యాదులు అధికారులకు అందాయి. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిష్కరిస్తే తప్ప ఆ పొరపాట్లను సరిచేయలేమని అధికారులు చెబుతున్నారు.ఎంత మేరకు పరిష్కరిస్తారన్నది ఈ నెల 10వ తేదీన తుది ఓటరు జాబితా విడుదలైతేనే తెలియనుంది. ఇక ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు అత్యధికంగా 1,556 నల్లగొండ జిల్లాలోనే వచ్చాయి. ఒకే సీరియల్ నంబరు ఇళ్లు ఉండటంతోనే... అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగానే వార్డులవారీ ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా వార్డుల వారీగా ‘టీ పోల్’యాప్ ద్వారా హద్దులు నిర్ణయించి, ఇంటి నంబర్ల ఆధారంగా వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను తయారు చేశారు. అయితే ఒక ఇంటి నంబర్ సీరియల్ ప్రారంభ డిజిట్ రెండు మూడు వార్డుల్లో ఉండటం, ప్రస్తుతం టీ పోల్ యాప్లో ఆ ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్ల జాబితా చేయడంతో పలు ఇళ్లకు చెందిన ఓటర్లు వేర్వేరు వార్డుల్లోకి వెళ్లిపోయారు. గతంలో ఉన్న వార్డు ఓటర్ల జాబితాను పరిశీలించుకుంటూ ఏ ఇంటి నంబర్ ఏ వార్డులో ఉందనేది తేల్చుతూ ఓటర్ల జాబితా తయారు చేస్తే ఇన్ని తప్పులు దొర్లేవి కావు. ఓటర్ల జాబితాల్లో తప్పులెన్నో.. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ ఓట్లు వేరే వార్డుల్లోకి మారిపోయాయని 1,187 మంది ఓటర్లు ఫిర్యాదు చేశారు. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల నుంచి 868 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో అత్యధికంగా 629 మంది ఓటర్లు తమ ఓట్లు వేరే డివిజన్లలోకి వెళ్లిపోయాయని ఫిర్యాదు చేశారు. ⇒ నిజామాబాద్ నగరపాలక సంస్థలో 1, 2, 3, 28వ డివిజన్లలో 3,200 ఓట్లు గల్లంతయ్యాయి. ఆ డివిజన్లలోకి వేరే డివిజన్ల నుంచి మరో 2,500 ఓట్లు వచ్చి చేరాయి. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. 4, 43వ డివిజన్ల నుంచి మరో వెయ్యికి పైగా ఓట్లు ఇతర డివిజన్లలోకి వెళ్లిపోయాయని ఫిర్యాదు చేశారు. బోధన్లో ఓటర్ల పేర్లు గల్లంతు అయ్యాయని, భీమ్గల్ మున్సిపాలిటీలో 3 వేల ఓట్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లిపోయాయని ఫిర్యాదు చేశారు. ⇒ భూపాలపల్లి జిల్లాలో గ్రామాల పరిధిలో రెండేళ్ల కిందట నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి వెళ్లిపోయిన వారి ఓట్లను కూడా భూపాలపల్లి మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. ⇒ కరీంనగర్ నగరంలోని 64వ డివిజన్లో 600కు పైగా ఇతర ప్రాంత (డివిజన్కు సంబంధం లేని) ఓట్లున్నట్లు అభ్యంతరాలు వచ్చాయి. ఇది ఎవరికీ పట్టని కాలనీ.. 449 మంది ఓట్ల తొలగింపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొమ్మేపల్లి పునరావాస కాలనీని ఆరేళ్ల కింద ఏర్పాటు చేశారు. అక్కడ 449 మంది ఓటర్లు ఉన్నారు. వారు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ కిష్టారం పంచాయతీ పరిధిలో ఓట్లు వేశారు. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కారణం ఏంటంటే.. మున్సిపాలిటీ పరిధిలో ఆ కాలనీ ఉండటమే. అయితే ప్రస్తుతం వారికి మున్సిపాలిటీ పరిధిలో ఓట్లు లేకుండా చేశారు.దీనిపై వారంతా ఎంపీడీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్కు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా 449 మందికి ఓటు హక్కు ఇవ్వలేదు. దీంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆ కాలనీని ఆనుకొని ఉన్న సింగరేణి క్వార్టర్స్ వారు 300 మంది ఓట్లు నమోదు చేసుకోగా, అదే మున్సిపాలిటీలోని 17వ వార్డులో కలిపారు. అయితే, కొమ్మేపల్లి పునరావాస కాలనీని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.ఈయన కడియం రమేశ్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 19వ వార్డు పరిధిలోని ముత్తిరెడ్డి కుంట. ఇంట్లో ఐదుగురు ఉంటారు. ఆయన భార్య జ్ఞానేశ్వరి, ఇద్దరు కూతుళ్లు జెన్నిఫ్లోరా, డివైన్ రోజ్ల ఓట్లు 19వ వార్డులో ఉన్నాయి. రమేష్ తోపాటు మరో కూతురు జెస్సికా ఫ్లోరెన్స్ ఓట్లు మాత్రం 38వ వార్డులోకి వెళ్లిపోయాయి. దీంతో వాటిని మార్చాలంటూ ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. -
మాటలేని మూగజీవాల వేదన… నదిని ఈదే గోవులు
చందంపేట: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లిలో ఆవులు కృష్ణా నదిని ఈదుకుంటూ శనివారం ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్లాయి. చందంపేట మండలం కంబాలపల్లి, కాచరాజుపల్లి, గువ్వలగుట్ట, పొగిళ్ల తదితర ప్రాంతాల ఆవులను.. కాపరులు జనవరి నెలలో గ్రాసం కోసం ఆంధ్రకు తరలిస్తుంటారు.కంబాలపల్లి నుంచి ఆంధ్ర ప్రాంతంలోని మాచర్లకు వెళ్లాలంటే సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో ఆవులను ఇలా రెండు కిలోమీటర్ల మేర కృష్ణా నదిని దాటిస్తుంటారు. మొదట గంగమ్మకు పూజలు చేసి గోవులను క్షేమంగా ఒడ్డుకు చేర్చాలని మొక్కుతారు. జనవరిలో మేత కోసం వెళ్లిన ఆవులు.. ఆరు నెలల తర్వాత జూన్లో స్వస్థలానికి ఈదుకుంటూనే తిరిగొస్తాయి. దూడలను మాత్రం కాపరులు తమతో పాటు పుట్టీల్లో తీసుకెళ్తారు. -
అధ్యయనోత్సవాలు పరిసమాప్తం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆరు రోజుల పాటు కొనసాగిన అధ్యయనోత్సవాలు ఆదివారం పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా ముగిశాయి. చివరి రోజు శ్రీస్వామిని శ్రీలక్ష్మీనరసింహుడిగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ అద్దాల మండపంలో శ్రీస్వామిని అధిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. అధ్యయనోత్సవాలకు వచ్చిన దివ్య ప్రబంధ పారాయణీకులను ఆలయాధికారులు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు అలయంలో నిత్య ఆరాధనలు నిర్వహించి, పారాయణీకులచే ప్రబంధ పారాయణం జరిపించారు. శ్రీస్వామి వారి ఆలయంలో ఉత్సవమూర్తులకు తిరుమంజన, నవకలశ స్నపన మహోత్సవం చేపట్టారు. అధ్యనోత్సవాలు ముగిసిన నేపథ్యంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. చివరి రోజు శ్రీలక్ష్మీనరసింహుడిగా అలంకరణ నేటి నుంచి నిత్య, శాశ్వత కల్యాణం, సుదర్శన హోమం ప్రారంభం -
చెరువులో కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగింపజేస్తా
● ఎమ్మెల్యే మందుల సామేల్ మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువులోని కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగింపజేస్తామని, మున్సిపల్ సుందరీకరణకు కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూ.13 కోట్లతో డీపీఆర్ రూపొందిస్తున్నారని, పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కేంద్రంలో రూ.2.50 కోట్లతో అంబేద్కర్ స్టడీ సర్కిల్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో విలీన గ్రామాలైన కొండగడప, బుజిలాపురంల అభివృద్ధితో పాటు శివారు గ్రామాలైన ఆరెగూడెం, రాజన్నగూడెం, ధర్మాపురం, కొండాపురం, జామచెట్లబావి అభివృద్ధి కోసం పాటు పడతానన్నారు. మోత్కూరు మినీ ట్యాంక్బండ్ చెరువు కట్ట రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు, వంగాల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల, అవిశెట్టి అవిలుమల్లు, గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, చింతల విజయభాస్కర్రెడ్డి, యాదగిరిరెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పనిచేసే నాయకులు ప్రజల హృదయాల్లో నిలుస్తారు
