breaking news
Annamayya
-
ప్రతిభకు కౌశల్ !
మదనపల్లె సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘కౌశల్’2025 పోటీలు దోహదపడుతాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి కౌశల్–2025 పేరిట రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభ అన్వేషణ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. భారతీయ విజ్ఞాన మండలి, ఏపీ సైన్స్ సిటీ, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో ఏటా ఈ పోటీలలను నిర్వహిస్తున్నారు. క్విజ్ పోటీలకు 8,9,10 తరగతుల నుంచి ఒక్కో తరగతికి ముగ్గురు, రెండు నిమిషాల వ్యవధితో కూడిన రీల్స్/ షార్ట్స్ పోటీలకు,పదో తరగతి నుంచి ఇద్దరు, పోస్టర్ తయారీ–1 పోటీలకు 9వ, పోస్టర్–2కు 8వ తరగతి నుంచి ఇద్దరు చొప్పున పాల్గొనాలి. ప్రతిభ కనబరిచిన వారిని ఆయా విభాగాలకు 20 మంది చొప్పున జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. విజేతలను జిల్లా రాష్ట్ర స్థాయిల్లో నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికలు అందజేస్తారు. ఆసక్తిగల విద్యార్థులు పాఠశాల సమన్వయకర్త ద్వారా అక్టోబర్ 24వతేదీలోపు www.bvmap.org వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని కౌశల్–2025 డివిజన్ సమన్వయకర్త భాస్కరన్ తెలిపారు. ఈ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8,9,10 తరగతుల విద్యార్థులు అర్హులు. కౌశల్ పోటీలకు 8,9,10 తరగతుల సిలబస్ నుంచి గణితం, ఫిజిక్స్, నేచురల్ సైన్సులపై ఉంటుంది. క్విజ్ పోటీల్లో... రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.15వేలు, ద్వితీయ బహుమతిగా రూ.12 వేలు, తృతీయ బహుమతిగా రూ.9 వేలు, ప్రోత్సాహక బహుమతిగా రూ.6 వేలు అందజేస్తారు. జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాలకు రూ.4,500, రూ.3,000, రూ.1,500 నగదు ఇస్తారు. పోస్టర్ ప్రజంటేషన్లో... రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.5 వేలు, రూ. 3 వేలు, రూ.2 వేలు చొప్పున అందజేస్తారు. కన్సోలేషన కింద రూ.1500 చొప్పున అందజేస్తారు. జిల్లా స్థాయిలో ప్రథమ రూ.1500, ద్వితీయ రూ.1000 ఇస్తారు. వైజ్ఞానిక లఘ చిత్ర పోటీల్లో ... వైజ్ఞానిక లఘచిత్ర పోటీల్లో కేవలం 10వ తరగతి విద్యార్థులే పాల్గొనాలి. లఘచిత్రం నిడివి రెండు నిమిషాలు ఉండాలి. రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2వేలు చొప్పున అందజేస్తారు. ప్రోత్సాహక బహుమతికి కింద రూ.1500 ఇస్తారు. జిల్లా స్థాయిలో ప్రథమ రూ.1500, ద్వితీయ రూ.వెయ్యి చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. పరీక్షల తేదీలు: పాఠశాల స్థాయిలో నవంబర్ 1,3,4 తేదీల్లో, జిల్లా స్థాయిలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి కౌశల్ –2025 పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాలు ప్రోత్సహించాలి. పిల్లల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదపడతాయి. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునేలా ఎంఈఓలు, హెచ్ఎంలు కృషి చేయాలి. – భాస్కరన్, కౌశల్ డివిజన్ సమన్వయకర్త. ఆన్లైన్ పరీక్ష తేదీలుపాఠశాల స్థాయి : నవంబర్ 1,3,4 తేదీలు జిల్లా స్థాయి : 8,9 తరగతులకు నవంబర్ 27న, పదో తరగతికి నవంబర్ 28 రాష్ట్రస్థాయి : డిసెంబర్ 27 -
బస్సు డ్రైవర్పై ప్రయాణికుల దాడి
రైల్వేకోడూరు అర్బన్ : బస్సు డ్రైవర్పై ప్రయాణికులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట వద్ద ప్రయాణికులు బస్సుకోసం వేచి యున్నారు. రాజంపేట డిపో ఆర్టీసీ బస్సు తిరుపతికి వెళ్తుండగా.. ప్రయాణికులు బస్సు ఆపారు. డ్రైవర్ బాషా ఆపకుండా పోవడంతో కొందరు యువకులు బస్సును వెంబడించి డ్రైవర్, కండెక్టర్లపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. ఇంకా కేసు నమోదు కాలేదు. బాలిక హత్య కేసులో అనుమానితులకు పాలిగ్రాఫ్ టెస్ట్జమ్మలమడుగు రూరల్ : గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో అనుమానితులైన కొండయ్య, సురేంద్ర, బాలిక స్నేహితుడు లోకెష్లను పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం సిఐ నరేష్బాబు ఈ నెల 5న విజయవాడకు తీసుకెళ్లారు. గత మూడు రోజులుగా అనుమానితులకు పాలిగ్రాఫ్ పరీక్ష చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 10వతేదీన కోర్ట్ అనుమతి ఉండడంతో హత్య కేసు చిక్కుముడి వీడనుంది. గండికోటలో మైనర్ బాలిక హత్య జూలై 14న జరిగింది. 85 రోజులు అయినా నిందితులు ఎవరినీ పోలీస్ అధికారులు గుర్తించలేదు. సాంకేతిక సాయంతో గుర్తించాలని అగష్టు 26న జమ్మలమడుగు కోర్టులో నిందితులను హాజరుపరచారు. జడ్జి అంగీకరించడంతో ముగ్గురిని విజయవాడకు తీసుకెళ్లారు. -
ప్రజల భద్రతే.. మా ప్రథమ కర్తవ్యం
రాయచోటి : జిల్లా ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల సహకారమే నేరాలను అరికట్టేందుకు అసలు బలమని ఎస్పీ తెలిపారు. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, నీటి కుంటలు, బోర్లు వంటి ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లనీయ వద్దని హెచ్చరించారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియా మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, పేకాట, కోడి పందేలు, గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీటర్లు, నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఎక్కడైనా గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గ్రామాలలో అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
విద్యార్థిపై దాడి సంఘటనపై విచారణ
లక్కిరెడ్డిపల్లి : ఫీజు చెల్లించలేదని బి.కొత్తకోట రిషీవాటిక గురుకులం విద్యార్థి శేషాద్రిరెడ్డిపై రాయితీ దాడి చేసిన సంఘటనపై ఉన్నతాధికారులు బుధవారం విచారణ నిర్వహించారు. సాక్షిలో ప్రచురితమైన విద్యార్థిపై దాడి....ఘటనపై వారు స్పందించారు. అన్నమయ్య జిల్లా డీఎంఅండ్హెచ్ఓ లక్ష్మీ నరసయ్య చేరుకుని విద్యార్థికి వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో శేషాద్రిరెడ్డి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడిపై బోధనేతర సిబ్బంది వెంకటేష్ దాడి చేసి నెల రోజులవుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి కుడి కన్ను పూర్తిగా దెబ్బతిందని, పోలీసులు పాఠశాల యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అన్యాయంపై ప్రశ్నిస్తుంటే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. శేషాద్రి రెడ్డి కేసును జిల్లా యంత్రాంగం నీరుగారుస్తోందని కన్నీటి పర్మంతమయ్యారు. వెంకటేష్ను అరెస్టు చేసే వరకూ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మదనపల్లి పోలీసులు తమను కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారన్నారు. -
చేతికొచ్చిన పంటను కోత కోయలేరు.. కోసి మార్కెట్కు తరలిస్తే కొనేవారే లేరు.. ‘మద్దతు’ పలకాల్సిన పాలకులకా కర్షకుడి కష్టమే పట్టడం లేదు. నోటి మాటలు.. వట్టి ‘కోత’లు తప్పా! ఇంకేముంది.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్లముందే కుళ్లిపోతోంది. ఇంటిల్లిపాది పడ్డ కష్ట
మైదుకూరు : జిల్లాలో ఉల్లి (పెద్ద బళ్లారి) పంటను సాగుచేసిన రైతులు కుదేలయ్యారు. అసలే గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులను గోరుచుట్టుపై రోకటి పోటులా వర్షాలు చుట్టుముట్టి దిక్కుతోచని స్థితిలో పడవేశాయి. జిల్లాలో మైదుకూరు, దువ్వూరు, వీరపునాయునిపల్లె, బ్రహ్మంగారిమఠం, ఖాజీపేట, చాపాడు, పులివెందుల తదితర మండలాల్లో 16,668 ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి ఉల్లి ధర అమాంతం పడిపోవడంతో రైతుల ఆశలు నేలపాలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ధర రూ. 400 – 500 మాత్రమే పలుకుతోంది. ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెట్టిన రైతులు క్వింటాల్ ధర పాతాళానికి పడిపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. ఆఖరికి పంట కోత కోసి విక్రయించడానికి అయ్యే ఖర్చులు కూడా రాకపోవడంతో చాలామంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. వీరపునాయని పల్లె మండలంలో వర్షాలకు పంట మునిగిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మైదుకూరు, దువ్వూరు మండలాల్లో పొలాల్లోనే వదిలేసిన ఉల్లి పంటను గొర్రెలు మేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైతుల కష్టాలపై స్పందించని కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర లేక కుదేలైన ఉల్లి రైతుల కష్టాలపై కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. రైతుల నుంచి క్వింటాల్ రూ.1200 తో కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన అధికారులు ఆచరణలోకొచ్చేసరికి చేతులెత్తేశారు. ఇంతవరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఊసే లేదు. గిట్టుబాటు ధర లేకపోవడం, వర్షాలతో పంట దెబ్బ తినడంతో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు హెక్టారుకు రూ.50 వేలు పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అది కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే వర్తిస్తుందని తెలియడంతో జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. అటు గిట్టుబాటు ధర లేక ఇటు వర్షాలతో పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా ఉల్లి రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధర లేక కుదేలైన రైతులు క్వింటాల్ రూ. 400 – 500కు పడిపోయిన ధర పంటనంతా పొలాల్లోనే వదిలేస్తున్న కర్షకులు -
పేద విద్యార్థుల కడుపుకొట్టేందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణ
● చంద్రబాబు దళిత వ్యతిరేకి.... కాదనేవాళ్లు చర్చకు రండి ● వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు సుధాకర్బాబు రాయచోటి టౌన్ : పేదవిద్యార్థుల కడుపు కొట్టేందుకే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు సుధాకర్బాబు ఆరోపించారు. బుధవారం రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముందు నుంచే దళితులంటే చంద్రబాబు నాయుడుకు గిట్టదని అన్నారు. మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలోకి తీసుకొస్తే పేద విద్యార్థులు నష్టపోవడమే కాకుండా ఉన్నత విద్యకు దూరం అవుతారన్నారు. అందుకే చంద్రబాబు పేద దళిత బిడ్డలు చదవకూడదని ప్రైవేటీ కరణ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దళితుల వ్యతిరేకి అనే విషయం అందరికీ తెలుసన్నారు. కాదనే వాళ్లు చర్చకు వస్తే చర్చిండానికి నేను సిద్ధం అని సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ నేతలను మద్యం కేసులో ఇరికించి బదనాం చేసేందుకు రాజంపేట ఎంపీ మిధున్ రెడిని అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నారు. ఇది కేవలం పెద్దిరెడ్డి కుటుంబంపై ఉన్న రాజకీయ కక్షే కారణమన్నారు. తంబళ్లపల్లెలో దొరికిన నకిలీ మద్యం తయారీదారులు ఎవరు..? వేల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లకొడుతున్న దొంగలు ఎవరో... చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లకు ఒకటి నకిలీ మద్యం బాటిల్ అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలకు ఎస్సీలకు, ఎస్టీలకు ఏమి ఇచ్చావో చెప్పాలని నిలదీశారు. వైఎస్ జగన్ను సీఎంగా చేసుకొనేందుకు జగనన్న పోర్స్ పేరిట ఒక టీంగా ఏర్పాటు అవుతున్నట్లు చెప్పారు. పోలీసులతో తలలు పగలకొట్టినా, కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీంఎ అయ్యే వరకు దళితులు అందరూ కలసి పోరాటాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. -
ఖాళీ చెక్కుతో కాసుల బేరం
సాక్షి టాస్క్ఫోర్స్ : సమాజంలో పరువుగా బతికే ఉద్యోగులు భయపడిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల వలలో చిక్కి లబోదిబోమంటున్నారు. ఏమి చేయాలో తోచక తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పలేని పరిస్థితి. 2016 నుంచి కొంత మంది అనుచరులను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకున్న ఓ వ్యాపారి దాష్టీకం ఇది. లక్ష రూపాయలు వడ్డీకి ఇచ్చి ఖాళీ చెక్కులు తీసుకోవడం.. మొత్తం చెల్లించినా.. తర్వాత ఎక్కువ మొత్తం చెక్కులో రాసి కోర్టు ద్వారా అధికంగా సొమ్ము లాక్కోవడం అతడికి ఆనవాయితీగా మారింది. బయటికి చెప్పుకోలేకపోతున్నామన్న ఉపాధ్యాయులు సాక్షితో స్వయంగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెకు చెందిన జింకా రవి గతంలో శిల్క్ వ్యాపారం చేసే వారు. నష్టాలు వచ్చాయని రూ.40 లక్షలకు 99/2003లో ఐపీ కేసు నమోదైంది. కోర్టు ద్వారా వేలంలో జింకా రవి ఇంటిని కూడా వేరొకరు కొన్నారు. ఈయనే 2016లో గుర్రప్ప స్వామి ఆటో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. పేరుకు మాత్రమే సంస్థ ఏర్పాటుచేశారు కానీ ఎలాంటి రికార్డులు మెయింటెనెన్స్ చేయడం, ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులనే టార్గెట్గా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నాడు. తీసుకున్న అప్పు కంతుల ప్రకారం చెల్లించినా తన వద్ద ఉన్న ఖాళీ చెక్కులను కోర్టులో వేసి రూ.లక్షకు రూ.10 లక్షలు బాకీ ఉన్నట్లు తన ఇష్టం వచ్చినట్లు ఖాళీ చెక్లో రాసుకుని బాకీదారులపై ఒత్తిడి చేసి వసూలు చేస్తున్నాడు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తూ పదవీ విరమణ చెందిన దంపతులు గుర్రప్ప స్వామి ఆటో ఫైనాన్స్లో అప్పు తీసుకున్నారు. రూ.లక్షల్లో బాకీ ఉన్నారని వారిపై 15 తప్పుడు కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలున్నాయి. ప్రొద్దుటూరు ఒకటో అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్, రెండో అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల పరిధిలో జింకా రవి, ఆయన అనుచరులు వేసిన కేసులు 300కు పైగానే ఉన్నాయనే ఆరోపణలున్నాయి. రూ.1.50 లక్షలు తీసుకుంటే రూ.36 లక్షలంటూ కోర్టుకు ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీలో నివసిస్తున్న వితంతురాలైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రూ.50 వేలు ఒక మారు, రూ.లక్ష మరో మారు వడ్డీకి తీసుకున్నారు. ఆమె రూ.3 లక్షలు చెల్లించారు. డబ్బు తీసుకున్న సమయంలో ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఖాళీ చెక్కులను ఆధారంగా చేసుకుని రూ.36 లక్షలు బాకీ ఉన్నట్లు కోర్టులో వేశాడు. తన కుమారుడు తిరుపతిలో ట్యాక్సీ నడుపుతుండటంతో అవసరాల కోసం ఆమె అప్పు తీసుకోవడం జరిగింది. గుర్రప్ప ఆటో ఫైనాన్స్ ఎండీ జింకా రవితోపాటు ఆయన అనుచరులు మొత్తం 7 కేసులు వేయగా 4 కేసులు కొట్టేశారు. మిగతా కేసులు విచారణలో ఉండగానే ఆమె చనిపోవడం జరిగింది. రూ.5 లక్షలకు.. రూ.20లక్షలట.. ప్రొద్దుటూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు రూ.లక్ష అప్పు తీసుకుని రూ.5 లక్షలు చెల్లించాడు. ఇంకా బాకీ ఉందని ఒత్తిడి చేయడంతో ఆ ఉపాధ్యాయుడు పక్కనున్న మండలానికి బదిలీ చేయించుకున్నారు. ఆయనపై రూ.20 లక్షలకు కోర్టులో కేసు వేశారు. 2019లో కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే తనకు వచ్చిన మెడికల్ బెన్ఫిట్ రూ.5 లక్షలు తనకంటే ముందుగానే బ్యాంక్ ద్వారా డ్రా చేసుకున్నాడు. ఈయనపై పెట్టిన రెండు కేసులను కోర్టులో కొట్టివేయడం జరిగింది. ఖాళీ చెక్కులపై అదనంగా రాసుకుని.. మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు యనమల సుబ్బరాయుడు గుర్రప్ప ఆటో ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకుని చెల్లించినా.. ఖాళీ చెక్కులను కోర్టులో వేసి తనకు ఇంకా బాకీ ఉందని కేసులు వేశారు. జింకా రవితోపాటు ఆయన అనుచరులు మొత్తం 7 కేసులు వేశారు. ఇందులో రెండు కేసులు కొట్టివేయగా, ఐదు కేసులు విచారణలో ఉండగానే గుండెపోటుతో ఉపాధ్యాయుడు మరణించాడు. మరో ఉపాధ్యాయుడిపై కూడా నాలుగు కేసులు వేయడం జరిగింది. మరో ఉపాధ్యాయుడు తాను తీసుకున్న డబ్బు చెల్లించినా కోర్టులో కేసు వేయడంతో విధిలేని పరిస్థితిలో ఆయన పక్క నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఆయన జింకా రవిని పిలిపించి హెచ్చరించడంతో కోర్టులో కేసు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు మానసిక వేదన అనుభించాడు. కోర్టులో కొట్టేసినా.. కె.చంద్రశేఖర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇచ్చిన ఖాళీ చెక్కుతో రూ.9 లక్షలు చెల్లించాలని 2017 జనవరి 7వ తేదీన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్ తరపున కేసు వేయగా 2019 మే 16న కొట్టేశారు. ఇదిలా ఉండగా తన వద్ద ఉన్న సదరు ఉపాధ్యాయుడి ఖాళీ చెక్కులను ఆసరాగా చేసుకుని రూ.4 లక్షలు చెల్లించాలని 2019 జూన్ 7న, జూలై 17న రూ.2.50 లక్షలకు మొదటి అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో తప్పుడు కేసులు వేయడం జరిగింది. ఓ మహిళా ఉపాధ్యాయురాలికి సంబంధించి 2019 మే 16న ఖాళీ చెక్తో దాఖలు చేసిన కేసును కొట్టివేయగా, 2019 మే 31న రూ.4.25 లక్షలకు మళ్లీ కేసు వేశారు. ఈ ప్రకారం గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్ ఎండీ జింకా రవి తరపున 2017లో 35 కేసులు, 2018లో 7 కేసులు, 2019లో 17 కేసులు, 2020లో 11 కేసులు వేశారు. జింకా వెంకటసుబ్బయ్య 42 కేసులు, జింకా బ్రహ్మయ్య 26 కేసులు, గుర్రం వెంకటలక్షమయ్య 9 కేసులు, పుల్లగూర చౌడయ్య 30 కేసులు, వద్ది ఓబయ్య 22 కేసులు వేశారు. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్వడ్డీ వ్యాపారి జింకా రవి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసుకున్నారు. 2016 నుంచి తక్కువ మొత్తం అప్పు ఇచ్చి ఉద్యోగులచే ఖాళీ చెక్కులను ఇప్పించుకుని తమ ఇష్టం వచ్చిన రీతిలో డబ్బు మొత్తాన్ని రాసుకుని కోర్టులో కేసు వేశారు. కోట్ల రూపాయలను అక్రమంగా పొందాలనే ప్లాన్తో ఇలా చేశారు. విచారణ జరిగిన కేసుల్లో 20కిపైగా కొట్టివేయడం జరిగింది. జింకా రవి వేసిన కేసుల్లో ఒకటి యదార్థంగా బాకీ ఉన్నట్లు అనిపించడం లేదు. అన్ని కేసులూ తప్పుడు కేసులే. ఒక కేసు కొట్టేశాక అదే వ్యక్తిపై మళ్లీ ఇంకొక కేసు వేశారు. – ఎన్సీ సుమంత్ కుమార్, న్యాయవాది, ప్రొద్దుటూరు వడ్డీ వ్యాపారి దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగులు విలవిల గుర్రప్ప స్వామి ఆటో ఫైనాన్స్ పేరుతో వ్యాపారం 300కు పైగా కేసులు వేసిన జింకా రవి, ఆయన అనుచరులు -
జిల్లాలో కొత్త రైల్వే లైన్
● మూడో ట్రాక్ నిర్మాణానికి సన్నద్ధం ● గుంతకల్ నుంచి ఓబులవారిపల్లె దాకా.. ● బొగ్గు గూడ్స్ రైళ్లకే పరిమితం ● జిందాల్ సహకారంతో ఏర్పాటు రాజంపేట : ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో కొత్తగా మూడో ట్రాక్ నిర్మాణానికి రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది. ముంబయి–చైన్నె కారిడార్ మార్గంలో గుంతకల్లు నుంచి ఓబులవారిపల్లె వరకు ఈ లైను నిర్మించనున్నారు. ఇప్పటికే గుత్తి–రేణిగుంట మధ్య డబ్లింగ్(డబుల్ లైను ట్రాక్) ఉన్న సంగతి విదితమే. సిమెంటు, బొగ్గు, ఐరన్తోపాటు ఇతర సరుకుల రవాణా అధికంగా ఉంటుంది. దీంతో జిందాల్ సంస్థ సహకారంతో మూడో లైన్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు) పూర్తయింది. గూడ్స్ రైళ్ల రాకపోకల కోసమే.. మూడో లైను ట్రాక్ నిర్మితం కేవలం గూడ్స్రైళ్ల నిర్వహణకు కేటాయించే విధంగా కొనసాగించనున్నారు. అది కూడా జిందాల్ సంస్థకు బొగ్గు రవాణాను దృష్టిలో ఉంచుకొని.. ఈ లైను నిర్మాణానికి దారి తీసింది. జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్లే గూడ్స్ రైళ్లకు ఈ ట్రాక్ను వినియోగించుకుంటారనే సమాచారం రైల్వే వర్గాల నుంచి వినిపిస్తోంది. 90 శాతం మేరకు జిందాల్ సంస్థకు రాకపోకలు సాగించే గూడ్స్ రైళ్లే నడవనున్నాయి. జిందాల్ సంస్థ, రైల్వే 50ః50 శాతం భాగస్వామ్యంతో ఈ లైను నిర్మాణం చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. గడువు ముగిసిన తర్వాత థర్డ్లైను రైల్వేకి ఇచ్చే విధంగా విధానం కొనసాగుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లలో థర్డ్లైను నిర్మాణం పూర్తి చేసేందుకు అటు జిందాల్, ఇటు రైల్వే యుద్ధప్రాతిపదకన చర్యలు తీసుకుంటున్నాయి. ఓబులవారిపల్లె జంక్షన్ వరకే... కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులవారిపల్లె జంక్షన్ వరకు ఉన్న రైలుమార్గం దాకా థర్డ్లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. గుత్తి–రేణిగుంట మధ్య ఫోర్లైన్ ట్రాక్స్ నిర్మాణానికి రైల్వేశాఖ సన్నద్ధమైంది. మొదటి విడత ప్రాధాన్యతగా గుంతకల్లు–ఓబులవారిపల్లె జంక్షన్ వరకు థర్డ్లైను ట్రాక్ వేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. భూసేకరణ.. సరిహద్దులపై దృష్టి థర్డ్లైన్ నిర్మితానికి అవసరమయ్యే భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. 3, 4 లైనుకు సంబంధించిన అవసరమైన భూసేకరణ, రైల్వే స్థల సరిహద్దులపై దృష్టి సారించారు. నందలూరు రైల్వేకేంద్రం మినహాయించి అన్ని స్టేషన్లలో.. అదనంగా 3, 4 రైల్వేట్రాక్ వేయాల్సి ఉంటుంది. చెయ్యేరు నదిపై బ్రిడ్జి నందలూరు చెయ్యేరు నదిపై థర్డ్ లైను నిర్మాణానికి అవసరమయ్యే బ్రిడ్జి నిర్మితం చేయడానికి సర్వే పూర్తయింది. బ్రిటీషర్ల హయాంలో ఏర్పాటైన బ్రిడ్జి స్థానంలో మూడవ బ్రిడ్జి నిర్మితం చేయనున్నారు. అయితే 3, 4 లైనుకు సరిపడే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. రేణిగుంట–ఓబులవారిపల్లె.. రేణిగుంట–ఓబులవారిపల్లె (56 కి.మీ) మధ్య కూడా మూడవ, నాల్గవ లైను నిర్మితం చేయాల్సి వుంటుంది. అయితే ఓబులవారిపల్లె వరకు థర్డ్లైను నిర్మాణం పూర్తి చేయనున్నారు. కృష్ణపట్నం పోర్టుకు గూడ్స్ రైళ్ల రాకపోకలను సకాలంలో నిర్వహించేందుకే.. ముందుగా ఽథర్డ్లైను నిర్మితంపై దృష్టి సారించారు. గూడ్స్రైళ్ల రద్దీ అధికంగా కొనసాగుతోంది. గుంతకల్ టు వయా ఓబులవారిపల్లె మీదుగా కృష్ణపట్నం పోర్టుకు లోడింగ్, అన్లోడింగ్తో కలుపుకొని 40 గూడ్స్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఉన్న డబ్లింగ్లో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతోపాటు ఇతర గూడ్స్ రైళ్ల ట్రాఫిక్తో.. కృష్టపట్నం పోర్టు గూడ్స్ రైళ్లు గమ్యాలకు చేరడంలో ఆలస్యం అవుతోంది. నందలూరు రన్నింగ్స్టాప్ క్రూసెంటర్ కేంద్రంగా ఈ గూడ్స్రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రైల్వేబోర్డు నందలూరు క్రూసెంటర్ను బలోపేతం చేసే దిశగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. -
వాల్మీకి జీవితం.. ఆదర్శనీయం
రాయచోటి : వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. రాయచోటిలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రామాయణాన్ని 24 వేల శ్లోకాలతో వాల్మీకి రచించారని తెలిపారు. ప్రతి శ్లోకం ఒక సందేశాన్ని తెలియజేసే విధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సురేష్ కుమార్, సోషల్ వెల్ఫేర్ అధికారి దామోదర్రెడ్డి, స్టేట్ వాల్మీకి డైరెక్టర్ మండెం ప్రభాకర్, వాల్మీకి జిల్లా అధ్యక్షులు యోగానంద, మదనపల్లి మార్కెట్ యార్డు డైరెక్టర్ శ్యామలమ్మ, జిల్లా వార్డన్ అధ్యక్షులు మనోహర్రెడ్డి, వాల్మీకి కుల సంఘం పెద్దలు పాల్గొన్నారు. రామాయణం స్ఫూర్తితో జీవించాలి రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కుటుంబ, మానవతా విలువలను పెంపొందించుకొని ధర్మబద్ధంగా జీవించాలని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. వాల్మీకి మహర్షి జీవితం, రామాయణం గొప్పతనంపై ఏఎస్పీ వివరించారు. కార్యక్రమంలో ఆర్ఐ ఎం.పెద్దయ్య, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ ఎ.ఆదినారాయణరెడ్డి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు అధికారులు, డీపీఓ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● సీపీడబ్ల్యూ స్కీమ్లకు విద్యుత్ సౌకర్యం ● తాగునీటి కోసం కొత్త బోర్ల ఏర్పాటు ● జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవింద రెడ్డి కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవింద రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ బద్వేలు, గోపవరం, పోరుమామిళ్ల, బ్రహ్మంగారిమఠం మండలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి టెండర్లు పిలిచి నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలని చెప్పారు. వేంపల్లె షాపింగ్ కాంప్లెక్స్కు మరమ్మత్తులు నిర్వహించాలని ఆదేశించారు. చక్రాయపేటలోని సీపీడబ్ల్యూ స్కీమ్ మోటారు కాలిపోవడంపై ఆయన ఆరా తీశారు. ఎర్రగుడి సీపీ డబ్ల్యూ స్కీమ్కు కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చేవరకు అద్దె ట్రాన్స్ఫార్మర్ వినియోగించాలని సూచించారు. గండిక్షేత్రంలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి తొలుత రూ. 25 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలవాలన్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, చక్రాయపేట మండలాల్లో భూగర్బ జలాలు అడుగంటాయన్నారు.ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా అవసరమైన చోట్ల కొత్త బోర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. టెండర్లు నామినేషన్లపై ఇస్తున్నారంటూ ఆడిట్ అధికారి తెలిపారు. వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి మాట్లాడుతూ బిల్లులే రాకపోతే టెండర్లు వేసేందుకు ఎవరు ముందుకు వస్తారంటూ ప్రశ్నించారు. ఏవైనా పనులకు టెండర్లు పిలువాలంటే ముందుగా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. అర్హత లేని వారికి పెన్షన్లు ఇచ్చారని, ఇప్పుడు వాటిని తొలగిస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని పులివెందుల జెడ్పీటీసీ అన్నారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ అనర్హులకు ఇవ్వడాన్ని తాము కూడా వ్యతిరేకమేనన్నారు. ఒకరికి అర్హత లేదని ఒక డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత అతను అప్పీలుకు వెళితే మరో డాక్టర్ అర్హత ఉన్నట్లుగా సర్టిఫికెట్ ఇస్తున్నారని పేర్కొన్నారు. అప్పుడు ఏ డాక్టర్ది తప్పంటూ చైర్మన్ ప్రశ్నించారు. తొలుత పెన్షన్కు అర్హులంటూ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ను సస్పెండ్ చేయాలని అభిప్రాయపడ్డారు. కో ఆప్షన్ సభ్యులు కరీముల్లా మాట్లాడుతూ డెంగీ జ్వరాలు వస్తుంటే ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారని తెలిపారు. రిమ్స్లో ప్లేట్లెట్స్ కౌంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. రిమ్స్లో ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారన్న విషయం ప్రజలకు తెలియదని, దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. దోమల బెడద అధికంగా ఉందని, ఫాగింగ్ యంత్రాలు మూలన పడేశారని విమర్శించారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ ఆ యంత్రాలకు మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుకు రావాలని అధికారులకు సూచించారు. పార్నపల్లె రిజర్వాయర్ నుంచి వేముల మండలంలోని నాయని చెరువుకు గ్రావిటీపై సాగునీరు వస్తోందని వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి అన్నారు. ట్రాన్స్ఫార్మర్ లేని కారణంగా భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, బక్కన్నగారిపల్లెకు నీటిని లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో షెడ్యూల్ కులాల్లోని మూడవ కేటగిరీకి చెందిన వారికి అన్యాయం జరిగిందన్నారు. అర్హత సాధించి వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ హారిజెంటల్ పద్దతిలో నియామకాలు చేపట్టి అన్యాయం చేశారని ఆరోపించారు. జీఓ నెం. 77 ప్రకారం నియామకాలు చేపట్టకుండా హారిజెంటల్ పద్ధతిని అనుసరించడం వల్ల ఈ అన్యాయం జరిగిందని, దీనిపై పునః పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, పలువురు జెడ్పీటీసీలు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
కల్యాణాన్ని వీక్షిస్తున్న భక్తులు సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద అర్చకులు ఉత్సవమూర్తులను వేర్వేరుగా ఉంచారు. అనంతరం సీతారాములకు సుగంధద్రవ్యాలతోపాటు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలు ధరింపజేసి, తులసి గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తరువాత సతీసమేతుడైన శ్రీ కోదండ రామస్వామికి ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించాలి
రాయచోటి : ప్రభుత్వం అందించే సేవలపై వాట్సాప్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ నుంచి ఆయన సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, నీటి పారుదల, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు, పీజీఆర్ఎస్ ద్వారా అందిన సమస్యల పరిష్కారం, వాట్సాప్ గవర్నెన్స్, జీఓ ఎంఎస్ నంబరు : 30, ప్రజల నుంచి వివిధ అంశాలపై తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణ, జలజీవన్ మిషన్కు అవసరమయ్యే భూసేకరణ, రీ సర్వే, చిన్న తరహా నీటిపారుదల, స్వచ్చ ఆంధ్ర తదితర అంశాలపై సమీక్ష చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాయచోటి జగదాంబసెంటర్ : అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీలకు హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య, విద్యా శాఖలు సంయుక్తంగా ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గురువారం ఉదయం 9 గంటలకు డైట్ హాల్లో ప్రతిభా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ‘బాలికల హక్కులను కాపాడండి’ ‘లింగ ఎంపిక గర్భస్రావ నిషేధ చట్టం అమలు’ అనే అంశంపై వ్యాసరచన, చర్చ, పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఒక్కొక్క అంశంలో మొదటి బహుమతిగా రూ.5 వేలు, రెండవ బహుమతిగా రూ.3 వేలు, మూడవ బహుమతిగా రూ.2 వేలు బహూకరిస్తారని అన్నారు. ఆసక్తి కలిగిన ప్రభుత్వ విద్యార్థులు పాల్గొనాలని కోరారు. నేడు నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని జిల్లా నిఘా పర్యవేక్షణ కమిటీ సభ్యులు, సంబంధిత జిల్లా అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు తిరుపతి సిటీ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హతలతో పాటు ఇతర వివరాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం సైనిక్–నవోదయ కోచింగ్ ఇన్స్టిట్యూట్, లేదా 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఏఐఏఏఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్తార్ ఫైజీ ఎంపిక కడప ఎడ్యుకేషన్ : ఆలిండియా అదబ్ ఎ అత్ఫాల్ సొసైటీ(ఏఐఏఏఎస్) రాష్ట్ర బాల సాహితీ సొసైటీ అధ్యక్షుడిగా ప్రముఖ ఉర్దూ బాల సాహితీవేత్త సత్తార్ ఫైజీ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన సి. కె. దిన్నె మండలం మూలవంక జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. తన ఎంపికపై ఫైజీ సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరం లో జష్నే రంగే బచ్చన్ పేరుతో అంతర్జాతీయ ఉర్దూ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెమినారు, ముషాయిరా, బాల సాహితి ఉర్దూ పుస్తకాల ఆవిష్కరణ, నాటికలు, పుస్తకాల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. -
ఆస్తి రాసిస్తే.. ఆదుకోనంటోంది..
