Nalgonda
-
అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ
రామగిరి(నల్లగొండ) : అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని, వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోవద్దని ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ ఏర్పాటై పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల రాలేదని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు దశాబ్దాల పాటు చేసిన పోరాటాలు, వేలాది మంది అమరుల ఆత్మబలిదానాల వల్లే వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు పందుల సైదులు, బోనగిరి దేవేందర్, చీర పంకజ్యాదవ్, దూసరి కిరణ్కుమార్, చింతమల్ల గురువయ్య, కె.పర్వతాలు, ఇందూరి సాగర్, ఆర్.విజయ్కుమార్, పి.ఏడుకొండలు, మల్లేశం. ఆర్. లక్ష్మయ్య, పెండెం ధనుంజయనేత, వెంకటేశ్వర్లు, బీవీ చారి, గద్దపాటి సురేందర్, కె.రత్నయ్య, సునీత, గూడూరి జానకిరామ్రెడ్డి, అయితగోని జనార్దన్గౌడ్, మాతంగి అమర్, బట్టు నవీన్, కొండేటి మురళి పాల్గొన్నారు. -
కరువు నేలను తడిపేందుకు ఎత్తిపోతలు
డిండి : నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ ప్ర భావిత ప్రాంతాల ప్రజలకు రక్షిత నీరు, బీడు భూములకు సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పలు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా 2015లో శివన్నగూడెంలో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా కిష్టరాంపల్లి, చింతపల్లి, శివన్నగుడెం, గొట్టిముక్కుల, సింగరాజుపల్లిలో రిజర్వాయర్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించి జిల్లాలో నిర్మించే ఐదు రిజర్యాయర్లు నింపితే.. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.61 ఎకరాలకు సాగునీరుతోపాటు ప్రజలకు తాగునీటి కష్టాలు దూరం కానున్నాయి. ప్రస్తుతం ఈ ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయి. ● సాగర్ ఆయకట్టు చివరి భూములకు, ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఐదు ఎత్తిపోతల పథకాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో బొత్తలపాలెం, దున్నపోతులగండి, కేశవాపురం– కొండ్రపోల్, వీర్లపాలెం, తోపుచర్ల లిఫ్ట్ పనులు ప్రగతిలో ఉన్నాయి. ● దశాబ్దాల కాలంగా కృష్ణపట్టె గిరిజన రైతాంగం ఎదురుచూస్తున్న నెల్లికల్లు ఎత్తిపోతలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసింది. రూ.692 కోట్లతో ఈ లిఫ్ట్ పనులు సాగుతున్నాయి. ఫ్లోరోసిస్ మహమ్మారి నుంచి విముక్తి నల్లగొండ : ఒకప్పుడు నల్లగొండ జిల్లా పేరు వినగానే గుర్తుకొచ్చేది ఫ్లోరోసిస్ సమస్య. ఇక్కడ వేలాది మంది ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడ్డారు. మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, కట్టంగూరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరోసిస్ అధికంగా ఉండటంతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రూ.3,000 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా కృష్ణానది నుంచి శుద్ధి చేసిన నీటిని పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తోంది. 1,750 గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత తాగునీరు అందుతోంది. ఈ పథకం జిల్లా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చింది. -
గూడు కోసం గోస..
నల్లగొండ నగరం పరిధిలోని చర్లపల్లి చెందిన దివ్యాంగుడు ఏర్పుల మారయ్య (70) తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం నల్లగొండ కలెక్టరేట్కు వచ్చి గోడు వెల్లబోసుకున్నాడు. చర్లపల్లిలో రూ.వెయ్యి అద్దె చెల్లించి తన తల్లి ఈదమ్మ (90)తో కలిసి జీవిస్తున్నానని చెప్పాడు. ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా.. ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధుడు, దివ్యాంగుడైన మారయ్య కలెక్టర్ను కలవడానికి ఆటోలో వచ్చేందుకు రూ.200, తిరిగి వెళ్లేందుకు మరో రూ.200 ఖర్చు చేశారు. కలెక్టరేట్ మెట్లు ఎక్కడం కూడా కష్టంగా మారినా, ఇతరుల సహాయంతో పైకి చేరుకుని వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశాడు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
నేడు పరేడ్ గ్రౌండ్లో పతాకావిష్కరణ
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నల్లగొండలో నిర్వహించే వేడుకలకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 7.45 గంటలకు క్లాక్టవర్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం, ఉదయం 8 గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వేడుకల్లో విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల ప్రదానం చేస్తారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సోమవారం రాత్రి పరిశీలించారు. -
విద్యలో నూతన ఒరవడి
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో విద్యారంగం నూతన ఒరవడిని సంతరించుకుంది. గురుకులాల విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మెడికల్ కళాశాల ఏర్పాటు, లా, నర్సింగ్ కళాశాలల మంజూరు వంటి చర్యలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యారంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. గురుకుల విద్యాసంస్థల విస్తరణతో వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల విద్య వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 24 ఎస్సీ, 34 బీసీ, 13 మైనార్టీ, 20 గిరిజన గురుకులాలు కొనసాగుతున్నాయి. వీటిలో నాణ్యమైన విద్యతోపాటు ఉచిత వసతి, భోజనం, పోటీ పరీక్షల శిక్షణ ఇస్తున్నారు. పేద కుటుంబాల పిల్లలు నేడు గురుకులాల ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ కళాశాలలు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. -
పోలీసులకు సేవా పతకాలు
నల్లగొండ : ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలను ప్రటించింది. ఏఆర్ ఎస్ఐ జయరాజ్కు ఉత్తమ సేవా పతకం, 12 బెటాలియన్ ఏఆర్ ఎస్ఐ బి.వెంకట్రెడ్డి, డీఎస్పీ సెల్లో పనిచేస్తున్న రఫియోద్దీన్, సీసీఎస్ కానిస్టేబుల్ పుస్పగిరి, ఏఆర్ పీసీ అంజద్ఖాన్కు సేవా పతకాలకు ప్రకటించింది. తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా మంగళవారం వారు పతకాలు అందుకోనున్నారు. బాధ్యతలు స్వీకరించిన డీఈఓనల్లగొండ : నల్లగొండ డీఈఓగా బదిలీపై వచ్చిన సుశీందర్రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయం సిబ్బందితోపాటు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా వినోద్కుమార్నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయాధికారిగా వి.వినోద్కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని వ్యవసాయశాఖ కమిషనరేట్లో ఏడీఏగా పనిచేస్తూ పదోన్నతి పొంది నల్లగొండ జిల్లాకు బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్చార్జి జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేసిన పాల్వాయి శ్రవణ్కుమార్ పదోన్నతి పొంది వ్యవసాయ శాఖ కమిషనరేట్కు బదిలీ అయ్యారు. పోలీస్ గ్రీవెన్స్లో 46 ఫిర్యాదులు నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 46 మంది బాధితులు భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు తదితర అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ తెలిపారు. -
పేదల సొంతింటి కల సాకారం
దేవరకొండ : పేదవాడి సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం దేవరకొండ మండలంలోని శకృనాయక్తండా గ్రామంలో నిర్మించిన 6 ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్తో కలిసి లబ్ధిదారులత చేత గృహ ప్రవేశ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ గృహాలను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ప్రతి కుటుంబం సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ తండాల్లో గుడిసెలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గ్రామల్లో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రాజెక్టు భూసేకరణ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పద్మప్రియ, తహసీల్దార్ సంజీవ్కుమార్, ఎంపీడీఓ డానియల్, సర్పంచ్ మోహన్లాల్, రామ్సింగ్, పంచాయతీ కార్యదర్శి కీర్తి, లబ్దిదారులు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ దేవరకొండ మండలం శకృనాయక్తండా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాం
మిర్యాలగూడ : తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని గల్లి నుంచి ఢిల్లీ దాక వినిపించాం. 1991 నుంచే పోస్టుకార్టు ఉద్యమాలతోపాటు 1997లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేశాం. కృష్ణాజలాలు, సాగునీటి కోసం ఎడమకాల్వపై పాదయాత్ర నిర్వహించాం. ప్రత్యేకంగా తెలంగాణ కావాల వద్దా అని రెఫరెండం పెట్టి ప్రజల మద్దతును కూడగట్టాం. ఇక్కడి నుంచి ఢిల్లీకి ప్రజలతో కలిసి సోనియాగాంధీకి ఇటలీ భాషలో ఉత్తరం రాశాం. సరిహద్దులో సభలు ఏర్పాటు చేసి గ్రామగ్రామాన పాదయాత్రలు చేపట్టి వినూత్న నిరసనలు చేపట్టాం. కేసీఆర్, గద్దర్, విమలక్క, జయశంకర్, కోదండరామ్లను ఆహ్వానించి మా ప్రాంతంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశాం. – వేనేపల్లి పాండురంగారావు (మట్టిమనిషి)ఉద్యమకారులను గౌరవించాలి● డాక్టర్ చెరుకు సుధాకర్ నకిరేకల్ : ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తాను అనేక కేసుల్లో ఐదు మాసాలు జైలు జీవితం గడిపాను. అనేక పోరాటల నడుమ స్వరాష్ట్రాన్ని సాధించి పుష్కరకాలం (12 ఏళ్లు) అవుతోంది. ఇక, నిర్బంధాలు లేని తెలంగాణ కావాలి. రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను గౌరవించాలి’ అని తెలంగాణ ఉద్యమకారుడు, డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన వారి జీవిత కాలంలో జూన్ 2వ తేదీ పండుగ రోజు. ఉద్యమకారుడు ఎవరైనా గర్వంగా ఫీల్ అవ్వాలి. చేతనైతే రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి. రాష్ట్రం కోసం పోరాడిన వారి కోసం ప్రభుత్వాలు పని చేయకపోతే నిలదీయాలి. ఐదు నెలలు జైలు జీవితం గడిపాను నేను స్వరాష్ట్ర ఏర్పాటు కోసం 1997లో జరిగిన ‘తెలంగాణ మహాసభ’ నుంచి ఎన్నో పోరాటాలు చేసి జైలుకు పోయివచ్చాను. మలిదశ ఉద్యమం 2009 నుంచి రాష్ట్రం వచ్చేంత వరకు జరిగిన అనేక పోరాటాల నడుమ, నాపై పెట్టిన వివిధ కేసుల వల్ల మొత్తం ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపాను. ఆనాటి సమైక్య ప్రభుత్వం నాపై పీడీ యాక్ట్తో పాటు ఇతర అనేక కేసులను ప్రయోగించింది. పీడీ యాక్ట్ కింద ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నప్పటికీ, కోర్టు ఇచ్చిన తీర్పులతో నేను ఆ శిక్షల నుంచి బయటపడ్డాను. నిర్బంధాలు లేని తెలంగాణ కావాలి స్వరాష్ట్రంలో పౌర, మానవ హక్కులు ఉండాలని పోరాడాం. వాటిని ఎక్కడ అణచివేసినా ఎదురించాలి. నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు.. నిర్బంధాలు లేని స్వేచ్ఛను అనుభవించే తెలంగాణ, సామాజిక న్యాయం ఉన్న తెలంగాణ, రాష్ట్రం కోసం పోరాడిన వారిని గౌరవించే తెలంగాణ కావాలన్నదే మా ఆకాంక్ష. రాష్ట్రం కోసం పోరాడిన వారంతా పుష్కర స్నానం చేసినంత పుణ్యం లభించినట్లుగా భావించాలి. నేడు గుండెల నిండా స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ గర్వపడాలి. -
ధాన్యాగారం..
నల్లగొండ అగ్రికల్చర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాలో వరిసాగు గణనీయంగా పెరిగింది. కోటీ 30లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధించి ధాన్యాగారంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2017లో వానాకాలంలో వరి 1,59,152 ఎకరాల్లో, పత్తి 5,83,800 ఎకరాలు, ఇతర పంటలు కలిపి మొత్తం 8,41,745 ఎకరాల్లో మాత్రమే రైతులు సాగు చేశారు. 2025 వానాకాలంలో వరి 5,41,570 ఎకరాల్లో పత్తి 5,82,062 ఎకరాలు ఇతర పంటలు కలిపి మొత్తం 11,95,601 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఏడాది రెండు సీజన్లకు నాగార్జునసాగర్ ఎడమకాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, మూసీ కాలువల ద్వారా సాగు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రధాన కాలువ పరిధిలోని గ్రామాలోని చెరువులు జలసిరులు సంతరించుకుంటున్నాయి. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు 43, ఇతర శాఖలకు 75 మొత్తం 118 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులన్నీ జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ‘జల్ సంచయ్ – జల్ భాగీదారి’ కార్యక్రమంలో నల్లగొండ రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడంనూ కలెక్టర్.. అధికారులను అభినందించారు. ఈనెల 1 నుంచి 5 వరకు ‘స్వచ్ఛ గావ్ సురక్ష జల్ వాయు’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 12 వరకు పర్యావరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఎఫ్ఓ రాజశేఖర్, తదితరులు ఉన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
స్వరాష్ట్రంలో మారిన జిల్లా రూపురేఖలు
నల్లగొండఫ సాగు, తాగునీటి ప్రాజెక్టులకు అడుగులు.. ఫ్లోరోసిస్ పీడకు విముక్తి ఫ రికార్డు స్థాయిలో పెరిగిన వరి సాగు.. ధాన్యం దిగుబడిలో అగ్రగామి ఫ మెడికల్ కళాశాల, ఏరియా ఆస్పత్రుల అప్గ్రేడ్తో మెరుగైన వైద్యం ఫ గురుకులాలతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ఫ యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్తో విద్యుత్ వెలుగులు ఇక్కడ ఒకప్పుడు ఎండిపోయిన చేలు, అర్ధరాత్రి కరెంట్ కష్టాలు, అన్నింటికీ మించి ఫ్లోరోసిస్ మహమ్మారితో ఒక తరం నలిగి పోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక.. నల్లగొండ చరిత్ర కొత్త మలుపు తిరిగింది. విద్యా, వైద్య, వ్యవసాయ, సాగునీటి రంగాల్లో అసాధారణ ప్రగతి సాధించింది. ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారడమే కాకుండా.. పచ్చని పొలాలు, మెడికల్ కాలేజీ, భారీ పవర్ ప్లాంట్, ధాన్యం దిగుబడిలో రికార్డు ఇప్పడు నల్లగొండ సొంతం. నల్లగొండ టౌన్ : తెలంగాణ రాష్ట్ర ఆవర్భావం తరువాత జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. నల్లగొండలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ సంఖ్య గణనీయంగా పెరిగింది. మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. జీజీహెచ్ను 400 పడకల స్థాయి నుంచి 700 పడకలకు పెంచారు. దాంతో పాటుగా మిర్యాలగూడ, దేవరకొండ ఏరియా ఆస్పత్రులను 100 నుంచి 200 పడకలకు, నకిరేకల్ ఆస్పత్రినిన 50 నుంచి వంద పడకలకు, మర్రిగూడ ఆస్పత్రిని 30 నుంచి 48 పకడలకు హాలియా పీహెచ్సీని 30 పడకలకు పెంచారు. దీంతో పాటుగా పల్లె దవఖానాలను, బస్తీ దావఖానాలను ఏర్పాటు చేశారు. ● జిల్లాలోని జీజీహెచ్తో పాటుగా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, మర్రిగూడ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ● హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నకిరేకల్లో, అద్దంకి జాతీయ రహదారిపై మిర్యాలగూడలో, నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై మాల్లో, నాగార్జునసాగర్లో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. నల్లగొండ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న నల్లగొండ సాగునీటి విస్తరణ, పారిశ్రామికాభివద్ధి, ిిస్తిరాస్థి వ్యాపారం, సేవారంగం పెరుగుదలతో తలసరి ఆదాయంలో గణనీయమైన పురోగతి సాధించింది. వ్యవసాయం, పాల ఉత్పత్తి, పరిశ్రమలు, సేవారంగం, స్థిరాస్తి వ్యాపారం తలసరి ఆదాయంలో మూడు రెట్లకు పైగా పెరుగుదల తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరాల్లో నల్లగొండ జిల్లా తలసరి ఆదాయం లక్ష రూపాయలలోపే ఉండేది. ప్రస్తుతం రూ.2.62 లక్షలకు పైగా చేరింది. – సాక్షి నెట్వర్క్ -
ఏఐ ఆధారిత బీటెక్తో ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : ఇంజనీరింగ్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ఏఐ ఆధారిత బీటెక్ ఎంతగానో ఉపయోగపడుతుందని ‘ఏఐ ప్రోఫ్’సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పైళ్ల సాయిచరణ్రెడ్డి అన్నారు. ఏఐ ప్రోఫ్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ఐటీ టవర్లో ఆదివారం నిర్వహించిన ఇంజనీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్కు ఆయన హాజరై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దిశా నిర్దేశం చేశారు. నల్లగొండకు చంఎదిన సాందీప్ కోణం గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్కు భరోసా ఇవ్వాలన్న సంకల్పంతోనే ఈ ఇంజనీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థుల ఆశలను నిజం చేస్తూ వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏఐ ప్రోఫ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అజ్మీర భానుప్రకాష్, కోణం ఫౌండేషన్ ప్రతినిధులు స్నేత, నవ్య, శ్రీనివాస్, అంజి, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. -
నీరు పెరుగుతోంది.. ధాన్యం కొనండి సారూ..!
శాలిగౌరారం : మండలంలోని రామగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాలిగౌరారం ప్రాజెక్టు ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభమయ్యింది. దీనికి తోడు మిల్లర్ల పేచీలు, హమాలీ, లారీల సమస్యలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో ఈ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. ఈనెల 24 నుంచి శాలిగౌరారం ప్రాజెక్టులోకి మూసీనది ఎగువనుండి వరద వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరిగి.. ధాన్యం రాసులకు సమీపిస్తోంది. ప్రాజెక్టు ఆవరణలోని కొనుగోలు కేంద్రంలో సుమారు 6 వేల క్వింటాళ్ల ధాన్యం రాశులు నిల్వ ఉన్నాయి. చేతికి అందిన పంట సకాలంలో కొనుగోళ్లు జరగక.. ఎక్కడ ప్రాజెక్టు నీట మునిగి పోతుందోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శాలిగౌరారం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి సుమారు రెండు నెలలు కావస్తోంది. కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్టులోకి మూసీ నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. ధాన్యం రాసులు ప్రాజెక్టు నీటిలో మునిగిపోతాయేమోనని భయమేస్తోంది. ఇప్పటికై నా అధికారులు వేగంగా కొనుగోలు జరిగేలా చూడాలి. – మాద నర్సింహ, రైతు, రామగిరి -
పంటలకు మద్దతు ధర కల్పించాలి
నల్లగొండ టౌన్ : పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఆదివారం నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద రైతు సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రం ఎరువుల ధరలను పెంచుతూ సబ్సిడీలు ఎత్తివేయడం వల్ల రైతులకు పెట్టుబడి పెరిగి రైతుల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, రామచంద్రు, పండు వెంకటేశ్వర్లు, కోశాధికారి దుర్గయ్య, జక్కల నరసింహ, కార్యదర్శి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీఈఓ భిక్షపతి బదిలీ
నల్లగొండ : నల్లగొండ జిల్లా విద్యా శాఖాధికారి బొల్లారం భిక్షపతి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్రావు నల్లగొండకు రానున్నారు. డీఈఓ భిక్షపతి జిల్లాలో 6 సంవత్సరాల 7 నెలల పాటు ఆయన డీఈఓగా పని చేశారు. ప్రస్తుతం ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో ఇప్పటివరకు ఇంత సుదీర్ఘకాలం పాటు డీఈఓగా పని చేసిన వారు లేరు. భిక్షపతి డీఈఓగా జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈయన కాలంలో విద్యాశాఖలో రెండు పర్యాయాలు ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు జరిగాయి. 317 జీఓలో జరిగిన బదిలీల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించి. ప్రజాప్రతినిధులతో, ఉపాధ్యాయ సంఘాలతో మన్ననలు పొందారు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలికట్టంగూర్ : భూగర్భ జలాల పెంపునకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జల్ సంచాయ్, జన్ భాగీదారి పనుల ఆన్లైన్ నమోదును ప్రక్రియను పరిశీలించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షించి మాట్లాడారు. సమావేశంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్రావు, ఎంపీఓ స్వరూపారాణి, సూపరింటెండెంట్ చలపతి, కార్యదర్శులు పెద్దయ్య, అశోక్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. అగ్నివీర్కు ఎన్జీ కాలేజీ విద్యార్థులు ఎంపికరామగిరి(నల్లగొండ) : ఇండియన్ ఆర్మీ తాజాగా విడుదల చేసిన అగ్నివీర్ ఫలితాల్లో ఎన్జీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు ఎంపికయ్యారు. కళాశాలకు చెందిన కె.మహేష్, కె.గణేష్, ఎస్.జయప్రకాశ్, పి.అనిల్, కె.మనోజ్కుమార్ కఠినమైన శారీరక, రాత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి విజయం సాధించడంపై లెఫ్టినెంట్ సిహెచ్.సుధాకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలిరామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ ఉద్యోగులను ఈ నెల 2వ తేదీన ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎన్ఆర్సి.రాజు, విఎస్.రెడ్డి, డిఎం.రెడ్డి, కెఎల్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్టాంప్ కష్టాలు
మిర్యాలగూడ : నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల కొరత తీవ్ర రూపం దాల్చింది. నల్లగొండ జిల్లా పరిధిలో నాలుగు నెలలుగా రూ.20, రూ.100 విలువ గల నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు, న్యాయవాదులు, డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో స్టాంప్ పేపర్లు దొరకక ప్రభుత్వ, ప్రైవేట్ పనులు నిలిచిపోతుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోతున్న పనులు.. ప్రస్తుతం సాధారణ అఫిడవిట్లు, వివిధ రకాల వ్యాపార ఒప్పంద పత్రాలు, బ్యాంకు రుణాలు, అగ్రిమెంట్లు, కోర్టు సంబంధిత లీగల్ పత్రాల తయారీ కోసం రూ.20, రూ.100 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు అత్యంత కీలకం.జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో ఈ పేపర్లు లభించకపోవడంతో ప్రజలు గంటల తరబడి స్టాంప్ విక్రేతల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా స్టాక్ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పనులు ఉన్న వారు పొరుగున ఉన్న ఇతర జిల్లాలకు వెళ్లి అదనపు ఖర్చులతో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కృత్రిమ కొరత... బ్లాక్ మార్కెట్ హవా జిల్లాలో సుమారు 200 మంది స్టాంప్ వెండర్లు ఉన్నారు. ప్రస్తుతం బాండ్ పేవర్ల కొరతను ఆసరాగా చేసుకోని కొందరు స్టాంప్ వెండర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి రూ.100 స్టాంప్ పేపర్లను నిబంధనలకు విరుద్ధంగా రూ.200 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బహిరంగ దోపిడీ జరుగుతున్నా సంబంధిత రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పర్యవేక్షణ లోపమే కారణమా.. తెలంగాణ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారిక ఆన్లైన్ పోర్టల్లోనూ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల స్టాక్ చాలా తక్కువగా చూపిస్తుందని స్టాంప్ వెండర్లు పేర్కొంటున్నారు. పైనుంచి సరఫరా వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని, దానికి తోడు జిల్లా స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్య మరింత జటిలంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో నెలకొన్న స్టాంప్ పేపర్ల సంక్షోభంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని న్యాయవాదులు, డాక్యుమెంట్ రైటర్లు కోరుతున్నారు. ఫ నాలుగు నెలలుగా నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ల కొరత ఫ నిలిచిపోతున్న అగ్రిమెంట్లు ఫ బ్లాక్లో ఎక్కువ రేటుకు విక్రయాలు ఫ పట్టించుకోని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
కనగల్ : చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలోని రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్మాణ పనులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదలకు చదువును దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందని, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్నడూ ఎంజీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టలేదని విమర్శించారు. తాను హెలికాప్టర్లో, కారులో, బండిమీద ఎలా తిరిగినా జిల్లా అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఎంజీ యూనివర్సిటీని చేశామని.. ఇప్పుడు రాష్ట్రంలోనే బెస్ట్ యూనివర్సిటీగా ఉందన్నారు. యూనివర్సిటీలో ఫార్మసీ, ఎల్ఎల్బీ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ధర్వేశిపురం నుంచి కనగల్ –గుర్రంపోడు–దేవరకొండ మీదుగా డిండి వరకు రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. వచ్చే నెల 13 లేదా 14 తేదీల్లో కనగల్ –గుర్రంపోడు మధ్య 100 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, చిట్ల వెంకటేశంగౌడ్, ఎంపీడీఓ వేదరక్షిత, ఎంపీఓ సతీష్, సర్పంచ్ నర్సింగ్ మురళీధర్గౌడ్, ఆర్టీఏ నెంబర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీసీ నర్సింగ్ కృష్ణయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ కనగల్లో జూనియర్ కళాశాల నిర్మాణ పనుల పరిశీలన -
నేరాల నియంత్రణకు నిరంతర తనిఖీలు
నల్లగొండ : నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తారని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఆయన శనివారం అర్ధరాత్రి నల్లగొండలో నాకా బందీ నిర్వహించి వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో నాఖాబందీ నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారని వెల్లడించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. ఫ ఎస్పీ శరత్ చంద్ర పవార్ -
ఎల్లమ్మ పండుగ వేళ.. కన్నవారికి తీరని కడుపుకోత
నల్గొండ జిల్లా: తల్లిదండ్రులు రేణుకా ఎల్లమ్మ పండుగ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారి కుమార్తె మధ్యాహ్నం సమయంలో సరదాగా తోటి పిల్లలతో ఈత కొట్టేందుకు వెళ్తుండగా తల్లిదండ్రులు వద్దని వారించిన వినలేదు. బాలిక గుంత లోతు గమనించక ఈత కొడుతూ కొంత దూరం వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందింది. ఈ ఘటన కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బిల్లంకానిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మగూడెంలో ఆది, సోమవారాల్లో గంగదేవమ్మ పండగ నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. ముందు రోజు శనివారం గ్రామానికి చెందిన ఎలుక శంకర్, కల్పన దంపతులు ఇంట్లో రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. వారు ఈ పనుల్లో నిమగ్నం కాగా.. వారి కుమార్తె హారిక(13) గ్రామ శివారులోని నీటి గుంతలో ఈత కొట్టేందుకు తన అన్న గణేష్, తన మేనత్త కుమార్తె, కుమారుడితో కలిసి గ్రామ శివారులో రైతులు పొలాల దిగువ భాగంలో నీటి నిల్వ కోసం తీసిన పెద్దగుంత వద్దకు వెళ్లారు. గుంత లోతు ఎక్కువగా ఉండటంతో గమనించని హారిక ఈత కొడుతూ దూరంగా వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. హారిక అన్న గణేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఈ విషయాన్ని గణేష్ తన తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో నకరేకల్ ఫైరింజన్ సిబ్బందిని పిలిపించారు. సిబ్బంది బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. హారిక చిన్నపురిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎవరెస్ట్పై అడుగు
సాక్షి, యాదాద్రి : ఫ ఎత్తుకు పోయిన కొద్దీ ఆక్సిజన్ తగ్గుతుంది ‘ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతారోహణ కేవలం ఒక సాహస యాత్ర మాత్రమే కాదు, అది ప్రకృతి.. మనిషికి విసిరే అతిపెద్ద సవాలు. దాన్ని ఎదుర్కొనేందుకు ముందుగా శారీరకంగా, మానసికంగా శిక్షణ పొందాలి’ అంటున్నారు భువనగిరి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి. ఇటీవల హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఎవరెస్ట్ అధిరోహణలో ప్రాణాలు కోల్పోవడం.. ఆయన పార్థివదేహాన్ని అక్కడే వదిలేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. 2022 మే 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి అప్పటి తన అనుభవాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..ఫ డెత్ జోన్లో ప్రాణాలకు పెనుముప్పు ఫ పర్వతారోహణకు ముందు సరైన శిక్షణ తీసుకోవాలి ఎవరెస్ట్ అధిరోహకురాలు పడమటి అన్వితారెడ్డి -
ప్రమాదాలను ఇలా అధిగమించాలి..