గరిడేపల్లి: ప్రజల కోసం పనిచేసే నాయకులు చనిపోయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారని సీపీఐ జాతీయ నాయకుడు, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు. ఆదివారం గరిడేపల్లి మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో సీపీఐ నాయకుడు పోటు ప్రసాద్ స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కమ్యూనిజం లేకుండా చేస్తామని మోదీ, అమిత్షా అంటున్నారని, కమ్యూనిజాన్ని అంతమొందించడం అంత సులువు కాదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. వెనుజులా దేశంపై అమెరికా చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, హేమంతరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, దండి సురేష్, రాజేశ్వరరావు, గుమ్మడి నరసయ్య, పోటు రంగారావు, గన్న చంద్రశేఖర్, ధనుంజయనాయుడు, రాములు, నారాయణరెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, సృజన, కంబాల శ్రీనివాస్, నంద్యాల రామ్రెడ్డి, సాయిబెల్లి, కళావతి, బాబు, కడియాల అప్పయ్య, సర్పంచ్లు కట్ట కళ్యాణి, పద్మ, పూర్ణచంద్రరావు, పున్నయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు. -
లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
వలిగొండ : లారీ బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన వలిగొండ మండలం నర్సాపురం గ్రామం పరిధిలోని బోడబండగూడెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూర్ మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికిరణ్ (19), దాచారం గ్రామానికి చెందిన బోల్ల దీక్షిత్ (21) స్నేహితులు. ఇద్దరు కలిసి బైక్పై భువనగిరికి వెళ్తుండగా నర్సాపురం గ్రామంలోని బోడబండగూడెం వద్ద ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు లారీ టైర్ల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్ తెలిపారు. దాచారం, దత్తప్పగూడెంలో విషాదఛాయలు మోత్కూరు : నర్సాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల స్వగ్రామాలైన మోత్కూరు మండలం దాచారం, దత్తప్పగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరు ఇరు కుటుంబాల్లో ఏకై క కుమారులు కావడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. నాడు పిడుగుపాటుతో తండ్రి.. నేడు రోడ్డు ప్రమాదంలో కుమారుడు.. దాచారం గ్రామానికి చెందిన బోళ్ల సంపత్– విజయ దంపతులకు కుమారుడు దీక్షిత్ (21), కుమార్తె జస్విక ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం స్వగ్రామంలో చింత చెట్టు కింద ఉన్న సంపత్ పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తల్లి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ కింద నైట్ వాచ్మెన్గా పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. దీక్షిత్ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. నాడు భర్త సంపత్ పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో ఆ బాధ నుంచి తేరుకోక ముందే ఇప్పుడు కుమారుడు దీక్షిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఏకై క కుమారుడిని కోల్పోవడంతో.. దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికిరణ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. కుమారుడు సాయికిరణ్ డిగ్రీ వరకు చదివాడు. కొంత కాలం ప్రైవేట్ కంపెనీలో పని చేసి మానేశాడు. కుటుంబానికి అండగా నిలబడతాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, అతడి అక్కాచెల్లెళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇరు కుటుంబాల్లో ఒక్కగానొక్క కుమారులు చనిపోవడంతో వారి తల్లిదండ్రుల రోదనలు ప్రజలను కలిచివేశాయి. -
పెళ్లికి నిరాకరించాడని..
చందంపేట : రెండు సంవత్సరాలుగా ప్రేమించి, తీరా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం నేరెడుగొమ్ము మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన పులికంటి శ్రీను, అదే గ్రామానికి చెందిన నిరసనమెట్ల మంజుల ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనుకు కొన్ని నెలల క్రితం రైల్వేలో ఉద్యోగం వచ్చింది. యువతి డిగ్రీ చదువుతోంది. వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వ కొలువు వచ్చిన నాటి నుంచి తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తుండడంతో మంజుల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గ్రామంలో పెద్దమనుషుల మధ్య మాట్లాడేందుకు శ్రీను రాకపోవడంతో గత నెల 24వ తేదీన అతడి ఇంటి ఎదుట పెట్రోల్ బాటిల్తో బైఠాయించింది. అంతకుముందే విషయం తెలుసుకున్న శ్రీను, అతడి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలానికి వెళ్లారు. యువతి కుటుంబసభ్యులు, బంధువులు అక్కడకు వెళ్లగా వీరి మధ్య వాగ్వాదం నెలకొంది. తాజాగా శనివారం మాట్లాడేందుకు శ్రీను, మంజుల తరపున కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్కు వచ్చారు. వీరి మధ్య మాటామాటా పెరగడం, శ్రీను వివాహం చేసుకునేందుకు అంగీకరించకపోవడంతో యువతి తన వెంట తెచ్చుకున్న డెటాల్ను తాగింది. గమనించిన సీఐ బీసన్న చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం యువతిని ఆదివారం హైదరాబాద్కు తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ యువతి తరపు బంధువులు కోరుతున్నారు.● యువతి ఆత్మహత్యాయత్నం ● నేరెడుగొమ్ము మండల కేంద్రంలో ఘటన -
రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డికి నివాళి
చిట్యాల: చిట్యాల పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి (ముప్ప నర్సింహా రెడ్డి) (84) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, జియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా విధులు నిర్వహించారు. 2004 నుంచి 2007 వరకు భూదాన్పోచంపల్లిలోని శ్రీ స్వామి రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్గా విధులు నిర్వహించారు. ఆయనకు భార్య భారతి, కుమార్తె అర్పిత, అల్లుడు గోపాల్రెడ్డి(మద్యప్రదేశ్ స్టేట్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరి) ఉన్నారు. ఎంఎన్ రెడ్డి మనవడితో ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కుమార్తెతో వివాహమైంది. ఎంఎన్.రెడ్డి మృతదేహాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాళులర్పించారు. చిట్యాల శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎంఎన్.రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. పలువురి సంతాపంభూదాన్పోచంపల్లి: మండలంలోని జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి మృతి పట్ల ఆదివారం సంస్థ చైర్మన్ కిషోర్రెడ్డి, డైరెక్టర్ హరికృష్ణ, వైఎస్ చక్రవర్తిస్వామి, అధ్యాపకులు సంతాపం తెలిపారు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలంచిట్యాల: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బాకీ కార్డులను ఆదివారం చిట్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బాకీ పడిన మొత్తాన్ని, రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వార్డు ప్రజలకు వివరించారు. అనంతరం చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే చిట్యాల మున్సిపాలిటీలో సుమారుగా రూ.30కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వైకుంఠధామం, ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాజ్ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ దుకాణ సముదాయాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో చిట్యాల మున్సిపాలిటీలో ఒక్క అభివృద్ది కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీంధర్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు జమాండ్ల శ్రీనివాస్రెడ్డి, జిట్ట బొందయ్య, కందాటి రమేష్రెడ్డి, రుద్రవరం యాదయ్య, కన్నెబోయిన శ్రీశైలం, ఆగు అశోక్, జిట్ట శేఖర్, ఆవుల ఆనంద్, అమరోజు నవీన్కుమార్, విఠల్రెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు.● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
గురుకులం పిలుస్తోంది!
