breaking news
Annamayya
-
రాయచోటికి అన్యాయం చేయొద్దు
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లాను ఇష్టారాజ్యంగా విభజించి రాయచోటికి అ న్యాయం చేయొద్దని, జిల్లాను యథాస్థితిగా కొనసాగించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన ఈమేరకు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. అన్నమయ్య జిల్లాను విభజించే ప్రయత్నాలు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయన్నారు. జిల్లాను రెండుగా విడదీయడం వల్ల భవిష్యత్తులో రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగడం ప్రశ్నార్థకమవుతుందన్నారు. పార్లమెంటు ప్రాతిపదిక ప్రకారమే జిల్లాల పునర్విభజన జరిగిందన్నారు. అందులో భాగంగా దశాబ్దాలుగా అన్ని విధాలుగా వెనుకబడిన రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం అందరికీ ఆమోదయోగ్యమే అన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన దూరంగా ఉండటం, స్వల్ప కాలంలోనే ఆఫీసులన్నీ ఏర్పాటు కావడం , అన్ని జాతీయ రహదారులు అనుసంధానమై సౌకర్యంగా ఉందన్నారు. దీనికి తోడు పుంగనూరును కూడా జిల్లాలో విలీనం చేయడం సంతోషకరమేనన్నారు. ఇప్పుడు నాలుగు నియోజకవర్గాలను కలిపి మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి, రాయచోటి, రాజంపేట, కోడూరు నియోజక వర్గాలను కలిపి జిల్లా కేంద్రంగా కొనసాగిస్తే ప్రజలకు ఇబ్బందులను తెచ్చి పెట్టడమే అన్నారు. రాయచోటిని బలహీనపరిచే నిర్ణయం మదనపల్లె ఒక అద్భుతమైన పట్టణమని, ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతమని శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఈ జిల్లాకు మదనపల్లె ప్రాంతం గుండెకాయలాంటిదని, అన్ని రకాల సౌకర్యాలతో అభివృద్ధి చెందిన ప్రాంతమన్నారు. విద్య, వ్యాపార రంగాల్లోనూ బెంగళూరు నగరానికి దగ్గరగా ఉండడం ఇలా అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. జిల్లాను భౌగోళికంగా తగ్గించేస్తే రాబోవు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పనిచేయడానికి ఆసక్తి చూపరన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి గతంలో ఏర్పడిన అన్నమయ్య జిల్లాను యథావిధిగా కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
గంజాయి విక్రయిస్తున్న విద్యార్థుల అరెస్టు
మదనపల్లె రూరల్ : ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన విద్యార్థులు మద్యం, గంజాయి మత్తుకు అలవాటు పడి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారని డీఎస్పీ మహేంద్ర తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. డీఎస్పీ మహేంద్ర, వన్ టౌన్ సీఐ మహమ్మద్రఫీ వివరాల మేరకు.. కొన్ని రోజులుగా గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మంగళవారం సాయంత్రం వన్టౌన్ సీఐ మహమ్మద్రఫీ, సిబ్బందితో కలిసి నక్కలదిన్నె బీటీ కాలేజీ గ్రౌండ్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిని విచారించగా కురబలకోట మండలం కసాయివీధికి చెందిన నజీర్ కుమారుడు మహమ్మద్అనీస్ (22)స్థానిక కాలేజీలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడని గంజాయి, మద్యం అలవాట్లకు లోనయ్యాడని తెలిపారన్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్మనీ విలాసాలకు సరికపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదనకై ఈ గంజాయి విక్రయాన్ని ఎంచుకున్నాడన్నారు. బసినికొండ పంచాయతీ పుంగనూరురోడ్డు అగ్గిపుల్లల ఫ్యాక్టరీ ప్రాంతానికి చెందిన వెంకటరమణ కుమారుడు దండు విజయకుమార్ ప్రస్తుతం చంద్రకాలనీ వాల్మీకి నగర్లో ఉంటూ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడన్నారు. వీరిద్దరూ కలిసి సలభంగా డబ్బు సంపాదించేందుకు పట్టణానికి చెందిన జాఫర్ అలీ గంగిశెట్టి శివకుమార్ అనే గంజాయి రవాణాదారుల వద్ద నుంచి 5 కిలోలు కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి మదనపల్లెతో పాటు పరిసర ప్రాంతాల్లో యువత, విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నారన్నారు. మంగళవారం సాయంత్రం జరిపిన దాడిలో నిందితులైన విద్యార్థులు పోలీసులకు పట్టుపడ్డారన్నారు. వారి వద్ద నుంచి 1.8 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్.ఐ అన్సర్బాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.1.8 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం -
బడి పిల్లలతో ప్రమాదకర పనులు
రైల్వేకోడూరు : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన బిడ్డల కోసం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీలో మినీ గురుకులం బాలిక పాఠశాలను స్థాపించారు. 150 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కలిగిన ప్రిన్సిపల్ వారిచేత ప్రమాదకరమైన వెట్టిచాకిరీ పనులు చేయిస్తున్నారు. బుధవారం పాఠశాలలోని నీళ్ల ట్యాంకులోకి బాలికలను దింపి వారిచేత శుభ్రం చేయించారు. పొరబాటున పిల్లలు నీళ్ల ట్యాంకులో ఇరుక్కుపోవడమో.. లేదా మరేదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అలాగే పిల్లలచేత చెత్త ఊడ్పించే పని కూడా చేయించడంపై మండిపడుతున్నారు. ప్రిన్సిపల్ వైఖరి కారణంగా గతంలో ఇదే పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు రాజీనామా చేశారని ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.శివశంకర్ పేర్కొన్నారు. విద్యార్థులచే వెట్టి చాకిరీ చేయించిన ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయచోటి వాసులు నన్ను ఆదరించారు రాయచోటి టౌన్ : రాయచోటి ప్రజలు ననున ఎంతో ఆదరించారు.. వృత్తి ధర్మంలో సహకరించారు.. నా కుటుంబసభ్యుల కన్నా ఎక్కువగా చూసుకున్నారు అని కడప అడిషనల్ ఎస్పీ కె.ప్రకాష్ బాబు భావోద్వేంతో అన్నారు. రాయచోటి ప్రైవేట్ పంక్షన్ హాల్లో స్థానికులు ఆయనకు అభినందన సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో పుట్టినప్పటికీ తొలిసారి ఎస్ఐ ఉద్యోగం నుంచి ఇప్పటి వరకూ కడప జిల్లాలోనే ఉద్యోగం చేశానని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో రాయచోటి ప్రజలతో ఎక్కువ అనుబంధం ఏర్పడిందని తెలిపారు. పదవీ విరమణ తర్వాత రాయచోటి లోనే స్థిరపడాలనే అలోచన ఉందని తెలిపారు. 12 ఏళ్ల కిందట బదిలీపై వెళ్లిన తనను గెట్ టుగెదర్కు పిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ హరినాథఽరెడ్డి, లయన్ నాగేశ్వరావు, సయ్యద్, ఇర్షాద్, జానకిరాం, ఖాదర్బాషా, అభిమానులు పాల్గొన్నారు. -
నష్టం మిగిలింది !
సాక్షి రాయచోటి : మొంథా తుపాను ప్రభావం జిల్లాపై పడింది. అంతకుమునుపు వరుస తుపాన్లతో అల్లాడిపోతున్న అన్నదాతలకు గోరుచుట్టుపై రోకలిపోటులా వర్షం దెబ్బ తీస్తోంది. సుమారు వారానికి పైగా ప్రతిరోజు తుంపెర, జడివానతో పొలాలు ఆరక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. అయితే మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేని వర్షాలతో పలు పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు కూడా అక్కడక్కడా దెబ్బతిన్నాయి. 2250 ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో సాగులో ఉన్న పంటలు దెబ్బతింటున్నాయి. భూమి తడి ఆరకముందే వరుస తుపానుల ప్రభావంతో రైతుకు నష్టం వాటిల్లే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లా వ్యాప్తంగా కలికిరి, నందలూరు, రాజంపేట, ఇతర ప్రాంతాల్లో సాగు చేసిన వరి పంటపై దెబ్బ పడింది. సుమారు 2250 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఒక్క వరినే కాకుండా మిగతా పంటలపై కూడా తుపాను ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టమాటా సాగు చేసిన రైతులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో టమాటా కాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. దీంతో టమాటా పనికిరాకుండా పోతోంది. అయితే ఇంకోవైపు రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో అరటి, బొప్పాయి, మామిడి సాగులో ఉన్నప్పటికీ ఎడతెరిపి లేని వర్షంతో పొలాలు ఆరకపోతే చెట్లు దెబ్బతింటాయన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. రోడ్లకు దెబ్బ జిల్లాలో కురిసిన వర్షాలతో పంచాయతీ రోడ్లతోపాటు ఆర్అండ్బీ రహదారులకు కూడా నష్టం వాటిల్లింది. ప్రధానంగా రేణిగుంట–కడప రహదారికి సంబంధించి రాజంపేట నుంచి రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట వరకు రోడ్లు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా పల్లె ప్రాంతాలకు వెళ్లే రోడ్లు కూడా కోతకు గురయ్యాయి. అలాగే తంబళ్లపల్లె ప్రాంతంలో కూడా కొన్నిరోడ్లు దెబ్బతిన్నట్లు స్థానికుల సమాచారం. మొత్తానికి వర్షం నేపథ్యంలో పలుచోట్ల ఆర్అండ్బీ శాఖకు కూడా కొంతమేర నష్టం వాటిల్లింది. -
3.4 మీటర్ల భూగర్భ జలాలు పెరుగుదల
– జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాయచోటి : నెల రోజుల కాలంలో 3.4 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, నీటిపారుదల, విద్యా, హౌసింగ్ తదితర శాఖల అధికారులు, సిబ్బందితో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం, పీజీఆర్ఎస్ ద్వారా అందిన సమస్యల పరిష్కారం వాట్సప్ గవర్నెన్స్ ప్రజల నుంచి వివిధ అంశాలపై తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణ, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమయ్యే భూసేకరణ, రీ సర్వే, చిన్న తరహా నీటిపారుదల, స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై సమీక్ష జరిపారు. మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో 9,10వ తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. రాబోయే ఎండా కాలంలో భూగర్భజలాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. జిల్లాలో తుపాను తీవ్రత ఎక్కువగా లేనప్పటికీ అధికారులు, సిబ్బంది అన్ని రకాల చర్యలు తీసుకున్నారని, భవిష్యత్తులో ఇలాంటి తుపాను వచ్చే సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎన్ఓపీని తయారు చేసుకుని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి నిందితుల పట్టివేత
పెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులో ఎస్ఐ హరిహరప్రసాద్, సిబ్బంది బుధవారం నాకా బందీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ము గ్గురు యువకులు ద్విచక్ర వాహనంలో వస్తూ పో లీసులను చూసి అనుమానాస్పదంగా తచ్చాడా రు. పోలీసులు సదరు వాహనాన్ని క్షుణంగా తని ఖీ చేయగా సుమారు అరకిలో గంజాయి పట్టుబడినట్లు సమాచారం. కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని మట్లివారిపల్లికి చెందిన రాజోళ్ల హరీష్ (29), మదనపల్లిలోని రామారావ్ కాలనీకి చెందిన ఫరూక్(19)లతోపాటు మరో మైనర్ యువకుడు గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టు బడినట్లు తెలుస్తోంది. తహసీల్దారు శ్రీరాములు నాయక్, వీఆర్వో నరేంద్రల సమక్షంలో పోలీసులు పట్టుబడిన గంజాయిని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. బొలెరో వాహనం బోల్తాచిన్నమండెం : మండల కేంద్రంలోని దేవపట్ల క్రాస్రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున బొలెరో వాహనం వెనుక టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అటుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మదనపల్లి వైపు నుంచి కడపకు నారు వేసుకొని వస్తున్న బొలెరో వాహనం దేవపట్ల క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి వెనుకవైపు టైర్ పగిలి అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తోపాటు ఎవరికీ చిన్నగాయాలు కూడా కాలేదు. యువకుడి ఆత్మహత్యపెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లికి చెందిన పీ.సతీష్ కుమార్ (22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉన్న కొక్కీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకట్రమణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ హరిహరప్రసాద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడి మృతికి అనారోగ్య సమస్యలా, వేరే ఇతర కారణాలా పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. మద్యం తాగి వ్యక్తి మృతిరామాపురం : మండలంలోని రాచపల్లి పంచాయతీ ఎగువఉప్పరపల్లెకు చెందిన టేకూరి లక్ష్మినారాయణ (62) మంగళవారం రాత్రి అతిగా మద్యం తాగి కిందపడి మృతి చెందారు. మద్యం తాగిన లక్ష్మినారాయణ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించి వేంకటేశ్వర స్కూల్ సమీపంలో కిందపడిపోయాడు. బుధవారం తెల్లవారుజామున మండల కేంద్రానికి వచ్చేవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థలానికి చేరుకొని పరీశీలించారు. తలకు బలమైన గాయం కావడంతో మృతిచెందాడని ఎస్సై వెంకట సుధాకర్రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మైనర్ బాలిక కేసులో నిందితుడి అరెస్టు
కేవీపల్లె : మైనర్ బాలిక ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మండలంలోని బసన్నగారిపల్లెకు చెందిన మైనర్ బాలిక(16) తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. తల్లి జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన నరేంద్ర అలియాస్ నాని(22) ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను లోబరచుకుని లైంగిక దాడికి పాల్పడాడు. దీంతో మైనర్ బాలిక గర్భం దాల్చింది. ఈ నెల 7న పురిటి నొప్పులు రావడంతో పీలేరులోని మాధవి అస్పత్రికి తరలించారు. 8న కాన్పు చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు బిడ్డను స్వాధీనం చేసుకుని రాయచోటి శిశుసంక్షేమ శాఖ కార్యాలయానికి తరలించారు. ఐసీడీఎస్ సీడీపీవో రాజమ్మ ఫిర్యాదు మేరకు వరుసకు అన్న అయిన నాగేంద్ర మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని, డాక్టర్మాధవి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడు నరేంద్రను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. -
30 నుంచి మాసోత్సవాలు
రాజంపేట రూరల్ : టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి నవంబరు 5వ తేదీ వరకూ కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రోగ్రామ్ అసిస్టెంట్ డాక్టర్ టి.గోపీబాబు, ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ తెలిపారు. మండలంలోని ఊటుకూరు శివాలయంలో బుధవారం కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ రోజూ సాయంత్రం ధార్మికోపన్యాసం, భజన ఉంటాయని తెలిపారు. యువకుడు ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : చీటి డబ్బు ఇవ్వలేదని యువకుడు విష ద్రావణం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బాధితుడి కుటుంబీకులు, ఆస్పత్రి అవుట్పోస్టు పోలీసుల వివరాల మేరకు.. బసినికొండ పంచాయతీ వడ్డిపల్లికి చెందిన గోపాల్ కుమారుడు విజయ్(22) స్థానికంగా ఉన్న ఓ మహిళ వద్ద రూ.50 వేల చీటీ వేశాడు. కంతులు పూర్తి స్థాయిలో చెల్లించేసి తనకు రావాల్సిన డబ్బు నిర్వాహకురాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాను అప్పుచెల్లించాల్సిన వ్యక్తుల వద్ద నుంచి ఒత్తిడి అధికం కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని కుటుంబస భ్యులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వన్టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో ఆటో డ్రైవర్ మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. స్థానిక కాలనీగేటుకు చెందిన యూనస్(27) ఆటో డ్రైవర్గా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సమస్యలు అధికం కావడంతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి లింగాల : మండలంలోని దొండ్లవాగు గ్రామంలో విద్యుత్ షాక్కు గురై గొడ్డలి వెంకట్రాములు (60) బుధవారం మృతిచెందాడు. ఎస్ఐ అనిల్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం వెంకట్రాములు తన ఇంటిలో విద్యుత్ స్విచ్ బోర్డు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. అతడకి భార్య, కుమారుడు ఉన్నారని తెలిపారు. వెంకట్రాములు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య చక్రాయపేట: మండలంలోని పోలిశెట్టిపల్లెకు చెందిన మాచనబోయిన సిద్ధయ్య(50) ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఉండడంతో శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గ్రామస్థులు కడప రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. -
జిల్లా మార్చురీ వద్ద ఉద్రిక్తత
ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. పిల్లల పేరుతో ఆస్తి రాయించాలంటూ మృతదేహాన్ని తీసుకెళ్లకుండా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందిన వివాహిత సునీత మంగళవారం సాయంత్రం విద్యుత్ షాక్తో మృతిచెందింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కావ్య, హరినాథ్ ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సునీత అమ్మగారి ఊరు మైదుకూరు మండలంలోని తిప్పిరెడ్డిపల్లె. సునీత మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులందరూ జిల్లా ఆస్పత్రి వద్దకు వచ్చారు. సునీత భర్త శ్రీకాంత్కు కొంతమేర పొలం ఉంది. పొలాన్ని పిల్లల పేరుతో రాయించాలని సునీత తరపు బంధువులు అడిగారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లకుండా తిప్పిరెడ్డిపల్లె వాసులు అడ్డుకున్నారు. పోలీసులు నచ్చ చెప్పినా మహిళలందరూ వాహనానికి అడ్డుగా నిల్చున్నారు. రూరల్ ఎస్ఐ రాజు, టూ టౌన్ ఎస్ఐ రాఘవేంద్రారెడ్డితోపాటు పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చివరకు పిల్లల పేరుతో పొలం రాయిస్తున్నట్లు తండ్రి శ్రీకాంత్ అగ్రిమెంట్ రాయడంతో సునీత బంధువులు శాంతించారు. అనంతరం సునీత మృతదేహాన్ని చౌడూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్న బంధువులు -
ఉపాధి అక్రమాలకు చెక్
రాయచోటి అర్బన్ : దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఇతర దేశాలకు వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఉపాధి కూలీలందరికీ ఈ–కేవైసీ చేయాలని డ్వామా అధికారులకు సూచించింది. దీంతో ఈ నెల 6వ తేదీ నుంచి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మండలాల్లో ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఉపాధి కూలికి సంబంధించిన ఆధార్ కార్డును వారి జాబ్కార్డుతో అనుసంధానం చేయడం మొదలైంది. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న టెక్నికల్, ఫీల్డ్ సిబ్బంది కూలీల వద్దకు వెళ్లి ఈ ప్రక్రియను చేస్తున్నారు. ఇప్పటి వరకు 78 శాతం కూలీలకు ఈ–కేవైసీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాబోవు రోజుల్లో ఈ–కేవైసీ చేసుకుంటేనే ఉపాధి పని కల్పించనున్నారు. జిల్లాలో మొత్తం జాబ్ కార్డులలో నమోదైన ఉపాధి కూలీలు 3,11,236 మంది ఉండగా , అందులో అక్టోబర్ 29వ తేదీ వరకు 2,43,112 మంది తమ ఆధార్, జాబ్ కార్డుల వివరాలతో ఉపాధి అధికారుల వద్ద కేవైసీ చేయించుకున్నారు. కూలీలకు సంబంధించిన అధార్ కార్డును కూడా అప్గ్రేడ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇంకా 68,124 మంది ఉపాధి కూలీలు ఈ– కేవైసీ మోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ చేయించుకోని వారికి పని కల్పించే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ ఇలా ... ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కోసం ఎన్ఆర్ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనే యాప్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కూలీలకు సంబంధించిన వివరాలు అధికారులు అందులో నమోదు చేస్తున్నారు. ఈ విధానంతో పారదర్శకతకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఒక జాబ్ కార్డుపై మరొకరు పనిచేసే విధానానికి స్వస్తి పలకవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. వయస్సు పైబడిన కూలీలకు తప్పని తిప్పలు.. వయస్సు పైబడిన వారితో పాటు కొంత మంది ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ నమోదు కాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. పలు సాంకేతిక కారణాలతో ‘ఐ బ్లికింగ్’ ప్రక్రియ జరగకపోవడం వల్ల అలాంటి వారు మళ్లీ మీ సేవ కేంద్రాలకు వెళ్లి, వారి ఆధార్ కార్డును అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మళ్లీ ఉపాధి అధికారుల వద్దకు వెళ్లి కేవైసీ చేయించాలి. ఈ విధంగా చేయడం చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఉపాధి కూలీలు 3,11,236 ఈ–కేవైసీ పూర్తి చేసుకున్న కూలీలు 2,43,112 ఈ–కేవైసీ కాని ఉపాధి కూలీలు 68,124 ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ తప్పనిసరి నూతన విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 78 శాతం కేవైసీ ప్రక్రియ పూర్తి , పెండింగ్లో మరో 22 శాతం ఉపాధి కూలీల జాబ్ కార్డులను ఆధార్కార్డులతో అనుసంధానం చేసి, ఈ –కేవైసీ ప్రక్రియ చేయడం వల్ల ఉపాధిలో అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉండదు. దీంతో పాటు ఒకరి బదులు మరొకరు పని చేసేందుకు కూడా అవకాశం లేదు. ప్రతి రోజు పనికి వచ్చిన కూలీల శ్రీఐ బ్లికింగ్శ్రీతో హాజరు నమోదు చేస్తారు. దీంతో పనులన్నీ పారదర్శకంగా జరుగుతాయి. మరణించిన వారిని, ఇతర ప్రాంతాలలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తొలగిస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 78 శాతం కేవైసీ ప్రక్రియ పూర్తి చేశాం. త్వరలో మిగిలిన టార్గెట్ను చేరుకుంటాం. అలాగే రాబోవు రోజుల్లో ఉపాధి హామీలో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము. – టి.వెంకటరత్నం, డ్వామా పీడీ. -
ఆ ఎంపీపీ మాకు వద్దు
బి.కొత్తకోట : బి.కొత్తకోట ఎంపీపీ లక్ష్మీ నరసమ్మను పదవి నుంచి తొలగించాలని తాము నిర్ణయించామని మండలానికి చెందిన పదిమంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణికి అవిశ్వాస నోటీసు అందజేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవీచ్యుతురాలిని చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 2021లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మండలంలోని 11 మంది ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీలు వి.ఖాదర్వలి, ఎన్.రాధ, ఎంపీఈసీ సభ్యులు వి.రామసుబ్బారెడ్డి, సి.విమలమ్మ, సి.యల్లప్ప, ఎ.సుబ్బయ్య, ఎ.గౌతమి, బి.ఈశ్వరమ్మ, ఎ.బాలకృష్ణ, ఎ.రమాదేవి కలిసి ఎంపీపీ లక్ష్మీ నరసమ్మను వ్యతిరేకిస్తున్నారు. అవిశ్వాస నోటీసులో అందుకు సంబంధించి కారణాలు వెల్లడించారు. నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తూ అభివృద్ది పనుల ప్రతిపాదనలను ఖాతర చేయకుండా ఎంపీపీ వ్యవహరిస్తున్నారని, పనులకు అటంకం కలిగేలా ప్రవర్తిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లోనూ అవిశ్వాస నోటీసు ఇవ్వగా అందుకు కాల పరిమితి సరిపోదని అధికారులు పక్కనపెట్టారని తెలిపారు. ప్రస్తుతం అవిశ్వాసం ప్రకటించి ఎంపీపీని పదవి నుంచి తొలగించేందకు నోటీసు ఇచ్చామని అధికారులు దానిని పరిగణలోకి తీసుకున్నారని వివరించారు. గుమ్మసముద్రం ఎంపీటీసీగ స్థానం ఎస్సీలకు రిజర్వు చేయడంతో లక్ష్మీ నరసమ్మను అనూహ్యంగా ఎంపీపీగా ఎన్నుకున్నారు. తమ గ్రామాలలో చిన్నచిన్న అభివృద్ది పనులు కూడా ఆమె చేపట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 12న అవిశ్వాసం : బి.కొత్తకోట ఎంపీపీ లక్ష్మినరసమ్మపై నవంబర్ 12న స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అవిశ్వాసం తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. సంబంధించిన నోటీసులను గురువారం అధికారులు జారీ చేయనున్నారు. ఆ తర్వాత నిర్వహించే సమావేశానికి ఎంపీటీసీలు హాజరుకావాల్సి ఉంటుంది. చర్చించిన తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. ఎంపీటీసీలు ఆమోదం తెలిపితే అదే రోజున ఎంపీపీ పదవి పోతుంది.అవిశ్వాస నోటీసు సబ్ కలెక్టర్కు ఇచ్చిన ఎంపీటీసీలు -
మోంథా ప్రభావిత పంటల పరిశీలన
సిద్దవటం : మండలంలోని టక్కోలు, ఖాజీపల్లి, డేగనవాండ్లపల్లి, లింగంపల్లి, కడపాయపల్లె గ్రామాలలో మోంథా తుపాను కారణంగా దెబ్బతిన్న వరి, మినుము పంటలను ఊటుకూరు వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు డా.కె.సునీల్కుమార్, డా.మాధురి, డా.యాస్మిన్, కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా.అంకయ్యకుమార్, ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డా.కృష్ణప్రియ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలంలో పడిపోయిన వరి కంకుల నుంచి గింజలు మొలకెత్తకుండా 50 గ్రాముల కల్లు ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పాలు పోసుకునే దశలో ఉన్న వరి పైరులో నల్లగింజ, పొట్టకుళ్లు, మానిపండు తెగుళ్లు రాకుండా ఉండటానికి ప్రోఫినోకోనజల్ 400 గ్రాములు ఎకరాకు పిచికారీ చేయాలని తెలిపారు. మినుము పంటలో నిల్వ ఉన్న నీటిని తీసేసి లద్దెపురుగు, ఆకు మచ్చ తెగుళ్లు రాకుండా పోరా ట్రానిజల్ ప్రోల్ 60 విహహైక్సక్రోనోజోల్ 40 మిలీ, 13:0:45, వెయ్యి గ్రాములు మందు ఎకరాకు పిచికారీ చేయాలని తెలిపారు. తేమ అధికంగా ఉన్నపుడు బ్రాండ్ల ద్వారా పిచికారీ చేసుకుని పురుగులు, తెగుళ్లను నివారించచుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రమేష్రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రభాకర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. వర్షానికి కూలిన ఇల్లు జమ్మలమడుగు: మోంథా తుపాను ప్రభావంతో పెద్దముడియం మండలం పాలూరు గ్రామంలో కాచన రమణారెడ్డి, పుల్లమ్మ నివాసం ఉన్న ఇల్లు కూలిపోయింది. చౌడుమిద్దె కావడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసింది. ఒక్కసారిగా ఆర్థరాత్రి సమయంలో ఇల్లు కూలింది. అయితే రమణారెడ్డి, పుల్లమ్మ ఇంట్లో కాకుండా సోఫాలు నిద్రించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కూలిన శబ్దం కావడంతో స్థానికులు వచ్చి భార్య, భర్తలను క్షేమంగా బయటికి తీసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కూలిన ప్రహరీ పరిశీలన సుండుపల్లె : మండలకేంద్రంలోని పురాతన శివాలయం ప్రహరీ మోంథా తుపాను ధాటికి కురిసిన వర్షాలకు కూలింది. అన్నమయ్య జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారి కొండారెడ్డి కూలిన ప్రహారీని బుధ వారం పరిశీలించారు. ప్రహరీ కూలడంతో ఆలయ ఆవరణలోకి వివిధ జంతువులు వస్తున్నాయని, ఆలయ పరిసరాలు అపరిశుభ్రమవుతున్నాయని భక్తులు అధికారికి విన్నవించారు. అంతకు ముందు ఆయన విరూపాక్ష స్వామిని దర్శించుకున్నారు. పెన్నా వద్ద పటిష్ట బందోబస్తు సిద్దవటం : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పెన్నా నదికి వరద నీరు పోటెత్తడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లో లెవల్ కాజ్వేకు ఇరువైపులా రహదారులకు జేసీబీ యంత్రాలతో అడ్డుకట్ట వేశారు. ఎస్ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ పెన్నానదిలో వరద నీరు పెరిగిందని, చేపల వేటకు వెళ్లే జాలర్లు నదిలోకి వెళ్లరాదన్నారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారం తెలపాలని ఎస్ఐ పేర్కొన్నారు. -
టీకాల పేరుతో కుక్కల సంహారం
మదనపల్లె : టీకాల పేరుతో వీధి కుక్కలను సంహరిస్తున్నారని బెంగళూరుకు చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థకు చెందిన యాంటి క్రుయాలిటీ సెల్ ఆఫీసర్ కేవీ.హరీష్ తెలిపారు. మదనపల్లె తాలుకా పోలీసులకు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. హరీష్ వివరాల మేరకు.. స్థానిక ప్రశాంత్ నగర్, ఇందిరా నగర్లో మంగళవారం సాయంత్రం, రాత్రి 60 కుక్కలను చంపారని తెలిపారు. కొన్ని అమానవీయంగా తరలిస్తుండగా పట్టుకున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జంతు సంరక్షణ బోర్డు, పురపాలక అధికారుల ఎలాంటి అనుమతి లేకుండా పట్టుకోవడం చట్ట విరుద్ధమన్నారు. టీకాల పేరుతో కుక్కలను ఎక్కడికి తరలించారో నిర్ధారించాలని అధికారులను కోరారు. టాటాఏస్ వాహనంలోని కుక్కల్లో ఒకటి గర్భిణి అని, ఇందులో ప్రమేయం ఉన్న సిబ్బంది, అధికారులపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అధికమైన బెడద మదనపల్లె పట్టణంలో కుక్కల బెడద తీవ్రమైంది. గతంలో కంటే ప్రస్తుతం వాటి సంఖ్య రెంటింపు అయ్యింది. చిన్నపెద్దా తేడా లేకుండా దాడిచేసి కాటేస్తున్నాయి. వీటినుంచి రక్షించాలని ప్రజలు చాలాకాలంగా మున్సిపల్ అధికారులను మొరపెట్టుకుంటున్నారు. కౌన్సిల్ సమావేశాల్లోనూ దీనిపై పలుమార్లు చర్చ జరిగింది. అయితే ఇప్పుడు కుక్కలను పట్టడంపై చట్టాలను అనుసరించాల్సి ఉన్నందున అధికారులు ఎలాంటి చర్యలతో ముందుకు వెళ్తారో చూడాలి.వాహనం పట్టుకున్న సంస్థ ప్రతినిధులు -
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త!
రాయచోటి : సైబర్ నేరాల ఉచ్చులో విద్యార్థులు, రైతులు చిక్కుకోకుండా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. వివిధ రూపాలలో వారు మోసాలకు పాల్పడుతున్న విషయంపై పత్రికా ప్రకటన ద్వారా వివరించారు. విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరైందని కాల్స్, మెసేజ్ చేస్తున్నారన్నారు. వెంటనే స్పందించి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) చెప్పమని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవల తుపాను, ప్రకృతి వైపరీత్యాలకు నష్ట పరిహారం ఇస్తామంటూ మొబైల్ ఫోన్కు తప్పుడు కాల్స్ చేస్తున్నారని వివరించారు. పరిహారం పేరుతో మోసగాళ్లు సున్నితమైన సమాచారాన్ని సేకరించి డబ్బు కాజేస్తున్నారని తెలిపారు. మీ పాస్ బుక్, బ్యాంక్ కాతా వివరాలలో ఆన్లైన్లో పొరపాట్లు ఉన్నాయి. వాటిని సరిదిద్దాలంటూ సైబర్ నేరగాళ్లు రైతులను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. తెలియని లింక్లను క్లిక్ చేయమని, ఓటీపీ, బ్యాంక్ వివరాలను చెప్పమని అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వెల్లడించరాదని, తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని ఎస్పీ కోరారు. ప్రభుత్వం, బ్యాంకుల తరపున ఎవరూ ఎప్పుడూ ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ వివరాలు, పిన్ నెంబర్, ఓటీపీ అడగరన్నారు. ఇటువంటి కాల్స్, మెసేజ్లు వచ్చిన వెంటనే అప్రమత్తమై వాటిని విస్మరించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వారు తక్షణమే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930, లేదా దగ్గరలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
వ్యాపారుల సిండికేట్... ప్రభుత్వ ఆదాయానికి గండి
చక్రాయపేట : వీరాంజనేయుడి ఆదాయానికి గండి పడింది. టెండరు దారులు సిండికేట్గా ఏర్పడి మంకుపట్టు వీడకపోవడంతో అధికారులు వచ్చిన కాడికి అంటూ గత ఏడాది కంటే తక్కువ మొత్తానికి కట్టబెట్టేశారు. గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో గత ఏడాది కొబ్బరికాయల విక్రయానికి వేలం నిర్వహించగా రూ.80 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాది టెండరు వేంపల్లెకు చెందిన నాగరాజు రూ.73,35,000కు దక్కించుకున్నారు. టెండరు దారులు సిండికేట్గా ఏర్పడి రూ.50 లక్షలకు మించి తమకు వద్దని భీష్మించుకు కూర్చోవడంతో కాసేపు చర్చ సాగింది. అయితే అనధికారికంగా రూ.60కి అమ్ముకోవచ్చునంటూ అధికారులు హామీ ఇవ్వడంతోనే ఆయనకు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ఏడాది కొబ్బరికాయల విక్రయం టెండర్ రూ.80 లక్షలకు దక్కించుకోగా.. జీఎస్టీతో కలిపి రూ.94 లక్షలు చెల్లించాలి. అయితే టెండరు దారుడు తనకు నష్టం వస్తోందని జీఎస్టీ చెల్లించలేదు. పైగా రూ.35 టెంకాయలు తెచ్చి రూ.60కి విక్రయించారు. దీనిపై భక్తులు పలుమార్లు అధికారులను విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఏడాది కూడా 30 నుంచి 35 సెంటీమీటర్లు గల టెంకాయ రూ.35కు అమ్మాలని అధికారులు నిబంధన పెట్టారు. అయితే జీఎస్టీ ఊసే ఎత్తలేదు. దీంతో టెండరు దారులు మార్కెట్లోనే రూ.40నుంచి రూ.45 ఉంటే రూ.35కే ఎలా అమ్మాలంటూ ఎదురుప్రశ్నలు వేశారు. పోటీకి ఎవరూ రాకపోవడంతో మూడు పర్యాయాలు వాయిదా వేశారు. చివరికి ఆలయ వర్గాలు మెట్టు దిగి పూజా సామగ్రితో కలిపి రు.42కు అమ్ముకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. అయినా ఎవరూ ముందుకురాలేదు. చివరకు రూ.60కు అమ్మవచ్చునని అనధికారిక హామీ రావడంతో అందరూ సిండికేట్గా మారి నామ మాత్రంగా పాడుతూ రూ.75,35, 000లకు ముగించేశారు. నాగరాజుకు హక్కు కల్పించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. దీంతో గత ఏడాది కంటే తక్కువగా టెండరు పాడడం.. ప్రభుత్వ ఆదాయానికి గండి పడడం జరిగిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ కార్యాలయ అధికారి భారతి, మాజీ ఛైర్మన్లు వీరభాస్కరుడు, వెంకటస్వామి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది కంటే తక్కువగా రూ.75 లక్షలకే అప్పగించేశారు -
రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
కృష్ణపట్నం రైలు మార్గంలో ప్యాసింజర్ రైలు నడిపించాలని చాలాసార్లు బోర్డు మీటింగ్లో అధికారులను కోరడం జరిగింది. రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా రైల్వే మంత్రితో గతంలో మాట్లాడారు. రైల్వే స్టేషన్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి రైలు నడిపిస్తామని అధికారులు చెబుతున్నారు. – తల్లెం భరత్కుమార్రెడ్డి, డీఆర్యూసీసీ సభ్యుడు, గుంతకల్ రైల్వే డివిజన్ కడప నుండి ఓబలవారిపల్లె మీదుగా నెల్లూరుకు ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వారు చదువుకునేందుకు సౌకర్యం కలుగుతుంది. దీంతోపాటు వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ సొరంగ మార్గంలో ప్రయాణించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. రైల్వే అధికారులు ప్యాసింజర్ రైళ్లు నడిపించాలి. – డి.శ్రీరాములు, వ్యాపారి, అంగడి వీధి, కడప -
15 మంది జూదరుల అరెస్టు
పులివెందుల రూరల్ : పులివెందుల–కడప రోడ్డులోని పెట్రోలు బంకు సమీపంలో జూదమాడుతున్న హోంగార్డు గిరినాయక్, మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సుభాన్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెల్ల గ్రామ సమీపంలో జూదమాడుతున్న 11మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. వైవీయూ అభివృద్ధికి సహకరించండి కడప ఎడ్యుకేషన్ : వైవీయూ అభివృద్ధికి సహకరించాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఎపిఎస్సిహెచ్) ఛైర్మన్ ఆచార్య కె.మధుమూర్తిని మంగళవారం ఆయన ఛాంబర్లో వీసి కలిసి విన్నవించారు. విద్య, పరిశోధనాపరమైన అనుభవాలతో విద్యా సంస్థను తీర్చిదిద్దాలని, ఎపీఎస్సీహెచ్ పూర్తిగా వెన్నంటి ఉంటుందని ఛైర్మన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కరరావు, కె.రత్న శైలామణి, సెక్రటరి బి.తిరుపతిరావులనులాయన కలిశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా కడప వైఎస్ఆర్ సర్కిల్ : కర్నూల్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝళిపిస్తోంది. జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు నిత్యం తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలు లేకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ఇన్ఛార్జి డీటీసీ వీర్రాజు ఆధ్వర్యంలో ఇప్ప టి వరకూ గత నాలుగు రోజుల్లో 61 కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న ఐదు బస్సులను సీజ్ చేశారు. అనుమతులు లేకపోవడం, పన్ను చెల్లించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మద్యం తాగి నడపడం, అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోవడం, సుత్తి లేకపోవడం, అత్యవసర ద్వారం లేకపోవడం, సరిగా తెరుచుకోకపోవడం వంటి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
సొరంగ మార్గ ప్రయాణం ఎప్పుడో?
దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగమార్గం కృష్ణపట్నం రైలు మార్గం. రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో ఉన్న ఈ మార్గంలో ప్రయాణించాలని రాయలసీమ ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్యాసింజర్ రైలు లేకపోవడంతో వారి ఆకాంక్ష కలగానే మిగిలిపోయింది. ● దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ ● కడప–నెల్లూరు ప్యాసింజర్ రైలు నడిపించాలంటున్న జనం సొరంగ మార్గంలో సరకు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు అన్నమయ్య జిల్లాలోని రైల్వే సొరంగ మార్గం ఓబులవారిపల్లె : ఓబులవారిపల్లి – కృష్ణపట్నం రైలు మార్గం అత్యంత పొడవైనది. ఈ మార్గంలో చిట్వేలి మండలం చెర్లోపల్లి సమీపంలోని కొండవద్ద ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో దాదాపు 6.6 కిలో మీటర్ల మేర అతి పెద్ద సొరంగ మార్గం ఏర్పాటుచేశారు. దీంతోపాటు మరో 5 కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం ఉంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగ మార్గం 11.21 కిలోమీటర్ల మేర జుమ్మూ కశ్మీర్లోని పీర్ పంచాలో ఉంది. సొరంగం ఉన్న ఈ మార్గాల్లో ప్రయాణించాలని ప్రజలు కోరుకుంటారు. రాయలసీమ ప్రజలు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా.. వారి ఆకాంక్ష కలగానే మిగిలిపోయింది. రూ.2 వేల కోట్లతో రైలు మార్గం ఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నం వరకు 1.33 కిలో మీటర్ల రైలు మార్గాన్ని రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. 2005–2006లో ఈ మార్గం మంజూరుకాగా, 2019 జూన్ 10న తొలి రైలును నడిపించారు. అప్పటినుంచి ఈ మార్గంలో సరకు రవాణా చేసే 25కు పైగా గూడ్స్ రైళ్లు నిత్యం ఈ మార్గంలో నడుస్తున్నాయి. మార్గ మధ్యంలో రైల్వే స్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్థ తప్ప ప్యాసింజర్లు ప్రయాణించే వీలుగా నిర్మించలేదు. ఈ మార్గంలో కడప నుంచి ఓబులవారిపల్లి మీదుగా రైల్వే అధికారులు ప్యాసింజర్ డెమో రైళ్లు నడిపించాలని ప్రజలు ప్రతిసారీ కోరుతున్నారు. ఈ రైలు నడిపతే కడప–నెల్లూరు మధ్య వాణిజ్యపరంగా, విద్యా పరంగా వ్యాపారం అన్ని విధాలా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అంతేగాక దక్షిణ భారతదేశ అతి పెద్ద సొరంగ మార్గంలో ప్రయాణించాలనే సీమ వాసుల కల నెరవేరుతుంది. రైల్వే అధికారులు స్పందించి ఈ మార్గంలో రైలు నడిపించాలని ప్రజలు కోరుతున్నారు. -
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
– డీఎఫ్ఓ వినీత్ కుమార్ వేంపల్లె : మండలంలోని బోలగొందిచెరువు బీట్ పరిధిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 40 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా అటవీశాఖ అధికారి వినీత్కుమార్ తెలిపారు. వేంపల్లె అటవీ శాఖ కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎరచ్రందనం రవాణాపై నిఘా పెట్టామని, వేంపల్లె ఎఫ్ఆర్ఓ పర్యవేక్షణలో సిబ్బంది బోలగొందిచెరువు బీట్ ప్రాంతంలో కూబింగ్ నిర్వహించారని తెలిపారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన వ్యక్తులు ఎర్రచదనం చెట్లను నరికి రవాణా చేసేందుకు సిద్దం చేస్తుండగా దాడులు చేశామన్నారు. వేములగొందికి చెందిన పోతలపల్లె మల్లికొండ, కాయలపల్లెకు చెందిన వీరాంజనేయులు, చినన్న వారిపల్లెకు చెందిన చెన్నకేశవులను అరెస్టు చేశామని, కాయలపల్లెకు చెందిన కలువపల్లె మనోహర్నాయుడు పరారీలో ఉన్నారన్నారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. వారి నుంచి రూ.2,13,692 విలువగల 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎరచ్రందనం స్మగ్లింగ్ చేస్తే సమస్యల్లో పడతారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు చేసి.. అక్రమ రవాణాపై ఎక్కువగా నిఘా పెట్టామని తెలిపారు. టాస్క్ఫోర్స్, పోలీస్, అటవీ శాఖ సిబ్బందతో కలిసి దాడులు చేసి డంప్లను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణులు, అడవి జంతువులను వేటాడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె ఫారెస్ట్ రేంజ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, డీఆర్ఓలు సుబ్బయ్య, శేషయ్య, బీవీ.సుబ్బయ్య, ఏబీఓ.శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు. -
ఇద్దరు గంజాయి నిందితుల అరెస్టు
రెండు కిలోల గంజాయి, 2 సెల్ఫోన్లు స్వాధీనం మదనపల్లె రూరల్ : కురబలకోటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. స్థానిక రూరల్ సర్కిల్ పోలీసు కార్యాలయంలో విలేకరులకు సీఐ సత్యనారాయణతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. కొన్నిరోజులుగా గంజాయి విక్రయాలపై నిఘా ఉంచామన్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అందిన సమాచారంతో ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బందితో కలిసి కురబలకోట రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్దకు వెళ్లారన్నారు. చంద్రాకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మూడే మణికంఠనాయక్(19), మదనపల్లె మండలం కురవపల్లికు చెందిన మల్లకుంట గోవిందు(67) వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని విచారించారని పేర్కొన్నారు. వారి వద్ద తనిఖీ చేసి రెండు కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడి మదనపల్లె పట్టణానికి చెందిన జాఫర్అలీ, గంగిశెట్టి శివకుమార్, బన్ను, తేజ, విష్ణు దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసి, 10, 20 గ్రాముల ప్యాకెట్లుగా తయారుచేసి యువత, విద్యార్థులకు విక్రయించే వారమని నిందితులు తెలిపారన్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రవర్తన, చదువులపై తల్లిదండ్రులు వాకబు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. కేసు దర్యాప్తులో ప్రతిభచూిపిన ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్, సిబ్బంది సుధాకర్, రెడ్డి శేఖర్, వెంకటేశ్వర్లు, సిద్ధేశ్వర్, శ్రీనివాసులు, ప్రసాద్, చక్రపాణిలకు పోలీసు రివార్డు కోసం సిఫారసు చేసినట్లు తెలిపారు. -
బి.మఠం మఠాధిపతి నియామకంపై వీడని ఉత్కంఠ
వినతి పత్రాలు స్వీకరిస్తున్న అధికారులు అభిప్రాయం విన్నవించేందుకు బారులు తీరిన భక్తులు బ్రహ్మంగారిమఠం : పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో 12వ మఠాధిపతి నియామకంపై ఉత్కంఠ వీడడం లేదు. పలువురు పోటీ పడుతూ కోర్టును ఆశ్రయించడంతో ధార్మిక పరిషత్ చివరికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి వచ్చింది. మఠంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబసభ్యుల మధ్య ఆధిపత్య వివాదం తలెత్తడంతో కోర్టును ఆశ్రయించారు. ఆరు వారాల లోపు మఠాధిపతి నియామకం జరపాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ధార్మిక పరిషత్ నిర్ణయించింది. ప్రత్యేక అధికారిగా ఆర్జేసీ స్థాయి అధికారి చంద్రశేఖర్ ఆజాద్ను నియమించింది. దీంతో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పూర్వ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్దభార్య పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, వీలునామా ప్రకారం తనకే దక్కాలని రెండో కుమారుడు భద్రయ్యస్వామి మరోవైపు, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ పెద్దకుమారుడు గోవిందస్వామి ఇంకోవైపు తమకే మఠాధిపతి కావాలని పట్టుపడ్డారు. పోటీ పెరగడంతో ప్రజా ప్రతినిధులు గతంలో సర్దిచెప్పారు. అయినా వినకపోవడంతో కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణచేవారు. తుఫాన్ను లెక్కచేయకుండా దూరప్రాంతాల నుంచి భక్తులు, వివిధ మఠాల నిర్వకులు, సాధువులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కందిమల్లాయపల్లె పుర ప్రజలు 1600మంది వినతిపత్రాల ద్వారా తమ అభిప్రాయం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డీసీ పట్టెం గురుప్రసాద్ , వైఎస్సార్ జిల్లా ఎండోమెంట్ కమిషనర్ మల్లికార్జునప్రసాద్ , ఈఓలు శంకర్బాలాజీ, జగన్మోహన్రెడ్డి ఎండోమెంట్ అధికారులు, మైదుకూరు డీఎస్పీరాజేంద్ర ప్రసాద్, సీఐ శివశంకర్, రమణారెడ్డి, ఎస్ఐ శివప్రసాద్, పోలీసులు పాల్గొన్నారు. -
జీజీహెచ్ కార్మికులను తొలగిస్తే ఉద్యమిస్తాం
కడప అర్బన్ : కడప జిజిహెచ్(రిమ్స్)లో పనిచేస్తున్న శానిటేషన్, సూపర్వైజర్లను తొలగిస్తే ఉద్యమిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ అన్నారు. ఆప్కాస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఆప్కాస్ జిల్లా అధ్యక్షుడు పవన్, రిమ్స్ నాయకులు ఏసన్న ,రాజమ్మ, పెంచలమ్మ, విజయలతో కలిసి రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్ఎస్.వెంకటేశ్వరరావును మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కడప ఆస్పత్రిలో ఈ నెల ఒకటో తారీఖు నుంచి పద్మావతి శానిటేషన్ వర్కర్స్ కాంట్రాక్ట్ వారు పనులు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్లను తొలగిస్తామని యాజమాన్యం తరఫున సురేష్ చెప్పడం సరికాదన్నారు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మ్యాన్ పవర్ ఎక్కువ కావాలనుకుంటే కొత్తవారిని తీసుకోవాలేగానీ, గతంలో పని చేసే వారిని తొలగిస్తే ఉద్యమిస్తామన్నారు. ఎంఓయూ ప్రకారం కార్మికులకు వేతనాలు మంజూరు చేయాలని, పీఎఫ్ ,ఈఎస్ఐ ప్రతి నెలా సక్రమంగా చెల్లించాలన్నారు. కార్మికులకు వీక్లీ ఆఫ్లు, సెలవులు తప్పనిసరిగా మంజూరుచేయాలని కోరారు. లేబర్ ఆక్ట్కు భిన్నంగా వేతనాలు ఇస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, బాలాజీ రావు, సీపీ.రమణ, శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. అనంతరం సూపరింటెడెంట్ డాక్టర్ శ్రీనివాసులుకు విన్నవించగా ఆయన స్పందిస్తూ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఎవరిని తొలగించవద్దని మౌఖికంగా తెలియజేశామని పేర్కొన్నారు. -
దౌర్జన్యంగా భూమిని కబ్జా చేస్తున్నారు
సుండుపల్లె : భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేసెయ్ అన్న రీతిలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తన భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని బాధితుడు డేరంగుల సతీష్ కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలోని భైరవగుట్ట సమీపంలో సుండుపల్లె గ్రామ సర్వే నెంబర్–426లో తన తాత డేరంగుల కృష్ణయ్య పేరుమీద 3.59 సెంట్ల డీపట్టా భూమి ఉందని తెలిపారు. తమ ఐదుగురు అన్నదమ్ములకు నేటికీ దానిపై సమాన వాటా ఉందన్నారు. అయితే ఇటీవల సుండుపల్లెకు చెందిన ఇద్దరు టీడీపీ ముఖ్య నాయకులు ఆ స్థలం ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమకు హక్కుగా ఉన్న భూమిలో ఫెన్సింగ్ వేసి రాతి కూసాలు వేశారని, భూమిలోకి రావద్దంటూ బెదరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా తమ పలుకుబడి వినియోగించి భయపెడుతున్నారని ఆరోపించారు. పిత్రార్జితంగా సంక్రమించిన భూమికి రక్షణ కల్పించాలని, ఆక్రమణదారుల నుండి తనను కాపాడాలని వేడుకున్నారు. ఈ విషయమై సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి సంతోష్ నాయక్ను చరవాణి ద్వారా వివరణ కోరగా కోర్టు విషయమై వేరే ప్రదేశంలో ఉన్నానని కార్యాలయానికి వచ్చిన తర్వాత సదరు సర్వే నెంబర్ పరిశీలించి వివరాలు తెలుపుతానన్నారు. రక్షణ కల్పించాలని పట్టాదారుడి వేడుకోలు -
రోడ్ల మరమ్మతులకు రూ. 74.20 కోట్లు
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో రోడ్లు, భవనాలశాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఆర్అండ్బీ అధికారి వై.సహదేవరెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలోని 218 కిలోమీటర్ల మేర రోడ్లను బాగు చేసేందుకు రూ. 74.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. నాబార్డు, ప్లాన్ వర్క్, నిమ్మనపల్లి–వాల్మీకిపురం – గుర్రంకొండ, కలకడ–గుర్రంకొండ, పొంతల చెరువు–తిమ్మాపురం, చిత్తూరురోడ్డు–మదనపల్లి రోడ్డు వయా కేశపురం బోనమల రహదారితోపాటు ఇతర గ్రామాల రహదారులల్లో మరమ్మతు పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. చోరీ కేసులో నిందితుల అరెస్టు జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని వాటర్ ట్యాంకు వీధిలోని టవర్ వద్ద ఈ నెల 21న జరిగిన బ్యాటరీ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ నరేష్బాబు తెలిపారు. కోవెలకుంట్ల రహదారిలో అనుమానాస్పదంగా ఉన్న పత్తూరిప్రశాంత్, పత్తూరు జగన్, అక్కలి పవన్సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా బ్యాటరీలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి నుంచి బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.90 వేలు ఉంటుందని తెలిపారు. సీఐ మాట్లాడుతూ మద్యం, చెడు అలవాట్లకు వ్యసనపరులై బ్యాటరీలు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో వివాహిత మృతి ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని చౌడూరులో విద్యుత్ షాక్కు గురై వివాహిత సునీత (32) మృతిచెందారు. రూరల్ పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలోని సునీత ఇంటి పక్కనే పశువుల కోసం రేకుల షెడ్డు నిర్మించారు. షెడ్డులో ఇనుపరాడ్డుకు ఫ్యాన్ను అమర్చారు. ఈ క్రమంలో సర్వీసు వైర్కు చుట్టిన టేప్ సరిగా లేకపోవడంతో విద్యుత్ సరఫరా అయింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పశువుల పాకలోకి వెళ్లిన సునీత విద్యుత్ షాక్కు గురై దుర్మరణం చెందారు. ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్రెడ్డి వెల్లడించారు. -
●జిల్లాలో 106 పునరావాస కేంద్రాలు
సాక్షి రాయచోరి: అన్నమయ్య జిల్లాలో మొంథా తుపాను ప్రభావం అలజడి రేపుతోంది. ఎక్కడ చూసినా తుపాను ప్రభావం వర్షం రూపంలో కనిపిస్తోంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరోవైపు బుధవారం ఎలాంటి విపత్క ర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతా ల్లో కురిసిన వర్షాలకు జిల్లాలోని పలు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో చెరువులు కూ డా నిండుతున్నాయి. మరోవైపు రైల్వే అధికారులు కడప నుంచి విశాఖకు బయలుదేరాల్సిన తిరుమల ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. ఈ రైలు రాజంపేట, రైల్వేకోడూరు మీదుగా విశాఖకు వెళ్లాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా వర్షం అన్నమయ్య జిల్లాలో మొంథా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు తుంపెర వర్షం కురిసినా తర్వాత నుంచి కొన్నిచోట్ల జడివాన కురిసింది. రాత్రి నుంచి భారీ వర్షం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం రాయచోటి పరిధిలోని కాటమయ్య కుంటకు భారీ వరదతో గండి పడగా, వెంటనే అధికారులు పూడ్చివేశారు. ఇరిగేషన్శాఖ అధికారులు కూడా జిల్లాలోని పలు చెరువులను పరిశీలించి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు. నందలూరులో చెరువును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ అన్నమయ్య జిల్లా రాజంపేట సెగ్మెంట్ పరిధిలో నందలూరు కన్యకా చెరువును జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, ఎస్పీ ధీరజ్, సబ్ కలెక్టర్ భావన, అడిషనల్ ఎస్పీ మనోజ్కుమార్తోపాటు ఇతర అధికారులు పరిశీలించారు. ఎక్కడికక్కడ భద్రతా చర్యలపై కిందిస్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేయడంతోపాటు ప్రజలను చైతన్యవంతులనుచేయాలని ఆదేశించారు. రెండు రోజుల క్రితం రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఈ చెరువును పరిశీలించారు. భారీ వర్షం కారణంగా నందలూరు బస్టాప్ సమీపంలోగల గోడౌన్ను వరద నీరు చుట్టుముట్టింది. చెయ్యేరుకు వరద ప్రవాహం జిల్లాలోని ప్రధాన నీటి వనరులైన చెయ్యేరుకు వరద ప్రభావం పెరిగింది. రెండు రోజుల కిందటి వరకు అంతంత మాత్రంగా చెయ్యేరులో నీటి ప్రవాహం ఉండగా, మొంథా తుపాను నేపథ్యంలో వరద నీరు అధికంగా వచ్చి చేరుతోంది. దీంతో చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు వెలిగల్లు జలాశయంలోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో బుధవారం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. పాపాఘ్ని కూడా వరద నీటితో ప్రవహిస్తుండగా, పింఛా ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీనివాసపురంతోపాటు ఝరికోన ప్రాజెక్టుకు కూడా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. మూడు రోజులుగా ముసురుపట్టిన ‘మోంథా’ మంగళవారం రాత్రి నుంచి ‘చినుకై ’ వణికిస్తోంది. ఒకటా రెండా 48 గంటలుగా వాన జడి పట్టింది. ఫలితంగా వైఎస్సార్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఏర్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సెలయేర్లు కుప్పించి దూకుతున్నాయి. పిల్ల కాలువలు పొంగి పారుతున్నాయి.. పెద్ద చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. జలాశయాలు నీటిలో నానుతున్నాయి. పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. వరుస వానలకు వేలాది ఎకరాల్లో పంట నీటి పాలైంది. మొత్తంపై జనజీవనం స్తంభించింది. తుపాను ముప్పు ఇంకా పొంచే ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల మనసునిండా.. ఇంకా మోంథా మబ్బులే కమ్మి ఉన్నాయి. మొంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు నందలూరు కన్యకా చెరువును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ తుపాను వర్షాల నేపథ్యంలో తిరుమల ఎక్స్ప్రెస్ రైలు రద్దు వెలిగల్లు, పింఛా, ఝరికోన, శ్రీనివాసపురం ప్రాజెక్టులకు వరద నీరు చెయ్యేరు, పెన్నా, పాపాఘ్నిలకు పెరుగుతున్న వరద ప్రవాహం స్తంభించిన జనజీవనం రాయచోటి: మొంథా తుపానును దృష్టిలో ఉంచుకొని జిల్లాలో 106 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని రాయచోటి, మదనపల్లి, రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా కలెక్టర్ ఆధ్వర్యంలో 106 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ఉంచారు. ఈ కేంద్రాలలో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
● పంట నీట మునిగింది..
కడప అగ్రికల్చర్/సిద్దవటం: మోంథా తుఫాన్ ధాటికి వైఎస్సార్ జిల్లాలో నాలుగు మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 470 మంది రైతులకు సంబంధించి 270 హెక్టార్లకు పంటనష్ట వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ సూచించారు. సిద్దవటం మండలంలో 60 హెక్టార్లలో వరిపంట, గోపవరం మండలంలో 20 హెక్టార్లలో వరి, 5 హెక్టార్లలో మెక్కజోన్న, పోరుమామిళ్లలో 150 హెక్టార్లలో వరిపంట, బిమఠంలో 35హెక్టార్లలో వరిపంట తెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమింగా నష్టాన్ని అంచనా వేశారు. సిద్దవటం: మండలంలోని లింగంపల్లి, మంగలవారిపల్లె, కడపాయపల్లె గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెనగలూరు: తుపాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పెనగలూరు మండలం, ఎన్ఆర్ పురం పంచాయతీ, పల్లంపాడు గ్రామం వద్ద నదిలో నీటి ప్రవాహాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ వర్షాలు తగ్గేంతవరకు ప్రజలు ఎవ్వరూ ఇంటిలో నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. అలాగే పల్లంపాడు గ్రామస్తులు నది దాటి ఇవతలవైపునకు రాకూడదన్నారు. ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే తమ గ్రామానికి వెళ్లేందుకు దారులు లేక గర్భిణులు, అనారోగ్యంతో బాధపడేవారు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తకు ఎక్కడైనా ఇంటిస్థలం, కాలనీలు మంజూరు చేస్తే పూర్తిగా గ్రామమంతా బయటకు వస్తామని సర్పంచ్ సుజాత కలెక్టర్కు విన్నవించారు. ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని గ్రామస్తులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భావన, డీఎస్పీ మనోజ్, సీఐ రమణ, ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ అమరేశ్వరి, పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని గుంజన నది ప్రవహిస్తున్న సింగనమల, ఈటమాపురం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ రవిప్రకాశ్ రెడ్డి తెలిపారు. కన్యకాచెరువు పరిశీలన.. నందలూరు: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నందలూరు కన్యకాచెరువును జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, అడిషనల్ ఎస్పీ మనోజ్కుమార్హెగ్డేలతో కలిసి మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కన్యకా చెరువు నిండిన వెంటనే నీరు చెయ్యేరు నదిలో చేరుతుందన్నారు. సోమశిల వెనుక జలాల పరిశీలన.. ఒంటిమిట్ట: మొంథా తుపాను కారణంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట మండలంలోని సోమశిల ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాంతమ్మ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సోమశిల ముంపు ప్రాంతాలైన పెన్నపేరూరు, తప్పెటవారిపల్లి గ్రామాలతో పాటు పెన్నా తీరప్రాంతాలైన దవంతరపల్లి, నరసన్నగారిపల్లి గ్రామాలను సందర్శించారు. నదీతీర ప్రాంతంలో ఉన్న వారు ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఒంటిమిట్ట తహసీల్దార్ దామోదర్రెడ్డి, సీఐ బాబు తదితరులు ఆయన వెంట ఉన్నారు. పెనగలూరు: పల్లంపాడు వద్ద చెయ్యేరు నదిలో గ్రామస్తులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నందలూరు: కన్యకా చెరువును పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రాజెక్టును పరిశీలిస్తున్న జల వనరుల శాఖ డీఈ చెంగల్రాయుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ -
ఎన్జీసీ జిల్లా కో–ఆర్డినేటర్గా శివలక్ష్మి
రాయచోటి: అన్నమయ్య జిల్లా నేషనల్ గ్రీన్ కార్ప్(ఎన్జీసీ) జిల్లా కో–ఆర్డినేటర్గా బి.శివలక్ష్మీని నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి కె. సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఈ మేరకు నియామక ఉత్తర్వుల విషయాన్ని డీఈఓ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వీరబల్లి మండలం, పెద్దివీడు రెడ్డివారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఏపీఎన్జీసీ జిల్లా కో–ఆర్డినేటర్గా నియామక ఉత్తర్వులు అందుకున్న అనంతరం ఆమె జిల్లా విద్యాశాఖ అధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా విద్యాశాఖ అధికారికి, ఎన్జీసీ రాష్ట్ర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్టలో రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి నూతన అభివృద్ధి పనులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి జరిగిన బోర్డు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి భక్తుల సౌకర్యం కోసం రూ. 37 కోట్లతో 100 గదులు ఉన్న నూతన ఆధునిక వసతి భవనాన్ని నిర్మించేందుకు, అలాగే రామాలయం వద్ద మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ. 2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు -
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
రాయచోటి: విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది చట్టానికి లోబడి విధులు నిర్వహించి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని డీఆర్ఓ మధుసూదన్రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్ఓ మాట్లాడుతూ నూతనంగా విధులలోకి వస్తున్న అధికారులు, సిబ్బంది చట్టానికి లోబడి విధులు నిర్వహించాలన్నారు. కడప రేంజ్ ఏసీబీ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ చట్టపరంగా వచ్చే ఆదాయం మినహా ఎలాంటి నగదు, బహుమతులు లాంటివి తీసుకున్నా చట్టపరంగా లంచం తీసుకున్నట్లు అవుతుందన్నారు. ఏసీబీ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవినీతి కేసులపై ఫిర్యాదు చేసేందుకు 1064, 9440446191 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.. డీఆర్ఓ మధుసూదన్రావు -
గంజాయి ముఠా గుట్టురట్టు
● రూ. 10.2 లక్షల విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం ● 14 మంది నిందితుల అరెస్టు ● వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లిరాయచోటి/ కలకడ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును అన్నమయ్య జిల్లా పోలీసులు రట్టు చేశారు. జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి వ్యాపారంపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి సూత్రధారులు, విక్రయదారులను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం మీడియాకు వివరించారు. కలకడ పోలీసుల ఆధ్వర్యంలో సాగిన ఈ ఆపరేషన్ ద్వారా రూ. 10.2 లక్షలు విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ బాషాతో కలిపి 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి. లక్ష్మన్న పర్యవేక్షణలో కలకడ ఎస్ఐ బి.రామాంజనేయులు పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారన్నారు. సోమవారం ఉదయం కలకడ మండలం, బంగారువాండ్లపల్లి, నడిమిచెర్ల, కొత్తపల్లి రోడ్డులోని రాతి దిబ్బ సమీపంలో పోలీసులు దాడి చేశారన్నారు. ఇదే సమయంలో గంజాయితో సిద్ధంగా ఉన్న నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిని పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో పట్టుబడిన 13 మంది పురుషులు, ఒక మహిళ నిందితురాలితోపాటు 14 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సొత్తు కేసు వివరాలు.. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10.2 లక్షలు విలువచేసే 34 కిలోల గంజాయిని రవాణాకు ఉపయోగించిన ఒక ఆటో, మూడు మోటార్ సైకిళ్లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్బాషా ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న చిన్నచిన్న విక్రయదారుల ద్వారా జిల్లాలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అరెస్టు అయిన 14 మందిపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం వాయల్పాడు కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని వివరించారు. కఠిన చర్యలు తప్పవు.. జిల్లాలో గంజాయి విక్రయాలను, వినియోగాన్ని సహించేది లేదని ఎస్పీ గట్టిగా హెచ్చరించారు. గంజాయి సేవించే యువత వెంటనే వ్యసనాన్ని వదిలిపెట్టి చదువుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి ముఠా అరెస్టు ఆపరేషన్ విజయవంతం చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ బి.రామాంజనేయులు, పీఎస్ఐ కుమారి హారిక, పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మదనపల్లె రూరల్ : మదనపల్లె కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. సోమవారం స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మదనపల్లె మండలం, వలసపల్లె మొలకలదిన్నెకి చెందిన గుర్రాల వాసు అలియాస్ ఎరుకుల శ్రీనివాసులు (35), కురబలకోట మండలం, తెట్టు ఆరోగ్యపురానికి చెందిన రత్నవేలు కుమారుడు గెంటిమ్ ఆనంద్ కుమార్(27) లు గంజాయి రవాణాదారులైన మదనపల్లె పట్టణానికి చెందిన సయ్యద్ ఖాసీంసాబ్ కుమారుడు జాఫర్ అలీ, గంగిశెట్టి చలపతి కుమారుడు శివకుమార్ల దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి, మదనపల్లె, అంగళ్లు తదితర ప్రాంతాల్లో రహస్యంగా యువతకు, విద్యార్థులకు విక్రయించేవారన్నారు. ఈ క్రమంలో 26వ తేదీ ఆదివారం తట్టివారిపల్లె వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ అనుమానాస్పదంగా పట్టుబడ్డారన్నారు. వారిని విచారించి నిందితుల వద్ద నుంచి, రూ. 20వేల విలువ చేసే రెండు కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏ 1 నిందితుడు శ్రీనివాసులుపై ఇదివరకే మదనపల్లె తాలూకా, టూ టౌన్, స్టేషన్లతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచామన్నారు. ఇదే కేసులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న జాఫర్ అలీ, గంగిశెట్టి శివకుమార్ పరారీలో ఉన్నారని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇందులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించామని, నిందితులైన ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన టు టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లాతోపాటు సిబ్బందిని అభినందించారు. -
రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ‘భారతి’ విద్యార్థి ఎంపిక
కమలాపురం : కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో ఉన్న డీఏవీ భారతి స్కూల్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వామ్ కిషోర్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ గండిలోని డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్–17 హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బంగారు పతకం సాధించిన వైశాలి త్వరలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు హాజరవుతుందని ఆయన వివరించారు. సిల్వర్ జోన్ ఫౌండేషన్ లిటిల్ స్టార్స్లో డీఏవీ విద్యార్థుల ప్రతిభ.. సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లిటిల్ స్టార్లో ఇంగ్లీష్, గణితం, సైన్స్ ఒలంపియాడ్ (ఐఓఈఎల్) డీఏవీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తెలిపారు. తమ డీఏవీ భారతి స్కూల్కు చెందిన 147 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందాయన్నారు. అలాగే ఐదుగురికి వెండి, ఏడుగురు రజత పతకాలు అందుకున్నారని తెలిపారు. బాలుడిపై విచక్షణా రహితంగా దాడి కడప అర్బన్ : కడప నగరం గంజికుంట కాలనీలో గుర్రాలషెడ్డు సమీపంలో 17 ఏళ్ల బాలుడిపై మేనమామ మరో వ్యక్తితో కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారు. కడప నకాష్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు, మరో బాలుడితో కలిసి టీవీఎస్ వాహనాన్ని దొంగతనం చేశారు. ఈ క్రమంలో వచ్చిన డబ్బులను తీసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లి జల్సా చేసుకున్నారు. తరువాత వారిలో ఇద్దరు కడపకు రాగా, మరో బాలుడిని అలాగే వదిలేశారు. ఇద్దరు యువకులు వచ్చిన తర్వాత బాలుని బంధువులు ఆరా తీశారు. పోలీసులను ఆశ్రయించగా వారు ఇతర ప్రాంతంలో బాలుడు ఉన్నాడని తెలుసుకొని బంధువులు అక్కడికి వెళ్లి అతన్ని తీసుకుని వచ్చారు. తర్వాత తమ బాలుడు ఇంటి నుంచి వెళ్లడానికి కారణమైన బాలుడిపై దారుణంగా దాడి చేయడంతో ఆ సంఘటనను సెల్ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఉగ్ర దాడులను సమిష్టిగా ఎదుర్కొందాం
ఒంటిమిట్ట : ఉగ్రదాడులు జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై సోమవారం రాత్రి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మంగళగిరి నుంచి వచ్చిన ఆక్టోపస్ దళాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ దళాల డీఎస్పీ కృష్ణ ముందుగా సోమవారం ఉదయం ఒంటిమిట్టలోని పోలీసులు, రెవెన్యూ, వైద్యం, అగ్నిమాపక, విద్యుత్, టీటీడీ, దేవస్థానం శాఖల అధికారులు, సిబ్బందితో స్థానిక టీటీడీ పరిపాలన భవనంలో సమీక్షించారు. ఆక్టోపస్ దళాలు నిర్వహించిన మాక్ డ్రిల్లో ఒక కల్పిత ఉగ్రవాద బృందాన్ని ఏర్పాటు చేసి, వారి ద్వారా జన జీవనం అధికంగా ఉండే పలు చోట్ల ఉగ్రదాడులకు పాల్పడితే ఎలా ఉంటుందో సంఘటనలను సృష్టించి, అలాంటి సమయంలో దళాల ప్రతిస్పందన ఎలా ఉంటుందో పరీక్షించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖల మధ్య సమన్వయం పెరిగితేనే ప్రజలకు భద్రత ఉంటుందన్నారు. ఇన్స్పెక్టర్ గోపిచంద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట తహసీల్దార్ దామోదర్ రెడ్డి, సీఐ బాబు, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఆలయ విజిలెన్స్ విభాగం పర్యవేక్షకుడు గంగులప్ప, వైద్య, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. -
మున్సిపల్ అధికారుల అవినీతిపై ఆగ్రహం
రాజంపేట : కూటమి పాలనలో పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట మున్సిపాలిటీలో అవినీతి పెచ్చరిల్లిపోయింది. రాజంపేటను దోచుకుంటున్నారు.. అంటూ అధికారుల అవినీతిపై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జరిగిన రాజంపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా.. పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు సమావేశంలో అధికారుల అవినీతిని ఎత్తి చూపారు. రాజంపేట పట్టణాన్ని చెత్తపట్టణంగా మార్చేశారని ఆరోపించారు. పనుల పురోగతి, వివిధ వార్డులలో పురపాలిక అధికారుల పనితీరును కౌన్సిలర్లు ఎండగట్టారు. పారిశుధ్యం పడకేసిందని కొంతమంది కౌన్సిలర్లు, రోడ్లు సరిగ్గా లేవని మరికొందరు, డ్రైనేజి వ్యవస్ధ అస్తవ్యస్తంగా ఉందని ఇంకొంతమంది కౌన్సిలర్లు కౌన్సిల్లో నిలదీశారు. రాజంపేట పట్టణాన్ని చెత్తగా మార్చేశారని, ఫెయిల్యూర్ కమిషనరు అంటూ చైర్మన్ సోదరుడు పోలా రమణారెడ్డి ధ్వజమెత్తారు. కౌన్సిలర్లు పోలా వెంకటరమణారెడ్డి, కూండ్ల రమణారెడ్డి, డొంకా సురేష్, సనిశెట్టి నవీన్, చప్పిడి కళావతి, టీడీపీకి చెందిన తుపాకుల అశోక్కుమార్, పసుపులేటి సుధాకర్, మనుబోలు విజయలక్ష్మీ, బీజేపీకి చెందిన రేనాటి రాఘవేంద్ర తదితరులు అధికారుల అవినీతిపై గళం విప్పారు. సొంత ఆదాయమే..పరమావధిగా.. పురపాలక సంఘానికి ఆదాయం కన్నా.. సొంత ఆదాయమే మిన్న అనే రీతిలో పురపాలక అధికారులు కొనసాగుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. అవుట్సోర్స్ సిబ్బంది నియామక వ్యవహారంపై ఆరోపణలు గుప్పించారు. చేయి తడిపితే అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో వైస్చైర్మన్ సుమియా, నూర్బాషా, హసీమా, తాళ్లపాక సిందూరి, సత్యాల మౌనిక, గునుకల బుజ్జమ్మ, రెడ్డిమాసి రాధ, గుజ్జల వసంత, బిల్లా దివ్యతేజ, తోటవాణి, మిరియాల చెంగమ్మ, కటారు హైమావతి, న్యామతుల్లా, కో–ఆప్షన్ సభ్యుడు పిండిబోయని రామ్మోహన్ యాదవ్, ఉమర్ ఫరూఖ్, షంషాద్బేగం, వివిధ విభాగాల అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కౌన్సిల్ హాల్లో వైస్ చైర్మన్ మర్రి బైఠాయింపు.. ఆర్ఐ నియామకంలో కమిషనర్ శ్రీనివాసులు అవినీతికి పాల్పడ్డారంటూ నిరసన తెలుపుతూ మున్సిపల్ వైస్చైర్మన్ మర్రి రవికుమార్ కౌన్సిల్లో బైఠాయించారు. అనుభవం ఉన్న సుబ్బరాయుడును పక్కనపెట్టి, తనకు అనుకూలమైన, అర్హతలేని వ్యక్తిని ఆర్ఐగా నియమించుకున్నారని కమిషనర్పై దుమ్మెత్తి పోశారు. ఇంటి నిర్మాణం విషయంలో ఆర్ఐ సాయిచరణ్రెడ్డి డబ్బులు వసూలు చేశాడంటూ బాధితుడి ఆరోపణను కౌన్సిల్లో మొబైల్ ద్వారా వినిపించారు. కలెక్షన్ ఏజెంట్గా మారిన ఆర్ఐను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల బైపాస్లో ఓ వెంచర్ విషయంలో ఆర్ఐ అవినీతికి పాల్పడ్డాడని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారని, దీనిపై కమిషనర్ను అడిగితే పొంతనలేని సమాధానం చెప్పారన్నారు. పనితీరు పారదర్శకంగా ఉండాలి.. ఎంపీ, ఎమ్మెల్యే, చైర్మన్ జోక్యం చేసుకుంటూ అధికారులు తమ పనితీరును పారదర్శకంగా మెరుగుపరుచుకోవాలని హితబోధ చేశారు. కౌన్సిలర్లతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, వారి వార్డులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయా లని సూచించారు. పురపాలక సంఘానికి ఆదాయం తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాజంపేట మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల ధ్వజం అధికారుల అవినీతిని ఆధారాలతో బట్టబయలు చేసిన వైస్చైర్మన్ మర్రి రవి పార్టీలకతీతంగా గళం విప్పిన సభ్యులు -
నిండిన నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టు
నిమ్మనపల్లె : ఇటీవల కురిసిన వర్షాలకు నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టు నిండింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 398.6 ఎంసిఎఫ్టిలు కాగా, సోమవారం తెల్లవారుజామున పూర్తిస్థాయిలో ప్రాజెక్టులోకి నీరు చేరింది. దీంతో ప్రాజెక్ట్ ఏఈ శ్రీహరి రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రెండు ప్రాజెక్టు గేట్లను ఎత్తి, 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రవాహం కొనసాగే ప్రాంతాలైన ముష్టూరు, కొండయ్యగారిపల్లె, అగ్రహారం, బండమీదపల్లె, తదితర ప్రాంతాల ప్రజలకు అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు సూచించారు. ప్రజలు రోడ్డు దాటకుండా కంచెలు ఏర్పాటు చేశారు. నిమ్మనపల్లె అహోబిల నాయిని చెరువు పూర్తిస్థాయిలో నిండి, వరద వెళుతుండడంతో నిమ్మనపల్లె సాహిద్ షా వలి కట్టకు సందర్శకుల రాకను నిలిపివేశారు. బాహుదా ప్రాజెక్టు తాజా పరిస్థితిని, వరద ప్రవాహాన్ని తహసీల్దార్ తప్పస్విని, ఎంపీడీఓ రమేష్ బాబు, ఎస్ఐ తిప్పేస్వామి డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, డిప్యూటీ తహసీల్దార్ సిరాజుద్దీన్, తదితరులు పరిశీలించారు. ప్రస్తుతం యాతాల వంక ద్వారా 100 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో ఉండగా, అంతే స్థాయిలో అవుట్ ఫ్లో ఉందని ఏఈ శ్రీహరి రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టులో జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.రెండు గేట్ల ద్వారా వంద క్యూసెక్కుల నీరు విడుదల -
న్యూయార్క్లో ఎంపీ మిథున్రెడ్డికి ఘన స్వాగతం
రాజంపేట : ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత్ తరపున వెళ్లిన బృందలోని అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ, లోక్సభ వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ పీవీ మిథున్రెడ్డికి న్యూయార్క్లో ఘన స్వాగతం లభించింది. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ యువనేత చిల్లా కిరణ్ తెలిపారు. వచ్చేనెల 1న జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఈనెల 25న ఎంపీ మిథున్రెడ్డి యుఎస్ఏకు వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి బొకేలను అందచేసి స్వాగతించారు. -
వేధింపుల బారి నుంచి కాపాడండి
మదనపల్లె రూరల్ : మద్యం సేవించి, ఆడపిల్లల వెంటపడి వేధిస్తూ, పలువురిపై దౌర్జన్యం చేస్తూ గ్రామంలో అల్లర్లు సృష్టిస్తున్న ముగ్గురు ఆకతాయిల వేధింపుల నుంచి తమను కాపాడాలని, నిందితులపై కేసు నమోదు చేసి ఆడబిడ్డలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ మండలంలోని పాశంవారి పల్లెకు చెందిన గ్రామస్తులు, సోమవారం మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఆదివారం రాత్రి మండలంలోని పెంచపాడు పంచాయతీ పాశంవారిపల్లెలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వెంకటప్ప, కోటూరి భరత్, వరణ్సందేశ్ మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించి వేధించడమే కాకుండా కత్తితో దాడి చేశారు. ఘటనను అడ్డుకునేందుకు స్థానికులు మహి, వెంకటరమణ ప్రయత్నించగా వారిపై కత్తితో వెంకటప్ప, మరో ఇద్దరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనకు నిరసనగా గ్రామస్తులు ఏకమై సోమవారం మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయని, గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారు డు కోటూరి వెంకటప్ప, రఘపతి కుమారుడు కోటూరి భరత్, బాబు కుమారుడు వరణ్సందేశ్ జులాయిగా తిరుగుతూ, మద్యం సేవించి తరచూ ఆడపిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు .అడ్డుకోబోయిన వారి పైన దాడికి తెగబడుతూ అసభ్యపదజాలంతో దూషిస్తున్నారన్నారు. స్థానికంగా ఉన్న ఓ మహిళపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరచారన్నారు. మూడు కుటుంబాలను బెదిరింపులకు గురి చేశారన్నారు. వీరికి ఇది వరకే తాలుకా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పు రాలేదన్నారు. పదేపదే ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకులపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు.తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన -
నగల దుకాణం వ్యాపారి అదృశ్యం
● నగల తయారీ పేరుతో లక్షల్లో వసూలు ● వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితులుమదనపల్లె రూరల్ : కొన్నేళ్లుగా నమ్మకంగా నగల వ్యాపారం నిర్వహిస్తూ, ఆభరణాలు తయారు చేస్తూ కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించిన ఓ నగల దుకాణ వ్యాపారి కనిపించకుండా పోయాడు. పెద్ద మొత్తంలో నగదు, నగలు వసూలు చేసుకుని వారం రోజులుగా దుకాణం మూసివేశాడు. నివసిస్తున్న ఇంటికి తాళం వేశాడు. దీంతో అతని వద్ద నగలు చేయించడానికి డబ్బులు కట్టిన కస్టమర్లు మాట్లాడే ప్రయత్నం చేసినా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలంటూ సోమవారం వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం, స్థానిక సిపాయి వీధికి చెందిన కె.సురేష్ కుమార్ అనే వ్యక్తి శ్రీ సాయి సురేష్ జ్యువెలర్స్ పేరుతో స్థానికంగా జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇందులో బంగారు ఆభరణాలు విక్రయించటంతో పాటు ఆర్డర్ పై ఆభరణాలు తయారు చేయించి ఇచ్చేవాడు. ఇతనితోపాటు సోదరుడు నాని, తండ్రి నారాయణ ఆచారి షాపులో పనిచేసేవారు. కాగా ఇతనికి మదనపల్లె మండలం బొమ్మనచెరువుకు చెందిన మహేష్ రూ. 3.4 లక్షలు చెల్లించి ఆభరణాలు ఆర్డర్ ఇచ్చాడు. అదేవిధంగా నగలు చేసి ఇవ్వాలంటూ రెడ్డి ప్రసాద్ అనే వ్యక్తి 150 గ్రాముల పాత బంగారు, రూ. 15 లక్షలు నగదు ఇచ్చాడు. పట్టణానికి చెందిన రవిచంద్ర రూ. 3 లక్షలు, రవితేజ రూ.8 లక్షలు ఇచ్చారు. ఇలా పలువురి వద్ద నగలు ఆర్డర్ తీసుకున్న సురేష్ కుమార్ లక్షల్లో వసూలు చేసుకొని, కుటుంబ సభ్యులతో సహా కనిపించకుండా పోయాడు. షాపు తెరవకపోవడం, ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఏమి చేయాలో తెలియని బాధితులు మోసపోయామేమోనని భావించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టారు. జరిగిన మోసం, అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు. అయితే సురేష్ కుమార్ వీరి వద్దనే కాకుండా పలువురి వద్ద పెద్ద మొత్తంలో నగలు, నగదు తీసుకుని ఉడాయించి, కోర్టులో ఐపీ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు బాధితులు అంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి – చిత్తూరు రోడ్డులోని ఎస్ఆర్ కల్యాణ మండపం సమీపంలో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం నడుచుకుంటూ వెళుతున్న రవి(22) అనే యువకుడిని ఢీకొంది. స్థానికులు గుర్తించి రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు సంబేపల్లె మండలం దిన్నెపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ కుళాయప్ప తెలిపారు. కార్మికుల సమస్యలపై పోరాటంఓబులవారిపల్లె : కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాదరాజు గంగాధర్ పేర్కొన్నారు. సోమవారం మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయం పరిసరాల్లో ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్, త్రివేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోగురి మురళీ, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు దినేష్, హరి, త్రివేణి, కార్మీక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు నాగరాజు, వెంకటరమణ, వరప్రసాద్ పాల్గొన్నారు. కోడిపందెం జూదరుల అరెస్టుపెనగలూరు : మండలంలోని ఎన్ఆర్ పురం గ్రామం వద్ద తోటల్లో కోడిపందెం ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ రవి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. వారి వద్దనుంచి 36 కోడి కత్తులు, ఆరు ద్విచక్ర వాహనాలు ఎనిమిది సెల్ ఫోన్లు, రూ.4050లు నగదును సీజ్ చేశామన్నారు. సీపీఎం విధానాలే దేశాభివృద్ధికి మార్గదర్శకంరాయచోటి అర్బన్ : సీపీఎం విధానాలే దేశాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి పేర్కొన్నారు. పలు ఉద్యమాల్లో పాల్గొన్న మండం సుధీర్ కుమార్ సోమవారం సీపీఎంలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సుధీర్ కుమార్తో పాటు చుక్క వీరభద్ర, వండాడి రెడ్డి సుధాకర్, పులిమి వెంకట రమణ, గాలివీటి రామాంజులు, పండరయ్య, రెడ్డిప్రసాద్, నరసింహులు తదితరులను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ చంద్రశేఖర్, పందికాళ్ల మణి, రైతు సంఘం జిల్లా కన్వీనర్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం
వీరపునాయునిపల్లె : మోంథా తుపాన్ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేసినట్లు విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రమణ అన్నారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా అయ్యవారిపల్లె విద్యుత్ సబ్స్టేషన్లో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్చిన చర్యలపై సిబ్బందికి సలు సూచనలందించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయేంతవరకు అదికారుల, సిబ్బందికి సెలవులు రద్దుచేశామని.. ప్రతి ఒక్కరూ 24గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశాననంతరం విలేకరులతో మాట్లాడుతూ తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కడప నుంచి కాకినాడకు 20 బృందాలను పంపించామని వెల్లడించారు. సర్కిల్ కార్యాలయం కడప, కడప డివిజన్, పులివెందుల ప్రొద్దుటూరు, మైదుకూరులలో 5కంట్రోల్ రూమ్లు పని చేస్తున్నాయని వివరించారు. కంట్రోల్ రూమ్ నంబర్లు యల్యమ్సి సర్కిల్ కార్యాలయం కడప 9440817440, కడప డివిజన్ కార్యాలయం 9901761782, పులివెందుల 7893063007, ప్రొద్దుటూరు 7893261958,మైదుకూరు 9849057659 అత్యవసర పరిస్తితుల్లో ఈ నంబర్లకు సమాచారం అందించవచ్చని యన తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రగుంట్ల డీఈ కిరణ్, ఏఈ హరిప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
● పింఛా ప్రాజెక్టు పరిశీలన
సుండుపల్లె : మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టును జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు దిగువున ఉన్న నదీ పరివాహక ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడకి వచ్చే సందర్శకులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చి జాగ్రత్తలు పాటించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. నదీ పరీవాహక ప్రాంతాల రైతులు, ప్రజలు తుపాను ప్రభావంతో ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతానికి నీరు వదలడంతో ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
హర హర మహాదేవ !
రాయచోటి : కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివయ్యకు జిల్లా అంతటా భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. శివజ్యోతులను వెలిగించి మనసారా మొక్కుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించడం పుణ్యదాయకమని భావించి మహిళలు పెద్ద ఎత్తున దేవాలయాల ప్రాంగణాలలో దీపాలు వెలిగించారు. అర్చకులు శివయ్య మూలమూర్తికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలలో గణపతి, రుద్ర హోమాలు నిర్వహించారు. పూజలు జరుగుతున్నంతసేపు భక్తబృందాలు లింగాష్టకం ఆలపించారు. రాయచోటి, మదనపల్లె తంబళ్లపల్లె, పీలేరు, కోడూరు, రాజంపేట ప్రాంతాల్లోని శివాలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించారు. ఉసిరి, జమ్మిచెట్లకు పూజలు జరిపారు.అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. రాజంపేట : ప్రత్యేక అలంకరణలో రామలింగేశ్వరుడు వైఎస్సార్ జిల్లా పుష్పగిరిలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు -
దొర్రిచెరువు నిండితే ఇబ్బంది ఉండదు
మా గ్రామంతోపాటు మరో రెండు గ్రామాలు దొర్రిచెరువు నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఆక్రమణలతో దొర్రిచెరువు నానాటికీ కుచించుకుపోతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారుల్లో స్పందన ఉండటం లేదు. అలాగే హైవే విస్తరణలో భాగంగా ఇక్కడ ఉన్న చెరువు భూమి తమదని పట్టాలు సృష్టించుకుని, నష్టపరిహారం పొందుతుండటం విస్తుపోయేలా చేస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలి. దొరిచెరువు ఆక్రమణకు గురికాకుండా చూడాలి. అలాగే దొర్రిచెరువుకు వచ్చే కాలువల క్రింద తవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కాలాడి జనార్దన్ రెడ్డి, సర్పంచ్, అప్పకొండయ్యగారిపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలం మూడేళ్లుగా వర్షాలు లేక పంటలు సాగుచేసుకోలేక పోతున్నాం. వెలిగల్లు నీటి ద్వారా దొర్రిచెరువును నింపితే ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే చెరువు సగం ఆక్రమణకు గురైంది. వెలిగల్లు కాలువలను తవ్వేసి నీరు లేకుండా చేస్తున్నారు. అధికారులు, రెవెన్యూ సిబ్బంది చొరవచూపి ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. లక్కిరెడ్డిపల్లి టౌన్తోపాటు మా ప్రాంతంలోని చాలా పల్లెలకు దొర్రిచెరువే ఆయువుపట్టుగా ఉంటుంది. – బాబు, చింతకుంట వాండ్లపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలం -
మోంథా ఎఫెక్ట్.. హై అలర్ట్
● జిల్లాలోని మదనపల్లెలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షం ● అప్రమత్తమైన అధికార యంత్రాంగం ● మండల కేంద్రాల్లో హెల్ప్డెస్క్ల ఏర్పాటు సాక్షి రాయచోటి : అన్నమయ్య జిల్లాపై మోంథాప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే వరుస తుపానులతో తడిసి ముద్దయిన జిల్లాకు మోంఽథాతో ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా చలి కూడా విపరీతంగా పెరిగింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోంథా తుపాను ఎలాంటి విపత్కర పరిస్థితులు సృష్టిస్తుందేమోనని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. తుపాను ప్రభావంతో సోమవారం మదనపల్లెలో ఉదయం నుంచి కొద్దిసేపు, తర్వాత మధ్యాహ్నం వర్షం పడగా, మిగతా ప్రాంతాల్లోనూ చినుకులు పడుతూనే ఉన్నాయి. జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, పీలేరు, రాయచోటి, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాల్లో తుంపర వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు ప్రకృతి సృష్టించే విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మదనపల్లె లాంటి చోట్ల మండల కేంద్రాల్లో కూడా హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. అలాగే మున్సిపల్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చే అవకాశాలు ఉండడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వెలిగల్లు నుంచి నీటి విడుదల ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న నేపధ్యంలో ముందుజాగ్రత్తగా ఇరిగేషన్శాఖ అధికారులు వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో దిగువనున్న పాపాఘ్ని నదికి 750 క్యూసెక్కులు చొప్పున ఒక గేటు ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 4.63 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.77 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అఽధికారుల ద్వారా తెలుస్తోంది. అలాగే సుండుపల్లె మండలంలోని పింఛాతోపాటు శ్రీనివాసపురం రిజర్వాయర్, జిల్లాలోని వివిధ చెరువులకు నీరు వచ్చి చేరుతోంది. -
చెరువును చెరబట్టారు
లక్కిరెడ్డిపల్లి : కరువు ప్రాంతమైన లక్కిరెడ్డిపల్లెలో చుక్కనీరు కూడా అమృతమే. అలాంటి ప్రాంతంలో చెరువులకు నీరు అందించే కాల్వలు ఎంతో ముఖ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో వారి అగడాలకు అంతే లేకుండా పోతోంది. ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా చేసేలా వారి ధోరణి ఉంటోంది. లక్కిరెడ్డిపల్లె మండలంలోని లక్కిరెడ్డిపల్లె టౌన్తోపాటు పలు గ్రామాలకు దొర్రిచెరువు కీలకం. ఈ చెరువు నిండితే తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదు. అలాంటి చెరువుపై కూటమి నాయకుల కన్ను పడింది. చెరువు భూమి ఆక్రమించుకుంటూ ఈ ప్రాంత రైతాంగాన్ని నిండా ముంచుతున్నారు. అలాగే కాల్వలను కూడా కబ్జా చేస్తున్నారు. వైఎస్సార్ కల.. గడికోట చొరవ.. వెలిగల్లు వెలిగల్లు ప్రాజెక్టు పునాదిరాయిని దివంగత మాజీ మంత్రి ఆర్.రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేసినా ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా నిధులు అప్పటి ప్రభుత్వం మంజూరు చేయలేదు. 2004లో అధికారం చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా వెలిగల్లు ప్రాజక్టు నిర్మాణ పనులను అప్పటి ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి ద్వారా పూర్తి చేయించారు. రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో వెలిగల్లును నిర్మించారు. తరువాతి కాలంలో గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిల కృషితో ప్రధాన కాల్వలను శరవేగంగా పూర్తయ్యాయి. 2019 తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎగువ ప్రాంతంలో మంచి వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 4.26 టీఎంసీలు చేరుకొని గేట్లు ద్వారా నీటిని వదిలారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు నిండుకుండను తలపించడంతో చివరి ఆయకట్టు అయిన దిన్నెపాడు పెద్దచెరువు, హసనాపురం పెద్దచెరువు వరకు వెలిగల్లు నీటిని నింపాలనే లక్ష్యంతో మరోసారి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు కాలువలలో పూడికతీత పనులు చేయించారు. ప్రతి చెరువును వెలిగల్లు నీటితో నింపారు. దీంతో రైతులు వరి, వేరుశనగ సాగుతోపాటు ఉద్యాన పంటలైన మామిడి, బొప్పాయి పంటలకు నీరు అందడంతో మంచి లాభాలు చూశారు. అయితే ప్రస్తుతం రెండేళ్లుగా ఈ ప్రాంతంలో వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇటీవల కురుస్తున్న వానలతో వెలిగల్లుకు చేరిన వరద నీటిని చెరువులకు అందించాలని నిర్ణయించి కాలువలకు నీరు వదిలారు. ఇప్పటి వరకు కుర్నూతల, కస్తూరురాజుగారిపల్లి, పందిళ్లపల్లి, బూడిదగుంటపల్లి వరకు మాత్రమే కొన్ని ప్రాంతాల్లోని చెరువులకు నీరు చేరింది. బూడిదగుంటపల్లి నుంచి దొర్రిచెరువు మీదుగా బి.ఎర్రగుడి, దిన్నెపాడు, పెద్దచెరువు వరకు నీరు చేరాలంటే దొర్రిచెరువు వద్ద ప్రధాన కాలువ కింద భాగం పూర్తిగా మట్టిని తవ్వేసి కొంతమంది ఆక్రమించుకున్నారు. దొర్రిచెరువుకు వెలిగల్లు కాల్వ ద్వారా నీరు చేరితేనే దాదాపు అప్పకొండయ్యగారిపల్లి, లక్కిరెడ్డిపల్లి టౌన్, చింతలకుంట వాండ్లపల్లి, ఉత్తరమెట్టు దళితవాడ, గంగనపల్లి, గుడ్లవారిపల్లి ప్రాంతాల్లోని చెరువులకు నీరు చేరి సాగునీరుతో పాటు భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి ఇబ్బంది ఉండదని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. దొర్రిచెరువు నుంచి కోనంపేట గ్రామం కాలాడివాండ్లపల్లి, దిన్నెపాడు, కోమటివానిచెరువు మీదుగా దిన్నెపాడు పెద్దచెరువుకు వెలిగల్లు నీరు చేరితే వేల ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీటి ఇబ్బందులు ఉండవని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఆక్రమణల జోరు.. ప్రశ్నార్థకంగా నీరు వెలిగల్లు కాలువ కింద భాగంలో అధికార పార్టీ నాయకుల అండతో కొందరు అక్రమార్కులు మట్టిని తవ్వేసి పొలాలుగా మార్చుకొని, నేషనల్ హైవేలో తమ పొలాలు పోతున్నాయంటూ తప్పుడు ధృవపత్రాలు సృష్టించి లక్షలాది రూపాలు సొమ్ము చేసుకున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. లక్కిరెడ్డిపల్లి సర్వే నంబరు 47లో 39 ఎకరాలు పైబడి దొర్రిచెరువు భూమి ఉంది. చెరువు భూమిలో దాదాపు 10 ఎకరాలు..(ఎకరం రూ.20లక్షలు పైన ఉంటుంది) కొందరు వ్యక్తులు ఆక్రమించడమే కాక ఏకంగా మొక్కలను నాటారు. దీనిపై రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడ్డారు. కస్తూర్బా గాంధీ పాఠశాలకు వెళ్లే మార్గంలో గొల్లపల్లి చెరువుకు చేరే వంకను కూడా కొంతమంది ఆక్రమించుకొని మట్టిని తోలుతున్నారు. గంగమ్మ జాతరకు వెళ్లే రోడ్డు మార్గం పక్కనే ఇలా వంకలు ఆక్రమణకు గురవుతున్నా లక్కిరెడ్డిపల్లి రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై ఆయకట్టు రైతులు పెదవి విరుస్తున్నారు. కాగా కూటమి నేతలు ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా మామూళ్లకు అలవాటుపడిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే వాదన పలువురు రైతుల నుంచి వినిపిస్తోంది. దీంతో లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నట్టు మండల ప్రజలు చెబుతున్నారు. కస్తూర్భాగాంధీ పాఠశాల సమీపంలో వంకను ఆక్రమించి జేసీబీ సాయంతో పనులు చేస్తున్న దృశ్యం చెరువులో మొక్కలు నాటిన అక్రమార్కులు అన్యాక్రాంతమవుతున్న ‘దొర్రిచెరువు’ కూటమి నేతల ఆగడాలకు అంతేలేని వైనం ప్రశ్నార్థకంగా వెలిగల్లు చివరి ఆయకట్టుకు నీరు -
రైల్వేసమస్యల పరిష్కారానికి కృషి
రాజంపేట : ఉమ్మడి కడప జిల్లాలో రైల్వేపరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యునిగా నియమితులై తొలిసారిగా విచ్చేసిన ఎంపీ మేడా రఘునాథరెడ్డిని మేడా భవన్(రాజంపేట బైపాస్ క్రాస్)లో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేస్టాండింగ్ కమిటీలో సభ్యునిగా చోటు కల్పించినందువల్ల రైల్వేపరంగా ఈ ప్రాంతానికి అవసరమైన అంశాలపై దృష్టి సారించగలిగే అవకాశం కలిగిందన్నారు. రైల్వేస్టాండింగ్ కమిటీ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి దృష్టికి ఉమ్మడి కడప జిల్లాలోని రైలుమార్గంలో నెలకొన్న సమస్యలను తీసుకెళ్లనున్నట్లు గుంతకల్ డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి తెలిపారు. మేడాభవన్లో ఎంపీ మేడాను కలిసి బొకేను అందచేశారు.కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ గాలివీటి వీరనాగిరెడ్డి,మార్కెట్మాజీ చైర్మన్ పీసీ యోగీశ్వరరెడ్డి, పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనరు కృష్ణారావు, నందలూరు సింగల్ విండో మాజీ అధ్యక్షుడు పాలగిరి సుధాకర్రెడి సౌమ్యనాధాలయ మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, కౌన్సిలర్ సనిశెట్టి నవీన్,్డతోపాటు పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎంపీ మేడా -
వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ వాయిదా
రాయచోటి : మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 28న నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీ తుపాను కారణంగా వాయిదా పడినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. నిరసన కార్యక్రమాన్ని తిరిగి నవంబర్ 4న నిర్వహించనున్నట్లు సోమవారం తెలిపారు. పార్టీ నాయకులు, పార్టీ విభాగాల సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అర్జీలకు సత్వరమే పరిష్కారం – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలించిర సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అర్జీలను పరిశీలించి వేగంగా పరిష్కారం చూపాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఏడీ సర్వే భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి సోమవారం పల్లకీ సేవ నిర్వహించారు.ముందుగా మూల విరాట్లు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, పూజలు జరిపారు. రంగు రంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువుదీర్చి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో స్థానికులతో పాటు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్కు ఎంపిక నందలూరు : మండలంలోని మహాత్మా జ్యోతి భా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో సెకండియర్ ఎంపీసీ చదువుతున్న ఎస్.నిత్య ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్లో ప్రతిభ కనబరిచారు. డిస్క్త్రో, షాట్పుట్ విభాగంలో హర్యానాలో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఫస్టియర్ సీఈసీ చదువుతున్న కె.మానస రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించిందని, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని తెలిపారు. విద్యార్థినులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు కె.జి సునీతను ఉపాధ్యాయులు, అధ్యాపకులు అభినందించారు. గుంటిమడుగు పెద్ద చెరువుకు గండి రాయచోటి : రాయచోటి రూరల్ మండలం గుంటిమడుగు సమీపంలోని పెద్ద గోలాన్ చెరువుకు భారీ గండి పడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోలాన్ చెరువులోకి వర్షపునీరు చేరింది. సోమవారం మధ్యాహ్నం గండిపడిన ప్రాంతాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు స్పందించి గండి పడిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు. కడప కోటి రెడ్డి సర్కిల్ : మోంథా తుపాను నేపథ్యంలో కడప నుంచి విశాఖపట్నం వెళ్లేతిరుమల ఎక్స్ప్రెస్ రైలును మంగళవారం రద్దు చేసినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు -
అధిక నీటి ప్రవాహంపై అప్రమత్తం
బి.కొత్తకోట : హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువలో అదనపు నీటి ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ బి.కొత్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువును పరిశీలించారు. చెరువు నిండి మొరవనీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంతోపాటు అప్రమత్తంగా పని చేయాలని రెవెన్యూ, జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. చెరువు కుడిమొరవ నుంచి ప్రవహిస్తున్న నీళ్లు సమీపంలోని హంద్రీ–నీవా కాలువలోకి వెళ్తుండటంతో అదనపు నీళ్లతో కాలువ సామర్థ్యం పెరిగిపోయి మళ్లీ కాలువ తెగే పరిస్థితులు ఉంటాయని సూచించారు. దీనికి ముందుస్తుగా కిలోమీటర్ 108 వద్ద కాలువలోకి అదనపు వర్షం నీరు లేదా చెరువునీళ్లు చేరితే బయటకు వెళ్లేలా కాలువ అంచున నీటి ప్రవహం మళ్లేలా ఎస్కేప్ ఏర్పాటు చేశామని ఎస్ఈ విఠల్ప్రసాద్, ఈఈ అమరనాథ్రెడ్డిలు కలెక్టర్కు వివరించారు. కాగా గుమ్మసముద్రం చెరువు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని తహశీల్దార్ బావాజాన్ను కలెక్టర్ ఆదేశించారు. -
సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : పట్టణంలోని కోటిరెడ్డినగర్లో నివసిస్తూ బి.కోడూరు మండలం తంగేడుపల్లె సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తుండే మన్నెం మల్లేశ్వరి (28) శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బి.మఠం మండలం మలుగుడుపాడుకు చెందిన సుబ్బరామిరెడ్డి, ఇంద్రావతిల రెండవ కుమార్తె అయిన మల్లేశ్వరిని మూడేళ్ల క్రితం పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెలకు చెందిన రామనరసారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఈయన అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని రామాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మల్లేశ్వరి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. భర్త ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉండటంతో తలుపును పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా మల్లేశ్వరి ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. మృతురాలి తండ్రి సుబ్బరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరామర్శించిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే .. మృతురాలు మన్నెం మల్లేశ్వరి స్వగ్రామం బి.మఠం మండలం మలుగుడుపాడు కావడంతో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆదివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మల్లేశ్వరి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, బి.మఠం మాజీ సింగిల్విండో అధ్యక్షుడు సుబ్బారెడ్డి, మండల నాయకులు వెంకటరామిరెడ్డి, వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లు, సీట్ల రాజకీయాలు చేస్తే క్షమించేది లేదు
మదనపల్లె రూరల్ : గిరిజనుల జాబితాలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడిన కులాలను తీసుకువచ్చి ఎస్టీ హోదా కల్పిస్తామని సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని మోదీ చెపుతున్నారని, అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు, సీట్లు రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించే పరిస్థితి లేదని రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్నాయక్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ టౌన్హాల్లో గిరిజన ప్రజాసమాఖ్య(జీపీఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల ఆత్మీయ ముఖ్య నేతల రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గిరిజన ఓట్లతో అధికారంలోకి వచ్చిన పాలకులు, ప్రభుత్వాలు అధికారాన్ని అనుభవిస్తూ, విదేశాల్లో విహారయాత్రలు చేస్తుంటే, తమ గోడు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గిరిజన సమాజంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలుచేయాలన్నారు. గిరిజనజాతి అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులు దారి మళ్లకుండా ఉండాలంటే చట్టసభల్లో గిరిజనుల తరపున ప్రాతినిథ్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు. కార్యక్రమంలో గిరిజన నేతలు విశ్వనాథ్నాయక్, మునీంద్రనాయక్, మూడే ప్రసాదనాయక్, లక్ష్మానాయక్, చిన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పింఛా నదిలో పడిపోయిన యువకుడు
కాపాడిన అధికారులుపీలేరురూరల్ : ద్విచక్రవాహనంలో పింఛా నదిని దాటే ప్రయత్నం చేసిన ఓ యువకుడు వాహనంతోపాటు నదిలో పడిపోయిన సంఘటన మండలంలోని బాలంవారిపల్లె సమీపంలో నూనేవాండ్లపల్లె వద్ద జరిగింది. పీలేరు మండలం కాకులారంపల్లె పంచాయతీ కోళ్లఫారానికి చెందిన గుండ్లూరు రవికుమార్, నీలావతి కుమారుడు జి. కార్తీక్ (19) డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి ద్విచక్రవాహనంలో తల్లి నీలావతితో కలసి మండలంలోని బాలంవారిపల్లె పంచాయతీ నాలేవాండ్లపల్లెకు అవ్వగారింటికి వెళ్లారు. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కార్తీక్ ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరాడు. నూనేవాండ్లపల్లె వద్ద పింఛానదిని దాటే క్రమంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ద్విచక్రవాహనంతో సహా పడిపోయాడు. కొంత దూరం వెళ్లాక నదిలో ఓ చెట్టును పట్టుకుని నది మధ్యలో ఓ రాతి బండపైకి చేరుకున్నాడు. కార్తీక్ వద్ద ఉన్న సెల్ఫోన్తో తన బంధువులకు సమాచారం అందించాడు. విషయాన్ని రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్ శివకుమార్, సీఐ యుగంధర్, అగ్నిమాపక అధికారి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోప్లైన్ సహాయంతో యువకుడిని అతికష్టంపై కాపాడి గట్టుకు చేర్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివకుమార్, సీఐ యుగంధర్ మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మండలంలో చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది చలపతి, అశోక్, జాకీర్, షఫీ, రాజేంద్రబాబు, ఇమ్రాన్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కువైట్లో ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కారు ప్రైవేటుపరం చేస్తుండటంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆదివారం కువైట్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండల ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రామిరెడ్డి ధ్వజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు చేసింది ఏమీలేదని విమర్శించారు. పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి, పేదపిల్లలు వైదులు కావడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని అమ్మేసుకుంటూ ప్రైవేట్పరం చేస్తున్నారని చెప్పారు. ప్రజల్లో చైతన్యం వస్తోందని, ఇకపై బాబు మోసపుపాలన సాగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ బాల్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, మన్నూరు చంద్రశేఖర్రెడ్డి, అహ్మద్, చంద్రశేఖర్రెడ్డి మహేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చదువుకోవాలా.. చదువు చెప్పాలా?
రాజంపేట టౌన్ : 2010వ సంవత్సరం కంటే ముందు ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారు టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో ఇప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులకు మనసు పెట్టి చదువు చెప్పాలా? లేక చదువుకోవాలో అన్న సందిగ్ధత నెలకొందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల టైంటేబుల్ కూడా వచ్చిందని అలాగే టెట్కు నోటిఫికేషన్ కూడా విడుదలైందన్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు విద్యార్థులను టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఎలా తర్ఫీదు చేయగలరని, అలాగే టెట్ పరీక్షకు ఎలా ప్రిపేర్ కాగలరని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు ద్వారా కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇచ్చేలా తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు సూర్యుడు నాయక్, ఉమామహేశ్వర్లు, నరసింహమూర్తి, ఆదాల నరసింహారెడ్డి, రామచంద్రరాజు, రాజారెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య -
సమాజంలో పోలీసుల పాత్ర చాలా గొప్పది
రాయచోటి టౌన్ : నేటి సమాజంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనది.. అసాంఘిక కార్యకలాపాలను నిలువరించాలన్నా.. శాంతి భద్రతలను నెలకొల్పాలన్నా అది పోలీస్ వ్యవస్థతోనే సాధ్యమని అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ అడ్మిన్ ఆర్ఐ వీజే రామకృష్ణ అన్నారు. ఆదివారం పోలీసుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఆదివారం రాయచోటి డైట్ కళాశాలలో డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు, పోలీసుల పిల్లలకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు నగదు పురస్కారాలను అందించారు. అనంతరం ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ భద్రత, సామాజిక బాధ్యత, నైతిక విలువలు వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించి భావిభారత పౌరులుగా ఎదిగేందుకు పోలీస్ వ్యవస్థ ఎంతో దోహదపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ అమరనాథరెడ్డి, అధ్యాపకులు గిరిధర్, వెంకటసుబ్బారెడ్డి, శ్రీనివాసులు, మోహన్ నాయక్, రెడ్డెప్ప రెడ్డి, శివభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మైలవరానికి నీరు విడుదల
కొండాపురం: గండికోట ప్రాజెక్టు నుంచి రెండు క్రస్ట్ గేట్లు ద్వారా 5 వేల క్యూసెక్కులనీటిని మైలవరం జలాశయానికి వదులుతున్నట్లు జీఎన్ఎస్ఎస్ఈఈ ఉమా మహేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు రావడంతో ఆవుకు రిజర్వాయర్ నుంచి 3 వేల క్యూస్కెలనీరు గండికోట ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఉందన్నారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం లోని చాగల్ల రిజర్వాయర్ నుంచి వేయ్యి క్యూసెక్కులనీటిని పెన్నానదికి వదలడంతో గండికోట జలాశయంలోకి రాత్రి వచ్చి చేరుతాయన్నారు. ప్రస్తుతం గండికోట జలాశయం పూర్తినీటిసామర్థ్యం 26.85 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 26.3 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో 5 వేల క్యూసెక్కులనీటిని ఆదివారం సాయంత్రం దిగువకు మైలవరం జలాశయానికి వదిలినట్లు వెల్లడించారు. -
వీఆర్ఓకు తీవ్ర గాయాలు
రాజంపేట రూరల్ : రై ల్వేకోడూరు పట్టణ వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న చాపల పెంచలయ్యకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఓబులవారిపల్లి మండల పరిధిలోని జాతీయ రహదారిపై పామలేరు వద్ద ఆదివారం గుర్తు తెలియని వాహనం వెనక వైపు నుంచి పెంచలయ్య ద్విచక్రవాహనం అయిన స్కూటీని ఢీ కొట్టింది. రహదారి పక్కన పడిపోయిన పెంచలయ్యను తిరుపతి నుంచి వస్తున్న ప్రైవెట్ అంబులెన్స్ యజమాని శేఖర్ రాజంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. తలకు, కాలికి తీవ్ర గాయాలు అయిన పెంచలయ్యకు ప్రాథమిక వైద్యం నిర్వహించారు. అనంతరం తిరుపతికి రిఫర్ చేశారు. చిన్నమండెం : మండల పరిధిలోని దేవగుడిపల్లి గ్రామం జల్లావాండ్లపల్లి సమీపంలో ఆగివున్న ట్రాక్టర్ ట్యాలీని ఢీకొని అజయ్కుమార్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. అజయ్కుమార్ తన తల్లి విజయనిర్మలతో కలిసి రాయచోటిలోని ఏజీ గార్డెన్లో నివసిస్తున్నాడు. సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో గుర్రంకొండకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా బైక్ నడిపిన యువకుడిపై కేసు నమోదు వేంపల్లె : నిర్లక్ష్యంగా మోటార్ బైక్ నడిపిన దర్బార్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. శనివారం సాయంత్రం వేంపల్లెలోని పులివెందుల – గండి బైపాస్ రోడ్డులోని మదీనాపురం సమీపంలో దర్బార్ అనే యువకుడితో పాటు మరో ఐదుగురు యువకులు 3 మోటార్ బైకుల్లో అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పెద్దగా శబ్దం చేయడంతో పాటు మోటార్ బైకు ముందు చక్రాలను లేపి వెనుక చక్రాలపై మోటార్ బైకు నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ నేపథ్యంలో మోటార్ బైకులను నడిపిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి మోటార్ బైకులపై చర్యలు తీసుకోవాలని ఎంవీఐకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ షాక్తో మహిళ మృతి మైలవరం : మండల పరిధిలోని కర్మలవారిపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (56) కరెంటు షాక్ తో మృతి చెందింది. ఆదివారం లక్ష్మీదేవి తాను ఉతికిన దుస్తులను ఇంట్లోనే ఆరబెట్టుకుంటుండగా కడ్డీలకు విద్యుత్ కనెక్షన్ తగలడంతో షాక్కు గురైంది. భర్త మాధవరెడ్డి భార్యకు కరెంటు షాక్ తగిలిందని భావించి కాపాడే ప్రయత్నం చేశాడు. అతను కూడా విద్యుత్ షాక్కు గురయ్యాడు. విద్యుత్ షాక్కు గురైన లక్ష్మీదేవిని వెంటనే ప్రభు త్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధృవీకరించారు. -
ఊరూరా.. మందుపాతరలు
కూటమిపాలన రాకతోనే.. గ్రామాలు, పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. వీధి వీధికి మద్యం విక్రయాలు విస్తరింపజేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. ఇంటి గడపల వద్దకే మద్యం తీసుకురావడం ద్వారా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. ప్రభుత్వ మద్యం ఒకవైపు, నకిలీ మద్యం విక్రయాలు మరోవైపు మందుబాబుల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాల ఏర్పాటు నిబంధనల నుంచి.. బెల్ట్ షాపుల నిర్వహణ వరకు ప్రతిదీ ఉల్లంఘనే. పల్లెల్లో బెల్టు షాపుల నిర్వహణ కోసం ఘర్షణ పడిన సంఘటనలు కోకొల్లలు. బెల్ట్ షాపులు ఉండొద్దని పైకి ఆదేశాలిస్తున్న ఎకై ్సజ్ శాఖ మాత్రం ఒక్క బెల్టు తీయలేక చోద్యం చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో మద్యం ఇక్కడ అక్కడ అని కాదు అంతటా ప్రవహిస్తోంది. దీని ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయి. –సాక్షి నెట్వర్క్ -
అదనపు పోలింగ్ బూత్ల ఏర్పాటు
రాయచోటి టౌన్ : రాయచోటి నియోజక వర్గ పరిధిలో అదనపు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు రాయచోటి రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలో అన్ని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి నియోజక వర్గం –128లో మొత్తం 292 పోలింగ్ బూత్లు ఉన్నాయని వాటికి మరో 32 పోలింగ్ బూత్లను చేర్చామన్నారు. వీటిలో అదనంగా లక్కిరెడ్డిపల్లెలో –1, రాయచోటిలో–18, గాలివీడులో –9, చిన్నమండెంలో–1, సంబేపల్లెలో 3 మొత్తం 32 పోలింగ్ బూత్లను పెంచగా 324 పోలింగ్ బూత్లుగా ఏర్పడ్డాయని తెలిపారు. వృద్ధురాలి అదృశ్యం కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్కు ఈనెల 26వతేదీన తన కుమార్తె ఇంటికి రాజుపాలెం మండలం అర్కటవేములకు చెందిన గంటల నాగమ్మ(82)అనే వృద్ధురాలు వచ్చింది. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయిందని అల్లుడు వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసినవారు పోలీసులకుగానీ, వేణుగోపాల్ సెల్ నెంబర్: 80740 22422కు తెలియజేయాలని పోలీసులు కోరారు. చెరువులో వ్యక్తి గల్లంతు అట్లూరు : చెరువులో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి గల్లంతైన ఉదంతం మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొండూరు ప్రభాకర్ (54) డప్పు కళాకారుడుగా జీవనం సాగిస్తున్నాడు. బోడిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందడంతో ఆదివారం ఆమె అంత్యక్రియలకు డప్పు వాయించేందుకు ప్రభాకర్ వెళ్లాడు. ఆ మహిళ అంత్యక్రియల అనంతరం ప్రభాకర్ ఇంటికి వస్తూ కాళ్లు, చేతులు కడుక్కొనేందుకు సమీపంలోని వేమలూరు చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయి గల్లంతయ్యాడు. దీంతో అక్కడున్న వారు బంధువులకు సమాచారం ఇచారు. బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు, తహసీల్దార్కు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ రామకృష్ణ, ఆర్ఐ రమణ, వీఆర్ఓ సుబ్బన్న బద్వేలు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి ఆదివారం చీకటి పడే వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గజ ఈతగాళ్లు మళ్లీ ఉదయం గాలిస్తామని తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఐదుగురు ఆడపిల్లలు కాగా, వారిలో ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. జాతీయ స్థాయి అబాకస్లో సత్తా చాటిన నాగార్జున విద్యార్థులు కడప ఎడ్యుకేషన్ : జాతీయస్థాయి అబాకస్ పోటీలలో కడప నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి క్యూబాటిక్ అబాకస్ పరీక్షల్లో 5వ తరగతికి చెందిన తబితాశ్రేష్ఠ, 4వ తరగతికి చెందిన మోక్షజ్ఞలు ద్వితీయ బహుమతులను సాధించగా 5వ తరగతికి చెందిన భారతి తృతీయ బహుమతిని సాధించారు. అలాగే 6వ తరగతికి చెందిన రేయాన్ఖాన్, 5వ తరగతికి చెందిన మోక్షితారెడ్డి, 3వ తరగతికి చెందిన సోహిత్, లక్ష్మి కాస్వీరెడ్డిలు నాలుగో స్థానంలో నిలిచారు. మరో నాలుగు మెరిట్ బహుమతులను పొందారు. జాతీయస్థాయి అబాకస్ పోటీలో ప్రతిభ చాటిన విద్యార్థులను నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ శివ తులశమ్మ, డైరెక్టర్ శివప్రసాద్రెడ్డి, హెచ్ఎం క్రిష్ణారెడ్డి, హెడ్మిసెస్ సుశీలదేవి అభినందించారు. మహిళ కుటుంబ సభ్యులకు అప్పగింత మైలవరం : మండల పరిధిలోని బుచ్చంపల్లి గ్రామానికి చెందిన మూడే తేజేశ్వరిని ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తేజేశ్వరి జూన్ 19వ తేదీన భర్త కేశాలు నాయక్తో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో పక్కింటి వారితో ఉపాధి పనికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. అయితే ఇంటికి భార్య తిరిగి రాకపోవడంతో భర్త కేశాలు నాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ఎస్ఐ మహిళ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం ఆచూకీ లభ్యం కావడంతో ఆమెను స్థానిక తహసీల్దార్ ఎదుట హాజరు పరిచారు. తన భర్తతో గొడవ కారణంగానే ఇల్లు వదిలి వెళ్లినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆమె కుటుంబ పెద్దలను పిలిపించి అప్పగించారు. -
మా స్థలంలోకి వెళ్తే దౌర్జన్యం చేస్తున్నారు..
లక్షల రూపాయలు అప్పులు చేసి 2012వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. కొందరు రైల్వేకోడూరు దళితవాడ గ్రామస్తులు ఎలాంటి పత్రాలు లేకుండా మా స్థలంలోకి పోకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించి న్యాయం చేయాలి. – ఉప్పలపాటి సుధీర్, అనంతరాజుపేట, రైల్వేకోడూరు మండలం దశాబ్దాల క్రితం ఇంటి స్థలాలు కొన్నాము. ముళ్లకంచె ఏర్పాటు చేసి దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారు. అన్యాయాన్ని అరికట్టే అధికారులు లేకుండా పోయారు. మా ఇంటిస్థలాలను మాకు ఇప్పించండి. – దేవర సుబ్బారెడ్డి, రైతు, ఓబులవారిపల్లి -
దెబ్బతిన్న వరిపంట పరిశీలన
పెనగలూరు: మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరిపంటను జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ఆదివారం పరిశీలించారు. ఆయన నారాయణనెల్లూరు, కోమంతరాజుపురం గ్రామాల్లో పర్యటించారు. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ వరిపంట దెబ్బతిందో పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. పడిపోయిన వరి పంటను మొలకెత్తకుండా వరి ఎన్నులు నిలబెట్టి చుట్టినట్లైతే కొంతమేర నష్టం లేకుండా కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శివశంకర్, మండల వ్యవసాయశాఖ అధికారి సచివాలయ వ్యవసాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నందలూరు మండలంలో.. నందలూరు: మండలంలో వర్షంతో దెబ్బతిన్న వరి పంటలను ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ, రాజంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు జి.శివశంకర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ పంట కోసిన రైతులు వరికుప్పల మీద ఐదు శాతం ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను వారం రోజుల తర్వాత కోయాలని చెప్పారు. వర్షాలు ఆగిన తర్వాత పంట మీద హెక్సాకానిజోల్ అనే మందులు పిచికారీ చేసి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి జి.మల్లిఖార్జున, వ్యవసాయ శాఖ సిబ్బంది శిల్ప, భరత్కుమార్ పాల్గొన్నారు. -
● భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
సాక్షి రాయచోటి: తుపాను అనగానే ప్రజలతోపాటు రైతులు అమ్మో అంటూ భయపడతున్నారు. ఇటీవల వరుసగా తుపానుల నేపథ్యంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. బయటికి పోలేక, ఇంటిలో ఉండలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మళ్లీ మోంథా తుపానుఅంటే ప్రధానంగా అన్నదాతల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే కురిసిన వర్షాలకు రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో పండ్ల తోటలతోపాటు పీలేరు, మదనపల్లె తదితర ప్రాంతాల్లో పంట పొలాలు తడి ఆరలేదు. ఉన్న పంటలు ఎక్కడ పోతాయోనన్న ఆందోళన వెంటాడుతుండగా, పండ్ల తోటలకు సంబంధించిన రైతులు కూడా దిగులు చెందుతున్నారు. రోజల తరబడి తడి అలాగే కొనసాగితే తెగుళ్లతోపాటు చెట్లు చనిపోతాయని, నష్టం ఎదుర్కొవాల్సి వస్తోందని భయాందోళనలకు గురవుతున్నారన్నారు. మొన్నటి వర్షాలకు ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి యంత్రాంగం అలర్ట్ అన్నమయ్య జిల్లాకు సంబంధించి తుపాను ప్రభావం అధికంగా ఉండనుందని వాతావరణశాఖ సూచన నేపథ్యంలో అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందోనని యంత్రాంగమంతా అలర్ట్ అయింది. మదనపల్లెలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు. మరోవైపు రైల్వేకోడూరు, రాజంపేటలపై కూడా తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తుపాను నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో పాఠశాలలకు కూడా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. జిల్లాలో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. ఇప్పటికే పండ్లతోటలతోపాటు ఇతర పంటల్లో తడి ఆరకుండా అల్లాడుతున్న వీరిని గోరుచుట్టుపై రోకలి పోటులా మళ్లీ తుపాను బెంబేలెత్తిస్తోంది. మూడు, నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసి సుమారు 10 రోజులు తడి ఆరకపోతే పంట ఉత్పత్తులు చేతికి అందకపోవడం ఖాయం. మొన్నటి తుపాన్తోనే తడి ఆరని పొలాలు ఇప్పటికే ఎక్కడికక్కడదెబ్బతిన్న ప్రధాన రోడ్లు తుపాను నేపథ్యంలో అలెర్ట్ ఇప్పటికే పాఠశాలలకు సెలవుప్రకటించిన విద్యాశాఖ రాయచోటి: మొంథా తుపాన్పై వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాపై ‘మొంథా తీవ్ర ప్రభావం చూపనుందని ఎస్పీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ వర్షంలో బయటకు వెళ్లొద్దన్నారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారు నీటిలోకి, ప్రమాదకర ప్రదేశాల వద్దకు వెళ్లకుండా పర్యవేక్షించాలని సూచించారు.వాగులు, వంకలు, నదులు, చెరువులు నిండుకుండల్లా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. సరదా కోసమైనా, స్నానం కోసమైనా నీటిలో దిగవద్దు, దింపవద్దని తెలిపారు. మోంథా తుపాన్ వల్ల ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకండి. నీటితో నిండిన రహదారులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దు. విద్యుత్ తీగలు, పోల్లు తాకరాదు, వాటికి దగ్గరగా కూడా వెళ్లవద్దు. ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయాలను శుభ్రం చేసుకోండి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడండి. నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల వద్దకు వెళ్లకండి. వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉంటే, ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించండి. పశువులను ఎత్తైన ప్రదేశాలకు తరలించండి. పిడుగు సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్ ప్రదేశాల్లో నిలబడి ఉండవద్దు. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని ఆపండి. పిడుగు సమయంలో నీటిలో ఉండవద్దు చేపలు పట్టడం లేదా స్నానం చేయడం మానుకోండి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. -
పరిహరం అందేనా.?
గుర్రంకొండ: జిల్లాలో ఈ ఏడాది నష్టాలపాలైన మామిడిరైతులను ఆదుకొని పరిహారం చెల్లించేవారేరని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది తొలిసారిగా జిల్లాలో మామిడితోటలకు ఇ–క్రాప్ ద్వారా పంటల బీమా చెల్లించారు. ఈ ఏడాది ఓవైపు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక, మరోవైపు మామిడి కాయలకు చీడపీడలు ఆవహించి రైతులు భారీగా నష్టపోయారు. గత ఏడాది జిల్లా మొత్తం మీద 4420 మంది రూ.1,24,87,500 పంటల బీమా కోసం ప్రభుత్వానికి చెల్లించారు. కనీసం గతంలో దరఖాస్తు చేసుకున్న వారికై నా పంటలబీమా అందుతుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఇ– క్రాప్లో మామిడితోటలకు పంటల బీమా చెల్లించేందకు రైతులు ముందుకురాకపోవడం గమనార్హం. ● ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో ధరలు కొంతమేరకు ఆశాజనకంగా ఉన్నా ఆతరువాత మామిడి ధరలు పతనమయ్యాయి. బెంగళూరుతో పాటు ఇతర రకాల మామిడికాయల్ని మార్కెట్లో కొనేవారు లేక తోటల్లోనే వదిలేసిన సంఘటనలు జిల్లాలో చోటు చేసుకొన్నాయి. మిగిలిన రకాలకు అప్పట్లో రూ. 15 నంచి రూ,22లోపే ధరలు పలికాయి.కాయలు కోసి మార్కెట్కు తరలించినా గిట్టుబాటు కాక పోవడంతో పలువురు కోయకుండా తోటల్లోనే వదిలేశారు. దీంతో మామిడి రైతులు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రూ. రూ.65 కోట్ల మేరకు నష్టపోయారు. చీడపీడలతో పంటనష్టం మూలిగే నక్కపై తాటికాయపడిందన్న చందనంగా మామిడిరైతుల పరిస్థితి మారింది. ఓవైపు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతుంటే మరోవైపు చీడపీడలతో తోటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడికాయలు మంచి రంగుమీదకొచ్చి కోతలకు వచ్చిన సమయంలో వైరస్లు, ఊజీ, నల్లమచ్చల రోగాలతో పాటు ఇతర చీడపీడలతో తోటలు భారీగా దెబ్బతిన్నాయి. చిన్నపాటి గాలులకు కూడా రాలిపోయి రైతులకు నష్టాలనే మిగిల్చాయి. తొలిసారిగా ఇ–క్రాప్లో మామిడికి పంటలబీమా జిల్లాలో తొలిసారిగా గత ఏడాది ప్రభుత్వం కొత్తగా మామిడి పంటకు బీమా సౌకర్యం కల్పించింది. గత ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఒక్కో ఎకరానికి రైతు రూ. 2250 పంటల బీమా మొత్తాన్ని చెల్లించేలా కొత్త పథకం ప్రారంభించారు. అకాల వర్షాలకు, వాతావారణ మార్పుల కారణంగా పంటలు దెబ్బతింటే బీమా వర్తిస్తుందని అప్పట్లో అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 4420 మంది 5550 ఎకరాలకు రూ.1,24,87,500 మొత్తాన్ని పంటల భీమా కింద ప్రీమియం చెల్లించారు. గత ఏడాది జిల్లాలో తొలిసారిగామామిడికి పంటలబీమా గడువుదాటినా 4420 మందిరైతులకు అందని పరిహారం ఈ ఏడాది ఇ–క్రాప్పై ఆసక్తి చూపని మామిడిరైతులు బీమా కంపెనీ వారే చెల్లించాలి మామిడితోటలకు పంటల బీమా చేసుకొని పంటనష్టపోయిన రైతులకు నష్టపరిహరాన్ని బీమా కంపెనీవారే చెల్లించాలి. రైతు లకు ఎంత మేరకు ఇవ్వాలో వారే నిర్ణయించాల్సి ఉంది. వాతావరణం నెలవారీ వివరాలు బీమాకంపెనీ వారు సేకరించి ఎంతశాతం మేరకు పంటనష్టం జరిగిందన్న సమాచారం వారి వద్దే ఉంది. ఎప్పుడు బీమా సొమ్ము చెల్లిస్తారన్న దానిపై సమాచారం లేదు. – ఈశ్వర్ప్రసాద్రెడ్డి, ఉద్యానవనశాఖాధికారి, మదనపల్లె ఎప్పుడిస్తారో గత ఏడాది ఎకరం మామిడితోటకు పంటల బీమా చేయించాను. ఈ సీజన్లో పంట మొత్తం చాలావరకు నష్టపోయాను. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడం, వైరస్లు, రోగాలు ఎక్కువగా రావడంతో తోటలు దెబ్బతిన్నాయి. అయితే సీజన్ అయిపోయి చాలారోజులవుతున్నా ఇంతవరకు మాకు పంట నష్టపరిహారం అందలేదు. కనీసం పంటల బీమా సొమ్ము ఎప్పుడు అందుతుందో అర్థం కావడంలేదు. – సావిత్రమ్మ, మామిడి రైతు, చారావాండ్లపల్లె -
పోలీసు సేవలపై అవగాహన అవసరం
ఓపెన్ హౌస్తో విద్యార్థులకు స్ఫూర్తి నింపిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రాయచోటి : అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత, ప్రజల సంరక్షణ, శాంతికోసం చేస్తున్న పోలీసు సేవలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విద్యార్థులకు బోధించారు. ఆదివారం రాయచోటిలోని పోలీసు కార్యాలయం వేదికగా పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించి పరిశీలనకు వచ్చిన విద్యార్థులకు పోలీసుల సాంకేతికత, సేవలను వివరిస్తూ ఉపాధ్యాయుడి పాత్రను పోషించారు. నేటి సమాజంలో పోలీసుల పాత్రను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించి ఆకట్టుకున్నారు. విద్యార్థులకు ఏకే 47 తుపాకీ, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, రోబో డ్రెస్ల గురించి అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల సంస్మరణార్థమే ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అమరవీరుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థి దశ నుంచే పోలీసులు వినియోగించే ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీ గురించి తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. యువత చదువుతోపాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంచి ఆలోచనలతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. కేసుల ఛేదనలో పోలీసులు ఉపయోగించే సాంకేతికతను, సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. శక్తి యాప్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఏఆర్ సిబ్బంది, పోలీసు బృందాలు 303 తుపాకీ, 7.62 ఎంఎం సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, 9 ఎంఎం పిస్టల్, ఏకే 47, టియర్ గ్యాస్ గన్తోపాటు ఇతర పరికరాలు, రైట్ గేర్ ఎక్యూప్మెంట్, బీపీ జాకెట్లను ప్రదర్శించి వాటి పనితీరును వివరించారు. అలాగే సాంకేతికత, పరిశోధన, బాంబ్ స్క్వాడ్, ట్రాఫిక్ వ్యవస్థ, శక్తి టీమ్, సైబర్ క్రైమ్, పోలీసు హోదాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ ఎం.శ్రీనివాసులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ప్రారంభం
రైల్వేకోడూరు: రైల్వేకోడూరు టివిఎస్ఆర్ కల్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–19 తైక్వాండో పోటీలు ప్రారంభమయ్యాయి.ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించిన 300 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ఆది, సోమవారాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ టీఎన్వీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులు జమ్మూకశ్మీల్రో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో చిన్నఓరంపాడు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హరిత, రాష్ట్ర పరిశీలకులు వి శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎ సుబ్బరాజు,నాగేశ్వరరెడ్డి, ఓబుల్ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, నీలకంఠరావు పాల్గొన్నారు. రాయచోటి: జిల్లాలో కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై 59 కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. రవాణ కమిషనర్ ఆదేశాల మేరకు రెండురోజులుగా కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ బస్సుల రికార్డులను పరిశీలించి 59 కేసులు నమోదు చేశామన్నారు. కేసులు ద్వారా రూ. 1,54,100లు జరిమానా విధించామన్నారు. ఉల్లంఘనలు అరికట్టేందుకు ఈ డ్రైవ్ మరికొన్ని రోజులు కొనసాగుతుందని తెలిపారు. -
కూటమి నేతల భూ దాహం !
● కోట్లు విలువ చేసే ఇంటి స్థలాలు కబ్జా చేస్తున్న టీడీపీ నాయకులు ● పట్టించుకోని రెవెన్యూ, పోలీసు అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్ : కోడూరు పట్టణం నడిబొడ్డున శివరామకృష్ణ థియేటర్ వెనుక లక్ష్మీనగర్లో కోట్ల రూపాయలు విలువచేసే భూమిని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 30 ఏళ్ల క్రితం రైల్వేకోడూరు, ఓబులవారిపల్లి గ్రామాల ప్రజలు ఇంటి స్థలాల ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రైల్వేకోడూరు పట్టణానికి చెందిన ద్వితీయ శ్రేణి తెలుగుదేశం పార్టీ నాయకుల కన్ను ఈ విలువైన కోట్లాది రూపాయల భూమిపైన పడింది. స్థానిక దళితవాడ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో కుమ్మకై ్క సంబంధిత భూమిలో అక్రమంగా కంచెను ఏర్పాటు చేశారు. కంచెను తొలగించేందుకు ఆదివారం ఇంటి స్థలాలకు సంబంధించిన లబ్ధిదారులు పెద్దఎత్తున జేసీబీ సహాయంతో ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, బినామీలు జేసీబీని అడ్డుకున్నారు. దీంతో లబ్ధిదారులకు, దళితవాడ గ్రామ ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. సర్వే నెంబరు. 13/1,13/7,13/13/5లలో దాదాపు ఏడు ఎకరాల భూమిని 200 మందికి పైగా ఇంటిస్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నారు. ఈ స్థలాన్ని 1917వ సంవత్సరంలో రైల్వేకోడూరు పట్టణానికి చెందిన సోడిశెట్టి శేషయ్య రిజిస్టర్ చేయించుకొని మామిడిచెట్లు నాటారు. అనంతరం మామిడిచెట్లు తొలగించి శేషయ్య వారసులు ఇంటి స్థలాలుగా విక్రయించారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఓబులవారిపల్లి, మంగంపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, రైల్వేకోడూరుకు చెందిన పారిశ్రామిక వేత్త, విద్యాసంస్థల అధినేత, మరో టీడీపీ నాయకుడి కన్ను ఈ భూమిపై పడింది. ఎలాంటి ఆధారం లేకపోయినా అక్రమ పత్రాలు సృష్టించి దళితులను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు విలువచేసే ఇంటిస్థలాలు కాజేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు, రెవెన్యూ, పోలీసు అధికారులు భారీ ఎత్తున మామూళ్లు తీసుకొని తమకు అన్యాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. లక్షలు అప్పు చేసి కొన్న ఇంటిస్థలాలను అక్రమంగా ఆన్లైన్ చేయించుకొని కబ్జాకు పాల్పడుతున్నారని, ఆదుకోవాలని లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని అర్హులైన భూమి యజమానులు అంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. -
అన్నమయ్య జిల్లాలో కంపించిన భూమి
అన్నమయ్య జిల్లా: రామసముద్రం మండలం మాలేనత్తం పంచాయతీ సింగంవారిపల్లెలో శనివారం సాయంత్రం భూమి కంపించి.. పెద్దగా శబ్ధం రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 6:54 నిముషాలకు భూమి రెండు సార్లు కంపించినట్టు తెలిపారు. ఇళ్లలోని సామాన్లు, పొయ్యిపై పాత్రలు, పడుకున్న మంచాలు సైతం కిందపడిపోయినట్టు తెలిపారు. -
రక్షక భటులు.. రక్తదాతలైన వేళ!
● మెగా వైద్య శిబిరంలో రక్తదానం చేసిన పోలీసులు ● పోలీసు కుటుంబాలకు వైద్య పరీక్షలు ● శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిరాయచోటి : జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణం శనివారం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. పోలీసులు మానవతా మూర్తులయ్యారు. సమాజ రక్షణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అన్నమయ్య జిల్లా పోలీసులు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి అంటూ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఇచ్చిన పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, ప్రసవాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో రక్తం లేక ఎంతో మంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారన్నారు. వారి అవసరాలు తీర్చడానికే ఈ సంకల్పం అన్నారు. ఎస్పీ పిలుపుతో స్ఫూర్తి పొందిన పోలీసులు 100 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చారు. జిల్లా ఎస్పీతోపాటు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, మదనపల్లి డీఎస్పీ ఎస్. మహేంద్ర, ఏఆర్ డీఎస్పీ ఎం,శ్రీనివాసులు సహా పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసిన ప్రతి పోలీసునూ ఎస్పీ అభినందించి పండ్లు, జ్యూస్ బాటిళ్లను అందజేశారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటేనే శాంతి భద్రతలను మరింత సమర్థంగా కాపాడగలుగుతారని ఎస్పీ అభిప్రాయపడ్డారు. శిబిరంలో సాధారణ బీపీ, షుగర్ పరీక్షలతోపాటు అత్యంత ముఖ్యమైన డర్మటాలజిస్ట్, డెంటల్, గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఫిజిషియన్, ఆప్తమాలజిస్టు వంటి నిపుణులతో వైద్య పరీక్షలు చేయించారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రులసమన్వయ అధికారి డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించిన రాయచోటి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ కిరణ్ కుమార్, ప్రభుత్వ వైద్యులు నవీన్ కుమార్, శైలేష్, మహేశ్వరరాజు, రామరాజు, మస్తాన్ రావు, ప్రశాంతి, వైద్య సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, ఇతర సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, హోంగార్డు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు
బి.కొత్తకోట : బస్సు దిగి అదుపు తప్పిన మహిళ కాలుపై బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం మండలంలో జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చీకటిమానుపల్లెకు చెందిన సుజాత (35) బంధువుల ఇంటికి వచ్చింది. తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు బి.కొత్తకోటకు వెళ్లే బస్సు ఎక్కింది. అమర నారాయణపురం వద్ద బస్సు దిగుతూ సుజాత అదుపుతప్పి పడిపోయింది. ముందుకు కదిలిన బస్సు సుజాత ఎడమ కాలిపై వెళ్లడంతో తీవ్రంగా గాయమైంది. స్థానికుల సమాచారంతో 108లో చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బాధితురాలికి బంగారు గొలుసు అప్పగింత మదనపల్లె రూరల్ : పట్టణంలోని ఎగ్జిబిషన్లో ఓ మహిళ పోగొట్టుకున్న బంగారు గొలుసును టూటౌన్ సీఐ రాజారెడ్డి బాధితురాలికి అప్పగించారు. కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య తరిగొండ ప్రమీల(37) పట్టణంలోని టిప్పుసుల్తాన్ మైదానంలో జరుగుతున్న ఎగ్జిబిషన్కు వచ్చింది. సుమారు 10 గ్రాముల బంగారు గొలుసు పోగొట్టుకుంది. దీంతో బాధితురాలు టూటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సీఐ రాజారెడ్డికి ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన ఆయన సాంకేతికత ఆధారంగా మహిళ పోగొట్టుకున్న బంగారు గొలుసును గుర్తించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్కు బాధితురాలిని పిలిపించి, బంగారు గొలుసు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ రాజారెడ్డి, పోలీస్ సిబ్బందికి తరిగొండ ప్రమీల కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో ఏఎస్ఐ రమణ పాల్గొన్నారు. గాలేరు– నగరిని సత్వరమే పూర్తి చేయాలిరాజంపేట : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గాలేరు–నగరి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలని సాగునీటి ప్రాజెక్టుల అధ్యయన బృందం డిమాండ్ చేసింది. శనివారం బృందం సభ్యులు అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించారు. ఈ బృందంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, రైతు సేవాసంస్ధ అధ్యక్షుడు అక్కినేని భవానీ ప్రసాద్, జలవనరుల, సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ, సెంటర్ ఫర్ లిబిర్టీ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాలేరు–నగిరి సుజల స్రవంతికి నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. అలాగే అన్నమయ్య ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, రిటైర్డ్ డీఆర్ఓ ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రవికుమార్, సీపీఐ పట్టణ కార్యదర్శి సికిందర్, హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్ ప్రతినిధి రమణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్ర తదితరులు పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుల అరెస్టుతొండూరు : మండలంలోని మల్లేల ఇమాంబీ దర్గాలో దొంగతనం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం తొండూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఘన మద్దిలేటితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం గోవిందిన్నె బీసీ కాలనీకి చెందిన షేక్ హిదయతుల్లా, జమ్మలమడుగు పట్టణానికి చెందిన షేక్ గైబుసావలీ ఈనెల 21వ తేదీన మల్లేల ఇమాంబీ దర్గాలోని హుండీని పగులగొట్టి రూ.30వేల నగదును అపహరించారన్నారు. వారిని శనివారం తొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని భద్రంపల్లె క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30వేల నగదుతోపాటు హీరో హోండా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. హిదయతుల్లాపై ఇప్పటికే ప్రకాశం జిల్లా అర్థవీడు, పులివెందుల, మైలవరం పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. అలాగే గైబుసావలీ కూడా పులివెందుల, మైలవరం పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులలో నిందితుడుగా ఉన్నట్లు వివరించారు. వీరిని పులివెందుల కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. వర్షానికి కూలిన మట్టి మిద్దె వేంపల్లె : వేంపల్లె పట్టణం 12వ వార్డు జెండామాను వీధిలో ఉన్న మాబు ఖాతున్కు చెందిన మట్టి మిద్దె గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలింది. ప్రమాదం తప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితురాలు మాట్లాడుతూ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మిద్దె కూలిందన్నారు. వస్తువులు ధ్వంసం కావడంతో దాదాపు రూ.50 వేలు నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసి నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. -
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాయచోటి: రానున్న మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి వరదలు, భారీ వర్షాల విపత్తు నిర్వహణపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు,మండల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారం మేరకు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చామన్నారు.ఆయా శాఖల అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావ్యవస్థలో ఉన్న భవాలను, పాఠశాలలను గుర్తించి ఆ ప్రదేశంలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలపై నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు అలర్ట్గా ఉండేలా చూసుకోవాని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ గుంతలు, కాలువలు, వాగులు, వంకల వద్ద, అధికంగా నీరు ప్రవహించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లుచ తహసీల్దార్లకు సూచించారు. ఏదైనా ప్రమాదం, విపత్తు సంభవించే అవకాశం ఉన్నా, జరిగిన వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్కు కూడా తెలియజేయాలన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ భావన, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ మధుసూదన్ రావు, అడిషనల్ ఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచన నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08561– 293006ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్లో 24 గంటలు సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశామని, సహాయక చర్యలకు పైన ఉన్న నంబర్లో సంప్రదించవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. -
ఇలా అధికారం!
అలా సభ్యత్వం..మదనపల్లె: మదనపల్లె పట్టణం నడిబొడ్డున రూ.కోట్ల ఆస్తులు కలిగిన ది మదనపల్లె సహకార గృహ నిర్మాణ సంఘం ఎన్నికలు నిబంధనల మేరకు జరగలేదన్న వాదన వినిపిస్తోంది. న్యాయస్థానం ఆదేశాలతో ఎన్నిక నిర్వహించామని సహకారశాఖ అధికారులు చెబుతుండగా పోటీ చేయాల్సిన సభ్యుల అర్హతకు సంబంధించిన నిబంధన పాటించలేదన్న చర్చ సాగుతోంది. అగస్టులో సభ్యత్వం పొందిన సభ్యులు నామినేషన్లు వేయడం ఎన్నిక కావడం, దశాబ్దాల తరబడి సభ్యులుగా ఉన్నవారు ఈఎన్నికలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. 2017 తర్వాత ఈ సొసైటీకి ఈనెల 22న ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టగా 29న ఎన్నిక నిర్వహించాలి. ఒక నామినేషన్ ఉపసంహరణతో బి.మహేష్కుమార్, ఎన్.రెడ్డెప్ప, కే.వీరవెంకట శివాజి, బి.శివానందనాయక్, కే.వెంకటాచలపతి, ఎస్.రెడ్డి షంషీర్, యు.నరేష్లు మాత్రమే బరిలో నిలవడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు శుక్రవారం ఎన్నికల అధికారి ప్రకటించారు. శనివారం స్థానిక సహకారశాఖ కార్యాలయంలో చైర్మన్గా రెడ్డి షంషీర్ వైస్ చైర్మన్గా రెడ్డెప్ప, కార్యదర్శిగా మహేష్లను సభ్యులు ఎన్నుకున్నారు. ● సహకార సంఘాలకు సంబంధించి ఏవరైనా సభ్యత్వం తీసుకుంటే వారు ఏడాది లేదా ఆపై వరకు ఆ సంఘ కార్యవర్గ ఎన్నికలో పోటీ చేయడానికి లేదని సహకారశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు సొస్టెటీకి ఎన్నికై న ఏడుగురు గడచిన ఆగస్టులో..రెండునెలల క్రితం సభ్యత్వం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. వీరికి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ● సొసైటీలో 238 మంది సభ్యులు ఉన్నట్టు ఎన్నికల అధికారి రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. వీరిలో 50ఏళ్ల నుంచి సభ్యులుగా ఉన్నవాళ్లు ఉన్నారు. వారికి గుర్తింపుకార్డుల జారీ, లేదా ఎన్నికల నిర్వహణపై సభ్యులకు సమాచారం ఇచ్చారా లేదా అన్నది తెలియడం లేదు. ఈ ఎన్నికకు సొసైటీ సీనియర్ సభ్యులు ఒక్కరైనా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ● సొసైటీకి సంబంధించి గత ఎన్నికలు జరిగిన 2017 తర్వాత ప్రస్తుతం ఎన్నిక జరిగింది. సొసైటీ నిర్వహణ రికార్డులు, ఆస్తుల వివరాలు తమవద్ద లేవని సహకారశాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నికలేకపోవడంతో ఇప్పటిదాకా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ పర్సన్ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆ రికార్డులు ఎవరివద్ద ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అన్నదానికి ఎవరి నుంచి సమాధానం లేదని అంటున్నారు. దాంతో కొత్త పాలకవర్గానికి పాలన వ్యవహారం ఆంతా ఈజీగా లేదు. పోటీకి ఏడాది గడువునిబంధన అవసరఽం లేదట రూ.కోట్ల విలువైన ఆస్తులున్న సొసైటీ రికార్టులు లేవంటున్న అధికారులు -
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో స్నపన తిరుమంజనం జరిపారు. స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. మదనపల్లె సిటీ: వృత్తి విద్యా కోర్సులు చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ మల్లీశ్వరి అన్నారు. శనివారం పాఠశాల 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్లో భాగంగా స్థానిక నీరుగట్టువారిపల్లెలోని చేనేత మగ్గాలను పరిశీలించారు. విద్యతో పాటు విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులు నేర్పిస్తున్నామన్నారు. నీరుగట్టువారిపల్లెలోని చేనేత మగ్గాలు, పవర్లూమ్స్ ద్వారా చీరలు నేయడం, కలర్స్ అద్దడం వంటివి విద్యార్థులకు ఒకేషనల్ ట్రైనర్ మాళవికస్వాతి చూపించి వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.స్వాతి, మేనక,దిల్షాద్, హేమలత తదితరులు పాల్గొన్నారు. చిన్నమండెం: సీఎం చంద్రబాబునాయుడు ఈనె 29న జిల్లాలోపర్యటించనున్నట్లు సీఎంఓ నుంచి సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం చిన్నమండెం మండలంలో జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్లు అధికారులతో కలిసి పర్యటించారు. దేవపట్ల రోడ్డులో హెలీప్యాడ్ ప్రదేశాన్ని, దేవగుడిపల్లె సమీపంలోని పెట్రోల్ బంకు వెనుకవైపున నూతనంగా నిర్మించిన ఇళ్ల ప్రారంభోత్సవం, దేవగుడిపల్లె హరిజనవాడ వద్ద జరిగే బహిరంగ ప్రదేశాలను పరిశీలించా రు. ఈ నెల 29న సీఎం పర్యటన ఉండటంతో అ ధికారులతో కలిసి కలెక్టర్, జేసీలు సమీక్షించారు. రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుల 108 అడుగుల విగ్రహం (అన్నమయ్య థీంపార్కు)లో నిర్మితమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహప్రతిష్ట మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి అన్నారు. శనివారం ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబరు 31 నుంచి నవంబర్ 3వతేదీ వరకు కుంభాభిషేకం సంప్రోక్షణం జరుగుతుందన్నారు. స్వామి విగ్రహప్రతిష్టకు సంబంధించి పుష్పాలను అందచేయాలని దాత ఉద్దండం సుబ్రమణ్యంకు సూచించారు. 3న ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం ఉదయం 9గంటలకుమహాపూర్ణాహుతి, ప్రాణప్రతిష్ట అనంతరం ధ్వజారోహణ,మహామంగళహారతి కా ర్యక్రమాలు ఉంటాయన్నారు. అదేరోజు సాయంత్రం శ్రీనివాస కల్యాణం ఉంటుందని తెలిపారు. మదనపల్లె రూరల్: మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న 260 పోలింగ్ కేంద్రాలను జనాభా ప్రాతిపదికన 325 పోలింగ్ కేంద్రాలుగా పునర్విభజన చేస్తున్నామని, ఈమేరకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి తెలిపారు. శనివారం సబ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ...మదనపల్లె మండలంలో 16, అర్బన్లో 30, నిమ్మనపల్లెలో 6, రామసముద్రంలో 13 పోలింగ్ కేంద్రాలు...1,200 మంది ఓటర్ల కంటే అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి పెంపుదలపై ఏదైనా అభ్యంతరాలుంటే రాజకీయపార్టీల ప్రతినిధులు ఓటరు జాబితాను పరిశీలించి లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేస్తే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ వైస్చైర్మన్ జింకాచలపతి, టీడీపీ బాలుస్వామి, సీపీఎం శ్రీనివాసులు, కాంగ్రెస్ రెడ్డిసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
● వేగానికి లేని కళ్లెం
సాక్షి, రాయచోటి: కర్నూలు సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రైవేట్ స్లీపర్ బస్సు ఘటన భయపెడుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యమో.. అవతల నుంచి వచ్చి పడిపోయిన బైక్కు సంబంధించిన వారి మద్యంమత్తో తెలియదు కానీ... 19 మంది ప్రాణాలు పోవడంతో ప్రస్తుతం ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే కొంత మేర అభద్రతా భావం ఉంటుంది. అయితే మొన్న బస్సు కాలిపోయిన ఘటనతో జిల్లావాసులు ఎక్కడికై నా వెళ్లేందుకు బెంబేలెత్తుతున్నారు. అయితే స్లీపర్ బస్సుల్లో కూడా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక బస్సుకు సంబంధించి ఒకరే డ్రైవర్ ఉండటం ఎమర్జెన్సీ డోర్ల విషయంలో స్పష్టత లేకపోవడం ఇతర అనేక సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. డ్రైవర్లు సెల్ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా.. గుట్కా, పాన్ లాంటివి వాడుతూ నడుపుతున్నారా.. అని తనిఖీ చేసేవారు లేకపోవడం.. బస్సును కూడా ఇష్టారాజ్యంగా స్పీడుతో వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ కూడా చూసీచూడనట్లు వెళ్తుండటం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సులు ఎంత వరకు ఫిట్ జిల్లాలోని మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారు 25 నుంచి 30 బస్సుల మేర వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు రవాణా శాఖ అధికారులు బస్సుల సౌకర్యాలతో పాటు ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించాల్సి ఉంది. అత్యవసర ద్వారాలను మొదలుకొని ఏదైనా ప్రమాదాలు జరిగినపుడు అప్రమత్తం చేసేలా చర్యలు తీసకోవాలి. చాలా వరకు ప్రైవేటు వ్యవహారం కావడంతో బస్సులకు సంబంధించి టైర్లు దెబ్బతినడం... ఇద్దరు డ్రైవర్లు లేకపోవడం... పాన్, గుట్కాలు లాంటివి వాడటం.. ఎవరూ చూడలేదన్న ధీమాతో సెల్ఫోన్ మాట్లాడుతూ.. మద్యం తాగి ఓనర్లకు తెలియకుండా డ్రైవర్లు బస్సులను నడపటం ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ అవసరం జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తిరిగే స్లీపర్ బస్సులతో పాటు నైట్ సర్వీసుల విషయంలో యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎక్కడికక్కడే డ్రైవర్లకు ముఖం కడిగించడం, స్పీడ్ విషయంలో పర్యవేక్షిస్తుండటం, ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చూడటం చేస్తే ఎంతో కొంత ప్రయాణికులకు భద్రత దొరుకుతుంది. రవాణ శాఖ అధికారులే కాకుండా పోలీసులు, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలకు ఉపక్రమిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. ఈ సొసైటీకి రూ.కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖలు, అత్యంత ధనవంతులు నివసించే సోసైటి కాలనీ, సిటిఎంరోడ్డులోని రాజరాజేశ్వరీ ఆలయం వెనుక ఉన్న భూములు, రింగ్రోడ్డు సమీపంలో పాతబైపాస్రోడ్డుపైన భూములు ఉన్నట్టు సహకారశాఖ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణంపై జంకుతున్న జనం బస్సుల ఫిట్నెస్ విషయంలోనూ అయోమయం ఇటీవల గువ్వలచెరువు ఘాట్లో అదుపు తప్పిన ట్రావెల్స్ స్లీపర్ బస్సు జిల్లాలోని రాజంపేట, రాయచోటి, మదనపల్లి, పీలేరు, రైల్వేకోడూరుల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రతి నిత్యం ప్రైవేట్స్లీపర్, ఏసీ బస్సులు నడుస్తుంటాయి. అంతేకాకుండా రైల్వేకోడూరు, రాజంపేట, కడప , మైదుకూరుల మీదుగా హైదరాబాద్ విజయవాడలకు వెళ్లే బస్సులు కోకొల్లలు. మదనపల్లె, రాయచోటిల మీదుగా, పీలేరు ఇతర ప్రాంతాల నుంచి కూడా మదనపల్లె మీదుగా బెంగళూరుకు వెళ్లే బస్సులు ఉన్నాయి. అయితే వేగాన్ని ఎవరూ నియంత్రించడం లేదు. రాత్రి 10 గంటలకు బస్సు కదిలితే తెల్లారే లోపు కేవలం ఆరేడు గంటల్లో ప్రయాణికులను గమ్యస్థానం చేర్చాలన్న పట్టుదలతో వేగంగా వెళ్తున్నారు. బస్సులోనూ డ్రైవర్లు, ఆపరేటర్లు తప్ప ఓనర్లు ఉండరు. అంతేకాకుండా రవాణ శాఖ అధికారులు కూడా ఎక్కడా మధ్యలో వేగం విషయంలో ప్రశ్నించడంలేదు. ఈ నేపథ్యంలో బస్సు సీటు వేడి కూడా ఎక్కువై ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. -
శుభపరిణామం
తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలిలో శ్రీవారి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం. దివంగత సీఎం వైఎస్సార్ పాలనలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ఏర్పాటు తరుణంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి బీజంపడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నమయ్య థీంపార్కును సందర్శించి, ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని కోరారు. అలాగే పూర్తయింది. ఇప్పుడు భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది. –ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట ఆనందదాయకం అన్నమయ్య థీంపార్కులో శ్రీవారి ఆలయం నిర్మించి, విగ్రహప్రతిష్టమహోత్సవాలు చేయడం శుభపరిణామం. ఈ మార్గంలో వెళ్లే యాత్రికులు, భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ వీలు కల్పించడం హర్షణీయం. శ్రీవారి ఆలయం అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అధికారులను కోరాం. ఇప్పటికి విగ్రహాప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించడం ఆనందదాయకం. –చొప్పా గంగిరెడ్డి్, ఏయూ అధినేత, రాజంపేట -
అన్నమయ్య చెంతకు.. గోవిందుడు!
రాజంపేట: అదివో..అల్లదివో..శ్రీహరివాసం..బ్రహ్మకడిగిన పాదం..అంటూ సులువైన పదాలతో కీర్తనలు అలపించిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో తాజాగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం అందుబాటులోకి రానుంది. పర్యాటకులు,యాత్రికులు శ్రీవారి దర్శించుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) కల్పించింది. వైఎస్సార్సీపీ పాలనలో అన్నమయ్య జన్మస్థలం అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయి. ఫలితంగా శ్రీవారి ఆలయం నిర్మితమైంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 3 వరకు శ్రీవారి విగ్రహప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. సాక్షి వరుస కథనాలు శ్రీవారి ఆలయం భక్తులకు అందుబాటులో లేకుండా పోయిందనే ఆవేదనపై సాక్షి వరుస కథనాలను ప్రచురించింది. ఈ మార్గంలో నిత్యం టీటీడీ ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తున్న చూస్తూ పోతున్నారని, భక్తులకు శ్రీవారి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం చేస్తున్నారనే కోణంలో కథనాలు ప్రచురించింది. అవి టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. ఎట్టకేలకు శ్రీవారి ఆలయంలో విగ్రహప్రతిష్ట మహోత్సవాలను తలపెట్టింది. 600 జయంత్యుత్సవాల నుంచి.. అన్నమాచార్యుని 600 జయంత్యుత్సవాలు అప్పటి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి హయాంలో జరిగాయి. 108 అడుగుల అన్నమయ్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహానేత వైఎస్రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత అన్నమయ్య థీంపార్కు అభివృద్ధిని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అటకెక్కించాయి. అప్పటి టీటీడీ పాలకమండలి తాళ్లపాక, అన్నమయ్య థీంపార్కు అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి కృషి ఫలితంగా చైర్మన్ థీంపార్కును సందర్శించారు. ఎన్నికల ముందు అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి హయాంలో మళ్లీ అన్న మయ్య జన్మస్థలి అభివృద్ధిపై దృష్టి సారించారు. అన్నమయ్య ఉద్యానవనంలో దశాబ్బంన్నర తర్వా వైఎస్సార్సీపీ పాలనలో మళ్లీ శ్రీవారి ఆలయ నిర్మాణానికి బీజం పడింది. అప్పట్లో ఎంపిక చేసిన స్థలంలో ఆలయం నిర్మించారు. టీటీడీ రూ.కోటికిపైగా వ్యయం చేస్తోంది. ఈ మార్గంలో తిరుమలకు వెళ్లే దక్షిణభారత యాత్రికులు ముందుగానే అన్నమయ్య జన్మస్థలిలో శ్రీవారిని దర్శించుకోవడం మహాదానందగా భావిస్తున్నారు. తాళ్లపాక, 108 అడుగుల విగ్రహం ప్రాంతం పార్కును టీటీడీ అటవీశాఖ సిద్ధం చేసింది. ఆలయం నిర్మాణం పూర్తికావడంతో త్వరలో ప్రారంభానికి టీటీడీ సన్నద్ధం కావడం శుభపరిణామంగా భక్తులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయం పూర్తి ఎట్టకేలకు శ్రీవారి ఆలయం ప్రారంభం ఈనెల 31 నుంచివిగ్రహప్రతిష్టమహోత్సవాలు -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో నియామకాలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా అనుబంధ విభాగ కమిటీల్లో పలువురిని వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వివరాలు ఇలా.. జిల్లా అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షులుగా కె.రెడ్డెమ్మ, జనరల్ సెక్రటరీలుగా షేక్ జమృత్, బి.శారదారెడ్డి, ఎన్.సుమలత, సెక్రటరీలుగా పి.నాగరాజమ్మ, ఎ.శ్యామల, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా జి.రాజేశ్వరి, సయ్యద్ అమ్మాజాన్, జి.రమాదేవి, ఎస్కే శర్మలు నియమితులయ్యారు. జిల్లా బీసీ విభాగం కమిటీ ఉపాధ్యక్షులుగా బి.రమణ, పి.రెడ్డి భాస్కర్, జనరల్ సెక్రటరీలుగా కె.బాలకృష్ణ, ఎన్వీ చలపతి, యు.రాజగోపాల్, షేక్ నజీర్ మహమ్మద్, సి.తిమ్మయ్య, ఎ.రామ్మూర్తి, సెక్రటరీలుగా ఎం.ఆంజనేయులు, జి.మల్లికార్జుననాయుడు, పీసీ శివకుమార్, జి.బాబు, కె.వినోద్, ఎన్.మునిరామయ్య, కె.ద్వారకనాథ్, జె.విజయ్, సి.సిద్దయ్య, టి.వెంకట రమణ, కె.నారాయణ, కె.హరినాథ్లతోపాటు పది మందిని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమంచారు. జిల్లా క్రిిస్టియన్ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షులుగా సత్యం సర్దార్, జనరల్ సెక్రటరీలుగా ఎం.రాజేష్, ఎస్డబ్ల్యుబీ రాజేష్, జె.శ్యామూల్, ఎం.రవికుమార్, సెక్రటరీలుగా పి.అశోక్, బి.మనోహర్ మయూర్రెడ్డితోపాటు ఐదుగురిని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు. జిల్లా సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షులుగా ఆర్.సుబ్బారెడ్డి, సి.సుబ్రమణ్యం, జనరల్ సెక్రటరీలుగా ఎన్.శివరామిరెడ్డి, ఎస్కే మహమ్మద్ ఖాసిం, ఎం.ఆదిరెడ్డి, యు.ఈశ్వర, పి.చలపతి, సెక్రటరీలుగా ఎన్.గిరిధర్, ఇ.వెంకట రమణారెడ్డి, వై.యుగంధర్నాయుడు, ఎం.సుధాకర్రెడ్డి, ఎన్.నారాయణస్వామితోపాటు 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు. జిల్లా దివ్యాంగుల విభాగం ఉపాధ్యక్షులుగా టి.నయాజ్అలీ, జనరల్ సెక్రటరీలుగా బి.సుధాకర్; షేక్ ఆరీఫుల్లా, జి.మస్తాన్బాషా, సెక్రటరీలుగా ఆర్.నాగార్జున, వై.యర్రప్ప, వి.వెంకట రమణతోపాటు ఆరుగురిని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు. జిల్లా డాక్టర్ల విభాగం ఉపాధ్యక్షులుగా ఇ.వాసుదేవరెడ్డి, అయూబ్ఖాన్, డి.మస్తాన్, వి.రమణ, జనరల్ సెక్రటరీలుగా పి.అంజద్ అలీఖాన్, సీహెచ్ ప్రకాశ్, వై.దామోదర్రెడ్డి, డి.పెద్దిరెడ్డి, సెక్రటరీలుగా బి.రెడ్డి భానుప్రకాశ్, టి.నాగరాజు, కె.రియాజ్ అహ్మద్, టి. ఆంజనేయులు, సి.వెంకటరమణ, టి.మణిదీప్, సి.శివకిశోర్తోపాటు ఐదుగురిని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు. జిల్లా ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం కమిటీ ఉపాధ్యక్షులుగా ఎం. శివతిమ్మారెడ్డి, ఆర్.బసిరెడ్డి, జనరల్ సెక్రటరీలుగా నరసారెడ్డి, ఎన్.పెద్దయ్య, సెక్రటరీలుగా జి.వెంకటయ్య, కృష్ణమూర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్.ఆదినారాయణరెడ్డి, షేక్ ఖాసింపీర్లను నియమించారు. జిల్లా మేధావుల ఫోరం ఉపాధ్యక్షులుగా పి.రమేష్, కె.రామకృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీలుగా సౌమిత్రి, ఎల్.రఘునాథరెడ్డి, జి.సురేంద్రనాథ్రెడ్డి, జి.సురేష్కుమార్రెడ్డి, సెక్రటరీలుగా ఎం.మహేశ్వరరెడ్డి, ఎస్.కుళ్లాయిరెడ్డి, బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.మధుసూదన్రెడ్డి, పి.రమేష్కుమార్రెడ్డి, పి.బ్రహ్మానందరెడ్డి, సి.రాజగోపాల్రెడ్డితోపాటు ఆరుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా ఐటీ విభాగం అధ్యక్షులుగా కె.వెంకట శివ, ఉపాధ్యక్షులుగా ఆర్.నవీన్కుమార్రెడ్డి, సి.వెంకట రమణారెడ్డి, ఎం.జయచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీలుగా జగదీష్, షేక్ ఇమ్రాన్, వై.విక్రమ్రెడ్డి, పి.లోకేష్కుమార్రెడ్డి, కె.ఆంజనేయులు, టి.గణేష్, సెక్రటరీలుగా టి.వెంకట సుబ్బయ్య, సి.శెట్టి వినోద్కుమార్, షేక్ ఉబేదుల్లా, ఎం.మహేశ్వర్రెడ్డి, ఏవీ రఘునాథరెడ్డి, డి.మంజునాథరెడ్డితోపాటు 14 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులుగా ఎస్.పర్వీన్ సుల్తాన, డి.రెడ్డికుమారి, జనరల్ సెక్రటరీలుగా ఆర్.శ్రీవాణి, షేక్ ముబీన, పి.సపుర, ఎం.శ్రీదేవి, డి.రాజకుమారి, ఎస్.రహీదా, సెక్రటరీలుగా కె.శిరోమణి, వి.వినూతబాయి, జె.రాజ్యలక్ష్మి, పి.నాగరాజమ్మ, ఎం.సాయిరా ఖానమ్తోపాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా మైనార్టీ విభాగం ఉపాధ్యక్షులుగా ఎస్.రహమతుల్లా, పి.అంజద్ఖాన్, జనరల్ సెక్రటరీలుగా ఎస్కే వలీచాన్, మహమ్మద్ సలీం, ఎస్.షబ్బీర్, ఎన్.బషీర్ అహ్మద్ఖాన్, పి.రహీం, ఎస్.రియాజ్బాషా, ఎస్కే ఇబ్రహీం, వి.ముస్తాక్, సెక్రటరీలుగా ఎస్.అజీజ్ అహ్మద్, ఎస్.అబ్దుల్లా, ఎస్.అల్లాబకష్, కె.ఫరూఖ్ఖాన్, ఎఫ్ఎస్ షహనాజ్ బేగం, ఎస్.కరీముల్లా, ఎస్.ఖాదర్వలీ, ఎస్కే మురాషావలీ, బి.జబీవుల్లాఖాన్, ఎస్.నిజాం, ఎస్.రహమతుల్లా బాషా, ఎం.గౌస్బేగ్, ఎస్. నాసిర్ వలీతోపాటు 11 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా మున్సిపల్ విభాగం ఉపాధ్యక్షులుగా ఎన్.ఈశ్వరయ్య, కె.ప్రసాద్బాబు, జనరల్ సెక్రటరీలుగా ఎస్.అలీం, ఎన్.చంద్రమౌలాల్రెడ్డి, ఆర్.శివయ్య, ఎం.సుధాకర్, ఎం.హేమంత్నాయక్, ఎం.హబీబుల్లాఖాన్, సెక్రటరీలుగా ఎం.సుబ్రమణ్యం, డి.నాగేంద్ర, ఎస్వీ రమణ, ఎన్.నవాజ్ అలీఖాన్, ఎస్కే ఖాదర్వలీ, కె.వెంకట ప్రసాద్బాబుతోపాటు 14 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఉపాధ్యక్షులుగా ఎస్కే ఆబిద్, బి.శివారెడ్డి, జనరల్ సెక్రటరీలుగా ఎస్.మహబూబ్బాషా, పి.కృష్ణారెడ్డి, ఎ.లోకనాథ్రెడ్డి, ఎం.శ్రీనివాసులురెడ్డి, పి.కేశవరెడ్డి, ఎస్.బసిరెడ్డి, కె.కోదండరామిరెడ్డి, సెక్రటరీలుగా డి.రెడ్డిమోహన్రెడ్డి, ఎన్.మస్తాన్; ఎల్.నాగమోహన్రెడ్డి, జె.మోహన్రాజ్, బి.రెడ్డెప్పరెడ్డి, సీకే యర్రంరెడ్డి, కె.దేవేంద్రరెడ్డి, వి.రామాంజులరెడ్డి, కరీముల్లాతోపాటు 13 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా వి.షమీరుల్లా, టి.విశ్వనాథ్, జనరల్ సెక్రటరీలుగా కె.రెడ్డెయ్యనాయుడు, ఎస్కే ఇంతియాజ్బాషా, షేక్ మునీర్, ఆర్.రమేష్బాబు, టి.మల్రెడ్డి, బి.శంకర్రెడ్డి, సెక్రటరీలుగా ఎం.నందకిశోర్రెడ్డి, కె.ప్రవీణ్కుమార్రెడ్డి, బి.వెంకటేశ్వరప్రసాద్రెడ్డి, ఆర్.రామ్మోహన్రెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి, జి.రవీంద్రారెడ్డి, పి.అజ్మతుల్లాఖాన్తోపాటు 11 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులుగా కె.వెంకట రమణారెడ్డి, ఆర్.కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీలుగా పి.సుబ్బరామిరెడ్డి, ిసీఓ జయరామిరెడ్డి, సి.కుసుమ శేఖర్రెడ్డి, ఎ.మహేశ్వర్రెడ్డి, వై.భాస్కర్రెడ్డి, సెక్రటరీలుగా టి.రాజశేఖర్రెడ్డి, పి.శివ, ఎ.జనార్దన్రెడ్డి, జి.భాస్కర్రెడ్డి, కె.రామచంద్రారెడ్డి, ఎం.ద్వారకనాథరెడ్డి, వై.రెడ్డెప్పరెడ్డి, కె.నాగేశ్వర్నాయడు, ఎం.మోహన్రెడ్డి, సి.హర్షవర్దన్రెడ్డి, బి.వెంకట రమణారెడ్డి, ఎం.జగన్మోహన్, పి.మస్తాన్రెడ్డి, టి.నరసింహారెడ్డి, పి.సుధీర్కుమార్రెడ్డి, పీవీ మల్లికార్జునరెడ్డిలతోపాటు 11 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులుగా జి.నాగార్జున, జనరల్ సెక్రటరీలుగా జి.మణి, టి.రాజన్న, జి.పరమేశ్వరప్రసాద్, పి.గంగులయ్య, టి.లక్ష్మినారాయణ, సెక్రటరీలుగా కె.పెంచలయ్య, బి.శివశంకర్, పి.బలరాం, వి.ఆదిత్యరాం,వి.శ్రీహరి, బి.రవీంద్రబాబు, పి.రెడ్డెప్పతోపాటు 13 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షులుగా బి.రాజబాబు, ఎన్.రాజశేఖర్రెడ్డి, ఎన్.రెడ్డిబాబు, జనరల్ సెక్రటరీలుగా జి.మహేష్రెడ్డి, పి.ఓం ప్రకాశ్, ఎస్.మహమ్మద్ యాసిన్, ఎం.మధుసూదన్రెడ్డి, ఎన్.జీవన్, సెక్రటరీలుగా వై.శశిధర్రెడ్డి, డి.శ్రీనివాసులు, ఎ.సోమశేఖర్రెడ్డి, సి.రామలింగారెడ్డి, కె.చంద్రశేఖర్, జి.హరీష్, ఆర్.హరికృష్ణ, కె.సురేష్బాబు, జి.అనిల్కుమార్, కె. కల్యాణ్కుమార్, పి.సతీష్కుమార్తోపాటు 11 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా ఎస్టీ విభాగం ఉపాధ్యక్షులుగా బి.సురేష్నాయక్, జనరల్ సెక్రటరీలుగా బి.రామాంజులనాయక్, ఎస్.పెద్దయ్య, పి.అమరేంద్రనాయక్, బి.రమేష్, ఎం.శంకర్ నాయక్, సెక్రటరీలుగా ఎం.దేవేంద్రనాయక్, వి.సుధాకర్, ఎ.ధనలక్ష్మి, బి.ప్రేమ్కుమార్ నాయక్, ఎం.శంకర్నాయక్తోపాటు 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులుగా ఎన్.సునీల్కుమార్రెడ్డి, జనరల్ సెక్రటరీలుగా ఎస్.ఇర్ఫాన్, ఎం.నరేష్, సయ్యద్ ఫైజాన్, కె.పూర్ణచంద్ర, సెక్రటరీలుగా ఆసిఫ్, సీఓ అభివర్షిత్రెడ్డి, జి.భాస్కర్ దర్శన్రెడ్డి, ఎస్కే షాకీర్, ఎస్.ఫైరోజ్ బాషా, డి.ఇమ్రాన్, జి.మనోజ్కుమార్, ఎన్.చంద్రశేఖర్, బి.శివాంజి, ఎం.లోకనాథంరెడ్డి, కె.చరణ్మోహన్రెడ్డితోపాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులుగా డి.మహేశ్వర, జనరల్ సెక్రటరీలుగా బి.హరికృష్ణ, పి.ఫైరోజ్ఖాన్, ఎస్కే బావాజాన్, కె.వంశీకర్రెడ్డి, ఎస్.కార్తీక్, ఎం.రాఘవేంద్ర, సెక్రటరీలుగా ఎస్.నవాజ్జాన్, వి.సిరాజ్బాషా, ఎం.అస్లం అలీఖాన్, జె.సంజీవరెడ్డి, బి.శ్రీకాంత్యాదవ్, సి.శివకుమార్రెడ్డి, ఎం.ద్వారకనాథరెడ్డి, ఆర్.జనార్దన్రెడ్డి, శరత్తోపాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా వలంటీర్స్ విభాగం ఉపాధ్యక్షులుగా ఐ.చిన్నరెడ్డెప్ప, ఎం.కృష్ణ చరణ్, జనరల్ సెక్రటరీలుగా ఎ.జగదీశ్వర్రెడ్డి, ఎస్.షాహిద్బాష, ఎం.షోయబ్ అలీఖాన్, జి.యోగేంద్రనాథ్రెడ్డి, ఎస్.జాకీర్ షరీఫ్, ఎస్.నయీం, సెక్రటరీలుగా ఎం.శివానందరెడ్డి, వై.నాగరాజ, పి.సాయిరాం, ఐ.కార్తీక్, పి.శంకర్, జి.గిరీష్, డి.సురేష్బాబు, వై.ధనుంజయరెడ్డి, ఎస్.శెట్టి రెడ్డికుమార్తోపాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా చేనేత విభాగం ఉపాధ్యక్షులుగా ఎంఎన్ ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీలుగా టి.సుబ్రమణ్యం, డి.రామాంజనేయులు, ఎం.రామ్మోహన్, సెక్రటరీలుగా ఎస్.వెంకటసుబ్బయ్య, బి.మధు, జి.వెంకట రమణతోపాటు ఏడుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా కె.దివ్యకుమార్రెడ్డి, పి.ద్వారకనాథరెడ్డి, జనరల్ సెక్రటరీలుగా పి.గుణయాదవ్, ఎన్.ఖాదర్వలీ, సి.నాగేంద్రకుమార్; ఎం.భువనేశ్వర్రెడ్డి, వి.వెంకట రమణారెడ్డి, కె.వెంకట హరిప్రసాద్, డి.మంజునాథ్, సి.ధనుష్కుమార్రెడ్డి, సెక్రటరీలుగా ఎస్కే మహమ్మద్ అలీ, తోట పవన్తేజ, ఎన్.సునీల్కుమార్రెడ్డి, ఎన్.నాగేంద్రబాబు, సి.సాయిశరణ్రెడ్డి, ఎస్.శ్రీకాంత్రెడ్డి, ఎం.కిరణ్, డి.రఘు, ఎస్కే ఫరూఖ్బాషా, ఆర్.రాజశేఖర్రెడ్డితోపాటు 16 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. జిల్లా వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షులుగా డి.భాస్కర్, టి.షావత్అలీఖాన్, జనరల్ సెక్రటరీలుగా ఎ.హరినాథ్, ఎస్.షఫీ, ఎస్ఎండీ కరీముల్లా, ఎన్.రమణారెడ్డి, సెక్రటరీలుగా ఎన్.నరసింహులు, పి.ఖైజర్ఖాన్, ఇ.వెంకట సిద్దమనాయుడుతోపాటు ఏడుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమితులయ్యారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● ఎంపీ పీవీ మిథున్రెడ్డి రాజంపేట: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట ఎంపీ, లోక్సభ ఫ్లోర్లీడర్ పీవీ మిథున్రెడ్డి గురువారం కోరారు. వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు, ఆరోగ్యసమస్యలు సంభవించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయపొలాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. గుంతలు, చెరువులు,ఏర్ల వద్దకు యువత వెళ్లరాదన్నారు. ఒంటిమిట్ట: గత రెండు రోజులుగా ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటలు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సరఫరా అందించడంలో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడప జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ సిబ్బందికి సూచించారు. గురువారం మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ..ప్రజల భద్రత, సేవల పునరుద్ధరణ కోసం ఏపీఎస్పీడీసీఎల్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సప్,హెల్ప్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ ఉదయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసు వ్యవస్థపై విశ్వాసం పెంచాలి
పుల్లంపేట : పోలీసుల పనితీరు తమ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచేలా ఉండాలని ఏఎస్పీ మనోజ్ రాంనాథ్హెగ్డే అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల సానుకూలంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రాత్రివేళల్లో గస్తీ ముమ్మరం చేయాలన్నారు. కేసుల పరిష్కారంలో సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించరాదన్నారు. అలాగే స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం ఇటీవల రశ్రీరాములపేట గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ విషయమై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు గురించి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. కొత్తపేట సర్పంచ్ మణికంఠను అడిగి గొడవకు దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. ఏఎస్పీ వెంట రాజంపేట రూరల్ సీఐ రమణ, ఎస్ఐ శివకుమార్ ఉన్నారు. -
కార్తీక మాసంలో భక్తుల కోసం విశేష ఏర్పాట్లు
కడప కోటిరెడ్డిసర్కిల్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాయలసీమ ప్రాంతాల్లోని వివిధ శైవ క్షేత్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటుచేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ ఈడీ పైడి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా నుంచి 60 బస్సు సర్వీసులు, అన్నమయ్య 56, తిరుపతి 10, చిత్తూరు 20, కర్నూలు 110, నంద్యాల 127, అనంతపురం 66, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 102 బస్సులు నడపనున్నామన్నారు. భక్తులకు శైవ క్షేత్రాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని, సురక్షితంగా ప్రయాణించాలని ఆయన సూచించారు. అలాగే దూర ప్రాంతాల వారికి ఆయా బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు. కడపజోన్ నుంచి 551 సర్వీసులు ఆర్టీసీ కడపజోన్ ఈడీ పైడి చంద్రశేఖర్ -
పిడుగుపాటుకు గేదె మృతి
రామాపురం : రామాపురం మండలం, సుద్దమళ్ల పంచాయతీ దిగువ దళితవాడకు చెందిన పెద్దివీటి కృష్ణయ్య అనే రైతుకు చెందిన గేదె గురువారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, పిడుగుల ప్రభావంతో మృతి చెందింది. గేదె ద్వారా పాలు విక్రయించుకుని కుటుంబాన్ని పోషించుకునే వాడినని ఇప్పుడు జీవనాధారం ప్రశ్నార్థకమైందని రైతు వాపోయాడు. రూ.50 వేలు విలువ చేసే గేదె మృతి చెందడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. పిడుగుపాటుతో గుడిసె దగ్ధంవీరబల్లి : మండలంలోని దిగువరాచపల్లి గ్రామ సమీపంలోని ఊట్లకుంట వద్ద బొంగాని వెంకటరమణ అనే రైతు తన పొలంలో ఏర్పాటు చేసుకున్న గుడిసైపె బుధవారం అర్థరాత్రి పిడుగు పడింది. దీంతో గుడిసె దగ్ధమైంది. గుడిసెలో నిల్వ ఉన్న వ్యవసాయ పరికరాలు, పనిముట్లు, ఎరువులు అగ్నికి ఆహుతయ్యాయి. భారీ వర్షం కురుస్తుండటంతో రైతు వెంకటరమణ పొలం నుంచి ఇంటికి వెళ్లాడు. వెళ్లిన కాసేపటికి గుడిసైపె పిడుగు పడింది. ఆసమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. -
సీటీఎం రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
మదనపల్లె రూరల్ : మండలంలోని సీటీఎం రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గురువారం స్టేషన్లోని రెండో ఫ్లాట్ఫాంపై సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించిన రైల్వే అధికారులు పరిశీలించారు. మృతి చెందినట్లు నిర్ధారించుకుని కదిరి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్బాషా, ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రైల్వే డాక్టర్లతో కలిసి పరిశీలించారు. కాగా, గుర్తుతెలియని వ్యక్తిది సహజ మరణమేనని, అనారోగ్య కారణాలతో చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే రైల్వే హెడ్కానిస్టేబుల్ మహబూబ్బాషా ఫోన్ నెంబర్.9133109537ను సంప్రదించాలన్నారు. -
అడిగేదెవరు.. ఆపేదెవరు
మదనపల్లె: బి.కొత్తకోట మండలంలోని బి.కొత్తకోట–మదనపల్లె రహదారిపై ఉన్న గుమ్మసముద్రం చెరువు పనులను అధికార టీడీపీ నేతల అండతో అడిగేవారు లేరని ఇష్టారాజ్యంగా చేపట్టారు. . కట్ట, మొరవల సాంకేతిక స్థితి ఎలా ఉందో అలాగే అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంది. సాంకేతిక మార్పులతో పనులు చేయడం ఎట్టి పరిస్థితుల్లో వీలుకాదు. అయితే తాము చేసిందే పని అన్నట్టుగా కొందరికి ప్రయోజనం కలిగించాలని ఎలా పడితే అలా చేశారు. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమేకాక మొరవ ఎత్తు పనిని పగలగొట్టారు. ● మండలంలోని ఒకట్రెండు పెద్ద చెరువుల్లో గుమ్మసముద్రం చెరువు ఒకటి. దీని కుడివైపు మొరవ, దానికి ముందు భాగంలో కాంక్రీట్ పనులను రూ.28.50 లక్షలతో చేపట్టారు. ఈ మొరవ అక్కడక్కడ దెబ్బతినడం, నీటి ప్రవాహానికి ఇబ్బందికరంగా ఉండటంతో పనులు చేపట్టారు. జలవనరులశాఖ చేపట్టిన పనుల్లో కుడి మొరవ ఎత్తు ఎంతుందో అంతే ఎత్తులో కాకుండా ఒక అడుగు ఎత్తు తగ్గించారని తెలుస్తోంది. ఎత్తు తగ్గించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం తగ్గతుంది. ఇలా చేయడం ద్వారా చెరువు అంచులోని కొందరి పొలాలు నీటిలో మునగకుండా చేశారని అంటున్నారు. ఇదేకాకుండా ఈ మొరవ ఎత్తు ఎందుకు తగ్గించారో అధికారులకే తెలియాలి. అలాగే చెరువు నిర్మాణం ఇప్పటిదాకా మార్పులేని ఎడమవైపు మొరవ ఎత్తును 20 సెంటిమీటర్ల దాకా పెంచారు. ఇక్కడ ఇలా ఎందుకు పెంచారో కూడా అధికారులకే తెలియాలి. సాంకేతికంగా నిర్మాణమై ఉన్న మొరవలను అలాగే ఉంచాలి. వాటిని తగ్గించడం, పెంచడం అనేది చెరువు నీటిని సమతుల్యం చేయలేని పరిస్థితి వస్తుంది. దీనివల్ల ప్రమాదరక పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఇసుక బస్తాలు ఎందుకు పెట్టారు కుడి మొరవ ఎత్తు తగ్గిందన్న విషయాన్ని ఆ మొరవపై పెట్టిన ఇసుక బస్తాలు మరింత అనుమానం రేకెత్తిస్తున్నాయి. చెరువు నిండి ప్రవహిస్తుండటంతో మొరవపై ఒకవరసలో ఇసుక బస్తాలను పెట్టారు. దీనివల్ల మొరవ ప్రవాహం ఆగిపోయింది. ఎత్తు తగ్గించడం వల్లే అదే ఎత్తులో ఇసుక బస్తాలు వేశారని అంటున్నారు. అలాగే ఎడమవైపు మొరవ ఎత్తు పెంచడంతో దాన్ని రైతులు రెండుచోట్ల పగులగొట్టి గతంలో మొరవ ప్రవాహం ఎలా జరిగేదో ఇప్పుడు అలాగే జరుగుతోంది. ఇక్కడ మొరవ ఎత్తును ఎందుకు పెంచాల్సి వచ్చిందో అధికారులకే తెలియాలి. తగ్గించలేదట కుడిమొరవ ఎత్తు తగ్గించలేదని ఈఈ సురేష్బాబు, ఏఈ సతీష్లు చెప్పారు. ఎడమ మొరవకు ఎత్తు పెంచాలని రైతులు కోరినట్టు వారు చెప్పగా, ఇప్పుడు ఆ ఎత్తును రైతులు ఎందుకు తొలగించారో చెప్పలేదు. కుడిమొరవపై ఇసుక బస్తాలను వేసింది హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులని చెప్పుకొచ్చారు. ఈ పనిని ఏ విధంగా కాంట్రాక్టర్కు అప్పగించారో తనకు తెలియదని ఏఈ సతీష్ చెప్పడం కొసమెరుపు. ఎత్తు తగ్గిన కుడిమొరవపై ఇసుకబస్తాలు ఎడమ మొరవపై సిమెంటుతో పెంచిన ఎత్తు గుమ్మసముద్రం చెరువు పనులు ఇష్టారాజ్యం రూ.28 లక్షలతో మొరవల పనులు కుడి మొరవ ఎత్తు తగ్గించి,ఎడమ మొరవ ఎత్తు పెంచారు గుమ్మసముద్రం చెరువు అభివృద్ధికి సంబంధించి రూ.32 లక్షలతో పనులు చేపట్టేందుకు అధి కారులు చర్యలు తీసుకున్నారు. దీనికి టెండర్లు నిర్వహించగా సురేంద్రనాఽథ్రెడ్డి పని దక్కించుకున్నారు. అయితే టెండర్దారునికి అప్పగించాల్సిన పనిని అధికారులు కుంటిసాకులతో రద్దు చేసేశారు. తర్వాత ఇదే పనికి టెండర్తో పనిలేకుండా రాయచోటికి చెందిన శ్రీనివాసులు అనే కాంట్రాక్టర్కు రూ.28.50 లక్షలకు పనిని అప్పగించారు. దీంతో పని ఇష్టమొచ్చినట్టు చేసి పర్సంటేజీలను ఓ టీడీపీ నేతతో కలిసి వాటాలు వేసుకున్నారని విస్త్రృత ప్రచారం జరుగుతోంది. జలవనరులశాఖ వర్గాల్లోనూ ఇదే అంశం చర్చించుకుంటున్నారు. -
కళా ఉత్సవ్ పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా విద్యార్థులు
రాయచోటి జగదాంబసెంటర్: విజయవాడలోని మురళి రిసార్ట్స్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ –2025 పోటీలలో ఉమ్మడి కడప జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని కళా ఉత్సవ్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఎం.నర్సింహారెడ్డి తెలిపారు. ఈ పోటీలకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడం, కళల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించడానికి విద్యార్థులకు వేదికను అందించడం, ప్రాంతీయ స్థాయిలో కళలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో కళా ఉత్సవ్ –2025 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గాత్ర, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, కథాకథనం పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా నుంచి 23 మంది పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కార్ట్ ఉపాధ్యాయులు భ్రమరాంబ, ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు. -
●బహుదా ప్రాజెక్ట్లో పెరిగిన నీటిమట్టం
సాక్షి రాయచోటి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉదయం కొద్దిసేపు ఎండ కాసినా ఉపశమనం లభించిందనుకున్న లోపే వర్షం కురుస్తోంది. మూడు, నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండడంతో సాగులో ఉన్న పంటలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. పంట పొలాల్లో నీరు ఉండడంతో పొలంలోకి వెళ్లడానికి కూడా అవకాశం లేదు. దీంతో రెండు, మూడు రోజుల తర్వాత పరిస్థితిని బట్టి అంచనా వేసేందుకు ఉద్యానశాఖతోపాటు వ్యవసాయశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.తుపాను ప్రభావం మరో రోజు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ● జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పండ్ల తోటలతోపాటు సాధారణ పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు టమాటా పంటకు సంబంధించి తెగుళ్లు ముసురుతుండడంతో రైతులు కాసిన కాయలను పారబోస్తున్నారు. ఎక్కువ రోజులు పొలం తడిగా ఉంటే బొప్పాయితోపాటు అరటి, ఇతర పంటలు కూడా దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల చెట్లు కూడా కుళ్లిపోతాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉన్నఫలంగా వర్షాలు కురుస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోక రైతులు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లోని పండ్ల తోటలతోపాటు వరి తదితర పంటలు నేలవాలాయి. అయితే వర్షం తెరిపి ఇచ్చిన తర్వాత భూమి ఆరిన అనంతరం అధికారులు అంచనా వేసే అవకాశం ఉంది. దెబ్బతింటున్న రోడ్లు: వర్షంతో జిల్లాలోని ప్రధాన రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. ప్రధానంగా కడప–రేణిగుంట జాతీయ రహదారిలో కూడా మళ్లీ గుంతలు మొదటికొచ్చాయి. గతంలో మరమ్మత్తులు చేపట్టినా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో ఎక్కడ చూసినా రోడ్డులో గుంతలు కనిపిస్తున్నాయి. మరోవైపు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని గంగరాజుపోడు, రైల్వేకోడూరు నుంచి మాధవరంపోడు వరకు జాతీయ రహదారిలో కూడా ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడ్డాయి. అలాగే పెనగలూరు, మదనపల్లె, రాజంపేట నియోజకవర్గంలోని పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఎప్పుడు వర్షం వచ్చినా ఎక్కువగా రోడ్లే దెబ్బతింటున్నాయి. ● జిల్లాపై వర్ష ప్రభావం జిల్లాలో మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. గురువారం కూడా పీలేరులో మంచి వర్షం కురిసింది. రాయచోటి, మదనపల్లెలో కూడా వర్షం పడుతూనే ఉంది. రైల్వేకోడూరు, రాజంపేటలలో కూడా తుంపర వర్షం కనిపిస్తోంది. శుక్రవారం కూడా వర్షం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇళ్లలోకి చేరిన నీరు సిద్దవటం: కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని తురకపల్లె గ్రామంలో పలు గృహాల్లోకి వర్షపునీరు చేరింది. విషపురుగులు సంచరిస్తాయేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షానికి నేలకొరిగిన వరి నందలూరు: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నందలూరు మండలంలో దాదాపు 62 ఎకరాలలో వరి పంట నేలకొరిగింది. పొత్తపి, నూకినేనిపల్లె, టంగుటూరు, కుమరునిపల్లె, ఆడపూరు, పాటూరు ప్రాంతాలలో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఒంటిమిట్ట: మండల పరిధిలోని గొల్లపల్లి, పెన్నపేరూరు గ్రామాల్లో కలిపి 7 ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎన్. మంజుల తెలిపారు, చింతరాజుపల్లిలో కేవలం 50 సెంట్లలో వరి పంట నేలకొరిగినట్లు వివరించారు. దీనికి సంబంధించి బాధిత రైతుల వివరాలను సేకరించామన్నారు. -
భూములకు రక్షణ కల్పించండి
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా కలికిరి మండలం పేత్తగడ గ్రామ పంచాయతీ మజరా పాలెంకు చెందిన గుండ్లూరు రాజగోపాల్ తనకు ప్రాణహాని ఉందని, భూములను రక్షించాలని బుధవారం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్కు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమ గ్రామంలో రెండు చింతచెట్లతో సహా సర్వే నెంబర్ 294లో 0.02 సెంట్ల భూమిని 1991లో కొనుగోలు చేశానన్నారు. అయితే ఇదే భూమిపై తమ గ్రామానికి చెందిన బందం గుర్రప్ప, అతని కుమారుడు బందం రాజు అలియాస్ పురుషోత్తంల కన్ను పడిందన్నారు. ఈ విషయమై తనను అనేకమార్లు అడిగినా తాను ఇవ్వనని చెప్పానన్నారు. అయితే ఈ నెల 21వ తేదీన తాను పొలం పనులకు వెళ్లగా బందం గుర్రప్ప, బందం రాజు, బందం రమణ, బందం రమేష్, బందం చెన్నకేశవులు మరికొందరు వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారన్నారు. అంతేకాకుండా తనను బంధించి దాదాపు 40 సంవత్సరాల వయస్సు గల రెండు చింతచెట్లను దౌర్జన్యంగా, అక్రమంగా నరికివేశారన్నారు. దీంతో తమకు దాదాపు లక్ష రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. తనపై దాడి చేసే సమయంలో ప్రాణభయంతో గట్టిగా అరుపులు వేయడంతో పక్కనే ఉన్న మదన, గంగరాజులు వచ్చి వారి బారి నుంచి తనను కాపాడారన్నారు. ఈ సంఘటనపై ఈ నెల 21వ తేదీన కలికిరి తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయం చేయాలని జేసీకి విన్నవించినట్లు బాధితుడు రాజగోపాల్ తెలిపారు. -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
రాయచోటి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 28న తలపెట్టిన నిరసన ర్యాలీకి సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చి నప్పటి నుంచి ప్రభుత్వాలు ఎన్ని మారినా రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్నాయన్నారు. వీటిలో కూడా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మూడు మెడికల్ కళాశాలలు తీసుకువచ్చారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. అందులో ఐదు ప్రారంభమై విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. గత ఏడాది రెండో దశలో మరో ఐదు కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నా మాకు వద్దని లేఖరాసిన దుర్మార్గమైన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు సీఎం అయినా ఒక్క మెడికల్ కళాశాలను తెచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు మెడికల్ కళాశాలలు అప్పచెప్పాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వంలో నడుస్తున్న పనులు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల విషయంలో మొండి వైఖరిని విడనాడి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఆకేపాటి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి, సుండుపల్లి, వీరబల్లి ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. 28న నియోజకవర్గాల్లో ర్యాలీలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి -
యథేచ్ఛగా ఆక్రమణలు.. నిత్యం ప్రమాదాలు!
● ఎన్హెచ్ 340 స్థలాలు కబ్జా ● డ్రైనేజీల ఆక్రమణ.. ఆపై అద్దె వసూళ్లు ● దుకాణాలపై దూసుకెళుతున్న వాహనాలుగుర్రంకొండ : మండలంలోని గుర్రంకొండ, ఖండ్రిగ గ్రామాల్లో జాతీయ రహదారి 340కు సంబంధించి రోడ్డుకిరువైపులా ఉన్న స్థలాలు కబ్జాకు గురయ్యాయి. దీంతో రోడ్డు ఇరుకుగా మారడంతో వాహనాలు దుకాణాలపై దుసుకెళుతున్నాయి. నిత్యం బస్టాండులో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారి 340కి ఇరువైపులా ఉన్న పంచాయతీ, స్మశాన స్థలాలను కబ్జా చేశారు. చివరకు డ్రైనేజి కాలువలను కూడా ఆక్రమించుకొని వాటిపై అద్దెలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో దుకాణాలు నిర్వహించుకొనే విషయమై ప్రతిరోజు బస్టాండులో ఘర్షణలు జరుగుతున్నాయి. అనధికారికంగా 100 దుకాణాలు.. వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందిన గుర్రంకొండ బస్టాండు, ఖండ్రిగ గ్రామాల్లో ఎన్హెచ్ 340కు సంబంధించి కబ్జాకు గురైన స్థలాల్లో సుమారు 100 దుకాణాలను అనధికారికంగా నిర్వహించుకుంటున్నారు. వీటిపై ఆక్రమణదారులు రూ. 3వేలు నుంచి రూ. 6వేలు వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. దుకాణాలపై దూసుకెళుతున్న వాహనాలు.. స్థానిక కోన క్రాస్ నుంచి బస్టాండు మీదుగా గుర్రంకొండ మార్కెట్యార్డు వరకు రోడ్డు కిరువైపులా ఉన్న ఎన్హెచ్ 340 స్థలాల్లో అక్రమంగా దుకాణాలు నిర్వహించుకొంటున్నారు. దీంతో బస్టాండుతో పాటు పలుచోట్ల ఇష్టానుసారంగా దుకాణాలు వెలిశాయి. కనీసం ద్విచక్రవాహనాలు నిలుపుకొనేందుకు కూడా వీలులేకుండా స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో వాహనాలు, లారీలు, ద్విచక్రవాహనాలు అదుపుతప్పి దుకాణాల్లోకి దూసుకెళుతున్నాయి. కారణంగా బస్టాండులో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హోటల్లోకి వాహనాలు దూసుకెళ్లడంతో పలువురికి ప్రాణాపాయం తప్పింది. డ్రైనేజీ కాలువపై అద్దెలు వసూళ్లు.. ఆక్రమణలకు కాదేదీ అనర్హం అంటూ పలువురు ఆక్రమణదారులు బస్టాండులోని డ్రైనేజీ కాలువలను కూడా ఆక్రమించేశారు. ఎన్హెచ్ 340 రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా బస్టాండులో ఇటీవల విశాలమైన డ్రైనేజీలు నిర్మించారు. వీటిని కూడా అక్రమార్కులు వదల్లేదు. వీటిని ఆక్రమించుకొని చిల్లర దుకాణాలు, తోపుడుబండ్లు నిర్వహించుకొనేందుకు అద్దెలకు ఇచ్చారు. చివరకు కాలువలపై రేకుల షెడ్లు కూడా వేసి రూ. 3వేల వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. -
జాతీయ స్థాయి పోటీలో ఏయూ విద్యార్థుల ప్రతిభ
రాజంపేట : కడప కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఎక్స్లియర్–2025 జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యార్థుల మీట్లో అన్నమాచార్య యూనివర్సిటీ పీజీ కాలేజి ఆఫ్ కంప్యూటర్ స్టడీస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ మేరకు వారిని గురువారం ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఏయూ వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి అభినందించారు. మార్కెటింగ్ గేమ్, హెచ్ఆర్ గేమ్, ఫైనాన్స్ గేమ్ పోటీలలో వివిధ ప్రాంతాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధులు పాల్గొన్నారు. ఫైనాన్స్ గేమ్లో భారత్కుమార్, కార్తీక్, కిషోర్ల బృందం రెండవ బహుమతిని దక్కించుకుంది. మార్కెటింగ్ గేమ్లో వరలక్ష్మీ, వర్ష, కావ్య బృందం మూడవ బహుమతిని సాధించారు. కార్యక్రమంలో పీజీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జె.సమతనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఏయూ విద్యార్థులు ప్రతి చోట ప్రతిభను సాధించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. -
ప్రమాణస్వీకారం
సిద్దవటం: సిద్దవటంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో గురువారం శ్రీ నిత్యపూజస్వామి పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చైర్మన్గా జంగిటి రాజేంద్రప్రసాద్, పాలకమండలి సభ్యులుగా పి.మల్లేశ్వరి, పి.వసంత, బి.వెంకటసుబ్బయ్య, వి.కృష్ణయ్య, ఆర్.పార్వతమ్మ, కె.మల్లీశ్వరి, సి.వెంకటసుబ్బయ్య, జె.శివారెడ్డి, కె.రూప, ఎక్స్ ఆఫీషియో సభ్యులు, అర్చకులు రంగసముద్రం సుబ్రమణ్యంశర్మల చేత ఈఓ శ్రీధర్ ప్రమాణస్వీకారం చేయించారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు పాల్గొన్నారు. రాజంపేట: వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా చొప్పా ఎల్లారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మే రకు నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. చొప్పా ఎల్లారెడ్డి గతంలో రాజంపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రవేశాలకు నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైస్ చాన్సులర్ జయరామిరెడ్డి తెలిపారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీతోపాటు డిప్ల మాలో ఓ బ్రాంచ్ పాసైన వారైనా అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థుల కలలను సాకారం చేసే సృజనాత్మక విశ్వవిద్యాలయం ఏఎఫ్యూ అని తెలిపారు. వివరాలకు 99855 88105, 90524 60323 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. మదనపల్లె సిటీ: నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25వతేదీ వరకు గడువు పొడిగించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 7–12–2025న నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పరీక్షకు జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 27వతేదీ, ప్రింటెడ్ నామినల్ రోల్, ఒరిజనల్ ఎన్బీఐ కలెక్ట్ రశీదును డిఈవో కార్యాలయంలో అందజేసేందుకు ఈనెల 29 చివరి తేదీగా పేర్కొన్నారు. డీఈవో లాగిన్లో దరఖాస్తు ధ్రువీకరించేందుకు ఈనెల 31వరకు గడువు ఉందన్నారు. రాయచోటి జగదాంబసెంటర్: పాఠశాల కమిషనర్ ఆదేశాల మేరకు నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8–10వ తరగతులు చదువుతున్న వారికి పోటీలు నిర్వహించాలన్నారు. ● పాఠశాల స్థాయిలో ఈ నెల 24వ తేదీన, మండల స్థాయిలో ఈ నెల 27న, నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 28వ తేదీన పోటీలు ఉంటాయన్నారు. ఉంటుందన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్కరిని ఎన్నుకోవాలి. (ప్రతి డివిజన్కు తప్పనిసరిగా ఒక బాలిక ఉండే విధంగా) రాష్ట్ర స్థాయికి పంపాలి. వీరు రాష్ట్ర స్థాయిలో ఒక రోజు శిక్షణ పొందుతారని డీఈఓ తెలిపారు. మదనపల్లె: తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి ప్రవహిస్తున్నాయని, వాటికి ఎలాంటి ప్రమాదం లేదని జలవనరులశాఖ మదనపల్లె ఈఈ సురేష్బాబు అన్నారు. గురువారం ఆయన మదనపల్లె రూరల్ మండలంలోని కదిరమ్మ చెరువు, మేడిపల్లి చెరువు, వెంకటమ్మ చెరువు, కనికల చెరువులను పరిశీలించారు. కదిరమ్మ చెరువుకు గండి పడిందన్న సమాచారంతో చర్యలు తీసుకున్నామని, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అలాగే మిగిలిన చెరువులు పటిష్టంగా ఉన్నాయని, చెప్పారు. బి.కొత్తకోట: మండలంలోని గుమ్మసముద్రం పంచాయతీలోని గుమ్మసముద్రం, బయ్యప్పగారిపల్లె పంచాయతీలోని మొగసాలమర్రి చెరువులను జలవనరులశాఖ ఈఈ సురేష్బాబు గురువారం పరిశీలించారు. మొగసాలమర్రి చెరువు మొరవ నీళ్లు ప్రవాహానికి అడ్డంకులు ఉండటంతో వాటిని తొలగించే చర్యలు చేపట్టామని సురేష్బాబు తెలిపారు. ఆయనవెంట ఏఈ సతీష్ ఉన్నారు. -
అనుమానం పెనుభూతమై..
కేవీపల్లె : అనుమానం పెనుభూతమై కట్టుకున్నవాడే కాలయముడై భార్యను హతమార్చిన సంఘటన మండలంలోని మారేళ్ల పంచాయతీ కొండకిందపల్లె దళితవాడలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొండకిందపల్లె దళితవాడకు చెందిన ఊటుపల్లె రమణ భార్య యశోదమ్మ (38) బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లి నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆమె ఫోన్లో ఇతరులతో మాట్లాడుతోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున యశోదమ్మను కర్రతో కొట్టి హత్య చేశాడు. అనంతరం రమణ కేవీపల్లె పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కలకడ సీఐ లక్ష్మన్న, ఎస్ఐ చిన్నరెడ్డెప్ప సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్కానింగ్ చేసిన మద్యాన్నే విక్రయించాలి రాయచోటి టౌన్ : మద్యం స్కానింగ్ చేసి అందులో మద్యం సీసాపై ఉన్న ధరలు, ఫ్యాకింగ్ తేదీ, ఏ ప్రాంతంలో తయారు చేశారు అనే విషయాలు అన్నీ కనిపిస్తేనే మద్యం ప్రియులకు విక్రయించాలని అన్నమయ్య జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి మధుసూదన్ వ్యాపారులకు సూచించారు. గురువారం రాయచోటి పట్టణంలోని పలు మద్యం షాపుల వద్దకు వెళ్లి కొనుగోలుదారులకు స్కానింగ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐలు గురుప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం మదనపల్లె రూరల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ(పీపీపీ)ను సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుని తీరుతామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్కుమార్ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన్సమాజ్పార్టీ ఆధ్వర్యంలో అన్నమయ్యజిల్లా మదనపల్లె చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో గురువారం వైద్య పోరాట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ... పేదలకు ఉచిత వైద్యం అందకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలను వైద్యవిద్యకు దూరం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే షాజహాన్బాషా, మెడికల్ కాలేజీ నిర్మాణంలో అవినీతిని అసెంబ్లీలో ప్రస్తావించారే తప్ప ప్రైవేటీకరణ నిలుపుదల చేయాల్సిందిగా ప్రశ్నించకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జడ్జి గుర్రప్ప, రాష్ట్ర కార్యదర్శి విజయ్కుమార్, ప్రభాకర్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల బీఎస్పీ నాయకులు, నియోజకవర్గాల ప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు చింతకొమ్మదిన్నె : స్థానిక చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులైన ఇందిరానగర్కు చెందిన రౌడీషీటర్ చిలకల చాంద్బాషా, అతని అనుచరులైన మరో ముగ్గురు ఎర్రవల్లి అబ్దుల్, షేక్ జాకీర్ హుస్సేన్, వలీ అలియాస్ ఖాదర్ హుస్సేన్లను గురువారం అరెస్టు చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. భార్యను హతమార్చిన భర్త -
పంచాయతీ కార్మికులకు అందని వేతనాలు
● రూ.90 లక్షలు నిధులు గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు ● ఆరు నెలలుగా జీతాలు లేక పంచాయతీ సిబ్బంది అవస్థలురైల్వేకోడూరు : గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో వీధులు శుభ్రపరచడం, మురుగు కాలువలు తీయడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, నర్సరీలో మొక్కలు పెంచడం, చెత్తను సేకరించి డంపింగ్ యార్డులో వేయడం లాంటి పనులను కార్మికులు నిర్వహిస్తున్నా వారికి మాత్రం పూట గడవడం కష్టంగా మారుతోంది. నెల నెల జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలు అందించాలని ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోలేదని వాపోతున్నారు. పంచాయతీలో రూ. 90 లక్షలు నిధులు గోల్మాల్ అయినట్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా కూటమి నాయకుల వర్గపోరుతో ఒక వర్గం వారు ఫిర్యాదు చేస్తే మరోవర్గం వారు నిలుపుదల చేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమగ్ర విచారణ కొనసాగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహించే సమయంలో నిధులు దుర్వినియోగమయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
ఇద్దరు జూదరుల అరెస్ట్
మదనపల్లె రూరల్ : పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. బుధవారం నీరుగట్టువారిపల్లె సమీపంలో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరోవ్యక్తి పారిపోయాడన్నారు. నిందితుల నుంచి రూ.6వేల నగదు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుగూళ్ల మార్కెట్పై తుపాన్ ప్రభావంమదనపల్లె సిటీ : తుపాన్ ప్రభావం పట్టుగూళ్ల మార్కెట్ పడింది. దీంతో మార్కెట్ గూళ్లు రాక వెలవెలబోతోంది. నిత్యం మార్కెట్లో రైతులు, రీలర్లతో సందడిగా ఉంటుంది. గత వారం నుంచి మార్కెట్ గూళ్లు రాలేదు. వర్షానికి తేమ శాతం ఎక్కువ ఉండటంతో పాటు గూళ్లు సరిగా రావు. దీంతో రైతులు మార్కెట్కు గూళ్లు తీసుకురావడం లేదు. ఈనెల 15వతేదీ నుంచి ఇప్పటి వరకు పూర్తిగా గూళ్లు రాలేదు.దీంతో మార్కెట్ బోసిపోయింది. రైలు కింద పడి సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని చిలంకూరు గ్రామానికి చెందిన గురుకిరణ్ (31) అనే సచివాలయ ఉద్యోగి ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ఎర్రగుంట్ల రైల్వే ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చిలంకూరు గ్రామానికి చెంగిన గురుబ్రహ్మ కుమారుడు గురు కిరణ్ ముద్దనూరు మండలం కోడిగాండ్లపల్లి గ్రామంలోని సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఒక బాబు సంతానం. అయితే కుటుంబ సభ్యులు తనను ఒంటరి వాడిని చేశారని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కు వచ్చిన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. -
టమాటా పొలాల్లో నీటిని తీసివేయాలి
మదనపల్లె రూరల్ : అధిక వర్షాలతో టమాటా పొలాల్లో నిలిచిన వర్షపునీటిని నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు కాలువల ద్వారా తీసివేయాలని జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ ఎస్ఎస్వి సుభాషిణి అన్నారు. బుధవారం మండలంలోని కొత్తవారిపల్లె, సీటీఎం గ్రామాల్లో టమాటా పంటలను పరిశీలించారు. వర్షాకాలంలో టమాటా పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు తెలియజేశారు. వర్షాల వల్ల దెబ్బతిన్న టమాటా పంటకు తగిన చర్యలు తీసుకునేందుకు పొలంలో నిలిచిన నీటిని తీసివేయడంతో పాటు మొక్కలకు మట్టిని ఎగదోయాలన్నారు. వర్షాలు ఆగిన వెంటనే 19–19–19 లేదా 13–0–45 లీటర్ నీటికి 5 గ్రాముల సూక్ష్మపోషకాలు 5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పొలాలు ఆరిన వెంటనే నీటిలో కరిగే ఎరువులను ఎకరాకు 5 కిలోలు డ్రిప్ ద్వారా పంపితే, కొత్త చిగురులు వచ్చి కొత్త పూత, పిందె వచ్చే ఆస్కారం ఉందని తెలిపారు. అలాగే ఆకులు, కాయలపై వచ్చే మచ్చల నివారణకు అక్రోబాట్ కంప్లీట్ 1.5గ్రాము.లేదా అమిస్టర్ టాప్ 1 గ్రా, స్ట్రెప్టోమైసిన్ 0.5 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. కలుపు మొక్కలు లేకుండా పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల హార్టికల్చర్ ఆఫీసర్ ఈశ్వరప్రసాదరెడ్డి, సీటీఎం, కొత్తవారిపల్లె హార్టికల్చర్ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు.జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సుభాషిణి -
ముగ్గురి మృతికి కారకుడైన లారీ డ్రైవర్కు జైలుశిక్ష
మదనపల్లె రూరల్ : నిర్లక్ష్యంగా లారీని నడిపి ముగ్గురు యువకుల మృతికి కారకుడైన లారీ డ్రైవర్కు 15నెలల జైలుశిక్ష విధిస్తూ మదనపల్లె ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ సుభాన్ బుధవారం తీర్పు ఇచ్చారు. డీఎస్పీ మహేంద్ర తెలిపిన వివరాలిలా...2021 ఫిబ్రవరి 12 రాత్రి 7.30 గంటల సమయంలో మదనపల్లె–తిరుపతి మార్గంలోని శానిటోరియం ఆస్పత్రి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన శ్రీహరి, తరుణ్కుమార్రెడ్డి, ధనుష్లు ద్విచక్రవాహనంలో వెళుతుండగా, శానిటోరియం వద్ద ఎదురుగా అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన లారీ యువకులను ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘటనపై శ్రీహరి తండ్రి మండపల్లి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు,..తాలూకా పోలీసులు క్రైమ్నెంబర్.45/2021, సెక్షన్.304(ఏ) ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేసి ప్రమాదానికి కారకుడైన రాయచోటి కొత్తపేటకు చెందిన లారీ డ్రైవర్ ఎస్.మహబూబ్బాషాను అరెస్ట్చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.కృష్ణారెడ్డి వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి బి.సుభాన్..నిందితుడు మహబూబ్బాషాకు 15నెలల సాధారణ జైలుశిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కేసు విచారణ వేగవంతంకు కృషిచేసిన మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, తాలూకా సీఐ కళావెంకటరమణ, ఎస్ఐలు జి.చంద్రమోహన్, గాయత్రి, కోర్టు సిబ్బంది జే.శివకుమార్, వినోద్కుమార్లను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు. -
నిబంధనలు ఏఈ ..?
● ఏడు పోస్టులకు ఒక్కడు ● తంబళ్లపల్లె నియోజకవర్గం జలవనరులశాఖలో విచిత్రం మదనపల్లె : జలవనరులశాఖలో ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుసుకోవాలంటే తంబళ్లపల్లె నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మదనపల్లె ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ పరిధిలో తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ శాఖలో నియోజకవర్గాన్ని ఒక సబ్డివిజన్ ఒక్కో దానికి ఒక డీఈఈ, మండలానికి సంబంధించి ఒక్కో మండలానికి ఒక ఏఈ, నీటిపారుదల ప్రాజెక్టులు ఉంటే వాటికి అదనంగా ఒక ఏఈని నియమిస్తారు. ఈ పద్ధతిలో పాలన సాగుతుంది. ఇది సాధారణమైన విషయమే. అయితే తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని మాత్రం ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తోంది. ఎలా చూస్తోందంటే పనిచేస్తున్న వాళ్లని వీళ్లు మా వాళ్లు కాదంటూ సాగనంపేసి..ఒక ఏఈని మాత్రమే ఎంచుకుంది. ఆ ఏఈపైనా ఆరోపణలు ఉన్నా వాటిని డొంట్ కేర్ అంటోంది. ఒకే ఒక్కడు.. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు మండలాలు, పెద్దేరు ప్రాజెక్టు ఉన్నాయి. ఒక్కో మండలానికి ఒక ఏఈ చొప్పున ఏడుగురు ఏఈలను నియమించాలి. పెద్దేరు ప్రాజెక్టుకు ఒక ఏఈ ఉండాలి. అయితే ఈ మొత్తం ఏడుగురు ఏఈ పోస్టులను ఒక్కరికే కట్టబెట్టేశారు. తంబళ్లపల్లె ఏఈగా పనిచేస్తున్న సతీష్కు మిగిలిన బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట మండలాలు, పెద్దేరు ప్రాజెక్టులకు ఏఈగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఇలా నియమించడానికి నిబంధనలు వరిస్తాయో లేదో కాని ఏఈ సతీష్కు మాత్రం వర్తింపజేశారు. ఒక ఏఈకి ఇంకో మండలం అదనంగా ఇవ్వడంలో ఇబ్బందిలేదుకాని పనిచేస్తున్న మండలం కాక మరో ఆరుగురు ఏఈ పోస్టులన్నీ ఆయనకే అప్పగించారు. ఇలాంటి పరిస్థితి పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో లేకపోవడం విశేషం. ఆ ఏఈని పంపేసి.. కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దమండ్యం ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాసులురెడ్డిని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. అప్పటికే తంబళ్లపల్లె ఏఈ సతీష్ పనిచేస్తుండగా ఏఈలు లేనందున ఇద్దరికి మూడు మండలాలను అప్పగించారు. అయితే టీడీపీ నేతలు కుటుంబ బంధాలను కూడా రాజకీయాల్లోకి లాగారు. శ్రీనివాసులురెడ్డి తమకు వద్దంటూ టీడీపీ నేతలు ఆయన్ను ఇక్కడికి నుంచి బదిలీ చేసేశారు. దీనితో మిగిలిన ఆరు పోస్టులను సతీష్కు అప్పగించగా నియోజకవర్గమంతా ఆయనొక్కరే విధులు నిర్వహిస్తున్నారు. బహుశా రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఏడుపోస్టులను ఒక్కరికే అప్పగించడం ఇక్కడే జరిగిందేమో. ఏం జరిగినా దిక్కులేదు నియోజకవర్గంలో ఒకే ఏఈ ఉండటంతో అభివృద్ధి పనుల పర్యవేక్షణ, వర్షాలతో చెరువులకు ప్రమాదం ఏర్పడినా తక్షణ చర్యలు చేపట్టే పరిస్థితులు లేవు. ఇటివల వర్షాలతో చెరువులు నిండి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెరువులు ప్రమాదస్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితులు వస్తే పరిస్థితి ఏటన్నది ప్రభుత్వానికే తెలియాలి. -
డ్యూటీ రోస్టర్ మార్చండి
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సిబ్బందికి డ్యూటీ రోస్టర్ మార్చాలని సూపరింటెండెంట్ రమేష్కు బుధవారం విన్నవించారు. వారికి మద్దతుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి ముబారక్..సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చి చర్చించారు. ఆస్పత్రిలోని ఇన్పేషెంట్, ఓపీ, ఇంటర్నెట్ విభాగాల్లో పనిచేస్తున్న తమకు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు కేటాయించకపోవడంతో పని నేర్చుకునే అవకాశం లేకుండా పోతోందని వాపోయారు. ఏడాదికాలంగా బయట విధులు మాత్రమే నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జీజీహెచ్గా ఉన్న ఆస్పత్రి త్వరలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ కాబోతుందన్నారు. ఆ పరిస్థితిలో తమకు ఇక్కడ విధులు కేటాయిస్తారో లేదోనని, ఒకవేళ ఇతర ఆస్పత్రులకు తమను బదిలీ చేస్తే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అవగాహన లేకపోవడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందరికీ సమానంగా రొటేషన్ పద్దతిలో విధులు కేటాయించాలని కోరారు. గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పించాలికడప రూరల్ : హెడ్ నర్సు నుంచి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతులు కల్పించాలని నర్సింగ్ అసోసియేషన్ నాయకులు ప్రిస్కిల్లా, మనో థెరిస్కోవా తెలిపారు. ఆ మేరకు బుధవారం స్థానిక వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్యకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు చాలా మంది పదవీ విరమణ పొందే దశలో ఉన్నారని తెలిపారు. కనుక హెడ్ నర్సు నుంచి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధమ్మ, అమరావతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో మూడు పందులు మృతి వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ షాక్తో మూడు పందులు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా.. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామ సచివాలయాలకు వెళ్లే దారిలో ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ తీగలు కిందకు జారిపోయి కేంద్రం ఇనుప గేటుకు తగులుకున్నాయి. దీంతో గేటుకు విద్యుత్ ప్రసరించింది. బుధవారం ఉదయం కేంద్రం వద్ద సంచరిస్తున్న మూడు పందులు గేటుకు తగిలి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక వైపు వర్షం కురుస్తుండడంతో పాటు ఆ సమయానికి మనుషులు అటువైపు రాక పోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. పందులు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది.సూపరింటెండెంట్కు ఔట్సోర్సింగ్ సిబ్బంది వినతి -
మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు
సిద్దవటం : మండలంలోని డేగనవాండ్లపల్లి గ్రామానికి చెందిన పెసల అమ్మణ్ణమ్మ(60) బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు పెన్నానది పరిసర ప్రాంతాల్లో ఒంటిమిట్ట సీఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, కడప ఫైర్ డిపార్ట్మెంట్ వారు సదరు మహిళ ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. పెన్నానదిలో విస్తృతంగా గాలింపులు చేపడుతున్నామని సీఐ బాబు తెలిపారు. అమ్మణ్ణమ్మ బుధవారం ఉదయం ఇంటి నుంచి గంప, కొడవలి తీసుకొని పొలం వద్దకు గడ్డి కోసం వెళ్లింది. ఆమె మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబీకులు పొలం వద్దకు వచ్చి చూడగా అక్కడ కనిపించలేదు. పెన్నానది ఒడ్డున గంప కొడవలిని చూసి నదిలో దూకిందేమోనన్న అనుమానంతో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం వచ్చారు. ఈ మేరకు ఒంటిమిట్ట సీఐ బాబు, రెస్క్యూటీంను రప్పించి వృద్ధురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. మిస్సింగ్ అయిన మహిళ భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఇద్దరికీ వివాహమైంది. -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
రాయచోటి టౌన్ : రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి వైద్యులకు సూచించారు. బుధవారం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సూపరిటెండెంట్ డాక్టర్ డేవిడ్ సుకుమార్ ఆధ్వర్యంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో కార్పోరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తీర్చి దిద్దుతామని చెప్పారు. అంతకు ముందు మంత్రిని ఆస్పత్రి కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఆస్పత్రి కమిటీ కమిటీ సభ్యులు ఖాదర్ బాష, మహమ్మద్, నిరంజన్ నాయుడు, లక్ష్మిదేవి, ఏపీఐఐసీ డైరెక్టర్ కొండా భాస్కర్రెడ్డి, నాయకులు బోనమల ఖాదర్ వలి, ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట
● అన్నమయ్య థీంపార్కులో శ్రీవారి ప్రసన్నం ● ఈనెల 31 నుంచి 3 వరకు విగ్రహప్రతిష్ట మహోత్సవాలురాజంపేట : తాళ్లపాక అన్నమాచార్యుల 108 అడుగుల విగ్రహం (అన్నమయ్య థీంపార్కు)లో నిర్మితమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఎట్టకేలకు శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహప్రతిష్ట కానున్నది. టీటీడీ సన్నాహాలు చేపట్టింది. ఈమేరకు బుధవారం టీడీపీ పీఆర్వో రవి విగ్రహప్రతిష్టమహోత్సవాల వివరాలను తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబరు 3 తేదీ వరకు వెంకటేశ్వరస్వామి విగ్రహప్రతిష్ట మహోత్సవాలలో కుంభాభిషేకం సంప్రోక్షణం చేస్తారు. 31 సాయంత్రం యజమాన సంకల్పం, వివ్వక్సేన ఆరాధనంము, యాగ సంకల్పం, రక్షా బంధనంము, వాస్తు హోమం, పంచగవ్వప్రోక్షణం, మృత్యంగ్రహణం, అంకుర్పారణం చేపట్టనున్నారు. నవంబర్ 1న ఉదయం భగవతుపణ్యాహం, మానోనాత్మన శాంతిహోమం, మహాకుంభరాధానం, ద్వాదశాక్షర, అష్టాక్షర, షడక్షర, విష్ణుగాయత్రీ పంచసూక్తపూర్వకమూర్తి హోమం, వేద, ప్రబంధాది పారాయణములు, పూర్ణాసుతి, శాత్తుమర, తీర్థగోష్టి చేపడతారు. సాయంత్రం మూర్తిహోమం, వేద, ప్రబంధం, విష్ణుసహస్రనామ పారాయణములు, జలాధివాసనము, పూర్ణాహుతి, బలిశాత్తుమొర నిర్వహించనున్నారు. 2న ఉదయం భగవత్పుణ్యాహం, విమానగోపుర, ధ్వజప్రసాదాములకు ఛాయాధివాసం, కర్మాంగస్నపనుము, నేత్రోనిమ్మలనం, మూర్తి హోమం, వేదాది పారాయణములు, పూర్ణహుతి, మహిర్నివేద, శాత్తుమొర, సాయంత్రం చతుఃస్ధానార్చన, శయ్యాదివాసం, జీవాధితత్వన్యాసహోమం, పంచసూక్త హోమం, పూర్ణాహుతి, గోష్ఠి చేపట్టనున్నారు. 3న ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం ఉదయం 9గంటలకు మహాపూర్ణాహుతి, మహాకుంభప్రక్షణ, ప్రాణప్రతిష్ట అనంతరం ధ్వజారోహణ, మహార్నివేదన, మహామంగళహారతి తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదేరోజు సాయంత్రం 6గంటలకు శ్రీనివాస కళ్యాణోత్సవం, ప్రాకారోత్సవం, ధ్వజావరోహణంతో ప్రతిష్ట కుంబాభిషేక సంప్రోక్షణం ముగియనున్నదని టీటీడీ పీఆర్వో తెలియజేశారు. -
విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలి
రాజంపేట:పోలీసులు విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంలోని రాజంపేట అర్బన్ పీఎస్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పోలీసు వ్యవస్థపై విశ్వాసం పెంచాలన్నారు.నేరాల విచారణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంచాలన్నారు.గస్తీ చర్యలను బలోపేతం చేయాలన్నారు. ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా నమోదు చేయాలన్నారు. రాజంపేట ఎఎస్పీ మనోజ్రామ్నాథ్ హెగ్డే, సీఐ నాగార్జున, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎఎస్ఐ ఖాసీం స్టేషన్సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం స్టేషన్లోని రికార్డులను ఎస్పీ పరిశీలించారు.సిబ్బందిపనితీరుగురించి ఆరా తీశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి చిట్వేలి: స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, కేసుల పురోగతిలో వేగంగా పనిచేయడం తప్పనిసరి అని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. బుధవారం జిల్లా సరిహద్దులో ఉన్న చిట్వేలి పోలీసు స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ భవనం పాతది కావడంతో మరమ్మత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలించారు.అనుంపల్లి చెక్పోస్టు సరిహద్దులో ఉన్నందున నిరంతరం నిఘా ఉంచాలని, అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో రాజంపేట ఏఎస్ఐ పి మనోజ్ రాంనాథ్ హెగ్డే, ఎస్ఐ నవీన్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
హరహరమహాదేవ.. శంభోశంకరా
పుష్పాలంకరణలో రామలింగేశ్వరుడు స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు రాజంపేట టౌన్/రాజంపేట రూరల్ : కార్తీక మాసం ప్రారంభం కావడంతో జిల్లాలోని దీంతో శైవక్షేత్రాల్లో భక్తుల సందడి కనిపించింది. భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేకువ జాము నుంచే పెద్దఎత్తున శివాలయాలకు తరలి వచ్చారు. అనేక మంది మహిళలు దీపాలను వెలిగించారు. హత్యరాల వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో, నదీపరివాహక ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేశారు. పలు ప్రాంతాల్లో శివాలయాల్లోని శివలింగాలకు క్షీరాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్దప్రసాదాలను అందచేశారు. కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకొని శివాలయాకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. -
కమనీయం..కల్యాణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి కల్యాణోత్సవం బుధవారం టీటీడీ వారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో కల్యాణమండపం వద్ద చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు.రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించారు.ముత్యాల తంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. కల్యాణోత్సవం సందర్భంగా యజ్ఞహోమాలు నిర్వహించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయఅర్చకులు గోపాలాబట్టర్, కృష్ణస్వామి, గోకుల్స్వామి, రాజుస్వామి, టీటీడీ అధికారులు పాల్గోన్నారు. -
‘మిట్స్’ను సందర్శించిన అమెరికన్ ప్రతినిధులు
కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీని అమెరికన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ సీఈఓ ప్రసాద్ మావుదురి, విద్య, కార్పొరేట్ అలయన్స్ అసోషియేట్ వైస్ చాన్స్లర్ చంద్రదశక బుధవారం సందర్శించారు. విద్య, పరిశోదన కార్యక్రమాలు, అధ్యాపక మార్పిడి, విద్యార్థుల అభివృద్ధి అవకాశాలు వంటి వాటిపై పరస్పర సంభావ్య సహకారాలను అన్వేషించడం ఈ సందర్శన లక్ష్యమని వీసీ యువరాజ్ తెలిపారు. 28నుంచి సివిల్ సర్వీస్ క్రీడాపోటీలకు ఎంపికలు రాయచోటి టౌన్ : రాష్ట్ర క్రీడా అభివృద్ధి సంస్థ(శాప్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల సర్వీస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డు (సీసీఎస్సీ అండ్ ఎస్బీ) వార్షిక క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాస్థాయిలో ఈనెల 28 నుంచి 30 వరకు ఎంపిక పోటీలు జరగనున్నాయి. రాయచోటి నక్కవాండ్లపల్లె క్రికెట్ స్టేడియం(డీఎస్ఏ)లో పోటీలు జరుగుతాయని జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి జి, చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 19 క్రీడా విభాగాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. ఇందులో పాల్గొనదలచిన ఉద్యోగులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ ఎంపికల ద్వారా రాష్ట్ర స్థాయి పోటీలు నవంబర్ 5నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఎంపిక కోసం వచ్చేవారు డిపార్టమెంట్ ఐడీ కార్డు,ఆధార్ కార్డు తప్పని సరిగా తీసుకురావాలని కోరారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక మదనపల్లె సిటీ : జాతీయస్థాయి అండర్–14 బాలికల ఫుట్బాల్ పోటీలకు మదనపల్లె మండలం అడవిలోపల్లికి చెందిన రాజ్రోహన్రెడ్డి ఎంపికయ్యారు. ఆగస్టు నెలలో రాజమండ్రిలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఈనెల 26 నుంచి చత్తీస్గడ్లోని నారాయణపూర్లో జరిగే జాతీయ చాంిపియన్షిప్ పో టీల్లో పాల్గొంటారని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్కుమార్, మురళీధర్ తెలిపారు. విద్యార్థికి ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జాన్ కమలేష్, సంయుక్త కార్యదర్శులు మహేంద్రనాయక్, పీడీలు అంజనప్ప, మహేంద్ర, అభిలాష్ రోహన్, నరేష్ అభినందనలు తెలిపారు. హ్యాండ్బాల్ జట్టు ఎంపిక వాయిదా మదనపల్లె సిటీ : స్థానిక బీటీ కాలేజీలో గురువారం జరగాల్సిన అండర్–14,–17 బాల,బాలికల హ్యాండ్బాల్ జిల్లా జట్ల ఎంపిక వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శులు నాగరాజు,ఝూన్నీరాణి బుధవారం తెలిపారు. అధిక వర్షం కారణంగా వాయిదా వేసిన ట్లు చెప్పారు. తదుపరి తేదీని ప్రకటిస్తామన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా కేంద్రమైన కడపతోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల డిపోల నుంచి జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు 100 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27, నవంబరు 3, 10, 17 తేదీలలో కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలకు బస్సులు నడపనున్నామన్నారు. కడప జిల్లాలోని పొలతల, నిత్యపూజకోన, పుష్పగిరి, బ్రహ్మంగారిమఠం, లంకమల, అగస్త్యేశ్వరకోన, కన్యతీర్థం, నయనాలపుకోనతోపాటు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, అరుణాచలం, పంచరామాలు, త్రిలింగ దర్శనాలకు ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడపనున్నామన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కడప, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, రాజంపేట డిపోల పరిధిలో పనిచేస్తున్న వారికి ఈ అవకాశం కల్పించారు. కండక్టర్లు, డ్రైవర్ల నుంచి అసిస్టెంట్ డిపో క్లర్కులుగా వంద మందిని నియమించారు. అలాగే డిపో క్లర్కులు 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మెకానికల్ నుంచి డిప్యూటీ మెకానికల్గా 29 మందికి పదోన్నతి కల్పించనున్నారు. అదేవిధంగా గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1కు డ్రైవర్లు 155, కండక్టర్లు 119, మెకానికల్ 24, ఆర్టీ జాన్స్లో 12 మంది చొప్పున పదోన్నతులు కల్పించనున్నారు. -
పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
● మంత్రి మండిపల్లి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి భరోసా ● ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవంరాయచోటి : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి భరోసా ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో రాయచోటి పోలీసు పెరెడ్ మైదానంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అధ్యక్షత వహించారు. దేశ సేవలో అమరులైన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పుష్పగుచ్చాలతో మంత్రి, ఎస్పీ, జేసీలు అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రశాంతమైన సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు వెలకట్టలేనివన్నారు. కుటుంబాలను వీడి, ప్రమాదాలను లెక్కచేయకుండా ప్రజల రక్షణకు నిలబడడం అసాధారణమైన ధైర్యమన్నారు. అమరుల త్యాగాల పునాదులపైనే రాష్ట్రం, దేశం శాంతి భద్రతలు ఉన్నాయన్నారు. పోలీసు అమరవీరుల త్యాగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి మాట్లాడుతూ ధైర్యం అంటే భయం లేకపోవడం కాదని, భయం ఉన్నప్పటికీ చర్య తీసుకోవడం, అది పోలీస్కు మాత్రమే సాధ్యమన్నారు. కోవిడ్–19 సమయంలో కర్తవ్య దీక్షతో మన పోలీసులు కనిపించని శత్రువుతో పోరాడారన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజల భద్రతను నిర్ధారిస్తూ చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సంవత్సరం అన్నమయ్య జిల్లాకు చెందిన ఎనిమిది మంది పోలీసులు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారన్నారు. అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు మంత్రి, జిల్లా ఎస్పీలు అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ప్రత్యేక భరోసా.. కార్యక్రమం అనంతరం జిల్లా ఎస్పీ విధి నిర్వహణలో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుతో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, మదనపల్లి, రాయచోటి డీఎస్పీలు ఎస్ మహేంద్ర, ఎంఆర్ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ ఎం.శ్రీనివాసులు, డీఆర్ఓ మధుసూదన్ రావు, జిల్లాలోని సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది, పోలీసు సిబ్బంది, హోంగార్డు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ మృతి
మదనపల్లె రూరల్ : భర్త చేతిలో యాసిడ్ దాడికి గురై చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పట్టణంలోని శేషప్పతోటలో నివాసం ఉంటున్న శశికళ(55)కు, ఆర్మీ ఉద్యోగి వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి బీటెక్ చదువుతున్న కుమారుడు సుజన్, లండన్లో ఎమ్మెస్సీ చేస్తున్న కుమార్తె సాత్విక వర్షిణి ఉన్నారు. ప్రస్తుతం ఆమె భర్త వెంకటరమణ తమిళనాడులోని చైన్నెలో ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా గత 20 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలను శశికళ పోషించేది. ఈ క్రమంలో ఆమె ఉంటున్న ఇల్లు వెంకటరమణ పేరుపై ఉండటంతో గత కొన్ని నెలలుగా ఇంటిని ఖాళీ చేయమని భర్త శశికళను వేధించసాగాడు. ఇదే విషయమై ఈనెల 6న వెంకటరమణ తన సోదరుడు రాజన్నతో కలిసి ఇంటివద్దకు వచ్చి శశికళపై దాడిచేసి యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా, ఆమె కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తిరుపతిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం కుటుంబ సభ్యులు బాధితురాలిని తిరిగి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. సోమవారం రాత్రి శశికళ మృతి చెందింది. అయితే, యాసిడ్ దాడి ఘటనలో నిందితుడైన ఆమె భర్త వెంకటరమణను ఇప్పటికే టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శశికళ మృతి చెందడంతో హత్యాయత్నం ఘటనను, హత్య కేసుగా మార్పు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. -
డీఏ అర్థాన్ని మార్చేసిన కూటమి ప్రభుత్వం
లక్కిరెడ్డిపల్లి : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన నాలుగు డీఏలలో ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఒక డీఏను మాత్రమే దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3.64 శాతంగా ప్రకటించడం పట్ల పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సూర్యుడు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఉత్తర్వు సంఖ్య 60, 61లో డీఏ అంటే డెత్ ఆఫ్టర్ లేదా రిటైర్మెంట్ ఆఫ్టర్ అని సరికొత్త నిర్వచనం ఇవ్వడం సరికాదన్నారు. కరువు భత్యం అంటే కాటికి పోయాక వచ్చేది కాదని, కాలానుగుణంగా వచ్చేదన్నారు. కనుక అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా దీనిని వెంటనే సవరించాలన్నారు. లేకుంటే పోరు తప్పదన్నారు. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు కరువు భత్యంలో 90 శాతం క్యాష్ రూపంలోను, పెన్షనర్స్కు అరియర్స్ రూపంలో విడతల వారిగా సర్వీసులో ఉండగానే చెల్లించాలని, ఓపీఎస్ ఉద్యోగులకు తక్షణమే పీఎఫ్ ఖాతాలో జమ అయ్యేలా ఉత్తర్వులు మార్చాలని కోరుతూ దేవులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సైకం గంగిరెడ్డి, ఉపాధ్యాయులు నాగరాజు, కృష్ణంరాజు, రెడ్డెయ్య, భాస్కర్, రాణి, నాగరత్నం, రామాంజి, రవి, రామ్మోహన్, తిరుమలరెడ్డి పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువు మండలం దేవరచెరువుకు చెందిన అమరనాథ్(23), నజీర్(23), పత్తికోటకు చెందిన మల్లికార్జున(24) ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంలో తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు ప్రాజెక్ట్ సందర్శనకు సోమవారం వెళ్లారు. తిరిగి బయలుదేరి వస్తుండగా, మార్గమధ్యంలోని తంబళ్లపల్లె సమీపంలో ఆటోను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను తంబళ్లపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తీసుకువచ్చారు. వీరిలో అమరనాథ్కు కాలు విరగ్గా, మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. టెంపో ఢీకొని.. టెంపో ఢీకొని సోమవారం బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లెలోని ఇసుకనూతిపల్లెకు చెందిన జాకీర్బాషా, రీహానా దంపతుల కుమారుడు మహమ్మద్ షాకిర్(6) ఇంటిలో నుంచి రోడ్డుకు అవతలి వైపున ఉన్న అవ్వ దగ్గరకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన టెంపో ఢీకొంది. ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును ఢీకొని.. కారులో వస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని సాఫ్ట్వేర్ ఇంజినీర్తో పాటు మరో ముగ్గురు గాయపడిన ఘటన పెద్దమండ్యం మండలంలో జరిగింది. గాలివీడు మండలం ప్యారంపల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జగదీష్(30) తన స్నేహితుడు సాయిచరణ్(26)తో పాటు గాలివీడుకు చెందిన పుల్లారెడ్డి(31), స్రవంతి(30)తో కలిసి మంగళవారం బెంగళూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో పెద్దమండ్యం మండలం కలిచెర్ల వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బైక్ ఢీకొని.. బైక్పై వెళుతున్న యువకుడిని మరో బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. రాజమండ్రికి చెందిన ప్రసాదరావు కుమారుడు సునీల్(20) పట్టణంలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. తట్టివారిపల్లెలో ఉన్న యజమాని వద్దకు ద్విచక్రవాహనంలో బయలుదేరి వెళుతుండగా, మున్సిపల్ బోర్డు వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు
రాయచోటి జగదాంబసెంటర్ : పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని డైట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలలో 8–12వ తరగతుల వరకు గల విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత, చట్టపరమైన అవగాహనను పెంపొందించడానికి ‘లైంగిక దాడుల నుంచి మహిళలు మరియు బాలల రక్షణ– విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన, వక్తత్వ పోటీలను నిర్వహించాలన్నారు. ఈ పోటీలు రాయచోటి డైట్, మదనపల్లి జెడ్పీ హైస్కూల్, మన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో డివిజన్ వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి ఈ నెల 26వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తారన్నారు. అన్ని యాజమాన్యాలలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు, డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్కేటింగ్ పోటీల్లో అక్కాతమ్ముళ్ల ప్రతిభ
రాజంపేట టౌన్ : ఇటీవల కడపలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోలర్ స్కేటింగ్ పొటీల్లో రాజంపేటకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. ఈ పోటీల్లో సగిలి రావణ రింక్రేస్–1, రేస్–2లో గోల్డ్మెడల్ సాధించాడు. అలాగే సగిలి సంఘమిత్ర రింక్రేస్–1లో రజత పతకం సాధించింది. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించడంతో రావణ, సంఘమిత్ర త్వరలో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రావణ, సంఘమిత్రలు అక్కా తమ్ముళ్లు కావడం విశేషం. ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిందని తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని వేంపల్లె పంచాయతీ రాగిమాకులపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డి, శారదమ్మ దంపతులు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తమ పొలంలో ఆవుల షెడ్ నిర్మించుకోవాలని విశ్వనాథ్రెడ్డి, అతడి కుమారుడు నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమైన నగదు కోసం తమ పొలం పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టాలని శారదమ్మతో చర్చించారు. అయితే ఆమె పొలం తాకట్టు పెట్ట వద్దని భర్తతో గొడవ పడింది. మనస్తాపం చెంది ఈనెల 19న ఇంటివద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విష జ్వరంతో మహిళ.. మదనపల్లె రూరల్ : విష జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని కమ్మవీధిలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు భార్య ఉమాదేవి(54) నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందింది. మంగళవారం తీవ్ర జ్వరంతో పాటు విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో డాక్టర్లు చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. -
గండబోయనపల్లిలో దొంగల ముఠా హల్చల్
● పశువులను చోరీ చేసి తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు ● వాహనాన్ని వదిలి పరారైన దుండగులుకలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయనపల్లిలో దొంగల ముఠా హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు... గండబోయనపల్లికి చెందిన పాడి రైతు వి.చిన్న రెడ్డెప్ప తన ఇంటి ఆవరణలో ఆవులు, దూడలను కట్టేసి వున్నాడు. శనివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు గుట్టుచప్పుడు కాకుండా రెండు పాడి ఆవులను దొంగిలించి దర్జాగా హైవే రోడ్డుపై నిలిపిన బొలోరో పికప్ (నెం.ఏపి02 టిబి 5680) వాహనంలోకి ఎక్కిస్తున్నారు. అటుగా వచ్చిన స్థానికులు గమనించి అర్థరాత్రి సమయంలో పశువులను ఎందుకు తరలిస్తున్నారని దుండగులను ఆరా తీశారు. అదే సమయంలో ఆవులు లేకపోవడంతో దూడల అరుపులు విని నిద్ర లేచి చూసిన రైతు గట్టిగా కేకలు వేశాడు. పాడి రైతు అరుపులు విన్న దుండగులు వాహనాన్ని, ఆవులను అక్కడే వదిలి పరారయ్యారు. స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడి దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించినా వారు తప్పించుకున్నారు. స్థానికులు 112కు డయల్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. విచారించిన వాల్మీకిపురం పోలీసులు ఆదివారం ఉదయం వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. చోరీ చేసిన పాడి పశువులను మరో ప్రాంతానికి తరలించి విక్రయించడానికా.. లేక కళేబరాలకు తరలించడానికా.. అనేది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. గతంలోనూ వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయినపల్లి, తాటిగుంటపల్లి, మంచూరు, మూరేవాండ్లపల్లి తదితర గ్రామాల్లో పాడి ఆవులు, బోరు మోటార్ల వైర్లు, స్టార్టర్లు చోరీకి గురయ్యాయి. వ్యవసాయ పొలాల వద్ద రైతులు ఏమారితే వైర్లు చోరీకి గురవుతుండటం రైతులకు రాత్రి పూట నిద్రలేకుండా చేస్తోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుని చోరీలకు అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు. నిందితుల గుర్తింపు పనిలో ఉన్నాం.. మండల పరిధిలోని గండబోయనపల్లి వద్ద దుండగులు వదిలి వెళ్లిన వాహనం ఆధారంగా నిందితుల గుర్తింపులో ఉన్నాం. స్థానికులు ఇచ్చిన వివరాల మేరకు త్వరలో నిందితులను అదుపులోకి తీసుకుంటాం. – చంద్రశేఖర్, ఎస్ఐ, వాల్మీకిపురం -
రూ.36 లక్షల రుణాల సొమ్ము స్వాహా
మదనపల్లె : మదనపల్లె వెలుగు సమాఖ్యలో రుణాలు, వాటి రికవరీల సొమ్ము అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ సంఘమిత్ర రూ.36 లక్షలు స్వాహా చేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు, వెలుగు సమాఖ్య అధికారులు, పోలీసు తెలిపిన వివరాలు. మదనపల్లె మండలం చిన్నతిప్పసముద్రం గ్రామానికి చెందిన గ్రామ సమాఖ్య –4కు సంఘమిత్రగా స్వాతి పని చేస్తున్నారు. ఈమె పరిధిలోని 30 మహిళా సంఘాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఈ సంఘాలకు వివిధ రకాల రుణాలను మంజూరు చేస్తూ వాటిని రికవరీ చేసి బ్యాంకులు, మండల సమాఖ్య ఖాతాలకు జమ చేయాలి. కొంతకాలంగా మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ, గ్రామ సమాఖ్య, సీ్త్ర నిధి, ఇలా పలు రకాల రుణాలను తీసుకున్నారు. వీటిని ప్రతినెలా తిరిగి కంతులను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 22 సంఘాలకు చెందిన మహిళలు గడువు మేరకు సంఘమిత్ర స్వాతికి తాము చెల్లించాల్సిన కంతుల సొమ్మును చెల్లిస్తూ వస్తున్నారు. ఈ సొమ్మంతా తాము తీసుకున్న రుణాలకు జమ అయ్యి అప్పు తీరిపోయిందని భావించారు. అయితే వెలుగు సమాఖ్య అధికారులు ఈ సంఘాలకు చెందిన మహిళలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం లేదని గుర్తించి ఆరా తీశారు. రుణాలు చెల్లించాలని సంబంధిత సంఘాల మహిళలకు సూచించడంతో అసలు వ్యవహారం బయటపడింది. తాము రుణాలన్నీ చెల్లించామని, మళ్లీ ఎందుకు అడుగుతున్నారని మహిళలు ప్రశ్నించారు. ఖాతాలకు సొమ్ము జమ కాని విషయాన్ని వారికి తెలియజేయడంతో సంఘమిత్ర స్వాతికి తాము ఇచ్చిన సొమ్ము చెల్లించలేదని గుర్తించారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోయామని భావించిన మహిళలు మంగళవారం మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎస్ఐ చంద్రమోహన్కు ఫిర్యాదు చేశారు. తాము చెల్లించిన రూ.36 లక్షల రుణాల రికవరీ సొమ్ము చెల్లించకుండా స్వాతి తమను మోసం చేసిందని.. తమకు న్యాయం చేయాలంటూ విన్నవించారు. మహిళల ఫిర్యాదు పై స్పందించిన ఎస్ఐ విచారణ చేపట్టారు. ఈ విషయంలో వెలుగు సమాఖ్య అధికారులు కూడా విచారణ చేపట్టారు. స్వాతి వ్యవహారంపై చర్యలు తీసుకోనున్నట్లు వెలుగు ఏపీఎం ఖిజర్ ఖాన్ చెప్పారు.పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళలు -
ఉమ్మడి రైస్ మిల్ను అమ్మేశారు
రాయచోటి : అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉమ్మడి ఆస్తిలో తమకు వాటా ఇవ్వకుండా టీడీపీకి చెందిన పాలకిర రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కె.నాగేశ్వరనాయుడు అన్యాయం చేస్తున్నాడని అతని అన్న రామచంద్రనాయుడు, అన్న కుమారుడు ఉమామహేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సంబేపల్లె మండల కేంద్రంలోని సర్వే నంబర్ 48–2లో ఉమ్మడి ఆస్తి 20 సెంట్ల భూమిలో నిర్మించిన రైస్మిల్ను నాగేశ్వరనాయుడు అమ్మేశారంటూ అన్న రామచంద్రనాయుడు, కొడుకు ఉమామహేశ్వర్లు వాపోయారు. 1989లో గురుమూర్తి, నాగేశ్వరనాయుడు ఇద్దరు కలిసి సిద్దం రాజువద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆస్తి 20 సెంట్లలో 10 సెంట్ల భూమిని గురుమూర్తి వద్ద నుంచి రామచంద్రనాయుడు 1992లో కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ ఆస్తిలో అన్నదమ్ములు ఇరువురు రైస్మిల్ ఏర్పాటు చేసుకొని అందులో వచ్చే ఆదాయాన్ని సమంగా పంచుకొనే వాళ్లమని తెలిపారు. ఉద్యోగ రీత్యా రైస్ మిల్ దగ్గర తాను లేకపోవడంతో నాగేశ్వరనాయుడే చూసుకొనేవాడన్నారు. ఆరేళ్ల క్రితం రైస్మిల్, లావాదేవీల విషయంలో మనస్పర్థలు రావడంతో రాయచోటి కోర్టులో దావా వేశమని తెలిపారు. నాగేశ్వర నాయుడు 20 సెంట్ల ఆస్తిని తమ పేరు మీద పాస్ పుస్తకం తయారు చేసుకొని అతని భార్య పేరుమీద 10 సెంట్లు భూమిని రిజిస్టేషన్ చేయించినట్లు తెలిపారు. తనకు చెందిన 10 సెంట్ల భూమిలో రైస్మిల్ చూపిస్తూ తమ కోడలు పేరుమీద రిజిస్టేషన్ చేయించినట్లు తెలిపారు. పాస్ పుస్తకం రద్దు చేయాలని సంబేపల్లె రెవెన్యూ అధికారులకు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారన్నారు. రైస్ మిల్ వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికి అక్టోబర్ 18 వతేదీన గుట్టుచప్పుడు కాకుండా రైస్మిల్ సామగ్రిని దాదాపు రూ.50 లక్షలకు అమ్మివేశారని ఆరోపించారు. ఈ విషయమై సంబేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. స్థానిక మంత్రి రాంప్రసాద్రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. -
చిట్టెంవారిపల్లిలో ఘర్షణ
రామసముద్రం : మండలంలోని మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లిలో స్థలం విషయమై ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన నారాయణ స్వామి తన స్థలంలో గోడ నిర్మాణం చేశాడని అదే గ్రామానికి చెందిన కమ్మన్న ఇరువురు ఘర్షణ పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో కమ్మన్న, కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. అదే గ్రామానికి చెందిన నారాయణ స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహన పూజకు వెళుతూ.. మదనపల్లె రూరల్ : వాహన పూజకు వెళుతూ ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని యువకుడు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ చింతయ్యగారికోటకు చెందిన రవి, పాపులమ్మ దంపతుల కుమారుడు తేజ(21) తన స్నేహితుడు జగదీష్(20)తో కలిసి ద్విచక్రవాహనంలో పుంగనూరు రోడ్డులోని కనుమలో గంగమ్మ ఆలయానికి వాహన పూజ కోసమని బైక్లో బయలుదేరాడు. మార్గమధ్యంలోని మదనపల్లె బైపాస్రోడ్డు నిమ్మనపల్లె సర్కిల్ వద్ద వేంపల్లెకు చెందిన సంతోష్(22), ప్రేమ్(21) మరో ద్విచక్రవాహనంలో పట్టణం నుంచి ఇంటికి వెళుతూ ఎదురెదురుగా ఢీకొన్నారు. ప్రమాదంలో తేజ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవార్త తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు.రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి -
కార్తీకం... శివోహం
శైవ సంప్రదాయాన్ని అనుసరించే వారెక్కువగా శివపూజలు నిర్వహిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో నడుచుకునే వారు విష్ణు ప్రతిరూప ఆలయాల బాటపడతారు. మరి శివ,కేశవులిద్దరు కలిసి పూజలందుకునే సందర్భం ఏదైనా ఉందా అంటే అదే కార్తీక మాసం. ఈనెల 22 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు శివుడికి, విష్ణువుకు నిష్టతో పూజలు చేస్తారు. అందుకే ఈ మాసంలో శైవ,వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ 30 రోజుల దీపారాధన ప్రత్యేకం. దీపారాధన చేయడం ద్వారా భక్తులు పుణ్యాన్ని ఆశిస్తారు. జిల్లాలోని ఆలయాలు దీపకాంతులతో శోభిల్లనున్నాయి. దైవనామస్మరణతో జిల్లా పులకరించనుంది. బుధవారం నుంచి కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రాజంపేట పట్టణంలో పురాతనమైన శివాలయం మదనపల్లె: సోమేశ్వరుడు మదనపల్లె సిటీ/రాజంపేట టౌన్: కార్తీకమాసాన్ని భక్తులు అత్యంత భక్తిభావాలతో నిర్వహిస్తారు. ప్రముఖ శివాలయాలు మదనపల్లెలోని యోగభోగేశ్వరస్వామి ఆలయం, సోమేశ్వరస్వామి ఆలయం, నిమ్మనపల్లె మండలం తవళంలోని నేలమల్లేశ్వరస్వామి ఆలయం, తంబళ్లపల్లె మల్లయ్యకొండపై వెలసిన భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం, రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయం, ఉమామహేశ్వరి ఆలయం, గండిమడుగు విరూపాక్షమ్మ ఆలయం, రైల్వే కోడూరులోని భుజంగేశ్వరస్వామి ఆలయం, కామేశ్వరితీర్థేశ్వర ఆలయం, అత్తిరాల బుజంగేశ్వర ఆలయం, రైల్వేకోడూరు మల్లికార్జున ఆలయం, సోమేశ్వర ఆలయం, చిట్వేల్, కలకడలోని సిద్దేశ్వర ఆలయం , ములకలచెరువులోని చంద్రమౌళి ఆలయం, రామాపురంలోని హసనాపురం శివాలయం, సిద్దవటం మండలంలోని నిత్య పూజకోన, ఒంటిమిట్టలోని ముకుంద మల్లేశ్వరస్వామి ఆలయంతో పాటు పలు శివాలయాలు కార్తీకమాసంలో భక్తుల పూజలందుకునేందుకు సిద్ధం చేశారు. బుధవారం వేకువజామునుంచే కార్తీకస్నానాలు చేసేందుకు భక్తులు సమాయత్తమవుతున్నారు. శివ, కేశవులకు ప్రీతిపాత్రం.. ఆషాడమాసంలో యోగనిద్రలో పవళించిన శ్రీ మహావిష్ణువును ఈ కార్తీకమాసంలో తులసిదళాలతో పూజిస్తారు. పరమశివుడికి మాహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వపత్రాలతో పూజలు నిర్వహిస్తారు. ఓం నమో భగవతే రుద్రాయా... నమస్తే రుద్రాయా... అంటూ లింగాకార భోళాశంకరుడికి అభిషేకాలు చేస్తారు. పంచామృతాభిషేకం శ్రేష్టమైనది. పౌర్ణమి నాడు కొందరు ప్రత్యేకంగా కేదారేశ్వరవ్రతం చేస్తారు. నదులు, చెరువుల్లో స్నానం ఆచరిస్తారు. ఉసరిక పూజలు, వనభోజనాలు, ఉపవాసం చేయడం, కార్తీక దీపాలు వెలిగించడం ఈ మాసంలోనే సాగుతుంటాయి. ఈ మాసం ఉల్లాసానికి, ఉత్తేజానికి ప్రతీక. ధ్యానానికి మహోత్తరమైన మాసం. ఈ మాసంలో ఆహార, నియమాలతో ఉపవాసాలు చేస్తే యోగశక్తిని పొందవచ్చు. దీపారాధన... కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహా మహోన్నతమైంది. శివాలయంలో లేదా గృహంలోనూ తెల్లవారుజామున, సాయంకాలంలో దీపారాధన చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. ఎవరైనా సరే కార్తీకమాసంలో తెలిసి లేదా తెలియకుండా ఎక్కడైనా దీపం పెట్టినా వారి సర్వ విధ పాపాలు హరిస్తాయని పురాణాల కథనం. జ్ఞానం, మోక్షం, ఇహాన శ్రేయస్సు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇదే నెలలో వనభోజనాలు జరుగుతాయి. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు. అంతేకాదు వేకువజామునే ఆచరించే స్నానం వెనుక కూడా ఆరోగ్య సూత్రం దాగి ఉంది. ఉదయాన్నే కురిసే మంచులో తొలిజాములో చేసే పూజాదికాలతో జీవనాడులు ఉత్తేజితమవుతాయి. దీపమే దైవ స్వరూపం: ‘దీపం జ్యోతి పరబ్రహ్మం’ అంటారు. అంటే దీపమే దైవస్వరూపమని అర్థం. అందుకే లోకాల్లో చీకట్లను తొలగించే దీపారాధనకు కార్తీకమాసంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల అనేక మంది తమ ఇళ్ళ ముంగిట, శివాలయాల్లో దీపాలను విధిగా వెలిగిస్తారు. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేష్టమని పురోహితులు చెబుతున్నారు. ఈమాసంలో స్నానా నికి, దీపానికి అధిక ప్రాధాన్యత ఉంది. అందువల్ల నదీస్నానమాచరిస్తే పునీతులవుతారని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో శివకేశవులిద్దరికి పూజలు నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి విశిష్టత: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీ కార్తీక పౌర్ణమి రానుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దానం చేయడం వల్ల దారిద్య్రం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. పౌర్ణమి రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం.....దానమాసం కార్తీక మాసంలో భక్తులు ఉపవాసం ఉండేందుకు అలాగే దాన ధర్మాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. వేకువజామునే స్నానమాచరించడం, దానం చేయడం, శివనామ స్మరణలో ఉండటం వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నదీస్నానం, దానధర్మాలు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములకు ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి సోమవారం : అక్టోబర్ – 27 రెండవ సోమవారం : నవంబర్ – 03 మూడవ సోమవారం : నవంబర్ – 10 నాల్గవ సోమవారం : నవంబర్ – 17 కార్తీక పౌర్ణమి : నవంబర్ – 05 కృత్తికా నక్షత్రంలో పున్నమిచంద్రుడు సంచరించే మాసం కావడంతో ఈమాసానికి ‘కార్తీకం’ అనే పేరు వచ్చిందని పురోహితులు చెబుతున్నారు. కృత్తిక అగ్నిసంబంధ నక్షత్రం కావడంతో కార్తీకమాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యతవుంది. ముఖ్యంగా శివాలయాల్లో, నదీ తీరాల్లో, ఇళ్లల్లో దీపాలను వెలిగించడం పుణ్యప్రదమని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో దీపం వెలిగించడం, దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈఏడాది నాలుగు సోమవారాలు నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ భక్తులకు అన్ని ఏర్పాట్లు కార్తీకమాసంలో శివాలయాల్లో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లు ఏర్పాటు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా ఆలయ ఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. –విశ్వనాథ్, జిల్లా దేవాదాయశాఖ అధికారి ముక్తికి మార్గం....కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. అందువల్ల ఈమాసంలోని ప్రతి రోజు మహిమాన్వితమైనదే. ఈమాసంలో నియమనిష్టలతో వేకువజామునే స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి శివారాధన చేస్తే ముక్తి లభిస్తుంది. – యతిరాజం హరినాఽథ్శర్మ, పురోహితులు, రాజంపేట శుభఫలితాలు కలుగుతాయి.. కార్తీకమాసంలో దీపారాధన చేయడం ఉత్తమోత్తమం. దీనివల్ల దైవానుగ్రహం లభిస్తుంది. సర్వపాపాలు హరిస్తాయి. భక్తులు నియమాలను తప్పకుండా పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. భగవంతున్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి. దీపారాధన చేసి వ్రతం ఆచరించాలి. ఈ విధంగా చేస్తే కష్టాలు తొలుగుతాయి. –ఫణికుమార్శర్మ, అర్చకులు, మదనపల్లె -
పరవళ్లు తొక్కుతున్న పింఛా
పింఛా ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి నీటి విడుదల సుండుపల్లె: మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వంకలు, వాగుల ద్వారా ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు రావడంతో అధికారులు మంగళవారం రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశశారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలోని పింఛా నది, ఎనుపోతుల వంక, తలకోన ఏటితో పాటు సమీపంలోని వంకల ద్వారా వర్షపు నీరు భారీగా చేరింది. ప్రాజెక్టులో నీటిసామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తూ మిగతా నీటిని రెండు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేశశారు. మంగళవారం సాయంత్రానికి ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోనికి 1819 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండటంతో 1640 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసిన సందర్భంగా నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
సాహితీ పరిమళాన్నందించిన ‘జానమద్ది’
కడప ఎడ్యుకేషన్: ‘తెలుగు సూర్యుడు’సి.పి.బ్రౌన్ పేరిట స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, అనేక కార్యక్రమాలు నిర్వహించి, సాహితీ పరిమళాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి అని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సోమవారం సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు జానమద్ది హనుమచ్ఛాస్త్రి 101వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా వైవీయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్, పరిశోధన కేంద్రం సిబ్బంది కలసి పరిశోధన కేంద్రం ప్రాంగణంలోని జానమద్ది కాంస్య విగ్రహానికి, సమావేశ మందిరంలోని చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జానమద్ది హనుమ చ్ఛాస్త్రి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డా. చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సాయం అందక చితికిపోయానని సీఎంవోకు మరణ సందేశం!
రాయచోటి: ఆర్థిక సమస్యలతో చితికిపోయిన ఓ చిన్న పరిశ్రమ యజమాని కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆదివారం పంపిన మరణ సందేశం కలకలం రేపింది. బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక చేదోడు పథకంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని దూల్లవారిపల్లి వద్ద రెడీమిక్స్ కాంక్రీట్ పరిశ్రమను శ్రీనివాసులు ఏర్పాటు చేసుకున్నారు. సొంత ఆస్తులు విక్రయించడంతోపాటు రూ.60 లక్షలు అప్పులు చేసి పరిశ్రమను నెలకొల్పిన ఆయన.. ప్రభుత్వం, బ్యాంకు నుంచి దాదాపు రూ.80 లక్షల మేర ఆరి్థక సాయం కోసం ఎదురు చూసి విసిగిపోయారు. అప్పులపై వడ్డీల భారం పెరిగిపోవడంతో ఆరి్థకంగా చితికిపోయాడు. ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిన సందేశంలో పేర్కొన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, అర్బన్ సీఐ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు రెడీమిక్స్ పరిశ్రమ యజమాని మర్రిపాటి శ్రీనివాసులును ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు కౌన్సెలింగ్ అనంతరం సంతకాలు తీసుకుని సోమవారం సాయంత్రం విడుదల చేశారు. -
కూటమి కుట్రలను ప్రజలకు వివరిద్దాం
గాలివీడు : కూటమి ప్రభుత్వం కుట్రలను ప్రజలకు వివరిద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బోరెడ్డిపల్లె, నూలివీడు పంచాయతీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతి ఇంటా తెలియజేసి.. వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. అనంతరం నక్కలవాండ్లపల్లెలో మల్లేశ్వరస్వామి దేవస్థానానికి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి కృషితో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు సంబంధించిన పనులను ఆయన పరిశీలించి ముఖ ద్వారానికి టెంకాయ కొట్టారు. బోరెడ్డిగారిపల్లెలో వైఎస్సార్సీపీ మైనార్టీ కార్యకర్త ఖలందర్బాషా ఇంటిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కుట్రలను కోటి సంతకాల కార్యక్రమం ద్వారా తిప్పికొట్టాలని సూచించారు. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంగా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. వాటిని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యలు గడ్డం చంద్రప్రకాశ్రెడ్డి, సర్పంచ్ నారాయణ, మాజీ సర్పంచ్ వెంకట నారాయణరెడ్డి, మైనార్టీ అధ్యక్షులు మన్సూర్, నాయకులు మహబూబ్బాషా, భానుమూర్తిరెడ్డి, అర్చకులు జల్లా మల్రెడ్డి, వల్లపు నాగేష్, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్రెడ్డి -
ఎకై ్సజ్ సురక్ష యాప్పై అవగాహన అవసరం
రాజంపేట : ఎకై ్సజ్ సురక్ష యాప్పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన్ తెలిపారు. రాజంపేటలో పలు మద్యంషాపులను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 122 మద్యంషాపులు, 11 బార్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశామన్నారు. ప్రతి షాపులో ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం మాత్రమే ఉందన్నారు. నకిలీ మద్యం ఎక్కడా లేదన్నారు. నకిలీ మద్యం అమ్మితే ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా ఇట్టే పసిగట్టవచ్చునన్నారు. ఒక వేళ ఎక్కడైనా మద్యం అమ్మిన బాటిల్ కన్సూమర్ పోర్టల్లో వివరాలు రాకపోయినా, మద్యం బాటిల్ అనుమానాస్పదంగా ఉన్న వెంటనే స్థానిక ఎకై ్సజ్ అధికారులు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (7981216391)ను సంప్రందించాలన్నారు. వాట్సాప్లో ఆ బాటిల్ ఫొటో పంపిన తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా 1,11,628 మద్యం సీసాలను స్కాన్ చేసి అమ్మడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిక, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్, స్కూటర్ ఢీకొని ముగ్గురికి గాయాలు పీలేరు రూరల్ : ట్రాక్టర్ – స్కూటర్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని మొరవ వడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీ పెళ్లికణం గూడెంకు చెందిన పి.జ్యోతి భానుకుమార్ (23), పి.హరీష్ (21), ఎన్.జ్యోతికుమార్ (19) టపాసులు కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంలో పీలేరుకు బయలుదేరారు. మొరవవడ్డిపల్లె వద్ద స్కూటర్, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పీలేరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. యువకుడికి గాయాలు గాలివీడు : మండలంలోని నక్కలవాండ్లపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసీఫ్(33) అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని నూలివీడు గ్రామం నక్కలవాండ్లపల్లి చెరువు మలుపు వద్ద ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో పార్సిల్ కొరియర్ బాయ్ ఆసీఫ్ ఎడమ కాలు విరిగినట్లు సమాచారం. వెంటనే స్థానికుల సమాచారం మేరకు ప్రైవేటు వాహనంలో రాయచోటికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కడప తరలించారని బంధువులు తెలిపారు. -
ప్రమాదంలో బొమ్మిరెడ్డి చెరువు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలం బండారువారిపల్లె పంచాయతీలోని బొమ్మిరెడ్డిచెరువు ప్రమాదస్థితిలో ఉండటంతో మూడు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి ప్రజలు కట్టపైకి చేరుకుని ఏం జరుగుతుందో అని ఆందోళన చెందారు. దీనికి సంబంధించి వివరాలు. మండలంలోని కనికలతోపు సమీపంలో ముంబై–చైన్నె జాతీయ రహదారిపైనే బొమ్మిరెడ్డి చెరువు ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండిపోయి ప్రవహిస్తోంది. రెండురోజులుగా కురిసిన భారీ వర్షానికి హర్సిలీహిల్స్, పక్కనే ఉన్న కొండలు, గుట్టల్లో కురిసిన వర్షంనీళ్లు చెరువులోకి చేరడంతో ప్రమాదకర స్థాయిలో నిండింది. మొరవ వెళ్తున్నప్పటికి నీటి మట్టం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో కట్ట బలహీపడింది. కట్టపై పగుళ్లు రావడమే కాకుండా మట్టి కుంగుతోంది. కట్టపైన తారురోడ్డుకు పగుళ్లు వచ్చాయి. దీంతో చెరువుకట్ట ప్రమాదస్థితికి చేరడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు కట్ట తెగితే..దీనికి సమీపంలోని కనికలతోపు, ఉమాశంకర్కాలనీ, తుమ్మనంగుట్ట, మద్దూరివారిపల్లె కాలనీకి ప్రమాదం వాటిల్లుతుంది. ఇళ్లు మునిగిపోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కట్ట బలహీనపడి పగుళ్లు, కుంగుతున్న కట్ట -
అప్రజాస్వామికం
పత్రికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటివి. ప్రభుత్వ వైఫ ల్యాలను ఎత్తిచూపుతున్నారనే కక్షతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు. సాక్షి ఎడిటర్ ధునుంజయరెడ్డి, పాత్రికేయులపై అక్రమకేసులు పెట్టడం అప్రజాస్వామికం. తక్షణమే వీటిని రద్దుచేయాలి. –రామిరెడ్డి ధ్వజారెడ్డి, వైస్ఎంపీపీ, రైల్వేకోడూరు బెదిరింపులు మానుకోవాలి కూటమి ప్రభుత్వం మీడియా పట్ల బెదిరింపు ధోరణి మానుకోవాలి. ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు మీడియా ద్వారా చేరవేస్తున్నందుకు కక్షకట్టి సాక్షి ఎడిటర్,పై కేసు లు పెట్టడం సరికాదు. భవిష్యత్తు లో మూల్యం చెల్లించుకుంటారు. – శ్రీనివాసులు, సీనియర్ రిపోర్టర్, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ మాజీ డైరెక్టర్ కూటమిది కక్షసాధింపు ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతున్న పత్రికలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్య లకు దిగడం సిగ్గుచేటు.ఇది వాస్తవాలను సమాధి చేయాలనే దుష్ట పన్నాగం. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమంగా బనాయించిన కేసులను రద్దు చేయాలి. –చిన్ననాగిరెడ్డి, ఉప సర్పంచ్, చాకిబండ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికే ప్ర మా దం. ఇటువంటి చర్యల ను ప్రజలు హర్షించరు. స్రాక్షి కార్యాలయంపై దాడులు, ఎడిటర్పై కేసులు నమోదు చేయడం.. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వెంటనే మార్చుకోవాలి. – యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి, మండల సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యులు, సుండుపల్లె -
ఎంత కష్టం.. ఎంత నష్టం
గుర్రంకొండ: ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని టమాటా తోటలు భారీగా దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా నల్లమచ్చలు, గజ్జిరోగాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్నా రోగాలతో తోటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోయారు. వందక్రీట్ల టమటా కోతల్లో సుమారు 35 నుంచి50 క్రీట్ల వరకు రోగాలబారిన పడినకాయలే ఉంటున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం 25కేజీల టమాటా క్రీట్ ధర రూ. 550 పలుకుతుండగా రోగాల బారిన పడిన టమాటాలను మార్కెట్లో కొనే వారు లేక పలువురు రైతులు కాయలు కోయకుండా తోటలు వదిలేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 7560 ఎకరాల్లో టమాటా పంట దెబ్బతింది. ధరలు పుంజుకొంటున్నా దిగుబడి ఏది? ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు పుంజుకొంటున్నాయి. వారం రోజుల కిందటవరకు 25కేజీల క్రీట్ ధర రూ. 300 లోపు ఉండగా ప్రస్తుతం రూ.550 వరకు ధరలు పలుకుతున్నాయి. అయితే ధరలు పుంజుకొంటున్నా పంట దిగుబడి మాత్రం రోగాలు, వైరస్ల కారణంగా సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో రైతులు ఆందొళన చెందుతున్నారు. టమాటాపై ఒకమచ్చ మాత్రమే ఉన్న కాయలు 25కేజీల క్రీట్ ధర కేవలం రూ. 50 నుంచి రూ.80 లోఫు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. మచ్చల సంఖ్య ఎక్కువగా ఉంటే వ్యాపారులు కొనడానికి నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదిలేక రైతులు రొడ్డుపక్కన పారోబోసి వెళ్లిపోతున్నారు.ప్రస్తుతం నల్లమచ్చలు, గజ్జిరోగాలున్న టమాటా తోటల్లో కాయలు ఎకరానికి 240 నుంచి 280 క్రీట్లు వస్తున్నాయి. 35 నుంచి50 శాతం మేరకు మచ్చలున్న టమాటాలే: వర్షాల కారణంగా మంచి కాపుమీదున్న టమాటా తోటల్లో 35 నుంచి 50 శాతం మేరకు కాయలు దెబ్బతిన్నాయి. కోత సమయంలో వంద క్రీట్లకు 35 నుంచి 50 క్రీట్లు నల్లమచ్చలున్న టమాటాలే ఉండడం గమనార్హాం. వీటిని మామూలు టమాటాల నుంచి వేరు చేసి మార్కెట్కు తర లించాలంటే తలప్రాణం తోకకు వస్తోందని రైతులు వాపోతున్నారు. కొన్ని మండలాల్లో 50 శాతం నుంచి 75 శాతం మేరకు నల్లమచ్చలు రావడంతో పంటను కాపాడుకోవడం భారంగా మారింది. 7560 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు: వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 7560 ఎకరాల్లో టమాటా పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాయల రూపురేఖలు మారిపోయాయి. ఓ వైపు నల్లమచ్చలు, మరోవైపు రంధ్రాలున్న కాయలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ రకం కాయలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో చేసేదిలేక పలువురు రైతులు తోటలవద్దనే పారబోస్తున్నారు. మరికొంతమంది పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు చేసిన పంట ఎకరాల్లో: 18532 దెబ్బతిన్నపంట ఎకరాల్ల్లో: 7560 అమ్ముడుబోని టమాటాలను రోడ్డుపక్కన పారబోసిన రైతులు పొలాల వద్ద పశుగ్రాసంగా మారిన టమాటాలు వర్షాలకు దెబ్బతిన్న టమాటా నల్లమచ్చలు,గజ్జి రోగాలతోతగ్గిన పంట దిగుబడి పలుచోట్ల కాయలు కోయకుండాతోటల్లో వదిలేసిన రైతులు -
పెన్నాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
సిద్దవటం : పెన్నా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. సిద్దవటం మండలంలోని వంతాటిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పెయ్యల నందు(36) గ్రామ సమీపంలోని పెన్నా వద్దకు తన పెంపుడు కుక్కతో శనివారం మధ్యాహ్నం వెళ్లారు. నదిలో చేపలు ఎగురుతుండటంతో.. వాటి కోసం కుక్క అందులోకి దూకింది. కుక్కను రక్షించేందుకు పెన్నా నీటిలో దిగి సుడిగుండంలో చిక్కుకొని గల్లంతైన విషయం తెలిసిందే. ఒంటిమిట్ట సీఐ బాబు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు, కడప రెస్క్యూ టీమ్ వారు శనివారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. మరలా ఆదివారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా సిద్దవటం మండలం ఎస్.రాజంపేట గ్రామ సమీపంలోని పెన్నా నదిలో నందు మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య పూజ, మూడేళ్ల కుమార్తె ఉంది. భార్య 8 నెలల నిండు గర్భిణి. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఝరికోనలో పడి వ్యక్తి మృతి కలకడ : ఝరికోన ప్రాంతంలో ఆహ్లాదంగా గడపడానికి కుటుంబంతో వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఝరికోనలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... సంబేపల్లె మండలం దేవపట్లకు చెందిన అజమతుల్లా(30) తన కుటుంబ సభ్యులతో ఝరిగడ్డ ప్రాంతానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు జారి కాలువలో పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అజమతుల్లాను కలకడ పీహెచ్సీకి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మహల్ సీహెచ్సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు.. అజమతుల్లా మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
దీపావళి ప్రతి ఇంటా కాంతులు నింపాలి
రాజంపేట టౌన్/రాయచోటి అర్బన్: దీపా వళి ప్రతి ఇంటా కొత్త కాంతులు నింపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలను తెలిపారు. దీపావళి అంటే చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయంగా పేర్కొన్నారు. ఈ పండుగను ప్రజలందరూ ఆనందంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. రాయచోటి: ఈనెల 20న నిర్వహించనున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. రాయచోటి కేంద్రంగా కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం జరగబోయే ఈ కార్యక్రమాన్ని దీపావళి పండుగ నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆదివారం వేర్వేరుగా అందజేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు రావద్దని ప్రకటనలో పేర్కొన్నారు. పీబీసీలోకి కృష్ణా జలాలు బి.కొత్తకోట: మండలంలోని గుండ్లపల్లె వద్ద హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ (పీబీసీ)కు గత బుధవారం గండిపడి తెగిపోయిన విషయం తెలిసిందే. దీనికారణంగా నీటి తరలింపు నిలిపివేశారు. కాలువకు మరమ్మతులు పూర్తి చేయడంతో సత్యసాయిజిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి ఆదివారం తెల్లవారుజాము 1.30 గంటలకు కృష్ణా జలాలను విడుదల చేశారు. తొలుత 200 క్యూసెక్కులు వదిలిన అధికారులు కొన్నిగంటల తర్వాత 275 క్యూసెక్కులకు పెంచారు. గండిపడిన కాలువ మరమ్మతులు పూర్తిచేసినా మళ్లీ అక్కడ గండిపడకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
– మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కలికిరి(వాల్మీకిపురం)/కలకడ : పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికే చంద్రబాబు కుట్ర పన్నారని, అందుకే వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. పీలేరు నియోజకవర్గ పరిధిలోని వాల్మీకిపురం మండలం నగిరిమడుగు, కలకడ మండలంలోని కలకడ పంచాయతీ, కోన గ్రామ పంచాయతీలలో ఆదివారం కోటి సంతకాల సేకరణపై రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు, అందరికీ అందుబాటులోకి వైద్య విద్యను తీసుకురావడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేసి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. వీటిలో దాదా పు పది కళాశాలలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీటికి అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పంగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తలపెట్టారన్నారు. డైవర్షన్ రాజకీయాలు కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేక సెగలు తగులుతుండటంతో సీఎం చంద్రబాబు రోజుకొక రకం డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. జరగని లిక్కర్ స్కామ్లో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భందించారని గుర్తు చేశారు. ఎంపీ బెయిల్పై విడుదలైనా కూడా ఎంపీ, ఆయన కుటుంబ సభ్యులపై కూటమి ప్రభుత్వం ఏదో రకంగా వేధింపులు కొనసాగిస్తుండటం దుర్మార్గపు చర్యలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమాలు, కుట్రలు, దౌర్జన్యాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజలతో సంతకాలు సేకరించారు. వాల్మీకిపురం కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నీళ్ళ భాస్కర్, సీనియర్ నాయకులు చింతల ఆనందరెడ్డి, మండల కన్వీనర్ పులి శివకుమార్రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, సర్పంచ్ రజని, ఎంపీటీసీ రెడ్డెప్ప, పీఎస్ వెంకటరమణారెడ్డి, వెంకటరెడ్డి, సురేంద్రరెడ్డి, సురేష్కుమార్రెడ్డి, రమేష్, విశ్వనాథ, ఈశ్వర్రెడ్డి, కలకడ మండలంలో కన్వీనర్ కమలాకర్రెడ్డి, కోన సర్పంచ్ జల్లా రాజగోపాల్రెడ్డి, షావత్ అల్లీ ఖాన్, శ్రీనివాసులురెడ్డి, లక్ష్మిరెడ్డి, రవికుమార్, జిలానీ బాషా, మస్తాన్ అహ్మద్, అంజన్కుమార్, జీవి కిశోర్, వెంకట్రమణారెడ్డి, ప్రకాష్రెడ్డి, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ అంటే అమరావతి, పోలవరమా?
వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కె.సురేష్బాబు రాజంపేట రూరల్ : ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే విధంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కొత్తమద్ది సురేష్బాబు, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్లో ఆదివారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ రూరల్ పరిధిలో కోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనీల్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కొత్తమద్ది సురేష్బాబు, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొని మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలకు కోటి సంతకాల సేకరణపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలతోపాటు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేస్తున్న పథకాలన్నింటిని అమలు చేస్తామని కూటమి నాయకులు ప్రజలను మభ్య పెట్టారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం అపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. తమ సామాజిక వర్గానికి మేలు చేసేందుకు అమరావతికి వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయక పోగా.. నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయనీయబోమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆశా దీపంగా నిలుస్తున్న మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి సంతకాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేపటి మన బిడ్డల భవిష్యత్ కోసం మనం వైఎస్సార్సీపీకి అండగా నిలవాలన్నారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నష్టపోయాం
వర్షాలతో టమాటా పంటకు నల్లమచ్చలు, గజ్జిరోగాలు సోకి తోటలు దెబ్బతిన్నాయి. వైరస్లు, రోగాల కారణగా ఎకరం పంటకు సుమారు 800 క్రీట్ల దిగుబడి రాగా ఇందులో సగానికిపైగా అంటే 300నుంచి 400క్రీట్ల వరకు నల్లమచ్చలున్న టమాటాలు వస్తున్నాయి. చెట్టుకాండం నుంచి ఆకులు, కాయలతో సహా నల్లమచ్చలు ఏర్పడ్డాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాం. – రెడ్డిమోహన్, గుర్రంకొండ కొనేవారు లేరు మార్కెట్లో నల్లమచ్చలు, గజ్జి రోగం సోకిన టమాటాలను కొనేవారు కరువయ్యారు. నాణ్యమైన టమాటాలు ఒక క్రీట్ ధర రూ.550వరకు పలుకుతున్నాయి. అయితే నల్లమచ్చలున్న కాయలు ఒక క్రీట్ ధర రూ.70లోపే ఉంటోంది. దీంతో ఒకక్రీట్కు రూ.500 వరకు రైతులు నష్టపోతున్నారు. టమాటా తోటల్లొ రోగాల నివారణ కోసం ఎకరానికి రూ. 60 వేలు వరకు మందుల కొసం ఖర్చు చేయాల్సి వస్తోంది. –మల్లయ్య, మొరంపల్లె -
ప్రజల మన్ననలు పొందిన నాయకుడు బ్రహ్మయ్య
బ్రహ్మయ్య విగ్రహం, ఉద్దండం ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి, చొప్పా గంగిరెడ్డి రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో సర్పంచిగా పని చేసి అక్కడి ప్రజల మన్ననలు పొందిన ఉద్దండం బ్రహ్మయ్య సేవలను రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కొనియాడారు. ఆదివారం తాళ్లపాకలో ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఉద్దండం సుబ్రమణ్యం ఆధ్వర్యంలో తాళ్లపాకలో ఏర్పాటు చేసిన మాజీ సర్పంచి ఉద్దండం బ్రహ్మయ్య విగ్రహాష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాఽథ్రెడ్డి.. బ్రహ్మయ్య సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచిగా తాళ్లపాక గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. అన్నమాచార్య యూనవర్సిటీ అధినేత చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంత అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పని చేసిన వ్యక్తి ఉద్దండం బ్రహ్మయ్య అన్నారు. తాళ్లపాకను అభివృద్ధి చేయాలని అనేక మార్లు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈయనతోపాటు సోదరుడు చొప్పా అనిల్రెడ్డి తదితర వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం విగ్రహావిష్కరణ సభలో శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, జనసేన నేత అతికారికృష్ణ, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టరు అద్దెపల్లె ప్రతాప్రాజు, టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు, మోదుగల కళావతమ్మ, ఇంజినీరింగ్ కళాశాల అధినేత పెంచలయ్య, న్యాయవాది సురేష్రాజు, అదృష్ణదీపుడు, మోహనరావు, గణేషు, గీతాంజలి విద్యా సంస్థల అధినేత ఎస్వీరమణ, మైనార్టీ నేత గుల్జార్బాషా, రాజంపేట టీడీపీ అధ్యక్షుడు మేడికొండు రవికుమార్నాయుడు, మాజీ ఎంపీపీ పారా సుబ్బానాయుడు, ప్రముఖ వైద్యుడు సుధాకర్, టీడీపీ నాయకుడు ఇడమడకల కుమార్, తాళ్లపాక గ్రామస్తులు పాల్గొన్నారు. -
బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం స్ఫూర్తిదాయకం
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డికడప సెవెన్రోడ్స్ : మహాదాత బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కుమ్మరి దస్తగిరి రచించిన బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్ర పుస్తక పరిచయ కార్యక్రమం రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ కార్యదర్శి కొండూరు జనార్దన్రాజు ఆధ్వర్యంలో ఆదివారం కడప హౌసింగ్బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి మాట్లాడుతూ డొక్కల కరువులో తిండి లేక వేలాది మంది రాయలసీమ ప్రజలు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో బుడ్డా వెంగళరెడ్డి కొన్ని వేల మందికి కొన్ని నెలల పాటు అంబలి పోసి ప్రాణాలు కాపాడారన్నారు. ఆయన దాతృత్వం, సేవల గురించి భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కడపలో ఆయన విగ్రహ ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని, తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠ్యాంశాల్లో చేర్చాలి ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం, ఆయన చరిత్ర గురించి పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టాలన్నారు. ఇందువల్ల భావి తరాలు ఆయన గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందేందుకు వీలుంటుందన్నారు. ఈ విషయాన్ని తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. వర్సిటీలు పరిశోధనలు జరపాలి రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు చెందిన బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలతోపాటు ఎందరో మహానీయుల సేవలు, త్యాగాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేపట్టాలని అన్నారు. వారి జీవితం, సేవల గురించి ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నందన, డొక్కల, ధాతు వంటి భయానక కరువుల్లో రాయలసీమ ప్రజలు అనుభవించిన ఆవేదన, కన్నీళ్లు, అవమానాలు లాంటి అంశాల గురించి బ్రిటీషు గెజిటీర్లు, చరిత్ర పుస్తకాల్లో లేవన్నారు. ఆ విషయాలను చరిత్ర పరిశోధకులు వెలుగులోకి తీసుకు రాగలిగితే రాయలసీమ యువత ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఘనంగా సన్మానం పుస్తక రచయిత దస్తగిరి, బుడ్డా వెంగళరెడ్డి ఐదవ తరం వారసులు బుడ్డా విష్ణువర్దన్రెడ్డి, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కవి కర్నాటి రామకృష్ణారెడ్డి, పుస్తక సమీక్షకులు జీవీ సాయిప్రసాద్, రెడ్డి సేవా సమితి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మప్రియ చంద్రారెడ్డి, యూ ట్యూబర్ దండా ప్రసాద్లను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయ ధర్మకర్త దేసు వెంకటరెడ్డి, కడప నగర డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మోపూరి బాలకృష్ణారెడ్డి, ఇంటాక్ జాతీయ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లయన్ కె.చిన్నపరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆర్.రంగనాథరెడ్డి, నగర ప్రముఖులు పోతుల వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, మానవత సంస్థ ప్రతినిధులు డాక్టర్ రామాంజులరెడ్డి, ఆచార్య సాంబశివారెడ్డి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ ప్రియులు -
పెద్ద దర్గా ఉరుసుకు విస్తృత ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్: నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ‘అమీన్ పీర్ దర్గా‘ ఉరుసు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో అమీన్పీర్ దర్గా ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. జేసీ అదితి సింగ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు, ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యం కలిగిన అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను కడప నగర ఫెస్టివల్గా, మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా స్టాండర్డ్ నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.15 రోజుల ముందుగానే ముందస్తు ప్రణాళికతో అన్ని రకాల ఉత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా) కమిటీ సభ్యులు, జిల్లా యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు, దర్గా నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఉరుసు ముందస్తు ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖలకు జిల్లా కలెక్టర్ విధులు కేటాయించారు. మున్సిపల్ అధికారులు: ప్రధానంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమలను చేపట్టాలన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలన్నారు. మొబైల్ టాయిలెట్స్, సురక్షితమైన తాగునీరు, హై మాస్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన కూడళ్లను అందంగా విద్యుత్ లైట్లతో అలంకరించాలని సూచించారు. పోలీస్ శాఖ: పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని, ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా గట్టి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రానున్న నేపథ్యంలో అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ శాఖ: పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో.. ఎక్కువగా గుమికుడే ప్రాంతాలలో బారికేడ్స్ను ఏర్పాటు చేయాలన్నారు. దర్గా నుంచి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్స్ వెళ్లడానికి గ్రీన్ ఛానల్ దారిని ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీ ప్రొటోకాల్, ప్రముఖులకు ప్రజాప్రతినిధులకు దర్గా ఆహ్వానాలు వంటి అంశాలను చూసుకోవాలని డీఆర్ఓను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ: వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అధిక సంఖ్యలో వైద్య సిబ్బందిని వైద్యాధికారులను నియమించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. 108 అంబులెన్స్ తదితర వాహనాలతోపాటు అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పర్యాటక శాఖ: నగరంలోని ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, ఎయిర్ఫోర్ట్ ప్రాంతాలలో పెద్ద దర్గా, ఇతర దేవాలయాల టెంపుల్ టూరిజం క్యాంపెయిన్ చేపట్టాలని పర్యాటక అధికారులకు సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ: ప్రధాన ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితరాల నుంచి అమీన్ పీర్ పెద్ద దర్గా ప్రాంతానికి షటిల్, బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మన జిల్లా నుంచే కాకుండా ఇతర రాయలసీమ జిల్లాలు, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. అలాగే ఉరుసు ప్రధాన రోజున దర్గా నుంచి వాటర్ గండి వరకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పవర్ మేనేజ్మెంట్ చేయాలన్నారు. షార్ట్ సర్క్యూట్లు సంభవించకుండా విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. సమాచార శాఖ: పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు అత్యంత ప్రాచుర్యం వచ్చే విధంగా, భక్తుల్లో అవగాహన పెంచేందుకు అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్లు నిర్వహించాలన్నారు. అలాగే జిల్లాలోని చారిత్రక నేపథ్యం కలిగిన ఒంటిమిట్ట, దేవుని కడప దేవాలయాలపై టెంపుల్ టూరిజం పై అవగాహన పెంచే విధంగా పర్యాటక అధికారులతో కలిసి ప్రణాళిక చేయాలని సూచించారు. అగ్నిమాపక శాఖ: ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. ఉర్సు పరిసర ప్రాంతాల్లో మినీ వ్యాన్లు, ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అమీన్ పీర్ దర్గా ప్రధాన ఉరుసు మహోత్సవం రోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. గతంలో పెద్ద దర్గా ఉర్సు నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది మల్టీ డిస్ప్లేనరీ కంట్రోల్ రూమ్ కొనసాగుతుందని, ఇందులో ఏడు శాఖలకు చెందిన అధికారులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ సాహెబ్.. సీఎంను కలిసి ఆహ్వానం అందించారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉరుసు మహో త్సవాలు నవంబరు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని, ఈ మహోత్సవాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఉరుసు ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు. -
కలంపై కూటమి కక్ష
నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రికలపై, విలేకరులపై కూటమి సర్కార్ కక్షగట్టింది. అక్రమ కేసులతో వేధిస్తోంది.పత్రికా కార్యాలయాల్లో సోదాలు, సంపాదకుల ఇళ్లలో తనిఖీల పేరుతో పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది.అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. మీడియాపై అంక్షలు విఽధించడం తగదని పలువురు ప్రజాస్వామ్యవాదులు, పార్టీల నాయకులు అభిప్రాయపడతున్నారు. పత్రికలపై కేసులు రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ పరిరక్షణలో కీలకపాత్ర మీడియాది. ప్రజాస్వామ్యం ప్రకారం తమ భావజాలాన్ని వ్యక్తం చేసే హక్కును రాజ్యాంగం మనకు కల్పించింది. తప్పుంటే రాజ్యాంగం ప్రకారం తిప్పకొట్టే అవకాశం ఉంది.అందుకు భిన్నంగా పత్రికల గొంతు నొక్కడం ఎరు చేసినా ఖండీనీయం. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు పెట్టడం, వేధించడం సమర్థనీయం కాదు. –మర్రి రవికుమార్, వైస్చైర్మన్, రాజంపేట మున్సిపాలిటీ, తగిన మూల్యం చెల్లించుకుంటారు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయం. నోటీసుల పేరుతో ఇళ్ల వద్దకు, సాక్షి కార్యాలయాల వద్దకు వెళ్లి పోలీసులు హంగామా సృష్టించడం అప్రజాస్వామికం. ప్రజల వాణిని వినిపించే మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేయడం సరికాదు. ఇలాంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – సయ్యద్ ముస్తాక్ మండల కన్వీనర్, పుల్లంపేట ఉద్దేశ పూర్వకంగానే సాక్షిపై కుట్ర ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం సాక్షి పత్రికపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోకి తేవడం నేరం కాదు. తప్పులను ఎత్తిచూపే హక్కు పత్రికలకు ఉంది. స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు సాక్షి కార్యాలయానికి వెళ్లడం, సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ చర్యల పట్ల జర్నలిస్టులు విస్తుపోతున్నారు. – పోరెడ్డి నరసింహారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రొద్దుటూరు బెదిరింపులు మానుకోవాలి రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుంది. ప్రభు త్వ వైఫల్యాలను వెలుగులోకి తీసుకొస్తూ వార్తలు రాసే పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టి కలానికి సంకెళ్లు వేయాలనుకోవడం అవివేకం. సాక్షి మీడియాపై కక్షపూరితంగా వ్యవహరించడం విచారకరం. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టడం కాదు సహేతుకం కాదు. ప్రభుత్వం జర్నలిస్టులను బెదించే ధోరణికి స్వస్తి చెప్పాలి – త్రినాథ్, రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, నందలూరు -
తండ్రీకొడుకుల కుట్రలను గడపగడపకు తెలియజేయాలి
రాజంపేట టౌన్: మెడికల్ కళాశాలలను తన అనుచరులకు కట్టపెట్టి తద్వారా జేబులు నింపుకునేందుకు చంద్రబాబునాయుడు, నారాలోకేష్ పన్నుతున్న కుట్రలను గడప గడపకు తెలియచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రైవేట్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటిలోని వివిధ వార్డులకు చెందిన కౌన్సిలర్లకు కోటి సంతకాల సేకరణ పత్రాలను ఎమ్మెల్యే అందచేశారు. అనంతరం అమరనాథరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ అయితే ముఖ్యంగా పేదలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షలా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆయా కళాశాలల యాజమాన్యాలు ఒక్కో మెడికల్ సీటుకు డొనేషన్ల రూపంలో భారీ మెత్తంలో తీసుకుటాయన్నారు. అందువల్ల పేద విద్యార్థులు డాక్టర్ కావాలన్న కల కలలాగనే మిగిలిపోతుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడతారని వైఎస్.జగన్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు. ఈకార్యక్రమాన్ని జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. ప్రజల అభివప్రాయాలను జగన్ గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళి ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్నారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పోలా వెంకటరమణారెడ్డి, కృష్ణారావుయాదవ్, వడ్డే రమణ, డీలర్ సుబ్బరామిరెడ్డి, రక్కాసి శ్రీవాణి, మిర్యాల సురేఖ, ఖాజా మొహిద్దీన్, సనిశెట్టి నవీన్కుమార్, సూరి, నాసిర్, నామ్నగర్ శివ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి -
అండర్–19 కబడ్డీ జట్ల ఎంపిక
నిమ్మనపల్లె: మండలంలోని రెడ్డివారిపల్లె మోడల్స్కూల్లో శనివారం జిల్లా అండర్–19 కబడ్డీ జట్ల ఎంపిక నిర్వహించినట్లు స్కూల్గేమ్స్ కార్యదర్శి డాక్టర్.ఎస్.బాబు, నాగరాజ తెలిపారు. జిల్లాలోని 30 మండలాల నుంచి వచ్చిన 150 మంది క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపీడీఓ రమేష్బాబు, ఎంఈఓ నారాయణ, పద్మావతి ముఖ్యఅతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలన్నారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, క్రీడాభారతి పీడీఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్బాబు, సెలక్షన్ కమిటీ సభ్యులు శారద, మోహన్, అన్సర్బాషా, ఇందిర, మణి తదితరులు పాల్గొన్నారు. కడప: కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో చిన్న పిల్లల విభాగం (పీడియాట్రిక్స్)లో పీజీ సీట్ల సంఖ్య ఏడుకు చేరింది. ఎన్ఎంసీ ఇటీవల 4 పీజీ సీట్లు మంజూరు చేసింది. గతంలో 3 పీజీ సీట్లు ఉండేవి. సీట్ల పెంపు కోసం హెచ్ఓడీతోపాటు వైద్యులు కృషి చేశారని జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జమున తెలిపారు. శనివారం ప్రిన్సిపాల్ తమ చాంబర్లో పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ వై. వంశీధర్, వైద్యులు అనిల్ కిరణ్, పద్మినీ ప్రియా, బి.కె.నిరంజన్తోపాటు చిన్నపిల్లల విభాగం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
టపాసుల మోతే!
రాయచోటి : దీపావళి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా విక్రయ కేంద్రాలను సిద్ధం చేశారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా టపాసుల విక్రయ కేంద్రాల నిర్వహణకు జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశానుసారం అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి అనిల్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై పర్యవేక్షణ చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల సమన్వయంతో జిల్లాలోని శాశ్వత టపాసుల విక్రయ కేంద్రాలతో పాటు పండుగ సందర్భంగా తాత్కాలిక విక్రయ కేంద్రాల అనుమతుల విషయంపై నిర్ణయాలను తీసుకున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో 42 శాశ్వత లైసెన్సుదారులకు గాను ఈ ఏడాది 33 షాపులకు అనుమతులు పొందారు. దీనితో పాటు రాయచోటి, మదనపల్లి, రాజంపేట, పీలేరు, కోడూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో తాత్కాలిక షాపుల ఏర్పాటు కోసం 252 ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. ఈ విక్రయకేంద్రాలను నివాస కేంద్రాలకు, పాఠశాలలకు, ఇతర ప్రమాదాలకు దూరంగా విశాలమైన ప్రదేశాలలో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అగ్నిమాపక అధికారి అనిల్కుమార్ తెలిపారు. వన్ మెన్ కమిటీ.. బాణసంచా అమ్మకాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాల కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. గతంలో రెవెన్యూ అధికారులు దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చేవారు. ఈ ఏడాది వన్మెన్ కమిటీ అంటే రెవెన్యూ, పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల సమన్వయంతో తాత్కాలిక విక్రయ కేంద్రాలకు అనుమతితో ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ఉండే అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలన చేసి నివేదిక అందిస్తారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. ● అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం జనావాసాల్లో ఎట్టి పరిస్థితుల్లో టపాసుల విక్రయాలు, దుకాణాలు ఉండరాదు. గోదాములు సైతం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదు ● నివాస సముదాయాలకు కనీసం 50 మీటర్ల దూరంలో దుకాణాలు ఉండాలి. ● తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాలు సైతం 3 మీటర్ల దూరంలో ఉండాల్సి ఉంటుంది. ● దుకాణాల దగ్గర సిగరెట్, బీడీ తాగరాదు. ● ప్రతి దుకాణం వద్ద ప్రత్యేకంగా నీటిసౌకర్యం, అగ్ని నిరోధక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ● జనావాసాల మధ్య తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసే చోట తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఉండి తీరాలి. ప్రమాద బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ధూమపానం నిషేధిత స్థలంగా ప్రకటించాలి. ● అగ్నిప్రమాదం జరిగితే వెంటనే అంటుకునే తడికలు, ప్లాస్టిక్ కవర్లతో దుకాణాలు ఏర్పాటు చేయరాదు. ప్రత్యేకంగా తయారు చేసిన జింక్, జీఐ రేకులతో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా షెడ్లలో హౌస్ కీపింగ్, చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉండాలి. ● ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి అగ్నిమాపక వాహనం వచ్చి చుట్టూ తిరిగే విధంగా స్థలం ఇచ్చి షెడ్లను నిర్మాణం చేసుకోవాలి. ● ఒక దుకాణానికి మరో దుకాణానికి కచ్చితంగా 3 మీటర్ల దూరం ఉండాలి. వాటితో పాటు బాణసంచా కొనుగోలు చేయడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా దారులు ఏర్పాటు చేయాలి. ● విద్యుత్ వైరింగ్ చేసుకునే సమయంలో ఎలాంటి అతుకులు లేని వైర్ ఉపయోగించాలి. ఒక్కో సందర్భంలో వీటి నుంచి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వైరింగ్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ● రేకులతో కూడిన్ షెడ్లు వేస్తేనే అనుమతి ఇస్తారు. ప్రతి దుకాణంలో రెండు మంటలను ఆర్పే పరికరాలు, 200 లీటర్ల రెండు డ్రమ్ములు, 4 నీటి బకెట్లు, రెండు ఇసుక బకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ● బాణసంచా దుకాణాల సమీపంలో ఎలాంటి పరిస్థితిలోనూ పొగ తాగరాదని ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలి. ● తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే దుకాణాలకు దూరంగా వాహనాలను పార్కింగ్ చేసేలా చూడాలి. తాత్కాలిక బాణసంచా దుకాణాలకు ఆన్లైన్లో దరఖాస్తులు అన్నమమయ్య జిల్లాలో ఇప్పటికే 252 లైసెన్సులు జారీ పాత లైసెన్సులు.. తాత్కాలికం.. 252 రూ. కోట్లలో టపాసుల వ్యాపారం నిబంధనలు తప్పనిసరి అంటున్న అధికారులు -
నవోదయలో ప్రవేశానికి గడువు పెంపు
రాజంపేట: జవహర్ నవోదయ విద్యాలయం(రాజంపేట మండలం నారమరాజుపల్లె)లో 2026–27 సంవత్సరానికి 11 వతరగతిలో ప్రవేశానికి మరోసారి గడువును పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి అన్నమయ్య, కడప జిల్లాకు చెందిన విద్యార్ధులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్ఏవీవోడీఏవైఏ.జీవోఎన్ వె వెబ్సైట్ను సందర్శించాలన్నారు. చివరి తేది 23–10–2025 అని వెల్లడించారు. ● 2026–27 సంవత్సరానికి సంబంధించి 9వ తరగతిలో ప్రవేశానికి కూడా గడువును పెంచినట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ తెలిపారు. 23.10. 2025 వరకు గడువు ఉందని వెల్లడించారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణ మూర్తులను అందంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. గాలివీడు: మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పర్యావరణ మండల ప్రత్యేక అధికారి.. ఉపాధిహామీ పీడీ వెంకటరత్నం అన్నారు.శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛమైన గాలి– ఆరోగ్యకరమైన జీవనం‘అనే అంశంపై జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్, ఎస్ డబ్ల్యూపీసీ సెంటర్లో మొక్కలు నాటే కార్యక్రమం,సైకిల్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పరిరక్షించాలని తెలిపారు.కార్యక్రమంలో మండల పరిషత్ అభివద్ధి అధికారి శకె.చంద్ర మౌలీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిమి శ్రీరామనాథ్కు గడియారం సాహిత్య పురస్కారం
కడప సెవెన్రోడ్స్ : హెదరాబాదుకు చెందిన యువకవి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరిమి శ్రీరామనాథ్ ‘మహాకవి’ డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 44వ సాహిత్య పురస్కారానికి ఎంపికై నట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి తెలిపారు. పురస్కార ప్రదాన సభ రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేది సాయంత్రం 5:30 గంటలకు ప్రొద్దుటూరులోని అరవిందాశ్రమంలో నిర్వహిస్తున్నామన్నారు. 1982 నుంచి ప్రతి ఏటా రాష్ట్ర స్థాయిలో ఎంపికై న కావ్యానికి బహూకరిస్తూ వస్తున్న ఈ అవార్డుకు 2025 సంవత్సరానికి పరిమి శ్రీరామనాథ్ రచించిన ‘జీవాతువు’ అనే కావ్యం ఎంపికై నట్లు తెలిపారు. పురస్కార ప్రదాన సభలో శ్రీరామనాథ్కు కవి సన్మానం, అవార్డుకు గాను రూ.10,000 నగదు బహుమతి, పురస్కారపత్రం, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. యువకుడి ఆత్మహత్య చక్రాయపేట : మండలంలోని గండి కొవ్వూరు గ్రామం ఓబుళనాయునిపల్లెలో గండికోట జగదీష్(18) అనే యువకుడు తమ ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగదీష్ తల్లిదండ్రులు జనార్దన, పావని జీవనోపాధి నిమిత్తం కువైట్లో ఉన్నారు. లక్కిరెడ్డిపల్లెలోని అమ్మమ్మ ఇంటివద్ద జగదీష్ ఉండేవారు. తనకు బుల్లెట్ బైకు కొనివ్వమని ఫోన్ చేసి వత్తిడి తేవడంతో తండ్రి మందలించాడని మనస్థాపానికి గురై లక్కిరెడ్డిపల్లె నుంచి ఓబుళనాయునిపల్లెలో ఉన్న ఇంటికు వచ్చాడు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీష్ ఫోన్ పనిచేయక పోవడంతో పాటు అలిగి వచ్చాడని అతని అమ్మమ్మ శనివారం ఓబుళనాయునిపల్లెలోని ఇంటి వద్దకు వచ్చి తలుపు తీయగా జగదీష్ ఉరివేసుకుని ఉండటాన్ని గమనించింది. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఉమ్మడి కడప జిల్లాలో కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ను ప్రవేశ పెట్టిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని కడప నగరం, బద్వేలు, సిద్దవటం పరిధిలోని మద్యం దుకాణాల్లోని అమ్మకాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మద్యం కొనుగోలు చేసే వ్యక్తి ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా స్కాన్ చేయగానే మద్యం తయారీ, ధర, తయారు చేసిన కంపెనీ, ఏ మద్యం దుకాణంలో విక్రయించారు అనే వివరాలు పొందవచ్చన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
రాజంపేట : రాజంపేట–రాయచోటి రోడ్డులోని పాలకేంద్రం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి కొనిరెడ్డి మహేంద్రరెడ్డి మృతి చెందాడు. నగరవనం నుంచి బైకులో వస్తూ పాలకేంద్రానికి ఎడమవైపు ఉన్న ఎంజీఆర్ ఐరన్ హోర్డింగ్ను బలంగా ఢీ కొట్టాడు. బైకు రైడర్ మహేంద్రకు రక్తగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న స్నేహితునికి స్వల్ప గాయాలు అయ్యాయి. సీఐ నాగార్జున మాట్లాడుతూ రాజంపేట పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హెల్మెట్ ధరించాలన్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం, అతివేగంగా బైకులను నడపటం ప్రమాదకరమన్నారు. ఒక్కసారి విద్యార్థులు తమ కుటుంబం, తల్లిదండ్రులను గుర్తుంచుకొని, బైకులు జాగ్రత్తగా నడపాలన్నారు. ఈ ప్రమాదంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన విద్యార్థిని సీఐ నాగార్జున, ఎస్ఐలు పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. మదనపల్లె సహకార గృహ నిర్మాణ సంఘ కార్యవర్గ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల రాయచోటి జగదాంబసెంటర్ : మదనపల్లె పట్టణంలోని మదనపల్లె సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్కు నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొనేందుకు నోటిఫికేషన్ను ఈ నెల 18వ తేదీన విడుదల చేసినట్లు ఎన్నికల అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 22న నామినేషన్ల స్వీకరణ, 23న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ, 24న నామినేషన్ల తుది జాబితా సాయంత్రం 5 గంటల తరువాత ప్రకటన, 29న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మదనపల్లెలోని రామాలయం వీధి సొసైటీ కాలనీలో గల నెహ్రూ మున్సిపల్ ప్రైమరీ, హైస్కూల్లో ఉంటుందన్నారు. ఈ నెల 30న అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు. ఆక్రమణకు యత్నించిన వ్యక్తులపై కేసులు నమోదు మదనపల్లె రూరల్ : ప్రభుత్వ భూముల ఆక్రమణకు యత్నించిన వ్యక్తులపై తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. మండలంలోని కోళ్లబైలు పంచాయతీ సర్వే నెంబర్.599/4లోని ప్రభుత్వ స్థలం స్వరూప స్వభావాలు మార్చి చదును చేసేందుకు ప్రయత్నించిన పట్టణంలోని నీరుగట్టువారిపల్లె గజ్జలకుంటకు చెందిన కె.శ్రీనివాసులు, భాస్కర్పై కేసు నమోదు చేశామన్నారు. అదే విధంగా కోళ్లబైలు పంచాయతీ సర్వేనెంబర్.598/3, 599/2 లోని ప్రభుత్వ స్థలాన్ని రాయచోటి కృష్ణాపురానికి చెందిన వలిపి సిద్ధయ్య, నీరుగట్టువారిపల్లె గజ్జలకుంటకు చెందిన నాగమల్లు.. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి, ప్రభుత్వ స్థలాన్ని చదునుచేసి ఆక్రమించేందుకు ప్రయత్నించారన్నారు. తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బాలికపై మేనమామ వేధింపులు కై కలూరు : మేనమామ వేధించడంతో పాటు తల్లి, అమ్మమ్మ, తాత చిత్రహింసలకు గురిచేశారని 9వ తరగతికి చెందిన బాలిక బావురుమంది. నరకం నుంచి బయటపడ్డానని గాయాలను చూపించింది. ఈ ఘటన ఏలూరు జిల్లా కై కలూరు మండలం చటాకాయికి చెందిన బాలికపై వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సమీప అగ్రహారంలో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం ఆమెను తండ్రి కై కలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చాడు. పోలీసులకు ఆమె వివరాలు వెల్లడించింది. బాధితురాలు, ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. చటాకాయికి చెందిన జయమంగళ కుమార అభిమన్యుడుకి ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన కామాక్షితో 2009లో వివాహమైంది. వీరికి 2012లో అమ్మాయి జన్మించింది. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కుమార్తె తండ్రి వద్ద ఉంటోంది. కామాక్షి మరో వ్యక్తిని వివాహం చేసుకోగా.. అభిమన్యుడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె (14) తండ్రి వద్దే ఉంటూ భుజబలపట్నంలో 9వ తరగతి చదువుతోంది. దసరా పండక్కి తీసుకెళ్లి:తండ్రి లేని సమయంలో కామాక్షి, ఆమె తల్లి చటాకాయలో ఉంటున్న బాలిక వద్దకు వచ్చి దసరా పండగకు దుస్తులు కొంటామని ప్రత్తికోళ్లలంక, అక్కడ నుంచి కామాక్షి సోదరుడు ఉమాశంకర్, తల్లిదండ్రులు నాగులమ్మ, వెంకటరమణ ఉంటున్న కడప జిల్లా బద్వేలుకు తీసుకువెళ్లారు. బాలికను అక్కడే ఉండాలని బలవంతం చేయడంతో ఆమె నిరాకరించి తండ్రి వద్దకు వెళతానని చెప్పింది. దీంతో తన తల్లి కామాక్షి ఇష్టానుసారం తనను కొట్టిందని బాలిక వాపోయింది. మేనమామ ఉమాశంకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు చెప్పింది. బద్వేలులో బాలిక పరిస్థితిని చూసిన ఓ వ్యక్తి తండ్రి అభిమన్యుడికి ఫోన్ చేయగా అక్కడికి వెళ్లి శుక్రవారం రాత్రి చటకాయకు తీసుకువచ్చారు. -
ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఓబులవారిపల్లె: చిన్నఓరంపాడు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మోటార్ బైక్పై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు. పెన్నానదిలో యువకుడి గల్లంతుసిద్దవటం : మండలంలోని వంతాటిపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పెయ్యల నంద (36) అనే యువకుడు శనివారం పెన్నానదిలో గల్లంతయ్యాడు. వంతాటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెన్నానది వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ పెన్నానది నీటిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న సిద్ధవటం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బైకులు ఢీకొని గాయాలుచింతకొమ్మదిన్నె : మండలంలోని ఊటుకూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొనడంతో యల్లటూరు ప్రదీప్ అనే యువకుడికి గాయాలయ్యాయి. కాలు విరగడంతో ప్రదీప్ను స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. -
ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
నందలూరు : మండలంలోని మదనమోహనపురం క్రాస్ సమీపంలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఎస్ఐ మాట్లాడుతూ రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ, నందలూరు సిబ్బంది, అన్నమయ్య ఆర్ఎస్ టాస్క్ఫోర్స్ సిబ్బంది కలిసి ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మండలంలోని ఎంఎం పురం క్రాస్ రోడ్డు సమీపంలో ఆవుల రవికుమార్, పొత్తపి పెంచలయ్య, బండారు సందీప్, కానపర్తి వంశీకృష్ణ, ఇమిడి నాగరాజు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి బరువు సుమారు 512.9 కేజీలు, వాటి విలువ సుమారు రూ.6.85 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ, స్థానిక ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, పోలీసు సిబ్బందిని, అన్నమయ్య జిల్లా ఆర్ఎస్ టాస్క్ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ అభినందించారు.20 దుంగలు స్వాధీనం -
లక్ష మద్యం బాటిళ్ల స్కానింగ్
మదనపల్లె రూరల్ : జిల్లాలో ప్రతిరోజు మద్యం దుకాణాల్లో లక్షకు పైగా మద్యం బాటిళ్లను స్కానింగ్ చేసి విక్రయిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. శనివారం పట్టణంలోని పలు మద్యం దుకాణాలు, బార్లలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తనిఖీ చేశారు. షాపులో మద్యం బాటిల్ను స్వయంగా స్కాన్ చేసి అందులోని వివరాలను వినియోగదారుడికి చూపించి విక్రయించారు. ఈ సందర్భంగా ఈఎస్ మధుసూదన్ మాట్లాడుతూ.. ఈనెల 16 నుంచి జిల్లాలోని 122 మద్యం దుకాణాలు, 11 బార్లలో మద్యం బాటిళ్లను స్కాన్ చేశాకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. రోజుకు సుమారుగా రూ.1.62 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా కల్తీ మద్యం విక్రయాలు జరగడం లేదన్నారు. స్కాన్ విధానంపై మద్యం వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మద్యం షాపు పర్మిట్ రూముల్లో కిచెన్లు, రెస్టారెంట్లు నిర్వహించరాదన్నారు. మద్యం దుకాణాలు, బార్లు సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మదనపల్లె ఎకై ్సజ్ సీఐ భీమలింగ, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలపై బస్సు జాతా
రాయచోటి టౌన్ : రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్సు జాతాను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు కోరారు. శనివారం రాయచోటి పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ ఈ బస్సు జాతా ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు సాగుతుందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.6400 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4500 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని వెంటనే వాటిని పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రించాలని కోరారు. ప్రభుత్వ ఎస్పీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, ప్రతి మండలానికి ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నారాయణ, ధనకుమార్, రఘుపతి, రెడ్డికుమార్, వంశీ, ఆశిక్ తదితరులు పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి
బి.కొత్తకోట : బి.కొత్తకోటకు సమీపంలోని బాలసానివారిపల్లెలో శనివారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేసి విచక్షణారహితంగా కొరకడంతో 50 గొర్రెలు మృతి చెందాయి. బాలసానివారిపల్లెకు చెందిన ఎం.బాబు గొర్రెల పెంపకంతో జీవిస్తున్నాడు. శనివారం వర్షం కురవడంతో గొర్రెలను గ్రామంలోనే గొర్రెలదొడ్డిలో వదిలి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎక్కడినుంచో వచ్చిన వీధి కుక్కలు గొర్రెలదొడ్డిలోకి దూరి గొర్రెలపై దాడి చేశాయి. దీంతో 50 గొర్రెలు మృతి చెందగా రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. మూడు నెలల క్రితం ఇలాగే బాబుకు చెందిన 11 గొర్రెలను కుక్కలు కొరికి చంపేయగా రూ.లక్ష నష్టం జరిగింది. ఇప్పుడు మళ్లీ 50 గొర్రెలు చనిపోవడంతో తనకు దిక్కేది అంటూ ఆవేదన చెందుతున్నాడు. కాగా బాలసానివారిపల్లె సమీపంలోని కమ్మోరుపల్లెలో మూడు రోజుల క్రితం కుక్కలు దాడి చేయడంతో హరి అనే వ్యక్తికి చెందిన 12 గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధితునికి రూ.1.20 లక్షల నష్టం వాటిల్లింది. వీధి కుక్కలను అదుపుచేసి గొర్రెలను కాపాడాలని రైతులు అధికారులను కోరుతున్నారు. -
ఫ్రీ బస్ను వెంబడించిన యువకులు.. ఎందుకంటే?
అన్నమయ్య జిల్లా: కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని కొత్త బోయనపల్లె (రాజంపేట మండలం) సమీపంలో ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట–కడప మధ్య నడిచే పల్లె వెలుగు బస్సును డ్రైవర్ న్యూబోయనపల్లె వద్ద ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో కొందరు యువకులు బస్సును వెంబడించి డ్రైవర్, కండెక్టర్తో వాగ్వాదానికి దిగారు. మహిళా ప్రయాణికులు డ్రైవర్ తీరుపై విరుచుకుపడ్డారు. ఉచిత బస్సు ఓవర్ లోడ్తో ఉన్నా ఆపాల్సిందేనని ప్రయాణికులు పట్టుబడుతుండడంతో డ్రైవర్, కండెక్టర్లు నిస్సహాయ స్థితిలో చేతులెత్తేస్తున్నారు. -
ఆర్డీఎస్ఎస్తో 24 గంటల విద్యుత్ సరఫరా
మైదుకూరు : గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీఎస్ఎస్ (రివేంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం)తో 24 గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ అన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని రాయప్పగారిపల్లె వద్ద జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం రాయప్పగారిపల్లెలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ అనుకూల, గ్రామీణాభివృద్ధి కేంద్రీకృత దృక్పథాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలను ఏపీఎస్పీడీసీఎల్ విజయవంతంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దువ్వూరు : పీఎం–కుసుం ఫీడర్ సోలార్ విద్యుద్దీకరణ పనులనుఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ శుక్రవారం పరిశీలించారు. దువ్వూరు జగనన్న కాలనీ వద్ద ఐదు మెగావాట్ల సామర్థ్యంతో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. విద్యుదుత్పత్తికి అవసరమైన స్థల సేకరణ, మట్టి పరీక్ష అంశాలపై అధికారులతో సమీక్షించారు. రైతులకు నాణ్యమైన, నిరంతర ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమణ, ఈఈలు లక్ష్మీపతి, నాగరాజు, డీఈఈలు శ్రీకాంత్, శివభాస్కర్, ఏఈలు రాజ్కుమార్, రామభద్రయ్య, హరి పాల్గొన్నారు.ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
● ప్రతి రోజు వంద టన్నులకుపైగా ఇసుక తరలింపు ● మండల స్థాయి టీడీపీ నాయకుడి అండతో రవాణాసాక్షి టాస్క్ఫోర్స్ : మండలస్థాయి టీడీపీ నేత అండతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. చక్రాయపేట మండలం మారెళ్ల మడక సమీపంలో ప్రభుత్వం ఇసుక రీచ్ ఏర్పాటు చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు రీచ్లో భారీగా వర్షపునీరు చేరింది. ఈ పరిణామం చక్రాయపేట మండల టీడీపీ నాయకుడికి వరంగా మారింది. అద్దాలమర్రి చెక్ పోస్టు సమీపంలో అమ్మవారి గుడి వద్ద పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులో ఉండడం గమనించి దానిపై ఆ నాయకుడు కన్నేశారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతంలో హిటాచీ ఏర్పాటుచేసి నిత్యం వంద టన్నులకు పైగా ఇసుక తరలించేస్తున్నారు. నిత్యం ఇది కనిపిస్తున్నా.. ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. టన్నుల వారీగా వచ్చే ఆదాయంలో వాటాల రూపంలో అందరికీ చేరుతోందనే ఆరోపణలున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మవారి ఆలయం నిర్మించి అక్కడి వరకూ సీసీ రహదారి నిర్మించింది. ఈ ఆలయ సమీపంలోనే తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. -
తవ్వేశారు.. బిల్లు చేసుకుని పూడ్చేశారు
● ఫారంపాండ్ పేరుతో తెలుగు తమ్ముళ్ల అక్రమార్జన ● వాటర్షెడ్లో రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగంపెద్దతిప్పసముద్రం : కూటమి ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్లు అధికారులను కను సైగలతో శాసిస్తూ లక్షల రూపాయల ప్రజా ధనం దోచేస్తున్నారు. సొంత భూములు కలిగిన రైతులకు సమాచారం ఇవ్వకుండా బినామీ పేర్లతో రైతుల పొలాల్లో ఫారంపాండ్ పనులు చేపట్టి బిల్లులు చేసుకున్నాక గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేస్తున్నారు. మండలంలోని సంపతికోట పంచాయతీ కొత్తపల్లికి చెందిన పి.రామలక్ష్మమ్మ పేరిట ఎలాంటి వ్యవసాయ భూములు లేవని సమాచారం. అయితే అదే పంచాయతికి చెందిన వల్లీసాబ్కు బోడిగుట్ట సమీపంలో ఖాతా నంబర్ 820లో అసైన్మెంట్ భూమి ఉంది. ఆయన కుటుంబీకులు బెంగళూరులో ఉంటూ నెలకోసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు వల్లీసాబ్ పొలంలో వాటర్షెడ్ ద్వారా మూడు నెలల కిందట ఫారంపాండ్ నిర్మించి బిల్లులు చేసుకోవాలని తలపెట్టారు. అనుకున్న వెంటనే పని గుర్తింపు సంఖ్య 20083లో రూ.1.85 లక్షల అంచనాతో పనులు పూర్తి చేశారు. భూమే లేని పి.రామలక్ష్మమ్మ పేరిట వల్లీసాబ్ పొలంలో చేసిన పనులకు బిల్లులు చేసుకున్నారు. వారం రోజుల కిందట వల్లీసాబ్ వచ్చి తన పొలం వద్ద ఫారంపాండ్ పనులు చూసి అవాక్కయ్యాడు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా పనులెలా చేపట్టారని కూటమి నాయకులను గట్టిగా నిలదీశాడు. ఇక చేసేది లేక తెలుగు తమ్ముళ్లు మూడు రోజుల కిందట జేసీబీ యంత్రాన్ని రప్పించి ఫారంఫాడ్ను గుట్టుగా పూడ్చేశారు. లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. నిధులను రికవరీ చేయాలి వాటర్షెడ్ ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయాలి. ఫారంపాండ్ పనికి మంజూరు చేసిన ప్రజాధనాన్ని అధికారులు రికవరీ చేయాలి. కమిటీల ఆమోదం లేకుండా అధికారులను బెదిరించి బిల్లులు చేసుకోవడం పద్ధతి కాదు. సెంటు భూమి కూడా లేని బినామీల పేరిట బిల్లులు చేసుకోవడం సబబుకాదు. రైతులు, కమిటీలు, అధికారుల ఆమోదంతో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపట్టాలి. –రఘునాథ్రెడ్డి, వాటర్షెడ్ ఛైర్మన్, సంపతికోట -
శాసీ్త్రయతపై విద్యార్థులకు అవగాహన
రాయచోటి టౌన్ : శాసీ్త్రయ దృక్పథంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సు ఉపయోగ పడుతుందని డీవైఈవో నాగయ్య పేర్కొన్నారు. పట్టణంలోని రాయచోటి డైట్ కళాశాలలో జిల్లా సైన్స్ అధికారి మార్లఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శన కనబరచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలను డీవైఈఓ అందజేశారు. ఆయన మాట్లాడుతూ క్వాంటం యుగం ప్రారంభం.. బలాలు, బలహీనతలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సెమినార్లో ప్రెజెంటేషన్, వైవా, అప్టిట్యూడ్ టెస్టుల ద్వారా పరీక్షించి ప్రతిభ కనబరిచిన సంబేపల్లె మోడల్ స్కూల్ విద్యార్థి బొజ్జ విశ్వానందరెడ్డి, వాల్మీకిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన షామీన్ తాజ్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. శనివారం విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, రెడ్డెయ్య, శ్రీనివాసరాజు, మడితాటి నరసింహారెడ్డి, దిలీప్కుమార్, రవిశంకర్రెడ్డి, శివలక్ష్మి, రంజిత, హేమంత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
అనాథ శవానికి అంత్యక్రియలు
మదనపల్లె సిటీ : మానవత్వం పరిమళించింది. పొట్టకూటి కోసం వచ్చిన బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కూలీలు పీటీఎం మండలం కందుకూరులో విద్యుత్తు షాక్తో మృతిచెందారు. మృతదేహాలను స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. కుటుంబీకులు, రక్తసంబంధీకులు ఎవరూ రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హిందూ సంప్రదాయబద్ధంగా ఇద్దరికీ స్థానిక శ్మశాన వాటిలో వారు దహన సంస్కరణలు చేశారు. కార్యక్రమంలో హెల్పింగ్మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్సిద్దిక్, సభ్యులు ఆనంద్, సమీర్, నవీన్, సుబ్బు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరికవీరబల్లి్: మండలంలోని వంగిమల్ల గ్రామామంలో పది కుటుంబాల టీడీపీ కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో పెదివేటి వేరునాగయ్య, చెన్నయ్య, బాలయ్య, అలీ, బాబు, అశోఆక్ కుమార్ తదితరులు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. వారు మాట్లాడుతూ టీడీపీలో ప్రజలకు ఏమి న్యాయం జరగలేదని, గత జగనన్న పరిపాలనలో జరిగిన సంక్షేమం, ఆర్థికాభివృద్ది దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరామని తెలిపారు. అనంతరం విజయభాస్కర్రెడ్డి, ఎంపీపీ రాజేంద్రనాథ్రెడ్డిలను రాజంపేట వైఎస్సార్సీపీ నాయకులు మదన్రెడ్డి, తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డప్పరెడ్డి, తారకేశ్వర్రెడ్డి, సురేంద్రనాథ్రెడ్డి, కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మహిళపై దాడిమైదుకూరు : పట్టణంలోని అరుంధతీ నగర్కు చెందిన మహిళ గద్దె సుజాతపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఈ నెల 11న సుజాత భర్త రవికి, బొచ్చెనపల్లె పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుకు మధ్య వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈ నెల 14న సుజాతపై ముగ్గురు దాడి చేసి గాయపరిచి అవమానపరిచారు. చికిత్స కోసం ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చేరిన బాధితురాలు అక్కడ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుపై ఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేశారు. ఝరికోనలో మృతదేహంకలకడ : మండలంలోని ఝరికోనలో గుర్తుతెలియని మృత దేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రామాంజ నేయులు శుక్రవారం పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రెండు రోజుల కిందట నీటిలో పడి ఉండవచ్చునని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలన్నారు -
ఆర్ఎంపీ క్లినిక్, ల్యాబ్ సీజ్
మైదుకూరు : ఛాతీనొప్పితో వచ్చిన మహిళకు చేసిన వైద్యం వికటించి మృతి చెందడానికి కారణమైన ఆర్ఎంపీ క్లినిక్, ల్యాబ్ను వైద్య శాఖ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మైదుకూరు పట్టణంలోని కడప రోడ్డుకు చెందిన ఓ మహిళ గురువారం మధ్యాహ్నం ఛాతీనొప్పితో బాధపడుతూ అదే రోడ్డులోని మెడికల్ షాప్ నిర్వాహకుడు వద్దకు వెళ్లారు. ఆయన చేసిన వైద్యం వికటించడంతో మహిళ మృతిచెందిన విషయంపై సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లేష్, జిల్లా డెమో ఆఫీసర్ భారతి, వైద్యాధికారులు ఎంవీఆర్ మెడికల్ స్టోర్ను తనిఖీ చేశారు. షాప్ నిర్వాహకుడు అనుమతులు లేకుండా ఆర్ఎంపీగా క్లినిక్, ల్యాబ్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ నాగరాజు ఆదేశాలతో మెడికల్ షాప్, క్లినిక్ను సీజ్ చేసి డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశామని డెమో అధికారి భారతి తెలిపారు. ఈ తనిఖీల్లో మెడికల్ ఆఫీసర్ ఎస్.అయేషా, డిస్ట్రిక్ట్ లీగల్ కన్సల్టెంట్ ఎం.పాలేశ్వరరావు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఎం.మరియాకుమారి, ఆర్.వెంగళరెడ్డి, టి.జయప్రకాష్, కె.వీరాంజనేయులు, డి.వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం యశోద పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి జమ్మలమడుగు రూరల్: మండలానికి చెందిన వల్లెపు రాంబాబు (40) శుక్రవారం సాయంత్రం విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మండలంలోని భీమరాయుని కొట్టాల గ్రామానికి చెందిన వల్లెపు రాంబాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లాడు. తిరిగి వచ్చి ఫోన్ తీసే క్రమంలో ప్లగ్ ఊడి వచ్చింది. దీంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు భార్య వల్లెపు రూపావతి తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. తీగలు తగిలి గేదెలు.. వల్లూరు : మండలంలోని భాకరాపురం గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి రెండు గేదెలు మృతిచెందినట్లు బాధిత రైతు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన గాలి వానకు బాకరాపురం సమీపంలోని పొలాల్లో విద్యుత్ లైన్లు తెగి నేలమీద పడ్డాయి. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామానికి చెందిన టి.నాగేశ్వర్రెడ్డి తన గేదెలను మేపడానికి పొలానికి తీసుకువెళ్లాడు. పొలంలో తెగి పడిన తీగలు రెండు గేదెలకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. మిగిలిన గేదెలను పక్కకు తోలడంతో అవి సురక్షితంగా బయటపడ్డాయి. సుమారు లక్షన్నర రూపాయల విలువ చేస్తుందన్నారు. పరిహార ం ఇచ్చిఆదుకోవాలని రైతు కోరారు. -
ఎర్రచందనం కేసులో ఇద్దరికి జైలుశిక్ష
ములకలచెరువు/తిరుపతి లీగల్ : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ కె.శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ ఆర్.గణేష్ తెలిపిన వివరాల మేరకు.. 2019 డిసెంబర్, 5న ములకలచెరువు పోలీసులకు వచ్చిన సమాచారంతో మదనపల్లె–కదిరి రోడ్డు తంబేపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. మదనపల్లె నుంచి ఓ టాటా సుమో వాహనం అతివేగంగా వస్తూ పోలీసులలను చూసి ఆగింది. ఆ వాహనంలోని ఇద్దరు కర్ణాటక, కోలార్ జిల్లా బంగారుపేట తాలూకా, దొడ్డూరుకు చెందిన నారాయణప్ప శివకుమార్, బంగారు పేట తాలూకా కురబర హళ్లికి చెందిన సుబ్రహ్మణ్యం, మంజునాథ్ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టాటా సుమో వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న 162 కిలోల ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
చెరువులో పడి ఒకరు మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ మండలం శిబ్యాల పరిధిలోని కానుగ చెరువులో పడి పఠాన్మున్నా (40) శుక్రవారం మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. శిబ్యాల గ్రామం (చెరువుకు దగ్గరగా ఉన్న ఊరు)లోని తన ఇంటి నుంచి గేదెలను మేపేందుకు పఠామున్నా వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ సాగించారు. పశువులు మేపేందుకు వెళ్లిన ఆధారాలు ఉండటం, తరువాత ఇంటికి రాకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో చెరువులో గాలించి మృతదేహాన్ని గుర్తించారు. గేదెలు మేస్తూ చెరువులోకి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. మున్నా కూడా నీటి మడుగులో నుంచి గేదెలను బయటకు తోలేందుకు వెళ్లి అక్కడ లోతైన గుంటలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