పర్వతాలపై ప్రకృతి మన నియంత్రణలో ఉండదు. ప్రధానంగా తీవ్రమైన చలి వల్ల చేతులు, కాళ్ల వేళ్లకు రక్తం ప్రసరించదు. వేళ్లను తరచూ కదిలిస్తూ ఉండాలి. ఒకవేళ మొద్దుబారినట్లు అనిపిస్తే వెంటనే కింది క్యాంపునకు దిగిపోవాలి. అనుభవజ్ఞులైన ‘షెర్పా’ గైడ్ల పర్యవేక్షణలోనే ఉండాలి. అక్కడ ఒక అగ్గిపెట్టె బరువు కూడా వంద కిలోలుగా అనిపిస్తుంది. అనవసరమైన బరువులు లేకుండా శరీరాన్ని సిద్ధం చేసుకుని వెళ్లడమే సురక్షితం. 8వేల మీటర్ల ఎత్తు తర్వాత ఆక్సిజన్ స్థాయి 5 నుంచి 10 శాతం మాత్రమే. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్న ప్రాంతాన్ని డెత్ జోన్ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు సరిగా ఉపయోగించాలి. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. 2015, 2019లో మంచు చరియలు విరిగిపడి ఎంతో మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు.పార్థివ దేహాలను అక్కడే వదిలేస్తారు -
ఉద్యోగాలను రద్దు చేయాలి
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అక్రమంగా భర్తీ చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను వెంటనే రద్దు చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంజీయూ విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ జిట్టా బాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటీవల చేపట్టిన నియామకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని తెలిపారు. రోస్టర్ పాటించకుండా పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, నాయకులు పొలగోని శివ, రాజేష్, యశ్వంత్, రామ్, జితేందర్, సంజీవ, నిరుద్యోగులు తదితరులు ఉన్నారు. -
‘సర్’ వేగవంతం చేయాలి
చిరుచేతుల్లో సృజనాత్మకత మిర్యాలగూడలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరం కొనసాగుతోంది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.ఆర్థిక సాధికారతే లక్ష్యం వికలాంగుల ఆర్థిక సాధికారతే లక్ష్యమని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. - 8లోశనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026జల సంరక్షణ అందరి బాధ్యతపెద్దఅడిశర్లపల్లి : జల సంరక్షణ అందరి బాధ్యత అని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దఅడిశర్లపల్లి మండలంలోని తిరుమలగిరిలో జల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ బెల్లి కృష్ణమ్మఆంజనేయులు, ఎంపీడీఓ చంద్రమౌళి, ఎంపీఓ శేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు. నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం నల్లగొండలోని కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. నేడు ప్రత్యేక ప్రజావాణినల్లగొండ : నల్లగొండలోని కలెక్టరేట్లో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశారన్ని దివ్యాంగులు, వృద్ధులకు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. మీసేవ కేంద్రాల్లో వేగవంతమైన సేవలుమాడుగులపల్లి : మీసేవ కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా సేవలు అందించాలని ఈడీఎం చల్లా దుర్గారావు అన్నారు. శుక్రవారం ఆయన మాడుగులపల్లి మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆన్లైన్ సేవలు, ధ్రువపత్రాలు, స్టేషనరీని పరిశీలించి.. కేంద్రంలో సేవలు సకాలంలో అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీసేవ కేంద్రాల్లో ప్రజలు చేశాక.. ప్రక్రియ పూర్తి కాగానే ఆన్లైన్లోనే నేరుగా ధ్రువీకరణ పత్రం అప్లోడ్ అవుతుందన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మేనేజర్ శివ, మీసేవ కేంద్రం నిర్వాహకులు ఉన్నారు. పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు మొత్తం 340 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు కళాశాల కోఆర్డినేటర్ సీహెచ్.నరసింహారావు తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో సమయానికి హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది ఎ.వెంకటేశ్వర్లు, అజయ్కుమార్, నరేందర్, నజీమొద్దీన్, రవీంద్ర, వీరేశ్నాయక్, చంద్రశేఖర్, ఇద్దయ్య పాల్గొన్నారు. స్తంభించిన ఆర్టీఏ సేవలు నల్లగొండ : నల్లగొండలో ఆర్టీఏ సేవలు నిలిచిపోయాయి. పట్టణంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్ల వానతో కలెక్టరేట్ పక్కన ఉన్న ఆర్టీఏ కార్యాలయ రోడ్డులో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. దీంతో డీటీసీ వాణి ఆర్టీఏ కార్యాలయ సేవలను శుక్రవారం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం స్లాట్ బుకింగ్లు శనివారానికి వాయిదా వేసినట్లు తెలిపారు. శుక్రవారం ఆర్టీఏ సేవలు నిలిచిపోవడంతో లైసెన్స్లు, పిట్నెస్ ఇతర సేవల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఫ చదువుకునే వయస్సులో బాలికలకు పెళ్లిళ్లు ఫ ఆడపిల్లను భారంగా భావిస్తున్న తల్లిదండ్రులు ఫ అధికారులు అడ్డుకుంటున్నా మారని తీరు ఫ మూడు ముళ్లలో బందీ అవుతున్న బాల్యం అడ్డుకున్న బాల్య వివాహాలు, కేసుల వివరాలు..సంవత్సరం అడ్డుకున్నవి కేసులు 2026 34 06 2025 73 16 2024 25 11 2023 38 13 2022 41 14 2021 42 12 2020 50 03 2019 30 03 2018 15 01 2017 09 01 పర్వతారోహణ ఒక కల. ఎవరెస్ట్ ఎక్కడానికి ఏప్రిల్, మే నెల అనువైనది. పర్వతారోహణకు కనీసం 6 నెలల ముందు నుంచే శిక్షణ తీసుకోవాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, మెట్లు ఎక్కడం వంటివి రోజూ సాధన చేయాలి. వీపుపై 15 నుంచి 20 కిలోల బరువున్న బ్యాగ్ని వేసుకుని ఎత్తయిన ప్రదేశాల్లో నడవడం ప్రాక్టీస్ చేయాలి. తీవ్రమైన చలి, శారీరక అలసటను తట్టుకునేలా మానసిక దృఢత్వం సాధించాలి. అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ఉండేలా శిక్షణ పొందాలి. పర్వతం ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలి తగ్గుతుంది. శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడటానికి బేస్ క్యాంపుల వద్ద కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్లాలి. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. వారంతా తగు జాగ్రత్తలు పాటించాలి.నల్లగొండ : కాలం మారుతున్నా.. సమాజం ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా.. మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నా కొందరు తల్లిదండ్రుల ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. చదువుకోవాల్సిన వయస్సులో తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ వారి బాల్యాన్ని మూడు ముళ్లతో బంధిస్తున్నారు. బాలికలకు వివాహాలు చేస్తూ భార్యలు, తల్లులుగా మారుస్తూ వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఎక్కడో ఒకచోట బాల్యవివాహం జరుగుతూనే ఉండడం ఇందుకు నిదర్శనం. అడ్డుకున్నా.. ఆగట్లేదు! జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ అధికారులు బాల్య వివాహాలు అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ సమాచారం అందిన వెంటనే స్పందిస్తూ బాల్య వివాహాలను పెళ్లిపీటల మీదనే అడ్డుకుంటున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు 357 బాల్య వివాహాలను అడ్డకున్నారు. కాగా చట్ట విరుద్ధంగా బాల్య వివాహాలు చేసినందుకు సంబంధికులపై పోలీస్ స్టేషన్లలో 2017 నుంచి ఇప్పటి వరకు 80 కేసులు నమోదయ్యాయి. మారని తల్లిదండ్రుల తీరు పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక ఆచారాలు, ఆడపిల్లల భద్రతపై భయాలు, బాల్య వివాహాలకు ప్రధాన కారణమవుతున్నాయి. ఆడపిల్ల భారమనే పాతతరం భావాల నుంచి బయట పడలేకపోతున్నారు కొందరు తల్లిదండ్రులు. మరికొందరు టీనేజీ ప్రేమలు, భద్రతా సమస్యల నెపంతో చట్టాలను పట్టించుకోకుండా చిన్న వయస్సులోనే బాలికలకు వివాహాలు చేస్తున్నారు. అధికారులు అడ్డుకుంటున్న వివాహాలు ఆగడం లేదు. అమరుల కుటుంబాలను ఆదుకుంటాం ఫ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ మోత్కూరు : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అమరుల కుటుంబాలు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతోందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత, తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి శంకరమ్మ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా నియామకమైన సందర్భంగా వారికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో శుక్రవారం మోత్కూరులో సన్మాన సభ నిర్వహించారు. ముందుగా అయిలమ్మ, శ్రీకాంతాచారి చిత్రపటాలకు మంత్రి, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తొలి, మలిదశ దశ ఉద్యమాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే పురుడు పోసుకున్నాయన్నారు. కాసోజు శంకరమ్మను బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవమానిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెతోపాటు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా నియమించి తగిన గౌరవం ఇచ్చిందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ గద్దర్ బిడ్డకు సైతం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి ఇచ్చి ప్రభుత్వం గౌరవించిందన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత మాట్లాడుతూ మహిళా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. ఈ సందర్భంగా కళాకా రుడు గిద్ద రామనర్సయ్య బృందం ఆట, పాటలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, చౌటుప్పల్ డీఎస్పీ పి.మధుసూదన్రెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్నేత, మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, మార్కెట్ చైర్పర్సన్ విమల తదితరులు ఉన్నారు.ఎవరెస్ట్ అధిరోహణలోప్రాణాలు కోల్పోతే.. మృతదేహాలను కిందికి తీసుకురాలేక, అక్కడే వదిలేస్తారు. కృత్రిమ ఆక్సిజన్ సహాయంతో ముందుకు సాగే సాహసకులు బరువును కోల్పోతారు. మైదాన ప్రాంతంలో పది కిలో మీటర్లు పరుగెత్తే వారు ఎవరెస్ట్ మీద ఆయాసంతో కనీసం ఒక్క అడుగు కూడా వేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి శవాలను తీసుకురావడానికి ముందుకు వచ్చే వారు తక్కువగా ఉంటారు. సాధారణ మనిషి బరువు 50 నుంచి 60 కిలోలు ఉంటే, వారి ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర సామగ్రి బరువు మరో 5 నుంచి 10 కిలోలు ఉంటుంది. ఎవరెస్ట్పై దారులు చాలా ఇరుగ్గా, లోయలతో ఉంటాయి. అడుగు అటుఇటు పడితే లోయల్లోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ దారుల్లో, ఒక మృతదేహం, లేదా ప్రమాదంలో చిక్కుకున్నవారిని కిందికి తీసుకురావాలంటే ఎంతో రిస్క్. ప్రస్తుతం ఎవరెస్ట్పై ఎక్కువ మరణాలు సంభవిస్తున్న ప్రాంతం ‘హిల్లరీ స్టెప్’. ఇక్కడ ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి గానీ, తాడు కిందకి వేసి రక్షించడానికి గానీ వీలుండదు. ఎందుకంటే ఆ ఎత్తులో హెలికాప్టర్ ఎక్కువసేపు ఆగలేదు. సత్వర వైద్య సేవలు అందించాలి : కలెక్టర్నల్లగొండ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) ద్వారా సత్వర సేవలందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆసుపత్రి పనితీరుపై శుక్రవారం తన ఛాంబర్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మానవనరులు, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గల కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సూపరింటెండెంట్ నరసింహారావు నేత, డీసీహెచ్ డాక్టర్ మాతృ, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన బాలిక తల్లిదండ్రులు మరణించగా తాత సంరక్షణలో పెరిగింది. కట్నం తక్కువ తీసుకునే అబ్బాయిని చూసి ఆ బాలికకు పెళ్లి చేయాలని ఆమె తాత నిశ్చయించాడు. గతేడాది మేలో బాల్య వివాహం చేస్తుండగా సమాచారం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ అధికారులు చింతకుంట్లకు వెళ్లి అడ్డుకున్నారు. బంధువులు, బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలికను చింతకుంట్ల జెడ్పీహెచ్ఎస్లో చేర్పించి పదో తరగతి చదివించగా ఈ ఏడాది 416 మార్కులు సాధించింది. తన మనవరాలు మేజర్ అయ్యేంత వరకు పెళ్లి చేయనని ఆ బాలిక తాత పేర్కొన్నారు. వేములపల్లి మండలం రావులపెంటకు చెందిన బాలికకు తల్లిదండ్రులు బాల్య వివాహం చేయాలనుకున్నారు. తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతోపాటు మంచి సంబంధం వచ్చిందని మధ్యవర్తి సంబంధం తేవడంతో గతనెలలో మొదటి వారంలో పెళ్లి నిశ్చయించారు. ఈ సమాచారం తెలిసిన ఐసీడీఎస్, బాలల సంరక్షణ అధికారులు బాలిక కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి గ్రామ సర్పంచ్ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి గతనెల 9న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరిచారు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం సూర్యాపేటలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. నల్లగొండ మండలం ఆర్జాలబావికి చెందిన ఓ బాలికకు తన కుటుంబ సభ్యులు ఆమెకు ఇష్టం లేకున్నా కనగల్ మండలం అజలాపురానికి చెందిన వ్యక్తితో బాల్య వివాహం చేయాలని చూశారు. ఈ ఏడాది మార్చి 6న బాలికకు వివాహం చేస్తున్నారని 1098కు ఫోన్ రావడంతో శిశు సంక్షేమ అధికారులు అక్కడకు చేరుకుని బాల్య వివాహం ఆపారు. అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ బాలిక నల్లగొండలోని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. -
శాలిగౌరారంలో లారీ డ్రైవర్లు, యజమానుల రాస్తారోకో
శాలిగౌరారం : శాలిగౌరారం అంబేద్కర్ చౌరస్తా వద్ద లారీ డ్రైవర్లు, యజమానులు శుక్రవారం ధాన్యం లోడుతో ఉన్న లారీని రోడ్డుకు అడ్డంగా నిలిపి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లారీల యజమానులు, డ్రైవర్లు మాట్లాడుతూ ధాన్యం లోడుతో మార్కెట్యార్డుకు వచ్చి వారం రోజులకుపైగా నిరీక్షిస్తున్నామన్నారు. లారీలో అధిక లోడు ఉండటంతో టైర్లు దెబ్బతింటున్నాయని, దిగుమతులు చేపట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. మార్కెట్యార్డులో కనీసం మంచినీళ్లు కూడా లేవని, తిండిలేక డ్రైవర్లు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ట్రిప్పు కిరాయితో వారం రోజులు పైగా పడిగాపులు కాస్తుంటే లారీల ఫైనాన్స్ చెల్లించలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. లారీల డ్రైవర్ల రాస్తారోకో విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాధవరావు, ఎస్ఐ సైదులు అక్కడికి చేరుకొని డ్రైవర్లు, యజమానులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా డ్రైవర్లు తహసీల్దార్ చేతులు పట్టుకొని మా ఇబ్బందులు తీర్చాలని వేడుకున్నారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. -
క్షణాల్లో మంటలు.. కాలిబూడిదైన ట్రావెల్స్ బస్సు!
సాక్షి, నల్లగొండ: డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో జాతీయ రహదారి-65పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘనటలో బస్సు క్షణాల్లో కాలి బూడిదైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును రోడ్డుపక్కన ఆపాడు. అనంతరం ప్రయాణికులందరినీ క్షణాల్లో బస్సు నుంచి బయటకు దించడంతో పెద్ద విషాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొద్ది సేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి.ప్రయాణికుల కళ్లెదుటే ట్రావెల్స్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ఏ ట్రావెల్స్కు చెందింది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇంజిన్లో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. -
నా కోడిని చంపినోళ్లను వదలొద్దు
నల్గొండ జిల్లా: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కింది. జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది. -
మీ ఫోన్ వస్తే భయమేస్తోంది సార్..
నల్గొండ జిల్లా: ‘మీ ఫోన్ వస్తే భయమేస్తోంది సార్.. మీ వల్ల నరకం చూశాను.. అధిక వడ్డీకి అప్పులు తీసుకొని తీర్చలేకపోతున్నా.. నా కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి’అని సూసైడ్ నోట్ రాసి వ్యవసాయాధికారి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు (38) కొన్నేళ్లుగా కేతేపల్లి క్లస్టర్ వ్యవసాయ శాఖలో ఏఈఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ అవసరాలతోపాటు వ్యవసాయం చేసేందుకుగాను కొందరి వద్ద అప్పుగా డబ్బు తీసుకొని వాటిపై అధిక వడ్డీ భారం మోస్తూ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించగా గురువారం ఉరుమడ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అప్పుల మీద అప్పులు.. ఆత్మహత్యకు ముందు ఏఈఓ బాలరాజు తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అందులో.. అప్పు ఇచ్చిన వారు ఫోన్ చేస్తూ ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు. తాను పనిచేస్తున్న ప్రాంతంలో మరో వ్యక్తితో కలిసి పదెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయగా రూ.3 లక్షల నష్టం వచ్చిందన్నాడు. అది పూడ్చుకునేందుకుగాను ఓ చిట్ఫండ్లో పనిచేసే ఏజెంట్ ద్వారా తన తోటి కౌలుదారుతో చిట్టీ వేయించానని, అందుకు తాను ష్యూరిటీ ఉన్నానని, అతడు చిట్టీ డబ్బులు పూర్తిగా కట్టకపోవడంతో రూ.5 లక్షలు చిట్ఫండ్ కంపెనీకి తానే కట్టాల్సి వచ్చిందని నోట్లో పేర్కొన్నాడు. ఈ భారం నుంచి బయటపడేందుకు.. తెలిసిన వ్యక్తుల ద్వారా మారి్టగేజ్ లోన్లు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొని, వడ్డీలు కట్టలేక మరలా అప్పులు చేయాల్సి వచ్చిందని బాలరాజు వివరించాడు. అధిక వడ్డీలతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న వారిని వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో కలెక్టర్, ఎస్పీలను కోరాడు. -
పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
మిర్యాలగూడ : మండలంలోని శ్రీనివాస్నగర్ గుమస్తాల కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పించే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం ఆయన.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 2న లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని, ఈనెల 30లోపు పనులన్నీ పూర్తి చేయాలన్నారు. శానిటేషన్, గదుల శుభ్రత, పెయింటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రోడ్లపై గుంతలను పూడ్చివేయాలన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, డీఈలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పనుల పరిశీలన తిప్పర్తి : డబుల్బెడ్ రూం ఇళ్ల వద్ద మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం తిప్పర్తి మండల కేంద్రంలోని డబుల్బెడ్రూం ఇళ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇళ్ల వద్ద విద్యుత్, శానిటేషన్ తదితర పనులు పూర్తి చేయాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ రాజ్కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ జ్యోతి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
నీలగిరిలో గాలివాన బీభత్సం
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో గురువారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పాటు వడగళ్లతో అరగంట పాటు కురిసిన వానకు జనం అతలాకుతలమయ్యారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. చాలా చోట్ల ఇళ్ల పైకప్పు లేయిపోయి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయం సమీపంలో ఓ ఇంటి పైనున్న హోర్డింగ్ విరిగింది. అయితే సగం విరిగి వేలాడుతున్న ఆ హోర్డింగ్ను తొలగించలేదు. మళ్లీ ఈదురుగాలి వస్తే జనాలపై పడే ప్రమాదం ఉంది. గొల్లగూడలోని శాంతి మహిళా మండలి వృద్ధాశ్రమంలో భారీ వృక్షం నేలకూలింది. రహమత్నగర్ రోడ్డు వరద నీటితో నిండింది. కూలిన వ్యాపార సముదాయం.. కలెక్టరేట్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వెళ్లే దారిలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాల పైకప్పు రేకులు లేచిపోయి దూరంగా పడ్డాయి. భారీ ఈదురుగాలులతో విద్యుత్ లైను తెగి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొన్ని కాలనీలు రాత్రి వేళ అంధకారంలోనే ఉన్నాయి. -
రైల్వే కారిడార్గా దామరచర్ల
మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రం భవిష్యత్లో రైల్వే కారిడార్గా మారనుంది. 30 ఏండ్ల క్రితం దామరచర్ల మీదుగా నడికుడి – బీబీనగర్ రైల్వేలైన్ సింగిల్గా ప్రారంభం కాగా ప్రస్తుతం ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు ఆరు లైన్లుగా విస్తరించనుంది. ఇప్పటికే విష్ణుపురం స్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వరకు రెండు లైన్లు నిర్మించారు. నడికుడి – బీబీనగర్ మార్గంలో ఇప్పటికే సింగిల్లైన్ ద్వారా రైళ్ల రాకపోకలు జరుగుతుండగా డబుల్ లైన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. విష్ణుపురం– మోటుమర్రి రైల్వే మార్గం సింగిల్ లైన్ ఉండగా ప్రస్తుతం రెండో లైన్ మంజూరైంది. ఇదిగాక దామరచర్ల వద్ద నడికుడి – బీబీనగర్ రైల్వేలైన్, విష్ణుపురం– మోటుమర్రి లైన్ను అనుసంధానం చేసే బైపాస్ లైన్ (5 కిలో మీటర్ల) ఇటీవల మంజూరు చేశారు. అధికారులు భూసేకరణ పూర్తి చేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో దామరచర్ల వద్ద ఎటు చూసినా రైల్వే లైన్లు కనిపించనున్నాయి. ఈ ఆరు లైన్లు వినియోగంలోకి వస్తే దామరచర్లకు మూడు వైపులా ఆర్యుబీ (వంతెన కింద రహదారి) ద్వారానే గ్రామానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కృష్ణానదిపై రైల్వే వంతెన.. నడికుడి – బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్ (డబ్లింగ్) పనుల్లో భాగంగా వాడపల్లి వద్ద కృష్ణా నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 239 కిలో మీటర్ల రైల్వే లైన్ ఏర్పాటుకు రూ.2,853 కోట్లు మంజూరు కాగా పనులు వేగంగా సాగుతున్నాయి. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 50శాతంకు పైగా పనులు పూర్తయ్యాయి. మట్టికట్ట, కల్వర్టుల నిర్మాణం జరుగుతోంది. కృష్ణానదిపై వంతెన ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దామరచర్ల సమీపంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్కు విష్ణుపురం నుంచి 8కిలోమీటర్ల దూరం డబుల్ రైల్వేలైన్ను నిర్మించారు. 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిత్యం 70వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. రోజుకు సరాసరి 15 ర్యాక్ రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దీని వల్ల బొగ్గు గూడ్సు రైళ్లు నిత్యం తిరగనున్నాయి. వైటీపీఎస్ రైలు మార్గంలో రైళ్ల రద్దీ వల్ల ఈ ప్రాంతంలో రైలు కూత మర్మోగనుంది. ఫ చుట్టూ ఆరు రైల్వే లైన్ల నిర్మాణం ఫ మూడు వైపులా ఆర్యూబీ ద్వారానే గ్రామంలోకి రాకపోకలు -
ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
రామగిరి(నల్లగొండ) : ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగను సందర్భంగా నల్లగొండ పట్టణం మునుగోడు రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి వెంకట్రెడ్డితోపాటు కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ హాజరై ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశ్వాసానికి, త్యాగ నిరతికి బక్రీద్ నిదర్శమన్నారు. దేశంలో సోదరభావాన్ని పెంపొందించేందుకు ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ ద్వేషాన్ని వీడండి – దేశాన్ని జోడించండి (నఫ్రత్ ఛోడో – భారత్ జోడో) అనే గొప్ప నినాదంతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా నల్లగొండలో గంగా–జమునా తహజీబ్ తరహాలో రంజాన్, బక్రీద్, దసరా పండుగలను సోదరభావంతో జరుపుకుంటున్నామని చెప్పారు. త్వరలో భూమిని కేటాయించి షాదిఖానాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఏఎస్పీ రమేష్, డిప్యూటీ మేరకు ఎండీ.అష్రఫ్ అలీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.హఫీజ్ఖాన్, కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్ మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు
రామగిరి(నల్లగొండ) : సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పరిశ్రమల అవసరాలు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తోంది. సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అనుబంధంగా కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సరికొత్త డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే సాఫ్ట్వేర్, ఆటోమేషన్, అధునాతన మ్యాన్ఫ్యాక్చరింగ్ రంగాల్లో స్థిరపడటానికి అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. ఐదు కళాశాలల్లో కొత్త కోర్సులు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు (నల్లగొండ, సూర్యాపేట, తిరుమలగిరి, నాగార్జునసాగర్, యాదగిరిగుట్ట) ఉన్నాయి. నల్లగొండలో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, నాగార్జునసాగర్లో అడ్వాన్స్డ్ మ్యాన్ఫాక్చరింగ్ టెక్నాలజీ, సూర్యాపేటలో ల్యాండ్ స్కేప్ డిజైన్, తిరుమలగిరిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, యాదగిరిగుట్టలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులు వచ్చాయి. ప్రస్తుత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈసారి అడ్వాన్స్డ్ కోర్సులకు అనుమతులు మంజూరయ్యాయి. టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, ఈ కొత్త కోర్సులతో కలిపి ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు స్లాట్ బుకింగ్, 29 నుంచి జూన్ 1 వరకు సరిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, జూన్ 6న కళాశాలల కేటాయింపు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త కోర్సులు ప్రారంభం కానుండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది. -
ప్రజలకు మరింత చేరువ కావాలి
రామగిరి(నల్లగొండ) : విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ రూరల్ పోలీస్స్టేషన్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. స్టేషన్లో రికార్డులు, క్రైం ప్రాపర్టీలు, సీజ్ చేసిన వాహనాలు, సీసీ కెమెరా పనితీరు, కోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామస్థాయి సమాచార వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తనిఖీలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు ఆదిరెడ్డి, రాఘవరావు, ఎస్ఐ సైదాబాబు, సిబ్బంది ఉన్నారు.ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక
నార్కట్పల్లి : టీజీఎస్ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్పేర్ అసోసియేషన్ రీజియన్ స్థాయి కార్యవర్గాన్ని గురువారం నార్కట్పల్లిలో ఎన్నుకున్నారు. రీజియన్ అధ్యక్షుడిగా కొర్ర లింగానాయక్, కార్యదర్శిగా పండి యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా బండారు జానకిరాములును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గడ్డం శ్రీనివాస్, బట్టు రాజయ్యనాయక్, బిబి.సింగ్ రాథోడ్, కావలి నిరంజన్, కడియం రమేష్, గాదె లక్ష్మయ్య, కె.శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు. సామూహిక పోరాటాలతోనే తెలంగాణ సాకారంమిర్యాలగూడ టౌన్ : సబ్బండ వర్గాల సామూహిక ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్ర సాకారమైందని సామాజికవేత్త, తొలి, మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ జాడీ రాజు అన్నారు. గురువారం స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవనంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన నాయకులను గుర్తించి, గౌరవంగా సత్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులను సత్కరించేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ నేత మాళోతు దశరథనాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, మాడుగుల శ్రీనివాస్, ధీరావత్ లింగానాయక్, క్రాంతికుమార్, బంటు వెంకటేశ్వర్లు, మురళియాదవ్, నాగేశ్వర్రావు, ఇక్బాల్, జయరాజు, నీలకంఠం, కిరణ్, కోల సైదులు, చిదేళ్ల సత్యనారాయణ, కృష్ణయ్య, లింగయ్య, గంధం సైదులు, చిలుకూరి శ్యాం, షోయబ్, నాగరాజు, మధుసూధన్, రాజ్కుమార్, ఎంవీఆర్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలి మర్రిగూడ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, పేదలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు భారంగా మారాయని అన్నారు. ప్రధాని మోదీ విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట చల్లం పాండురంగారావు, ఆర్.అంజయ్యచారి, నలభరాజు రామలింగయ్య, ఈదుల భిక్షంరెడ్డి, బుర్ర శేఖర్, ఎరుకల నిరంజన్, ఆకుల రఘుమయ్య, జక్కలి అంజయ్య, కల్లెట్ల లింగయ్య, అయితగోని వెంకటయ్య, బాలకిషన్, అల్వాల్ నరసింహ, బోడ అంజయ్య, కృష్ణయ్య, నజీర్, యాదయ్య, రామచంద్రం, మహేందర్, శేఖర్ తదితరులు ఉన్నారు. -
15 నెలలుగా వేతనాల్లేక..