ముఖ్యమైన తేదీలు : దరఖాస్తులు ప్రారంభం : డిసెంబర్ 11, 2025 దరఖాస్తులకు గడువు : జనవరి 21, 2026 ప్రవేశ పరీక్ష : ఫిబ్రవరి 22, 2026 పూర్తి వివరాలు: టీజీసెట్.సీజీజీ.జీవోవీ.ఇన్ ఐదో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ 21వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం పెద్దవూర: తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతిలో ప్రవేశానికి, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్యూఆర్ఈ ఐఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గత నెల 11వ తేదీన ప్రారంభంకాగా.. ఈనెల 21వ తేదీ వరకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష రుసుం రూ.100లు ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకు సూచనలు ఐదవ తరగతిలో ప్రవేశానికి విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి చదువుతుండాలి. ఆరు నుంచి తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి గాను వరుసగా ఐదు నుంచి ఎనిమిదో తరగతి చదువుతుండాలి. ఐదవ తరగతిలో ప్రవేశాలకు ఓసీ, బీసీ, బీసీ మైనారిటీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు వరుసగా ఓసీ, బీసీ, బీసీ మైనారిటీలకు 10 నుంచి 15 ఏళ్ల మద్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10 నుంచి 17 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణం ప్రాంతం వారికి రూ.1,50,000లు, పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షలకు మించకూడదు. ప్రవేశ పరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. తెలుగు (20 మార్కులు), ఇంగ్లిష్(25 మార్కులు), గణితం(25 మార్కులు), మెంటల్ ఎబిలిటీ(10 మార్కులు), పరిసరాల విజ్ఞానం(20 మార్కులు) సబ్జెక్టులలో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నంటాయి. విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఐదవ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి చదువుతున్నట్లుగా, ఆరో తరగతిలో 5వ తరగతి, 7వ తరగతిలో 6, 8వ తరగతికి 7వ, 9వ తరగతికి 8వ తరగతి చదువుతున్నట్లు సంబంధిత పాఠశాల నుంచి బోనఫైడ్/స్టడీ సర్టిఫికెట్ను దరఖాస్తుతో పాటు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. విద్యార్థుల ఎంపికకు ఉమ్మడి జిల్లాను యూనిట్గా పరిగణిస్తారు. ఇతర సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్ 1800 42545678ను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వ గురుకులాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని ప్రమాణాలతో బోధన చేసి విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రత్యేకించి విద్యార్థులలో క్రమశిక్షణ, ఆటలపై ఆసక్తి, ధ్యానం ఇతర అన్ని విధాలా విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహకాన్ని అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – మంగ్తా భూక్యా, ప్రిన్సిపాల్, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం, పెద్దవూర -
39 ఏళ్ల తరువాత ఒక్కచోటుకు..
పెద్దవూర: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో 1986–87లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఆదివారం ఒకే వేదికపైకి చేరారు. 39 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ప్రస్తుత పెద్దవూర సర్పంచ్ ఐతగోని వెంకటయ్య, కూర్నాల శ్రీనివాస్, పీఎల్ఎన్ శర్మ, శ్రీనవాస్శర్మ, సంజీవ, వెంకటయ్య, రవీందర్రెడ్డి, దేవదాసు, సంజీవ్కుమార్, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీదేవి, నీలమ్మ, జయమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరి కంటి సమస్యను తీరుస్తా
మునుగోడు: నియోజకవర్గంలోని ప్రతిఒక్కరి కంటి సమస్యను పరిష్కరిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మునుగోడులోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 11వ విడుత ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లోని అనేక మంది నిరుపేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, వారు కార్పొరేట్ స్థాయి ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకొలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. వారందరికీ తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన 10 శిబిరాల్లో 7,806 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1490 మందికి ఆపరేషన్లు చేయించినట్లు చెప్పారు. అవసరమైతే మునుగోడులో అన్ని సౌకర్యాలతో ప్రత్యేక కంటి ఆస్పత్రి నిర్మాణం చేపట్టి నల్లగొండ జిల్లాలోని పేద ప్రజలందరికీ వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నారబోయిన రవి, చండూరు మార్కెట్ చైర్మన్ దొటి నారయణ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, పాల్వాయి జితేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి -
తెలంగాణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని నాగార్జునసాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఆదివారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షురాలిగా సుంకిరెడ్డి రమ్య, ప్రధాన కార్యదర్శిగా ముచ్చపోతుల కిరణ్కుమార్, ఉపాధ్యక్షులుగా రొయ్య వెంకట్రామయ్య, సహాయ కార్యదర్శిగా గుగులోతు కల్పన, కోశాధికారిగా రాజ్యలక్ష్మి, సాంస్కృతిక ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఎర్రెడ్డి అంజిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా చంద నరేందర్రెడ్డి, షేక్ ఖాసీం, మీర్ ఆసీఫ్అలీఖాన్, కలం ధర్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులు మేక నితీష్రెడ్డి, మేడికొండ బాబ్జి, గౌరవ సలహాదారులు రొక్కం మాధవరెడ్డి సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలు రమ్య ప్రధాన కార్యదర్శి కిరణ్ -
10 రోజులు.. 1,02,685 బస్తాలు
నల్లగొండ అగ్రికల్చర్ : యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా బుకింగ్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ యాప్ను గత డిసెంబర్ 20 నుంచి అమలులోకి తెచ్చింది. 22వ తేదీ నుంచి రైతులు యాప్లో యూరియా బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ వరినాట్లు, వేరుశనగ ఇతర పంటల సాగు ఊపందుకోవడంతో.. ఇప్పటి వరకు 34,926 మంది రైతులు యాప్లో 1,15,524 బస్తాల యూరియా కోసం బుక్ చేసుకున్నారు. వారిలో 1,02,685 బస్తాలను ఆయా దుకాణాలు, పీఏసీఎస్ల నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఎకరాకు మూడు బస్తాలే.. గతంలో రైతులు ఇష్టానుసారంగా యూరియా పరిమితి లేకుండా కొనుగోలు చేసేవారు. గత వానాకాలంలో యూరియాను అధికంగా వాడడంతో పాటు రైతులు ముందస్తుంగా నిల్వ ఉంచుకున్న కారణంగా సకాలంలో యూరియా అందక రైతులు నానా అవస్థలు పడిన విషయం విధితమే. దీనికి దృష్టిలో పెట్టుకుని యాసంగిలో రైతులు యూరియాకు ఇబ్బందులు పడోద్దన్న సంకల్పంతో ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్లో యూరియాను బుక్ చేసుకుంటే ఎకరానికి మూడు బస్తాల చొప్పున మాత్రమే ఇవ్వనున్నారు. ఒకటి నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులకు ఒక దఫాలో, రెండు నుంచి ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు రెండు నుంచి మూడు దఫాల్లో యూరియాను అందించున్నారు. దీంతో యూరియా అధిక వినియోగాన్ని కట్టడి చేయడంతో పాటు రైతులకు అవసరం మేరకు యూరియాను అందించే వెసులుబాటు కలుగుతోంది. యాసంగి సీజన్లో ఎరువుల అంచనా ఇలా.. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 6,57,229 ఎకరాల్లో వరి, ఇతర పంటలను సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో వరి 5,64,678 ఎకరాల్లో సాగుకానున్నట్లు అంచనాలు వేసింది. దానికి గాను యూరియా 74,955 మెట్రిక్ టన్నులు, డీఏపీ 18,583 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 14,600, కాంప్లెక్స్ ఎరువులు 46,628, ఎస్ఎస్పీ 7435 మెట్రిక్ టన్నులు అవసరంగా అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించింది.ఫ బుకింగ్ యాప్ ద్వారా రైతులకు యూరియా సరఫరా ఫ ఇప్పటి వరకు యూరియా బుక్ చేసుకున్న 34,926 మంది రైతులు ఫ యాప్లో బుకింగ్తో తీరనున్న యూరియా కష్టాలు -
