Annamayya
-
హెడ్ నర్స్గా పదోన్నతులు
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్స్గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 24 మందికి గాను 21 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం ప్రమోషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరిండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: గతంలో ఓకా–మధురై–ఓకా మధ్య స్పెషల్ రైలు నడిచేదని, దాని స్థానంలో ఓకా–తిరుపతి (19560), తిరుపతి–ఓకా (19559) వీక్లీ రెగ్యులర్ రైలుగా నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి సోమవారం ఓకాలో రాత్రి 11.35 గంటలకు బయలుదేరి ద్వారక, కంబాలియా, జామ్నగర్, రాజ్కోట్, సురేంద్రానగర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, అకోల, నాందేడ్, నిజామాబాద్, కరీంనగర్, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూలు, డోన్, తాడిపత్రి మీదుగా కడపకు మరుసటిరోజు సాయంత్రం 5.55 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి రాత్రి 11.30 గంటలకు చేరుతుందన్నారు. ప్రతి గురువారం తిరుపతిలో ఉదయం 8.15గంటలకుబయలుదేరి ఇదే మార్గంలో శనివారం రాత్రి 11.50 గంటలకు ఓకా చేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కడప అర్బన్: రాష్ట్ర జైలు శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ములాఖత్కు అవకాశం ఉంటుందని కడప కేంద్రకారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండుటెండల నుంచి రక్షణ పొందడానికి వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ములాఖత్కు వచ్చే వారు మారిన సమయాన్ని గుర్తించి, అధికారులకు సహకరించాలని కోరారు. చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా నాలుగోరోజు సోమవారం పలు కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ మహాయజ్ఙం, తుంబూర వేషాలంకారంతో పాటు నాగవళ్లి దళాలతో(తమలపాకులతో) సహస్ర నామార్చన నిర్వహించారు.అనంతరం శాత్తమొరై జరిపారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రొద్దుటూరు కల్చరల్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రచారార్థం జయహో బీమా సంకల్ప్ మెగా మేళాను ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జి.కిరణ్ సోమవారం తెలిపారు. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులలో జయ హో బీమా సంకల్ప్ నిర్వహించనున్నట్లు ఆయ న పేర్కొన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ రేట్లు అందిస్తూ, ఇతర బీమా సంస్థలతో పోలిస్తే ప్రజ లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి గ్రామస్తుడు తమ సమీపంలోని పోస్టా ఫీసు ద్వారా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకంలో చేరవచ్చని పేర్కొన్నారు. -
సౌతాఫ్రికాలో కలిచెర్ల వాసి మృతి
పెద్దమండ్యం : మండలంలోని కలిచెర్లకు చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వివరాలలోకి వెళితే.. పెద్దమండ్యం మాజీ ఎంపీపీ పి. ప్రసాద్రెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బీటెక్ పూర్తి చేసిన కుమారుడు శ్రీకాంత్రెడ్డి సౌతాఫ్రికాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో 8 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా డు. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అక్కడే కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడి, అలసటగా ఉందని చెప్పి కుప్పకూలినట్లు అతని స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, గుండెపోటుకు గురి కావడంతో మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపినట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మాజీ ఎంపీపీ తనయుని ఆకస్మిక మరణంతో కలిచెర్ల, యర్రగుట్టపల్లెలో విషాదం నెలకొంది. భార్య ఇటీవల స్వగ్రామానికి వచ్చి సౌతాఫ్రికాకు వెళ్లి 20 రోజులు అవుతోంది. మృతుని భార్య, బిడ్డను తిరిగి కలిచెర్లకు పంపించేందుకు అక్కడి కంపెనీ ప్రతినిధులు చొరవ తీసుకున్నట్లు సమాచారం. మాజీ ఎంపీపీ తనయుని అకస్మిక మృతిపట్ల తంబళ్లపల్లె ఎమ్యెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కలిచెర్ల సింగిల్విండో మాజీ ఛైర్మన్ కలిచెర్ల సుధాహరరెడ్డి, ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక, మాజీ ఎంపీపీ టి రెడ్డిశేఖరరెడ్డిలు దిగ్బాంతి వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ స్థలం దర్జాగా కబ్జా
● రాత్రికి రాత్రే వెలుస్తున్న అక్రమ షెడ్లు ● పట్టించుకోని హౌసింగ్ శాఖ అధికారులుమదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె బసినికొండలో ప్రభుత్వ స్థలాలు కబ్జాదారుల పాలవుతున్నాయి. నిర్మిత కేంద్రం స్థలంలో రాత్రికి రాత్రే అక్రమ షెడ్లు వెలిసినా హౌసింగ్ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పట్టించు కోవడం లేదు.పేదలకు తక్కువ ధరకు ఇసుక, సిమెంట్, నిర్మాణ సామగ్రి అందించేందుకు ప్రభుత్వం 1990లో నిర్మిత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 80 సెంట్ల స్థలాన్ని కేంద్రానికి కేటాయించారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం విలువ రూ.20 కోట్ల పైమాటే. గతంలో ఈ స్థలంలో నిర్మిత కేంద్రం కార్యాలయం, గోడౌన్ నడిచేవి. రాత్రికి రాత్రే షెడ్లు కొంతకాలంగా నిర్మిత కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోవడంతో కబ్జాదారుల కన్ను పడింది. గత వారం రోజులుగా రాత్రి వేళల్లో మట్టితోలి జేసీబీతో స్థలాన్ని చదును చేసి రేకుల షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని ఇళ్లు, ఐదు షెడ్లు, వాటర్ సర్వీస్ కేంద్రం వెలిశాయి. మరికొన్ని పునాదుల స్థాయిలో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం నిర్మిత కేంద్రం స్థలం హౌసింగ్ శాఖ పరిధిలోకి వస్తుంది. కానీ జిల్లా హౌసింగ్ ఈఈ, డీఈలు క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే కబ్జాకు గురైన స్థలానికి ఆనుకునే బసినికొండ గ్రామ సచివాలయం ఉంది. సచివాలయ సిబ్బంది, వీఆర్వో కళ్లముందే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిన్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినా ‘మాకు సంబంధం లేదు‘ అని దాటవేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిబంధనలు గాలికి ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ, సచివాలయ సిబ్బందిపై ఉంది. అక్రమ నిర్మాణాలు చేపడితే వెంటనే తహసీల్దార్కు నివేదించి తొలగించాలి. ఏపీ ల్యాండ్ ఎన్న్క్రోచ్మెంట్ యాక్ట్–1905 ప్రకారం నోటీసు ఇచ్చి 7 రోజుల్లో ఖాళీ చేయించాలి. కానీ ఇక్కడ నెల రోజులుగా కబ్జా జరుగుతున్నా ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. ప్రజల ఆగ్రహం జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుంటే మారు మూల గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్మిత కేంద్రం స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనిపై హౌసింగ్ ఈఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
విన్నపాలు.. వినవలె!
పీజీఆర్ఎస్కు 383 వినతులు స్పెల్ బీలో జాతీయస్థాయిలో రెండో స్థానం సాధించిన విద్యార్థి బి.శైలేష్ను కలెక్టర్ నిశాంత్కుమార్ ప్రశంసించారు. సోమవారం డీఈఓ సుబ్రమణ్యం, ఏసీపీ అనురాధలు శైలేష్ను కలెక్టర్ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులతో పోటీపడిన పెద్దమండ్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న శైలేష్ ఏప్రిల్ 22న ముంబైలో జరిగిన స్పెల్ బీ పోటీల్లో జాతీయస్థాయిలో రెండోస్థానం దక్కించుకుని పొందిన మెడల్, అవార్డు, కప్ను కలెక్టర్కు చూపించారు. దీనిపై ఆయన విద్యార్థి ప్రతిభను మెచ్చుకున్నారు మదనపల్లె/అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి 383 వినతులు వచ్చినట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఆయాశాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అర్జీదారులతో నేరుగా మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం తగదన్నారు. అర్జీలను పెండింగ్లో ఉంచరాదన్నారు. నాణ్యతగా, వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ శివ్నారాయణశర్మ, సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని అర్జీల వివరాలు.. ఆక్రమణదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మకై ్క వారసత్వంగా సంక్రమించిన 15 ఎకరాల భూమిని ఆన్లైన్ నుంచి తొలగించి అన్యాయం చేశారంటూ కురబలకోట మండలం ఎర్రజేనుపల్లెకు చెందిన రెడ్డెమ్మ అర్జీ సమర్పించింది. తమ భూమిని ఆక్రమణదారుల పేరుమీద రాసి, అన్యాక్రాంతం చేశారంటూ బాధితురాలు వాపోయింది. ఆక్రమణదారులు తమ భూమిని కబ్జా చేశారంటూ కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లెకు చెందిన ఫిరోజ్ఖాన్ అర్జీ సమర్పించాడు. గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, జయారెడ్డిలు రెవెన్యూ అధికారుల అండతో 15 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులు రీసర్వేలో తమకు చెందిన 90 సెంట్ల భూమిని మాజీ సర్పంచి ఎంజీ మల్లయ్య కోడలు సుజాత పేరుమీద ఆన్లైన్ చేసేశారంటూ నందిరెడ్డిగారిపల్లెకు చెందిన అమీర్బాషా అర్జీ సమర్పించాడు. కలెక్టర్ ఎండార్స్మెంట్ ఇచ్చిన స్థలాన్ని ఆన్లైన్ చేయడంతో బాధితుడు తన గోడును కలెక్టర్కు విన్నవించాడు. బి.కొత్తకోట పట్టణంలోని బీసీ కాలనీని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్థాని కులు వినతిపత్రం అందజేశారు. 35 ఏళ్ల క్రితం ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. స్థలాల్లో గృహ నిర్మాణ పథకం కింద, సొంతంగా పేదలు ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే ఈ కాల నీ పరిధిలోని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల మేరకు ఈ నిషేధం తొలగించి క్రయ, విక్రయాలకు అవకాశం ఇవ్వా లని స్థానికులు అధికారులను కోరుతున్నారు. మదనపల్లె సీటీఎం రోడ్డును వ్యాపార సంస్థలు ఆక్రమించడంపై బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ ఫిర్యాదు చేశారు. -
నూతన ఆవిష్కరణల దిశగా యువత ఆలోచించాలి
కడప ఎడ్యుకేషన్ : నూతన ఆవిష్కరణల దిశగా యువత ఆలోచించి పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి సూచించారు. కడప లోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో సోమవారం జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం ప్రాముఖ్యతను వివరించారు.ఆధునిక ప్రపంచంలో డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివద్ధి చెందుతోందని, విద్యార్థులు కాలానుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్ కన్వీనర్ జి. ఫణీంద్ర రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక, కృత్రిమమేధ వినియోగంపై విలువైన అవగాహనను పంచుకున్నారు. ప్రాజెక్ట్ ఆలోచన దశ నుంచి తుది రూపకల్పన వరకు ఆటోమేటెడ్ టూల్స్ ఉత్పత్తి ప్రక్రియను ఎలా వేగవంతం చేస్తున్నాయో వివరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఐఐసీ కన్వీనర్ డాక్టర్ వి.శివకష్ణారెడ్డి, క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్ కన్వీనర్ డాక్టర్ జి.ఫణీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులోని ఎస్సీఎస్ఆర్ కల్యాణ మండపం సమీపంలో సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు భరత్ (20) ద్విచక్ర వాహనంలో పులివెందులకు వెళ్లి పనులు ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. కదిరి రోడ్డులో వస్తుండగా.. కదిరి నుంచి పులివెందుల వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్కు తీవ్ర గాయాల య్యాయి. యువకుడిని చికిత్స కోసం 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్ డివైడర్ను ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి..ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెప్పలి నాగమల్లేష్ (22) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని శ్రీనివాసనగర్కు చెందిన నాగమల్లేష్ బీటెక్ చదివాడు. సోమవారం పరీక్ష రాసి వచ్చిన అతను తన స్నేహితుడు తాళ్లప్రొద్దుటూరుకు చెందిన మహేష్ను బస్సు ఎక్కించేందుకు బైక్లో బయలుదేరాడు. ఈ క్రమంలో బుడ్డాయపల్లె సమీపంలోకి రాగానే బైక్ డివైడర్ను ఢీ కొంది. ఈ ఘటనలో నాగమల్లేష్ అక్కడిక్కడే మృతి చెందగా మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. నాగమల్లేష్ తండ్రి చిన్న వెంకటేష్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించసాగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పాము కాటుతో రైతు.. లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన బంగారంపేట ఆదినారాయణ (55) అనే రైతు పాము కాటుకు గురై మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రైతు ఆదినారాయణ తన అరటి తోటకు వెళ్లాడు. అక్కడ పాము కాటుకు గురయ్యాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి వేలూరుకు, అనంతరం కడప రిమ్స్కు తీసుకెళ్లారు. రిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. రైతు ఆదినారాయణకు భార్య గంగమ్మ, పిల్లలు ఉన్నారు. -
ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు
పుంగనూరు : ప్రమాదవశాత్తు ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈసంఘటన పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన నూర్బాషా(42), యాస్మిన్(35), స్థానిక యూబికాంపౌండుకు చెందిన సుమన్తాజ్(32)లు కలసి పుంగనూరుకు ఆటోలో వస్తుండగా రాంపల్లె వద్ద ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వీరిని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారు, నగదు చోరీతంబళ్లపల్లె : ఇంటితలుపులు పగలగొట్టి నగదు, బంగారు చోరీ చేసిన సంఘటన మండలం కేంద్రంలో జరిగింది. బాధితులు జీ.రమణయ్య తెలిపిన వివరాలు.. ఆర్.ఎన్.తాండా పంచాయతీ బోనాసువారిపల్లెకు చెందిన రమణయ్యకు తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఇళ్లు ఉంది. శనివారం ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం స్వగ్రామం బోనాసువారిపల్లెకు వెళ్లారు. ఎవరూ లేరని గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా తాళాలు తీసి లోపల లాకర్ పగలగొట్టి 17గ్రాముల బంగారు నగలు, 20 తులాల వెండి గొలుసులు, రూ.20వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలి మదనపల్లె టౌన్ : ప్రజల సమస్యలను విని, వాటికి తక్షణ పరిష్కారం చూపించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. లైంగిక వేధింపులపై కేసు నమోదుఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో పారిశుధ్య కార్మికురాలైన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక వేధింపులు చేస్తున్నాడని కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఏడాది కాలం నుంచి లైంగికంగా, మానసికంగా వేదిస్తున్నాడని బాధితురాలు పిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
రేపు టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సమావేశం
కడప ఎడ్యుకేషన్: కడపలోని సీఎస్ఐ ఉన్నత పాఠశాలలో ఈ నెల 13వ తేదీ ఉదయం 9.30 గంటలకు టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, బాలశౌరిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పబ్బాపురం ప్లాట్ల వ్యవహారంపై ప్రత్యేక చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం సొసైటీ చేసిన, చేస్తున్న కృషి, అవరోదాలు,లబ్ధిదారుల అపార్థాలు,అభియోగాలు అన్నింటిపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అందరూ తప్పకుండా హాజరు కావాలని వారు కోరారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 14న అండర్ 14 16, బాలుర క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్సార్ డిస్టిక్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ తెలిపారు . ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కాపీ,బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), లాస్ట్ 3 సంవత్సరాల మార్కులిస్ట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. అండర్– 16 ఎంపికలకు 2010 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. అండర్ –14కి 2012 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులని వివరించారు. -
హత్యకేసులో నిందితులు అరెస్టు
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని పందిళ్లపల్లి గ్రామం, బీసీ కాలనీకి చెందిన చిన్నక్క హత్యకేసులో తల్లీ, కొడుకులైన సావిత్రి, వేణులను సోమవారం అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. పందిళ్లపల్లి కస్సాలోని పసుపులేటి చిన్నక్క (65) ఒకే బజారులో ఉన్న సావిత్రి, వేణులు ఏప్రిల్ 25న ఇంటిముందర గొడవపడ్డారు. తల్లీ కొడుకులు చిన్నక్కను గోడకేసి కొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్కు తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా ఫిట్స్ రావడంతో తిరుపతికి తరలించారు.అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లమని చెపారు. దీంతో ఆమెను ఈనెల 7న పందెళ్లపల్లికు తీసుకువచ్చారు.అదేరోజు రాత్రి మృతి చెందింది. సావిత్రి, వేణులు కొట్టిన దెబ్బలకు మా అత్త మృతి చెందిందని చిన్నక్క కోడలు రామాంజనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, ఎస్ఐ గోల్కొండ శోభలు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు సీఐ, ఎస్ఐ తెలిపారు. అదుపు తప్పి కూలీల ఆటో బోల్తా వేంపల్లె : వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్తోపాటు 15మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం వేంపల్లె పట్టణంలోని గౌరీ నగర్, సంఘం వీధి, కరణంవీధి తదితర ప్రాంతాల నుంచి నందిపల్లె గ్రామ పొలాల్లోకి వ్యవసాయ కూలీ పనికి ఆటోలో వెళ్లారు. మధ్యాహ్నం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆటో డ్రైవర్ వేరే వాహనాన్ని తప్పించబోయి మట్టి కుప్పను ఎక్కించాడు. అధిక లోడు ఉండడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 8మందికి తీవ్రంగా, మిగిలిన వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ నిత్యానంద, వీరమ్మ, మహబూబ్ బీ, పద్మావతి, అమరావతి, అంజనమ్మ లక్ష్మీదేవిలను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తీసుకెళ్లారు. మిగిలిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. -
గంగలో రైల్వే పరువు!
రాజంపేట: భారతీయ రైల్వే పరువు గంగపాలవుతోంది. ప్రయాణికులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో, ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో బోగీల్లో నీటిని నింపడంలో రైల్వే యంత్రాంగం దారుణంగా విఫలమవుతోంది. అడిగే నాథుడు లేక, పట్టించుకునే అధికారులు లేక ప్రయాణికులు ’ఆపుకోలేని’ సమస్యతో నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రైవేటీకరణే అసలు గండం గతంలో రైళ్లలో నీటిని నింపే బాధ్యత రైల్వే అధికారుల పర్యవేక్షణలో ఉండేది. కానీ మూడేళ్ల క్రితం ఈ ప్రక్రియను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించిన నాటి నుంచి నిర్వహణ గాలికి వదిలేశారు. రైలు బయలుదేరే స్టేషన్లో ప్లాట్ఫామ్పై ఉన్న పైపుల ద్వారా ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపడం లేదు. టైమ్ సరిపోలేదనో, పైపులైన్లలో ప్రెషర్ లేదనో సాకులు చెబుతూ సగమే నింపుతున్నారు. ఫలితంగా రైలు బయలుదేరిన నాలుగు గంటలకే ట్యాంకులు ఖాళీ అవుతున్నాయి. ఏసీ బోగీల్లో తప్ప స్లీపర్, జనరల్ బోగీల్లో కుళాయిలు వెక్కిరిస్తున్నాయి. దుర్గంధం.. అపరిశుభ్రత: టాయిలెట్లలో నీళ్లు రాకపోవడంతో ప్రయాణిలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీరు లేకున్నా అలాగే వాడుతుండటంతో బోగీల్లో దుర్గంధం వెదజల్లి అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. మహిళలు, వృద్ధులు, పసిపిల్లలు ఈ దుర్భర పరిస్థితిని భరించలేక నరకం చూస్తున్నారు. రైలు ఏదైనా స్టేషన్లో ఆగగానే ఖాళీ సీసాలతో ప్లాట్ఫామ్ వైపు పరుగులు తీయడం నిత్యం కనిపిస్తున్న దృశ్యం. టీసీలకు ఫిర్యాదు చేసినా ‘మా చేతుల్లో ఏమీ లేదు‘ అనే సమాధానమే వస్తోంది. నందలూరుకు ‘నీటి’ మోక్షమెప్పుడో? చైన్నె–ముంబై రైలు కారిడార్లో నందలూరు అత్యంత కీలకమైన సెంటర్ పాయింట్. ఇక్కడ వాటరింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తే సగం రైళ్లలో నీటి సమస్య తీరుతుందని రైల్వే క్షేత్రస్థాయి వర్గాలు మొత్తుకుంటున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అంశంపై ఇటీవలే ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వే మంత్రిని కలిసి విన్నవించారు. ఎంపీలు పీవీ మిథున్రెడ్డి, మేడా రఘునాథరెడ్డి కూడా నందలూరులో వాటరింగ్ పాయింట్ పునరుద్ధరించాలని ఒత్తిడి తెచ్చారు. అయినా సరే, రైల్వే బోర్డు మొండివైఖరి ప్రయాణికులకు శాపంగా మారింది. మాకు ఫిర్యాదులేమీ రాలేదు.. అంతా బానే ఉంది‘ అంటూ అధికారులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. బోగీల్లో నీళ్లు రానప్పుడు, అపరిశుభ్రత ఉన్నప్పుడు ప్రయాణికులు మౌనంగా ఉండకుండా తక్షణమే 139 నంబర్కు కాల్ చేయాలని లేదా రైల్వే యాప్ ద్వారా ఎస్ఎమ్ఎస్ ద్వారా ఫిర్యాదు చేయాలని రైల్వే వర్గాలే సూచిస్తున్నాయి. ప్రయాణికులు మేల్కొని ప్రశ్నిస్తేనే వారి యాతనకు ముగింపు లభిస్తుంది. మధ్యలోనే నీటి ట్యాంకులు ఖాళీ దుర్గంధంతో బోగీల్లోని మరుగుదొడ్లు రైళ్లకు నీళ్ల కోసం నందలూరే సెంట్రల్ పాయింట్ రైళ్ల వాటరింగ్కుకోవిడ్–19 ముందు సర్వే బోగీలోని ప్రయాణికులకు సమ్మర్ ప్రభావం ప్రధానరైలుమార్గం: ముంబాయి–చైన్నె రైళ్లు: 30 (అప్ అండ్ డౌన్) స్టేషన్లు: 25 ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉత్పన్నం ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉందనేది నిత్యసత్యం. నేను హరిప్రియలో ఇటీవల ప్రయాణిస్తే నీళ్లులేవు. లాంగ్ ట్రైన్స్ అయితే నీళ్లు అయిపోతే, అడిగే నాథుడే లేకుండా పోతున్నాడు. తిరుమల, ఇంటర్సిటీ, హరిప్రియ, చైన్నె–ముంబై రైళ్లలో నీటి నిల్వలు ఎప్పుడో అయిపోయింటాయి. నీటి వాడకం లేకపోవడంతో దుర్గంధపూరితంగా మారిపోతున్నాయి. గుత్తి–రేణిగుంట మధ్య అటు చైన్నె, ఇటు ముంబై రైళ్లకు సెంటర్పాయింట్గా నందలూరులో వాటరింగ్ సౌకర్యం కల్పిస్తే ప్రయాణికులకు నీటి సమస్య తీరుతుంది. –వేపగుంట శ్యామ్రాజ్, సంఘసేవకుడు, నందలూరు రైల్వేకేంద్రం దూరప్రాంత రైళ్లలో నీటి సమస్య ఽఅధికమే జిల్లా మీదుగా నడిచే దూరప్రాంత రైళ్లలో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రయాణికులకు నీటి సమస్య లేకుండా చూద్దామనే ఆలోచన రైల్వే శాఖకు లేదు. ప్రయాణికుల నుంచి చార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తారు. బోగీలలో మెరుగైన సౌకర్యాలు ఉండవు. గుత్తి–రేణిగుంట మధ్య రైళ్ల మరుగుదొడ్లలో నీళ్లుండవు. సెంటర్పాయింట్గా నందలూరులో రైళ్ల వాటరింగ్ పెడితే ఈ మార్గంలో బోగీలలో నీటి సమస్య తీరుతుంది. –సయ్యద్ జుల్ఫీకర్, వరల్డ్ హ్యుమన్ రైట్స్కౌన్సిల్ -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కడప ఎడ్యుకేషన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (ఏపీఈఏపీసెట్)–2026 నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్)విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. వైఎస్సార్ జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 14846 మంది ఇంజనీరింగ్కు, 3985 మంది మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను రాయనున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో పరీక్షా కేంద్ర వివరాలు ఇలా... ఏపీ ఈపీపీ సెట్ పరీక్ష కోసం జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో కడపలో ఆరు, ప్రొద్దుటూరులో రెండు, రాజంపేటలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని సిద్ధం చేశారు. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
పెన్షన్ పెంపు చేసి ఆదుకోరూ..
