breaking news
Nalgonda
-
అడ్డంకులు వచ్చినా ఆగేది లేదు..
చిట్యాల: వినాయకచవితికి హైదరాబాద్ నుంచి భారీ గణపతి విగ్రహాలను పెద్దఎత్తున వాహనాల్లో మండపాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ శివారులోని రైల్వే అండర్పాస్ ఎత్తు తక్కువగా ఉండడంతో వాహనాల్లో భారీ విగ్రహాలను తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అండర్పాస్ అవతలివైపే వాహనాల్లో నుంచి విగ్రహాలను క్రేన్ సహాయంతో కిందకు దించి చక్రాలతో ట్రాలీలో విగ్రహాలను ఉంచి తాళ్ల సహాయంతో అండర్పాస్ కింద నుంచి ఇవతలి వైపు లాక్కొస్తున్నారు. అనంతరం క్రేన్ సహాయంతో మరలా విగ్రహాన్ని వాహనాల్లోకి ఎక్కించి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పలు విగ్రహాలు అండర్పాస్ బ్రిడ్జికి తగిలి ధ్వంసమవుతున్నాయి. అంతేకాకుండా విగ్రహాలను అండర్పాస్ కింద నుంచి తరలించే సమయంలో హైవేపై వచ్చే వాహనాలు ఆగిపోతుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్రేన్తో విగ్రహాన్ని వాహనంలోకి ఎక్కిస్తున్న యువకులు అండర్పాస్ నుంచి బయటకు వచ్చిన భారీ గణనాథుడు అండర్పాస్ కింది నుంచి విగ్రహాన్ని లాగుతున్న యువకులు -
వరిలో కొత్త రకం కలుపు మొక్కలు
చిలుకూరు: ఈ ఏడాది వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేసిన రైతులకు కలుపు మొక్కలు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో వివిధ రకాల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. ఏ మందులు పిచికారీ చేసినా కలుపు మొక్కలు చనిపోయే పరిస్థితి లేదు. వరి విత్తనాలు వెదజల్లిన 15 నుంచి 20 రోజుల వ్యవధిలో రైతులు ఒకసారి కలుపు మందులు పిచికారీ చేశారు. అయినా కలుపు మొక్కలు చనిపోలేదు. మరోసారి పిచికారీ చేసినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని రైతులు చెబుతున్నారు. గతంలో లేని విధంగా ఈసారి కొత్త రకం కలుపు మొక్కలు పుట్టుకొస్తున్నాయని రైతులు అంటున్నారు. కొత్త రకం కలుపుతో తంటాలు వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరి పొలాలను ప్రారంభంలో ఆరబెట్టడం, నీళ్లు పెట్టడం చేయడం వలన సాధారణంగానే కలుపు మొక్కలు మొలకెత్తుతాయి. గతంలో తుంగ, వంజ, నక్కలతోకల గడ్డి, దారక లాంటి కలుపు మొక్కలు కనిపించగా.. మొదటి 20 రోజుల్లో మందులు పిచికారీ చేయడం వల్లన వాటిని నివారించేవారు. ఈ ఏడాది కొత్తగా నకిలి వరి, గోధుమ రంగులో వంజ, ఎర్ర, తెల్ల వంజలు మొలకెత్తాయని రైతులు వాపోతున్నారు. ఇవి ఏ మందులు కొట్టినా చనిపోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వంజ రకం కలుపు విపరీతంగా పెరిగి అసలు వరి పైరు కనబడటం లేదని రైతులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక చిలుకూరులో కొంతమంది రైతులు 30 నుంచి 35 రోజుల క్రితం వెదల్లే పద్ధతిలో సాగు చేసిన పొలాలను ట్రాక్టర్తో దున్ని మళ్లీ నాట్లు వేస్తున్నారు. దీని వల్లన రైతులు ఒక్కో ఎకరానికి రూ. 20వేలకు పైగా నష్ట్రపోతున్నారు. చిలుకూరు నుండి దూదియాతండా రోడ్డులో చాలా మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. చిలుకూరు మండల వ్యాప్తంగా 70 శాతం మంది రైతులు ఈ ఏడాడి వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేశారు. ఇప్పటికై నా వ్యవసాయాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాను. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మొదటి 20 రోజులకు కలుపు మందులు పిచికారీ చేశా. అయినా అవి చనిపోలేదు. మళ్లీ వెంటనే రెండోసారి కూడా కలుపు మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు. పొలంలో విపరీతంగా కొత్త రకం వంజ పుట్టింది. పొలం మొత్తం కమ్మేసింది. ఏమి చేయాలో అర్ధంకాక పొలం మొత్తం మళ్లీ దమ్ము చేసి నాట్లు వేస్తున్నా. – గుండు శ్రీను, కౌలు రైతు, చిలుకూరు ఫ పొలం చెడగొట్టి మళ్లీ దమ్ము చేస్తున్న రైతులు ఫ వ్యవసాయాధికారులు సూచనలు ఇవ్వాలని కోరుతున్న అన్నదాతలు -
జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
మునగాల: మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి చెందిన పోలంపల్లి సురేష్గౌడ్, సుజాత దంపతుల కుమారుడు వసంత్గౌడ్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. వసంత్గౌడ్ నల్లగొండ జిల్లా పెదవూర మండలం చలకుర్తి గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఏపీలోని ఏలూరులో జరిగిన అండర్–14 హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాసమితి క్రికెట్ సెలక్షన్స్లో వసంత్గౌడ్ పాల్గొని 15రోజుల రీజినల్ క్రికెట్ శిబిరానికి ఎంపికయ్యాడు. ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ నెల చివరి వారంలో హర్యానా రాష్ట్రంలో జరగనున్న నవోదయ క్రీడా సమితి జాతీయ స్థాయి అండర్–14 క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. తన తండ్రి సురేష్గౌడ్, కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ సిద్ధిక్ ప్రోత్సాహం, ఎస్వీఎస్ పాఠశాల, నల్లగొండ యాజమాన్యం సహకారంతో జాతీయ స్థాయికి ఎంపికై నట్లు వసంత్గౌడ్ పేర్కొన్నాడు. వసంత్గౌడ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలంపల్లి సుధాకర్గౌడ్ ఆకాంక్షించారు.ఎంజీయూలో అధ్యాపకులకు శిక్షణనల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అధ్యాపకుల నైపుణ్యాలను పెంపొందించేందుకు గురువారం యూనివర్సిటీలో ఇన్ల్పిప్ నెట్ సంస్థ ప్రతినిధి అర్షద్ఖాన్ శిక్షణ ఇచ్చారు. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంపై ఆన్లైన్ కోర్సులు రూపొందించుట, విద్యా సంబంధిత విషయాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచే విధానాలు, పరిశోధనలు, వాటి ప్రచురణలు తదితర అంశాలపై ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పించారు. ఇన్ల్పిప్ నెట్లో విశ్వవాప్తంగా జరిగే అధునాతన పరిశోధనలు అందుబాటులోకి రావడం వలన అధ్యాపకులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ విద్యార్థులకు బోధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, మిర్యాల రమేష్, శ్వేత, శ్రీలక్ష్మి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.వాగులో కొట్టుకుపోయి రైతు మృతినిడమనూరు: పొలానికి వెళ్తూ వాగులో కొట్టుకుపోయి రైతు మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరేపల్లి గ్రామానికి చెందిన ఆవుల రాంమూర్తి(55) మంగళవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్తూ మార్గమధ్యలో హాలియా వాగులో కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతడి ఆచూకీ కోసం గాలిస్తుండగా.. గురువారం వాగు వెంట చెట్ల పొదల్లో రాంమూర్తి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.గుండెపోటుతో జూనియర్ అసిస్టెంట్ మృతిగరిడేపల్లి: గరిడేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ జియావుద్దీన్(55) గురువారం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మృతిచెందారు. ఆయన స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి కాగా.. అక్కడి నుంచి ఆయన బదిలీపై గరిడేపల్లికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ గత మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. జియావుద్దీన్ మృతి పట్ల పాఠశాల సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. -
యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం
నకిరేకల్: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. నకిరేకల్లోని తాటికల్ పీఏసీఎస్ వద్ద గురువారం ఉదయం యూరియా కోసం బారులుదీరిన రైతుల వద్దకు ఆయన చేరుకుని.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ.. రైతులు చంటిపిల్లలతో వచ్చి యూరియా కోసం క్యూ కడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీ కాళ్లు మొక్కి అయినా రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. లేందటే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, పీఎసీఎస్ మాజీ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, నాయకులు పెండెం సదానందం, గొర్ల వీరయ్య, సామ శ్రీనివాస్రెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, పల్లె విజయ్, దైద పరమేశం తదితరులు ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
మిర్యాలగూడలో రామ్రాజ్ కాటన్ షోరూం ప్రారంభం
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో రామ్రాజ్ కాటన్ షోరూమ్ను గురువారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన సతీమణి మాధవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామ్రాజ్ కాటన్ దుస్తులను దేశంలోని రాజకీయ నాయకులతో పాటు ప్రముఖ వ్యక్తులు ఎక్కువగా ఆదరిస్తున్నారని అన్నారు. దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తెల్లటి దుస్తుల అమ్మకాల్లో రామ్రాజ్ కాటన్ పేరుగాంచిందన్నారు. కంపెనీ ప్రతినిధులు సరసమైన ధరలకు దుస్తులు అందించేలా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో బిల్డింగ్ ఓనర్ రాము, రామ్రాజ్ కాటన్ షోరూం ఫౌండర్, ఛైర్మన్ కేఆర్. నాగరాజన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమాదేవిశ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో చేనేత రుణమాఫీ
భూదాన్పోచంపల్లి: లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే వచ్చే నెలలో చేనేత కార్మికుల ఖాతాల్లో చేనేత రుణమాఫీ డబ్బులు జమవుతాయని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. భూదాన్పోచంపల్లిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాస్టర్ వీవర్, నేషనల్ మెరిట్ అవార్డు గ్రహీత తడక రమేశ్ ఏర్పాటుచేసిన పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ షోరూంను వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్కుమార్తో కలిసి గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చేనేత రుణమాఫీ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, కొన్ని జిల్లాల్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల తీర్మానాలు పూర్తి కాలేదన్నారు. జిల్లాల వారీగా వచ్చిన బ్యాంకర్ల తీర్మానాలు రాష్ట్రస్థాయిలో పూర్తిచేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు. త్రిఫ్ట్ పథకంలో కొత్త పేర్లు మార్పులు, చేర్పులతో కాస్త ఆలస్యమైందని, జూన్ నెలకు సంబంధించి రూ.7 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెస్కో కొనుగోలు చేసిన పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కులో నెల రోజుల్లో నేచురల్ డై యూనిట్ను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. పర్యావరణహితమైన నేచురల్ డై విధానం అందుబాటులోకి వస్తే పోచంపల్లి ఇక్కత్కు మరింత గుర్తింపువస్తుందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఐఐహెచ్టీని పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారని, శిథిలావస్థకు చేరిన హ్యాండ్లూమ్ పార్కును పునర్నిర్మించి వచ్చే రెండేళ్లలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇక్కడే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఐఐహెచ్టీని హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ తెలంగాణలోనే మొదటి పైలెట్ ప్రాజెక్ట్ అని అన్నారు. చేనేత వస్త్రోత్పత్తులు, ఉపాధి, మార్కెటింగ్ అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొడ్యూసర్ కంపెనీలను ప్రోత్సహిస్తోందని అన్నారు. షోరూమ్లో తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్, గద్వాల, సిద్దిపేట గొల్లభామ వస్త్రాలతో పాటు దేశంలో పేరెన్నికగన్న అనేక వస్త్రాల వైరెటీలను అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా డూప్లికేట్ చేనేత వస్త్రాలను అరికట్టేందుకు తెలంగాణ అథెంటిక్ లోగోలను అందజేస్తుందని, ఈ లోగోలను అతికించడం ద్వారా చేనేత వస్త్రాల నాణ్యత, వినియోగదారులకు నమ్మకం పెరిగి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు. 62 మంది అవార్డు గ్రహీతలకు పింఛన్లు మంజూరు.. 65 సంవత్సరాలు దాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.8వేలు పింఛన్ ఇస్తున్నామని, ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి 62 మందికి పింఛన్ మంజూరైందని వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్కుమార్ అన్నారు. అవార్డు గ్రహీతల పిల్లలు హ్యాండ్లూమ్కు సంబంధించి కోర్సులు అభ్యసిస్తే వారికి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు నెలకు రూ.5వేల స్కాలర్షిప్ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అంతేకాక 90శాతం సబ్సిడీతో ఎలక్ట్రానిక్ జకాట్ మిషన్లు, మగ్గాలు, ఆసు యంత్రాలు, హ్యాండ్లూమ్ ఎక్విప్మెంట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రంలో మరో 42 షోరూలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖతతో ఉందని తెలిపారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా 12మంది చేనేత కళాకారులను విదేశాలకు పంపించి అక్కడ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి మార్కెటింగ్ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. కొత్తగా బున్కర్ దీదీ పథకం కింద మహిళా చేనేత కార్మికులకు ముద్ర రుణాలు ఇప్పించడంతో పాటు వారికి నూలు అందించడం, మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. చేనేత కార్మికుల వార్షిక ఆదాయం రూ.10లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణను ఎంపిక చేయగా.. అందులో ఉమ్మడి జిల్లాను ఎంపిక చేశామని త్వరలో ఆ పథకాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. యునెస్కో చేత అంతర్జాతీయ అవార్డు పొందిన పోచంపల్లిలో ఉత్సవాలను నిర్వహించాలని, పోచంపల్లిలో నూలు డిపో ఏర్పాటు చేసి కేంద్రం ఇచ్చే సబ్సిడీని అమలు చేయాలని పోచంపల్లికి చెందిన చేనేత నాయకులు తడక వెంకటేశం తదితరులు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఉత్సవాల డీపీఆర్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్రావు, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐ వెంకట్రెడ్డి, డీఓ రాజేశ్వర్రెడ్డి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ -
స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
రామగిరి(నల్లగొండ) : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని విదేశీ వస్తువులను నిషేధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ వినోద్ హిందుస్తానీ అన్నారు. గురువారం నల్లగొండలోని రామగిరి నుంచి గడియారం సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా, చైనా, టర్కీ మొదలైన విదేశీ వస్తువులను వాడకూడదని, మన దేశ ఉత్పత్తులనే వాడి, దేశ జీడీపీని పెంచి, ఇక్కడి పరిశ్రమలకు దన్నుగా నిలవాలన్నారు. విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, చైనా, టర్కీ వంటి శత్రు దేశాల వస్తువులు, సేవలను బహిష్కరించడం విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకు బదులుగా భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు ఎంతో అవసరం అన్నారు. ప్రతి భారతీయుడు ‘స్వదేశీ సురక్షా ఔర్ స్వావలంబన్ అభియాన్’లో భాగమై, స్వదేశీ ఆచరణతో భారతాన్ని మళ్లీ మహోన్నత దేశంగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పొట్టిపాక నాగరాజు, ఆవుల సంపత్, అమల, లక్ష్మి, శ్రీదేవి, మణికుమార్, హరీష్, బన్నీ, జయంత్, రుత్విక్, లక్ష్మీనివాస్, శ్రీకాంత్, వంశీ పాల్గొన్నారు. -
కొత్తకార్డులకూ సన్నబియ్యం
నల్లగొండ : రేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి కల నెరవేరనుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం అందజేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన వారికి కూడా రేషన్ బియ్యం అందించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కొత్తగా కార్డులు వచ్చిన వారికి ఈ నెల నుంచి రేషన్ బియ్యంతోపాటు ప్రభుత్వ పథకాలు కూడా అందనున్నాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా 65,749 కార్డులు మంజూరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కొత్తగా 65,749 కార్డులను మంజూరు చేసింది. 82,364 మంది పేర్లను కార్డుల్లో కొత్తగా నమోదు చేసింది. తొలుత మే 20వ తేదీ వరకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులకు పౌరసరఫరాల అధికారులు కార్డులు మంజూరు చేసింది. దాంతో జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం జూన్లోనే ఒకేసారి ఇచ్చారు. దీంతో జిల్లాలో అప్పటి వరకు ఉన్న కార్డులతోపాటు కొత్తగా కార్డులు పొందిన 21,649 మంది సన్నబియ్యం తీసుకున్నారు. మే 20 తేదీ తరువాత రేషన్కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అప్పటి నుంచి ఈనెల 13వ తేదీవరకు కొత్తగా మరో 44,099 కార్డులను మంజూరు చేసింది. అయితే వీరు జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కార్డులు పొందినప్పటికీ రేషన్ తీసుకునే అవకాశం దక్కలేదు. దాంతో సెప్టెంబర్ 1 నుంచి ఇచ్చే కోటాలో కొత్తరేషన్ కార్డుదారులు మొదటిసారిగా సన్న బియ్యం తీసుకోనున్నారు. రేషన్ కార్డులు జారీ చేయడంతో పేదలకు సమస్యలు తీరనున్నాయి. రేషన్ కార్డులేక ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి దూరం కావడంతోపాటు పిల్లల చదువుల విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాక ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం పెట్టినా దానికి రేషన్కార్డు తప్పనిసరి చేయడంతో చాలా మంది ఆ పథకాలకు దూరమయ్యారు. అంతే కాక ప్రభుత్వం ఆరోగశ్రీ ద్వారా ఇచ్చే వైద్య సేవలను కూడా పొందలేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కార్డులు జారీ చేయడంతో వారి సమస్యలు తీరనున్నాయి. ఫ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పంపిణీ ఫ మొదటిసారి బియ్యం తీసుకోనున్న 44,099 కుటుంబాలు ఫ వారికి రేషన్తోపాటు అందనున్న ప్రభుత్వ పథకాలు ఫ ఏళ్లనాటి కల నెరవేరుతుండడంతో లబ్ధిదారుల హర్షం రేషన్ దుకాణాలు 991 పాత కార్డులు 4,62,554 కొత్తవి 65,749 మొత్తం 5,28,303 గతంలో బియ్యం కోటా 89.15 లక్షల క్వింటాళ్లు వచ్చే నెల నుంచి కేటాయింపు 94.04 లక్షల క్వింటాళ్లు -
వయోవృద్ధుల సంక్షేమానికి అనేక చట్టాలు
రామగిరి(నల్లగొండ) : వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయ వ్యవస్థలో అనేక చట్టాలు ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సదన్లో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వయోవృద్ధుల సంరక్షణకు న్యాయ వ్యవస్థ కృషి చేస్తుందన్నారు.అనంతరం సీనియర్ సిటిజన్స్ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పురుషోత్తమరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్, మహిళా కోర్టు జడ్జి కవిత, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, చీఫ్ లీగల్ ఎయిర్ కౌన్సిల్ సభ్యుడు ఎన్.బీమార్జున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏటీసీ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణనల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ), ఐటీఐలో యువతకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ ఇస్తామని డీఆర్డీఓ శేఖర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా 6 కోర్సులు ప్రవేశపెట్టామని.. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆధారంగా ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి దేశీయంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ పాత ఐటీఐ, కొత్త ఐటీఐ, అనుముల, డిండి ఐటీఐలలో రోజూ ఉదయం 12 గంటలలోపు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు పదో తరగతి మెమో, ఆధార్కార్డు, బోనఫైడ్, టీసీ, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. వృద్ధులు, వికలాంగులు, బాలికలతో కొత్త సంఘాలునల్లగొండ : సెర్ప్ ద్వారా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమంలో భాగంగా కొత్త మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్డీఓ శేఖర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్లు పైబడిన మహిళలు 10 నుంచి 15 మందిని కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వికలాంగులకు ప్రత్యేకంగా, 13 నుంచి 15 ఏళ్ల వయస్సు వరకు, 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు కలిగిన కిషోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భక్తిశ్రద్ధలతో తీజ్ వేడుకలుకొండమల్లేపల్లి : మండలంలోని గౌరికుంటతండాలో తీజ్ వేడుకలను గురువారం గిరిజనులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలు చేసిన మొలకల బుట్టలను యువతులు తలపై ఎత్తుకొని గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మొలకల బుట్టలను చెరువులో వదిలారు. వేడుకల్లో గ్రామపెద్దలు, తదితరులు పాల్గొన్నారు. డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పోస్టల్ డివిజన్ పరిధిలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్పీఎల్ఐ) డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత అర్హత కలిగి మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్షియల్ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటా, వయస్సు ధ్రువీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్, గుర్తింపు పత్రాల ప్రతులు జతచేసిన దరఖాస్తును నల్లగొండ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ డివిజన్ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు. -
ఇందిరమ్మ ఇళ్లను గ్రౌండింగ్ చేయాలి
నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ను పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై గృహనిర్మాణ శాఖ అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించగా, మొదటి, రెండో విడతలో 3337 గృహాలు మంజూరు చేశామని.. అందులో 1129 గ్రౌండింగ్ కాగా.. బేస్మెంట్ స్థాయిలో 1,037, రూఫ్ లెవెల్లో 67, పూర్తయ్యే దశలో 25 ఇళ్లు ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మండలాల ప్రత్యేక అధికారులు, గృహ నిర్మాణ ఇంజనీర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్ల గ్రౌండింగ్ను పెంచాలన్నారు. గృహాలు నిర్మించుకునేందుకు సుముఖత లేని లబ్ధిదారుల నుంచి సమ్మతి తీసుకోవాలని సూచించారు. పూర్తయిన గృహాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ప్రారంభోత్సవం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నల్లగొండ మున్సిపాలిటీతో పాటు కనగల్, తిప్పర్తి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మంజూరైన గృహాలు గ్రౌండింగ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీఓలపై ఉందని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి : ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం రాత్రి వరకు ఎగువ నుంచి మూసీ రిజర్వాయర్కు 6,835 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు ఏడు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 5,949 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా.. నీటిమట్టాన్ని 642.50 అడుగుల(3.79 టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 117 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని పేర్కొన్నారు. -
యూరియా కష్టాలు
కొత్తపల్లిలో ఒక్కో రైతుకు మూడు బస్తాలే.. హాలియా : హాలియా మండలంలోని కొత్తపల్లి వ్యవసాయ సహకార సంఘానికి గురువారం 20 మెట్రిక్ టన్నుల (444 బస్తాలు) యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు, మహిళలు, చిన్నారులు గురువారం ఉదయం నుంచే పీఏసీఎస్ వద్ద ఎగబడ్డారు. ఎక్కువ మంది రైతులు రావడంతో పీఏసీఎస్ సిబ్బంది.. ఏడీఏ సరిత, సీఐ సతీష్రెడ్డికి సమాచారం అందించారు. సీఐ సతీష్రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులను వరుసలో నిలబెట్టి టోకెన్ల ప్రకారం పంపారు. యూరియా తక్కువగా ఉండడంతో ఒక్కో రైతుకు కేవలం మూడు బస్తాలు మాత్రమే ఇచ్చారు. అయినా సరిపోకపోవడంతో చాలా మంది రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. తాటికల్ గోదాం వద్ద బారులు నకిరేకల్ : నకిరేకల్లోని తాటికల్ పీఎసీఎస్ గోదాం ముందు గురువారం రైతులు, మహిళలు ఉదయం నుంచే బారులుదీరారు. 330 బస్తాల యూరియా నిల్వ ఉండడంతో పీఎసీఎస్ సిబ్బంది పోలీసుల సహకారంతో రైతులకు యూరియా అందించారు. ఒక్కో రైతులకు మూడు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో కేవలం 110 మంది రైతులకు పరిపోయింది. దీంతో మరో 200 మంది రైతులు గోదాం వద్ద ఆందోళనకు దిగారు. మరో రెండు రోజుల్లో 15 టన్నుల యూరియా వస్తుందని.. రైతులకు పూర్తిస్థాయిలో అందిస్తామని పీఏసీఎస్ సిబ్బంది హమీ ఇవ్వడంలో రైతులు వెనుదిరిగారు. నార్కట్పల్లిలో ఆందోళన నార్కట్పల్లి : నార్కట్పల్లి పీఏసీఎస్కు గురువారం యూరియా వచ్చింది. కానీ రైతులకు ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సీఏసీఎస్ ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పడంతో ఆందోళన సద్దు మనిగింది. కట్టంగూర్ : కట్టంగూర్ పీఏసీఎస్ గోదాముకు గురువారం ఉదయం 11 గంటలకు గోదాముకు 333 యురియా వచ్చింది. అప్పటికే రైతులు ఆధార్కార్డులు, పాస్బుక్లను క్యూలో ఉంచారు. పీఏసీఎస్ సిబ్బంది, ఏఓ గిరిప్రసాద్ పోలీసుల సహకారంతో రైతుకు ఒక్క బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. 200 మందికి పైగా రైతులు యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగిగారు. రెండు వారాల్లో 600 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని ఏఓ తెలిపారు. ఫ వరి, పత్తి పంటలకు ఒకేసారి అవసరం ఫ యూరియా కోసం పీఏసీఎస్ల వద్ద రైతుల బారులు ఫ అరకొర సరఫరాతో తప్పని ఇబ్బందులు ఫ ఒక్కోచోట రైతుకు మూడు బస్తాల చొప్పున పంపిణీ ఫ క్యూలో ఉన్నా యూరియా అందక నిరాశతో వెనుదిరిగిన కొందరు రైతులు సాగు పనులు ఊపందున్న వేళ అన్నదాతలకు ఎరువుల కష్టాలు తప్పడం లేదు. సరిపడా యూరియా నిల్వలు లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. వారం రోజులుగా అడపాదడపా వర్షాలు కురవడం, కాల్వల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తుండడంతో సాగు పనులు ఊపందుకున్నాయి. దీంతో వరి, పత్తి సాగు చేసే రైతులకు ఒకేసారి యూరియా అవసరం ఏర్పడింది. కానీ రైతుల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా లేకపోడంతో రైతులు తాము సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క బస్తా దొరికినా చాలు అన్న విధంగా రైతులు రోజుల తరబడి పీఏసీఎస్ల ఎదుట నిరీక్షిస్తున్నారు. గురువారం జిల్లాలోని పలు పీఏసీఎస్ల వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు. గంటల కొద్దీ వేచి ఉన్నా కొందరికి యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు. -
దళారులతో మంత్రులు కుమ్మక్కు
నల్లగొండ టూటౌన్ : యూరియా కొరత వెనుక కొందరు మంత్రులు, అధికారులు దళారులతో కుమ్మక్కయ్యారని మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు నిద్రాహారాలు మాని, యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టుకునే పరిస్థితి తెచ్చిందన్నారు. గతంలో నల్లగొండ మంత్రి ధాన్యం కొనుగోళ్లలోనూ కమీషన్లు తీసుకుని రైతులను గాలికి వదిలేశారని ఆరోపించారు. 56 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి కనీసం ఎరువులు తేలేడా అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకొని పదవులు తెచ్చుకొనే కాంగ్రెస్ నేతలకు రైతుల సమస్యలపై పట్టింపులేదన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో మంత్రి పూర్తిగా విఫలమయ్యారని, ధాన్యం కొనుగోళ్లు అంతే, నీళ్ల పరిస్థితి అంతే, ఇవ్వాల యూరియా కొరతపైనా అదే పరిస్థితి ఉందన్నారు. ఇద్దరు మంత్రులు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకునే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండ నియోజకవర్గంలో సాగునీటి కోసం రైతులు రోడ్డు ఎక్కుతున్నారని.. ఈ విషయంలో మంత్రులు సిగ్గు పడాలన్నారు. ప్రతి ఎకరాకు కావాల్సిన యూరియా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎరువుల విషయంలో ప్రభుత్వానికి ముందస్తు సమీక్ష లేదని, ప్రైవేట్ దళారులతో కుమ్మకై ్క అన్నదాతను అరిగోస పెట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని జిల్లా అధికారులు అబద్ధాలు చెబితే మీరే ఇబ్బందులు పడుతారని హెచ్చరించారు. కొరత లేదని చెప్పే అధికారులు రైతులకు ఎందుకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిషోర్కుమార్, నిరంజన్వలి, కటికం సత్తయ్యగౌడ్, మందడి సైదిరెడ్డి, చీర పంకజ్యాదవ్, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, మాలె శరణ్యారెడ్డి, బోనగిరి దేవేందర్, జమాల్ఖాద్రీ, మారగోని గణేష్, పల్రెడ్డి రవీందర్రెడ్డి, నాగార్జున పాల్గొన్నారు. ఫ యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం ఫ సంపాదన పైనే సీఎం, మంత్రుల దృష్టి ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి విమర్శ -
వలంటీర్లు జాతీయస్థాయిలో రాణించాలి
నల్లగొండ టూటౌన్ : ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయస్థాయిలో రాణించి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఖ్యాతిని చాటాలని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి అన్నారు. వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్ పరేడ్ –2025 కోసం ఎంజీయూ పరిధిలోని ఎన్ఎస్ఎస్ వలంటీర్ల ఎంపిక గురువారం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ రీజినల్ యూత్ ఆఫీసర్ సైదానాయక్ వలంటీర్లకు రన్నింగ్ పరేడ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనభర్చిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపికై న వలంటీర్లను గుజరాత్లో జరిగే పీఆర్డీకి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి, స్టేట్ ఎన్ఎస్ఎస్ అధికారి నరసింహ, సుధాకర్, ఆనంద్, శ్రీనివాస్, కాంతయ్య, దయానంద్, శ్యామల, మేనేశ్వరి, పావని, శృతి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయులుగా నాజ్నీన్, శంషున్నిసా
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలకు చెందిన బయాలజికల్ సైన్స్ టీచర్(స్కూల్ అసిస్టెంట్) నాజ్నీన్ ఖుర్షీద్, ఉర్దూ టీచర్(స్కూల్ అసిస్టెంట్) శంషున్నిసా బేగం రాష్ట్రస్థాయి ఉర్దూ మీడియం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. బుధవారం వారిని హైదరాబాద్లోని తెలంగాణ ఉర్దూ అకాడమీ కార్యాలయంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందన్, తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఫ్ అన్సారి, తెలంగాణ వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ శాలువాలు, పూలమాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. తమ పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు రాష్ట్ర స్థాయి ఉర్దూ మీడియం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం గర్వంగా ఉందని ప్రధానోపాధ్యాయురాలు ఏడబ్ల్యూఎస్ రాబియా అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అయూబ్ఖాన్, షేక్ బాబా, అతియా, ఆర్. ప్రవీణ, ఇర్షత్ ఫర్హీన్, పీఈటీ అష్రఫ్ అహ్మద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలి
హాలియా : ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు వారి పరిధిలోని పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె హాలియాలోని 30 పడకల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన భవన నిర్మాణ పనులను, ఆస్పత్రిలో ఓపీ, ఏఎన్సీ, మందులు, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న తలసేమియా, ప్రసవాలు, సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగీ, టైపాయిడ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయని తెలిపారు. ఆస్పత్రిలో సరిపడా వైద్యుల నియామకంపై దృష్టి సారించాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్ను ఆదేశించారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రవి, డాక్టర్ రామకృష్ణ, తహసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీఓ లక్ష్మి తదితరులు ఉన్నారు. -
నేటి నుంచి పోస్టాఫీస్ పనివేళల్లో మార్పు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ హెడ్ పోస్టాఫీస్ కార్యాలయం పనివేళలను గురువారం నుంచి మార్చుతున్నట్లు జిల్లా సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి బుధవారం తెలిపారు. స్టాంపులు, పార్సిళ్లు, స్పీడ్ పోస్టు, మనీ ఆర్డర్ల లావాదేవీలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తామని, సేవింగ్స్ బ్యాంక్, సర్టిఫికెట్లు ఉదయం 9 గంటల నుంచి మధ్యాధ్నాం 3 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫిర్యాదు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరంతిప్పర్తి : సీజనల్ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాదికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్క, పాము కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డెంగీ, మలేరియా తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, జిల్లా మలేరియా అధికారి ప్రదీప్బాబు, డాక్టర్ మమత సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలిగుర్రంపోడు : విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని డీఈఓ భిక్షపతి కోరారు. బుధవారం గుర్రంపోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠాలు బోధించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని ఈ సందర్భఃగా పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఈఓ నోముల యాదగిరి, హెచ్ఎం సంధ్యారాణి తదితరులు ఉన్నారు. 23న ఎన్ఎస్ఎస్ వలంటీర్ల ఎంపికనల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీయూ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఎన్ఎస్ఎస్ యూనిట్ల నుంచి వలంటీర్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జాతీయ సేవ పథకం కో ఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్, హిందీ, నాయకత్వ లక్షణాలు, కల్చరల్ అంశాల్లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు వచ్చే నెల 18 నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్లో జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి హాజరు కావడానికి అర్హత సాధిస్తారని తెలిపారు. ఏటీసీ, ఐటీఐ కోర్సుల పోస్టర్ ఆవిష్కరణనల్లగొండ: నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐ, డైట్ కాలేజీలో బుధవారం ఏటీసీ, ఐటీఐలలో కొత్తగా ప్రవేశపెట్టిన 6 అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులపై అవగాహన కల్పించే పోస్టర్ను డీఆర్డీఓ శేఖర్రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు నల్లగొండలోని పాత ఐటీఐ కాలేజీ, కొత్త ఐటీఐ కాలేజీ, అనుముల, డిండి ఐటీఐ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అరవిందరెడ్డి, నరేందర్, దామోదర్ పాల్గొన్నారు. -
అవసరం ఉన్న రైతులకే యూరియా
మిర్యాలగూడ : జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అసవరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో యూరియాపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. మంగళవారం రాత్రి జిల్లాకు 510 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఈ యూరియాను ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అసవరం ఉన్నంత మేరా కేటాయించామన్నారు. యూరియా పంపిణీలో అక్రమాలు జరగొద్దని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. అనవసరం లేని రైతులు యూరియాను నిల్వ ఉంచుకోవద్దని సూచించారు. యూరియా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా వాడపల్లి చెక్పోస్టు వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సబ్కలెక్టర్ నారాయణ్అమిత్ను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ను ఆదేశించారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో మొత్తం 19500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు సుమారు 14వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్కుమార్ వివరించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్ని సహకార సంఘాల్లో ఎరువులు ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రిజర్వేషన్లకు మించి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపైనే రాజకీయ పార్టీల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు, వారు గెలుపొందిన స్థానాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. వారికి కేటాయించిన స్థానాలతోపాటు, జనరల్ స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసి సర్పంచ్లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు పలు అడ్డంకులు ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా అమలు చేసే యోచనతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అన్ని పార్టీలు అమలు చేస్తాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో 23 శాతం రిజర్వేషన్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2019 ఎన్నికల్లో బీసీలు తమకు ఉన్న రిజర్వేషన్లకు మించి స్థానాలను దక్కించుకున్నారు. రిజర్వు అయిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో అధిక సీట్లను కై వసం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే 23 శాతం రిజర్వేషన్ స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో పోటీ చేసి 40 శాతానికి పైగా సర్పంచ్ స్థానాల్లో గెలుపొందినట్లు రాజకీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. మరోవైపు ఎంపీటీసీ స్థానాల్లోనూ 35 శాతం వరకు, జెడ్పీటీసీ స్థానాల్లోనూ 25 శాతం వరకు స్థానాలను సాధించారు. జనరల్ స్థానాల్లో గెలుపు ఇలా.. ● నల్లగొండ జిల్లాలో 844 సర్పంచ్ స్థానాలు ఉండగా.. బీసీ రిజర్వేషన్ కింద 209 స్థానాలతోపాటు 79 జనరల్ స్థానాల్లోనూ బీసీలే పోటీ చేసి విజయం సాధించారు. మొత్తంగా 288 స్థానాలను (35 శాతం) బీసీలు దక్కించుకున్నారు. 346 ఎంపీటీసీ స్థానాల్లో రిజర్వుడ్ స్థానాలు 93తోపాటు 23 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది.. మొత్తంగా 121 స్థానాలను బీసీలు దక్కించుకున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాల్లోనూ బీసీ రిజర్వుడ్ స్థానాలు 4తో పాటు మరో 4 జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి.. 8 స్థానాల్లో గెలుపొందారు. ● సూర్యాపేట జిల్లాలోనూ 475 సర్పంచ్ స్థానాలకు గాను బీసీ రిజర్వుడ్ స్థానాలు 171తోపాటు మరో 52 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది.. 233 స్థానాలను (47 శాతం) బీసీలు దక్కించుకున్నారు. 255 ఎంపీటీసీ స్థానాల్లో 29 రిజర్వుడ్ స్థానాలతోపాటు మరో 50 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తంగా 79 స్థానాలను కై వసం చేసుకున్నారు. 23 జెడ్పీటీసీ స్థానాల్లో 3 రిజర్వుడ్ స్థానాలతోపాటు మరో 2 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తంగా 5 జెడ్పీటీసీ స్థానాలను సాధించారు. ● యాదాద్రి భువనగిరి జిల్లాలోని 420 సర్పంచ్ స్థానాల్లో బీసీ రిజర్వుడ్ 117 స్థానాలతోపాటు 59 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి.. 176 స్థానాలను (42 శాతం) కై వసం చేసుకున్నారు. 117 ఎంపీటీసీ స్థానాల్లో 39 రిజర్వుడ్ స్థానాలతోపాటు 12 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తం 51 స్థానాలను బీసీలు సాధించారు. 17 జెడ్పీటీసీ స్థానాల్లో 4 బీసీ రిజర్వుడ్ స్థానాలతోపాటు మరొక జనరల్ స్థానంలో పోటీ ఐదింటిని దక్కించుకున్నారు. ఫ ఈసారి బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేలా కసరత్తు ఫ ప్రభుత్వ పరంగా కుదరకపోతే పార్టీ పరంగా అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ఫ మిగతా పార్టీలూ బీసీలకు ప్రాతినిధ్యం పెంచక తప్పని పరిస్థితి ఫ రిజర్వేషన్ల అమలుపై పార్టీల్లో విస్తృత చర్చ గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పరంగా చేస్తేనే మేలు జరుగుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. ఒకపార్టీ 42 శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు సీటు కేటాయించినా, అక్కడ మరో పార్టీ జనరల్ అభ్యర్థిని నిలబెడితే ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నాయి. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేసేందుకు తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా సానుకూల నిర్ణయం వెలువడలేదు. కేంద్రం ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితిలేదు. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ఒక్క కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ముందస్తుగానే వైన్స్ టెండర్లు!