యూరియా అందుబాటులో ఉంది
జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉంది. యూరియా కోసం ఆందోళన అవసరం లేదు. యాప్లో బుక్ చేసుకున్న రైతులకు వెంటనే కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఎకరానికి మూడు బస్తాలు ఇస్తున్నారు. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ నాకు ఎకరం 34 గుంటల భూమి ఉంది. వరి సాగు చేస్తున్నారు. యూరియా కోసం యాప్లో బుక్ చేసుకుంటే గొల్లగూడ సహకార సంఘంలో మూడు బస్తాల యూరియా ఇచ్చారు. యూరియాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 15 రోజుల తరువాత మళ్లీ బుక్ చేసుకుంటే ఇస్తామన్నారు. – కుంచం ఎల్లయ్య రైతు, గొల్లగూడ -
ప్రజాస్వామ్యం మేడిపండు చందం
చండూరు : దేశంలో ప్రజాస్వామ్యం మేడిపండు చందంగా ఉందని, సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ సంస్మరణ సభ చండూరు మండలం పుల్లెంలలో ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ను ఆపాలని, బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమించాయన్నారు. మావోయిస్టులు చర్చలు జరుపుతామని అన్నా అవకాశం ఇవ్వకుండా.. అడవుల్లో ఉన్న ఖనిజ సంపద దోచేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నిరంకుశంగా చంపుతునాన్నరని ధ్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం లేకుండా చేస్తే, ఆర్థిక అసమానతలు లేని సమాజం వస్తే మావోయిస్టులు ఉండరని చెప్పారు. పాక హనుమంతు డిగ్రీ చదివే రోజుల్లో ఏబీవీపీ అరాచకాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారని, 45 ఏళ్ల పాటు పీడిత ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన మరణ వార్త మునుగోడును విషాదంలో ముంచిందన్నారు. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ పాక హనుమంతును చంపి రాజ్యం గెలిచిందని విర్రవీగుతోందని, కానీ ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు పెట్టినా ఆయన అంతిమయాత్రకు 20 వేల మంది ప్రజలు హజరయ్యారంటేనే ప్రజలు గెలిచారని అర్థమవుతోందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ మావోయిస్టులను చంపేందుకు ఓ దిక్కు అమిత్షా, మరోపక్క చంద్రబాబు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. దేశంలో రాజకీయాలు ఎంత కిరాతకంగా చేస్తున్నారో ఈ ఎన్కౌంటర్లను చూస్తే అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, విరసం కార్యదర్శి రివేరా, భరద్వాజ, భవాని, అనురాధ, దీప, మాభూమి సంధ్య, డాక్టర్ టి.నరసింహాచారి, పందుల సైదులు, బాబన్న, భవనం శ్రీనివాస్రెడ్డి, దాడి శ్రీనివాస్రెడ్డి, కావలి యాదగిరి, పిట్టల శంకర్, బుచ్చన్న, జంగయ్య, యాదగిరి, లింగయ్య, సర్పంచ్ ముక్కాముల వెంకన్న, వెంకట్రెడ్డి, రమేష్, వెంకట్రెడ్డి, లోకేష్ పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఫ పుల్లెంలలో పాక హనుమంతు సంస్మరణ సభ -
జీజీహెచ్లో పారిశుద్ధ్యంపై ఫోకస్
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో పరిసరాల పరిశుభ్రతపై నూతన సూపరింటెండెంట్ నర్సింహారావు నేత ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గతానికి భిన్నంగా ఇటీవల జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలను చేపట్టిన సూపరింటెండెంట్ వైద్య సేవలను పర్యవేక్షించడంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్ను పెట్టారు. వార్డులే కాదు ఆస్పత్రి ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగులు త్వరగా కోలుకుంటారన్నది ఆయన భావన. రోగం వచ్చిన తరువాత ఆస్పత్రికి పోవడం సరికాదు.. రోగం రాకుంగా ముందు చూసుకోవడం ముఖ్యమని ఆస్పత్రి ఆవరణలోని పరిసరాలను పరిశుభ్రం చేయిస్తున్నారు. గతంలో వార్డుల్లోనే.. గతంలో పనిచేసిన అధికారులు కేవలం వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగు కోసం చొరవ చూపే వారు. జీజీహెచ్ ఆవరణలో పిచ్చిమొక్కలు మొలిచి, ఆస్పత్రికి వచ్చే వారు ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, తినుబండాలను వేయడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండేది. ఆస్పత్రి వచ్చే వాహనదారులతో పాటు డాక్టర్లు, సిబ్బంది కూడా వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేవారు. ఎక్కడా చెత్త లేకుండా.. నూతన సూపరింటెండెంట్ నర్సింహారావు నేత ప్రతి వార్డును రోజూ సందర్శిస్తూ పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. వెల్నెస్ సెంటర్, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ విభాగం పరిసరాల్లో పిచ్చిమొక్కలను తొలగించి అక్కడ ఎర్రమట్టిని పోయించి డోజర్తో చదును చేయిస్తున్నారు. ఆవరణలో ఎక్కడా చెత్తలేకుండా రోజూ రెండు సార్లు శుభ్రం చేయిస్తున్నారు. మంచినీటి ట్యాంకు, క్యాంటిన్, రోగుల సహాయకులు ఉండే షెడ్ల వద్ద శుభ్రం చేయించారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసి డాక్టర్లు, సిబ్బంది, ప్రజలు ప్రత్యేక స్థలాలో మాత్రమే పార్కింగ్ చేసే విదంగా ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను నియమించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకుంటున్న సూపరింటెండెంట్ను ప్రజలతో పాటు రోగులు అభినందిస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వార్డులు మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు. ఆస్పత్రి ఆవరణతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడే రోగులతో పాటు వారి సహాయకులు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలి. – డాక్టర్ గుర్రం నర్సింహారావునేత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఫ ఆస్పత్రి వార్డులతోపాటు పరిసరాలపై దృష్టి పెట్టిన సూపరింటెండెంట్ ఫ పారిశుద్ధ్య కార్మికులను పరుగులు పెట్టిస్తున్న నూతన అధికారి -
మూసీలో గుర్రపు డెక్క
కేతేపల్లి : మూసీ రిజర్వాయర్లో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోయింది. ఈ ఏడాది వరదతోపాటు పరివాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గుర్రపుడెక్క కూడా రిజర్వాయర్లోకి కొట్టుకొచ్చింది. వరద తగ్గాక అధికారులు ప్రాజెక్టు గేట్లు మూసి వేయడంతో గుర్రపుడెక్క బైటకు వెళ్లే మార్గం లేక ప్రాజెక్టు గేట్ల వద్ద, రిజర్వాయర్ మట్టి కట్టల వెంట పేరుకుపోయింది. ఈ గుర్రపుడెక్కను తొలగించకుంటే ఆకులు కుళ్ళిపోయి నీరు కలుషితమై.. చేపలు, పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ గుర్రపుడెక్క పూర్తిగా విస్తరించక ముందే అధికారులు స్పందించి డ్యాంను శుభ్రపరచాలని మత్య్సకారులు, ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
పన్ను చెల్లించాలా.. వద్దా!