జమ్మలమడుగు రూరల్ : వృద్దాప్యంలో తమను ఆదుకుంటుందనే ధీమాతో ఆస్థి రాసిచ్చాం.. ఇపుడు ఆదుకోము.. ఆస్తి వెనక్కు ఇవ్వమని చెప్పడం న్యాయం కాదని ఓ వృద్ధురాలు ఆర్డీఓ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు అర్డీఓ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గూడురు నాగయ్య, భార్య వెంకటలక్ష్మమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. అందరినీ ప్రయోజకులను చేసి వివాహాలు జరిపించారు. ఆస్తి అంతా వారికే ధారపోసి ఓ ఇంటిని తమకోసం ఉంచుకున్నారు. ఇపుడు వారు వృద్ధాప్యంలోకి అడుగిడడంతో తమకు అసరా కావాలని, తమను పోషిస్తే మోడంపల్లెలోని సొంత ఇంటిని వారి పేరిట రాసిస్తామని చెప్పారు. ఈ ఒప్పందానికి ముందుకు వచ్చిన రెండో కూదురికి ఇంటిని రాసి ఇచ్చారు ఆ వృద్ద దంపతులు. కొన్ని నెలల తర్వాత వీరిని ఆదుకోకుంటూ ఆ కూతరు చేతులెత్తేసింది. కుమార్తె పట్టించుకోకపోవడం... ఇల్లు లేకపోవడంతో ఆ వృద్ధులు జమ్మలమడుగు ఆర్డీఓను ఆశ్రయించారు. దీంతో మంగళవారం కుటుంబ సభ్యులంతా ఆర్డీఓ ఎదుట హజరయ్యారు. ఇక్కటే అసలు కథ మొదలైంది. ఆ ఇంటికి తగిన ధర చెల్లించి కోనుగోలు చేశానంటూ కుమార్తె చెప్పడంతో ఆర్డీఓ తల పట్టుకోవాల్సి వచ్చింది. తమను పోషించాలి.. లేకపోతే ఇంటిని వెనక్కు ఇస్తే అక్కడే ఉంటామని వృద్ధులు ఆర్డీఓకు చెప్పారు. ఇరువురూ వాదించుకుంటుండడంతో ఏమి చేయాలో తోచక తదుపరి వారానికి వాయిదా వేశారు. నలుగురు కుమార్తెలున్నా.. ఆ వృద్ధ దంపతులకు చట్టం ఏ మేరకు సహాయం అందుతుందో మరి.ఆర్డీఓ ఎదుట వృద్ధ దంపతుల ఆవేదన -
మినీ లారీ ఢీకొని ఒకరికి గాయాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డు సమీపంలోని ఏపీ కార్ల్ సమీపంలో మంగళవారం మినీ లారీ ఐచర్ వాహనం ఢీకొని మోహన్రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు..అనంతపురం జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి గత కొంతకాలంగా పెద్దరంగాపురం సమీపంలో ఉన్న ఏపీ కార్ల్లో రీసెర్చ్ అసోసియేట్గా పనిచేస్తున్నాడు. మంగళవారం అనంతపురం నుంచి ఆయన భార్య బస్సులో పులివెందుల బస్టాండులో దిగింది. ఆమె భర్త మోహన్ రెడ్డికి ఫోన్ చేయడంతో ఆమెను ఏపీ కార్ల్లోని తమ నివాసానికి తీసుకెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో బస్టాండ్ వద్దకు వస్తుండగా మినీ ఐచర్ లారీ ఢీకొంది. దీంతో మోహన్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రోడ్డులో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మోహన్రెడ్డికి ప్రథమ చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు -
విపత్తుల నివారణపై మాక్ డ్రిల్
సిద్దవటం : విపత్తుల నివారణపై మండలంలోని భాకరాపేట హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో కర్మాగారాల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ చిన్నారావు ఆధ్వర్యంలో మంగళవారం మాక్డ్రిల్ నిర్వహించారు. ముందుగా హెచ్పీసీఎల్లోని ఎమర్జెన్సీ–1లోని ట్యాంకు వద్ద డీజిల్ లీక్ అవడంతో దాన్ని కంట్రోల్ చేసేందుకు సిబ్బంది పనిచేస్తుండగా స్కానర్ కిట్టు కింద పడి మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న వర్కర్లు ఫైర్ అని అరవడంతో హెచ్పీసీఎల్ సిబ్బంది సైరన్ మోగించారు. సిబ్బంది అప్రమత్తమై ఆటోమేటిక్ పరికరాలతో ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో పెట్రోల్ డిపో సిబ్బంది సహకారంతో పోమ్, వాటర్తో మంటలను అదుపు చేశారు. అక్కడ ఇద్దరు వర్కర్లకు ప్రమాదం జరగడంతో వారిని మెడికల్ క్యాంపుకు సిబ్బంది తీసుకొచ్చే సన్నివేశాన్ని మాక్ డ్రిల్ చేసి చూపించారు. అలాగే ఫిల్టర్–ఎ వద్ద డీజిల్ ఓవర్ లీక్ అవుతుండటంతో అక్కడి వర్కర్లు మరమ్మతులు చేస్తుండగా స్పోనర్ కిందపడి మంటలు చెలరేగాయి. ఫైర్ అయిందని గట్టిగా కేకలు వేయడంతో హెచ్పీసీఎల్ సిబ్బంది మరోసారి సైరన్ మోగించారు. సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేసేందుకు డీసీపీ ఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా పోమ్, నీటితో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వర్కర్లు అస్వస్థతకు గురికావడంతో స్ట్రక్చర్పై మెడికల్ క్యాంపు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు పరిశీలించి కడప రిమ్స్ ఆసుపత్రికి పంపారు. ఇదంతా మాక్ డ్రిల్ అని తెలిసింది. చిన్నారావు మాట్లాడుతూ చట్ట ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ డిపో మేనేజర్ సతీష్కుమార్, జిల్లా ఫైర్ ఆఫీసర్ ధర్మారావు, పైపులైన్ డీజీఎం ఓబయ్య, కడప ఏజీ అండ్ పీ మానస్, సెక్యూరిటీ సూపర్వైజర్ సిద్దారెడ్డి, హెచ్పీసీఎల్, పైపులైన్ , సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రైవేట్ వాటర్ ప్లాంట్కు పంచాయతీ నిధుల చెల్లింపు
ఎర్రగుంట్ల : మండలంలోని చిలంకూరు జెడ్పీ పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి నిర్వహించే వాటర్ ప్లాంట్కు పంచాయతీ నిధులతో రూ.6 లక్షల విద్యుత్తు బిల్లులు చెల్లించారని, వెంటనే రికవరీ చేయించాలని వైఎస్సార్సీపీ నాయకుడు అరిగాళ్ల మురళి తెలిపారు. సర్పంచ్ శరత్కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీలతలకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధులతో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న ప్రైవేటు వ్యక్తి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి 26న రూ.28553, గత ఏడాది డిసెంబర్ 11న రూ.588994లు విద్యుత్తు బిల్లుల రూపంలో పంచాయతీ నిధులు చెల్లించారన్నారు. సర్పంచ్ శరత్కుమార్ వివరణ కోరగా.. ప్లాంట్ కరెంట్ మీటర్ వివరాలు సేకరించి తెలియజేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రీలతవ ూట్లాడుతూ విచారణ చేపబడుతామన్నారు. -
దుబాయి కరెన్సీ అంటూ దగా
● చిత్తు కలర్ పేపర్ల చుట్ట చేతిలో పెట్టారు ● రూ.4.5 లక్షలు దోచుకున్న దుండగులురాయచోటి టౌన్ : గతంలో నకిలీ బంగారం పేరుతో మోసం చేసిన మాయగాళ్ల గురించి విన్నాం.. వాటిపై నిఘా పెరిగిందనుకున్నారో.. ఏమో ఇక విదేశీ కరెన్సీ అంటూ ఎరవేసి దగా చేస్తున్నారు. రాయచోటిలో చోటు చేసుకున్న ఈ సంఘటనే ఇందుకు అద్దం పడుతోంది. రాయచోటి అర్బన్పోలీస్ స్టేషన్లో డీఎస్సీ కృష్ణ మోహన్ విలేకరులకు మంగళవారం వివరాలు వెళ్లడించారు. ఢిల్లీకి(వాయువ్య ఢిల్లీ) చెందిన హారూన్, తూర్పు ఢిల్లీకి చెందిన మిరాజ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్కు చెందిన నూర్ మహమ్మద్ ఖాన్లు రాయచోటిలో మకాం వేశారు. పట్టణంలోని షాపుల వద్దకు వెళ్లి వారితో( హిందీ మాట్లాడే వారితోనే) మాటా మాటా కలుపుతారు. పరిచయం పెంచుకొని తాము వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చామని.. తమ వద్ద దుబాయ్ దేశానికి చెందిన కరెన్సీ( దిర్హం) నోట్లు ఎక్కువ ఉన్నాయని చెబుతారు. నమ్మించడానికి ఒకటి.. రెండు చూపిస్తారు. 100 దిర్హం నోటు ధర ఇండియన్ కరెన్సీ నోట ధర ప్రకారం రూ.2400 పలుకుతున్నట్లు నమ్మిస్తారు. వీరు కూడా ఆన్లైన్ ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ విచారణ సాగించి నమ్ముతారు. శాంపిల్గా ఇచ్చిన నోట్లు ఒరిజనల్వే కావడంతో దుకాణదారులు నమ్మారు. అంతేగాక తమ వద్ద ఎక్కువ నోట్లు చూస్తే సమస్య వస్తుందని, నోటు తీసుకుంటే దిర్హం రూ.1000కే దుండగులు దుకాణదారులను నమ్మించారు. దీనిని నమ్మిని ఒక వ్యక్తి రూ.4.5 లక్షలు నగదు ఇచ్చాడు. రాయచోటి రింగ్ రోడ్డు వద్దకు రమ్మని చెప్పి స్థానికుడి నుంచి రూ.4.5లక్షలు నగదు తీసుకొని ఆ వ్యక్తికి దుబాయ్ నోట్ బయటికి కనిపించే విధంగా టవల్ మధ్యలో కలర్ పేపర్లు ఉంచి ఒక చుట్ట చుట్టి వారికిచ్చి అక్కడ నుంచి పారిపోయారు. మూట తెరిచి చూడగా అందులో పూర్తిగా రంగు రంగుల పేపర్లు చుట్టి ఉండడంతో దుకాణదారు లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడని డీఎస్పీ చెప్పారు. అర్బన్ సీఐ బివి చలపతి, ఎస్సై బాలకృష్ణ, స్పెషల్ పార్టీ సిబ్బంది శ్రీను, మల్లిఖార్జున వేగవంతంగా విచారణ సాగించి రాయచోటి–కడప రోడ్డు సమీపాన అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. విచారణ వేగంగా చేసి నిందితులను పట్టుకున్న అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారని, రివార్డు కోసం వారి పేర్లు పంపామని తెలిపారు. -
వృద్ధురాలిని కట్టేసి నగల దోపిడీ
చింతకొమ్మదిన్నె : ఒంటరి వృద్దురాలి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఆమెను కట్టేసి నగలు దోచుకెళ్లారు. మండల పరిధిలోని కొప్పర్తి గ్రామంలోని రహదారి ప్రక్కనే నివాసముంటున్న కోగటం సరస్వతమ్మ భర్త వెంకట సుబ్బారెడ్డి వీఆర్వోగా పని చేస్తూ ఇటీవల మృతిచెందారు. ఈమె ఇద్దరు కుమారులు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు, కుమార్తెకు వివాహమై కడపలో నివాసం ఉంటోంది. దీంతో సరస్వతమ్మ ఒంటరిగా నివాసమయుంటోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు యువకులు బైక్లో ఆమె ఇంటికి వచ్చారు. పక్కా రెక్కీ నిర్వహించిన దొంగలు ఆమె ఇంటిపై బాడుగకు ఉంటున్న వ్యక్తికి వివాహ పత్రిక ఇవ్వడానికి వచ్చినట్లు నమ్మించారు. పెన్ను ఇస్తే అడ్రస్ రాసి ఇస్తామని అడగ్గా.. సరస్వతమ్మ పెన్ను కోసం వెళ్లింది. ఇంతలో దొంగలు ఆమె వెనుకే వెళ్లి నోరు నొక్కి, చేతులు, కాళ్ళు కట్టేసి బెడ్ రూములోకి లాక్కెళ్లారు. అరిస్తే చంపేస్తాం అంటూ బెదిరించారు. ఆమె మెడలోని బంగారు చైన్, చేతి గాజులు, ఉంగరాలు, చెవి కమ్మలు బలవంతంగా లాక్కుని, బీరువా, అల్మారా తెరిచి అందులోని, బంగారు నగలు, నగదు దోచుకున్నారు. మొత్తం పది తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్లినట్లు వృద్ధురాలు తెలిపారు. కొంతసేపటికి కట్లు విప్పుకొని గట్టిగా అరవడంతో చుట్టు ప్రక్కల వారు వచ్చి సపర్యలు చేశారు. బంధువులతో వచ్చి పోలీసులకు సమాచారం తెలిపారు. డీఎస్పీ స్పందించి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో వచ్చి పరిశీలించారు. చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి, ఎస్ఐ శ్రీనివాసులరెడ్డిని సంప్రదించగా ముగ్గురు వ్యక్తులు కలిసి దోపిడీ చేసినట్లు ఫిర్యాదు అందించని, నేరం చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.పట్టపగలే ముగ్గురు దొంగల నిర్వాకం -
హద్దులు చెరిపి ఆక్రమణకు యత్నం
మదనపల్లె రూరల్ : మండలంలోని కోళ్లబైలు పంచాయతీ శేషాచలనగర్ సమీపంలో ప్రభుత్వ భూమిగా ఉన్న గుట్టను చదునుచేయడంతోపాటు ఆక్రమణకు యత్నించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదుచేసినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. మంగళవారం తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి కోళ్లబైలు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్–529లో గుట్టను జేసీబీతో చదునుచేసి, ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ విషయమై స్థానికులను విచారించి, గుట్ట స్వరూప స్వభావాలను మార్చినందుకు రామిశెట్టి రవి, నాగార్జునపై, తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఒంటిమిట్ట : మండలంలోని ఒంటిమిట్ట వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అట్లూరు మండలం కోనరాజుపల్లికి చెందిన బత్తల శ్రీను (38)ను ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వెనుకవైపు గేటు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శ్రీను మృతిచెందారు. పోలీసులు విచారిస్తున్నారు.చోరీ కేసులో ఇరువురికి జైలుశిక్షపుల్లంపేట : దొంగతనం కేసులో ఇరువురికీ న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2020 అక్టోబర్, 7న స్థానిక బైపాస్ రోడ్డులోని నాయుడు హోటల్ వద్ద కడపకు చెందిన సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ బజులు ఆటోను చోరీ చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా విచారణ అనంతరం మంగళవారం నందలూరు జడ్జి ఉదయ్ ప్రకాష్ నిందితులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్ఐ శివకుమార్ తెలిపారు.వైద్యుల సమ్మెకు ఆశాల సంఘీభావంరైల్వేకోడూరు : రైల్వేకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సమ్మె చేస్తున్న వైద్యులకు మంగళవారం ఆశ వర్కర్ల యూనియన్లు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో వైద్యులు నిర్వహిస్తున్న ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం కళ్లు తెరిచి వైద్యుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు యాదరాజు గంగాధర్, జిల్లా కన్వీనర్ రత్నమ్మ, చెంగమ్మ, యశోద, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణంకలకడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కలకడ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పెద్దసుబ్బయ్య కుమారుడు రమణయ్య(65) కె.బాటవారిపల్లెలో టమాట సాగు చేస్తున్నారు. మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంలో ఇంటికి చేరుకుంటున్న సమయంలో పీలేరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ రమణయ్య పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందినట్లు వైధ్యులు తెలిపారు. పోలీసులు వాహనాన్ని కలకడ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఖతార్లో గాలివీడు వాసి మృతి
గాలివీడు : బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ దేశమైన ఖతార్కు వెళ్లిన పఠాన్ ఫయాజ్ (29) మంగళవారం గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల కథనం మేరకు గాలివీడు పట్టణం గేటు నాలుగు రోడ్ల కూడలి వద్ద నివాసం వుంటున్న అజీజ్ఖాన్ కుమారుడు ఫఠాన్ ఫయాజ్ బ్రతుకు దెరువు కోసం ఖతార్ వెళ్లాడు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఫయాజ్ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే తమ బిడ్డ తమనుండి దూరమవ్వడం జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిట్టీలు కట్టించుకుని.. చెల్లించలేనంటూ..బి.కొత్తకోట : చీటీల పేరుతో వ్యాపారం చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. తిరిగి మొత్తాలను చెల్లించలేనని చేతులెత్తేశాడు. బి.కొత్తకోట మండలంలో ఎనిమిదేళ్లు పనిచేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొన్ని నెలల కిందట తంబళ్లపల్లి మండలానికి బదిలీపై వచ్చారు. ఇతను చాలాకాలంగా చిట్టీలు నిర్వహిస్తూ సకాలంలో డబ్బులు చెల్లించేవాడు. దీంతో ఉపాధ్యాయులతోపాటు స్థానికుల్లో నమ్మకం కుదిరింది. భారీ సంఖ్యలో ఇతడి వద్ద చిట్టీలు వేశారు. అయితే మూడు రోజులు క్రితం తాను డబ్బు చెల్లించాల్సిన వ్యక్తుల ఫోన్ నెంబర్లతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేశాడు. ఆ గ్రూపులో తన వద్ద చిట్టీలు వేసిన వారికి తిరిగి డబ్బు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పుకున్నాడు. తనకు చెందిన భూమిని విక్రయించి దాని ద్వారా వచ్చిన డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పుకున్నాడు. దీంతో డబ్బు చెల్లించిన వాళ్లంతా ఆందోళనలో పడ్డారు. సుమారు రూ.4 కోట్ల వరకూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలకు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. తమ డబ్బు తిరిగి వస్తుందో రాదోనని లబోదిబోమంటున్నారు.హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుగాలివీడు : మండలంలోని నల్లబత్తిన వాండ్లపల్లెకి చెందిన సుబ్బారాయుడు హత్య కేసులో ఆయన అన్న రాజుపాలెం నాగయ్య(74)కు జీవిత ఖైదు విధిస్తూ రాయచోటి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. పోలీసుల కథనం మేరకు.. 2022 జూన్, 14న మల్లేశ్వరస్వామి మొక్కుబడి విషయంలో తోటిగాండిమడుగు వద్ద మేక నరికే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తరువాత సాయంత్రం 5 గంటల సమయంలో తమ్ముడు సుబ్బారాయుడుపై వేట కొడవలితో నాగయ్య దాడి చేయగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై గాలివీడు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. మంగళవారం రాయచోటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.కృష్ణన్ కుట్టి ఆధ్వర్యంలో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జూద స్థావరాలపై దాడులుమదనపల్లె రూరల్ : మండలంలోని సీటీఎం, బసినికొండలోని జూద స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి పది మంది జూదరులను అరెస్ట్ చేసినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. మంగళవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడుతూ సీటీఎం, బసినికొండ సత్యనారాయణస్వామిగుడి వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్, తాలూకా పోలీసుల సహాయంతో మెరుపుదాడులు నిర్వహించామన్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.56,200 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, 8 సెల్ఫోన్లు సీజ్ చేశామన్నారు. దాడులు జరిపే క్రమంలో సీటీఎంకు చెందిన జనార్దన్, గుర్రంకొండకు చెందిన ఉత్తన్న, కలికిరికి చెందిన రామాంజులు పారిపోయారని, వారిపై కేసు నమోదుచేశామని తెలిపారు. అదేవిధంగా బసినికొండ సత్యనారాయణస్వామి గుడి వద్ద పేకాడుతున్న నలుగురిని అరెస్ట్చేసి వారి నుంచి రూ.2,800 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జూదం నిర్వహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థికి గోల్డ్ మెడల్కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ పురుషుల కళాశాల(స్వయం ప్రతిపత్తి)లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ విద్యార్థిని అంకాల శైలజ (ఎం.కామ్ 2022–24 బ్యాచ్) గోల్డ్ మెడల్ సాధించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. ప్రిన్సిపల్ జి.రవీంద్రనాథ్ అభినందించారు. -
శ్రీగంధం స్మగ్లర్లు అరెస్ట్
బి.కొత్తకోట : మండలంలో శ్రీగంధం చెట్లను నరికి అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు జరిపి ఇద్దరిని అరెస్ట్ చేశామని మదనపల్లి అటవీ శాఖ రేంజర్ జయప్రసాదరావు మంగళవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. బి.కొత్తకోట మండలం మొగసాల మర్రికి చెందిన శ్రీనివాసులు (50), తంబళ్లపల్లె మండలం, ఇట్నేనివారిపల్లికి చెందిన టి.శివకుమార్ (23) లు శ్రీగంధం చెట్లను వ్యవసాయ పొలాల వద్ద నరికి 10 కిలోలను సేకరించారు. పొరుగు రాష్ట్రానికి తరలించేందుకు ఇంటిలో ఉంచగా దాడులు చేసి శ్రీగంధం స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసామని తెలిపారు. ఈ దాడుల్లో హార్సిలీహిల్స్ సెక్షన్ ఆఫీసర్ శివకుమార్, బీటు అధికారులు జయరాం, సుమిత, దేవేంద్రలు పాల్గొన్నారు. సీఐ మృతి.. ఎస్పీ సంతాపంరాయచోటి : అనారోగ్యంతో మృతి చెందిన సీఐ జాన్సన్ బాబురావు(45) కుటుంబీకులకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తన సంతాపం తెలిపారు. ఓ పోలీస్ అధికారిని ఇంత దురదృష్టకర రీతిలో కోల్పోవడం బాధాకరమని, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. సీఐ జాన్సన్ బాబూరావు వైఎసార్ కడప జిల్లా ముద్దనూరు వాసి. 2002లో ఎస్ఐగా ఉద్యోగంలోచేరి అనంతరం సీఐగా పదోన్నతి పొందారు. ఎస్పీ ఆదేశాల మేరకు ముద్దనూరులోని మృతుడి స్వగ్రామం వద్ద అన్నమయ్య జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ ఎ.ఆదినారాయణరెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది వెళ్లి నివాళులర్పించారు. దహన సంస్కారాల నిమిత్తం లక్ష రూపాయల నగదును మృతుడి సతీమణి ఆశ్రిత మంజూషకు అందజేశారు. అతిగా మద్యం తాగి వ్యక్తి మృతిములకలచెరువు : అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం ములకలచెరువులో జరిగింది. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం వడ్డిపల్లికి చెందిన శ్రీరాములు (55) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి అతిగా మద్యం తాగి కదిరి రోడ్డు పక్కన అపస్మారకస్థితిలో పడిపోయాడు. ఉదయం చనిపోయినట్టు స్థానికులు గుర్తించారు. -
విద్యా రంగ సేవకుడికి విశిష్ట గౌరవం
కురబలకోట : విద్యారంగంలో విశేష కృషి చేసిన బి.ఈశ్వరయ్యకు న్యూడిల్లీలో భారత్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సాధారణ కు టుంబం నుంచి అంచెలంచెలుగా జిల్లా, రాష్ట్ర, జాతీ య స్థాయి గుర్తింపు సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈశ్వరయ్యకు ఈ పురస్కారం దక్కింది. మండలంలోని ఎనుములవారిపల్లెకు చెందిన ఈశ్వరయ్య రిషి వ్యాలీ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. మదనపల్లె బీటీ కళాశాలలో డిగ్రీ చదివి గోల్డ్ మెడల్ సాధించారు. ఎంఏ బీఈడీ చేసి విద్యారంగం వైపు మక్కువ చూపారు. రిషి వ్యాలీ రివర్ స్కూల్లో టీచర్గా, ఆ తర్వాత హెడ్మాస్టర్గా ఏడేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ నాంది పౌండేషన్లో ఎడ్యుకేషనల్ రీసోర్సు పర్సన్గా నాలుగేళ్లు, న్యూఢిళ్లీ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రిన్సిపల్, డైరెక్టర్గా మూడేళ్లపాటు సేవలందించారు. అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు 200 మంది ఈశ్వరయ్య వద్దకు విమానంలో వచ్చి సలహాలు, తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆపై న్యూడిల్లీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ హెడ్గా పదేళ్లపాటు పనిచేశారు. ఎన్సీఈఆర్టీలో రీసోర్సు పర్సన్గా గత ఏడేళ్లుగా కొనసాగుతున్నారు. విద్యా సంస్కరణల్లో కీలక పాత్ర విద్యా రంగంలో ఇతడి సేవలను గుర్తించిన గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి విద్యా సంస్కరణల కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ కమిటీలో రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ కమిటీ సభ్యుడిగా సమున్నత స్థానం కల్పించింది. ఐదేళ్ల పాటు ఇతడు ఇన్పోసిస్ సుధానారాయణమూర్తి, మరో తొమ్మిది మందిసభ్యులలో ఒకడిగా క్రియాశీలకంగా పనిచేశారు. అప్పట్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకూ చదువులు ఎలా ఉండాలనే అంశంపై నివేదిక సమర్పణలో ఆయన కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని అన్ని డైట్ కళాశాలలు తిరిగి.. ఆయన అందించిన సేవలకు ఇపుడు గుర్తింపు లభించింది. నీతి అయోగ్ పర్యవేక్షణలో నడిచే న్యూఢిల్లీ భారత్ వర్చువల్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్లు 2025 సంవత్సరానికి ఇతనికి గౌరవ డాక్టరేట్ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో ఇతనికి ఒక్కడికే ఈ డాక్టరేట్ లభించడం మరో విశేషం. సమాజ నిర్మాణంలో విద్య కీలకం సమాజ నిర్మాణంలో విద్యకు ప్రాధాన్యం ఉంది. విద్యార్థులకు చదువు నేర్పడం కన్నా ముందు వారిలో ఆత్మ విశ్వాసం నింపాలి. చదువు పట్ల భయం పోగొట్టాలి. బడి పట్ల ఇష్టం కలిగేలా చూస్తూ పుస్తకాలను చదివించేలా చూడాలి. ఈ గౌరవ డాక్టరేట్ అవార్డు విద్యా వ్యవస్థ గొప్పతనంగా భావిస్తున్నా. పేదరికాన్ని జయించడానికి చదువే గొప్ప అస్త్రం. ఎవ్వరైనా ఉన్నతంగా ఎదగడానికి చదువుకు మించిన ఆయుధం లేదు. – ఈశ్వరయ్యభార త్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం -
విద్యార్థిపై దాడిపై విచారణ
● కంటి చూపు కోల్పోయిన విద్యార్థి ● నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ● ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదులక్కిరెడ్డిపల్లి : తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తపేట సమీపంలోని గట్టు గ్రామ పంచాయతీ గట్ల వద్ద ఏర్పాటైన రిషీ వాటిక గురుకుల పాఠశాలలో విద్యార్థిపై జరిగిన దాడిపై మదనపల్లి–2వ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట గ్రామ పంచాయతీ కలాడివాండ్లపల్లికి వారు సోమవారం చేరుకుని విద్యార్థి కొండా శేషాద్రిరెడ్డి, వారి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి శేషాద్రిరెడ్డి తండ్రి అమరనాథరెడ్డి సీఐ రాజారెడ్డికి వివరాలు వెల్లడించారు. వేదవ్యాస్ భారతి ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే రిషీ వాటిక గురుకులంలో బోధనేతర సిబ్బందిగా పని చేస్తున్న ఆర్.వెంకటేష్ అనే వ్యక్తి విద్యార్థి తండ్రి అమరనాథరెడ్డికి ఒక లక్ష ఫీజు చెల్లించాలంటూ ముందుగా తెలియజేశారు. రెండు రోజులు ఆలస్యం అవ్వడంతో.. విద్యార్థి శేషాద్రిరెడ్డిపై వెంకటేష్ రాయితో కొట్టడంతో కన్నుపై పడి.. కంటి నుంచి రక్తస్రావం అయినట్లు తెలిపారు. విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో పాఠశాల సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా సొంత వైద్యం చేయడంతో.. కుడి కన్నులోని రెటినా పూర్తిగా జారిపోయి దెబ్బతిన్నట్లు గమనించి.. తండ్రి అమరనాథరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారన్నారు. హుటాహుటిన తిరుపతిలోని ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేయించారన్నారు. తర్వాత స్వగ్రామం అయిన లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట గ్రామం కాలాడివాళ్లపల్లికి తీసుకొచ్చామన్నారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సెప్టెంబర్ 7న విద్యార్థిపై దాడి చేయగా అదే నెల 14న విద్యార్థి శేషాద్రిరెడ్డి, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బి.కొత్తకోట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్కడి పోలీసులు ఆ పాఠశాల యాజమాన్యంతో కుమ్మకై వెంకటేష్పై మాత్రమే కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటి వరకు ఆ పాఠశాల యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంకటేష్ను గానీ అరెస్టు చేయలేదన్నారు. ఈ తంతు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల యాజమాన్యంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు డీజీపీ, హోం శాఖ సెక్రటరీ, హోం మంత్రి, ఉమెన్ మినిస్ట్రీ సెంట్రల్కు ఫోన్ ద్వారా తెలపడంతోపాటు వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం, నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్)కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకోకుండా నిందితుడు వెంకటేష్, పాఠశాల యాజమాన్యాన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం స్టేట్, సెంట్రల్ వారికి తప్పుడు సమాచారం అందిస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. న్యాయం చేయాలి ఇంతటితో ఈ కేసు వదిలేయకపోతే మీ కుటుంబం మొత్తాన్ని లేపేస్తామని అదే పాఠశాలలో చదువుకునే మరొక విద్యార్థి తండ్రి పాఠశాల తరఫున వంత పాడుతూ కాలాడివాండ్లపల్లికి వచ్చి చెప్పినట్లు తెలిపారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఏ బిడ్డకు జరగకూడదనే ఉద్దేశంతో కేసును ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విచారణ పేరుతో మదనపల్లి నుంచి వచ్చిన సీఐ గోపాల్రెడ్డి విద్యార్థి శేషాద్రిరెడ్డిని ఇంట్లో నుంచి బయటికి బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేయగా.. విద్యార్థి భయభ్రాంతులకు గురై కుప్పకూలిపోయినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలను స్థానికులు వీడియోలు తీయడంతో.. చాటుమాటుగా డ్రస్ మార్చుకునే ప్రయత్నం చేసి అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా ఆ పాఠశాల యాజమాన్యం, వెంకటేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించారు. -
‘ఎర్రచందనం’ కేసులో ఇద్దరి అరెస్ట్
రాయచోటి : ఎర్రచందనం అక్రమ తరలింపు కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాయచోటి అర్బన్ పోలీసుస్టేషన్లో సీఐ బీవీ చలపతి సోమవారం వివరాలు వెల్లడించారు. 2021 నవంబర్ 10న రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్లో ఎర్రచందనం అక్రమ తరలింపుపై కేసు నమోదైందని తెలిపారు. ఈ కేసులో వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు మండలం శ్రీరామ్నగర్కు చెందిన కొలిమి సుభాన్ బాషా, అర్జున్ నిందితులుగా ఉన్నారన్నారు. నాటి నుంచి పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం గాలివీడు రింగ్రోడ్డు వద్ద గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన రికార్డులతో తిరుపతిలోని రెడ్ సాండిల్ స్పెషల్ కోర్టుకు హాజరు పరచగా, రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ వివరించారు. -
వైఎస్ఆర్ నగర్లో గృహాల కూల్చివేత
● ఫోర్జరీ సంతకాలతో అనుబంధ పత్రాలు ● న్యాయం చేయాలని బాధితులు వేడుకోలుసిద్దవటం : మండలంలోని మాధవరం–1 పంచాయతీ పరిధి వైఎస్ఆర్ నగర్ 892/3 సర్వే నంబర్లో ఏర్పాటు చేసుకున్న నివాస గృహాలను కొందరు వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం కూల్చివేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు బొడ్డుబోయిన నారాయణ, ఇప్పలపల్లె సుజాత, కోండ్ల పార్వతమ్మ, భోగా లక్ష్మమ్మలు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం 2008లో రెవెన్యూ శాఖ అధికారులు ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున స్థలం మంజూరు చేసి డీ ఫారాలు, అనుబంధ పత్రాలను అందజేశారన్నారు. అందులో తాము గృహాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆయా గృహాలకు మాధవరం గ్రామ పంచాయతీకి పన్నులు కూడా చెల్లిస్తున్నామన్నారు. గృహాలకు విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకోగా అవి కూడా వచ్చాయన్నారు. ఈ క్రమంలో పాటూరు గంగిరెడ్డి, ఎర్రి వెంకటరెడ్డిలు కొందరు బయటి వ్యక్తులను పిలుచుకొని వచ్చి సిద్దవటం పోలీసుల ఆధ్వర్యంలో తాము లేని సమయంలో నూతనంగా నిర్మించుకొన్న గృహాలను కూల్చివేశారన్నారు. అలాగే పాటూరు గంగిరెడ్డి, ఎర్రి వెంకటరెడ్డిలు ఫోర్జరీ సంతకాలతో అనుబంధ పత్రాలను సృష్టించి ఇవి తమ స్థలాలే అని కట్టడాలను కూల్చివేశారన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. -
రాంగ్ రూట్లో వచ్చి లారీని ఢీకొన్న కారు
● తప్పిన పెను ప్రమాదం ● మద్యం మత్తులో కారులోని యువకులుపుల్లంపేట : ముగ్గురు యువకులు మద్యం తాగి కారులో రాంగ్ రూట్లో వచ్చి.. లారీని ఢీకొనడంతో.. లారీ వెనుక వైపున నాలుగు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. టిప్పర్ డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో.. రెండు కార్లలో ఉన్న పది మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం తాగి కారులో రాజంపేట నుంచి రైల్వేకోడూరు వైపు వెళ్తూ ఉడుమువారిపల్లి సమీపంలోకి రాగానే రాంగ్ రూట్లో ఎదురుగా ఉన్న లారీని ఢీకొన్నారు. ముందుగానే పసిగట్టిన లారీ డ్రైవర్ బ్రేక్ వేయడంతో.. కారు పాక్షికంగా దెబ్బతింది. కారులో ఉన్న ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయిలే లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుకవైపున లారీతోపాటు రెండు కార్లు వస్తున్నాయి. అదే సమయంలో వాటి వెనుకే ముగ్గురాయితో మంగంపేట నుంచి కడపకు వెళ్తున్న టిప్పర్ ప్రమాదాన్ని పసిగట్టి పక్కకు తిప్పడంతో కారు వెనుకవైపు ఓ పక్క ఢీకొంది. దీంతో రెండు కార్లలో ఉన్న పది మంది సురక్షితంగా బయటపడ్డారు. టిప్పర్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రెండు కార్లు పాక్షికంగా మాత్రమే దెబ్బతిన్నాయి. ఒక కారులో అయితే ఇద్దరు, తల్లిదండ్రులతోపాటు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేసి మద్యం మత్తులో ఉన్న యువకులను పోలీసు స్టేషన్కు తరలించారు. -
బెల్ట్షాపులో మద్యం పట్టివేత
ములకలచెరువు : ఎక్సైజ్ పోలీసుల దా డులు జరుగుతున్నా, నకిలీ మద్యం కేసుతో అలజడి రేగినా బెల్టుషాపుల నిర్వాహకులు మాత్రం యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ములకలచెరువు మండలంలోని బురకాయలకోటలో ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. దుకాణంలో నిర్వహిస్తున్న బెల్టుషాపు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ బీర్లు, మద్యం కలిపి 278 బాటిళ్లు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరారయ్యాడని ఎకై ్సజ్ పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు. దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలి రాయచోటి : జిల్లాలోని దళితవాడల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాయచోటి కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గ పరిధిలోని అరవీడు గ్రామం, అలకచెరువుకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో నాయకులు రహదారి నిర్మిస్తామని హామీలు ఇస్తూ ఓట్లు వేయించుకొని తరువాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జ్యోతి చిన్నయ్య, మర్రి సుమిత్ర, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పండుగోల్ల మణి, కార్మిక సంఘం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కుప్పం ఎమ్మెల్యే పదవిపై ఆసక్తికర చర్చ
మదనపల్లె : స్థానిక పంచాయతీరాజ్ ప్రాంగణంలో సోమవారం పీకేఎం ముడా చైర్మన్ బీఆర్.సురేష్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పదవిపై పరస్పర వ్యాఖ్యలు చర్చకు దారితీసింది. సభలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ ‘బీఆర్ సురేష్ తండ్రి దొరస్వామినాయుడు ఎమ్మెలేగా చేశారు, సురేష్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఉంది. అందుకనే ఆయన టీడీపీ రాజకీయాల్లో ఎదిగి ఎమ్మెల్యే కావాలని కోరుకొంటున్నట్టు’ చెప్పడంతో ఎమ్మెల్యేలు, కుప్పం నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. కుప్పంలో చంద్రబాబు ఉండగా ఆయన స్థానంలో సురేష్ పోటీ చేయాలా అన్న చర్చ మొదలైంది. చివర్లో ప్రసంగించిన బీఆర్.సురేష్ ఎక్కడో (వేరే నియోజకవర్గాలు) వెళ్లి ఎమ్మెల్యే కావాలని లేదని, కుప్పంలోనే ఉండి పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. తనకు ఎమ్మెల్యే పదవిపై ఆశలేదని ప్రకటించి ఉంటే సరిపోయేది, అలా కాకుండా ఎక్కడో వెళ్లి పోటీ చేయలేనని చెప్పడం చూస్తే కుప్పంలో పోటీ చేయాలన్న ఆలోచన ఉందా అంటూ హాజరైన పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఈ సభకు ముందు బీఆర్.సురేష్ పీకేఎం ముడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు యండపల్లె వెంకట్రావ్, షాజహాన్బాషా, జగన్మోహన్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. -
అంతర్ రాష్ట్ర బైక్ల దొంగ అరెస్ట్
మదనపల్లె : అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసినట్టు స్థానిక డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు. సోమవారం మదనపల్లె తాలూకా సీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన పులి వెంకటరెడ్డి (33) బైక్ల చోరీలకు పాల్పడ్డాడు. అన్నమయ్య, తిరుపతి, కర్ణాటకలోని కోలారు జిల్లాల్లో 25 బైక్లను చోరీ చేశాడు. రెండేళ్లలో మదనపల్లె, పీలేరు, కలికిరి, బి.కొత్తకోట, ముదివేడు, పెద్దతిప్పసముద్రం మండలాలు, కోలారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైక్లను చోరీ చేశాడు. కర్ణాటకలో చోరీ చేసిన బైక్లను ఆంధ్రాలో.. ఆంధ్రాలో చోరీ చేసిన బైక్లను కర్ణాటకలో విక్రయిస్తున్నాడు. దీనిపై నమోదైన కేసులతో నిందితునిపై పోలీసులు నిఘా పెట్టారు. సోమవారం మదనపల్లె బసినికొండ వద్ద ఓ బైక్ను చోరీచేసే ప్రయత్నంలో ఉండగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బైక్ల దొంగతనాలు వెలుగులోకి వచ్చాయని, నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ కళా వెంకటరమణ, ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు. -
భార్యపై భర్త దాడి
మదనపల్లె : భార్యపై భర్త దాడి చేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక శేషప్పతోటలో కాపురం ఉంటున్న కేవీ రమణ భార్య శశికళ (50) గత 20 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. పిల్లలకు వివాహమై స్థిరపడ్డారు. ఈ క్రమంలో తరచూ కేవీ రమణ భార్య కోసం ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. వారి మధ్య ఏం జరిగిందో కానీ ఉదయం శశికళ వంట చేస్తుండగా భర్త, మరిది దాడి చేసి గాయపరిచారు. బాధితురాలిని స్థానికులు వైద్యం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కారు ఢీకొని రైతు దుర్మరణంకురబలకోట : మండలంలోని దొమ్మన్నబావి సర్కిల్ వద్ద సోమవారం కారు ఢీకొన్న సంఘటనలో తూగువారిపల్లెకు చెందిన రైతు రఘునాథరెడ్డి (55) దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తూగువారిపల్లెకు చెందిన రఘునాథరెడ్డి మరో ఇద్దరితో కలసి మోటార్ సైకిల్పై అంగళ్లు వైపు రాసాగాడు. దొమ్మన్నబావి సర్కిల్ వద్ద బైపాస్ మీదుగా వేగంగా వస్తున్న కారు వీరిపైకి ఒక్కసారిగా దూసుకు వచ్చింది. వేగంగా ఢీకొంది. దీంతో రైతుకు తీవ్ర గాయాలై రెప్పపాటులోనే అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెనుక కూర్చుని వస్తున్న మరో ఇద్దరికి గాయాలు కాగా వారు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.యువకులకు గాయాలురైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట కట్టాపుట్టాలమ్మ ఆలయం వద్ద ప్రధాన రహదారిపై బొమ్మవరానికి చెందిన వెంకటరమణ, శంకర సోమవారం రాత్రి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా తిరుపతికి వెళ్తున్న కారు ఢీకొని తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని హుటాహుటిన కోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఎస్సై లక్ష్మీ ప్రసాద్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్జీలకు సత్వర పరిష్కారం
రాయచోటి: పీజీఆర్ఎస్ ద్వారా అందే ప్రతి అర్జీని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తోందని తెలిపారు. కావున అధికారులు ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.● వ్యవసాయ అనుబంధ రంగాల పనిముట్లపై జీఎస్టీ తగ్గింపును రైతులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం రాయచోటిలోని మార్కెట్ యార్డులో వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, బయో పెస్టిసైడ్స్ తదితర వస్తువులపై జీఎస్టీ 2.0 అమలు అనంతరం రైతులకు చేకూరే లబ్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుపై క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే పాత రేట్లు, కొత్తరేట్లు తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, రాయచోటి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ ఎ రాంప్రసాద్ రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివ నారాయణ, జిల్లా ఉద్యానవన అధికారిణి సుభాషిణి, పశు సంవర్ధకశాఖ డీడీ పిళ్లై తదితరులు పాల్గొన్నారు. -
భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
రాజంపేట రూరల్: ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన అత్తిరాలలోని శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామికి పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా బహుదానదికి గంగా హరతి ఇచ్చారు. అనంతరం కామాక్షిమాతను, త్రేతేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువు దీర్చారు. భక్తులు పల్లకిని లాగుతూ..భక్తి పాటలు పాడుతూ..శివనామస్మరణ చేస్తూ గిరిప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ అనంతరం రాజంపేటకు వచ్చే భక్తులకు చెర్రీస్ స్కూల్ యజమాన్యం వారు బస్సులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు సిద్దా లింగారెడ్డి, కార్యదర్శి పోకల ప్రభాకర్, కోశాధికారి వై నందకిషోర్గౌడ్, కమిటి సభ్యులు యుపీరాయుడు, బాలక్రిష్ణారెడ్డి, రాఘవరెడ్డి రామ్మోహన్రెడ్డి, కాశీ విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
గౌరవ వేదన!