నల్లగొండ : మద్యం దుకాణాల కేటాయింపునకు ఈసారి కూడా ప్రభుత్వం ముందస్తుగానే టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్ కాలం ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 డిసెంబర్ 1నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండు సంవత్సరాల కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. మద్యం దుకాణం టెండర్ ఫాం ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. టెండర్ ఫీజు మినహా.. గతంలో ఉన్న మద్యం పాలసీ విధానాన్ని ఈసారి కూడా అమలుపరచనుంది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకునేందుకు అవకాశం ఉండడంతో మద్యం వ్యాపారులు, ఆశావహులు టెండర్లు వేసేందుకు సిద్ధవుతున్నారు. రిజర్వేషన్ అమలు రిజర్వేషన్ల ప్రకారం ఆయా కేటగిరీల వారీగా దుకాణాలను కేటాయించనున్నారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్ను కల్పిస్తారు. ఈ రిజర్వేషన్ల వెసులుబాటుతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కమిషనర్ ఉత్తర్వుల తర్వాత దరఖాస్తులు ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల లైసెన్స్ల జారీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిపికేషన్ అనంతరం వచ్చే రెండేళ్లకు మద్యం షాపుల లైసెన్స్ల జారీ కోసం ఎప్పటి నుంచి దరఖాస్తు తీసుకోవాలి. ఎప్పుడు డ్రా తీయాలనే విషయంపై కలెక్టర్లకు ఆదేశాలు రానున్నాయి. అయితే సెప్టెంబరు 2వ వారంలోపు షెడ్యూల్ విడుదల చేసి ఆ నెల మొత్తం దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించే అవకాశం ఉంది. అక్టోబర్లో లాటరీ పద్ధతిలో షాపుల కేటాయించనుంది. దుకాణాల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వేసి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ డ్రా తీయనున్నారు. జిల్లాలో 155 మద్యం దుకాణాలున్నాయి. జనాభా ప్రాతిపదికన షాపులకు పీజు ఉంటుంది. రెండేళ్ల కాలానికి నాలుగు నెలలకోసారి ఆరు స్లాబ్లలో లైసెన్స్దారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫ 5 వేల జనాభా లోపు రూ.50 లక్షలు ఫ 5 వేల నుంచి 50వేల జనాభాకు రూ.55 లక్షలు ఫ 50వేల నుంచి లక్ష జనాభాకు రూ.60లక్షలు ఫ లక్ష నుంచి 5 లక్షల వరకు రూ.65లక్షలు ఫ 5లక్షల నుంచి 20లక్షల జనాభాకు రూ.85లక్షలు ఫ 20లక్షల పైచిలుకు జనాభా ఉంటే రూ.కోటి 10లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫ దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంపు ఫ సెప్టెంబర్ రెండో వారంలోపు షెడ్యూల్, అదే రోజునుంచి దరఖాస్తుల స్వీకరణ ఫ అక్టోబర్లో డ్రా పద్ధతిన కేటాయింపు ఫ డిసెంబరు నుంచి కొత్త వైన్స్ల నిర్వహణకు అవకాశం ఫ జిల్లాలో 155 మద్యం దుకాణాలు -
గర్భిణి మృతి కేసులో ఏడుగురి అరెస్ట్
సూర్యాపేట టౌన్: గర్భిణికి ఆమె భర్త ఆర్ఎంపీ వైద్యులతో అబార్షన్ చేయించగా.. అది వికటించి ఆమె మృతిచెందింది. దీంతో ఆమె భర్తతో పాటు అబార్షన్ చేసేందుకు సహకరించిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను బుధవారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన బయగల శ్రీను, విజిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడోసారి గర్భవతి అయిన విజిత(ఐదు నెలలు)కు ఈ నెల 15న అకస్మాత్తుగా కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయిబాలాజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి వైద్యం చేయగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఖమ్మంకు తీసుకెళ్లారు. అప్పటికే విజిత పరిస్థితి విషమించి మృతి చెందింది. తన భార్య మృతికి ఆర్ఎంపీ బండి శ్రీనివాస్ కారణమని తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో శ్రీను ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆర్ఎంపీని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. అబార్షన్ చేయించడంతో..విజితకు ఆమె భర్త శ్రీను ఖమ్మం పట్టణంలో స్కానింగ్ చేయించగా.. కడుపులో మళ్లీ ఆడపిల్లే ఉందని తేలడంతో అబార్షన్ చేయించాలని అనుకున్నాడని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ బండి శ్రీనివాస్ను సంప్రదించగా.. అతడు మరో ఆర్ఎంపీ పానుగంటి సతీష్తో కలిసి విజితకు ఈ నెల 15న తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయిబాలాజీ హాస్పిటల్లో అబార్షన్ చేశాడని డీఎస్పీ తెలిపారు. ఈ అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. అయితే శ్రీను తన భార్య విజితను ఖమ్మం తీసుకెళ్లి అక్కడ తుమ్మచర్ల అరుణ అనే నర్సును సంప్రదించి లింగ నిర్ధారణ పరీక్ష చేయించాడని, ఖమ్మం పట్టణంలో కల్పన క్లినిక్ నిర్వహిస్తున్న పోలంపల్లి కల్పన లింగ నిర్ధారణ పరీక్ష చేసినట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఖమ్మం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ సంపేట అశోక్ స్కానింగ్ పరికరంతో లింగ నిర్ధారణ పరీక్ష చేశాడని, అతడికి లింగ నిర్ధారణ పరీక్ష చేసే స్కానర్ను పులి వీరభద్రరావు సమకూర్చినట్లు గుర్తించామని డీఎస్పీ వివరించారు. ఏడుగురి అరెస్ట్, రిమాండ్..ఈ కేసులో ఏ–1 తుంగతుర్తికి చెందిన ఆర్ఎంపీ బండి శ్రీనివాస్, ఏ–2 విజిత భర్త బోయగల శ్రీను, ఏ–3 ఖమ్మంలో స్కానింగ్ చేసే సంపెట అశోక్, ఏ–4 స్కానింగ్ చేసే పరికరం సమకూర్చిన పులి వీరభద్రరావు, ఏ–5 లింగ నిర్ధారణ పరీక్ష చేయడానికి ఏర్పాటు చేసిన నర్సు తుమ్మచర్ల అరుణ, ఏ–6 కల్పన క్లినిక్ నిర్వాహకురాలు పోలంపల్లి కల్పన, ఏ–7 నాగారం మండలం పసునూరు గ్రామానికి చెందిర ఆర్ఎంపీ పానుగంటి సతీష్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అబార్షన్ వికటించి మృతిచెందినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ ఆమె భర్తతో పాటు ఆరుగురి రిమాండ్ -
ఇళ్లు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి
వలిగొండ: రోడ్డు వెడల్పు పేరుతో తమ ఇళ్లను అక్రమంగా జేసీబీతో కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పులిగిల్ల గ్రామస్తులు బుధవారం వలిగొండ పోలీసులను ఆశ్రయించారు. వలిగొండ నుండి కాటిపల్లి వరకు నూతనంగా బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా గ్రామానికి చెందిన కొంతమంది ఇంటి యజమానులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారు. దీంతో పలువురు బాధితులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ యుగంధర్ తెలిపారు. పోలీసులను ఆశ్రయించిన పులిగిల్ల వాసులు -
శిశుగృహకు నవజాత శిశువు అప్పగింత
పెద్దఅడిశర్లపల్లి: మూడో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించడంతో సాకలేక బంధువులకు అప్పగించిన నవజాత శిశువును బుధవారం ఐసీడీఎస్ అధికారులు నల్లగొండ శిశుగృహ సిబ్బందికి అప్పగించారు. ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం మునావత్తండాకు చెందిన మునావత్ శంకర్, రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. మూడో కాన్పులోనూ రాణి ఆడబిడ్డకు జన్మించింది. దీంతో ముగ్గురిని సాకలేక నవజాత శిశువును బంధువులకు అప్పగించారు. రాణి కాన్పుకు అమ్మగారి ఇంటికి వెళ్లి రెండు నెలల తర్వాత ఈ నెల 4న మునావత్తండాకు శిశువు లేకుండా రావడంతో ఐసీడీఎస్ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. శంకర్, రాణి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో మంగళవారం గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శిశువు తల్లిదండ్రులు, బంధువులను స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు. ముగ్గురు ఆడపిల్లలను సాకలేక బంధువులకు అప్పగించారని తేలడంతో శిశుగృహకు అప్పగించారు. -
ప్రముఖ విద్యావేత్త చినవెంకట్రెడ్డి కన్నుమూత
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త కొండకింది చినవెంకట్రెడ్డి(99) మంగళవారం రాత్రి మృతిచెందారు. చినవెంకట్రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు కొండకింది పూర్ణచందర్రెడ్డి హైదరాబాద్లో ప్రముఖ వైద్యుడు. చినవెంకట్రెడ్డి ఉమ్మడి జిల్లాలోని ప్రముఖులు, రాజకీయ నాయకులందరికీ సుపరిచితుడే. ఈయన స్వస్థలం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామం. రైతు కుటుంబంలో జన్మించిన చినవెంకట్రెడ్డి పుట్టిన తేదీ 1929 సెప్టెంబర్18 అని సర్టిఫికెట్లలో ఉండగా, కుటుంబ సభ్యులు మాత్రం ఆయన వయస్సు 99 సంవత్సరాలు అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన చినవెంకట్రెడ్డి 1947లో ఎస్టీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు సేవలందించారు. ఆ తర్వాత హెచ్ఎంగా, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్గా పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందారు. సాహితీ మేఖల సంస్థకు జిల్లా గౌరవాధ్యక్షుడిగా చాలాకాలం కొనసాగి సంస్థ అభివృద్ధికి, సాహిత్యాభివద్ధికి కృషి చేశారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలుచినవెంకట్రెడ్డి సతీమణి తారకమ్మ చాలా సంవత్సరాల క్రితమే మృతిచెందింది. ఆమె పేరు మీద కొండకింది తారకమ్మ చినవెంకట్రెడ్డి ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి ప్రతిభా స్కాలర్షిప్లను అందజేసి తోడ్పాటునందించారు. భారత సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషిచేస్తూనే బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు జిల్లాస్థాయి ప్రతిభా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేవారు. పద్యాల పట్ల విద్యార్థుల్లో సన్నగిల్లుతున్న ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా 100 పద్యాలను కంఠస్థం చేసిన వారికి రూ.1,116, 200 పద్యాలు కంఠస్థం చేసిన వారికి రూ.2,116 నగదు బహుమతిని అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. అదేవిధంగా గతంలో వరద బాధితుల సహాయార్ధం సుమారు రూ.10 లక్షల విలువైన దుస్తులు, బ్లాంకెట్లు, లుంగీలు, దోవతులు, చీరలు, షర్ట్స్, ప్యాంట్లు, టవల్స్, బనియన్లు, దుప్పట్లు అందజేశారు. ప్రముఖుల నివాళి.. చినవెంకట్రెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న ప్రముఖులు నల్లగొండ పట్టణంలోని ఆయన నివాసానికి వచ్చి పార్ధివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, డీఐజీ మహేష్ భగవత్, ఏసీబీ డీజీ విజయ్కుమార్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎంజీయూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆకుల రవి, అడిషనల్ ఎస్పీ రమేష్, రిటైర్డ్ ఐఏఎస్లు పురుషోత్తంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, చొల్లేటి ప్రభాకర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మున్సిపల్ చైర్మన్లు పుల్లెంల వెంకట్నారాయణగౌడ్, బుర్రి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, అబ్బగోని రమేష్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, బండారు ప్రసాద్, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, సీపీఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, హాశం, పలువురు డాక్టర్లు, న్యాయవాదులు, లయన్స్క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. కలిసిరాని రాజకీయాలు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు గడించిన కొండకింది చినవెంకట్రెడ్డికి రాజకీయాలు కలిసి రాలేదు. 1984లో చినవెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఆయనకు నల్లగొండ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ద్వారా లభించగా.. చకిలం శ్రీనివాసరావు బీ ఫారం క్యాన్సిల్ చేయించడంతో అవకాశం చేజారిపోయింది. 1994లో అప్పటి మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డితో సన్నిహితంగా ఉండటం వలన ఆయన కోరిక మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి ఆర్గనైజింగ్ సెక్షన్లో పాలుపంచుకున్నారు. రాజకీయంగా ఏ పదవులను ఆశించలేదు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నివాళులర్పించిన ప్రముఖులు -
పది రోజుల్లో ఇంటింటికి తాగునీరు అందించాలి
పెద్దవూర: పది రోజుల్లో ఇంటింటికి తాగునీటిని అందించాలని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదన్న ఫిర్యాదుతో బుధవారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్రెడ్డితో కలిసి పెద్దవూర మండల కేంద్రంతో పాటు గర్నెకుంట, వెల్మగూడెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఎలా ఉందని ఇళ్లలోకి వెళ్లి మహిళలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని మహిళలు ఆయనకు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించగా.. రోజుకు 400 లీటర్ల నీటిని వాడుకోవాల్సి ఉండగా 1200 లీటర్ల నీటిని వాడుకుంటున్నారని తెలిపారు. ఫ్లో కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేస్తే ఎక్కువ తక్కువలు కాకుండా ఇంటింటికి ఒకే పరిమాణంలో తాగునీటిని అందించవచ్చునని అధికారులు పేర్కొన్నారు. చౌరస్తాలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న నల్లాను తొలగిస్తే ఇంటింటికి నీళ్లు అందుతాయని తెలుపగా.. వెంటనే తొలగించాలని సూచించారు. మిషన్ భగీరథ పథకానికి సంబంధించి మండలంలో గర్నెకుంట చివరి గ్రామం అని కరెంట్ పోయినా, పైపులు పగిలినా మొదటగా సమస్య ఇక్కడే ఉత్పన్నమవుతుందని భవిష్యత్లో పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. వెల్మగూడెంలో గతంలో నిర్మించిన పాత సంపులోకి నీటిని ఎక్కిస్తే గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, పబ్బు యాదగిరి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు నాగేశ్వర్రావు, కృష్ణయ్య, ఈఈలు శాంతికుమారి, లక్ష్మీనారాయణ, డీఈలు మధు, నిరంజన్సిన్హా, ఏఈలు దీక్షిత్, ప్రవీణ్, నడ్డి గోపాలకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి -
బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ): బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్ల గొండ పోక్సో కోర్టు జడ్జి ఎన్. రోజారమణి బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నాంపల్లి మండలం చమలపల్లి గ్రామానికి చెందిన మంగళపల్లి యాలాద్రి అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి 2014 మే 15న కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. అప్పటి సీఐ వెంకట్రెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరిపి నిందితుడు యాలాద్రిని కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలతో ఏకీభవించిన జడ్జి రోజారమణి నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రస్తుత సీఐ రాజు, కోర్టు కానిస్టేబుల్ సైదులు, లైజన్ ఆఫీసర్ నరేందర్ సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించడంలో సహకరించారు. కుంటలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యంబొమ్మలరామారం: స్నేహితులతో కలిసి కుంటలో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ శివారులో గల బ్లూ అగ్రిగేట్స్ స్టోన్ క్రషర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నందిలాల్ భారతి(25) పని చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు స్టోన్ క్రషర్ సమీపంలోని కుమ్మరి కుంటలో నీరు చేరింది. నందిలాల్ భారతితో పాటు మరో నలుగురు కార్మికులు మంగళవారం ఉదయం కుమ్మరి కుంటలో ఈత కొడుతుండగా.. లోతు అంచనా వేయకలేక నందిలాల్ భారతి కుంటలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక జాలరుల సహాయంతో నందిలాల్ భారతి కోసం గాలించారు. ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం రంగంలో దిగి మంగళవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా.. సాయంత్రం నందిలాల్ భారతి మృతదేహాన్ని కుంటో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపారు. కానిస్టేబుల్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడు ● కానిస్టేబుల్తో పాటు వాహనదారుడికి గాయాలు ● పంతంగి టోల్ప్లాజా వద్ద ఘటనచౌటుప్పల్ రూరల్: మద్యం మత్తుతో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి వాహనాలు తనిఖీ చేస్తున్న హెడ్కానిస్టేబుల్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్తో పాటు వాహనదారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటప్పల్ ట్రాఫిక్ పోలీస్ సేష్టన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎస్కే ఆసిఫ్ మంగళవారం రాత్రి పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కు స్కూటీపై వెళ్తున్న హైదరాబాద్లోని కొత్తపేటకు చెందిన విశాల్ను ఆపబోయాడు. కానీ మద్యం మత్తులో ఉన్న విశాల్ స్కూటీతో హెడ్కానిస్టేబుల్ ఆసిఫ్ను ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విశాల్ స్కూటీ పైనుంచి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ ఆసిఫ్ కాలు విరగడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విశాల్కు స్వల్ప గాయాలు కావడంతో కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
బుద్ధవనం ప్రాజెక్టు అద్భుతంగా ఉంది
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని బుద్ధవనం ప్రాజెక్టు అద్భుతమని అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలోని వియత్నాం బౌద్ధవిహార ఆచార్యులు థామ్ కొనియాడారు. బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి బుధవారం హ్యూస్టన్లోని బుద్ధవిహారాన్ని, మూడంతస్తుల పగోడాను, 72అడుగుల ఖ్యాన్ ఆమ్ బోధిసత్వ విగ్రహాన్ని సందర్శించారు. బౌద్ధ ఆచార్యులను కలిసి కృష్ణాతీరంలోని బౌద్ధ వారసత్వ స్థలాలు, బుద్ధవనం గురించి వివరించారు. బుద్ధవనంకు సంబంధించిన వీడియోను చూపించారు. కట్టడాలు, శిల్పాలు ఆచార్య నాగార్జునుని స్ఫూర్తిని ఈ తరానికి తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా థామ్ మాట్లాడుతూ.. తాను నాగార్జునకొండను సందర్శించాలని అనుకుంటున్నానని తెలిపారు. ఆచార్య నాగార్జునుడి రచనలను బుద్ధవనం ద్వారా ఈ తరానికి తెలియ జెప్పే కార్యక్రమాలను రూపొందించాలని బౌద్ధాచార్యులు సూచించారని, ఈ విషయాన్ని తాను బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు తెలియజేయనున్నట్లు శివనాగిరెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ బౌద్ధ క్షేత్రాల గురించి అమరావతి శిల్పకళ ప్రత్యేకత, కృష్ణాతీరం నుంచి శ్రీలంక ద్వారా బౌద్ధం దక్షిణాసియా దేశాలకు చేరిందని వియత్నాం బౌద్ధ విహార ఆచార్యులుకు వివరించినట్లు శివనాగిరెడ్డి చెప్పారు. కొనియాడిన అమెరికాలోని హ్యూస్టన్ బౌద్ధవిహార ఆచార్యులు థామ్ -
వ్యవసాయ పనుల్లో ఉత్తరాది కూలీలు
చౌటుప్పల్ రూరల్: గ్రామాల్లో రైతులు కూలీలు కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీల ఆగమనం ప్రారంభమైంది. దీంతో వలస కూలీలు రైతులకు వ్యవసాయ పనుల్లో బాసటగా నిలుస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వరి నాట్లతో పాటు పత్తి, ఇతర పంటల సాగులో పనిచేయడానికి ఉత్తరాది రాష్ట్రాల కూలీలు పెద్ద సంఖ్యలో గ్రామాలకు చేరుకున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహర్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్తో పాటు ఛత్తీస్గడ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కుటుంబాలతో కలసి కూలీలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వలస వస్తున్నారు. వ్యవసాయ సీజన్ ముగిసే వరకు ఆయా గ్రామాల్లోని రైతుల వద్ద ఉంటున్నారు. చౌటుప్పల్, వలిగొండ, భూదాన్పోచంపల్లి మండలాల్లో రైతులు వలస కూలీలపై ఆధాపడి వ్యవసాయ పనులు చేస్తున్నారు. గతంలో మగ కూలీలు మాత్రమే వచ్చేవారు. ఈ ఏడాది మహిళలతో పాటు కుటుంబాలను తీసుకొని వచ్చారు. ప్రతి గ్రామంలో వరి నాట్లు సగం వరకు వలస కూలీలే పూర్తిచేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లోనే నివాసం, వంటావార్పు..వలస కూలీలకు రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల వద్దనే నివాస ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే వారు వంట చేసుకుంటున్నారు. వరి నాట్లకు వెళ్లే కూలీలు ఉదయమే పంట పొలాలకు వెళ్లి నాట్లు వేస్తున్నారు. పత్తి చేలలో కలుపు తీసే పనులకు వెళ్లే వారు వంట చేసుకొని మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్తున్నారు. స్థానిక కూలీలు ఎకరాకు పది నుంచి పన్నెండు మంది నాట్లు వేస్తే వీరు మాత్రం నలుగురు లేదా ఐదుగురు మాత్రమే పూర్తి చేస్తున్నారు. దీంతో ఖర్చు తగ్గుతుండడంతో రైతులు వలస కూలీల వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని పనుల్లో ఆరితేరి..వలస కూలీలు పత్తి చేనులో కలుపు తీయడం నుంచి గుంటుక కొట్టడం, అడుగు మందు వేయడం, పురుగు మందులు కొట్టడం వంటి పనులు చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, పంతంగి, రెడ్డిబాయి గ్రామాల్లో రైతుల వద్దకు పది కుటుంబాలు వలస వచ్చారు. ఇలా సుమారు ఆయా గ్రామాల్లోనే రెండు వందల మందికి పైగా వలస కూలీలు ఉన్నారు. వీరు ట్రాక్టర్ పనులు కూడా చేస్తున్నారు. కూలి తక్కువ.. పని త్వరగా..వలస కూలీలకు ఇచ్చే కూలి స్థానిక కూలీలతో పోల్చితే తక్కువగా ఉంది. వరి నాట్ల కోసం ఎకరాకు రూ.5వేలు ఇస్తున్నారు. స్థానిక కూలీలకు ఎకరాకు రూ.6వేలు ఇస్తున్నారు. పత్తి చేనులో పనికి వెళ్తే వలస కూలీలకు రూ.400 ఇస్తే, స్థానిక కూలీలకు రూ.500 ఇస్తున్నారు. ఇలా కూలీ తక్కువ ఉంటుంది. వీరు పని కూడా త్వరగా పూర్తిచేసుకుని వెళ్తున్నారు. గ్రామాల్లో కూలీల కొరత తీరిందంటున్న స్థానిక రైతులు వలస కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేస్తున్న అన్నదాతలు -
ప్రజా పోరాటాలకు పాటే ప్రాణం
రామన్నపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి ప్రజా పోరాటాల వరకు పాటే ప్రాణంగా నిలిచిందని, భూమి ఉన్నంత వరకు పాటకు మరణం ఉండదని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ అన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో బుధవారం రామన్నపేటలో నిర్వహించిన జానపద కళాకారుల ప్రదర్శనను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాటకు, ఆటకు ప్రజలను చైతన్యపరిచే గొప్ప శక్తి ఉందని తెలిపారు. పాశ్చాత్య విష సంస్కృతి వల్ల అంతరించిపోతున్న జానపద కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. వందలాది మంది కళాకారులను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి ప్రదర్శనలు ఇవ్వడం శుభపరిణామమని కొనియాడారు. ప్రజా నాట్యమండలి ప్రజాపాటకు బహువచనమని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ప్రపంచీకరణ ముసుగులో ప్రజాకళలు పెట్టుబడిదారుల చేతుల్లో బందీ అవుతున్నాయని, సినిమాలు ఇతర రూపాల్లో వికృతరూపం దా లుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజానాట్య మండలి ప్రజల కళారూపాలను భుజానికి ఎత్తుకొని ముందుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిందు, యక్షగానం, భాగవతం, కోలాటం, బుర్రకథ, డప్పు కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా కోఆర్డినేటర్ వేముల పుష్ప, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటెపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, దేశపాక రవి, కూరెళ్ల నర్సింహాచారి, వేల్పుల వెంకన్న, మేడి పృథ్వీ, గంటెపాక శ్రీకృష్ణ, కందుల హన్మంత్, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం పాల్గొన్నారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ -
సాక్షి ఫొటోగ్రాఫర్ భజరంగ్ ప్రసాద్కు కలెక్టర్ సన్మానం
నల్లగొండ: జాతీయ గోల్డ్మెడల్ అవార్డు పొందిన సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్టు కంది భజరంగ్ ప్రసాద్ను మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి తన ఛాంబర్లో ఘనంగా సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ భజరంగ్కు ఇప్పటికీ 79 అవార్డులు రావడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హాఫీజ్ ఖాన్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు క్రిస్టఫర్, డాక్టర్ ఏ ఏ ఖాన్, సౌరయ్య, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి
నల్లగొండ : పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు తెలుసుకుని.. కేసుల ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు రోజూ గ్రామానికి వెళ్లి ప్రజలతో మమేకం అవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్రాజు, రవికుమార్, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నేను ఎవరినీ కించపరచలేదు : కలెక్టర్
నల్లగొండ : ప్రజావాణి సందర్భంగా తాను ఎవరినీ కులం, మతం పేరుతో కించపరచలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయిల్ యుద్ధ సంఘటనకు సంబంధించి జిల్లాలోని కొంతమంది ఉలేమాలు తనకు దరఖాస్తును ఇచ్చారని, ఆ సందర్భంలో వారికి సంబంధం లేని హైదరాబాద్కు చెందిన దేవి అనే మహిళ కలెక్టర్ను ‘నువ్వు.. నువ్వు’ అని సంబోధించిందని.. జిల్లా అధికారులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిందని తెలిపారు. అయినప్పటికీ తాను ఆమెకు సముచితంగా సమాధానం చెప్పి పంపామని తెలిపారు. 18వ తేదీన ప్రజావాణిలో ఉలేమాలను తాను కించపరిచాననడం నిజం కాదని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళలపై దాడులను అరికట్టడంలో విఫలం తిప్పర్తి : మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్యా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మంగళవారం తిప్పర్తి సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ఐద్వ జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. మహిళలను వంటింటికి పరిమితం చేస్తూ.. అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం లేదన్నారు. మహిళలను చైతన్యం చేసేందుకు ఐద్వా ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడగు ప్రభావతి, అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి, అనురాధ, పద్మ, నాగమణి, గోవర్దన, సుల్తానా, ధనలక్ష్మి, జంజరాల ఉమ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు విరివిగా పెంచాలినల్లగొండ : మొక్కలను విరివిగా పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం ఆయన నల్లగొండలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో సామాజిక కార్యకర్త సురేష్ గుప్తాతో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. మహిళా కానిస్టేబుళ్లకు కరాటే శిక్షణమిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలోని 14 పోలీస్స్టేషన్లో నూతనంగా విధుల్లో చేరిన మహిళా కానిస్టేబుళ్లకు స్పెల్ప్ డిఫెన్స్లో భాగంగా మంగళవారం కరాటే శిక్షణ ఇచ్చారు. మిర్యాగులగూలోని ఎన్పెస్పీ క్యాంపు గ్రౌండ్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని డీఎస్పీ కె.రాజశేఖరరాజు ప్రారంభించి మాట్లాడారు. మహిళా కానిస్టేబుళ్లకు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా కరాటే శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఐలు మోతీరామ్, సోమనర్సయ్య, పీఎన్డీ ప్రసాద్, కరాటే కోచ్ శ్రీధర్, ఎస్ఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో తనిఖీలుచిట్యాల : వ్యవసాయానికి ఉపయోగించే యూరియా, ఎరువులు పక్కదారి పడుతున్న నేపథ్యంలో చిట్యాల మున్సిపాలిటీలో, నార్కట్పల్లి మండలం గోపాలయపల్లిలోని ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలను మంగళవారం జిల్లా పరిశ్రమలశాఖ, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆ పరిశ్రమలో వాడుతున్న రసాయన పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సతీష్, నకిరేకల్ ఏడీఏ జానీమీయా మాట్లాడుతూ యూరియాను, ఎరువులను పరిశ్రమల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ గిరిబాబు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరులో 4 వేల మెట్రిక్ టన్నులు వస్తుంది
జిల్లాలో ప్రస్తుతం 2500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, ఈ నెలాఖరుకు మరో 4 వేల మెట్రిక్ టన్నులు వస్తుంది. నానో యూరియా 40 వేల లీటర్ల మార్కెట్లో అందుబాటులో ఉంది. నానో యూరియా ధర కూడా తక్కువగా ఉన్నందున రైతులు వినియోగించుకోవచ్చు. ఎక్కువ ధరకు యూరియాను విక్రయించకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ -
యూరియా ఏదయా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాలకు కేటాయించిన యూరియా నిల్వలు వెంటనే ఖాళీ అవుతున్నాయి. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇచ్చినా.. అందరికీ అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేట్ డీలర్లు ఇదే అదనుగా భావించి ఒక్కో బస్తాపై రూ.50కి పైగా అదనంగా వసూలు చేయడమే కాకుండా ఇతర పురుగు మందులను అంటగడుతున్నారు. మరోవైపు యూరియా కొరత కారణంగా మళ్లీ దొరకదేమో అనే ఆందోళనతో రైతులు ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేటాయింపు ఎక్కువ.. సరఫరా తక్కువ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 10,60,650 ఎకరాల్లో వివిద పంటలను రైతులు సాగు చేశారు. అందులో వరి 4,07,350 ఎకరాల్లో, పత్తి 5,59,640 ఎకరాల్లో, మిగతా కంది, పెసర, ఇతర మెట్ట పంటలను సాగు చేశారు. సీజన్లో పత్తి, వరి పంటకు రైతులు యూరియాను వినియోగిస్తున్నారు. జిల్లాకు ఈ సీజన్లో ఇప్పటివరకు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం అలాట్ చేసింది. కానీ, అందులో 44,500 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే జిల్లాకు సరఫరా అయింది. దీనిలో వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలకు 24 వేల మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 20,500 మెట్రిక్ టన్నుల కేటాయించారు. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు యూరియాను రైతులు వెంటవెంటనే కొనుగోలు చేస్తుండడంతో అక్కడ నాలుగైదు రోజుల్లోనే యూరియా ఖాళీ అయ్యింది. వర్షాలు పడుతుండటంతో పెరిగిన డిమాండ్ జిల్లాలో కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటం, వరి నాట్లు ఊపందుకోవడంతో పత్తి, వరి చేలకు యూరియా వినియోగం ఒక్కసారిగా పెరిగింది. రైతులు సీజన్ ఆరంభానికి ముందే యూరియాను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడంతో పాటు యూరియా వాడకం మోతాదును పెంచుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా కేటాయింపులో కోత విధిస్తోంది. ఈ కారణంగా జిల్లాలో యూరియా కొరత తీవ్ర అవుతోంది. మెజారిటీ పీఏసీఎస్లలో కొరతే ● చిట్యాల పీఏసీఎస్లో ప్రస్తుతం యూరియా అందుబాటులో లేదు. ఇప్పటివరకు రైతులకు ఎకరాకు రెండు బస్తాల చొప్పున యూరియాను మాత్రమే ఇచ్చారు. మండలంలో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 2500 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ● నాంపల్లి మండలంలో పీఏసీఎస్ల్లో యూరియా లేకపోవడంతో ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో బస్తాకు రూ.360 నుంచి రూ.400 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ● గట్టుపల్ మండలానికి 180 టన్నులు రాగా, ఇంకా అవసరముందని పది రోజుల కిందట ఇండెంట్ పెట్టి నగదు చెల్లించినా ఇంతవరకు అందలేదు. ● తిప్పర్తి, వేములపల్లి, పెద్దవూర మండలాల్లోనూ అధిక కొరత ఉంది. ● అనుముల మండలానికి 4 వేల మెట్రిక్ టన్నులు అవసరమైతే 1200 మెట్రిక్ టన్నులే వచ్చింది. ఒక్క కొత్తపల్లి పీఏసీఎస్కు వచ్చిన యూరియా వెంటనే అయిపోయింది. ఇక్కడ ఎకరానికి ఒక బస్తా మాత్రమే ఇచ్చారు. 120 మెట్రిక్ టన్నుల యూరియా కోసం డీడీ చెల్లించినా ఇంతవరకు రాలేదు. ● మునుగోడుకు వారం కిందట వచ్చిన యూరియా వెంటనే అయిపోయింది. మళ్లీ ఇప్పటివరకు రాలేదు. ● కనగల్, నిడమనూరు మండలాల్లోని పీఏసీఎ స్లలో వారం రోజులుగా, మాడులపల్లి సొసైటీల్లో నాలుగు రోజులుగా యూరియా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ సహకార సంఘాల్లో వెంటనే ఖాళీ అవుతున్న నిల్వలు ఫ ఫర్టిలైజర్ షాపుల బాట పట్టిన రైతులు ఫ బస్తాకు రూ.50 అదనం.. పురుగు మందులూ కొనాలని షరతు ఫ మళ్లీ దొరకదేమోనని అవసరానికి మించి యూరియా కొనుగోలు వ్యవసాయేతర అవసరాలకు యూరియా వాడొద్దునల్లగొండ : వ్యవసాయేతర అవసరాలకు యూరియా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం ఆమె నల్లగొండలోని ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణాన్ని, గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరం లేనిచోట యూరియా డంప్ చేయవద్దని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియా అమ్మాలన్నారు. యూరియా, ఎరువుల సక్రమ సరఫరా కోసం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆమె వెంట నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఉన్నారు. -
పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
నల్లగొండ : ప్రజలంతా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె నల్లగొండ పట్టణంలో గతేడాది ఏఆర్నగర్లో ఎక్కువ డెంగీ కేసులు నమోదైన ఏఆర్నగర్లో పర్యటించారు. వార్డు పరిసరాలు, డ్రెయినేజీలు, ఇళ్లను పరిశీలించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను గమనించారు. వార్డుల్లో ఓపెన్ డ్రెయినేజీలను మూసి వేయాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ను ఆదేశించారు. వార్డులో నిర్వహిస్తున్న జ్వర సర్వే వివరాలను మలేరియా సిబ్బంది మాట్లాడి తెలుసుకున్నారు. డాక్టర్లు వచ్చారా? రక్తం నమూనాలు తీసుకున్నారా? అని ఇళ్ల యజమానులను అడిగారు. లైన్వాడ ఆస్పత్రి తనిఖీ నల్లగొండ పట్టణంలోని లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న మందులు, నమోదైన హైరిస్క్ కేసులు, ప్రసవాల నమోదు, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల ఈడీడీ కేసులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. లైన్వాడ వార్డులో జనాభా ఎక్కువగా ఉన్నందున ఇక్కడ మరో పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్, డాక్టర్ ఇంతియాజ్, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు. మాదకద్రవ్యాలను నిర్మూలించాలి జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో మత్తుమందుల నివారణ జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత మత్తు మందులకు బానిస కాకుండా అన్ని స్థాయిలలో అవగాహన కల్పించాలన్నారు. నల్లగొండను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చాలన్నారు. పాఠశాలలు, కళాశాలెకల మాదకద్రవ్య నిర్మూలన కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ అతివేగం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ను కోరారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏసీపీ మౌనిక, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్, ఆర్డీఓలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సంపదను దోచుకుంటున్న పాలకులు
మిర్యాలగూడ : దేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టేందుకు కార్పొరేట్లు, ఓట్లను పాలకులు దోచుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సంపద కొంతమంది చేతుల్లోకి వెళ్తుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో అధికారం కోసం తప్పుడు మార్గాలు అనుసరిస్తోందని విమర్శించారు. బిహార్లో బీజేపీకి ఓటు వేయని 65 లక్షల ఓట్లను తొలగించారని ధ్వజమెత్తారు. స్వతంత్య్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిపోయిందన్నారు. కేంద్ర,. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. తెలంగాణాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్షతను చూపుతోందన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీశ్ఛంద్ర, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, శశిధర్రెడ్డి, రెమడాల పరుశురాములు, తిరుపతి రామ్మూర్తి, కరీం, నాగేశ్వర్రావునాయక్, రామారావు, ఉన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి -
45 శాతం అధిక వర్షం
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో సాధారణం కంటే 45 శాతం అధిక వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా 20 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జూలై చివరి వరకు జిల్లాలో లోటు వర్షపాతం నమోదవగా.. ఆగస్టు తొలి వారం నుంచి జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసి అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు 276 మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా.. 399 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 12 మండలాల్లో అత్యధికం జిల్లాలోని 12 మండలాల్లో అత్యధికంగా, 10 మండలాల్లో అధికంగా, 11 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. శాలిగౌరారం, మర్రిగూడ, చింతపల్లి, గుర్రంపోడు, అడవిదేవులపల్లి, పెద్దవూర, పీఏపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ, గుడిపల్లి, చందంపేట, మండలాల్లో అత్యధిక వర్షం కురిసింది. చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, కనగల్, అనుముల, హాలియా, మాడ్గులపల్లి, దామరచర్ల, తిరుమలగిరి సాగర్, నేరడుగొమ్ము మండలాల్లో అధిక వర్షం కురిసింది. కేతేపల్లి, తిప్పర్తి, నల్లగొండ, మునుగోడు, చండూరు, నాంపల్లి, నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి, మిర్యాలగూడ, గట్టుప్పల్ మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. ఊపందుకున్న వరి నాట్లు.. అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరి నాట్లు ఊపందుకున్నాయి. వారం క్రితం వరకు 2.50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ప్రస్తుతం వర్షాలకు తోడు నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ, మూసీ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు రావడంతో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,07,465 ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు మరో లక్ష ఎకరాల్లో రైతులు నాట్లు వేసుకునే అవకాశం ఉంది. ఫ జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు ఫ ఇప్పటి వరకు కురవాల్సింది 276 మి.మీ కురిసింది 399 మి.మీ -
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద రాక కొనసాగుతోంది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఎనిమిది క్రస్ట్గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు ఎగువ ప్రాంతాల నుండి మూసీకి 13,294 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 645 అడుగుల (4.46 టీఎంసీలు) గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో ప్రస్తుతం నీటిమట్టం 643 అడుగుల (3.94 టీఎంసీలు) వద్ద ఉంది. ప్రాజెక్టులో నాలుగు క్రస్ట్గేట్లను మూడు అడుగులు, మరో నాలుగు క్రస్ట్గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 12,270 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 94 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
ఎవరే నీకు అత్త.. కొడుకుని చితక్కొట్టిన తల్లిదండ్రులు
భువనగిరిటౌన్ : కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడంతో అతడి తండ్రి తన ఆస్తిని కుమార్తెల పేరిట వీలునామా రాశాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు జ్ఞానేశ్వర్ తన స్నేహితురాలైన గుండాల మండలం సుద్దాలకు చెందిన సౌమ్యతో ఇరు కుటుంబాల అంగీకారంతో మే 22న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న జ్ఞానేశ్వర్ తండ్రి ఈ నెల 16న తన ఆస్తిని తన ఇద్దరు కూతుర్ల పేరిట వీలునామా రాశారు. అదే రోజు సాయంత్రం తనను తన భార్యను ఇంటి నుంచి వెళ్లిపోవాలని గెట్టివేసినట్లు జ్ఞానేశ్వర్ ఆరోపించారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ తన భార్యతో కలిసి తన తండ్రి నిర్వహించే దుకాణం ఎదుట ధర్నాకు దిగాడు. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరడంతో పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. జ్ఞానేశ్వర్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటన ట్రోలింగ్గా మారింది. -
నాకు పదవి లేకున్నా.. ఉన్నట్లే
నల్గొండ జిల్లా: తనకు పదవి లేకున్నా.. ఉన్నట్లేనని, వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నానని, తన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న తన కుమారులతో కలిసి అభివృద్ధిలో భాగస్వాముడిని అవుతానని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దవూర మండలం గర్నెకుంట, వెల్మగూడెం గ్రామాల్లో మాజీ సర్పంచ్ దాచిరెడ్డి మాధవరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి(దాచిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి) సోదరులు రూ.12లక్షల సొంత ఖర్చులతో నిర్మించిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లను సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. సొంత నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు అప్పగించడం హర్షణీయమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మాధవరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. రెండేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని, ఇళ్లు రాలేదని ఎవరూ బాధపడవద్దని సూచించారు. ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధచూపుతూ నాకంటే ఎక్కువ మన్ననలు పొందాలని ఎమ్మెల్యే జైవీర్రెడ్డికి సూచించారు. వారంలో రెండు రోజులు మద్యం తాగడం బంద్ చేసి ఆ డబ్బులతో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని తనతో పాటు డీవీఎన్రెడ్డి కూడా కొంత సహాయం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, ధర్మారెడ్డి, బోయ నరేందర్రెడ్డి, వెంకటయ్య, రామలింగయ్య, నాగరాజు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
దోమలు పుట్టకుండా.. కుట్టకుండా..