ఆస్తి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ ఎఫెక్ట్ నల్లగొండ టూటౌన్ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ ఎఫెక్ట్ పడుతోంది. ఆస్తి పన్ను వసూలుకు ఆయా మున్సిపాలిటీ యంత్రాంగాలు దృష్టి సారించిన విషయం తెలిసిందే. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ వారం రోజుల క్రితం జీహెచ్ఎంసీలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మున్సిపాలిటీల్లోనూ వడ్డీ మాఫీ ఉంటుందా లేదా అనే మీమాంసలో అధికారులతో పాటు పట్టణాల్లోని ప్రజలు ఉన్నారు. గతేడాది మూడు రోజుల ముందు ప్రకటన మున్సిపాలిటీల్లో రానున్న మూడు నెలలు ఆస్తి పన్ను వసూలు చేసుకోవడానికి ఎంతో కీలకం. గత ఏడాది కూడా ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీని మార్చి 31కి మూడు రోజుల ముందు ప్రకటించారు. ఇలాంటి అస్పష్టమైన నిర్ణయం వల్ల ఆస్తి పన్ను చెల్లించే వారు కూడా ముందుగా చెల్లించకుండా వడ్డీ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక అధికారులు, సిబ్బంది మాటలు నమ్మి బకాయిలతో సహా ఆస్తి పన్ను ముందుగా చెల్లించడం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని పలువురు భవన యాజమానులు చెబుతున్నారు. ఆస్తి పన్ను చెల్లించడానికి విముఖత... ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మున్సిపాలిటీల్లో పని చేసే అధికారులు, సిబ్బందిపి ఆస్తి పన్ను వసూలు కోసం గల్లీగల్లీ తిప్పుతారు. రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టినా మార్చి చివరి నాటికి 70 శాతం నుంచి 95 శాతం వరకు వసూలు చేస్తుంటారు. కానీ ఈసారి ఆస్తి పన్ను వసూలు చేయడం అంత సులభం కాదని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేస్తే వసూల్పై ఎలాంటి ప్రభావం చూపదు. జీహెచ్ఎంసీలో మాత్రమే 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించడంపై పట్టణాల్లోని ప్రజలు గుర్రుగా ఉన్నారు. మహానగరంలో ఉన్న వాళ్లు పేదలు, మున్సిపల్ పట్టణాల్లో ఉండే వారు శ్రీమంతులా అనే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ మున్సిపల్ పట్టణాల్లోనూ ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేస్తేనే ఆస్తి పన్ను సక్రమంగా వసూలు అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. ఫ బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించిన జీహెచ్ఎంసీ ఫ మున్సిపాలిటీల్లోనూ మాఫీ వస్తుందనే ఆశతో పన్ను చెల్లించని యజమానులు ఫ వడ్డీ మాఫీ ప్రకటన రాకపోతే పన్ను వసూలు కష్టమే ఇప్పటికే ఆస్తి పన్ను వసూలు కోసం వార్డుల్లో తిరుగుతున్న సిబ్బందికి మార్చి చివరిలోనే ఆస్తి పన్ను చెల్లిస్తామని ఖరాఖండిగా చెబుతుండడంతో వారు చేసేది ఏమీ లేక మిన్నకుండిపోతున్నారు. త్వరలోనే మున్సి పల్ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 90 శాతం వడ్డీ రాయితీ ఇస్తుందా లేదా అనేది ఈ నెలలో తెలిసే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
మైనార్టీ యోజనకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్నా కా సహారా మిస్కీనో కే.లియే’ పథకాల కింద ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి టి.విజయేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు tgobm-m-r.c-f-f.gov.i n వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు సమర్పించాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు చిన్న వ్యాపారాలకు ఒక్కోరికి రూ.50 వేల ఆర్థిక సాయం లభిస్తుందని పేర్కొన్నారు. రేవంతన్నా కా సహారా మిస్కీనో కే లియే పథకానికి ఫఖీర్, దుదేకుల వర్గాలకు చెందిన అర్హులకు మోపెడ్ వాహనాలు మంజూరు చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు ఎంఏ.ఫహీం, ఫీల్డ్ అసిస్టెంట్, 79811 96060 నంబర్కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలిహాలియా : మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి ఆదేశించారు. ఆదివారం హాలియా మున్సిపల్ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయన పరిశీలించారు. ఇంటి చిరునామా ఆధారంగా వార్డు ఓటరు జాబితా సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా ఒక ఇంట్లో ఉన్న ఓటర్లంతా ఒకే వార్డులో ఉండేలా చూడాలని, ఒకే పోలింగ్ స్టేషల్లో గరిష్టంగా 800మంది ఓటర్లు మాత్రమే ఉండేలా పునర్విభజన చేయాలని సూచించారు. 10న తేదీన మున్సిపాలిటీలో తుది జాబితా ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శననల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి కాలేజీలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన చిగురు కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, నాటకాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ ఆర్జేడీ సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు ‘చిగురు’ దోహదం చేస్తుందన్నారు. తాను కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకుని ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. విద్యార్థులు చిన్నతనంలోనే ఓ లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి 700 మంది విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, వెంకట్జీ, అరవింద్జీ, నాగేందర్, భరద్వాజ్, సైదులు, స్వామి, మహేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా టెట్
నల్లగొండ టూటౌన్ : జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ స్కూల్లో నిర్వహించిన టెట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8.30 గంటలకే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద తమ అభ్యర్థులు తమ హాల్టికెట్ నంబర్లు పరిశీలించుకొని లోపలికి వెళ్లారు. ఉదయం పేపర్–1కు 185 మంది అభ్యర్థులకుగాను 166 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పేపర్–2 పరీక్షకు 185 మంది అభ్యర్థులకు గాను 172 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 13 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. -
విజ్ఞానమివ్వని వైజ్ఞాన ప్రదర్శన!