104 పథకంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సిబ్బందికి నెలనెలా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు అందించి ఆదుకోవాలి. అలాగే ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారిని జిల్లాకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. – బైరగోని భిక్షం, పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, (ఐఎన్టీయూసీ 3194) జిల్లా అధ్యక్షుడు నల్లగొండ టౌన్ : ఔట్సోర్సింగ్ పద్ధతిన 104 పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 15 నెలలుగా వేతనాలు అందడం లేదు. గతంలో ఈ పథకాన్ని రద్దు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందులో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాల్లో సర్దుబాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 75 మంది ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు మూడేళ్ల క్రితం వరకు పనిచేశారు. ఇందులో 15 మంది రెగ్యులర్ అయ్యాయి. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన తర్వాత 104 సేవలు అవసరం లేదని నిలిపివేసింది. దాంట్లో అందులో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగాం జిల్లాలోని ఆస్పత్రులు, పీహెచ్సీలలో సర్దుబాటు చేసి వారందరిని అక్కడ విధులను నిర్వహించాలని ఆదేశించింది. దీంతో వారందరూ తక్కువ వేతనాలు అయినప్పటికీ బతుకుదెరువు కోసం ఆయా జిల్లాల్లో విధులను నిర్వహిస్తున్నారు. ఇందులో రెండేళ్ల వరకు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసిన 60 మందిని డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్) పరిధిలోకి తీసుకున్నారు. తక్కువ వేతనంతో వెట్టిచాకిరీ.. ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న 104 వాహన ఉద్యోగులకు విభాగాల వారీగా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనాలు ఉంటాయి. వేతనం తక్కువ అయినప్పటికీ విధిలేక ఇతర జిల్లాలో పనిచేస్తున్నా ప్రతినెలా ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు సుమారు పదిహేను నెలల నుంచి వేతనాలను ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా తాము బస్సు కిరాయిలు, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, కుటుంబ పోషణకు నెలనెలా అప్పులు చేసి నెట్టుకు వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలనెలా వేతనాలు అందేలా చూడాలని సిబ్బంది కోరుతున్నారు. ఫ ఆర్థిక ఇబ్బందుల్లో 104 సిబ్బంది ఫ పథకాన్ని రద్దు చేసినా ఇతర జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు ఫ ప్రస్తుతం డీఎంఈ పరిధిలో పనిచేస్తున్న 60 మంది -
ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తాం
మునుగోడు : రానున్న ఐదేళ్లలో మునుగోడు మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తామని డీసీసీబీ మాజీచైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నా రు. రూ.7.5కోట్ల నిధులతో బి.వెల్లెంల ఉదయ సముద్రం నుంచి మండలంలోని పులిపలుపుల, కల్వలపల్లి గ్రామాలకు సాగు నీరు అందించే కాల్వ నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుగోడు మండలంలోని చెరువులన్నీ నింపి రైతుల కళ్లల్లో ఆనందం నింపేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే కిష్టాపురం చెరువు వరకు కాల్వ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారా యణ, బీరెల్లిగూడెం, పులిపలుపుల, గంగోనిగూడెం సర్పంచ్లు దాసరి గోవర్ధన్, కమ్మంపాటి జ్యోతివెంకటేశ్వర్లు, గోపగోని పాపయ్యగౌడ్, బొల్గూరి నర్సింహ, సయ్యద్, ముక్తార్, పాష పాల్గొన్నారు. -
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ : బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లాలోని ముస్లింలకు బుధవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ ప్రతి ముస్లిం కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. కాగా నేడు నల్లగొండలో ఈద్గా వద్ద జరిగే బక్రీద్ వేడుకలకు మంత్రి హాజరు కానున్నారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి : గుత్తా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులునల్లగొండ : నల్లగొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు బదిలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీ అయిన ఉద్యోగులకు జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పు రాంబాబు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. 29న జాబ్మేళా నల్లగొండ : నల్లగొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఐటీఐ క్యాంపస్లో ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు జిల్లాలోని నిరుద్యోగ యువతకు పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించుటకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ :7893420435 నంబర్ను సంప్రదించాలని కోరారు. ధాన్యం దిగుమతికి లారీల బారులుకొండమల్లేపల్లి : మండల పరిధిలోని గుమ్మడవల్లి గ్రామ సమీపంలోని సాయిలక్ష్మీ పారా బాయిల్డ్ రైస్ మిల్లు వద్ద వరి ధాన్యం దిగుమతి (అన్ లోడింగ్) కోసం లారీలు రోడ్డుపై బారులుదీరాయి. ప్రస్తుతం మిల్లు ఎదుట రోడ్డుపై ఆరు లారీలు, మిల్లు లోపల 10కి పైగా లారీలు ధాన్యం లోడుతో దిగుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిలో కొన్ని లారీలు వారం క్రితం రాగా, మరికొన్ని మూడు రోజుల క్రితం, ఇంకొన్ని గత రాత్రి కురిసిన వర్షంలో తడుస్తూ ఇక్కడికి చేరుకున్నాయి. మిల్లులోని గోదాములు నిండిపోవడమే దిగుమతి ఆలస్యానికి ప్రధాన కారణమని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి త్వరగా ధాన్యాన్ని దిగుమతి చేయించాలని డ్రైవర్లు, రైతులు కోరుతున్నారు. యాదగిరీశుడికి లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవను జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలను నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన పూజను చేపట్టారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవమూర్తులను అలంకరించి, వివిధ సుగ్రంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలు, తులసీ దళాలతో శ్రీస్వామి వారికి లక్ష పుష్పాలతో అలంకరించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులు, అధికారులు, సిబ్బందికి పుష్పాలను అందజేశారు. -
మెరుగైన సేవలు అందించాలి
నల్లగొండ : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు అప్రమత్తంగా పనిచేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిపాలన, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్రైమ్ ప్రాపర్టీ రూమ్లో భద్రపరిచిన కేసు సంబంధిత వస్తువులు, స్వాధీనం చేసుకున్న సామగ్రి, వాహనాలను శాసీ్త్రయ పద్ధతిలో భద్రపరచాలని తెలిపారు. అనంతరం పోలీస్ అధికారులు, స్టేషన్ సిబ్బందితో సమావేశమయ్యారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలపై తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనునాయక్, టూటౌన్ ఎస్ఐ సైదులు ఉన్నారు. -
మొక్కలంటే లెక్కలేదా
కొండమల్లేపల్లి : వర్షాకాలంలో చేపట్టే వన మహోత్సవానికి మొక్కలు పూర్తిస్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. కొండమల్లేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో గల నర్సరీల్లో మొక్కల పెంపకంపై నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గుమ్మడవల్లి, దేవరోనితండా గ్రామ పంచాయతీల్లోని వన నర్సరీలో మట్టినింపిన సంచుల్లో గింజలు పెట్టినా మొలకెత్తలేదు. వాటిల్లో మళ్లీ గింజలు పెట్టాల్సి ఉన్నా అలాగే వదిలేశారు. మరికొన్ని కవర్లలో మట్టినింపి ఖాళీగా ఉంచారు. గుమ్మడవల్లి గ్రామ పంచాయతీకి, దేవరోనితండా కార్యదర్శి ఇన్చార్జిగా ఉండడం వల్ల ఈ రెండు నర్సరీలను నిర్లక్ష్యం చేసినట్లుగా కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలా తయారైందని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. -
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
రామగిరి (నల్లగొండ) : బక్రీద్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇందుకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు నిర్వహించనుందని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా ప్రాంగణాన్ని బుధవారం ఎస్పీ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్థనలకు ముస్లింలు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీటి వసతి, పరిశుభ్రత తదితర అంశాలపై దృష్టిపెట్టాలని సంబంధిత అధికారులకు, ఈద్గాను శుభ్రం చేస్తున్న మున్సిపల్ వర్కర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, నీలగిరి నగర మున్సిపల్ డిప్యూటీ మేయర్ అమేర్, వివిధ డివిజన్ల కార్పొరేటర్స్, ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలోని ఈద్గా వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు ముస్తాబైన మునుగోడు రోడ్డులోని ఈద్గా ప్రాంగణం ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
కార్మికుల భద్రతకు ప్రాధాన్యం
నల్లగొండ : పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్, జిల్లా సంక్షోభ కమిటీ చైర్మన్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి సంక్షోభ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పరిశ్రమల్లో ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రమాదాల సందర్భంగా ప్రాణ నష్టం జరగకుండా కార్మికుల భద్రతే ధ్యేయంగా ప్రతి శాఖ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల భద్రతలో భాగంగా ప్రతి కంపెనీ వారంలోగా సేఫ్టీ ఆడిట్ నివేదికలను సమర్పించాలన్నారు. వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ విజయకుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి పలు విషయాలను వివరించారు. సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ దామోదర్ సింగ్, ఐఎన్టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగన్న, దుర్గాప్రసాద్, ఆర్డీఓ అశోక్రెడ్డి పాల్గొన్నారు. 6.96లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు రూ.1,663 కోట్ల విలువ చేసే 6,96,218 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్రెడ్డి హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఇంకా 46,312 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉందన్నారు. కాన్ఫరెన్స్లో ఎస్పీ శరత్చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల డీఎం రాంపతి నాయక్, డీఎస్ఓ వెంకటేశం, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
అభివృద్ధితోనే జీడీపీ పెరుగుతుంది
నల్లగొండ : గ్రామాల అభివృద్ధితో గ్రామీణ జీడీపీ (గ్రామీణ స్థూల జాతీయోత్పత్తి) పెరుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ పంపు పనులు, మహిళా సూపర్ బజార్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఏపీఓలు, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా 1.23 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. జిల్లాలో 17 ఎంపీడలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ లక్ష్యాల సాధనలో అధికారులు చూపుతున్న కృషిని ప్రశంసించారు. జిల్లాలో 941 గ్రామ సమాఖ్య భవనాలు, 14 ఫుడ్ స్టోరేజ్ గోదాముల నిర్మాణం చేపట్టడం శుభపరిణామన్నారు. సమష్టి నాయకత్వంతో గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఆర్గానిక్ సాగువైపు అడుగులు వేయాలి స్వయం సహాయక మహిళా సంఘాలు కూడా ఆర్గానిక్ సాగు వైపు అడుగులు వేయాలని దాన కిషోర్ సూచించారు. రాష్ట్రంలో 8,029 ధాన్యం కేంద్రాలను స్వయం సహాయక మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రెండేళ్లలో మహిళా సంఘాలకు రూ.65 వేల కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ కమిషనర్ లక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి పాల్గొన్నారు. ఫ పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ -
నెలన్నర దాటినా..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వానాకాలం వ్యవసాయ సీజన్ దగ్గర పడుతోంది. మబ్బులు కమ్ముకొస్తున్నాయి. అయినా యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. అకాల వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడం లేదు. లారీల కొరతతో నెలరోజుల క్రితం వచ్చిన ధాన్యం కూడా కల్లాల్లోనే ఉండిపోతోంది. దానికి తోడు కొందరు నిర్వాహకులే దళారులు అవతారం ఎత్తారు. కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనకుండా, తక్కువ ధరకు తామే కొనుక్కొని ఎక్కువ ధరకు మిల్లుకు విక్రయిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెనెలన్నర రోజులు దాటిపోయినా రైతులు తమ ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా? అంటూ ఎదురు చూడాల్సి వస్తోంది. మంగళవారం రాత్రి అక్కడక్కడా అకాల వర్షం పడడంతో ధాన్యం తడిచిపోయింది. మిగితా ప్రాంతాల్లోనూ అకాల వర్షాలు పడితే ధాన్యం తడిచిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొన్నది 6.96 లక్షల మెట్రిక్ టన్నులే.. జిల్లాలో 7.42 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం మార్కెట్కు వచ్చింది. అందులో 6.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా అంతకంటే ఎక్కువే ఉంటుందని రైతులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ లారీల సమస్య తీరడం లేదు. 820 లారీలు పెట్టామంటున్న జిల్లా పౌరసరఫరాల విభాగం చెబుతున్నా, లారీలు రాకపోవడం వల్లే ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొనుగోళ్లలో జాప్యంతో రైతుల ఆవేదనఫ ఇంకా కొనుగోలు కేంద్రాల్లో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఫ రోజుల తరబడి ఎదురుచూపులే.. ఫ గాలివానకు తడిచిపోతున్న ధాన్యం ఫ కాపాడుకునేందుకు అవస్థలు -
విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తాం : వీసీ
నల్లగొండ టూటౌన్ : సెనెట్ సభ్యుల సూచనలు సలహాలు మేరకు విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తామని ఎంజీయూ వైస్ చాన్స్లర్ (వీసీ) ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో మంగళవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన అకడమిక్ సెనెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో విద్య, ఆర్థిక అంశాలను సమీక్షించి ఆమోదించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక లెక్కలు, 2025–26కు సంబంధించిన డ్రాప్టు బడ్టెట్, రివైజ్డ్ బడ్జెట్కు ఆమోదం తెలిపారు. కొత్తగా నియమితులైన డీన్, రిజిస్ట్రార్ నియామకాలు, పదోన్నతులు, అనుబంధ విద్యా విభాగాల బలోపేతానికి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి మరింత దోహదం చేయడానికి ఈ నిర్ణయాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. సమావేశంలో మాజీ వీసీ గంగాధర్, ప్రొఫెసర్లు కట్టా నర్సింహారెడ్డి, భాగ్యనారాయణ, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రొఫెసర్ శ్రీదేవి, రేఖ, ఆకుల రవి, అల్వాల రవి, అన్నపూర్ణ, ఉపేందర్రెడ్డి, హరీష్కుమార్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
నల్లగొండ : బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సమీప కాలనీల కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈద్గాలు, మసీదుల వద్ద తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ కె.శివరాంరెడ్డి, వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, నల్లగొండ ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అమేర్, ఎస్ఐలు సైదులు, లచ్చిరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నాలుగు గ్రామాల్లోవడగండ్ల వానశాలిగౌరారం : మండలంలోని వంగమర్తి, మాధారంకలాన్, ఇటుకులపహాడ్, పెర్కకొండారం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. అకాల వర్షం ధాటికి ఆయా గ్రామాల్లోని వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మాధారంకలాన్లో అత్యధికంగా గంటన్నర సేపు వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో వానాకాలం పంటల సాగుకు సిద్ధమయ్యే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరీశుడి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేషపూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు చేశారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన జరిపారు. ఇక శ్రీస్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్యన నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
చిట్యాల : చిట్యాల పట్టణంలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రెండో వార్డులో కురిసిన రాళ్ల వర్షానికి కూనూరు గాలమ్మ ఇంటి పైకప్పు రేకులు, పైపులు విద్యుత్ స్తంభాలపై పడడంతో వైర్లు తెగాయి. ఓ వేప చెట్టు విరిగి పడింది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రెండో వార్డుకే చెందిన వనం రేణుక, చింతపల్లి నరేష్, దండుగల లక్ష్మమ్మ ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. కోనేటి యాదయ్య స్లాబ్ చుట్టూ ఉన్న కంటే గోడ కూలి ట్రాక్టర్ మీద పడటంతో ఆస్తి నష్టం ఏర్పడింది. -
ఉచిత కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : రాష్ట్ర మైనార్టీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు ఎంట్రెన్స్ టెస్టు రాసే మైనార్టీ విద్యార్థులకు మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవ్వనున్న ఉచిత కోచింగ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.విజయేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మైనార్టీలుగా పరిగణించబడతారని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 31లోగా ఆన్లైన్ వెబ్సైట్ https://cet.cgg.gov.in/tmreis ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష జూన్ 14న నల్లగొండలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉటుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలను నిర్మూలిద్దాంనల్లగొండ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మహిళా వారోత్సవాల సందర్భంగా మంగళవారం నల్లగొండలోని రెడ్క్రాస్ భవనంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిషేధ చట్టం–2006పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల అనేక మంది బాలికల జీవితాలు అంధకామవుతున్నాయన్నారు. విద్యార్థులు తమ ప్రాంతాల్లో జరిగే బాల్య వివాహాలపై పోలీసులకు, అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు సోషల్ మీడియాను అతిగా ఉపయోగించకుండా, ఏఐ ఫొటో మార్పింగ్ వంటి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే దరఖాస్తు చేసుకోండి.. చదువుకు ఆర్థిక ఇబ్బందులున్న విద్యార్థులు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బాలికల సమస్యలపై ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రణామం వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను సందర్శించారు. వృద్ధులు క్యారమ్స్ ఆడుతుండగా ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సీడీపీఓ లావణ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ చింత కృష్ణయ్య, సభ్యులు భాస్కర్ వెంకన్న, డీసీపీఓ గణేష్ పాల్గొన్నారు. 30న ప్రత్యేక ప్రజావాణినల్లగొండ : నల్లగొండలోని కలెక్టరేట్లో ఈ నెల 30న దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిసున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి కేవీ.కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కరెంట్ కోతలు లేకుండా చూడాలి
నల్లగొండ టూటౌన్ : మండుతున్న ఎండలకు నీలగిరిలో ఏసీల వినియోగం పెరిగి తరుచూ ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అయి కరెంట్ పోతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. అదనపు ట్రాన్స్ఫార్మర్లు త్వరగా మంజూరు చేయించి విద్యుత్ కోతల సమస్యను వెంటనే పరిష్కరించాలని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం నీలగిరి మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కార్పొరేటర్లు పలు సమస్యలను లేవనెత్తారు. 41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ కరెంట్ కోతలతో తాగునీటి సమస్య ఏర్పడుతోందని, రూ.10 లక్షల వ్యయంతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు త్వరగా ప్రారంభించాలని మేయర్ను కోరారు. 7వ డివిజన్ కార్పొరేటర్ మారగోని భవాని మాట్లాడుతూ వేలాడుతున్న కరెంట్ వైర్లతో మంటలు వస్తున్నాయని, పాత వైర్లు తొలగించి కొత్తవి అమర్చేలా చూడాలన్నారు. సెయింట్ ఆల్ఫన్సెస్ స్కూల్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. 21వ డివిజన్ కార్పొరేటర్ ఇబ్రహీం మాట్లాడుతూ నగరంలోని వివిధ కాలనీల్లో పాత స్తంభాలు తొలగించి ఎత్తైన స్తంభాలు పాతాలన్నారు. 33వ డివిజన్ కార్పొరేటర్ రేగట్టే అండాలు లింగస్వామి మాట్లాడుతూ డివిజన్లో కుక్కల సమస్య తీవ్రంగా ఉందని, వాటిని నియంత్రించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. కొత్త స్తంభాలు ఏర్పాటు చేయిస్తాం.. అనంతరం నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కరెంట్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ వైర్లు, కొత్త స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎజెండా అంశాలను ఆమోదించారు. ఈ సమావేశంలో డిప్యూటి మేయర్ అశ్రఫ్ అలీ (అమేర్), మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర, ఈఈ రాములు, కార్పొరేటర్లు మారగోని నవీన్గౌడ్, అల్లి సుభాష్యాదవ్, గోగుల గణేష్, దాసరి సాయి, అబ్బగోని కవిత, గుమ్ముల జానకి మోహన్రెడ్డి, పెరిక స్వాతి, యామ కవిత, గంట్ల అనంతరెడ్డి పాల్గొన్నారు. ఫ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య పెంచాలి ఫ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో కార్పొరేటర్ల విజ్ఞప్తి ఫ సమస్యను పరిష్కరిస్తామన్న మేయర్ బుర్రి చైతన్య -
అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని ధర్నా
మిర్యాలగూడ టౌన్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మిర్యాలగూడ మున్సి పల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ డీఈఈ వెంకన్నకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణానికి చెందిన పేదల కోసం 565 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి డ్రా పద్ధతిలోనే కేటాయించి, ఇప్పుడు కేవలం 332 మందికే ఇళ్లు ఇస్తామనడం విడ్డురంగా ఉందన్నారు. మిగిలిన ఇళ్లను అధికార పార్టీ వారికి కేటాయించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అర్హులకు పింఛన్లు అందించాలని, పట్టణంలో ఇబ్బందిగా నిర్మించిన డివైడర్లను తొలగించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యడవల్లి శ్రీనివాస్రెడ్డి, అన్నబిమోజు నాగార్జునాచారి, ఎండి మగ్ధూం, కౌన్సిలర్లు ఎండి ఇలియాస్, పెద్ది శ్రీనివాస్గౌడ్, గడ్డం దీపిక, గుడిసె జానకమ్మ, లావూరి అరుణ, సందేశి రజని, సునిత, యరమళ్ల దీనేష్, లక్ష్మి, సీత, భిక్షం, అంజిబాబు, తిరుమలగిరి వజ్రం, షోయబర్, కోటేశ్వర్రావు, భూక్య రాంబాబు, ఆంజనేయరాజు, తిరుపతిరావు, ఈశ్వరాచారి, వినోద్, శ్రవణ్రెడ్డి, సంతోష్రెడ్డి, దైద సత్యం, మస్తాన్, వెంకటేష్, రామస్వామి, లక్ష్మీనారాయణ, మురళిచారి, అఖిల్నాయక్, రామావతారం, ఫయిజ్, రమేష్చారి పాల్గొన్నారు. -
క్వార్టర్స్ ఖాళీ చేయాలనడం అన్యాయం
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నెస్పీ క్వార్టర్స్లో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న ప్రజలు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం సాగర్ డ్యాం పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం ఈఈ సీతీరాంకునాయక్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కౌన్సిలర్ రమేశ్జీ మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎన్నెస్పీ క్వార్టర్స్లో నివాసముంటున్న ప్రజలను అకస్మాత్తుగా ఖాళీచేయాలంటూ నోటీసులు ఇవ్వడం అన్యాయమని అన్నారు. 58,59 జీవోల ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నివాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి సైదులు, మహ్మద్ ఘని, విజయ్, చంద్రమౌళినాయక్, కోడె విజయ్, ఆదాసు విక్రం, నరేష్, నజీర్, షరీఫ్, ఎస్కె.రఫీభాషా, శేఖరాచారి, లక్ష్మణ్నాయక్, కోదండం, ధార రవి తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన ఘనత..
విహారెడ్డి సాధించిన ఈ అంతర్జాతీయ విజయం వెనుక ఎన్నో కన్నీళ్లు.. అంతకుమించి కఠిన శ్రమ ఉన్నాయి. 2023లో జరిగిన ఒక టోర్నమెంట్లో ఆడుతున్న సమయంలో ఆమె కుడికాలికి గాయమైంది. గాయం నుంచి కోలుకోగానే పట్టుదలతో మళ్లీ సాధన మొదలు పెట్టింది. 2024లో జాతీయ పోటీల సమయంలో కాలి మడిమకు తీవ్ర గాయమైంది. ఆ గాయాన్ని జయించి రెట్టింపు పట్టుదలతో ఆటలోకి అడుగుపెట్టింది.విహారెడ్డి భవిష్యత్లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ స్థాయిలో దేశానికి పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 23 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగే ఎఫ్ఐబీఏ ఆసియా కప్ అండర్–18 బాస్కెట్బాల్ టోర్నీలో భారతజట్టును విజేతగా నిలపడమే తన తదుపరి లక్ష్యమని విహారెడ్డి పేర్కొంది. రోజూ గంటల తరబడి సాధన చేస్తూ తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటోంది. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ప్రపంచ స్థాయిలో రాణించగలరని నిరూపిస్తోంది విహారెడ్డి.ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో జరుగుతున్న దక్షిణాసియా క్వాలిఫయింగ్ అండర్–18 టోర్నీలో భారత జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విహారెడ్డి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చింది. అంతకుముందు 2025 అక్టోబర్ బహ్రెయిన్లో నిర్వహించిన మూడో ఏసియా యూత్ గేమ్స్ బాస్కెట్బాల్ టోర్నీలోనూ భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును విజయపథంలో నడిపించింది. -
వానాకాలానికి ఎరువులు సిద్ధం
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువులను ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉంచేందుకు జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గత యాసంగిలో రైతులకు ఎదురైన సమస్యలు వానాకాలంలో పునరావృతంగా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలోని పలు సంస్థల వద్ద యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచారు. వేర్హౌసింగ్ గోదాములు, హోల్సేల్ డీలర్లు, రిటైల్ డీలర్ల వద్ద 66,938 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉంచారు. ఎరువుల కోసం ఇండెంట్.. రానున్న వానాకాలం సీజన్లో 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో పత్తి 5,3,524 ఎకరాలు, వరి 5,86,137, కంది 14,000, సజ్జ 200, జొన్న 500, మొక్కజొన్న, పెసర 7,000, వేరుశనగ ఇతర పంటలు కలిపి మొత్తం 12,02,051 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేయనున్నట్లు అంచనాలు వేసింది. దీనికి అవసరంగా యూరియా 1.61 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 61,342 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 33,758 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 12,932 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 1,14,043 మెట్రిక్ టన్నులు అవసరంగా అంచనాలు వేసి గత నెలక్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రావాల్సిన ఎరువులను జూన్ మొదటి వారం నుంచి నెలనెలా రైతుల అవసరం మేరకు సరఫరా చేయనుంది. సీజన్ ముగిసే వరకు ప్రతి నెలాపంపించనుంది. ఫ గత యాసంగి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు సన్నాహాలు ఫ ప్రస్తుతం అందుబాటులో 66,938 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్న ఎరువులు ఇలా.. ఎరువు మెట్రిక్ టన్నులు యూరియా 30,023 డీఏపీ 3,238 ఎంఓపీ 2593 ఎన్పీకేఎస్ 29087 ఎస్ఎస్పీ 1863 యూరియా కోసం రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ను జూన్ మొదటి వారంలో రైతులకు అందుబాటులో ఉంచనున్నాం. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరం మేరకు మాత్రమే వాడాలి. అధిక మోతాదులో వాడితే నష్టం తప్ప లాభం లేదు. ఇప్పటికే నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాం. రైతులు నానో యూరియాను వాడి అధిక దిగుబడులను సాధించవచ్చు. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి -
మహిళా సమాఖ్యకు సీఎం అభినందన
నల్లగొండ : రాష్ట్రంలోనే అత్యధికంగా 937 గ్రామ మహిళా సమాఖ్య భవనాలకు స్థల సేకరణ చేసి, 48 భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు నల్లగొండ జిల్లా మహిళా సమాఖ్యను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్గా 8 వేల మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నల్లగొండ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవితో మాట్లాడారు. నెల రోజుల్లోనే 937 భవనాలకు స్థల సేకరణ ఎలా చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ జిల్లాలో 38 మండల సమాఖ్యలు, 1144 గ్రామ సమాఖ్యలు, మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలతో వేగంగా స్థల సేకరణ పూర్తి చేశామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఉద్యోగాలు, ఉపాధి, విద్య కోసం వెళ్లే వారికి ఎంతో మేలు చేకూరుతోందని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఉచిత బస్సు పథకం వల్ల బాలికల చదువు మధ్యలో మానేసే పరిస్థితులు తగ్గాయన్నారు. గ్రామ సమాఖ్య సమావేశాల్లో పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయం, ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పెట్రోల్ బంకులు, గోదాములు, మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు వినతులు ఆయనకు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ వాటిని పరిష్కరించాలని పోలీస్ అధికారులుకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పండువలా జరుపుకోవాలినల్లగొండ టౌన్ : ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మాదిగ జాతి పండుగలా జరుపుకోవాలని ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ అన్నారు. నల్లగొండలోని టీఎన్జీవోస్ భవనంలో సోమవారం నిర్వహించిన ఆయన మాట్లాడారు. తెలంగంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్నందున 9 శాతం రిజర్వేషన్ సదుపాయాలు మాదిగలు ఉపయోగించుకోవాలన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో నూతన జెండా గద్దెలను నిర్మించుకోవాలన్నారు. జూలై 7న మాదిగ జాతి పండుగగా జెండా పండుగ చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, జానకి రామయ్యచౌదరి, మల్లెపాక వెంకన్న, తరి ఏడుకొండలు, కురుపాటి కమలమ్మ, ఆడెపు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మేథమెటిక్స్ ప్రోగ్రాంకు ఎన్జీ విద్యార్థినుల ఎంపికరామగిరి(నల్లగొండ): సమ్మర్ స్కూల్ ఫర్ ఉమెన్ ఇన్ మేథమెటిక్స్ ప్రోగ్రాంకు నల్లగొండ ఎన్జీ కాలేజీలో డిగ్రీ సెంకడ్ ఇయర్ చదువుతున్న కె. నవ్య, జె.శిరీష ఎంపికయ్యారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మేథమెటిక్స్ అండ్ కమిటీ ఫర్ ఉమెన్ ఇన్ మేథమెటిక్స్ సౌజన్యంతో ఇండియన్ ఉమెన్ అండ్ మేథమెటిక్స్ సహకారంతో హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్లో జూన్ 22 నుంచి జూలై 2వ తేదీ వరకు ఈ శిక్షణ జరగనుంది. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు గణితం సబ్జెక్టుపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ఉద్దేశం. ఐఐటీ, వివిధ రాష్ట్రాల సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించగా.. తెలంగాణ నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎన్జీ కాలేజీ నుంచి ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, మేథమెటిక్స్ హెచ్ఓడీ వెంకట్ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ మధుకర్, కనకయ్య, మతిన్ హుస్సేన్, బాల కార్తీక్ విద్యార్థినులను అభినందించారు. అకాల వర్షం.. రైతులకు నష్టం మర్రిగూడ : అకాల వర్షంతో అన్నదాతలు అతలాకుతలమయ్యారు. సోమవారం సాయంత్రం మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం కారణంగా రాంరెడ్డిపల్లి గ్రామంలో నక్క శ్రీనివాస్యాదవ్, నక్క బుగ్గరాములుతోపాటు రాజాపేటతండాకు చెందిన రాజయ్యకు పశువులపాకలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలగోని యాదయ్య, వడ్డె రమేష్కు చెందిన మామిడి, నిమ్మ చెట్లు నేలకొరిగాయి. అదేవిధంగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, రహదారుల వెంట ఉన్న చెట్లు కూలిపోయాయి. మర్రిగూడ, శివన్నగూడ, ఖుదాబాక్షపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కె.నవ్యజె.శిరీష -
క్వార్టుర్లు ఖాళీ చేయండి
దశాబ్దాల క్రితమే ఈ క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని నివాసయోగ్యం కావని ఉన్నతాధికారులు నివేదికలు ఇచ్చి డిస్మెంటల్ చేయాలని సూచించారు. అయినప్పటికీ స్థానికులు తమ ఖర్చులతో మరమ్మతులు చేసుకుని ఇండ్లలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు నాగార్జునసాగర్ జలాశయంలో పూడిక తొలగింపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పనులకు వచ్చే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బందికి వసతి కల్పించేందుకు ఈ క్వార్టర్లను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఎన్నెస్పీ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే మేమే లక్షల రూపాయలు ఖర్చు చేసి నివాస యోగ్యంగా మార్చుకున్న ఇండ్లను ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎంతవరకు న్యాయమని అంటూ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇప్పటికే నివసిస్తున్న కుటుంబాలకు శాశ్వాత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నందికొండ హిల్కాలనీ, పైలాన్కాలనీలో దశాబ్దాలుగా నివాసముంటున్న కుటుంబాలకు ఇళ్లు ఖాళీ చేయాలంటూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం క్వార్టర్లు కావాలని, నోటీసు అందిన వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వం తీసుకునే చర్యలకు నివాసులు బాధ్యులవుతారని పేర్కొనడంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో హిల్కాలనీ, పైలాన్కాలనీ, కెనాల్స్, బండల క్వారీ, రైట్బ్యాంక్ ప్రాంతాల్లో సుమారు 4,800 క్వార్టర్లు నిర్మించారు. అప్పట్లో ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు, కార్మికుల నివాసం కోసం ఈఈ, ఏఈ, ఏ, బీ, హెచ్ టైపు క్వార్టర్లను ఏర్పాటు చేశారు. కాలక్రమేణా సుమారు ఏడు దశాబ్దాలు గడవడంతో అనేక క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకోగా కొన్ని పూర్తిగా కనుమరుగయ్యాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రసుతం హిల్కాలనీ, పైలాన్కాలనీలే ప్రధానంగా మిగిలాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జీవో 58, 59 కింద అనేక క్వార్టర్లను నివాసితులకే విక్రయించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. పలువురు ప్రభుత్వానికి భారీ మొత్తాలు చెల్లించి రిజిప్ట్రేషన్ కూడా చేయంచుకున్నారు. మరికొందరు దరఖాస్తులు సమర్పించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ జీవోలను నిలిపి వేయడంతో ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. ఇదిలా ఉండగా పాత క్వార్టర్లు నివాసయోగ్యం కాకపోవడంతో స్థానికులు తమ సొంత డబ్బులుతో లక్షలాధి రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపట్టారు. కొందరు పూర్తిగా పాడైపోయిన ఇండ్లను కూల్చివేసి కొత్తగా నిర్మించుకోగా మరికొందరు పాత గోడలను ఆధారంగా చేసుకుని ఆధునిక స్లాబులు వేసుకోని రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆ ఇండ్లకు పాత క్వార్టర్ల రూపమే లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లకు నోటీసులు ఇవ్వడం ఏంటి, ఏళ్ల తరబడి నివసిస్తున్న కుటుంబాలను ఒక్కసారిగా బయటకు వెళ్లమంటే ఎక్కడి వెళ్లాలని అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి నివాసితుడికి ఇండ్ల హక్కులు కల్పిస్తామని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం ఖాళీ చేయమంటూ నోటీసులు రావడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతుంది. ఇప్పటికే హిల్కాలనీ, పైలాన్కాలనీల్లో సుమారు 50 కుటుంబాలకు నోటీసులు అందగా మరికొంత మందికి కూడా ఇవ్వడానికి అధికారులు సిద్దమవుతున్నటు సమాచారం. ఫ నందికొండలో ఇళ్లకు అధికారుల నోటీసులు ఫ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నివాసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇండ్లకు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం 50 ఇండ్లకు ఇచ్చాం. మరో 50 ఇండ్లకు ఇచ్చేందుకు సమాయత్తమయ్యాం. – ఏఈ విమల -
బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలోని క్లీయో స్పోర్ట్స్లో బ్యాడ్మింటన్ జిల్లా జట్లను సోమవారం ఎంపిక చేశారు. వీరు హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. అండర్–11 విభాగంలో అన్షు శ్రీయన్, విదురు కృష్ణారెడ్డి, భవ్యన్షి, ఆరాధ్య, సంజన, అండర్ –13 విభాగంలో దీపక్నాయుడు, అద్వైత్రెడ్డి, కుషల్, శ్రయన్, సహాస్రార్షిత, చైత్రరెడ్డి, లోహిత, మనస్వీ, అండర్ –17 విభాగంలో అక్షిత్రెడ్డి, అభినవ్, చాణిక్య, చందన, రిదాహష్మి, శ్రీచైత్ర, యశస్విని, మసాదిక్ అలీ, అండర్–19 విభాగంలో అన్విత్ నిీహాల్రెడ్డి, అభినవ్, రోహిత్సాయి, వంశీ, తేజస్విని, మెన్ అండ్ ఉమెన్ విభాగంలో ప్రణిత్, అన్వీత్ నిహాల్రెడ్డి, చందన, పూజిత ఎంపికై నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జి.అంజయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రశాంత్, నవీన్కుమార్ తెలిపారు. జిల్లా జట్లల్లో ప్రతిభను కనబరిచిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మధుబాబు, సికిందర్రెడ్డి, గంజి శ్రీనివాస్, జిల్లా కోచ్ రామకృష్ణ తదితరులున్నారు. -
ఆపదమిత్రలు గ్రామాల్లో సేవలు అందించాలి
నల్లగొండ టూటౌన్ : యువ ఆపదమిత్రలు గ్రామాల్లో సేవలు అందించాలని కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో యువ ఆపదమిత్రలకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. 31వ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లను ఆయన అభినందించారు. ఈ శిబిరంలో వివిధ కళాశాలలకు చెందిన సుమారు 300 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొని విపత్తు నిర్వహణకు సంబంధించిన సైద్దాంతిక, ప్రాక్టికల్ శిక్షణ పొందారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఇంజరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రేఖ, శశిధర్రావు, మాధవరావు, మల్లయ్య, ఆశిష్ కుమార్, యూసుఫుద్దీన్, మచ్చేందర్, రాము, సీటీఓ నాగు నాయక్ పాల్గొన్నారు. -
గోడు వినండి.. గోస తీర్చండి
నల్లగొండ : అయ్యా.. మా గోడు వినండి.. గోస తీర్చండి అంటూ పలువురు బాధితులు కలెక్టర్కు విన్నవించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. గ్రీవెన్స్లో రెవెన్యూ శాఖకు 46, ఇతర శాఖలకు 57.. మొత్తం 103 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి పకడ్బందీగా నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరిస్తే ప్రజలకు సులభంగా ఉంటుందన్నారు. ప్రజావాణి ఫిర్యాదులతో పాటు, సీఎం కార్యాలయం నుంచి వచ్చినవి, ఇతర ఫిర్యాదులను ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య అతిథి సందేశానికి అవసరమైన నివేదికలను ఆయా శాఖలు తక్షణమే సీపీఓకు సమర్పించాలని చెప్పారు. అనంతరం యూనిక్ డిజెబిలిటీ ఐడీపై రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, సీపీఓ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రజావాణిలో బాధితుల వినతులు ఫ ఫిర్యాదులు పరిష్కరించాలి : కలెక్టర్ -
శాలిగౌరారం ప్రాజెక్టులోకి మూసీ నీటి రాక
శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టులోకి ఆదివారం ఎగువ నుంచి మూసీ నది వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీ నదిపై యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ వద్ద నిర్మించిన హెడ్ రెగ్యూలేటర్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టులోకి సుమారు 30 కిలోమీటర్ల పొడవు ఉన్న రాచకాల్వ ద్వారా వరదనీరు వచ్చి చేరుతోంది. 1,200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి సామర్థ్యంతో 6 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం 5 అడుగుల దిగువన నీటి నిల్వ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మూసీనది ద్వారా ప్రవహించే ఆ నీటిని పల్లివాడ హెడ్ రెగ్యులేటర్ ద్వారా శాలిగౌరారం ప్రాజెక్టులోకి ఇటీవలే మళ్లించారు. ఈక్రమంలో ప్రాజెక్టు రాచకాల్వకు అనుసంధానంగా ఉన్న రామన్నపేట, నార్కట్పల్లి, శాలిగౌరారం మండలాలకు చెందిన పలు చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తున్నాయి. -
ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయొద్దు
నకిరేకల్ : అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్రావు ఏమి చేయాలో అర్థంకాక ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వంపై నిరంతరం తప్పుడు ప్రచారం చేయడం తగదని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. నెలా ఖారులోగా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. ఆదివారం నకిరేకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షిస్తూనే ఉన్నామని తెలిపారు. కేవలం రాజకీయం చేయాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదని అబద్ధాలు, తప్పుడు అంకెలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘సెలవు రోజుల్లో కూడా మా ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు చేస్తున్న విషయం నిజం కాదా’ అని ప్రశ్నించారు. ‘మీ హయాంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేశారని, మేము మాత్రం అలా చేయబోమని.. ప్రతి పక్షం ఉండాలి మా తప్పులు ఎత్తి చూపుతూనే ఉండాలి’ అని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇక్కడి ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గ వ్యాప్తంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కేలాష్ నేత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుత్తా మంజులమాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నూక కిరణ్యాదవ్, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాదగోని కొండయ్య, నకిరేకంటి నరేందర్, గాజుల సుకన్య, దాసరి వీరార్జున్రెడ్డి, కందాల భిక్షంరెడ్డి పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి -
వర్షపు నీటిని ఒడిసిపట్టేలా..