రామసముద్రం : తన భర్త కు నడుము విరిగిపోయి ఏడాదిగా మంచానికే పరిమిత మయ్యాడని బాధితుడు భార్య పర్వీన్ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన పీజీఆర్ ఎస్ కార్యక్రమానికి వచ్చిన ఆమె మాట్లాడుతూ కూలి చేసుకొని జీవనం చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఏడాది క్రితం తన భర్త ఎద్దులబండిలో ఇసుక తోలుతుండగా ఇసుక గడ్డ విరిగిపడి వీపుపై పడటంతో నడుము విరిగిందన్నారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెన్షన్ రూ.6వేలు ఇస్తున్నారని, రోజుకు చికిత్సకే రూ.300లు ఖర్చు అవుతుందని తెలిపింది. తన భర్త మంచానికి పరిమితం కావడంతో తమ కుటుంబ జీవన పరిస్థితి కష్టంగా మారిందని, ప్రభుత్వం పెన్షన్ పెంపు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరింది. -
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
కలకడ : ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. హెడ్కానిస్టేబుల్ ముజీర్ కథనంమేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం, ఎర్రకోటపల్లెపంచాయతీ, మల్లవరంవాండ్లపల్లె గ్రామానికి చెందిన మల్లూరి.రవీంద్రరెడ్డి కుమారుడు చంద్రశేఖర్రెడ్డి (22) స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో బొంతలవారిపల్లెలో జరిగే జాతరకు బయలుదేరాడు.మార్గమధ్యలో బైక్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సూచికబోర్డును ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇతన్ని చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రామాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ ముజీర్ తెలిపారు. -
రుణాల పేరిట మోసం
సాక్షి, మదనపల్లె : రుణాలు ఇప్పిస్తామని, అందుకు సంఘాలు ఏర్పాటు చేయాలని నమ్మించిన ఇద్దరు మహిళలు అందిన కాడికి దండుకున్నారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం బి.కొత్తకోట పోలీస్స్టేషన్కు చేరుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు వివరాలు. ఫరీదా అనే మహిళ, ఆమె కూతురు నస్రిన్ బి.కొత్తకోట పట్టణం, మండలానికి చెందిన మహిళలతో పరిచయాలు పెంచుకున్నారు. వారికి వివిధ పథకాలు మంజూరు చేస్తామంటూ నమ్మించారు. 13 నుంచి 15 మంది మహిళలను కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేసి 38 సంఘాలను ఏర్పరిచారు. వీరికి రూ.ఐదు లక్షల దాకా రుణాలు ఇప్పిస్తామని అందుకు రూ.3 వేల దాకా ఖర్చవుతుందని చెప్పి వసూలు చేశారు. తర్వాత కుట్టు మిషన్లు కూడా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1,200 వసూలు చేశారు. వారిని నమ్మి డబ్బు చెల్లించిన మహిళలకు రుణాలు అందక, కుట్టు మిషన్లు మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చింది. ఈ విషయమై వారిని నిలదీయగా సమాధానం లేదు. తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులు ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్టేషన్కు వచ్చిన మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి న్యాయం చేయాలని కోరారు.పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళలు -
ఇల్లు కబ్జా చేశారని ఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు సోమల, గాలివీడు, కేవిపల్లె మండలాల నుంచి వచ్చిన బాధితులు తమ బాధను మీడియాకు తెలిపారు. ఇల్లు కబ్జా చేశారని కూతురు, అల్లునిపై అన్నమయ్య జిల్లా, కేవీపల్లె మండలం, నూతన కాలువకు చెందిన బాధితురాలు కాంతమ్మ జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లికి ఫిర్యాదు చేసింది. కూతురు, అల్లుడు శ్రీనివాసులు, నాగవేణితో ప్రాణహాణి ఉందని, ఇల్లు ఖాళీ చేయించి తనకు న్యాయం చేయాలని వేడుకొంది. అలాగే గాలివీడు మండలం, పందికుంట సుగాలి తాండాకు చెందిన శంకర్ నాయక్ కూలీ పనుల కోసం వేరే ఊరికి వెళ్లి కొన్ని రోజుల తర్వాత వచ్చేసరికి సోదరుడు హుక్కులే నాయక్ తాను ఉంటున్న ఇంటిని ఆక్రమించుకుని ఇప్పుడు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని, ఇళ్లు విడించి న్యాయం చేయలనికోరాడు. సోమ మండలం, దొడ్డివారిపల్లెకు చెందిన మోహన, మునిలక్ష్మి 70 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న ఇంటి స్థలంలో కొత్త ఇంటిని నిర్మిస్తుంటే అదే ఊరికి చెందిన రామకృష్ణ అడ్డుకుని బొలెరోతో గుద్దించి చంపేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలి కలకడ : నా ఇంటికి ప్రభుత్వం వదలిన దారిని చూపాలని 15నెలలుగా గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదని బాధితుడు లక్ష్మీపతి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ముడియంవారిపల్లె పంచాయతీ బీసీ కాలనీకి చెందిన రామలింగయ్య కుమారుడు లక్ష్మిపతి సోమవారం కలెక్టరేట్ వద్ద మాట్లాడుతూ 2018లో గ్రామంలోని బీసీలకు కేటాయించిన ఇంటి స్థలాలను అదే గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సర్వే నంబర్:93–2లో ఇంటిపట్టా మంజూరు చేశారని, నా ఇంటికి బీసీ కాలనీ నుంచి 30 లింకుల దారి ఉన్నా దారి వదలడం లేదన్నారు. తన ఇంటికి ఉన్న దారిని అక్రమార్కులు ఆక్రమించారని కలకడ రెవెన్యూశాఖ అధికారులకు విన్నవించినా న్యాయం జరగడంలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
పోలీసుల రక్షణ కోరిన ప్రేమ జంట
మదనపల్లె టౌన్ : పెద్దల నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ను మదనపల్లెలో కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ప్రేమ జంట మీడియాతో మాట్లాడుతూ.. పీలేరుకు చెందిన హేమకుమార్ రొంపిచర్లకు చెందిన నందిని గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించ లేదు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి ఈ నెల 9న సత్యసాయి జిల్లాలోని కదిరి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నామన్నారు. మేజర్లైన తమ ఇద్దరి పెళ్లి విషయం పెద్దలకు తెలిసిపోవడంతో వారి నుంచి ప్రాణహాని పొంచి ఉందని చేసేదిలేక జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు తెలిపారు. -
కన్నీటి మడుగు
గాలివీడు : మండలం పరిధి గండిమడుగులో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మతి చెందాడు.పోలీసుల కథనం మేరకు.. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలం టీ కుంట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ నాసిర్ (25) వేసవి సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి గండిమడుగు వద్ద ఉన్న వెలుగల్లు పార్కును సందర్శించేందుకు వచ్చాడు. అనంతరం గండిమడుగులో ఈత కొట్టేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లి మునిగి పోయాడు. యువకుడు నీటిలో కనిపించక పోవడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే గాలివీడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులు, ఫైర్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మతదేహాన్ని వెలికితీయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.ఈతకు వెళ్లి యువకుడు మృతి -
గుండెపోటుకు గురై యువకుడు మృతి
చౌడేపల్లె : గుండెపోటుకు గురై యువకుడు వెంకటేష్(29)మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి.. పరికిదొన పంచాయతీ ఎగువమల్లెలవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు వెంకటేష్ సహచర స్నేహితులతో కలిసి ఉదయంనుంచి 11 గంటల వరకు క్రికెట్ పోటీలో పాల్గొన్నారు.అనంతరం ఇంటికివచ్చిన వెంకటేష్ స్నానం చేసి విశ్రాంతి తీసుకొన్నాడు.అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యసిబ్బంది అప్పటికే వెంకటేష్ మృతిచెందినట్లు నిర్ధారించడంతో వెనుతిరిగారు.వెంకటేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకొన్నాయి. మృతుడి భార్య నాలుగునెలల గర్ణిణీ.భర్త మృతితో ఆమె, కన్న బిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆగి ఉన్న లారీని ఢీకొని.. రామాపురం : మండలంలోని బండపల్లి టోల్గేట్ సమీపంలో శనివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని బైక్ ఢీకొనడంతో తీగల భార్గవాచారి(41) అక్కడిక్కడికే దుర్మరణం చెందినట్లు రామాపురం ఎస్సె శివకుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు రాయచోటి నుంచి కడప వెళుతున్న లారీకి పంచర్ కావడంతో బండపల్లి టోల్గేట్ సమీపంలో నిలిపి మరమతులు చేపడుతున్నారు. ఇదే సమయంలో రాత్రి 11 గంటలకు రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న స్కూటీ ఆగి ఉన్న లారీ వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న తీగల భార్గవాచారి(41)తలకు బలమైన గాయమై అక్కడిక్కడికే మృతి చెందాడు.మృతుడు రామాపురం మండలం సుద్దమల్ల గ్రామంలోని ఎర్రంరెడ్డిపల్లికి చెందిన వాడు కాగా, ప్రస్తుతం రాయచోటి పట్టణం కొత్తపేటలోని చౌడేశ్వరీ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
వాల్మీకిపురం : గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో పోస్టల్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని చింతలవారిపల్లి సమీపంలోని నేషనల్ హైవేపై చోటు చేసుకొంది. వివరాలు.. సోమల మండలం, కందూరుకు చెందిన ప్రభాకర్ ఇదే పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లిలో పోస్ట్మెన్గా పని చేస్తున్నాడు. ఆదివారం సొంత పనుల నిమిత్తం గుర్రంకొండ మండలం, రామాపురంలోని తన మేనమామ ఇంటికి ద్విచక్రవాహనంపై వచ్చి, తిరిగి ప్రయాణమయ్యాడు. మండలంలోని చింతలవారిపల్లి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఢీకొన్న వాహనం లారీగా గుర్తించి, తిరుపతిలో సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కియా కంపెనీలో అట్లూరు మండలవాసి మృతి
అట్లూరు : విధి నిర్వహణలో భాగంగా అనంతపురం జిల్లా కియా కంపెనీలో అట్లూరు మండలం జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీ జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన సొద్దల రామాంజనేయులు (24) కియా కంపెనీలో విధులు నిర్వహిస్తూ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. మృతుని తల్లి, తమ్ముడు, చెల్లెలు ఇదివరకే మృతి చెందారు. తండ్రి లక్షుమయ్య ఉన్న ఒక్క కొడుకు రామాంజనేయులను కూలి పనులు చేసుకుంటూ బీటెక్ చదివించాడు. రామాంజనేయులు ఆరు నెలల కిందట కియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు రామాంజనేయులు మిషనరీలో పడి మృతి చెందాడు. విషయాన్ని కియా కంపెనీ యాజమాన్యం బంధువులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం జొన్నవరం ఎస్సీ కాలనీకి రామాజంనేయులు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆధునిక ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
కురబలకోట : జిడ్డు కృష్ణమూర్తి..ఈపేరు ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు..అదే పెద్దతరం వారు వింటే పులకరించిపోతారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. కాలానికి పరిమితమైన వారు కాదు..తరతరాలకు గుర్తుండిపోయే మానవతావాది. గొప్ప దార్శనికుడిగా,రచయితగా అంతకు మించి విద్యావేత్తగా,ధార్మికుడిగా, తత్వవేత్తగా ఆయన ఫిలాసిపీ ఎందరినో కదిలించింది. జాతి, మత, దేశ,రాజకీయ ఆదర్శాలకు అతీతంగా విద్యార్థులకు విద్య నందించడమే నూతన ప్రపంచానికి మార్గమన్నారు. సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అని చాటి చెప్పిన ప్రపంచ తత్వవేత్తగా ఖ్యాతి గడించాడు. ఆయన జీవిత విశేశేషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మదనపల్లెలో పుట్టి మద్రాస్ అడయార్లో పెరిగి ఆపై ప్రపంచ మాస్టర్గా ఎదిగిన ఆయన 60 ఏళ్లకు పైగా ప్రపంచ దేశాలు పర్యటించారు. జీవన సందేశాన్ని వినిపించారు. విప్లవాత్మకమైన జీవన తాత్వికతను ప్రపంచానికి అందించాడు. ప్రదానంగా సత్యాన్ని తెలుసుకోడానికి దారులు లేవు. ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాలన్నారు. ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం కన్నా నిన్ను నీవు తెలుసుకోవడం వల్ల సత్యాన్ని తెలుసుకోగలరన్నారు. సాంప్రదాయ విద్య కన్నా స్వతంత్రాలోచన కల్గించే విద్య మనిషిని మేల్కొలుపుతుందన్నారు. సిద్దాంతాలకు కట్టుబడి ఉండరాదన్నారు. మనిషిని పరిపూర్ణుడిగా చేయడమే విద్య కర్తవ్యమని బోధించారు. విద్యార్థి నిరంతరం నేర్చుకునే వాడిగా ఉండాలి..టీచర్ విద్యార్థి లోని సృజనాత్మకతను తట్టి మేల్కొపేలా ఉండాలి. మనసు నిండా ప్రేమ ఉన్న వారు మంచి తప్ప చెడు చేయలేరని చెప్పారు. మనిషి సంపూర్డుడిగా ఎదగాలని పదేపదే చెప్పారు. పదవులను ఆయన తృణప్రాయంగా ఎంచారు. ఇప్పటితరం వారు చిన్న పదవులు లభిస్తే వదలమన్నా వదలరు. అనిబిసెంట్ అప్పట్లో ఆయన్ను ప్రపంచానికి జగద్దురువును చేయాలని ఆర్డర్ ఆఫ్ది స్టార్ అనే సంస్థకు అధినేతను చేశారు. అది నచ్చక 1926లో రద్దు చేయడంతో పాటు ఏకంగా దాని నుంచి వైదొలిగారు. వందల కోట్ల ఆస్తిని కూడా వదులుకున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయంపై అప్పట్లో యావత్ ప్రపంచమే విస్తుపోయింది. ఇది అపూర్వ ఘట్టంగా చరిత్రలో నిలచిపోయింది.మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశారు. ఎవరికి వారు మార్పు చెందాలన్నారు. మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశాడు. మూడ నమ్మకాల నుంచి విముక్తి పొందాలనేవారు. జిడ్డు కృష్ణమూర్తికి చదువు సంధ్యల పట్ల పెద్దగా ఆసక్తిలేకపోయినా 15 ఏళ్లవయస్సులో అట్ ది ఫీట్ ఆఫ్ది మాస్టర్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశారు. మదనపల్లె పట్టణంలో 1895 మే 11న తల్లితండ్రులు సంజీవమ్మ, నారాయణయ్యకు ఎనిమిదో సంతానంగా జన్మించి ఆయన 1986 ఫిబ్రవరి 17న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. కృష్ణమూర్తి ఫౌండేషన్ పేరిట దేశ విదేశాల్లో విద్యాలయాలు నడుస్తున్నాయి. వీటన్నింటి కన్నా దేశంలోని మదనపల్లె దగ్గరున్న రిషివ్యాలీ స్కూల్ ప్రత్యేకతను సంతరించుకుంది. 1925లో సోదరుడు నిత్యానంద ఆకస్మిక మరణం ఆయనలో ఎనలేని మార్పునకు దారితీసింది. జిడ్డు కృష్ణమూర్తి బోధనలు సామాజిక అవసరాలను గుర్తించి మనిషిలో జ్ఞాన తృష్ణను రగిలిస్తాయి.ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం.ఆధునిక తత్వవేత్తలలో ఆద్యుడిగా, ప్రపంచ జ్ఞానిగా పేరు గడించాడు. ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప మహోన్నతుడిగా, విశ్వ మానవుడిగా జిడ్డు కృష్ణమూర్తి గురించి యావత్ ప్రపంచం కొనియాడుతోంది.నేడు జయంతి -
సుందరయ్య కుటుంబానికి న్యాయం చేయాలి
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీలో 75 ఏళ్ల వృద్ధ రైతు భూమిని ఆక్రమించేందుకు యత్నించి, కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రత్యర్థులు దాడి చేయడంతో బాధితులు ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరారు. వారిని పరామర్శించిన సీపీఐ నాయకులు కష్ణప్ప, సాంబశివ, శ్రావణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీ, దేలకుప్పానికి చెందిన సుందరయ్యకు సర్వే నంబర్ 32/12లో 1.9 సెంట్ల పట్టా భూమి ఉందన్నారు. ఆదివారం ఉప్పరపల్లి పంచాయతీ నాగిళ్లవారిపల్లికి చెందిన యదుశేఖర్ నాయుడు, కోటినాయుడు తమ అనుచరులతో వచ్చి సుందరయ్య భూమిని జేసీబీతో ఆక్రమించేందుకు యత్నించారు. అడ్డు వెళ్లిన సుందరయ్య, ఆయన కుమారుడు, కోడలిని కొట్టి సెల్ ఫోన్లు లాక్కొని దుర్భాషలాడుతూ ‘‘అడ్డొస్తే జేసీబీతో తొక్కిస్తాం’’ అంటూ బెదిరించారన్నారు. భూమిలో ఉన్న మామిడి చెట్లు, ఫారం పాండ్ ట్యాంక్, రాతి కూసాలు, కంచె ధ్వంసం చేశారని ఆరోపించారు. దీంతో సుమారు రూ.10 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. గాయపడతాము చేసేదిలేక మదనపల్లి ప్రభుత్వాసుపత్రుల చేరి చికిత్స పొందుతున్నామని వాపోయారు. -
బంగారు, వెండి నగల చోరీ
పెద్దతిప్పసముద్రం : మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ ఉప్పరవాండ్లపల్లిలో మావిళ్ల చెన్నకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చెన్నకృష్ణ సోదరుడు లక్ష్మినారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా.. చెన్నకృష్ణ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ 15 రోజులకోసారి కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఆయన ఎప్పటి లాగానే భార్యా, పిల్లలను వెంట బెట్టుకుని ఉద్యోగరీత్యా తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయాడు. ఈ తరుణంలో ఈ నెల 8న గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు, సుమారు 200ల గ్రాముల బంగారంతో పాటు వెండి నగలు అపహరించుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న ములకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్ఐ పరమేశ్ నాయక్లు సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీకి పాల్పడింది స్థానికులా, బయట వ్యక్తులా, అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.రైలు కింద పడి వ్యక్తి మృతిపీలేరు రూరల్ : రైలు కింద పడి గుర్తతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానిక చిత్తూరు రోడ్డు మార్గంలోని రాజీవ్నగర్ కాలనీ సమీపంలో జరిగింది. వివరాలిలావున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ముంబై నుంచి నాగర్కోయిల్ వెళుతున్న రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి రైల్వేపోలీసుల కు సమాచారం ఇచ్చారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. యువకుడు ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : ఒంటికి నిప్పు అంటించుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. బి. కొత్తకోటకు చెందిన వై. వెంకటరమణారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి (30) కొంతకాలం క్రితం ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. రెండేళ్ల తర్వాత ఇంటికి రావడంతో కుటుంబీకులు మహేందర్రెడ్డి తీరు మార్చుకొని బుద్ధిగా ఇంటివద్దే ఉండాలని మందలించారు. దీంతో అతను తీవ్ర మనస్థాపం చెంది, ఇంట్లో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడుని చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. దీంతో మహేందర్ రెడ్డిని ఓ ప్రైవేట్ వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. 13న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలుకాశినాయన : మండలంలోని ఆనంవారిపల్లె గ్రామంలో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈనెల 13న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మొదటి బహుమతి హోండా యూనికాన్ బైక్, రెండో బహుమతి హోండా షైన్, మూడో బహుమతిగా రూ.80వేలు గెలుపొందిన ఎడ్ల యజమానులకు అందిస్తామని వారు వివరించారు. పోటీల్లో పాల్గొనదలచిన రై తులు 13న మధ్యాహ్నం తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9441337657 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
భక్తిలో మునిగారు
ఆలయం లేదు..మూలవిరాట్టులు లేరు..ఆలయం సోమశిల వెనుక జలాల్లో మునిగింది..అయినా గ్రామస్తులు ఏటా ఉత్సవ విగ్రహాలతో కల్యాణం చేయించి.. భక్తిపారవశ్యంతో పరమానందం పొందుతున్నారు.. అదెక్కడో కాదు..సోమశిల బ్యాక్వాటర్ పరీవాహక గ్రామం యల్లంపేట. దీనిపై ప్రత్యేక కథనం.. రాజంపేట: అది సోమిశిల వెనుకజలాలల్లో మునిగి పోయిన గ్రామం..యల్లంపేట .. చుట్టూ పచ్చటి పొలాలు..ఆహ్లాదకరమైన వాతవరణం. ఏరు ఉంటుంది. ఈ గ్రామంలో అప్పట్లో 300 కుటుంబాలకుపైగా నివాసం ఉండేవారు. యల్లంపేట, ఓబులంపేట రెండు గ్రామాలు ఉండేవి.ఈ గ్రామానికి చెందిన ఆలయం మునకలోకి వెళ్లిపోయింది. గ్రామస్తులకు పునరావాసం లేదు..ఆలయం నిర్మించలేకపోయారు. గ్రామంలో రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీమంత్రి బండారు రత్నసభాపతి(ఓబులంపేట), ఎమ్మెల్యే లేని రోజుల్లో జిల్లా డిస్ట్రిక్బోర్డు మాజీ సభ్యుడు తాండ్ర పేరమనాయుడు (యల్లంపేట) పెద్ద కుటుంబాలు ఉండేవి. ● సోమశిల బ్యాక్వాటర్లో ఇప్పటికీ రుక్మిణ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. బ్యాక్వాటర్లో మునిగిపోయి, గోపురం కనిపిస్తుంది. ఈ గోపురం కనిపించగానే అధ్యాత్మికభావన మనుసులో పుట్టుకొస్తుంది. ప్రతి ఇంటిలో ఒకరికి స్వామిపేరు.. శ్రీ రుక్మిణి, సత్యభామ శ్రీ వేణుగోపాలస్వామిపై అపారమైన భక్తి భావం, ప్రగాఢ విశ్వాసం పెంచుకున్నారు. ఈ క్రమంలోని యల్లంపేటలో ప్రతి ఇంటిలో ఒకరికి స్వామి పేరుపెట్టుకోవడం గమనార్హం. ఏటా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గ్రామస్తులు ఒక్కటిగా స్వామి వారి ఎదుట కలుసుకొని పరస్పరం సంతోషాలతో గడుపుతారు. భక్తులకు అన్నప్రసాదాలను అందచేస్తారు. సోమశిల బ్యాక్వాటర్ మునిగిన యల్లంపేట రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, యేటా గ్రామస్తులు నిర్వహించే కల్యాణంలో ఉత్సవమూర్తులు వేణుగోపాలస్వామిపై తరగని భక్తి గ్రామం మునిగిపోయి నాలుగుదశాబ్దాలు దాటుతున్నా యల్లంపేట వేణుగోపాలస్వామిపై భక్తిభావం తరగలేదు. ఆలయం మునిగిపోయింది, గ్రామం ఖాళీ అయింది. యల్లంపేటకు పునరావాసం లేదు. ప్రభుత్వాలు ఆలయం నిర్మాణంతోపాటు పునరావసం కల్పిస్తే, మళ్లీ గ్రామస్తులు ఒక్కచోట కలిసి ఉండేందుకు మార్గం సుగమమవుతుంది. –తాండ్ర రమేష్నాయుడు, యల్లంపేట, నందలూరు ● సోమశిల బ్యాక్వాటర్లో యల్లంపేట గ్రామంతోపాటు ఆలయం మునకకు గురైంది. ● గ్రామానికి 1986 ప్రాంతంలో నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియను చేపట్టారు. 1990 నుంచి గ్రామాన్ని దశలవారీగా ముంపువాసులు వదలివెళ్లారు. తమకు అనుకూలమైన ప్రాంతాలకు, రాష్ట్రంలో నలుమూలలకు వెళ్లి స్థిరపడ్డారు. ● గ్రామం ఖాళీ అవుతున్న క్రమంలో, మరోవైపు నీళ్లు గ్రామానికి చేరువలో రావడంతో మానవసమాజం ఆలయానికి దూరమైంది. ఈ నేపథ్యంలో గుప్తనిధుల ముఠా ఆలయాన్ని తమ స్వార్థం కోసం ధ్వంసం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని ఊరేగించే వాహనాలు, పంచలోహ విగ్రహాలు మాత్రం మిగిలాయి. ● దొరల కాలంలో యల్లంపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మితం చేశారు. ఆలయంలో రాతి విగ్రహామూర్తులు ఉండేవి. అయితే ఇక్కడ ఎక్కడాలేని విధంగా చెక్క విగ్రహాలే మూలవిరాట్టులు చేసి, పూజలు నిర్వహించేవారు. పంచలోహవిగ్రహాలే ఉత్సవ మూర్తులుగా నిర్వహించేవారు. ఏటా పెద్దఎత్తున యల్లంపేట తిరునాల జరిగేది. 8రోజుల పాటు తిరునాల నిర్వహించేవారు. ● ఆలయానికి సోమశిల నష్టపరిహారం చెల్లించారు. రెవెన్యూ డిపాజిట్ చేశారు. అప్పట్లో రూ.80లక్షలు ఉన్నట్లు సమాచారం. ● గ్రామాన్ని వదలివెళ్లినప్పటికి గ్రామస్తులు ఏటా శ్రీ రుక్మిణ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణం రోజున అందరూ ఏకమవుతారు. గ్రామంలేకున్నా స్వామిని మాత్రం భక్తులు మరవేలదనడానికి ఇదే నిదర్శనం. మొన్నటి వరకు ఒంటిమిట్ట రామాలయంలో..ఇప్పుడు సౌమ్యనాథాలయం(నందలూరు)లో పంచలోహ విగ్రహాలు భద్రపరిచారు. ఈ విగ్రహాలతో స్వామివారి కల్యాణం నిర్వహించుకునేవారు. వాహన సేవలకు సంబంధించిన వాహనాలు కూడా ఉన్నాయి. ● రాజంపేట మండలంలో యల్లంపేట వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి కేటాయించిన స్థలం వివాదంలో ఉందని భక్తులు చెబుతున్నారు. బ్యాక్వాటర్లో వేణుగోపాలస్వామి ఆలయం మునక అయినా యల్లంపేట గ్రామస్తుల్లో తరగని భక్తిభావం ఏటా ‘వేణు గోపాలస్వామి కల్యాణం -
భక్తుల వాహనాన్ని ఢీకొన్న లారీ
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఆదివారం వేకువజామున ముంబై టు చైన్నె జాతీయ రహదారిలో ఉన్న రాయల్ వుడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫి, తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం, కడవకల్లు గ్రామానికి చెందిన 60మంది భక్తులు బోయకొండకు ఐషర్, బొలెరో వాహనాల్లో వెళ్లే క్రమంలో మదనపల్లె బైపాస్ లో ఉన్న రాయల్ ఉడ్ దగ్గరకు ఐషర్ లారీ రాగానే వెనకనే వచ్చిన మరో లారీ ఐషర్ను ఢీకొంది. ఈ ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి, మిగిలిన వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వారు రోడ్డు ప్రమాదంలో రాజేశ్వరి (25), లక్ష్మీనారాయణ (42)లకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిలో సహస్ర (13), అశ్వని (28), లక్ష్మీదేవి (52), రమాశ్రీ (38), అరుణ (36), పుల్లమ్మ (35), గంగాధర్ (16), వెంకటరాయుడు (55), కుల్లాయమ్మ (42), శివశంకర్ (32), లక్ష్మి (31), రాజా (15), లక్ష్మీదేవి (32), భవ్యశ్రీ (13) మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వద్దకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. కేసు నమోదు అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫి, ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపారు.16మందికి గాయాలు -
‘సీమ’ఎత్తిపోతలకు నీళ్లొదిలారు!