నల్లగొండ టూటౌన్ : ప్రపంచం ఒక వైపు నైపుణ్యతలో దూసుకుపోతుంటే జిల్లా విద్యాశాఖ మాత్రం పాత ప్రాజెక్టులతో వైజ్ఞానిక ప్రదర్శన పెట్టి మమ అనిపించిందనే విమర్శలు వెలువెత్తాయి. ప్రచార ఆర్భాటమే తప్ప విద్యార్థులతో కొత్త ప్రాజెక్టులు చేయించడంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు విఫలమయ్యారనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. పేరు పెద్ద ఊరు దిబ్బ అన్న చందంగా అధికారులు ఊదాసీనత వ్యవహరించడంతో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల చేత కొత్త పాజెక్టులను తయారీ చేయించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో ఈ నెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ఫేర్ విద్యార్థులకు విజ్ఞానమివ్వని వైజ్ఞానిక ప్రదర్శనగా మిగిలిందనే ఆరోపణలు వచ్చాయి. 280 ప్రాజెక్టులు అని డంబాచారంగా చెప్పుకున్న అధికారులు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రదర్శనలో పాత ప్రాజెక్టులే అధికంగా ఉన్నట్లు అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులే పెదవి విరుస్తున్నారంటే సంబంధిత అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పడం కోసం ఒకే రకమైన ప్రాజెక్టులే ఏర్పాటు చేశారు. ఎంతో సీరియస్గా తీసుకొని విద్యార్థుల చేత కొత్త ప్రాజెక్టులును తయారు చేయించాల్సి వారు ఏ మాత్రం ఉపయోగం లేని పాత ప్రాజెక్టులతో సైన్స్ ఫేర్ను మమ అనిపించినట్లు తెలుస్తోంది. ఆర్భాటమే తప్ప ప్రయోజనం ఏదీ..! జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన మొత్తం పేలవంగా సాగింది. ప్రాజెక్టులను చూసేందుకు వివిధ పాఠశాలల నుంచి తీసుకువచ్చిన విద్యార్థులకు ఆ ప్రాజెక్టుల గురించి అర నిమిషం కూడా వివరించకుండా తీసుకువెళ్లడం చూస్తే వైజ్ఞానిక ప్రదర్శనపై సంబంధిత అధికారులకు ఎంత నిబద్దత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. లక్షల రూపాయల ఖర్చు చేసి.. కలెక్టర్, ఎస్పీ చేతులమీదుగా ప్రారంభించిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన ఎంత మంది విద్యార్థులకు ఉపయోగపడిందనే విషయం సంబంధిత అధికారులే చెప్పాలి. వైజ్ఞానిక ప్రదర్శన అని ఆర్భాటం చేయడం తప్ప క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్థుల చేత ఏఏ ప్రాజెక్టులు తయారు చేయించారన్న కనీసం సమాచారం కూడా అధికారులు తెలుసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంపై డీఈఓను వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా.. స్పందించలేదు.ఫ పాత ప్రాజెక్టులతో మమ అనిపించిన అధికారులు ఫ ఆర్భాటం తప్ప.. ఆచరణలో లేని కొత్త ప్రాజెక్టులు ఫ ఉన్న ప్రాజెక్టుల పనితీరు వివరించడంలోనూ లోపం ఫ నల్లగొండలో ముగిసిన జిల్లాస్థాయి సైన్స్ ఫేర్ వైజ్ఞానిక ప్రదర్శనలో పెట్టిన వాటిలో ఎక్కువ ప్రాజెక్టులు చిన్న, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించినవే ఉన్నాయి. అవి కూడా గత పదేళ్ల కిందటనే రూపొందించిన ప్రాజెక్టులు కావడం విస్మయానికి గురి చేస్తుంది. పాతదో కొత్తదో.. కనీసం పెట్టిన ప్రాజెక్టుల గురించి అక్కడికి వచ్చిన విద్యార్థులకు వాటి పరితీరును పూర్తిస్థాయిలో వివరించిన పాపాన కూడా పోలేదు. విద్యార్థులంతా క్యూలైన్లో వెళ్లి చూపి క్షణాల్లోనే బయటికి రావడంతో.. అవి ఏంటో కూడా ఏ విద్యార్థికి అర్థం కాకుండా పోయిందనే విమర్శలు వచ్చాయి. రావడం, పోవడం వ్యయ ప్రయాసాలు తప్ప వైజ్ఞానిక ప్రదర్శన వల్ల ఒనగూరిందేమీ లేదనే ఆరోపణలు వచ్చాయి. పది ప్రాజెక్టులు పెట్టినా వాటిలో నాలుగు ప్రయోజనకరంగా ఉంటే విద్యార్థులతో పాటు దేశానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్లోనైనా కచ్చితత్వంతో కూడిన వైజ్ఞానిక ప్రదర్శనలో దేశానికి, ప్రజలకు ఉపయోగ పడే ప్రాజెక్టులు పెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని విద్యాశాఖ గ్రహించాల్సిన అవసరం ఉంది. -
సిండికేట్ ఆడించినట్లే..
మధ్యం వ్యాపారుల గుప్పిట్లో ఎకై ్సజ్, పోలీస్ శాఖలు సమయ పాలన లేని వైన్ షాపుల కారణంగా మందుబాబులు బెల్ట్ షాపులనే బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి వైన్ షాపుల యజమానులే క్వార్టర్కు బ్రాండ్ను బట్టి ఎమ్మార్పీపై అదనంగా రూ.20 నుంచి రూ.25 వసూలు వసూలు చేస్తున్నారు. దీంతో బెల్ట్ షాపుల్లో ఒక్కో ఫుల్ బాటిల్పై బ్రాండ్ను బట్టి రూ.160 నుంచి రూ.200 వరకు అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపుల వారు మందుబాబుల నుంచి ఒక్కో క్వార్టర్కు రూ.40 నుంచి రూ.50 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కొందరు ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది.. మద్యం వ్యాపారుల సిండికేట్ చేతుల్లో కీలు బొమ్మల్లా మారిపోయారు. మామూళ్ల దందాకు అలవాటు పడిన ఆ అధికారుల తీరుతో ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. వ్యాపారులు బెల్ట్ షాపులకు అదనపు ధరలకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోకుండా వారికే వంతపాడుతున్నట్లు తెలిసింది. అంతేకాదు సిండికేట్ దందాలో మద్యం కల్తీ జోరుగా సాగుతున్నా నోరు విప్పడం లేదని, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సిండికేట్ నుంచి వచ్చే పెద్దమొత్తానికి అలవాటు పడి.. స్టాక్ మిస్ మ్యాచింగ్ పేరుతో నోటీసులు ఇస్తూ ఇతర వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘బెల్ట్’కు అండదండలు జిల్లాలో బెల్ట్ షాపుల వ్యాపారం మూడుపూలు ఆరుకాయలు అన్నచందంగా సాగుతోంది. ఏ గ్రామంలోకి వెళ్లినా రెండు మూడింటికి తగ్గకుండా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. ఎకై ్సజ్, స్థానిక పోలీసుల నుంచి వైన్స్ యజమానులకు పూర్తిస్థాయిలో అండదండలు లభిస్తుండడంతో.. వైన్స్ యజమానులు బెల్ట్ షాపులు నిర్వహించే వారికి అదనపు రేట్లకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అలా వచ్చిన మొత్తం నుంచే ఎకై ్సజ్, పోలీసు అధికారులకు, సిబ్బందికి ముడుపులు ముట్టజెప్పుతారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అవకాశం ఉన్నా మండలాల్లో రాత్రి 8 గంటల వరకు వైన్స్లను మూసేస్తారని.. బెల్ట్ షాపులకు బేరం పెంచడం కోసమే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా మట్టుజెప్పాల్సిందే.. నల్లగొండ జిల్లాలో 154, సూర్యాపేట జిల్లాలో 93, యాదాద్రి భువనగిరి జిల్లాలో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాలను నుంచి స్థానిక ఎకై ్సజ్ అధికారులకు ప్రతి నెల కనీసం రూ.15 వేలు, వ్యాపారం అఽధికంగా సాగే ప్రాంతమైతే రూ.25 వేలు, స్థానిక పోలీసులకు కూడా నెలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఆ మొత్తాన్ని ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తారని, మద్యం షాపుల వద్ద చిన్నపాటి సమస్య వచ్చినా న్యూసెన్స్ కేసులు పెట్టి ఇబ్బందులపాలు చేస్తారని తెలుస్తోంది. ప్రతి నెలా ముడుపులు ఇస్తే మాత్రం మద్యం షాపులకు, బెల్ట్ షాపులకు మద్దతు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బెల్ట్షాపులపై కేసులు పెట్టకుండా, వైన్స్, పర్మిట్ రూంల నిర్వహణ విషయంలోనూ ఇబ్బందులపాలు చేయకుండా ఉండేందుకు ముడుపులు చెల్లించక తప్పదని ఓ వైన్స్ యజమానే పేర్కొన్నారు. ఫ ఎక్కువ రేట్లకు విక్రయాలు, మద్యం కల్తీపై నోరుమెదపని వైనం ఫ బెల్టుషాపుల్లో విచ్చలవిడిగాసాగుతున్న మద్యం అమ్మకాలు ఫ కేసుల పేరుతో చిన్న వ్యాపారులకు బెదిరింపులు ఫ అధికారుల తీరుతో ప్రజల జేబుకు చిల్లు -
ఆ.. 14 నెలల కాలం మరువలేనిది
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన 14 నెలల కాలం మర్చిపోలేనిదని నిజామాబాద్ కలెక్టర్గా బదిలీపై వెళ్లిన ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారుల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠిని జ్ఞాపికలు, శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు. ఫ నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
వీధుల్లో చెత్త ఎందుకు వేస్తున్నారు..