ఇంకుడుగుంత నిర్మించుకుని నీటిని ఒడిసి పట్టుకుంటే నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది. 200 గజాల విస్తీర్ణం దాటిన నివాస, వాణిజ్య భవనాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండాలి. వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇంకుడు గుంత లేనివారికి నోటీస్లు జారీ చేస్తున్నాం. – బి.శరత్చంద్ర, నల్లగొండ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లగొండ టూటౌన్ : వర్షాలు కురిసినప్పుడు వరద నీరు వృథాగా పోకుండా నీటిని ఒడిసి పట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్యలు రాకుండా ఉంటాయని ప్రభుత్వం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నల్లగొండ నగరంతోపాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాల్లో 200 గజాలకుపైగా విస్తీర్ణంలో ఇల్లు నిర్మించిన వారు తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలనే నిబంధన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ పట్టణాల్లో మున్సిపల్ యంత్రాంగం ఇంకుడు గుంతల లెక్క తీస్తున్నారు. ఇంకుడు గుంతల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్మించుకోని ఇళ్ల వారికి ఇంకుడు గుంత తీయాలని మున్సిపల్ సిబ్బంది నోటీసులు జారీ చేస్తున్నారు. నీటి ఎద్దడి రాకుండా.. వేసవి కాలం దాటగానే సకాలంలో వర్షాలు పడకుంటే పట్టణాల్లో నీటి ఎద్దడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పలుసార్లు పట్టణాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగు నీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రధానంగా 200 గజాల విస్తీర్ణం దాటిన భవనాలు, అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య దుకాణాల సముదాయాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు తీయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంకుడు గుంతలు ఎన్ని ఉన్నాయి. లేనివి ఎన్ని భవనాలు ఉన్నాయనే వివరాలను మున్సిపల్ సిబ్బంది సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. 70 శాతం వరకు భారీ భవనాలున్నా.. మున్సిపాలిటీల్లో ఇంకుడు గుంతలు తీయాలనే నిబంధన కచ్చితంగా ఉంటుంది. గత పుష్కర కాలం నుంచి వర్షాలు భారీగానే కురువడంతో ఇంకుడు గుంతలపై ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసింది. కొన్నేళ్ల నుంచి చేపట్టిన నిర్మించిన భవనాల్లో ఇంకుడు గుంతలు చాలా తక్కువ మంది తీసినట్లు మున్సిపల్ యంత్రాంగం పరిశీలనలో వెల్లడవుతుంది. దాదాపు 70 శాతం మంది భారీ భవనాలు ఉన్నా ఇంకుడు గుంతలు మాత్రం తీయించలేదు. దాంతో 200 గజాలు దాటిన భవనాలు, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా వాటిల్లో ఇంకుడు గుంతలు లేవనే చెప్పాలి. కాంక్రీట్ నిర్మాణంతో తగ్గిన భూగర్భ జలాలు.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంక్రీట్ నిర్మాణాలు భారీగా పెరిగిపోయాయి. ప్రధాన రహదారులతో పాటు ప్రతి కాలనీల్లో కాంక్రీట్ రోడ్లు వేశారు. కాలనీల్లో ప్రజలు కూడా తమ భవనాలు ముందు శుభ్రంగా ఉండేలా సిమెంట్తో ఫ్లోరింగ్ చేయించుకున్నారు. భారీ వర్షాలు కురిసినా వరద నీరు దిగువకు వెళ్తుంది తప్ప భూమిలోకి ఇంకిపోయే పరిస్థితులు లేక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇళ్లలోనూ బోర్లు సైతం ఎండిపోతున్నాయి. దాంతో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు, ఆవశ్యకత గురించి ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ పట్టణాల్లో లెక్కలు తీస్తున్న మున్సిపల్ యంత్రాంగం ఫ 200 గజాల విస్తీర్ణం దాటిన ఇంట్లో విధిగా నిర్మించుకోవాలని నిబంధన ఫ నిర్మించుకోని వారికి నోటీసులు జారీ -
157 మంది జెడ్పీ ఉద్యోగుల బదిలీ
నల్లగొండ : జిల్లా పరిషత్లో పనిచేసే వివిధ కేటగిరీలకు చెందిన 157 మంది ఉద్యోగులకు కౌన్సిలింగ్ ద్వారా ఆదివారం బదిలీలు నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. ఉద్యోగుల సీనియారిటీ, ఖాళీల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్లో 39 మంది జూనియర్ అసిస్టెంట్లు, 22 మంది రికార్డు అసిస్టెంట్లు, 9 మంది టైపిస్టులు, 79 మంది అటెండర్లు, 8 మంది నైట్వాచ్మెన్లను ఖాళీల ఆధారంగా కోరుకున్న చోట బదిలీ చేశారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బదిలీల కౌన్సిలింగ్లో జిల్లా పరిషత్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
26న ముదిరాజ్ల సదస్సు
నల్లగొండ టౌన్ : ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లో ముదిరాజ్ల సింహావలోకనం సదస్సు నిర్వహించనున్నట్లు ఆ వేదిక నాయకుడు, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. ఆదివారం నల్లగొండలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సుకు సంబంధించి పిట్టల రవీందర్ రాసిన పుస్తకంతోపాటు, పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో కేశబోయిన శంకర్, కట్ల సైదులు, మేకల శ్రీహరి, సుదర్శన్, బాల్య, పి.శంకర్, అజయ్, శివ పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట ఎరువులు సిద్ధం
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు కావాల్సిన జీలుగ, జనుము విత్తనాలను మిర్యాలగూడ పరిధిలోని నందిపాడు విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీకి సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలు, రైతు పరస్పర సెంటర్లలో జీలుగ 3,500 క్వింటాళ్లు, జనుము 500 క్వింటాళ్లను అందుబాటులో ఉంచింది. ఈ విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. పచ్చిరొట్టతో ప్రయోజనాలు పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల భూమి సారవంతంగా తయారవుతుంది. అధిక దిగుబడులు రావడంతోపాటు పెట్టుబడులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నేలలో సేంద్రియ పదార్థం పెరగడంతోపాటు నైట్రోజన్ స్థాయి సహజంగా అధికమవుతోంది. ఈ ఎరువులు వాడిన భూమి గట్టిదనం తగ్గి మెత్తబడుతుంది. మట్టిలో సూక్ష్మ జీవాల సంఖ్య పెరిగి మట్టి ఆరోగ్యంగా తయారవుతుంది. ధరలు ఇలా.. (కేజీ రూపాయల్లో..) పంట కేజీ సబ్సిడీ రైతు వాటా జీలుగ 163.50 81.85 81.75 జనుము 155.50 77.75 77.75పచ్చిరొట్ట ఎరువుల వాకంతో రసాయన ఎరువుల అవసరం తగ్గి సాగు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా సుస్థిర వ్యవసాయానికి దోహదపడనున్నాయి. రైతులు పచ్చిరొట్ట ఎరువులను విరివిగా వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఫ 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేత ఫ సహకార సంఘాలు, ఆగ్రోస్ సెంటర్లో అందుబాటులో విత్తనాలు ఫ పంపిణీకి ఏర్పాట్లు చేసిన విత్తనాభివృద్ధి సంస్థ -
జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి
మిర్యాలగూడ టౌన్ : బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జి.అంజయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్ పిలుపునిచ్చారు. జూన్లో జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు జిల్లా జట్టును ఎంపిక కోసం ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో తలపెట్టిన బ్యాడ్మింటన్ పోటీలను వారు అధికారికంగా ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారుల్లో పట్టుదల, నిరంతర కృషి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతారన్నారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జూన్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నవీన్కుమార్, జాయింట్ సెక్రటరీ గంజి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మధుబాబు, సికిందర్, కోశాధికారి శరన్కుమార్, జిల్లా కోచ్ రామకృష్ణ పాల్గొన్నారు. వైభవంగా యాదగిరీశుడి నిత్యకల్యాణ వేడుకయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో నిత్యకల్యాణ వేడుకను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆదివారం వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేశారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ జరిపించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు ఊరేగించారు. మట్టపల్లిలో నిత్యపూజలు మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామి అమ్మవార్లకు అర్చకులు నిత్యపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలో మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం నిర్వహించి గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగించారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
చిన్నారికి.. ఎంతకష్టం
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన నాలుగు నెలల పసికందు అక్షితకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మూ డు రోజులుగా చిన్నపిల్లల వార్డులో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తదుపరి పరీక్షల కోసం ఎక్స్రే తీయాలని సూచించారు. చిన్నపిల్లల వార్డు నుంచి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఎక్స్రే కేంద్రానికి పాపను తీసుకెళ్లాల్సి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని, పసికందును ఎత్తుకొని మండుటెండలో నడుచుకుంటూ ఎక్స్రే కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అన్ని సేవలు ఒకేచోట అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ భజరంగ్ ప్రసాద్, నల్లగొండ -
ధాన్యం లారీల డ్రైవర్ల ఆందోళన
శాలిగౌరారం : సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా ధాన్యం లారీల్లోని బస్తాలను దిగుమతి చేస్తున్నారంటూ శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ వద్ద శనివారం ధాన్యం లారీల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. గోడౌన్ వద్ద లారీలను అడ్డుగాపెట్టడంతో ధాన్యం దిగుమతులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గోడౌన్ వద్దకు చేరుకొని లారీ డ్రైవర్లు, హమాలీలతో మాట్లాడారు. నకిరేకల్ డీటీసీఎస్ జ్యోతి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టారీతిన ధాన్యం దిగుమతులు చేయడంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని పలువురు లారీ డ్రైవర్లు తెలిపారు. మార్కెట్యార్డు పరిధిలో 217 మంది హమాలీలు ఉన్నా కేవలం 20 మంది మాత్రమే రావడం ఏమిటని డీటీసీఎస్ ప్రశ్నించారు. ఎండవేడితో పాటు దిగుమతుల డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడం వల్లే ఎవరూ రావడం లేదని హమాలీలు తెలిపారు. లారీలను సీరియల్ ప్రకారం దిగుమతి చేయాలని డీటీసీఎస్ ఆదేశించారు. దాంతో లారీ డ్రైవర్లు ఆందోళన విరమించారు. శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిలిచిన ధాన్యం దిగుమతులు -
గాలివాన బీభత్సం
పెద్దవూర : పెద్దవూర మండల కేంద్రంతో పాటు ఈదులగూడెం, సంగారం గ్రామాల్లో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలోని వండర్కిడ్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ భవనం పైనున్న రేకులు లేచిపోయి పక్కనే ఉన్న గ్రామపంచాయతీ భవనంపై పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందున్న రేకులు పగిలిపోయాయి. కట్టెబోయిన సైదులు ఇంటిపైకప్పు రేకులు లేచిపోయాయి. ఈదులగూడెం గ్రామానికి చెందిన లింగాల కోటయ్య, గుండెబోయిన రాములుకు చెందిన ఇంటికప్పు రేకులు లేచిపోయాయి. దీంతో ఇంట్లోని సామగ్రి తడిసిపోయింది. సంగారం గ్రామానికి చెందిన కంచర్ల శ్యాంసుందర్ ఇంటి పక్కన ఉన్న మర్రి చెట్టు కూలి ఇంటిపై పడటంతో గోడలు కూలిపోవడంతో పాటు ఇంటిపై కప్పు రేకులు పగిలిపోయి సామగ్రి ధ్వంసమైంది. ఏనేమీదిగూడెం గ్రామంలోని పీర్ల కొట్టం పైకప్పు రేకులు లేచిపోయి సమీపంలో పడిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. సబ్ మార్కెట్ యార్డు సమీపంలో స్తంభం కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం
నల్లగొండ టూటౌన్ : యువత స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సీఎం కప్ క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులకు శనివారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో బహుమతులు ప్రదానం చేశారు. జాబ్మేళాలో ఎంపికై న యువతకు నియమక పత్రాలు అందజేసి మాట్లాడారు. దేశంలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, యువతే దేశానికి గొప్ప వరమన్నారు. ఫిట్నెస్కు ప్రాధాన్యం పెంచే ఉద్దేశంతో ‘ఫిట్ తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. నల్లగొండలోని న్యాక్, సెట్విన్ సెంటర్, ఇందిరా మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు కెరీర్, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఎంఎస్ఎంఈ ద్వారా రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఎం కప్ క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన హాకీ జట్టును అభినందించారు. అనంతరం క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, కోచ్ శంభులింగం తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఫిట్నెస్ లేకుంటే సీజ్ !
నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. కనీస ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూల్ బస్సులను రోడ్లపైకి వదిలితే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 745 స్కూల్ బస్లు ఉండగా.. ఇప్పటి వరకు 254 బస్లు ఫిట్నెస్ పొందాయి. ఇంకా 491 బస్లు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. జూన్ 12 నాటికి అన్ని వాహనాలకు భద్రతా ప్రమాణాలు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు ఫిట్నెస్ తనిఖీలు ఇలా.. ఫిట్నెస్ తనిఖీల్లో భాగంగా బస్లకు బ్రేకులు, టైర్లు, లైట్లు, ఎమర్జెన్సి డోర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, భద్రతా పరికరాలను పరిశీలిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలకు ఫిట్నెట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. లోపాలున్న వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజీపడకుండా ప్రతి బస్కు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. డ్రైవర్లకు శిక్షణ సర్టిఫికెట్ ఉంటేనే.. సిరిసిల్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్కూల్ బస్లు నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్నారు. డ్రైవర్లు, రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించడంతోపాటు విద్యార్థుల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించేలా శిక్షణ ఇస్తున్నారు. అనుకోని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి.. ప్రమాదాల నుంచి విద్యార్థులను సురక్షితంగా ఎలా కాపాడాలని అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. సిరిసిల్లలో శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఆ సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే స్కూల్ బస్లను నడిపేందుకు అర్హత పొందుతారు. ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. జరిమానా విధించడంతోపాటు బస్లు సీజ్ చేస్తాం. పిల్లల భద్రత విషయంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. యాజమాన్యాలు తప్పనిసరిగా బస్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. –వాణి, జిల్లా రవాణాశాఖ అధికారిఫ జిల్లాలో 745 స్కూల్ బస్లు ఫ తనిఖీలు చేయించింది 254 మాత్రమే ఫ స్కూల్ బస్ డ్రైవర్లకు సిరిసిల్లలో శిక్షణ ఫ సర్టిఫికెట్ పొందిన వారికి మాత్రమే అనుమతి -
పారదర్శకంగా భూ విలువల సవరణ
నల్లగొండ : భూముల విలువల సవరణ ప్రక్రియను పారదర్శకంగా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం హెదరాబాద్ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్.లోకేష్కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఇక్కడ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ను బట్టి ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి భూ విలువల సవరణ ఉంటుందన్నారు. మే 28 నాటికి విలువల సవరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్జే శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ ఉద్యోగుల బదిలీల షెడ్యూల్నల్లగొండ : నల్లగొండలోని జెడ్పీలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, నైట్ వాచ్మన్ల బదిలీల కౌన్సిలింగ్ షెడ్యూల్ను జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ నెల 24న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాస్టల్ క్యాటరింగ్కు దరఖాస్తులురామగిరి(నల్లగొండ) : నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి హాస్టల్ క్యాటరింగ్ నిర్వహించేందుకు ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సిహెచ్.నర్సింహారావు తెలిపారు. దరఖాస్తు ఫారంలు కళాశాలలో తీసుకోవాలని పేర్కొన్నారు. అర్హులు జూన్ 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. రోడ్డు పనులు చేపట్టాలని పాదయాత్ర మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం గూడూరు నుంచి బోట్యానాయక్తండా వరకు ఉన్న గుంతలమయంగా మారిన రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధర్యంలో శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భఃగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నడవడానికి కూడా వీలు లేకుండా అత్యంత దారుణంగా గుంతలమయమైన ఈ రోడ్డు మరమ్మతుల పనులు 10వ తేదీలోగా ప్రారంభించకుంటే ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం టెండర్లు ఖరారైనప్పటికీ.. ఇప్పటివరకు కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్, వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, రవినాయక్, పరుశురాములు, మల్లు గౌతంరెడ్డి, నూకల జగదీశ్ చంద్ర, సాగర్నాయక్, శ్రీను, కృష్ణయ్య, పిల్లుట్ల సైదులు, బొంగరాల వెంకటయ్య, మేక రాంబాబు, మంగా, కరీమున్నీసాబేగం తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నేత దారుణ హత్య.. అర్థరాత్రి హైటెన్షన్
సాక్షి, సూర్యాపేట: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సూర్యాపేట మండలం యర్కారంలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. మూడు ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో పడేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. రాజకీయ హత్యలకు యర్కారం కేరాఫ్ అడ్రస్గా మారింది. కొన్నేళ్ల క్రితం అప్పటి సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యర్కారంలో హత్యకు గురైన మధు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు . ఆయన భార్య మౌనిక యర్కారం మాజీ సర్పంచ్. మధును హత్య చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లేనని మౌనిక ఆరోపిస్తున్నారు. తన భర్తను మిద్దె రవీందర్ కుమారుడితో పాటు మరో 15 మంది కలిసి హత్య చేసినట్టు చెబుతున్నారు.ఇదిగా ఉండగా.. సూర్యాపేట ప్రాంతంలో ఫ్యాక్షన్ గ్రామంగా యర్కారానికి పేరు. గ్రామంలో 1985 నుంచి ఇప్పటి వరకు హత్యకు గురైన వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది నాయకులు ఉన్నారు. తాజాగా హత్యకు గురైన చింతలపాటి మధు గతంలో జరిగిన ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు. 2004లో జరిగిన మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు. నిన్న రాత్రి 11-12 గంటల ప్రాంతంలో మధు హత్య జరిగింది. అత్యంత దారుణంగా కత్తులు, గొడ్డళ్లు, వేట కొడవళ్లతో దుండగులు నరికి చంపారు. ముఖం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. హత్య అనంతరం గోనె సంచుల్లో కుక్కి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. -
గే యాప్ పరిచయం.. యువకుడి దారుణ హత్య..!
కోదాడ: సోషల్ మీడియాలో ఓ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం యువకుడి హత్యకు కారణమైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరానికి చెందిన బల్గూరి గణేష్(20) ఈ నెల 15న హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సామాజిక మాధ్యమంలో ఉన్న ‘పోలో’ గే యాప్ కారణమని, హత్యకు కారణమైన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా హత్యకు సహకరించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గణపవరానికి చెందిన బల్గూరి గణేష్కు, హుజూర్నగర్కు చెందిన బర్రెంకుల సోమేష్కు పోలో అనే గే యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఏకాంతంలో తీసుకున్న ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గణేష్ను చంపాలని సోమేష్ నిర్ణయించుకున్నాడు. దీనికి గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన తన స్నేహితుడు పగిల్ల ఉదయ్కిరణ్ సాయం తీసుకున్నాడు. గణేష్ హత్యకు సోమేష్ పథకం వేస్తున్న విషయం తెలిసినప్పటికీ సోమేష్ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతి మిన్నకుండిపోయారు. ఈ నెల 15న రాత్రి పథకం ప్రకారం సోమేష్.. గణేష్ను గణపవరానికి సమీపంలో ఉన్న మామిడి తోట వద్దకు పిలిచాడు. ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అక్కడే ఉన్న సోమేష్ స్నేహితుడు ఉదయ్కిరణ్ సాయంతో గణేష్పై రాయితో దాడి చేశారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. సంఘటన స్థలం నుంచి కత్తి, మొబైల్ ఫోన్లు ఇతర ఆధారాలను సేకరించినట్లు డీఎస్పీ తెలిపారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేసి సీసీ పుటేజీలు, మొబైల్ లొకేషన్లు పరిశీలించి నిందితులైన పగిళ్ల ఉదయ్కిరణ్, ప్రధాన నిందితుడైన సోమేష్ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతిలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్క పంపినట్లు ఆయన వెల్లడించారు. సోమేష్ పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో కోదాడ రూరల్ ఇన్చార్జీ సీఐ రామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డి, మేళ్లచెరువు ఎస్ఐ నవీన్కుమార్, చింతలపాలెం ఎస్ఐ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాం
బుధవారం ప్లాట్ రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేసుకున్నా. గురువారం ఉద యం వచ్చా, సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. గంటల తరబడి సమయం పడుతోంది. సిబ్బంది సరిపోవడం లేదని చెబుతున్నారు. ఆలస్యమైనా చేస్తామంటున్నారు. ఎండకు కార్యాలయంలో తట్టుకోలేకపోతున్నాం. కనీసం మంచినీరు లేవు. – లింగయ్య, పారేపల్లిగూడెం భూముల ధరలు పెరుగుతుండటంతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వచ్చాం. గంటలకొద్దీ నిలబడాల్సి వచ్చింది. కూర్చోవడానికి కుర్చీలు లేవు. అందరు నిలబడ్డారు. వృద్ధులు, మహిళలు ఎన్ని గంటలు నిలబడాలి. కనీసం మంచినీరు కూడా లేదు. గ్రామాల నుంచి వచ్చి ఎండకు ఇబ్బందులు పడుతున్నాం. – విష్ణువర్ధన్, నల్లగొండ -
కొనుగోళ్ల వేగవంతానికి చర్యలు
పెద్దఅడిశర్లపల్లి : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లారీల కొరతను తీర్చేందుకు హైవేలపై లారీలను ఆపి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గుడిపల్లి మండలంలోని చిల్కమర్రి వద్ద ఉన్న మిల్లును పరిశీలించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తక్షణమే తనకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఫౌర సరఫరాల మేనేజర్ రాంపతినాయక్, తహసీల్దార్ జయశ్రీ, పీఏసీఎస్ సీఈఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తుల రిజిస్ట్రేషన్కు పాట్లు
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. త్వరలోనే ప్రభుత్వ భూముల విలువలు పెరగనున్నాయనే సమాచారంతో, ధరల భారం తప్పించుకోవడానికి జనాలు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల కోసం ఎగబడుతున్నారు. రెండు మూడు రోజుల్లోనే కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉండటంతో గురువారం జిల్లా కేంద్రంలోని కార్యాలయం కొనుగోలుదారులు, డాక్యుమెంట్ రైటర్లతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు రద్దీ పెరగడం, మరోవైపు అధికారులు పెరగనున్న ధరల కసరత్తులోనే పూర్తిగా నిమగ్నమవ్వడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని వచ్చినప్పటికీ.. ఒక్కో రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి అమ్మకం, కొనుగోలుదారులు 7 నుంచి 8 గంటల పాటు కార్యాలయంలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సిబ్బంది కొరతతో పనులు ఆలస్యం ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయి. గత నెలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తనిఖీల తర్వాత ఇక్కడి నలుగురు అవుట్సోర్సింగ్ సిబ్బంది కాలపరిమితిని రెన్యువల్ చేయకుండా విధులకు దూరం పెట్టారు. మిగతా చోట్ల అవుట్సోర్సింగ్ సిబ్బంది కొనసాగుతున్నప్పటికీ, నల్లగొండలో మాత్రం వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆ అదనపు పనిభారమంతా ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పడుతోంది. తీవ్ర ఎండలు.. కనీస వసతులు కరువు.. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న తరుణంలో, కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేకపోవడం ప్రజల ఇబ్బందులను రెట్టింపు చేస్తోంది. జిల్లాలో ఎండ తీవ్రత 44 డిగ్రీలు దాటడంతో వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. పాత మున్సిపల్ భవనంలో కొనసాగుతున్న ఈ కార్యాలయంలో ఎండవేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతూ ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తున్నా, కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు. మూత్రశాలలు (వాష్రూమ్లు) లేకపోవడంతో మహిళలు, వృద్ధులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడంపై పెట్టిన శ్రద్ధ, ఆ ఆదాయాన్ని సమకూరుస్తున్న ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో పెట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది కొరతను తీర్చి, కార్యాలయంలో వసతులు మెరుగుపరచాలని కోరుతున్నారు. ఫ అమ్మకం, కొనుగోలుదారులతో కిక్కిరిసిన నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఫ రిజిస్ట్రేషన్కు 7 గంటలకుపైగా నిరీక్షణ ఫ భూముల విలువ పెరుగుతుందని ముందే వస్తున్న జనం ఫ సిబ్బంది కొరతతో రిజిస్ట్రేషన్ల్లలో జాప్యం ఫ కార్యాలయంలో కనీస వసతులు లేక అల్లాడుతున్న ప్రజలు -
ఉదయసముద్రంలో మాక్ డ్రిల్
నల్లగొండ టూటౌన్ : ఆకస్మత్తుగా వచ్చే విపత్తును ఎలా ఎదుర్కొని బయట పడాలనే అంశంపై ఎంజీ యూనివర్సిటీకి చెందిన యువ ఆపద మిత్ర – ఎన్సీసీ క్యాడెట్లకు గురువారం పానగల్ ఉదయ సముద్రంలో మాక్ డ్రిల్ నిర్వహించి శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా యువతను సమాజస్థాయి విపత్తు ప్రతిస్పందన బృందాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 31వ బెటాలియన్, ఎన్సీసీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో పానగల్ ఉదయ సముద్రంలో మాక్డ్రిల్ నిర్వహించి గర్భిణులు, వృద్ధులు, పిల్లలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్న వారు అత్యంత సున్నిత మార్గాల ద్వారా ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఎలా ఇవ్వాలి, ఎలా రక్షించాలి, ఎలా సురక్షిత ప్రాంతానికి చేర్చాలి అనే అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 31వ బెటాలియన్ ఎన్సీసీ అధికారులు, లెఫ్టినెంట్ కల్నల్ శశిధర్రావు, సుబేదార్ మేజర్ మాధవరావు, సుబేధార్ కొమ్ము మల్లయ్య, ఏపీడీ హరీష్కుమార్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులు సాయిదీపక్, ఏఎన్ఓ మశ్చేందర్, రామునాయక్, నాగు, భాగ్యలక్ష్మి, శిక్షకులు శివకుమార్, తేజస్విని, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు ఇన్చార్జిలు
నల్లగొండ : బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జి లను నియమించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజవర్గానికి చింతల వెంకటేశ్వర్రెడ్డి, నాగార్జునసాగర్కు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మిర్యాలగూడకు మాజీ ఎంపీ లింగయ్యయాదవ్, హుజూర్నగర్కు కంచర్ల కృష్ణారెడ్డి, కోదాడకు తిప్పన విజయసింహారెడ్డి, సూర్యాపేటకు ఇస్లావత్ రామచందర్నాయక్, నల్లగొండకు ఎమ్మెల్సీ ఎంసి.కోటిరెడ్డి, మునుగోడుకు వెంకటనారాయణగౌడ్, భువనగిరికి క్యామ మల్లేష్, నకిరేకల్కు గుజ్జా దీపిక యుగందర్రావు, తుంగతుర్తికి ఎలగందుల వెంకటేశ్వర్, ఆలేరు నియోజకవర్గానికి బండా నరేందర్రెడ్డిని సభ్యత్వ నమోదు ఇన్చార్జిలుగా నియమించింది. నల్లగొండకు నేడు మంత్రుల రాకనల్లగొండ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి కార్యక్రమానికి శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రానున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో సమీపంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ప్రజా పాలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 27 నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్నాగార్జునసాగర్ : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం పాలిసెట్–2026 వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈనెల 27నుంచి ప్రారంభమవుతుందని సాగర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.ఐలయ్య గురువారం తెలిపారు. సాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలిసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 27 నుంచి 31వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 9 నుంచి జూన్3 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్తో పాటు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 6న సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్స్, మూడు సెట్లు జిరాక్స్ ప్రతులతో సమయానికి హాజరుకావాలని సూచించారు. పాలిసెట్ హాల్టికెట్, ర్యాంకు కార్డు, ఎస్ఎస్సీ మెమో, టీసీ, ఆధార్కార్డు, ఆదాయం, నివాస ధ్రువీకరణపత్రాలు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా తీసుకరావాలని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ కోసం విద్యార్థులు tgpolycet.nic.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. యాదగిరి క్షేత్రంలో నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట క్షేత్రంలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లకు నిత్యారాధనలు సంప్రదాయబద్ధంగా కొనసాగాయి. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాలభోగం, సహస్ర నామార్చనలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాఢ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మిర్యాలగూడ టౌన్ : జిల్లాలో అక్రమ ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం మిర్యాలగూడ రూరల్పోలీస్ స్టేషన్లో ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లకు నిర్వహించిన కౌన్సిలింగ్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక ద్వారా 2024లో రూ.35 కోట్లు, 2025లో రూ.43 కోట్లు, 2026లో ఇప్పటి వరకు రూ.83 కోట్లు వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 196 వరకు అక్రమ ఇసుక రవాణా కేసులు నమోదు చేశామన్నారు. చట్ట వ్యతిరేకంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సహాజ వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐలు పీఎన్డీ ప్రసాద్, సోమనర్సయ్య, ఎస్ఐలు మల్లికంటి లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, నరేష్ తదితరులు ఉన్నారు. ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్ -
జీవ వైవిధ్యం..