కడప సెవెన్రోడ్స్: సీమ ఎత్తిపోతల పథకంపై కూటమి సర్కార్ కుట్రలు పన్నుతోందన్న అనుమానం నిజమైంది. ఇరిగేషన్ క్యాలెండర్ సాక్షిగా సీమ ఎత్తిపోతల పథకానికి బాబు సర్కారు నీళ్లొదిలింది. రాయలసీమ వాసులకు మరోసారి మోసం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ల సమావేశ సందర్భంగా ప్రభుత్వ ఇరిగేషన్ క్యాలెండర్ను ప్రకటించారు. రాష్ట్రంలోని 25 సాగునీటి ప్రాజెక్టులను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారో, ఎప్పుడు శంకుస్థాపనలు చేస్తారో గడువును నిర్ణయిస్తూ రూపొందించిన క్యాలెండర్ను ఆయన విడుదల చేశారు. ఇందులో రాయలసీమకు ప్రాణప్రదమైన ఎత్తిపోతల పథకం ఊసే లేదు. రాయలసీమకు తాగు, సాగునీరు అందించే గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, వెలిగొండలతోపాటు చైన్నెకి తాగునీరు అందించడంలో అత్యంత కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రస్తావన లేకపోవడంపై జిల్లాకు చెందిన పలువురు రైతు నాయకులు, వామపక్షాల నేతలు తప్పుబడుతున్నారు. ‘సీమ’ ప్రాజెక్టుల జీవనాడిగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని ఇరిగేషన్ క్యాలెండర్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా అధికార టీడీపీ నేతలు పెదవి విప్పకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎత్తిపోతలు ఎందుకంటే.... శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉంటే తప్ప సీమ ప్రాజెక్టులకు అవసరమైన సాగునీరు అందే వీలుండదు. ఇక 841 బెడ్లెవెల్లో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒక్కటే సీమ సాగునీటి అవసరాలు తీర్చలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇక చెప్పాల్సిన పనే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఫోర్ షోర్లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని డ్రా చేసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడుకు దిగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ఎంసీలో కలుపుతారు. ఈ పథకానికి సంబంధించి 2020 మే 5వ తేది ప్రభుత్వం జీఓఆర్టీ నెంబరు 203 విడుదల చేసింది. ఈ పథకాన్ని రూ. 3825 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని తీసుకొచ్చే ఇన్లెట్ కెనాల్ నిర్మించారు. అలాగే పంపుహౌస్, ఇతర నిర్మాణాలు దాదాపు 80 శాతం జగన్మోహన్రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. ఈలోపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాయలసీమకు జీవనాడి అయిన ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ‘సీమ’ ద్రోహి చంద్రబాబు అననుకూల పరిస్థితుల్లో కూడా రాయలసీమ దాహార్తి తీర్చడంలో ఎత్తిపోతల పథ కం జీవనాడిగా ఉంటుంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంపై ఆయనకున్న వివక్ష వల్ల ఎత్తిపోతల పథకానికి మరణశాసనం వినిపించారు. దీంతో సీమ ద్రోహిగా నిరూపించుకున్నారు. ప్రభుత్వ ఇరిగేషన్ క్యాలెండర్లో సీమ ఎత్తిపోతల పథకానికి చోటు కల్పించకపోవడం ఈ ప్రాంతాన్ని శాశ్వత ఎడారిగా మార్చడమే. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి ‘సీమ’ ప్రాజెక్టులకు ప్రాణప్రదం రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందించడంలో ఎత్తిపోతల పథకం ప్రాణప్రదమైనది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు ఒక్కటే రాయలసీమ అవసరాలు తీర్చలేదు. శ్రీశైలం ఫోర్షోర్లో 800 అడుగుల నుంచి నీటిని తీసుకొచ్చే ఈ పథకం ద్వారానే సీమ ప్రాజెక్టులకు నీళ్లందుతాయి. అలాంటి ప్రాజెక్టులు విస్మరించడం తగదు. ఈ విషయంలో అధికార టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. లేదంటే చరిత్ర క్షమించదు. – సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప -
ఆర్భాటం నమ్మొద్దు.. నాణ్యత మరవొద్దు
● ప్రవేశాల కోసం ప్రైవేటు విద్యా సంస్థల ప్రచారం ● అన్ని అంశాలు తెలుసుకుని విద్యార్థులను చేర్పిస్తేనే మేలుమదనపల్లె సిటీ : జిల్లాలో విద్యా సంవత్సరం ముగిసింది. మరో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యార్థులను చేర్చుకునేందుకు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల వారు ప్రచారం ముమ్మరం చేశారు. విద్యార్థులను ఆకర్షించేందుకు కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు పిల్లలు,వారి తల్లిదండ్రులను ప్రలోభపెట్టేలా ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ నేపథ్యంలో వారి మాయమాటలు, ప్రచార ఆర్భాటాన్ని నమ్మకూడదని, విద్యార్థులకు నాణ్యమైన బోధన, మెరుగైన వసతులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేర్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అనుమతులు పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించే ముందు ఆయా విద్యా సంస్థలకు విద్యాశాఖ, ఇంటర్ బోర్డు నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవాలి. అగ్నిమాపకశాఖ అనుమతులు, పిల్లల రక్షణకు తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలను పరిశీలించడం తప్పనిసరి. ఈ విషయాలు తెలుసుకునేందుకు విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులను సంప్రదించాలి. ఫలితాల సరళి కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాలు రాకున్నా.. యాజమాన్యాలు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాఽధించినట్లు తప్పుడు ప్రచారం చేస్తూ పిల్లల తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేస్తాయి. ఆ విద్యా సంస్థల గత ఫలితాల సరళిని పరిశీలించాలి. ఆ పాఠశాలలు, కళాశాలలో విద్యతో పాటు ఏయే అంశాల్లో విద్యార్థులు రాణించేలా దృష్టి పెడుతున్నాయో పరిశీలించాలి. బోధన అర్హత ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకుల అర్హత గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా పాఠశాలల్లో బీఈడీ, డీఈడీ చదినవారు బోధిస్తున్నారా, అనర్హులతో బోధిస్తున్నారా? అన్న వివరాలను ఆరా తీయాలి. పలు పాఠశాలలు తక్కువ వేతనాలు ఇవాల్నన్న ఉద్దేశంతో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేయని వారితో బోధిస్తుంటాయి. అర్హులైన ఉపాధ్యాయులతో బోధించే పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి. ఇరుకు గదులపై ఆరా జిల్లాలోని చాలా ప్రైవేట్ విద్యా సంస్థల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇరుకిరుకు గదుల్లో బోధిస్తున్నారు. గాలి,వెలుతురు రాని గదుల్లో బోధిస్తుంటే విద్యార్థులు అసౌకర్యానికి గురవుతుంటారు. బోధకుల చెప్పే అంశాలు విద్యార్థుల చెవికెక్కవు. విశాలమైన గాలి, వెలుతురు ఉన్న గదుల్లో బోదించే బడుల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మైదానం ఉందా? విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యం. నిర్ణీత వేళల్లో పిల్లలను తప్పకుండా క్రీడలు ఆడించాలి. జిల్లాలో చాలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అసలు మైదానాలే లేవు. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించరు. మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉండి,ఆటలు ఆడించే విద్యా సంస్థలను ఎంచుకోవాలి. సంగీతం, పాటలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యం తదితరాలు నేర్పిస్తూ పిల్లలకు సాంస్కృతిక అంశాలపై ఆసక్తి పెంపొందించే విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి.సౌకర్యాలు ఉన్న పాఠశాల్లో చేర్పించాలి ప్రభుత్వ అనుమతి పొంది, అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి. ఒకసారి పాఠశాల,కళాశాలను పరిశీలించాలి. ఎవరో చెప్పిన మాటలు విని మోసపోకూడదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల, కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. –జీవీ ప్రసాద్, విద్యావేత్త, మదనపల్లె -
ప్రాణం తీసిన ఈత సరదా
బద్వేలు అర్బన్ : ఈత నేర్చుకునేందుకు స్విమ్మింగ్పూల్కు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ బాలుడు మృతిచెందిన ఘటన ఆదివారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె గ్రామానికి చెందిన దాసరినారాయణ, రమాదేవి దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వ్యాపార నిమిత్తం గత కొన్నేళ్లుగా వీరు పట్టణంలోని మార్తోమానగర్లో నివసిస్తున్నారు. వీరి కుమారుడైన దాసరిఅర్జున్ (10) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేశాడు. ఈత నేర్చుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం పోరుమామిళ్ల బైపాస్రోడ్డులోని స్విమ్మింగ్పూల్కు అర్జున్ తన సోదరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. నడుముకు ట్యూబ్ వేసుకుని నీటిలోకి దిగిన అర్జున్ కొద్దిసేపటికి ట్యూబ్ తీసేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారించి మళ్లీ ట్యూబ్ వేసుకుని స్విమ్మింగ్పూల్లోకి దిగమని సూచించారు. అయితే కొద్దిసేపటికి మళ్లీ ట్యూబ్ తీసేసిన అర్జున్ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి దిగడంతో నీటిలో మునిగిపోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు అర్జున్ను స్విమ్మింగ్పూల్ నుంచి బయటికి తీసుకువచ్చి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సరదాగా ఈతకు వెళ్ళి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని తల్లిదండ్రులు దమ్మనపల్లె గ్రామానికి తీసుకెళ్లారు. ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.స్విమ్మింగ్పూల్లో పడి బాలుడు మృతి -
వైఎస్సార్సీపీ సోషియల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసు
లక్కిరెడ్డిపల్లి : అన్నమయ్య జిల్లా అప్పకొండయ్యగారిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సోషియల్ మీడియా కార్యకర్త లక్ష్మీరెడ్డిపై గిద్దలూరు పోలీసు స్టేషన్లో అక్రమంగా కేసు బనాయించి విచారణ నిమిత్తం విశాఖపట్నం నుంచి గిద్దలూరుకు తీసుకొచ్చి రాత్రంతా పోలీసు స్టేషన్లో పెట్టినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం జనసేన పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో లక్కిరెడ్డిపల్లి మండలంలోని అప్పకొండయ్యగారిపల్లికు వచ్చిన గిద్దలూరు పోలీసులు విచారణ నిమిత్తం లక్ష్మీరెడ్డి సోదరుడుని విచారించి విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకుంటున్న లక్ష్మీరెడ్డిని శనివారం అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం గిద్దలూరు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు కాకునూరి హిమశేఖర్ రెడ్డి ఆదివారం బాధిత వ్యక్తులకు బెయిల్ ఇప్పించారు. బెయిల్ పొందడానికి సహకరించిన కాకునూరి విక్రమాధిత్య రెడ్డి, గిద్దలూరు మండల యువజన విభాగ అధ్యక్షులు యర్రం వెంకటరామిరెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి తదితరులకు లక్ష్మీరెడ్డి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. -
పాముకాటుతో మహిళ మృతి
వాల్మీకిపురం : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని ఫత్తేపురంలో ఆదివారం చోటు చేసుకొంది. వివరాలు.. వాల్మీకిపురం పంచాయతీ ఫత్తేపురానికి చెందిన అంజి భార్య యమున (38) ఆదివారం ఉదయం ఇంటి ముందు చెత్త ఊడుస్తుండగా పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ నుంచి మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయాకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. యమున భర్త అంజి గతంలో మృతి చెందగా.. ఇద్దరి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుండగా యమున మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాము కాటేసి వ్యక్తికి అస్వస్థతమదనపల్లె టౌన్ : పొలంలో దోస కాయలు కోస్తుండగా విష సర్పం కాటేసి కూలి పనులకు వచ్చిన సత్యసాయి జిల్లా వాసి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై వివరాలు.. సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, కొక్కంటి క్రాస్ లో నివాసం ఉంటున్న గోపాల్ కుమారుడు రవి (48) ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు సాగుచేసిన దోసకాయ పంటను వడపడానికి ఓ టెంపోలో కూలీలను తీసుకొని చిత్తూరు జిల్లా, చౌడేపల్లి సమీపంలోని బోయకొండకు ఆదివారం ఉదయం వచ్చాడు. కూలీలతో దోస కాయలు కోయిస్తుండగా చెట్ల మధ్యన ఉన్న విష సర్పం రవి కాలిపై కాటేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడిని సహచరులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. దీంతో రవి ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నాడు. -
ముగిసిన ఉరుసు
పుంగనూరు: పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్ నూర్షావలి బాబా దర్గా వారి ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. చివరిరోజు ఆదివారం రాత్రి ముస్లిం పెద్దలు, హజరత్లు దర్గాలోని మజార్పై చాదర్, పూలు సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. దర్గాను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.నాగపూర్కు చెందిన ఇంతియాజ్సాబిరి, ముంబైకి చెందిన అంజాబ్సాబిరి , పూనేకు చెందిన తౌసిఫ్జునైది , కర్నాటకాకు చెందిన తౌసిఫ్ఖాదరి మధ్య ఖవ్వాలి ఆద్యంతం భక్తులను ఆలరించింది. ఉరుసు సందర్భంగా దర్గా వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ మదనపల్లె డీఎస్పీ పావని ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు అన్సర్బాషా, రమణ, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
అధికార పార్టీ నేతలకు కార్పొరేషన్ అధికారులు బందీగా మారారు. నిబంధనలకు పాతరేస్తూ.. పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ పాలన గాలికొదిలేశారు.. కూటమినేతలు చెప్పిందానికల్లా తలాడిస్తూ.. చట్టాన్ని వారి చుట్టంగా మార్చేశారు.. ఫలితంగా వ్యవస్థ గాడితప్పింది.. సమాజంలో శాంతిభ
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా అధికార యంత్రాంగం మొద్దునిద్ర పోతోంది. ఏదైనా సంఘటన జరిగేదాకా కళ్లు తెరవనంటోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడపలో కార్పొరేషన్ అధికారుల అడ్డగోలు నిర్ణయాలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి పనిచేయాల్సిన వ్యవస్థలు గాడి తప్పుతున్నాయి. అధి కార పక్షం అభిమానం దక్కితే చాలన్నట్లుగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాల్సిన జిల్లా సర్వోన్నతాధికారి చూస్తుండిపోతున్నారు. ఫలితంగా జిల్లా కేంద్రమైన కడపలో ఘర్షణలకు ఆస్కారం ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఇలాగే వ్యవహరిస్తే సమాజానికి భారీ కీడు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ● కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఇష్టారాజ్యంగా పనిచేస్తోంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా అధికారపార్టీని మెప్పిస్తే చాలన్నట్లు వ్యవహరిస్తోంది. అధికారపక్షం ఏం చేసినా వత్తాసుగా నిలవడం మినహా, నిబంధనలకు వ్యతిరేకమని చెప్పే సాహసం కూడా చేయలేని దుస్థితి నెలకొంది. చలానా స్వీకరణలో నిర్లక్ష్యం... కార్పొరేషన్ పరిధిలో ప్లెక్సీలను చలానా చెల్లించి ఏర్పా టు చేసుకోవాలి. ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టానుసారం ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. 3రోజులకు 10/15 ప్లెక్సీకు రూ.15వందలు చలానా చెల్లించాలి. ఇతరులను రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కంటెంట్ ఉందా లేదా పరిశీలించి అనుమతించాల్సిన బాధ్యత కూడా కేఎంసీదే. ఇవేవీ గత కొంతకాలంగా కేఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి ధోరణిలోనే తగిన చలానాలు స్వీకరించకుండా.. కంటెంట్ను పట్టించుకోకుండా అల్మాస్పేట సర్కిల్లో ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలకు అవకాశమిచ్చారు. వెరసి రెండు వర్గాలు విడిపోయి ఘర్షణలు దిశగా అడుగులు పడ్డాయని పరిశీలకులు వివరిస్తున్నారు. ఇన్చార్జి కమిషనర్పై చర్యలు... అల్మాస్పేటలో శనివారం చోటుచేసుకున్న ఉద్రికత్తలు, ఘర్షణలకు ప్రధాన కారణం ప్లెక్సీలు అనుమతేనని ఓ నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం కడప ఇన్చార్జ్ కమిషనర్ రాకేష్చంద్రను బదిలీ చేసింది. ఆస్థానంలో రాజంపేట సబ్కలెక్టర్ హెచ్ఎస్ భావనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ కార్పొరేషన్ గాడి తప్పుతున్నప్పుడే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దృష్టి సారించింటే ఇలాంటి విపత్కర పరిస్థితి చోటుచేసుకునేది కాదని పలువురు వాపోతున్నారు. జిల్లాలో అధికారులు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తూ, ఏకపక్ష చర్యలకు మొగ్గుచూపుతున్నప్పుడు కలెక్టర్ కర్రపెత్తనం చలాయించాల్సి ఉంది. అలా కాకుండా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేంటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలు అమలు చేయడంలోఅధికారయంత్రాంగం విఫలం అధికార పక్షానికి చుట్టంగామున్సిపల్ కార్పొరేషన్ అడ్డగోలు వ్యవహారమేఇరువర్గాల ఘర్షణలకు కారణం కడప కార్పొరేషన్ యంత్రాంగం నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారు. ముందే చేసిన పనులు టెండర్లు పిలిచి కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారు. లెస్కు కోట్ చేసినా పనులు ఇవ్వకపోవడం.. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే టెండర్లు దక్కేలా ప్రణాళిక రచించడం వంటివి చేస్తున్నారు. దీనికి 4వ డివిజన్లో చంద్రవర్దిని నగర్ ఆర్చి నుంచి చివర వరకూ రోడ్డు నిర్మాణానికి(టెండర్ ఐడీ 903811) పిలిచిన టెండరే ఉదాహరణ. ఇలా కేఎంసీలో అన్నీ విభాగాల అధికారులు అధికార పక్షం మెప్పుకోసమే తాపత్రయం చూపుతున్నారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఇక వైరిపక్షం ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద పుట్పాత్లు తొలగించడం కూడా కేఎంసీ చేస్తూ వచ్చింది. నగరమంతా అవే నిబంధనలు పాటించారా?అంటే అలాంటిదేమి లేదు. అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్నట్లుగా కేఎంసీ చర్యలుండిపోయాయి. కేఎంసీ చర్యలే ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
నమో.. నారసింహా
గుర్రంకొండ: మండలంలోని గుర్రంకొండ, తరిగొండ గ్రామాల్లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పలు రకాల నైవేద్యాలు సమర్పించి అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఈసందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని స్వామివార్లను దర్శించుకొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా
సాక్షి, మదనపల్లె : పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై శనివారం మధ్యాహ్నం ఓ ఆటో ప్రమాదానికి గురైంది. ఆటో ప్రొద్దుటూరు మలుపు వద్ద బోల్తా పడింది. అందులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటో ధ్వంసం అయింది. ఈ పర్యాటకులు ఎక్కడి వారు, ఎంత మంది ఉన్నారు అన్న వివరాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కొండపై నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కిందికి వస్తున్నారు. ప్రమాదం చూసి అక్కడ ఆగిన ఆయన బాధితులకు సహకారం అందించారు. భద్రత సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తర్వాత ఆటోను ప్రమాద ఘటన నుంచి తీసుకువెళ్లిపోయారు. అయితే ఆటోకు సంబంధించి వివరాలు ఏవీ తెలియ రాలేదు. ఈ మలుపు వద్ద ఇటీవల ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఇది మూడో ప్రమాదం. పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంటమదనపల్లె టౌన్ : పెద్దల నుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట శనివారం మదనపల్లె డీఎస్పీ పావనిని కలిసి ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు.. సదుం మండలంతాటిగుంట పాళ్యంకు చెందిన రమణయ్య, చంద్రమ్మ దంపతుల కుమారుడు నాగార్జున మెడికల్ రిప్రజెంటేటివ్గా తిరుపతిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మొలకలచెరువు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన సుధాకర్, మంజుల దంపతుల కుమార్తె కుంచపు హర్షిత బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ నాలుగేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో విడదీస్తారనే భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి శుక్రవారం పీలేరులోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ శనివారం మదనపల్లె డీఎస్పీ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీఎస్పీ సదుం పోలీసులతో మాట్లాడి మేజర్లైన ఈ జంటకు రక్షణ కల్పించాలని, ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. డయాలసిస్ కేంద్రం మంజూరుపీలేరు : పీలేరు ఏరియా ఆస్పత్రికి డయాలసిస్ కేంద్రం మంజూరైనట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖ్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు మంజూరు కాగా అందులో పీలేరుకు డయాలసిస్ కేంద్రం మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా, స్థానికంగా డయాలసిస్ కేంద్రం అందుబాటులో రానున్నట్లు చెప్పారు. -
కారు ఢీకొని రైతు దుర్మరణం
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో కారు ఢీకొని రైతు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శనివారం అమ్మ చెరువుమిట్ట వద్ద చోటు చేసుకుంది. ముదివేడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కురబలకోట మండలం దాదంవారిపల్లికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు, రైతు సుధాకర్రెడ్డి (50) సొంత పని మీద బైక్పై మదనపల్లెకు బయలుదేరాడు. మార్గంమధ్యలోని మదనపల్లె అమ్మచెరువు మిట్ట వద్ద, ఏసీ గోడౌన్ సమీపానికి రాగానే వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైతు మృతికి కారణమైన కారు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే వాహనంతో పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించే పనిలో ఉన్నామన్నారు. -
విద్యార్థి మృతిపై అన్నీ అనుమానాలే!