నల్లగొండ టూటౌన్ : ప్రస్తుత వానాకాలంలో దోమలు వ్యాప్తి చెందకుండా వాటి ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అడ్డుకట్ట వేసేందుకు నీలగిరి వార్డుల్లో మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత ఏడాది పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వందలాది మంది డెంగీ, చికున్గున్యా, సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తుగా బస్తీ కాలనీలపై మున్సిపల్ యంత్రాంగం నజన్ పెట్టింది. దీంట్లో భాగంగా పేద, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా నివాసముంటున్న పట్టణంలోని ఏఆర్ నగర్, హిందూపూర్, పాతబస్తీ, అక్కచల్మ, లైన్వాడ, కుమ్మరివాడ, మాన్యంచల్క, హైదర్ఖాన్గూడ, అబ్బాసియా కాలనీ, రహ్మత్నగర్, షమ్స్నగర్, రాంనగర్, గొల్లగూడ, కేశరాజుపల్లి, బీటీఎస్, కతాల్గూడెం, మామిళ్లగూడెం, గంధంవారిగూడెం, అర్బన్ కాలనీ, లెప్రసీ కాలనీ, పానగల్, చర్లపల్లి, ఎన్టీఆర్ కాలనీ, గిరకబావి గూడెం, అక్కలాయిగూడెం, ముత్యాలమ్మ కాలనీ, సూర్యవంశీ కాలనీ గుట్ట, వెంకటరమణ కాలనీల్లోని బస్తీ వాసులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. వీటిపైనే అవగాహన.. ఇంటి ఆవరణలో పాత తొట్లు, ఇతర సామగ్రి, తాగి పడేసిన కొబ్బరిబోండాలు, మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది, మెప్మా ఆర్పీ, బస్తీల్లో పేదల ఇంటికి వెళ్లివారి ఇంట్లో ఉండే కూలర్లు, పూల కుండీలు, ఇతర పాత సామగ్రిని ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోని నీటి సంపులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లేకుండా దోమలు చేరి వాటి ద్వారా డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతాయని పేర్కొంటున్నారు. దోమలు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైతన్యపరుస్తున్నారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా జ్వరాలు, ఇతర వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి ఇంట్లో ఉండే సెప్టిక్ట్యాంక్ ఎయిర్ పైపులకు జాలీలు లేకపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. దీనిపై ప్రజలకు కనీస అవగాహన లేని కారణంగా సెప్టిక్ ట్యాంక్ ఎయిర్ పైప్కు జాలి పెట్టడంలేదు. పట్టణంలో ఒక్క శాతం ఇంట్లో కూడా ఎయిర్ పైప్లకు జాలి లేవనే చెప్పాలి. మున్సిపల్ యంత్రాంగం ప్రజలకు జాలీలు అమర్చుకునే విధంగా జాగృత పర్చాల్సిన అవసరం ఉంది. ఫ నీలగిరి బస్తీ కాలనీలపై మున్సిపల్ యంత్రాంగం నజర్ ఫ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు కార్యాచరణ ఫ ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్న సిబ్బంది ఫ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన బస్తీ కాలనీల్లో పరిశుభ్రతపై ప్రజలకు మున్సిపల్ సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఇంట్లోకి సిబ్బంది వెళ్లి పాత సామగ్రి తొలగించడం, కుండీలు, కూలర్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. అవసరంలేని వస్తువుల ద్వారా దోమలు ఎక్కువగా వస్తాయి. ఇళ్లలో అవి లేకుండా తొలగించుకోవాలి. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ -
గ్రీవెన్స్ డేకు కచ్చితంగా రావాల్సిందే..
నల్లగొండ: ప్రజావాణి కార్యక్రమం (గ్రీవెన్స్ డే)కు హాజరుకాని జిల్లా అధికారులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. నల్లగొండ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆయా సమస్యలను చర్చించేందుకు ఆయా శాఖలకు సంబంధించి ఇద్దరు, ముగ్గురు అధికారుల పేర్లను పిలువగా వారు రాలేదు. వారికి బదులు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గాకుండా ఏ శాఖ నుంచి సిబ్బంది వచ్చారో నిలబడాలని చెప్పడంతో సోషల్ వెల్పేర్, మత్స్య శాఖ, చేనేత జౌళి శాఖ, మున్సిపాలిటీ తదితర శాఖలకు సంబంధించిన సిబ్బంది నిలబడ్డారు. అయితే సోషల్ వెల్పేర్ డీడీ శశికళను మొదట అడుగ్గా వస్తుందని జూనియర్ అసిస్టెంట్ చెప్పారు. ఆ తర్వాత మరో వ్యక్తిని అడుగ్గా ఆ శాఖ నుంచి ఇద్దరు హాజరయ్యారు. ఇతర శాఖల నుంచి కూడా అధికారికి బదులు ఇద్దరిద్దరు హాజరయ్యారు. దీంతో ఇదేమన్న సినిమానా..బైవన్ గెట్ వన్ లెక్క ఒక అధికారికి ఇద్దరు, ముగ్గురు సిబ్బంది వస్తున్నారు ఇదేమన్న తమషానా అధికారులు గ్రీవెన్స్కు హాజరు కాకపోతే నేనొచ్చేది దేనికంటూ సీరియస్ అయ్యారు. సెలవులు సరిపోవడం లేదా.. సెలవులు వచ్చినయ్. ఇంకా సెలవులు సరిపోవడం లేదా ఎందుకు రాలేదంటూ వచ్చిన సిబ్బందిని కలెక్టర్ ప్రశ్నించారు. అదే సందర్భంలో ఎస్పీ వెల్పేర్ డీడీ శశికళ రావడంతో టైమ్ ఎంతయిదంటూ కలెక్టర్ ప్రశ్నించారు. సమయపాలన పాటించాలని ఆమెకు సూచించారు. చేనేత జౌళి శాఖ జూనియర్ అసిస్టెంట్ను మీ అధికారి ఎక్కడకు వెళ్లారని అడగ్గా చండూరు వెళ్లారని చెప్పగా ఇక్కడ జిల్లా సమావేశం వదిలిపెట్టి చండూరులో ఏంపని అంటూ మండిపడ్డారు. అదేవిధంగా ఫిషరీస్, కొందరు మున్సిపల్ కమిషనర్లకు బదులుగా సిబ్బంది హాజరు కావడంతో సీరియస్ అయ్యారు. తప్పనిసరిగా అధికారులంతా సమయానికి గ్రీవెన్స్కు హాజరు కావాలన్నారు. అధికారులు రాకుంటే నేనెవరితో మాట్లాడాలి. ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుకాని సంబంధిత అధికారులకు సీసీ ద్వారా ఫోన్ చేయించి హాజరు కావాలని ఆదేశించారు. దీంతో గ్రీవెన్స్ అంతా గతంలో ఎప్పుడూలేని విధంగా అధికారులు మూడు రోజులు సెలవులు వచ్చినా సోమవారం గ్రీవెన్స్కు హాజరు కాకపోవడంపై మొదటిసారిగా కలెక్టర్ మండిపడ్డారు. గ్రీవెన్స్ సమావేశాలకు కచ్చితంగా హాజరు కావాల్సిందే అని ఆమె ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజావాణి కార్యక్రమం హాట్హాట్గా కొనసాగింది. ఫ హాజరుకాని అధికారులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ ఫ కిందిస్థాయి సిబ్బందిని పంపిన కొందరు ఫ ఎందుకు రాలేదంటూ సిబ్బందిని ప్రశ్నించిన కలెక్టర్ ఫ అధికారులు రాకుంటే తానొచ్చేది ఎందుకని మండిపాటు -
యూరియా కొరత లేదు
నల్లగొండ: జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్కు కలెక్టరేట్ నుంచి ఆమె హాజరై మాట్లాడారు. జిల్లాలో సుమారు 70 శాతం మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారన్నారు. నానో యూరియాను వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయానికి కాకుండా పరిశ్రమలు, ఇతర పనులకు యూరియా వాడితే క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. యూరి యా పక్కదారి పట్టకుండా టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఏఓ శ్రవణ్ కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకురాలు ఛాయాదేవి, జిల్లా సహకార శాఖ అధికారి పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు భరోసా కల్పించాలి నల్లగొండ: పోలీస్ గ్రీవెన్స్ డేకు వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 38 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పూర్తి వివరాలు సమర్పించాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. వారి ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చిన్నారుల భద్రతపై నేటి నుంచి టీచర్లకు శిక్షణనల్లగొండ: ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు జిల్లాలోని 229 ఉన్నత పాఠశాలల నుంచి 229 మంది టీచర్లకు బాలల భద్రత, అక్రమ రవాణా అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని డైట్ కళాశాలలో నాలుగు విడతలుగా శిక్షణ తరగతులు కొనసాగుతాయని పేర్కొన్నారు. మొదటి విడత ఈ నెల 19, 20 తేదీల్లో, రెండో విడత 21, 22 తేదీల్లో, 3వ విడత 28, 29న నాలుగవ విడత సెప్టెంబర్ 8, 9 తేదీల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. -
బీసీ కోటాపై ఆశలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా పెంపు అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీసీలకు గతంలో ఉన్న రిజర్వేషన్ల కంటే ఈసారి పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆశావహులు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వపరంగా అమలు విషయంలో అడ్డంకులు ఉండడంతో పార్టీ పరంగా రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తూ ముందుకు సాగేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో దీనిపై పక్కా అభిప్రాయానికి రానుంది. మరోవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనూ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలోపే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం బీసీలకు ఎన్ని సీట్లు ఉన్నాయి.. ఎన్ని పెరిగే అవకాశం ఉంటుందో అధికార పార్టీతోపాటు ఇతర పార్టీల్లోనూ ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. భారీ అంచనాల్లో అధికార పార్టీ ఆశావహులు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు 2019లో జరిగాయి. 2024లో పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయింది. అయినా ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతోంది. అయితే ఇందుకు చాలా అడ్డుంకులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ల పెంపుపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా సానుకూల నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ కోణాల్లో ఆలోచనలు చేస్తున్నా, పార్టీ పరంగానే 42 శాతం రిజర్వేషన్ల అమలుతో ముందుకెళ్లే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏయే మండలాల్లో ఏయే గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు అవకాశాలు దక్కుతాయన్న విషయంలో అధికార పార్టీ నేతలు, ఆశావహులు అంచనాలు వేసుకుంటున్నారు. ఫ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న ప్రభుత్వం ఫ పార్టీ పరంగా ఓకే.. ప్రభుత్వ పరంగా తప్పని చిక్కులు ఫ త్వరలోనే పీఏసీ, కేబినెట్ సమావేశాల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఫ సెప్టెంబర్ మొదటి వారంలోపే జారీ కానున్న ఎన్నికల షెడ్యూల్! -
ఎనిమిది గేట్ల ద్వారా మూసీ ఉరకలు
కేతేపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం సాయంత్రం వరకు 15,643 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల రిజర్వాయర్లో 643.35 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు ఆదివారం నాలుగు గేట్లు ఎత్తగా సోమవారం మాత్రం ఎనిమిది క్రస్ట్ గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి ఇన్ఫ్లోకు సమాంతరంగా 15,442 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా మూసీ కుడి, ఎడమ కాల్వలకు 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యంగల రిజర్వాయర్లో ప్రస్తుతం 4.03 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. -
అమ్మా.. మా మొర ఆలకించరూ..
నల్లగొండ: నల్లగొండ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణికి పలు మండలాల నుంచి బాధితులు వచ్చి వివిధ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి పలువురిని నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కొందరు మా మొర ఆలకించి మమ్ములను ఆదుకోవాలని కలెక్టర్ను వేడుకున్నారు.అమ్మా నాన్న లేరు.. ఆదుకోండి మాకు అమ్మా నాన్న చిన్నతనంలోనే చనిపోయారు. అప్పటి నుంచి నన్ను, నా సోదరుడి కార్తిక్ను నానమ్మ బోడమ్మ కూలిపని చేసి పోషిస్తుంది. మా తాత కూడా చనిపోయాడు. నానమ్మే మాకు ఆధారం. తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. నాకు ఆరేళ్ల క్రితమే నరాల వ్యాధితో కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. నాకు పెన్షన్ రావడం లేదు. వికలాంగుల పింఛన్ విప్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – రక్షిత, దివ్యాంగురాలు, పజ్జూర్, తిప్పర్తి మండలం నా కాళ్లు చచ్చుపడిపోయాయి. ఎక్కడికి వెళ్లాలన్నా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. నా వెంట మరో మనిషి లేకుండా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఉంటూనే కుండలు తయారు చేస్తాను. నాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాపై దయదలిచి నాకు చార్జింగ్ ట్రైసైకిల్ ఇప్పించి ఆదుకోవాలి. – ఎర్రజెల్ల నాగమ్మ, చండూరు ఫ ప్రజావాణిలో కలెక్టర్ను వేడుకున్న బాధితులు -
గోదాములు ఫుల్!
వానాకాలం ధాన్యం వచ్చే నాటికి ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగిస్తే మిల్లుల్లో ఖాళీ ఉంటుంది. దాంతో కొత్తగా వచ్చే ధాన్యం నిల్వ చేసుకోవచ్చు. ప్రైవేట్ గోదాములు తీసుకుని అయినా సీఎంఆర్ సేకరణ వేగవంతం చేయాలి. – కర్నాటి రమేష్, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లాలోని గోదాముల్లో 4.05 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు 3.90 లక్షల మెట్రిక్టన్నుల బియ్యం నిల్వలున్నాయి. ప్రస్తుతం ర్యాక్లు వచ్చిన వెంటనే ఇక్కడి బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి మిల్లర్ల నుంచి సీఎంఆర్ తీసుకుంటాం. – సువిన్కుమార్, ఎఫ్సీఐ డీఎం నల్లగొండ : బియ్యం నిల్వలతో జిల్లాలోని ఎఫ్సీఐ గోదాములన్నీ నిండిపోయాయి. గోదాముల్లో ఖాళీ లేక మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ గోదాముల్లో ఇప్పటికే బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో గత యాసంగి సీఎంఆర్ తీసుకునే విషయంలో ఆలస్యమవుతోంది. దీంతో మిల్లులోనే ఉన్న ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని మిల్లర్లు అంటున్నారు. ఎఫ్సీఐకి ఇచ్చేది బాయిల్డ్ బియ్యమే.. జిల్లాలో నల్లగొండతో పాటు మిర్యాలగూడ, తిప్పర్తి, పెద్దకాపర్తి పరిధిలో ఎఫ్సీఐ గోదాములు ఉన్నాయి. ప్రతి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్ కింద పౌర సరఫరాల శాఖకు, ఎఫ్సీఐకి ఇస్తారు. పౌర సరఫరాల శాఖకు ఇచ్చే సన్న బియ్యం హాస్టళ్లు, రేషన్ షాపులకు వెళ్తుంది. ఎఫ్సీఐ మాత్రం యాసంగి ధాన్యానికి సంబంధించి బాయిల్డ్ బియ్యం తీసుకుంటుంది. ఇవ్వాల్సిన సీఎంఆర్ 2,24,915 టన్నులు యాసంగి సీజన్లో మొత్తం 6.03 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని మిల్లులకు ఇవ్వగా.. 4,07,300 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించి ఇప్పటి వరకు 1,82,618 మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్ కింద ఎఫ్సీఐ తీసుకుంది. ఇంకా 2,24,915 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రోజూ 1,500 టన్నుల బియ్యం తీసుకుంటున్నారు. ఉన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తేనే.. జిల్లాలోని గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ఎఫ్సీఐ ఇతర రాష్ట్రాలకు తరలిస్తేనే మిల్లర్ల నుంచి బియ్యం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వానాకాలం పంట సాగవుతోంది. ఆ దిగుబడి రాకముందే జిల్లాలో మిల్లర్ల నుంచి సీఎంఆర్ తీసుకుంటే మిల్లుల్లో ఉన్న ధాన్యం ఖాళీ అవడంతో కొత్తగా వచ్చే ధాన్యం నిల్వ చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రైవేట్ గోదాములనైనా అద్దెకు తీసుకుని మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ సీఎంఆర్ దిగుమతికి స్థలం కరువు ఫ మిల్లుల్లోనే మగ్గుతున్న ధాన్యం ఫ రంగుమారే ప్రమాదం ఉందంటున్న మిల్లర్లు -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి చివ్వెంల : బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం గుంజలూరు గ్రామ స్టేజి వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన నత్త భానుప్రకాశ్ (22), అతని స్నేహితులు మణిదీప్, పవన్ ముగ్గురు బైక్పై విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. గుంజలూరు స్టేజీ వద్దకు రాగానే వారి బైక్ అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న భానుప్రకాశ్ తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరికి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కూడా సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ట్రాక్టర్ ఢీకొనడంతో మరొకరు..గుండాల : మద్యం మత్తులో అతివేగంతో ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామంలో బోనాల పండుగను పురస్కరించుకొని గ్రామానికి చెందిన సంగు శ్రీను ట్రాక్టర్ను గ్రామ దేవతల చుట్టూ అతివేగంతో తిప్పుతుండడంతో అదుపు తప్పి గ్రామానికి చెందిన రామగిరి శ్రీరాములు (55) ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్పారు. పోతుగంటి లింగన్న, బుర్ర శేఖర్కు గాయాలైనట్లు పేర్కొన్నారు. గాయాల పాలైన వారిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో లింగన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇంకొకరు..డిండి: ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం డిండి మండలం పెద్దతండా సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన ముడి రాములు(58), ముడి శ్రీను తమ అవసరాల నిమిత్తం మండలంలోని బొల్లనపల్లి గ్రామానికి వెళ్లి బైక్పై స్వగ్రామానికి తిరుగి వస్తున్నారు. ఈ క్రమంలో దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డిండి నుంచి చెర్కుపల్లి స్టేజీ మీదుగా దేవరకొండకు వెళ్తోంది. ఈ సమయంలో పెద్దతండా సమీపంలోకి రాగానే ముడి శ్రీను నడుపుతున్న బైక్, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో బైక్ వెనుక కూర్చున్న ముడి రాములు రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన శ్రీనును దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రాములు మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పజెప్పారు. మృతుడి కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.లారీని ఢీకొన్న కోళ్ల వ్యాన్ ఒకరి మృత్యువాతచందంపేట: ఆగి ఉన్న లారీని కోళ్ల వ్యాను వెనుకనుంచి ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వేకువజామున చందంపేట మండలంపోలేపల్లి గేటు సమీ పంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిండి నుంచి వడ్ల లోడ్తో దేవరకొండకు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాను ఢీకొట్టింది. కోళ్ల వ్యానులో ఉన్న గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన భూతం లింగయ్య(45)కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాను డ్రైవర్ కుంటిగొర్ల సైదులు, మరో వ్యక్తి వడ్లమల్ల రాఘవేందర్కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూతం లింగయ్య మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు భార్య ఇందిరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ఏడుగురు వ్యక్తులకు గాయాలు చివ్వెంల, గుండాల, డిండి, చందంపేట మండలాల పరిధిలో ఘటనలుఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుంజలూరు స్టేజీ వద్ద ఒకరు, గుండాల మండలం బండ కొత్తపల్లి వద్ద, డిండి మండలం పెద్దతండాలో, చందంపేట మండలం పోలేపల్లి గేటు సమీపంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగు వ్యక్తులు మృత్యు వాతపడ్డారు. -
పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్గా శ్రీకాంత్గౌడ్
నాగారం : బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నాగారం మండలం మామిడిపల్లికి చెందిన గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్గౌడ్ను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను కన్వీనర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఐదుగురిపై కేసు నమోదు నార్కట్పల్లి: మండల కేంద్రంలో ఓ హోటల్పై దాడి చేసిన ఘర్షణలో ఐదుగురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీదేవి ప్రసాద్ హోటల్కు శనివారం రాత్రి కొందరు యువకులు వచ్చి క్యాషియర్తో గొడవ పడి హోటల్లోని సామగ్రి, ఫర్నిచర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. హోటల్ యజమాని శెట్టి ప్రవీణ్కుమార్ సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణ పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజ మాని ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన బోడ నవీన్, మేడి స్వామితో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
బత్తాయి ధర పతనం
గుర్రంపోడు : బత్తాయి ధర భారీగా పడిపోయింది. ప్రస్తుతం చేతికొచ్చిన సీజన్ కాయలు తోటల వద్ద టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు మించి ధర పలకడం లేదు. ఎండాకాలంలో దిగుబడి వచ్చే కత్తెర సీజన్ పంటకు ఈ యేడు వారం రోజులు పాటు టన్నుకు రూ.40 వేల ధర పలికి ఆ తర్వాత రూ.20 వేల పడిపోయి ఈ ధర నిలకడగా నిలిచింది. కత్తెర సీజన్లో గతంలో ధర టన్ను రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండేది. కత్తెర పంటకు మంచి ధర లభించి.. సీజన్ దిగుబడులు లేకున్నా రైతుకు ఊరట లభించేది. కానీ గత రెండేళ్లుగా కత్తెర, సీజన్ రెండు పంటలకూ మార్కెట్లో సరైన ధర లభించక రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదు. నష్టపోతున్నామని రైతుల ఆవేదన పదేళ్ల క్రితం బత్తాయి తోటలకు నల్లగొండ జిల్లా పేరుగాంచింది. అప్పట్లో నాలుగు లక్షల ఎకరాలోరైతులు బత్తాయి సాగు చేశారు. కాలక్రమేణా తోటలు తీసేసి.. వరి, ఇతర పంటల సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 40 వేల ఎకరాలకు బత్తాయి సాగు పడిపోయింది. దిగుబడి తగ్గినా బత్తాయికి రేటు మాత్రం పెరగడం లేదు. బత్తాయి ధర పెరుగుతుందేమోనని ఎదురుచూస్తున్న రైతాంగ కాయలు పండు పండి రాలిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ధర పెరుగుతుందనే ఆశలు వదులుకున్న రైతులు ఎదో ఒక ధరకు కాయలు అమ్ముకుంటున్నారు. బత్తాయికి పలురకాల మంగు నల్లి ఆశించడం, కాయలు పక్వానికి రాకముందే రాలిపోవడం లాంటి తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ను ముంచిన భారీ వర్షాలు బత్తాయి ధరలు ఇంతగా పడిపోవడానికి ఢిల్లీ, బనారస్, లక్నో, జైపూర్ తదితర ప్రాంతాల్లో రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణమని అంటున్నారు. మార్కెట్లలో సరుకు దిగుమతి చేసుకునే పరిస్ధితి లేక రోజుల తరబడి లారీలు నిలబడి ఉండటం వల్ల మార్కెట్ మందగించి ధరలు పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఆయా మార్కెట్లలో గతంలో రోజుకు 20 లారీల వరకు విక్రయాలు జరగగా.. ఇప్పుడు ఐదు లారీలకు మించి సరుకు అమ్ముడుపోవడం లేదని అంటున్నారు. ఇక.. అనంతపురం జిల్లాలో గతంలో కంటే ఈ యేడాది అనూహ్యంగా బత్తాయి దిగుబడులు పెరగడం కూడా ధరలు పడిపోవడానికి కారణమని తెలుస్తోంది. గతంలో నల్లగొండ జిల్లా నుంచే ఎక్కువ ఎగుమతులు ఉండగా ఇక్కడ తోటల విసీర్ణం తగ్గి దిగుబడులు కూడా తగ్గినా అనంతపురం దిగుబడులు మార్కెట్ను భర్తీ చేయడం వల్ల డిమాండ్ తగ్గిందని అంటున్నారు. ఫ క్వింటాకు రూ.15 వేలు మించని రేటు ఫ దిగుబడులు తగ్గినా పెరగని ధర ఫ భారీ వర్షాలు కారణమంటున్న వ్యాపారులు ఫ తోటల్లో రాలుతున్న కాయలు ఫ వచ్చిన రేటుకు అమ్ముకుంటున్న రైతులు బత్తాయి మార్కెట్లో కమీషన్ ఏజెంట్లుగా వ్యవహరించే దళారులు సిండికేట్గా మారి ధర పెరగకుండా నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్కు సరకు తగ్గినప్పుడు ధరను పెంచి సరుకు పెరిగాక ధరను తగ్గించడం.. వ్యాపారులకు మాత్రం మంచి ధర ఇచ్చి రైతులకు తక్కువ ధర ఇవ్వడం లాంటి జిమ్మిక్కులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో నిబంధనల మేరకు కేవలం నాలుగు శాతం కమీషన్ తీసుకోవాల్సి ఉండగా పదిశాతం కమీషన్ తీసుకోవడం, చూట్ కింద టన్నుకు క్వింటా తరుగు తీస్తున్నారు. అసలే ధర లేక.. మళ్లీ ఈ కోతలు.. పాట పాడింది ఒక రేటు కాగా చేతికి వచ్చేది మరో రేటుతో ఇవన్నీ బత్తాయి రైతును వేధిస్తున్నాయి. మార్కెట్ మోసాలకు భయపడి రైతులు ఏదో ఒక ధరకు ఇక్కడి దళారులకు అమ్ముకుంటున్నారు. -
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు శ్రావణ మాసం ముగుస్తుండడంతో శ్రీస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు 45 వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. భక్తులు అధికంగా రావడంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.58,05,696 వచ్చి నట్లు అధికారులు వెల్లడించారు.శ్రీస్వామి సన్నిధిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పూజలుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.సంప్రదాయ దుస్తుల్లో విదేశీయులుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఫ్రాన్స్ దేశస్తులు ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీస్వామి వారి ఆలయ నిర్మాణ శైలిని ఫ్రాన్స్ దేశస్తులకు వివరించారు. హైదరాబాద్కు వచ్చిన క్రమంలో యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చినట్లు వారు వెల్లడించారు. -
ఖాళీల భర్తీకి తాత్సారం
నల్లగొండ : అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్ల నియామకంలో విద్యుత్ శాఖ తాత్సారం చేస్తోంది. క్షేతస్థ్రాయిలో పనిచేసే సిబ్బంది కొరత కారణంగా ఉన్నవారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తోంద. దీంతో విధి నిర్వహణలో సిబ్బంది ఇబ్బందులు పడడంతోపాటు.. వినియోగదారులకు సేవలు అందడంలో తాత్సారం జరుగుతోంది. 2023లో జూనియర్ లైన్మెన్ల నియామకం చేపట్టానా.. వారిని క్షేత్రస్థాయిలో వినయోగించుకోకుండా.. సగం మందిని సబ్స్టేషన్లకే పరిమితం చేసింది. దీంతో ఫీల్డ్లో పని చేసేవారు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో లైన్మన్కు 3 వేల కనెక్షన్లు క్షేత్రస్థాయిలో పనిచేసే ఒక్కో జూనియర్ లైన్మన్ పరిధిలో 3 వేలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి. వారికి సహాయంగా అసిస్టెంట్ లైన్మన్ ఉంటారు. విద్యుత్ సరఫరాతో పాటు విద్యుత్ అంతరాయాలు నివారించడం, మీటర్ రీడింగ్, బిల్లుల వసూలు చేయాల్సిన బాధ్యత వారిదే. ఈ పనులన్నీ వారే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్రాంతాలను వారికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2023లో జేఎల్ఎం పోస్టుల భర్తీ క్షేత్రస్థాయిలో పని చేసేందుకు 2023లో జూనియర్ లైన్మెన్లను నియమించారు. వారంతా క్షేత్రస్థాయిలో పని చేయాల్సి ఉన్నా.. సగం మందిని సబ్స్టేషన్లలో విధులకు నియమించారు. అప్పుడు 136 పోస్టులను భర్తీ చేస్తే అందులో 68 మంది సబ్స్టేషన్లో నియమించగా.. 68 మంది మాత్రమే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. సబ్ స్టేషన్లలో 96 మంది రిటైర్డ్ ఉద్యోగులే.. సబ్ స్టేషన్లలో ప్రస్తుతం 96 మంది రిటైర్డ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వాస్తవంగా రిటైర్డ్ అయిన ఉద్యోగుల్లో కొందరు మాత్రమే ప్రత్యక్షంగా విధులు నిర్వహిస్తున్నారు. మరికొందరు వారి బదులు మరొకరిని పెట్టుకుని పని చేయిస్తున్నారు. వారిస్థానంలో కొత్త వారిని నియమిస్తే నిరుద్యోగులకు మేలు కలుగుతుంది. ఖాళీల వివరాలు ఇలా.. ఉద్యోగం మొత్తం పని ఖాళీలు పోస్టులు చేస్తుంది అసిస్టెంట్ లైన్మెన్ 194 144 50 జూనియర్ లైన్మెన్ 272 150 122 ఫ విద్యుత్ శాఖలో భారీగా జేఎల్ఎం, అసిస్టెంట్ లైన్మెన్ ఖాళీలు ఫ సిబ్బంది లేక క్షేత్రస్థాయిలో అందని సేవలు -
ఇంటి నిర్మాణానికి రుణం!