మదనపల్లె సిటీ: మైనార్టీల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించింది. ముస్లింలను భక్తిమార్గంలో నడిపే ఇమామ్లు, మౌజన్లకు భుక్తి లేకుండా చేస్తోంది. గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోంది. దాదాపు 11 నెలలుగా గౌరవవేతనం చెల్లించడం లేదు. మసీదు నిర్వహణ నిధులు మాటే మర్చిపోయింది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మసీదులకు సొంతంగా ఆదాయం ఉండదు. వాటిని నిర్వహించే ఇమామ్లు, మౌజన్లు ప్రతి నెలా ప్రభుత్వమిచ్చే గౌరవ వేతనాలపైనే ఆధారపడతారు.కూటమి కక్ష సాధింపుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి వరకు ఇచ్చిన వేతనాన్ని రెట్టింపు చేసి, ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు చొప్పున ప్రతి నెలా పంపిణీ చేసేవారు. 2024 ఎన్నికల నోటిఫికేషన్తో కోడ్ అడ్డురాగా అప్పట్లో 3 నెలల గౌరవ వేతనం పెండింగ్లో పడింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అందరు ఒత్తితి చేయడంతో ఇప్పటి దాకా ఆరు నెలలు మాత్రమే గౌరవ వేతనం ఇచ్చి చేతులు దులుపుకుంది. ముస్లింలపై నిర్లక్ష్య వైఖరిని అవలంభించే కూటమి నాయకులు, 11 నెలలుగా గౌరవ వేతనం మంజూరు చేయడం లేదు. దీంతో వారు ఆర్థికంగా నలిగిపోతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఉండగా ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది తలెత్తలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తుంటే ..దాదాపు 11 నెలల నుంచి గౌరవవేతనం బకాయిలు ఉన్నాయంటే మసీదుల విషయంలో వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. చిన్న కార్యక్రమాలకు రూ. కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తుండగా మసీదు నిర్వహణ మాత్రం భారంగా మారడం దారుణం. షాదీతోఫా పేరుతో రూ.లక్ష ఇస్తామన్న హామీని కూడా తుంగలో తొక్కారు. జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, రాజంపేట, పీలేరు, కలకడ, కలికిరి తదితర ప్రాంతాల్లో సుమారు 380 మసీదులు ఉండగా సుమారు 760 మంది ఇమామ్లు, మౌజాన్లు పని చేస్తున్నారు.జిల్లాలోని మసీదులు: 380ఇమామ్లు, మౌజాన్లు: 760 మందిగౌరవవేతనాలు మంజూరు చేయాలిఇమామ్లు,మౌజన్లకు 11 నెలలుగా గౌరవవేతనం మంజూరు చేయకపోవడం దారుణం. కూటమి ప్రభుత్వం తీరుతో వారంతా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం లేని మసీదుల నిర్వహణ కష్లంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులు లేవు.తక్షణమే ఇమామ్, మౌజన్లకు గౌరవవేతనం మంజూరు చేయాలి. – నిస్సార్ అహ్మద్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మదనపల్లె -
నకిలీ మద్యంలో చినబాబు..పెదబాబు ప్రమేయం
కురబలకోట: ములకలచెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీలో చినబాబు (నారా లోకేష్), పెదబాబు (నారా చంద్రబాబు) ప్రమేయం ఉందని, లేదంటే ఇంత దైర్యంగా హైవే పక్కన నకిలీ మద్యం తయారు చేయడం అంత సులభం కాదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్సి ఆర్సీ ఈశ్వర్రెడ్డి, అంగళ్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డీఆర్. ఉమాపతిరెడ్డి ఆరోపించారు.కురబలకోట మండలంలోని కనసానివారిపల్లెలో పార్టీ నాయకులతో కలసి సోమవారం విలేకరుతో వారు మాట్లాడుతూ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రభుత్వ దుకాణాల వ్యవస్థకు మంగళం పాడి ప్రైవేట్ వారికి మద్యం షాపులు కేటాయించినప్పుడే చంద్రబాబు బుద్ధి బయటపడిందన్నారు. నకిలీ మద్యం తయారీ విక్రయాల వెనుక రాష్ట్ర స్థాయి పెద్దల ప్రమేయం ఉందన్నారు. మరో వైపు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా భారీగా నకిలీ మద్యం రాకెట్ తాజాగా బయటపడిందన్నారు. ఇది కూడా ములకలచెరువు తరహాలో ఉండడంతో ఇలాంటి యూనిట్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండవచ్చనడానికి బలాన్ని చేకూరుస్తోందన్నారు. దీన్ని బట్టి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని చెప్పవచ్చన్నారు. సమగ్ర విచారణ జరిపితే పెద్ద కుంభకోణమే బయటపడుతుందన్నారు. రాష్ట్ర పెద్దల బండారం తెలిసి రాగలదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధునన్ రెడ్డిని అక్రమంగా మద్యం కేసులో అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఆ పాపం నకిలీమద్యంతో కూటమి ప్రభుత్వాన్ని వెంటాడుతోందన్నారు. తంబళ్లపల్లె నియోజక వర్గానికి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం మరక అంటించించడం విచారకరమన్నారు. రాయలసీమ కరువును పారదో లడానికి ఫ్యాక్టరీలు రప్పిస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారన్నారు. ప్రజలు నమ్మి గెలిపిస్తే చివరకు నకిలీ మద్యం ఫ్యాక్టరీలకు తెరలేపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. నకిలీ మద్యం కేసులో పెద్దల బాగోతాన్ని బయటపెట్టకపోతే వైఎస్సార్ సీపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.●తంబళ్లపల్లి నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జి డి. జయచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో నియోజక వర్గానికి చదువుకున్న వ్యక్తిగా ఫ్యాక్టరీలు రప్పిస్తామని చెప్పారని, చివరకు నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించి జనాల చెవిలో పూలు పెట్టారని అన్నారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నా ఎకై ్సజ్, పోలీస్ శాఖలు పసిగట్టలేక పోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టడమేనన్నారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎంజీ భూదేవి, వైస్ ఎంపీపీ ఎన్వి. రమణారెడ్డి, మండల కన్వీనర్ మధుసూధన్ రెడ్డి, మహిళా నాయకురాలు రెడ్డి కుమారి, సర్పంచ్ ఆర్కే కృష్ణారెడ్డి, నక్కా రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల సమస్యలపై 13న మహాధర్నా
రాయచోటి అర్బన్: గత నాలుగు నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు, కూరగాయల బిల్లులతో పాటు రెండు మాసాలుగా జీతాలు అందలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు పేర్కొన్నారు. సోమవారం ఆయన రాయచోటిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని అధికారులు చేతులెత్తేయడంతో ఈ నెల 13వ తేదీన మహాధర్నాకు పిలుపునిచ్చామన్నారు. ప్రతి సెంటర్కు దాదాపు రూ.50 నుంచి 60వేల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. శనివారం లోగా పెండింగ్ బిల్లులు చెల్లించి , జీతాలు కూడా విడుదల చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సుమలత, విజయమ్మ, సురేఖ, భూదేవి, శంకరమ్మ, పద్మజ, షబాన, కళావతి, పీరమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.బాధ్యతల స్వీకరణ కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 డిప్యూటీ డైరెక్టర్గా నాగ రత్నమ్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పరిపాలన అధికారిగా విధులు నిర్వహించారు. పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్ వనిషా, రవి, మానస తదితరులు నాగరత్నమ్మను అభినందించారు.గాలి, వానకు దెబ్బతిన్న వరిపంట సిద్దవటం: మండలంలోని ఎస్.రాజంపేట, వంతాటిపల్లి, కడప యాపల్లి, లింగింపల్లి గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరిపంట ఆదివారం రాత్రి వీచిన గాలులకు దెబ్బతింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి రమేష్రెడ్డి ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వంద ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. రైతులు జూన్ నెల చివరి వారంలో వరి సాగు చేశారు. ఎకరా పంటకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేశారు. ఈ నెల చివరిలో పంటను కోయాల్సిన సమయంలో గాలి, వానలకు నేలకొరిగి దెబ్బతింది. గతంలో పంట నష్టానికి ప్రభుత్వం బీమా కల్పించేదని, అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రభాకర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైన సేవలందించాలిలక్కిరెడ్డిపల్లి/రామాపురం: స్మార్ట్ పోలీసింగుతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లి సర్కిల్ పరిధిలోని రామాపురం పోలీస్టేషన్ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ ప్రాంగణం, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్కు వచ్చే వృద్ధులు, మహిళలు, బాధితుల పట్ల ఆప్యాయంగా, ఓర్పుతో వ్యవహరించాలని సూచించారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. రామాపురం పరిధిలోని గువ్వలచెరువు ఘాటు రోడ్లలో జరిగే ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, బాలలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, రాయచోటి రూరల్ సిఐ వరప్రసాద్, రామాపురం ఎస్ఐ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యం సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా ములకలచెరువు వద్ద భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్నది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దలేనని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దందానేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేత సురేంద్రనాయుడు పాత్రధారి మాత్రమేనని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టాలని.. సీఎం చంద్రబాబు ఈ దందాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!?..ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా హైవే పక్కనే ఓ పరిశ్రమను తలపించేలా నకలి మద్యాన్ని ఎలా తయారు చేయగలరు? ఈ ప్రభుత్వ పెద్దలు గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న దుర్మార్గాలేంటి? నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!? ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్తో రోజుకు 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారుచేసి, మద్యం షాపులకు, బెల్టు షాపులకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.పైగా.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే.. పెద్దఎత్తున లిక్కర్ స్కాం జరుగుతోందని కూటమి పార్టీలు, ఎల్లో మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. మరి ఇవాళ ములకలచెరువులో భారీగా బయటపడ్డ నకిలీ మద్యం గురించి టీడీపీ కూటమి ప్రభుత్వం, ఈ ఎల్లో మీడియా ఏం సమాధానం చెబుతాయి? అప్పుడు మద్యం తాగినవాళ్లందరికీ లివర్లు, కిడ్నీలు పాడైపోయాయని అన్నారుగా.. ఇప్పుడు పాడవవా? ఇక నిన్న అరెస్టైన సురేంద్రనాయుడు ఏ నాయకుడికి ముడుపులిస్తే ఈ దందా జరుగుతుందో సమాధానం చెప్పాలి.ములకలచెరువులోనే ఐదేళ్లలో రూ.500 కోట్ల దందా..ఇదిలా ఉంటే.. ఈ నకిలీ మద్యంతో కూడిన క్వార్టర్ బాటిల్ తయారీకి రూ.8 లేదా రూ.9 ఖర్చవుతుంది. అదే బాటిల్ను బెల్టుషాపుల వారికి రూ.110కి అమ్మితే వాళ్లు రూ.130కి అమ్ముతున్నారు. అంటే ఒక్కో బాటిల్ మీద రూ.100 ఆదాయం వస్తోంది. ఒక్క ములకలచెరువులో ఒక రోజులో 30 వేల బాటిళ్ల నకిలీ మద్యం తయారవుతుండగా రూ.30 లక్షల అక్రమార్జన జరుగుతోంది. ఇలా ఏడాదికి రూ.100 కోట్లు, ఐదేళ్లలో రూ.500 కోట్లు దండుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఇంకెన్ని చోట్ల నకిలీ మద్యం తయారుచేస్తున్నారో ప్రజలకు తెలియాలి. -
‘నకిలీ’ దందా డైరీలో నిక్షిప్తం
సాక్షి, రాయచోటి/ ములకలచెరువు/పెద్దతిప్పసముద్రం/ఇబ్రహీంపట్నం (మైలవరం): అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బట్టబయలైన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ వ్యవహారంలో మరి కొన్ని కీలక వివరాలు లభ్యమయ్యాయి. అక్కడ దొరికిన డైరీ (చిన్న పుస్తకం)లో నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు సరఫరా అయిన వివరాలు రాసి ఉండటం చర్చనీయాంశమైంది. అయితే ఆయా బెల్ట్ షాపులపై సజ్ అధికారులు తొందరపాటుతో చర్యలకు ఉపక్రమించొద్దని పెద్దల నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. దీంతో తూతూ మంత్రంగా ఒకటి రెండు షాపులపై దాడులు చేసి మమ అనిపించేలా ‘షో’ చేస్తున్నారు. కాగా, పాల వ్యాన్ తరహాలో ఉన్న ఆటోలో నకిలీ మద్యం సరఫరా అయ్యేది.ఈ విషయమై రెండు రోజులుగా ప్రజల్లో భారీగా చర్చ జరగడంతో రాజేష్కు చెందిన ఈ వ్యాన్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పెద్దతిప్పసముద్రం మండల టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడు ఇంటిలో, ఆయన నిర్వహిస్తున్న ఆంధ్రా వైన్స్లో నకిలీ మద్యం గుర్తించగా ఆయన్ను ఇప్పటికే అరెస్ట్ చేయడం తెలిసిందే.టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పీఏ టి.రాజేష్ పరారీలో ఉన్నట్టు చెబుతూ ఆయన దుకాణం జోలికి వెళ్లక పోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆదివారం సాయంత్రం రాజేష్ నిర్వహిస్తున్న ‘రాక్ స్టార్’ మద్యం దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూధనరావు మీడియాకు వెల్లడించారు. ఈ షాపులో ఎంత నకిలీ మద్యం నిల్వ ఉందనే వివరాలను మాత్రం వెల్లడించ లేదు. జనార్దనరావు, రాజు ఇళ్లల్లో తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం తయారీ కేసులో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లు, పచారీ దుకాణం, బార్లో శనివారం సోదాలు చేపట్టిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా పచారీ దుకాణం, బార్ నిర్వహిస్తున్న జనార్దనరావు, అతని పచారీ దుకాణంలో పనిచేసే కట్టా రాజు ఇళ్లను తనిఖీ చేశారు. వ్యాపార వేత్తగా ఉన్న జనార్దనరావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనప్పటికీ పలువురు టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. జనార్దనరావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా, కట్టా రాజు పరారీలో ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, జనార్దనరావు బార్లో ఇన్నాళ్లూ మద్యం తాగిన వారంతా బెంబేలెత్తిపోతున్నారు.దానిమ్మ తోటలో నకిలీ లిక్కర్ బాక్సులు పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల పంచాయతీ పరిధిలోని ఉప్పరవాండ్లపల్లిలో వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన దానిమ్మ తోటలో మూడు బాక్సుల్లో బీర్లు, నకిలీ మద్యం పట్టుబడింది. ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన బీరు బాటిళ్ల హోలోగ్రామ్ లేబుల్ స్కాన్ కాకపోవడంతో బీర్లు కూడా నకిలీవని తేలింది. ఈ మేరకు సీఐ అనుమానం వ్యక్తం చేస్తూ విషయాన్ని ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం.పట్టుబడిన మద్యం బాక్సులను కట్టా సురేంద్ర నాయుడు ఇటీవల బాబు అనే వ్యక్తి ద్వారా ఇక్కడకు పంపినట్లు రైతు వెంకటరెడ్డి పోలీసులకు తెలిపాడు. బాబు అనే వ్యక్తి మండలంలోని టి.సదుం పంచాయతీ పరిధిలోని చెన్నరాయునిపల్లికి చెందినవాడు. కట్టా సురేంద్ర నాయుడుకు నమ్మిన బంటు. కల్తీ మద్యం బాక్స్లను బెల్ట్ షాపులకు తరలించేవాడని తెలుస్తోంది. దానిమ్మ తోటలో పట్టుబడిన నకిలీ మద్యం వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
కోర్టు ఆర్డర్ సాకుతో.. రూ.20కోట్ల స్థలం..కబ్జాకు యత్నం
● అక్రమంగా పొజిషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నం ● అడ్డుకున్న తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది కోళ్లబైలు పంచాయతీలో ఆక్రమణకు యత్నించిన ప్రభుత్వ స్థలం తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డితో వాగ్వాదం చేస్తున్న టీడీపీ నాయకులు. మదనపల్లె రూరల్ : కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని దొడ్డిదారిన ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన తెలుగు తమ్ముళ్ల కుట్ర బట్టబయలైంది. కొన్నేళ్లుగా గుబురుపొదలు, పిచ్చిచెట్లు, ముళ్లకంపలతో చిన్నపాటి అడవిని తలపించేలా ఉన్న ప్రభుత్వ భూమిని, కోర్టు ఆర్డర్ సాకుతో తమ అనుభవంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటే, స్థానికుల ఫిర్యాదుతో మండల తహసీల్దార్ రంగంలోకి దిగి అడ్డుకుని, ఆక్రమణదారులకు నోటీసులు జారీచేసిన ఘటన మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో జరిగింది. మండల తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి తెలిపిన మేరకు..కోళ్లబైలు పంచాయతీలోని 598/3, 599/2 సర్వే నంబర్లలో భూమిని కొందరు వ్యక్తులు చదును చేస్తున్నారని, దీనికి సంబంధించి రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతోందని ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించామన్నారు. భూములకు సంబంధించి రికార్డులు పరిశీలిస్తే...2004కు ముందు వలిపి కుటుంబసభ్యులకు ఇందులో అసైన్మెంట్ పట్టా జారీ అయిందన్నారు. 2004 తర్వాత దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఈ భూమికి ఎస్టీ సంఘం పేరుతో కొందరు వ్యక్తులు హౌసింగ్ కాలనీకి మంజూరు చేయాల్సిందిగా 2004, 2016లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. అయితే, 2011–12లో రెవెన్యూ రికార్డుల వెబ్ల్యాండ్ ఆన్లైన్ ప్రక్రియలో, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ పొరపాటుగా వలిపి కుటుంబసభ్యుల పేరుతో నమోదుచేశారన్నారు. దీంతో గతంలో వారు భూమిని దున్నేందుకు ప్రయత్నిస్తే, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో హైకోర్టులో రిట్పిటిషన్ వేశారన్నారు. హైకోర్టు చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా తమను ఆదేశించిందన్నారు. ఆదివారం ఉదయం భూమిని చదును చేస్తుండగా సంబంధిత వీఆర్వోలు అడ్డుకుంటే కోర్టు ఆర్డర్ చూపారన్నారు. అయితే వారు చూపుతున్న ఆర్డర్ కాపీ కోర్టు నుంచి తమకు అందలేదన్నారు. వారు చూపిన కోర్టు ఆర్డర్లో పిటిషన్దారుడు పొజిషన్లో ఉంటే... వ్యవసాయభూమి అనుభవాన్ని భంగపరచవద్దని, అడ్డుకోవద్దని ఉందన్నారు. వాస్తవానికి, పిటిషనర్ పొజిషన్లో లేడని, భూమి మొత్తం కంపచెట్లు, ముళ్లపొదలు, గుబురు పొదలతో నిండిపోయి ఉందన్నారు. కోర్టు ఆర్డర్ను చూపి, పిటిషనర్ పొజిషన్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో అడ్డుకున్నామన్నారు. భూమి ప్రభుత్వానికి చెందినది కావడంతో ఆక్రమణదారుడికి నోటీసులు అందజేసి, రెవెన్యూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వస్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా చదునుచేస్తున్నారని తహసీల్దార్కు ఫిర్యాదుచేసిన వారిలో కోళ్లబైలు పంచాయతీ టీడీపీ ఇన్చార్జి రాటకొండ శ్రీనివాసులునాయుడు, రెడ్డి రాయల్లు ఉన్నారు. ఆక్రమణకు టీడీపీ నాయకుల అండ... కోళ్లబైలు పంచాయతీలో కోట్ల విలువైన ప్రభుత్వభూమి ఆక్రమణ వెనుక టీడీపీ నాయకుల హస్తం బయటపడింది. ఆక్రమణదారులకు మద్దతుగా టీడీపీ మండల అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, నాయకులు మేకల రెడ్డిశేఖర్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆర్డర్ ప్రకారం భూమి తమవారిదేనని, చదును చేయవద్దనేందుకు మీరు ఎవరని వాదులాటకు దిగారు. పార్టీల ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి తహసీల్దార్ రాజకీయాలతో పనిలేదని, కోర్టు ఉత్తర్వుల్లో కనపరిచిన ప్రకారం పొజిషన్లో లేనందున ప్రభుత్వస్థలం స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. -
నకిలీ మద్యం కేసులో దిద్దుబాటు చర్యలు
● సాక్షి కథనాలతో ప్రభుత్వంలో కదలిక ● తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, పీటీఎం నేత కట్టా సురేంద్ర నాయుడులు పార్టీ నుంచి సస్పెన్షన్ మదనపల్లె : ములకలచెరువు నకిలీ మద్యం రాకెట్ కేసు వ్యవహారంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం ఎకై ్సజ్ శాఖ దాడులతో నకిలీ మద్యం రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో సూత్రధారులైన టీడీపీ నేతలను తప్పించి అమాయకులను బలి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై‘సాక్షి’వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో తప్పించుకోలేని పరిస్థితుల్లో పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, పీటీఎం మండలానికి చెందిన సీనియర్ నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు నిందితులపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో తొలి రెండు రోజులు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. అక్కడ పనిచేస్తున్న కూలీలపై కేసు నమోదు చేసింది. సూత్రధారులు ప్రస్తావన తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనం ప్రభుత్వ, పార్టీ పరంగా కదిలిక తీసుకొచ్చింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి స్పందన కనిపించలేదు. సాయంత్రం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. జయచంద్రారెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి. చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంతో చంద్రబాబు ఆదేశాలతో రాత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తమదాకా వస్తుందనే.. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ వ్యవహారం ప్రభుత్వ మెడకు చుట్టుకుంటోందని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు సమస్య తమదాకా రానివ్వకుండా చర్యలకు ఉపక్రమించారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని పదేపదే ఆరోపణలతో, అవాస్తవాలతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసి మద్యాన్ని విక్రయించారు. ఈ వ్యవహారం రాష్ట్రమంతా తీవ్రమైన చర్చకు దారితీసింది. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం కంటే.. ఈ నకిలీ మద్యం తయారీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ వ్యవహారం ఎంత దూరం తీసుకెళ్తుందో అన్న ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తం అయింది. దీంతో ఆలస్యం చేయకుండా ఇన్చార్జి జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులపై పార్టీపరంగా వేటు పడేలా చేసింది. ● పీటీఎం మండలానికి చెందిన టిడిపి సీనియర్ నేత కట్టా సురేంద్ర నాయుడు తొలుత జయచంద్రారెడ్డితో విభేదించి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయనతో కలిసిన పాపానికి కల్తీ మద్యం కేసులో ఇరుక్కోవడమే కాకుండా, పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయ్యాడు. సురేంద్ర నాయుడు జయచంద్రారెడ్డి -
నకిలీ మద్యం.. టీడీపీదే పాపం
● ప్రజల ప్రాణాలతో చెలగాటం ● పాల వ్యాన్ ముసుగులో సరుకు సరఫరా ● ఎక్స్తెజ్ అధికారుల సెర్చ్ ఆపరేషన్ సాక్షి రాయచోటి/మదనపల్లె : నకిలీ మద్యం తీగ లాగితే డొంక కదులుతోంది. ఒకచోట తయారు చేసి అనేక ప్రాంతాలకు యథేచ్ఛగా సరఫరా చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుని అమ్ముకునే వ్యాపారులు కొందరైతే..స్థానికంగా పేరొందిన టీడీపీ నాయకులే నకిలీ మద్యం తయారీని చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దాదాపు మూడు నాలుగు నెలల నుంచి ఈ తతంగం నడుస్తున్న క్రమంలో ఒక్క అన్నమయ్య జిల్లాలోనే కాకుండా సరిహద్దు ప్రాంతంలోని అటు అనంతపురం, ఇటు చిత్తూరు జిల్లాకు కూడా సరఫరా చేశారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మూడు రోజుల కిందట నకిలీ మద్యం తయారీకి సంబంధించిన యంత్రాలతోపాటు పెద్ద ఎత్తున డంపును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పెద్దతిప్ప సముద్రం మండలంలో నకిలీ మద్యం స్వాధీనంతోపాటు ఒక వైన్షాపును కూడా సీజ్ చేయడం కలకలం రేపుతోంది. ములకలచెరువు సమీప ప్రాంతంలో నకిలీ మద్యాన్ని తయారు చేసిన అనంతరం నేరుగా బెల్ట్షాపులకు సరుకు రవాణా సాగింది. అయితే , ఇక్కడి నుంచి సరఫరాకు పాల వ్యాన్ తరహాలో ఆటో ద్వారా తతంగాన్ని నడిపినట్లు తెలియవచ్చింది. ములకలచెరువులో ఇటీవల ఎకై ్సజ్ అధికారులు దాడులు చేసి పట్టుకున్న నకిలీ మద్యం వ్యవహారంలో కీలక అంశాలు లభ్యమయ్యాయి. అందుకు సంబంధించి అక్కడ దొరికిన డైరీ (చిన్న పుస్తకం)లో నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి బెల్ట్ షాపులకు సరఫరా అయిన వివరాలు లభించాయి. సెర్చ్ ఆపరేషన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎకై ్సజ్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. నిందితుల నుంచి వచ్చిన సమాచారంతోపాటు స్థానికుల ద్వారా అందుకున్న రహస్య సమాచారం మేరకు నియోజకవర్గంలో విస్తృతంగా దాడులు చేశారు. ప్రధానంగా పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, బి.కొత్తకోట, తంబళ్లపల్లెతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ, తోటల్లోనూ ఆపరేషన్ నిర్వహించారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని తోటలో నిల్వ చేసిన పలు రకాల నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ ఆధ్వర్యంలో ఒక్కో మండలానికి ఒక్కో బృందం వెళ్లి దాడులు నిర్వహించింది. జిల్లాలో కలకలం జిల్లాలో నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్కడ చూసినా చర్చ కొనసాగుతోంది. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు సురేంద్రనాయుడుతోపాటు మరికొంతమంది కీలక టీడీపీ నేతల ప్రమేయంతో కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. విజయవాడకు చెందిన వ్యక్తులతోపాటు స్థానికంగా టీడీపీలో పలుకుబడి కలిగిన నాయకులు ఇందులోకీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆదాయ మార్గాల కోసం టీడీపీ నాయకులు వక్రమార్గాలను ఎంచుకుని ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా అనేక చోట్లకు నకిలీ మద్యం సరఫరా చేసిన నేపథ్యంలో రానున్న కాలంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ములకలచెరువులో బట్టబయలైన నకిలీమద్యం తయారీ రాకెట్ వ్యవహారంలో మద్యం తరలింపు, విక్రయాలకు సంబంధించిన లెక్కలను ఎకై ్సజ్ అధికారులు పక్కాగా సేకరించారని, దీనికి బలం చేకూర్చే వివరాల ఆధారాలు లభించాయని తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో మద్యం కొనుగొలు చేసిన వ్యక్తులు, దుకాణాల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఓ మద్యం షాపును సీజ్ చేసిన ఎకై ్సజ్ అధికారులు మిగిలిన వారి వివరాలతో ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. ఎవరికెంత ములకలచెరువు నకిలీమద్యం తయారీ కేంద్రం నుంచి ఏ మేరకు మద్యం తయారైంది, దాన్ని ఎక్కడెక్కడికి, ఎవరెవరికి సరఫరా చేసింది వివరాలు లభ్యమైనట్టు తెలిసింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువుకు సమీపంలో పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట మండలాలు, సరిహద్దులో తంబళ్లపల్లె మండలం ఉండగా తర్వాత పెద్దమండ్యం, కురబలకోట మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో ప్రతిపల్లెలో బెల్టుషాపులను నిర్వహించారు. ఈ విషయం అధికారులకు తెలిసిన విషయమే. వీటిని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎంత మద్యం సరఫరా చేసింది వివరాలు ఉన్న కాగితాలు దొరికాయని సమాచారం. దీనిద్వారా ఎకై ్సజ్ అధికారులు పూర్తిస్థాయిలో వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. బెల్టుషాపుల మూత నకిలీమద్యం తయారీ వ్యవహారం వెలుగులోకి రా వడంతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో బెల్టుషాపులు మూతపడ్డాయి. శుక్రవారం జరిగిన దాడులతో నకిలీమద్యం కేసు తమకు చుట్టుకుంటుందన్న ఆందోళనతో బెల్టుషాపులను మూసివేయడమేకాక నిర్వాహకులు మొబైల్ఫోన్ల స్విచ్చాఫ్ చేశారు. విక్రయాల్లో కీలకంగా వ్యవహరించే కొందరు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దొరికిన లెక్కల ఆధారంగా ఎకై ్సజ్పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రమేయం ఉన్న విక్రయదారులను గుర్తించి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఆదివారం నకిలీమద్యంపై ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ఫోర్స్ బృందాలు తంబళ్లపల్లె నియోజకవర్గంలో దాడులు నిర్వహించాయి. దీంతో నియోజకవర్గమంతటా దీనిపై చర్చ జరిగింది. తమ ప్రాంతంలో ఏకంగా నకిలీమద్యం కేంద్రం బట్టబయలు కావడం, ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో అన్న ఉత్కంఠ కనిపించింది. ఎక్కడైనా నకిలీమద్యం డంపులు ఉన్నాయా, వాటిని గుర్తించేందుకు ఆరా తీస్తున్నారు. -
బెల్ట్ షాపులను మూయించండి
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశంకురబలకోట : మద్యం బెల్ట్ షాపులను వెంటనే మూయించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే శాంతి భధ్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీస్ యంత్రాగాన్ని ఆదేశించారు. ఆదివారం ఆయన ముదివేడు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ స్థలాన్ని సర్వే చేయించి చుట్టూ కంచె వేయాలని సూచించారు. రికార్డులు, సీడీ పైళ్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో శాంతి భద్రతలు కాపాడడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. పీజీఆర్ఎస్ పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. రౌడీ షీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి మంగళవారం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళ గస్తీ పెంచాలన్నారు. నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. ముదివేడు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతన్నాయని దీని నియంత్రణకు సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంగళ్లు నియోజక వర్గ కూడలిగా ఉన్నందున పరిసరాల్లో సీసీ కెమెరాలు యుద్ధప్రాతిపధికన ఏర్పాటు చేయాలన్నారు. ఎస్ఐ దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
రేపు వాల్మీకి జయంతి
రాయచోటి జగదాంబసెంటర్ : వాల్మీకి జయంతి వేడుకలను ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు తెలిపారు. రాయచోటి పట్టణం బస్టాండ్ రోడ్డులో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమం, వాల్మీకి మహర్షి సేవా స్మరణ జరుగుతుందని చెప్పారు. జిల్లా నలుమూలల నుంచి వాల్మీకి బంధువులు పాల్గొని జయంతి వేడుకలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. గంగమ్మకు బోనాల సమర్పణ లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బోనాలు సమర్పించి, తలనీలాలు అర్పించారు. తల్లీ ..కాపాడమ్మా అంటూ వేడుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్సీసీలో జాతీయ స్థాయిలో రజత పతకం కురబలకోట : అంగళ్లు మి ట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎన్సీసీ క్యాడెట్ కె. ఇస్సాక్ ఎనోస్ జాతీయ స్థాయి జడ్జింగ్ డెస్టెన్స్, ఫీల్డ్ సిగ్నల్స్ పోటీలో రజత పతకం సాధించినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. ఆలిండియా స్థాయిలో న్యూఢిల్లీలో ధాల్ సైనిక్ క్యాంప్లో పోటీలు జరిగాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 91 మంది క్యాడెట్లతో కూడిన డైరెక్టరేట్ పోటీదారులు అధ్బుత ప్రదర్సన చేశారన్నారు. ఇందులో మిట్స్ ఎన్సీసీ క్యాడెట్ కె. ఇస్సాక్ ఎనోస్ భాగస్వామి కావడం గర్వంగా ఉందని చాన్స్లర్ ఎన్. విజయబాస్కర్ చౌదరి తెలిపారు. వరుసగా 11 క్యాంపుల్లో పాల్గొని ఈ ఘనత సాధించినట్లు తెలిపారు.క్యాడెట్ తల్లిదండ్రులు కె. ఎస్తేర్ రాణి, కె. జెర్మియాను కూడా అభినందించారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రాయచోటి : ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 6వ తేది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక మదనపల్లె సిటీ : జిల్లా ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.భాస్కరన్, ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా పిఎల్.ఎన్.శాస్త్రి, గౌరవ అధ్యక్షుడిగా వెంకటశివయ్య, డివిజనల్ కార్యదర్శులుగా హేమంత్కుమార్(మదనపల్లె),రాజంపేట పి.వెంకటేశ్వర్లు,పీలేరు రెడ్డిశేఖర్రెడ్డి, రాయచోటి రామయ్యను ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శులుగా కె.మురళీధర్, శ్రీధర్కుమార్, మహిళా కార్యదర్శిగా పార్వతి, ఉపాధ్యక్షులుగా జగన్మోహన్రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రాజయ్య, కె.భాస్కర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా స్థాయి అకడమిక్ టీం అధ్యక్షుడిగా ఆంజనేయులు, సభ్యులుగా అన్వర్సాధత్, వెంకటసుబ్బయ్య, శివప్రసాద్, ఆడిట్ కమిటీ సభ్యులుగా వరప్రసాద్, రమేష్రెడ్డి ఎన్నికయ్యారు. -
రైతు భూమిపై టీడీపీ నేత కన్ను
మదనపల్లె రూరల్ : కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి పంటను నాశనం చేయడమే కాకుండా.. చంపేస్తామని రైతును టీడీపీ నాయకుడు బెదిరించిన ఘటన ఆదివారం మదనపల్లె మండలం పోతబోలులో జరిగింది. పట్టణంలో నివాసం ఉంటున్న గాలి వెంకటసుబ్బయ్య కుమారుడు గాలి రవీంద్ర పోతబోలు గ్రామం సర్వే నంబర్: 605లో 0.25 సెంట్ల వ్యవసాయభూమిని హక్కుదారురాలైన బత్తెన్న గారి పాపన్న అలియాస్ వెంకటస్వామి భార్య రెడ్డెమ్మ నుంచి కొనుగోలు చేశాడు. వ్యవసాయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఉలవ పంట వేశాడు. అయితే ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నాయకుడు బురుజు పెద్దరెడ్డెప్ప.. కొంత మందితో కలిసి ఆదివారం దౌర్జన్యంగా భూమిలోకి ప్రవేశించడమే కాకుండా ట్రాక్టర్తో ఉలవ పంటను దున్ని, జొన్నలు వేసేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న గాలి రవీంద్ర అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అతడిని చంపేస్తామని బెదిరించాడు. దీంతో చేసేదేమీలేక బాధితుడు తాలూకా పోలీస్స్టేషన్కు చేరుకుని, భూమికి, పెద్దరెడ్డెప్పకు ఎలాంటి సంబంధం లేదని, భూరికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. టీడీపీ నాయకుడితో ప్రాణహాని ఉన్నందున, రక్షణ కల్పించాల్సిందిగా వినతి చేశాడు.పంటను దున్నేసిన వైనం -
కొత్త టీచర్లు అంకితభావంతో పని చేయాలి
మదనపల్లె సిటీ : కొత్త టీచరత్లు అంకితభావంతో పని చేయాలని కడప డీఈఓ డాక్టర్ షంషుద్దీన్ అన్నారు. ఆదివారం స్థానిక చిత్తూరు రోడ్డులోని గ్రీన్వ్యాలీ స్కూల్లో నూతనంగా ఎంపికైన టీచర్ల శిక్షణా కార్యక్రమా న్ని సందర్శించారు. శిక్షణను సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. క్లాస్రూములు సందర్శించి తనదైనశైలిలో కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులు పాఠశాలలో నిర్వర్తించాల్సిన విధుల గురించి, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి,రిసోర్సుపర్సన్లు రెడ్డిశేఖర్, శివశంకర్రెడ్డి, నరేంద్ర, నాగరాజరెడ్డి, కోర్సు డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఇద్దరు చైన్స్నాచర్స్ అరెస్టు
రాయచోటి జగదాంబసెంటర్ : పలు ప్రాంతాలలో బంగారు, వెండి ఆభరణాల చోరీలకు పాల్పడ్డ ఇద్దరు చైన్స్నాచర్స్ను అరెస్టు చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ కృష్ణమోహన్ అర్బన్ సీఐ బివి చలపతితో కలిసి ఆదివారం వివరాలు వెల్లడించారు. కడప అగాడి సెంటర్కు చెందిన షేక్ నమాస్ అలియాస్ మస్తాన్పై రాయచోటి అర్బన్ పోలీస్స్టేషన్లో నాలుగు, ప్రొద్దుటూరు ఒన్టౌన్, టూ టౌన్, బనగానపల్లి, యర్రగుంట్ల, మైదుకూరు, జమ్మలమడుగు, ఖాజీపేట పోలీస్స్టేషన్లలో 9 చోరీ కేసులు ఉండగా, కడప జిల్లాలో మరో మూడు ప్రాంతాలలో దొంగతనాలు చేసినట్లు తెలిపారు. ఇతని వద్ద నుంచి 215 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి ఆభరణాలను రికవరీ చేయగా, వీటి విలువ సుమారు రూ.21.30 లక్షలు ఉండగా రాయల్ ఎన్ఫీల్డ్ జిటి ట్విన్ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా కడప టౌన్ మోచంపేటకు చెందిన మహమ్మద్షా అలీజబ్రి అలియాస్ షేక్ మహమ్మద్ రెహమాన్ అలియాస్ అబ్దుల్లా అలియాస్ సోహెల్పై రాయచోటి అర్బన్, చెన్నూరు పోలీస్స్టేషన్లలో కేసులు ఉండగా, ఇతని వద్ద నుంచి 95 గ్రాముల మూడు తాళిబొట్లు, చైన్లు స్వాధీనం చేసుకోగా వీటి విలువ సుమారు రూ.9.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన అర్బన్ సీఐ చలపతి, ఎస్ఐలు బాలకృష్ణ, అబ్దుల్జహీర్, రామకృష్ణ, సిబ్బంది అమరనాథ్, బాబ్జీ, రామకృష్ణ, సురేంద్ర, సీసీఎస్ సిబ్బంది బర్కత్, మహేంద్రలను రాయచోటి డీఎస్పీ అభినందించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేంపల్లె : చక్రాయపేట మండలంలోని గొంది అడవుల్లో నక్కలదిన్నెపల్లె గ్రామ వాసి బండ్లపల్లె ప్రతాప్ రెడ్డి (55) అనే వ్యక్తి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చక్రాయపేట మండలంలోని నక్కలదిన్నెపల్లె గ్రామానికి చెందిన బండ్లపల్లె ప్రతాప్రెడ్డి, గడ్డంవారిపల్లె గ్రామానికి చెందిన యోగేశ్వరరెడ్డి కలిసి శనివారం గొంది గ్రామ సమీపంలోని తెల్లకొండ అడవి ప్రాంతానికి మంచం కోళ్లకు సంబంధించి కొయ్యలు తీసుకొచ్చేందుకు వెళ్లారు. అయితే గొంది అడవి ప్రాంతంలోని తెల్లకొండ సమీపంలో ప్రతాప్రెడ్డికి తేనెటీగలు కుట్టి అక్కడికక్కడే మృతి చెందాడని యోగీశ్వరరెడ్డి మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి కుమారుడు నవీన్కుమార్రెడ్డి, బంధువులతో కలిసి పోలీసులు గొంది సమీపంలోని అడవి ప్రాంతానికి వెళ్లి ప్రతాప్రెడ్డి మృతదేహన్ని పరిశీలించారు. మృతదేహన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా.. మృతి జరిగిన సంఘటనపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో కడప రిమ్స్కు తరలించారు. కడప రిమ్స్లో ప్రతాప్రెడ్డి మృతదేహనికి పోస్టుమార్టం చేసి బంధువులకు పోలీసులు అప్పగించారు. నవీన్కుమార్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. పెద్ద దర్గా దర్శించుకున్న వక్ఫ్బోర్డ్ సీఈవో కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని పెద్ద దర్గాను వక్ఫ్ బోర్డ్ సీఈవో మహమ్మద్ అలీ ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వక్ఫ్బోర్డు డైరెక్టర్ సయ్యద్ దావూద్ బాషా ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం వక్ఫ్ బోర్డ్ సీఈఓ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకుడు లయన్ పటాన్ ఖాదర్బాషా, దర్గా ముజావర్ అమీర్, మేనేజర్ అలీఖాన్, బీఎండబ్ల్యూ ఇదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ఆడుకుంటూ.. అనంతలోకాలకు..
● కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృత్యువాత ● శోకసంద్రంలో తల్లిదండ్రులుసంబేపల్లె : ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ.. అనంతలోకాలకు వెళ్లారు. నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డారు. వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన సంబేపల్లె మండల పరిధిలోని రెడ్డివారిపల్లె గ్రామం నడిమిరాజుగారిపల్లె దళితవాడ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నడిమిరాజుగారిపల్లెకు చెందిన ములగురి జనార్ధన్నాయుడు, సుజన దంపతులకు లిఖిత్ (11) అనే కుమారుడు ఉన్నాడు. వారి ఇంటికి మదనపల్లె అమ్మమిట్ట చెరువుకు చెందిన రఘుపతినాయుడు, సుమలతతోపాటు వారి కుమారుడు పి.మోక్షిత్(13) దసరా సెలవుల సందర్భంగా వచ్చారు. సుమలత, సుజన అక్కాచెల్లెళ్లు. వారి కుమారులైన లిఖిత్, మోక్షిత్ సెలవుల్లో సరదాగా గడిపారు. ఈ క్రమంలో ఆడుకుంటూ సమీపంలోని నల్లరాళ్లకుంట వద్దకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్రెడ్డి పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
‘రెవెన్యూ’ మాయాజాలం