నల్లగొండ టూటౌన్ : కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా కొత్త కలెక్టర్ రంగంలోకి దిగడంతో క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు, సిబ్బందికి చలిలో చెమటలు పట్టాయి. అధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే కొత్త కలెక్టర్ చంద్రశేఖర్ నీలగిరి పట్టణంలోని 28వ వార్డులో శనివారం ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రత్యక్షమయ్యారు. వార్డులోని శ్రీకృష్ణానగర్లో కలియదిరుగుతూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. చెత్త ట్రాక్టర్ సమయం ప్రకారం వస్తుందా.. వస్తుంటే మీరెందుకు వీధుల్లో చెత్త వేస్తున్నారని కలెక్టర్ అక్కడి మహిళలను ప్రశ్నించారు. ఇక నుంచి చెత్తను వీధుల్లో.. రోడ్ల వెంట వేస్తే భారీగా జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇంట్లోని చెత్తా చెదారాన్ని మున్సిపల్ వాహనంలోని సిబ్బందికి అందించాలని మహిళలకు సూచించారు. తాగునీరు ఎంత సేపు వస్తుంది, ఏ సమయంలో వస్తుంది.. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహణలో ఎక్కడా లోపాలు రావద్దని సంబంధిత అధికారులకు సూచించారు. ఆస్తి పన్ను చెల్లింపులు సక్రమంగా ఉండాలని, వార్డు ఆఫీసర్లకు రోజు వారి టార్గెట్ విధించి వంద శాతం పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు. అదే కాలనీలో ఉన్న మోతి కుంటను కలెక్టర్ పరిశీలించారు. కట్ట, కుంటలో నీటికి సంబంధించి అధికారులను ఆరా తీశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, ప్రదీప్రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ చెత్త ట్రాక్టర్ రోజూ రావడం లేదా ఫ కాలనీ వాసులను ప్రశ్నించిన కలెక్టర్ ఫ నీలగిరి 28వ వార్డులో ఉదయం 7 గంటలకే కొత్త పర్యటన ఫ తాగునీరు, శానిటేషన్పై ఆరా ఫ రోడ్లపై చెత్త వేస్తే జరిమానా వేయాలని అధికారులకు ఆదేశం -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
నల్లగొండ : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ముఖ్య లక్ష్యంతో రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మోటర్ వాహనాల చట్టం 1988 ప్రకారం హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలనే ఉద్దేశంతో శ్రీనో హెల్మెట్ – నో పెట్రోల్శ్రీ అనే నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకే పెట్రోల్ పోయాలని బంక్ యజమానులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే, అవసరమైన చోట కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ కమిషనర్ వాణి, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి లావణ్య, ఎస్బీ సీఐ రాము, టూటౌన్ సీఐ రాఘవరావు, వన్టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్ నగేష్
పెద్దవూర : జిల్లా మలేరియా అధికారిగా మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్కు పదోన్నతి లభించింది. ఈయన పెద్దవూర మండల వైద్యాధికారిగా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఉత్తమ వైద్యాధికారిగా అవార్డులు సైతం పొందారు. డాక్టర్ రమేష్కు జిల్లా మలేరియా అధికారిగా పదోన్నతి లభించడంపై వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. న్యాయశాఖ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణరామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ హైదరాబాద్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాతంగి వీరబాబు ఉద్యోగుల సమస్యలను చీఫ్ జస్టిస్కు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి.సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి వివి.రమణారావు, రాష్ట్ర నాయకులు కోటిరెడ్డి, నరేష్, రాకేష్ పాల్గొన్నారు. అభ్యంతరాలకు నేడు ఆఖరునల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులు, అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ఈనెల 4వ తేదీతో గడువు ముగియనున్నది. మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్లు దాటిపోయి తమ ఓట్లు ఇతర వార్డుల్లో చేరాయని, వాటన్నింటిని తమ వార్డుల్లోకి చేర్చాలని కోరుతూ పలువురు రాజకీయ నాయకులు, ఓటర్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కాగా వార్డుల వారీగా ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఆదివారంలోగా మున్సిపల్ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ నల్లగొండ : పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డీడీ శశికళ అన్నారు. శనివారం నల్లగొండలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల క్యాంపస్లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. అసెంబ్లీలో స్పీకర్ వైఖరి దారుణందేవరకొండ : అసెంబ్లీలో స్పీకర్ వైఖరి దారుణమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్ చేసి గొంతునొక్కడం సరికానద్నారు. అసెంబ్లీ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. స్పీకర్ ఏకపక్ష దోరణి, ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బహిష్కరించిందన్నారు. కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదని.. నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమావేశంలో టీవీఎన్ రెడ్డి, బిల్యానాయక్, గాజుల ఆంజనేయులు, చింతపల్లి సుభాష్, వల్లపురెడ్డి, నీల రవి, ఖాదర్ బాబా, జానీబాబా, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు ఉన్నారు. -
నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో శనివారం సాయంత్రం ఓ ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైంది. నకిరేకల్లోని ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న స్కూటీ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్కూటీకి మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. దగ్ధమైన స్కూటీ ఓలా కంపెనీకి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. మంటలు చెలరేగిన సమయంలో రహదారిపై వాహనాలు, పాదచారులు ఉండటంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం కానీ ఎవరికీ పెద్దగా గాయాలు కానీ కాలేదు. సదరు ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. -
సమస్యల పరిష్కారంలో చురుకుగా ఉండాలి
నల్లగొండ : రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర కీలకమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం ఉండాలన్నారు. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, పిర్యాదుదారుకు రశీదు ఇవ్వాలని, ఫిర్యాదుల రిజిస్టర్లు, అన్ని వివరాలు కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతినెలా తహసీల్దార్ల సమావేశం నిర్వహిస్తామనిన్నారు. అనంతరం భూ భారతి, పౌరసరఫరాలు తదితర అంశాలపై సమీక్షించారు. సమాఏశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎకై ్సజ్.. గుడ్విల్