నల్లగొండ : ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే స్థోమత లేని పేదలకు ప్రభుత్వం రుణసాయం చేస్తోంది. ప్రభుత్వం ప్లాటు ఉండి ఇల్లులేని వారికి మొదటి విడతగా 19,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఇంటి నిర్మాణం ప్రారంభించి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేస్తేనే మొదటి విడత బిల్లు మంజూరవుతుంది. అందుకు బునాది తీయడం, రాతి కట్టడంతో పాటు సిమెంట్, సీకులు, ఇసుక , కూలీలకు, మేసీ్త్రలకు డబ్బులు అవసరం అవుతాయి. ఆ డబ్బులు లేని కొందరు పేదలు ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు. దీంతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇల్లు నిర్మించుకునే స్థోమత లేనివారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇప్పటికే జిల్లాలో 241 మందికి రూ.లక్ష రుణం అందజేశారు. సంఘాల్లో సభ్యులు కాకపోయినా.. జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేందుకు పేదలైన లబ్ధిదారులకు.. ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాల ద్వారా సీ్త్రనిధి, బ్యాంకుల ద్వారా రూ.లక్ష రుణం మంజూరు చేస్తున్నారు. జిల్లాలో 241 మందికి రూ.2.44 కోట్ల రుణం అందించారు. కొందరు మహిళా సంఘాల్లో సభ్యులు కాకపోయినా.. వారిని సభ్యులుగా చేర్చి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సంబంధిత డీఆర్డీఓ సిబ్బంది లబ్ధిదారులను గుర్తించి రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు పొందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నెలకు రూ.4 వేల చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే క్రమంలో ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చే డబ్బులను మంజూరు చేయగానే తిరిగి మహిళా సంఘాల ద్వారా తీసుకున్న అప్పును చెల్లించే అవకాశం కూడా ఉంది. ఫ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు ప్రభుత్వం భరోసా ఫ మహిళా సంఘాల సభ్యులకు సీ్త్ర నిధి, బ్యాంకుల ద్వారా రుణాలు ఫ జిల్లాలో ఇప్పటికే 241 మందికి రూ.లక్ష చొప్పున రుణం అందజేత -
కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు : ఎంజీయూ వీసీ
నల్లగొండ: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితేనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు ఉజ్వల భవిష్యత్ అందుకోగలుగుతారని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఆదివారం నల్లగొండలో వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నీట్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మెడికల్ కౌన్సిలింగ్ నిపుణులు హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఏ ఖాన్, షరీఫ్, మొయిజ్, మహమూద్, ఏంఏ పర్వేజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేతి ఉత్పత్తులపై పన్ను మినహాయించాలిసంస్థాన్ నారాయణపురం: చేతివృత్తుల ఉత్పత్తులపై ప్రభుత్వం పన్ను మినహాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. చేనేత జాతీయ యువత విభాగంలో అవార్డు గ్రహీత గూడ పవన్ను ఆదివారం సంస్థాన్ నారాయణపురంలో శ్రీనివాస్గౌడ్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ యువతకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలుతో పాటు స్వయం ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం ఆధ్యక్షుడు వీరమళ్ల కార్తిక్, మండల అధ్యక్షుడు బొల్లేపల్లి లక్ష్మణ్, దూసరి వెంకటేశం, కొత్త భాను, ఉప్పరగోని రాజు, జోకు స్వామి, లక్ష్మణ్, చిరంజీవి, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న యువకుడు మృతి మోటకొండూర్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కనికునూరి పవన్ కుమార్(22) బోడుప్పల్లోని అభయ ఆస్పత్రిలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 15న డ్యూటీకి వెళ్తున్నాని తేర్యాలలో తన ఇంటి నుంచి బయలుదేరి మండలంలోని ఆరెగూడెం శివారులోని వెంచర్లో పురుగు మందు తాగాడు. అనంతరం తన స్నేహితులు, బంధువులకు పురుగుల మందు తాగినట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే పవన్ వద్దకు వెళ్లిన బంధువులు అతడిని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తదిశ్వాస విడిచాడు. మృతుడి బంధువు మత్స్యగిరి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. మృతి గల కారణాలు తెలియరాలేదు. బైక్ అపహరణఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో మజ్జిగ రాంబాబుకు చెందిన టూవీలర్ బైక్( టీఎస్ 30–హెచ్8353)ను శ్రీకనకదుర్గ దేవాలయ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. రాంబాబు కుమారుడు వ్యవసాయ భావి నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్టు అడగడంతో బైక్ను ఆపాడు. దీంతో అతని చేతిలో నుంచి బైక్ను లాక్కొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
డీఈఈ సెట్–25 స్పాట్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్
నల్లగొండ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు 2025–27 బ్యాచ్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నల్లగొండలోని ప్రభుత్వ డైట్ కాలేజీలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ కె.గిరిజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్కు హాజరుకావాలని సూచించారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. మూసీకి కొనసాగుతున్న వరద కేతేపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్కు 6,191 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్గేట్లను ఐదు అడుగుల మేర పైకెత్తి 5,060 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 141 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 642.50 అడుగుల(3.84 టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంది. పుస్తక పఠనంతో మేధా శక్తి పెంపుమిర్యాలగూడ : పుస్తక పఠనం మేధాశక్తిని పెంపొందించడంతోపాటు చారిత్రక విషయాలను తెలియజేస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముక్తేశ్వర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో తడకమళ్ల రామచందర్రావు అధ్యక్షతన ‘ప్రణయ సౌరభం చారిత్రక వైభవం’ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. గ్రంథ రచయిత ముడుంబై పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో పుస్తకం, ఒక గ్రంథం రాయడం అనేది సామాన్య విషయం కాదన్నారు. ఎంతో నిబద్ధత, రాయాలని కోరిక బలంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. నేటి యువత ప్రతి విషయాన్ని సోషల్ మీడియా, గూగుల్పై ఆధారపడుతోందన్నారు. ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలను అందించి విద్యార్థులకు గత వైభవాన్ని తెలపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తడకమళ్ల రామచంద్రరావు, సంఘనభట్ల నర్సయ్య, సోమ అంజిరెడ్డి, గంజి సత్యనారాయణ, సూలూరు శివసుబ్రహ్మణ్యం, కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి, రామావతారం, పులి కృష్ణమూర్తి, లక్ష్మీనారాయణశర్మ, పయ్యావుల శ్రీనివాస్ రావు, సూదిని వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరాటేలో అక్కాతమ్ముడికి పతకాలుపెద్దవూర: మండలంలోని చలకుర్తి గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు కరాటేలో అంతర్జాతీయ పతకాలు సాధించి ఔరా అనిపించారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఇండో–నేపాల్ అంతర్జాతీయ కరాటే చాంపియన్ షిప్లో చలకుర్తికి చెందిన పాతనబోయిన విహాస్ కటా విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. అలాగే పాతనబోయిన సుదీక్ష రెండో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అక్కాతమ్ముళ్లు సుదీక్ష, విహాస్లకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
దేవరకొండ : కాంగ్రెస్పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన చేయూత పింఛన్దారుల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెంచకుండా మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 20నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయకున్నా.. ప్రతిపక్ష పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. వికలాంగుల పింఛన్ రూ.6 వేలు, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలతోపాటు చేయూత పింఛన్లన్నీ రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 3న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన చేయూత పింఛన్దారుల మహాగర్జనకు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. వీహెచ్పీఎస్ నాయకుడు సైదులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో గోవింద నరేష్, ఇరిగి శ్రీశైలం, మారుపాక గోపాల్, నల్ల శ్రీకాంత్, కాశీం, రామదాసు వెంకటాచారి, రామేశ్వరి, కిషన్లాల్ పాల్గొన్నారు. ఫ మంద కృష్ణమాదిగ -
కబడ్డీ పోటీల్లో జిల్లాకు మంచిపేరు తేవాలి
హుజూర్నగర్ : కబడ్డీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం హుజూర్నగర్లో యువ ప్రో కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ఎంపికై న జిల్లా క్రీడాకారుల జట్టును మంత్రి క్యాంప్ కార్యాయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులకు తమ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటందన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తున్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ను అధ్యక్ష కార్యదర్శులు అల్లం ప్రభాకర్రెడ్డి, నామ నరసింహరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, తన్నీరు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి -
పోలీస్ జాగిలం పింకీకి అంతిమ వీడ్కోలు
నల్లగొండ: పన్నెండేళ్ల పాటు విశేష సేవలంందించిన పోలీస్ జాగిలం పింకీ (ట్రాకర్) అనారోగ్యంతో ఆదివారం తుది శ్వాస విడిచింది. అనేక కేసుల్లో నేరస్తులను డిటెక్ట్ చేసి పోలీస్ శాఖకు పట్టించిన పింకీ విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. పింకీ అంత్యక్రియలను ఆదివారం పోలీసులు అధికార లాంఛనాలతో జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పలు కేసుల దర్యాప్తులో కీలకం ఉమ్మడి జిల్లాలో విధినిర్వహణలో భాగంగా పింకీ పలు కేసులో దర్యాప్తులో కీలకంగా వ్యవహరించింది. నల్లగొండ వన్టౌన్ పరిధిలోని బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలుగా నరికి కాళ్లు, చేతులు, మొండేన్ని వేర్వేరు చోట్ల పెట్టిన కేసు పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. నల్లగొండలో జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హల్ వద్ద జరిగిన రూ.1.40 కోట్ల చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితు ల జాడను తె లిపింది. గుండాల మండలం వంగాలలో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం తర్వాత నిందితుల ఇళ్లలోకి వెళ్లి పసిగట్టింది. ఇలా ఎన్నో కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పింకీ మృతిపట్ల ఎస్పీ శరత్చంద్ర పవార్ సంతాపం తెలిపారు. -
మిస్టరీగా మారిన ఈశ్వర్ మృతి
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకుడు ఈశ్వర్ మృతి మిస్టరీగా మారింది. శనివారం రాత్రి కాలనీ శివారులో అనుమానాస్పదంగా మృతిచెందిన యువకుడిని ప్రేమ వ్యవహారంలో హతమర్చారా..? లేక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదగోని సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమారుడు మాదగోని ఈశ్వర్(19) ఈ ఏడాది ఇంటర్ పూర్తిచేసి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కొంత కాలంగా పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు తన స్నేహితుల ద్వారా తెలిసింది. అయితే మృతుడు నడుపుతున్న బైక్ మృతదేహానికి వంద అడుగుల దూరంలోని పొలంలో పడి ఉండడం.. గొంతుపై కత్తితో కోసినట్లుగా గాయం ఉండడంతో హత్యగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే.. మృతదేహం తల, ఇతర భాగాలపై గయాలు కనిపించాలి కానీ అలాంటి ఆనవాలు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశ్వర్ మృతిచెందిన విషయం అతడు ప్రేమించిన యువతికి తెలియడంతోపాటు మృతదేహం ఫొటోలు ఆమె ఫోన్కు వీడియోలు పంపడం వెనుక హత్యకుట్ర దాగి ఉన్నట్లు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కులాంతర ప్రేమను విచ్ఛిన్నం చేసేందుకు పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలిమిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద కాలనీ వాసులు, బంధువులు చేరుకుని తమకు న్యాయం చేయలని ఆందోళన వ్యక్తం చేశారు. వన్టౌన్ పోలీస స్టేషన్కు వెళ్లి ఈశ్వర్ మృతికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులతో వన్టౌన్ సీఐ మోతీరాం మాట్లాడుతూ ఈశ్వర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని..త్వరలోనే నింధితులను గుర్తించి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వర్ తిరిగిన ప్రాంతాలను సీసీ ఫుటేజిల ద్వారా పరిశీలిస్తున్నామని, మృతుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అతడి కాల్ డేటాను సేకరిస్తున్నామని చెప్పారు. సీఐ హామీతో మృతుడి బంధువులు ఆందోళన విరమించుకున్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈశ్వర్ తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ పేర్కొన్నారు. న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన -
ఆర్ఎంపీపై సుమోటోగా కేసు నమోదు
తుంగతుర్తి : ఆర్ఎంపీ చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై స్పందించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సదరు డాక్టర్పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ తెలిపారు. వైద్యం వికటించి మహిళ మృతి అనే వార్త వివిధ పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆదివారం తుంగతుర్తిలోని సాయి బాలాజీ ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శించి విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తిలో ఆర్ఎంపీ శ్రీనివాస్ కొన్నేళ్లుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా సాయి బాలాజీ ఆస్పత్రి నిర్వహించడంతోపాటు గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయిస్తున్నారని స్థానికులు తెలిపారన్నారు. ఆయన వెంట డాక్టర్ విష్ణు తదితరులు ఉన్నారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలో అర్హత లేని వైద్యులు ఆస్పత్రులు నిర్వహిస్తూ వైద్యం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిలో అబార్షన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి కేసుపై కలెక్టర్ ఆదివారం తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ వెంటనే తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ కొరివిల్ల శ్రీనివాస్ అబార్షన్ చేయడం వల్లే విజేత అనే గర్భిణి మృతిచెందిందని డీఎంహెచ్ఓ తెలిపారు. -
మూసీ ప్రాజెక్టుకు భారీగా నీరు
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం వరద పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. శుక్రవారం ఉదయం 7,200 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సాయంత్రానికి 15,109 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో ఇప్పటికే నీటిమట్టం 645 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరువలో ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ఉదయం తెరిచిన ఆరు క్రస్టు గేట్లకు అదనంగా సాయంత్రం మరో మూడు క్రస్టు గేట్లను(మొత్తం 9 గేట్లు) రెండు అడుగుల మేర ఎత్తి 14,910 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగుకు 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు పోతున్న వరదనీరు -
ఏఎమ్మార్పీ నాలుగు మోటార్ల ద్వారా నీరు
పెద్దఅడిశర్లపల్లి : ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ వినియోగంలోకి వచ్చింది. నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు, హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు గాను ఏఎమ్మార్పీ నుంచి ఉదయ సముద్రానికి నీటి విడుదల కొనసాగుతుంది. పుట్టంగండి వద్ద గల సాగర్ వెనుక జలాల నుంచి ఏఎమ్మార్పీ నాలుగు మోటార్ల ద్వారా 2400 క్యూసెక్కుల నీరు ఏకేబీఆర్కి రావాల్సి ఉంది. అయితే యూనిట్ – 4 మోటారు మే నెలలో మరమ్మతులకు గురికావడంతో అధికారులు మే 28న బాగు చేసే పనులు ప్రారంభించారు. దీంతో మూడు మోటార్ల ద్వారా మొన్నటి వరకు కేవలం 1800 క్యూసెక్కుల నీరు ఏకేబీఆర్కు వచ్చింది. దీంతో ఉదయసముద్రానికి 1000 క్యూసెక్కుల నీటి మాత్రమే విడుదల చేశారు. ప్రధానకాలువ వెంట ఉన్న డిస్ట్రిబ్యూటరీలకు సరిపడా నీరు అందలేదు. అంతే కాకుండా ఏకేబీఆర్ లెవల్ను పెంచడానికి సరిపడా నీరు అందకపోవడంతో డి–7బీకి నీటి విడుదల సాధ్యం కాలేదు. మోటార్ మరమ్మతు పనులు బుధవారం పూర్తయ్యాయి. యూనిట్ – 4 మోటారును తిరిగి ప్రారంభించారు. దీంతో గురువారం నుంచి ఏఎమ్మార్పీ నాలుగు మోటార్ల ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు పంపుతున్నారు. అక్కడినుంచి ప్రధానకాలువ ద్వారా 1130 క్యూసెక్కులు ఉదయసముద్రానికి, హైదరాబాద్ జంటనగరాలకు 525 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 45 క్యూసెక్కులు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల కొనసాగుతుందని ఏఎమ్మార్పీ అధికారులు తెలిపారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
మిర్యాలగూడ అర్బన్ : దేశంలో అంతరాలు లేని సమాజస్థాపనకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామంలో నిర్వహించిన రాగిరెడ్డి వీరారెడ్డి 44వ వర్థంతిలో ఆయన మాట్లాడారు. ముందుగా సీపీఎం కార్యాలయం నుంచి రాయినిపాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఉన్న వీరారెడ్డి స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జూలకంటి మాట్లాడుతూ.. భూ పంపిణీ చేయాలని రాగిరెడ్డి వీరారెడ్డి రాజీలేని పోరాటాలు చేశారని గుర్తుచేశారు. వీరారెడ్డి ఉద్యమాలను తట్టుకోలేక దారుణంగా హత్య చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీష్చంద్ర, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, పాదూరి శశిధర్రెడ్డి, వినోద్ నాయక్, పోలెబోయిన వరలక్ష్మి, శ్రీనివాస్, రామ్మూర్తి, ఊర్మిల, గోవర్ధని, అరుణ, వాడపల్లి రమేష్, సైదులు, గోవిందరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీని లాభాల దిశగా నడిపిస్తాం
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ని లాభాల దిశగా నడిపించడానికి తమ పాలకవర్గం కృషి చేస్తుందని బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం తమ పాలకవర్గం పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిడించినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే లాభాల బాటలో పయనిస్తున్న బ్యాంకును వచ్చే ఆరునెలల కాలంలో మరింత బలోపేతం చేయనున్నామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, సభ్యులు పాశం సంపత్రెడ్డి, గుడిపాటి సైదులు, కొంద సైదయ్య, ధనావత్ జయరాం, బుంటు శ్రీనివాస్, వీరస్వామి, గొల్లగూడ సొసైటీ చైర్మన్ నాగరత్నంరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పొంగిన డిండి
డిండి : ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు దుందుబి వాగు ద్వారా మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపోస్తోంది. శుక్రవారం సెలవు దినం కావడంతో డిండి ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరింగింది. ఈ క్రమంలో ప్రాజెక్టు వద్ద ఆగి డ్యాం అలుగుపోస్తున్న అందాలను కొందరు తమ సెల్ఫోన్లో బందిస్తుండగా మరికొంతమంది సెల్పీ దిగారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 24,105 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ఇరిగేషన్ ఏఈ పరమేష్ తెలిపారు. డిండి ప్రాజెక్టు అలుగు ద్వారా దిగువకు పోతున్న వరద నీరు -
సంక్షేమానికి పెద్దపీట
99123 62784శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఎర్రకోట ఉత్సవాల్లో కోతులారం రైతు దంపతులుమునుగోడు : ఢిల్లీ ఎర్రకోటలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర వేడుకల్లో మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన రైతు జాజుల బుచ్చిరాములు, సైదమ్మ దంపతులు పాల్గొన్నారు. బచ్చిరాములుకు 10 పదెకరాల భూమి ఉండగా.. అందులోని 8 ఎకరాల్లో కలబంధ సాగు చేస్తున్నాడు. ఔషధ రంగంలో ఉపయోగించే కలబంధను ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దీతో కేంద్ర ఆయుష్ విభాగం ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు రైతు రామ్మూర్తి దంపతులు హాజరయ్యారు. లీగల్ అడ్వయిజర్గా గోవర్ధన్ నల్లగొండ టౌన్ : బీసీ సంక్షేమ సంఘం జిల్లా లీగల్ అడ్వయిజర్గా నల్లగొండ పట్టణానికి చెందిన రిటైర్డ్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, న్యాయవాది గుంటోజు గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోవర్ధన్ నియామకంపై సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేశబోయిన శంకర్ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. సాగర్లో ట్రాఫిక్ జాంనాగార్జునసాగర్ : సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పర్యాటకులు వచ్చిన కార్లు, బైక్లు, మినీ బస్సులను నదీ తీరం వెంట సాగర్ నుంచి మాచర్ల వెళ్లే కొత్త వంతెన సమీపంలో రోడ్డు నిలిపుతున్నారు. దీంతో పలుమార్లు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అప్రమత్తమైన ట్రాఫిక్ క్లీయర్ చేసి వాహనాలను పంపించారు. హెడ్కానిస్టేబుల్ చేతజెండా ఆవిష్కరణ నల్లగొండ: షీటీమ్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బక్కయ్య జెండా ఆవిష్కరించారు. బక్కయ్య ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. 40 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో పని చేసి పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా షీటీమ్స్ సీఐ కరుణాకర్ ఆయనకు జెండా ఆవిష్కరించే అవకాశాన్ని కల్పించారు. జెండా ఆవిష్కరించిన బక్కయ్య బావోద్యేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో షీటీమ్ ఎస్ఐ గౌస్, భరోసా ఎస్ఐ అంజలి, హెడ్కానిస్టేబుల్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, చిత్రంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ తదితరులు నల్లగొండ అంటేనే త్యాగాలకు పుట్టిల్లు. తల్లి దండ్రులు నాకు జన్మనిస్తే ఈ గడ్డ రుణం తీర్చుకునే భాగ్యం ఇక్కడి ప్రజలు కల్పించారు. రాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు కూర్చుంటే వీరతిలకం దిద్ది పోరు చేయి బిడ్డా అంటూ వెన్నంటే ఉన్నారు. – స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం సంక్షమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు. ప్రధానంగా విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కామన్ పీపుల్కు సింబల్ అన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా కులగణన చేశామని.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కంకణం కట్టుకున్నాని పేర్కొన్నారు. నల్లగొండను బంగారు కొండగా మార్చాలనే సంకల్పంతో జిల్లాలో ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిదులు సమష్టిగా కృషి చేస్తున్నారన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం.. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాం. కానీ.. ప్రతిపక్షాలు ప్రాజెక్టును ఆపేయాలనే దుష్ట ప్రచారం మొదలు పెట్టాయని.. వాళ్లకు సీట్లు, ఓట్లు, కమీషన్లు తప్ప మరో అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యం, సాగు, తాగునీటి రంగాలకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రోడ్లే జీవనాడులు.. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడులు రోడ్లే అని, రోడ్లు బాగుంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రమే మారుతుందన్నారు. అందుకే రాష్ట్రంలో హ్యాం పద్ధతిలో రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి 4 వరుసల రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు 2 వరుసల రోడ్లు, గ్రామాలను కలిపేలా రోడ్లను బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అన్ని పథకాలు అమలు చేస్తున్నాం ప్రజా సంక్షేమం కోసం అనే పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆడ పడుచులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాల చొప్పున 19,526 నిర్మించాలని తలపెట్టామని.. వాటిలో 4300 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో కొత్తగా 65,276 కొత్త రేషన్ కార్డులను ఇచ్చామన్నారు. పాత కార్డుల్లో 82,364 మంది సభ్యులను చేర్చి.. కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 2,43,175 మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. బ్రాహ్మణ వెల్లెంల పూర్తిచేశాం జిల్లాలో సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి బ్రాహ్మణవెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్, రిజర్వాయర్ పనులు పూర్తిచేసి సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. నెల్లికల్లు లిఫ్ట్ కింద 24,866 ఎకరాల ఆయకట్టు పెంచడానికి పరిపాలన ఆమోదం పొందామన్నారు. కేశవాపురం, కొండ్రపోల్, బొత్తలపాలెం, వాడపల్లి, వీర్లపాలెం, తోపుచర్ల, దున్నపోతులగండి తదితర లిఫ్ట్ల కోసం నిధులు మంజూరు చేశామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కింద 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా పని చేస్తున్నామన్నారు. జిల్లాలో లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి రూ.110 కోట్లతో 40 సబ్స్టేషన్ నిర్మిస్తున్నామని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని 200 పడకలకు పెంచామని.. గంధంవారిగూడెంలో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ప్రతి నియోజకవర్గంలో భూములు కేటాయించామని.. నల్లగొండలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణకు పోలీస్శాఖ మిషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా జిల్లా సరోతముఖాభివృద్ధికి కృషి చేస్తున్న శాసన మండలి చైర్మన్, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రదాన న్యాయమూర్తి, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, అధికార యంత్రాగానికి ధన్యవాదాలు తెలిపారు. నల్లగొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో విద్యార్థుల నృత్య ప్రదర్శనజాతీయ అవార్డు అందుకున్న రఘునందన్ రామగిరి(నల్లగొండ): పొగాకు నియంత్రణకు 20 ఏళ్లుగా కృషి చేస్తున్న మాచన రఘునందన్ నేషనల్ టోబాకో కంట్రోల్ హీరోస్ 2025 అవార్డు అందుకున్నారు. పొగాకు నియంత్రణ అంతర్జాతీయ వేదిక రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ (ఆర్సిటిసి) ఈ అవార్డును అందజేసింది. శుక్రవారం రఘునందన్ వర్చువల్గా జరిగిన సమావేశంలో పాల్గొని అవార్డు స్వీకరించారు. ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ పనిచేస్తూ సమాజ హితం కోసం రఘునందన్ పాటు పడుతున్నట్లు ఆర్సిటిసి ఆచార్యులు డాక్టర్ సోనూ గోయల్ కొనియాడారు. నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. ఇక ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, ఆరాధన చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, వెండి జోడు సేవోత్సవం నిర్వహించారు. నాగార్జునసాగర్: ఎగువ నుంచి సాగర్కు వరద స్వల్పంగా తగ్గింది. నాలుగు రోజులుగా 26గేట్లను ఎత్తిన అధికారులు.. శుక్రవారం 14గేట్లకు తగ్గించి నీటిని విడుదల చేస్తున్నారు. వద్ద పద్నాలుగు క్రస్ట్గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 1,44,694 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి 14 గేట్ల నుంచి, విద్యుదుత్పాదనతో కలిపి 1,38,244 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.90 అడుగులు ఉంది.ఫ విద్యా, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాం ఫ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎస్ఎల్బీసీ పూర్తి చేసి తీరుతాం ఫ హ్యామ్ పద్ధతిలో రోడ్లు నిర్మిస్తున్నాం ఫ నల్లగొండను బంగారుకొండ చేసేందుకు కృషి చేస్తున్నాం ఫ స్వాతంత్య్ర వేడుకల్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జిల్లాలో 2,33,981 మంది రైతులకు రూ.2044. 83 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద 5,26,363 మంది రైతులకు రూ.716.48 కోట్లు ఇచ్చామన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇస్తున్నామని.. 38,539 మెట్రిక్ టన్నుల యూరియాపాటు 3,66,872.45 టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లాలో 2928 మందికి 5577 ఎకరాల పోడు పట్టాల పంపిణీ చేశామన్నారు. ఫ 14 గేట్ల ద్వారా నీటి విడుదల -
సాగర్కు పర్యాటకుల తాకిడి
నాగార్జునసాగర్: సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. కృష్ణాష్టమి సందర్భంగా శనివారం సెలవు కావడంతో సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్పిల్ వే మీదుగా కిందకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ పరవళ్లను ఫొటోలు తీసుకుంటూ, సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. పర్యాటకుల వాహనాలతో లాంచీ స్టేషన్ వద్ద, ఫైలాన్ కాలనీ మూడు రోడ్ల కూడలిలో, కొత్త వంతెన సమీపంలో ట్రాఫిక్ జాం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 50 మంది, తెలంగాణ నుంచి 50 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకున్నారు. నాగార్జునకొండలో పర్యాటకులను వదలివచ్చిన లాంచీ స్టేషన్ సిబ్బందినాగార్జునకొండ సందర్శనకు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు లాంచీలో వెళ్లిన పర్యాటకులను నాగార్జునకొండలోనే వదిలి.. లాంచీ ఎక్కిన వారిని తీసుకుని లాంచీ స్టేషన్కు తిరిగి వచ్చింది. దీంతో 30 మంది పర్యాటకులు నాగార్జునకొండ పైనే ఉండిపోయారు. అక్కడున్న పర్యాటకులు ఫోన్లు చేయడంతో తిరిగి లాంచీ వెళ్లి రాత్రివేళ వారిని తీసుకుని వచ్చింది. లాంచీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కనీసం పర్యాటకులు అందరూ వచ్చారా లేదా అని చూసుకోకుండానే తిరిగి వస్తున్నారని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బంగారం చోరీ కేసులో ఇద్దరు దొంగల అరెస్టు
సూర్యాపేటటౌన్: సూర్యాపేట పట్టణంలోని శ్రీసాయి సంతోషి జ్యూయలరీ షాపులో జూలై 21న రాత్రి జరిగిన భారీ దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. నిందితుల నుంచి రూ.60లక్షల విలువ గల 554 గ్రాముల బంగారం, రూ.92,500 నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిన్ దినాజ్పుర్ జిల్లా, బైహోర్ గ్రామానికి చెందిన ఏ–4 అయిన మాలిక్ మొల్లా అనే దొంగను ఈ నెల 11న సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. అలాగే నేపాల్కు చెందిన ఏ–6 నిందితుడు అమర్ భట్ను ఖమ్మం పట్టణంలో అదుపులోకి తీసుకుని అతని వద్ద రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏ–6 నిందితుడైన అమర్భట్ ఖమ్మంలో దొంగలకు ఆశ్రయం ఇవ్వడం, రెక్కీ చేసేందుకు సహాయం చేసినట్టు చెప్పారు. ఏ–4 నిందితుడైన మాలిక్ మొల్లాను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తపన్ పోలీస్ స్టేషన్ పోలీసుల సహాయంతో అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు రూ.60 లక్షల విలువ గల 554 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.87,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బలార్ ఘాట్లోని జిల్లా కోర్టులో న్యాయమూర్తి వద్ద నిందితుడిని ప్రవేశపెట్టి ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి తీసుకుని నిందితుల రాష్ట్రాల బదిలీ (ట్రాన్సిట్) నిబంధనల ప్రకారం సూర్యాపేటకు తీసుకొచ్చారు. జూలై 27న మహిళ అరెస్టు, 14తులాలు స్వాధీనం ఇదే కేసుతో సంబంధమున్న మహిళను జూలై 27న అరెస్టు చేసి ఆమె వద్ద 14 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. ఆ మహిళను విచారించగా పలు విషయాలు వెల్లడించినట్టు చెప్పారు. అదేవిధంగా పట్టుబడిన మాలిక్ మొల్లాను విచారించగా నేపాల్కు చెందిన ఏ–1 ప్రకాశ్ అనిల్కుమార్, ఏ–2 కడక్సింగ్ అహుల్వాలియ, ఏ–3 పురన్ప్రసాద్ జోషి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లాకు చెందిన ఏ–5 జషిముద్దీన్తో కలిసి శ్రీసాయిసంతోషి జ్యూయలరీ షాపులో దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు. అద్దెకు తీసుకున్న రూంలో బంగారం పంచుకొని పరార్.. దొంగతనానికి పాల్పడిన దొంగలు షాపు సమీపంలో తీసుకున్న అద్దె రూంలో 5 భాగాలుగా పంచుకుని దొంగతనానికి సహకరించిన ఏ–7 అయిన యశోద అనే మహిళకు, ఏ–6 అయిన అమర్ భట్లకు ఖర్చుల కోసం కొంత బంగారం, డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. నేపాల్కు చెందిన ఏ–1 ప్రకాష్ అనిల్ కుమార్, ఏ–6 అమర్భట్లు ఇద్దరు ఖమ్మంలో గూర్కాగా పనిచేస్తూ వచ్చే సంపాదన సరిపోక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని ఖమ్మంలో దొంగతనాలు చేసి కేసుల్లో జైలుకు సైతం వెళ్లి వచ్చారు. మిగతా నిందితుల కోసం గాలింపు.. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు కాగా అందులో ముగ్గురిని అరెస్టు చేయగా మిగతా ఏ–1 ప్రకాష్ అనిల్కుమార్, ఏ–2 కడాక్ సింగ్, ఏ–3 పురన్ప్రజోషి, ఏ–5 జషిమొద్దీన్ నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాగా పనిచేసిన పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ నరసింహ అభినందించి రివార్డ్ అందజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుల నుంచి 554గ్రా. బంగారం, రూ.92,500 నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ -
సఖీ సెంటర్లో కుట్టు మిషన్ల పంపిణీ
నల్లగొండ : సఖీ సెంటర్లలో 17 మంది మహిళలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ రిసోర్స్ సెంటర్ పర్ ఉమెన్, ఓల్డ్ సాలిదారిటీ సహకారంతో కుట్టు మిషన్లు అందజేశామన్నారు. బాధిత మహిళలకు పోలీస్, న్యాయ శాఖల సమన్వయంతో త్వరగా న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సఖీ కేంద్రానికి నెలకు సుమారు 70 కేసులు వస్తున్నాయని.. వాటిని త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కె.కృష్ణవేణి, సుమలత, సునీత, వరుణ శ్రీ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టుల కోసమే రాజీనామా డ్రామా
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పెండింగ్లో ఉన్న కాంట్రాక్టుల కోసమే రాజీనామా డ్రామా అడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విమర్శించారు. రూ.18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చాడని ఆరోపించారు. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస మునుగోడు అభివృద్ధిపై లేదన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకణాలగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూసుకుంట్ల మాట్లాడారు. ‘ప్రభుత్వం సహకరిస్త లేదని అంటున్నావు.. మీ అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఒక్కసారైనా మునుగోడు నియోజకవర్గానికి తీసుకొచ్చావా’ అన్ని ప్రశ్నించారు. మునుగోడుకు నేనే మంత్రి.. నేనే రాజుగా రాజగోపాల్రెడ్డి వ్యవహరిస్తున్నాడని, మంత్రులను, ఎంపీని రానివ్వడం లేదన్నారు. ‘ఎల్బీనగర్ నుంచి పోటీచేస్తే మంత్రి పదవి వచ్చేదని అంటున్నావు.. మునుగోడుపై ప్రేమ ఉంటే మంత్రి పదవి ఎందుకు. మంత్రి పదవి స్టేజీల మీద మాట్లాడితే రాదు.. అధిష్టానంతో మాట్లాడితే వస్తుంది’ అని కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి వల్ల మునుగోడు నాశనం అవుతుందన్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తావో.. ఇంకేం చేస్తావో కానీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. సుశీలమ్మ ఫౌండేషన్కు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, తాను ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేపట్టానని అన్నారు. నిఝెజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలే కనిపిస్తున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన వెంట నారాయణపురం మండల బీఆర్ఎస్ పార్టీ మండల ఆధ్యక్షుడు నర్రి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఫ రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస.. అభివృద్ధిపై లేదు ఫ మునుగోడుకు మంత్రులను, ఎంపీని రానివ్వడం లేదు ఫ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి -
అమరవీరుల స్ఫూర్తితోనే ప్రజాపాలన
శాలిగౌరారం : అమరవీరుల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని ఏఐసీసీ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో నాడు రజాకార్ల చేతిలో పదిమంది ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తన సొంత ఖర్చులతో నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్లతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లానే కేంద్రబింధువు అన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రమేశ్బాబు, నాయకులు శ్రీకాంత్గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు దండ అశోక్రెడ్డి, గూని వెంకటయ్య, మాజీ సర్పంచ్ షేక్ ఇంతియాజ్, మాజీ ఎంపీటీసీ నోముల జనార్థన్, భూపతి వెంకటేశ్వర్లు, రామలింగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వాసవీ ఆలయానికి స్వర్ణ రథం
ఫ 17, 18 తేదీల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు దేవరకొండ : తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి స్వర్ణ రథాన్ని దేవరకొండ ఆర్యవైశ్య సంఘం నాయకులు సమకూర్చారు. ఈ నెల 17, 18 తేదీల్లో స్వర్ణరథం ప్రారంభోత్సవానికి దేవాలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. 18న రథోత్సవ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. -
సమగ్రాభివృద్ధి సాధించేలా..
పెద్దవూర : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సమగ్రాభివృద్ధి సాధించేలా గిరిజన సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యుక్త వయస్సులోని బాల, బాలికలకు చదువుతో పాటు ఆరోగ్యం, లైఫ్ స్కిల్స్ చాలా ప్రధానం. శారీరక మార్పులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన లేక గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు అనారోగ్యం బారిన పడుతుంటారు. వీటిపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్కు చెందిన వాయిస్ 4 ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాయ్స్ అండ్ గర్ల్స్ 4 చేంజ్ ఫైర్ ఫైల్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని ఆరు ఆశ్రమ పాఠశాలలు ముదిగొండ, దేవరకొండ, తెల్దేవర్పల్లి, అయిటిపాముల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలు, దేవరకొండ, పెద్దవూర బాలుర ఆశ్రమ పాఠశాలల్లోని ఏడు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఈ నెల 5వ తేదీ నుంచి కౌన్సిలర్లచే పదిరోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ 14వ తేదీన ముగిసింది. రోజుకో అంశంపై శిక్షణ.. పది రోజుల శిక్షణలో రోజుకు ఒక అంశంపై విద్యార్థులకు శిక్షణ నిచ్చారు. కలల నుంచి వాస్తవిక జీవితం, విజయం ఎలా సాధించాలి, ఉద్యోగాల్లోని రకాలు, ఆరోగ్య జీవన విధానం, హక్కులు, విధులు, కౌమరదశలో వచ్చే మార్పులు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ సాగింది. అకాడమిక్, నాన్ అకాడమిక్ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ, నాణ్యమైన ఉన్నత విద్య, విభిన్న రంగాల్లో ఉపాధి పొందేందుకు కావాల్సిన నైపుణ్యాలను సాధించటమే లక్ష్యంగా బాల, బాలికలకు శిక్షణ సాగింది. గ్రూపు డిస్కషన్ నిర్వహించి వారి ప్రాంతాల్లోని సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను బోధించారు. శిక్షణ చివరి రోజు శిక్షణకు సంబందించిన సర్టిఫికెట్లు అందజేశారు. ఫ గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు శిక్షణ ఫ జిల్లాలో ఆరు పాఠశాలల్లో పది రోజులపాటు కార్యక్రమం ఫ ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్న విద్యార్థులు పది రోజుల శిక్షణలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. కమ్యునికేషన్ స్కిల్స్, ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో నేర్చుకున్నాం. చదువుతో పాటు సమాజంలో ఎలా మసలుకోవాలో నేర్పించారు. పది రోజుల శిక్షణ ఎంతో సరదాగా, సంతోషంగా సాగింది. ఈ అంశాలను నిజ జీవితంలో అన్వయించుకుంటాం. – డి.హర్షవర్థన్, 8వ తరగతి, పెద్దవూర ఆశ్రమ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా మంది చిన్నచూపు ప్రదర్శిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఉంటారు. వీరిలో ఆత్మస్థైర్యాన్ని నింపి, నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి వాటిని ఎదుర్కొనేలా ప్రేరణ కల్పించాం. లింగ వివక్ష, సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఈ శిక్షణ అవకాశం కల్పించింది. చిన్నతనం నుంచే సమాజంపై గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేలా శిక్షణ ఉపయోగపడింది. – ముఢావత్ చత్రు, డీటీడీఓ, నల్లగొండ -
తప్పుడు హాజరుకు.. తప్పదు మూల్యం
ఫేక్ అటెండెన్స్ వేసిన 69 మంది పంచాయతీ కార్యదర్శులకు ఛార్జ్ మెమోలు ఇస్తే వారికి ఇబ్బందులు తప్పవు. పదోన్నతులు ఆగిపోవడంతో పాటు ఇంక్రిమెంటు కూడా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ కార్యదర్శులు ఆర్థికంగా నష్టపోతారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందించగా.. అయితే ఈ ఫేక్ అటెండెన్స్ కారణంగా పంచాయతీ కార్యదర్శులకు మాత్రం అవార్డుల్లో చోటు దక్కలేదు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పంచాయతీ కార్యదర్శుల నకిలీ హాజరును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వారందరికి ఛార్జ్ మెమోలు జారీ చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో పలువురు పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరుకానున్నా హాజరైనట్లుగా ఫేస్ రికగ్నిషన్ యాప్లో తప్పుడు పద్ధతిలో నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలోనే గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ ఆ నకిలీ హాజరు వేసినవారి వివరాలను జిల్లాలకు పంపి.. వారిపై చర్యలకు ఆదేశించింది. దీంతో వారికి ఛార్జ్ మెమోలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఫొటోలతో హాజరు నమోదు జిల్లాలో 844 పాత పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులంతా ప్రతి రోజు ఆయా గ్రామాలకు వెళ్లి వారికి ఇచ్చిన షేస్ రికగ్నిషన్ యాప్లో అటెండెన్స్ వేయాలి. కానీ.. కొందరు కార్యదర్శులు తప్పుడు పద్ధతిలో హాజరు నమోదు చేశారు. 69 మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు వెళ్లకుండానే.. వెళ్లినట్లుగా ఆ పంచాయతీలో పనిచేసే కార్యదర్శుల చేత తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేయించారు. గ్రామ పంచాయతీల వారీగా ఫేస్ రికగ్నిషన్ యాప్లో వేసిన అటెండెన్స్ హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఉన్న సర్వర్కు వెళ్తుంది. అక్కడ పరిశీలించిన అధికారులు కొందరు నకిలీ అటెండెన్స్ వేసినట్లు గుర్తించారు. వారి వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. ఇప్పటికే నోటీసులు జారీ జిల్లాలో తప్పుడు పద్ధతిలో అటెండెన్స్ వేసిన 69 మంది కార్యదర్శులకు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు డీపీఓ వెంకయ్య నోటీసులు జారీ చేశారు. ఎందుకు తప్పుడు పద్ధతిలో అటెండెన్స్ వేశారనే దానిపై వివరణ కోరారు. ఆ కార్యదర్శులు ఆ నోటీసుకు సమాధానం ఇచ్చారు. అయినా వారి వివరణ సక్రమంగా లేదని తేలింది. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో వారందరికీ ఛార్జ్ మెమోలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే చార్జ్ మెమోలకు సంబంధించిన అనుమతి వచ్చినట్లు తెలిసింది. దీంతో సోమవారం లేదంటే మంగళవారం వారికి చార్జ్ మెమోలు జారీ చేసే అవకాశం ఉంది. పంచాయతీ కార్యదర్శుల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ ఫ జిల్లాలో 69 మందికి ఛార్జ్ మెమోలు ఫ వారి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కట్.. ఫ స్వాతంత్య్ర దినోత్సవ అవార్డులు సైతం నిలిపివేత పేక్ అటెండెన్స్కు సంబంధించి 69 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. వారు వాటికి సమాధానాలు ఇచ్చారు. ఆ నివేదికను కలెక్టర్కు పంపించాం. కలెక్టర్ నిర్ణయం మేరకే చర్యలు తీసుకుంటాం. – వెంకయ్య, డీపీఓ -
నీలగిరిలో జంతు వధశాల
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో ఎన్నో ఏళ్లుగా జంతు వధశాల (స్లాటర్ హౌస్) ఏర్పాటుకు అడుగుల పడుతున్నాయి. నగర అభివృద్ధి పథకంలో భాగంగా సీడీఎంఏ ప్రత్యేక నిధుల ద్వారా మున్సిపాలిటీకి రూ.6 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల్లో రూ.5 కోట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చొరవతో జంతు వధశాల నిర్మాణానికి కేటాయించారు. నిర్మాణ పనుల కోసం త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధమవుతోంది. రోడ్లపై కోయడంతో ఇబ్బందులు నీలగిరి పట్టణంలో ఇప్పటి వరకు జంతు వధశాల లేదు. దీంతో మాంసం వ్యాపారులు పానగల్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, ప్రధాన కూడళ్లలో కూడా రోడ్ల మీదనే జంతువులను వధిస్తున్నారు. దీంతో వాటి వ్యర్థాల కారణంగా ఆ ప్రదేశాలు దుర్గందం వెదజల్లుతున్నాయి. దోమలు, ఈగలు వ్యాప్తి కూడా పెరుగుతోంది. దీనిపై స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు మంత్రి కోమటిరెడ్డి చొరవతో త్వరలోనే జంతు వధశాల నిర్మాణం కానుంది. జంతు వధశాల నిర్మాణం కోసం కలెక్టరేట్ వెనుక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. ఈ స్థలంలోనే జంతు వధశాల నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. వెటర్నరీ వైద్యుడు ధ్రువీకరించిన తర్వాతే.. నీలగిరి పట్టణంలో వందలాది యాట పోతులు కోస్తున్నా వాటిని ఏ అధికారి కూడా పరీక్షించలేదు. వాటిల్లో నాణ్యమైనవి ఏవో గుర్తించే అవకాశాలు లేకపోవడంతో వినియోగదారులకు కూడా నాణ్యమైన మాంసం లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వధశాల అందుబాటులోకి వచ్చిన తర్వాత వెటర్నరీ వైద్యుడు వ్యాపారులు తెచ్చిన జంతువులను పరీక్షించి ఆరోగ్యంగా ఉందని ధ్రువీకరించిన తర్వాతే వాటిని వ్యాపారులకు అప్పగిస్తారు. పశు వైద్యులు తిరస్కరిస్తే సంబంధిత యాట పోతులను వధించడానికి వీలు లేదు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత వ్యాపారులకు మున్సిపల్ యంత్రాంగం జరిమానాలు విధించనుంది. దీంతో వినియోగదారులకు నాణ్యమైన మాంసం లభించనుంది. ఫ రూ.5 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు ఫ కలెక్టరేట్ వెనుక స్థలం కేటాయింపు ఫ తీరనున్న వ్యాపారులు, వినియోగదారుల ఇబ్బందులు -
బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకం
నల్లగొండ టూటౌన్ : బీజేపీ జిల్లా కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి శనివారం ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా మైల నరసింహ, శాగ చంద్రశేఖర్రెడ్డి, బచ్చనబోయిన దేవేందర్యాదవ్, సజ్జల నాగిరెడ్డి, వనం నరేందర్రెడ్డి, పకీర్ మోహన్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, మన్సాల వెంకన్న నియమితులయ్యారు. జిల్లా కార్యదర్శులుగా ఇస్లావత్ బాలాజీనాయక్, రమనగోని దీపిక, ఏరుకొండ నర్సింహ, తాటిపాముల శివకృష్ణగౌడ్, ఇరిగిసెట్టి అనిత, పబ్బు వెంకటేశ్వర్లును నియమించారు. జిల్లా కోశాదికారిగా కాసాల జనార్థన్రెడ్డి, ఉప కోశాధికారిగా తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, కార్యాలయ కార్యదర్శిగా గోసెట్టి భద్రమ్మ, కార్యాలయ ఉప కార్యదర్శిగా మంగిలిపల్లి కృష్ణమూర్తి, ఐటీ ఇన్చార్జిగా కంచుగొమ్ముల వేణును నియమించారు. వ్యవసాయ మంత్రిని కలిసిన డీసీసీబీ చైర్మన్ కుంభంనల్లగొండ టౌన్ : పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించిన సందర్భంగా శనివారం హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాధికారం కోసం ఉద్యమించాలిసంస్థాన్ నారాయణపురం: రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉద్యమించాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ పిలుపునిచ్చారు. సంస్థాన్నారాయణపురం మండలంలోని కంకణాలగూడెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్తో కలిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచన విధానాలు గొప్పవిని, వాటిని యువత ఆచరణలో పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్వి యాదయ్య, నర్రి నర్సింహ, బైరి శేఖర్, రవీందర్, రమేష్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్.. రప్పా.. రప్పా అంటూ..