భూమిపై జీవరాశులు, వాటి జన్యువులు, జీవావరణ వ్యవస్థల సమాహారమే జీవ వైవిధ్యం. శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026- 8లోభానుడి ఉగ్రరూపంఫ 44 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఫ బెంబేలెత్తుతున్న జనం నల్లగొండ : భానుడు ఉగ్రరూపం దాల్చాడు. దీంతో నల్లగొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వాతావరణం వేడెక్కి ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరి అయితేనే బయటికి వస్తున్నారు. చాలాచోట్ల ఉదయం 11 గంటల నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాత్రి 7 గంటలైనా వేడి తగ్గడం లేదు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానియాలు తాగుతున్నారు. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. -
ధాన్యం డబ్బు సకాలంలో చెల్లించాలి
నల్లగొండ : ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో డీఆర్డీఏ, ఐకేపీ, పీఏసీఎస్ ఏజెన్సీల ప్రతినిధులు, ట్యాబ్ ఆపరేటర్లు, ఏపీఎంలు, పీఏసీఎస్ సీఈఓలు, మండల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేసి రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీసీఓ పత్యనాయక్, పౌరసరఫరాల అధికారి వెంకటేష్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
బీఆర్ఎస్ది.. రైతులకు బేడీలు వేయించిన చరిత్ర
నల్లగొండ : రైతులకు బేడీలు వేయింని చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. గురువారం రాజీవ్గాంధీ వర్థంతి సందర్భంగా నల్లగొండలో రాజీవ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్, వారి చెంచాలు రైతులకు ద్రోహం చేసి వారి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో సుమారు పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేయించిన సంఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ సభను చూస్తే రైతు హంతకుల సభను తలపించిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 75 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని ఈనెల 25వ తేదీ లోపు వంద శాతం పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు యాల రవీందర్రెడ్డి, బోడ స్వామి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, మధగోని వెంకన్న, వావిళ్ల దేవదాస్, నాగరాజు, పొట్ట మధు, శరత్, వినీత్, సచిన్ పాల్గొన్నారు. ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ -
కాంటా తంటా..తాలు మోసాలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలో కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 54,53,622 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ధాన్యం వచ్చింది. అందులో ఈ నెల 18వ తేదీ వరకు 39,74,335 ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా మరో 14,79,287 ఎంటీల ధాన్యం కేంద్రాల్లోనే ఉంది. ఇక కొనుగోలు చేసిన ధాన్యంలోనూ 2,87,540 ఎంటీల ధాన్యం మిల్లులకు పంపకుండా కేంద్రాల్లోనే ఉంచారు. అంటే అధికారిక లెక్కల ప్రకారమే 17,66,827 ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. ఇక 36,86,795 ఎంటీల ధాన్యం మిల్లులకు వెళ్లినా, అందులో 6,00,143 ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లు దింపుకోలేదు. మొత్తంగా ఇలా 23.66 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కొనుగోళ్లు ప్రారంభమై నెలన్నర దాటిపోయింది. మే నెలాఖరుకల్లా కొనుగోళ్లు చివరి దశకు చేరుకోవాల్సి ఉంది. అయినా 43.38 శాతం ధాన్యానికి సంబంధించిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొనుగోళ్ల వ్యవహారంలో అధికారులు విఫలం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీలు రాక మండుటెండలో.. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో 60 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేయగా, 151 ఎల్ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో దాదాపు 40 శాతం మిల్లర్లు నేరుగా కొను గోలు చేసినా, మిగతా 60 శాతం కొనుగోలు కేంద్రాల ద్వారానే కొనాలి. కానీ అందులో కొనుగోలు చేసింది 65 శాతం లోపే. ఇక 8,575 కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ట్రక్కులు, ట్రాక్టర్లు, లారీలు కలిపి 11500 రవాణా వాహనాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో అందులో సగం కూడా కనిపించడం లేదు. రాష్ట్ర స్థాయి లో లారీలను సమకూర్చుతామంటూ టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. తమ వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్నొ న్న లారీల్లో సగం కూడా ధాన్యం రవాణాకు సమకూర్చకపోవడంతో రైతులకు తంటాలు తప్పడం లేదు. ఈ విషయంలో అధికార యంత్రాంగం వారికే వంత పాడుతోందనే ఆరోపణలున్నాయి. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోతుండగా, మరికొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు రోజు విడిచి రోజు కూడా లారీలు రావడం లేదు. దీంతో రైతులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అకాల వర్షాల భయంతో ఏదోలా అమ్ముకొని ఇంటికి వెళదామంటే సకాలంలో లారీలు రాకపోవడంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. తాలు పేరుతో అడ్డగోలు దోపిడీ మరోవైపు కొనుగోలు కేంద్రంలోనే తాలు పేరుతో కిలో, రెండు కిలోలు అదనంగా దోపిడీ చేస్తుండగా, మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని దింపుకునేందుకు తాలు పేరుతో కొర్రీలు పెడుతూ నాలుగైదు కిలోలు కోత పెడుతున్నారు. మొత్తం మీద కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం తూకం వేసినందుకు హమాలీలకు కమీషన్ ఇవ్వాల్సి వస్తుండగా, లారీల వారు కూడా రైతులనుంచి బస్తాకు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. అలా డబ్బులు ఇస్తేనే కొనుగోలు కేంద్రానికి లారీలను పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద కష్టపడి ధాన్యం పండించిన రైతులు ఆ ధాన్యం అమ్ముకోవడానికి సైతం నానా కష్టాలూ పడుతూ, నష్టపోవాల్సిన పరిస్థితులు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడ్డగోలుగా ధాన్యం దోపిడీ నల్లగొండ జిల్లాలోని ఓ కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని బస్తాకు 40 కిలోల 700 గ్రాముల చొప్పున తూకం వేయాల్సి ఉన్నా, దానిని 42.5 కిలోల చొప్పున తూకం వేసి ఒక్కో బస్తాకు కిలో 800 గ్రాములు దోచుకున్నారు. ఒక లారీలో 1057 బస్తాలు వేస్తే దానిపై 19 క్వింటాళ్లు కోత పెట్టా రు.ఆ ధాన్యం బస్తాలను మిల్లుకు పంపించగా, సదరు మిల్లర్.. బస్తాకు 40 కిలోల 700 గ్రాముల చొప్పున లెక్కించి 1,038 బస్తాలుగానే పరిగణనలోకి తీసున్నాడు. అంటే ఇక్కడ 19 బస్తాలకు కోత పెట్టారు. అంటే మిల్లులో దాదాపు 7.7 క్వింటాళ్లు కోత పెట్టారు. ఇలా ఒక్క లారీపైనే ఇటు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, అటు మిల్లర్లు కలిసి 26.7 క్వింటాళ్ల వరకు కోత పెట్టి, ఆ రైతుల నుంచి ఏకంగా రూ.63 వేలు దోచుకున్నారు. లారీలు ఎప్పుడొస్తాయో..ధాన్యం మార్కెట్కు తెచ్చి నెల అవుతోంది. ఇంతవరకు తరలించలేదు. లారీలు రాలేదు. ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో పట్టాలు కప్పి కాపలా ఉండాల్సి వస్తోంది. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. – బోడ హెమ్లా, బిస్రాజుపల్లి తండా, తిరుమలాయపాలెం, ఖమ్మం కోతకు ఒప్పుకుంటేనే అన్లోడ్నేను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి విక్రయించా. 437 బస్తాలు తూకం వేసి మిల్లుకు పంపించారు. మిల్లర్ క్వింటాలుకు 14 కిలో ల తరుగు అడిగాడు. అడిగినంత తరుగుకు ఒప్పుకుంటేనే బస్తాలు దింపుకుంటాననడంతో ఏం చేయలేక అంగీకరించా. ఇదేం దోపిడీయో అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. – ఏనుగు చిన్న బాల్రెడ్డి, మైలారం, ధర్పల్లి, నిజామాబాద్ లారీకి రూ.5 వేలు ఇవ్వాలంటధాన్యం ఆరబెట్టి మంగపేట ఎఫ్ఎస్సీఎస్ సెంటర్లో బస్తాలు నింపి కాంటా కోసం సిద్ధంగా ఉంచా. ఇప్పటికి 29 రోజులు కావస్తున్నా నేటికీ కాంటా పెట్టలేదు. లారీకి రూ.5 వేలు ఇస్తే కాంటా పెడతామని చెపుతున్నారు. – జక్కం నాగేశ్వర్రావు, బోరునర్సాపురం, ములుగు -
స్వచ్ఛ సర్వేక్షణ్పై నజర్
నల్లగొండ టూటౌన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ –2026లో సింగిల్ డిజిట్ (10)లోపు ర్యాంకు సాధించేలా నీలగిరి కార్పొరేషన్ దృష్టి సారించింది. నగరంలోని అన్ని కూడళ్లు, ప్రజా మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్ధాల శుద్ధి, మార్కెట్లు, పచ్చదనం, సుందరీకరణ తదితర వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మార్కులు కేటాయిస్తుంది. దాంతో మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం వీటిపై ప్రత్యేక నజర్ పెట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, శానిటేషన్ సిబ్బంది, వార్డు అధికారులు, మెప్మా ఆర్పీలతో ఇటీవల పలుసార్లు సమావేశం నిర్వహించి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు ప్రత్యేకతపై కమిషనర్ వివరించారు. ప్రతి ఉద్యోగి స్థానిక కాలనీల్లోని ప్రజలతో మమేకమై వారి ద్వారా పౌర సేవలపై ఆన్లైన్లో మున్సిపాలిటీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసేలా చూడాలని సూచించారు. మెరుగైన ర్యాంకు సాధించేలా ప్రజలను భాగస్వామ్యులను చేయడానికి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్లైన్లో ఫీడ్ బ్యాక్ ఆధారంగా.. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్పై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ర్యాంకులు ఇస్తుంది. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ నగరాలు, పట్టణాలు తీసుకున్న విధానంపై ప్రజలు ఆన్లైన్లో ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. పట్టణాల ప్రజలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్, మున్సిపల్, కార్పొరేషన్ కార్యాలయాలు ఇచ్చే రికార్డుల ఆధారంగానే మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షన్లో ర్యాంకులు వస్తాయి. దాంతో నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పక్కా ప్రణాళికతో ముందుకు పోతూ గతంలో కంటే మెరుగైన ర్యాంకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ మెరుగైన ర్యాంకు సాధించేలా కార్పొరేషన్ కృషి ఫ ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న యంత్రాంగం స్వచ్చ సర్వేక్షణ్లో కేంద్ర ప్రభుత్వం మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం. గతేడాదికంటే కచ్చితంగా మెరుగైన ర్యాంకు సాధించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా సహకరం అందించాలి. – శరత్చంద్ర, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
నిప్పుల కొలిమి
పోలీస్స్టేషన్ వద్ద అగ్ని పమాదం కేతేపల్లి పోలీస్స్టేషన్ వద్ద జరిగిన అగ్నిపమాదంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు దగ్ధమయ్యాయి. - 8లోనల్లగొండ : నల్లగొండ జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో బుధవారం సగటున గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీలుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజు 39.2 డిగ్రీలుగా ఉంది. జిల్లాలో అత్యధికంగా కట్టంగూర్లో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని చోట్ల 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోడ్లన్నీ నిర్మానుష్యం ఎండవేడిమి, వడగాలులకు తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రోడ్లపై జన సంచారం తగ్గింది. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 7 గంటల వరకు కూడా వాతావరణ చల్లబడడం లేదు. ఏసీలు, కూలర్లు వాడకం పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ జిల్లాలో కూడా పెరిగింది. గత సంవత్సరం మే 20వ తేదీన జిల్లాలో 608 మెగావాట్ల విద్యుత్ వినియోగం కాగా.. ఈ నెల 19న 709 మెగావాట్లు విద్యుత్ వినియోగం నమోదైంది. బుధవారం 772 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది కంటే 164 మెగావాట్ల విద్యుత్ ఒక రోజులో ప్రజలు అధికంగా వినియోగించారు. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుందిఫ జిల్లాలో సగటున 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఫ కట్టంగూర్లో అత్యధికంగా 45.8 డిగ్రీలు ఫ భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం -
మెడికల్ షాపుల బంద్ సంపూర్ణం
నల్లగొండ టౌన్ : ఈ ఫార్మసీ విధానానికి వ్యతిరేకంగా మెడికల్ షాపుల యజమానులు చేపట్టిన బంద్ నల్లగొండలో బుధవారం సంపూర్ణంగా జరిగింది. ఆన్లైన్లో మందుల విక్రయానికి వ్యతిరేకంగా మెడికల్ షాప్ల యజమానులు బంద్ చేపట్టినట్లు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలుకూరి పరమాత్మ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ మందులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి చిలుకూరి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు పోశం రఘుపతి, కార్యదర్శి వి.శ్రీనివాసులు, కోశాధికారి వెంకటేశ్వర్లు, సుధాకర్, నిరంజన్, పోల రమేష్, స్వామి, హరిప్రసాద్, జీవన్, నరేంద్ర, అనిల్, శ్రీహరి పాల్గొన్నారు. మహిళా సంఘాలకు రుణాలివ్వాలితిప్పర్తి : మహిళా సంఘాలకు సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని సెర్ప్ డైరెక్టర్ నవీన్ అన్నారు. బుధవారం తిప్పర్తి మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహిస్తున్న సీనియర్ పీఆర్పీ స్ట్రాటజీ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మండలంలోని 33సంఘ బంధాల అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. కొత్త సంఘాల ఏర్పాటు, జీవనోపాధి కల్పనపై పలు సూచనలు చేశారు. సీ్త్ర నిధి రుణాల బకాయిలను రికవరీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సెర్ప్ డీపీఎం కరుణాకర్, డీపీఎం రామలింగయ్య, ఏపీయం హరి తదితరులు పాల్గొన్నారు. సాగర్లో టూరిజం హెరిటేజ్ వాక్నాగార్జునసాగర్ : తెలంగాణ టూరిజం వారోత్సవాల్లో భాగంగా బుధవారం నాగార్జునసాగర్లో హెరిటేజ్ టూరిజం వాక్ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యాటక అధికారి మహ్మద్ అక్బర్అలీ ఆధ్వర్యంలో స్థానిక టూరిజం విజయవిహార్ అతిథిగృహం ప్రాంగణంలో వాక్ చేశారు. జిల్లాలోని టూరిజం ప్రాంతాలకు సంబంధించిన బ్రోచర్లోని పలు ప్రాంతాలపై చర్చించారు. కార్యక్రమంలో టూరిజం గైడ్ సత్యనారాయణ, స్థానికులు నజీర్, అనిల్కుమార్, రాజగోపాల్, అడ్వకేట్ వినోద్కుమార్, మల్లికార్జున్, సిబ్బంది వెంకటస్వామి, అంజి, తులసి పాల్గొన్నారు. నైపుణ్యాన్ని పెంచుకోవాలినకిరేకల్ : దివ్యాంగులు వ్యాపారాల్లో మెళకువలతో పాటు నైపుణ్యాన్ని పెంచుకోవాలని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ జిల్లా క్లస్టర్ మేనేజర్ బి.సాయితేజ కోరారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్, నల్లగొండ మండాలకు చెందిన దివ్యాంగులకు స్వయం ఉపాధిపై శిక్షణ కార్యక్రమం బుధవారం నకిరేకల్లో నిర్వహించారు. ఈ శిక్షణలో పాల్గొన్న 29 మంది దివ్యాంగులకు వ్యాపార యూనిట్ల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 109 మంది దివ్యాంగులకు వ్యాపార యూనిట్లను మంజూరు చేశామని తెలిపారు. ఇలాంటి శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సెర్ప్ కోఆర్టినేటర్ జిల్లా వెంకన్న, క్లస్టర్ కో ఆర్టినేటర్లు మణికంఠ, మహేష్, రవి, తండు సైదులు తదితరులు పాల్గొన్నారు. -
సాగర్కు.. ఆదాయమేదీ!
ఫ కాలనీలు, మిగులు భూములు మున్సిపాలిటీకి ఇవ్వాలని గత ప్రభుత్వం ఆదేశం ఫ ఇప్పటికీ ఆస్తులు అప్పగించని ఎన్ఎస్పీ ఫ సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్న సాగర్ కాలనీ వాసులునాగార్జునసాగర్ : నాగార్జున సాగర్ వాసులకు కష్టాలు తప్పడం లేదు. అక్కడి ఇళ్లలో నివాసం ఉంటున్నా.. అవి వారి సొంతం కాదని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఎలాంటి ప్రైవేట్ భూమి లేకపోవడంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరడం లేదు. నందికొండ మున్సిపాలిటీకి ఆదాయ వనరులను సమకూర్చేందుకు ఎన్నెస్పీ ఆస్తులైన నివాస ప్రభుత్వ క్వార్టర్లు, మిగులు భూములను అప్పగించాలని గత ప్రభుత్వం ఎన్నెస్పీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు, అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు గతంలో సంయుక్తంగా సర్వే కూడా నిర్వహించారు. ప్రభుత్వం మారడంతో అధికారులు ఆ ఊసే ఎత్తడం లేదు. అప్పటి ప్రభుత్వం ఆదేశించినా.. 65 ఏళ్లుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలనీలైన హిల్కాలనీ, పైలాన్ కాలనీల ప్రజలు ప్రాజెక్టు అధికారుల పాలనలో మగ్గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే జరిగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే సాగర్ కాలనీలను మున్సిపాలిటీ చేస్తానని ప్రకటించారు. ఆ హామీ మేరకు నందికొండ పేరుతో మున్సిపాలిటీ చేశారు. ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ ఇండ్లన్నీ ఎన్నెస్పీవే. ప్రైవేట్ ఆస్తులేమీ ఉండవు. మున్సిపాలిటీకి ఎలాంటి ఆదాయ వనరులు లేవు. ఈ విషయాలను స్థానికులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్నెస్పీ క్వార్టర్లను, మిగులు భూములను మున్సిపాలిటీకి అప్పగిస్తే స్టాండెడ్ అద్దైలెనా వస్తాయని వాటిని అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. రికార్డుల్లో 2,555.15 ఎకరాల విస్తీర్ణం.. కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు శాఖల అధికారులు భూముల రికార్డులను పరిశీలించి సర్వే చేశారు. జీఓ ఎంఎస్ నంబర్ 783 అగ్రికల్చర్ డెవలప్మెంట్ తేదీ 15 ఏప్రిల్ 1959లో నల్లగొండ కలెక్టర్కు 1612 ఎకరాల ఫారెస్ట్ భూములను అప్పగించారు. అనంతరం బండల క్వారీ దగ్గర మెమో నంబర్ 5587 ఫారెస్ట్ తేదీ 05 ఫిబ్రవరి 1966లో 381.29 ఎకరాలు అప్పగించారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి 3,104 ఎకరాలు అప్పగించారు. ఆ భూములు ప్రస్తుతం ఆ జిల్లా పరిధిలోకే వెళ్లాయి. హిల్కాలనీ, పైలాన్కాలనీ భూములు 525.12 ఎకరాలుగా గుర్తించారు. ఎర్త్డ్యాం, హాస్పిటల్, పార్కులు, రోడ్లు, కాలనీలు, ఆలయాలు, ప్రాజెక్టు పరిధిలోగల భూములన్నీ కలిపి 2,555.15 ఎకరాల విస్తీర్ణం రికార్డులో ఉంది. ఆనాడు జరిగిన సర్వే కొలతల్లో ఎంత భూమి తేలిందనేది ఏ అధికారి దగ్గరా సమాచారం లేదు. రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లకు ట్యాక్స్ మున్సిపాలిటీకి ఆధాయం సమకూరాలంటే ఇప్పటికే 58, 59 జీవో ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లకు మున్సిపాలిటీ ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ కాని ఇళ్లకు దరకాస్తు చేసుకున్న వారికి నోటీసులు అందజేసి ఆ జీఓ ప్రకారం నగదు చలానా రూపేనా కట్టించుకుని రిజిస్టేషన్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రిజిస్టేషన్ కాగానే మున్సిపాలిటీకి ట్యాక్స్ చెల్లించనున్నారు. రిజిస్టేషన్ కాకున్నా మున్సిపాలిటీ నుంచి స్థానిక కాలనీల ప్రజలు సేవలను పొందుతున్న దృష్ట్యా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుని భూములన్నింటినీ మున్సిపాలిటీకి అప్పగించి నివాసుల నుంచి ట్యాక్స్ వసూలు చేసేందుకు మార్గం సుగమం చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీంతో నివాసల మీద హక్కులు వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
వాన నీటిని ఒడిసి పట్టాలి
గుర్రంపోడు : ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టేలా నీటి సంరక్షణ కార్యక్రమాల్లో రైతులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని డీఆర్డీఓ వై.శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం గుర్రంపోడు మండలంలోని పోచంపల్లి గ్రామంలో జల సంచయ్ జన భాగిదారి కార్యక్రమంలో భాగంగా రైతులు, ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు. కందకాల తవ్వకాలు, వాలుకు అడ్డంగా అడ్డుకట్టలు, నీటి కొలనులపై అవగాహన కల్పించారు. కళాజాత ప్రదర్శనలో వాన నీటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండెబోయిన కళావతి, ఎంపీడీఓ మహేష్, ఏపీఓ గోపాల్రెడ్డి, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సవరణకు సహకరించాలి
నిడమనూరు : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్)కు రాజకీయ పక్షాలు సహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం ఆయన నిడమనూరులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఓటరు మ్యాపింగ్ ఎలా చేపడతారో వివరించారు. బూత్ లెవల్ అధికారుల జాన్ 25 నుంచి వచ్చే నెల 24 వరకు ఇంటింటీ సర్వే చేపడతారని తెలిపారు. వచ్చేనెల 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారని, ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, 1 అక్టోబరు 2026న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైవీర్రెడ్డి ఓటరు జాబితాలో సవరణకు సంబంధించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు జంగాల కృష్ణయ్య, అనిల్కుమార్, చందర్రావు, శ్రీనివాస్, గాజుల ప్రమీల, కరుణశ్రీ, బాణోతు ఖాసీం, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, ఎడవెల్లి వల్లభారెడ్డి, రామలింగయ్య, కొండేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
‘సర్’ను పారదర్శకంగా పూర్తిచేయాలి
నల్లగొండ : ఓటరు జాబితా సమ గ్ర సవరణ ప్రక్రియను (సర్) పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన తన ఛాంబర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా ప్రస్తుతం ఆ ఓటర్ల పరిస్థితి, 2002 తర్వాత కొత్తగా జాబితాలో చేరిన వారి అంశాలను పరిశీలిస్తూ 2026 ఓటరు మ్యాపింగ్ చేపట్టాలని తెలిపారు. ఇప్పటివరకు 80.65 శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగతా ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు 1,575 మంది బీఎల్ఓలను నియమించామని, సర్ ప్రక్రియలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ 2 ఫారాలు అందజేస్తామని, ఓటర్లు ఒక దానిని పూరించి సమర్పించాలని చెప్పారు. ఓటరు జాబితాకు సంబంధించిన సమస్యలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారిని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
వాహనాల అద్దె పెంచాలి..
ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం అద్దె నిర్ణయించింది. అదే ఇప్పటి వరకు కొనసాగుతోంది. డీజిల్, పెట్రోలు ధరలు పెరిగాయి. నిత్యావసరాలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే అద్దె సరిపోవడం లేదు. అద్దె పెంచితేనే గిట్టుబాటు అవుతుంది. – కంచుకంట్ల వెంకన్న, అద్దె వాహనయజమాని ప్రభుత్వం ఇచ్చే కార్ల అద్దె గిట్టుబాటు కావడం లేదు. ప్రస్తుతం డీజిల్, పెట్రోలు ధరలు పెరిగాయి. మెయింటెనెన్స్ కష్టమైంది. మాకు రూపాయి మిగలడం లేదు. ప్రభుత్వం ఆలోచన చేసి మా బాదలు అర్థం చేసుకుని అద్దెలు పెంచాలి. – శౌరి రాజు, తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నల్లగొండ -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
పెద్దఅడిశర్లపల్లి : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం లారీ కాంట్రాక్టర్, పీఏసీఎస్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి కావాల్సిన లారీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని లారీ కాంట్రాక్టర్కు ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయశ్రీ, పీఏసీఎస్ సీఈవో ప్రభాకర్, సర్పంచ్ చిరంజీవి పాల్గొన్నారు. హోటళ్లు, బేకరీల్లో తనిఖీలునల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలో మంగళవారం పలు హోటళ్లు, బేకరిలు, స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో కొంతమంది వ్యాపారులు మాంసాహార పదార్థాలను సరైన లేబులింగ్ లేకుండా, ‘యూజ్ బై డేట్’ నమోదు చేయకుండా ఫ్రిడ్జ్లో నిల్వ చేసినట్లు గుర్తించారు. బేకరీల్లో గడువు ముగిసిన బిస్కెట్లు, చాక్లెట్లు, సాస్లు ఇతర ఆహార పదార్థాలతో కలిపి నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. డీవీకే రోడ్డులోని ఒక కేఫేలో టీ తయారీలో రంగులు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా గుర్తించిన టీ పొడి, చక్కెర నమూనాలను ప్రయోగశాలకు పంపారు. తనిఖీలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.శివశంకర్రెడ్డి, ఎఫ్ఎస్డబ్ల్యూ టెక్నీషియన్ ఎం.వెంకటపతి, డ్రైవర్ పి.వంశీ పాల్గొన్నారు. చెక్పోస్ట్ల వద్ద పటిష్ట నిఘా అవసరంనల్లగొండ టౌన్ : బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలోని చెక్పోస్టుల వద్ద నిఘా అవసరమని జిల్లా పశు వైద్య, పశువైద్య శాఖ అధికారి డాక్టర్ జివి.రమేష్ తెలిపారు. మంగళవారం ఆలగడప అంతర్జిల్లా చెక్పోస్ట్, వాడపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్, అవంతిపురం పశువుల సంతను సందర్శించిన ఆయన డాక్టర్ జివి.రమేష్ అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్పోస్టుల వద్ద పోలీసు, పశువైద్య సిబ్బందిని 24 గంటల పాటు విధుల్లో నియమించినట్లు తెలిపారు. చెక్పోస్టుల ద్వారా వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి, నిబంధనలకు అనుగుణంగా పశువుల రవాణా జరుగుతుందో లేదో పరిశీలించాలని సూచించారు. సరైన పశువైద్య ధ్రువీకరణ ప త్రాలు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. పరిమితికి మించి పశువులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సహాయ సంచాలకుడు డాక్టర్ వెంకట్రెడ్డి, పశువైద్యులు రమాదేవి, స్వప్న, శశికళ పాల్గొన్నారు. -
ఉద్యమకారుల గుర్తింపులో పారదర్శకత ఉండాలి
రామగిరి(నల్లగొండ) : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పూర్వ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రెడ్ క్రాస్ భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా స్థాయి ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం జీవితా లను అంకితం చేసి ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా గుర్తింపు ప్రక్రియ కొనసాగాలన్నారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతి జిల్లాలో పర్యటింటి ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించి ఉద్యమకారుల అభిప్రాయాలను సేకరించాలన్నారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నడిపిన నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధుల సమాచారాన్ని ప్రామాణికంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, త్యాగాలు, పోరాట స్ఫూర్తి దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా నిజమైన ఉద్యమకారుల ఎంపిక జరగాల్సిన అవసరం ఉందన్నారు.1969 ఉద్యమకారుల కమిటీ ఒకటి ఉన్నది ముందుగా వారికి వైద్య అవసరాల కోసం అయినా పది కోట్ల రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాలను పిలిచి వారి నుంచి కూడా అభిప్రాయాలను సేకరించాలన్నారు. ఉద్యమకారులకు ముందుగా ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి, అనంతరం సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఉద్యమకారులు చక్రహరి రామరాజు, గోలి అమరేందర్రెడ్డి, బోనగిరి దేవేందర్, వైద్యుల సత్యనారాయణ, అంబటి నాగయ్య, వీరెల్లి చంద్రశేఖర్, ఇందూరి సాగర్, దూసరి కిరణ్కుమార్, పందుల సైదులు, పన్నాల గోపాల్రెడ్డి, పెరిక కరణ్జయరాజు, రమేష్, శ్రవణ్కుమార్, నల్ల సోమమల్లయ్య, వెంకట్రామిరెడ్డి, తోట నరసింహాచారి, సంతోష్రెడ్డి, చంద్రారెడ్డి, నరేంద్రబాబు, శ్రీనివాస్రావు, దాసోజు లలిత, లక్ష్మీనారాయణ, భీమార్జున్రెడ్డి, హరికృష్ణ పాల్గొన్నారు. -
రెండు ఎకరాలకేనా భరోసా?