● ఒకరి భూమి మరొకరిపై ఆన్లైన్ ● హక్కుదారుడు నిలదీయడంతో.. మళ్లీ అతని పేరుపై.. ● పాసుపుస్తకం మంజూరులో జాప్యం ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనంగోపవరం : చేయి తడిపితే ఎలాంటి పనినైనా చేయగల సత్తా ఒక రెవెన్యూ శాఖలోనే ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ ఆ శాఖ అధికారుల తీరులో.. ఎలాంటి మార్పులేదు. ఫలితంగా భూ వివాదాలు పేట్రేగిపోతున్నాయి. ఏ శాఖలోనైనా కొంత మేరకై నా సమస్యలు పరిష్కారమవుతాయి గానీ రెవెన్యూశాఖలో మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం సాక్షాత్తు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే కలెక్టర్ల సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇందుకు నిదర్శనం సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరే. పైసలిస్తే పట్టా భూమిని కూడా మార్చివేస్తున్న రెవెన్యూ అధికారులు.. గతంలో కోట్లు విలువ పలికే డీకేటీలు సైతం ఆన్లైన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ లబ్ధిదారుడి పట్టా భూమిని కూడా నకిలీ అగ్రిమెంటుతో మరొకరి పేరుతో ఆన్లైన్లో ఎక్కించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గోపవరం రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 107/1ఎ లో మందల జయరామయ్యకు ఒక ఎకరం పట్టా భూమి ఉంది. ఈ భూమిని ఒంగోలు వెంకటరెడ్డి దగ్గర 27–05–2002లో కొనుగోలు చేశారు. బద్వేలు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో అప్పట్లో రిజిస్టర్ కూడా అయింది. డాక్యుమెంట్ నంబర్ 557/2002. హక్కుదారుడు ఊరిలో లేనిది చూసి.. జయరామయ్య వృత్తి రీత్యా మరొక చోట నివాసం ఉంటున్నాడు. సదరు పట్టా భూమిని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బమ్మ అనే మహిళ జయరామయ్య తనకు అగ్రిమెంటు రాయించినట్లుగా ఒక అగ్రిమెంటును సృష్టించింది. సదరు మహిళకు ఆన్లైన్ కావాలంటే రిజిస్టర్ డాకుమెంట్ తప్పనిసరి. ఎలాగైనా అగ్రిమెంటు మీద ఆన్లైన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చు అయినా భరిస్తామని చెప్పడంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేసేందుకు సిద్దపడ్డారు. ఇక పైసలిస్తే రెవెన్యూలో ఎలాంటి పనైనా జరుగుతుందనే విషయం తెలిసిందే. ఒక రేటు మాట్లాడుకుని సదరు మహిళ వద్ద ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే అగ్రిమెంటు మీదనే తహసీల్దారు.. వెంకటసుబ్బమ్మ పేరుతో ఆన్లైన్ చేశారు. ఇదే అదునుగా భావించిన వెంకటసుబ్బమ్మ ఇది మరొకరికి మారితే బలం చేకూరుతుందనే విషయం గ్రహించి.. తన కుమార్తె కలవకూరి ప్రశాంతికి గిఫ్ట్ రూపంలో 2024 జనవరి1న రిజిస్టర్ చేయించింది. డాక్యుమెంట్ నంబర్ 452/2024. ఇంతటితో తన వ్యూహం ముగిసిందనే లోపే అసలు లబ్ధిదారుడు జయరామయ్య తన భూమికి సంబంధించి ఆన్లైన్లో చెక్ చేసుకోవడం జరిగింది. ఆన్లైన్లో తన పేరుకు బదులు వెంకటసుబ్బమ్మ పేరు ఉండటంతో కంగుతిన్నాడు. ఒకరి పేరుతో ఉన్న పట్టా భూమి కూడా మరొకరి పేరుతో మారుతుందా అని సందేహపడ్డారు. హుటాహుటిన గోపవరం తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని తహసీల్దారును నిలదీశారు. అక్కడ సరైన సమాధారం రాకపోవడంతో 2024 డిసెంబర్16న బద్వేలు ఆర్డీఓకు అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారుల నుంచి తహసీల్దారుపై ఒత్తిడి పెరిగింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా తహసీల్దారు రంగంలోకి దిగి.. ఫేక్ అగ్రిమెంటుపై రిజిస్టర్ చేయించుకున్న వారిని సంప్రదించి రిజిస్టేషన్ను రద్దు చేయించుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చారు. వారు పలకకపోవడంతో రెవెన్యూ అధికారులే 2025 జనవరి 2వ తేదీన బద్వేలు సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళ్లి.. 2024 నవంబర్ 22న ప్రశాంతి పేరు మీద జరిగిన రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రారును కోరారు. అందుకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని చెప్పడంతో ఎట్టకేలకు రిజిస్టర్ను రద్దు చేశారు. రద్దు చేసిన డాక్యుమెంట్ నంబర్ 15/2025. తిరిగి లబ్ధిదారుడి పేరు మీదికి మార్చికి.. ప్రశాంతి రిజిస్ట్రేషన్ రద్దు అయిన వెంటనే, వెంకటసుబ్బమ్మ పేరుతో ఉన్న ఆన్లైన్ను తిరిగి.. జయరామయ్య పేరు మీద మార్చారు. 2025 మార్చి7న జయరామయ్య పేరుతోనే పట్టా భూమి ఉందని స్వయంగా తహసీల్దారే ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈలోపే జయరామయ్య ఆరోగ్య పరిస్థితి బాగ లేకపోవడంతో 2025 ఫిబ్రవరి10న తన భార్య దొరసానమ్మ పేరుతో రిజిస్టర్ చేయించారు. రిజిస్టర్ డాక్యుమెంట్ నంబర్ 469/2025. రిజిస్టర్ కార్యాలయంలోనే దొరసానమ్మ పేరుతో ఆటోముటేషన్ అయింది. తన పేరు మీద పాసుపుస్తకం కావాలని డాక్యుమెంట్లతో పాటు మూడు దఫాలుగా మీసేవ చలానా కట్టడం జరిగింది. కానీ తహసీల్దారు మాత్రం ఇప్పటి వరకు పాసుపుస్తకాలు మంజూరు చేయలేదని స్థానిక రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అగ్రిమెంటు మీద ఆన్లైన్ చేసిన తహసీల్దారు స్వయంగా పట్టాదారుని పేరుకే పాసుపుస్తకాలు మంజూరు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారంటే ఆయన వ్యవహారశైలి ఏవిధంగా ఉందోనని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను మీసేవలో మూడు దఫాలు చలానా కట్టినా పాసుపుస్తకాలు మంజూరు కాకపోవడంతో.. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని లబ్ధిదారురాలు చెప్పిడం జరిగింది. జరిగిన పూర్తి సమాచారంపై తహసీల్దారు త్రిభువన్రెడ్డిని సాక్షి వివరణ కోరగా అగ్రిమెంట్ మీద ఆన్లైన్ చేయడం జరిగిందని, తిరిగి జరిగిన తప్పిదాన్ని సరిచేసినట్లు తెలిపారు. -
రహదారి.. నత్తగా మారి
● జాతీయ రహదారి నిర్మాణంలో జాప్యం ● భూ సేకరణలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం ● కూటమి ప్రభుత్వం అశ్రద్ధకడప సిటీ : జాతీయ రహదారి–440 నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. కల నెరవేరుతుందన్న తరుణంలో.. పనుల్లో జాప్యం జరుగుతుండటం నిరాశ కలిగిస్తోంది. భూ సేకరణ అంతంత మాత్రమే జరగడంతో నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రెవెన్యూ శాఖ భూ సేకరణకు సహకరించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోడ్డుకు 2023 మార్చిలో నిధులు మంజూరైనప్పటికీ ప్రధానంగా భూ సేకరణ కాకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఊపందుకున్న పనులు.. ఆ తర్వాత కుంటుపడుతూనే వస్తున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఈ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వ పెద్దలను పలుమార్లు కలిసి పట్టుదలతో కృషి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీకి అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించి సమస్యను వివరించడంతో ఆయన కృషి ఫలించి రహదారి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఈ విషయంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చేసిన కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. రెండు రీచ్లుగా అంటే చాగలమర్రి–వేంపల్లె వరకు 80 కిలోమీటర్లకు గాను రూ.660 కోట్లు, వేంపల్లె–రాయచోటి వరకు 53.9 కిలోమీటర్లకు గాను రూ.230 కోట్ల నిధులు కేటాయించారు. ప్రజల ఇబ్బందులు తొలగేందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ రోడ్డు కార్యరూపం దాల్చుతుందన్న నేపథ్యంలో.. ఆయన ఆకస్మిక మరణంతో అటకెక్కింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఈ రోడ్డు నిర్మాణాన్ని విస్మరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కృషితో ఎట్టకేలకు ఈ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రైతులకు పరిహారం అంతంత మాత్రమే ప్రధానంగా ఈ రోడ్డు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఇందుకు కారణం భూ సేకరణ ఆలస్యం కావడంతోనేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూశాఖ నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినప్పటికీ.. భూ సేకరణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సేకరించి వారికి అప్పగించాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వహిస్తుందంటే.. అందుకు కారణం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వమే. రెండు రీచ్లకు కలిపి మొత్తం 185 హెక్టార్లు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందులో చాగలమర్రి–వేంపల్లె రోడ్డుకు 174 హెక్టార్లకు గాను 104 హెక్టార్లు మాత్రమే జరిగింది. అలాగే వేంపల్లె–రాయచోటి రోడ్డుకు కేవలం 11 హెక్టార్ల భూసేకరణ గాను.. దాదాపు ఇక్కడ భూసేకరణ పనులు చిన్నా చితక ప్రాంతాల్లో మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం భూసేకరణకు చాగలమర్రి–వేంపల్లె రోడ్డుకు రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ. 24 కోట్లు రైతులకు అందింది. అలాగే వేంపల్లె–రాయచోటి రోడ్డుకు రూ.70 కోట్ల పరిహారానికి గాను రూ.53 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సంబంధిత శాఖ మంత్రి పట్టించుకుని భూసేకరణపై శ్రద్ధ వహిస్తేగానీ పనులు ముందుకు సాగవు. ముందుకు సాగని చాగలమర్రి–వేంపల్లె ఎన్హెచ్ రోడ్డు పనులు ఎన్హెచ్–440 పేరుతో చాగలమర్రి–వేంపల్లె వరకు 80 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇందుకు గాను 285 హెక్టార్ల భూ సేకరణ అవసరం ఉంది. మొత్తం రూ.660 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. భూ సేకరణ తీవ్ర ఆలస్యం కావడంతో ఈ రోడ్డు పనులు ముందుకు సాగలేదు. ఇటీవలే ఈ రోడ్డుకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. 28 గ్రామాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. పరిహార విషయంలో రూ.14 లక్షల నుంచి గరిష్టంగా రూ. 2.50 కోట్ల వరకు హెక్టారుకు ఉంది. చాగలమర్రి నుంచి రాజుపాళెం, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మీదుగా వేంపల్లె–రాయచోటి బైపాస్ వరకు ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది. 2024 వరకు పనుల్లో పురోగతి ఉండగా, ఆ తర్వాత జాప్యం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రెండు మేజర్ బ్రిడ్జిలు, ఇంకా చిన్నా చితక వంతెనలు కూడా నిర్మించాల్సి ఉంది. త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కొనసాగుతున్న వేంపల్లె–రాయచోటి ఎన్హెచ్ రోడ్డు పనులు వేంపల్లె–రాయచోటి ఎన్హెచ్–440 రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. 53.9 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాల్సి ఉండగా, రూ.230 కోట్ల నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో మేజర్ వంతెనలు 2, మైనర్ వంతెనలు 11, కల్వర్టులు 60, పైపు కల్వర్టులు మరికొన్ని అవసరం ఉన్నాయి. ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ ఈ పనులను ప్రారంభించింది. మరో ఆరు నెలలు గడిస్తే గానీ ఈ రోడ్డు పూర్తయ్యే అవకాశం లేదు. చక్రాయపేట వద్ద గ్రామంలో కాకుండా ఊరి వెలుపల రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. అయితే అందుకు సంబంధించిన సర్వీసు రోడ్డు గుంతలమయంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు విన్నవిస్తున్నారు. భూ సేకరణకు కేవలం 11 ఎకరాలు మాత్రమే అవసరం ఉండగా, రూ.70 కోట్లకు గాను రూ.53 కోట్ల పరిహారం అందించారు. మరికొంత భూ సేకరణ చేయాల్సి ఉంది. ఎల్ఆర్ పల్లె, నాగులగుట్టపల్లె, ఆంజనేయపురం, పాయలోపల్లె గ్రామాల వద్ద భూ సేకరణ పెండింగ్లో ఉంది. ఈ భూ సేకరణ పూర్తయితే ఎటువంటి ఆటంకం లేకుండా రోడ్డు పనులు కొనసాగే అవకాశం ఉంది.ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కృషి ఎనలేనిది ఈ రోడ్ల నిర్మాణానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఎంతో కృషి చేశారు. పలుమార్లు సంబంధిత కేంద్ర మంత్రి గడ్కరీకి వినతిపత్రాలు సమర్పిస్తూ సమస్యను వివరిస్తూ రావడంతో ఎట్టకేలకు ఆయన కృషి ఫలించి ఈ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. కడప ఎంపీ కృషి ఫలితం వల్లే నిధులు మంజూరు కావడం జరిగింది. ఆయన చేసిన కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.త్వరితగతిన పూర్తికి చర్యలు ఎన్హెచ్–440 రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భూ సేకరణ ఆలస్యం కావడం వల్ల పనులకు ఇబ్బంది కలుగుతోంది. సంబంధిత అధికారులతో భూ సేకరణ విషయంపై చర్చించి వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్.సుధాకర్, ఎన్హెచ్ ఈఈ, కడపత్వరగా పూర్తి చేయాలి ఎన్హెచ్–440 రోడ్డు నిర్మాణ పనులను త్వరగా చేపట్టి పూర్తి చేయాలి. ఎన్నో ఏళ్లుగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సి అవసరం ఉంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు కొనసాగించాలి. – ఎన్.శివ, యాండ్లవాండ్లపల్లె, చక్రాయపేట మండలందుమ్ము, ధూళితో అల్లాడుతున్నాం వేంపల్లె–రాయచోటి నేషనల్ హైవే పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా చక్రాయపేట మండల కేంద్రంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ రోడ్డుకు సంబంధించిన వాహనాలు తిరగడం వల్ల రోడ్డు గుంతలమయంగామారింది. దుమ్ము, ధూళితో అల్లాడిపోతూ రోగాల బారిన పడుతున్నాం. ఎన్హెచ్ అధికారులు చొరవ తీసుకుని రోడ్డు వేయాలి. – బి.యోగేశ్వర, నాగిరెడ్డిపల్లె, చక్రాయపేట మండలం -
చౌక బియ్యం పట్టివేత
సిద్దవటం : మండల పరిధి మాధవరం–1 గ్రామ పంచాయతీ మహబూబ్నగర్ గ్రామంలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాల చౌక దుకాణం బియ్యాన్ని ఆదివారం పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారని వచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 681 కేజీల బియ్యం స్వాధీనం చేసుకుని, సిద్దవటం ఆకులవీధికి చెందిన అతికారి మురళి, కడపకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఆటోను ఢీకొన్న కారుమదనపల్లె సిటీ : నిలిచివున్న ఆటోను కారు ఢీకొనడంతో నలుగురు గాయపడిన సంఘటన కురబలకోట మండలం కంటేవారిపల్లెలో ఆదివారం జరిగింది. సత్యసాయిజిల్లా కొక్కంటికి చెందిన లక్ష్మిదేవి కుటుంబ సభ్యులతో కలిసి బోయకొండకు ఆటోలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కంటేవారిపల్లె వద్ద ఓ హోటల్ వద్ద ఆగారు. ఆటోను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న లక్ష్మిదేవి(55), హేమంత్(11), చంద్రశేఖర్ (45), కిరణ్కుమార్(30) గాయపడ్డారు. వీరిని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం ఒంటిమిట్ట (సిద్దవటం) : మండల పరిధిలోని నడింపల్లి వద్ద ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. మండల పరిధిలోని మలకాటిపల్లి గ్రామానికి చెందిన శివరామకృష్ణారెడ్డి, రేణుక, వారి కుమార్తెలు నందలూరు మండలం నల్లతుమ్మలపల్లి గ్రామంలో వివాహ వేడుకకు కారులో వెళ్తుండగా.. మంగంపేట వద్ద గుర్తు తెలియని కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. కారులో మిగిలిన ముగ్గురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యక్తి ఆత్మహత్యాయత్నం పోరుమామిళ్ల : ఏళ్లు గడుస్తున్నా తన ఇంటి సమస్య పరిష్కరించలేదని ఓ వ్యక్తి ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వివరాలిలా ఉన్నాయి. ఆరేళ్ల క్రితం అమ్మవారిశాల పురాతన మందిరం తొలగించి నూతనంగా నిర్మించే సమయంలో.. ఆనుకుని ఉన్న దర్శి సత్యనారాయణ ఇల్లు దెబ్బతింది. అప్పట్లో ఆలయ కమిటీవారు ఈ ఇంటిని మళ్లీ యథాతథంగా చేస్తామన్నారు. తరువాత వివిధ కారణాలతో ఆ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. సత్యనారాయణ ఇల్లు బాగు కోసం ఎంత ఖర్చు చేసినా ఇస్తామని కమిటీవారు చెబితే, మీరే బాగు చేయాలని ఆయన అన్నాడని, తాము చేస్తామంటే అలా కాదు, ఇలా కాదు, అంటూ ఏవేవో సాకులు చెపుతూ సత్యనారాయణ సమస్య పరిష్కారానికి అవకాశం ఇవ్వడం లేదని ఆలయ సభ్యుల మాట. తన ఇంటిని ఇంత వరకు బాగు చేయించలేదని సత్యనారాయణ వాదన. ఇలా ఇరువురి మధ్య సమస్య తెగక నలుగుతూ ఉంది. ఆదివారం అమ్మవారిశాలలో మరో పంచాయతీపై పట్టణ ఆర్యవైశ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో తన సమస్యకు పరిష్కారాం చూపాలని దర్శి సత్యనారాయణ పట్టుబట్టారు. ఆ సమస్యపై సభ్యులు మాట్లాడటం లేదని ఆవేశంతో సత్యనారాయణ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అందరి ముందు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. వెంటనే అక్కడున్నవారు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. -
టీడీపీ నేతల దందా.. వెలుగులోకి మరో కల్తీ మద్యం డంప్
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో మరో కల్తీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. ఉప్పరవాండ్ల పల్లిలో భారీ నకిలీ మద్యం డంప్ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ములకల చెరువులో కోటి 75 లక్షల విలువ చేసే కల్తీ మద్యం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం దందా అంతా టీడీపీ నేతల కనుసన్నలోనే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.కాగా, తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువుకు సమీపంలో శుక్రవారం (అక్టోబర్ 3) నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఇంత భారీ రీతిలో నకిలీ మద్యం దందా సాగించడానికి ప్రభుత్వంలోని టీడీపీ ముఖ్య నేతల అండ ఉందని తెలుస్తోంది. ప్రతి నెలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగేవని తేలింది.ఇందులో కొంత సొమ్ము ముఖ్య నేతలకు ప్రతి నెలా చేరేదని సమాచారం. ఏడాదికి పైగా విచ్చలవిడిగా, నిర్భీతిగా యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేసి.. జనంతో తాగించి వారి ప్రాణాలతో చలగాటం ఆడిన టీడీపీ నేతలు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా నోరెత్తడం లేదు.పైగా అసలు సూత్రధారులను తప్పిస్తూ.. పాత్రధారుల్లో అనామకులైన కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్యనేత, తంబళ్లపల్లి ఇన్చార్జ్ కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగాయని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఇక్కడి కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయట పడుతుందని భావించి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ విషయమై స్థానికులకు ఇదివరకే అనుమానాలు వచ్చినా, టీడీపీ నేతలకు జడిసి నోరు విప్పలేదు. -
టీడీపీ నేత మద్యం దుకాణం సీజ్
పెద్దతిప్పసముద్రం: ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై శుక్రవారం పోలీసులు జరిపిన దాడుల్లో మండలానికి చెందిన టీడీపీ కీలక నేత కట్టా సురేంద్రనాయుడు సహా మరికొందరు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర, సీఐ మల్లయ్య బృందం శనివారం అన్నమయ్య జిల్లా టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లి సమీపంలో కట్టా సురేంద్రనాయుడు ‘ఆంధ్రవైన్స్’ పేరుతో నిర్వహిస్తున్న మద్యం దుకాణంలో ఉన్న బాటిళ్లకు పంచనామా నిర్వహించి వైన్షాపు లైసెన్స్ను సీజ్ చేసి సీలు వేశారు.ఎక్సైజ్ పోలీసులు బృందంగా ఏర్పడి మఫ్టీలో కల్తీ మద్యం రవాణా, నిల్వలపై మండలంలో నిఘా వేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు పుట్టగొడుగుల్లా వెలసిన బెల్ట్షాపుల్లో దర్జాగా మద్యం విక్రయాలు చేపట్టేవారు. కల్తీ మద్యం రాకెట్ గుట్టు రట్టు కావడంతో బెల్ట్షాపులు నిర్వహిస్తున్న గ్రామస్థాయి కూటమి కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి కల్తీ మద్యంతో పట్టుబడితే ఎక్కడ కేసుల్లో ఇరుక్కుపోతామోనని భావించి బెల్ట్షాపులను మూసేసి పరిచయస్తులకు మాత్రమే చాటుగా మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం. -
‘పెద్దల’ దన్నుతోనే నకిలీ మద్యం రాకెట్
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువుకు సమీపంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కనీ వినీ ఎరుగని రీతిలో ఇంత భారీగా యంత్రాల సాయంతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యం ములకలచెరువు వద్ద తయారవుతోందని తెలిసి ఉమ్మడి చిత్తూరు, అనంతపురం వాసులు విస్తుపోయారు. ఇన్నాళ్లూ తాము తాగిన మద్యం నకిలీదేనని తెలుసుకుని స్థానికంగా ఉన్న వారు బెంబేలెత్తుతున్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు ప్రధానంగా ఇక్కడి నుంచి నకిలీ మద్యం సరఫరా అయ్యేదని శుక్రవారం నాటి ఎక్సైజ్ దాడుల్లో స్పష్టమైంది.ఇంత భారీ రీతిలో నకిలీ మద్యం దందా సాగించడానికి ప్రభుత్వంలోని టీడీపీ ముఖ్య నేతల అండ ఉందని తెలుస్తోంది. ప్రతి నెలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగేవని తేలింది. ఇందులో కొంత సొమ్ము ముఖ్య నేతలకు ప్రతి నెలా చేరేదని సమాచారం. ఏడాదికి పైగా విచ్చలవిడిగా, నిర్భీతిగా యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేసి.. జనంతో తాగించి వారి ప్రాణాలతో చలగాటం ఆడిన టీడీపీ నేతలు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా నోరెత్తడం లేదు. పైగా అసలు సూత్రధారులను తప్పిస్తూ.. పాత్రధారుల్లో అనామకులైన కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్యనేత, తంబళ్లపల్లి ఇన్చార్జ్ కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగాయని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఇక్కడి కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయట పడుతుందని భావించి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ విషయమై స్థానికులకు ఇదివరకే అనుమానాలు వచ్చినా, టీడీపీ నేతలకు జడిసి నోరు విప్పలేదు. శుక్రవారం నాటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో అందరూ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. వారి పేర్లు ఎక్కడా రాకూడదునకిలీ మద్యం రాకెట్ను నడిపిస్తున్న టీడీపీ ముఖ్య నేతల పేర్లు ఎక్కడా రాకూడదని, కేసులో వారి పేర్లు ఉండకూడదని ఉన్నతాధికారులకు అమరావతి నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. శుక్రవారం నాటి నాటకీయ పరిణామాలు, శనివారం సాయంత్రం ములకలచెరువులో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ప్రెస్మీట్లో వెల్లడించిన అంశాలు పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టం అవుతోంది. అసలు వాస్తవాల జోలికి వెళ్లకుండా, సూత్రధారులెవరో చెప్పకుండా, కేవలం పాత్రధారుల వివరాలను మాత్రమే వెల్లడించి చేతులు దులుపుకున్నారు. నకిలీ మద్యం కేసులో అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎక్సైజ్ అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తం ఆవుతున్నాయి. ముఖ్యులను తప్పించేసినట్టేములకలచెరువు నకిలీ మద్యం వెలుగులోకి రాగానే ప్రభుత్వ నిఘా, ఎక్సైజ్ వర్గాలు తమ నివేదికలను సీఎంఓకు నివేదించాయని సమాచారం. మొదట టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును అదుపులోకి తీసుకున్నాక.. అక్కడి పరిస్థితి ఉన్నత స్థాయి వ్యక్తుల దృష్టికి వెళ్లింది. మొదట దీనిపై కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సురేంద్ర నాయుడును అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. శనివారం అసలు సూత్రధారుల వివరాలను వెల్లడిస్తారని భావించగా, పైస్థాయిలో జరిగిన పరిణామాలతో తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యల పేర్లు బయటకు రాకుండా తొక్కిపెట్టినట్టు తెలిసింది.దీంతో ఇప్పటికే కేసులో నమోదు చేసిన నిందితుల పేర్లను మరోమారు వెల్లడించి సరిపెట్టుకున్నారు. నిజానికి తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పాత్ర ఉందని ఈ ప్రాంతంలో అందరికీ తెలిసినా, ఆయనను తప్పిస్తూ ఆయనæ పీఏ రాజేష్పై మాత్రమే తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. అయితే ఇతని అరెస్ట్పై కూడా అధికారులు ఆసక్తి చూపేలా కనిపించడం లేదు. పైగా రాజేష్కు చెందిన మద్యం దుకాణం వైపు శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ దుకాణాన్ని సీజ్ చేస్తామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామని శుక్రవారం చెప్పిన అధికారులు పై నుంచి ఒత్తిడి రావడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న జనార్దనరావు, కట్టా రాజులు దొరికితే కానీ వాస్తవాలు తెలియవని ఎక్సైజ్ అధికారులు తప్పించుకునే ధోరణితో ముందుకెళ్తున్నారు. విజయవాడకు చెందిన జనార్దన్రావు ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్టు సమాచారం. ఇదే నిజమైతే అయన్ను ఇక్కడికి ఎప్పుడు రప్పిస్తారు.. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. నిజాలు ఎప్పుడు వెలికితీస్తారనే దానికి సంబంధించి అధికారుల నుంచి స్పందనే లేదు. ఈ నకిలీ మద్యం ఏడాది క్రితం నుంచి నడుస్తుండగా.. గత నెలలోనే పెట్టారంటూ అధికారులు తేల్చేయడం గమనార్హం.ఈ ప్రశ్నలకు బదులేదీ?⇒ ఈ కేంద్రానికి పెట్టుబడి పెట్టింది ఎవరు? ⇒ నగదు లావాదేవీల మాటేంటి? ఏయే అకౌంట్ల ద్వారా లావాదేవీలు నడిచాయి?⇒ ఒక్క రోజే రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం దొరికిందంటే ఇన్నాళ్లూ సరఫరా చేసిన మద్యం విలువ ఎంత?⇒ ఏయే ఊళ్లలోని ఏయే దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా చేశారు?⇒ ప్రముఖ బ్రాండ్లకు సంబంధించి నకిలీ మద్యం ఆర్డర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి?⇒ నకిలీ మద్యం తయారీకి సంబంధించి ముడి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చారు?⇒ లేబుళ్లు, సీసాలు, మూతలు, స్పిరిట్, ఫ్లేవర్లు, భారీ యంత్రాలతో కూడిన ప్లాంట్ను నడపడం కేసులో చూపుతున్న నిందితులకు సాధ్యమా?⇒ చిన్న చిన్న బడ్డీ కొట్లను సైతం వదలకుండా మామూళ్లు దండుకునే ప్రజా ప్రతినిధులకు ఇంత భారీ ప్లాంట్ గురించి తెలియదంటే ఎవరు నమ్ముతారు?⇒ ఈ కేంద్రాన్ని విజయవాడకు చెందిన జనార్దనరావు అనే వ్యక్తి చూస్తుంటాడని.. అంతా అతనిపైకి నెట్టేయడం ఎంత వరకు సమంజసం?⇒ అధికార పార్టీ నేతల అండ దండలు లేకుండా స్థానికేతరుడు ఇంత భారీ నకిలీ మద్యం ప్లాంట్ను నడపగలడా?⇒ రోజుకు 20వేలకు పైగా 180 ఎంఎల్ బాటిళ్ల మద్యం తయారు చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు ఎంత సరుకు విక్రయించారు?⇒ ఒడిశా, తమిళనాడు నుంచి వచ్చిన తొమ్మిది మంది కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం సబబా? ⇒ పెద్దలంతా తప్పించుకుని ఒక్క కట్టా సురేంద్ర నాయుడిని మాత్రమే బలి పశువును చేస్తున్నారని నిలదీస్తున్న ఓ సామాజిక వర్గీయుల ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?నకిలీ మద్యం ప్లాంట్ కేసులో పది మంది అరెస్ట్ములకలచెరువు: అన్నమయ్య జిల్లా ములకలచెరువు పాత హైవే సమీపంలో బట్టబయలైన నకిలీ మద్యం తయారీ కేంద్రం కేసులో 14 మందిపై కేసు నమోదు చేసి, 10 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో జనార్దనరావు, కట్టా రాజు, పి.రాజేష్, కొడాలి శ్రీనివాసరావు, నాగరాజు, హాజీ, బాలరాజు, మణిమారన్, ఆనందన్, సూర్య, వెంకటేషన్ సురేష్, మిథున్, అనంతదాస్, కట్టా సురేంద్ర నాయుడుపై కేసు నమోదు చేశారు.వీరిలో జనార్దనరావు, పి.రాజేష్, కట్టా రాజు, కొడాలి శ్రీనివాసులు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. మిగతా వారిని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి ఎస్ఎస్ ట్యాంకు, డిస్టలరీ వాటర్ ట్యాంకు, బాటిళ్లకు మూతలు బిగించే 3 యంత్రాలు, మూడు వాహనాలు, ఎలక్ట్రికల్ మోటార్, 1,050 లీటర్ల స్పిరిట్, బాటిలింగ్కు సిద్ధంగా ఉన్న 1,470 లీటర్ల మద్యం, 20,208 బాటిళ్ల మద్యం, 12 వేల ఖాళీ బాటిళ్లు, వేలాది మూతలు, 70 క్యాన్లు, రాయల్ లాన్సర్ లేబుళ్లు 10,800, ఓల్డ్ అడ్మిరల్ లేబుళ్లు 1200, 4 వేల రోల్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.1.75 కోట్లని చెప్పారు. -
ప్రజారవాణాలో ఆటోడ్రైవర్ల పాత్ర కీలకం
మదనపల్లె రూరల్: ప్రజారవాణా వ్యవస్థలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. శనివారం రవాణాశాఖ ఆధ్వర్యంలో మదనపల్లెలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, ఎమ్మెల్యే షాజహాన్బాషా, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు పట్టణాల్లో సేవలందించడమే కాకుండా గ్రామాలు, పట్టణాలను కలిపే కీలక పాత్రను పోషిస్తున్నారన్నారు. విద్యార్థిదశలో తనకు ఆటో డ్రైవర్లతో ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని మరచిపోలేనన్నారు. సివిల్ సర్వీసెస్కు ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు తన ఆందోళనను గుర్తించిన ఆటోడ్రైవర్, ఇచ్చిన మానసిక ధైర్యం నేటికీ మరచిపోలేనన్నారు. ఆటోడ్రైవర్లు ప్రభుత్వం అందిస్తున్న 15వేల ఆర్థికసహాయాన్ని కుటుంబ అభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. ఆటోడ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి అన్నమయ్యజిల్లా వ్యాప్తంగా మొత్తం 8,835 మంది ఆటో డ్రైవర్లకు రూ.13.25 కోట్ల రూపాయల నగదు జమచేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్బాషా సబ్కలెక్టర్ చల్లా కల్యాణి, ఆర్టీఓ అశోక్ప్రతాప్, ఎంవీఐ దినేష్చంద్ర, మున్సిపల్ కమిషనర్ కే.ప్రమీల, ఏఎంవీఐలు శివలింగయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంత్కుమార్ -
పల్లె వైద్యంపై సమ్మెట
రాయచోటి: ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి వైద్యులు చేపట్టిన ఆందోళన శనివారం నాటికి తొమ్మిదో రోజుకు చేరింది. ఆసుపత్రుల్లో ఉండాల్సిన వైద్యులు విజయవాడలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. దశలవారీగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గతనెల 26వ తేదీ నుంచి వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో గ్రామీణుల ఆరోగ్యం ఆగమ్యగోచరంగా మారింది. అరకొర ప్రత్యామ్నాయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సమ్మె తలపెట్టడంతో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు తగినంత ఫలితాలు ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంటల్, స్కిన్, ఆర్తో, కంటి వైద్య నిపుణులను అక్కడక్కడ ఏర్పాటు చేసినా ఫలితాలు కనిపించలేదు. దీంతో ఆసుపత్రికి వచ్చిన వారు నర్సులు, సిబ్బంది అందిస్తున్న వైద్యంతో సరిపెట్టుకోవాల్చి వచ్చింది. జిల్లాలో 30 మండలాల్లో మొత్తం 51 పీహెచ్సీలు ఉన్నాయి. బంద్ కారణంగా వీటిల్లో వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో స్థానికులు వైద్యం కోసం పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. మరికొందరు సమీపంలోని ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యం పడకేయడంతో పల్లె వాసులు అవస్థలు పడుతున్నారు. సమ్మెను విఫలం చేసేందుకు యత్నాలు ఇన్ సర్వీసు పీజీ కోటాను పునరుద్ధరించాలి, టైమ్ బౌండ్ పదోన్నతలు అమలు చేయాలి, పీహెచ్సీ వైద్యులకు కచ్చితమైన పని గంటలను నిర్దేశించాలంటూ వైద్యులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమ్మెను విఫలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి తదితర ప్రభుత్వ విభాగాల నుంచి కొంతమంది వైద్యులను పీహెచ్సీలకు పంపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ కూటమి పాలకులు ఏమాత్రం స్పందించకపోవడం పట్ల గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గ్రామీణులకు లభించని వైద్య సేవలు తొమ్మిదోరోజుకు చేరినపీహెచ్సీ వైద్యుల ఆందోళన చోద్యం చూస్తున్న కూటమి పాలకులు అందరి మద్దతు కోరుతాం.. సమ్మెకు ఇతర ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న వైద్యుల మద్దతును కూడా కోరుతాం. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. –రమేష్ బాబు, ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
జిల్లాలో వర్షం
రాయచోటి: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో శనివారం వర్షం కురిసింది. పీలేరులో 84.2 మిల్లీమీటర్లు,సుండుపల్లిలో 28 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.జిల్లాలోని రామసముద్రం, నిమ్మనపల్లి, మదనపల్లె, వాల్మీకిపురం, కలికిరి, కలకడ, కేవీపల్లి, గుర్రంకొండ, రాయచోటి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తెగిన చెరువు కట్ట..దెబ్బతిన్న పంట పొలాలు పీలేరు రూరల్: పీలేరు – మదనపల్లె మార్గంలో నాలుగులేన్ల రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం కోసం కొత్తచెరువును తవ్వి వదిలేశారు. శనివారం కురిసిన భారీ వర్షానికి నీరు ఎక్కువుగా చెరువులోకి చేరుకోవడంతో కట్టతెగిపోయింది. దీంతో దిగువన ఉన్న పంటపొలాలు దెబ్బతిన్నాయి. వరి, టమాట, ఆకు కూరలు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. భూములు కోతకు గురయ్యాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ శివకుమార్, ఇరగేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కట్ట పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పీలేరు, సదుం మండలాల్లోని ఎగువ ప్రాంతాల్లో వర్షం విస్తారంగా కురిసింది.దీంతో పింఛా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నూనెవాండ్లపల్లె మార్గాన్ని తహసీల్దార్ శివకుమార్, సీఐ యుగంధర్ పరిశీలించి రాకపోకలు నిలుపుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీలేరు: పీలేరులో శనివారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లపై నీరు నిలిచింది.బస్టాండ్ జలయమమైంది. బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆర్టీసీ బస్టాండ్కు డ్రైనేజ్ సమస్య ఉన్నందున, వర్షం పడిన ప్రతిసారీ ఇలాగే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది బస్టాండ్కు చేరుకుని వర్షపు నీటిని దారిమళ్లించారు. పీలేరులో 84.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు -
ఈ–క్రాప్ నమోదు గడువు పెంపు
రాయచోటి: ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ–క్రాప్ నమోదు గడువును ఈనెల 25వ తేదీ వరకు పెంచారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జి శివనారాయణ శనివారం తెలిపారు. సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పు చేర్పులకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. తుది జాబితాను ఈనెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సారి ఈకేవైసీని నోటిఫైడ్ పంటలకు మాత్రమే పరిమితం చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి పేర్కొన్నారు. సిద్దవటం: కార్తీక మాసంలో భక్తులు నిత్యపూజయ్య స్వామికి సమర్పించే తలనీలాల పోగు హక్కు కోసం శనివారం నిర్వహించిన వేలంపాటలో రూ.3.30 లక్షలకు హెచ్చుపాటదారుడు దక్కించుకున్నాడు. దేవదాయశాఖ ఈఓ శ్రీధర్, రాజంపేట ఇన్స్పెక్టర్ జనార్ధన్ ఆధ్వర్యంలో జరిగిన వేలంపాటలో 16 మంది పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు, ప్రొద్దుటూరు, చాపాడు, జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాలకు చెందిన ఐదుగురు లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. ఇందులో చాపాడు మండలం పల్లవోలు గ్రామానికి చెందిన జి.రామక్రిష్ణ రూ.3.30 లక్షలకు తలనీలాల పోగు హక్కును దక్కించుకున్నాడు. అనంతరం మిగిలిన డబ్బులు చెల్లించి అధికారుల నుంచి రసీదును పొందారు. ఒంటిమిట్ట (సిద్దవటం): ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం స్నపన తిరుమజనం వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలోని మూలవిరాట్కు అర్చకులు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ వారు సమర్పించిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. రాయచోటి టౌన్: రాయచోటి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శనివారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జులై 1వ తేది నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.22,99,430 వచ్చినట్లు ఈవో డీవీ రమణా రెడ్డి తెలిపారు. అలాగే 43.063 గ్రాముల బంగారం, 1.870 కిలలో వెండి వచ్చిందని చెప్పారు. ఈ మొత్తం ఎస్బీఐ, ఏపీజీబీ బ్యాంకులో జమ చేశామని వివరించారు. జిల్లా దేవాదాయశాఖ అధికారి విశ్వనాథ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన అర్చకులు,భక్తులు పాల్గొన్నారు. కలికిరి(వాల్మీకిపురం): వాల్మీకిపురం పట్టణానికి క్రికెట్ క్రీడాకారుడు దీపన్ సాయినాథ్ ఆంధ్రా రంజీ ప్రాబబుల్స్కు ఎంపికై నట్లు వాల్మీకిపురం సీడీసీఎ హెడ్కోచ్ సునీల్ కుమార్ తెలిపారు.శనివారం ఆయన మా ట్లాడుతూ దీపన్ సాయినాథ్ లెఫ్ట్హ్యాండ్ స్పిన్ బౌలర్గా చిత్తూరు జిల్లా జ ట్టుకు, అనంతరం సౌత్జోన్ నుంచి ఉత్తమ ప్ర తిభ కనపరచి ఆంధ్ర రంజీ క్యాంపునకు ఎంపికై న ట్లు చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలో న్యూజిలాండ్ నుంచి వ చ్చిన, రాష్ట్ర కోచ్ల పర్యవేక్షణలో క్యాంపు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అ సోషియేషన్ సంయుక్త కార్యదర్శి విజయ్కుమా ర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోషియేషన్ కార్యదర్శి సతీష్ యాదవ్, ఉపాధ్యక్షుడు శ్రీధర్కుమార్ సాయినాథ్కు అభినందనలు తెలిపారు. -
మైండ్ గేమ్!
సాక్షి ప్రతినిధి, కడప: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించడంలో టీడీపీ నేతలకు మరెవ్వరూ సాటిరారు. తాజాగా కడప కార్పొరేషన్లోనూ ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. రాజకీయ అలజడితో లబ్ధి పొందాలనే కొత్త కుట్రలకు తెరతీశారు. తమ్ముళ్ల ఎత్తుగడలకు ఎల్లో మీడియా వంతపాడుతోంది. కడప మేయర్కు సంబంధించి ఉన్నత న్యాయస్థానంలో వ్యవహారం నడుస్తోంది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎమ్మెల్యేకు హైకోర్టు ఉత్తర్వులున్నాయి. ఇప్పటికిప్పుడే కోర్టులో వ్యవహారం తేలిపోయే అవకాశం లేదు. అయినప్పటికీ మేయర్ ఎన్నిక, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మధ్య బహుముఖ పోటీ అంటూ తెలుగుతమ్ముళ్లు మైండ్గేమ్ ఆడుతున్నారు. ● కడప మేయర్ సురేష్బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. డిప్యూటీ మేయర్ ముంతాజ్బేగంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం అనర్హత చర్యలపై మాజీ మేయర్ సురేష్బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈనెల 7కు వాయిదా వేస్తూ, ఆ రోజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఫిర్యాదుదారు కడప ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలైన తర్వాత ఇరుపక్షాల వాదనల అనంతరం ఫైనల్ తీర్పు వెలువడనుంది. ఈతతంగం ముగిసేంత వర కూ మేయర్ ఎన్నిక ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. ఇదిలాఉంటే... వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మధ్య అలజడి లేపేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. కడప మేయర్ సీటు కోసం వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మధ్య బహు ముఖ పోటీ అంటూ పచ్చ నేతలు తానా అంటుంటే.. ఆ రెండు పత్రికలు తందాన అంటూ వంత పాడుతున్నాయి. ● ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’అన్నట్లుగా టీడీపీ నేత లు, ఎల్లోమీడియా వైఖరి ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పేర్లు వారే ప్రకటించడం, వారే ప్రచారం చేయడం ఒకదాని వెంట ఒకటి తెరపైకి వస్తున్నాయి. మేయర్ ఎన్నిక, పోటీలో పలువురు కార్పొరేటర్లంటూ కొత్త పల్లవి -
కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం
రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతోందని, ములకల చెరువులో అక్రమ మద్యం, మిషనరీలు పట్టివేతే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీఎమ్మెల్యే కొరముట్లశ్రీనివాసులు విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దశల వారీగా మద్యనిషేధం చేయడానికి బెల్ట్షాపులన్నీ రద్దు చేసి పరిమితంగా షాపులు నిర్వహిస్తే చంద్రబాబు వచ్చాక మద్యమే ప్రభుత్వానికి, వారి నాయకులకు ఆదాయ వనరులుగా చేశారని విమర్శించారు. ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తూ... చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ ఇన్చార్జికి సంబంధించిన వ్యక్తి నకిలీ మద్యం తయారు చేయడానికి చిన్నపాటి పరిశ్రమనే పెట్టుకొన్నారంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో దాని వెనకాల ఎవరు ఉన్నారో విచారించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంత జరుగుతున్నా వ్యవస్థలు, యంత్రాంగం ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చెప్పే మాటలు దేశాలు, ఖండాలు దాటిపోతుంటాయి. కానీ అభివృద్ధి మాత్రం గుండుసున్నా అని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఎరువులు విత్తనాలు అందుబాటులో లేవు. అయితే కల్తీ మద్యం యథేచ్ఛగా దొరుకుతోందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రత్నమ్మ, పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు వెలగచర్ల శివప్రసాద్రెడ్డి, సీహెచ్రమేష్, మందలనాగేంద్ర, శంకరయ్య, రాజ, మహేష్, నందాబాల, సిధ్దు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
ఆటంకాలు తొలగేలా.. ఆటలో మెరిసేలా..!