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి మిద్దె పై నుంచి పడి మృతి చెందడం పాఠకులకు విదితమే. ఎంబీఏ విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసిన మదనపల్లె రెండవ పట్టణ సీఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. పుంగనూరు మండలం కుక్కలపల్లికి చెందిన గంగరాజు(24) కురబలకోట మండలం అంగళ్ళులోని మిట్స్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలో తన స్వగ్రామానికి చెందిన స్నేహితుడు గోవర్ధన్ నాయక్ మదనపల్లె ఇందిరా నగర్లో బాడుగకు ఉంటూ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆఫీస్ సబార్డినేట్గా పని చేస్తున్నాడు. గంగరాజు ఇంటికి వచ్చిన సమయంలో గోవర్ధన్ నాయక్ ఇంట్లో లేకుండా పోవడంతో.. అతని భార్యతో గంగ రాజు మాట్లాడుతుండగా సడన్గా వచ్చినట్లు సమాచారం. దీంతో గోవర్ధన్ నాయక్ భార్య దొంగా దొంగా అని కేకలు పెట్టడంతో.. భవనం మూడవ అంతస్తు పై నుంచి గంగరాజు తప్పించుకునే క్రమంలో కిందికి దూకి తీవ్రంగా గాయపడ్డాడని సీఐ తెలిపారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న లాప్టాప్, సెల్ఫోన్ కూడా పగిలిపోయాయన్నారు. తీవ్రంగా గాయపడ్డ గంగరాజును విష్ణు నాయక్ వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి భార్యతో కలిసి తీసుకువెళ్లి ప్రథమ చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అతని పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడని, దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా గంగరాజు మృతి మిస్టరీని తేల్చునున్నామని చెప్పారు. -
స్వదేశ అభివృద్ధి కోసం పాటుపడాలి
రాయచోటి అర్బన్ : అమెరికా దేశంలోని పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హారిస్బర్గ్ నగరంలో ఎన్ఆర్ఐలు, తెలుగు ప్రజలలు, వైఎస్సార్సీపీ అభిమానులతో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి హృదయ పూర్వకంగా మమేకమయ్యారు. విదేశాల్లో స్థిరపడినా స్వదేశ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ భవిషత్యుపై తమకున్న అభిమానాన్ని, బాధ్యతను అక్కడి తెలుగు సమాజం మరోసారి స్పష్టంగా చాటి చెప్పింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాస తెలుగు ప్రజలు అక్కడి స్థానిక జీవన విధానం, అధునిక అభివృద్ధి నమూనాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో పేదరిక నిర్మూలనకు సమగ్ర ప్రణాళికలు, గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే విధానాలపై విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడి, వారి అభిప్రాయాలను విన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారి అనుభవాలు, ఆలోచనలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా వినియోగించాలనే సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే విధంగా వైఎస్సార్సీపీ బలోపేతంపై శ్రీకాంత్ రెడ్డి చర్చించారు. -
కోట అందం.. చూసొద్దాం
● రాజరికానికి దర్పణం గుర్రంకొండ కోట ● అన్నమయ్య జిల్లాకు మణిహారం ● నిత్యం పర్యాటకుల సందడిగుర్రంకొండ : వేసవి సెలవుల్లో పిల్లలు, పెద్దలు చూడదగిన ప్రదేశం చారిత్రాత్మాక గుర్రంకొండ కోట. అన్నమయ్య జిల్లాలో రాచరికానికి, నవాబులు, రాజులు, బ్రిటీషు వారి పాలనకు నిలువుటద్దం ఈ కోట. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. 14 వ శతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. ముఖ్యంగా కడప నవాబు పరిపాలనలో ఇది పేరుగాంచింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దేవాలయాలు, ఎన్నో చెరువులు ఉన్నాయి. మైసూర్ రాజు టిప్పు సూల్తాన్ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషు వారితో ఇక్కడ రాజరిక పాలనకు తెరపడింది. ఘన చరిత్ర కలిగిన ఈ కోటలో ఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఇక్కడి విశేషాలను తిలకించడానికి మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. మనం కూడా ఒకసారి చూసొద్దాం రండీ. రంగిణీ మహల్ గుర్రంకొంట కోటలో చూడదగిన ముఖ్య ప్రదేశం రంగిణీమహల్. పురాతన రాజభవనం. ముందువైపు నుంచి రెండు అంతస్తులుగానూ, వెనకవైపు నుంచి మూడు అంతస్తులు నూ కనిపించడం దీని ప్రత్యేకత. ఎన్నో గదులు, ఓ గదిలో భవనం లోపలి నుంచి సొరంగ మార్గం ఉంది. శత్రురాజులు దండెత్తినప్పుడు ఈ మార్గం గుండా కోట బయటికి వెళ్లేందుకు ఆస్కారం ఉండేది. పురాతన మెట్లు, సమావేశపు గదులు రాజరికానికి నిలుటద్దంగా నిలుస్తాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గుర్రంకొండ కోటను విజయనగర రాజులు పాలించే కాలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని.. అప్పటి పాలకులు శ్రీకృష్ణ దేవరాయులు కోటలోని కొండపైభాగంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. శిల్పకళాసౌందర్యంతో ఈ దేవాలయ స్తంభాలు ఇట్టే ఆకట్టుకొంటాయి. అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా నిర్మిస్తే.. దీన్ని పశ్చిమముఖంగా నిర్మించడం విశేషం. ఇక్కడి నుంచి చూస్తే గుర్రంకొండ పట్టణంతోపాటు పరిసర గ్రామాల పచ్చటి పొలాలు, రాయల కాలం నాటి చెరువులు కనిపిస్తాయి. కోట ముఖద్వారం గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోటగోడలను నిర్మించారు. కోటగోడల చుట్టూ కందకాలు తవ్వారు. ఈ కందకాల్లో నీటిని నింపేవారు. శత్రువులు కోటగోడలు ఎక్కకుండా ఆ నీటిలో మొసళ్లను వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించే వారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది. మగ్బీరా కోట పక్కనే మగ్బీరా ఉంది. పురాతన మహమ్మదీయుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కట్టడం ఇది. మగ్బీరా అంటే సమాధి. గుర్రంకొండ కోటను టిప్పుసుల్తాన్ మేనమామ మీర్రజాఆలీఖాన్ పాలించే వారు. అతను మృతి చెందిన తరువాత సమాధిని మగ్బీరాగా నిర్మించారు. డూమ్లో చేసే శబ్దాలు ప్రతి ధ్వనించడం(రీసౌండ్) ఇక్కడి ప్రత్యేకత. షాహజాదీ మసీదు టిప్పు సుల్తాన్ కాలంలో రాజవంశీయుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మసీదు ఇది. పూర్తిగా రాతితోనే నిర్మించారు. ప్రస్తుతం దీన్ని పూర్తి స్థాయిలో ఆధునికరించారు. ఇలాంటివి కోట పరిసరాల్లో మరో రెండు ఉన్నాయి. షాకమాల్ దర్గా మైసూర్ పాలకులు, అప్పటి గుర్రంకొండ కోట పాలకులు అయిన టిప్పు సుల్తాన్ ఆస్థాన గురువు షాకమాల్ దువ్వమ్. ఆయన ఈజిప్టు దేశం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన గొప్పతనం విన్న అప్పటి మైసూర్ పాలకులు హైదరాలీ తన కుమారుడు టిప్పుసుల్తాన్ను గుర్రంకొండలోని అతని మేనమామ మీర్రజా ఆలీఖాన్ వద్ద ఉంచి షాకమాల్ దగ్గర విద్యాబుద్ధులు నేర్పించారు. తదనంతర కాలంలో షాకమాల్ దువ్వమ్ టిప్పుసుల్తాన్ గురువుగా నియమింపబడ్డాడు. ఇతని సమాధినే ఇక్కడ గొప్ప దర్గాగా ప్రజలు కొలుస్తారు. ఇంకా చూడదగిన విశేషాలు ● కొండపైన కోట బురుజులు, పురాతన కట్టడాలు, పురాతన ఇళ్లు ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి మెట్లమార్గం కూడా ఉంది. ● కోటలో శిథిలావస్థకు చేరుకొన్న అలనాటి ఆస్పత్రి భవనం ఉంది. ● శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయాలు, టిప్పుసుల్తాన్ కాలం నాటి ఈద్గాలు ఉన్నాయి. ● గుర్రంకొండ పట్టణంలో శ్రీ షాకమాల్ దర్గా దగ్గర టిప్పుసుల్తాన్ చదువుకొన్న పాఠశాల యూసూఫ్ సాహేబ్ తకియా ఉంది.ముందువైపు నుంచి రెండు అంతస్తులుగా కనిపిస్తున్న రంగిణీమహల్వెనుకవైపు నుంచి మూడు అంతస్తులుగా కనిపిస్తున్న రంగిణీ మహల్ -
అదనపు రైల్వేబోర్డు సభ్యుడిగా కె.వి.రెడ్డి
పీలేరు రూరల్ : భారతీయ రైల్వే బోర్డులో అత్యుతన్నత గ్రేడ్ 16 అదనపు రైల్వే బోర్డు సభ్యుడిగా పీలేరు ప్రాంతానికి చెందిన కె.వి.రెడ్డి (కె.వెంకటరమణారెడ్డి)కి పదోన్నతి లభించింది. కె.వి.రెడ్డి గుంతకల్లు డీఆర్ఎంగా, దక్షిణ మధ్య రైల్వేలో పీసీఎస్వోగా, ఐఆర్ఐఎస్ఈటీలో ప్రొఫెసర్గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పీలేరు రైల్వే స్టేషన్ను అమృత్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయడంలో, అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు పీలేరులో స్టాపేజీలకు విశేష కృషి చేశారు. ఆయన 1990 ఐఈఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. 11న కలెక్టరేట్ ముట్టడిమదనపల్లె సిటీ : సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు కృష్ణారెడ్డి, వివ్వనాథరెడ్డి, ఆదినారాయణ తెలిపారు. 25 ఏళ్లుగా సర్వీసు నష్టపోయిన తమను వెంటనే రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ కాలపరిమితి 62 ఏళ్లకు పెంచాలని, 12 నెలల కాలానికి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన వారికి నెలకు రూ.25 వేలు పెన్షన్ ఇవ్వాలని, హెల్త్కార్డులు జారీ చేయాలన్నారు. దూర ప్రాంతాలకు బదిలీ అయిన వారిని సొంత మండలాలు, దగ్గర ప్రాంతాలకు బదిలీ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అక్కులప్ప, రవి, జమాల్భాషా, వాసుదేవ తదితరులు పాల్గొన్నారు. పిడుగుపాటుతో ఆవు మృతి కలికిరి : పిడుగుపాటుతో పాడి ఆవు మృతి చెందిన ఘటన మండలంలోని పల్లవోలు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. పల్లవోలు గ్రామం లింగపల్లికి చెందిన ప్రభాకర పాడి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం పొలం వద్ద ఆవులను మేపుకొంటుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఆవులకు సమీపంలో పిడుగు పడటంతో సుమారు రూ.లక్ష విలువ చేసే పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. పాడి ఆవుల పాల దిగుబడితో జీవనం సాగిస్తున్న పాడి రైతు ఆవు మృతి చెందడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. యువకుడు ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : ఎలుకల నివారణ మందు తాగి ఓ ప్రైవేటు వాహన డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం చౌడేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఆమనకుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు చందు(27) ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్గా పని చేస్తూ, తల్లిదండ్రులతోపాటు భార్య శిల్పా, తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి అనంతపురం సెంట్రల్ : అనంతపురం నగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా కడప నగరం ఆజాద్నగర్కు చెందిన షేక్ కరీముల్లా కుమారుడు షేక్ మహబూబ్బాషా(20), అనంతపురంలోని రాణినగర్కు చెందిన బాబావలి కుమారుడు ఖాసీంవలీ(18) బంధువులు. రెండు రోజుల క్రితం మహబూబ్ బాషా అనంతపురానికి వచ్చాడు. శుక్రవారం ఖాసీంవలీతో కలిసి విద్యుత్నగర్ సర్కిల్ నుంచి సంఘమేష్ సర్కిల్ వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ.. రమణ రమేష్ థియేటర్ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒమన్లో చిక్కుకున్న మహిళ సురక్షితంగా ఇంటికి..
మదనపల్లె టౌన్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి అక్కడ యజమానుల చేతిలో మోసపోయి, నరకయాతన అనుభవించిన అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన మహిళ షహానాజ్ ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ వివరాలను శనివారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) వెల్లడించారు. వాయల్పాడుకు చెందిన షహానాజ్, అబూబకర్ దంపతులకు ముగ్గురు చిన్న పిల్లలు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏజెంట్ల ద్వారా ఉపాధి కోసం షహానాజ్ ఒమన్ లోని మస్కట్కు వెళ్లారు. అక్కడ మొదటి నాలుగు నెలలు బాగానే ఉన్నప్పటికీ, గత రెండు నెలలుగా యజమానులు ఆమెతో అధికంగా పని చేయిస్తూ, కనీసం భోజనం కూడా పెట్టకుండా వేధించారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను చీకటి గదిలో బంధించి, బయటికి వెళ్లనివ్వకుండా చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆమె వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు తన దీనస్థితిని తెలుపుతూ రోదించారు. సోషల్ మీడియాలో వైరల్గా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పోలీసులు స్పందించారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్, వాయల్పాడు పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగంట్లకు వెళ్లి ఏజెంట్లను విచారణ చేశారు. ప్రభుత్వం తరఫున ఇండియన్ ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఒమన్లో ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అక్కడి అధికారుల సాయంతో ఆమెను రక్షించి, ముంబైకి తీసుకువచ్చారు. ముంబై నుంచి హైదరాబాద్కు, తర్వాత విజయవాడ నుంచి వాయల్పాడులోని వారి ఇంటికి చేర్చారు. ప్రయాణ ఖర్చులను ఉప ముఖ్యమంత్రి భరించారు. ప్రభుత్వానికి, పోలీసు సిబ్బందికి షహానాజ్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్, కలికిరి సీఐ అనిల్ కుమార్, వాయల్పాడు ఎస్ఐ తిప్పేస్వామి పాల్గొన్నారు.ఎంబసీతో సమన్వయం చేసుకుంటూ రప్పించిన ఎస్పీ -
మాకు న్యాయం చేయండి
పుంగనూరు : మా భూమిని మాకు అప్పగించి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు. మండలంలోని రాగానిపల్లెకి చెందిన దళిత మహిళ లక్ష్మమ్మ శనివారం విలేకరులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నరాయప్ప పేరుతో ఉన్న భూమి రికార్డులను.. రెవెన్యూ అధికారులు ధనికుల పేరుతో మార్చారని లక్ష్మమ్మ ఆరోపించింది. రాగానిపల్లెలో నివాసం ఉన్న చెన్నరాయప్పకు అదే గ్రామంలో సర్వే నంబరు: 337/3, ఖాతా నంబరు: 113లో 2 ఎకరాల 45 సెంట్ల భూమికి ప్రభుత్వం గతంలో పట్టా మంజూరు చేసి, పాసుపుస్తకం జారీ చేసింది. ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారులు చెన్నరాయప్ప, లక్ష్మమ్మలకు తెలియకుండా చంద్రప్ప, గౌరమ్మల పేరుతో 1బి రికార్డులు మార్చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ విషయమై బాధితురాలు జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి పీజీఆర్ఎస్లో ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేసింది. కానీ స్థానిక అధికారుల్లో చలనం లేకపోవడంతో ఆమె వీధిన పడింది. ఈ భూమికి సంబంధించి విచారణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతోంది. -
పట్టించుకునే దిక్కులేదు
తాను చైర్మన్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సహకారంతో 15 ఎకరాలకు పైగా స్థలాన్ని మార్కెట్ యార్డు నిర్మాణానికి సేకరించాం. రైల్వే ప్లై ఓవర్ దగ్గర చదును చేయడం లాంటి పనులు కూడా చేశాం. కమిటీకి రూ. 2 కోట్లకు పైగా ఆదాయం సమకూరేలా చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా మరుగునపడింది. రెండేళ్లవుతున్నా కొత్త కమిటీ ఊసే లేదు. జగన్ ప్రభుత్వం కొనసాగి ఉంటే మార్కెట్యార్డు పనులు పూర్తి చేసుకుని వినియోగంలోకి కూడా వచ్చి ఉండేది. –డీఆర్. ఉమాపతి రెడ్డి, అంగళ్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కురబలకోట మండలం -
వైద్యసేవల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కీలకం
రాజంపేట : వైద్యసేవల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ పాత్ర అత్యంత కీలకమని, అందువల్లనే ఆ కోర్సులకు డిమాండ్ పెరిగిందని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్లర్ చొప్పాగంగిరెడ్డి అన్నారు. శుక్రవారం హెల్త్సైన్సెస్ ప్రెషర్స్డేలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో హెల్త్కోర్సులకు అధిక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ప్రముఖ జనరల్ సర్జన్ డా.శ్రీకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో హెల్త్ సైన్సెస్ తీసుకొచ్చిన ఘనత ఏయూ అధినేత చొప్పాగంగిరెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబారెడ్డి, గెస్ట్ హాఫ్ ఆనర్ డా.రామ్నిఖి చక్రవర్తి, ఎఐటీఎస్ వైస్చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, అలైడ్ హైల్త్ ప్రొఫెషనల్స్ ఇన్చార్జి ద్వారకనాథరెడ్డిలతో పాటు అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లితండ్రులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సన్మానించారు. -
యువకుడు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : భూ వివాదం కారణంగా మనస్థాపం చెందిన ఓ యువకుడు విషపు ఆకులు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం చోటు చేసుకున్న ఘటనపై బాధితుని కుటుంబీకుల కథనం.. మదనపల్లె పట్టణం, నీరుకుటివారిపల్లెలోని కట్లాటపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న శివన్న (32)కు కర్ణాటకలోని మంచినీళ్ల కోట వద్ద కొంత ఇంటి స్థలం ఉంది. ఆ స్థలాన్ని అదే ఊరికి చెందిన కొందరు ఆక్రమించేందుకు యత్నించారు. వారితో గొడవపడ్డాడు. అనంతరం అక్కడే ఉన్న విషపు ఆకులు తిన్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
భార్య కాపురానికి రాలేదని..
మదనపల్లె టౌన్ : భార్య కాపురానికి రాలేదని భర్త చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యకు యత్ని ంచిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. ఘటనపై జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మదనపల్లె కదిరి రోడ్డు, అమ్మచెరువు మిట్టలో కాపురం ఉంటున్న రహీముల్లా కొడుకు చాంద్ బాషా (27) చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. భార్య హసీనా ఇటీవల భర్తతో గొడవ పడి అలిగి తన పుట్టింటికి వెళ్లి పోయింది. కాపురానికి రావాలని శుక్రవారం అత్తగారి ఇంటికి వెళ్లి భార్యను కోరి నప్పటికీ, ఆమె రాలేదు. ఇంటికి వచ్చిన చాంద్ బాషా జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఉన్న కత్తితో చేతి నరాలు కోసుకున్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు చికిత్సలు అందించడంతో కోలుకుంటూ ఉన్నాడు. వన్ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
● ఒక్క అడుగు ముందుకు పడని అంగళ్లు మార్కెట్ కమిటీ ● రెండేళ్లుగా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం ● ఆవిరైన రైతుల ఆశలుకురబలకోట : రైతులకు అండగా నిలవాల్సిన అంగళ్లు మార్కెట్ కమిటీ పేరుకు మాత్రమే పరిమితమైంది. ఆచరణకు ఆమడ దూరంలో ఉంది. కుర బలకోట, బి.కొత్తకోట మండలాల రైతుల కోసం ఏర్పాటైన ఈ మార్కెట్ కమిటీ కూటమి పాలనలో ఇంత వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి రైతులకు అనుకూలంగా ప్రత్యేక చొరవ చూపారు. ములకలచెరువు మార్కెట్ కమిటీ నుంచి 2022లో దీనిని భైఫర్ కేషన్ (విభజన) చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అంగళ్లు కేంద్రంగా ఏర్పాటైంది. తొలి చైర్మన్గా డీఆర్. ఉమాపతి రెడ్డి నియమితులయ్యారు. అప్పట్లో కురబలకోట రైల్వే ఫ్లై ఓవర్ (ఆర్ఓబీ) దగ్గర 15 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించారు. కొత్త మార్కెట్ యార్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. అప్పట్లో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. టమాటా రైతులకు ఊరటగా ఉండగలదని ఆశించారు. అయితే తర్వాత ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ మార్కెట్ కమిటీ పూర్తిగా మరుగున పడింది. ఇది ఉందన్న సంగతిని కూడా అందరూ మరచిపోయారు. ఇదివరలో అంగళ్లులోని సతీష్ బిల్డింగ్లో ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని కూడా స్థానికంగా కమతంపల్లి మార్గంలోకి మార్చారు. దీని పరిధిలో రెండు చెక్పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం అంగళ్లు పంచాయతీ అధ్వర్యంలో నడుస్తున్న టమాటా మార్కెట్, రెండు చెక్ పోస్టులు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఏడాదికి రూ.60 లక్షలకు పైగా ఆదాయం కూడా వస్తోంది. అంగళ్లు, బి.కొత్తకోట ప్రాంతాల్లో విస్తారంగా టమాటా సాగు చేస్తారు. మార్కెట్ యార్డు ఏర్పాటైతే ఎంతో సౌకర్యం. అయినా రెండేళ్లుగా ఎలాంటి ప్రగతి లేకపోవడంతో ఇది ఉన్నా లేనట్టేనని రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయమై అంగళ్లు మార్కెట్ కమిటీ కార్యాలయ కార్యదర్సి మదన్మోహన్రెడ్డిని విచారించగా మార్కెట్ యార్డు నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని వివిధ కారణాలతో ఉన్నతాధికారులు రద్దు చేశారన్నారు. కొత్తగా అంగళ్లు, ముదివేడు మార్గ మధ్యలో 20 ఎకరాల భూ సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. స్థలం కేటాయించగానే కొత్త మార్కెట్ యార్డు నిర్మాణానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. పాలక వర్గం నియామకం ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు. -
మిద్దైపెనుంచి పడి విద్యార్థి మృతి
మదనపల్లె టౌన్ : మిద్దైపె నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఎంబీఏ విద్యార్థి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో చోటు చేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి అవుట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పుంగనూరు మండలం, పాలెంపల్లి పంచాయతీ, కుక్కలపల్లికి చెందిన రామకృష్ణ కుమారుడు గంగరాజు (24) అంగళ్లు మిట్స్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉన్న తన స్నేహితుడు గోవర్ధన్ నాయక్ మదనపల్లె ఇందిరా నగర్లో ఉన్నాడు. అతని ఇంటికి వచ్చిన గంగరాజు స్నేహితునితో మిద్దైపెకి వెళ్లి మాట్లాడు తుంటుండగా.. ప్రమాదవశాత్తు కిందపడి తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు మెరుగైన వైద్యం అందించినప్పటికి పరి స్థితి విషమించి మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపారు. అనుమానస్పద స్థితిలో యవకుడు..కేవీపల్లె : అనుమానస్పద స్థితిలో యువకుడి మృతి చెందిన సంఘటన మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ కరణంవారిపల్లె సమీపంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ వెంకటశివకుమార్ కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కరణంవారిపల్లె సమీపంలోని ఓ మామిడి తోటలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా మృత దేహం కుళ్లిన స్థితిలో ఉంది. అక్కడ లభించిన ఆధారాలతో సుండుపల్లె మండలం ముడుంపాడు నగిరికి చెందిన మల్లిఖార్జున నాయుడు (35)గా గుర్తించారు. ఐదు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
టీడీపీ మూకలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
తిరుపతి తుడా : రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ మూకలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని శుక్రవారం రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాయచోటిలో మంత్రి రామ్ప్రసాద్రెడ్డి భూ దందాలు, రౌడీయిజం, గంజాయి అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. రామ్ప్రసాద్రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వారికి ఇదే పరిస్థితి భవిష్యత్లో ఎదురవుతుందన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దాడి చేయడంపై ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరిక -
పొలాలకు వెళ్లే దారి కోసం రైతుల పాట్లు
రాయచోటి : వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దారి కావాలంటూ రైతులు నాలుగు నెలలుగా అధికారుల చూట్టూ తిరుగుతూ పడరాని పాట్లు పడుతున్నారు. మండల పరిధిలోని దేవపట్ల గ్రామం కట్టుగుత్తపల్లెకు చెందిన 20 మంది రైతులు శుక్రవారం వీరు తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ తహసీల్దార్ సుబ్రమణ్యంరెడ్డి లేరు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ కట్టుగుత్తపల్లెకు చెందిన ఓ వ్యక్తి డీకేటీ పొలంలో కాలువ సైతం పూడ్చి దారికి అడ్డుపడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 1340–7లో చెంచయ్య, సుబ్బమ్మ పేర్లమీద డీకేటీ పట్టాలు ఇచ్చారు. సుబ్బమ్మ వృత్తి రీత్యా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగికి ఎలా డీ పట్టా ఇచ్చారంటూ రైతులు ప్రశ్నించారు. ఇక్కడ పొలంలో దారి ఇస్తే తప్ప పైన ఉన్న రైతుల పొలాలకు వెళ్లే వీలుండదు. సర్వే నంబర్ 204లో రామ సుబ్బమ్మ పట్టాభూమి, 196–2లో జయరామ్కి సంబంధించి చుక్కుల భూమి ఉన్నట్లు తెలిపారు. వీరితో పాటు మరికొందరు రైతులు ఉన్నారు. పొలాల్లోకి దారి వేయకుండా అడ్డుపడుతున్న వ్యక్తిని అధికారులు పలు మార్లు పిలిచి మాట్లాడితే రైతులకు ఇక్కడ దారి ఇస్తే నేను పురుగుల మందుతాగి చనిపోతానని బెదిరిస్తూ అధికారు విధులకు భంగం కలిగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని రైతులు ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా అతను బెదిరింపులకు పాల్పడటం వాస్తవమేనని, అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వివరించారు. -
అధికారం అండతో నిర్మాణ పనులు పూడ్చివేత
సాక్షి, మదనపల్లె : సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు అన్న కారణంగా వైఎస్సార్సీపీ నిమ్మనపల్లె మండలం సోషల్ మీడియా ఇన్చార్జి టి.రవితేజ చేపట్టిన నీటితొట్టె నిర్మాణాన్ని శుక్రవారం అధికారులు ఏకపక్షంగా జేసీబీతో పూడ్చివేశారు. 2005లో నిమ్మనపల్లిలో రవితేజ తల్లి సుజాతకు ఒకటిన్నర సెంటు పట్టా ఇచ్చారు. ఈమెతోపాటు మరికొందరికి ఇచ్చారు. ఈ ఇంటి స్థలం ఆవరణలో నీటి తొట్టి, మరుగుదొడ్డికి పిట్ నిర్మాణం కోసం గుంతలు తవ్వారు. దీనికోసం రూ.లక్ష దాకా ఖర్చు పెట్టారు. నీటి తొట్టె నిర్మాణం కోసం పనులు చేపడుతున్నా అధికారులకు అది ఆక్రమించి చేస్తున్న పనులు అని అడ్డగించలేదు. స్థలం అక్రమించి చేస్తున్న నిర్మాణం కూడా కాదు. అయితే ఎలాగైనా వేధించాలన్న టీడీపీ నేతల కుతంత్రంతో అధికారులను శుక్రవారం రంగంలోకి దింపారు. ఎస్ఐ, ఎంపీడీవో, పంచాయతీ ప్రత్యేక అధికారి, మహిళా పోలీసులు రవితేజ ఇంటి వద్దకు చేరుకున్నారు. తవ్విన గుంత ప్రభుత్వ స్థలంలో ఉందని ఆరోపించారు. నిర్మాణం పూడ్చేందుకు ప్రయత్నిస్తుండగా వద్దంటూ కుటుంబీకులు వేడుకుంటున్నా పట్టించుకోలేదు. ఒకవేళ ఆక్రమణ ఉంటే తామే పూడ్చివేస్తామని రవితేజ అధికారులకు చెబుతున్నా వినకుండా మొత్తం నిర్మాణ పనులను దగ్గరుండి జేసీబీతో పూడ్చి వేయించారు. నిర్మాణం కోసం అక్కడ ఉంచిన ఇటుకలు, సిమెంట్ పాడయ్యాయి. వైఎస్సార్సీపీలో రవితేజ చురుగ్గా వ్యవహరించడం టీడీపీ నేతలు జీర్జీంచుకోలేకపోతున్నారు. దీంతో ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలన్న లక్ష్యంతో ఇంటి కోసం చేపట్టిన నీటితోట్టి నిర్మాణ పనులపై కక్ష సాధించారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించలేదని, ఆక్రమణ ఉంటే తామే పూర్తి చేస్తామని చెబుతున్నా అధికారులు కనీసం పట్టించుకోలేదు. వచ్చిన పని అయ్యిందంటూ గుంతను పూడ్చి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంటి పనులపై కక్ష సాధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.వైఎస్సార్సీపీ నాయకుడిపై కక్ష సాధింపు -
ఎన్సీసీ క్యాడెట్స్ సత్తా
కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎన్సీసీ క్యాడెట్లు రామిరెడ్డి లక్ష్మణ్, గంగరపు జ్యోతీశ్వర్, ఎం.భార్గవి జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో హిమాలయ శిఖరాలను అధిరోహించి యూనివర్సిటీకి గర్వకారణంగా నిలిచారని వీసీ యువరాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 15 మంది ఎన్సీసీ క్యాడెట్లు హిమాలయన్ సెంటర్ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో టూరిజం నిర్వహించిన పర్వతారోహణ శిక్షణలో పాల్గొన్నారన్నారు. వీరిలో ముగ్గురు మిట్స్ విద్యార్థులు భాగస్వాములయ్యాయన్నారు. 6582 అడుగుల ఎత్తయిన హిమాలయ శిఖర ప్రాంతంలో ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్,పారా గ్లైడింగ్, రాక్ క్రాఫ్ట్, ఐస్ క్రాఫ్ట్ రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొని సత్తా చాటారన్నారు. క్యాంప్ కోర్సు డైరెక్టర్ కాజీ షెర్పా, ట్రైనింగ్ ఆఫీసర్ సకుల్ గిరి పర్యవేక్షణలో సాగిందన్నారు. యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ నాదేళ్ల విజయ భాస్కర్ చౌదరి. ప్రో చాన్స్లర్ నాదేళ్ల ద్వారకనాఽథ్ వీరిని అభినందించారు. -
ఇద్దరిపై అట్రాసిటీ కేసు
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : దాడి చేసి, కులం పేరుతో దూషించిన ఇద్దరిపై శుక్రవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు నిమ్మనపల్లె ఎస్సై రామకష్ణ తెలిపారు. మండలంలోని కొండయ్యగారిపల్లెకు చెందిన కత్తి శ్రావణి కూలి పనులకు వెళ్లేదన్నారు. అదే ఊరికే చెందిన రెడ్డిశివక్రిష్ణకు, శ్రావణి కి అక్రమ సంబంధం ఉందని రెడ్డిశివక్రిష్ణ భార్య శోభన అనుమానిస్తూ వుండేదన్నారు. అప్పుడప్పుడు శ్రావణిని చూసి తిట్టడమే కాకుండా శుక్రవారం ఇంటికి వెళ్లి కొట్టి కులం పేరుతో దూషించిందన్నారు. దీంతో బాదితురాలు ఫిర్యాదు పై రెడ్డిశివకష్ణ, శోభన పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇంటికి చేరిన మస్కట్ మహిళవాల్మీకిపురం : మస్కట్లో సేఠ్్ వేధిస్తున్నాడంటూ వీడియో ద్వారా వైరల్ అయిన వాల్మీకిపురం పట్టణం నమాజ్కట్టవీధికి చెందిన మహిళ షహనాజ్ శుక్రవారం ఇంటికి చేరుకుంది. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని బాధితురాలిని మంగళగిరిలో వైద్య పరీక్షలు చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం కారులో విజయవాడ నుంచి శుక్రవారం రాత్రి వాల్మీకిపురాని చేరుకుంది. తన ముగ్గురు పిల్లలను హత్తుకొని బోరున విలపించింది. దాడిలో గాయపడిన మహిళ మృతిలక్కిరెడ్డిపల్లి : మండలంలోని పందిళ్లపల్లి కస్సా బీసీ కాలనీకి చెందిన పసుపులేటి సుబ్బమ్మ (60)కి ఎదురింటి వారితో పదిరోజుల క్రితం ఇంటి ముందుర కసువు, నీళ్లకోసం గొడవపడిన ఘర్షణలో గాయపడింది. చికిత్సపొందుతూ గురువారం అర్దరాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ గోల్గొండ శోభ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు పసుపులేటి సుబ్బమ్మ ఎదురింటి వేణు, సావిత్రిలు ఇంటిముందర కసువు, నీళ్లు కోసం ఇరువురు ఘర్షణపడ్డారు. ఈ ఘర్షణలో సుబ్బమ్మ తలకు తీవ్రగాయమైంది. ఆమెను లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సుబ్బమ్మను తిరుపతి రుయాకు తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి సుబ్బమ్మ మృతి చెందినట్లు ఎస్ఐ గోల్కొండ శోభ తెలిపారు. ఈ మేరకు వేణు, సావిత్రిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సీఐ కృష్ణంరాజ్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చౌక దుకాణంలో తనిఖీలు మైదుకూరు : పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో ఓ చౌక దుకాణంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీలోని 10వ వార్డు పరిధిలో కొన్ని గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే 34వ దుకాణంలో తనిఖీలు చేశారు. బియ్యం, జొన్నలు, అంగన్వాడీలకు వచ్చే సన్నబియ్యం నిల్వలు పంపిణీపై ఆరా తీశారు. -
నీటి ఎద్దడి లేకుండా చూడండి
కడప సెవెన్రోడ్స్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన నీటి ఎద్దడిపై ఆరా తీశారు. ఇందుకు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు బదులిస్తూ రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, చెన్నూరు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ తమకు నిధులు కావాలంటూ తరచూ జెడ్పీటీసీలు అడుగుతుంటారని చెప్పారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే నిధులు సమకూరుతాయని తెలిపారు. గ్రామీణ రహదారుల గురించి జెడ్పీ చైర్మన్ సమీక్షించారు. ఇందుకు పంచాయతీరాజ్ ఎస్ఈ బదులిస్తూ జిల్లాలో 20 బీటీ రోడ్ల మరమ్మతులకు రూ. 65 కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ జరుగుతోందన్నారు. 74 బీటీ రోడ్ల పనులు రూ. 35 కోట్ల తో, 79 మెటల్ రోడ్ల పనులు రూ. 17 కోట్లతో పూర్తి చేశామని వివరించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లించాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య మాట్లాడుతూ జువారి సిమెంటు కర్మాగారం నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ కారణంగా నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము ధూళి వద్ద ఇప్పటికే 10 మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడి మృతి చెందారన్నారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ తమ మండలంలో 15 ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లారని, ఇందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి -
తాగునీటి కలుషితంపై అప్రమత్తం
సాక్షి, మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీలో తాగునీటి కలుషితంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన కమీషనర్ కే. ప్రమీలతో కలిసి విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం సుదీర్ఘంగా నిర్వహించారు. తాగునీరు, అభివృద్ధి పనులు, పచ్చదనం, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, ఆదాయ మార్గాల పెంపు తదితర అంశాలపై విభాగాల వారిగా సమీక్షించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ మురికినీరు తాగునీటితో కలిసి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరా విషయంలో లోటు పాట్లు సరి చేసుకోవాలని, ఇబ్బంది లేకుండా ప్రజలకు తాగునీరు అందించాలన్నారు. మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయాన్ని పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా ప్రతి విభాగాధికారి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీపై సమీక్షలో జేసీ -
● ఎస్ఈ కార్యాలయంలో తన్నుకున్న పచ్చ నేతలు
సాక్షి ప్రతినిధి, కడప: కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఇష్టారాజ్యంగా నడుచుకుంటోంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా దోపిడీదారులకు అండగా నిలుస్తోంది. టెండర్ బిడ్ను అడ్డగోలుగా రద్దు చేస్తూ అయినా వారికి కట్టబెట్టే చర్యలను ఎంచుకుంది. నిబంధనల మేరకు తక్కువ రేట్లకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సిందిపోయి, ఏకంగా టెండర్ బిడ్నే రద్దు చేశా రు. అదే పనికి తిరిగి టెండర్కు పిలవడం, అయిన వారికి కట్ట బెట్టడం ఇదే వరుసను కొనసాగిస్తున్నారు. తెలుగుతమ్ముళ్లుతో పనులు చేయించడం తర్వాత టెండర్లు తంతు ప్రక్రియను పూర్తి చేయిస్తున్నారు. ● కడప నగర పరిధిలోని పుష్పగిరి స్కూల్ రోడ్డు వెళ్లే రహదారిపై చంద్రవర్దిని నగర్ ఆర్చి నుంచి చివరి వరకు రోడ్డు వేసేందుకు (టెండర్ ఐడీ 903811) రూ.16.15లక్షలకు టెండర్లు పిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న టెండర్లు పిలిచి 24వ తేది తుది గడువు నిర్ణయించారు. ఆ టెండర్లను ఓపెన్ చేయగా ఇద్దరు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అందులో ఎస్వీఎస్ఎస్ కన్స్ట్రక్షన్ 1.17శాతం తక్కువకు కోట్ చేయగా, ఎస్.యల్లారెడ్డి 10.08శాతం తక్కువకు కోట్ చేశారు. 10శాతం తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్ యల్లారెడ్డి పనులు చేసేందుకు సుముఖంగా ఉన్నానని తనకు పనిని అప్పగించాలని కమిషనర్కు లేఖ కూడా ఇచ్చారు. అధికారులు తిరిగి అదే పనిని రీ టెండర్లకు ఆహ్వానించారు. 8వతేది శుక్రవారం సాయంత్రం 3వ కాల్గా టెండర్ కొనసాగించారు. ఇలా కార్పొరేషన్లో నిబంధనలు విరుద్ధంగా తెలుగుతమ్ముళ్లుకు వంతపాడుతున్నారు. దీన్నిబట్టి కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎంత నీతివంతంగా పనిచేస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వింతపోకడలో ఇంజనీరింగ్ సెక్షన్... కార్పొరేషన్లో ఇంజనీరింగ్ సెక్షన్ వింత పోకడలో ఉండిపోయింది. టెండర్లు బిడ్లో కాంట్రాక్టర్లు పాల్గొంటే బెదిరింపులకు దిగుతోందనే ఆరోపణలు వెంటాడుతున్నాయి. అయినప్పటికీ ఎవరైనా కాంట్రాక్టర్లు పాల్గొంటే విత్డ్రా చేయించడం లేదంటే టెండర్లు రద్దు చేయించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలా కుదరకపోతే అనుకున్న వ్యక్తులతో పనులు ముందే చేయించి తర్వాత టెండర్లకు పోతున్నారు. ప్రస్తుతం చంద్రవర్ధిని నగర్ 3వ కాల్గా పిలిచిన 7921/జీఎఫ్/24–25/ఏటీఓ/ఎంసీకే బిడ్ అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ పనికి టీడీపీ నేతలతో ముందే చేయించారు. తర్వాత టెండర్లు పక్రియను కొనసాగించారు. ఇదే పక్రియ పరిపాటిగా ఇంజనీరింగ్ విభాగం కొనసాగిస్తోంది. రోడ్డు ముందే వేయించి ఆపై టెండర్లు 10శాతం లెస్కు టెండర్ దాఖలు చేసినా బిడ్ రద్దు తెలుగుతమ్ముళ్ల అక్రమార్జనకు అండగా యంత్రాంగం ఇంజనీరింగ్ విభాగం అడ్డగోలు వ్యవహారం కారణంగా ఇటీవల తెలుగుతమ్ముళ్లు పరస్పరం తన్నుకున్నారు. అడ్డగోలు పనుల పందేరాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో పనుల కోసం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోసాగారు. ఈ నేపధ్యంలో బుచ్చంపల్లెలో చేపట్టిన పనుల కోసం తెలుగుతమ్ముళ్లు ఇంజనీరింగ్ కార్యాయ లంలో పరస్పరం దాడులు చేసుకొని కార్యాలయం ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలకు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం వేదికగా నిలుస్తోంది. ఇంతటి దుశ్చర్యలు కేఎంసీలో చోటుచేసుకుంటున్నా ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ శ్రీధర్లో కనీస స్పందన లేకపోవడంతోనే ఇంజనీరింగ్ విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహహారిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
కలసికట్టుగా అభివృద్ధి చేసుకోండి
పెద్దతిప్పసముద్రం: వర్గ విభేధాలకు తావు లేకుండా కలసి మెలసి మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే కొంత మంది అధికారులు తమకు సహకరించలేదని పలువురు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం సీఈఓ మండల కేంద్రానికి విచ్చేసి విచారణ చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎన్ని ఉన్నాయి, ఏయే పనికి ఎన్ని రూ.లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, చెత్త నిర్వహణ ఎలా ఉంది, బ్యాటరీతో నడిచే ఈ ఆటోలు ఉన్నాయా, మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా చెత్తరహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి నివారణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోతుపేట, దేవప్పకోట గ్రామ పంచాయతీల్లో సచివాలయాలు లేక ఈ గ్రామాల్లో పని చేసే అధికారులు ప్రజలకు ఉపయోగకరమైన గ్రామ సభలు నిర్వహించాలంటే చెట్ల కింద, రచ్చ బండల వద్ద జరపాల్సిన దుస్థితి నెలకొందన్నారు. భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ చూపాలని నాయకులు సీఈఓకు విన్నవించారు. ఆయన వెంట మదనపల్లి డివిజన్ డీఎల్డీవో లక్ష్మీపతి, ఎంపీడీవో చంద్రశేఖర్రెడ్డి, డిప్యూటి ఎంపీడీవో ప్రతాప్రెడ్డి, ఎంఈఓ టూ గౌస్పీర్, ఏవో శ్రీధర్ తదితరులు ఉన్నారు. -
విధులకు మంగళం.. ఆఫీసులకు తాళం
మదనపల్లెలోని ప్రభుత్వశాఖల జిల్లా కార్యాలయాల పనితీరు ఇంకా మెరుగుపడలేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తాళం వేసిన ఈ కార్యాలయాలు. శుక్రవారం పనిదినమే అయినా కార్యాలయాలకు తాళాలు కనిపించాయి. ఇలా ఎందుకు తాళాలు పడ్డాయో ఉన్నతాధికారులే విచారించాల్సి ఉంది. మడికయ్యల శివాలయం వెళ్లేదారిలోని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా క్రీడాధికార శాఖ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటం కనిపించింది. ఇదే ప్రాంగణంలోని మిగతాశాఖల కార్యాలయాల్లో ఆశాఖల అధికారులు విధుల్లో ఉండగా ఈశాఖల కార్యాలయాలు మాత్రం తెరచుకోలేదు. విధుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యానికి ఈ చిత్రాలే సాక్ష్యాలు. –సాక్షి, మదనపల్లె తాళాలువేసిన క్రీడా, మైనార్టీ సంక్షేమ జిల్లా కార్యాలయాలు, తెరుచుకోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయం -
గంగమ్మా.. దీవించమ్మా
రాజంపేట టౌన్: పట్టణంలోని బలిజపల్లె గ్రామంలో గత రెండు రోజులుగా జరిగిన గంగమ్మ జాతర ముగిసింది.శుక్రవారం ఉదయం అమ్మవారి ప్రతిమను ఊరేగింపుగా పొలిమేర్లకు సాగనంపడంతో ఈ ఏడాదికి జాతర ఘట్టం ఘనంగా పరిసమాప్తమైంది. గంగమ్మను పొలిమేర్లకు తరలించే ఊరేగింపు కార్యక్రమం వేకువ జామున ప్రారంభమై ఉదయం 8 గంటల వరకు సాగింది.ఈసందర్భంగా పలువురు భక్తులు గంగమ్మకు ఎదురుగుంభంగా ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. ఆసాదులు దారిపొడవునా కథ చెబుతూ.. దీవెనలిస్తూ సాగారు. ఈ ఏడాది జాతరలో దాదాపు లక్షమందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నట్లు నిర్వాహకుల అంచనా. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలు గురువారం పొద్దుపోయే వరకు దారివెంబడి నీళ్లు,, మజ్జిగ పాకెట్లు, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. జాతర నిర్వాహకులు, పోలీసు అధికారుల సమష్టి కృషి ఫలితంగా బలిజపల్లె గంగమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్హెగ్డే ఆధ్వర్యంలో రాజంపేట అర్బన్, మన్నూరు సీఐలు, ఎస్ఐలు, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బంది, ముఖ్యంగా మహిళా పోలీసులు రాత్రి వేళలో సైతం భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించడంలో, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాతర ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు కృషి చేశారు. కోటి రూపాయలకు పైగా వ్యాపారం బలిజపల్లె గంగమ్మ జాతరను పురస్కరించుకొని వివిధ రకాల వ్యాపారాలు జోరుగా సాగాయి. వందలాది మంది భక్తులు గంగమ్మకు నైవేద్యాలుగా పొట్టేళ్లు, మేకపోతులు, కోడిపుంజులు వంటివి సమర్పించారు. అలాగే బలిజపల్లె గ్రామంలోనే కాక పరిసర ప్రాంతాల్లో వ్యాపారులు వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు చేశారు.ఈ ఏడాది దాదాపు కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరిగి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. ముగిసిన జాతర ఘట్టం పొలిమేర్లకు తరలిన అమ్మవారు -
అధ్యాపక నియామక నోటిఫికేషన్ రద్దు
కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి తీర్మానం, ప్రభుత్వ జీఓ నెం. 70 ప్రకారం గతంలో ఇచ్చిన 138 అధ్యాపక పోస్టుల భర్తీ నోటిఫికేషన్ను రద్దు చేశామని రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, పొఫెసర్ పోస్టులు ఉన్నాయన్నారు. 2023 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు రుసుమును తిరిగి పొందేందుకు సంబంధిత సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ను పరిశీలించాలని పేర్కొన్నారు. కొత్త నోటిఫికేషన్ల తేదీలు, ఇతర వివరాలు విడిగా ప్రకటిస్తామని వివరించారు. పీలేరు: నియోజకవర్గంలో వివిధ ఆలయాల పునరుద్ధరణకు సర్వశ్రేయో నిధులు రూ. 6.78 కోట్లు మంజూరైనట్లు దేవాదాయ శాఖ ఈఓ మంజుల తెలిపారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. పీలేరు మండలం దొడ్డిపల్లె పంచాయతీ శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి రూ. 63,50,000, అన్నంగివారిపల్లె శ్రీ మాతమ్మ ఆలయానికి రూ. 75,00,000, వాల్మీకిపురం మండలం చింతపర్తిలో శ్రీ గుంటివీర గంగమ్మ ఆలయానికి రూ. రూ.కోటి, మంచూరు శ్రీ సోమేశ్వరస్వామి ఆలయానికి రూ. కోటి, గుర్రంకొండ మండలం చెర్లోపల్లె రెడ్డెమ్మతల్లి ఆలయానికి రూ. 2.20 కోట్లు, కలికిరి మండలం గుండ్లూరు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి రూ. 1.20 కోట్లు మంజూరైనట్లు వివరించారు. సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలంలోని బయ్యప్పగారిపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 124 పక్కనున్న గుట్టలో భూ ఆక్రమణ జరిగిందని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతోపాటు ఏ విధంగా ఆక్రమణ జరిగింది, వృక్ష సంపద ఎలా నాశనమైందో వివరిస్తూ ఆధారాలు సమర్పించారు. వివరాల్లోకి వెళితే.. తోకలపల్లి చెందిన రైతుల పేరిట ఉన్న పట్టా భూములకు ఆనుకొని గుట్ట ప్రాంతం ఉంది. దీనిపై కొంతమంది కన్నేశారు. గుట్టను తవ్వేసి, అందులోని చెట్లను నాశనం చేశారు. పర్యావరణం దెబ్బతినేలా భూమి స్వరూపాన్ని మార్చేసి ఆక్రమించారు. దీనివల్ల పర్యావరణకు నష్టం కలగడంతో గుట్ట ఆక్రమణ గురైందని ఫిర్యాదులో గ్రామస్తులు వివరించారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కాగా ఈ ఫిర్యాదుతో పాటు గతంలో గుట్ట ప్రాంతం ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది, ఎంత ధ్వంసం అయింది అన్న వివరాలు తెలిపే ఫోటోలను ఫిర్యాదుతో పాటు అధికారులకు పంపించారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుని జయంత్యుత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరిరోజు తాళ్లపాక ధ్యానమందిరంలో మోహన్, గోపికృష్ణ బృందం సంకీరన్తలు ఆలపించారు. బోయనపల్లె గ్రామానికి చెందిన శ్రీ కోదండరామ కళానాట్యమండలి మహేంద్రస్వామి ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జీవిత ఘట్టాల ప్రదర్శన కన్నులపండువగా సాగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ సీ.లత, తాళ్లపాక దేవాలయాల ఇన్స్పెక్టర్ బాలాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలను ధర్మాచార్యులు గంగనపల్లె వెంకటరమణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో కళాకారులు రూపరాజు, శిరీష, వెంకటసుబ్బయ్య, చెన్నారెడ్డి, నారాయణ యాదవ్, హర్మోనియం సుబ్బరాయుడు, వయోలిన్ చంగల్రాయులు, తబలా ప్రవీణకుమార్, శృతి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘మిషన్ ఎయిడ్స్’ను విజయవంతం చేయండి
మదనపల్లె టౌన్: మిషన్ ఎయిడ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎయిడ్స్ నియంత్రణ మండలి (దిశా) జిల్లా క్లస్టర్ మేనేజర్ భాస్కర్ కోరారు. గురువారం మదనపల్లె ఏఆర్టీ సెంటర్లో వైద్య సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైరిస్క్ గ్రూపులతో పాటు, అనుమానం ఉన్నవారికి సైతం హెచ్ఐవీ పరీక్షలు చేయాలన్నారు. వ్యాధిగ్రస్తులకు ఈ ఆర్టీవో మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. మదనపల్లె టౌన్: మదనపల్లె జిల్లా ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్లో రక్తం కొరత లేకుండా చూసుకోవాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ రాధిక సూచించారు. గురువారం ఆమె మదనపల్లి బ్లడ్ బ్యాంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్లడ్ బ్యాంకులోని నిల్వ లు, రికార్డులను పరిశీలించారు. రక్తదానం చేసే దాతలు ప్రాణదానంతో సమానమని తెలపాలన్నారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. బ్లడ్ బ్యాంకు పరిధిలో ప్రతి నెలా క్యాంపులు నిర్వహించాలన్నారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు సేకరించిన రక్తం 30శాతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకు అందజేయాలన్నారు. ఎవరైనా రక్తం అమ్మినట్లు సమాచారం తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా క్లస్టర్ ప్రోగ్రాం అధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న సైట్ ఇంజనీర్లు, డ్రాప్ట్మెన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ సున్నా అనూరాధ తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు సైట్ ఇంజనీర్లు నాలుగు, డ్రాప్ట్మెన్ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒప్పందన ప్రాతిపదికన భర్తీ చేస్తామని వివరించారు. సైట్ ఇంజనీర్ పోస్టుకు సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ లేదా డిప్లోమా అర్హత కలిగి ఉండాలని, డ్రాప్ట్మెన్ పోస్టుకు సివిల్ ఇంజనీరింగ్ బీటెక్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఈనెల 14వతేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఎంపికై న సిబ్బంది జిల్లాలోని విద్యామౌళిక సదుపాయాలు పనులు, పాఠశాలలు, కేజీబీవీ భవన నిర్మాణాలు, మండల విద్యాశాఖ కార్యాలయాల మరమ్మతులు తదితర సివిల్ పనులు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. సమావేశంలో ఎంఈఓ–2 రాజగోపాల్ పాల్గొన్నారు. -
మధురఫలం.. విషతుల్యం
● కార్బైడ్తో ఆరోగ్యంపై తీవ్రప్రభావం ● మార్కెట్లోకి విచ్చలవిడిగా పండ్లు ● దాడులు చేసిన దాఖాలాలు లేవు ● అమలుకాని ఆహారసంరక్షణ చట్టంరాజంపేట : ఫలరాజుగా పేరొందిన మామిడి కొందరు వ్యాపారుల అత్యాశ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విషతుల్యంగా మారుతోంది. పక్వానికి రాకముందే కాయలను విష రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నారు. కార్బైడ్తో మాగిన పండ్లు తిన్న వారికి అనారోగ్యసమస్యలు వస్తున్నాయి. ఒకసారి తిన్న వ్యక్తి మరోసారి తినేందుకు ఇష్టపడటంలేదు. రాజంపేట వ్యవసాయమార్కెట్ యార్డులో సౌకర్యాలు లేక రైల్వే కోడూరుకు మామిడి కాయలను తీసుకెళుతున్నారు. ధరలేక.. తగ్గిన మామిడిసాగు.. మామిడికి సరైన ధర లేదనే కారణంతో జిల్లాలో మామిడి సాగు తగ్గిపోయింది. నిల్వ ఉంచుకునేందుకు ఏసీ గౌడౌన్లు లేవు. ఎగుమతులకు సరైన అవకాశాలు లేవు. దళారుల వల్ల మామిడి రైతులు నష్టపోతున్నారు. తినేవాడికి..పండించే వాడికి మధ్యలో దళారులకు లాభం చేకూరుతోంది. కాపు వచ్చేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. తియ్యటిపండ్ల వెనుక చేదు నిజాలు.. 2011 ఆహార భద్రత ప్రమణాల ప్రకారం ప్రభుత్వం కార్బైడ్, ఎసిటిలిన్ రసాయనాలను నిషేధించింది, సహజంగా పండించే ఇథలిన్కు మాత్రమే 100 పీపీఎం వరకు వినియోగించేందుకు అనుమతి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు 20కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథలిన్ను వినియోగించాల్సి ఉంటుంది. వ్యాపారులు పండ్లు మేలిమిగా కనిపించేందుకు కార్బైడ్ను వినియోగిస్తున్నారు. అమోదించిన ఇథిలిన్తో పోల్చితే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌకగా లభిస్తాయి. త్వరగా పండ్లు మాగుతాయి. దీంతో వ్యాపారులు యథేచ్చగా కార్బైడ్ వాడుతున్నారు. తింటే ఏమవుతుందంటే.. ప్రమాదకర రసాయనాలతో పక్వానికి వచ్చిన పండ్లను తింటే దీర్ఘకాలిక సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కడుపులో పుండ్లు ఏర్పడతాయి. కాలేయం, జీర్ణకోశం దెబ్బతింటాయని, క్యాన్సర్ వంటివి వ్యాపించే ప్రమాదం ఉందని, కాళ్లు, చేతులు, తిమ్మర్లు రావడం శరీరం పై మచ్చలు వస్తాయని చెబుతున్నారు. కాల్షియం కాౖర్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలిన్ వాయువు నాడీవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని, దీని వల్ల తలనొప్పి , దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయని, గర్భిణుల్లో హోర్మన్లు దారితప్పుతాయని చెబుతున్నారు. జరిమానా.. జైలు శిక్ష తప్పదు.. ఆహారసంరక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కాల్షియం కార్బైడ్, ఇతర రసాయనాలతో మామిడిపండ్లను మాగబెట్టినా, అమ్మినా ఏడాది జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో అధికారులు కొన్నేళ్లుగా దాడులు చేసిన దాఖాలాలు లేవు. దీంతో విచ్చలవిడిగా ప్రమాదకర రసాయనాలతో మాగబెట్టిన పండ్లను వ్యాపారులు విక్రయిస్తూ.. ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారు. వ్యాపారులు పండ్లు పక్వానికి రాకముందే కాయలు కోసి మండీలకు తరలించి కార్బైడ్ ఇతర ప్రమాదకర రసాయనాలు వినియోగించి మాగబెడుతున్నారు. మాగబెట్టిన వాటిని మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. వీధి వ్యాపారులు మండ్లీలో నుంచి వీటిని తెచ్చుకొని వ్యాపారాలు సాగిస్తూ అనారోగ్యాన్ని పంచుతున్నారు. -
మన్యం వీరుడు అల్లూరి
సాక్షి, మదనపల్లె: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, పోరాట స్ఫూర్తి, ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. గురువారం కలెక్టరేట్ హాల్లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన విప్లవ యోధుడని అన్నారు. అల్లూరి పోరాట ఫలితంగానే గిరిజన సంక్షేమం, అటవీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, డ్వామా పీడీ వెంకటరత్నం, స్టెప్ అధికారి నారాయణ, శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జేసీ శివ్ నారాయణ శర్మ -
అధికారులకు పట్టడం లేదు!
గుర్రంకొండ: జిల్లాలో ఇసుక అక్రమ రవాణకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. రాత్రింబవళ్లు ఇసుక తరలిపోతూనే ఉంది. దీనికితోడు పట్ట పగలు ఏంచక్కా పట్టలు కట్టుకోకుండా మరీ ఇసుక టిప్పర్లు వెళ్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. పట్టలు లేకపోవడంతో టిప్పర్ల దారి వెంబడి ఇసుక రోడ్డుపై రాలిపడుతోంది. గాలికి వెనుకపోయే వాహనదారుల కళ్లల్లో పడుతోంది. దీంతో ద్విచక్రవాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈవిషయమై వాహనదారులకు ఇసుక టిప్పర్ల డ్రైవర్లకు తరచూ ఘర్షణ జరుగుతోంది. జిల్లా నలుమూలల నుంచి ఇసుక టిప్పర్లు గుర్రంకొండ మీదుగా మదనపల్లె వైపు, కర్ణాటక వైపు అనునిత్యం వెళుతున్నాయి. ప్రతిరోజు 30నుంచి 40 ఇసుక టిప్పర్లు రాత్రింబవళ్లు వెళుతున్నాయి. కనీసం ఈ టిప్పర్లకు అనుమతి ఉందా లేదా రికార్డులు సరిగ్గా ఉన్నాయా లేవా అని తనిఖీ చేసే అధికారులు కరువయ్యారు. గతంలో టిప్పర్లపైనుంచి ఇసుక గాలికి ఎగిరి వెనుకవైపు వచ్చే వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్లాస్టిక్ పట్టగానీ నర్శరీ జాలీగానీ ఏర్పాటు చేసుకొని వెళ్లేవారు. ప్రస్తుతం ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇష్టానుసారం జనావాసాల మధ్యలో వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. రాత్రింబవళ్లు టిప్పర్లలోజోరుగా ఇసుక రవాణా పట్టలు కప్పకుండా వెళుతుండడంతోకళ్లల్లో పడుతున్న ఇసుక వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్న వైనం -
దేవుడా వీరు చేసిన పాపమేమి!
పెద్దతిప్పసముద్రం : అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లిలో గత మూడు రోజుల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబీకులు, ఆత్మీయుల రోదనలతో ఆ ప్రాంతం విషాదంతో నిండిపోయింది. ఒకే కుటుంబంలోని తల్లి, కుమారుడి అకాల మరణం చూపరులను కంట తడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే మద్దయ్యగారిపల్లికి చెందిన షేక్ మగ్బూల్, మైబూన్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఈ దంపతుల చిన్న కుమారుడు షేక్ మున్నా (35) నాలుగేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. పెద్ద కుమారుడు షేక్ షామీర్ (45) బుధవారం అతిగా మధ్యం తాగి అపస్మారకస్థితికి చేరుకోవడంతో కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గురువారం షామీర్ అంతిమ సంస్కారానికి బంధువులు సమాయత్తం అవుతుండగా మృతుడి తల్లి మైబూన్ (65) ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స కోసం మండల కేంద్రంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా అర్ధంతరంగా కొడుకులిద్దరూ, ఇన్నాళ్లూ తనకు చేదోడు వాదోడుగా ఉన్న భార్య అనంత లోకాలకు వెళ్లిపోవడంతో షేక్ మగ్బూల్ లోలోపలే కుమిలిపోతున్నాడు.కుమారుడి అంతిమ సంస్కారం రోజే తల్లి మృతి -
నేటి నుంచి గండిలో మహాకుంభాభిషేక మహోత్సవాలు
చక్రాయపేట: ప్రముఖ గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. నాలుగున్నరేళ్లుగా అంజన్న మూల విరాట్ దర్శనం లేక నిరుత్సాహంతో ఉన్న భక్తులకు కుంభాభిషేకం అనంతరం దర్శనం కలగనుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి సుమారు రూ. 30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గండి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మహాకుంభాభిషేకం సందర్భంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో కార్యక్రమాలు మొదలవుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి పట్టెం గురుప్రసాద్ తెలిపారు 9న శ్రీరామ సహస్ర లక్ష తులసీ అర్చన, 10న సీతా సహస్ర లక్ష కుంకుమార్చన, 11న ఆంజనేయ సహస్రనామ నాగవళ్లి దళార్చన, 12న హనుమజ్జయంతి సందర్భంగా మూలవర్లకు సహస్ర కలశాభిషేకం, చివరిరోజు 13న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. -
కారు ఢీకొని ఐదుగురికి గాయాలు
మదనపల్లె టౌన్ : కారు ఢీకొని ఐదుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం ఉదయం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం నుంచి మదనపల్లెకు వస్తున్న ఓ కారు వేంపల్లి సమీపంలోని బెంగళూరు రోడ్డు, రెడీ ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద మదనపల్లెకు కూలి పనులకు వెళ్తున్న మూడు బైక్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చీకిలబైలు గ్రామం జోలపేటకు చెందిన రామలక్ష్మి, చలపతి, తిప్పారెడ్డిగారిపల్లెకు చెందిన చంద్రశేఖర్, మరో బైక్పై ఉన్న కిరణ్, ఆనంద్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. రామలక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. మిగిలిన నలుగురు మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్స పొందు తున్నారు. సమాచారం అందుకున్న మదనపల్లె తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు.గాయపడిన రామలక్ష్మి, చంద్రశేఖర్, చలపతి -
● వైభవం.. ఉరుసు ఉత్సవం
పుంగనూరు : పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్ నూర్షావలి బాబా దర్గా ఉరుసు ఉత్సవాన్ని శతాబ్దకాలంగా ముస్లింలు నిర్వహిస్తున్నారు. ఈ ఉరుసు గురువారం నూరాని గంధంతో ప్రారంభమైంది. శుక్రవారం పట్టణంలోని కుమ్మరవీధిలో ఉండు పహిల్వాన్సాబ్ ఇంటి నుంచి దర్గా వరకు గంధం ఊరేగింపుగా తీసుకొచ్చి దువా చేస్తారు. ప్రతి రోజు ఉరుసుకు వచ్చే వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉరుసు సందర్భంగా ప్రతి రోజు రాత్రి దర్గా కమిటీ వారు ఖవ్వాలి పాటల పోటీలు ఏర్పాటు చేశారు. 9, 10 తేదీల్లో రాత్రి నాగపూర్కు చెందిన ఇంతియాజ్సాబిరి, ముంబైకి చెందిన అంజాబ్సాబిరి , పూనేకు చెందిన తౌసిఫ్జునైది , కర్ణాటకకు చెందిన తౌసిఫ్ఖాదరిలతో ఖవ్వాలి పాటల పోటీలు జరుగుతాయి. సయ్యద్ నూర్షావలి బాబా దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉరుసు సందర్భంగా ముస్లిం మతపెద్దలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉరుసును ప్రతి ఏటా ఎన్ఎస్.పేటలోగల ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించడం ఆనవాయితీ. మైదానంలో రంగుల రాట్నాలు, దుకాణాలను ఏర్పాటు చేశారు. ఉరుసు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కానీ 10 రోజుల పాటు ఉరుసు కార్యక్రమం జరుగతుంది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా వేలాది మంది ఉరుసు ఉత్సవంలో పాల్గోనేందుకు తరలివస్తున్నారు. కమిటీ ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు రహదారి కావడంతో వాహనాల మళ్లింపు కార్యక్రమం చేపట్టారు. -
గ్రామాల్లో కనీస వసతులు కల్పించాలి
మదనపల్లెఅర్బన్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు డిప్యూటీ ఎంపీడీఓలు, కార్యదర్శులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ పేర్కొన్నారు. గురువారం స్థానిక కార్యాలయంలో మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె మండలాలకు చెందిన డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం మెరు గుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పారిశుధ్యం లోపించిందన్నారు. దీంతో జనం వ్యాధుల బారినపడే అవకాశం ఉందని సూ చించారు. అలాగే తాగునీరు, సీసీరోడ్లు, వీధిలైట్లు, పైపులైన్ తదితర వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా మౌలిక వసతులపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని.. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్త పడాలన్నారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్డీవోలు లక్ష్మీపతి, శ్రీనివాసులు, డీఎల్పీవో నాగరాజ, సిబ్బంది పాల్గొన్నారు. డీపీవో రాధమ్మ -
● వెటకారం ఏమైంది బాబు
సాక్షి, మదనపల్లె: కూటమిపాలనలో ఏపీలో చమురు ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు చలో కర్ణాటక అంటూ అక్కడికి పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విక్రయిస్తున్న ధరకు, ఆంధ్ర సరిహద్దులోని కర్ణాటకలో అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎంతో వ్యత్యాసం ఉంది. దీంతో వినియోగదారులు తమకు ఎంతోకొంత ఉపయోగమని, సొమ్ము మిగులుతుందని కర్ణాటకకు వెళ్లి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రాలోని సరిహద్దు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. ఆంధ్రాలో ధరల దోపిడీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్ణయించిన పెట్రోలు, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదని వినియోగదారులు అంటున్నారు. ప్రధానంగా అన్నమయ్య జిల్లా దక్షిణ ప్రాంతానికి సరిహద్దులో ఉన్న కర్ణాటకలో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ దొరుకుతోంది. ఆంధ్రాలో పెట్రోల్ లీటరు రూ.115.11, డీజిల్ లీటర్ రూ.100.66తో వినియోగదారులు బంకుల్లో కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటకలో పెట్రోల్ లీటర్ రూ.103.23, డీజిల్ లీటర్ రూ.91.29తో వినియోగదారులకు అందిస్తున్నారు. ఆంధ్ర కంటే కర్ణాటకలో లీటర్ పెట్రోల్ రూ.11.88, డీజిల్ లీటర్కు రూ.9.37 తక్కువ. ఈ ధర వ్యత్యాసం ఆంధ్ర ప్రాంత వినియోగదారులకు వరంగా మారింది. ఎక్కువ చమురు అవసరమైన వినియోగదారులు కర్ణాటక వైపు పరుగులు తీస్తున్నారు. సరిహద్దు బంకుల మూత ఆంధ్రలో చమురు ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా కర్ణాటక సరిహద్దులోని ఏపీ చమురు బంకులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సరిహద్దులో ఉన్నవారు, పది నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కర్ణాటకకు వెళ్లి చమురు తెచ్చుకుంటున్నారు. దీని కారణంగా తంబళ్లపల్లె నియోజకవర్గానికి సరిహద్దులోని ఆంధ్రకు చెందిన నాలుగు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇక్కడ చమురు కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపించకపోవడంతో నిర్వహణ భారమై నిర్వాహకులు వాటిని వదిలించుకున్నారు. సరిహద్దుల్లో కర్ణాటక బంకులు సరిహద్దులోని ఆంధ్ర బంకులు మూతపడుతుంటే కర్ణాటకలో ఆంధ్ర సరిహద్దుకు సమీపంలో కొత్త పెట్రోల్ బంకులు ఏర్పాటు అవుతున్నాయి. బి. కొత్తకోట మండల సరిహద్దుకు రెండు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, మదనపల్లి మండల సరిహద్దుల్లో, పెద్దతిప్పసముద్రం మండల సరిహద్దుల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బంకులు వెలుస్తున్నాయి. దాంతో ఈ బంకుల్లో వ్యాపారం పెరిగింది. ఆంధ్ర సరిహద్దులో కర్ణాటకలో కొత్తగా ప్రారంభించిన పెట్రోల్ బంకు అక్కడ ధర తక్కువ ఫలితంగా ఆంధ్రా పెట్రోల్ బంకుల మూత సరిహద్దులో వెలుస్తున్న కర్ణాటక బంకులు ‘కర్ణాటక, తమిళనాడులో పెట్రోల్ ధర తక్కువ, ఇక్కడ ఎక్కువ ఏం తమ్ముళ్లు.. అక్కడికెళ్లి బండికి పెట్రోల్ కొట్టించి, మిగిలిన డబ్బుతో మీరు మందు కొట్టి ఎంచక్కా వస్తారు కదా’ అని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు చేసిన వెటకారం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వెటకారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. -
పట్టణాభివృద్ధి వేగం పెంచాలి
సాక్షి. మదనపల్లె : పలమనేరు–కుప్పం–మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సంస్థ చైర్మన్ బీఆర్.సురేష్ బాబు, వైస్ చైర్మన్, జేసీ శివ్ నారాయణ్ శర్మ కోరారు. గురువారం స్థానిక కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం గుండ్లసాగరం గ్రామపంచాయతీలో 30.865 ఎకరాల భూమిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా లేఔట్ ప్లాన్లు రూపొందించడం, ప్లాట్ల విభజన, రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సదుపాయాలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంస్థ పరిధిలోని అనధికార లేఔట్లను గుర్తించి జీవో ప్రకారం యజమానులకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేయాలన్నారు. సమావేశంలో సెక్రటరీ పిఆర్.మనోహర్, పరిపాలనాధికారి చిట్టిబాబు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.ఉడా చైర్మన్ సురేష్ బాబు, వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ -
మన్యం వీరుడి త్యాగం స్ఫూర్తిదాయకం
మదనపల్లె టౌన్ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం. వెంకటాద్రి అన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు గురువారం మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పోలీసులు నిర్వహించారు. ఏఎస్పీ వెంకటాద్రి అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించా రు. అనంతరం మాట్లాడుతూ.. చిన్న వయసు లోనే దేశభక్తిని పుణికిపుచ్చుకున్న అల్లూరి బ్రిటీష్ పాలకులకు ముచ్చెమటలు పట్టించారన్నారు. దాస్య శృంఖలాలను తెంచేందుకు ఆయన చూపిన తెగువ, పట్టుదల నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఏఓ శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వి.జె. రామకృష్ణ, కె. సురేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇలా అయితే ఎలా?
సాక్షి, మదనపల్లె: ఆపదలో ఆదుకునే 108 అంబులెన్స్లు సంజీవనిగా ఉపయోగపడుతున్నాయి. అయితే మదనపల్లె జిల్లా ఆస్పత్రి నుంచి గురువారం ఒక్కరోజే ఆరు మండలాలకు చెందిన 108 అంబులెన్స్లు తిరుపతికి రోగులను తరలించాయి. దీంతో ఆరు మండలాల్లో 108 సేవలు స్తంభించిపోయాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకపోవడంతో ఇబ్బందులు తప్పాయి. గురువారంనాటి ఈ పరిస్థితికి సంబంధించిన వివరాలు. ఏడు రెఫర్లు వివిధ ప్రాంతాలకు చెందిన రోగులు గురువారం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చారు. పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అంటూ వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. వీరిని ఉచితంగా 108 అంబులెన్స్లో తరలించాల్సి ఉండడంతో రోగులు వీటిని సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కేసులను రెఫర్ చేశారు. మదనపల్లె పట్టణం, మదనపల్లె రూరల్ మండలాలకు కలిపి ఒకటే అంబులెన్స్ ఉంది. అయితే నాలుగు కేసులు ఒకేసారి తరలించాల్సి రావడంతో 108 అధికారులు పొరుగు మండలాలకు చెందిన అంబులెన్స్లను రప్పించాల్సి వచ్చింది. దీంతో మదనపల్లెతో పాటు, నిమ్మనపల్లె, బి.కొత్తకోట, కురబలకోటలకు అంబులెన్స్లను రప్పించారు. ఇందులో శ్వాస, ప్రసవ, జ్వరం సంబంధిత వ్యక్తులను తిరుపతి రుయాకు తరలించారు. తర్వాత సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు మరో ముగ్గురు రోగులను తరలించాలని వైద్యులు రెఫర్ చేశారు. ఉదయం రుయాకు వెళ్లి వచ్చిన మదనపల్లె అంబులెన్స్తో పాటు పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి, పీలేరు నియోజకవర్గం వాయల్పాడు కు చెందిన అంబులెన్స్లను రప్పించారు. వీటిలో ఒక పాయిజన్, ఒక శ్వాస సంబంధిత, ఒక కాలిన గాయాలకు చెందిన బాధితులను రుయాకు తరలించారు. ఇందులో మదనపల్లె అంబులెన్స్ ఒకే రోజు రెండుసార్లు తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆరు మండలాలకు చెందిన అంబులెన్స్లు ఒక్కటి కూడా స్థానికంగా లేకుండా పోయాయి. పొరుగు మండలాలకు ఇబ్బందులు స్థానిక జిల్లా ఆసుపత్రి నుంచి రోగులను తిరుపతికి రెఫర్ చేస్తూ ఉండడంతో అంబులెన్స్ల పరిస్థితి దయనీయంగా మారింది. మదనపల్లె నుంచి తిరుపతికి 115 కిలోమీటర్ల దూరం ఉంది. రాను పోను 230 కిలోమీటర్లు. రోజుకు ఒకసారి వెళ్లి వస్తే సగం రోజుకు పైగా గడిచిపోతుంది. ఈ రెఫర్ల ఫలితంగా పొరుగు మండలాలకు చెందిన అంబులెన్స్లను కూడా వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా ఆ మండలాల్లో ఏదైనా ప్రమాద ఘటన జరిగినా, బాధితులకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినా సకాలంలో వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించే పరిస్థితి లేదు. ప్రైవేట్ వాహనాలను సమకూర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికే సమయం వృథా అయ్యి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అంబులెన్స్లు అందుబాటులో ఉంచాల్సిన అవసరం చాలా ఉంది. గురువారం ఆరు మండలాలకు చెందిన అంబులెన్స్లు స్థానికంగా అందుబాటులో లేవు. అదృష్టవశాత్తు ఈ మండలాల్లో ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో ఇబ్బందులు తప్పాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతిరోజూ నెలకొంటే ఆందోళన తప్పకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా గురువారం ఒకరోజే మదనపల్లె నుంచి తిరుపతికి ఏడు రెఫర్లు జరిగిన విషయాన్ని 108 ఆంబులెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. ● తిరుపతి రెఫర్లతో 108 అంబులెన్స్లు ఖాళీ ● మదనపల్లె వాహనం రెండుసార్లు, ● బి.కొత్తకోట, చౌడేపల్లి, వాయల్పాడు, నిమ్మనపల్లి, ● రామసముద్రం 108లు ఒక్కోసారి తిరుపతికి -
మదనపల్లెలో విజిలెన్స్ దాడులు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో గురువారం కడపకు చెందిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా ఆదేశాలతో సీఐ శ్రీనివాసులు రెడ్డి, అగ్రికల్చర్ ఏడి లక్ష్మణరావుల బృందం మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీలో రేషన్ బియ్యం వ్యాపారి హబీబ్ ఇంట్లో దాడులు జరిగాయి. అక్రమంగా నిల్వ ఉన్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో హబీబ్ నిల్వఉంచిన రూ.1.75లక్షల విలువచేసే 33 క్వింటాల్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఎస్పీ ఆదేశాలతో పట్టుబడిన బియా న్ని స్థానిక నీరుగట్టువారిపల్లెలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న పౌరసరఫరాలశాఖ గోడౌన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. వేఽధింపుల కేసులో ముగ్గురికి జైలు శిక్షతంబళ్లపల్లె : వేధింపుల కేసులో భర్తతో సహా అత్త, మామలకు జైలు శిక్ష విధిస్తూ తంబళ్లపల్లె సివిల్ కోర్టు న్యాయమూర్తి ఉమర్ఫరూక్ గురువారం తీర్పు చెప్పారు. వివరాలు.. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లెకు చెందిన అంజలికి సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఈతోడు గ్రామానికి చెందిన రెడ్డిశేఖర్తో వివాహం జరిగింది. భర్త రెడ్డిశేఖర్, అత్తమామలు రామచంద్ర,యశోదమ్మ వేధిస్తున్నారని 2018లో తంబళ్లపల్లె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో రెడ్డిశేఖర్ కు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా, రామచంద్ర,యశోదమ్మకు మూడు నెలల జైలు, 1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : నిప్పు అంటించుకుని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం పెద్దతిప్ప సముద్రం మండలంలో జరిగింది. బాధితుల కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని బూర్లపల్లి కు చెందిన కోనప్ప కొడుకు నరసింహులు(49) కుటుంబ సమస్యల కారణంగా తన ఇంటి వద్దనే పెట్రోల్ మీద పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. కుటుంబీకులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు అదుపుచేసి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించారు. అతని పరిస్థితి విషమించిందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పీటీఎం పోలీసులు తెలిపారు. -
గడ్డి కట్టర్లో పడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : పశువులకు గడ్డి కోసి చాఫ్ కట్టర్లో వేస్తుండగా ప్రమాద వశాత్తు చేయి యంత్రంలో పడి ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన పీటీఎం మండలంలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంకిరెడ్డిపల్లికి చెందిన బయారెడ్డి భార్య రమణమ్మ (60) గురు వారం ఇంటి వద్ద పశువులకు గడ్డి కోసి చాఫ్కట్టర్తో కత్తిరిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాద వశాత్తు ఆమె కుడి చేయి యంత్రంలో పడిపోయింది. దీంతో చేయి మణికట్టు వరకు నుజ్జునుజ్జు అయింది. గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగున వచ్చి మిషన్ను ఆపి, ఆమెను బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రైవేట్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల సూచన గడ్డి కటింగ్ మిషన్లు, చాఫ్ కట్టర్లు వాడేటప్పుడు మహిళలు వదులు దుస్తులు, చీరలు ధరించవద్దని, చేతికి గ్లౌజులు వేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో మహిళా జూనియర్ అసిస్టెంట్పై దాడి
మదనపల్లె టౌన్ : మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ మహిళా జూనియర్ అసిస్టెంట్ పై అదే విభాగంలో పనిచేసే మరో జూనియర్ అసిస్టెంట్ దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. గురువారం వెలుగు చూసిన ఘటనపై బాధితురాలి కథనం.. ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే నందిని పై అదే విభాగంలో పని చేస్తున్న మరో జూనియర్ అసిస్టెంట్ సాయి ఆస్పత్రి స్కానింగ్ రూములో అందరూ చూస్తుండగానే బుధవారం చేయి చేసుకున్నాడు. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యం అందించడంతో కోలుకుంది. దాడి వ్యవహారం ఆస్పత్రి ఆర్ఎంఓ రాధిక దృష్టికి వెళ్లడంతో మహిళా జూనియన్ అసిస్టెంట్ నందినితో పాటు మరో జూనియర్ అసిస్టెంట్ సాయిని చాంబర్ కు పిలపించి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఏ వైనా వ్యవహారాలు ఉంటే అస్పత్రి బయట చూసుకోవాలే తప్ప ఇక్కడ కొట్టు కోవడాలు, బెదిరించడం చేస్తే కేసులు పెట్టాల్చి వస్తుందని హెచ్చరించి పంపేసిందనిఆస్పత్రి వర్గాలు చర్చించుకుంటున్నారు. అయితే జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరూ గత కొంత కాలంగా సన్నిహితంగా ఉండేవారని తెలిసింది. ఇద్దరి మద్య ఏం జరిగిందో ఏమో కొట్టుకోవడం వెలుగులోకి రావడంతో అస్పత్రిలో వ్యవహారం తీవ్ర చర్చినియాంశంగా మారింది. -
మదనపల్లెకు ప్రత్యేక బాదుడు
ఆదాయం కోసం రిజిస్ట్రేషన్ల శాఖ మదనపల్లె ప్రజలపై బాదుడుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే పాలసీ కొనసాగుతుండగా మదనపల్లెలో ‘ప్రత్యేక మార్కెట్ విలువ’ పెంపు కోసం అధికారులు నివేదిక సిద్ధం చేసే పనిలో పడ్డారు. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే పట్టణ ప్రజల జేబులకు చిల్లు పడ్డట్టే. ఈ ప్రయత్నాలపై ప్రత్యేక కథనం. ● ప్రాంతాల విలువను బట్టి మార్కెట్ విలువ పెంపు ● భారీగా ఆదాయం పెంచుకునేందుకు సిద్ధమైన చర్యలు ● పట్టణంలో కలిసిపోయిన పంచాయతీలకు ప్రత్యేకం సాక్షి, మదనపల్లె: మదనపల్లె జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడినుంచి అత్యధిక ఆదాయం రాబట్టడం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మదనపల్లె కోసం ప్రత్యేక మార్కెట్ విలువ పెంపునకు ప్రయత్నాలు మొదలయ్యాయి. రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండగా కూటమి ప్రభుత్వం మదనపల్లెకు మార్చింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాలను పొరుగు జిల్లాల్లో కలిపింది. చిత్తూరులోని పుంగనూరును అన్నమయ్యలో కలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయానికి గండిపడింది. ఇదే పరిస్థితి ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఆదాయం పెంచుకునే మార్గాలను రిజిస్ట్రేషన్ల శాఖ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా మదనపల్లె సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో ఆస్తుల విలువను పెంచడం.. అలాగే ఉంచడంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పడిపోయిన ఆదాయం రిజిస్ట్రేషన్లశాఖలో గత ఆర్థిక సంవత్సరం ఊహించని విధంగా ఆదాయం పడిపోయింది. 2025–26లో రూ.220.76 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా రూ.190.69 కోట్లు లభించింది. ఇందులో కలికిరి, మదనపల్లె, రాయచోటి, పీలేరు, వాయల్పాడు, పుల్లంపేట, సుండుపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు లక్ష్యాలను సాధించకపోగా ఆదాయం తగ్గింది. తంబళ్లపల్లె మాత్రమే లక్ష్యానికి మించిన ఆదాయం సాధించింది. మదనపల్లె రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రూ.69.16 కోట్ల ఆదాయ లక్ష్యం ఉండగా రూ.63.03 కోట్ల ఆదాయమే వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో జిల్లాలో రూ.22.24 కోట్ల ఆదాయం సాధించాలన్న లక్ష్యం అయితే రూ.13.26 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ రకంగా ఆదాయం తగ్గిపోవడం జిల్లా అధికారుల్లో సమీక్షకు దారి తీసింది.అదాయ మార్గాలను అన్వేషిస్తోంది. రెండే మార్కెట్ విలువలు మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో రెండు రకాలైన మార్కెట్ విలువలను అమలు చేస్తున్నారు. వాణిజ్యపరమైన వాటికి చదరపు అడుగు రూ.32,700, గృహాలకు చదరపు అడుగు రూ.11 వేల మార్కెట్ విలువను రిజిస్ట్రేషన్ల సందర్భంగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విలువను ప్రాంతాల వారీగా వాటి విలువ ఆధారంగా చదరపు గజానికి రూ.3 నుంచి రూ.5 వేలదాకా పెంచుకునేలా వివరాలు సిద్ధం చేస్తున్నారు. ఏ ప్రాంతంలోని ఆస్తులకు విలువ పెంచాలి లేదా అలాగే ఉంచాలి, లేకపోతే తగ్గించాలి అన్నదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీని ద్వారా ఆదాయం పెంచుకోవాలని అధికారుల ఆలోచన. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపి మదనపల్లెకు ప్రత్యేక మార్కెట్ విలువను పెంచడానికి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. విలీనమైన పంచాయతీలపైనా మదనపల్లె మున్సిపాలిటీ శివారులోని కొత్తపల్లె, కొత్తిండ్లు, ఈశ్వరమ్మకాలనీ, కురవంక, వైఎస్సార్కాలనీ, బసినికొండ, రామాచార్లపల్లె, కొండామర్రిపల్లె, తట్టివారిపల్లె, కోళ్లబైలు, అంకిశెట్టిపల్లె, పొన్నుటిపాళెం పంచాయతీలు ఇప్పటికే పట్టణంలోకి విలీనం అయిపోయాయి. వీటి విలువను పరిశీలిస్తే పట్టణంలో ఉన్న ధర కంటే శివారు ప్రాంతంలోని కాలనీలు, లేఔట్లలో అత్యధిక ధరలు పలుకుతున్నాయి. ఇవి పూర్తిగా మున్సిపాలిటీలో కలిసిపోయాయి. ఏది మున్సిపాలిటీ పరిధి, ఏది పంచాయతీ అని తెలియనంతగా కలిసిపోయాయి. పంచాయతీల్లో చదరపు గజం మార్కెట్ విలువ రూ.3,900 ఉంది. ఇప్పుడు పంచాయతీలో పట్టణంలో కలిసిపోవడంతో అసాధారణమైన విలువ కలిగిన ఆస్తులపై మార్కెట్ విలువ పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. వీటికి ఉన్న చదరపు గజం విలువను పెంచాల్సిన అవసరం ఉందని నిర్ధారించి నివేదిస్తున్నారు. మున్సిపాలిటీ ప్రాంతాలపై పెంచే మార్కెట్ విలువ ద్వారా వచ్చే ఆదాయం కంటే, శివారు ప్రాంతాల ఆస్తులపై పెంచే విలువ ద్వారా అత్యధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం కావడం, ఇక్కడ ప్రభుత్వ మార్కెట్ విలువకు, బహిరంగ మార్కెట్ విలువకు పూడ్చలేనంత అంతరం ఉంది. మొత్తం మున్సిపాలిటీ పరిధికి రెండు రకాలైన మార్కెట్ విలువలను మాత్రమే అమలు చేస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్ ఆస్తుల విలువ ఊహించని స్థాయిలో పలుకుతున్నాయి. ఈ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నాయి. సాధారణ ధర కలిగిన పట్టణంలోని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయం పెంచుకోవడం కోసం మళ్లీ కొత్తగా మదనపల్లె మున్సిపాలిటీకి మాత్రమే ప్రత్యేక మార్కెట్ విలువను పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. పుంగనూరు రోడ్డు నుంచి గాంధీ రోడ్డు, చిత్తూర్ బస్టాండ్, పటేల్ రోడ్డు, కదిరి రోడ్డు, రింగ్ రోడ్డు వరకు, అనిబిసెంట్ సర్కిల్ నుంచి బెంగళూరు రోడ్డు, నిమ్మనపల్లి సర్కిల్ నుంచి బైపాస్ రోడ్డు, ఆర్ఆర్ స్ట్రీట్, చెంబకూరు రోడ్డు, మల్లికార్జున సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ నుంచి సిటిఎం రోడ్డు, టౌన్ బ్యాంకు సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ నుంచి తిరుపతి రోడ్డు, తిరుపతి రోడ్డు నుంచి పారిశ్రామిక వాడ, తిరుపతి రోడ్ నుంచి గొల్లపల్లి బైపాస్ రోడ్డు మీదుగా రింగ్ రోడ్డు వరకు, రెడ్డప్ప నాయుడు కాలనీ, ఎస్బిఐ కాలనీ, సొసైటీ కాలనీ, రెడ్డిస్ కాలనీ, టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెనకవైపు, తట్టివారిపల్లె రింగ్రోడ్డు నుంచి కదిరిరోడ్డు రింగ్రోడ్డు వరకు..ఇలా ముఖ్యమైన ప్రాంతాల్లో ఆస్తులు విలువ ఆకాశాన్నంటాయి. వాణిజ్య పరమైనవి కాని ప్రాంతాల్లో ధరల్లో వ్యత్యాసం ఉంది. రెసిడెన్షియల్ ప్రాంతాల్లోనూ ఒక్కోచోట ఒక్కో రకమైన విలువ ఉంది. సబ్రిజిస్ట్రార్ లక్ష్యం వసూలు కలికిరి 717.13 481.89 మదనపల్లె 6916.19 6303.02 పీలేరు 2027.56 1650.91 తంబళ్లపల్లె 510.22 556.20 వాయల్పాడు 794.69 681.82 బి.కొత్తకోట 739.09 655.08 చిట్వేలి 555.57 538.77 లక్కిరెడ్డిపల్లె 660.16 612.11 పుల్లంపేట 1590.19 1311.28 రాయచోటి 4871.16 3777.09 రాజంపేట 2106.01 2041.76 టి.సుండుపల్లె 588.63 459.89 -
చారాల వద్ద రోడ్డు ప్రమాదం
● దంపతులతోపాటు వారి కుమారుడికి తీవ్ర గాయాలు ● గాయపడిన బాలుడి పరిస్థితి విషమంమదనపల్లె టౌన్ : చౌడేపల్లి మండలంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు వారి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి బాధితుల కుటుంబీకుల కథనం.. చౌడేపల్లి మండలం, చారాల పంచాయతీ, మొటుకుపల్లి కు చెందిన దంపతులు ద్విచక్ర వాహనంలో సొంత పని మీద చౌడేపల్లి కు బయలు దేరారు. స్కూటర్ మార్గ మధ్యంలోని చెరువు ముందర వడ్డిపల్లె వద్ద కు రాగానే ఎదురుగా వస్తున్న ఓ బస్ ను తప్పించబోయి బైకు అదుపు తప్పడంతో ముగ్గురు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో భార్య, భర్తలు మునిరాజా(30), మంగ (26) లతో వారి కుమారుడు సంతోష్ 8 కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను చికిత్స కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి దంపతులతోపాటు సంతోష్ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ట్రాక్టర్ ను ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొని ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదానికి సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లెకి చెందిన రైతు ఎస్.వెంకటరమణ (50) వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలను పిలవడానికి పొరుగు గ్రామమైన దండువారి పల్లెకు బైకుపై బయలుదేరాడు. స్కూటర్ మార్గ మధ్యంలోని దండువారిపల్లె సమీపానికి వెళ్ళగానే రోడ్డు పక్కన లైట్లు ఆర్పి నిలబెట్టి ఉన్న ట్రాక్టర్ను గుర్తించలేక ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రైతును స్థానికులు గమనించి చికిత్స కోసం మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలించారు. కారు ఢీకొని తమిళనాడు వాసికి.. మదనపల్లె టౌన్ : కారు ఢీకొని తమిళనాడు వాసి తీవ్రంగా గాయపడ్డ సంఘటన మంగళవారం అర్ధరాత్రి పుంగనూరు మండలంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం తిరుచి గ్రామానికి చెందిన నెహ్రు రాజా(48), వరి కోత యంత్రాన్ని తీసుకుని పుంగనూరు మండలం ఈడిగపల్లి కు వచ్చాడని తెలిపారు. గ్రామానికి సమీపంలోని ఓ రైతు పొలంలో మరో డ్రైవర్ పంట వడుపు తుండగా, వాహనానికి డీజిల్ అవసరమై క్యాన్ తీసుకొని ఈడికి పల్లె వద్దకు వచ్చాడు. పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దాటే క్రమంలో ఓ కారు వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కాళ్లు చేతులు విరిగి అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం అతడి పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా పై వేలూరుకి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పుంగనూరు పోలీసులు తెలిపారు. -
టీడీపీ నేతల చేతుల్లో చిక్కి శల్యమవుతున్న నదులు నిబంధనల హద్దులు మీరి.. ఇసుకను సరిహద్దులు దాటిస్తున్న పచ్చ నేతలు
సాక్షి అన్నమయ్య : తెలుగు తమ్ముళ్లు ఇసుకలో తైలం పిండుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తమ్ముళ్లకు ఆర్థిక వనరులు అనుకున్న మేర లభించలేదు. దీంతో ఉచిత ఇసుక పేరుతో దండుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలోని పలు నదుల్లో పొక్లెయిన్లు పెట్టి టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. చెయ్యేరు పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ కొనసాగుతున్నా ఎవరూ కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ● అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో విస్తరించి ఉన్న చెయ్యేరు నదిపై పచ్చనేతల కన్ను పడింది. ఒక వైపు ట్రాక్టర్ల ద్వారా ఎక్కడికక్కడ ఇసుక తోడేస్తుండగా, అది చాలదన్నట్లుగా మరోవైపు ఏకంగా టిప్పర్లు పెట్టి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలించి పచ్చనేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. చెయ్యేరు ప్రాంతంలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల సరిహద్దులోని పలు గ్రామాల నుంచి ఇసుకను నిత్యం తరలిస్తున్నారు. జంగాలపల్లె సమీపంలోని దర్జిపల్లె వద్ద టిప్పర్లతో తోడేస్తున్నారు. అలాగే నందలూరు మండలంలోని కుమారునిపల్లె, బాలరాజుపల్లె సమీపంలో బుడుగుంటపల్లె, సుండుపల్లె మండలంలోని పలు ప్రాంతాలతోపాటు రామసముద్రం మండల పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను అటు బెంగుళూరు, ఇటు చైన్నెలకు తరలిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చెయ్యేరు, పెన్నానదులకు ఇసుకాసురులు గర్భశోకం మిగుల్చుతున్నారు. అధికారులు ఒకచోట అనుమతులు ఇస్తే....కుంటి సాకులు పెట్టి మరొకచోట తవ్వుతూ ఇసుక దోపిడీ చేస్తున్నారు. కొన్నిమీటర్ల మేర మాత్రమే ఇసుకను తీయాల్సి ఉండగా, పెద్ద పెద్ద గుంతలు తీసి తరలిస్తున్నారు. ఇదేమని అడిగే అధికారులు లేకపోగా, మనకెందుకులే మనవారేనని కూటమి పెద్దలు చూస్తుండిపోతున్నారు. కొన్ని చోట్ల నదుల్లో దారులు ఏర్పాటు చేసుకుని ఇసుకను రాత్రిళ్లే కాకుండా పగలు కూడా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల సుండుపల్లె మండలంలో ప్రజలు టిప్పర్లను సైతం అడ్డుకుని తిరుగుబాటు చేశారంటే అక్రమ తవ్వకాలు ఎలా కొనసాగిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఎప్పుడో ఒకసారి అలా నదుల్లో ఇసుకను కూటమి సర్కార్లోని కొంతమంది పెద్దలు దోపిడీ చేస్తున్నా ఎవరూ పట్టించుకోరు. పత్రికల్లో వార్తలు ప్రచురితమైతే అప్పుడప్పుడు అలా దాడులు జరిపి... పట్టుకున్నట్లు హడావుడి చేస్తున్నారు. రోజుల తరబడి ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా పట్టించుకోరుగానీ, ఎప్పుడో ఒకసారి దాడులు చేసి తామున్నామంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఏదిఏమైనా కూటమి సర్కార్ ఉచిత ఇసుక పేరుతో తెచ్చిన విధానం కొంతమంది పచ్చనేతల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతోందని పలువురు పేర్కొంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
లక్కిరెడ్డిపల్లి : మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లి చింతలకుంటవాళ్లపల్లి మార్గమధ్యలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పకీరమ్మ (68) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ గోల్కొండ శోభ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. కోనంపేట పంచాయతీలోని కాలాడివాళ్లపల్లికి చెందిన పకీరమ్మ ఉదయాన్నే ఉపాధి పనికి వెళ్లి వచ్చింది. మధ్యాహ్నం బ్యాంకులో అగ్రికల్చర్ సంబంధించిన పని పూర్తి చేసుకొని, కూరగాయలు తీసుకొని కాలాడివాళ్లపల్లెకు కాలినడకు వెళ్తుండగా కోనంపేట నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే రెండు కాళ్లు చేతులు విరిగిపోయి మృత్యువాత పడింది. ఈ మేరకు కార్ డ్రైవర్పై కేసు నమోదు చేసి మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కలికిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని కలికిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల వ్యవసాయ డిప్లమో, అగ్రికల్చర్ ఇంజనీరింగ్(3సం.లు) కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆర్.లక్ష్మీప్రసన్న తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని, పదో తరగతి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21 తేదీ లోగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏఎన్జీఆర్ఎయు.ఏసీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండేళ్ళ డిప్లమో కోర్సులో 34 సీట్లు, అగ్రికల్చర్ ఇంజినీరింగ్కు 30 సీట్లు ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు 8008554448 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. వ్యవసాయ డిప్లమో కోర్సులకు.. పుంగనూరు: స్థానిక వ్యవసాయ పాలిటెక్నిక్లో రెండు సంవత్సరాల కోర్సుకు సంబంధించి అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఎటువంటి రుసుం లేకుండా ప్రవేశం పొందవచ్చని తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్లో వివరాలు పొందుపరచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల పని వేళల్లో సంప్రదించాలని తెలిపారు. ఉచిత ప్రవేశాలకు రెండో విడత జాబితా విడుదల మదనపల్లె సిటీ: ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం రెండో విడత లాటరీ ఫలితాల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ తెలిపారు. జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 156 మంది విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎంపికై న వారి వివరాలను తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించడంతో పాటు https://cse.ap.gov. in/ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మొదటి విడతలో 465 మందికి సీట్లు కేటాయించగా, అందులో 386 మంది ఇప్పటికే పాఠశాలల్లో చేరినట్లు చెప్పారు. రెండోజాబితాలో ఎంపికై న విద్యార్థులు తమ ఆధార్కార్డు, తల్లి లేదా తండ్రి ఆధార్కార్డు, ఆదాయ, కులధృవీకురణ పత్రాలు, విద్యార్థి జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, తోబుట్టవుల ఆధార్, స్టడీ సర్టిఫికెట్ తదితర అవసరమైన పత్రాలతో ఈనెల 17వతేదీలోగా సంబంధిత పాఠశాలలకు హాజరై ప్రవేశాన్ని నిర్థారించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు టోల్ఫ్రీ నంబర్ 18004258580లో సంప్రదించాలని తెలిపారు. తిరుపతి–చాప్రా మధ్య ప్రత్యేక రైలు కడప కోటిరెడ్డిసర్కిల్ : వేసవి రద్దీని పురస్కరించుకుని తిరుపతి–చాప్రా మధ్య ప్రత్యేక రైలును నడపుతున్నారని కడప రైల్వేకమర్షియల్ మేనేజర్ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ రాత్రి 11.55 గంటలకు ఈ రైలు (07433) తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి,డోన్, కర్నూలు, గద్వాల్, వనపర్తిరోడ్డు, మహబూబ్నగర్, షాద్నగర్, కాచిగూడ, మల్కాజ్గిరి, కామారెడ్డి, నిజామాబాద్, ముడ్కేడ్, నాందేడ్, పూర్ణ, హింగోలి, వాషిమ్, అకోల, మల్కాపూర్, ఖాడ్వా, ఇట్సాసి, భూపాల్, బిన, లక్ష్మీభాయిజాన్సీ, ఓరాయి కన్పూర్, లక్నో, అయోధ్య కెంట్, అయోధ్యమ్, బస్తీ, గోరక్పూర్, సిజ్వాన్ మీదుగా చాప్రాకు 10వ తేది ఉదయం 7.45 గంటలకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 12వ తేదీ ఉదయం 5.00 గంటలకు చాప్రాలో బయలుదేరి 14వ తేది మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి చేరుతుందని తెలిపారు. మలేరియా ప్రబలకుండా చర్యలు చేపట్టాలి లక్కిరెడ్డిపల్లి: గ్రామాల్లో మలేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. శుభ్రతతో వ్యాధులు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహచ్ఓ, ఎంపీహెచ్ఎస్ మహమ్మద్ బాషా, జిల్లా మలేరియా ఆఫీసర్ జయరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
లద్దిగం వద్ద టమాటా సాగు కోసం సిద్దం చేసిన పొలంలో నిలిచిన వర్షపునీరు చింతమాకులపల్లె వద్ద నేలరాలిన మామిడి కాయలు చౌడేపల్లి: మండలంలో బుధవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.గాలుల ధాటికి మామిడికాయలు నేల రాలాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమాటా పంటలో వర్షం నీరు చేరింది. అకాల వర్షంతో వరి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది.దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ ఓ వరం
● రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం ● గోల్డెన్ అవర్లో స్పందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ ● సహాయం చేసిన వారికి రూ.25 వేల నగదు బహుమతి ● అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడిమదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’పీఎం రాహత్’ పథకం ఒక వరమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ పేర్కొన్నారు. బుధవారం మదనపల్లె పోలీసు కార్యాలయంలో పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా ఈ ’నగదు రహిత చికిత్స’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోల్డెన్ అవర్.. ప్రాణాలకు ఆధారం! ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమైనదిగా ఎస్పీ అభివర్ణించారు. ఆ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ’ప్రమాదం జరిగిన వెంటనే భయపడకుండా 112 నంబర్కు ఫోన్ చేస్తే అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. బాధితులను వెంటనే నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స ప్రారంభించవచ్చని ఎస్పీ తెలిపారు. పథకం విశేషాలు ఇలా ఉన్నాయి.. ఉచిత చికిత్స : ప్రమాదానికి గురైన వ్యక్తికి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తారని తెలిపారు. ఏడు రోజుల పరిమితి: ప్రమాదం జరిగిన రోజు నుండి వరుసగా 7రోజుల పాటు నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందవచ్చని తెలిపారు. ఎవరెవరు అర్హులు అంటే.. రోడ్డుపై నడిచే పాదచారులు, సైకిల్ దారులు, ద్విచక్ర వాహనదారులు, డ్రైవర్లు విదేశీయులు సైతం ఈ పథకానికి అర్హులేనని చెప్పారు. నిబంధనలు ఇలా.. ప్రమాదం జరిగిన అనంతరం వీలైనంత త్వరగా, సాధారణంగా 24గంటలలోపు బాధితుడిని ఆసుపత్రి లో చేర్చించితే ఈ పథకం ప్రయోజనాలను సంపూర్ణంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. సహాయం చేసేవారికి ’రక్ష’.. నగదు బహుమతి ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే ’గుడ్ సమారిటన్ (రహవీర్)’లకు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. బాధితులను కాపాడిన వారికి పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, పైగా వారి సాహసాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం రూ.25,000 వరకు నగదు బహుమతిని అందజేస్తుందని ఎస్పీ వెల్లడించారు. పోలీసు శాఖకు సమాచారం అందిన 24 గంటల్లోనే ప్రమాద ధృవీకరణ ప్రక్రియ పూర్తిచేసి, వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసు కుంటామని తెలిపారు. జిల్లా ఎస్పీ ఏమని విజ్ఞప్తిచేసారంటే.. ’మీరు వేసే ఒక్క అడుగు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందని భయపడకండి. మానవత్వంతో స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించి పీఎంరాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలి’ అని జిల్లా ఎస్పీ ధీరజ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం
మదనపల్లె టౌన్ : టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన మదనపల్లి మండలంలో బుధవారం రాత్రి జరిగింది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుంగునూరు మండలం అడవినాధుని కుంటకు చెందిన రైతు చెన్నారెడ్డి కొడుకు రవీంద్రనాథ్ రెడ్డి(51), సొంత పనిమీద ద్విచక్ర వాహనంలో మదనపల్లి కు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో వెళుతుండగా మార్గమధ్యలోని పుంగనూరు రోడ్డు నయారా పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ ఢీ కొట్టి రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కళా వెంకటరమణ, ఎస్సై చంద్రమోహన్ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇరువర్గాల ఘర్షణలో ఐదుగురికి గాయాలు మదనపల్లె టౌన్ : ఇరు వర్గాల ఘర్షణలో ఐదుగురు గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇందుకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములకల చెరువుకు చెందిన నవీన్, జితేంద్ర బన్నీ మరికొంతమంది కలిసి ఓ మద్యం షాపు వద్దకు వెళ్లి ఫుల్గా మద్యం తాగినట్లు తెలిపారు. అందరూ స్నేహితులైనప్పటికీ మద్యం మత్తులో మాట మాట పెరిగి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో నవీన్ జరిపిన దాడిలో జితేంద్ర, బన్నీ మరో ఇద్దరు గాయపడగా, జితేంద్ర బన్నీలు జరిపిన దాడిలో నవీన్ సైతం గాయపడ్డాడు. గాయపడ్డ వారిని కుటుంబీకులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రతాప్ తెలిపారు. కణితిపై కుక్కల దాడిఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద బుధవారం కుక్కల దాడిలో వన్యప్రాణి కణితి తీవ్రంగా గాయపడింది. ఫారెస్ట్ అధికారుల వివరాల మేరకు..ఒంటిమిట్ట చెరువులోని నీరు తాగేందుకు సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన కణితిని 7 కుక్కలు వెంటాడి తీవ్రంగా గాయపరిచాయి. ఆ కణితిని ఫారెస్ట్ సిబ్బంది పశువైద్య శాలకు తరలించి చికిత్స అందించారు. -
కనెక్టివిటీకి ‘మార్గ’మేదీ !