జిల్లాలో 5,29,991 మంది రైతులున్నారు. అందరికీ పెట్టుబడి సాయం అందించడానికి రూ.624 కోట్ల నిధులు అవసరం. యాసంగి సీజన్కు సంబందించి మొదటి విడతలో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో రూ.303 కోట్ల జమ చేసింది. గతనెల 20న రెండో విడతలో రెండెకరాలలోపు రైతులకు రూ.268 కోట్లు అందించారు. ఇంకా రూ.53 కోట్లు జమ కావాల్సి ఉంది. నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్ పూర్తయినా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతు భరోసా అందలేదు. రెండెకరాల్లోపు రైతులకే పెట్టుబడిసాయం పరిమితమైంది. ఆపైన భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారన్న విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున గత ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. మొదట్లో ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున ెఅందించిన సర్కారు.. తర్వాత రూ.10 వేలకు పెంచింది. తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చాక నిధుల కొరత ఉందంటూ ప్రతి సీజను ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తామని పేర్కొంది. గత వానాకాలంలో రైతులందరికీ నిధులు జమయ్యాయి. కానీ యాసంగికి వచ్చేసరికి పథకం అమలులో జాప్యం జరుగుతోంది. వానాకాలమైనా ఇస్తారా.. గతంలో రైతులు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వారు. రైతుబంధు పథకం వచ్చాక రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం కొంత తగ్గింది. అయితే ఈ పథకాన్ని అమలు చేయడంలో రెండేళ్లుగా జాప్యం జరుగుతోంది. దీంతో మళ్లీ అన్నదాతలు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి భరోసానే పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఇక వచ్చే వానాకాలం పెట్టుబడి సాయం ఉంటుందో ఉండదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికై నా చిత్తశుద్ధితో వ్యవహరించి పూర్తిస్థాయిలో రైతుభరోసా నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఫ పూర్తిస్థాయిలో అందని యాసంగి పెట్టుబడిసాయం ఫ నిరాశలో అన్నదాతలు -
రైతులను ముంచింది బీఆర్ఎస్ వాళ్లే
ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత నల్లగొండ : రైతులకు తీరని అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత విమర్శించారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టులు కట్టింది, కాల్వలు తవ్వింది కాంగ్రెస్ పార్టీయేనని, దాంతో.. నల్లగొండ జిల్లానే అత్యధికంగా ధాన్యం పండుతోందన్నారు. ఆనాడు మిల్లర్లతో కుమ్మకై ్క బీఆర్ఎస్ నేతలు దోపిడీకి పాల్పడితే నేడు వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్లో మంత్రులుగా పని చేసిన తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సబిత ఇంద్రారెడ్డి ఉద్యమకారులా అని ప్రశ్నించారు. జిల్లాలో భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కంచర్ల భూపాల్రెడ్డి ఎక్కడ ఉద్యమం చేసారని నిలదీశారు. చిలుకపలుకులు పలుకుతున్న ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు దొంగ ఎన్కౌంటర్లు చేసి తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించారు. -
హీట్ స్ట్రోక్ వార్డులు
నల్లగొండ టౌన్ : రానున్న నాలుగు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్డ్ ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వడదెబ్బ బారిన పడిన వారికి ప్రత్యేక వైద్య సేవలను అందించడానికి ముందస్తుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పాటుగా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, మర్రిగూడ ఏరియా ఆస్పత్రులతో పాటు 24 గంటల పీహెచ్సీల్లో ప్రత్యేకంగా హీట్స్ట్రోక్ వార్డులను ఏర్పాటు చేశారు. అందులో వైద్యులతో పాటు ఏఎన్ఎంలు 24 గంటలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా వడదెబ్బ బారిని పడితే అత్యవసర వైద్య సేవలను అందించనున్నారు. సిద్ధంగా మందులు, గ్లూకోజ్ బాటిళ్లు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో పాటు జీజీహెచ్, ఏరియా ఆస్పత్రుల అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఉపాధిహామీ పథకం పనులు చేసే ప్రాంతాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. పీహెచ్సీల్లో ఓపీ సేవల కోసం వచ్చే వారి కోసం ప్రత్యేకంగా లీటర్ నీటిలో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ను కలిపి దాహం వేసిన వారికి అందించనున్నారు. ఎండల కారణంగా ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా వారికి ఈ ఏర్పాట్లను జిల్లా వైద్య ఆరోగ్య ఽశాఖ చేసింది. వేసవిలో వచ్చే జబ్బులకు సంబంధించిన మందులను, గ్లూకోజ్ బాటిళ్లను అన్ని ఆస్పత్రులు, పీహెచ్సీల్లో అందుబాటులో ఉంచారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా రోజువారి సమాచారాన్ని తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. జీజీహెచ్, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు ఫ 24 గంటలు అందుబాటులో వైద్యులు, సిబ్బంది ఫ రెడ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ -
చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.44,16,666
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు విచ్చేసి స్వామి వారికి మొక్కుబడగా 60 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీలను మంగళవారం లెచ్చించారు. మొత్తం రూ.44,16,666 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ మోహన్బాబు తెలిపారు. అన్నదానం హుండీని లెక్కించగా రూ.18,642 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ వరాల రమేష్, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ, ధర్మకర్తలు మల్లేషం, సంపత్, యాదగిరి, శ్రీనివాస్రెడ్డి, లింగస్వామి, శ్రీను, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటయ్య, రాజలక్ష్మి, నరేష్, మహేందర్రెడ్డి, గణేష్ పాల్గొన్నారు. -
కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
నల్లగొండ : కేసులు దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల సరఫరా, రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ప్రజా ప్రదేశాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాల నివారణకు గస్తీలు నిర్వహించాలన్నారు. డయల్ 100కు వచ్చే ప్రతి కాల్పై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లాలన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పెంచేలా ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, శ్రీనివాసరావు, డీఎస్పీ రవి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఆస్తి పన్ను సర్వర్ డౌన్
ఆస్తి పన్ను సర్వర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా. ఐదు శాతం రాయితీ తరువాత అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అందువల్లే సర్వర్ సమస్య ఏర్పడినట్లు తెలిసింది. – బి.శరత్చంద్ర, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆస్తి పన్ను సర్వర్ పని చేయడంలేదు. నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో 13 రోజులుగా ఆస్తి పన్ను సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పట్టణాలకు చెందిన వారు పలువురు కార్యాలయాలకు వచ్చి ఆస్తి పన్ను చెల్లించేందుకు వస్తుండడంతో సర్వర్ పని చేయడంలేదని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. దాంతో భవనాల యాజమానులు ఆస్తి పన్ను చెల్లించే అవకాశం లేక వెనుదిరిగిపోతున్నారు. వార్డు ఆఫీసర్లు డివిజన్లు, వార్డుల్లో తిరుగుతున్నా కొందరు మాత్రం మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి ఆస్తి పన్ను చెల్లించి రశీదు పొందుతుంటారు. ఆస్తి పన్ను సర్వర్ పని చేయని కారణంగా కార్యాయాలకు వచ్చి ఆస్తి పన్ను చెల్లించాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడంలేదు. వార్డు ఆఫీసర్ల దగ్గర ఉన్న మిషన్లు కూడా పని చేయకపోవడంతో గత 13 రోజుల నుంచి ఆస్తి పన్ను సేవలు నిలిచిపోయాయి. సీడీఎంఏలోనే సర్వర్ సమస్య.. హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయంలోనే ఆస్తి పన్ను సర్వర్ సమస్య నెలకొంది. అసలు సమస్య ఎందుకు వచ్చిందనే సమాచారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇవ్వకపోవడం లేదు. ఆస్తి పన్ను సర్వర్ పని చేయని కారణంగా మే నెలలో ఆస్తి పన్ను వసూలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఆస్తి పన్ను సర్వర్ ఎప్పుడు వస్తుందనే సమాచారం మున్సిపాలిటీ అధికారులకు లేకపోవడంతో వారు చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సర్వర్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఫ 13 రోజులుగా నిలిచిన సేవలు ఫ మన్సిపాలిటీలు, కార్పొరేషన్లో నిలిచిన పన్ను వసూళ్లు -
జనగణనకు సవాళ్లు
నేను పని చేస్తున్న నకిరేకల్ మండలం పాలెంలో నాకు మూడు బ్లాక్లు కేటాయించారు. నా మూడు బ్లాక్లు మూడు దిక్కులుగా ఉన్నాయి. అతి కష్టం మీద మూడు బ్లాక్ల మ్యాపింగ్ చేయాల్సి వచ్చింది. ఇది అయిపోకా యాప్లో నమోదు చేద్దామంటే గ్రామాల్లో ఉపాధి హామీ పని అడ్డంకిగా మారింది. ప్రజలందరు ఉదయం 6.30గంటలకే పనులకు వెలుతున్నారు. మళ్లీ 12 గంటల తర్వాత ఇంటికి వస్తున్నారు. వారి కోసం మధ్యాహ్నం వరకు నిరీక్షించాల్సి వస్తోంది. – నర్సింహమూర్తి, పాలెం, నకిరేకల్ మండలం ఒక్కో ఎన్యుమరేటర్కు 180 నుంచి 320 వరకు గృహాలను కేటాయించారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా ఇళ్లను విభజించడం వల్ల కొందరు ఎన్యుమరేటర్లకు తక్కువ ఇళ్లు, మరి కొందరికి ఎక్కువ ఇళ్లు కేటాయించబడ్డాయి. కొందరికి మూడు, నాలుగు బ్లాక్లు కూడా కేటాయించారు. అవి వేర్వేరు ప్రాంతాల్లో ఉండడంతో ఎండలకు ఆయా ప్రాంతాలకు వెళ్లి మ్యాపింగ్ చేయాల్సి వస్తోంది. కొన్ని ఇళ్లకు నంబర్లు లేకపోవడంతో వాటిని మ్యాపింగ్ చేయడం వారికి కష్టతరంగా మారింది. మ్యాపింగ్ పూర్తి చేసినా గ్రామాల్లో ప్రజలు పనులకు వెళ్తుండడంతో వారి వివరాలు నమోదు చేసేందుకు మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వస్తోంది. పంచాయతీ సిబ్బంది కూడా వీరికి ఎలాంటి సహకారం అందించడం లేదు. నకిరేకల్ : జనగణన ప్రక్రియలో క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటిసారిగా డిజటల్ జనగణన చేపడుతున్నారు. మొదటి దశ జనగణన ప్రక్రియ ఈనెల 11 నుంచి జూన్ 9 వరకు కొనసాగుతుంది. మొదటి దశలో ఆయా ప్రాంతాలకు కేటాయించిన ఎన్యుమరేటర్లు ఇంటి వివరాలు, గృహ సౌకర్యాలు, తాగు నీరు, ఆస్తుల వివరాలు, నివాస పరిస్థితుల వంటి సమాచారం సేకరిస్తారు. అయితే సర్వే చేసే ఎన్యుమరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు జనగణన, మరోవైపు బడిబాట ఒత్తిడిలో ఉపాధ్యాయులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. క్లిష్టంగా మ్యాపింగ్ ప్రక్రియ జనాభా, గృహాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకులు కీలకపాత్ర పోషిస్తున్నారు. మొదటి మూడు రోజుల్లో గృహాల మ్యాపింగ్ పూర్తి చేసి ఇంటి నంబర్లు వేయాలని సూచించారు. ఆ ప్రక్రియ అనేక గ్రామాల్లో పూర్తి కాకపోవడంతో ఎన్యుమరేటర్లు, ఆందోళకు గురిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాల సంఖ్య ఎక్కువగా ఉండడం, మ్యాపింగ్ ప్రక్రియ క్లిష్టంగా మారింది. కేవలం మూడు రోజుల్లో పనిపూర్తి చేయాలని అధికారులు ఆదేశించడంతో వారు ఒత్తిడి లోనవుతున్నారు. అందరికీ సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విద్యశాఖ ఈనెల 14 నుంచి బడిబాట నిర్వహించాలని ఆదేశించింది. దీంతో వారు పనిచేస్తున్న పాఠశాలలకు ఉరుకులు పరుగులు పెట్టి మళ్లీ జనగణన ప్రక్రియలో పాల్గొంటున్నారు. దీనికి తోడు తీవ్ర ఎండలు వారిని భయపెడుతున్నాయి. ఉత్తర్వులు కంటితుడుపే.. ప్రభుత్వం జనగణన డ్యూటీ పడని ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. అయితే జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే 95 శాతం మంది ఉపాధ్యాయులకు జనగణన డ్యూటీ పడింది. వారు బడిబాట కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు జనగణన డ్యూటీ చేయాల్సి రావడం ఇబ్బందిగా మారింది. ఫ క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్న ఎన్యుమరేటర్లు ఫ బ్లాక్ల కేటాయింపులో వ్యత్యాసం ఫ కష్టతరంగా మారిన మ్యాపింగ్ ప్రక్రియ ఫ గ్రామాల్లో ఉపాధి పనులతో మధ్యాహ్నం ఎండలోనే డ్యూటీ ఫ బడిబాట, జనగణనతో ఉపాధ్యాయుల ఉరుకులు పరుగులు -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలుఐబ్రోస్(త్రెడింగ్), వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : 16–05–2026 నుంచి 21–05–2026 వరకు సమయం : ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం.వరకు రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/– వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుండి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకుతన్విక బ్యూటీపార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్, రోడ్ నెం.1బి, వీటి కాలనీ, నల్లగొండ. సంప్రదించవలసిన ఫోన్ : 8341151413, 9666013544రిజిస్ట్రేషన్ మరియు శిక్షణా స్థలం వివరాలుఫ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయి -
యోగా, వ్యాయామంతో ఆరోగ్యం
నల్లగొండ టూటౌన్ : రోజూ యోగా, వ్యాయామంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండలోని డాక్టర్స్ కాలనీలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. వివిధ పనులు చేయడం ద్వారా శరీరం అలసటకు గురవుతుందని, యోగా చేస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. అనంతరం 2కే రన్ను ప్రారంభించి కలెక్టర్ కూడా రన్నింగ్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్అలీ, మున్సిపల్ కమిషనర్ బి.శరత్చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాలి
నల్లగొండ : అధికారులు ఈ వారం అంతా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు, సెన్సస్, సాదాబైనామా, ఎస్ఐఆర్, ఎన్ఆర్ఈజీఎస్ పథకాల పురోగతిపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఎస్ఓలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. రోజూ 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అన్లోడింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. లారీలు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కొన్ని సెంటర్లు మూతపడిన నేపథ్యంలో అక్కడి వనరులను ఇతర కేంద్రాల్లో వినియోగించాలని ఆదేశించారు. జనగణనకు సంబంధించి జూన్ 9 నాటికి 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పనులపై బీఎల్ఓలతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి 100 శాతం పూర్తిచేసేలా చూడాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపడుతున్న పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. లేబర్ రిపోర్టులు త్వరగా నమోదు చేయాలని, అర్హులైన వారికి జాబ్ కార్డులు వెంటనే జారీ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, పౌరసరఫరాల డీఎం రాంపతి నాయక్, సీపీఓ శ్రీనివాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అడవుల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ నల్లగొండ : అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్లో జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ భూముల్లోనే కాకుండా ప్రైవేట్ భూముల్లో కూడా ఉన్న అటవీ ప్రాంతాలను గుర్తించి వాటిని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రకృతి సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అటవీ ప్రాంతాల గుర్తింపులో రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామాల వారీగా సర్వే నిర్వహించి చెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఏడీఎస్ఎల్ఆర్ రాజశేఖర్, జిల్లా ఫారెస్ట్ అధికారి వై.శ్రీనివాస్, ఫారెస్ట్ అధికారులు వి.చంద్రమోహన్, వీరేంద్రబాబు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
హెలికాప్టర్ మంత్రులు ఎక్కడ?
నల్లగొండ : రైతులు అరిగోస తీస్తుంటే హెలికాప్టర్ మంత్రులు ఎక్కడికి పోయారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్వింటాకు 10 కేజీల చొప్పున కోత విధించి రైతులను ఇబ్బంది పెడుతున్నా.. జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పత్తాలేరని మండిపడ్డారు. ఆనాడు కేసీఆర్ ఉచిత విద్యుత్, రైతుబంధు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు రారాజులా ఉన్నారని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వానికి ముందుచూపు లేక రైతులను ఆగం చేసిందన్నారు. కరోనా సమయంలోనూ దేశమంతా ఇంటికే పరిమితమైతే తెలంగాణలో మాత్రం రైతు కల్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొన్న చరిత్ర కేసీఆర్కు దక్కిందన్నారు. ప్రజలు రేవంత్రెడ్డి మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే మోసం చేశాడని.. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లను పట్టించుకోని కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. మంత్రులు ఏసీ రూమ్లకే పరిమితమయ్యారు : ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏసీ రూమ్లకే పరిమితమయ్యారని, రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ ఆరోపించారు. 60 నుంచి 70 కార్ల కాన్వాయ్తో వెళ్లి కల్లాల వద్ద డ్రామాలు చేశారు తప్ప రైతుల గోస పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతులను పట్టించుకోలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. ధర్నాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కిషోర్కుమార్, ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు లింగయ్యయాదవ్, కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, రావుల శ్రీనివాస్రెడ్డి, కొండూరు సత్యనారాయణ, మాలే శరణ్యారెడ్డి పాల్గొన్నారు. ఫ రైతులు అరిగోస తీస్తున్నా వారికి పట్టదా ఫ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందు చూపులేదు ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఫ నల్లగొండ కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నా -
వైటీపీఎస్లో ప్రమాద స్థలం పరిశీలన
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో (వైటీపీఎస్) ఆదివారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సోమవారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సమీక్షించారు. ప్లాంట్లోని కంట్రోల్ రూమ్కు వెళ్లి ప్రమాదం జరిగిన సమయానికి సంబంధించిన సీసీ టీవీ విజువల్స్ను చూశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ యూనిట్–3 పరిధిలోని టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీక్ కావడం వల్లే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్, కొన్ని కీలకమైన వాల్వ్లు దెబ్బతిన్నాయని, అత్యంత విలువైన ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం ఊరట కలిగించే విషయమన్నారు. భవిష్యత్లో ఇటువంటి సాంకేతిక లోపాలు పనురావృతం కాకుండా ముందస్తు భద్రత చర్యలు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్లాంట్ను పునరుద్ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్లాంట్ చీఫ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విద్యుత్ కేంద్రం ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
20, 21 తేదీల్లో నల్లగొండ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎండల తీవ్రత పెరుగనుండటంతో వాతావారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో ఇప్పటికే 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, అవి రానున్న మూడు నాలుగు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలో 44 డిగ్రీలకంటే ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆ రెండు రోజులు రెడ్ అలర్ట్ను ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే అల్లాడుతున్న జనం గతంలో కంటే ఈసారి ఎండల తీవ్రత పెరిగింది. గాలిలో తేమ శాతం తగ్గింది. ఎండలతో ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఇంట్లో కూడా వేడిని తాళలేక ఏసీలు, కూలర్లు పెట్టుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. అయితే బుధ, గురువారాల్లో 44 డిగ్రీలకు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈనెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తే కూడా ప్రారంభం అవుతుండటంతో ఎండలు మండిపోయే పరిస్థితి ఉంటుందని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఇళ్ల వద్దే ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఫ 44 డిగ్రీలు దాటనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఫ సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు అరెంజ్ అలర్ట్ ఫ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచనప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ణ్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 12 గంటల్లోగా పనులు చూసుకోవాలి. బయటకు వెళ్లాలంటే గొడుగులు, టోపీలు, తెల్లని వదులైన దుస్తులు ధరించాలి. కూల్డ్రింక్స్, ఆయిల్ఫుడ్కు దూరంగా ఉండాలి. మజ్జిగ, చల్లని నీరు తాగాలి. ఉపాధి హామీ కూలీలు, బయటకు పని నిమిత్తం వెళ్లేవారు 12 గంటల్లోగా ఇళ్లకు చేరుకోవాలి. కిటికీలు, తలుపులు దగ్గరకు వేసుకుని ప్యాన్లు వేసుకోవాలి. ఉష్ణోగ్రత పెరిగితే పక్షవాతం వచ్చి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది. వడదెబ్బ వస్తే సమీప వైద్యులను సంప్రదించాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను తీసుకోవాలి. – డాక్టర్ మాతృ, డీసీహెచ్ఎస్, నల్లగొండ -
కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 8 సీట్లు, 8వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 25వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ నల్లగొండ : ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజావాణిలో అందిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 89 వచ్చాయని, వాటిలో రెవెన్యూ శాఖకు 29, ఇతర శాఖలకు సంబందించినవి 60 వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, హౌసింగ్ పీడీ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆలయాల పాలకవర్గాల ప్రమాణ స్వీకారంరామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాల నూతన పాలకవర్గాలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పచ్చల సోమేశ్వరాలయం చైర్మన్గా గజ్జి సురేష్యాదవ్ ధర్మకర్తలుగా జంపాల శంకర్, కొండ అంజయ్య, కొడదల వెంకన్న, ఊసం సక్కుబాయి, వేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్గా ఓర్సు రమేష్, గుడిసె రాంబాబు, గజ్జి రాజు, రుద్రాక్షి మంగమ్మ, ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్గా కొప్పు సత్తయ్యగౌడ్, ధర్మకర్తలుగా గుండెగోని సురేష్గౌడ్, తుల్మ శశికిరణ్, చాపల ప్రవీణ్, చిలుముల అశోక్ ప్రమాణ స్వీకారం చేశారు. పచ్చల సోమేశ్వరాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి పాల్గొని నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఒకటో డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట్ల నాగరాజు, ఆలయాల అర్చకులు తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
సాక్షి, నల్లగొండ: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలై, తమకు చేదోడువాదోడుగా టుందనుకున్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ ఇంటి దీపం శాశ్వతంగా ఆరిపోయింది. రూ.50 లక్షలు అప్పు చేసి మరీ అమెరికా పంపిన కౌలు రైతు దంపతులకు తీరని శోకం మిగిలింది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టుకు చెందిన నవ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు నవ్య (24) బీటెక్ పూర్తి చేయడంతో ఎంఎస్ కోసం రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లింది. చిన్న కూతురు ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. నవ్య చికాగో రాష్ట్రంలోని రోజ్ వెల్ యూనివర్సిటీలో రెండున్నర సంవత్సరాల నుంచి ఎంఎస్ చదువుతోంది.శనివారం రాత్రి కారులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వెనుక నుంచి మరో కారు ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితురాలు ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నవ్య మృతి విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి సమాచారం అందించారు. తక్షణమే వారు స్పందించి అమెరికా నుంచి నవ్య మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నవ్య తల్లిదండ్రులు తెలిపారు.ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. నవ్య 10వ తరగతి నల్లగొండలోని ఎంవీఆర్ స్కూల్లో, ఇంటర్ గీతాంజలి కాలేజీలో, బీటెక్ హైదరాబాద్లోని విజ్ఞాన్ కళాశాలలో పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి ఎంఎస్ చదువుతోంది. తన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వార్త తెలుసుకున్న శ్రీనివాస్రెడ్డి కుప్పకూలిపోయాడు. తన కూతురు ఉన్నత విద్యావంతురాలై విదేశంలో ఉద్యోగం చేసి ఇంటి దీపంగా వెలుగుతుంది అనుకుంటే రోడ్డు ప్రమాదం ఇంటి దీపాన్ని ఆర్పిందని నవ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేసిన అప్పులు తీరకముందే.. గడుసు శ్రీనివాసరెడ్డి, శోభ దంపతులు సొంతంగా భూమి లేకున్నా ప్రతి సంవత్సరం 10 నుంచి 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట పడిస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివిపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం పెద్ద కూతురు నవ్యను ఉన్నత విద్య కోసం అమెరికా పంపేందుకు రూ.30 లక్షలు బ్యాంకు రుణం, రూ.20 లక్షలు ప్రైవేట్ అప్పు చేశారు. చేసిన అప్పు తీరక ముందే కుమార్తె కానరాని లోకానికి పోయిందని తల్లడిల్లిపోతున్నారు. పెద్ద కూతురు ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేస్తే చిన్న కూతురికి, తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది అనుకుంటే అప్పులతో పాటు కన్నీరే మిగిలిందని రోదిస్తున్నారు. -
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. -
చేతివృత్తులపై అభిరుచి పెంచుకోవాలి
నల్లగొండ : విద్యార్థులు చదువుతో పాటు చేతివృత్తులపై అభిరుచి పెంచుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలోని డైట్ కాలేజీ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ట్స్, క్రాఫ్ట్, కల్చర్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒకేచోట 2500 మంది విద్యార్థులు చదువుకునే విధంగా రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, సైన్స్ అధికారి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓటర్ మ్యాపింగ్ పూర్తిచేయాలి నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో నల్లగొండ కలెక్టరేట్ నుంచి పాల్గొన్న అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. సర్ షెడ్యూల్ మొదలయ్యేలోగా ఓటరు మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. సాదాబైనామ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. భూ భారతి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీఓలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
రమ్యకు స్పోర్ట్స్ సైకిల్ అందజేత
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన సైక్లింగ్ క్రీడాకారిణి నిజానపల్లి రమ్యకు మంత్రి కేటీఆర్ స్పోర్ట్స్ సైకిల్ అందజేశారు. సైక్లింగ్లో జాతీయ స్థాయి క్రీడాకారిణి రమ్య.. అంత్యంత ఖర్చుతో కూడుకున్న సైక్లింగ్ సామగ్రి కోసం దాతల సాయం కోరింది. ‘సాక్షి’లో ‘సాయం చేస్తే సత్తా చాటుతా’ శీర్షికన ప్రచురితమైన కథనం మాజీ మంత్రి కె.తారకరామారావు దృష్టికి వెళ్లడంతో రమ్యకు సాయం చేస్తానని మాటిచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో రమ్యకు రూ.13 లక్షల విలువ గల సైకిల్తో పాటు స్పోర్ట్స్ సామగ్రిని అందజేశారు. పేద కుటుంబానికి చెందిన తాను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించిన కేటీఆర్కు రమ్య కృతజ్ఞతలు తెలిపింది. జాతీయస్థాయిలో రాణించి రాష్ట్రానికి గుర్తింపు తెస్తానని తెలిపింది. ఎంజీయులో విద్యా వారోత్సవాలునల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో శనివారం విద్యావారోత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల నాన్–టీచింగ్, పరిపాలనా సిబ్బంది ఆఫీస్ నిర్వహణలో భాగంగా ‘ఏఐ టూల్స్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టాస్క్ నుంచి సాయి రాఘవేంద్ర మాట్లాడుతూ ఏఐ ఆధారిత కార్యాలయ ఆటోమేషన్, అధికారిక లేఖలు, నివేదికలు, నోటీసుల తయారీ, దత్తాంశ నిర్వహణ, డాక్యుమెంటేషన్, స్మార్ట్ ప్రజెంటేషన్లు, కంటెంట్ సృస్టి, ఈ–మెయిల్ కమ్యూనికేషన్ వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో ఎం.జయంతి, రేఖ, నీలిమ, సునీత, ప్రగతి, నిర్మల, నాగయ్య, హేమంత్, ఉమ పాల్గొన్నారు. ఎన్జీ కళాశాలలో కృత్రిమ మేధపై అవగాహనరామగిరి(నల్లగొండ) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్లగొండ ఎన్జీ కళాశాలలో కృత్రిమ మేధపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగల్ ప్రాక్టీషనర్ సిద్దేశ్వర్రావు, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకుడు వెంకటరమణ, టీఎస్కేసీ మెంటర్ ఎండీ.తౌసిఫ్, ఇంగ్లిష్ విభాగం అధ్యక్షుడు వైవిఆర్.ప్రసన్నకుమార్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహారించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – మెషిన్ లెర్నింగ్ నిత్యజీవితంలో వీటి ప్రాధాన్యత, పనితీరును వివరించారు. హెల్త్కేర్లో వ్యాధుల గుర్తింపునకు, వ్యవసాయంలో దిగుబడిని పెంచేందుకు ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో వివరించే నమూనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డి.మునిస్వామి, అధ్యాపకులు జె.నాగరాజు, వెల్దండి శ్రీధర్, ఎన్.కోటయ్య, ఎ.మల్లేశం, లెఫ్టినెంట్ సుధాకర్, అనిల్ బొజ్జ, జ్యోత్స్న, ఎం.శ్రీనివాస్రెడ్డి, బోధనేతర సిబ్బంది, విద్యారులు తదితరులు పాల్గొన్నారు. -
2,815 క్వింటాళ్ల విత్తనాలు కావాలి
ఫ ప్రభుత్వానికి విత్తనాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు ఫ నెలాఖరు నాటికి అందుబాటులోకి విత్తనాలు నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్కు అవసరమైన వరి, పెసర, జీలుగ, జనుము విత్తనాలను రైతులకు అందించటానికి నందిపాడ్ విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 2,815 క్వింటాళ్ల వరి, పెసర, జీలుగ, జనుము విత్తనాల అవసరం ఉంటాయని అంచనా వేసి ప్రభుత్వానికి పంపింది. రైతులకు అవసరమైన వరి విత్తనాలను నెలాఖరు నాటికి అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 12,02,051 ఎకరాల్లో వరి, పత్తితో పాటు వివిద పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకు అవసరమైన వరి జేజీఎల్ 27356 రకం 133 క్వింటాళ్లు, ఎంటీయు 1010 రకం 983.75 క్వింటాళ్లు, కేఎన్ఎం 118 రకం 879 క్వింటాళ్లు, జేజీఎల్ 24423 రకం 369.50 క్వింటాళ్లు, బీపీటీ 5204 రకం 246 క్వింటాళ్లు, పెసర ఎంజీజీ 385 రకం 34 క్వింటాళ్లు, జీలుగ 114.60 క్వింటాళ్లు, జనుము 51.20 క్వింటాళ్లు అవసరంగా గుర్తించింది. జీలు, జనుము 50 శాతం సబ్సిడీపై.. జీలుగ, జనుము విత్తనాలు 50 శాతం సబ్సిడీపై రైతులకు అందించనున్నారు. వరి, పెసర విత్తనాలపై ఎలాంటి సబ్సిడీ ఉండదు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన పత్తి విత్తనాలు సుమారు 16 లక్షల ప్యాకెట్లు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. పత్తితో పాటు ఇతర హైబ్రీడ్ వరి విత్తనాలు కూడా ప్రైవేట్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేసే విత్తనాలను త్వరలో ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా సంస్థల్లో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. వానాకాలం సాగు అంచనా ఇలా.. పంట ఎకరాల్లో పత్తి 5,13,524 వరి 5,86,137 కంది 14,000 సజ్జ 200 జొన్న 500 మొక్కజొన్న 500 ఆముదం 500 పెసర 7,000 వేరుశెనగ 5,000 -
ఈత సరదా.. కారాదు ప్రమాదం
ఎండల నుంచి ఉపశమయం పొందేందుకు నల్లగొండలోని పానగల్లు ఉదయ సముద్రం తాగునీటి రిజర్వాయర్లో పెద్దలు, యువకులు, చిన్నారులు సైతం ఈతలు కొడుతున్నారు. కొందరు సెల్ఫీలు, రీల్స్ కోసం రిజర్వాయర్ మధ్య వరకు వెళ్లి ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నారు. రిజర్వాయర్ వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రిజర్వాయర్లో లోతైన ప్రాంతాలపై అవగాహన లేకుండా ఈతకు దిగడం ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
అలైన్మెంట్ను మార్చాలి
త్రిబుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలి. లేకుండా నిర్వాసితులకు భూమి కింద భూమి ఇవ్వాలి. లేదా మార్కెట్ ధరకు ఐదు రెట్లు పరిహారం చెల్లించాలి. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. మా ప్రాంతానికి ఇప్పటికే డ్రాగన్ లాంటి త్రిబుల్ఆర్ అలైన్మెంట్ ఉండగా గ్రీన్ఫీల్డ్ హైవే, రైల్వే లైన్తో ఇక్కడి భూములు గద్ద వచ్చి కోడి పిల్లకు గురి పెట్టినట్లుగా ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేదటే అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతాం. – జిల్లా కిశోర్, రైతు, రాజాపేటతండా -
ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి
మర్రిగూడ : ప్రతి శుక్రవారం డ్రై డేగా నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, మర్రిగూడ వైద్యులతో కలిసి మర్రిగూడలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమలను కట్టడి చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్లు రాహుల్, దీప, కృష్ణకుమారి, నగేష్, దీపక్, శాలిని, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉంటాం
నల్లగొండ : అర్హుల ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, సర్ విషయంలో అప్రమత్తతతో వ్యవహరిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్ బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అంశాలపై ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్లో మంత్రి కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. నల్లగొండ, భువనగిరి లోక్సభల్లో చేపట్టే ఓటర్ల జాబితా సవరణకు పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని అందుకు బూత్ లెవల్ కమిటీ బాధ్యతలు తీసుకోవాలన్నారు. అకారణంగా తొలగింపునకు గురైన ఓటర్లకు తిరిగి అప్పీల్ చేసుకోవడం, దరఖాస్తు చేసుకునేందుకు మూడు నెలల సమయం ఇచ్చేలా ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేలా కాంగ్రెస్ తరఫున తెలియజేయాలన్నారు. నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల్లో 20, 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న వారికి ఇవ్వాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేసిన ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ కోసం కష్టపడే వాళ్లకే పదవులు ఇస్తామని, అర్హులైన వారి పేర్లు మీరే ఇవ్వండి అని సూచించారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారని, మంత్రి ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డితో కలిసి సమాలోచనలు చేసి జాబితా ఇస్తామని తెలిపారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి
మిర్యాలగూడ : కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని మిల్లర్లు జాప్యం చేయకుండా దిగుమతి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం మిర్యాలగూడలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శరత్చంద్రపవార్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడింగ్ చేయాలని, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. రోజూ కనీసం 400 లారీల ధాన్యం మిల్లుల్లో దించేలా చూడాలన్నారు. ధాన్యం అన్లోడింగ్ అయిన వెంటనే ట్రక్ షీట్లను తీసుకెళ్లాలని తెలిపారు. రైస్ మిల్లులు, లారీ ట్యాగింగ్ సమస్యలు ఉంటే అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. మిర్యాలగూడ లారీ అసోసియేషన్ అదనంగా 50 లారీలను అందుబాటులో ఉంచాలని, ధాన్యం తరలింపు పూర్తయ్యే వరకు సహకరించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేష్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, పౌరసరసరఫరాల డీఎం రాంపతినాయక్, తహసీల్దార్ శ్రీనివాస్, మిల్లర్లు గౌరు శ్రీనివాస్, బాబి, నవీన్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఐస్ తయారీ యూనిట్లలో తనిఖీ
నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని ఐస్ తయారీ యూనిట్లను జిల్లా ఆహార భద్రత అధికారి ఎన్.శివశంకర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూనిట్లలో పరిశుభ్రత, శానిటరీ, ఆహార భద్రత ప్రమాణాలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఐస్ను నేరుగా ఆహార పదార్థంగా ఉపయోగించకపోయినా, చేపలు, పండ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉంటుందని, ఆహార భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రకాశం బజార్లోని ఒక చికెన్ సెంటర్ నుంచి ఒక ఫంక్షన్ హాల్కు ఎలాంటి పత్రాలు లేకుండా ఆటోలో తరలిస్తున్న సుమారు 200 కిలోల చికెన్ను అధికారులు తనిఖీ చేసి నిర్వాహకులకు అవగాహన కల్పించి వదిలివేశారు. -
జనగణనలో అందరూ పాల్గొనాలి : ఎస్పీ
నల్లగొండ : జనగణన – 2027లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఎన్యుమరేటర్ల వద్ద వివరాలను నమోదు చేయించుకుని మాట్లాడారు. ప్రజలు ఎన్యూమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు కీలక ఆధారమని, భవిష్యత్ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. జనగణన పేరుతో మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లు ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా, ఏటీఎం వివరాలు, ఓటీపీలు అడగరని తెలిపారు. అలాంటి వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు ఉస్మాన్, మల్లిక్ ఉన్నారు. -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలుఐబ్రోస్(త్రెడింగ్), వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : 16–05–2026 నుంచి 21–05–2026 వరకు సమయం : ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం.వరకు రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/– వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుండి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకుతన్విక బ్యూటీపార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్, రోడ్ నెం.1బి, వీటి కాలనీ, నల్లగొండ. సంప్రదించవలసిన ఫోన్ : 8341151413, 9666013544రిజిస్ట్రేషన్ మరియు శిక్షణా స్థలం వివరాలుఫ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయి -
యాసంగి సన్నాలకు
నల్లగొండ అగ్రికల్చర్, పెద్దవూర : యాసంగిలో సన్నాలు సాగు చేసి ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. కేవలం వానాకాలం కొనుగోలు చేసిన సన్నాలకే పరిమితం చేసింది. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2024–25 వానాకాలం నుంచి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ ఆ నిర్ణయం కేవలం వానాకాలం సాగుకే అమలవుతోంది. గత యాసంగి బోనస్ ఇవ్వలేదు. ఈ యాసంగిలో అసలు బోనస్పై ఎలాంటా ప్రకటనా చేయలేదు. మరోవైపు ఈ వానాకాలం నుంచి తాము సూచించిన 8 రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తోంది. దీంతో రైతులు ఏ రకాలు సాగు చేయాలోనని గందరగోళం చెందుతున్నారు. రూ.10.97 కోట్లు పెండింగ్ 2024–25 వానాకాలం సీజన్లో రైతుల నుంచి 74,393 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వారందరికి కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ను కూడా విడుదల చేసింది. ఆ సీజన్లో రూ.37.20 కోట్లను రైతులకు బోనస్ కింద జమ చేసింది. కానీ 2024–25 యాసంగి సీజన్లో రైతులు పండించిన సన్నాలు 21,939 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసింది. బోనస్ కింద రూ.10.97 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ఇంత వరకు విడుదల చేయలేదు. ఈ యాసంగిలో బోనస్ ఊసే లేదు.. 2025–26 వానాకాలం సీజన్లో ప్రభుత్వం 1,48,812 మెట్రిక్ టన్నుల సన్న దాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. కానీ.. యాసంగి సీజన్ బోనస్ను విడుదల చేయని ప్రభుత్వం 2025–26 సీజన్కు సంబంధించిన వానాకాలం బోనస్ కింద రూ.74.41 కోట్లను విడుదల చేయడం విశేషం. తిరిగి 2025–26 యాసంగి సీజన్ కూడా ముగిసి ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నా.. గత యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్పై నోరు మొదపడం లేదు. అసలు యాసంగి సీజన్కు బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే 2024–25, 2025–26 యాసంగి సీజన్లకు సంబంధించిన బోనస్ను ఖాతాల్లో జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాము చెప్పిన రకాలే సాగు చేయాలి.. వానాకాలంలో సాగు చేసే వరి సన్నాల్లో తాము సూచించే ఎనిమిది రకాలనే సాగు చేయండి.. బోనస్ పొందండి అంటూ వ్యవసాయశాఖ ప్రచారం చేపట్టింది. సన్నాల్లో ఎన్నో రకాలు ఉండగా కేవలం ఎనిమిది రకాలనే ప్రమోషన్ చేస్తూ ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. గడిచి రెండు వానాకాలం సీజన్లలో సన్నాల్లో ఏ రకం సాగు చేసి విక్రయించినా ప్రభుత్వం బోనస్ను అందించింది. 2026 వానాకాలం సీజన్కు సంబంధించి మాత్రం 8 రకాలనే వ్యవసాయ శాఖ ప్రమోషన్ చేయాలని నిర్ణయించడం.. రైతులను అయోమయానికి గురి చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం సూచించిన 8 రకాలనే సాగు చేయాలంటే విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయా అనే అనుమానం నెలకొంది. ఫ ఏడాది గడిచినా రైతులకు అందని పోత్సాహకం ఫ వానాకాలం సన్నాలకే బోనస్ ఇస్తున్న ప్రభుత్వం ఫ యాసంగిలో సన్నాలు సాగు చేసినా ప్రయోజనం లేదంటున్న రైతులు ఫ 8 రకాలకే బోనస్ ఇస్తామంటూ ఇప్పుడు వ్యవసాయ శాఖ ప్రచారంఈ ఫొటోలోని రైతు మాడ్గులపల్లి మండల కేంద్రానికి చెందిన పుల్లెంల యాదగిరి. ఈ రైతు గత యాసంగిలో 16 ఎకరాల్లో పండిన 437 క్వింటాళ్ల సన్నరకం ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో అమ్మాడు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పడంతో తనకు మద్దతు ధరతోపాటు రూ.2,18,500 వస్తాయని లెక్కలు వేసుకున్నాడు. కానీ ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. గత వానాకాలంలో ఐకేపీలో సన్న ధాన్యం అమ్మిన బోనస్ వచ్చింది. దీంతో ఈ యాసంగి సీజన్లో కూడా 318 క్వింటాళ్ల సన్న ధాన్యం ఐకేపీలో విక్రయించాడు. ఈ యాసంగిలోనైనా ప్రభుత్వం బోనస్ ఇస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నాడు. సన్నాల్లో ఎన్నో రకాలు ఉండగా రోగాల బారిన పడని, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సూచించిన రకాల్లో కొన్నింటికి దిగుబడి ఆశించినంతగా రాదని రైతులు చెబుతున్నారు. అలాగే రోగాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం సూచించే 8 రకాల కంటే ఎంతో నాణ్యమైన విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సన్న రకాలకు బోనస్ అనే హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, అంతేకాని తాము సూచించిన రకాలకే బోనస్ వర్తిస్తుందనే ప్రకటనను ఉపసంహరించుకోవాలని రైతులు కోరుతున్నారు. వానాకాలం సాగుకు అవసరమైన వరి విత్తనం సేకరణలో బిజీగా ఉన్న రైతులకు వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రచారం అయోమయంలోకి నెట్టిందని, దీనిపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఎంజీయూలో ఏఐపై అవగాహన
నల్లగొండ టూటౌన్ : విద్యా వారోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం ఆర్ట్స్ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ‘ఆర్టిఫిపియల్ ఇంటెలిజెన్స్ పర్ ఎవ్రి వన్’ అనే అంశంపై హైదరాబాద్కు చెందిన ఏఐ నిపుణుడు డాక్టర్ కళ్యాణ్ సర్వేపల్లి.. ప్రొపెసర్లకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఏఐ సాంకేతికత, మిషన్ లెర్నింగ్.. విద్యా రంగంలో, ఇంజనీరింగ్ విద్యలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు జరుగుతాయని, విద్యార్థులు వీటిని గమనించి లోతైన అవగాహన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అంజిరెడ్డి ప్రిన్సిపాల్ ఆర్.రేఖ, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, ప్రొఫెసర్లు హరీష్కుమార్, జయంతి, సంధ్యారాణి, సుధారాణి, అధాపకులు పాల్గొన్నారు. వర్షపు నీటిని సంరక్షించాలికనగల్ : వర్షపు నీటిని సంరక్షించాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి కోరారు. జల సంచాయ్ – జన్ భాగిదారి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కనగల్ గ్రామంలో ఆయన నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆవ వేదరక్షిత, ఎంపీఓ సతీష్కుమార్, సర్పంచ్ నర్సింగ్ మురళిగౌడ్, ఉప సర్పంచ్ చంద్రయ్య, ఏపీఓ సుధాకర్, కార్యదర్శి వీరబాబు, మాజీ సర్పంచ్ చిట్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ‘ఇక్కత్’ను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం భూదాన్పోచంపల్లి : ఇక్కత్ చేనేత కళను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభించినందుకు ఎంతో గర్వంగా ఉందని మిస్ ఏషియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్బంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్యాషన్షోలో పాల్గొనేందుకు శుక్రవారం ఆమె ఫ్యారీస్కు బయలుదేరి వెళ్తూ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. 200 సంవత్సరాల తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో రెడ్ కార్పెట్పై నడవబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, మగ్గంపై ఎంతో శ్రమకోర్చి కళాత్మక ఇక్కత్ వస్త్రాలను రూపొందించిన పోచంపల్లి నేతన్నలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. -
జంతు హింసకు పాల్పడొద్దు
నల్లగొండ : జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జంతు హింస నివారణ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జంతువుల రవాణా విషయంలో నిబంధనలు పాటించాలని, ఒకే వాహనంలో అధిక సంఖ్యలో జంతువులను తరలించవద్దని చెప్పారు. పశు వైద్యాధికారి సర్టిఫికెట్ లేకుండా జంతువులను తరలించడం నేరమన్నారు. రవాణా వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలని, ట్రాన్స్పోర్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండి జంతువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. మున్సిపాలిటీల్లో జంతువులకు ఆశ్రయం కల్పించే విధంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై తిరిగే పశువులను గోశాలకు తరలించాలని సూచించారు. వీధి కుక్కల నియంత్రణ కోసం త్వరలో కుక్కల దత్తత కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, పశు సంవర్ధక అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ముంచుతున్న కాంగ్రెస్
కొండమల్లేపల్లి : ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొండమల్లేపల్లిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. పంట వేశాక యూరియా ఇవ్వకుండా, ఇప్పుడు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. సుమారు గంట పాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ -
ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలి
నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రభుత్వం ప్రాధామ్య పథకాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్లి ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా పెండింగ్ ఉన్న కేంద్రాలను సందర్శించి కారణాలను విశ్లేషించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు నూటికి నూరు శాతం గ్రౌండింగ్ చేయాలని, గ్రౌండింగ్ కాని వాటిని రద్దుచేసి కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ఎల్–3 నుంచి ఎల్–1కు వచ్చే కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగులకు అవకాశం కల్పించాలని, బదిలీల్లో ఎలాంటి సమస్యలకు అవకాశం ఇవ్వకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
పెంచిన ధరలు తగ్గించాలి..
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. ఈ పెంపు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది. నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా. బండి మీద వెళ్లాలి. వచ్చిన జీతంలో అధిక శాతం పెట్రోల్కే ఖర్చయితే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పునరాలోచించాలి. – మాదవి, ప్రైవేట్ ఉద్యోగి, నల్లగొండ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత ఽపెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ఇప్పటికే ధరలు పెరిగి వ్యాపారాలు లేవు, కుటుంబం గడవడం కష్టమవుతోంది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. దాంతో మళ్లీ ధరలు పెరుగుతాయి. దీనివల్ల వ్యాపారంలో నష్టపోతాం. ప్రభుత్వం ధరలు తగ్గించాలి. – ముర్తూజా, పండ్ల వ్యాపారి, నల్లగొండ -
సామాన్యుడిపై పెట్రో పిడుగు
ఫ లీటర్ పెట్రోల్పై రూ.3.40, డీజిల్పై రూ.3.27 పెంపు ఫ నిరసన తెలిపిన రాజకీయ పక్షాలునల్లగొండ : సామాన్యుడిపై పెట్రో బాంబు పేలింది. కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. ఇప్పటికే గ్యాస్ ధరల పెరుగుదల, కొరతతో హోటళ్లు, చిన్న వ్యాపారాలు మూతపడుతున్న తరుణంలో.. తాజా పెంపు ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు’ తయారైంది. రూ.3 పైనే పెంపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సాకుతో కేంద్రం ఇంధన ధరలను సవరించింది. పెట్రోల్పై లీటరుకు రూ.3.40, డీజిల్పై లీటరుకు రూ.3.27 పెంచింది. డీ జిల్ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై నేరుగా పడనుంది. ఫలితంగా నిత్యావసరాలైన బియ్యం, ప ప్పులు, నూనె ధరలు పెరగనున్నాయి. కూరగాయలు, రవాణా ఖర్చులు పెరగడంతో సా మాన్యుడిపై భారం పడనుంది. స్టీల్, సిమెంట్ ధరలు పెరిగి సామాన్యుడి సొంతింటి కల మరింత దూరం కానుంది. జిల్లాపై ప్రభావం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 240 పెట్రోల్ బంకులు ఉన్నాయి. నిత్యం వేల లీటర్ల ఇంధన విక్రయాలు జరిగే ఈ జిల్లాలో, తాజా పెంపు వల్ల ప్రజలపై ప్రతి నెలా కోట్లాది రూపాయల అదనపు భారం పడనుంది. ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం తప్పనిసరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో, మధ్యతరగతి జీవి బడ్జెట్ తలకిందులవుతోంది. వెల్లువెత్తుతున్న నిరసనలు పెరిగిన ధరలకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసన సెగలు మొదలయ్యాయి. నల్లగొండ పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఆటోకు తాడు కట్టి లాగుతూ పెట్రో ధరల పెంపుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫ్రీ బస్తో మహిళలు ఆటోలు ఎక్కడం లేదు. నల్లగొండ నుంచి చర్లపల్లి, ఎస్ఎల్బీసీ, పానగల్ వెళ్లేవారు కూడా బస్లు ఎక్కుతున్నారు. వృద్ధులు, నడవలేని వారు మాత్రమే ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ దరలు పెంచింది. దీంతో మా బతుకులు బస్టాండ్ పాలు కానున్నాయి. – గాలయ్య, ఆటో డ్రైవర్, నల్లగొండ -
బోరుబావిలో పడ్డ చిన్నారి.. రక్షించబోయి తాత మృతి
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడగా.. రక్షించేందుకు వెళ్లి అతని తాత మృత్యువాత పడ్డాడు. శనివారం ఉదయం యాదగిరిపల్లిలో జరిగిందీ ఘటన.. శనివారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఉన్న మామిడి చెట్టుకు నీరు పెట్టేందుకు మనువడు, మనవరాలుతో వెంకన్న(50) వెళ్లాడు. మనవడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. అది గమనించిన తాత వెంకన్న రక్షించేందుకు ప్రయత్నించగా.. బోరు అంచులో ఉన్న మట్టి కుంగిపోయి అదే గుంతలో తలకిందులుగా పడిపోయాడు. వెంటనే మనవరాలు స్థానికులను అప్రమత్తం చేసింది. దీంతో తాళ్ల సాయంతో సైదులు అనే యువకుడు లోపలికి దిగి వాళ్లను బయటకు తీశాడు. ఈలోపు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే బోరుబావి గుంతలో ఊపిరి ఆడక వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే వెంకన్న కన్నుమూశాడు. చిన్నారి పరిస్థితి బాగానే ఉందని.. ప్రస్తుతం చికిత్స అందుతుందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మద్దతు ధర పెంపును సవరించాలి
సూర్యాపేట అర్బన్: కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఏమాత్రం ప్రయోజన కరంగా లేవని, వాటిని సవరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి. కోటేశ్వరరావు కోరారు. సూర్యాపేట పట్టణంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు పి. లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మద్దతు ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేవని అన్నారు. ముఖ్యంగా వరికి 72 రూపాయలు ప్రకటించడం సరైంది కాదన్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ఎరువులు, వ్యవసాయ పనిముట్లపై పెద్ద ఎత్తున పెంచుతూ పంటలకు తక్కువ ధరలు ప్రకటించడం అంటే వ్యవసాయ రంగాన్ని మరింత దివాలా తీయించడం తప్ప మరొకటి కాదన్నారు. వరికి 2,441 అంటే 3.93శాతం, పత్తి6.2శాతం, మొక్కజొన్న 06శాతం పెరిగిందని అదే ఎరువులకు 18.50శాతం, వ్యవసాయ పనిముట్లకు 25శాతం రేట్లు పెంచిందన్నారు. ఈ విధంగా పెట్టుబడులకు పెద్ద ఎత్తున పెంచడం, మద్దతు ధరలు అతి తక్కువ పెంచడం సరైనది కాదన్నారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా నాయకులు కాకి మోహన్ రెడ్డి, అహ్మద్ హుస్సేన్, అలుగుబెల్లి వెంకటరెడ్డి , కోట మధుసూదన్ రెడ్డి, మేకల కనకారావు, పి. నాగన్న పాల్గొన్నారు. -
పాడి రైతులకు భరోసా
సాక్షి, యాదాద్రి: కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నల్లగొండ – రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘానికి (నార్ముల్– మదర్ డెయిరీ) ఎట్టకేలకు ఊరట లభించింది. తక్షణ సాయంగా రూ.27కోట్ల చెక్కును ఎన్డీడీబీ అందజేసింది. ఇందులో రూ. 10 కోట్లతో బుధవారం ఆరు నెలల పెండింగ్ పాల బిల్లులు చెల్లించనున్నారు. మంగళవారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నార్ముల్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, డైరెక్టర్ల సమక్షంలో మదర్డెయిరీ, ఎండీఎన్డీడీబీ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక.. క్రమం తప్పకుండా బిల్లులు ఒప్పందం ప్రకారం నార్ముల్ పాలసేకరణ చేస్తుంది. ఎన్డీడీబీ, ఢిల్లీ మదర్ డెయిరీలు పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ చేస్తాయి. నార్ముల్ –మదర్డెయిరీ రోజూ లక్ష లీటర్లకుపైగా పాల సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు ప్రతి 15 రోజులకోసారి బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు. నార్ముల్ కొనుగోలు చేసి ఇచ్చే ప్రతి లీటరు పాలకు ఎన్డీడీబీ రూ.6.50 కమీషన్ చెల్లిస్తుంది. ఈ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు చెల్లించడంతో పాటు మెయింటెనెన్స్ చేస్తారు. పాడి రైతుల బిల్లులు చెల్లించేందుకు రూ. 10 కోట్ల చెక్కు, అప్పు చెల్లించేందుకు రూ.17 కోట్ల చెక్కుతో కలిపి మొత్తం రూ. 27 కోట్లు నార్ముల్– మదర్ డెయిరీకి ఎన్డీడీబీ అందజేసింది. ముందుగా ఆరు నెలల పెండింగ్ పాల బిల్లులను బుధవారం చెల్లిస్తారు. అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద ఉన్న నార్ముల్–మదర్ డెయిరీ భూమి 29.37 ఎకరాలను ఎన్డీడీబీ కొనుగోలు చేసి రూ. 40 కోట్లు చెల్లిస్తుంది. మరో రూ.28 కోట్లు సాఫ్ట్లోన్ ఇస్తుంది. ఫ నార్ముల్ – ఎన్డీడీబీ మధ్య కుదిరిన ఒప్పందం ఫ రూ. 27 కోట్లు విడుదల ఫ పాడి రైతులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు -
ఫీజు చెల్లిస్తే.. ప్లాట్ ఓకే!
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ పట్టణాల్లో అనుమతి తీసుకోకుండా చేసిన వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ కోసం చేసుకున్న దరఖాస్తులు 42,681 పెండింగ్లో ఉన్నాయి. గతంలోనూ ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇచ్చినా చాలా మంది దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. ప్రస్తుతం మరోసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మే, జూన్ నెలల్లో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. పెండింగ్లో భారీగా దరఖాస్తులు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెయ్యి రూపాయలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్లను మాత్రమే ప్రస్తుతం ఎల్ఆర్ఎస్కు అనుమతి ఇచ్చారు. నల్లగొండ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ కోసం మొత్తం 74,254 మంది దరఖాస్తులు చేసుకోగా.. 31,033 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ చేయించుకున్నారు. ఇంకా 42,681 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోతే భారం ఎక్కువే.. అనుమతి లేని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోతే ఇల్లు కట్టుకునే వారికి భారీగా ఖర్చు కానుంది. మున్సిపాలిటీల్లో అనుమతులు తీసుకోవాలంటే ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న మార్కెట్ ప్రకారం 14 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ కింద అయితే ప్లాట్ కొన్నప్పుడు డాక్యుమెంట్పై ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే ధర ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం అయితే ఉదాహరణకు 200 గజాలు ఉంటే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఇంటి అనుమతుల కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే భూముల విలువ పెంచే అవకాశం ఉన్నందున ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోతే ఫీజు మరింత పెరిగే అకాశం ఉంటుంది. చాలా మంది తాము ప్లాట్లు అమ్ముకునే వాళ్లం గనుక ఎల్ఆర్ఎస్ ఎందుకులే అనే దోరణిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారైనా పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ చేయించుకుంటారో లేదో వేచి చూడాలి. మున్సిపాలిటీలు దరఖాస్తులు క్రమబద్ధీకరణ పెండింగ్ నల్లగొండ 36,827 24,554 11,733 మిర్యాలగూడ 14,339 3,117 11,222 హాలియా 4,300 1,200 3,100 దేవరకొండ 5,043 423 4,620 చండూరు 3,400 1,100 2,300 చిట్యాల 3,265 208 3,057 నకిరేకల్ 7,080 431 6,649 మొత్తం 74,254 31,033 42,681 ఫ ఎల్ఆర్ఎస్కు మరోసారి అవకాశమిచ్చిన ప్రభుత్వం ఫ జూన్ 30 వరకు గడువు ఫ పెండింగ్ దరఖాస్తులు 42,681 -
మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు : కలెక్టర్
మిర్యాలగూడ : కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, మిల్లర్లు ప్రైవేట్ ధాన్యానికి ప్రాధాన్యం ఇచ్చి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బి.చంద్రశేఖర్ హెచ్చరించారు. మంగళవారం ఆయన ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి మిర్యాలగూడలోని వాగ్దేవి, మహేశ్వరి రైస్ మిల్లులను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం వచ్చిన ధాన్యం లారీని 12గంటల్లోపు దిగుమతి చేసి తిరిగి కేంద్రాలకు పంపించాలని, అవసరమైతే ఎక్కువ మంది హమాలీలను నియమించుకోవాలన్నారు. డిండి, అవంతీపురం ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహేశ్వరి రైస్ మిల్లుల్లో రైతు వద్ద డబ్బులు తీసుకున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో సంబంధిత రికార్డులను పరిశీలించిన కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని మాడుగులపల్లి తహసీల్దార్ను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 4.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా 2.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో ఉందని తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా దించుకోవాలని, అన్లోడింగ్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాంపతి నాయక్, డీఎస్ఓ వెంకటేశం, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
పాలిసెట్కు అంతా సిద్ధం
నల్లగొండ : పాలిసెట్– 2026 పరీక్షకు అన్ని ఏర్పాటు చేసానట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. ఆయన నల్లగొండలో మంగళవారం తన చాంబర్లో ఆయా శాఖల అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. పాలిసెట్కు జిల్లాలో మొత్తం 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు 5810 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అడిషనల్ ఎస్పీ రమేష్ను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో బీఎన్ఎస్ 163వ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా కో–ఆర్డినేటర్ సిహెచ్ నరసింహారావు, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, ట్రాన్స్కో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించంరామగిరి(నల్లగొండ) : పాలిసెట్ ప్రవేశపరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్.నర్సింహారావు తెలిపారు. మంగళవారం ఆయన నల్లగొండలో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరుగుతుందని నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరని తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్లో ప్రవేశాలునల్లగొండ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ (రామంతపూర్, బేగంపేట)లో 2026–27 విద్యా సంవత్సరంలో 1వ తరగతి డే స్కాలర్స్లో గిరిజన విద్యార్థుల ప్రవేశాలకు ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా దరఖాస్తులు తీసుకుని, ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అదే కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అర్హత, ఎంపిక విధానం, పూర్తి వివరాలకు 9515181080 ఫోన్ నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తులునల్లగొండ : తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులకు నిర్వహించనున్న ఉచిత కంప్యూటర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉర్దూ అకాడమీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జి సయ్యద్ యూసుఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే విధానం, అర్హత, ఎంపిక తదితర పూర్తి వివరాల కోసం నల్లగొండలోని ఉర్దూ అకాడమీ ట్రైనింగ్ సెంటర్, లేదా 7989314572 ఫోన్ నంబర్ను స్పంప్రదించాలని సూచించారు. ‘సమ్మెకు ప్రభుత్వం దిగివచ్చింది’నల్లగొండ టౌన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వం దిగివచ్చి పలు డిమాండ్లను అంగీకరించిందని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఈదురు వెంకన్న అన్నారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, ఆరు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న సమ్మె ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి చర్చలకు పిలిచి 32 డిమాండ్లను అంగీకరించిందని తెలిపారు. ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలను కొనసాగించుకోవడానికి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. సమావేశంలో ఎస్.బాబు , జమాల్, డి.గోపాల్, పాటి అప్పారావు, కేఎస్.రెడ్డి, మనోహర్, బాసాని వెంకటయ్య, పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో కదలిక