ఒక్కోషాపు నుంచి రూ. 3 లక్షల వరకు వసూలుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎకై ్సజ్ అధికారుల వసూళ్ల దందా అడ్డగోలుగా సాతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో ప్రారంభమైన మద్యం దుకాణదారుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మొదట గుడ్ విల్ కింద వన్ టైమ్ అమౌంట్ వసూలు చేస్తున్న ఎకై ్సజ్ సిబ్బంది.. నెలవారీ మామూళ్లు వేరుగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా షాపులను దక్కించుకున్న వారి నుంచి ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దుకాణాల కోసం ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యాపారులు.. ఇప్పుడు ఈ వసూళ్ల దందాతో ఇబ్బంది పడుతున్నారు. డిసెంబర్ 1న దుకాణాలు ప్రారంభం 2025 అక్టోబర్లో నిర్వహించిన టెండర్లలో షాపులు దక్కించుకున్న వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త షాపులను ప్రారంభించారు. ఆ షాపులనుంచి గుడ్ విల్ కింద ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికాల మౌఖిక ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఈ వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణాల్లో ఎక్కువ మొత్తం జిల్లాలో 154 మద్యం షాపులు ఉన్నాయి. అందులో సగానికిపైగా మద్యం దుకాణాలు పట్టాణాల్లో ఉన్నాయి. అలాంటి షాపుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల నుంచి కనీసం రూ.2 లక్షలకు తగ్గకుండా వసూలు చేస్తున్నట్లు షాపుల నిర్వాహకులే గగ్గోలు పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా వ్యాపారం కొనసాగే, దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లో అత్యధికంగా సేల్స్ ఉండే ప్రాంతాల్లోనూ గుడ్ విల్ కింద రూ.3 లక్షలకు తగ్గకుండా ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నట్లు సమాచారం. మొదటిసారిగా షాపులు వచ్చిన వారిని టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. రూ.50 లక్షలు పెట్టి షాపు దక్కించుకున్న మీరు రూ.3 లక్షలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఇస్తే అన్నీ మేమే చూసుకుంటాం అని చెబుతూ వసూళ్లకు దిగుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా ఎవ్వకపోతే కేసులు తప్పవని కూడా బెదిరిస్తున్నట్లు తెలిసింది. లొకేషన్ సరిగ్గా లేదని, ప్రార్థన మందిరాలకు పక్కనే ఉన్నాయని, నిబంధనలు పాటించడం లేదనే సాకులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇక, గతంలో వైన్స్ నడిపించి, ఈసారి కూడా లాటరీలో షాపులను దక్కించుకున్న వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారన్న తెలుస్తోంది. కొత్త షాపుల వారే ఇస్తుండగా, మీరు ఇవ్వకపోవడం ఏంటి? అన్నీ మీకు తెలుసుకదా.. ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారని ఓ వైన్స్ షాపు యజమాని పేర్కొన్నారు. ఫ మొదట గుడ్విల్ కింద.. ఆ తర్వాత నెలవారీ మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి ఫ టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేయిస్తున్న ఎక్సైజ్శాఖ అధికారులు ఫ ఇబ్బందులు పడుతున్న మద్యం వ్యాపారులు -
అభివృద్ధి పథంలో నడిపించాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో భాగస్వాములై జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో తనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు జిల్లా, మండల, గ్రామస్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలన్నారు. పథకాల అమలులో అందరికీ న్యాయం జరిగితేనే జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, జిల్లా రవాణా కమిషనర్ వాణి, తదితరులు ఉన్నారు. ఓటరు జాబితాలను పునః పరిశీలన చేయాలి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను పునః పరిశీలన చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో పారదర్శకంగా ఉండాలన్నారు. వార్డుల వారీగా రూపొందించిన జాబితాలో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్ల ప్రకారం ఉన్నాయో లేదో చూడాలన్నారు. ఒక కుటుంబ సభ్యులు ఒకే వార్డులో ఉండేలా చూడాలన్నారు. ఓటరు జాబితా పై ఈనెల 5వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. ఓటరు జాబితాలపై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ నల్లగొండ : రోడ్డు రవాణ శాఖ అధ్వర్యంలో చేపట్టిన రోడ్డు భద్రతా వారోత్సల వాల్పోస్టర్ను కలెక్టర్ బి.చంద్రశేఖర్ శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీటీసీ వాణి, ఎంవీఐలు లావణ్య, స్వప్న, సత్తయ్య, గోపీనాథ్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లెప్రసీ అనుమానితులు 80 మంది
నల్లగొండ టౌన్ : జిల్లా వ్యాప్తంగా 80 లెప్రసీ అనుమానిత కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెపుతున్నాయి. గతనెల 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వైద్య ఆరోగ్యశాఖ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సీడీసీ) సర్వేను నిర్వహించింది. ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి శరీరంపై ఉన్న నల్ల, తెల్ల, గోధుమరంగు మచ్చలు, స్పర్శలేని మచ్చలను పరిశీలించారు. అందులో 80 మందికి లెప్రసీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ పూర్తి స్థాయిలో లెప్రసీ పరీక్షలను నిర్వహించి ఎంతమందికి లెప్రసీ ఉందో త్వరలో తేల్చనున్నారు. బాధితులకు చికిత్స ఇలా.. జిల్లాలో ఉన్నటువంటి కుష్టువ్యాధి బాఽధితులకు బహుళ ఔషధ పద్ధతిన (మల్టీ డ్రగ్ థెరఫీ–ఎండీటీ) చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 102 మంది వరకు కుష్టువ్యాధిన పడిన బాధితులకు జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న కుష్టువ్యాధి విభాగంలో ఎండీటీ పద్ధతిన చికిత్స అందిస్తున్నారు. కుష్టువ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరం నుంచి ఎల్సీడీసీ సర్వే ద్వారా కుష్టువ్యాధి లక్షణాలను ఉన్నవారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి మల్టీడ్రగ్ థెరఫీ చికిత్స చేయిస్తోంది. దీంలో జిల్లాలో అప్పటి నుంచి కుష్టు బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. రానున్న రోజుల్లో జిల్లాను కుష్టు రహిత జిల్లాగా మార్చాలన్న లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ ముందుకు సాగుతోంది. కుష్టు లక్షణాలు.. కుష్టు వ్యాధి అనేది మైక్రోబ్యాక్టీరియం లెప్రో అనే బ్యాక్టీరియా వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రధానంగా ఏ వయస్సు వారికై నా సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నరాలు, చర్మం, ముక్కు ద్వారా ఎగువ శ్వాసనాళాలపై ప్రభావం చూపుతుంది. చర్మంపై ఎర్రని, గోధుమరంగు (పాలిపోయిన, స్పర్శలేని మచ్చలు) ఉంటే కుష్టువ్యాధి లక్షణాలుగా గుర్తించాలి.శరీరంపై ఎర్రని, తెల్లని, స్పర్శలేని గోధుమరంగు మచ్చలు ఉంటే వైద్యారోగ్య శాఖ సిబ్బందికి చూపించాలి. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే జిల్లా కేంద్రంలోని లెప్రసీ కేంద్రానికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న ఉచితంగా చికిత్స చేయించుకోవాలి. క్రమంతప్పకుండా మందులను వాడాలి. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఫ ఇంటింటి సర్వే ద్వారా గుర్తించిన వైద్యారోగ్య శాఖ ఫ పూర్తిస్థాయి పరీక్షల అనంతరం తేలనున్న కేసులు ఫ జిల్లాలో ఇప్పటికే 102 మంది కుష్టువ్యాధి బాధితులు -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా ఉండాలని, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, మౌలిక వసతులు, సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు ముసాబ్ అహ్మద్, మల్లేశం, శ్రీనివాస్, రామదుర్గారెడ్డి, సుదర్శన్, దండు శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి