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రప్పా.. రప్పా అంటూ ఫ్లెక్సీల వార్ మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫొటోలతో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. సూర్యాపేటలో మరోసారి రప్పా రప్పా ఫీవర్ మొదలైంది. నెల రోజుల క్రితం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కౌంటర్గా తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవాళ కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల ఇచ్చే కార్యక్రమానికి జగదీష్ రెడ్డి హాజరు కానున్నారు.ఈ నేపథ్యంలో కలెక్టరేట్కు వెళ్లే దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ ఫొటోతో ఎదురొస్తే రప్పా.. రప్పా అంటూ రాసుకొచ్చారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్పై తెలంగాణ బెబ్బులి పులి - ఉత్తమ్ అన్న యువశక్తి అంటూ రాశారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట రాజకీయం ఆసక్తికరంగా మారింది. -
అయ్యా రేవంత్ రెడ్డి పదవులూ మీకే.. పైసలూ మీకేనా?
సంస్థాన్ నారాయణపురం: ‘పదవుల్లో మీరే ఉంటరు.. పైసలు మీరే తీసుకుంటరు. నాకు పదవి ఇవ్వకపోయినా నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘పదవి వచ్చేటప్పుడు వస్తుంది. మనను ఎవరూ ఆపలేరు. పదవులు మీకే.. పైసల్ మీకే అని కొన్ని రోజుల కిందట అన్నాను. సీఎం రేవంత్రెడ్డిని అన్నానని తెలుసు కదా. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదు. మంత్రి దగ్గరకి వెళ్లి అడిగినా రాలే. పనిచేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించమంటున్నారు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్ చేతిలో ఉంది. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి’ అని వ్యాఖ్యానించారు. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని రాజగోపాల్రెడ్డి చెప్పారు. -
ఒకే మాట.. ఒకటే బాట
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామాల్లో మద్యం అమ్మకాల నిషేధం కఠినంగా అమలవుతోంది. అల్లందేవిచెర్వు గ్రామం నుంచి ప్రారంభం.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరేళ్ల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో.. బెల్టుషాపులు మూసివేసి మద్యం అమ్మకాలను నిషేధించిన గ్రామాల అభివృద్ధి కోసం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరిట రూ.5లక్షలు ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. దీంతో సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు గ్రామస్తులు సమావేశమై తీర్మానం చేశారు. అందుకు అనుగుణంగా గ్రామంలో బెల్టుషాపులను మూసివేసి, మద్యం అమ్మకాలను నిషేధించారు. ఆ తర్వాత చిమిర్యాల గ్రామస్తులు కూడా ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ రెండు గ్రామాల స్ఫూర్తితో గ్రామాగ్రామాన బెల్టుషాపుల మూసివేత పోరాటం కొనసాగింది. మద్యం అమ్మకాలు నిషేధించిన అల్లందేవిచెర్వు గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఐదేళ్ల కిందట రూ.5లక్షలు ప్రోత్సాహకం అందజేశారు. ఆ నిధులతో గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో అమలు చేశా ఎమ్మెల్యే ప్రకటనతో గ్రామస్తుల సహకారంతో మద్యం అమ్మకాలను నిషేధాన్ని కఠినంగా అమలు చేశాం. దీంతో మా గ్రామానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.6లక్షలు నిధులు ఇవ్వడంతో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించుకున్నాం. – సుర్వి యాదయ్య, మాజీ సర్పంచ్ -
మునుగోడులో ‘ప్లాస్టిక్’పై చైతన్యం
మునుగోడు: పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ కవర్లు మునుగోడు మండలంలో కనుమరుగయ్యాయి. మూడు నెలల క్రితం వరకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా వినియోగించేవారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మండల, గ్రామ స్థాయి అధికారులంతా రంగంలోకి దిగి ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపర్చారు. దీంతో మండలంలో దశలవారీగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని మానిపించారు. ప్రతి దుకాణాన్ని తనిఖీ చేస్తూ ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి చెక్ పెట్టారు. చాటుమాటుగా వినియోగిస్తున్న దాదాపు 30మందికిపైగా దుకాణాదారులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు జరిమానాలు విధించారు. దీంతో ప్రస్తుతం మండల వ్యాప్తంగా వివిధ దుకాణాల్లో చూద్దామన్నా ప్లాస్టిక్ కవర్లు కన్పించడం లేదు. -
సేంద్రియ సాగులో రాణిస్తున్న పట్టభద్రుడు
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిల్లపాటి గోవర్ధన్రెడ్డి ఉన్నత చదువులు చదివి వ్యవసాయంపై ఉన్న మక్కువతో సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తున్నారు. అర్ధశాస్త్రంలో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తిచేసిన గోవర్ధన్రెడ్డి గత నాలుగేళ్లుగా గోఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతరించిపోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణాన్ని, భూమి, నీరు పరిరక్షించుకోవడం, తగ్గుతున్న భూసారాన్ని కాపాడాలనే లక్ష్యంతో సేద్యం చేస్తున్నారు. రసాయన మందులు లేని ఆహారాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం కోసం కృషిచేస్తున్నారు. గోవుల పెంపకంతో వాటి మలమూత్రంతో జీవామృతం, ఘన జీవామృతం, గో కృపామృతం, కషాయాలు ఉపయోగించి దేశవాళి పంటలను పండిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు వరిలో దేశవాళి రకాలైన నవార, రత్నచోళి, మైసూర్, మల్లిక, మట్ట రైస్, కులాకర్, కృష్ణప్రియ, బహురూపి పండిస్తున్నారు. సేంద్రియ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఆశించిన లాభాలు వస్తున్నాయని ఆయన పేర్కొంటున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుడమి పుత్ర పురస్కారాన్ని గతేడాది డిసెంబర్లో యాదగిరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో గోవర్ధన్రెడ్డి అందుకున్నారు. సేంద్రియ వ్యవసాయంపై తాను అవగాహన పెంచుకుంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నానని ఆయన చెబుతున్నారు. -
స్వేచ్ఛ, సమానత్వం అంతంతే..
77 ఏళ్లుగా మువ్వన్నెల రెపరెపలురాజాపేట: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం రైతాంగ సాయుధ పోరాటం తర్వాత 1948 సెప్టెబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి లభించడంతో రాజాపేట మండలం బేగంపేట గ్రామం నడిబొడ్డున అదే గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్య జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 77 ఏళ్లుగా బేగంపేట గ్రామం నడిబొడ్డున మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. తమ పెద్దలు చూపిన మార్గాన్ని ఇప్పటికీ గ్రామస్తులు అనుసరిస్తూ నిరంతరాయంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్తులంతా కలిసి ఆ జెండా ఎగురవేసే ప్రదేశంలో 1979లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. యువతతో పాటు భావిభారత పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15వ తేదీ, దసరా పండుగ రోజున పాత జెండాను మార్చి నూతన జెండాను ఎగురవేస్తూ జాతీయ నాయకులను స్మరించుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశ వ్యాప్తంగా 79 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలోనూ స్వేచ్ఛ సమానత్వం లేకుండాపోయిందని నేటి యువతరం వాపోతోంది. సమాజంలో అవినీతి, పేదరికం ఇంకా ప్రధాన సమస్యగానే ఉన్నాయని పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. ప్రజలు, ముఖ్యంగా యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, స్వేచ్చ, సమానత్వం అందుతున్న తీరు, స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే ఏం చేయాలన్న అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. 90 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాం. దేశానికి స్వాంతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తయినా సమాజంలో ఇప్పటికీ స్వేచ్ఛ సమానత్వం లేకుండా పోయిందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అవినీతి పేదరికం కొనసాగుతోందని, అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే.. అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతో పనిచేయాలని, చట్టసభలు సమర్థవంతంగా వ్యవహరించాలని, న్యాయ వ్యవస్థ మరింత మెరుగైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇందులో మీడియా పాత్ర ప్రధానమేనని వివరించారు. బేగంపేట గ్రామంలో నిరంతరాయంగా ఎగురుతున్న జాతీయ పతాకంమీడియాకులవివక్ష6చట్టసభలు 21అధికార యంత్రాంగం న్యాయ వ్యవస్థ3924కొద్దిగాఅవునులేదు78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత.. 1. మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏదీ? ఫ అవినీతి, పేదరికమే అసలు సమస్య ఫ అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతోనే మేలు ఫ నాణ్యమైన విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే ‘సాక్షి’ సర్వేలో యువత మనోగతం 3. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగం ఏదీ? -
స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: నల్లగొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించనున్నారు. వివిధ రకాల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆస్తుల పంపిణీలో మంత్రి పాల్గొననున్నారు. వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నల్లగొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లయిన ఎన్జీ కాలేజి, గడియారం సెంటర్, ఇతర కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమయ్యాయి. మండల ప్రత్యేకాధికారుల పాత్ర కీలకంనల్లగొండ: అభివృద్ధి కార్యక్రమాల అమలులో మండల ప్రత్యేకాధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకాధికారులు మండలాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. విద్య, వైద్య పథకాల అమలు తీరుపై నివేదికలు సమర్పించాలని సూచించారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని జిల్లా రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని, యూరియా బయటికి పోకుండా చూడాలన్నారు. అనంతరం ప్రత్యేకాధికారులు వారి పరిధిలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, కేజీబీవీలు, హాస్టళ్లు, ప్రభుత్వ సంస్థల సందర్శన, అధికారుల పనితీరుపై నివేదికలను కలెక్టర్కు అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్చార్జ్ డీఆర్ఓ అశోక్ రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్ నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో 2025– 26కు సంబంధించి గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు 19వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సమన్వయ అధికారి బలరాం గురువారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సిలింగ్కు హాజరుకావాలని పేర్కొన్నారు. 30న డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్ష నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ చదివి 6వ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వారికి ఈనెల 30న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ సీఓఈ ఉపేందర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరిశోధనలతో విజ్ఞానం పెంపొందుతుందినల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పరిశోధనలపై మక్కువ పెంచుకుంటే విజ్ఞానం పెంపొందుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం విద్యార్థిని వాణి గాయత్రి, ఎంబీఏ ద్వితీయ సంవత్సర విద్యార్థిని సనా కౌసర్ ప్రభుత్వ వైద్య సేవల్లో సిబ్బంది, వారి పని ప్రదేశాల్లో ఎదురయ్యే ప్రమాదాలు అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన అంశం స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ జనరల్లో ప్రచురితం కావడంతో గురువారం వీసీ వారిని అభినందించారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, ప్రొఫెసర్ సరిత, డా. సబినా హరాల్డ్, డా.సురేష్రెడ్డి, డా.వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భవిష ్యత్ భారత్దే..
నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి కృత్రిమ మేధ, డిజిటల్ నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కోవిడ్ తర్వాత నైపుణ్యాల్లో అసమానతలు మరింత పెరిగాయి. లక్షలాది మంది యువత శిక్షణ లేక నిరుద్యోగులుగా మారారు. పారిశ్రామిక అవసరాలకు తగిన ప్రతిభ లోపించడం ప్రధాన సమస్య. ఈ పరిస్థితి అధిగమించాలి. – ఎండీ. మీరాజుద్దీన్ ● విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది ● కీలకం కానున్న యువత పాత్ర ‘సాక్షి’ టాక్ షోలో ఎన్జీ కళాశాల విద్యార్థుల మనోగతం -
వరదలతో అప్రమత్తంగా ఉండాలి
మిర్యాలగూడ : రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇర్కిగూడెం ఘాట్ వద్ద చేపలు పట్టేందుకు మత్స్యకారులు లోపలికి వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా నియమించాలని తహసీల్దార్ను ఆదేశించారు. అంతకు ముందు తెలంగాణ –ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన దామరచర్ల మండలం వాడపల్లి చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యం, ఇసుక, యూరియా అక్రమంగా రవాణా కాకుండా పటిష్ట నిఘా ఉంచాలని అఽధికారులను ఆదేశించారు. అనంతరం దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు పాము, తేలు కాటు వంటి మందులతోపాటు సీజనల్ మందులను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పీహెచ్సీ పరిధిలోని పాఠశాలలను ప్రతి గురువారం వైద్యాధికారి సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి, తహసీల్దార్ జవహర్లాల్, పీహెచ్సీ వైద్యుడు నాగేశ్వర్రావు ఉన్నారు. ఫ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫ దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణమ్మ ఉధృతి పరిశీలన -
మన నడిగూడెంలోనే.. జాతీయ జెండా రూపకల్పన
నడిగూడెం : భిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశాన్ని ఏకం చేస్తూ దేశ కీర్తిని తన మువ్వన్నెల్లో ప్రతిబింబిస్తూ భారతీయులంతా సగర్వంగా సెల్యూట్ చేస్తున్న మన జాతీయ పతాకానికి నడిగూడెం రాజావారి కోటలో రూపకల్పన జరిగింది. నాటి మునగాల పరగణాను నడిగూడెంలోని కోటను కేంద్రంగా చేసుకుని జమీందారు బహుద్దూర్ రాజా నాయిని వెంకటరంగారావు పాలన సాగిస్తున్నారు. ఈ సమయంలో రాజావారికి పింగళి వెంకయ్య పరిచయం కాగా తన కోటకు ఆహ్వానించి వ్యవసాయ అధికారిగా నియమించారు. ఈ సమయంలోనే పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పనకు పూనకున్నారు. కోట సాక్షిగా త్రివర్ణ పతాకం.. నడిగూడెం రాజావారి కోటలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న పింగళి వెంకయ్య కోట సాక్షిగా జాతీయజెండాకు రూపకల్పన చేశారు. 1916 లక్నోలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయజెండాను ఎగురవేశారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో నేటి విజయవాడ (నాటి బెజవాడ)లో ఎగురువేశారు. గాంధీజీ ఈ సమావేశానికి వెంకయ్యను పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులతోపాటు సత్యం, అహింసకు నిదర్శనమైన తెలుపు రంగు మధ్యలో రాట్నంగల ఒక జెండాను రూపొందించమని కోరారు. దీంతో గాంధీ సూచన మేరకు వెంకయ్య 1921 మార్చి 31న జెండాను పూర్తిస్థాయిలో రూపొందించారు. ఈ జెండాకు రూపకల్పన జరిగి 2021 మార్చి 31న వందేళ్ల వేడుకలను జరుపుకుంది. అయితే 1947 జూలై 22న భారత్య రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ పతాకంలోని రాట్నాన్ని తీసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఏర్పాటు చేశారు. చిహ్నం మార్పు తప్పితే మన పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. కోటలో డక్కన్ ఆర్కియాలజీ అండ్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరిన నడిగూడెం రాజావారి కోటను మునగాలకు చెందిన చరిత్ర నిపుణుడు జితేంద్రబాబు మరమ్మతులు చేయించి అభివృద్ధి పరిచారు. ఇదే కోటలో ప్రస్తుతం జితేంద్రబాబు ఆధ్వర్యంలో డక్కన్ ఆర్కియాలజీ అండ్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధనా కేంద్రంలో దాదాపు రెండున్నర లక్షలకుపైగా పుస్తకాలు, లక్ష తాళపత్ర గ్రంథాలు ఉంచారు. జెండా చారిత్రక నేపథ్యానికి గుర్తుగా నడిగూడెంలో 108 అడుగుల ఎత్తుగల స్తంభంపై 30 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు కలిగిన జాతీయజెండా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తిచేశారు. అధికారికంగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఫ పింగళి వెంకయ్య చేతుల్లో రూపుదిద్దుకున్న త్రివర్ణ పతాకం ఫ జమీందారు నాయిని వెంకటరంగారావు కోటలో జెండా కూర్పు ఫ గాంధీజీ సూచనతో తెలుపు రంగుతో తుది మెరుగులు -
డీసీసీబీ పాలకవర్గ పదవీకాలం పొడిగింపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా నాగార్జున మార్కెటింగ్ సొసైటీ (ఎన్డీసీఎంఎస్), జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. గురువారం పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గురువారమే వాటి పదవీకాలాన్ని పొడిగిస్తూ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్రావు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 107 పీఏసీఎస్లు, ఎన్డీసీఎంఎస్తోపాటు డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు మరో ఆరునెలలపాటు ఆ పదవుల్లో కొనసాగుతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ తరువాత మళ్లీ పొడిగిస్తారా? ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న అంశంపై జనవరి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. జిల్లాలోని పీఏసీఎస్లు, డీసీసీబీ పాలకవర్గాల నియామకం కోసం ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించింది. అదే నెల 14వ తేదీన పాలకవర్గాలు బాధ్యతలను స్వీకరించాయి. దాని ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ నాటికి కొత్త పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అందులో భాగంగా డీసీసీబీ, పీఏసీఎస్లకు కూడా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి పదవీ కాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించింది. ఇప్పుడు తాజాగా రెండోసారి మరో ఆరు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించింది. రైతు సంక్షేమానికి మరింతగా కృషి ప్రభుత్వం రైతుల సంక్షేమ, అభివృద్ధికి మరోసారి కృషి చేసే అవకాశాన్ని తమకు కల్పించిందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు. రానున్న ఆరు నెలల కాలంలో బ్యాంకును మరింత అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాని పేర్కొన్నారు. పీఏసీఎస్ పాలకవర్గాల గడువు సైతం పొడిగించిన ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు డీసీసీబీ చైర్మన్గా కుంభం శ్రీనివాస్రెడ్డి -
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ నల్లగొండ టౌన్: బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను కల్పించే అర్డినెన్స్ రాష్ట్రపతి వద్ద ఉన్నందున వాటినిఆమోదించడానికి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజీపీ రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్రావులు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులు కుల గణన సక్రమంగా జరగలేదని, బీసీల 42 శాతంలో ముస్లీంలకు 10 శాతం ఎలా ఇస్తారని అంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై న రాష్ట్ర బీజీపీ నాయకులు ఢిల్లీలో ధర్నాలు చేసి కేంద్రంపై వత్తిడి తెచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ముందుకుపోవాలని డిమాండ్ చేశారు. రాహుల్గాంధీ బీసీల రిజర్వేషన్లపై పార్లమెంట్లో చర్చించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నకిరేకంటి కాశయ్యగౌడ్ పాల్గొన్నారు. -
కృష్ణా ఎగువన వరద తగ్గుముఖం
నాగార్జునసాగర్/దోమలపెంట/డిండి: ఎగువ నుంచి కృష్ణానది నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఎత్తి ఉంచిన 7 గేట్లలో 4 గేట్లను గురువారం మూసివేశారు. 3 గేట్ల ద్వారా సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 881.9 అడుగుల వద్ద 198.3623 టీఎంసీల నీటి నిల్వ ఉంది.⇒ సాగర్ ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. 26 క్రస్ట్గేట్లు 5 అడుగులు ఎత్తి దిగువకు స్పిల్వే మీదుగా 2,03,762 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 587.50 అడుగులు ఉంది. ⇒ నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం సమీపంలోని డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి గురువారం అలుగుపోస్తోంది. ఎగువన నాగర్కర్నూల్ జిల్లాలో కురిసిన వర్షాలకు దుందు వాగు పరవళ్లు తొక్కడంతో డిండి ప్రాజెకుకు వరద వచ్చింది. డిండి ప్రాజెక్టు అలుగు పోస్తుండగా, ఆ సుందర దృశ్యాన్ని దిగువన హైదరాబాద్–శ్రీశైలం హైవేపై వెళుతున్న వాహనదారులు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బాలికపై హత్యాచారం.. దోషికి ఉరి శిక్ష
రామగిరి (నల్లగొండ): మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషికి ఉరి శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... హైదరాబాద్కు చెందిన మహ్మద్ ముకరమ్ నల్లగొండలోని హైదర్ఖాన్గూడలో ఉంటూ బీఫ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. నల్లగొండలోని మాన్యంచెల్కకు చెందిన 12 ఏళ్ల బాలిక 2013 మే 28న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎవరూ చూడని సమయంలో ముకరమ్ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తలిదండ్రులకు చెబుతుందేమోనని చున్నీని మెడకు బిగించి కిరాతకంగా హత్య చేసి సమీపంలోని డ్రైనేజీలో మృతదేహాన్ని పడేశాడు. బాలిక తండ్రి సాదిక్అలీ చాంద్ ఇచ్చిన ఫిర్యాదుతో వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ విజయ్కుమార్, సీఐ లక్ష్మణ్ దర్యాప్తు చేసి నిందితుడు ముకరమ్ను అరెస్టు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ శ్రీవాణిరెడ్డి, శ్రీవాణి దామోదరం వాదనలతో ఏకీభవించిన కోర్టు ముకరమ్ను దోషిగా తేల్చి ఉరి శిక్ష విధించింది. అలాగే, రూ.లక్షా పదివేల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.కుమార్తెపై తండ్రి లైంగికదాడినిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటననవీపేట: కంటికి రెప్పలా రక్షించాల్సిన కన్న తండ్రే కూతురుపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఓ గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లో తన భార్య లేని సమయంలో 11 ఏళ్ల పెద్ద కూతురుకు ఫోన్లో అశ్లీల సినిమాలు చూపిస్తూ లైంగికంగా వేధించాడు. ఇటీవల రాఖీ పండుగ రోజు తల్లి బంధువుల ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. కూతురు భోరున విలపిస్తూ వెళ్లొద్దని వారించింది. తల్లి ఆరా తీయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో విషయం గ్రామపెద్దలకు వివరించగా వారు తండ్రిని హెచ్చరించడంతో భయపడి పరారయ్యాడు. అనంతరం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.7 రోజులు మృత్యువుతో పోరాడి..కామాంధుడి దారుణానికి బలై ప్రాణాలొదిలిన వృద్ధురాలుఆదిలాబాద్ టౌన్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు 78 ఏళ్ల వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడి అనంతరం తోసివేయడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో ఏడు రోజులపాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వృద్ధురాలు భిక్షాటన చేస్తోంది. ఆమెకు కుమారుడు, కోడలు, మనవరాలు ఉన్నారు. పేద కుటుంబం కావడంతో కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 7న ఫుట్పాత్పై వృద్ధురాలు నిద్రించిన సమయంలో 20 నుంచి 30 ఏళ్లు ఉండే ఓ యువకుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఏడు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. కాగా, అదే రోజు అర్ధరాత్రి నిందితుడు రైల్లో మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రిమ్స్లోని మార్చురీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి వారికి నచ్చజెప్పారు. -
సంఘటితమై దేశ ఐక్యతను చాటుదాం
నల్లగొండ టూటౌన్ : ప్రజలంతా సంఘటితమై దేశ ఐక్యతను చాటుదామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల నుంచి ప్రకాశం బజారు మీదుగా పెద్ద గడియారం సెంటర్ వరకు తిరంగయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ యే శ్రీరామ రక్ష అన్నారు. భారతీయులంతా జాతీయ జెండాను ముద్దాడి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు గోలి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, వీరెళ్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్, పల్లెబోయిన శ్యాంసుందర్, దాయం భూపాల్రెడ్డి, బొజ్జ నాగరాజు, కంకణాల నాగిరెడ్డి, పోతెపాక లింగస్వామి, పాలకూరి రవి, నీరజ తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధం చేయాలి
నల్లగొండ : స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకలపై బుధవారం ఆయన జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 15న ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. నేడు వాలీబాల్ సెలక్షన్ పోటీలునల్లగొండ టూటౌన్ : అండర్ –15 వాలీబాల్ పోటీలకు బాలబాలికలను ఎంపిక చేసేందుకు గురువారం నల్లగొండలోని మేకల అభినవ్ ఔట్డోర్ స్టేడియంలో సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి దగ్గుపాటి విమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలక్షన్ పోటీల్లో ప్రతిభ కనభర్చిన వారిని ఈనెల 18, 19 తేదీల్లో హైదరాబాద్లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9948987026 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. గవర్నర్ను కలిసిన ఎంజీయూ వీసీనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. యూనివర్సిటీలోని పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాభివృద్ధి, కోర్సులు తదిరత అంశాలను గవర్నర్కు వివరించారు. సెప్టెంబర్ నెలలో యూనివర్సిటీలో నిర్వహించనున్న కాన్వకేషన్కు గవర్నర్ను ఆహ్వానించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ అలువాల రవి, సీఓఈ డాక్టర్ ఉపేందర్రెడ్డి ఉన్నారు. బోధనోపకరణాతో సృజనాత్మకతకట్టంగూర్ : ఉపాధ్యాయులు బోధనోపకరణాల(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్)తో బోధిస్తే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండలస్థాయి బోధనోపకరణల మేళాను ఆయన పరిశీలించి మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు రావాలన్నారు. ఈ మేళాలో విద్యార్థులు మోడల్ చార్ట్స్, శాసీ్త్రయ పరికరాలు, గణిత ఉపకరణాలు, భూగోళశాస్త్ర పరికరాలు, భాషా అభ్యసన సాధనాలను ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, ఎంఈఓ అంబటి అంజయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు. నీటి పారుదల ఎస్ఈకి.. సీఈగా పదోన్నతి నల్లగొండ : నీటిపారుదల శాఖలో ఎస్ఈగా పనిచేస్తున్న అజయ్కుమార్కు సీఈగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఎస్ఈగా ఎవరికీ బాధ్యతలను అప్పగించలేదు. పదోన్నతి పొందిన అజయ్కుమార్ను బుధవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి శేఖర్రెడ్డి, డిఐ.రాజు, మేడి జయరావు, మధుసూదనాచారి, కత్తుల మనోజ్ప్రదీప్, మహేష్, లక్ష్మయ్య, సైదులు, శ్రీనివాస్, యూనస్, రాజరత్నం పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
రామగిరి(నల్లగొండ) : యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. బుధవారం ఎన్జీ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు, కళాశాల యాంటీ డ్రగ్స్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, కోకై న్ లాంటి డ్రగ్స్ ప్రమాదకరమన్నారు. మీ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, మిమ్మల్ని డ్రగ్స్ తీసుకోవాలని ఒత్తిడి చేసినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ కళాశాలలో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని.. వాటిని అరికట్టాలని పోలీసు శాఖను కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరామ్రెడ్డి, సిఐ. రాఘవరావు, ఎస్ఐ వై.సైదులు, యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు బొజ్జ అనిల్కుమార్, ఏ.మల్లేశం, వెంకట్రెడ్డి, కోటయ్య, సావిత్రి, శివరాణి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
పొంగుతున్న వాగులు
రాకపోకలకు అంతరాయం నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పైనుంచి వచ్చిన వరదతో కాలనీలు నీటిమయం అయ్యాయి. పెద్దవూర మండలంలోని పర్వేదుల–పెద్దవూర రహదారిలో కల్వర్టుపై నుంచి చిన్నవాగు పొంగి పొర్లుతోంది. నిడమనూరు, తుమ్మడం చెరువులు అలుగుపోస్తున్నాయి. బంకాపురం–నిడమనూరు మధ్యలో వర్షపు నీటి కారణంగా లోలెవల్ కల్వర్టు దెబ్బతింది. దానిపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో రహదారిపై రాకపోకలు బంద్ చేశారు. చండూరు మండలం చామలపల్లి వాగు, నాంపల్లి మండలం శశిలేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండమల్లేపల్లి మండలం అబ్బనోనిగూడెం నుంచి వర్షపు నీరు గౌరీకుంటతండాకు చెందిన ఇళ్లల్లోకి చేరింది. దీంతో వారంతా రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేములపల్లి మండలంలో ఆమనగలు చెరువు అలుగుపోస్తోంది. భీమారం – సూర్యాపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అడవిదేవులపల్లి – మిర్యాలగూడ మధ్య రామన్నపేట వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఉమ్మడి జిల్లాను ముంచెత్తింది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల మీదుగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో 77.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 250.8 మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా, ఇప్పటికే 339.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక సూర్యాపేట జిల్లాలోని పాలకీడులో 114.7 మిల్లీమీటర్ల వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలో ఈ సీజన్లో 326 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా, ఇప్పటికే 402 మిల్లీమీటర్ల వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలో బీభత్సం..సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలంలోని చెరువులన్నీ అలుగు పోస్తున్నాయి. ఏపూరు వద్ద బిక్కేర్ వాగుపై వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో మంగళవారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. తుమ్మల పెన్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కురుస్తుండడంతో ఈరోజు పాఠశాలకు సెలవు ప్రకటించారు. చివ్వెంల మండలంలో కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి నీరు వచ్చాయి, ఆత్మకూరు ఎస్ మండలం పాతసూర్యాపేటలో వర్షం కారణంగా విద్యుత్తు షార్ట్ సర్క్యూట్లో ఇల్లు కాలిపోయింది. తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఇళ్లల్లోకి నీరు చేరి వస్తువులు తడవడంతో రెండు రోజులుగా బాధితులకు అధికారులు భోజనాలు అందిస్తున్నారు. చింతలపాలెం మండలం కిష్టాపురం వద్ద చింత్రియాల మేజర్ (ఎన్ఎస్పీ) కాలువ తెగిపోయింది. దీంతో పంటలు నీటమునిగాయి. పిల్లలను బస్సులో పంపించిన పేట కలెక్టర్ మఠంపల్లి మండలంలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మఠంపల్లి, చౌటపల్లి ఊర చెరువులు అలుగు పోస్తున్నాయి. దీంతో రాకపోకలను నిలిపివేశారు. మఠంపల్లి మోడల్ స్కూల్ నుంచి 11 మంది విద్యార్థులు ఆటోలో రఘునాథపాలెం వెళ్తుండగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ చూసి తన కారులో స్కూల్ వద్దకు తీసుకువచ్చి, ప్రత్యేక బస్సులో వారిని ఇళ్లకు పంపించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల మీదుగా మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. బీమలింగం, రుద్రవెళ్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ఆత్మకూరు(ఎం) మండలంలో బిక్కెరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫ గ్రామాలకు రాకపోకలు బంద్ ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం ఫ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన ఇల్లు ఫ పాలకీడు, దామరచర్ల మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు -
అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలి
● ఎస్పీ శరత్చంద్ర పవార్మిర్యాలగూడ, మిర్యాలగూడ టౌన్ : వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి వెళ్లవద్దని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. బుధవారం రాత్రి మాడుగులపల్లి వద్ద అద్దంకి–నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎడతేరపి లేకుండా వర్షాలు వస్తున్న నేపథ్యంలో మూసీ, కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే వాగులు, వంకలు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు, పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు. పాడుబడిన మిద్దెలు, పడిపోయే స్థితిలో ఉన్న గృహాలు, చెట్ల కింద ఎవరూ ఉండవద్దని సూచించారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లే రైతులు మోటార్ స్వీచ్లు ఆన్ ఆఫ్ చేయవద్దన్నారు. రోడ్ల వెంట ఉన్న విద్యుత్ స్తంభాలు పట్టుకుంటే విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పోలీస్ యంత్రాంగం 24గంటల పాటు అందుబాటులో ఉంటుందని.. ఏమైన సమస్య వస్తే వెంటనే 100 నంబరుకు డయల్ చేయాలని సూచించారు. ఆయన వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, ఎస్బి సీఐ రాము తదితరులున్నారు. -
పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమిటి..?
నల్లగొండ : పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన గుంటకండ్ల జగదీష్రెడ్డి.. 80 ఎకరాల్లో ఫామ్హౌస్ సంపాదించకున్నాడు తప్ప జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ శంకర్నాయక్ విమర్శించారు. జిల్లా ప్రాజెక్టులను బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేయాల్సింది. అప్పుడు గాలికి వదిలేశారు. నిండుకుండలా ఉన్న పానగల్ ఉదయ సముద్రం వద్దకు వెళ్లి నీరు లేదని మాట్లాడుతున్నావు .. కళ్లున్నాయా.. లేవా.. అని మండిపడ్డారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్నాయక్ మాట్లాడారు. వర్షాలు పడతున్నాయి.. చెరువులు, కుంటలకు నీరు చేరుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోరన్నారు. కేసీఆర్కు, కేటిఆర్కు ఊడిగం చేశాడు తప్ప జగదీష్రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చేసింది ఏమీలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పడు ఎస్ఎల్బీసీని చేపట్టి 30 కిలోమీటర్లకు పైగా పూర్తి చేస్తే.. ఆ తరువాత వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. పదేళ్ళలో మిగిలిన 10 కిలో మీటర్ల సొరంగం తీసి ఉంటే నేడు గ్రావిటీ ద్వారానే జిల్లాకు నీరు అందేదన్నారు. మీ పాపం, చేతగాని తనం వల్ల జిల్లా ప్రజలకు నష్టం జరిగిందని విమర్శించారు. రూ.90 కోట్లు విడుదల చేస్తే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తయి లక్ష ఎకరాలకు నీరు అందేదని, కానీ కోమటిరెడ్డికి పేరు వస్తుందన్న కారణంగా పట్టించుకోలేదన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిల ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో జగదీష్రెడ్డి భూదందాలు, ఇసుక దందాలు, కంకర దందాలు చేశాడని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు. వర్షం నీరు సముద్రంలో కలుస్తుందని విమర్శించడం సిగ్గుచేటు ఎమ్మెల్సీ శంకర్నాయక్ -
జిల్లా మంత్రులు దద్దమ్మలు
నల్లగొండ టూటౌన్ : వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించే సోయిలేని జిల్లా మంత్రులు దద్దమ్మలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులకు ఏపీకి నీరు వదిలేంత ఆతృత జిల్లాలో రైతులకు ఇవ్వడంలో లేదన్నారు. కేసీఆర్ హయాంలో ఏఎమ్మార్పీ కింద కనగల్, నల్లగొండ, తిప్పర్తి, నకిరేకల్, సాగర్ పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిచామన్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే 70 వేల ఎకరాలకు నీరందించిన ఘనత మా ప్రభుత్వానిదన్నారు. సాగునీటి కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా మంత్రి కోమటిరెడ్డికి పట్టింపు లేదని మండిపడ్డారు. కృష్ణానది జలకళ సంతరించుకున్నా.. జిల్లాలోని చెరువులు ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయని, గత సంవత్సరం కూడా పంటలు ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. మోటార్లు మరమ్మతుకు గురైతే సమీక్షించే బాధ్యత జిల్లా మంత్రి కోమటిరెడ్డికి లేదా అని ప్రశ్నించారు. నల్లగొండ నడిబొడ్డున ఆర్అండ్బీ అతిథి గృహాన్ని మంత్రి సొంత క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడం సరికాదన్నారు. నిజాం కాలం నాటి అతిథి గృహాన్ని మార్చడం మంచి పద్ధతి కాదన్నారు. దానికి నిధులు మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వమని గుర్తు చేశారు. అంతకు ముందు పానగల్ ఉదయసముద్రాన్ని నాయకులతో పరిశీలించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, నిరంజన్ వలి, సింగం రామ్మోహన్, చీర పంకజ్యాదవ్, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, బోనగిరి దేవేందర్, రవీందర్రావు, శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, ఐతగాని యాదయ్య, దేప వెంకట్రెడ్డి, వంగాల సహదేవరెడ్డి, తండు సైదులుగౌడ్, లక్ష్మయ్య పాల్గొన్నారు. ఫ వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ పరిధిలో నీరిచ్చే సోయి లేదు ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి -
మహిళా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లాలి
నల్లగొండ : మహిళ పోలీస్ సిబ్బంది ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మహిళా పోలీసు సిబ్బంది బ్లూ కోల్ట్స్ విధులను ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. మహిళా పోలీసులు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు. మహిళా సిబ్బంది పోలీస్స్టేషస్లో విధులకే పరిమితం కావొద్దన్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు సెల్ఫ్ డిఫెన్స్పై శిక్షణలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో మహిళా పోలీస్ సిబ్బంది బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ రాము, టూటౌన్ సీఐ రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సూరప్పనాయుడు, సంతోష్, శ్రీను మహిళా ఎస్ఐలు శ్రావణి, విజయబాయి పాల్గొన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ -
పత్తికి అదునైన వాన..!
నల్లగొండ అగ్రికల్చర్ : ఈ వానాకాలం సీజన్లో మెట్టపంటలకు అనుకూలంగా మంచి ఆదునైన వర్షాలు కురుస్తున్నాయి. జాన్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికి జూలై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలే కురిసాయి. ఈ వర్షాలు పత్తి పంటకు అనుకూలంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 5,57,641 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మంచి అనుకూలమైన వర్షాలు కురవడంతో పత్తి చేలలో గుంటకలు తోలుకుని కలుపు తీసుకున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎరువులు పెట్టుకోవడంతో చేలు మంచి ఏపుగా పెరిగి పూత, పిందె దశలో కనిపిస్తున్నాయి.వారం రోజుల్లో కాయదశకు చేరుకుంటాయి. దసరా పండుగ నాటికి పత్తి తెంపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చేలు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఈ సీజన్లో పత్తి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షపాతం నమోదు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అధిక వర్షపాతం నమోదైంది. మిర్యాలగూడం మండలంలో మాత్రం లోటు వర్షం కురిసింది. ఇప్పటి వరకు సగటున జిల్లాలో 246.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 309.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మర్రిగూడ, పీఏపల్లి, కొండమల్లేపల్లి, గుండ్లపల్లి, చందంపేట మండలాల్లో అత్యధిక వర్షం కురవగా చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, శాలిగౌరారం, నకిరేకల్, చింతపల్లి, గుర్రంపోడు, అడవిదేవులపల్లి, టి.సాగర్, పెద్దవూరలో అధిక వర్షం కురిసింది. మిగతా మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. ఫ జిల్లాలో 5,57,641 ఎకరాల్లో సాగు ఫ పూత, పిందె దశలో పత్తి చేలు ఫ మంచి దిగుబడి వస్తుందని రైతుల ఆశాభావం -
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలసి మూసీ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, నీటిమట్టం, కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు పరిధిలో వివరాలు, ప్రాజెక్టు వద్ద నెలకొన్న సమస్యలు నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గేట్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ క్రస్ట్గేట్లు ఎత్తాలని సూచించారు. అనంతరం వారు మూసీ ప్రాజెక్టు దిగువన కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామం వద్ద మూసీ నదిపై నిర్మించిన లోలెవల్ కాజ్వేను పరిశీలించారు. మూసీ ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కులకు పైగా వరదనీటిని వదిలినప్పుడు మాత్రమే లోలెవల్ కాజ్వే వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు కలెక్టర్కు చెప్పారు. కలెక్టర్ వెంట నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, సూర్యాపేట డివిజన్ ఐబీ ఈఈ ఎన్.వెంకటరమణ, మూసీ డీఈలు చంద్రశేఖర్రెడ్డి, వాణి, జేఈ కీర్తి, ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ వెంకన్న తదితరులు ఉన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగొద్దునల్లగొండ : రానున్న 72 గంటల్లో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, నారాయణ్ అమిత్, దేవరకొండ ఏసీపీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీతో కలిసి మూసీ ప్రాజెక్టు సందర్శన -
సమ్మెలోకి కేటరింగ్ కాంట్రాక్టర్లు
నల్లగొండ : ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఓ 17కు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో భోజనం అందించే కేటరింగ్ కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ ఈ నెల 14వ తేదీనుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఇప్పటికే వారు కలెక్టర్కు నోటీసు అందజేశారు. వారితోపాటు కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు కూడా సమ్మె బాట పడుతున్నారు. నేటి నుంచి గురుకులాల్లో వంట సేవలు ఆగిపోనున్నాయి. దీంతో విద్యార్థులు ఎవరు వంట చేస్తారనే దానిపై సందిగ్దం నెలకొంది. బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా జీఓ 17 ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం కేటరింగ్ కాంట్రాక్టర్ల ఎంపిక విషయంలో జీఓ నంబర్ 17 తెచ్చింది. ఈ జీవో ప్రకారం ఒక కాంట్రాక్టర్, ఒక స్కూల్కు సంవత్సర కాలంలో రూ.20 లక్షలు సరుకులు సరఫరా చేస్తే రూ.4 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జీవో వల్ల చిన్న కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనే పరిస్థితి లేదని.. బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొత్త జీఓ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నాలుగు నెలలుగా ఎలాంటి బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే.. ప్రస్తుతం కొత్త టెండర్ విధానం తేవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ టెండర్లో పాల్గొనే ఆర్థిక స్థోమత లేదని సడలింపులు ఇవ్వాలని ఇప్పటికే పలువురు చిన్న కాంట్రాక్టర్లు కలెక్టర్కు విన్నవించారు. పాత టెండర్ విధానం కొనసాగించాలని కోరారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. వంట ఎలా..! గురుకుల, కేజీబీవీల్లో వంటలను మహిళా సంఘాలకు అప్పగిస్తారని చర్చ సాగుతోంది. నెలకు సరిపడా కిరాణ సామాను ఇప్పటికే హాస్టళ్లకు చేరింది. కూరగాయలు 2, 3 రోజులకోసారి సరఫరా చేస్తారు. మటన్, చికెన్ వారంలో 2 పర్యాయాలు అందిస్తారు. కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్తే వీటి సరఫరా ఆగిపోయే అవకాశం ఉంది. వంట సిబ్బంది సమ్మె బాట పడితే పిల్లలకు భోజనానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి గురుకులాలు, కేజీబీవీల్లో వంటలు బంద్ జీఓ 17కు నిరసనగా ఆందోళన బాట -
కారొ్పరేషన్ పదవుల పందేరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కార్పొరేషన్ డైరెక్టర్లను త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆశావహుల్లో ఆశలు మొదలయ్యాయి. ఇప్పటికే జిల్లాలో మంత్రులు సిద్ధం చేసిన జాబితాలను రాష్ట్ర పార్టీకి పంపించారు. అందులో కొందరికి త్వరలోనే డైరెక్టర్ పదవులు దక్కనున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురికి అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు వందవరకు ఉండగా, ఒక్కో దాంట్లో నాలుగైదు డైరెక్టర్ పదవులు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు జాబితాలు ఇవ్వాలని గతంలోనే మంత్రులకు రాష్ట్ర పార్టీ సూచించింది. అందుకు అనుగుణంగా ఆయా పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి పది మంది చొప్పున పేర్లను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. అందులో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురికి డైరెక్టర్లుగా అవకాశం లభించనుంది. స్థానిక ఎన్నికలకు ముందే భర్తీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. పార్టీలో పనిచేసే వారికే పదవులు అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కూడా పలు సందర్భాల్లో ప్రకటించారు. అందులో భాగంగా ప్రస్తుతం కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది. అంతకంటే ముందుగానే కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను భర్తీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కేడర్ బాగా పని చేస్తుందనే అంచనాల్లో ఉంది. కార్యకర్తలు కూడా కష్టపడి పని చేస్తారనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. అందుకే ముందుగా డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసి ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. చైర్మన్ పదవులు ఎప్పుడు...? ప్రస్తుతం కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఆశావహులు కార్పొరేషన్ల చైర్మన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా డైరెక్టర్ పదవులను భర్తీ చేస్తామని చెప్పడంతో చైర్మన్ పదవులను ఎప్పుడు భర్తీ చేస్తామన్నది ప్రకటించకపోవడంతో సందిగ్దత నెలకొంది. ఫ రాష్ట్ర పార్టీకి జాబితాలను పంపించిన జిల్లా మంత్రులు ఫ నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురికి దక్కనున్న డైరెక్టర్ పదవులు ఫ వీరి నియామకం తర్వాతే స్థానిక ఎన్నికలు ఫ చైర్మన్ పదవులపై వీడని సందిగ్దం -
తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
రామగిరి(నల్లగొండ): కన్న కూతురిపై అత్యాచారం జరగడానికి కారణమైన తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. నల్లగొండ పట్టణంలోని లైన్వాడకు చెందిన గ్యారాల శివకుమార్ బీటీఎస్కు చెందిన వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకొని, మైనర్ అయిన యాదమ్మ కూతురుపై కూడా కన్నేశాడు. యాదమ్మ సహకారంతో శివకుమార్ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నంచగా తిరస్కరించింది. బలవంతంగా బాలిక దుస్తులు విప్పి వీడియోలు తీసి, శారీరకంగా అనుభవించాడు. శివకుమార్కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాధిత బాలిక 2023 మే 8న నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లి యాదమ్మ, శివకుమార్పై ఫిర్యాదు చేసింది.పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ.. ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఏ1గా ఉన్న గ్యారాల శివకుమార్ ఉదయం కోర్టుకు వచ్చినట్లే వచ్చి పారిపోయాడు. అతడు కోర్టుకు గైర్హాజరైనట్లుగా న్యాయస్థానం ప్రకటించి దోషిగా తేలుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. తదుపరి కోర్టు ముందు హాజరుపర్చిన రోజు శిక్షను ఖరారు చేయడం జరుగుతుంది. ఏ2 యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలు వినిపించారు. పదేళ్లు జైలు శిక్ష.. రామగిరి(నల్లగొండ), మర్రిగూడ: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన పోలె నరేష్ 2016 ఆగస్టు 22న అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ కె. బలరాం పోలె నరేష్పై పోక్సో కేసు నమోదు చేయగా.. అప్పటి నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా జడ్జి రోజారమణి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కారు డ్రైవర్కు..కట్టంగూర్: ప్రమాదంలో కారుతో మహిళను ఢీకొని ఆమె మృతికి కారణమైన డ్రైవర్కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమనా విధిస్తూ నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ ఆరిఫ్ మంగళవారం తీర్పు వెలువరించారు. కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015 మార్చి 18న శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన బట్టా సుమన్ తన బంధువైన మందుల పరిమళను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామం నుంచి అయిటిపాములలో శుభకార్యానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో చెర్వుఅన్నారం క్రాస్రోడ్డు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా.. ఖమ్మం జిల్లా వేపకుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ అంగోతు కిశోర్కుమార్ హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో అజాగ్రత్తగా, అతివేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మందుల పరిమళ తలకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమన్ తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ విజయ్ప్రకాశ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్ఐ తెలిపారు. అత్యాచారం కేసులో 20 ఏళ్లు..రామగిరి(నల్లగొండ): మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన వీరంశెట్టి సాంబశివ 2017 ఏప్రిల్ 15న అదే గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలైన బాలికను ఇంట్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రోజారమణి నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరించడంలో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులుగా జె. రవీందర్, ఏ. రమేష్బాబు, జె. శివకుమార్ వ్యవహరించారు. -
వరంగల్ను ముంచెత్తిన వరద
సాక్షి, వరంగల్/ఖమ్మం/నల్లగొండ నెట్వర్క్: వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ రైల్వేస్టేషన్లో ఉన్న మూడు పట్టా లైన్లు నీట మునిగి రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది నీటిని బయటకు పంపడంతో రైళ్ల రాకపోకలు సాగాయి. హంటర్ బ్రిడ్జ్ రోడ్డులోకి భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాశీకుంట వాంబేకాలనీలోని ఇంట్లోకి నీరు వచ్చి మంచం మునగడంతో దానిపై పడుకున్న వృద్ధురాలు పసునూటి బుచ్చమ్మ చనిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖిలా వరంగల్ కోట నీటిలో మునిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామంలో గేదెలను బయటకు తోలేందుకు ఆకేరు వాగులో దిగిన పశువుల కాపరి కందికగ్ల ఉప్పలయ్య వరదనీటిలో గల్లంతయ్యారు. ∙గొల్లబుద్దారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు వరద ప్రవా హం ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాఠశాల ప్రాంగణం ఒక చిన్న చెరువును తలపించింది. దాదాపు 400 మంది విద్యార్థులు పాఠశాల లోపలే చిక్కుకుపోయి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో....ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాలేరు రిజర్వాయర్ సామర్థ్యం 23 అడుగులు కాగా 23.15 అడుగులు, వైరా రిజర్వాయర్ 18.03 అడుగులకుగాను 18.08 అడుగుల మేర ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. ఇక తిరుమలాయపాలెం మండలం రాకాసితండాను గతేడాది ఆ కేరు వరద ముంచెత్తగా ఈసారి మంగళవారం సాయంత్రాని కి ఆకేరు వరద పెరిగి సీతారామ ఆక్వాటెక్ట్కు తాకి ప్రవహి స్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో....ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామం వద్ద వలిగొండ– తొర్రూరు ప్రధాన రహదారిపై బ్రిడ్జి పనులు సాగుతుండగా, తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. వరద నీరు దిగువకు వెళ్లక అక్కడే చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెలిశాలలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ లైనింగ్ దెబ్బతిన్నది. భూదాన్పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య గల లోలెవల్ బ్రిడ్జి పై నుంచి మూసీనది ఉధృతి కొనసాగింది. దీంతో పోచంపల్లి నుంచి బీబీనగర్కు రాకపోకలు నిలిచిపోయాయి.సంగారెడ్డి జిల్లాలో....రాయికోడ్(అందోల్): సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూసుఫ్పూర్ గ్రామానికి చెందిన ఎం. శ్రీనివాస్(35) మంగళవారం రాయికోడ్ నుంచి స్వగ్రామానికి పయనమ య్యాడు. గ్రామ సమీపానికి చేరుకోగానే వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీనివాస్ వరద నీటిలో నుంచి గ్రామం వైపు దాటేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతికి ఒక్కసారిగా వరద నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. నీళ్లు నిలిచి.. ఒండ్రు చేరి..సంగారెడ్డి జిల్లాలో పత్తి చేలన్నీ నీట మునిగాయి. కొన్ని చోట్ల మొక్కలు ఎర్రగా, మరికొన్నిచోట్ల నల్లగా మారి మురిగిపోయాయి. భారీ వర్షం పడినప్పుడు పొలాల్లో నీళ్లు పారుతుండటంతో ఒండ్రుమట్టి వచ్చి చేరుతోంది. -
కృష్ణాకు పోటెత్తుతున్న వరద
నాగార్జునసాగర్/దోమలపెంట/నల్లగొండ: ఎగువ నుంచి కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. మంగళవారం జూరాల, సుంకేశుల నుంచి 1,57,373 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. దీంతో విద్యుదుత్పత్తి, ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 1,74,608 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 883 అడుగుల నీటిమట్టం వద్ద 204 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి వస్తున్న వరదకు తోడు, స్థానికంగా కురిసే వర్షాలతో సాగర్ జలాశయానికి 1,86,258 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312,0450టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 589.50 అడుగులు (310.5510టీఎంసీలుగా) ఉంది. సాగర్ జలాశయం 18 గేట్లు 5 అడుగులు ఎత్తి 1,44,864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిండుకుండలా ఉదయ సముద్రం పానగల్లు ఉదయసముద్రం చెరువు నిండుకుండలా ఉంది. ఈ రిజర్వాయర్కు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోత ల ప్రాజెక్టు కాలువ ద్వారా నీరు వస్తోంది. ఈ చెరువు నుంచి పలు గ్రామాలకు తాగునీరు అందుతోంది. -
రేవంత్ను సీఎం చేశారుగా..: రాజగోపాల్రెడ్డి
మునుగోడు: ‘నాకు మంత్రి పదవి ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారు.. నేడు పదవి ఇచ్చేందుకు సమీకరణలు కుదరడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనడం సరైంది కాదు.. నన్ను పార్టీలో చేర్చుకునే సమయంలో సమీకరణలు ఎందుకు గుర్తుకు రాలేదు’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు. తన మంత్రి పదవిని ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసని చెప్పారు. మంగళవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెం గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ..‘నేను ఏ పదవి కోరుకున్నా మునుగోడు ప్రజల కోసమే. నాకు పదవులపై ఎలాంటి ప్రేమ లేదు. మహబూబ్నగర్ నుంచి రేవంత్రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు కదా.. మా అన్నదమ్ములిద్దరికి మంత్రి పదవి ఉంటే తప్పేంటి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి. ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు అంటే.. ఇద్దరం సమర్థులం, పరిపాలన చేసే సామర్థ్యం కలిగిన వ్యక్తులం. అలాంటి వారికి పదవులు ఇస్తే ఎవరికి ఇబ్బంది. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వకుండా సమీకరణల పేరుతో దాట వేస్తున్నారు. నాకు పదవి రాకపోతే జరిగే నష్టం మునుగోడు ప్రజలకు తప్ప నాకు కాదు. పదవులు ఇచ్చే నిర్ణయం అధిష్టానం చూసుకుంటుంది. నాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో నేను ఎంతవరకైనా ఓపిక పడతా. కానీ, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిధులు ఇవ్వకుండా అడ్డుపడితే ఊరుకునే ప్రసక్తి లేదు. నిధులు ఇవ్వకుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతా. మరోమారు ఉద్యమానికి సిద్ధమై తీరుతా. అలా అని మునుగోడు ప్రజలు తలవంచుకునే పని అసలు చేయను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన కొనసాగిస్తూ నిధులు ఇవ్వకుండా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుంటే చూసి ఊరుకోలేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంను మునుగోడు ప్రజల దగ్గరకు తీసుకొచ్చా. నా రాజీనామా కారణంగానే నియోజకవర్గానికి అప్పటి ప్రభుత్వం దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేస్తే ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఇంకా మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వకుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమైతా. అందుకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు కావాలి. ప్రధానంగా కమ్యూనిస్టుల మద్దతు పూర్తిగా అందించాలి’. అని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గౌరికుంటతండా జలమయం
కొండమల్లేపల్లి : భారీ వర్షానికి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని గౌరికుంటతండా జలమయం అయ్యింది. భారీ వర్షం వల్ల తండా పైనున్న అబ్బనబోయినగూడెం నుంచి వచ్చిన వరద అంత తండాను ముంచెత్తింది. సుమారు 15 మంది ఇళ్లలోకి నీరు చేరింది. అబ్బనబోయిన గూడెం సమీపంలో నిర్మించిన ఓ ఫంక్షన్ హాల్ ఎత్తు పెంచుకొని వరద కట్టపోయడంతో పట్టణంలోని నల్లకుంటకు వెళ్లాల్సిన వర్షపు నీరు మొత్తం కూడా తండాకు చేరింది. ఈ విషయాన్ని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే అధికారులు గ్రామాన్ని సందర్శించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తండావాసులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ నరేందర్, ఎస్ఐ అజ్మీర రమేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు. -
మహిళా పోలీసులు అన్ని విధులు నిర్వర్తించాలి
నల్లగొండ : నేరాలర నియంత్రణలో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించడానికి సిద్ధం కావాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని ప్రాంతాల పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పురుష సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తే ఎదురయ్యే సమస్యలు, కుటుంబం తరఫున వస్తున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. షీ లీడ్స్–నల్లగొండ బిలీవ్స్ అనే నినాదంతో నూతన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మహిళా సిబ్బంది పోలీస్స్టేషన్ రిసెప్షన్, రికార్డు వర్క్, సీసీటీఎన్ఎస్, టెక్ టీమ్, కమ్యూనిటీ పోలిసింగ్ ప్రోగ్రాం, బ్లూ క్లోట్స్, నైట్ పెట్రోలింగ్, పిటిషన్ ఎంక్వయిరీ చేయాలన్నారు. కోర్ట్ సమన్స్, వెహికల్ చెకింగ్, ఎస్కార్టు, ట్రాఫిక్, బందోబస్తు, మెడికల్, కోర్టు డ్యూటీలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ రాము, డబ్ల్యూపీఎస్ సీఐ కరుణాకర్, ఆర్ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అదనపు చార్జీలపై ఆగ్రహం
రామగిరి(నల్లగొండ) : రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. అయితే బస్సుల్లో చార్జీలను పెండంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ నుంచి హైదరాబాద్ సాధారణ టికెట్ ధర రూ.210 ఉంటే.. ప్రత్యేక బస్సులో రూ.280 వసూలు చేశారు. కాగా.. నల్లగొండ బస్టాండ్ సోమవారం ప్రయాణికులతో రద్దీగా మారింది. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు బస్ చార్జీలు అధికంగా ఉండడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రద్దీగా మారిన బస్టాండ్.. మూడు రోజులు సెలవులు ముగియడంతో ప్రయాణికులు సొంతూళ్ల నుంచి ఆయా ప్రాంతాలకు బయల్దేరారు. దీంతో నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ సోమవారం కిక్కిరిసిపోయింది. బస్సుల కోసం ప్రయాణికులు బారులు తీరారు. బస్సు ప్లాట్ఫాం మీదకు వచ్చే సమయంలోనే బుస్సులోకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఇక బస్సులు ఎక్కే సమయంలో తొక్కిసలాట సైతం జరిగింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫ ఆర్టీసీ సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం -
క్రీడలతో మానసికోల్లాసం
రామగిరి(నల్లగొండ) : క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మేకల అభినవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరంతరం బిజీగా ఉండే న్యాయవాదులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడా పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సంపూర్ణ ఆనంద్, కార్యదర్శి మంద నగేష్, కోశాధికారి బరిగల నగేష్, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్ డేలో వినతుల స్వీకరణనల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్చంద్రపవార్ 52 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆయా ఫిర్యాదులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు చట్ట పరంగా న్యాయం జరిగే విధంగా చూడాలని పోలీసులకు సూచించారు. అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలిచిట్యాల : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి పేర్కొన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ పాఠశాలలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలోని ఎఫ్ఆర్ఎస్ హాజరు, టీచర్స్ డైరీలు,, విద్యార్థుల వర్క్బుక్స్ను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో ఆయన మాట్లాడి గణితం, ఆంగ్లం, తెలుగు అంశాలపై ప్రశ్నించి సమాధానాలను రాబట్టారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలని కోరారు. విద్యార్థులకు అర్థమయ్యే రితీలో పాఠ్యాంశాలను బోఽధించాలన్నారు. మూసీకి కొనసాగుతున్న వరదకేతేపల్లి : భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు సోమవారం ప్రాజెక్టు మూడు క్రస్ట్గేట్లను పైకెత్తి దిగువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు ఎగువ నుంచి మూసీకి 4,718 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. మూడు క్రస్ట్గేట్ల ద్వారా 4,375 క్యూసెక్కులు, మూసీ కుడి, ఎడమ కాల్వలకు 454 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 645 అడుగుల (4.46 టీఎంసీలు) గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో.. ప్రస్తుత నీటిమట్టం 643.50 అడుగుల (4.04 టీఎంసీలు) వద్ద ఉంది. -
పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు
నల్లగొండ : పదో తరగతి వార్షిక పరీక్షలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మాదిరిగానే రాత పరీక్ష 80 మార్కులు, ఇంటర్నల్ మార్కులు 20 చొప్పున ఉంటాయి. ఈ విధానం 2014–15 నుంచి అమల్లో ఉంది. కాగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక శాతం విద్యార్థులకు 20కి 20 ఇంటర్నల్ మార్కులు వేస్తున్నాయని, దీంతో విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఉండదని 100 మార్కులతోనే వార్షిక పరీక్షలు ఉంటాయని గత ఏడాది అక్టోబర్ 28 ప్రభుత్వం ప్రకటించింది. ఉత్కంఠకు తెర జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యా యి. మూడు నెలలు కావస్తున్నా వార్షిక పరీక్షలు 100 మార్కులతో నిర్వహించాలనే దానిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో విద్యార్థులను ఆ దిశగా సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుల్లో సందిగ్ధం నెలకొంది. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన కోసం ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పలేదు. ఎట్టకేలకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పాత పద్ధతిలోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. ఫ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్ ఫ ఉపాధ్యాయ వర్గాల్లో వీడిన ఉత్కంఠ ఫ రాత పరీక్షకు 80, ఇంటర్నల్కు 20 మార్కులు -
గిరిజనులకు వైద్యం అందించాలి
నాగార్జునసాగర్ : అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని చెంచుగూడేలు, తండాల్లోని గిరిజనులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పలు స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో ఏప్రాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరక్షరాస్యత, అవగాహన లోపం, మేనరిక వివాహాలు, పౌష్టికాహారలోపం, యుక్తవయస్సుకు ముందే గర్భం దాల్చడం, వివిధ జబ్బులకు సకాలంలో చికిత్స తీసుకోకపోవడం, రక్తహీన తదితర కారణాలతో గిరిజనులు బాధపడుతున్నారని తెలిపారు. గిరిజనుల ఆరోగ్యానికి సంబంధించిన లోపాలను గుర్తించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘నైస్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాఖీ నాగర్కర్నూల్ జిల్లా అప్పాపూర్, రాంపూర్, చెంచుపేటలతో పాటు ఐదు రాష్ట్రాల్లోని గిరిజనుల ఆరోగ్యం కోసం పనిచేసిన అనుభవాలను వివరించారు. చందంపేటను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలి చందంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అక్కడి సమస్యలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకు దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవిని నోడల్ అధికారిగా, డీటీడీఓ చత్రునాయక్, గృహనిర్మాణ శాఖ పీడీ రాజకుమార్ను సమన్వయ సమస్యల పరిష్కారానికి అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిని సందర్శించి.. రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను డాక్టర్ మాతృనాయక్ను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, రిచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రష్మీ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
డీసీసీబీ.. నంబర్ వన్
రాష్ట్రంలోనే ఉత్తమ సహకార బ్యాంక్ అవార్డు సొంతం ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వ్యాపార లక్ష్యం రూ.3,500 కోట్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. తద్వారా రూ.70 కోట్ల లాభాలను సాధించేలా చర్యలు చేపడుతోంది. సహకార వ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూనే మిగతా డీసీసీబీల కంటే నల్లగొండ డీసీసీబీ రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందంజలో ఉంది. దీంతో నాబార్డు ప్రతి ఏటా ఇచ్చే ఉత్తమ బ్యాంకు అవార్డుకు ఈసారి నల్లగొండ బ్యాంకును ఎంపిక చేసింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివా స్రెడ్డి, ఇతర డైరెక్టర్లు, అధికారులకు అందజేసింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ డీసీసీబీ రాష్ట్రంలోనే ఉత్తమ బ్యాంకుగా నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఆర్థికంగా చేయూతను అందించి ముందంజలో నిలువడమే కాకుండా డిపాజిట్ల పెంపుతో వ్యాపార వృద్ధిని సాధించింది. మొండిబకాయి(ఎన్పీఏ)లను తగ్గించుకోవడంతోపాటు రూ.42 కోట్ల లాభాలను ఆర్జించి, రైతులు, ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను నాబార్డు నల్లగొండ డీసీసీబీకి బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంకు అవార్డును అందజేసింది. లాభాల బాటలో నల్లగొండ బ్యాంకు నల్లగొండ డీసీసీబీ గత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారాన్ని రూ.2,342.13 కోట్ల నుంచి రూ.2,940.13 కోట్లకు పెంచింది. తద్వారా ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.598.16 కోట్లు వృద్ధిని సాధించింది. రాష్ట్రంలో ఏ ఇతర డీసీసీబీలు ఇంతగా వృద్ధి రేటును సాధించలేదు. ఇక లాభాల విషయంలోనూ రూ.22 కోట్ల నుంచి రూ. 42 కోట్లకు పెంచగలిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు రెట్టింపు లాభాలను గడించి ఉత్తమ బ్యాంకుగా నిలిచింది. గతంలో 1.85 శాతం ఉన్న మొండిబకాయి(ఎన్పీఏ)లను 1.38 శాతానికి తగ్గించుకొని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పంట రుణాల బడ్జెట్ పెంపు రైతులకు పంట రుణాల విషయంలోనూ ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు నాబార్డు గుర్తించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.110 కోట్లు రైతులకు రుణాలుగా అందించి వారి సంక్షేమం, అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒక్క వానాకాలం సీజన్లోనే రైతులకు రూ.50 కోట్ల పంట రుణాలను ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అవసరమైతే మరో రూ.50 కోట్లు రైతులకు పంట రుణాలుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచింది. అనుబంధ రంగాలకు ప్రాధాన్యం వ్యవసాయ అనుబంధ రంగాలైన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద రెతులకు కోళ్లు, కోళ్ల ఫారాలు, పాడి పరిశ్రమకు రుణాలు ఇస్తోంది. సొసైటీల ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడేలా గోదాముల నిర్మాణానికి రుణాలు, సహకార సంఘాలకు నాబార్డు రీఫైనాన్స్ ద్వారా కిసాన్ డ్రోన్లు ఇచ్చి బలోపేతానికి కృషి చేస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు కూడా ఇచ్చేలా చర్యలు చేపట్టింది.ఫ గత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.598.16 కోట్ల వృద్ధి ఫ మిగతా బ్యాంకులతో పోల్చితేరెట్టింపు లాభాలు ఫ మొండి బకాయిలు తగ్గుదల ఫ రైతులకు చేయూత అందించడంలోనూ ముందంజ బ్యాంకు సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది రైతుల అభివృద్ధికి తోడ్పాటు అందించేలా చూస్తున్నాం. ఇందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరంలో ఐదు కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మరో ఆరు కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. రైతులు, ఖాతాదారులకు ఉత్తమ సేవలను అందించడం ద్వారా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా పాలకవర్గం కృషి చేస్తోంది. – కుంభం శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్డే సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె అదనపు కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులపై బాధితులకు వెంటనే సమాధానం ఇవ్వాలని సూచించారు. ఏ స్థాయిలో ఆ సమస్య ఉందో ఆ అధికారికి వాటిని పంపి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. -
ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి
నల్లగొండ టౌన్ : నులి పురుగుల నివారణ కోసం 19 సంవత్సరాలలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం నల్లగొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో వైద్యుల పర్యవేక్షణలో ఆల్బెండజోల్ మాత్రలు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్, రేణుక, డీఈఓ భిక్షపతి, జిల్లా మాస్ మీడియా అధికారి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికులందరికీ భరోసా కల్పించాలి
గట్టుప్పల్ : ఎలాంటి షరతులు లేకుండా జియోట్యాగ్ కలిగిన చేనేత కార్మికులందరికీ చేనేత భరోసా కల్పించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించిన చేనేత కార్మిక సంఘం మండల మహాసభకు హాజరై మాట్లాడారు. చేనేత కార్మికులు, సహకార సంఘాల దగ్గర నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. చేనేత సహకార సంఘాలు తీసుకున్న రుణాలను క్యాష్ క్రెడిట్ మాఫీ చేయాలన్నారు. ఇల్లులేని పేదలకు 120గజాల స్థలం ఇవ్వడంతోపాటు కేంద్రం రూ.10 లక్షలు, రాష్టం రూ.5 లక్షలు అందజేసి హౌస్ ఫ్రం వర్క్ షెడ్డు నిర్మాణం చేసి ఇవ్వాలన్నారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా గంజి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా కర్నాటి వెంకటేశంతోపాటు పలువురు కమిటీ సభ్యులుగా నియమించారు. కర్నాటి వెంకటేశం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కర్నాటి మల్లేశం, పున్న కిషోర్, గణేష్, బావండ్ల ఆంజనేయులు, చెరుపల్లి సత్యనారాయణ, అందె రాము, చెరుపల్లి కృష్ణయ్య, శంకర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దులో రేషన్ బియ్యం దందా!
పీడీ యాక్ట్ నమోదు చేస్తాం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసినా, దందాకు సహకరించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. అక్రమ దందాపై సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు సరైన పారితోషకాన్ని అందిస్తాం. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తాం. – రాజశేఖర్రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ మిర్యాలగూడ ప్రాంతంలో ఆగని అక్రమ వ్యాపారం ఫ పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నా షరామామూలే.. ఫ ఏపీకి చెందిన వ్యాపారులే సూత్రధారులు ఫ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో కొనుగోలు ఫ పల్నాడు జిల్లాలో మిల్లులకు విక్రయం ఫ అక్కడ పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా మిర్యాలగూడ : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టి పట్టుకుంటూ చర్యలు తీసుకుంటున్నా.. చివరికి పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నా మిర్యాలగూడ ప్రాంతంలో రేషన్ బియ్యం దందా మాత్రం ఆగడం లేదు. గతంలో తెలంగాణ నుంచి ఏపీ రాష్టానికి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరిగేది. కానీ, ఇప్పుడు ఇక్కడి వారి సహాయంతో ఏపీకి చెందిన వ్యాపారులు కొందరు ఇక్కడా అక్కడా తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని మిల్లులకు అమ్ముతున్నారు. ఆ బియ్యాన్నే మిల్లుల యజమానులు పాలిష్ చేసి తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటు న్నారు. తాజాగా రాష్ట్ర సరిహద్దులోని మిర్యాలగూడ పరిధిలో గల వాడపల్లి చెక్ పోస్టు వద్ద 600 బస్తాలు (300 క్వింటాళ్ల) రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఇందులో అరెస్టయిన వారంతా ఏపీకి చెందిన వారు కావడం గమనార్హం. కిలో పది రూపాయలకు కొని.. తెలంగాణలో ఆరు నెలలుగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. పక్కనున్న ఏపీ రాష్ట్రంలో దొడ్డు బియ్యాన్ని అందిస్తున్నారు. సరిహద్దులో ఉన్న తెలంగాణ గ్రామాల నుంచి ఏపీకి చెందిన కొందరు రేషన్ బియ్యాన్ని కిలో రూ.10 నుంచి రూ.11కు కొనుగోలు చేసి మిల్లులకు అమ్ముకుంటున్నారు. అలాగే సరిహద్దులోని ఇరు రాష్ట్రాలకు చెందిన గ్రామాల రేషన్ షాపుల డీలర్లు కూడా కిలోకు రూ.10 నుంచి 12 వరకు లబ్ధిదారుల నుంచి కొని మిల్లులకు కిలోకు రూ.25 నుంచి రూ.30ల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు మిల్లుల యజమానులు ఆ రేషన్ బియ్యాన్ని సన్నగా పాలిష్ చేయించి బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి ప్రత్యేక వాహనాల్లో వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తూ కిలో రూ.40 నుంచి రూ.50లకు అమ్ముంటున్నారు. నకిలీ బిల్లులు సృష్టించి.. ఏపీ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని ఓ రైస్ మిల్లో పనిచేసే ఓ గుమస్తా తమ జిల్లాకు సరిహద్దులో ఉన్న తెలంగాణ పల్లెల్లో రేషన్ బియ్యం సేకరించి అదే మిల్లుకు తరలిస్తూ పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకుంటున్నాడు. అక్కడికి వెళ్లిన రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి తెల్ల సంచుల్లో నింపి ఇతర రాష్టాలకు తరలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి రాష్ట్ర సరిహద్దు దాటించేందుకు ఒక ఏజెంట్ను నియమించుకుని అతనికి నెలకు రూ.3లక్షలకుపైగా కమీషన్ ఇస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులకు చిక్కని సూత్రధారులు.. ఇటీవల రాష్ట్ర సరిహద్దులోని వాడపల్లి చెక్పోస్టు వద్ద పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుకున్నప్పటికీ అసలు సూత్రధారులు ఇప్పటివరకు చిక్కలేదు. ఆ సూత్రధారులకు ఏపీలో అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు జంకుతున్నారు. ఇప్పటివరకు అనేక మంది రేషన్ బియ్యం అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసినా దందా ఆగడం లేదు. ఇటీవల పట్టుబడిన రేషన్ బియ్యం కేసులో ఎనిమిది మందికిగాను ఐదుగురిని అరెస్ట్ చేయగా ముగ్గురు అసలు సూత్రధారులు పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారంతా ఏపీ రాష్ట్రానికి చెందిన వారే. -
సరికొత్తగా ఓటరు జాబితా
నల్లగొండ: గ్రామ పంచాయతీల్లో సరికొత్త ఓటరు జాబితా సిద్ధమవుతోంది. గతంలో ఎంపీడీఓ పరిధిలో ఉన్న టీపోల్ లాగిన్లో ఆయా గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు ఓటర్ల జాబితాలను అప్లోడ్ చేశారు. అయితే గత విధానాన్ని పంచాయతీరాజ్ శాఖ మార్పు చేసింది. కొత్తగా ప్రతి గ్రామానికి ఒక టీపోల్ లాగిన్ ఇచ్చి గ్రామ పంచాయతీ లాగిన్లో ఓటర్ల జాబితాను అప్లోడ్ చేయాలని ఆదేశించింది. దీంతో ఇరవై రోజుల నుంచి కార్యదర్శులు జీపీ లాగిల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్లోడ్ చేశారు. జిల్లాలో కొత్త ఓటరు జాబితా తయారీ చివరి దశకు చేరిందని మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎంపీడీఓ లాగిన్లో.. పంచాయతీ ఎన్నికలు గత ఫిబ్రవరిలోనే నిర్వహిస్తారనే ఉద్దేశంతో అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ ఎంపీడీఓ లాగిన్ ద్వారా ఓటరు జాబితాను రూపొందించింది. ఆయా మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని గ్రామాలు, ఆవాసాలలో ఉన్న ఓటర్ల జాబితాను ఎంపీడీఓ లాగిన్లో అప్లోడ్ చేశారు. అలా జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఓటరు జాబితా తయారు చేశారు. ఎంపీడీఓ దాన్ని పరిశీలించి డీపీఓకు పంపించారు. డీపీఓ వాటిని పరిశీలించి తుది జాబితాను ప్రకటించారు. అయితే ఎంపీడీఓ లాగిన్ ద్వారా ఓటర్ల జాబితా అప్లోడ్ చేయడం వల్ల చిన్న మార్పు వచ్చినా డీపీఓ స్థాయి నుంచి ఓటర్లను సరిచేయాల్సి రావడం వల్ల ఇబ్బందులు ఏర్పడేవి. దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ఆ విధానం మార్చి జీపీకి ప్రత్యేక లాగిన్ ఇచ్చింది. ప్రతి జీపీకి ప్రత్యేక లాగిన్ ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీపోల్ లాగిన్ ఇచ్చింది. ఆ లాగిన్లో ప్రతి గ్రామంలో ఉన్న ఓటరు జాబితాను వార్డుల వారీగా అప్లోడ్ చేశారు. గతంలో ఒక గ్రామం పరిధిలో గూడెం ఉంటే వాటికి ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేశారు. దాంతో ఓటరు జాబితాలో పక్కగా ఏ ఓటరు ఎక్కడ ఉన్నాడనేది తెలిసేలా జీపీ లాగిన్ ద్వారా స్పస్టంగా తెలియనుంది. ఒక వేళ ఏదైనా జాబితాలో పొరపాటు అయితే ఓటరు జాబితాను గ్రామ పంచాయతీ లాగిన్లో అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంపీడీఓలాగిన్కు వెళుతుంది. మార్పులు చేర్పులు ఉంటే ఎంపీడీఓ గ్రామ పంచాయతీ లాగిన్కు పంపి వాటిని సరిచేసే అధికారం ఇచ్చారు. గతంలో ఇలాంటి అవకాశం ఉండేది కాదు. జీపీ లాగిన్ వల్ల ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. ఎంపీడీఓ లాగిన్ నుంచి తిరిగి డీపీఓ లాగిన్కు ఓటరు జాబితా పంపుతారు. అక్కడ పరిశీలించిన తర్వాత ఈ రెండు మూడు రోజుల్లో కొత్త ఓటరు జాబితా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జీపీ టీపోల్ లాగిన్ ద్వారా కొత్తగా తయారు చేసిన ఓటరు జాబితాతోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. పంచాయతీల వారీగా రూపకల్పన ఫ ప్రతి పల్లెకు ప్రత్యేక టీపోల్ లాగిన్ ఫ వార్డుల వారీగా అప్లోడ్ చేసిన కార్యదర్శులు ఫ మరో మూడు రోజుల్లో జాబితా ప్రకటన ఫ ఈ జాబితాతోనే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే అవకాశంగ్రామ పంచాయతీలు 869 వార్డుల సంఖ్య 7,494 ఓటర్లు 10,53,920 (పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం) -
మూసీకి స్వల్పంగా తగ్గిన ఇన్ఫ్లో
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి 4,365 క్యూసెక్కుల వదరనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయిలో ఉండడంతో అధికారులు శనివారం ఐదు గేట్లు తెరవగా రెండింటిని ఆదివారం మూసి వేశారు. మిగతా మూడు గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి 3,850 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్ ప్రస్తుతం 643.50 అడుగుల వద్ద ఉంది. ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 454 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఫ మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
రోగులకు ఇబ్బందులు రానివ్వద్దు
నల్లగొండ టౌన్: రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వార్డుల్లో ఉన్న పేషెంట్లకు ఎక్స్రేలు, స్కానింగ్, ఇతర పరీక్షలు చేయాలంటే వార్డు నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్న రేడియాలజీ డిపార్ట్మెంట్ వరకు ఎండలో స్ట్రక్చర్, వీల్చైర్లపై, నడిపిస్తూ తీసుకెళ్తున్న పరిస్థితిపై ‘రోగులకు పరీక్ష కష్టాలు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ప్రత్యేక కథనానికి కలెక్టర్ స్పందించి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసీయూ, సర్జికల్, మెడికల్ వార్డులతోపాటు రేడియాలజీ విభాగాన్ని పరిశీలించి వైద్యులు, నర్సులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేడియాలజీ విభాగం దూరంగా ఉండడంతో నడవలేని రోగులకు మొబైల్ ఎక్స్ రే యూనిట్ ద్వారా ఎక్స్ రే తీస్తున్నట్లు, నడవగలిగే వారిని వీల్చైర్ మీద రేడియాలజీ రూమ్కు తీసుకెళ్తున్నట్లు వైద్యులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డాక్టర్లు, సిబ్బంది, నర్సులు అందుబాటులో ఉంటూ సకాలంలో వైద్యం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. ఆమె వెంట డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్, ఆర్ఎంఓ కిరణ్కుమార్, టీఎస్ఎంఐడీసీ రాజశేఖర్, జితేందర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రాబడి స్వల్పం.. ఖర్చు అధికం
నీలగిరి మున్సిపాలిటీలో ఖర్చులకు తగ్గట్టు రాని ఆదాయం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలి సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీలో ఖర్చులకు తగ్గట్టు ఆదాయం రావడం లేదు. నెలనెలా రూ.2.84 కోట్ల ఖర్చు వస్తుంటే..ఆదాయం మాత్రం రూ.2 కోట్లలోపే ఉంటోంది. దీంతో ఖర్చులను సర్దుబాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రతినెలా ఇబ్బందులు పడుతున్నారు. నీలగిరి మున్సిపాలిటీ విస్తరణకు తగ్గట్టుగానే కార్మికులు, ఉద్యోగులను నియమించారు. మున్సిపాలిటీ పరిధిలోని 48వార్డుల్లో మొత్తం 43 వేలకు పైగానే భవనాలు ఉండగా ఏడాదికి రూ.18 కోట్ల ఆస్తి పన్ను ద్వారా ఆదాయం వస్తుంది. నల్లా కనెక్షన్లు మాత్రం 29వేల వరకే ఉండగా వీటి ద్వారా ఏడాదికి రూ.3 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు కలుపుకుంటే మొత్తం రూ.21 కోట్ల రాబడి వస్తుంది. భవనాలకు అనుమతుల ద్వారా నెలకు రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. కానీ ఈ డబ్బులు నేరుగా సీడీఎంఏ ఖాతాలో జమ అవుతుండగా.. ఐదారు నెలలకు ఒకసారి మున్సిపాలిటీలకు ప్రభుత్వం పంపుతుంది. కానీ మున్సిపాలిటీలో అన్ని ఖర్చులకు ఏడాదికి దాదాపు 34.08 కోట్ల వరకు అవుతుందని అధికారులు చెబుతున్నారు. 813 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వివిధ పనుల కోసం మొత్తం 813 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి వీరికి నెలకు వేతనాల కింద రూ.1.20 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. వాహనాల డీజిల్కు రూ.22 లక్షలు, పంప్హౌస్, వీధి దీపాలు, పవర్ బోర్స్, ఆఫీస్ కరెంట్ బిల్లు నెలకు రూ.75 లక్షల వరకు వస్తుంది. ఎన్ఎంఆర్ ఉద్యోగులు వేతనాలు నెలకు రూ.7.50 లక్షలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్ నెలకు రూ.40 లక్షలు, పైప్లైన్, లీకేజీ మరమ్మతుల నిర్వహణ ఖర్చులు రూ.10 లక్షలు, వాహనాల నిర్వహణ ఖర్చు నెలకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీకి నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతుండగా, ఆదాయం మాత్రం అనుకున్నంతగా రావడంలేదని తెలుస్తోంది. 010 పద్దు ద్వారా వేతనాలు ఇస్తే సరి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు కార్మికులు చెబుతున్నారు. ఆ హామీ ప్రకారం కార్మికులను రెగ్యులరైజ్ చేసి 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీకి వేతనాల భారం తప్పనుంది. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తున్న మాదిరిగా.. వీరికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు ఇస్తే మున్సిపాలిటీకి నిర్వహణ భారం నుంచి విముక్తి కలగనుంది. న్యూస్రీల్ఫ ఖర్చు రూ.2.84 కోట్లు.. ఆదాయం రూ.2 కోట్ల లోపే.. ఫ నెలనెలా జమకాని భవనాల అనుమతుల సొమ్ము ఫ మున్సిపల్ సిబ్బందికి తప్పని సర్దుబాటు ఇక్కట్లు ఫ కార్మికుల వేతనాలు ప్రభుత్వం ఇస్తే తప్పనున్న భారం ఆదాయ వనరుల పెంపుపై దృష్టేదీ? పట్టణంలో ఏర్పాటవుతున్న వ్యాపారాలన్నింటినీ ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేయడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ అధికారులు, సిబ్బంది సమన్వయలోపం, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఆస్తి పన్నును పెంచుకోవడంలో విఫలమవుతున్నారనే చర్చ సాగుతోంది. ఆదాయ వనరును అందిపుచ్చుకోవాలని సీడీఎంఏ అధికారులు చెబుతున్నా ఆ దిశగా మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేడయంలేదు. ఆస్తి పన్ను, నల్లా బిల్లుల ద్వారా ఆదాయం దాదాపు రూ.40 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నా.. ఆ దిశగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
అన్ని రంగాల్లో విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. - 8లోఆదాయ వనరులు పెంచుతాం కరెంట్ బిల్లులు, కార్మికుల వేతనాలు, వాహనాలు పెరగడంతో డీజిల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. మున్సిపాలిటీకి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయ వనరులు కూడా పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ -
నేడు చిట్యాలకు మంద కృష్ణమాదిగ రాక
చిట్యాల : చేయూత పింఛన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చిట్యాలలో సోమవారం నిర్వహించనున్న నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల స్థాయి సమావేశానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రానున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరసాని గోపాల్ మాదిగ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి చేయూత పింఛన్దారులు, దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ప్రజాసేవ చేయడమే లయన్స్ క్లబ్ లక్ష్యంనల్లగొండ టౌన్: పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ముందుకెళ్తోందని లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు. ఆదివారం నల్లగొండలోని గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 2025–26 జిల్లా కేబినెట్ ఇన్స్టాలేషన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా జ్వోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. సేవే పరమావధిగా స్థాపించబడిన లయన్స్ క్లబ్ నేడు ప్రపంచవ్యాప్తంగా పేదప్రజలకు చేయూతగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా సమయంలో కూడా పేదప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్కుమార్ రూమాల్ల, గోపాల్రావు, దీపక్ బట్టాచార్య, టి.రాజేంద్రప్రసాద్, రాజిరెడ్డి, భీమయ్య, కేవీ.ప్రసాద్, సతీష్ కుమార్, రామకృష్ణ, అశోక్రెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆత్మగౌరవ పోరుకు యాదవులు సిద్ధంకావాలి నల్లగొండ టౌన్: యాదవులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని యాదవ సంఘం భవన్లో ఏర్పాటు చేసిన ఆ మహాసభ సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సోమవారం చేపట్టిన రెజాంగ్లా రజ్ కలశ యాత్రను విజయవంతం చేయాలన్నారు. యాత్రలో భాగంగా దేవరకొండ, కొండమల్లేపల్లి, గుర్రంపోడు, కనగల్ ప్రాంతాల్లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అలాగే 12వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు నల్లగొండలోని క్లాక్టవర్లో ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. యాదవుల ఆత్మ గౌరవం పెంచడానికి అహిర్ రెజిమెంట్ ప్రకటించాలని ఇండియన్ ఆర్మీని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుందన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్, సోమనబోయిన సుధాకర్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, కొలగాని పర్వతాలు యాదవ్, ఎల్వీ.యాదవ్, తరాల పరమేశ్ యాదవ్, గంగుల చందువంశీ యాదవ్, గుండెబోయిన జానయ్య యాదవ్, ముప్పిడి మల్లయ్య యాదవ్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, గోగుల శ్రీనివాస్ యాదవ్, జాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు. యాదగిరీశుడికి నిత్యారాధనలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రఽభాత సేవ, ఆరాధన.. గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించారు. -
బుద్ధవనం సందర్శనకు అమెరికన్ల ఆసక్తి
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని, నాగార్జునకొండను సందర్శించటానికి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల మహాయాన బుద్ధ విహార ప్రధానాచార్యుడు ఆసక్తి కనబర్చారని బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బౌద్ధాలయాల సందర్శనలో భాగంగా శనివారం ఆయన న్యూయార్క్ కెనాల్ వీధిలోని మహాయాన బౌద్ధాలయాన్ని సందర్శించి బుద్ధవనం, నాగార్జునకొండను సందర్శించమని ప్రధానాచార్యుడిని ఆహ్వానించినట్లు తెలిపారు. బుద్ధవనంలో ఆచార్య నాగార్జునుడి రచనలపై ఒక పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పాలని, కృష్ణా నది తీరంలో విలసిల్లిన ప్రముఖ బౌద్ధ స్థావరాల వివరాలను తెలుసుకోవడానికి తగిన సమాచారం అందజేయమని బుద్ధ విహార ప్రధానాచార్యుడు కోరారని ఆయన పేర్కొన్నారు. బుద్ధవనం అధికారులను కలిసి ఈ విషయంపై చర్చించి కేవలం దక్షిణాసియా దేశాల నుంచే కాక యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల బౌద్ధ పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. ఆయన వెంట ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, న్యూయార్క్ తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ సొసైటీ ప్రతినిధి, కథా రచయిత డాక్టర్ కలశపూడి శ్రీనివాసరావు ఉన్నారు. లారీల్లో నుంచి డీజిల్ చోరీకి యత్నం ఫ పోలీసులను చూసి పారిపోయిన దొంగలు నార్కట్పల్లి: నార్కట్పల్లి మండల కేంద్రం పరిధిలో నల్లగొండ బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేసేందుకు యత్నించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకోగా దొంగలు పారిపోయారు. ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై నార్కట్పల్లి మండల కేంద్రం సమీపంలో నల్లగొండ బైపాస్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల వద్ద శుక్రవారం రాత్రి ఇన్నోవా కారు అనుమానాస్పదంగా ఆగి ఉండడంతో పక్కనే ఉన్న టీస్టాల్ యజమాని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని కారును పరిశీలిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. వాహనాన్ని పరిశీలించంగా 50 లీటర్ల సామర్ధ్యం గల 30 డీజిల్ క్యాన్లు, మూడు ప్లాస్టిక్ పైపులు లభించాయి. అందులో 24 క్యాన్లలో డీజిల్ ఉండగా.. 8 క్యాన్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1200 లీటర్ల డీజిల్, ఇన్నోవా కారు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సీసీ కెమెరాలను పరిశీలించగా చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో నుంచి డీజిల్ దొంగిలించి పట్టుబడిన ఇన్నోవా వాహనంలో తరలిస్తున్నట్లు రికార్డయ్యిందని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా వాహనంలో వచ్చి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారితో పాటు నార్కట్పల్లి–అద్దంకి రహదారి పక్కన ఆగి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో పాము భువనగిరి: భువనగిరి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం రాత్రి పాము రావడంతో రోగులు గమనించి దానిని చంపేశారు. ఆస్పత్రి ఆవరణలో చెత్త వేస్తుండడం, విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడంతో పాములు వస్తున్నాయని రోగులు అంటున్నారు. ఆస్పత్రి ఆవరణను శుభ్రంగా ఉంచడంతో పాటు రాత్రి సమయంలో విద్యుత్ లైట్లు వేయాలని కోరుతున్నారు. -
బోనాల పండుగ.. ఉపాధి మెండుగ
ఫ సోదరా నీవే రక్ష రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సాక్షి నిర్వహించిన ‘సెల్ఫీ విత్ రాఖీ’ ఆహ్వానానికి విశేష స్పందన లభించింది. మహిళలు, యువతులు, బాలికలు తమ సోదరులకు రాఖీ కట్టి సెల్ఫీ తీసుకుని పంపించారు. అందులో కొన్ని.. రామగిరి(నల్లగొండ), సూర్యాపేట అర్బన్: ఉమ్మడి జిల్లాలో శ్రావణ మాసం బోనాల సందడి నెలకొంది. హైదరాబాద్లో ఆషాడమాసంలో బోనాలు నిర్వహిస్తే, పల్లెల్లో మాత్రం శ్రావణమాసంలో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఇంటికొచ్చే బంధువులు, ఆడపడుచుల రాకతో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. బోనాల పండుగ సామాజికంగా, ఆర్థికంగా చాలామందికి ఉపాధి కల్పిస్తోంది. ఫ గ్రామాల్లో శ్రావణమాసం బోనాల సందడి ఫ కుండలు, నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లు, బ్యాండ్, డప్పులు, ఎల్ఈడీ లైటింగ్కు ఫుల్ గిరాకీ బోనాల పండుగలో భాగంగా అమ్మవార్లకు ప్రతి కుటుంబం నుంచి బోనం సమర్పిస్తారు. కుమ్మరి వృత్తివారు వివిధ ఆకారాల్లో బోనం కుండలతో పాటు దానిపై దీపం పెట్టే మూతను ఒక సెట్లాగా తయారుచేసి అమ్ముతున్నారు. బోనాల సీజన్లో కుండలకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో నెల రోజుల ముందు నుంచే కుండల తయారీ ప్రక్రియ ప్రారంభించారు. ఆర్డర్లకు అనుగుణంగా కుండలు, చిన్న గురిగిలను తయారు చేసి ఇస్తున్నారు. నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లు అ‘ధర’హో.. సాధారణ రోజుల కంటే శ్రావణమాసం బోనాల సమయంలో నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. భక్తులు అమ్మవారికి నాటుకోళ్లు, గొరెర పొట్టేళ్లను బలిస్తారు. సాధారణంగా నాటుకోడి కిలో రూ.500 ఉంటుంది. ప్రస్తుతం డిమాండ్ ఎక్కుగా ఉండడంతో రూ.600 నుంచి 700 వరకు ధర పలుకుతోంది. కుల వృత్తులకు కలిసొచ్చే పండుగ.. బోనాల ఊరేగింపులో బ్యాండ్, డప్పు చప్పుళ్లు, డీజేలు ఉపయోగిస్తుతండడంతో వారికి ఉపాధి లభిస్తోంది. మాంసం విక్రయించే వారు, చాకలి, మంగలి కుల వృత్తుల వారు, ఎల్ఈడీ లైటింగ్, నైవేద్యం తయారీకి కిరాణా సామాను కొనుగోలు చేస్తుండడంతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతోంది. వ్యాపారులు, ప్రభుత్వానికి లబ్ధి బోనంతో పాటు అమ్మవారిని అంకరణకు పూలు, మామిడి ఆకులు అవసర ఉండడంతో పూల మార్కెట్లలో వ్యాపారం ఊపందుకుంది. కొబ్బరికాయలు విక్రయించే వారికి కూడా గిరాకీ పెరిగింది. బస్సుల్లో ప్రయాణించే వారితో ఆర్టీసీకి, బోనాల సందర్భంగా మద్యానికి డిమాండ్ పెరిగి ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.గిరాకీ బాగుంది శ్రావణమాసం బోనాల పండుగ సందర్భంగా కుండల గిరాకీ బాగానే ఉంది. సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ పార్కు దగ్గర కుండలు పెట్టి విక్రయిస్తున్నాను. వివిధ సైజులను బట్టి రూ.150 నుంచి 300 దాకా అమ్ముతున్నాం. – నిమ్మనకొట్టి పూలమ్మ, కుండల వ్యాపారి, సూర్యాపేట రకరకాల డిజైన్లతో తయారు చేస్తున్నాం వివిధ రకాలుగా బోనం కుండలను డిజైన్ చేసి అమ్ముతున్నాం. బోనం కుండ మూత దానిమీద పెట్టే గురిగి, వెయ్యి గండ్ల బోనం, సాదా బోనం కుండ, అలంకరణ చేసిన బోనం కుండలను విక్రయిస్తున్నాం. వైరెటీని బట్టి ధర ఉంటుంది. – మురళి, కుమ్మరి బజార్, సూర్యాపేట ముందుగానే ఆర్డర్లు ఇస్తారు బోనాల పండుగ కోసం మట్టి కుండలు, చిన్న గురుగులు, దీపం మూతలను ముందుగానే ఆర్డర్లు ఇస్తారు. దానికి అనుగుణంగా తయారుచేసి పంపుతాం. ఇంటి వద్ద కూడా విక్రయిస్తాం. నెల రోజుల పాటు ఆర్ధికంగా చేదోడుగా ఉంటుంది. – బొడ్డుపల్లి మల్లయ్య, కుండల తయారీదారుడు, నల్లగొండమట్టి కుండలకు గిరాకీ -
మొక్కలను రక్షించుకుంటేనే మానవ మనుగడ
కోదాడ: మొక్కలను రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, ప్రతిఒక్కరూ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలకు రాఖీలను కట్టి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు అన్నారు. రాఖీ పర్వదినాన్ని పరస్కరించుకొని కోదాడ పట్టణ పరిధిలోని అశోక్నగర్ వద్ద ఆయన ఆధ్వర్యంలో శనివారం మొక్కలకు రాఖీలు కట్టారు. ప్రతి ఇంట్లో చిన్నా పెద్దా మొక్కల ప్రాధాన్యతను గుర్తించి ఈ కార్యక్రమాన్ని తమ ఇంటి నుంచే ప్రారంభించాలని, ముందు ఇంట్లో మొక్కలను, ఆ తర్వాత ఇంటి ముందు మొక్కలను రక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీరుద్దీన్, ఆవుల శివప్రసాద్, షేక్ షరీపుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. విధుల్లో ఉన్న సోదరుడి వద్దకు వెళ్లి.. ● రాఖీ కట్టిన సోదరిఅర్వపల్లి: కానిస్టేబుల్గా విధుల్లో ఉన్న సోదరుడి వద్దకే వెళ్లి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది ఓ సోదరి. వివరాలు.. జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన రమావత్ సుధాకర్ భార్య సుజాత శనివారం తన సోదరుడికి రాఖీ కట్టడానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లింది. ఆమె సోదరుడు లునావత్ శ్రీను సూర్యాపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా శనివారం పొట్టి శ్రీరాములు సెంటర్లో ఉండగా సుజాత నేరుగా అక్కడికి వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహం పక్కనే సోదరుడు శ్రీనుకు రాఖీ కట్టింది. కుటుంబ కలహాలతో బలవన్మరణంకేతేపల్లి: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కేతేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన దుబ్బాక రాంరెడ్డి(47) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటి నిర్మాణం కోసం అప్పు చేశాడు. అప్పు తీర్చకపోగా మద్యం సేవిస్తూ కొంతకాలంగా పనికి వెళ్లడం లేదు. ఈ విషయమై భార్య స్వాతితో తరుచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం భార్యతో గొడవపడి మనస్తాపం చెందిన రాంరెడ్డి ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటంబ సభ్యులు గమనించి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. -
మూడు నెలలుగా మందుల కొరత
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని వెల్నెస్ సెంటర్కు మందుల కొరత పట్టిపీడిస్తుంది. మూడు నెలలుగా పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండడం లేదు. కేవలం మూడు నాలుగు రకాల ట్యాబ్లెట్లు, కొన్ని క్రీమ్లు, చిన్నా చితక మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నెలనెలా మందుల కోసం వచ్చే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడికే.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు, జర్నలిస్టులు.. వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సేవలను అందించడంతో పాటు మందులను కూడా ఉచితంగా అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. హెల్త్ కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె, కిడ్నీ , కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతి నెలా వెల్నెస్ సెంటర్కు వచ్చి ఉచితంగా మందులను తీసుకెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వారు ఇక్కడికి వచ్చి డాక్టర్లకు చూపించుకుని మందులు తీసుకుంటారు. కానీ మూడు నెలలుగా సక్రమంగా మందులు లేకపోవడంతో ఉన్న మూడు నాలుగు రకాల ట్యాబ్లెట్లు, సిరప్లు, క్రీమ్లు ఇచ్చి పంపుతున్నారు. మిగతా మందులు వచ్చాగా వచ్చి తీసుకుపోవాలని ఫార్మసిస్టులు సూచిస్తున్నారు. పూర్తి స్థాయిలో మందులు లేని కారణంగా దూరం ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మందులు అందుబాటులో ఉంచేలా చూడాలని కోరుతున్నారు.ఫ వెల్నెస్ సెంటర్లో మూడు నాలుగు రకాలు మాత్రలే అందుబాటులో.. ఫ దీర్ఘకాలిక వ్యాధుల ట్యాబ్లెట్లు లేవంటున్న సిబ్బంది ఫ ఇబ్బంది పడుతున్న హెల్త్ కార్డుదారులు ఇండెంట్ పంపించాం వెల్నెస్ సెంటర్లో అవసరమైన మందుల కోసం ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఇండెంట్ పంపించాం. దశల వారీగా పంపుతున్నారు. పేషంట్ల సంఖ్యకూడా గణనీయంగా పెరిగింది. మందులు తక్కువగా పంపిస్తున్నారు. రోగులకు ఇంబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ లావణ్య, వెల్నెస్సెంటర్ ఇన్చార్జి -
ఫ మూసీ ఉధృతి
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 5,082 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు ఐదు క్రస్ట్గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 9,598 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. నీటిమట్టాన్ని 643.50 వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వస్తున్న వరద మొత్తం దిగువకు వదులుతున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 286 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.0 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు. -
పూర్తిస్థాయి నీటిమట్టానికి సాగర్
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. నాగార్జునసాగర్ గరిష్టస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు (312 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 589.70 అడుగులు (311.1486 టీఎంసీలు)గా ఉంది. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 65,530 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా కృష్ణా నదిలోకి 29,313 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, వరద, ఏఎమ్మార్పీ కాలువల ద్వారా మరో 15,577 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడం.. ప్రాజెక్టు గరిష్టస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఆదివారం ఉదయం క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఫ మరోసారి తెరుచుకోనున్న క్రస్ట్గేట్లు -
13 వరకు రైతు బీమా దరఖాస్తులు
నల్లగొండ అగ్రికల్చర్ : కొత్తగా పాస్బుక్తో వచ్చిన రైతులంతా రైతు బీమా కోసం ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన, 18 నుంచి 59 సంవత్సరాల వరకు వయసు ఉన్న రైతులందరూ రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రైతులు తమ పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు, నామిని ఆధార్ కార్డ్ జిరాక్స్లతో పూర్తి చేసిన దరఖాస్తులను ఏఈఓలకు అందజేయాలని సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంకట్టంగూర్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు. ఈ నీటితో కొండకిందిగూడెం, బండపాలెం, ఇనుపాముల, కేతేపల్లి, కొర్లపహాడ్, నోముల, నకిరేకల్ చెరువులను నింపుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సుంకరబోయిన నర్సింహ, మాద యాదగిరి, రెడ్డిపల్లి సాగర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, నంద్యాల వెంకట్రెడ్డి, బెజవాడ సైదులు, చెవుగోని సాయిలు, ఎడ్ల పెదరాములు, చెవుగోని రవి, మర్రి రాజు, ముక్కాముల శేఖర్, ఇరిగేషన్ డీఈ భూషణాచారి, ఏఈలు పాండు, చందన ఉన్నారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కృషిదేవరకొండ : ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా దేవరకొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం–గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువటద్దంగా నిలిచే జీవనశైలి ఆదివాసీ సొంతమన్నారు. దేశంలో ఆదివాసీలు సమానత్వం, హక్కులు, వివక్ష లేని సమాజం కోసం ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారని వారి హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఛత్రునాయక్, ఎంపీడీఓ డానియల్, తహసీల్ధార్ మధుసూదన్రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, వేణుధర్రెడ్డి, బిక్కూనాయక్, కొర్ర రాంసింగ్ తదితరులు ఉన్నారు. పండుగ వేళ ఆర్టీసీ బాదుడుమిర్యాలగూడ టౌన్, కొండమల్లెపల్లి : పండుగలకు ఆర్టీసీ ప్రయాణికులపై చార్జీల భారం మోపుతోంది. రాఖీ పండుగ సందర్భంగా రీజియన్ పరిధిలో బస్ చార్జీలను 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచింది. మామూలు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు సూపర్ లగ్జరీ బస్సుకు చార్జీ రూ.310 ఉండగా.. రాఖీ రోజున రూ.430కి పెంచింది. అంటే ఒక్క టికెట్పై రూ.120 అదనంగా వసూలు చేసింది. దేవరకొండ నుంచి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ బస్చార్జీ రూ.160 ఉండగా రూ.220 వసూలు చేశారు. ఓ పక్క మహిళలకు ఫ్రీ ఇస్తూనే.. పండగ స్పెషల్ అంటూ అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏరియల్ లైడార్ సర్వే
ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకానికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం పనులపై ఆశలు చిగురిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఇన్లెట్లోని 14వ కిలోమీటరు వద్ద జరిగిన ప్రమాదంతో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రమాదం జరిగిన చోట టన్నెల్ను తవ్వే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా టన్నెల్ పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రెండు రకాల సర్వేలు చేయిస్తోంది. వాటి నివేదికల ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో టెన్నల్ తవ్వకం పనులను పక్కాగా చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఏరియల్ లైడార్ సర్వే నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేషనల్ జియో ఫిజికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో వీటెమ్ ప్లస్ మాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. ఈ సర్వేలు చేపట్టేందుకు రూ.2.36 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం పాలనపరమైన అనుమతులు జారీ చేసింది. అవాంతరాలతో ఆలస్యం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో 2005లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ప్రభుత్వం చేపట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పూర్తి గ్రావిటీ ద్వారా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి వరకు నీటిని తరలించేందుకు 43.930 కిలోమీటర్ల పొడవునా సొరంగం తవ్వకాన్ని చేపట్టింది. ఇన్లెట్, ఔట్లెట్ కలిపి 34.37 కిలోమీటర్లు టన్నెల్ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అందులో ఔట్లెట్లో 20.435 కిలోమీటర్లు సొరంగం తవ్వకం పూర్తి కాగా, మరో 3.545 కిలోమీటర్ల తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో టీబీఎం బేరింగ్ పాడైపోవడంతో 2023 జనవరిలో పనులు ఆగిపోయాయి. అదే ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లోనే నిధులను వెచ్చించి అమెరికా నుంచి బేరింగ్ తెప్పించ్చింది. బేరింగ్ ఏప్రిల్ నెలలో మన్నెవారిపల్లికి చేరుకుంది. బేరింగ్ను టీబీఎంకు అమర్చేందుకు అవసరమైన పరికరాలు కెనడా నుంచి రావాల్సి ఉంది. డబ్బుల సమస్యతో అవేవీ రాలేదు. దీంతో బేరింగ్ వచ్చినా టన్నెల్ లోపలికి కూడా తీసుకెళ్లలేదు. ఇన్లెట్లో ప్రత్యామ్నాయాలపైనే ప్రత్యేక దృష్టి సొరంగం ఇన్లెట్ దోమలపెంట వైపు నుంచి 13.935 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది. ఇంకా 6.015 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే 14వ కిలోమీటరు కంటే ముందు షియర్ జోన్ కారణంగా పెద్ద ఎత్తున బురద, మట్టి ఉబికి వస్తుండటంతో పనులు 2019లోనే ఆగిపోయాయి. అప్పటి నుంచి అక్కడ డీవాటరింగ్ మాత్రమే కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన పనులను ప్రారంభించారు. టీబీఎంతో తవ్వుతుండగా సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాద దాటికి టీబీఎం ముక్కలైపోయింది. 8 మంది గల్లంతయ్యారు. వారిని వెలికితీసేందుకు 60 రోజులకుపైగా సహాయక చర్యలు కొనసాగాయి. ఇద్దరు కార్మికుల మృతదేహాలను మాత్రమే వెలికితీయగా, ఇంకా ఆరుగురి జాడ తెలియలేదు. పైకప్పు మళ్లీ కూలేందుకు అవకాశం ఉండటంతో సహాయక చర్యలు ఆపేశారు. అయితే ఇన్లెట్లో 14వ కిలోమీటరు వద్ద కుప్పకూలిన ప్రాంతానికి కంటే ముందు నుంచి యాభై మీటర్ల పక్కకు జరిగి, అక్కడి నుంచి సమాంతరంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం తవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రెండు జాతీయ సంస్థల ఆధ్వర్యంలో సర్వే చేపట్టాలని నిర్ణయించింది. వేగం పుంజుకోనున్న సర్వే పనులుటన్నెల్ ప్రాంతం అంతా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు, పర్యావరణ రక్షణ కోసం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం కాకుండా టీబీఎం ద్వారా తవ్వకాన్ని చేపట్టింది. అయితే ఇన్లెట్ కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ఎలా ముందుకు సాగాలనే విషయంలో పలు అంశాలను పరిశీలిస్తోంది. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో టన్నెల్ తవ్వాలన్న దానిపై రెండు రకాల సర్వే చేపట్టేందుకు ఉపక్రమించింది. అందుకు నిధులు కూడా విడుదల చేసింది. ఔట్లెట్లోనూ బేరింగ్ బిగించేందుకు అవసరమైన పరికరాలను తెప్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఫ ఆరు నెలలుగా నిలిచిన పనుల్లో కదలిక ఫ తాజాగా రెండు రకాల సర్వేకు ప్రభుత్వం కసరత్తు ఫ సర్వేకు రూ.2.36 కోట్లతో పరిపాలనా అనుమతులు ఫ 9.56 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయితే నల్లగొండకు జలసిరి -
పంట పొలాల్లో ఇసుక మేట
ఫ భారీగా దెబ్బతిన్న పంటలు ఫ ధ్వంసమైన లింకురోడ్లు ఫ శాలిగౌరారం మండలాన్ని అతలాకుతలం చేసిన వర్షం శాలిగౌరారం : మండలంలో గురువారం కురిసిన అతి భారీ వర్షం శాలిగౌరారం మండలాన్ని అతలాకుతలం చేసింది. 14.1 సెంటీమీటర్ల వర్షంతో మండలకేంద్రంతో పాటూ మండలంలోని పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగి చెరువులు, కుంటలను తలపించాయి. భారీ వర్షంతో పోటెత్తిన వరదలకు ఆయా గ్రామాల్లో వరి, పత్తి పంటపొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శనివారం నాటికి వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద గల లోతట్టు ప్రాంతంలో వరదనీటి ప్రభావం అత్యధికంగా ఉండటంతో వరి చేలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వలతో పాటూ రామగిరి, తిరుమలరాయునిగూడెం, శాలిగౌరారం గ్రామాల వరదనీరు మొత్తం శాలిగౌరారం బస్టాప్ వద్ద ఉన్న లోతట్టు భూములమీదుగానే ప్రవహించడంతో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దెబ్బతిన్న అనుసంధాన రోడ్లు.. భారీ వర్షానికి మండలంలోని గ్రామాలకు మధ్యన అనుసంధానంగా ఉన్న లింక్రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా రోడ్లపై రాకపోకలు సాగించడం కష్టతరంగా మారింది. అందులో ప్రధానంగా ఊట్కూరు–బండమీదిగూడెం గ్రామం రోడ్డు, భైరవునిబండ–అద్దెలోనిబావి రోడ్డు, శాలిలింగోటం–తుడిమిడి రోడ్డు, అంభారిపేట–చిత్తలూరి రోడ్లు ఉన్నాయి. బండమీదిగూడెం మెటల్రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాళ్లు తేలడంతో వాహనాలు సైతం నడుపలేని అధ్వాన్న పరిస్థితి ఏర్పడింది.పొలం ఇసుకమేటలు వేశాయి శాలిగౌరారం బస్టాప్ వద్ద నాకున్న ఎకరం భూమిలో ఇటీవలే వరినాటు వేశాను. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాల్వ కట్ట తెగి పొలంమీదుగా వరద ప్రవహించింది. పొలం మొత్తం రాళ్లు, ఇసుక మేటలు వేశాయి. రూ.30 వేలు ఖర్చుపెట్టి పంటసాగు చేస్తే వర్షం నా పొలాన్ని రాళ్ల కుప్పగా మార్చింది. ప్రభుత్వమే మమ్ములను ఆదుకుని న్యాయం చేయాలి. – షేక్ మహబూబ్అలీ, రైతు, శాలిగౌరారం -
సెలవులతో బస్సులు కిటకిట..