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై జిల్లా యంత్రాంగం కదిలింది. ధాన్యంతో వెళ్లిన లారీలు మిల్లుల వద్ద రోజుల తరబడి దిగుమతి కావడం లేదు. దీంతో కల్లాల వద్ద లారీల కొరత ఏర్పడటంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరోవైపు అటు నిర్వాహకులు, హమాలీలు, రైతుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ, డబ్బులు ఇస్తేనే తూకం వేసే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై ‘సాక్షి’ ‘అడుగడుగునా అడ్డంకులు, ఆదేశాలు బేఖాతరు’, ‘లారీలు రావు.. ధాన్యం కదలదు’, ‘డబ్బులిస్తేనే లోడింగ్’ శీర్షికలతో వరుస కథనాలను ప్రచురించింది. దీంతో జిల్లా యంత్రాంగం కదిలింది. రవాణాలో అలసత్వం వహించిన నలుగురు లారీ కాంట్రాక్టర్లకు జరిమానా విధించింది. మరోవైపు మిల్లుల వద్ద ధాన్యం దిగుమతులపై కఠిన చర్యలు చేపట్టేలా రంగంలోకి దిగింది. మిల్లుల్లో కలెక్టర్, ఎస్పీ తనిఖీలు ఈసారి ధాన్యం కొనుగోళ్లలో ప్రధాన సమస్య రవాణా, ధాన్యం దిగుమతి చేసుకోవడమే. దిగుమతుల విషయంలో మిల్లర్లు తాలు పేర కిరికిరి పెడుతూ, వారు సొంతంగా కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకుంటూ ప్రభుత్వ కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని రోజుల తరబడి దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. దీనిపై కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పౌరసరఫరాల విభాగం అధికారులు మంగళవారం మిర్యాలగూడ వెళ్లి మిల్లుల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మిల్లర్లు వారు కొనుగోలు చేసే ధాన్యాన్ని ఆపి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ముందుగా దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. వచ్చిన లారీని వచ్చినట్లుగా దిగుమతి చేసుకోవాలని సూచించారు. ప్రతి మిల్లు వద్ద ప్రత్యేక అధికారి, పోలీస్ ఇబ్బందిని పెట్టి లారీలు రాగానే దిగుమతి చేసుకునేలా చూడాలని, ఏవైనా ఇబ్బందులు అయితే పైఅధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో మిల్లర్లు జాప్యం చేస్తే కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. అధిక సంఖ్యలో లారీల దిగుమతి కలెక్టర్, ఎస్పీలు రంగంలోకి దిగి మిల్లు పరిశీలనకు వెళ్లడంతో ఒక్క రోజే మిల్లుల వద్ద లారీల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం దిగుమతి అయింది. మంగళవారం సాయంత్రం వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి దిగుమతులను పర్యవేక్షించారు. ఒక్కరోజు దాదాపు ఏడు వందల లారీలు దిగుమతి చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో వందకుపైగా లారీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్ అయినట్లు తెలిపారు. దిగుమతి అయిన లారీలు వెంటనే ధాన్యం ఎక్కువగా ఉన్న కేంద్రాలకు పంపాలని పౌరసరఫరాల విభాగం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కొనుగోళ్లలో పెరగనున్న వేగం నెల రోజులుగా ధాన్యం అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిల్లర్ల సహకారం లేక అన్నిచోట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రస్తుతం సమస్యను పరిష్కరించేలా కలెక్టర్, ఎస్పీ క్షేత్రస్థాయికి వెళ్లడంతో కొనుగోళ్లలో మరింత వేగం పెరిగే అవకాశం ఉంది. ఫ ధాన్యం దిగుమతులపై రంగంలోకి దిగిన కలెక్టర్, ఎస్పీ ఫ మిర్యాలగూడలో తనిఖీలు ఫ ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి, పోలీసు సిబ్బంది నియామకం ఫ ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని ఆదేశాలు ‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం -
జీజీహెచ్లో నర్సుల దినోత్సవం
నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో (జీజీహెచ్) మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సులు అందించే సేవలను విస్త్రతం చేసి రోగుల ప్రాణాలు కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఆర్ఎంఓ చంద్రశేఖర్, నర్సింగ్ సూపరింటెండెంట్లు నీలాబాయి, సుజాత, రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా ఇళ్ల లెక్క
నల్లగొండ : జనగణన–2027 మొదటి దశ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి గృహ గణనకు శ్రీకారం చుట్టారు. జూన్ 9 వరకు నెల రోజుల పాటు సాగే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లు జిల్లాలోని ప్రతి గడపను తట్టనున్నారు. గృహ గణనతో పాటు నివాస వసతులు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను సేకరించనున్నారు. కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, గణన తీరును పరిశీలించారు. పకడ్బందీగా యంత్రాంగం ఏర్పాట్లు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఇళ్ల గణన సజావుగా సాగేందుకు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 3,117 మంది ఎన్యుమరేటర్లను, వారికి మార్గనిర్దేశం చేసేందుకు 531 మంది సూపర్వైజర్లను నియమించారు. ఎన్యుమరేటర్లు తొలి మూడు రోజులు తమకు కేటాయించిన పరిధిలోని ఇంటి నంబర్లను సరిచూసుకోవడం, సరిహద్దులను గుర్తించడం వంటి పనులు పూర్తి చేస్తారు. ఇళ్లకు స్టిక్కర్లు వేస్తూ అక్కడ రోడ్డు, బావి, బడి ఉందా అన్నింటిని పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని భవనాలతో పాటు నీటి ట్యాంకులను కూడా మ్యాపింగ్ చేస్తారు. నాలుగో రోజు నుంచి మొబైల్ యాప్ ద్వారా అసలైన డేటా సేకరణ ప్రారంభమవుతుంది. 34 రకాల వివరాలతో యాప్ ద్వారా చేయనున్నారు. వలసలు.. ఇతర ప్రాంతాల్లో నమోదుపై స్పష్టత జిల్లాలో నివసిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల వివరాల నమోదుపై అధికారులు కీలక వివరణ ఇచ్చారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నమోదు చేసుకున్నా, తుది గణాంకాల ప్రకారం వారి వివరాలు సొంత జిల్లాల ఖాతాలోకే చేరుతాయి. అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన వారు ఉపాధి, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాల్లో ఉండి అక్కడ వివరాలు నమోదు చేసినా, అవి జిల్లా జనాభా లెక్కల్లోకే వస్తాయని అధికారులు తెలిపారు. రామగిరి(నల్లగొండ) : జనగణనలో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు, జిల్లా ఇన్చార్జి హోబాలాల్ అన్నారు. సెన్సెస్ తొలిదశలో భాగంగా గృహగణనను సోమవారం నల్లగొండ మండలం గుండ్లపల్లిలో వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వీయ గణన చేసుకున్న వారు ఐడీని ఎన్యూమరేటర్లకు తెలియజేసి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రూరల్ ఆఫీసర్ కె.పరశురామ్, ఎంపీ.యాకుబ్నాయక్, శేఖర్రెడ్డి, చారి, వంగూరి రమేష్ పాల్గొన్నారు. ఫ పూర్తి వివరాలు సేకరించనున్న ఎన్యుమరేటర్లు -
‘హ్యామ్’లో రోడ్లు అభివృద్ధి
మిర్యాలగూడ : మిర్యాలగూడ డివిజన్లోని రోడ్లకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) రహదారుల ప్రాజెక్టు మొదటి దశలో మిర్యాలగూడ ఆర్ అండ్ బీ డివిజన్లో 12 రహదారులను ఎంపిక చేశారు. రూ.616 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ విధానంలో ప్రాజెక్టు వ్యయంలో కాంట్రాక్టర్ 60 శాతం, ప్రభుత్వం 40 శాతం నిధులు భరించి నిర్మిస్తారు. నిర్మాణం పూర్తి చేసిన తర్వాత వాయిదాల్లో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తుంది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రారంభించింది. టెండర్ ప్రక్రియ పూర్తయిందని అప్రూవల్ వచ్చిన వెంటనే పనులను ప్రారంభించేలా చూస్తామని ఆర్అండ్బీ ఈఈ రాజేందర్ తెలిపారు. ఎంపిక చేసినవి రోడ్లు ఇవే.. ● ముకుందాపురం తుమ్మడం మీదుగా అడవిదేవులపల్లికి వెళ్లే రహదారి 21 కిలోమీటర్లు. ● నాగార్జునసాగర్ పీడబ్ల్యూడీ రహదారి నుంచి రాజవరం మీదుగా అల్వాల ఎక్స్ రోడ్డు వరకు 14.22 కిలోమీటర్లు. ● పడమటపల్లి పీడబ్ల్యూడీ రహదారి నుంచి శ్రీశైలం రహదారి వరకు 18.43 కిలోమీటర్లు. ● మాడుగుల పీడబ్ల్యూడీ రహదారి నుంచి సాగర్ పీడబ్ల్యూడీ రహదారి వరకు 9.30 కిలోమీటర్లు. ● డిండి– దేవరకొండ రహదారి నుంచి బాపనకుంట మీదుగా గోనబోయినపల్లి వరకు 16 కిలోమీటర్లు. ● కొత్తపల్లి అజ్మాపూర్ రహదారి (ధర్మాతండా మీదుగా) 7 కిలోమీటర్లు. ● బొత్తలపాలెం రాగడప రహదారి (కల్లేపల్లి, తిమ్మాపురం, శాంతినగర్, నర్సాపూర్, రాజాగట్టు, పుట్టలగడ్డ మీదుగా) 25.65 కి.మీ. ● డిండి – దేవరకొండ రహదారి 34 కిలోమీటర్లు. ● డిండి – దేవరకొండ రహదారి నుంచి కంబాలపల్లి 30.90కిలోమీటర్లు. ● మహబూబ్నగర్ నల్లగొండ రహదారి (మల్లేపల్లి నుంచి ధర్వేశిపురం వరకు) 8 కిలోమీటర్లు. ● మిర్యాలగూడ – తడకమళ్ల రహదారి 15.43 కి. ● ముకుందాపురం, తుమ్మడం, అడవిదేవులపల్లి (నారమ్మగూడెం మీదుగా) 8.46కిలోమీటర్లు. ఫ మిర్యాలగూడ డివిజన్లో12 రహదారుల గుర్తింపు ఫ రూ.616 కోట్లతో టెండర్లు పూర్తి -
రూ.100 కోట్లతో చెర్వుగట్టు అభివృద్ధి
నార్కట్పల్లి : చెర్వుగట్టు ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యుల చేత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా వారాల రమేష్ను పాలకమండలి సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెర్వుగట్టు ఆయల ప్రాముఖ్యతను సీఎం రేవంత్రెడ్డికి.. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలసి వివరించిన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి ప్రత్యేక నిధులు మంజూరు చేశారని వివరించారు. ఆలయానికి ఏటా రూ.15 కోట్ల ఆదాయం వస్తోందని, నూతనంగా పదవులు పొందిన పాలకమండల సభ్యులు ఆలయ ప్రాముఖ్యత, చరిత్రను అందరికీ తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ వారాల రమేష్, పాలక మండలి సభ్యులు నల్ల అనిత, రేగట్టె శ్రీనివాస్రెడ్డి, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, ఇడుకుల్ల సంపత్కుమార్, మర్రి లింగస్వామి, కమ్మలపల్లి మల్లేషం, కొమ్ము శ్రీను, మధుల నర్సింహ, రంగ శ్రవణ్కుమార్, పాల మహేష్, వీరెల్లి రఘునాథ్, గద్దగూటి యాదయ్య, గౌరిదేవి లక్ష్మయ్య, ఎక్స్ అఫీషియో సభ్యులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, ఆలయ ఈఓ మోహన్, సర్పంచ్లు నేతగాని కృష్ణ, ఏల్లెందుల లింగస్వామి, జేరిపోతుల భారత్, వెంకట్రెడ్డి, కొంపెల్లి సైదులు, పున్నపురాజు యాదగిరి, రేగట్టె రాజశేఖర్రెడ్డి, నల్ల వెంకన్న, సట్టు సత్తయ్య, సిద్దగోని స్వామి, పాశం శ్రీనివాస్రెడ్డి, సామ నరేందర్రెడ్డి, గడ్డం పశుపతి, గోలి సాగర్రెడ్డి, మట్టిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా అధికారులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో 86 దరఖాస్తులు రాగా రెవెన్యూ శాఖకు 46, ఇతర శాఖలకు సంబంధించినవి 40 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి మంజూరు చేసే ఇళ్లకు గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన తర్వాత లాగిన్కు పంపించాలని చెప్పారు. జనగణనలో భాగంగా సోమవారం నుండి నిర్వహించనున్న ఇళ్ల లెక్కింపును, విద్యా వారోత్సవాలను మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. జూన్ 2 నిర్వహించనున్న రాష్ట్రావతరణ వేడుకకు అన్ని శాఖలు ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కింద చేపట్టిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించాలన్నారు. జూన్ 1 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై సిబ్బందికి శిక్షణ సిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలి
నల్లగొండ : నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘జల సంచాయ్ – జన్ భాగిదారి’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని సోమవారం ఆయన కలెక్టరేట్లో మేయర్ బుర్రి చైతన్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. జల సంరక్షణపై ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలలో ఈ విషయమై అవగాహన కల్పించేందుకు ప్రచార వాహనం జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరుగుతుందన్నారు. తెలంగాణ సాంస్క్రతిక సారధి కళాకారుల ద్వారా నీటి సంరక్షణ, నీటి పొదుపు, నీటి వనరులను ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటి వనరులను సంరక్షించుకోవాలని, సూచించారు. మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇల్లు నిర్మించుకునే వారిరు తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకునేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పున్న జ్ఞానేశ్వరి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
దారి కోసమంటూ ఇచ్చేసిన నీటిపారుదల శాఖ
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గిరికబావిగూడెం వద్ద ఎస్ఎల్బీసీ కాలువ నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూమి కబ్జాకు గురైంది. హైదరాబాద్–మునుగోడు బైపాస్ రోడ్డును ఆనుకొని ఇటీవల కొత్త కొత్త వెంచర్లు పుట్టగొడుగొల్లా పుట్టుకొస్తున్నాయి. వెంచర్లలోకి ప్రవేశించేందుకు దారిలేకపోవడంతో కాలువ భూమిని ఆక్రమించి అక్రమంగా రోడ్లు ఏర్పాటు చేశారు. ఓ వైపు ఆక్రమణకు గురైన ఎన్ఎపీ, ఎస్ఎల్బీసీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. కానీ నల్లగొండలో రియల్టర్లు మాత్రం ఎస్ఎల్బీసీ భూములను ఆక్రమించి వెంచర్లలోకి 30 ఫీట్ల వెడల్పుతో మూడు చోట్ల నుంచి రోడ్లు వేయడమేగాక, భూములకు నలువైపులా ఇనుపకంచెలు నిర్మించి ఆక్రమిస్తున్నారు. రూ.వందల కోట్లతో ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో రూ.కోట్ల విలువైన భూమిని రియల్టర్లు కబ్జా చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. బైపాస్తో భూముల ధరలకు రెక్కలు నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు గిరకబాయిగూడెం నుంచి లతీఫ్సాహెబ్ గుట్ట వెనుక భాగం నుంచి మునుగోడు రోడ్డుకు వెళ్లే దారిలో ఎస్ఎల్బీసీ ప్రధాన కాల్వ ఉంది. ఆ కాల్వ తవ్వే సమయంలో ఇరిగేషన్ శాఖ కాల్వ వెంట అప్పట్లో భూమిని సేకరించింది. ఆ భూమి పక్కనుంచి ప్రస్తుతం బైపాస్ రోడ్డు వస్తుండటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే కాల్వ వెంట ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమి చుట్టుపక్కల భారీ ఎత్తున ఒక ప్రైవేట్ వెంచర్ వెలిసింది. దానికి దారులు లేవు. దీంతో అధికారులను ప్రసన్నం చేసుకోవడంతో వారు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండన్నట్లుగా వదిలేశారు. ఇక్కడ ఆ ఎస్ఎల్బీసీ స్థలానికి కూడా కడీలు పెట్టి పెన్సింగ్ కూడా రియల్టర్లే వేయడంతో ఆ భూమి కూడా ప్రైవేట్ భూమి అన్న తీరులో అక్కడ దర్శనమిస్తోంది. బండ్లదారి కాదే.. సాధారణంగా ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరించినప్పుడు దాని వెనుక ఉండే వ్యవసాయ భూములకు మాత్రమే ఎడ్ల బండ్లు వెళ్లేలా దారి ఇస్తారు. అదీ రైతులు వెళ్లి వచ్చేందుకు ఒకచోట మాత్రమే ఇస్తారు. కానీ ఇక్కడ మూడు చోట్ల పెద్ద రోడ్లు వేశారు. అయినా నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోలేదంటే దాని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వం ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు పెట్టి పెన్సింగ్ వేసి, కాపాడాలని చెబుతుంటే నల్లగొండలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఏకంగా వెంచర్దారులకు భూమిని అప్పగించేశారు. ప్రభుత్వ భూమే కదా అని 30 ఫీట్ల వెడల్పు చొప్పున మూడు రోడ్లు వేసుకున్నారు. సగం వరకు సీసీ వేసుకుని మిగతా మట్టి రోడ్డు వేశారు. ఆ వెంచర్కు మూడుదారులు వేసి పెద్దగేట్లు పెట్టేసరికి దీంతో చూడటానికి మంచి లుక్ వచ్చింది. దీంతో కొనుగోలుదారులను ఆకర్షించేలా వెంచర్ తయారైంది. ఇలా ప్రభుత్వ భూమిలో నుంచి రోడ్లు వేసుకుని కష్టమర్లను ఆకర్షించి ప్లాట్లు అమ్మేందుకు అధికారులు సహకరించారు. ఈ తతంగంలో భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సంబంధిత డీఈని అడిగితే వారికి దారి లేదు ఎలా వెళతారని సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వెంచర్దారులకు అలా ఇవ్వవచ్చా అని అడుగ్గా వెంటనే దాన్ని తీసివేస్తామని సంబంధిత అధికారులు చెప్పడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నల్లగొండ ఫ భూసేకరణ సమయంలో వ్యవసాయ బండ్ల బాటకు ఇచ్చేలా ఒప్పందం ఫ అంతకు మించి రెండు మూడు చోట్ల రోడ్డు వేస్తున్నా పట్టించుకోని యంత్రాంగం ఫ నల్లగొండ సమీపంలో ఆక్రమణకు గురవుతున్న ఎస్ఎల్బీసీ స్థలం -
పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా
కేతేపల్లి : బక్రీద్ పండగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చెక్పోస్టులతో నిఘా పెంచామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులో గల టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్టును సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ తీరును పరిశీలించి అక్కడ విధుల నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. కంటైనర్లు, లోడ్ వాహనాలు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా పశువులను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పశువులను రవాణా చేసే వ్యక్తులు తప్పనిసరిగా అనుమతి పత్రాలు, కొనుగోలు రశీదులు, వెటర్నరీ ధ్రువపత్రాలు తమ వెంట ఉంచుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డుకోవటం, గొడవలకు దిగటం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నకిరేకల్ సీఐ హరిబాబు, కేతేపల్లి, శాలిగౌరారం ఎస్ఐలు సతీష్, సైదులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. వినతులు స్వీకరించిన ఎస్పీ వాటిని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
బండి సంజయ్ రాజీనామా చేయాలి
దేవరకొండ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు నమోదై మూడు రోజులవుతున్నా నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఎం రేవంత్రెడ్డి పోలీసులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో వల్లపురెడ్డి, టీవీఎన్ రెడ్డి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
13న పాలిసెట్
రామగిరి(నల్లగొండ) : పాలిసెట్ – 2026 ప్రవేశపరీక్ష 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్.నర్సింహారావు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో 13, నాగార్జునసాగర్ 2 సెంటర్లు కేటాయించినట్లు తెలిపారు. పరీక్షకు మొత్తం 5,310 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. 11 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట హెచ్బి పెన్సిల్, బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలని సూచించారు. మ్యాపింగ్ ప్రక్రియ 90 శాతం పూర్తి చేయాలినల్లగొండ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా 90 శాతం పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మ్యాపింగ్ ప్రక్రియలో వెనుకబడిపోయిన మండలాలపై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలిగా కాసోజు శంకరమ్మమోత్కూరు : మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి కాసోజు శంకరమ్మ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మితో పాటు ఏడుగురు సభ్యులను నియమించారు. ఏడుగురు సభ్యులలో కాసోజు శంకరమ్మ ఒకరు. నైపుణ్యాలతో మెరుగైన ఉపాధినల్లగొండ టూటౌన్ : నైపుణ్యాలతో మెరుగైన ఉపాధి అవకాశాలు సాధించవచ్చని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఇన్నోక్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఎంపికై న 20 మంది టీచర్లకు ఆయన నియామకపత్రాలు అందజేసి మాట్లాడారు. 20 మంది వివిధ పాఠశాలల్లో అధ్యాపకులుగా అర్హత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ హరీష్కుమార్, కొప్పుల అంజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఇన్నో క్యూటర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నీటి ప్రవాహానికి బండరాళ్లు అడ్డు
నాగార్జునసాగర్ : లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నిర్వహణపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వలో పేరుకుపోయిన బండరాళ్లు నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ సామర్థ్యం ప్రకారం ప్రవహించాల్సిన నీటికి, వాస్తవ ప్రవాహానికి పొంతన ఉండటం లేదని చెబుతున్నారు. కాల్వలో 11 లక్షల క్యూసెక్కులు ప్రవహించాల్సి ఉండగా, పూడిక, రాళ్ల వల్ల అది 9 నుంచి 10 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. అయితే, ఎడమ కాల్వ వద్ద ఉన్న గేజీ మీటర్ మాత్రం 13 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని చూపిస్తుండడం గమనార్హం. కూలుతున్న దరులు.. పెరిగిన అడ్డంకులు కాల్వకు ఇరువైపులా ఉన్న రాతి దరులు వర్షాలకు నానుతుండటంతో అప్పుడప్పుడు కాల్వలోకి కూలిపోతున్నాయి. పదేళ్ల క్రితం వాటిని తొలగించారు. కానీ కాల్వ దరులను మాత్రం లైనింగ్ చేయలేదు. దరులపై చెట్లు పెరిగి, వాటి వేర్లు బలంగా పాకడంతో రాళ్లు వదులై నీటిలో పడుతున్నాయి. చిన్న రాళ్లు ప్రవాహానికి కొట్టుకుపోయి బొయ్యారం (టన్నెల్) లోకి చేరుతుండగా, పెద్ద బండరాళ్లు మాత్రం కాల్వలోనే ఉండిపోయి నీటి వేగాన్ని తగ్గిస్తున్నాయి. జలాశయం లోపల ఉన్న అప్రోచ్ కెనాల్లో పడిన రాళ్లను ఇప్పటి వరకు తొలగించకపోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనం. చేపల వేట కోసం కొందరు ఉపయోగిస్తున్న నాటు బాంబుల వల్ల కూడా ఈ రాతి దరులు బీటలు వారి నీటిలో పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాళ్లు తొలగించేందుకు ఇదే తగిన సమయం ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం తగ్గింది. అప్రోచ్ ఛానల్ మొత్తం బయటపడటంతో, అందులో పేరుకుపోయిన బండరాళ్లను తొలగించడానికి ఇదే సరైన సమయమని రైతులు సూచిస్తున్నారు. తూము ముందు భాగంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తేనే నీటి సరఫరా సజావుగా సాగుతుంది. మరమ్మతులకు నిధులిస్తేనే.. కాల్వ దరులు పటిష్టంగా ఉండాలంటే ‘షార్ట్క్రీటింగ్’ పద్ధతిని చేపట్టాలని రిటైర్డ్ ఇంజనీర్లు సూచిస్తున్నారు. సన్నని ఇనుప జాలీని అమర్చి సిమెంట్తో లైనింగ్ చేయడం వల్ల దరులు కూలకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల దరులపై చెట్లు మొలిచే అవకాశం కూడా ఉండదు. పెద్ద బండలకు డ్రిల్లింగ్ చేసి ఇనుప రాడ్లను అమర్చడం ద్వారా శాశ్వత పరిష్కారం చూపవచ్చు. ప్రభుత్వం స్పందించి, కాల్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఆయకట్టు రైతాంగం డిమాండ్ చేస్తోంది. ఫ ఎడమకాల్వ అప్రోస్ కెనాల్, తూము వద్ద కూలుతున్న దరులు ఫ ఏళ్లు గడుస్తున్నా తొలగించని అధికారులు ఫ లైనింగ్ చేయాలని రైతుల డిమాండ్ -
గ్యాస్ కోసం రోడ్డెక్కిన లబ్ధిదారులు
తిప్పర్తి : మండల కేంద్రంలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్లను అక్రమంగా అమ్ముకుంటున్నారని పలువురు లబ్ధిదారులు ఆదివారం మండల కేంద్రంలోని నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బుకింగ్ చేసుకున్న వారికి గ్యాస్ ఇవ్వకుండానే డెలివరీ అయినట్లు మెసెజ్ వస్తోందని ఆరోపించారు. సిలిండర్లను బ్లాక్లో అమ్ముకుంటున్న గ్యాస్ ఏజెన్సీపై తగు చర్యలు తీసుకొని బుకింగ్ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
3,99,593 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.954.63 కోట్ల విలువ చేసే 3,99,593 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6,59,596 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని కొనుగోలు చేసిన ధాన్యంలో 3,97,616 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, రూ.644 కోట్ల విలువచేసే 2,69,730 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేశామని వెల్లడించారు. ధాన్యం అమ్మిన 30,167 మంది రైతులకు రూ.558.94 కోట్లు చెల్లించామని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై రోజూ క్షేత్రస్థాయిలో కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తున్నామని తెలిపారు. ఎంజీయూలో నేటి నుంచి విద్యా వారోత్సవాలు నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో సోమవారం నుంచి తెలంగాణ విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మెగా టీచర్ ప్లేస్మెంట్ డ్రైవ్, రెండవ రోజు జాతీయ విద్యా ప్రణాళిక – 2020 అమలుపై చర్చ, మూడవరోజు డిగ్రీ టీచర్లకు సిలబస్ రివ్యూ, కొత్త డిగ్రీ కోర్సులపై ఓరియంటేషన్, 4వ రోజు బీఈడీ టీచర్లకు సిలబస్ రివ్యూ, మూల్యాంకనంపై ఓరియంటేషన్, 5వ రోజు ఇంజనీరింగ్ టీచర్లకు కత్రిమ మేధ వినియోగం శిక్షణ, 6వ రోజు నాన్ టీచింగ్ ఉద్యోగులకు కత్రిమ మేధ వినియోగంపై ఓరియంటేషన్, 7వ రోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మెరుగైన విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలిసూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యాలయాల్లో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం ద్వారా సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు విద్య, వైద్యం ఉచితంగా అందించవచ్చని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన డీటీఎఫ్ ఐదవ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మాట్లాడుతూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయకుండా ప్రభుత్వం సుప్రీం కోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం సరికాదన్నారు. మొత్తంగా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొచ్చెర్ల వేణు, బీవీ రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.పున్నయ్య పాల్గొన్నారు. -
దళితుల ఆత్మీయ బంధువు.. సీఎం రేవంత్రెడ్డి
నల్లగొండ : దళితుల ఆత్మీయ బందువు సీఎం రేవంత్రెడ్డి అని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని యాదవ సంఘ భవనంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్లో ఐదు మంత్రి పదవులు దళితులకు దక్కాయన్నారు. ఎస్సీ వర్గీకరణతో అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం రేవంత్రెడ్డికి దక్కిందన్నారు. దళితులను వంచించిన కేసీఆర్ను బీఆర్ఎస్ను ప్రజలు జన్మలో నమ్మరన్నారు. కాంగ్రెస్ సంస్థాగత ఇన్చార్జి మందుల సూర్యకిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్కు అండగా నిలిచేది దళితులే అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తో సాధ్యమన్నారు. సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బోడ స్వామి, బీసీ సెల్ చైర్మన్ జిల్లా పల్లి పరమేష్,, కుర్పటి గణేష్, వేముల గోపి, పెరిక అంజయ్య, పుల్లెంల సందీప్, చింతపల్లి బాలకృష్ణ, సంజయ్, వినోద్, చిరుమర్తి ఉపేందర్, పెరిక హరిప్రసాద్, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ గణనకు స్పందన కరువు
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన (సెన్సస్) ప్రక్రియలో భాగంగా.. ఈసారి వినూత్నంగా ప్రవేశపెట్టిన ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ (స్వీయ గణన)కు జిల్లాలో ఆశించిన స్పందన లభించలేదు. ఏప్రిల్ 26 నుంచి ఈ నెల 10 వరకు గడువు ఇచ్చినప్పటికీ, ప్రజల నుంచి స్పందన కరువైంది. కలెక్టర్ చంద్రశేఖర్ పదేపదే అవగాహన కల్పించినప్పటికీ, జిల్లాలోని 5 లక్షల పైచిలుకు కుటుంబాలలో కేవలం 17,161 కుటుంబాలు మాత్రమే స్వీయ గణన చేసుకున్నాయి. విద్యావంతులు కూడా దీనిపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. స్వీయ గణన చేసుకున్న వారు, ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు ఆ వివరాలు చూపిస్తే సరిపోయేది. గడువు ముగియడంతో ఇకపై ఎన్యుమరేటర్ల ద్వారానే వివరాలు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. రెండు దశలో జనగణన జనగణనను ఈసారి రెండు దశలుగా విభజించారు. మొదటి దశలో ఇళ్ల గుర్తింపు, రెండో దశలో జనాభా గణన జరగనుంది. ఈ క్రమంలో, నేటి నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటి సర్వేను ప్రారంభించనున్నారు. జూన్ 9 వరకు మొదటి దశలో భాగంగా ఇళ్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలోని 33 మండలాలు, 8 మున్సిపాలిటీల్లో ఈ సర్వే ముమ్మరంగా సాగనుంది. వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరిలో రెండో దశ కింద పూర్తిస్థాయి జనాభా లెక్కింపు చేపట్టనున్నారు. సిబ్బంది నియామకం జనగణన కోసం జిల్లావ్యాప్తంగా 3,117 మంది ఎన్యుమరేటర్లను, వారికి మార్గనిర్దేశం చేసేందుకు 531 మంది సూపర్వైజర్లను నియమించారు. ప్రతి ఎన్యుమరేటర్ 150 నుంచి 300 ఇళ్లను (సుమారు 700 మంది జనాభా) కవర్ చేయాల్సి ఉంటుంది. వీరికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసి.. జనగణన కిట్లను అందజేశారు. తొలిసారి డిజిటల్ పద్ధతిలో.. ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు.ఎన్యుమరేటర్లు తమ స్మార్ట్ఫోన్లలోని ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట ‘ఆఫ్లైన్’లో వివరాలు సేకరించి, తర్వా త సర్వర్లో అప్లోడ్ చేసే సౌకర్యం కల్పించారు. జిల్లాలో 16,18,416 మంది జనాభా ఇటీవలి సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 16,18,416 మంది జనాభా ఉన్నట్లు అంచనా. ఈ సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని 2027 జనగణన కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి తమ ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించి, సరైన వివరాలు అందించాలని అధికారులు కోరుతున్నారు. ఫ వివరాలు నమోదు చేసింది 17,161 కుటుంబాలే.. ఫ ముగిసిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ గడువు ఫ నేటి నుంచి గృహాల గుర్తింపు -
ఇంటి నంబర్లపై కసరత్తు..
నల్లగొండ టూటౌన్ : నీలగిరి కార్పొరేషన్ పరిధిలో డాక్యుమెంట్ లేని స్థలాల్లో నివాసాలకు ఇంటి నంబర్ల సమస్య పరిష్కారం కోసం కసరత్తు జరుగుతోంది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో కలెక్టర్ చంద్రశేఖర్.. పానగల్, నంద్యాల నర్సింహ్మారెడ్డి కాలనీల్లో పర్యటించి ఇంటి నంబర్లు లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఏడు విలీన గ్రామ పంచాయతీలు, వాటి ఆవాస గ్రామాలు, పానగల్, నంద్యాల నర్సింహ్మారెడ్డి కాలనీ, ఏఆర్నగర్, వెంకటరమణ కాలనీ, న్యూ సూర్యవంశీ కాలనీ గుట్ట, పాతబస్తీ ప్రాంతం, మాన్యంచల్క, హైదర్ఖాన్గూడ, సుందరయ్య కాలనీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న నివాస స్థలాలు, ఇండ్లకు పూర్వం నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేవు. గ్రామ కంఠం భూమలు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఇక్కడి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కొందరికి ఇంటి నంబర్లు ఉండగా, మరి కొందరికి లేవు. దాంతో ఇంటికి సంబంధించిన గుర్తింపు పత్రం అవసరమైనప్పుడు సమస్య వస్తోంది. 9 వేలకు పైగా ఇళ్లు నీలగిరి నగరంలోని ఆయా ప్రాంతాల్లో పూర్వం నుంచి నివాసం ఉంటూ డాక్యుమెంట్లు లేని ఇండ్లు 9,645 ఉన్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఈ ఇళ్లలో కొన్నింటికి ఇంటి నంబర్లు లేని కారణంగా కార్పొరేషన్కు ఆస్తి పన్ను రావడం లేదు. డాక్యుమెంట్స్ లేని కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ కింద ఇంటి నంబర్లు ఇవ్వాల్సి వస్తోంది. దాంతో సంబంధిత ఇంటి యజమానులు తమ పేరు లేకుండా ఇంటి నంబర్లు ఇస్తే తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కలెక్టర్ ఆయా కాలనీల్లో పర్యటించిన సందర్భంలో ఇంటి నంబర్లు లేని ఇళ్లు, డాక్యుమెంట్ లేకపోవడం, కొంతమందివి రాసుకున్న పాత కాగితాలు, తాతల పేరు మీద ఉన్న ఇళ్లకు ప్రభుత్వం పట్టా ఇస్తే విక్రయించివి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకున్నవి, అసలు విలీన గ్రామాల్లో రికార్డుల్లో కూడా ఇంటి నంబర్లు లేని లాంటి సమస్యలు గుర్తించారు. ఇక్కడ గుర్తించిన సమస్యలపై కలెక్టర్ నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఏళ్ల నుంచి వస్తున్న ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుంతో లేదో వేచి చూడాల్సిందే. ఫ నీలగిరి కార్పొరేషన్లో ఇళ్ల వివరాలు ఆరా తీసిన కలెక్టర్ ఫ డాక్యుమెంట్ లేని ఇళ్లకు సంబంధించి పలు సమస్యల గుర్తింపు ఫ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కలెక్టర్ సొంతిల్లు ఉన్నా.. దానిపై వారికి ఎలాంటి హక్కు పత్రం లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. డాక్యుమెంట్ లేని కారణంగా ఆస్తి పన్ను కూడా రెండింతలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు కొత్తగా నిర్మించాలన్నా, బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకుందామన్నా డాక్యుమెంట్ కావాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకుందామన్నా డాక్యుమెంట్ లేని కారణంగా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో డాక్యుమెంట్ లేనివి కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడలేదు. ఇంతటి జఠిలమైన సమస్యకు పరి ష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.