రాజంపేట : కడప–రేణిగుంట ప్రస్తుత హైవేలో నుంచి కిలోమీటర్ దూరం ఈదరపల్లె ఎస్టీకాలనీకి సమీపంలో నందలూరు సౌమ్యనాథాలయ రథం దారిలో ఐదు ఎకరాలను మహమ్మద్షేక్ పదేళ్లకు లీజుకు తీసుకున్నారు. దానిని క్రికెట్ స్టేడియంగా రూపొందిస్తున్నారు. క్రికెట్ శిక్షణ టోర్నమెంట్కు అవసరమైన రీతిలో ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడాలేని నెట్, గ్రౌండ్ ఉండే విధంగా క్రికెట్ మైదానాన్ని తీర్చిదిద్దుతున్నారు. తన స్థాయి ఎంత కష్టమైనా సరే..అన్నట్లుగా దాదాపు రూ.25 లక్షల వ్యయంతో తొలుత మైదానం చదును, మైదానంలో క్రికెట్ ఆటగాళ్లకు అనువైన రీతిలో గడ్డిని పెంచారు. బౌండరీలను ఏర్పాటు చేయడం, గ్యాలరీ తదితర క్రికెటర్లకు సదుపాయాలను కల్పించేందుకు అన్ని విధాలుగా తన ఇద్దరు కొడుకులు ఆదిల్, ఆసిఫ్లు, సమీప బంధువు క్రికెటర్ జాఫర్(స్టేట్ప్లేయర్)తో కలిసి రూపకల్పన చేస్తున్నారు. క్రికెట్లో రాణించేందుకు... క్రికెట్లో రాణించేందుకు క్రికెట్ మైదానంలో సకల సదపాయాలను కల్పించనున్నారు. హైస్టాండర్ట్ క్రికెట్ గ్రౌండ్, వన్ అండ్ వన్ కోచింగ్, సీనియర్ క్రికెటర్లతో శిక్షణ, రెగ్యులర్గా ఓపెన్ నెట్ సెషన్స్లు ఉంటాయి. తరచుగా ప్రాక్టీస్ మ్యాచ్ల ఏర్పాటు. టోర్నమెంట్ల నిర్వహణతోపాటు ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా క్రికెటర్ ఫ్యామిలీ ముందుకెళుతోంది. వసతి పరంగా ఓపెన్ డార్మెంటరీ క్రీడాకారులకు ఇంటి భోజనం తరహాలో అందించడం, కామన్ టీవీ ఏరియా, నిరంతరం మంచినీటి సదుపాయం దశలవారీగా క్రికెట్ మైదానంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో మ్యాచ్లకు క్రికెట్ క్రీడా మైదానం.. ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడాలేని విధంగా నెట్తోపాటు క్రీడామైదానం కలిగివుండటం వలన క్రికెట్ అసోసియేషన్లు నిర్వహించే మ్యాచ్ల నిర్వహణకు దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రీతిలో మైదానాలు లేక అనేక మందిలో దాగివున్న క్రికెట్ నైపుణ్యాలు వెలికితీసేందుకు అవసరమయ్యే శిక్షణ, మైదానాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇప్పుడు నందలూరులో ఏర్పాటు కాబోతున్న క్రికెట్ మైదానం ఎందరో క్రికెటర్లను ఈ దేశానికి, రాష్ట్రానికి అందజేస్తుందనే ఆశాభావం క్రీడాభిమానుల్లో వ్యక్తమవుతోంది. తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మైదానం.. విజయవాడ తర్వాత క్రికెట్ర్స్ ఫ్యామిలీ నందలూరు క్రికెట్ క్రీడా మైదానంలో అంతర్జాతీయ స్థాయిలో స్టేడియం, పిచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ప్రప్రథమనే చెప్పవచ్చు. అంతర్జాతీయ క్రికెటర్స్ ఆడే మ్యాచ్లో వినియోగించే పిచ్ టర్ఫ్ వికెట్ విజిబిలిటీ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం విశేషంగా క్రికెట్ క్రీడాభిమానులు చెప్పుకుంటున్నారు. క్రికెట్ మైదానం ఎక్కడంటే.. కడప–రేణిగుంట జాతీయరహదారి మండల క్లాంపెక్స్ నుంచి కిలోమీటర్లో ఈదరపల్లె రహదారిలో క్రికెట్ క్రీడామైదానాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రశాంత వాతావరణంలో, చుట్టూ పంటపొలాలు, తోటలు ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడామైదానం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ క్రీడాకారుల దృష్టి దీనిపై పడింది. నందలూరు రైల్వేకేంద్రం నుంచి బస్టాండుకు చేరుకొని అక్కడి నుంచి మండల క్లాంపెక్స్కు మార్గంలో వెళ్లాలి. ఈదరపల్లె ఎస్టీ కాలనీ దాటిన తర్వాత నందలూరు సౌమ్యనాథస్వామి రథం దారిలో దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నందలూరులో సొంత నిధులతో ఐదు ఎకరాల్లో క్రికెట్ మైదానం విజయవాడ తర్వాత క్రికెట్లో రాణింపునకు టర్ఫ్ వికెట్ పిచ్ అందుబాటులోకి అంతర్జాతీయ స్థాయి స్టేడియం ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహమ్మద్ షేక్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. నందలూరు బస్టాండులో టీ దుకాణం కొన్ని దశాబ్దాల నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నారు. తన బిడ్డలు షేక్ ఆదిల్ హుసేన్, ఆసిఫ్లు క్రికెట్లో రాష్ట్ర స్ధాయి వరకు వెళ్లారు. ఎలాగైనా జాతీయ స్థాయిలో భారత జట్టుకు ఆడాలనే బిడ్డల తపన, కృషి చూసిన తండ్రి తన బిడ్డలాగానే, తమ ప్రాంతం నుంచి క్రికెటర్లు మరికొందరు రాణించాలనే ఆలోచనతో క్రికెట్ ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేశారు. -
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
మదనపల్లె రూరల్ : కారు ఢీకొని ఇద్దరికి గాయాలైన సంఘటన శనివారం జరిగింది. తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డికి చెందిన శశిధర్రెడ్డి(23), కిరణ్కుమార్రెడ్డి(25) ఇద్దరూ మదనపల్లె నుంచి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో బి.కొత్తకోట మండలం శీతోళ్లపల్లె స్టాప్ వద్ద కారు ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పీలేరులో చోరీ పీలేరు రూరల్ : పీలేరు పట్టణం తిరుపతి రోడ్డు మార్గంలోని జర్నలిస్టు కాలనీలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక జర్నలిస్టు కాలనీలో ఉంటున్న యు. రాజేష్ విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని విషయం తెలుసుకున్న దుండగులు తలుపు పగుల గొట్టి ఇంటిలోకి చొరబడ్డారు. ఇంటిలో వెండి వస్తువులు, నాలుగు పట్టుచీరలు, రూ. 20వేలు నగదు, జత కమ్మలు, జత గాజులు కలిపి సుమారు 25 గ్రాముల బంగారు నగలతో ఉడాయించారు. శనివారం ఉదయం ఇంటిలో జరిగిన సంఘటన గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ యుగంధర్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వేలిముద్ర నిపుణులు ఆధారాలు సేకరించారు. రాయచోటి జగదాంబసెంటర్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13 బీసీ స్టడీ సర్కిళ్లలో పని చేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు కోరారు. శనివారం రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ స్టడీ సర్కిళ్లను నమ్ముకొని పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ దినసరి కూలీలు, పేద మధ్య తరగతి ఉద్యోగులందరికీ అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలన్నారు. 2022 పీఆర్సీ ప్రకారం జీతభత్యాలను పెంచాలని, పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచాలని కోరారు. శిక్షణ పొందే అభ్యర్థులకు రూ.1500 నుండి రూ.4500లకు శిక్షణ భృతి పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణం బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణోత్సవం శనివారం వైభవంగా జరిగింది. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలోని కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేసి, విశేష పూజలు చేపట్టారు. అనంతరం వేదపండితులు మంత్రోచ్చారణతో కల్యాణ క్రతువు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కనులారా దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి, సిద్ధాంతి ఇడమకంటి జనార్దన శివాచార్య, పూర్వపు మఠాధిపతి కుటుంబ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
భూ ఆక్రమణకు కూటమి నేతల కుట్ర
● తమ భూమికి అన్ని ఆధారాలు ఉన్నా అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని రైతు ఆవేదన ● హోం మంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం ● కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా మామిడి చెట్లు నరికి కంచె తొలగించారని ఆరోపణ సాక్షి టాస్క్ఫోర్స్ : తనకు వారసత్వంగా వచ్చిన రిజిస్టర్డ్భూమిని తాను గత 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నానని, అయితే కూటమి నాయకులు దౌర్జన్యంగా తన పొలంలో ఉన్న 25 మామిడి చెట్లను నరికి వేసి, తన పొలం చుట్టూ వేసుకున్న ఇనుప కంచెను తొలగించారని రైతు చెన్న కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కుర్నూతల గ్రామం, మూలపల్లెకు చెందిన ఎ.చెన్నారెడ్డికి అదే గ్రామ పొలంలో సర్వే నంబరు 792/2 లో 0.63 సెంట్లు, 797/3లో 1.71 ఎకరాలు పొలం ఉంది. తన పొలం పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన వేల్పుచర్ల ఓబుల్ రెడ్డి, సహదేవరెడ్డి, వాసుదేవరెడ్డి, మాజీ సైనికుడు రమణారెడ్డి తదితర కూటమి నేతలు తమపై దాడిచేసి తన పొలంలోని కొంత భాగాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతు పేర్కొన్నారు. ఈ విషయమై 2023లోనే అప్పటి తహసీల్దార్, సీఐ, ఎస్ఐకి ఫిర్యాదు చేశామన్నారు. వారి ఆదేశాల మేరకు సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారుల సూచన మేరకు తహసీల్దార్, సర్వేయర్, సీఐ, ఎస్ఐల సమక్షంలోనే తమ పొలం చుట్టూ ఇనుప స్థంభాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తమ పొలంతో పక్క పొలం వారికి ఎలాంటి సంబంధం లేదని లక్కిరెడ్డిపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని రైతు చెన్నారెడ్డి తెలిపారు. తమ పొలానికి అన్ని రికార్డులు సవ్యంగా ఉండటంతోపాటు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా కూటమి నేతలు తమకు తెలియకుండా తమ పొలంలో నాటిన ఇనుప కంచెను తొలగించి, స్తంభాలను ఎత్తుకెళ్లడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంపై ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనిత, ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు తమ భూమికి సంబంధించిన రికార్డులను లక్కిరెడ్డిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించామని, కూటమి నాయకులు వారి రికార్డులను తీసుకురాకుండానే తమ పొలంలో ఉన్న 25 మామిడి చెట్లను దౌర్జన్యంగా నరికేయడంఓ రూ.3 లక్షల పైబడి తమకు నష్టం వాటిల్లిందని వాపోయారు. రెవెన్యూ, పోలీసు అధికారులు తనకు న్యాయం చేయడంతో పాటు కూటమి నాయకుల నుంచి రక్షణ కల్పించాలని రైతు కోరుతున్నాడు. -
మీ సహకారం మరువలేను
రాయచోటి : అన్నమయ్య జిల్లా ఎస్పీగా 14 నెలల పాటు సేవలందించి బదిలీపై కృష్ణా జిల్లా ఎస్పీగా వెళ్లిన వి.విద్యాసాగర్నాయుడుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ దంపతులను జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో శనివారం అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. స్థానిక ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్పీ సేవలను కొనియాడారు. ఎస్పీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో తాము పార్వతీపురం మన్నెం జిల్లాలో కలిసి పనిచేశామన్నారు. ఆయనకున్న నిబద్ధత, నిజాయితీని ప్రశంసించారు. నూతన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ ఎస్పీ విద్యాసాగర్నాయుడు సేవలు జిల్లాకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. బదిలీ ఎస్పీ విద్యాసాగర్నాయుడు మాట్లాడుతూ గత 14 నెలలలో నేరాల నియంత్రణ, పిల్లలపై నేరాలను అరికట్టడం, మహిళల కోసం అవగాహనా కార్యక్రమాలు చేపట్టాం.. ప్రజలకు మంచి సేవలు అందించానన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీలు, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి, మదనపల్లి డీఎస్పీలు కృష్ణమోహన్, మహేంద్ర, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, హోంగార్డులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
5జీ మొబైల్స్ ఇచ్చే వరకు విధుల బహిష్కరణ
ఒంటిమిట్ట (సిద్దవటం) : 5జీ మొబైల్స్ ఇచ్చే వరకు ఆన్లైన్ పనులు బహిష్కరిస్తున్నామని ఒంటిమిట్ట వెలుగు వీఓఏలు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని సీ్త్రశక్తి భవన్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట వీఓఏలు ఏపీఎం అశోక్రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5జీ మొబైల్స్ ఇవ్వకుండా కింది స్థాయిలో ఆన్లైన్ పనులు చేయలేదని వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ప్రతి పనికి లక్ష్యాన్ని పెట్టి ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి జమ్మలమడుగు రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో పెద్ద చౌరెడ్డి (55) అనే వ్యక్తి మృతి చెందాడు. పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండల పరిధిలోని అంజనపురం గ్రామానికి చెందిన పెద్ద చౌరెడ్డి సొంత పనుల నిమిత్తం శుక్రవారం రాత్రి పట్టణానికి వస్తుండగా మార్గమధ్యంలోని పెన్నానది బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం చాపాడు : మండల పరిధిలోని విశ్వనాథపురం గ్రామ సమీపంలో ఏటూరు కాలువ వద్ద శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపిన వివరాల మేరకు... 50 ఏళ్లు పైబడిన గుర్తు తెలియని మగ వ్యక్తి శవాన్ని గుర్తించామన్నారు. మృతదేహం బాగా కుళ్లిపోవడంతో ముఖం కూడా కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడి దుర్మరణం ముద్దనూరు : స్థానిక రైల్వేస్టేషన్ పరిధిలో శనివారం ఉదయం రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు(35) దుర్మరణం చెందాడు. ఎర్రగుంట్ల రైల్వే పోలీసు ఎస్హెచ్ఓ నాగాంజనేయులు సమాచారం మేరకు మృతుని వద్ద జమ్మలమడుగు నుంచి ముద్దనూరుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు బస్సు టికెట్ ఉంది. మృతుని శరీరంపై వున్న టీ–షర్టు ముందు భాగంలో నారాయణ మెడికల్ కాలేజి 2020 అని ముద్రించి ఉంది. మృతుని వివరాలు తెలిసిన వారు ఎర్రగుంట్ల రైల్వే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు. మదనపల్లె రూరల్ : ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి ఏఆర్ కానిస్టేబుల్ గాయపడిన ఘటన శనివారం పట్టణంలో జరిగింది. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల పంచాయతీ బోయపల్లెకు చెందిన అమరనాథ్(30), రాయచోటిలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. గ్రామానికి వెళ్లే క్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు వేగంగా వెళ్లాడు. వర్షం కారణంగా బైక్ అదుపుతప్పడంతో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
ఆవు ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు
మదనపల్లె రూరల్ : రోడ్డుపై వెళుతున్న ఆవులు, ఉన్నట్లుండి గెంతుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు గాయపడగా, అందరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కురబలకోట మండలం తెట్టు పంచాయతీ ఆరోగ్యపురానికి చెందిన కాంతమ్మ(57), సుమంత్ (35) మదనపల్లెలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. ఊరు దగ్గరే, రోడ్డుపై వెళుతున్న ఆవు గెంతుకుంటూ వచ్చి ఒక్కసారిగా బైక్పై పడటంతో ఇద్దరూ కిందపడి గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించాక, కాంతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. చింతలకుంటలో అగ్నిప్రమాదం నందలూరు : మండలంలోని చింతలకుంట గ్రామం హరిజనవాడలో బల్లి ఓబులేసు అనే వ్యక్తి ఇంట్లో శనివారం అగ్నిప్రమాదం జరగడంతో దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బాధితుల కథనం మేరకు ఉదయం 10 గంటల సమయంలో ఇంటిలోని ఫ్రిజ్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాప్తి చెందాయి. ఈ సంఘటనలో రూ.2.50 లక్షల బంగారు, ఇంటిలోని పలు రకాల వస్తువులు, దుస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.10 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న రాజంపేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు పెద్దతిప్పసముద్రం : మండలంలోని టి.సదుం పంచాయతీ రేకులగుంటిపల్లికి చెందిన కొత్తోళ్ల చిన్న వెంకట్రమణ (49) కనిపించడం లేదని అతని కు మారుడు మంజునాథ్ శనివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు. తన తండ్రి గత నెల 30న తిరుపతికి వెళుతున్నానని ఇంటి నుంచి వెళ్లాడని, ఐదు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఫిర్యాదు చేశారన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
నియామకం
సాక్షి రాయచోటి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురు నాయకులను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ), స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) మెంబర్స్గా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లు: దేశాయి తిప్పారెడ్డి (మదనపల్లె), సుగవాసి బాలసుబ్రమణ్యం (రాయచోటి), డాక్టర్ కె. ఇక్బాల్ అహ్మద్ఖాన్ (పీలేరు) స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ)మెంబర్లు: గాలివీటి విజయభాస్కర్రెడ్డి (రాజంపేట), నల్లారి తిమ్మారెడ్డి (పీలేరు), పూల శ్రీనివాసరెడ్డి (రాజంపేట), షమీమ్ అస్లం (మదనపల్లె), యోగేశ్వరరెడ్డి (రాజంపేట) సుగవాసి బాలసుబ్రమణ్యం డాక్టర్ కె.ఇక్బాల్ అహ్మద్ఖాన్ దేశాయి తిప్పారెడ్డి పి.శ్రీనివాసులురెడ్డి షమీమ్ అస్లం నల్లారి తిమ్మారెడ్డి గాలివీటి విజయభాస్కర్రెడ్డి యోగేశ్వరరెడ్డి -
పల్లెపల్లెకు ఈ మద్యమే
మదనపల్లె: మద్యం అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలపై కక్షకట్టి వేధిస్తున్న కూటమి ప్రభుత్వం తన పాలనలో ఏకంగా నకిలీ మద్యం తయారీ కార్మాగారమే వెలసింది. రూ.కోట్లు ఆర్జించాలన్న లక్ష్యంతో అన్నమయ్య జిల్లా మండల కేంద్రం ములకలచెరువుకు కూతవేటు దూరంలో నకిలీమద్యం తయారీ కార్మాగారం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతోంది. స్పిరిట్తో తయారు చేసిన ప్రాణాంతక నకిలీమద్యం వ్యవహారంలో అధికార పార్టీనేతల ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మారుమూల తంబళ్లపల్లె నియోజకవర్గానికి పరిశ్రమలు తెస్తామని టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు కాలేదు కాని నకిలీమద్యం ఫ్యాక్టరీ వచ్చిందంటూ సోషల్మీడియాలో ప్రచారం సాగుతోంది. స్పిరిట్తో తయారైన నకిలీమద్యం తాగితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టే. చవక మద్యం తాగే వారిని లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్న నకిలీమద్యం వ్యవహారంపై కూటమిప్రభుత్వం తెరవెనుక ఎవరున్నారో తేల్చుతుందా లేక కాపాడుతుందా అనేది చూడాలని ప్రజలు అంటున్నారు. దాడితో నకిలీమద్యం మాయం ములకలచెరువులో నకిలీమద్యం తయారీ కార్మాగారంపై ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారన్న సమాచారంతో అక్కడినుంచి సరఫరా అయిన మద్యం బాటిళ్లను ఎక్కడికక్కడ దాచేశారు. బెల్టుషాపుల్లో విక్రయిస్తున్న మద్యం బాటిళ్లతోపాటే విక్రయాలను కూడా నిలిపివేశారు. దాడులు తమవరకు జరుగుతాయన్న ఆందోళనతో బెల్టు నిర్వాహకులు నకిలీ మద్యం బ్రాండ్ల బాటిళ్లు దాచేసి మొబైల్ఫోన్ల స్విచ్చాఫ్ చేసేశారు. కాగా ఈ మద్యం తయారీపై సోషల్ మీడియాలో స్థానిక ముఖ్య టీడీపీ నేతలకు ప్రమేయం ఉందంటూ ఆరోపణలతో హోరెత్తిస్తున్నారు. నిఘాకు చిక్కలేదా ఏదైనా చిన్న ఘటన జరిగినా ఆమూలాగ్రం శోధనచేసి సమగ్ర వివరాలను సేకరించడంలో పోలీసు నిఘా విభాగం కీలకంగా పని చేస్తుంది. అలాంటి నిఘా విభాగం నకిలీమద్యం తయారీ కార్మాగారమే నడుస్తుంటే తెలియకలేదా అన్నది అశ్చర్యమే. ఏదిఏమైనా నకిలీమద్యం తయారీ కేంద్రం వెలుగులోకి రావడం ములకలచెరువులో కలకలం రేపింది. తాము నిత్యం సంచరించే ప్రాంతంలోనే ఇలాంటి పని జరుగుతోందా అంటూ ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెజవాడకు లింకు ములకలచెరువు నకిలీమద్యం తయారీ వ్యవహరంలో విజయవాడకు చెందిన వ్యక్తులతో లింకులున్నట్టు అనుమానిస్తున్నారు. వీరికి స్థానిక టీడీపీనేతలతో పరిచయాలు ఉన్నట్టు, వారికి ఇందులో ప్రమేయం ఉందన్న ప్రచారం సాగుతోంది. విజయవాడకు చెందిన జనార్దనరావు ద్వారానే ఇక్కడ పనిచేస్తున్న కూలీలను పంపినట్టు ఎకై ్సజ్ అధికారులే ప్రకటించారు. నకిలీమద్యం తయారీకి వినియోగిస్తున్న యంత్రాలు ఎక్కడినుంచి తెప్పించారు, నకిలీ లేబుళ్లు ఎక్కడ ముద్రించారో,ఎవరు ముద్రింపజేశారో తేలాల్సి ఉంది. దసరా మరుసటిరోజే నకిలీమద్యంతో వ్యాపారం వర్ధి ల్లాలని ఆశించారేమో..యంత్రాలకు, క్యాన్లకు పూజ నిర్వహించారు. గురువారం విజయదశ మిరోజు ఈ వేడుక నిర్వహించినట్టు తెలుస్తోంది. గ్యాస్ నింపే యంత్రాలకు పూజలు చేసి వాటికి పూలహారాలు వేయడం దాడుల్లో కనిపించింది. దీని చూసిన అధికారులు ఔరా అంటూ అశ్చర్యపోయారు. ఎకై ్సజ్, పోలీసు సర్కిల్ స్టేషన్లకు కిలోమీటర్ దూరంలోనే నకిలీమద్యం తయారీ కార్మాగారం నిర్వహిస్తుంటే ఎకై ్సజ్, పోలీసులకు ఆ విషయం తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కడప, రాయచోటి నుంచి ఎకై ్సజ్ అధికారులు వచ్చి దాడి చేసేదాకా ఇక్కడి వ్యవహారం ఎవరికీ తెలియదంటే ఎవరికై నా అనుమానం కలగకమానదు. పోలీసు పెట్రోలింగ్, తనిఖీలు సాధారణంగానే జరుగుతుంటాయి. అక్రమ మద్యం, కర్ణాటక మద్యం, సారా తయారీపై ఎకై ్సజ్శాఖ దాడులు నిరంతరం సాగుతుంటాయి. ఎక్కడో అటవీ ప్రాంతాల్లో నాటుసారా తయారీపై దాడులుచేసే ఎకై ్సజ్ పోలీసులకు తమ స్టేషన్కు కిలో మీటర్ దూరంలో నకిలీమద్యం తయారీ కర్మాగారం కొనసాగుతుంటే ఎందుకు తెలియకుండాపోయిందో ఆశాఖ ఉన్నతాధికారులే తేల్చాలి. లేదంటే శాఖపరమైన దర్యాప్తు చేపట్టాలి. ములకలచెరువులో ఎకై ్సజ్, పోలీసు సర్కిల్ స్టేషన్లకు కిలోమీటర్ దూరంలోనే నకిలీమద్యం కర్మాగారం పోలీసు నిఘా విభాగం నిర్లక్ష్యం నకిలీమద్యం తయారీలో టీడీపీ నేతలపైసోషల్ మీడియాలో ప్రచారం ములకలచెరువులో తయారైన నకిలీమద్యం తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో బెల్టుషాపులకు తరలించి విక్రయించినట్టు ఎకై ్సజ్ అధికారులే చెబుతున్నారు. బెల్టుషాపులకు ఆయా మద్యం దుకాణాదారులే వారి పరిధిలోని పల్లెలకు సరఫరా చేస్తారు. అధికార పార్టీనేతల అండతో ఉమ్మడి చిత్తూరు, అనంతపురంజిల్లాలకు సరఫరా చేసినట్టు అనుమానిస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులు ప్రకటించినట్టు పాలవ్యాన్లో నకిలీమద్యాన్ని బెల్టుషాపులకు తరలించి విక్రయిస్తున్నట్టు చెప్పారు. దీంతో పేదలు, కార్మిక, కర్షకులు ఈ నకిలీమద్యం సేవించి ఆరోగ్యాన్ని గుల్ల చేసుకున్నారు. నకిలీమద్యం తయారీ కేంద్రం ఎప్పటినుంచి నడుస్తోందనే దానిపై స్పష్టత లేకపోతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. మద్యం దుకాణాల నిర్వహణ మొదలైన తర్వాత నుంచి మొదలై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే నకిలీ మద్యం కర్మాగారం నడుస్తున్న భవన యజమాని లక్ష్మీనారాయణ బెంగళూరులో ఉంటారని, ఆయన రామ్మోహన్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడని ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. ఇతను కొన్నినెలల క్రితం దాబా నిర్వహణ నిలిపివేశాడని, తర్వాత ఈ భవనాన్ని ఎవరు లీజుకు పొందారో తెలియాల్సి ఉందని ఎకై ్సజ్ అధికారులు ప్రకటించారు. అంటే ఈ దాబా ఖాళీ అయినప్పటినుంచి నకిలీమద్యం తయారీ మొదలై ఉంటుందన్న కోణంలో విచారణ మొదలైంది. -
7న జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం
కడప సెవెన్రోడ్స్: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం ఈనెల 7వ తేది ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సీఈఓ ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలంతా ఉదయం 10 గంటలకు స్థాయీ సంఘ సమావేశాలకు హాజరు కావాలని కోరారు. రాజంపేట: భారతీయ రైల్వే కమిటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి నియమితులయ్యారు. రైల్వేస్టాండిగ్ కమిటీ చైర్మన్గా సీఎం రమేష్ నియమితులయ్యారు. ఈయనతోపాటు కమిటిలో సభ్యులుగా లోక్సభ నుంచి 21 మంది లోక్సభ సభ్యులను తీసుకున్నారు. అలాగే రాజ్యసభ నుంచి పది మంది సభ్యులను రైల్వే స్టాండింగ్ కమిటిలోకి తీసుకున్నారు. ఇందులో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కూడా ఒకరు కావడం విశేషం. రైల్వేస్టాండింగ్ కమిటి సభ్యునిగా మేడా రఘునాథరెడ్డి ఎంపిక కావడం పట్ల పలువురు వైఎస్సార్సీపీనేతలు, అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రైల్వేశాఖ పరంగా ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని రైల్వే స్టాండింగ్కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. రాయచోటి: డీఎస్సీ–2025లో ఎంపికై న కొత్త ఉపాధ్యాయుల విద్యాబోధన పటిష్టం చేయడం కోసమే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్జేడీ శ్యామ్యుల్ అన్నారు. శుక్రవారం రాయచోటిలోని అర్చన కళాశాలలో జరిగిన ఇండక్షన్ రెసిడెన్షియల్ శిక్షణను డీఈఓ సుబ్రమణ్యంతో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులు విద్యావృత్తిని సమర్థవంతంగా ప్రారంభించాలన్నారు.డీఈఓ మా ట్లాడుతూ అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఇందుకోసం రాయచోటిలో రెండు, మదనపల్లిలో మూడు సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి భానుమూర్తి రాజు, స్టేట్ నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. మొదటిరోజు 273 మంది ఉపాధ్యాయులకు 269 మంది హాజరైనట్లు డీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టిఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, ఏఎఎంఓ అసదుల్లా, విద్యాశాఖ సిబ్బంది, రీసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
తగ్గిన ధరలకే వస్తువులు విక్రయించాలి
గుర్రంకొండ: జీఎస్టీతో తగ్గిన ధరల మేరకే అన్ని రకాల వస్తువులను విక్రయించాలని జిల్లా కలెక్టర్ నిషాంత్కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సూపర్ జీఎస్టీ– సూపర్సేవింగ్స్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనశాలలను సందర్శించి, సూపర్ జీఎస్టీ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుకాణాల వద్ద గతంలో ఉన్న ఎమ్మార్పీ ధరలు, ప్రస్తుతం జీఎస్టీతో తగ్గిన ధరల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా అఽధిక ధరలకు, పాత ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయట్రాక్టర్లు, వ్యవసాయయంత్రాలపైన 12 నుంచి 5 శాతం మేరకు ధరలు తగ్గాయన్నారు. ట్రాక్టర్ విడి భాగాలు, టైర్లు, డ్రోన్లపైన 18 నుంచి 5 శాతం మేరకు జీఎస్టీతో తగ్గాయన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తగ్గించిన ధరల మేరకు వ్యాపారులు విక్రయించకపోతే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేయాలంటే జిల్లాస్థాయిలో టోల్ఫ్రీ నంబర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ, జిల్లా ఉద్యానశాఽఖాధికారిణి సుభాషిణి, జిల్లా పీడీ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ లక్ష్మీప్రసన్న, ఎంపీడీవో పరమేశ్వరరెడ్డి, ఏవో రత్నమ్మ, సింగిల్విండో చైర్మన్ మూర్తిరావ్, నాయకులు నాయిని జగదీష్, ఎల్లుట్ల మురళీ, సుంకర్ శేఖర్, నౌషాద్, మహాత్మారెడ్డి, చలమారెడ్డిలు పాల్గొన్నారు. వ్యాపారులపై కలెక్టర్కు రైతుల ఫిర్యాదు జాక్పాట్ల పేరుతో టమాటా రైతులను వ్యాపారులు ఇష్టానుసారంగా దోచుకొంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిషాంత్కుమార్కు రైతులు, టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ను వారు కలిశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ జాక్పాట్లపేరుతో వ్యాపారులు వందకు 12 నుంచి 15 క్రీట్ల టమాటాలను బలవంతంగా తీసుకొంటున్నారని అన్నారు. మండీల్లో వేలం పాటలు నిర్వహించే సమయంలో టమాటాలను క్రీట్లపై రాసులుగా పోస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే వ్యాపారులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కమీషన్లు నాలుగుశాతానికి బదులు పదిశాతం తీసుకొంటున్నారని ఫిర్యాదు చేశారు.సమస్యలపై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా మార్కెట్యార్డులో పట్టించుకొనే వారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ నిషాంత్కుమార్ -
ముగిసిన దసరా సంబరాలు
ప్రొద్దుటూరు కల్చరల్: దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. విజయదశమిని పురస్కరించుకుని గురువారం విశేష అలంకారాలలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో గురువారం సాయంత్రం శమీదర్శన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విజయానికి, సకలశుభాలకు, సిరిసంపదలకు చిహ్నమైన శమీ వృక్షాన్ని విజయదశమి రోజు దర్శించి పూజలు నిర్వహిస్తే శుభప్రదమని దశమినాడు ఈ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వాసవీమాత అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టువస్త్రాలతో, పూలతో, పుత్తడి ఆభరణాలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకువచ్చి కొర్రపాడురోడ్డులోని శ్రీ వాసవీ శమీవృక్ష మండపంలో శమీదర్శన మహోత్సవం చేయించారు. కన్నులపండువగా వాసవాంబ తొట్టిమెరవణి శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో దేవీశరన్నవరాత్రి వేడుకల సందర్భంగా గురువారం అర్ధరాత్రి విజయలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు గ్రామోత్సవం (తొట్టిమెరవణి) కన్నుల పండువగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ మూర్తిని గజమాలలతో, ఆభరణాలతో అలంకరించి శ్రీచక్రం ఉన్న పంచలోహ హంస వాహన రథంపై ఆశీనులను చేసి పురవీధులలో వాసవీ నామస్మరణ మధ్య అట్టహాసంగా ఊరేగించారు. అమ్మవారిశాల నుంచి రాత్రి 11.55 గంటల సమయంలో ప్రారంభమైన తొట్టిమెరవణి బంగారు అంగళ్లవీధి, పప్పుల బజార్ మీదుగా 2.50 గంటల సమయంలో పుట్టపర్తి సర్కిల్కు చేరుకుంది. అనంతరం నుంచి శివాలయం ఎదురుగా మార్కెట్లో రకరకాల బాణసంచా పేలుళ్లు, చెట్లు, పాములు వంటి వాటిని పేల్చి విజయదశమి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కాంతార ప్రదర్శన, కేరళ సింగారి మేళం, అమ్మవారి తొట్టిమెరవణిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ● అన్నమయ్య జిల్లాలో దసరా వేడుకలు అంబరాన్నంటాయి. భక్తులతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. యువతీ,యువకులు జమ్మిచెట్టుకు పూజలు చేసి ,జమ్మి ఆకు పెద్దలకు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు.రాయచోటిలో శ్రీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జరిగిన శమీదర్శన శోభాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లె వాసవీభవన్వీధిలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరదేవి ధనలక్ష్మి అలంకారంలో అందరినీ ఆకట్టుకుంది. సుమారు రూ.80 లక్షల వరకు కరెన్సీనోట్లతో అమ్మవారి అలంకరించారు. మదనపల్లెసిటీ: ధనలక్ష్మి అలంకారంలో వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి కడపలో గ్రామోత్సవంలో శ్రీ విజయదుర్గమ్మ రాయచోటిటౌన్: శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవి శోభాయాత్ర ప్రొద్దుటూరు: తొట్టి మెరవణిలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ప్రొద్దుటూరు: పుట్టపర్తి సర్కిల్లో భక్తుల సందడి -
గాంధీజీ మార్గంలో నడవాలి
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి రాజంపేట టౌన్: జాతిపిత మహాత్మాగాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం మాజీ సిఎం వైఎస్.జగన్మోహన్రెడ్డికే సాధ్యమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ గాంధీజీ ఆశయమైన అహింస, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి గాంఽధీ చూపిన బాటలో పయనించి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరా జ్యం దిశగా తన హయాంలో బాటలు వేశారన్నారు.మహాత్ముని ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనిస్రెడ్డి, వైఎస్సార్ సిపి వివిధ విభాగాల కన్వీనర్లు వడ్డే రమణ, ఏల్చూరు అశోక్కుమార్, సనిశెట్టి నవీన్కుమార్, బొగ్గరపు రాజేష్గుప్త, పచ్చిపులుసు చక్రి, మిర్యాల సురేఖ, దయానంద్, కటారు శేఖర్రెడ్డి, గోవిందు బాలకృష్ణ, దండు గోపి, దాసరి పెంచలయ్య, సురేంద్రయాదవ్, జాహీద్అలీ, అబ్దుల్ మునాఫ్, అమర, వేల్పుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
అంబులెన్స్ ఢీకొని ఆర్ఎంపీ మృతి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో నివాసముంటున్న ప్రముఖ ఆర్ఎంపీ నార్జా ల నరేంద్రరావు శనివారం తెల్లవారుజామున పట్టణలోని గంగాలమ్మ ఆలయం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ఢీకొని మృతి చెందాడు. కేసున మోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీప్రసాద్రెడ్డి తెలిపారు. పలువురు మృతదేహాన్ని సందర్శంచి నివాళులు అర్పించారు. మూడు వాహనాలను ఢీకొట్టిన లారీ – తప్పిన పెను ప్రమాదం పీలేరు రూరల్ : వేగంగా వస్తున్న లారీ వరుసగా మూడు వాహనాలను ఢీకొట్టి.. బీభత్సం సృష్టించింది. అయితే అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు వైపు నుంచి ఎర్రగుంట్లకు వెళుతున్న లారీ.. కర్నూలుకు చెందిన దంపతులు ఎం.యతేంద్ర వర్మ, పి.అరుణదావి కారులో చిత్తూరుకు వస్తుండగా ఢీకొట్టింది. అనంతరం అదే లారీ మరో లారీ, ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎం.యతేంద్ర వర్మ, పి.అరుణదావి గాయపడ్డారు. వారిని స్థానికులు పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవరు, మరో లారీ డ్రైవరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒకే సారి నాలుగు వాహనాలు ఢీకొనడంతో ట్రాఫిక్ స్తంభించింది. మనస్తాపంతో వృద్ధుడి ఆత్మహత్య మదనపల్లె రూరల్ : అనారోగ్యం, మతిమరుపుతో బాధపడుతున్న తనను భార్య అకారణంగా తిడుతోందనే కోపంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లె మండలంలో జరిగింది. కొత్త ఇండ్లు పంచాయతీ రంగారెడ్డి కాలనీకి చెందిన బండ్ల నరసింహులు(69) కొంత కాలంగా షుగర్, మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నాడు. సమయానికి మాత్రలు వేసుకోకపోవడం, వ్యాధిని ముదరబెట్టుకుంటుండటంతో భార్య గంగులమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన నరసింహులు, అలిగి, బుధవారం సాయంత్రం కొత్త ఇంటి సమీపంలోని బహిరంగ ప్రదేశానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్మకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన అతడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు పొందుతూ నరసింహులు గురువారం మృతి చెందాడు. తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణ.. బైక్ దగ్ధం పుల్లంపేట : మండల పరిధిలోని తిప్పాయపల్లి గ్రామంలో ఇరువురు ఘర్షణ పడ్డ ఘటనలో బైక్ దగ్ధమైనట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన అంజిరెడ్డి అనే వ్యక్తి గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని అనడంతో.. జగన్మోహన్రెడ్డి దాడి చేసి బైక్ దగ్ధం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
రైల్వేకోడూరు అర్బన్ : మంగంపేట ఏపీఎండీసీ హైస్కూల్లో వాచ్మ్యాన్గా విధులు నిర్వహిస్తూ అకస్మాత్తుగా మృతి చెందిన పనుపులేటి రవితేజ (29) కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కూటమి ప్రభుత్వాన్ని, ఏపీఎండీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇవ్వలేదని తెలిపారు. మృతుడి మరణానికి గల కారణాలు స్పష్టంగా చెప్పకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, నాయకులు మృతుడి కుటుంబాన్ని కలిసినా ఏమాత్రం హామీ ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇలా జరిగితే గంటల్లో 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామని కానీ కూటమి నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా, ఉద్యోగం ఇవ్వకుంటే నిరననలు చేస్తామని హెచ్చరించారు. -
ఒంటిమిట్టలో వైభవంగా శమీవృక్ష పూజ
ఒంటిమిట్టలో స్వామి, అమ్మవారి గ్రామోత్సవం జమ్మి చెట్టుకు పూజ చేస్తున్న వేద పండితులు ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామికి గురువారం విజయదశమి సందర్భంగా ఆలయ అర్చకులచే టీటీడీ అధికారులు వైభవంగా శమీ వృక్ష పూజ నిర్విహించారు. ముందుగా ఆలయంలోని సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవారిని రామాలయం నుంచి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, శృంగిశైలిపై ఉన్న ఆస్థాన మండపంలో ఆశీనులను చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు ఆరాధన, చతుర్వేద పారాయణం, శమీ వృక్ష పూజ, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులు గ్రామోత్సవానికి బయలుదేరి, పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. తమ ఇంటి వద్దకు వచ్చిన శ్రీరాముడికి భక్తులు కాయాకర్పూరం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఆలయ విజిలెన్స్ అధికారి గంగులయ్య, ఆలయ అర్చకులు వీణారాఘవాచార్యులు, శ్రావణ్ కుమార్, పవన్ కుమార్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామయ్యను దర్శించుకున్న తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి పి.టి ఆశా శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, ఆలయ ప్రదక్షణ కావించి, గర్భాలయంలోని మూల విరాట్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె కాసేపు ఆలయ రంగమండపంలో సేద తీరారు. ఆమెను అర్చకులు ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
సిద్దవటం కోటలో అడవి పందుల స్వైరవిహారం
సిద్దవటం : మండల కేంద్రంలోని మట్లి రాజుల కోటలో అడవిపందులు రాత్రి వేళలో స్వైరవిహారం చేస్తున్నాయి. సిద్దవటం కోట రాను రాను మట్టిలో కలుస్తుందనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. డంకానగర్, పార్కులు, బిస్మిల్లా షా ఖాద్రి దర్గా సమీపంలోని రహదారి పక్కన అడవి పందులు పెద్ద గుంతలు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. కోటలోని కట్టడాలు కూడా పడిపోతున్నా పురవాస్తు శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదు. సిబ్బంది కేవలం నోటుబుక్కులలో పర్యాటకుల పేర్లు నమోదు చేసుకుని వెళ్లిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఐచర్ ఢీకొని మహిళ మృతి
మదనపల్లె రూరల్ : బతుకుదెరువు కోసం వచ్చిన మహిళ రోడ్డు దాటే క్రమంలో ఐచర్ వాహనం ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఘటన గురువారం రాత్రి మండలంలోని వలసపల్లె పంచాయతీలో జరిగింది. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలం లద్దిగంకు చెందిన మునిలక్ష్మమ్మ(55) జీవనోపాధిలో భాగంగా వలసపల్లె పంచాయతీ గ్రీన్వ్యాలీ పాఠశాలలో హెల్పర్గా పనికి కుదిరింది. శుక్రవారం నుంచి గ్రీన్వ్యాలీ పాఠశాలలో డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు ఉండటంతో, స్వగ్రామం నుంచి గురువారం సాయంత్రం బయలుదేరింది. పుంగనూరు నుంచి ఆటోలో మరో మహిళతో కలిసి బయలుదేరిన మునిలక్ష్మమ్మ, గ్రీన్వ్యాలీ స్కూల్ ఎదురుగా రోడ్డుకు అవతలి వైపున దిగింది. తోడు వచ్చిన మహిళ ఆటో డ్రైవర్కు డబ్బులు ఇస్తుండగా, మునిలక్ష్మమ్మ రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో హైవేపై వేగంగా వస్తున్న ఐచర్ వాహనం మునిలక్ష్మమ్మను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె రెడ్డెమ్మ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సు, బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు సుండుపల్లె : మండల పరిధిలోని మడితాడు వంక వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం నుండి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మడితాడు గ్రామం చండ్రాజుగారిపల్లికి చెందిన ద్విచక్ర వాహనదారుడు సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ‘శ్రీశక్తి’ విజయంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం రాయచోటి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకాన్ని దిగ్విజయం చేయడంలో ఆర్టీసీ కార్మికుల పాత్రం చాలా గొప్పదని విజయవాడ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఇంజనీర్ టి.చంగల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రాయచోటి డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి డిపోను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మహేశ్వరరెడ్డి, డిపో యంఎఫ్, గ్యారేజీ కార్మికులు పాల్గొన్నారు. -
ఏపీఎండీసీ పాఠశాల ఉద్యోగి మృతి
ఓబులవారిపల్లె : ‘ఏమి జరిగిందో ఏమో తెలియదు’ కానీ.. ఏపీఎండీసీ పాఠశాల ఉద్యోగి పసుపులేటి రవితేజ(26) శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీఎండీసీ పాఠశాల ప్రారంభం నుంచి పసుపులేటి రవితేజ అక్కడ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సెక్యూరిటీ ఉద్యోగంతోపాటు పాఠశాలలో టీలు అందించడం, ఇతర పనులు కూడా చేస్తుంటాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఏపీఎండీసీ పాఠశాల రక్షణగోడ పక్కనే ఉన్న తాగునీటి మోటారు వేసేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పాఠశాల పై అంతస్తులో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు గమనించి ప్రధానోపాధ్యాయురాలికి సమాచారం ఇచ్చారు. అందరూ అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే రవితేజ మృతి చెంది ఉన్నాడు. హుటాహుటిన రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎండీసీ పాఠశాలలో పని ఒత్తిడి కారణంగా రవితేజ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ పనులతోపాటు ఇతర పనులు కూడా చేయించుకుంటూ ఉండటంతో రవితేజ ఇబ్బందులు పడేవాడని వారు తెలిపారు. పని ఒత్తిడితో గుండెపోటుతో చనిపోయాడా, విద్యుత్ షాక్తో మృతి చెందాడా అనే విషయం తెలియాల్సి ఉంది. రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మహేష్ నాయుడు.. సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. మృతికి సంబంధించిన కారణం తెలియలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దెబ్బతిన్న లోలెవల్ కాజ్వే వంతెన
సిద్దవటం : సిద్దవటంలోని పెన్నా నదిపై నిర్మించిన లోలెవల్ వంతెన గత కొంత కాలంగా ప్రవహిస్తున్న వరద నీటి కారణంగా దెబ్బతింది. ఆగస్టు నుంచి ఇటు కుందూ నదినీరు, వర్షాల కారణంగా వచ్చిన వరదనీటితో.. దాదాపు 2 నెలల నుంచి పెన్నానది లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెన్నానది లోలెవల్ వంతెనపై నుంచి సిద్దవటం గ్రామానికి రూ.4 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో స్కీం వాటర్ పైపులైన్ ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహానికి గురువారం ఒక్కసారిగా పెన్నానదిపై ఉన్న లోలెవల్ కాజ్వే కుంగిపోయింది. వంతెనపై ఏర్పాటు చేసిన వాటర్ పైప్లైన్ కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పెన్నానది లోలెవల్ వంతెనకు మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
జీఎస్టీ తగ్గింపు ప్రతి రైతుకు తెలియాలి
రాజంపేట రూరల్ : వ్యవసాయం చేసే ప్రతి రైతుకు జీఎస్టీ తగ్గింపుదల గురించి తెలియజేయాలని వ్యవసాయ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆదేశించారు. మండల పరిధిలోని ఊటుకూరులో శుక్రవారం జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఏడీఏ కే.శివశంకర్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ సబ్ కలెక్టర్ హెచ్.ఎస్ భావనతో కలిసి నూతన జీఎస్టీ ధరతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ జీఎస్టీతో వ్యవసాయ కార్యకలాపాల ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. డ్రిప్, స్ప్రింకర్లపై 5 శాతం తగ్గిందన్నారు. రూ.6 లక్షల ట్రాక్టర్పై రూ.42 వేలు తగ్గుతుందన్నారు. అదే విధంగా ట్రాక్టర్ విడిభాగాలైన టైర్లు, హైడ్రాలిక్ పంపులు వంటి వాటిపై కూడా తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ పీర్మున్నీ, ఎంపీడీఓ వరప్రసాద్, జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పీ.మధుసూదన్రెడ్డి, ఏఓ జీ నాగలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్, హెచ్ఓ సునీల్, బీటీఎం సుబ్రమణ్యం, వీఏఏలు ప్రియాంక, వంశీకృష్ణ, వీహెచ్ఏ మల్లిక, ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గాంధీ జయంతి రోజున జోరుగా మద్యం విక్రయాలు
గుర్రంకొండ : గాంధీ జయంతి అక్టోబర్ రెండో తేదీన మద్యం విక్రయాలు గుర్రంకొండలో జోరుగా జరగడం గమనార్హం. గురువారం నాడు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎకై ్సజ్శాఖ అధికారులు మండలంలోని మూడు వైన్షాపులను సీజ్ చేసి వెళ్లిపోయారు. అయితే వైన్షాపు నిర్వాహకులు ముందుగా వేసుకొన్న ప్రణాళికల ప్రకారం మద్యం దుకాణాల పరిసరాలు, వెనుకవైపు బాటిళ్లు ఉంచుకొని యథేచ్చగా విక్రయాలు నిర్వహించారు. పలువురు గాంధీ జయంతి రోజునే బస్టాండులో తాగి రోడ్లపైనే పడిపోయి ఉండడం గమనార్హం. గాంధీ జయంతి రోజున ఇలా మద్యం విక్రయించడం దారుణమని గ్రామస్తులు చర్చించుకొంటున్నారు. ఈ విషయమై వాల్మీకిపురం ఎకై ్సజ్ సీఐ లతను వివరణ కోరగా జరిగిన సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొంటామన్నారు. -
సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు మదనపల్లె రూరల్ : భార్య తన మాట వినకపోవడం, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన భర్త సెల్టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. గుర్తించిన పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. కలకడ మండలం ఎనుగొండపాలెం మొరమ్మీదపల్లెకు చెందిన నామాల రెడ్డిశేఖర్నాయుడు, మౌని భార్యాభర్తలు. బతుకుదెరువులో భాగంగా మదనపల్లెకు వలస వచ్చి చెంబకూరురోడ్డు రాగిమానుసర్కిల్ సమీపంలో కాపురం ఉంటున్నారు. హోటల్లో వంట పనులు చేస్తూ జీవిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రెడ్డిశేఖర్నాయుడు కర్ణాటక రాష్ట్రం చింతామణిలో పనిచేసేందుకు వెళ్లాడు. దీంతో భార్య మౌని, భర్తకు చెప్పకుండా మదనపల్లెలో ఇల్లు ఖాళీ చేసి, స్వగ్రామానికి వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం మదనపల్లెకు వచ్చి గతంలో పని చేసిన హోటల్లో పనికి కుదిరింది. తనకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేయడం, పల్లెలో ఉండకుండా మళ్లీ టౌన్కు రావడం, ఎందుకు వచ్చావని నిలదీస్తే... తనపైనే తిరగబడటంతో అవమానం భరించలేక సెల్టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పట్టణంలోని కదిరిరోడ్డు బ్రహ్మంగారి గుడి వద్ద సెల్టవర్ వద్దకు వచ్చి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెడ్డిశేఖర్నాయుడును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
జీఎస్టీ ఫలాలు ప్రజలందరికీ అందాలి
నిమ్మనపల్లె : జీఎస్టీ ఫలాలు ప్రజలందరికీ అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీడీఓ రమేష్బాబు అన్నారు. బుధవారం మండలంలోని రెడ్డివారిపల్లె, కొండయ్యగారిపల్లె పంచాయతీల్లోని సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జీఎస్టీ శ్లాబులను కేంద్ర ప్రభుత్వం నాలుగు నుంచి రెండుకు తగ్గించడంతో రైతులు, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగిందన్నారు. వీటి కారణంగా నిత్యావసర వస్తువులు, ప్రాణాధార ఔషధాలు, లైఫ్–హెల్త్–టర్మ్ బీమా పాలసీలు, విద్యాసామగ్రి, వ్యవసాయ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్, పాల ఉత్పత్తులు, బేబీకేర్, ఫర్టిలైజర్స్...ఇలా అనేకవస్తువులు తగ్గిన ధరలతో సామాన్యులకు లభిస్తాయన్నారు. జీఎస్టీ సంస్కరణలు, పౌరుల జీవితాలను మెరుగుపరుస్తాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, ఏఓ మంజుల, పంచాయతీ కార్యదర్శి గాయత్రి తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ల పంపిణీ
రామాపురం: మండలంలోని కల్పనాయన చెరువు గ్రామంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. మామిడి మొక్కల పరిశీలన కల్పనాయన చెరువు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నాటిన మామిడి మొక్కలను కలెక్టర్ పరిఽశీలించారు. ఈ సందర్భంగా పీడీ వెంకటరత్నంను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే మండలంలోని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మినరసయ్యకు పలుసూచనలు చేశారు. రాయచోటి: ఇన్స్పైర్ అవార్డులకు 3048 మంది విద్యార్థులతో వందశాతం నామినేషన్లు సమర్పించి రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం తెలిపారు. బుధవారం డైట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రితో నామినేషన్ల కార్యక్రమం ముగిసిందన్నారు. జిల్లాలో 625 ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయన్నారు. పాఠశాలలు తమ విద్యార్థులతో ఇన్స్పైర్ అవార్డులకు ఆన్లైన్లో నామినేషన్లు సమర్పించాయన్నారు. నామినేషన్లు సమర్పించిన వారిలో 12శాతం మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం అవార్డులను ప్రధానం చేస్తుందన్నారు. అవార్డుకు ఎంపికై న ఒక్కో విద్యార్థి అకౌంట్లో ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి పదివేల రూపాయలు నగదు జమ చేస్తారన్నారు. అంకితభావంతో పనిచేసిన జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ జట్టుకు మదనపల్లె విద్యార్థి ఎంపిక
మదనపల్లె రూరల్: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ జట్టుకు పట్టణంలోని శ్రీ విద్యావికాస్ జూనియర్ కళాశాల విద్యార్థి వి.కార్తీక్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఇ.శివశంకర్, కోచ్ బాలాజీ తెలిపారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వి.కార్తీక్ను, ప్రిన్సిపాల్, కోచ్ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక్, ఎస్.జి.ఎఫ్ జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనపరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. భవిష్యత్తులో చక్కటి క్రీడా ప్రతిభ కనపరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై , మదనపల్లె ప్రతిష్టను దేశవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 6 నుంచి జమ్మూకాశ్మీర్లో జరిగే అంతరాష్ట్ర ఫుట్బాల్ పోటీల్లో కార్తీక్ ఏపీ జట్టుతరపున ఆడుతాడన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎస్.రెడ్డెప్పనాయుడు, వై.గుణకర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ రేటు తగ్గుదలతో రైతులకు మేలు
కడప అగ్రికల్చర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రేటు తగ్గించడంతో రైతులకు సాగు ఖర్చు తగ్గుతుందని, వ్యవసాయోత్పత్తులపై పన్నుభారం తగ్గడం వలన కొనుకొనుగోలు శక్తి పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. జిల్లా రైతుల కోసం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్– జీఎస్టీ –2.0 పై బుధవారం కడప ప్రభుత్వ పురుషుల జూనియర్ కళాశాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై రైతులకు అవగాహన సదుస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా వ్యవసాయ అధికారితోపాటు జీఎస్టీ సంయుక్త కమిషనర్ సుమతి, ఉద్యానశాఖ అధికారి సతీ్ష్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరెడ్డి, సెరికల్చర్ జిల్లా అధికారి రామశివదీక్షిత్(ఎఫ్ఏసీ), ప్రకృతి వ్యవసాయ డీపీఎం ప్రవీణ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎస్టీ సంయుక్త కమిషనర్ సుమతి మాట్లాడుతూ ట్రాక్టరు, హార్వెస్టింగ్ వంటి వ్యవసాయ యంత్రాలపై పన్ను 18 నుంచి 5 శాతం, ఎరువులు, పురుగు మందులు, బయో పెస్టిసైన్సుపై పన్ను 12 నుంచి 5 శాతం తగ్గిందన్నారు. అలాగే నీటి పారుదల పరికరాలు, స్ప్రింక్లర్లు, బిందు సేద్య పరికరాలు ఇతర నీటి పారుదల పంపులపై 12 నుంచి 5 శాతానికి తగ్గింపు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఏడీఏ లక్ష్మిమాధవి, కడప ఏఓ సురేష్కుమార్రెడ్డి, ఏఈఓలు సరిత, రాధిక, కవితతోపాటు రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి చంద్రా నాయక్ -
నేడు ఒంటిమిట్ట రామయ్య పార్వేట ఉత్సవం
ఒంటిమిట్ట: విజయదశమి సందర్భంగా గురువారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామికి పార్వేట ఉత్సవం ఉంటుందని టీటీడీ ఆలయ అధికారులు బుధవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయ సమీపంలో ఉన్న వావిలి కొలను సుబ్బారావు గుట్టపై ముస్తాబైన ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి, ప్రత్యేక పూజలతో పార్వేట ఉత్సవాన్ని ముగిస్తారన్నా రు. అనంతరం ఉత్సవమూర్తులు గ్రామోత్సవానికి తరలివెళ్లి, భక్తులకు అభయమిస్తారని పేర్కొన్నారు. పుల్లంపేట: స్థానిక సమీకృత బాలుర వసతి గృహం రాష్ట్రస్థాయి స్వచ్ఛ హాస్టల్గా ఎంపికై నట్లు వసతిగృహ అధికారులు తిరుపతిరెడ్డి, కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పచ్చనిచెట్లతో ఉంచడంతోపాటు హాస్టల్ ఆవరణలో కూరగాయలను సాగుచేసి విద్యార్థుకు స్వచ్ఛమైన తాజా వంటకాలను అందిస్తున్నామన్నారు. జిల్లాలో 54 వసతి గృహాలకుగాను పుల్లంపేట వసతి గృహాన్ని ఉన్నతాధికారులు తనిఖీ చేసి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేశారని వివరించారు. కడప అగ్రికల్చర్: ఉపాధి హామీ, ఉద్యానశాఖ, ఏపీ ఎంఐపీతోపాటు పట్టు పరిశ్రమశాఖల సమన్వయంతో 50 వేల ఎకరాల అదనపు విస్తీర్ణం కింద ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహానికి మండల, గ్రామస్థాయి ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి జి. సతీష్ తెలిపారు. గ్రామస్థాయిలో సభలు నిర్వహించి అర్హత ఉన్న ప్రతి రైతును ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 100 శాతం రాయితీతో ఎస్సీ, ఎస్టీ రైతులకు, 90 శాతం సబ్సిడీతో చిన్న, సన్న కారు రైతులకు బిందు, తుంపర సేద్య పరికాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి తెలిపారు. కడప కోటిరెడ్డిసర్కిల్: దసరా పండుగకు సొంతూళ్లకు వచ్చిన వారి తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ముఖ్య ప్రాంతాలకు జిల్లాలోని ఆరు డిపోల నుంచి ఈనెల 4, 5 తేదీలలో సాధారణ ఛార్జీలతో 80 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. బెంగళూరు 35, హైదరాబాద్ 25, విజయవాడ 10, చైన్నెకి 10 బస్సులు వెళతాయని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కడప సెవెన్రోడ్స్: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక, సర్ సీవీ రామన్ సైన్స్ క్లబ్ సంయుక్తాధ్వర్యంలో కడప ఐటీఐ సర్కిల్ వద్ద గాంధీజీ ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు జేవీవీ జిల్లా అధ్యక్షుడు సమీర్బాషా ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీజీ జీవిత ఘట్టాలు, జీవిత సందేశం, స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో ఆయన పాత్ర, వర్దమాన ప్రపంచానికి గాంధీజీ ఆవశ్యకతపై ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. మద్యం, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, సమాజంలో చైత్యం పెంచాలని కోరుతూ ప్రత్యేక వినతిపత్రం గాంధీజీ విగ్రహానికి సమర్పిస్తారని జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, సైన్స్క్లబ్ కడప డివిజన్ అధ్యక్షులు ఆర్.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. -
మెప్మా.. ఇదేంటి చెప్మా
కడప కార్పొరేషన్: ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం మాటున ఓ ప్రైవేటు సంస్థ, కొంతమంది అధికారులు అక్రమార్జన కోసం అడ్డదారులు వెతుకుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొంది సుమారు 20 సోలార్ రూఫ్ టాప్ అమర్చే ఏజెన్సీలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కాదని ఎక్కడో గుంటూరుకు చెందిన ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ద్వారానే సోలార్ రూఫ్ టాప్ అమర్చుకునేలా విద్యుత్ వినియోగదారులను ఒప్పించాలని లక్ష్యాలు విధించడం హాట్ టాపిక్గా మారింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో స్వయం సహాయ సంఘాలకు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించే వారికి టార్గెట్లు విధించారు. ఒక్కో ఆర్పీ వంద కనెక్షన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. సోలార్ రూఫ్ టాప్లు అమర్చుకునేలా ప్రజలకు విస్తృత అవగాహన తీసుకురావాలని గతంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు బ్యాంకర్లను కూడా పిలిపించి రుణాల మంజూరుకు హామీ ఇప్పించారు. కానీ కొద్దిమంది మాత్రమే ఆ దిశగా మొగ్గుచూపారు. ఇప్పుడు ఆర్పీల వంతు వచ్చింది. ఎలాగైనా సరే విద్యుత్ వినియోగదారులను ఒప్పించి సోలార్ రూఫ్టాప్ అమర్చేలా చేయాలని మెప్మా అఽధికారులు ఒత్తిడి తెస్తుండటంతో ఆర్పీలు లోలోన మథనపడిపోతున్నారు. ఒకే ఒక్క ఏజెన్సీనే ఎందుకు...? జిల్లాలో సుమారు 30 ఏజెన్సీలు ఉండగా ఒక్క ఆంఽధ్ర ఎంటర్ప్రైజెస్కు మాత్రమే లబ్ది చేకూర్చేందుకు మెప్మా అధికారులు టార్గెట్లు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంపెనీ ప్రతినిధులతో మెప్మా అధికారులు కుమ్మకై ్క తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆర్పీలు వాపోతున్నారు. ఆర్పీల సమావేశంలో కంపెనీ ప్రతినిధులను కూర్చొబెట్టి వంద కనెక్షన్లు చేయాలని నిర్దేశిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే సెలవుపై వెళ్లాలని బెదిరిస్తున్నారని సమాచారం. కడపలో 210 ముంది ఆర్పీలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి వంద చొప్పన అంటే 20వేల కనెక్షన్లు చేయాలని టార్గెట్ ఇచ్చి మరీ బెదిరించడం విమర్శలకు తావిస్తోంది. టార్గెట్లు పూర్తి చేస్తే కమీసన్లు ఇస్తామని ప్రలోభాలకు కూడా గురిచేస్తున్నట్లు తెలిసింది. సోలార్ రూఫ్ టాప్ గురించి విస్తృత అవగాహన కల్పించడంలో ఎలాంటి తప్పులేదు కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలతో కరపత్రాలు ప్రచురించడం, ప్రభుత్వమే ఆ కంపెనీని ప్రోత్సహిస్తునట్లు మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ ద్వారానే సూర్యఫలకలు అమర్చేలా మెప్మా అధికారులు అత్యుత్సాహం చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్లపై సూర్య ఫలకలు అమర్చిన ఏ ఏజెన్సీ అయినా ఐదేళ్లపాటు సర్వీసు అందించాల్సి ఉంటుంది. స్థానికంగా ఉన్న ఏజెన్సీలు, వెండార్స్ అయితే కొంత మేరకై నా జవాబుదారీగా ఉండే అవకాశముంది. గుంటూరులో ఉండే ఈ ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ ఏ మేరకు సర్వీసు అందిస్తున్నది ప్రశ్నార్థకంగా మారింది. వారు నాసికరం సూర్య ఫలకలు అమర్చి భవిష్యత్లో ఏవైనా సమస్యలు వస్తే వినియోగదారులు ఎవరిని అడగాలి, ఒప్పించి కనెక్షన్లు ఇప్పించిన మెప్మా అధికారులనా...ఆర్పీలనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నివాస గృహాల రూఫ్పై సోలార్ ఫలకలు ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రూ.78వేల వరకూ సబ్సిడీ ఇస్తుంది. లబ్ధిదారులు వెండార్స్ను ఎన్నుకొని వారి ద్వారా సోలార్ ఫలకలను అమర్చుకోవచ్చు. అలాగే బ్యాంకు లోన్ పొంది సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు. ప్రతినెలా కరెంటు బిల్లుకు చెల్లించే మొత్తాన్ని ఈఎంఐ కడితే కొంత కాలానికి సోలార్ ద్వారా ఉచిత విద్యుత్ లభిస్తుంది. మొత్తంగా పీఎం సూర్యఘర్ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఇది. పీఎం సూర్య ఘర్ ఒక సంస్థకే డ్వాక్రా ఆర్పీలకు అధికారుల టార్గెట్లు ఆందోళనలో రిసోర్స్ పర్సన్లు -
ఎస్పీ చొరవతో గల్ఫ్ బాధితురాలికి విముక్తి
రాయచోటి : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి చొరవతో గల్ఫ్ దేశమైన కువైట్లో ఇబ్బందులు పడుతున్న మహిళకు విముక్తి లభించింది. జిల్లాలోని ములకల చెరువు మండలానికి చెందిన బత్తల నాగవేణి కువైట్లో అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు బాధితురాలి తమ్ముడు హరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు ఎస్పీ కిందిస్థాయి పోలీసు అధికారులను విచారణకు ఆదేశించారు. తక్షణం ఏజెంట్లను విచారించి అధికారులతో సమన్వయం చేసి బాధితురాలిని స్వదేశానికి రప్పించారు. బాధితురాలు నాగవేణి, ఆమె తమ్ముడు హరి బుధవారం రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు ప్రభుత్వ అనుమతి పొందిన ఏజెంట్ల ద్వారానే ప్రయాణం చేయాలని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు. – జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ కడప అర్బన్ : వయోవృద్ధులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ అన్నారు. కడప కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవా సదన్లో శ్రీన్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ఙ్ తో పాటు, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వృద్ధుల జీవితాలను ప్రభావితం చేసే సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. భద్రత కల్పించాల్సిన వృద్ధులను విడిచిపెట్టినా, పరిత్యాగం చేసే విధంగా బుద్ధిపూర్వకంగా వ్యవహరించినా గరిష్టంగా మూడు నెలలు జైలు శిక్ష లేదా అపరాధ రుసుము లేదా రెండింటినీ కలిపి విధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్, పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్.రామమూర్తి నాయుడు, వృద్ధాశ్రమాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
కిలో టమాట @ రూ..2
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో టమాటా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పంట చేతికొచ్చినా మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోవడంతో లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం కిలో టమాటా ధర రైతులకు రెండు రూపాయలు మాత్రమే లభిస్తోంది. మదనపల్లి, గుర్రంకొండ, కలకడ, కలికిరి, రాయచోటి మార్కెట్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోజురోజుకు పతనమవుతున్న ధరలతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కిలో టమోటా ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ వ్యాపారులు వీటిని పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ● పతనమైన టమాట ధరలు ● తీవ్ర సంక్షోభంలో రైతులు -
ఆల్మట్టిపై చంద్రబాబు మాట్లాడరెందుకు.?
కడప కార్పొరేషన్ : ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్నాటక కేబినెట్ తీర్మాణం చేసి, టెండర్లు కూడా పిలుస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనం వహించడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1995లో దేవెగౌడ సర్కార్ అల్మట్టి ఎత్తును 509 నుంచి 524 మీటర్లకు పెంచుతూ పనులు చేపట్టినా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నోరు మెదపకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మెన్గా వ్యవహరించిన బాబు, కర్నాటక సీఎం దేవగౌడను ప్రధానిగా చేయడంలో తానే కీలకంగా వ్యవహరించినట్లు చెప్పుకుంటారన్నారు. ఆయన ప్రధాని అయ్యాకే ఆల్మట్టి డ్యామ్కు నిధులు మంజూరై పనులు పూర్తయ్యాయన్నారు. ఇలా అప్పట్లో ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోకుండా చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. తాజాగా ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ ఎత్తును 509 నుంచి 524 మీటర్లకు పెంచుతూ కేబినెట్ తీర్మాణం చేసిందన్నారు. దీంతో ఆల్మట్టి డ్యామ్ సామర్థ్యం 129.72 నుంచి 270.72 టీఎంసీలకు పెరుగుతుందన్నారు. కర్నాటక చర్యల వల్ల కృష్ణా జలాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు ఉండవన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎగువ నుంచి చుక్క నీరు కూడా కిందికి రాదన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పోలవరం నుంచి బనకచర్ల క్రాస్ వరకూ అనుసంధానిస్తామని, సోమశిల అనుసంధానం అంటూ ముఖ్యమంత్రి పొంతన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఒకవైపు కర్నాటక, మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించడం వల్ల రాయలసీమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెడితే పర్యావరణ అనుమతులు లేవనే సాకుతో ఆ పనులు పూర్తి చేయకుండా ఉన్నారన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పొత్తులో ఉన్న చంద్రబాబు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి ఈ పనులు పూర్తి చేయలేరా అని ప్రశ్నించారు. జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ను కలిపే పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. 17 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, రాయలసీమకుగానీ ఇతర ప్రాంతాల అభివృద్ధికిగానీ చేసింది శూన్యమన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు పెంచారన్నారు. నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, పుట్టపర్తి జిల్లాలను ఏర్పాటు చేసి, కొప్పర్తి, ఓర్వకల్లు సెజ్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంతానికి మేలు చేశారన్నారు. ఈవెంట్ల పేరుతో వారానికొసారి ఢిల్లీకి, నిత్యం విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందన్నారు. దీనిపై పోరాటం చేసి భవిష్యత్ తరాలకు నష్టం కలగకుండా చూడాల్సిన సమయం వచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో రూ.3లక్షల కోట్లు అప్పు చేస్తే 17 నెలల్లోనే చంద్రబాబు రూ.2లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకా హత్య కేసును పదే పదే ప్రస్తావించారని, అధికారంలోకి వచ్చి 17 నెలలైనా ఆ కేసును ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో ఆధారాలు దొరకలేదని, కోర్టులో ఈ కేసు వీగిపోయే అవకాశం ఉందన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని, టెండర్లు వెనక్కి తీసుకునేలా పలుకుబడిని ఉపయోగించాలని సూచించారు. భవిష్యత్లో శ్రీశైలంపై ఏ ప్రాజెక్టు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్, వేర్హౌస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్ఏ కరిముల్లా, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు షఫీవుల్లా, వలంటీర్స్ విభాగం అధ్యక్షుడు ఫయాజ్ పాల్గొన్నారు. ప్రాజెక్టు ఎత్తు పెంచితే రాయలసీమ ఎడారే గతంలో ఆల్మట్టి ఎత్తు పెంచినా నోరు మెదపని బాబు ఇప్పుడు ఎన్డీఏతో పొత్తులో ఉన్నా అడ్డుకోకపోవడం అన్యాయం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
ఫెయిల్యూర్ రహిత డిపోలుగా తీర్చిదిద్దాలి
మదనపల్లె సిటీ : జిల్లాలోని ఆర్టీసీ డిపోలను ఫెయిల్యూర్ రహిత డిపోలుగా తీర్చిదిద్దాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్రెడ్డి అన్నారు. బుధవారం మదనపల్లె ఆర్టీసీ–1,2 డిపోలను సందర్శించారు. బస్స్టేషన్ను పరిశీలించారు. డిపో గ్యారేజీలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 50 డిపోలు ఫెయిల్యూర్రహిత డిపోలుగా నమోదైనట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా ఫెయిల్యూర్ రహిత జిల్లాగా సాధించారన్నారు. మదనపల్లె వన్,టు డిపోలు ఫెయిల్యూర్ రహిత డిపోలుగా నమోదు కావాలని కోరారు. సీ్త్రశక్తి పథకం సజావుగా నిర్వహించాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్టాండు ఆవరణంలోని ఫ్లాట్ఫారం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డిపో ఆవరణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎంలు మూరే వెంకటరమణారెడ్డి, అమరనాథ్, సీసీఎస్ డెలిగేట్ వినోద్బాబు, డిపో సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంపీ మిథున్రెడ్డికి ఆహ్వానం
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణం అమ్మవారిశాలలో గురువారం జరిగే దసరా వేడుకల్లో పాల్గొనాలని ఎంపి పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గ్రంధే సత్యనారాయణగుప్త, కౌన్సిలర్ సనిశెట్టి నవీన్కుమార్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు బుధవారం ఎంపీని తిరుపతిలోని ఆయన స్వగృహంలో కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు అన్నపూర్ణ, మురళి, రమేష్, బొగ్గరపు రాజేష్, నరేష్, సత్య పాల్గొన్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగం ఎంతో కాలం సాగదు
రాజంపేట టౌన్ : రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయించి సాగిస్తున్న కూటమి ప్రభుత్వం పాలన మరెంతో కాలం సాగదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి హెచ్చరించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి బెయిల్ రావడంతో మంగళవారం పట్టణంలోని ఆకేపాటి భవన్లో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగమే మద్యం కేసు అని తెలిపారు. మిథున్రెడ్డి ఎకై ్సజ్శాఖ మంత్రి కాదని, కనీసం ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎకై ్సజ్శాఖ మంత్రి కాదన్నారు. అలాంటప్పుడు మిథున్రెడ్డికి మద్యంతో ఏం సంబంధం ఉంటుందని ఆకేపాటి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, అందువల్ల ప్రజల దృష్టి మరల్చేందుకు మద్యంలో అవినీతి జరిగిందంటూ అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మిథున్రెడ్డిపై నమోదు చేసిన మద్యం అక్రమ కేసు సాక్ష్యాలు లేక వీగిపోవడం ఖాయమన్నారు. మిథున్రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టి దాదాపు 72 రోజుల పాటు జైలులో ఉంచడం బాధాకరమన్నారు. తమ నాయకులపై కేసులు పెట్టే కొద్ది తమ పార్టీ కార్యకర్తలు జూలువిదిల్చిన సింహాల్లా పార్టీ కోసం పనిచేస్తారన్న విషయాన్ని కూటమి పార్టీ నాయకులు గుర్తించుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం చంద్రబాబునాయుడు దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబునాయుడు వైఎస్సాసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడంపై చూపే శ్రద్ధ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై చూపాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రక్కాసి శ్రీవాణి, సుజాత, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు జెనుగు కృష్ణారావు యాదవ్, ఏపీఎన్ఆర్సీ మాజీ డైరెక్టర్ బీహెచ్.ఇలియాస్, వివిధ విభాగాల కన్వీనర్లు డీలర్ సుబ్బరామిరెడ్డి, పాపినేని విశ్వనాథ్రెడ్డి, డి.భాస్కర్రాజు, వడ్డే రమణ, ఖాజామొహిద్దీన్, నాగా శేఖర్రెడ్డి, కటారు శేఖర్రెడ్డి, జీవీ.సుబ్బరాజు, అబ్దుల్ మునాఫ్, రెడ్డిమాసి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి -
మెడికల్ ప్రైవేటీకరణపై దళిత గర్జన
సాక్షి రాయచోటి/రాయచోటి/టౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై అన్నమయ్య జిల్లా రాయచోటిలో దళిత వర్గాలు గర్జించాయి. వైఎస్ జగన్ సర్కారు హయాంలో మంజూరై బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటున్న వైద్య కళాశాలలను.. పీపీపీ విధానంలోకి చేర్చి అన్యాయం చేశారంటూ దండెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవలే మదనపల్లె మెడికల్ కళాశాల వద్ద ఆందోళనలు చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు.. ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడంతో మరొకసారి ఆందోళన బాట పట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళిత వర్గాలు కదం తొక్కాయి. పేద ప్రజల నడ్డి విరిచేందుకే ప్రైవేటు వైపు మొగ్గు చూపారని.. ఈసారి జిల్లాలోని కళాశాలకు కేటాయించిన సీట్లను కూడా వెనక్కి పంపారంటూ సర్కార్పై నిరసనకారులు మండిపడ్డారు. పీపీపీ విధానంపై నిరసన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ (పీపీపీ) విధానానికి కూటమి సర్కారు తేవడంపై ఎస్సీ సెల్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ దళిత శ్రేణులతోపాటు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా నేతాజీ సర్కిల్, ఠాణా మీదుగా మాసాపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అమరావతిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం పార్కును ప్రైవేటీకరణకు అప్పగించడం వంటి సమస్యలపై దళిత నాయకులు విశదీకరించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పార్టీ కార్యాలయం నుంచి మాసాపేటకు చేరుకుని అక్కడ ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే నిలుచొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతోపాటు కూటమి సర్కార్ నిరంకుశ వైఖరిపై నినాదాలతో హోరెత్తించారు. అనంతరం బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. దళిత నాయకులతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని అన్యాయంపై అంబేడ్కర్కు వేదన వినిపించారు. ‘వైద్య విద్య మా హక్కు, అమ్మకానికి కాదు, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి, జగన్ కలలను కాపాడుకుందాం–పీపీపీ కుట్రలను అడ్డుకుందాం, వైద్య విద్యను కార్పొరేట్ లాభాలకే కాదు–ప్రజల సేవకే ఇవ్వాలి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్కటై పోరాడదాం’ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కమలాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు చుక్కా అంజనప్ప, దండుగోపి, మారుతీ, హరి, రవీంద్ర, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్లప్ప, నరేష్ కుమార్, మాజీ ఎంపీటీసీ సగినాల శివ శంకర్, లోకేష్, నాగసుబ్బయ్య, జయరామచంద్రయ్య, ప్రసాద్, నాగమణి, రెడ్డయ్య, రాజ్ కుమార్, అంకె ఆంజనేయులు, పెంచలయ్య, రాజన్న, గంగులయ్య, రెడ్డయ్య, అశోక్, రామ్మోహన్ తదితర ఎస్సీ నేతలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపిద్దాం రాబోయే ఎన్నికల్లో కూటమిని ఓడగొట్టి వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకొద్దాం. అప్పుడు ఈ 17 మెడికల్ కళాశాలలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పరం చేసి పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తారు. – గుండ్లూరు జయరామ చంద్రయ్య, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిఽధి పేదలకు వైద్య విద్య దూరం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేసి 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే.. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు చేస్తోంది. మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం అయితే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. – లింగం లక్ష్మీకర్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, రైల్వేకోడూరు ప్రభుత్వ వైద్య కళాశాలలుప్రైవేటుపరం చేయడంపై నిరసన వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ఆధ్వర్యంలో ఆందోళన కూటమి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రంసమర్పించిన నేతలు -
మంత్రి మండిపల్లిని కలిసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి
రాయచోటి టౌన్ : రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఆయనను కలసి జిల్లాలోని శాంతి భద్రతలు, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మైనర్ల డ్రైవింగ్ నియంత్రణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే యువత క్రీడలపై మక్కువ పెంచుకొనేందుకు పోలీస్ శాఖ సహాయ సహకారాలు అందించాలని మంత్రి కోరారు. దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. -
4న తలనీలాల వేలం
సిద్దవటం : మండల పరిధి వంతాటిపల్లి గ్రామ పంచాయతీ లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజస్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో భక్తులు సమర్పించే తలనీలాల సేకరణ హక్కుకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎ.శ్రీధర్ తెలిపారు. అక్టోబర్ 4న ఉదయం 11 గంటలకు సిద్దవటం శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో వేలంపాట నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు లక్ష రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. పాట ముగిసిన వెంటనే హెచ్చు పాటదారుడు పూర్తి మొత్తం చెల్లించి రశీదు పొందాలని వివరించారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీ చిన్నమండెం : మండలంలోని దేవగుడిపల్లి ఆర్చి వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలైనట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దేవగుడిపల్లి కస్పాకు చెందిన నాగరాజు కుమారుడు విశ్వ చిన్నమండెం నుంచి దేవగుడిపల్లికి వస్తుండగా కడప–బెంగళూరు జాతీయ రహదారిపై దేవుడుపల్లి ఆర్చి వద్దకు వచ్చేసరికి చిన్నమండెం మండల కేంద్రంలోని అరబిక్వీధికి చెందిన సాదిక్, జాఫర్, శేషావలి రాయచోటి వైపు నుంచి వస్తూ విశ్వ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నారు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విశ్వాను తిరుపతి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా శేషావలి, సాదిక్, జాఫర్ అతివేగంతో వచ్చి విశ్వను ఢీకొనట్టినట్లు బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనర్లకు బైక్లు ఇచ్చిన వారిపై కేసులు రాజంపేట టౌన్ : మైనర్లకు బైక్లు ఇచ్చేవారిపై కేసులు నమోదు చేయనున్నట్లు ఏఎస్పీ మనోజ్ రామనాఽథ్ హెగ్డే హెచ్చరించారు. మైనర్ల డ్రైవింగ్పై డ్రోన్ సహాయంతో మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బైక్లు నడిపే మైనర్లను గుర్తించి అర్బన్ పోలీస్ స్టేషన్లో వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే మైనర్లు బైక్లు నడుపుతున్నారన్నారు. దీని వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు ఎట్టిపరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదన్నారు. మైనర్లకు బైక్లు ఇస్తే చట్టపరంగా తల్లిదండ్రులకు శిక్ష పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ బి.నాగార్జున, ఎస్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బస్సులో బంగారు నగలు చోరీ ముద్దనూరు : స్థానిక పాత బస్టాండులో ఆర్టీసీ బస్సులో ఎక్కిన మహిళనుంచి నాలుగున్నర తులం బంగారు నగలు చోరీ అయ్యాయి. ఏఎస్ఐ రమేష్ సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మండలంలోని దేనేపల్లెకు చెందిన లక్ష్మీప్రసన్న అనే మహిళ తన బ్యాగులోని పర్సులో నల్లపూసల దండ, బంగారు హారం పెట్టుకుని పోట్లదుర్తి గ్రామానికి వెళ్లేందుకు తన ఇద్దరు చిన్న పిల్లలతో కలసి పాతబస్టాండులో ప్రొద్దుటూరు బస్సు ఎక్కింది. పాత బస్టాండు నుంచి 4 రోడ్ల కూడలికి వెళ్లిన తర్వాత టికెట్ కోసం పర్సులో వున్న ఆధార్కార్డు చూపించడానికి పర్సుకోసం చూడగా బ్యాగులో పర్సులేదని గుర్తించింది. పర్సు దొంగిలించినట్లు తెలుసుకుని వెంటనే బస్సులో నుంచి దిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
రహదారులపై రక్తపు మరకలు !
జాతీయ రహదారులు రక్తపు మరకలతో నిండిపోతున్నాయి. కారణాలు ఏవైనా నిత్యం వాహనదారులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. ఒక వైపు అతివేగం, మరో వైపు పొంచి ఉన్న ప్రమాదాల వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై ఆయా కుటుంబాలలో విషాదాన్ని మిగులుస్తున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో జరిగిన ఘోర ప్రమాదాలు వందలాది కుటుంబాలలో చీకటిని నింపాయి. రాయచోటి అర్బన్ : జిల్లాలోని పలు జాతీయ రహదాలు రక్తంతో తడిసిపోతున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఊహించని ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఆయా కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. పొంచి ఉన్న ప్రమాదాలు ... జాతీయ రహదారులలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనుల వద్ద సరైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా రాత్రి సమయంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాయచోటి పట్టణ పరిధిలోని గాలివీడు రింగు రోడ్డు సర్కిల్ నుంచి వేంపల్లి రోడ్డు సర్కిల్ వరకు రింగురోడ్డు పనులు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. అయితే ఇదే రహదారిలో మాండవ్య నది ప్రవహిస్తుండటం వల్ల గతంలో నిర్మించిన రెండు వంతెనలు ఉన్నాయి. ప్రస్తుతం పెరిగిన రోడ్డు వెడల్పుకు అనుగుణంగా ఆయా వంతెనల వెడల్పు పెరగకపోవడం వల్ల అక్కడ ఇటీవల పలుమార్లు ద్విచక్రవాహనదారులు, కారు, ఆటోలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదాలకు గుర య్యారు. సోమవారం రాత్రి పట్టణ పరిధిలోని గాలివీడు రింగురోడ్డు సర్కిల్ సమీపంలోని వంతెన వద్ద ద్విచక్రవాహనదారులు ప్రమాదానికి గురై లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం చిన్నపోతులవాండ్లపల్లెకు చెందిన ముబారక్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, రెడ్డిశేఖర్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదాల నివారణకు రవాణాశాఖ మంత్రి శాశ్వత పరిష్కారం చూపాలి.. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఇదే జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ తీసుకుని రోడ్డు ప్రమాదాల శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ● ఇదే ఏడాది జూలైలో పుల్లంపేట మండలంలో జరిగిన మామిడి పండ్ల లారీ బోల్తా పడిన ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ● మే నెల 24వ తేదీన గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ఒకే ప్రమాదంలో మరో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ● మే 30వ తేదీన కురబలకోట వద్ద జరిగిన కారు ప్రమాదంలో రాయచోటికి చెందిన మైనార్టీ యువకుడు మృతి చెందాడు. ● జూలై 11న సుండుపల్లి రోడ్డు మార్గంలో ఆటో, ద్విచక్రవాహన ప్రమాదంలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు గాయపడ్డారు. ● ఆగస్టు 9వ తేదీన చిన్నమండెం మండల పరిధిలో ట్రాక్టర్ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదాలకు అతి వేగం, రహదారుల్లో సూచిక బోర్డులు సరిగా ఏర్పాటు చేయకపోవడం కారణంగా తెలుస్తోంది. ఇప్పటికై నా రవాణాశాఖ మంత్రి చొరవ తీసుకుని ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి అతివేగం, రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. జాతీయ రహదారులతో పాటు ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో కూడా తప్పనిసరిగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లతో పాటు , బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ముబారక్(ఫైల్) ప్రమాదం జరిగిన తరువాత ఏర్పాటు చేసిన సూచిక బోర్డు జాతీయ రహదారులపై నిత్యం మృత్యు ఘంటికలు ఒక వైపు అతివేగం, మరో వైపు పొంచి ఉన్న ప్రమాదాలు రహదారులపై కనిపించని ప్రమాద సూచికలు వాహనదారులకు అవగాహన తప్పనిసరి ప్రమాదాల నివారణకు రవాణాశాఖ మంత్రి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ -
ఎంపీ బెయిల్పై కువైట్లో సంబరాలు
రాయచోటి : రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో కువైట్లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కువైట్ మాలియా ప్రాంతంలో పార్టీ ఆఫీసు వద్ద గల్ఫ్ కో కన్వీనర్ ఆధ్వర్యంలో మిథున్రెడ్డి విడుదల సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టినట్లు గల్ఫ్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, కోకన్వీనర్ గోవిందు నాగరాజు తెలిపారు. వారు మాట్లాడుతూ మూడు సార్లు ఎంపీగా గెలిచిన మిథున్రెడ్డిని కేవలం రాజకీయ కక్షతో అక్రమ కేసులో జైలుకు పంపించడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం ఇంతటి నీచమైన చర్యలకు పాల్పడిందన్నారు. గల్ఫ్ అడ్వైజర్ నాయిని మహేష్రెడ్డి, కువైట్ కోకన్వీనర్ మన్నూరు చంద్రశేఖర్రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు షేక్ రహమతుల్లా, సీనియర్ నాయకులు పూలపుత్తూరు సురేష్కుమార్రెడ్డి, కమిటీ సభ్యులు అఫ్సర్ఆలీ, అబ్బాస్, కిషోర్, హనుమంతురెడ్డి, షంషుద్దీన్, షేక్ ముస్తఫా, షఫీ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి రిజిస్టర్ పోస్టు రద్దు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : దశాబ్దాలుగా పోస్టల్ శాఖలో సేవలందిస్తున్న రిజిస్టర్ పోస్ట్ రద్దవుతోంది. రిజిస్టర్డ్ పోస్టును స్పీడు పోస్టులో విలీనం చేయడం ద్వారా ఈ విధానం రద్దు కానుంది. కొత్త విధానం అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పోస్టల్ శాఖ అమలులోకి తీసుకురానుంది. ఇకనుంచి స్పీడ్ పోస్ట్ పార్సిల్ సేవలు అందనున్నాయి. స్పీడ్ పోస్ట్ అనేది పోస్టల్ శాఖలో విస్తృత సేవలు అందిస్తోంది. కొత్తగా స్పీడ్ పోస్ట్లో ట్రాకింగ్ సిస్టం కూడా అందుబాటులోకి వచ్చింది. పార్సెల్ బుక్ చేసిన వ్యక్తికే కాకుండా దానిని అందుకోనున్న వ్యక్తి మొబైల్ ఫోన్కు పూర్తి సమాచారంతో కూడిన మెసేజ్ వస్తుంది. బుక్ పార్సిల్ ఎక్కడుంది. ఎప్పటికి అందుతుంది వంటి వివరాలు మొబైల్ ఫోన్లో చూసుకునే వెసులుబాటు కల్పించింది. సరికొత్త టెక్నాలజీ దిశగా.... పోస్టల్ శాఖలో ఇప్పటివరకు అమలవుతున్న టెక్నాలజీ విధానాలకు స్వస్తి పలికి సరికొత్త సాంకేతిక ఆధునికతతో కూడిన ఏపీటీ 2.0 ద్వారా సేవలందిస్తోంది. జులై నెలకు ముందు పోస్టల్ శాఖ మొత్తం సేవలు కోర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా అందేవి. వీటినే అడ్వాన్స్్డ్ టెక్నాలజీతో ఉన్న ఏపీటీ 2.0 అమలులోకి తెచ్చింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి విలీనమైన స్పీడ్ పోస్ట్ ద్వారా సాంకేతిక సౌకర్యాలతో సేవలందించేందుకు కడప పోస్టల్ డివిజన్లో అన్ని ఏర్పాట్లు చేశారు. -
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
రాయచోటి : విజయదశమి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ప్రజలకు సూచించారు. మంగళవారం ఆయన విజయదశమి సందర్భంగా జిల్లా ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు ప్రకటన ద్వారా ప్రత్యేక భద్రత సూచనలు జారీ చేశారు. ఉత్సవ ఊరేగింపుల సమయంలో శాంతియుతంగా, క్రమబద్ధంగా పాల్గొనాలన్నారు. తోపులాట, అల్లర్లు వంటి ప్రమాదకర చర్యలు చేయరాదన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఊరేగింపు మార్గాలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసి ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. శబ్ద పరికరాలు అనుమతించిన స్థాయిలోనే వినియోగించాలన్నారు. మద్యపానం, కత్తులు, కర్రలు, ఇతర ప్రమాదకర వస్తువులు పూర్తిగా నిషేధమన్నారు. ప్రతి పట్టణ, గ్రామంలో ఊరేగింపు మార్గాలపై ప్రత్యేక పోలీసు పహారా ఉంటుందన్నారు. విజయ దశమి పండుగ మన సంస్కృతి, ఐక్యత, ఆనందానికి ప్రతీక అన్నారు. ఈ పండుగను అందరూ సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి -
డీటీసీ కావలెను !
● 9 నెలలుగా రవాణాశాఖ కార్యాలయంలో సీటు ఖాళీ ● ఇన్చార్జి డీటీసీలతో సరిపెడుతున్న అధికారులు ● సకాలంలో పనులు కాక సతమత మవుతున్న వాహనదారులుకడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో 9 నెలల నుంచి డీటీసీ సీటు ఖాళీగా ఉంది. గతంలో ఇక్కడ ఉన్న డీటీసీ చంద్రశేఖర్రెడ్డి లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డీటీసీ సీటు ఖాళీగానే ఉంది. ఇన్చార్జి డీటీసీలతో విధులు.. రవాణాశాఖ అధికారులు ఇతర జిల్లాల అధికారులను ఇన్చార్జిలుగా నియమించి వారితో విధులు నిర్వహింపజేస్తున్నారు. ఇప్పటికే మగ్గురు డీటీసీలు ఇక్కడ ఇన్చార్జిలుగా పని చేశారు. అన్నమయ్య జిల్లా డీటీసీ ప్రసాద్ను ఇన్చార్జిగా నియమించగా ఆయన నాలుగు నెలలు పని చేసి వెళ్లారు. తర్వాత చిత్తూరు డీటీసీ నిరంజన్ రెడ్డి మూడు నెలలు, అనంతరం ప్రస్తుతం అనంతపురం డీటీసీ వీర్రాజు ఇన్చార్జి డీటీసీగా వాహనదారులకు సేవలను అందిస్తున్నారు. ఆయన వారంలో బుధవారం, గురువారం మాత్రమే ఇక్కడ ఉంటూ కార్యకలాపాలను నడిపిస్తున్నారు. ఈ రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో డీటీసీ లేకపోవడంతో వాహనదారులకు సకాలంలో సరైన సేవలు అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణాశాఖ కార్యాలయంలో అధికారుల కొరత ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే భారం పడుతోంది. ఇతర ఏ శాఖలో అయినా అధికారి బదిలీ అయినా సస్పెండ్ అయినా వెంటనే వేరే అధికారిని నియమించే ప్రభుత్వం జిల్లా ఉప రవాణాశాఖ కార్యాలయానికి మాత్రం ఇంతవరకు రెగ్యులర్ డీటీసీని నియమించలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు. -
అర్జీలకు సత్వర పరిష్కారం
– జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ రాయచోటి : పీజీఆర్ఎస్ అర్జీలకు సత్వరం పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తుందని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి సమస్యను, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుందన్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్య లు తీసుకుని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జేసీ ఆదర్శరాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటిలకు నియామక పత్రాలు జిల్లా వెనుక బడిన తరగగతుల సంక్షేమ శాఖ ఆ ధ్వర్యంలో శిక్షణ పొంది, డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలకు నియామక పత్రాలు పొందిన వారిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమ వారం అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉ పాధ్యాయులుగా నియామకం కావడం వారి కష్టానికి ఫలితమన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని వారికి కలెక్టర్ సూచించారు. స్కూల్ అసిస్టెంట్గా నియామకమైన ఎస్ మహమ్మద్, ఎస్జీటీగా నియామకమైన శివాజీలకు మెగా డీఎస్సీ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన సంక్షేమశాఖ అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామికి విశేష పూజలు
తంబళ్లపల్లె : మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్యకొండపై వెలసిన శ్రీభ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. దేవీశరన్నవరాత్రుల సందర్భంగా స్వామి, అమ్మవారికి పూజారులు ఈశ్వరప్ప, మల్లికార్జున ప్రత్యేక అలంకరణ చేశారు. పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రిని తలపించే విధంగా సుదూరప్రాంతాలు కర్ణాటక, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మల్లయ్యకొండను సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ మునిరాజ, కొండకిట్టల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. కళాకారుల బృందాలు పలు రకాల భజనలు, కోలాటలతో భక్తులను అలరింపజేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఏనుగుమల్లమ్మకు ప్రత్యేక అలంకరణ మల్లయ్యకొండకు వెళ్లే మార్గంమధ్యలో వెలసిన శ్రీ ఏనుగుమల్లమ్మ ఆలయంలో అమ్మవారికి పూజారులు విజయకుమారి, శేఖర్ ప్రత్యేక అలంకరణ చేశారు. పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. మహిళా భక్తులు అమ్మవారికి పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. -
దోపిడీ దొంగ అరెస్ట్
రాజంపేట రూరల్ : ఏరుకాల్వ రమాదేవి అనే మహిళపై దాడి చేసి బంగారం దోచుకెళ్లిన వేముల విశ్వనాథంను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనోజ్రామ్నాథ్్హెగ్డే తెలియజేశారు. మండల పరిధిలోని ఎర్రబల్లిలో గల డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన పుల్లంపేట మండలం వత్తలూరు వడ్డిపల్లి గ్రామానికి చెందిన రమాదేవిపై పీలేరు మండలం బోడుమల్లువారిపల్లి గ్రామం మొరవడ్డిపల్లికి చెందిన వేముల విశ్వనాథం దాడి చేసి బంగారం దోచుకెళ్లారని తెలియజేశారు. విశ్వనాథంను రూరల్ సీఐ బీవీ రమణ ఆధ్వర్యంలో పుల్లంపేట, పెనగలూరు ఎస్ఐలు బీవీ శివకుమార్, బీ రవిప్రకాశ్రెడ్డి రెడ్డిపల్లి చెరువు కట్టవద్ద తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. అతని వద్ద నుంచి 92,030 గ్రాముల బంగారం స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.9,50000లు ఉంటుందన్నారు. విశ్వనాథం నేరానికి ఉపయోగించిన రక్తపు మరకలు కలిగిన రాయిని సీజ్ చేశామన్నారు. అదే విధంగా ఒక ఫల్సర్ బైక్, ఓపీపీఓ సెల్ఫోన్ను సీజ్ చేశామని తెలియజేశారు. అయితే ఈ బంగారు ఆభరణాలు చిత్తూరు జిల్లాలోని సదుం, అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట, పెనగలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు అయిన కేసులలోని బంగారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. విలేకరితోపాటు ముగ్గురిపై కేసు నమోదుప్రొద్దుటూరు క్రైం : కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఓ విలేకరితోపాటు ముగ్గురు యువకులపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 27న ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పినందుకు కానిస్టేబుల్ను నలుగురు యువకులు తోశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. వారిలో ఓ విలేకరి కూడా ఉండటం గమనార్హం. ● 9 తులాల బంగారం స్వాధీనం ● ఏఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే -
అంతిమ విజయం న్యాయానిదే
రాజకీయంగా పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని ఎదుర్కోలేక కుట్రపూరితంగా కూటమి సర్కార్ అక్రమ మద్యం కేసు పెట్టింది. మిథున్కు బె యిల్ మంజూరు కావడం మంచి పరిణామం. వైఎస్సార్సీపీ శ్రేణులపై పెడుతున్న అక్రమ కే సులు ఎన్నో రోజులు నిలవవు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బుద్ధిచెబుతారు. ఎవరెన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమ విజయం న్యాయానిదే. – గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత ఎన్నికల సమయంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోలేక కూటమి సర్కార్ మద్యం అక్రమ కేసు పెట్టింది. ఈ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఏసీబీ కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తి లేదు. ఇప్పటికై నా కూటమి పాలకులు బుద్ధి తెచ్చుకుని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడాలి. – ఆర్ రమేష్కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలచెరువు మండలం చౌడసముద్రంకు చెందిన రమణ(60) తనకు పరిచయస్తుడైన మదనపల్లె మండలం పోతబోలుకు చెందిన నరసింహులుతో కలిసి చౌడసముద్రం నుంచి పాపిరెడ్డిపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యంలోని చెట్లవారిపల్లె వద్ద ట్రాక్టర్ పక్క నుంచి ఉన్నట్లుండి రోడ్డుపైకి రావడంతో ద్విచక్రవాహనం ఢీకొంది. ప్రమాదంలో రమణ తీవ్రంగా గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ● నిమ్మనపల్లె మండలం ఎగువమాచిరెడ్డిగారిపల్లెకు చెందిన ఫిరోజ్, అతడి భార్య రాజమ్మ(45) ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంలో సోమలకు వెళుతుండగా, మార్గమధ్యంలోని కందూరు సమీపంలో మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో రాజమ్మ తీవ్రంగా గాయపడింది. స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ● కడప జిల్లా ఖాజీపేటకు చెందిన శంకరనాయక్ (24), కామాక్షయ్య(35) అరటికాయలు అన్లోడ్ చేసేందుకు కూలీ పనుల్లో భాగంగా పులివెందుల నుంచి బొలేరో వాహనంలో పలమనేరుకు బయలుదేరారు. మార్గమధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు సమీపంలో బొలేరో ముందు చక్రం పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో పైన ఉన్న ఇద్దరు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. జింక అడ్డు రావడంతో.. మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో వెటర్నరీ ఉద్యోగి తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ములకలచెరువు మండలంలో జరిగింది. కందుకూరు వెటర్నరీ కేంద్రంలో ఎల్ఎస్ఏగా పని చేస్తున్న నాగేంద్రప్రసాద్(47) సోమవారం సమావేశం నిమిత్తం కందుకూరు నుంచి బురకాయలకోటకు వెళుతుండగా, మార్గమధ్యంలోని దూలంవారిపల్లె సమీపంలో రోడ్డుకు అడ్డంగా జింక రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో కాలు విరిగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. డిప్యూటీ ఎండీవోకు.. పెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లి సచివాలయంలో పని చేసే డిప్యూటీ ఎండీవో క్రిష్ణప్రసాద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 27న ఆయన విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంలో సత్యసాయి జిల్లా పెనుగొండకు వెళుతుండగా సోమందేపల్లి వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో కర్నూల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నట్లు మండల పరిషత్ సిబ్బంది సోమవారం తెలిపారు. విషయం తెలుసుకున్న బూర్లపల్లి సర్పంచ్ సుబ్బిరెడ్డి కర్నూల్లోని అదే ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్గా పని చేస్తున్న తన బావమరిదికి ఫోన్ చేసి అధికారి క్రిష్ణప్రసాద్ ఆరోగ్యం కుదుట పడేందుకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.గాయపడిన వెటర్నరీ ఉద్యోగి నాగేంద్రప్రసాద్ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రిష్ణప్రసాద్ -
అభివృద్ధి పనుల్లో కౌన్సిలర్లను గౌరవించాల్సిందే
మదనపల్లె : ప్రజలు గెలిపించిన కౌన్సిలర్లకు వారి వార్డుల్లో గౌరవం ఉండేలా.. ఆయా ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంలో కౌన్సిలర్లకు తప్పనిసరిగా గౌర్వం ఇవ్వాలని, ఆలాగే వారి అమోదంతోనే పనులను ప్రతిపాదించాలని మున్సిపల్ చైర్మన్ వరపన మనూజ స్పష్టం చేశారు. సోమవారం ఆమె అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు, తాము ప్రతిపాదించని పనులను అజెండాలో ఉన్నట్టు ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. వార్డుల్లో ఏ పని చేయాలన్నా కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఇలా జరగని పక్షంలో కౌన్సిల్ అజెండాలో పెట్టే పనులను తిరస్కరిస్తామని హెచ్చరించారు. వైస్చైర్మన్ జింకా చలపతి మాట్లాడుతూ కౌన్సిల్ పదవీకాలం ఉన్నంత వరకై నా కౌన్సిలర్లను గౌరవించండని కోరారు. తమ వార్డులో వీధిలైట్లు వెలగడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. కౌన్సిలర్లు బీఏ.ఖాజా, శ్రీనివాసులు, ప్రసాద్, రాజేష్ మాట్లాడుతూ కౌన్సిలర్లకు విలువ లేకుండా పోతోందని, కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పితే కూటమి పాలనలో ఒక్క పని జరగలేదన్నారు. అభివృద్ధి పనుల పేరిట చెపడుతున్న పనులకు బిల్లులు ఇవ్వకుండా పనులు పెట్డడం ఎందుకు, వాటిని రద్దు చేయండని నిలదీశారు. ఆర్అండ్బీ రహదారిలో సిమెంటు రోడ్డును వేయిస్తున్న అధికారులు చిత్తూరుబస్టాండ్లోని గుంతలపై మానవత్వంలో స్పందించి పనులు చేయించాలని కోరారు. కౌన్సిలర్లు ఉండగా టీడీపీ వార్డు ఇన్చార్జ్లు చెప్పే పనులకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమన్నారు. దీనితో కౌన్సిలర్లకు విలువలేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని మండిపడ్డారు. కౌన్సిలర్ కరీముల్లా మాట్లాడుతూ మున్సిపాలిటీకి పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తోందని, అన్నివార్డులకు సమంగా అభివృద్ధి పనులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలం అవుతున్నారని ఆరోపించగా.. ఆదాయం, పనులకు సంబంధించి కమిషనర్ ప్రమీల వివరణ ఇచ్చారు. కౌన్సిలర్ షబానా మాట్లాడుతూ పట్టణంలోని చిత్తూరుబస్టాండ్, ఫైర్స్టేషన్, మిషన్కాంపౌండ్ వద్ద పెట్టుకున్న దుకాణాలకు అనుమతి ఎవరు ఇచ్చారు, వారి నుంచి అద్దెలను ఎవరు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రమీల చెప్పారు. టీడీపీ కౌన్సిలర్ తులసీ మాట్లాడుతూ అభివృద్ధి పనులు అజెండా పెడుతున్నారే కానీ కౌన్సిల్ వాటి పనులు చేపట్టడం లేదని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించడంతో వైస్చైర్మన్ జింకా చలపతి, కౌన్సిలర్ రాజేష్ మాట్లాడుతూ కూటమిపాలన రాకతోనే అభివృద్ధికుంటుపడిందని, ఈ విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నించాలని కోరారు. తర్వాత కరీముల్లా, తులసీలు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అజెండా వద్దంటూ కౌన్సిల్ వాకౌట్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపాల్సిన అంశాలపై అధికారులు అజెండాను రూపొందించారు. 30 అంశాలపై ఆమోదం తెలపాల్సి ఉండగా దానిపై కనీస చర్చ లేకుండా కౌన్సిల్ మొత్తం నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది. దీనితో అజెండాను పట్టించుకోకుండా అర్ధాంతరంగా కౌన్సిల్ సమావేశాన్ని ముగించారు. దీనిపై చైర్మన్ మనూజ మాట్లాడుతూ కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకోకుండా, వారిని నిర్లక్ష్యం చేసి అజెండా అంశాలను ప్రతిపాదించిన కారణంగా వాటిపై చర్చలేకుండా తిరస్కరించామని చెప్పారు. దీని కారణంగానే సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించామని చెప్పారు. ఈ సమావేశంలో మేనేజర్ పీఆర్.మనోహర్, డీఈ శ్రావణీ, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటసుబ్బయ్య, ఏఈ రవీంద్రనాయక్, ఆర్ఐలు శ్రీనివాసులు, తిరుమల, సిబ్బంది పాల్గొన్నారు. లేదంటే అజెండా అంశాలను నిక్కచ్చిగా తిరస్కరిస్తాం అధికారులను హెచ్చరించిన చైర్మన్ మనూజ సమస్యలపై కౌన్సిలర్ల ఏకరువు ఆపై అజెండాపై చర్చ, ఆమోదం తెలపకుండా కౌన్సిల్ వాకౌట్ -
సామాన్యుడిపై టీడీపీ నాయకుల దౌర్జన్యం
సుండుపల్లె : అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు బంధువుల స్థల వివాదం.. నరసింహరాజుపై దౌర్జన్యం చేసేలా జరిగింది. ఒక పక్క అధికార బలం.. మరో పక్క పదవిలో ఉన్న టీడీపీ నేత కావడంతో.. ఆయన అనుచరులు అడ్డంగా దూసుకొచ్చారు. సామాన్యుడిగా ఉన్న నరసింహరాజు కుటుంబీకులపై వాదోపవాదాలు చేస్తూ దౌర్జన్యంగా తోసేశారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సొంత భూమిని కాపాడుకోవాలన్న తపనతో ప్రయత్నం చేసిన అతని పైకి వస్తుండటంతో.. తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వివరాలలోకి వెళ్లితే.. సుండుపల్లె మండల పరిధిలోని పెద్దినేనికాలువ గ్రామ పంచాయతీ రాచపల్లికి చెందిన నరసింహరాజు ఒక పత్రిక పెట్టుకుని హైదరాబాదులో జీవనం సాగిస్తున్నారు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నరసింహరాజు 6 నెలల క్రితం తన స్వగ్రామంలో కొండూరు విజయభాస్కర్రాజు దగ్గర ఒక ఎకరా భూమిని కొనుగోలు చేశాడు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన ఎకరా భూమిపై కన్నుపడింది. ఆ స్థలం తమకు కావాలని అడిగారని, తాను ఇవ్వనని చెప్పానని బాధితుడు మీడియాకు తెలిపారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు అత్తవారి స్థలం ఇదని, నువ్వు ఎలా కొంటావని నరసింహరాజును జగన్మోహన్రాజు అనుచరులైన మండల టీడీపీ నాయకులు శివరాంనాయుడు మరో 15 మందిని వెంటబెట్టుకొని వెళ్లి వారిపై దాడికి పాల్పడ్డాడు. నరసింహరాజు తన పొలంలో నాటుకున్న జామ చెట్లను దౌర్జన్యంగా పీకేశారు. స్వతహాగా పత్రికా వ్యక్తి అయిన నరసింహరాజు వీడియోలు, ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తే అతని ఫోన్ని లాక్కున్నారు. సర్వే నంబర్ 47 సబ్ డివిజన్ చేసి 457/1, 2,3 మూడు భాగాలుగా విభజన జరిగింది. 457/1లో ఏ, బీ, సీలుగా సబ్ డివిజన్ అయింది. అందులో పాస్బుక్లో పేర్కొన్న ప్రకారం వన్బీలో ఉన్న ఎకరా స్థలం తనదేనని నరసింహరాజు అంటున్నాడు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు టీడీపీ రాజంపేట ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు అత్తగారి భూమి భాగాలలో.. అదే గ్రామానికి చెందిన నరసింహరాజు ఒక ఎకరా భూమి తగాదా విషయమై బాధితుడు అయిన నరసింహరాజు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేశారు. 6 నెలల క్రితం కొన్న భూమిలో తాను జామచెట్లను నాటుతుండగా మండల టీడీపీ నాయకుడు శివరాంనాయుడు మరికొంత మందిని వెంటబెట్టుకొని తనపై, తన కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగి తమకు తోసేశారని పేర్కొన్నాడు. వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని నరసింహరాజు తన వారితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం దగ్గర పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. ‘మాకు బలం లేదు.. టీడీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నేతలు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. ఎస్పీనే మాకు న్యాయం చేయాలి’ అని వేడుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి బంధువుల స్థల వివాదం అధికార బలంతో అడ్డంగా దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులు జిల్లా ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు -
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : ఫిర్యాదులపై అలసత్వం లేకుండా బాధితులకు న్యాయం అందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ పర్యవేక్షించారు. ప్రతి ఫిర్యాదుదారుడితో ముఖాముఖి మాట్లాడి సమస్యల మూలాలను తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి రాలేని అర్జీదారులు సమీప పోలీస్స్టేషన్, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయంలో అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. పోలీసు అధికారులతో ఫోన్లో స్వయంగా మాట్లాడి, కీలక సూచనలు చేశశారు. ప్రజాసేవలో పోలీసులు నిరంతరం ముందుంటారని, ప్రజలు ధైర్యంగా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ పేర్కొన్నారు. హుండీ ఆదాయం లెక్కింపు సిద్దవటం : శ్రీ నిత్యపూజ స్వామి హుండీ ఆదాయం లెక్కించగా రూ.60,785 ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖ రాజంపేట ఇన్స్పెక్టర్ జనార్ధన్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ.శ్రీధర్లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను గ్రామస్తుల సమక్షంలో లెక్కించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది చంద్ర, వంతాటిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు మదనపల్లె సిటీ : ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి గడువును అక్టోబర్ 31వతేదీ వరకు పెంచినట్లు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పఠాన్ మహమ్మద్ఖాన్ తెలిపారు. రూ.200 అపరాధ రుసుంతో అవకాశం కల్పించారన్నారు. 14 సంవత్సరాలు వయస్సు నిండిన వారు పదోతరగతిలో, అలాగే 10వ తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందొచ్చన్నారు. ఓపెన్ స్కూల్ దారా ప్రవేశం పొందినవారు సెలవు దినాల్లో నిర్వహించే తరగతులకు హాజరుకావాలన్నారు.అడ్మిషన్ పొందిన వెంటనే అభ్యర్థులు పెట్టిన చిరునామాకు పాఠ్యపుస్తకాలు పంపబడుతాయన్నారు. పూర్తి వివరాలకు 8121852786 నంబర్లో సంప్రదించాలన్నారు. -
వైభవం.. బిందెసేవ గ్రామోత్సవం
రాజంపేట టౌన్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గ్రంధే సత్యనారాయణగుప్త ఆధ్వర్యంలో నిర్వహించిన బిందెసేవ గ్రామోత్సవ సంబరం అంబరమంటింది. అమ్మవారిశాల మాడవీధులతో పాటు పట్టణంలోని మెయిన్రోడ్డు, పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తి, జానపద గేయాలకు కళాకారులు ప్రదర్శించిన కోలాటం ప్రజలను అబ్బురపరిచింది. దారివెంబడి గుర్రం చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. అమ్మవారి బిందెసేవలో రాజంపేట పట్టణ వాసులే కాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. -
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం
నందలూరు : ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.అశోక్బాబు అన్నారు. సోమవారం నందలూరుకు చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు దళిత నాయకులు స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో అశోక్బాబును ఘనంగా సత్కరించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు అన్ని విధాలుగా నష్టపోతారన్నారు. కొందరి మాయమాటల మోజులో పడి కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడం అన్యాయం అన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే ఈ యాత్ర చేపట్టామన్నారు. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మోడపోతుల రాము, ఆర్ముగం విశ్వనాథ్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు పెనుబాల నాగసుబ్బయ్య, కాకి చంద్ర, నాయనపల్లి ఆదినారాయణ, తుమ్మది శివకుమార్, గుడిష సుబ్రమణ్యం, ఎముక దుర్గయ్య, శివనరసింహులు, సురేష్, నాగభూషణం, నాగరాజు, డిస్కో మని తదితరులు పాల్గొన్నారు. -
‘క్వారీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాం’
ఓబులవారిపల్లె : మంగంపేట జాతీయ రహదారి పక్కనే కంకరకు సంబంధించిన మైన్లో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ కారణంగా చాల రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని, పరిష్కరించాలని గోవిందంపల్లె గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ యామినిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవిందంపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ చాల సంవత్సరాలుగా గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా కంకర క్వారీలో పెద్ద ఎత్తున పనులు నిర్వహిస్తుండటంతో.. మైన్లో భారీ పేలుళ్ల వల్ల వెలువడుతున్న కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అనేక మంది రోగాల బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలో పనులు నిర్వహిస్తున్నరని, కాలుష్య నివారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అంతే కాకుండా జాతీయ రహదారి పక్కనే పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారని, దీంతో భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని రైతులు ఆన్లైన్కు సంబంధించి భూముల సమస్యలపై తహసీల్దార్కు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సిద్దేశ్వర్రావు, ఆర్ఐ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం గెలిచింది
● ఎంపీ మిథున్కు బెయిల్పై సంబరాలు ● కూటమి అక్రమ అరెస్ట్లకు భయపడమంటూ నినాదాలు మదనపల్లె : రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని జూలై 19న కూటమి ప్రభుత్వం మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసింది. 72 రోజులపాటు నిర్బంధించింది. బెయిల్ రాకుండా కుట్రలు, కుతంత్రాలు చేసింది. బెయిల్ కోసం న్యాయస్థానం ముందు పిటిషన్ వేస్తే.. అడ్డుకునేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్ వేసింది. అరెస్ట్ అయిన 62 రోజుల తర్వాత సిట్ కస్టడి కోరడం, దాని వెనక ఉద్దేశం ఇట్టే అర్థమవుతుంది. అక్రమ అరెస్ట్ నుంచి.. ఎన్నో వేధింపులు, ఇబ్బందులకు గురి చేసినా చివరకు న్యాయమే గెలిచింది. సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమ నేతను అక్రమ కేసులో నిర్బంధించి, వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు వార్త బయటకు రాగానే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్దిరెడ్డి కుటుంబ అభిమానులు, అనుచరులు, వైఎస్సార్సీపీప నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. మిథున్ రెడ్డి బ్యానర్లు చేతబట్టి.. జై జగన్, జై మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి, కక్షగట్టి వేధిస్తున్న చంద్రబాబుకు అధికార పతనం తప్పదు అంటూ హెచ్చరించారు. అక్రమ మద్యం కేసులో పసలేదు. ఎంపీగా మిథున్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రమేయం ఉండదు. మద్యం వ్యవహారంలో ఆయన పాత్ర లేదు. నిరూపించేందుకు కనీస ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ వేధించాలన్న లక్ష్యంతో అక్రమ కేసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం ద్వారా తప్పుడు కేసు అని నిరూపితమైంది. – దేశాయి తిప్పారెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే ఎంపీ మిథున్ రెడ్డి పై పెట్టిన మద్యం అక్రమ కేసు ముమ్మాటికీ తప్పుడు కేసే.సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేశారని మిథున్ రెడ్డి చెప్పడం అక్షరాలా నిజమైంది. వైఎస్సార్సీపీని బలహీనపర్చాలన్న టీడీపీ కుట్రలు సాగవు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ తప్పదు. – నిసార్ అహ్మద్, వైఎస్సార్సీపీ, మదనపల్లె సమన్వయకర్త -
‘హృదయాన్ని అద్దంలా..!
చూసుకో పదిలంగా..కడప రూరల్ : మానవ శరీరంలో అన్ని శరీర భాగాలు కీలకమే. ప్రధాన భాగమైన గుండె పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమెంది. ఏదైనా సంఘటనను తట్టుకొని నిలబడినప్పుడు వాడికి ‘గుండె నిబ్బరం’ ఎక్కువరా..! అంటారు. అంటే గుండె సంపూర్ణ ఆరోగ్యకంగా ఉందనడానికి నిదర్శనం. అది ఎప్పుడో 30ఏళ్ల మాట. ఇప్పుడు గుండె జబ్బులు సాధారణ వ్యాధుల్లా మారాయి. ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలియని విధంగా ఆరోగ్య పరిస్థితులు మారాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. ఉచిత వైద్యసేవ ద్వారా యేటా వేలాది మంది బైపాస్సర్జరీలు చేయించుకున్నారు. స్టంట్లు వేయించుకుని, ఎన్సీడీ కార్యక్రమాల ద్వారా గుండె జబ్బుగల వారికి వైద్య సేవలంన్నారు. ఆరోగ్యశ్రీకి రెఫర్ చేశారు. ఇలా పలు పథకాలు, నివేదికల ద్వారా గుండె వ్యాధుల తీవ్రతను తెలియపరుస్తోంది. జాగ్రత్తలతో హృదయాన్ని కాపాడుకుంటే పదికాలాలపాటు జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జీవనశైలి మార్పులతోనే 35 ఏళ్లకు ముందు ఏదైనా ఆహారం తినాలంటే నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, బఠానీలు, సంప్రదాయ పదార్థాలు లభించేవి. హోటళ్లలో కల్తీలేని ఆహార పదార్థాలు లభించేవి. నేడు ఆహారం విచ్చలవిడిగా లభిస్తూ మనిషి ప్రాణాల మీదకు తెస్తోంది. నూడుల్స్, బర్గర్లు, పిజ్జాల వంటి కార్పొరేట్ ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తోంది. అందులో కీలకమైనది గుండె. ఈ భాగంలో మార్పులు సంభవించడం, రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడంతో గుండె వ్యాధులు, హార్ట్ స్టోక్లు వస్తున్నాయి.గుండె నొప్పి లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఛాతీలో మంట.. కొద్దిగా నడిచినా అయాసం జీర్ణాశయం పైభాగాన నొప్పి ఎడమచేయి, రెండు చేతుల్లో నొప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకోవాలి. 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మంచి పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. కొవ్వు, నూనె, మసాల పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని జయించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి.నేడు ప్రపంచ గుండె దినోత్సవంయుక్త వయసులోనే ‘గుండె’ లయ తప్పుతోంది. ‘గుండె నొప్పి’ కారణంగా ఉన్న ఫలంగా కుప్ప కూలిపోతున్నారు.. ప్రాణాలు విడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో గుండెను పదిలంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక కథనం. -
మాదిగలను విభజించే హక్కు చంద్రబాబుకు లేదు
మదనపల్లె రూరల్ : మాల మాదిగలను విభజించే హక్కు చంద్రబాబుకు లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఆగస్టు 3వ తేదీన కుప్పం నుంచి మొదలైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఆదివారం అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చేరుకుంది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం ఆధ్వర్యంలో ఈ మహా పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. నిమ్మనపల్లె సర్కిల్ నుంచి ప్రారంభమైన యాత్ర మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి ఎస్సీలు రోడ్లపైకి రావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటుతో ఎస్సీ వర్గీకరణను తీసుకువచ్చి ఇపుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం అంటే 15 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి అనుభవించడం కాదని, మాదిగను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. అన్నదమ్ముల్లా ఉంటున్న దళితుల మధ్య లేనిపోని తగాదాలు పెట్టి, వారిని రోడ్లపైకి తీసుకువచ్చిన చంద్రబాబు వైఖరి తప్ప అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్ కాదని, డైరెక్షన్ ఇచ్చిందని, దాని ఆధారంగా దళితులను విభజించడం దుర్మార్గపు చర్య అన్నారు. చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆఽశయాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు తూట్లు పొడుస్తున్నారన్నారు. దళితులకు అన్యాయం చేసే ప్రభుత్వాలను కూల్చడంతోపాటు, వారిపై చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగంలో చట్టం తీసుకురావాలన్నారు. ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు, మాలమహానాడు రాష్ట్ర అఽధ్యక్షులు యమలాసుదర్శన్ మాట్లాడుతూ పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 15 శాతం నుంచి 20 శాతానికి పెంచాలన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని రద్దుచేయాలన్నారు. దళిత క్రిష్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప -
స్థలం విషయంలో ఘర్షణ
మదనపల్లె రూరల్ : స్థల విషయంలో జరిగిన ఘర్షణలో అక్క, తమ్ముడు గాయపడిన సంఘటన పట్టణంలో ఆదివారం జరిగింది. టీచర్స్ కాలనీకి చెందిన చిన్నప్ప కుమారుడు శివశంకర్(37) స్థానికం వారపుసంతలో కూరగాయల మండీ నిర్వహిస్తున్నాడు. ఇసుకనూతిపల్లెకు చెందిన అతడి అక్క ఇ.మంజుల(40) కొత్తిమీర వ్యాపారం చేస్తోంది. కొంతకాలంగా శివశంకర్, వారపుసంతలో మండీ నిర్వహిస్తున్న సయ్యద్ షావలి మధ్య స్థలం వివాదం ఉంది. ఆదివారం సయ్యద్ షావతి తన వద్ద పనిచేస్తున్న ఈశ్వరమ్మ కాలనీకి చెందిన యువకుడిని ప్రోత్సహించి శివశంకర్పై దాడికి ఉసి గొల్పాడు. దీంతో ఆ యువకుడు కొంతమందితో కలిసి శివశంకర్పై ఇనుపరాడ్తో దాడి చేస్తుండగా, అడ్డువచ్చిన అతడి సోదరి మంజులపై సైతం దాడిచేశాడు. దాడిలో అక్క, తమ్ముడు గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేయగా, విచారణ చేస్తున్నారు. -
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం
బ్రహ్మంగారిమఠం : విశ్వ బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఉద్యమిస్తామని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు అన్నారు. బ్రహ్మంగారిమఠంలోని విరాట్ విశ్వకర్మ భవన్లో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తెలంగాణ అడిషనల్ పోలీస్ కమిషనర్ కె.కిరణ్కుమార్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు ఐకమత్యంతో ముందుకు సాగితే రాజ్యాధికారంలో వాటా సాధ్యమని తెలిపారు. ఏపీ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం లీగల్సెల్ చైర్మన్ పేరుసోముల గురుప్రసాద్ ఆచారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాకుగానీ, కొత్తగా బద్వేలు జిల్లా ఏర్పడితే దానికి వీరబ్రహ్మేంద్రస్వామి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు జవ్వాది కూర్మాచార్యులు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు ప్రతి ఎన్నికల్లో ఎంపీ, రెండు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇ.వెంకటాచారి మాట్లాడుతూ తిరుమలలో వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, వసతిగృహం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని టీటీడీ కోరింది. విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి మాట్లాడుతూ మంగళ సూత్రం తయారీ హక్కుదారులుగా విశ్వబ్రాహ్మణ, స్వర్ణకారులకు వీలు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దార్ల పాపయ్య, విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు అంగలకుదిటి సుశీల, తాళభద్ర వాసవి, నాగార్జున, తుంపాల వెంకటేశ్వర్లు, లక్కోజు సుజాత, వినుకొండ సుబ్బారావు, శ్రీనివాస ఆచారి, దశరథ ఆచారి, రంగాచారి, అప్పలస్వామి, శేషగిరి రావు, శేష బ్రహ్మ ఆచారి, చిలకపాటి మధుబాబు, మోడపల్లె నాగు, రామకృష్ణ ఆచారి, పద్మావతి, సాయి, శివ, ఫణీంద్రకుమార్, వీరాచారి, పలు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు -
నీటికుంటలో పడి హిజ్రా మృతి
సంబేపల్లె : నీటికుంటలో పడి హిజ్రా శిరీష (20) ఆదివారం మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని బండకాడమాలపల్లెకు చెందిన హిజ్రా గ్రామ సమీపంలోని నీటికుంట వద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి మృతిచెందారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కట్టా పుట్టాలమ్మ గుడిలో చోరీఓబులవారిపల్లె : మండలంలోని మంగంపేట కట్టాపుట్టాలమ్మ గుడిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఉదయం గుడి తెరిచి చూడగా గుడిలో బీరువా, హుండీ పగలకొట్టి చీరలు, నగదు దొంగతనానికి పాల్పడ్డారు. జాతీయ రహదారి సమీపంలో కట్టా పుట్టాలమ్మ గుడి ఉండడంతో సీసీ కెమేరాలు ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేతనాలు విడుదల చేయాలికడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో కెజీబీవీ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి కోరారు. కడప సీపీఐ కార్యాలయంలో కేజీబీవీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 45 మంది మహిళా నాన్ టీచింగ్ స్టాఫ్కు 11 నెలల వేతనం ఇవ్వకపోవడంతో అర్ధకాలితో అలమటిస్తూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ దృష్టి కేంద్రీకరించి వేతనాల విడుదలకు కృషిచేయాలని కోరారు. లేని పక్షంలో విజయవాడ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామన్నారు. నిర్లక్ష్యం చేయకుండా వేతనాల విడుదలకు కృషిచేయాలని, లేకపోతే రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు అజిత, మౌనిక, నాగమణి, కృష్ణ, సునీత, తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయాలకు నెలవు
● తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ● పురాణేతిహాసాల్లో ఘట్టాలను వివరిస్తున్న వైనంబొమ్మల కొలువు కేవలం సరదా కాదు.. ఆ కొలువు మన సంప్రదాయాలకు నెలవు. వందల ఏళ్లుగా ఆ కొలువు నిర్వహిస్తున్న వారికి ఈ విషయం తెలిసి ఉంటుంది. ముందుతరం వారు ఏర్పాటుచేసిన బొమ్మల కొలువును జాగ్రత్తగా కాపాడుకుంటూ మన బొమ్మలను జతచేస్తూ.. తరం మారుతున్న కొద్దీ కొలువును మరింత అందంగా తయారు చేస్తారు. పాతకాలం నాటి బొమ్మలు నాటి కథాకాలక్షేపాలకు ఆచార వ్యవహారాలకు సాక్షిగా ఉంటాయి. మదనపల్లె సిటీ : దసరా అంటేనే సందడి. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇందులో బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యువతకు బొమ్మల కొలువు అంటే కొత్తమాటలా అనిపిస్తున్నా నేటికీ కొన్ని కుటుంబాలు కొలువులు ఏర్పాటు చేస్తూ తరతరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. దసరా ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు ఇళ్లల్లో బొమ్మల కొలువులు ఏర్పాటుచేస్తారు. ఇంట్లో ప్రత్యేక గదిని కేటాయించి బొమ్మలు పేర్చడం కష్టంతో కూడుకున్న పనే అయినప్పటికీ ఇష్టంగా చేస్తుంటారు. తొమ్మిదిమెట్లు ఏర్పాటు చేసి సంప్రదాయబద్ధంగా కొలువుదీర్చుతారు. మట్టి కొయ్య, పింగాణి, ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ బొమ్మలు ఆకర్షణగా నిలుస్తాయి. భద్రపరచడం కష్టమే.. బొమ్మల కొలువు పూర్తయ్యాక వాటిని భద్రపడం కీలకమని చెబుతున్నారు నిర్వాహకులు. దీనికి ఎంతో ఓపిక, సహనం ఉండాలంటున్నారు. మళ్లీ బొమ్మల కొలువు వచ్చే వరకు వాటి రంగులు ఊడిపోకుండా వాటిని జాగ్రత్తగా పెట్టెల్లో కాపాడుకుంటామని వారు వివరించారు. దుర్గాదేవితో పాటు రాముడు, కృష్ణుడు, వినాయకుడు, లక్ష్మి, సరస్వతీ, పెళ్లితంతు, జంతువులు, పక్షులు, పండ్లు, చెట్లు, ఆకులు,పురాతన కట్టడాలు, ప్రయాణ సాధనాలు, వాహనాల.. ఇలా రకరకాల బొమ్మలు ఈ కొలువులో కనువిందు చేస్తుంటాయి. వాటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. -
పనిగంటల పెంపు నిర్ణయం రద్దు చేయాలి
రాయచోటి జగదాంబసెంటర్ : కార్మిక శ్రమను దోచే పని గంటలను తక్షణమే రద్దుచేయాలని, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ.నాగేశ్వరరావు అన్నారు. రాయచోటి ఎన్జీఓ హోంలో సీఐటీయూ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పని గంటల పెంపు నిర్ణయం మరణశాసనంగా మారుతుందని, మూడు షిప్టులు, రెండు షిప్టులుగా మారడంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉపాధి పోతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సర్వేలో కార్మికులలో హృద్రోగ మరణాలు పెరుగుతున్నాయని, సుదీర్ఘ పనిగంటలతో మానసిక మస్యలు పెరుగు తాయన్నారు. కార్మికుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో ఛిన్నాభిన్నం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని విధానం ఉన్నప్పుడే అనేక పరిశ్రమల్లో 12 గంటలు పనిచేయించడం జరిగిందని, ఇపుడు కార్మికులతో 14, 16 గంటలు పని చేయించుకుని బానిసలుగా మారుస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయకపోతే కార్మికులు, ఉద్యోగులు పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. 12వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. లేబర్ కోడ్స్ రద్దు కొరకు దీర్ఘకాలిక ఐక్య పోరాటాలు చేయడానికి సీఐటీయూ కీలకపాత్ర పోషిస్తోదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎ.రామాంజులు, హరిశర్మ, డి.భాగ్యలక్ష్మి, మెహరున్నీసా, వెంకట్రామయ్య, ఓబులమ్మ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ.నాగేశ్వరరావు -
ఆదిపత్యం.. అభివృద్ధికి ఆటంకం
జమ్మలమడుగు: ఇద్దరు నేతల మధ్య ఆదిపత్య పోరుతో గండికోట అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఒకరేమో అనకాపల్లి ఎంపీ రమేష్నాయుడు, మరొకరు స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాస్కి నిధుల కింద వైఎస్సార్ జిల్లాలోని గండికోట అభివృద్ధికి 78 కోట్ల రూపాయలు కేటాయించారు. టెండర్ను రిత్విక్ కంపెనీ లెస్కు దక్కించుకుంది. దీంతో మొదటి విడతగా 50 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని సంప్రదించకుండా పనులు చేపట్టడంతో స్థానిక నాయకులు గుర్రుగా ఉన్నారు. సబ్కాంట్రాక్ట్ కింద ఇతర జిల్లాలకు చెందిన వారికి పనులు ఇచ్చారంటూ గండికోట వాసులు, స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా అడ్డంకులే... సాస్కి పథకం కింద గండికోటలో రహదారులు, బోటు షికారు, వసతుల కల్పన తదితర పనులు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నుంచి రిత్విక్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని స్థానికులు పనులను అడ్డుకున్నారు. దీంతో కంపెనీ యాజమాన్యం రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల పహారాలో పనులు చేపట్టారు. అయినా రెండో సారి పనులను అడ్డుకున్నారు. దీంతో ఈ పంచాయితి కలెక్టర్ వద్దకు వెళ్లినట్లు తెలిసింది. కలెక్టర్ కూడా స్థానికులకే పనులు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని రమేష్నాయుడు, సురేష్నాయుడు వ్యతిరేకించారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నెల్లూరు ప్రాంత వాసులతో చేయించుకుంటారా అని బీజేపీ, టీడీపీ నాయకులు కంపెనీ కార్యాలయంపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 22వ తేదీ జరిగిన దాడి తర్వాత గండికోటలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దీంతో గండికోటలో అభివృద్ధి జరుగుతుందా.. లేక ఆగిపోతుందా అనే సందేహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన రూ.50 కోట్ల పనులు -
పెన్షన్.. టెన్షన్!
మదనపల్లె: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన కార్యాచరణలో భాగంగా అక్టోబర్ ఒకటిన జరగాల్సిన సామాజిక పింఛన్ల పంపిణీ కోసం బ్యాంకుల నుంచి నగదు విత్డ్రాను నిరాకరిస్తూ ఎవరూ నగదు దగ్గర పెట్టుకోకూడదని నిర్ణయించారు. వచ్చే గురువారం పింఛన్ల పంపిణి జరగాలి. తెల్లవారుజాము నుంచే పింఛన్దారుల ఇళ్లవద్దకే వెళ్లి అందజేయాలి. అయితే సచివాలయ ఉద్యోగ సంఘాల జేఏసీలు అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా వాట్సప్ గ్రూపుల నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చారు. జిల్లాలో పింఛన్ల పంపిణీకి సోమవారం పోగా రెండురోజులు మిగిలి ఉంటాయి. ఈ రెండురోజుల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఆయా సచివాలయాల ఉద్యోగులు సన్నద్దం కావాలి. ఒకరోజు ముందుగా బ్యాంకులనుంచి న గదును విత్డ్రా చేసుకుని తమవద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకటిన తెల్లవారుజాము నుంచే పంపిణీ మొదలవ్వాలి. అయితే ఇప్పటిదాకా దీనిపై స్పష్టత లేకుండాపోయింది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయలేదు. జేఏసీ ప్రతినిధులతో చర్చించేందుకు నిర్ణయించగా వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టి యథావిధిగా పంపిణీ చేయిస్తుందా స్పష్టత లేదు. ఒకవేళ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తే..వీరికి ప్రత్యామ్నయంగా సంఘమిత్ర, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు అధికారులతో పింఛన్ల పంపిణీ చేయించే అవకాశం ఉందని జేఏసీ రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు. అక్టోబర్ ఒకటిన జిల్లాలోని 30 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లోని 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 4,029 మంది ఉద్యోగులు..జిల్లాలోని 2,17,657 మంది పెన్షన్దారులకు రూ.93.94 కోట్లు పంపిణి చేయాల్సి ఉంది. అక్టోబర్ ఒకటిన పింఛన్లు ఇవ్వమని సచివాయల జేఏసీ అల్టిమేటం జిల్లాలో 2,17,657 మందికి రూ.93.94 కోట్ల పంపిణీ జరగాలి ప్రత్యామ్నయంపై దృష్టి పెట్టని ప్రభుత్వం -
శభాష్.. అసద్
రాయచోటి జగదాంబసెంటర్: రెడ్ టెన్నిస్ బాల్ అండర్ –19 జాతీయ క్రికెట్ జట్టుకు రాయచోటికి చెందిన అసద్ ఎంపికయ్యాడు. శనివారం ఉత్తరాఖండ్లో జాతీయ స్థాయి టోర్నీలో అసద్ తెలంగాణ జట్టు తరపున పాల్గొని, జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించినట్టు కుటుంబసభ్యులు ఇక్కడి విలేకరులకు తెలియజేశారు. దీంతో అసద్ జాతీయ జట్టుకు ఎంపికై వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే మ్యాచ్లో పాల్గొంటారన్నారు. కాగా అసద్ రాయచోటిలోని నిదా టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అసద్ జాతీయ జట్టుకు ఎంపికవ్వడం పట్ల స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
పండగ వేళ.. ఇల్లు జాగ్రత్త
రాయచోటి : దసరా పండగ సెలవులు వచ్చాయని ఊళ్లకు వెళ్లే సందర్భంలో ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలని ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ఓ ప్రకటనలో సూచించారు. ఇంటికి తాళం కనిపించినపుడే దొంగలు గుర్తిస్తారని ఎస్పీ హెచ్చరించారు. తలుపులకు తాళం సరిగా వేయకపోవడం, బయట తాళం వేసి వెళ్లిపోవడం, విలువైన వస్తువులు ఇంట్లో వదిలేయడం చేస్తే దొంగలకు ఆహ్వానం పలికినట్లే అన్నారు. ఇంట్లో సీసీ కెమేరాలు, అలారం, సెన్సార్ లైట్లు అమర్చాలన్నారు. ఊరిలో పరిచయం లేని వ్యక్తులు తిరుగుతుంటే జాగ్రత్తగా గమనించాలని సూచించారు. మీరు ఇంట్లో లేనప్పుడు ఆ వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. నమ్మకమైన వారికి మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి -
జాక్పాట్ పేరుతో మోసం
గుర్రంకొండ : జాక్పాట్ పేరుతో తమను దగా చేస్తున్నారని మార్కెటింగ్ శాఖ అధికారులకు టమాట రైతులు శనివారం ఫిర్యాదు చేశారు. వారం రోజుల కిందట మార్కెట్ యార్డులో జరిగే అన్యాయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాయచోటి మార్కెటింగ్ శాఖ ఏడీఏ త్యాగరాజు గుర్రంకొండ యార్డులో విచారణ చేపట్టారు. పలువురు రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జాక్పాట్ పేరుతో వందకు పది నుంచి 12 క్రీట్ల టమాటాలను బలవంతంగా తీసుకొంటున్నారని పేర్కొన్నారు. దానికితోడు టమాటాలను క్రీట్లపై రాశులుగా పోస్తున్నారని, కమీషన్లు పది శాతం తీసుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. వేలం పాట పాడుకొనే ధరల కంటే క్రీట్పై రూ.50 నుంచి రూ.70 వరకు కోత విధిస్తున్నారని వాపోయారు. 25 కిలోల క్రీట్లకు బదులుగా 15 కిలోల క్రీట్లు మండీల్లో ఏర్పాటు చేస్తామని వ్యాపారులు చెబుతున్న మాటలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయని ఆరోపించారు. సమస్యలపై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే వారే కరువయ్యారని రైతులు పేర్కొన్నారు. అనంతరం రైతుల వద్ద లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఏడీఏ స్వీకరించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిఫురం మార్కెట్ కమిటీ కార్యదర్శి కుమార్రెడ్డి, సిబ్బంది. రైతులు పాల్గొన్నారు. -
సాఫ్ట్ట్బాల్ జిల్లా జట్టు ఎంపిక
పుల్లంపేట : స్థానిక మోడల్ స్కూల్ క్రీడా మైదానంలో కడప జిల్లా సబ్ జూనియర్ బాలబాలికలు, సీనియర్ పురుషుల సాఫ్ట్ బాల్ జట్లను శనివారం ఎంపిక చేసినట్లు రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సభ్యులు ఎస్పి.రమణ, నరసింహారెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ అక్టోబర్ 3, 4, 5వ తేదీలలో విశాఖపట్టణంలో జరిగే సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొనే ఉమ్మడి కడప జిల్లా జూనియర్ బాల, బాలికల జట్టును, నవంబర్లో జరిగే సీనియర్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు పురుషుల జట్టును ఎంపిక చేశామన్నారు. ఒక్కో జట్టులో పదహారు మంది సభ్యులు ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో ఆల్పామైరెన్ అధినేత సుధాకర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లీలాశ్రీహరి, ఫిజికల్ డైరెక్టర్ నీలకంఠరావు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో అందరికీ ప్రయోజనం రాయచోటి టౌన్ : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో సాధారణ ప్రజలందరికీ ప్రయోజనం ఉందని అన్నమయ్య జిల్లా డీఎంఅండ్హెచ్వో డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. వైద్య సిబ్బందితో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 25వతేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా శాఖల వారీగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జీఎస్టీపై అవగాహన, 30వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు వ్యవసాయం, ఉద్యానవనం, ఉపాధి హామీ కూలీలకు అవగాహన, 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మానవ వనరులు, విద్య, ఆరోగ్యం, అభివృద్ధి సాధికారితలపై అవగాహన, 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ వికాస్ విశ్వాస ర్యాలీలు, సమావేశాలు, క్విజ్ పోటీలు, సెమినార్లు, వివిధ రకాల పోటీల నిర్వహణ, 19నుంచి మండల, జిల్లా స్థాయి దీపావళి సంబరాలు ఉంటాయని తెలిపారు. టీకాతో ప్రాణాంతక వ్యాధులు నయం – జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు సిద్దవటం : ప్రాణాంతకమైన వ్యాధులను టీకాతో నయం చేయవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్యఖాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. మండలంలోని పొన్నవోలు కొత్తపల్లి పీహెచ్సీలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గర్భిణులకు పోషకాహారం అందించామని, చిన్నపిల్లలకు టీకాలు వేయించి, వృద్ధులకు మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సోకితే భయపడవద్దన్నారు. అనంతరం స్వచ్ఛ నారీ సశక్త్ పరివార్ గురించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ జె.ప్రవీణ్కుమార్, వైద్యాధికారిణి పి.రంగలక్ష్మి, పి.సందీప్, హర్షిత, కల్పన, మంజుల, సూర్యప్రకాష్, యూనస్, లక్ష్మీనరసమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
తక్షణ చికిత్సతోనే ప్రాణాలకు రక్షణ
కుక్క కరిచిన ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకుని సరిపెట్టుకునే వాళ్లుంటారు. కానీ పెంపుడు కుక్క, వీధి కుక్క... ఏది కరిచినా రేబీస్ రాకుండా ఇంజెక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. కుక్క కరిచిన వెంటనే వైద్యుడిని సంప్రదించి టీకా వేయించుకుంటే రేబిస్ బారినుంచి తప్పించుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. 28న రేబిస్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. రాజంపేట టౌన్ : రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి కుక్క కాటు కేసులో ఏటా పెరుగుతున్నాయి. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు 10,104 మంది కుక్క కాటుకు గురై చికిత్స తీసుకున్నారు. ఏటా సెప్టెంబర్ 28న రేబిస్ వ్యాధి నివారణ దినం నిర్వహిస్తూ.. ప్రభుత్వం కుక్క కాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే వీధి కుక్కల బెడద ఇటీవల పెరగడంతో పలువురు కుక్క కాటుకు గురవుతున్నారు. ప్రాథమిక ఆస్పత్రుల్లో సకాలంలో మందులు లేకపోవడంతో వేల రూపాయలు బయట ఆస్పత్రులకు ఖర్చు చేస్తున్నారు. వీధి కుక్కలను తరలించడంలో మున్సిపాల్టీ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో ఏటా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి ఎలా వస్తుంది గబ్బిలాలు, పిల్లులు, నక్కలు, కోతి లాలాజలంలో రేబిస్ ఉంటుంది. అవి కరచినా, వాటి లాలాజలం శరీరభాగాల్లోని ద్రవాల్లోనూ, గాయాల పైనా పడినా ప్రాణాంతకరమైన రేబిస్ వ్యాధికి దారి తీస్తుంది. రేబిస్ వైరస్ సోకిన కుక్క కరిస్తే తొలుత కండరాలకు, అనంతరం శ్వాసకోశ నాళాలకు వైరస్ సోకుతుంది.. చలాకీగా కదిలే కుక్క అకస్మాత్తుగా నీరసించడం, ఒంటరిగా ఉండిపోవడం, నోటి నుంచి సొంగ కారడం, నీటికి దూరంగా ఉండడం, గుండ్రంగా తిరుగుతూ ఉండడం వంటి లక్షణాలు కనిపించిన కుక్కకు దూరంగా ఉండాలి. వాటికి ఆహారం తినిపించడం, ఆడుకోవడం చేయరాదు. కుక్క కరిస్తే కనిపించే లక్షణాలు కుక్క కరచిన మనిషికి ఆకలి తగ్గడం, తల తిరగడం, జ్వరం రావడం, నీరు చూసినా భయపడడం వంటి లక్షణాలుంటాయని తెలిపారు. కుక్కలకు సోకే రేబీస్ వైరస్ శరీరంలో దీర్ఘకాలం పాటు ఉండిపోతుంది. కుక్క ప్రాణాలు కోల్పోయేలోపు ఎంతమందిని కరిస్తే అంతమందికీ రేబీస్ వైరస్ సోకుతుంది. కుక్క గోళ్లు గీసుకున్నప్పుడు వెంటనే సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొరికినప్పుడు పన్ను లోపలకు దిగి రక్తం కారితే ఆ ప్రదేశంలో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి, రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాధి బాగా ముదిరితే మనిషి కుక్కలా ప్రవర్తిస్తారు. కోమాలోకి వెళ్లి శ్వాస ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. ఏ కుక్క కరిచినా.. కుక్క కరిచినప్పుడు, ఎంత లోతుగా కరిచింది అనే దాని మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది. కుక్క గోళ్లతో గోకడాన్ని గ్రేడ్ ఎగా, కొరికినప్పుడు పంటిగాటు ఏర్పడితే ఆ గాయాన్ని గ్రేడ్ బిగా, పంటిగాటుతోపాటు రక్తస్రావమైతే గ్రేడ్ సిగా పరిగణించాలి. ఈ గాయాలకు రేబిక్యూర్ వ్యాక్సిన్తో పాటు, రేబీస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ టీకా ఇవ్వాల్సి ఉంటుంది. కుక్కకు ఎలాంటి టీకాలు ఇప్పించకపోయినా, అది వీధికుక్క అయినా, పెంపుడు కుక్క అయినా రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. సాధారణంగా చాలామంది వీధిలో రోజూ కనిపించే కుక్క, దానికేం కాలేదు కాబట్టి మాక్కూడా ఏం జరగదు అని చికిత్సను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అది ఎలాంటి కుక్క అయినా, ఎలాంటి లక్షణాలు లేకున్నా కరచిన వెంటనే తప్పనిసరిగా వైద్యులను కలిసి ఇంజెక్షన్లు తీసుకోవాలి. పెంపుడు కుక్కల నుంచి కుటుంబ సభ్యులకు వ్యాధులు సోకుతాయి కాబట్టి వాటికి తప్పనిసరిగా యాంటీ రేబీస్సతో పాటు లెప్టోస్పైరోసిస్ లాంటి ఇతరత్రా వ్యాధుల టీకాలు వేయించాలి. డోసులు ఇలా.. పెంపుడు కుక్క : యాంటీ రేబీస్ టీకాలు ఇప్పించిన పెంపుడు కుక్క కరిచినప్పుడు మూడు డోసుల యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, ఏడవ రోజు 21 రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి. వీధి కుక్క : ఈ కుక్క కరిచినప్పుడు ఐదు డోసుల యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, మూడో రోజు, ఏడవ రోజు, 14వ రోజు, 27వ రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి. 90వ రోజున బూస్టర్ డోసు తీసుకోవాలి. నేడు రేబిస్ వ్యాధి నివారణ దినం కుక్క కరిచిన వెంటనే ఆ భాగంలో కుళాయి నీటితో పది నిమిషాలపాటు శుభ్రంగా కడగాలి. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించుకోవాలి. వైద్యులు లేకుంటే మెడికల్ స్టోర్స్లో లభించే అయోడిన్, సేవ్లాన్ వంటి యాంటిసెప్టిక్ లోషన్లు రాయాలి. గాయం అయితే వైద్యుడిని సంప్రదించి రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ టీకా వేయించుకోవాలి. బయట ఇంజెక్షన్ కొనాలంటే రూ.3వేలు అవుతుందని, ప్రభుత్వఆస్పత్రిలో ఉచితంగా వేస్తారు. – డాక్టర్ పాలనేని వెంకటనాగేశ్వరరాజు, సూపరింటెడెంట్, రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి -
అక్రమాలకు చరమగీతం పలికే ఆయుధం డిజిటల్ బుక్
● వైఎస్.జగన్ నేతృత్వంలో న్యాయ యుద్ధానికి శ్రీకారం ● ప్రతి కార్యకర్త మొబైల్లో డిజిటల్ బుక్ యాప్ ఉండాలి ● వైఎస్సార్సీపీ నాయకుల పిలుపు రాయచోటి : అన్యాయాలు, అక్రమాలకు చరమ గీతం పలికే ఆయుధంగా డిజిటల్ బుక్ ఉంటుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్కుమార్రెడ్డి అన్నారు. రాయచోటి వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జగనమోహన్రెడ్డి ఆదేశాలకు డిజిటల్ బుక్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాజకీయ వేదింపులపై న్యాయపోరాటం సాగించేందుకు డిజిటల్ బుక్ ఆయుధంగా పనిచేస్తుందన్నారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఛీజీజజ్ట్చీఛౌౌజు. ఠ్ఛీడటటఛిఞ. ఛిౌఝ, లోగానీ లేదా ఐవీఆర్ఎస్ ఫోన్ నెంబరు 040–49171718 ద్వారా కార్యకర్తలు తమకు జరిగే అన్యాయాలు, రాజకీయ దాడుల వివరాల ఫొటోలు, ఆధారాలతో సహా అప్లోడ్ చేయాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కుట్ర చేసిన వారిని శిక్షిస్తామని పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చారన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన పూర్తిస్థాయి అక్రమాలకు, అరాచకాలకు నిలయంగా మారిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని, వ్యాపారులు కప్పం కట్టాలంటూ బెదిరించడం, వినకపోతే దాడులకు పాల్పడడం దారుణమన్నారు. సామాజిక మాధ్యమ కార్యకర్తపై నమోదైన కేసును సీబీఐ దర్యాప్తుకు చేరుకోవడం అధికారుల ఏకపక్ష వైఖరికి బలాన్నిస్తోందన్నారు. అభిమాని తన మొబైల్లో డిజిటల్ బుక్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలను మానకపోతే కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 28న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, 29న మండల కేంద్రాలలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా అవహేళన చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి నెట్టుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫయాజుర్ రెహమాన్, కొలిమి హరూన్బాషా, బేపారి మహమ్మద్ఖాన్, పల్లపు రమేష్, శ్రీనివాసులురెడ్డి, రియాజుర్ రెహమాన్, సాధిక్అలీ, షబ్బీర్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్, విజయభాస్కర్, అంజనప్ప, ఖలీల్, బేపారి అసద్, కొత్తపల్లి ఇంతియా, పైరోజ్, బేపారిజబీఉల్లాఖాన్, బుజ్జిబాబు, అశోక్, తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న శ్రీకాంత్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, రమేష్కుమార్రెడ్డి, తదితరులు -
వీరభద్రస్వామికి వెండి గద బహూకరణ
రాయచోటి టౌన్: రాయచోటి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి కర్నాటకలోని ధార్వాడ్ గ్రామానికి చెందిన ప్రవీణ్ చాడిచాల్ వెండి గదను బహూకరించారు. శనివారం ఆలయ ఈవో డీవీ రమణారెడ్డికి దీనిని అందజేశారు. గద విలువ రూ. 50నుంచి రూ. 55 వేలు ఉంటుందని, దీనికి సంబంధించిన రసీదును అందజేసినట్లు ఈవో తెలిపారు. దాత పేరున స్వామి, అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని మూల విరాట్కు అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. రాజంపేట టౌన్: ఇప్పటికే ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు, ప్రజలు తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు ప యనం అవుతున్నారు. దీంతో అన్ని మార్గాల్లో తిరిగే బస్సులు కిక్కిరిస్తున్నాయి. ఇదిలావుంటే శనివారం రాజంపేట పాతబస్టాండు ప్రయా ణికులతో కిటకిటలాడింది. బస్సుల్లో సీట్లు దొ రకక ఇబ్బందులు పడ్డారు. చాలామంది బస్సుకు ఎదురెళ్లి కిటికీల నుంచి సీట్లు పెట్టుకునేందుకు పోటీపడ్డారు. దసరా ముందు రోజు వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆర్టీసీ ఉన్నతాధికారులు అదనపు సర్వీసులు నడపాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉమ్మడి కడప జిల్లా కళలకు కాణాచి
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి కడపజిల్లా కళలకు కాణాచి అని సంస్కృతి, సంప్రదాయాలకు, ఆత్మీయతకు పెట్టింది పేరని జిల్లా విద్యాశాఖా ధికారి షంషుద్దీన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సభాభవనంలో రచయిత, ఉపాధ్యాయుడు గజ్జల వెంకటేశ్వర రెడ్డి రచించిన మన కడప–ఘన గడప పాటకు సంబంధించిన వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలోని ఆధ్యాత్మిక స్థలాలు, దర్శనీయస్థలాలు, నదులు, ఖనిజ సంపద, కవులు,ఆటలు తదితల అంశాను కూర్చి అద్భుతమైన పాటను రచించి,గానం చేసి వీడియోగా చిత్రీకరించిన వెంకటేశ్వర రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డీకే చదువులబాబు, ఏఎంఓ. వీరేంద్ర, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షు రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు బాలగంగి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఇలియాస్బాషా, ఎన్టీఏ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణంరాజు, లెక్కలవారి పల్లె ప్రధానోపాధ్యాయుడు నరసింహులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్, మహేష్ బాబు, వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు సజ్జల రమణారెడ్డి, ఆర్జేయూపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సైన్స్ ఉపాధ్యాయులు వేపరాల ఎబినేజర్, సైన్స్ మ్యూ జియం క్యూరేటర్ రెహ్మాన్ , కౌశల్ జిల్లా కో–ఆర్డినేటర్ విజయ మోహన్ రెడ్డి, సైన్స్ కో ఆర్డినేటర్ సుుబ్బానాయుడు పాల్గొన్నారు. -
ప్రయాణం.. ప్రమాదకరం
గుర్రంకొండ: మండలంలోని టి.పసలవాండ్లపల్లె గ్రామం..అదొక మారుమూల ప్రాంతం. ఇరువైపులా కొండలు.. మధ్యలో 20 గ్రామాలతో పంచాయతీ విస్తరించి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు మాండవీయ నది వంక ఉధృతంగా ప్రవహించడంతో టి.గొల్లపల్లె వద్ద ఉన్న బ్రిడ్జి కుప్పకూలిపోయింది. పిల్లవాండ్లపల్లె వద్ద ఉన్న మరో బ్రిడ్జి సగం వరకు దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. అప్పటి నుంచి 20 గ్రామాలకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు టి.గొల్లపల్లె వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జి స్థానంలో తాత్కలికంగా మట్టి, సిమెంట్ పైపులు వేసి రహదారిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిపై చిన్న ఆటోలు, ద్విచక్రవాహనాలు మాత్రమే అతికష్టం మీద వెళుతున్నాయి. ఏదైనా పెద్ద వాహనం వచ్చిందంటే తాత్కాలిక బ్రిడ్జి కుంగిపోతుంది. ఇప్పటికే బ్రిడ్జి పై రంధ్రాలు కూడా ఏర్పడటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు సగం దారి వరకు వచ్చి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. కాగా పదిహేను రోజుల నుంచి ఈ మార్గంలో బస్సు కూడా తిరగడంలేదు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ● రాయచోటి– అంగళ్లు జాతీయ రహదారికి పక్కనే కొండల మధ్య ఉన్న 20 గ్రామాలకు పదిహేను రోజులుగా బస్సు సర్వీసు నిలిపివేశారు. రాయచోటి నుంచి చిన్నమండ్యం, కేశాపురం, టి.పసలవాండ్లపల్లె మీదుగా కలిచెర్ల వరకు బస్సు సర్వీసు నడిపేవారు. ప్రతిరోజు 5 మార్లు బస్సు తిప్పేవారు. వివిధ పనుల మీద వందలాది మంది ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లేవారు. మాండవీయనది వంకపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో ఉన్న ఒక్క బస్సు సర్వీసు నిలిచిపోయింది. దీంతో అధిక డ బ్బులు చెల్లించి ఆటోల్లో కేశాపురానికి చేరుకుంటున్నారు.కలిచెర్ల నుంచి రాయచోటి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో అక్కడి ప్రజలు పెద్ద మండ్యం, గాలివీడుకు వెళ్లి రాయచోటికి చేరుకుంటున్నారు. పిల్లావాండ్లపల్లె హరిజనవాడ వద్ద ఉన్న సిమెంట్రోడ్డు దెబ్బతింది. దీనివల్ల కుమ్మరపల్లె, ఎగువ,దిగువ మొరంపల్లె,పిల్లావాండ్లపల్లె గ్రామాల ప్రజలు పంచాయతీకస్పా అయిన టి.పసలవాండ్లపల్లెకు చేరుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో 20 గ్రామాల ప్రజలకు ప్రమాదంపొంచి ఉంది. టి.గొల్లపల్లె వద్ద మాండవీయనదిపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి దెబ్బతిన్న బ్రిడ్జిపై వెళుతున్న వాహనాలు మాండవీయనది వంకపై కూలిపోయిన వంతెనలు 20 గ్రామాలకు రవాణా బంద్ -
జేఎన్టీయూలో యంత్ర 2025 జాతీయ సదస్సు
పులివెందుల టౌన్ : స్థానిక జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ విభాగంలో శుక్రవారం యంత్ర 2కె25 మూడు రోజుల విద్యార్థుల జాతీయ సదస్సును ఘనంగా ప్రారంభించారు. యూసీఐఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభాస్రంజన్, న్యూటెక్ బయోసైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ వసంత్కుమార్, విశాఖపట్టణం ఫోర్ట్ అథారిటీ గ్రేడ్–1 అసిస్టెంట్ సెక్రటరీ అజయ్తేజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి 500మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభాస్రంజన్ మాట్లాడుతూ మానవుడి జీవితంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), చాట్ జీపీటీ ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలు వివరించారు. అనంతరం విశిష్ట అతిథులు ఇంజినీరింగ్ ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి.విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపల్ ఎం.శేషమహేశ్వరమ్మ, మెకానికల్ విభాగాధిపతి ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అత్యుత్తమ పరిశోధకుల జాబితాలో ఎల్వీపీఈఐ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రతిష్టాత్మక 2025 స్టాన్ఫోర్డ్/ఎల్సెవియర్ టాప్–2 సైంటిస్ట్ జాబితా ప్రామాణిక సైటేషన్ మెట్రిక్స్ ఆధారంగా ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పరిశోధకుల జాబితా విడుదలైంది. ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (ఎల్వీపీఈఐ) మరోసారి ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శించిందని ఆ వైద్యశాల హెడ్ డాక్టర్ కావ్యమాధురి బెజ్జంకి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఏడుగురు ఎల్వీపీఈఐ అనుబంధ క్లినిషియన్ శాస్త్రవేత్తలు జీవితకాల ర్యాంకింగ్స్లోనూ, 15 మంది 2025 వార్షిక ర్యాంకింగ్స్లోనూ చోటు దక్కించుకున్నారని చెప్పారు. ఎల్వీపీఈఐ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లిఎన్.రావు భారతదేశంలోనే నేత్ర వైద్య రంగంలో జీవితకాల ర్యాంకింగ్లో రెండవ స్థానంలో నిలిచారన్నారు. ఆయతోపాటు మరో ఆరుగురు పరిశోధకులు సావిత్రిశర్మ, ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యన్ మహ్మద్ జావిద్ అలీ, ప్రశాంత్ గర్గ్, తారాప్రసాద్దాస్, స్వాతి ఉత్తమ ర్యాంకుల జాబితాలో ఉన్నారని చెప్పారు. 2025 సంవత్సరానికిగానూ 61 మంది భారతీయ నేత్ర వైద్య శాస్త్రవేత్తలు వార్షిక ర్యాంకింగ్స్లో స్థానం సంపాదించుకోగా మహ్మద్ జావిద్ అలీ, స్వాతి కలికి, సావిత్రి శర్మ, ప్రశాంత్ గర్గ్, సయన్ బసు, రోహిత్ ఖన్నా, గుళ్ళపల్లి ఎన్.రావు, స్వాతి సింగ్, తారాప్రసాద్ దాస్, ఎలిజబెత్ కీఫ్, వివేక్ సింగ్, పవన్ కుమార్ వెర్కిచర్ల, ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్, మిలింద్ నీలకంఠ నాయక్, సుభద్ర జలాలిలు జాబితాలో చోటు సంపాదించారని తెలిపారు. -
అధికారులు నిబద్ధతతో పని చేయాలి
తంబళ్లపల్లె: సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వివిధ అంశాలపై నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం సాయంత్రంలోపు అధికారులు తమ నియోజకవర్గ స్థాయి సమస్యలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేసి, స్పెషల్ ఆఫీసర్లకు తప్పనిసరిగా పంపాలన్నారు. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పైప్లైన్ ఎక్కడా డ్రైనేజీ లైన్తో కలిసిపోకుండా చూడాలన్నారు. అంతకుముందు మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి అమరనాథరెడ్డి, బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్ పల్లవి పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల చేకూరే లబ్ధిపై అవగాహన పెంచాలి రాయచోటి: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ద్వారా జీఎస్టీ తగ్గించడంవల్ల చేకూరే లబ్ధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.కలెక్టరేట్ నుంచి క లెక్టర్ నిశాంత్కుమార్, జేసీ ఆదర్శరాజేంద్రన్లు పాల్గొన్నా రు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ప్రజలకు చేకూరే లబ్ధిపై ఈ నెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు.జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
మిథున్రెడ్డి అరెస్ట్లో వేధింపులే లక్ష్యం
మదనపల్లె: సాక్ష్యాలులేని అక్రమ కేసుల్లో తనను అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం వేధించేందుకు సిద్ధమైందని మిథున్రెడ్డి ముందే పసిగట్టారు. తానొక ఎంపీని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో తన ప్రమేయం, సంబంధం ఉండదు, అయినా తనను లక్ష్యంగా చేసుకుని వేధించేందుకు సిద్దమయ్యారని మిథున్రెడ్డి స్పష్టంగా చెప్పినా, ఆరోపణలపై సాక్ష్యాలు చూపాలని కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన చెప్పినట్టే జూలై 19న సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం ఆయన కుమారుడిపై కుట్రలు పన్నుతోంది. ● పెద్దిరెడ్డి కుమారుడు మిథున్రెడ్డి చిన్న వయసులోనే రాజంపేట పార్లమెంట్ ఓటర్ల మనసును గెలుచుకుని వారికి దగ్గరయ్యారు. 2014లో తొలిసారి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరీని ఓడించి మిథున్రెడ్డికి అధిక మెజార్టీ ఇచ్చారు.ఇదికాక పెద్దిరెడ్డి తమ్ముడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డిని ఓడించాలని గత ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా ఓటర్లు ద్వారకనాధరెడ్డిని గెలిపించారు. మానసికంగా వేధించాలనే... కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డిని మానసికంగా వేధించే మార్గం ఎంచుకుంది. ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని మద్యం అక్రమ కేసులో జూలై 19న చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఇప్పటిదాకా బెయిలు రాకుండా మానసిక వేధింపులకు గురిచేస్తోంది. ● గత తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై కక్ష కట్టారు. 2014లో తొలిసారి రాజంపేట ఎంపీగా పోటీ చేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక.. అప్పుడే వేధింపులకు శ్రీకారం చుట్టారు. రేణిగుంట విమానాశ్రయంలో ఓ ఉద్యోగిపై దాడి చేసినట్టు అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలులేక న్యాయస్థానం కొట్టివేసిందని మిథున్ రెడ్డి ఓ సందర్భంలో వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే మిథున్రెడ్డి రాజకీయ ఎదుగుదల, ప్రజాబలం చూసి ఓర్వలేక పోతున్నట్టు అర్థమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసు నిరాధారమని తేలిపోవడంతో ఇప్పుడు మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసి వేధిస్తున్నారు. 62 రోజుల తర్వాత కస్టడీకి జూలై 19న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని మద్యం అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. తర్వాత విచారణ కోసం సిట్ కస్టడీని కోరవచ్చు. అయితే అరెస్ట్ చేసిన రెండునెలలకు కస్టడీ కోరిన సిట్కు రెండురోజుల విచారణకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అరెస్ట్ అయిన 62 రోజుల తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారించారు. సిట్ కస్టడీ కోరినప్పటికే మిథున్రెడ్డి తరపున న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలైంది. బెయిల్ను కస్టడీ ద్వారా అడ్డుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న భావన నెలకొంటోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డినిరాజకీయంగా ఎదుర్కోలేక కుమారుడిపై కుట్రలు, కుతంత్రాలు బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణనుఅడ్డుకునేలా కస్టడీ జూలై 19న అరెస్ట్..జైలు, కస్టడీ..రిమాండ్తో అటూఇటూ తిప్పుతున్నారు ‘నేను చెప్పేది ఒకటే..మేం ఇంట్లో పదిమంది ఉన్నాం. నన్ను అరెస్ట్ చేసినా పట్టించుకోను..దేనికై నా సిద్ధం. నన్ను చంపినా పర్వాలేదు. నా ఇంట్లో నా తమ్ముడో, మా అమ్మో వస్తుంది..కచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం. ప్రజలకు అండగా నియోజకవర్గంలో నిలబడతాం.’ –అరెస్ట్కు కొన్నాళ్ల ముందు ఎంపీ మిథున్రెడ్డి ‘గత టీడీపీ హయాంలో తప్పుడు కేసు పెట్టగా నిరూపణ కాకపోవడంతో కొట్టేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అరెస్ట్కు భయపడే ప్రసక్తేలేదు. రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఓ బెటర్ పర్సన్గా బయటకొస్తాను. మీకు సహకరిస్తాను, సాక్ష్యాలు చూపండంటే చూపలేదు.నోటిమాటతో ముఖ్యనేతలను టార్గెట్ చేసి అక్రమకేసులతో వేధిస్తున్నారు.’ –జూలై 19న అరెస్ట్కు ముందు ఎంపీ మిథున్రెడ్డి -
రూ.925 కోట్లతో హంద్రీ–నీవా పనులు
మదనపల్లె: జిల్లాలో హంద్రీ–నీవా ప్రధానకాలువ, నీవా ఉప కాలువల అసంపూర్తి పనులు, వాటికి కొత్త కాంక్రీట్ లైనింగ్ పనులు చేయించడం కోసం రూ.925 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మదనపల్లె సర్కిల్–3 ఎస్ఈ ఆర్.విఠల్ప్రసాద్ చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాసపురం, అడివిపల్లె రిజర్వాయర్లకు కృష్ణా జలాలను తరలించడం కోసం మిగిలిపోయిన పనులను పూర్తి చేయించాల్సి ఉందని చెప్పారు. దీనికోసం ప్రధాన కాలువ ప్యాకేజీ–1కు రూ.242.95 కోట్లు, ప్యాకేజీ–2కు రూ.177.81 కోట్లు, నీవా ఉప కాలువ అసంపూర్తి పనులు, లైనింగ్ కోసం మూడు ప్యాకేజీల్లో రూ.504.55 కోట్లతో పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కోరుతూ సీఈ ప్రభుత్వానికి నివేదించారని చెప్పారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలతో నింపుతున్నామని అన్నారు. కాలువలో ప్రవహిస్తున్న నీటిని రైతులు పైపుల ద్వారా, మోటార్లతో నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని అన్నారు. కాలువను తెగ్గొట్టడం, నీటిని మళ్లించుకోవడం లాంటి చర్యలు పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో జరుగుతోందన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అధికారికంగా ప్రణాళిక ప్రకారం నీటిని తరలిస్తామని చెప్పారు. ఎక్కడైనా కాలువను తెగ్గొడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్ఈ విఠల్ప్రసాద్ -
బాలకృష్ణా.. మెంటల్కు చికిత్స చేయించుకో..
– వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శి దండు గోపి రాజంపేట టౌన్ : 20 ఏళ్ల కిందట బాలకృష్ణకు మెంటల్ ఉందని వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారని, ఆయన సరైన చికిత్స చేయించుకోవడం లేదని.. దీంతో ఆయన పిచ్చి పీక్స్కు చేరిందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దండుగోపి ఎద్దేవా చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల కిందట అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలనుబట్టి రాష్ట్ర ప్రజలకు ఆయన వైఖరి స్పష్టంగా అర్థమైందన్నారు. బెల్లంకొండ సురేష్పై అతడు కాల్పులు జరిపినప్పుడు దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి దయచూపారని, లేకుంటే ఇప్పటికే జైల్లో చిప్పకూడు తినేవారంటూ ఆరోపించారు. ఇలాగే వదిలేస్తే అసెంబ్లీలో తోటి ఎమ్మెల్యేలు, మంత్రులపై చేయిచేసుకునే అవకాశం లేకపోలేదన్నారు. ప్రజాస్వామ్యంలో మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం చాలాముఖ్యమని టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా శివారెడ్డి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పోతుల శివారెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (కేంద్ర కార్యాలయం)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోతుల శివారెడ్డి చెన్నూరు మండలం ఓబులంపల్లెకు చెందిన నాయకుడు. గతంలో ఆయన ఐటీ విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందించారు. రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సుదర్శన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన జల్లా సుదర్శన్రెడ్డిని రాష్ట్ర లీగల్సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాయచోటి జగదాంబసెంటర్: రైతులు ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ పేర్కొన్నారు. రాయచోటిలోని డీపీఎం కార్యాలయంలో శుక్రవారం రైతు సామాజిక సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం –2005పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. సమాచార హక్కు చట్టం –2005 గురించి రైతులకు స్పష్టంగా తెలియజేశారు. డీపీఎం వెంకటమోహన్ పాల్గొన్నారు. రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రైతులు 4 వేల ఎకరాలలో పండ్ల తోటలను సాగు చేసినట్లు జిల్లా ఉపాధి హామీ పథక సంచాలకులు వెంకటరత్నం అన్నారు. శుక్రవారం రామాపురంలోని ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ నాలుగు వారాలకు సంబంధించిన బిల్లులు పది రోజుల్లో కూలీల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. అనంతరం చిట్లూరు గ్రామంలోని సప్లై ఛానల్ను, నల్లగుట్టపల్లి గ్రామంలో రైతులు వెంకటరమణ, వెంకటస్వామిలు సాగు చేసిన నిమ్మతోటలను ఆయన పరిశీలించారు. ఏపీఓ పెంచలయ్య, ఈసీ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
యర్రగుంట్ల మున్సిపాల్టీలో వార్డుల పెంపు
ఎర్రగుంట్ల : యర్రగుంట్ల పురపాలక సంఘం పరిధిలో మరో ఏడు వార్డులను పెంచేందుకు డీఎంఏ(డైరెక్ట్ మున్సిపాలిటీ ఆథారిటీ) ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ శేషఫణి, మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం మున్సిపాల్టీలో 20 వార్డులు ఉండగా, 32572 మంది నివసిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండవచ్చునని భావిస్తున్నామని తెలిపారు. ఇపుడు మున్సిపాలిటీలో ఏడు వార్డులు అదనంగా పెంచుతున్నట్లు ఉత్వర్వులు వచ్చాయని ఆయన తెలిపారు. ఎవరికై నా అభ్యర్థనలుంటే అక్టోబరు ఆరో తేదీలోగా మున్సిపాలిటీలో స్వీకరిస్తామని, 8వ తేదీలోగా పూర్తి నివేదిక కలెక్టర్కు పంపిస్తామని పేర్కొన్నారు. 10న డీఎంఏ (డెరెక్ట్ మున్సిపాలీటీ ఆథారిటి)కి పంపిస్తామని, 12న ప్రభుత్వానికి పంపగా, 14న జీవో విడుదల అవుతుందని తెలిపారు. యర్రగుంట్ల పురపాలక సంఘంలో 27 వార్డులు ఏర్పాటుకానున్నాయని, ఓటరు శాతం ప్రకారం ఒక్కో వార్డుకు 850కి తక్కువ కాకుండా విభజించాల్సి ఉంటుందని తెలిపారు. వార్డుల విభజనపై టీఎంపీ విభాగం కసరత్తు ప్రారంభించారని, 1 నుంచి 20వ వార్డు వరకు అన్నింటినీ పరిశీలించి విభజిస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి 27 వార్డులు -
జయశుభకారిణి..విజయరూపిణి
మదనపల్లెసిటీ: మహాలక్ష్మి అలంకారంలో శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి రాజంపేట టౌన్ః మోహినీదేవిగా వాసవీమాత శరన్నవరత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది.విద్యుద్దీపాలంకరణలతో అమ్మవారి ఆలయాలు వెలుగులీనుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. జయములీవు జగజ్జననని అంటూ వేడుకున్నారు. –సాక్షి నెట్వర్క్ -
గుట్టల్లో పారబోసిన షూలు స్వాధీనం
పెద్దతిప్పసముద్రం: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మంజూరైన షూలను మండల కేంద్రానికి సమీపంలోని బోడిగుట్ట వెనుక వైపున వ్యవసాయ పొలాల్లో గుట్టల నడుమ పారబోశారు. ఈ విషయంపై శుక్రవారం ‘సాక్షి’లొ ప్రచురితమైన ‘గుట్టల్లో గుట్టుగా విద్యార్థుల షూ’లు వార్తపై జిల్లా కలెక్టర్ స్పందించారు. పారబోసిన షూలను స్వాధీనం చేసుకుని సమగ్రంగా విచారణ చేయాలని డీఈఓ కె.సుబ్రమణ్యంకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డీఈఓ నేతృత్వంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి (సీఎంవో) కరుణాకర్, స్థానిక ఎంఈఓ గౌస్పీర్,సీఆర్పీ నాగరాజుతో కలిసి షూలను గుట్టల నడుమ పారబోసిన స్థలాన్ని పరిశీలించారు. షూలను స్వాధీనం చేసుకుని మండల కేంద్రంలోని స్టాక్ పాయింట్లో భద్రపరిచారు. వీటిని ఎవరు పారబోశారనే విషయంపై సమగ్రంగా విచారణ చేపట్టి కలెక్టర్కు నివేదిక అందజేస్తామని సీఎంవో వెల్లడించారు. -
చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
రాయచోటి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి, హీరో చిరంజీవిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటి వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పడంతోపాటు బాలకృష్ణతోనూ క్షమాపణ చెప్పించాలన్నారు. రాష్ట్ర ప్రజలను అవమానించేలా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల తీరు కొనసాగుతోందని, కక్షపూరిత రాజకీయాలు చేయను అని చెబుతూనే తమ పార్టీ నాయకులకు వెనుక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దాడులు, బ్రిటీష్ తుగ్లక్ పాలనను మించి జరుగుతున్నాయన్నారు. హోమంత్రి, డిప్యూటీ స్వీకర్లు హద్దుమీరి మాట్లాడుతుండటం దారుణమన్నారు. తెలుగుదేశం మంత్రులు వ్యక్తిగతంగా దూషిస్తూ అసభ్య పదజాలతో రెచ్చిపోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. చిత్ర పరిశ్రమలో చిరంజీవితో పోటీపడలేక అక్కసు వెళ్లగక్కుతూ బాలకృష్ణ శాసనసభకు మచ్చతెచ్చారన్నారు. నాలుగేళ్ల కిందట అలాగా జనం, అలగా నా కొడుకు, సంకరజాతి వాడంటూ మాట్లాడిన బాలకృష్ణ ఇంకా తన తీరు మార్చుకోలేదన్నారు. ఎన్టీరామారావు కుమారుడు అని మరచిపోయి అసెంబ్లీలో ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. తన గన్నుతో ఒక మనిషిని కాల్చి చంపడానికి ప్రయత్నించిన బాలకృష్ణ సైకో కాదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మెంటల్ సర్టిఫికెట్ తీసుకున్న బాలకృష్ణ స్వయం కృషితో ఎదిగిన చిరంజీవిని ఇంత ఘోరంగా అవమానిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. అనేక సందర్భాలలో మహిళలను అవహేళన చేస్తున్నా.. రామారావు కుమారుడున్న కారణంగానే బాలకృష్ణను అందరూ గౌరవిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
తప్పిన పెను ప్రమాదం
డ్రైనేజీలో నుంచి ఎగిసి పడుతున్న మంటలు, ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఎర్రగుంట్ల : పట్టణంలోని ముద్దనూరు రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ఆపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల వివరాల మేరకు.. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో హెచ్పీ పెట్రోల్ బంకులోని ట్యాంక్లోకి నీరు చేరింది. దీంతో వాహన దారులకు పెట్రోల్, డిజీల్ వేయలేదు. ఆయిల్ ట్యాంక్కు లీకులు ఉండడడంతో పెట్రోల్, డీజిల్ సమీపంలోని డ్రైనేజీ నీటిలో కలిసిపోయింది. దీంతో బంకు నిర్వాహకులు ట్యాంక్ చుట్టూ ఉన్న నీటిని తోడే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఒక్కసారిగా డ్రైనేజీ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. సిమెంటు దిమ్మెలు పెద్ద శబ్ధంతో ఒకపక్క పగిలిపోతుండగా.. మరోవైపు మంటలు వ్యాపించి పొగ కమ్మేసింది. స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. సీఐ విశ్వనాథరెడ్డి చేరుకుని బంకు సిబ్బందితో మాట్లాడి మంటలు అర్పే ప్రయత్నం చేయించారు. అనంతరం ప్రొద్దుటూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి డ్రైనేజీలలో ఆయిల్ను తొలగించడానికి కెమికల్ వాడారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
పులివెందుల టౌన్ : విద్యార్థులు సృజనాత్మకతతో జాతీయస్థాయిలో సత్తా చాటాలని ఆర్డీఓ చిన్నయ్య అన్నారు. స్థానిక న్యాక్ బిల్డింగ్ సమీపంలో న్యూఢిల్లీ యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శుక్రవారం ప్రారంభించారు. ఆర్డీఓ చిన్నయ్య మాట్లాడుతూ యుఎస్ఓ లాంటి ఎన్జీవో సంస్థలు దేశవ్యాప్తంగా విద్యార్థి సమగ్ర సంపూర్ణ వ్యక్తిత్వానికి సహకారం అందించి సఫలీకృతం అవుతున్నారని ప్రశంసించారు. త్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార్గుప్తా మాట్లాడుతూ యుఎస్ఓ జాతీయస్థాయి పోటీలను పులివెందులలో నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. విద్యార్థులు చదువుకు మాత్రమే పరిమితం కాకుండా పోటీ ప్రపంచంలో కావాల్సిన అన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలన్నారు. సెక్రటరీ జనరల్ నీనాజైన్ మాట్లాడుతూ పది రాష్ట్రాల నుంచి దాదాపు 158 మంది చిన్నారులు పాల్గొని అన్ని రాష్ట్రాల సంస్కృతులు, అలవాట్లను తెలుసుకుంటారని తెలిపారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దాసరి భానుప్రకాష్, సునీల్కుమార్, త్యాగరాజన్, విజయ్కుమార్, మిశ్రా నిఖిల్, రాజేష్, శర్మ తదితరులు పాల్గొన్నారు. -
నగలతో పరారీ
రాజంపేట : రాజంపేట పట్టణంలో షపీ అనే నగల తయారీ పలు బంగారు దుకాణాల నుంచి తయారీకోసం నగలు తీసుకుని వెళ్లి కనిపించడంలేదని దుకాణాల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడిగపాలెం గ్రామానికి షఫీ బండ్రాళ్ల వీధిలోని పలువురు బంగారు దుకాణాలకు నగలు తయారు చేసి ఇస్తున్నారు. దాదాపు రూ.50 లక్షలు విలువ గల నగలు తీసుకుని కనిపించడం లేదని వ్యాపారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్కు జరిమానాపెద్దతిప్పసముద్రం : మండలంలోని ఆవులరెడ్డిపల్లి సమీపంలోని ఏటీలో కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమంగా తోడి కర్నాటక రాష్ట్రానికి తరలిస్తున్నారని పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఇటీవల రైతులు ఫిర్యాదు చేసారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దారు విద్యాసాగర్, భూగర్బ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేష్, ఆర్ఐ చినపరెడ్డి ఇసుక నిల్వలు ఉన్న ఏటిని సందర్శించి రైతులతో సమీక్షించారు. తనిఖీ సమయంలో ఇసుక తరలింపునకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్ పట్టుబడడంతో యజమానికి రూ.10వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. -
వరుస చోరీలతో వ ణ ుకుతున్న గుర్రంకొండ
గుర్రంకొండ పట్టణం వరుస చోరీలతో వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా పట్టణంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఓ వైపు గంజాయి ముఠా సభ్యులు మరోవైపు బయట రాష్ట్రాల నుంచి వ్యక్తుల సంచారంతో పట్టణ ప్రజలు హడలెత్తిపోతున్నారు. గుర్రంకొండ : పట్టణంలో దుండుగులు యథేచ్చగా వరుస చోరీలకు పాల్పడుతున్నారు. పట్టణం వ్యాపా ర కేంద్రంగా ఆభివృద్ధి చెందుతోంది. దీంతో స్థానికంగా నివాసం ఏర్పాటుచేసుకొనే వారి సంఖ్య పెరిగిపోతోంది. నాలుగు మండలాల ప్రజలు ఇక్కడ ఇల్లు కట్టుకొని నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మిచుకొంటున్న ఇళ్లతోపాటు గ్రామానికి శివారు ప్రాంతాల్లో నివాసముండే ఇళ్లలో ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల నిర్మాణంలో ఉండే ఇళ్లలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నామి. పది రోజుల కిందట స్థానిక బలిజగడ్డవీధిలో ని నాలుగు ఇళ్లలో వరుసగా రెండురోజులపాటు దుండుగులు చోరీలకు పాల్పడ్డారు. స్థానిక వైన్ షాపుపై భాగాన్ని కత్తిరించి మద్యం సీసాలను చోరీ చేశారు. బస్టాండులోని పలు దుకాణాల్లో వరుస చోరీలు జరిగాయి. పలు దుకాణాల పైకప్పులను కత్తిరించి చోరీలకు పాల్పడ్డారు. పట్టణంతో పాటు ఇందిరమ్మకాలనీ, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం ఉన్న ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టణ శివారు ఇళ్లే టార్గెట్ పలువురు దుండగులు పట్టణ శివారులోని ఇళ్లనే ఎక్కువగా టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఇంటి నిర్మాణం వద్ద వస్తువులు ఉంచాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. పలువురు రాత్రిళ్లు కాపలా ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటితోపాటు శివారు ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకున్న చోట ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల సైకిళ్లు, ఇళ్ల పరిసరాల్లో ఉంచిన వస్తువులను రాత్రిళ్లు చోరీ చేస్తున్నారు. రాత్రిళ్లు పట్టణ శివారు ప్రాంతాల్లో సంచరించాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులతోపాటు గంజాయి మత్తుకు అలవాటు పడిన పలువురు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. గతంలో వీరు పలుమార్లు చోరీ చేసిన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. వాటికి సంబంధించి పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్స్టేషన్కు చేరని కేసులు ఎన్నో ఉన్నాయి. చోరీలు జరిగినా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు పలువురు భయపడి మిన్నుకుండిపోతున్నారు. దీంతో దుండుగులు పట్టణంలో యథేచ్చగా చోరిలకు పాల్పడుతుండడం గమనార్హం. మహిళలకు తప్పని వేధింపులు పట్టణంలోని మహిళలకు పలు రకాలుగా వేధింపులు తప్పడం లేదు, కొంతమంది సెల్ఫోన్లో మహిళల ఫొటోలు తీస్తూ వికృతానందం పొందుతున్నారు. మరో వైపు గంజాయి ముఠా సభ్యులు వీధుల్లో వేగంగా వాహనాలను నడపుతూ అడ్డు వచ్చిన మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. మహిళలు వీధుల్లో సంచరించాలంటే భయపడుతున్నారు. ఇటీవల ఓ కామాంధుడు కొత్తపేట వీధిలో సంచరిస్తూ వీధుల్లో నడిచి వెళుతున్న మహిళల ఫొటోలు రహస్యంగా తీయసాగాడు. వీధి వెంబడి వెళుతున్న ఓ మహిళ అనుమానం కలిగి సదరు వ్యక్తి సెల్ ఫోన్ను లాక్కొంది. పరిశీలించగా అందులో తన ఫొటోలు ఉండడం గమనించి గట్టిగా నిలదీసింది. సరైన సమాధానం చెప్పకపోవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని సదరు కామాంధుడికి దేహశుద్ధి చేశారు. కొంతమంది అతడి సెల్ఫోన్ను పూర్తి స్థాయిలో పరిశీలించగా పలు ప్రాంతాల మహిళల ఫోటోలు అందులో ఉండడంతో నివ్వెరపోయారు. కొందరు మహిళల ఫొటోలు వివిధ భంగిమల్లో తీసి ఉండడం గమనించారు. అతడి సెల్ ఫోన్లో సుమారు 500 మహిళల ఫోటోలు ఉండడం గమనార్హం. ఇందులో బస్టాండులో వివిధ దుకాణాల్లో పనిచేసే మహిళల ఫొటోలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వీటిని తీయ డం వెనుక మర్మమేమిటో అంతుచిక్కడం లేదు. దీనివెనుక ఎవరైనా ముఠా సభ్యులున్నారా అన్న కోణంలో పట్టణవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, మహిళలు కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీస్స్టేషన్కు వెళ్లి అప్పగించారు. ధైర్యంగా ఫిర్యాదు చేయలేదనే నెపంతో సదరు కామాంధుడిపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. చర్యలు తీసుకొంటాం పట్టణంలో జరుగుతున్న చోరీలపె గట్టి నిఘా చేపట్టి చర్యలు తీసుకొంటాం. చోరీలకు గురైన ఇళ్లకు సంబంధించి యజమానులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఇళ్ల పరిసరాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలి. – గజేంద్ర, స్టేషన్ ఇన్ఛార్జి, గుర్రంకొండచెలరేగిపోతూ చోరీలకు పాల్పడుతున్న దుండగులు -
పీలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలి
పీలేరు రూరల్ : పీలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక మూన్లైట్ ఫంక్షన్ హాల్లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత వందేళ్లుగా ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి చిత్తూరు, మదనపల్లె, రాయచోటికి పీలేరు వాసులు తిరగాల్సి వస్తోందన్నారు. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరును కలుపుకొని మదనపల్లె జిల్లాగా చేస్తూ, రొంపిచెర్ల, పులిచెర్ల, సోమల, కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం, కేవీపల్లె, పీలేరు, యర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు మండలాలలను కలిపి పీలేరు రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటపల్లె బాబురెడ్డి, ఎన్.సుధాకర్బాబు, పురం రామ్మూర్తి, సుంకర చక్రధర్, సుదర్శన్రెడ్డి, కలప రవి, అమృతతేజ, శ్రీకాంత్, టిఎల్.వెంకటేష్, రామాంజులు, ముల్లంగి చంద్రయ్య, గుర్రం నారాయణ, ధరణికుమార్, సుభాష్, రఘునాథ్, విజయ్, మల్లికార్జున, రాజేశ్వరి, శ్రీనివాసులు, విశ్వనాథ, ఓబులేషు, నాగేంద్ర, ఆంజినేయులు, కొండయ్య, రవి, గురునాథ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం మండలంలో జరిగింది. కోళ్లబైలు పంచాయతీ బాబూకాలనీకి చెందిన ఆసిఫ్ భార్య ప్రభావతి(25) భర్త ప్రతి రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన ప్రభావతి ఇంటి వద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.వివాహిత అదృశ్యంనిమ్మనపల్లె : నెల రోజులుగా ఓ వివాహిత కనిపించడం లేదని కుటుంబసభ్యులు గురువారం స్థానిక మీడియాకు తెలిపారు. బోడిమల్లయ్యగారిపల్లెకు చెందిన హుస్సేన్ బీ, మహబూబ్ఖాన్ దంపతుల కుమార్తె నసీమా(21)ను తురకపల్లెకు చెందిన సుబహాన్ఖాన్కు ఇచ్చి ఐదేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి కుమార్తె సహారా(4), కుమారుడు సాహిల్ఖాన్(3) ఉన్నారు. ఆగస్టు 22న రాత్రి 9గంటల సమయంలో నసీమా బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. అయితే, అదృశ్యమై నెలరోజులు కావడంతో ఆమె ఆచూకీకై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు నిమ్మనపల్లె పోలీస్స్టేషన్ ఎస్ఐ ఫోన్ నెంబర్. 9440900706కు సమాచారం అందించాలన్నారు.రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణంకడప అర్బన్ : నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నబీకోటకు చెందిన చెన్నకేశవరెడ్డి కుమారుడు చంద్రశేఖర్రెడ్డి (25) దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఖాజీపేట మండలానికి చెందిన చెన్నకేశవరెడ్డి లారీడ్రైవర్ గా పనిచేస్తూ తన కుటుంబ సభ్యులతో నబీకోటలో నివాసముంటున్నాడు. పెద్ద కుమారుడైన చెన్నకేశవరెడ్డి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో నబీకోటకు చెందిన తన స్నేహితుడు యువకిషోర్తో కలిసి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై అలంకాన్పల్లె వైపు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. మార్గ మధ్యంలో వినాయక నగర్కు వెళ్లే దారిలో ఓ కారును ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్రెడ్డికి తీవ్రగాయాలు కాగా స్థానికులు వెంటనే రిమ్స్ కు తరలించారు. చంద్రశేఖర్రెడ్డి చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకిషోర్కు తీవ్ర గాయాలయ్యాయి. చేతికొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ జయరాములు తెలిపారు. -
అంతర్ జిల్లాల దొంగల అరెస్టు
రాయచోటి : పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తెలిపారు. వారి నుంచి రూ.4.70 లక్షల విలువైన ఆస్తులు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. రాయచోటి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామానికి చెందిన రెపన బాలాజీ (19), మండెం సాయికుమార్ (28)లు బీటెక్ వరకు చదువుకున్నారని తెలిపారు. చిన్నమండెం మండల పరిధిలో జరిగిన దొంగతనాలపై ఆరాతీస్తున్న సమయంలో పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దొంగలించిన డబ్బులో కొంత ఆన్లైన్ బెట్టింగులకు ఖర్చుచేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. వారి నుంచి బంగారు నగలు, నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్, కడప చిన్న చౌక, కడప పాతబస్టాండ్ మరికొన్ని జిల్లాల పరిధిలో వారు దొంగతనాలకు పాల్పడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్.కృష్ణమోహన్, రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ సుధాకర్, సిబ్బందిని ఎస్పీ ప్రశంసించారు.ఎస్పీ ధీరజ్ కనుబిల్లి