నల్లగొండ, చౌటుప్పల్: వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. స్వస్థలాలకు వెళ్లేవారితో బస్టాండ్లు, రహదారులు కిక్కిరిసిపోయాయి. నల్లగొండ బస్టాండ్లో బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి నిలబడి బస్సుల కోసం ఎదురు చూశారు. కిక్కిరిసిన బస్సుల్లో వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. చిన్నారులను బస్సు కిటికీ ల్లోంచి లోపలికి ఎక్కించాల్సి వచ్చింది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం విపరీతమైన రద్దీ నెలకొంది. ప్రధానంగా విజయవాడ మార్గంలో.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భారీగా వాహనాల రద్దీ నెలకొంది. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జనం నానా తిప్పలు పడ్డారు. ప్రధానంగా జంక్షన్ వద్ద రోడ్డును దాటేందుకు సాహసాలు చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్ క్రమబదీ్ధకరణకు పోలీసులు భారీగానే మోహరించారు. -
ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి
దేవరకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అధికారులు పురోగతి తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్తో కలిసి ఏర్పాటు చేసిన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ఇల్లు మంజూరై నిర్మించుకు నేందుకు ఆర్థిక స్థోమత లేని వారిని గుర్తించి వారికి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇళ్ల పురోగతిని పరుగులు పెట్టించాలని అధికారులకు సూచించారు. జాబితాలో అర్హులైన వారిని చేర్చాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఆర్డీఓ రమణారెడ్డి, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఎన్నెస్పీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి త్రిపురారం : భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు వచ్చే అవకాశం ఉంటుందని ఎన్నెస్పీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వద్ద కంపాసాగర్ పరిధిలో సాగర్ఎడమ కాలువకు ఉన్న ఎమర్జెన్సీ గేట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దదేవులపల్లి చెరువు విస్తీర్ణం, నీటి సామర్థ్యం, ఎమర్జెన్సీ గేట్ల పనితీరుపై ఆరా తీశారు. వరదలు వచ్చినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని తెలసుకున్నారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎన్నెస్పీ డీఈ గోపీనాథ్, తహసీల్దార్ గాజులు ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, ఎన్నెస్పీ ఏఈ ప్రవీన్ ఉన్నారు. ఎడమకాల్వ పరిశీలన హాలియా : భారీ వర్షాలు వస్తే అత్యవసర సమయంలో అప్రమత్తంగా ఉంటూ సాగునీటిని నియంత్రించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హాలియాలోని 17వ మైలురాయి వద్ద ఎడమకాల్వను పరిశీలించారు. అత్యవసర పరిస్ధితుల్లో నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే నీటిని ఎస్కేప్ ఛానెల్ ద్వారా స్ట్రీమ్కు పంపించాలన్నారు. -
64,884 మందికి రేషన్ కార్డులు
నల్లగొండ: కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎట్టకేలకు పూర్తయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డుల పంపిణీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంతో పాటు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. అయితే వాటన్నింటిని పరిశీలించి గతనెల 14వ తేదీన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం నియోజక వర్గాల వారీగా ఎమ్మెల్యేల చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. మొత్తంగా 72,100 మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోగా 64,884 దరఖాస్తులను అప్రూవల్ చేసి లబ్ధిదారులకు అందించారు. మిగతావి వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్నాయి. పేర్లు చేర్చేందుకు 87,122 అర్జీలు రేషన్ కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు 87,122 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 82,185 దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో వాటిల్లో కొత్తగా పేర్లు చేర్చారు. మిగతావి ఆర్ఐ, తహసీల్దార్, డీఎస్ఓ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. ఫ పూర్తయిన పంపిణీ ప్రక్రియ ఫ కొత్త కార్డులకు సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డులేని అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా దరఖాస్తులను పరిశీలించి అర్హతల ప్రకారం కొత్త కార్డు మంజూరు చేస్తాం. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ -
గుజరాత్ నుంచి నల్లగొండకు బ్యాలెట్ బాక్సులు
నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను గుజరాత్ రాష్ట్రం నుంచి తెప్పిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో గ్రామ పంచాయతీ ఎన్నికలు వరుసగా నిర్వహించే అవకాశం ఉన్నందున జిల్లాలో ఉన్న బ్యాలెట్ బాక్సులు సరిపోయే అవకాశం లేదు. దీంతో గుజరాత్ నుంచి 4280 బ్యాలెట్ బాక్సులను తెప్పించారు. వాటిని శుక్రవారం నల్లగొండలోని జిల్లా పరిషత్ పాత భవనంలో భద్రపరిచారు. బ్యాలెట్ బాక్సులను జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు పరిశీలించారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పీజీ సెమిస్టర్ పరీక్షలను అధికారులు తనిఖీ చేశారు. యూనివర్సిటీలో పరీక్ష కేంద్రాలను వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ జి.ఉపేందర్రెడ్డి పర్యవేక్షించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరంచిట్యాల : వానాకాలం వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగు ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ సూచించారు. చిట్యాల పీహెచ్సీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఆనంతరం మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో ఇటీవల డెంగీ వ్యాధి సోకిన ఇంటి పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైడే నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డీఎంఓ ప్రదీప్, డాక్టర్ ఈసం వెంకటేశ్వర్లు, సీహెచ్ఓ నర్సింహారావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కేజీబీవీ తనిఖీ హాలియా : పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓ బొల్లారం భిక్షపతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన హైజెనిక్ ఆహార పదార్థాలను అందించాలని స్పెషల్ ఆఫీసర్ హైమావతికి సూచించారు. స్టోర్, కిచెన్, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాల సిబ్బందితో సమావేశమై విద్యార్థుల ప్రగతిని సమీక్షిస్తూ గుణాత్మకమైన విద్యను అందించాలని సూచించారు. నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యారాధనలో భాగంగా ఆండాళ్దేవికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. -
ముంచెత్తిన వాన
జిల్లా అంతటా జోరు వర్షం ఫ శాలిగౌరారంలో అత్యధికంగా 14.1 సెంటీమీటర్లు నమోదు ఫ పలుచోట్ల పొంగిన వాగులు.. రాకపోకలకు అంతరాయంఫ పత్తి చేలలో నిలిచిన నీరుపెద్దవూర, తిరుమలగిరి(నాగార్జునసాగర్), త్రిపురారం : అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 31.9 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 14.1 సెంటీమీటర్ల వర్షం కురవగా.. అత్యల్పంగా నాంపల్లి మండలంలో 8.0 మిల్లీమీటర్ల వాన కురిసింది. వర్షంతో పలుచోట్ల పత్తి చేలలో నీరు చేరింది. వాగులు, వంకలు పొంగాయి. దీంతో లోలెల్ వంతెనల పైనుంచి వరద నీరు పోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే.. మొన్నటి వరకు వేసవిని తలపించేలా ఎండలు ఉండటంతో పత్తి, మిరప చేలు వాడు దశకు చేరుకున్నాయి. ఈ వర్షంతో పంటలకు డోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీటమునిగిన చేలు ● పెద్దవూర మండలంలో కురిసన భారీ వర్షంతో మండలంలోని పెద్దవూర, నాయినివానికుంట, సంగారం, పోతునూరు చెరువులు అలుగులు పో స్తున్నాయి. పెద్దవూర–పర్వేదుల రహదారిపై మండల కేంద్రంలో చిన్నవాగుపై ఉన్న వంతెన పై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో నీటిలోనుంచే పశువులు, వాహనాలు వెళ్లాల్సి వచ్చింది. ● తిరుమలగిరి సాగర్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురింసింది. మండలంలో చాలా గ్రామాల్లో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. పత్తి పంట చెరువును తలపించేలా మారాయి. ● త్రిపురారం మండల వ్యాప్తంగా భారీ వర్షం కురి సింది. దీంతో మండల కేంద్రం నుంచి కుక్క డం వెళ్లే రహరారిలో బాబుసాయిపేట వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శాలిగౌరారంలో కుండపోత శాలిగౌరారం : మండలంలో గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో అలుగు పోస్తున్నాయి. వరదలకు మండల కేంద్రంలో కాల్వలకు గండ్లు పడటంతో వరి పంటకు నష్టం వాటిల్లింది. మండలంలోని ఊట్కూర్, మాదారం కలాన్కు వెళ్లే ప్రధాన రోడ్డుపై ఊట్కూర్ వద్ద కాజ్వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో మండలంలోని ఊట్కూర్, మాదారం కలాన్, పెర్కకొండారం, ఇటుకలపాడ్, వంగమర్తి గ్రామాలకు మండల కేంద్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి వందల ఎకరాల్లో పత్తి, వరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఊట్కూర్ నుంచి బండమీదగూడెం వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో బండమీదగూడెం వెళ్లడం కష్టతరంగా మారింది. నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన ముగ్గురు తాపిమేసీ్త్రలు ఊట్కూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ముగించుకుని బైక్పై తిరిగి వెళుతుండగా ఊట్కూర్ మాదారంకలాన్ గ్రామాల మధ్య కాజ్వేపై వరద నీటిలో కొట్టుకుపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వారిని తాళ్ల సాయంతో బయటకు లాగి ప్రాణాపాయం తప్పించారు. శుక్రవారం ఉదయం బైక్ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. వర్షపాతం వివరాలు ఇవీ.. నల్లగొండ టౌన్ : చిట్యాల 49.1మి.మీ, నార్కట్పల్లి 35.5, కట్టంగూర్ 60.3, నకిరేకల్ 42.5, కేతేపల్లి 31.9, తిప్పర్తి 11.9, నల్లగొండ 47.5, కనగల్ 15.2, అనుముల హాలియా 41.7, నిడమనూరు 26.8, త్రిపురారం 36.8, మాడ్గులపల్లి 25.5, వేములపల్లి 59.1, మిర్యాలగూడ 15.8, దామరచర్ల 24.5, అడవిదేవులపల్లి 45.4, తిరుమలగిరి సాగర్ 26.7, పెద్దవూర 37.8, చింతపల్లి 19.5, గుర్రంపోడు 11.5, పీఏపల్లి 26.8, నేరడుగొమ్ము 10.8, కె.మల్లేపల్లి 16.8, దేవరకొండ 27.6, గుండ్లపల్లి 56.9, చందంపేట 18.0, గుడిపల్లి 17.7, మునుగోడు 22.8, చండూరు 21.6, గట్టుప్పల్ 10.3, మర్రిగూడ మండలంలో 9.4 మిలీమీటర్ల వర్షం కురిసింది. -
విధులకు వెళ్లకుండా ఫేక్ అటెండెన్స్!
నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ వ్యవహారం నల్లగొండ జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. జిల్లాలో 69 మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరు కాకుండానే అటెండెన్స్ వేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్రస్థాయిలో గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ వారి వివరాలను జిల్లా అధికారులకు పంపించి చర్యలకు ఆదేశించింది. దీంతో ఫేక్ అటెండెన్స్కు పాల్పడ్డ కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడం.. అందుకు వారు సమాధానం కూడా ఇచ్చారు. త్వరలోనే వారిపై కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఉదయం 9.30 గంటలకు హాజరు వేయాలి జిల్లాలో పాత గ్రామ పంచాయతీలు 844 ఉన్నాయి. వాటి పరిధిలో పని చేసే పంచాయతీ కార్యదర్శులు రోజూ ఉదయం 9.30 గంటలకు ఆయా గ్రామాలకు వెళ్లి ఫేస్ రికగ్నిషన్ యాప్లో అటెండెన్స్ అప్లోడ్ చేయాలి. కానీ.. కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతూ ఫేక్ అటెండెన్స్ వేసి పంచాయతీరాజ్ శాఖను మోసం చేస్తున్నారు. ఇలా జిల్లాలో 69 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా మారుమూల ప్రాంతాల గ్రామాలకు చెందిన వారే ఉండడం గమనార్హం యాప్లోనే లొసుగులు ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు కోసం యాప్ను రూపొందించి అమలు చేస్తోంది. కానీ ఆ యాప్లో పలు లొసుగులు ఉన్నాయి. యాప్లో ఉద్యోగి ఆధార్కు అనుసందానం లేదు. దానికి తోడు ఎవరి ఫొటో పెట్టినా అటెండెన్స్ పడుతుంది. దీంతో కార్యదర్శులు ఆ గ్రామంలో పనిచేసే కార్మికుల సెల్లో యాప్ను డౌన్లోడ్ చేసి కార్యదర్శుల పాస్ ఫొటోలను వారికి ఇవ్వడంతో వీరు విధులకు వెళ్లని రోజు కార్మికులే వీరి పాస్పొటోను చూపి అటెండెన్స్ వేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం పంచాయతీ కార్యదర్శులు రోజూ ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరువేస్తారు. వారి హాజరును పరిశీలించాల్సింది ఎంపీఓ. సదరు అధికారి రోజూ 2, 3 గ్రామాలు వెళ్లి పరిశీలించాలి. కానీ జిల్లాలో అధికారులు ఫేక్ అటెండెన్స్లు గుర్తించలేదు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్కు పాల్పడ్డట్లు స్పష్టమవుతోంది. ఫ 69 మంది కార్యదర్శులను గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ ఫ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చిన కార్యదర్శులు ఫ క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్న జిల్లా కలెక్టర్ క్రిమినల్ చర్యలకు అవకాశం.. జిల్లాలో తప్పుడు పద్ధతిలో అటెండెన్స్ వేసిన 69 మంది కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేశారు. వాటికి కార్యదర్శులు కూడా సమాధానం ఇచ్చారు. ఆ నివేదిక అంతా కలెక్టర్కు సమర్పించనున్నారు. సీసీఎల్ఏ నిబంధనల ప్రకారం కార్యదర్శులను సస్పెండ్ చేయవచ్చు. ఇంక్రిమెంట్ కట్ చేయడం, ఇతర క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం కూడా ఉంది. దీనిపై త్వరలోనే కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
నల్లగొండ: ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై గురువారం నల్లగొండ కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన చేయాలన్నారు. ముఖ్య అతిథి సందేశానికి శాఖల వారి ప్రగతికి సంబంధించిన నివేదికలను ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలని సూచించారు. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకావిష్కరణ, వందన స్వీకరణ, సందేశం, శకటాలు, స్టాళ్ల ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే విధంగా పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేయాలని చెప్పారు. వేడుకలకు హాజరయ్యే వారందరికీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఇన్నోవేషన్ హబ్
..మనకేనా?స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా.. రీజనల్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కేంద్రం భావిస్తోంది. పరిశోధన – అభివృద్ధి కేంద్రాల్లో ఉద్యోగాలు, నూతన సాంకేతికతలపై పరిశోధనలో పాలుపంచుకునే అవకాశాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్లకు సహకారం అందించడం, ఫండింగ్, మార్కెట్ లింకేజీలో సహకారం అందించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటును అందించనుంది. దక్షిణ తెలంగాణలో రీజనల్ హబ్ ఏర్పాటుకు కేంద్రం సుముఖత ఫ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలకం ఫ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు ఫ పార్లమెంటు ప్రశ్నోత్తరాల్లో ఎంపీ రఘువీర్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దక్షిణ తెలంగాణలో రీజనల్ ఇన్నోవేషన్ హబ్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పరిశీలన జరుపుతున్నామని వెల్లడించింది. అంతేకాదు నల్లగొండలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి పార్లమెంటులో బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్ హబ్ను నల్లగొండలోనే ఏర్పాటు చేసేలా ఎంపీ కేంద్రాన్ని కోరారు. దీంతో జిల్లాలో హబ్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలు, పరిశోధన, పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రీజనల్ ఇన్నోవేషన్ హబ్లను/సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చైన్నె తదితర ప్రాంతాల్లో ఇన్నోవేషన్ హబ్లు ఉన్నాయి. అవికాకుండా ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో రీజనల్ హబ్ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే దక్షిణ తెలంగాణలో ఒకటి ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎంపీ రఘువీర్రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ హబ్ నల్లగొండకు మంజూరు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది దానిపైనా అధికారులతో త్వరలోనే సమావేశమై చర్చించనున్నారు. ప్రాంతీయ అవసరాలపైనా ప్రాజెక్టులు రీజనల్ హబ్లో ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రూపొందించి అమలు చే యనుంది. తద్వారా స్థానిక అవసరాలకు పెద్దపీట వేయనుంది. స్థానిక యువత, విద్యార్థులు, పరిశోధకులకు ప్రోత్సాహం అందించనుంది. స్టార్టప్లకు ప్రోత్సాహంతో కొత్త సంస్థలు ఏర్పడటం ద్వారా వాటిల్లోనూ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.ఆధునిక సాంకేతికతపైనా ప్రత్యేక దృష్టి రీజనల్ ఇన్నోవేషన్ హబ్లో నూతన ఆవిష్కరణలతో పాటు స్టార్టప్లకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానంపైనా శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టనుంది. అందులో ఏర్పాటు చేసే నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రస్తుతం మార్కెట్లో ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తుంది. ముఖ్యంగా డిజిటల్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్, డాటా సైన్స్, ఫ్యాబ్రికేషన్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టనుంది. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ప్రదర్శన కేంద్రాలు (ప్రోటోటైపింగ్), చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉత్పత్తుల పరీక్ష వేదికలను ఏర్పాటు చేయనుంది. అలాగే వృత్తి శిక్షణ కేంద్రాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్లు, వర్చువల్ లాబ్స్ – టెక్ లాబ్లు, ఇండస్ట్రీ, అకాడమీ కొలాబ్రేషన్ కేంద్రాలను ఇందులో ఏర్పాటు చేయనుంది. -
ప్రబలుతున్న విషజ్వరాలు
జ్వర పీడితులతో ఆస్పత్రులు కిటకిట ఫ మలేరియా, టైపాయిడ్ బాధితులే అధికం ఫ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజూ వందల సంఖ్యలో ఓపీ ఫ మార్చి నుంచి ఎనిమిది డెంగీ పాజిటివ్ కేసులు నమోదు ఫ పరీక్షల పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు వైద్యాధికారుల సూచనలు ఇవీ.. ● దోమలు పెరగకుండా ఇళ్ల ముందు మురికి గుంతల్లో రసాయన ద్రవాలను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ● పాత ట్యూబులు, కుండల్లో నీరు నిల్వ ఉంకుండా చూడాలి. ● దోమ తెరలను వినియోగించుకోవాలి. ● జ్వర లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలి. ● చిన్న పిల్లలను పట్ల అప్రమత్తంగా ఉండాలి. జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలి. ● ఇంటి పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. నల్లగొండ టౌన్: వానాకాలం కావడంతో సీజనల్గా వచ్చే విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కొన్ని రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు డెంగీతోపాటు మలేరియా, టైపాయిడ్ వంటి లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్నాయి. ఇందులో మలేరియా, టైపాయిడ్, సాధారణ జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం మార్చి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా రక్త పరీక్షలు చేయగా ఎనిమిది డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, నార్కట్పల్లి, కేతేపల్లి, దామరచర్ల, నాగార్జునసాగర్ ప్రాంతాల్లోని ప్రజలు డెంగీ లక్షణాలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో జూన్ నుంచి ప్రతిరోజూ 400 నుంచి 600 వరకు ఓపీ నమోదవుతోంది. సాధారణ రోజుల్లోనైతే 300 వరకు ఓపీ నమోదయ్యేది. అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వర్షాలు కురిస్తే డెంగీ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. మురుగునీటి నిల్వే కారణం.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీటి గుంతలతో పాటు మురుగు కాల్వల్లో, ఇళ్లలో నీటి తొట్లు, పగిలిపోయిన కుండలు, పాత డ్రమ్ములు, కొబ్బరిబోండాల వంటి వాటిల్లో నీటి నిల్వలు ఉండడం వల్ల దోమల వ్యాప్తి పెరిగి డెంగీ ప్రబలుతోంది. గ్రామాలు, పట్టణాల్లోని వీధులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వర్షాలకు ముందు తర్వాత డ్రెయినేజీల్లో పూడిక తీసివేసి మురుగునీరు సక్రమంగా పారేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉన్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వారంలో ఒక రోజు డ్రైడేగా పాటించి పేరుకుపోయిన నీటి నిల్వలను పారబోయడం వల్ల డెంగీని అరికట్టవచ్చు. ముఖ్యంగా అర్బన్ మలేరియా విభాగంలో ఒక్క నల్లగొండ పట్టణంలో 60 మంది వరకు సిబ్బంది ఉన్నారు. వీరంతా దోమల నివారణకు మందు చల్లడం, ఫాగింగ్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుస్తోంది. పెరుగుతున్న రోగులు జిల్లాలో సీజనల్ వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్), మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నకిరేకల్, మర్రిగూడ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా డెంగీ, మలేరియా, టైపాయిడ్ వంటి లక్షణాలతో బాధితులు పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఇదే పరిస్థితి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కనిపిస్తోంది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ పరీక్షల పేరుతో బాధితుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం డెంగీ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలిశా పరీక్ష ద్వారా చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు డెంగీ బూచిని చూపి వివిధ పరీక్షల పేరుతో బాధితులను నిలువ దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 01ఏరియా ఆస్పత్రులు 04అర్బన్ హెల్త్ సెంటర్లు 05కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 01పీహెచ్సీలు 34 బస్తీ దవాఖానాలు 195పల్లె దవాఖానాలు 07సిబ్బందిని అప్రమత్తం చేశాం జిల్లాలో డెంగీ వ్యాప్తి చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశాం. అన్ని గ్రామాలు, పట్టణాల్లో మురుగునీటి గుంతల్లో దోమల నివారణకు మందులు స్ప్రే చేయాలని ఆదేశించాం. ప్రజలు కూడా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పారిశుభ్రత పాటించాలి. డెంగీ లక్షణాలు కనపడితే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించి సరైన వైద్యసేవలు పొందాలి. – పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ -
భూభారతి చట్టం.. రైతులకు వరం
మిర్యాలగూడ, నిడమనూరు, చింతపల్లి : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రైతులకు వరమని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ అన్నారు. సాగు న్యాయ యాత్రలో భాగంగా గురువారం మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయం, నిడమనూరు, చింతపల్లి రైతు వేదికల్లో రైతులకు భూ చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ రైతులు భూ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. భూ చట్టాలపై అవగాహన అవసరమని, తద్వారానే రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. రైతుల హక్కులు, సాగు చట్టాలపై అవగాహన కల్పించేందుకు జూలై 28 నుంచి సాగు న్యాయ యాత్ర చేపట్టామని, అక్టోబర్ 2 వరకు 800 పైచిలుకు గ్రామాల మీదుగా 2,400 కిలోమీటర్ల పర్యటన సాగుతుందన్నారు. రైతులు విత్తనాలు కొన్నప్పుడు రసీదు అడిగి తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనం రైతు హక్కు అని పేర్కొన్నారు. అనంతరం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి లీవ్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. నిడమనూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పీఏ హరివెంకట ప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్, ప్రకృతి సాగు నిపుణుడు గున్న రాజేందర్రెడ్డి, అడ్వకేట్స్ జీవన్, అభిలాష్, మల్లేష్, ప్రవీణ్, సందీప్, ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్రెడ్డి, నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, ఏడీఏ సరితా, ఆయా మండలాల వ్యవసాయాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫ రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ -
రసాయన పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలి
నల్లగొండ: జిల్లా పరిధిలోని రసాయన, ఔషధ పరిశ్రమల్లో నెల రోజుల్లోగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా ఫైర్ ఆఫీసర్, జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారులతో గురువారం ఆమె కలెక్టరేట్లో సమావేశమయ్యారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతంలో జూన్లో జరిగిన పెద్ద విస్పోటన ఘటనకు సంబంధించి భద్రతా సమస్యలపై తనిఖీలకు జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తనిఖీలు దశల వారీగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు. రెవెన్యూ అర్జీలను వేగంగా పరిష్కరించాలినల్లగొండ: భూభారతి అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో నల్లగొండ డివిజన్లోని తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి తప్పులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు, డీటీలు, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మూసీకి 2,200 క్యూసెక్కుల వరదకేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో గురువారానికి 643.50 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 2,580 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. ఆయకట్టులో పంటల సాగకు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 620 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గేట్లు, కాల్వల ద్వారా మొత్తం 3,200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. మూసీ రిర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.07 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బ్యూటీషియన్, టైలరింగ్లో శిక్షణనల్లగొండ: నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ఈ నెల 18 నుంచి బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్ ఎ.అనిత ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 08682 244416 నంబర్నుం సంప్రదించాలని ఆమె కోరారు. ఆర్జిత సేవలు పునఃప్రారంభంయాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. శ్రీస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు విశేష పర్వాలు జరిగిన నేపథ్యంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను అధికారులు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు ముగిసిన అనంతరం ఆలయ అధికారులు గురువారం ఉదయం ఆర్జిత సేవలను పునఃప్రారంభించారు. శ్రీసుదర్శన హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో నిత్య కై ంకర్యాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా జరిపించారు. -
ఇసుక దందాను అరికట్టేందుకే..
ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకే సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా అన్నారు. - 8లోవ్యర్థాలు తొలగింపు నల్లగొండ టౌన్ : జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన వ్యర్థాలను ఎట్టకేలకు తొలగించారు. ఆస్పత్రిఆవరణలోని వ్యర్థాలతో మూగజీవాలకు ప్రాణసంకటంగా మారిందని ‘సాక్షి’లో గురువారం ఆరుబయటే ఆస్పత్రి వ్యర్థాలు అనే శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక కథనానికి ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. వెంటనే ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన వ్యర్థాల కుప్పలను ఆగమేఘాల మీద తొలగించి పరిశుభ్రం చేయించాయి. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
కేతేపల్లి : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు నిర్మాణ పనుల వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం కేతేపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కేతేపల్లి, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఐకేపీ ఏపీఎంలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆమె సమీక్షించారు. గ్రామాల్లో వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి తక్కువగా ఉన్న విషయాన్ని కలెక్టర్ గుర్తించారు. ఈనెల 13వ తేదీ నాటికి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కనీసం 20 శాతం పురోగతి సాధించేలా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం వనమహోత్సవం కింద మొక్కలు నాటారు. భూ భారతి దరఖాస్తులపై సమీక్షించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ బి.శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఉపాధ్యాయులు.. ఉరుకులు పరుగులు
నల్లగొండ : ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం ఈ నెల 1వ తేదీనుంచి ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్) యాప్ ద్వారా టీచర్ల హాజరు నమోదు చేస్తోంది. ఉదయం 9 గంటలకు.. సాయంత్రం 4.15 గంటల తర్వాత రెండు సార్లు ఎఫ్ఆర్ఎస్ యాప్లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మొన్నటి వరకు ఇష్టారాజ్యంగా పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఉదయం 9 గంటల్లోపే స్కూల్కు వెళ్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన ఆన్లైన్లో అటెండెన్స్ రెడ్మార్కు చూపిస్తుండడంతో ముందుగానే పాఠశాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. సాకులకు ఇక చెక్.. మొన్నటి వరకు ఉపాధ్యాయులు కొందరు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లేవారు. ఒకవేళ హెచ్ఎం అడిగితే.. కొందరు ఎదురుతిరిగేవారు. మరికొందరు రాజకీయ నేతల అండతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించేవారు. దేవరకొండ, చందంపేట, డిండి తదితర దూర ప్రాంతాల ఉపాధ్యాయులైతే ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఉండేది. ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు ఒకరోజు.. మరొకరు ఇంకోరోజు పాఠశాలకు వెళ్లేవారు. ఇక కొందరైతే ఒకపూటే వెళ్లేవారు. సాయంత్రం 4 గంటలు కాకముందే ఇంటిబాట పట్టేవారు. బస్ల్లో ప్రయాణం చేసే వారి.. బస్లు దొరకడం లేదనే సాకుతో ముందే తోటి ఉపాధ్యాయులకు చెప్పి బడి నుంచి బయటపడే వారు. వీటన్నింటికీ ఎఫ్ఎర్ఎస్ అటెండెన్స్ యాప్ చెక్ పెట్టింది. సెలవులూ ఆన్లైన్లోనే.. ఏ ఉపాధ్యాయుడైన తనకు సెలవు కావాలంటే గతంలో లిఖిత పూర్వకంగా లేదా మౌఖికంగా హెచ్ఎంకు చెప్పి తీసుకునేవారు. హెడ్మాస్టర్ సెలవు కాదంటే లీవ్ లెటర్ రాసి స్కూల్లో పెట్టి వెళ్లిపోయేవారు. కానీ అందుకు కాలం చెల్లింది. సెలవు కావాలనుకునే ఉపాధ్యాయుడు ఈ యాప్లోనే సెలవు పెట్టుకుంటే అది స్కూల్ హెడ్మాస్టర్కు వెళుతుంది. హెచ్ఎం దాన్ని ఆమోదిస్తేనే సెలవు తీసుకోవచ్చు. రిజక్ట్ చేస్తే కచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలి. లేదంటే అతనికి ఆటోమెటిక్గా ఆబ్సెంట్ పడుతుంది. ఫ ఎఫ్ఆర్ఎస్తో అటెండెన్స్తో ఉదయం 9 గంటల్లోపే పాఠశాలకు ఫ నిర్ణీత సమయం దాటితే రెడ్మార్క్ ఫ రెండు పూటలా హాజరుతో డుమ్మా కొట్టేందుకు నోచాన్స్ ఫ మంచి పరిణామం అంటున్న పలువురు టీచర్లు ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వం ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగు పడతాయి. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు హాజరవుతారు. విద్యార్థులు కూడా సమయానికి వస్తారు. తద్వార ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం. – రాములు, హెడ్మాస్టర్, జెడ్పీహెచ్ఎస్ నకిరేకల్ నిర్ణీత సమయం పాఠశాలలో ఉండాల్సిందే.. ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న పాఠశాలలకు వెళ్లి ఎఫ్ఆర్ఎస్ యాప్లో అటెండెన్స్ వేసుకోవాలి. ఆ పాఠశాల ఆవరణలో ఉండి అటెండెన్స్ వేస్తేనే వారి ఫొటో క్యాప్చర్ అవుతుంది. 9 గంటలకు ఒక్క నిమిషం దాటినా యాప్లో అటెండెన్స్ ప్రజెంట్ అని చూపించినా పక్కన రెడ్మార్కు చూపుతుంది. 9 గంటల్లోపు అయితే గ్రీన్ మార్కు చూపుతుంది. రెడ్ మార్కు చూపితే సమయానికి పాఠశాలకు హాజరు కాలేదని హైదరాబాద్ డీఎస్ఈలోనే నమోదవుతుంది. అలాగే సాయంత్రం 4.15 గంటల లోపు వెళ్లినా హాజరు తీసుకోదు. దీంతో ఉపాధాయులు పాఠశాలకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
కట్టంగూర్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సమగ్ర శిక్షా అభియాన్ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏఎస్పీడీ) ఎం.రాధారెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె జీసీడీఓ కె.అరుంధతి, డీఈఓ బొల్లారం భిక్షపతితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్ కళాశాల భవనాన్ని, వంటగది, స్టోర్రూం, మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో సమావేశమై పాఠశాలలో నిర్వహిస్తున్న గుణాత్మక విద్యా కార్యక్రమాల అమలుతీరును తెలుసుకున్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి బస చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, ఎస్ఓ నీలాంబరి ఉపాధ్యాయులు ఉన్నారు. -
నిలిచిన పదోన్నతుల ప్రక్రియ
నల్లగొండ : ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నెల 11వ తేదీ వరకు నిలిపివేయాలని బుధవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గెజిటెడ్ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు సంబంధించి సీనియార్టి జాబితాను ప్రకటించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. గెజిటెడ్ హెడ్మాస్టర్లకు సంబంధించి 56 ఖాళీలు ఉన్నాయి. అందులో రెండు పాఠశాల్లో విద్యార్థులు లేరు. ఆ రెండు పాఠశాలలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేయనున్నారు. బుధవారం జీహెచ్ఎంలకు సంబంధించి వెబ్ ఆప్షన్లు తీసుకున్నారు. గురువారం వారికి పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8వ తేదీన స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు కల్పించేలా షెడ్యూల్ రచించారు. అయితే పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాను సరిచూసిన తరువాత ఈ ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశిస్తూ.. వెబ్ ఆప్షన్ల ప్రకియను ఈనెల 11వ తేదీ వరకు ఆపాలని సూచించింది.రాములబండ పీహెచ్సీ తనిఖీరామగిరి(నల్లగొండ) : మండలంలోని రాములబండ పీహెచ్సీని డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం వివరాలు అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోస్టాఫీసులో ఖాతాదారుల ఆందోళనరామగిరి(నల్లగొండ) : నల్లగొండ హెచ్ పోస్టాఫీసు కార్యాలయంలో ఖాతాదారులు బుధవారం ఆందోళన చేశారు. రెండు రోజులుగా సేవలు అందడం లేదని కార్యాలయం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవల కోసం కొత్త సాఫ్ట్వేర్ తీసుకువచ్చారు. సాఫ్ట్వేర్లో లోపాల వల్ల సరిగ్గా పని చేయడం లేదు. సేవలు అందకపోవడం వల్ల ఖాతాదారులు అసహనం వ్యక్తం చేశారు. క్రీడలతో మానసిక ప్రశాంతతనల్లగొండ : క్రీడలు శరీర దారుఢ్యానికి, మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృత్తి రిత్యా నిత్యం మానసిక ఒత్తిడిలో ఉండే న్యాయవాదులకు క్రీడాపోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సంపూర్ణ ఆనంద, కులకర్ణి, శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేష్, న్యాయవాదులు ప్రసన్నకుమార్, కీసర శ్రీనివాస్రెడ్డి, నామిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, నాంపల్లి నరసింహ, నాంపల్లి భాగ్య, కూకుంట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. మూసీ రిజర్వాయర్కు ఎగువ నుంచి 2030 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రాజెక్టు అధికారులు రెండు క్రస్ట్గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 1,276 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా.. 643 అడుగుల (3.94 టీఎంసీలు)మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 404 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 62 క్యూసెక్కుల నీరు వృథా అవుతోందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు. -
అన్ని రకాల వైద్యసేవలు అందించాలి
నల్లగొండ టూటౌన్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మాన్యంచల్క పట్టణ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ, ఏఎన్సీ, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. టెస్టులు, ఇతర రిజిస్ట్రర్లను తనిఖీ చేసి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణ పనులు పూర్తయినందున ఇతర అంతర్గత పనులు త్వరగా చేపట్టి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఆమె వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, జిల్లా క్షయనియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.