● గ్రీన్హైవే నిర్మాణప్రక్రియలో సర్వీస్ రోడ్లు లేకపోవడంపై స్థానికుల్లో ఆందోళన ● సర్వీస్ రోడ్లు నిర్మించాలని భక్తులు, యాత్రికుల డిమాండ్ రాజంపేట: గ్రీన్ హైవే (కడప–రేణిగుంట నేషనల్ హై వే) నిర్మాణంలో సర్వీసు రోడ్డుకు మోక్షం కరువైంది.. శేషాచలం అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో పయ నించే గ్రీన్హైవే నుంచి మెయిన్ రోడ్డుపైకి రావడానికి ‘కనెక్టివిటీ’కి దారి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రఖ్యాత ఒంటిమిట్ట, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడికి కూడా స ర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంపై స్థానికుల్లో ఆందోళన కలుగుతోంది. కాగా రూ.4వేల కోట్ల వ్యయంతో రా యలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన గ్రీన్హైవేని మరో రెండేళ్లలో పూర్తిగా అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. గ్రీన్హైవే నుంచి సర్వీసురోడ్డు లేదంటా.. గ్రీన్హైవే నుంచి పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలు సర్వీసురోడ్డు లేదని సమాచారం నిర్మాణ సంస్థల నుంచి తెలిసింది. గ్రీన్హైవే రోడ్ మ్యాప్లో సర్వీస్ రోడ్ల ప్రతిపాదన లేదని కాంట్రాక్ట్ సంస్ధలకు చెందిన ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. సర్వీసురోడ్డు నిర్మాణం చేయాలంటే కేంద్రం నుంచే ఆదేశాలు రావాలని చెబుతున్నట్లు సమాచారం. రామయ్య వద్దకు వెళ్లేదేలా.. కడప–రేణిగుంట నేషనల్హైవేలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. గ్రీన్ హైవే నుంచి సర్వీస్ రోడ్డు లేకపోతే ఈ ప్రముఖ ఆలయాలకు, ఆయా ప్రాంతాల కు వెళ్లేదెలా అంటూ యాత్రీకులు,భక్తులు, పర్యాటకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా మండల కేంద్రాలకు సంబంధంలేని ఏరియాలో సదూర ప్రాంతంలో కనెక్టటివి ఇవ్వడంవల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే భూసేకరణ చేసైనా సర్వీస్ రో డ్లు నిర్మించాలని భక్తులు, పర్యాటకులు కోరుతున్నారు. కూటమి ఎంపీలు స్పందించాలిపుడే... రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం చెందిన జిల్లాలోని పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట నందలూరు కేంద్రాలకు కడప–రేణిగుంట గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి కనెక్టిటివి రోడ్ (సర్వీసురోడ్డు) అవసరమని భక్తులు గట్టిగా వాదిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న కూటమి ఎంపీలు స్పందించి కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రా మాలయం ఒంటిమిట్ట రా మాలయం. రాష్ట్రంలో నలు మూలల నుంచి భక్తులు, యాత్రీకులు రావాలంటే హై వే నుంచి సర్వీసు రోడ్డు ఇ వ్వడం తప్పనసరి. ఇప్పుడు నిర్మితంలో ఉన్న గ్రీన్హైవే నుంచి ఒంటిమిట్ట దగ్గరలో సర్వీసురోడ్డు ఇవ్వాలి. ఆదిశగా కేంద్రప్రభుత్వం అడుగులు వేయాలి. ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. – ఇరగంరెడ్డిసుబ్బారెడ్డి, జెడ్పీ మాజీ వైస్చైర్మన్, ఒంటిమిట్ట గ్రీన్హైవే నుంచి పుణ్యక్షేత్రా లైన నందలూరుకు నేరుగా సర్వీసురోడ్డు నిర్మితం చేయాలి. ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలు లేవనే విషయం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడో అప్రోచ్రోడ్డు నిర్మితం చేయడం వల్ల ఉపయోగంలేదు.దక్షిణభారతీయులు నందలూరు సౌమ్యనాధునికి రావాలంటే నాగిరెడ్డిపల్లె శివార్లలో నేరుగా సర్వీసురోడ్డ్డు నిర్మితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది – భూమనశంక్రెడ్డి, మాజీ సర్పంచి,నాగిరెడ్డిపల్లె, నందలూరు -
చనిపోకనే పెన్షన్ ఇచ్చి ప్రాణాలు నిలపండి
● డీఎంహెచ్ఓను వేడుకుంటున్న డయాలసిస్ రోగి ● రెండేళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదని కంటతడిమదనపల్లె టౌన్ : తాను డయాలసిస్ చేయించుకుంటూ రోజులు లెక్కబెడుతూ కాలం వెళ్లదీస్తున్నాను. రోజూ డయాలసిస్ చేయించు కోవడానికి ఆర్థిక స్తోమత లేదు. డయాలసిస్ చేయించుకోకుంటే ఎప్పుడు చనిపోతానో చెప్పలేమని వైద్యులు తెలిపారు. డయాలసిస్ చేయించుకునే ఆర్థిక స్తోమత లేదు. తన బాధను అర్థం చేసుకుని, పెన్షన్ మంజూరు చేయిస్తే కొంతకాలమైనా బతుకుతానని ఆశగా ఉంది. ఈ అభాగ్యురాలిపై దయతలచి పెన్షన్ మంజూరు చేయించండి సారూ.. అంటూ ఓ యువతి డీఎంహెచ్ఓ ను బుధవారం కలిసి వినతి పత్రం అందజేసింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు మండలం , మద్దినాయినిపల్లె పంచాయతీ, బండపల్లికి చెందిన వెంకటరమణ, రామలక్ష్మి దంపతుల కుమార్తె రవణమ్మ (21). ఈమె ఇంటర్ వరకు చదువు కుంది. చదువుకునే సమయంలో కడుపునొప్పి అని వెళితే మదనపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యుడు మూడు సార్లు ఆపరేషన్ చేసి తన రెండు కిడ్నీలు పాడయ్యేలా చేశాడని తెలిపింది. అప్పటి నుంచి గత ఆరేళ్లుగా డయాలసిస్ తో ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనలాగా డయాలసిస్ తో బాధపడుతున్న వారు కాస్తో కూస్తో రాజకీయ పలుకుబడి ఉపయోగించి పెన్షన్ మంజూరు చేయించుకున్నారు. తనకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇస్తే ఆరోగ్యం కాపాడు కోవచ్చునని రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ పెన్షన్ కోసం తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు.. ప్రభుత్వం నుంచి పెన్షన్ మంజూరు కాలేదని కంటతడి పెట్టింది. ఇటీవల మదనపల్లె కలెక్టరేట్ కు వెళ్లా పీజీఆర్ఎస్ లో కలెక్టర్కు మొరపెట్టుకుంటే వారు డీఎంహెచ్ఓ వద్దకు వెళ్లాలని రాసిచ్చినట్లు తెలిపింది. అందుకే మీ వద్దకు వచ్చాననీ.. తమరైనా పెన్షన్ మంజూరు చేయండని సారూ.. అంటూ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్యను రవణమ్మ వేడుకుంది. -
సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కు వాస్తు దోషమంటా..
● ప్రధాన ద్వారం గేటు మార్చాలని ఎస్ఐ హుకుం జారీ ● అవాక్కవుతున్న సిమెంట్ కంపెనీల డీలర్లు, బ్రిక్స్ యజమానులుసాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లాలోని సింహాద్రిపురంలోని పోలీస్స్టేషన్కు వాస్తు దోషమని ప్రధాన ద్వారానికి తాళం వేసి మరొక గుమ్మం ద్వారా పోలీసులు నడుస్తున్నారు. దీంతో పోలీస్స్టేషన్ మెయిన్ ద్వారానికి తాళం వేయడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరికొందరు ఇదేమిటని పోలీసులను ప్రశ్నించడంతో స్టేషన్కు వాస్తు దోషం పట్టిందని చెబుతున్నారు. పోలీస్స్టేషన్కు వాస్తు దోషంవల్ల అనర్థాలు జరుగుతున్నాయని జ్యోతిష్యుడు చెప్పారని పోలీసులు తెలిపారు. బయట ఉన్న ఇనుప గేటును మార్చాలని జ్యోతిష్యుడు చెప్పడంతో గత నెల 21న పోలీసులు ఈ చర్య చేపట్టారు. 2023లో రూ. కోటి వ్యయంతో అన్ని హంగులతో పోలీస్స్టేషన్ను నిర్మించారు. అప్పటినుంచి ఎందరో పోలీసులు, ఎస్ఐలు వచ్చి ఉద్యోగాలు చక్కగా చేశారు. అలాగే కొందరు ఎస్ఐలు సీఐలుగా పదోన్నతి కూడా పొందారు. కానీ 2026 ఫిబ్రవరిలో లంచం తీసుకుంటూ ఎస్ఐ, సీఐలు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం విధితమే. లంచం తీసుకుంటూ పట్టుబడినా కూడా వాస్తు దోషమని చెప్పడం ఎంతవరకు సమంజసమో వారికే అర్థమవ్వాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఉన్న ప్రధాన ద్వారాలకు తాళం వేసి వేరే ద్వారం గుండా నడుస్తుండడం, ప్రధాన గేటును కూడా మూసివేసి ఇంకో భాగానికి మార్చాలనుకోవడం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. లంచాలు తీసుకుంటూ పట్టుబడినా కూడా దీనికి పోలీసులు వాస్తు దోషం అనడంపై విస్మయం చెందుతున్నారు. అయినా ఎస్ఐ ఇవేమీ పట్టించుకోకుండా గత మంగళవారం ఐదు కంపెనీల సిమెంట్ డీలర్లను, ఇద్దరు బ్రిక్స్ యజమానులను పోలీస్ స్టేషన్కు పిలిపించి సిమెంట్, ఇటుకలు ఉచితంగా పోలీస్స్టేషన్కు అందించాలని హుకుం జారీ చేశారు. ఎస్ఐ సడన్గా వారితో ఈ మాట అనడంతో డీలర్లు ఆయనకు ఏమి చెప్పాలో అర్థంకాక మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. -
వాహనం ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి
పీలేరు రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన స్థానిక కడప మార్గంలోని కేవీఆర్ లడ్జీ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. కేవీపల్లె మండలం తీతవగుంటపల్లెకు చెందిన మిన్నంరెడ్డి సుధాకర్రెడ్డి(62) ఆర్టీసీ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. స్థానిక కడప రోడ్డు మార్గం ఎస్ఆర్ నగర్లో నివాసముంటున్న ఆయన మంగళవారం సాయంత్రం కడప రోడ్డు మార్గంలో వాకింగ్ వెళ్లడానికి ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చారు. గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో సుధాకర్రెడ్డి తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. ఆయన్ను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తేనెటీగల దాడిమదనపల్లె టౌన్ : తేనెటీగల దాడిలో పలువురు గాయపడ్డ సంఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. ఘటనపై బాధితుల కథనం.. ముదివేడుకు చెందిన నిర్మలమ్మ(60), చంద్రశేఖర్రెడ్డి(50), నిర్మల(40), వారి పిల్లలు గీతిక(7), ఫియాన్సి(5)లు ఊరికి సమీపంలోని వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో పెద్దపెరా తేనెటీగల గుంపు వచ్చి దాడి చేసింది. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి నిర్మలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. కాఫీ మీద పడి.. బాలుడిపై కాఫీ పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం మదనపల్లిలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు.. మదనపల్లి పట్టణం కొత్త ఇండ్లలో కాపురం ఉంటున్న దంపతులు రామాంజులు, రాణెమ్మలు తాము ఉంటున్న అద్దె ఇల్లును ఖాళీ చేసేందుకు సామగ్రిని సర్ది మూటల్లో భద్రపరిచారు. అలసిపోయిన దంపతులు కాఫీ తాగాలి అనుకున్నారు. వెంటనే రాణి వెళ్లి కాఫీ పెట్టుకుని వచ్చి భర్తకు ఒక గ్లాసులో పోసి తాగమని టేబులుపై పెట్టింది. అదే సమయంలో ఆడుకుంటూ అక్కడికి వచ్చిన ఏడాది కొడుకు నవీన్ కాఫీని చేత్తో పట్టుకొని మీద పోసుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు చికిత్స కోసం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో, మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. -
ప్రజలకు కనీస వసతుల కల్పన
సాక్షి, మదనపల్లె : మదనపల్లె పట్టణంలో చేపడుతున్న సుందరీకరణ పనులు, మౌలిక వసతుల పనులను జాయింట్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి శివ్ నారాయణ్ శర్మ మంగళవారం పరిశీలించారు. కమిషనర్ కే.ప్రమీలతో కలిసిన ఆయన ముగ్గురాళ్ల వంక, బహుదా వంతెన, బస్టాండ్ సమీప ప్రాంతం, కోమటివాని చెరువు పరిసరాల్లో చేపడుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి, పరిశుభ్రత, అందాన్ని పెంపొందించేలా పనులను గడువులో పూర్తి చేయించాలని కమీషనర్ను ఆదేశించారు. రైతు బజార్, వారాంతపు సంత, టమోటా మార్కెట్యార్డులను పరిశీలించి మౌలిక సదుపాయాలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట ఉత్పత్తులను ఇబ్బందులు లేకుండా విక్రయించుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్, మార్కెటింగ్శాఖ అధికారులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ -
గోధుమ.. సగం మందికే సుమా !
● అప్పులు చేసి డీడీలు చెల్లించినా సగం మందికే గోధుమ పిండి ! ● గౌడౌన్లో స్టాక్ లేదంటున్న సివిల్ సప్లయ్ అధికారులు పెద్దతిప్పసముద్రం: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు నెల నెలా ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ సరుకులే ఆసరా. ఆ రేషన్ సరుకుల్లోనూ చంద్రబాబు సర్కార్ కోతపెడుతోంది. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయం, రేషన్ దుకాణాల్లో ప్రస్థుతం పొందుతున్న సరుకులతో పాటు అదనంగా రాగులు, సజ్జలు, కంది పప్పు పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పుడేమో ఇచ్చే సరుకుల్లోనే కోత విధిస్తోంది. కేవలం బియ్యం, చక్కెరతో సరిపెడుతోంది. ఇక గోధుమ పిండి విషయానికొస్తే ఈ కోటాలో కొంత మందికి పరిమితం కాగా పలు చౌక దుకాణాలకైతే స్టాకే రాకపోవడం శోచనీయం. డీలర్లకు తలనొప్పిగా గోధుమ పిండి పంపిణీ చౌక దుకాణాలకు బియ్యం, చక్కెరతో పాటు గోధుమ పిండి అలాట్మెంట్కు కూడా డీడీలు చెల్లించాలని సివిల్ సప్లయ్ అధికారులు చౌక దుకాణ డీలర్లపై ఒత్తిడి తెచ్చారు. దీంతో డీలర్లు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి డీడీలు చెల్లించారు. సగం చౌక దుకాణాలకు మాత్రమే అది కూడా పూర్తి స్థాయిలో కాకుండా అరకొరగా పిండిని అలాట్ చేశారు. దీంతో వీటిని పంపిణీ చేసేందుకు డీలర్లకు తలనొప్పిగా మారుతోంది. వచ్చిన అరకొర పిండిని ఎవరికి ఇవ్వాలోనని ఆందోళన చెందుతున్నారు. మరి కొన్ని చోట్ల గోధుమ పిండి ఒకరికి ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వలేదంటూ కార్డుదారులు నిలదీస్తుండటంతో డీలర్లకు చీవా ట్లు తప్పడం లేదు. ఇదిలా ఉండగా యుద్దం నేపథ్యంలో వంట గ్యాస్ ధరల పెంపుతో ప్రభుత్వం ప్రతి కార్డుదారుడికి కిరోసిన్ అందజేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. జిల్లాలో 992 చౌక దుకాణాలు అన్నమయ్య జిల్లా పరిధిలోని 25 మండలాల్లో మొత్తం 992 చౌక దుకాణాలు ఉండగా జిల్లా వ్యాప్తంగా 4,27,784 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 12,86,918 మంది సభ్యులుగా ఉన్నారు. గౌడౌన్లో స్టాక్ లేదు చౌక దుకాణా డీలర్లే గోదుమ పిండికి కూడా డీడీలు తీశారు. గౌడౌన్లో స్టాక్ లేనందున అన్ని చౌక దుకాణాలకు పిండిని అలాట్ చేయలేదు. వచ్చే నెల అందరికీ ఇస్తాం. నా పరిధిలోని పీటీఎం, ములకలచెరువు, బి.కొత్తకోట మండలాల్లో 105 చౌక దుకాణాలకు గాను రేషన్ కార్డుల సంఖ్య ఆధారంగా 40 టన్నుల గోదుమ పిండి అవసరం కాగా 20 టన్నుల పిండి మాత్రమే అలాట్ అయింది. – సుబ్బయ్య, సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్. బి.కొత్తకోట. -
దేవపట్ల పీహెచ్సీ తనిఖీ
సంబేపల్లె: మండల పరిధిలోని దేవపట్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం జిల్లా అదనపు వైద్యాధికారి రాధ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన ఆశాడే కార్యక్రంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలోని సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాలొగన్నారు. పాలిసెట్లో 90 శాతం పాస్! మదనపల్లె సిటీ: పాలిసెట్–2026 ఫలితాల్లో జిల్లాలో 90.82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను మంగళవారం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. గత నెల 25న జరిగిన ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 3397 మంది హాజరయ్యారు. ఇందులో 2005 మంది బాలురు, 1392 మంది బాలికలు హాజరుకాగా ఇందులో బాలురు 1796 మంది, బాలికలు 1289 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 89.58 శాతం, బాలికలు 92.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ముగ్గురికి టాప్ ర్యాంకులు సాధించినట్లు పాలిసెట్–26 జిల్లా కన్వీనర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. డి.సాదిక్ 229 ర్యాంకు, డేరంగుల రెడ్డిశేఖర్ 279 ర్యాంకు, చింతం రెడ్డిరూప 376 ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఎన్ఆర్ఐలతో ఆత్మీయ సమావేశం రాయచోటి అర్బన్ : అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వర్జీనియా రాష్ట్రానికి చెందిన తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆత్మీ య సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు స్థానిక జీవన విధానం, అభివృద్ధి నమూనాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో పేదరిక నిర్మూలనకు సమగ్ర ప్రణాళికలు ఎలా ఉండాలి, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు ఎలా కల్పించాలి వంటి అంశాలపై విలువైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ప్రతి ఒక్కరితో సన్నిహితంగా మాట్లాడి, వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్నారు. రాజంపేట వాసికి ఉత్తమ డైరెక్టర్ అవార్డు రాజంపేట టౌన్: దర్శకరత్న దాసరినారాయణరావు జయంతిని పురస్కరించుకొని దర్శకుల దినోత్సవం సందర్భంగా ఈనెల 4వ తేదీ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాజంపేట మండలం ఎస్.ఎర్రబల్లెకు చెందిన ఆదిత్య వంశీ బెస్ట్ షార్ట్ఫిల్మ్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఈవిషయాన్ని ఆయన మంగళవారం ఇక్కడి విలేకరులకు తెలిపారు. తన దర్శకత్వంలో రూపొందిన మధురం కదా బాల్యం, ఉత్తరం అనే షార్ట్ ఫిల్మ్లకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చినట్లు తెలిపారు. మధురం కదా బాల్యం, ఉత్తరం షార్ట్ఫిల్మ్లకు కథను, లిరిక్స్ను ప్రముఖ లిరిక్ రైటర్ ఎండి.రఫి అందించారని పేర్కొన్నారు. -
క్వారీకి స్థలం కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణ
కలికిరి : మండలంలోని గుండ్లూరు, పల్లవోలు గ్రామాల పరిధిలోని శ్రీలక్ష్మీస్టోన్ క్రస్సర్(క్వారీ)కి అదనపు స్థలం కేటాయింపుపై మంగళవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కడప కార్యాలయం అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పీలేరు డివిజినల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారి సుధ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో క్వారీ నిర్వహణకు గానూ గ్రామాలలో చేపట్టవలసిన కనీస సౌకర్యాలు, వసతులు కల్పించలేదని, పర్యావరణ పరిరక్షణ చర్యలు సైతం చేపట్టలేదన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా క్వారీ నిర్వహించుకోవాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కోరారు. అదనపు స్థలం కేటాయింపునకు చర్యలు మండలంలోని గుండ్లూరు, పల్లవోలు గ్రామాల పరిధిలోని ఈ క్వారీ ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో గతంలో చుట్టు పక్కల గ్రామాలైన కొత్తపల్లి, శీనప్పగారిపల్లి, పెద్ద దళితవాడ, గ్యారంపల్లి దళితవాడ, గడి తదితర ప్రాంతాంలో నివాసాలు దెబ్బతిన్నాయి. నాయకునివారిపల్లిలో నివాసాలు దెబ్బతినడంతోపాటు ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తిగా దెబ్బతిని నిరుపయోగంగా మారింది. ప్రజలు సైతం జబ్బులకు గురయ్యారు. చుట్టు పక్కల మామిడి తోటలు, పంటలు సైతం దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మళ్లీ క్వారీకి అదనంగా 12 ఎకరాల విస్తీర్ణం కేటాయించడం పలు విమర్శలకు తావిస్తోంది. కార్యక్రమంలో తహసీల్దారు సయ్యద్, మండల సర్వేయరు రెడ్డెప్ప, మైనింగ్ శాఖ అధికారులు, వీఆర్ఓలు, తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య
● కూలీని హత్య చేసిన మేస్త్రీ ● ఇద్దరు నిందితుల అరెస్ట్మదనపల్లె టౌన్ : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కూలీని మేసీ్త్ర హత్య చేశాడు. ఈ కేసులో నిందితులను ఎట్టకేలకు మంగళవారం మదనపల్లె తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి డీఎస్పీ పావని మీడియాకు వివరాలు వెల్లడించారు. మదనపల్లె మండలం పోతబోలుకు చెందిన మేస్త్రి ఖాదర్ బాషా (54) కూలీలతో మేసీ్త్ర పనులు చేయించే వాడు. ఈ క్రమంలో ఖాదర్ బాషా వద్దకు కూలీ పనులు చేయడానికి సిటిఎం దళితవాడకు చెందిన పలక మురళి అతని భార్య అలాగే కొత్త కూరాకులవారిపల్లికి చెందిన పాకాల కిరణ్ వెళ్లే వారు. ఈ నేపథ్యంలో పలక మురళి మద్యం అలవాటు ఉండడంతో భార్య పిల్లల్ని పట్టించుకోకుండా పోయాడని, మురళి భార్య తన మేస్త్రి ఖాదర్ బాషాతో సన్నిహితంగా కొనసాగడాన్ని భర్త గమనించాడని డీఎస్పీ తెలిపారు. అప్పటి నుంచి మురళి అతని భార్య ఖాదర్ బాషా వద్దకు పనులకు వెళ్లకుండా మానేశారన్నారు. తనకు మురళి భార్య దూరం అవుతోందన్న బాధతో ఖాదర్బాషా.. మురళిని మట్టు పెట్టడానికి పథకం వేసుకున్నట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే గత నెల 14న రాత్రి కొత్త కూరాకులవారిపల్లెకు చెందిన పాకాల కిరణ్ సాయంతో పలక మురళిని సిటిఎం సమీపంలోని కంకర ఫ్యాక్టరీ వద్దకు రప్పించారన్నారు. మద్యం తాపించి బండరాళ్లతో కొట్టి హత్య చేసి, ఆపై బైక్లో ఉన్న పెట్రోల్ తీసి చనిపోయిన పలక మురళి మీద పోసి తగలబెట్టి పరారైనట్లు తెలిపారు. 15న మురళి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుపై తాలుకా సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక ఆధారాలతోపాటు హత్యకు ఉపయోగించిన బండరాళ్లు, బీరు బాటళ్లు సీజ్ చేసి ల్యాబ్కు పంపడం జరిగింది. అనంతరం నిందితుల కోసం గాలిస్తుండగా, స్థానిక ఎరగాని మిట్ట టిడ్కో ఇళ్ల వద్ద ఇద్దరిని మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని, మొబైల్ ఫోన్లతో సహా బైకును సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారణ అనంతరం నేరం అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య కేసును ఛేదించిన సీఐ కళా వెంకటరమణను డీఎస్పీ అభినందించి రివార్డుకు ఎస్పీకి సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. -
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
మదనపల్లె టౌన్: విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మదనపల్లె జిల్లా విద్యుత్ శాఖ విజిలెన్స్ పోలీస్ అధికారి దిలీప్ అన్నారు. మంగళవారం చీఫ్ విజిలెన్స్ అధికారి జనార్దన్ నాయుడు, ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్య రెడ్డి ఆదేశాలతో, వలసపల్లి గ్రామ సచివాలయంలో సిబ్బందితో కలసి పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ మోటర్ స్విచ్లను తడి చేతులతో ముట్టుకోకుండా చెప్పులు ధరించి ఆఫ్ ఆన్ చేయాలన్నారు. పొలాల్లో తెగి పడి న విద్యుత్ వైర్లను తాకరాదని, పంటకు చుట్టూ వేసే కంచెకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదని హెచ్చరించారు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చి జంతువులను వేటాడితే భారీ జరిమానా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రైతు లు పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులను సొంతంగా వేయరాదని సూచించారు. విద్యుత్ సమస్య ల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు డయల్ చేయాలని కోరారు. పోస్టర్ల ఆవిష్కరణలో విజిలెన్స్ అధికారి దిలీప్ -
యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన మంగళవారం రాయచోటిలో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. సత్యసాయి జిల్లా కదిరి బాపనపల్లెకు చెందిన నారాయణస్వామి కొడుకు ఎం.రెడ్డిప్ప(30) తన భార్య అంజలితో కలిసి రోజూ పల్లెలకు బట్టల వ్యాపారం చేయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో రెడ్డప్ప తన స్నేహితులతో కలిసి రాయిచోటి సమీపాన పల్లెలకు బట్టల వ్యాపారం చేసేందుకు వెళ్ళాడు. పల్లెల్లో వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రాయచోటి బస్టాండ్కు వచ్చాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో మద్యం మత్తులో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సహచరులు గమనించి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. అనంతరం వైద్యుల సలహా మేరకు బెంగళూరుకు ఓ అంబులెన్స్లో తరలిస్తుండగా, పరిస్థితి విషమించిందని వెంటనే దారిలోని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతిపెద్దతిప్పసముద్రం : మండలంలోని మద్దయ్యగారిపల్లికి చెందిన బిల్లూరు డిష్ నాగరాజు (54) మంగళవారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఎప్పటిలాగానే నాగరాజు వృత్తి రీత్యా ఓ ఇంట్లో డిష్ కనెక్షన్ ఇచ్చే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధాంతరంగా తనువు చాలించిన నాగరాజు మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్కు గాయాలు చౌడేపల్లె : మండలంలోని లద్దిగం విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో మంగళవారం జరిగిన విద్యుత్ ఘాతంలో ట్రాన్స్కో ఫీల్డ్అసిస్టెంట్ నిరంజన్రెడ్డికు గాయాలయ్యాయి. లద్దిగం చెరువు వద్ద గల ఫీల్డ్లో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గ్రానైట్ లారీ సీజ్గుర్రంకొండ : గ్రానైట్ లారీని అధికారులు సీజ్ చేసిన సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. మంగళవారం గ్రామానికి సమీపంలో జిల్లా గనుల శాఖ అధికారులు గ్రానైట్ లారీని తనిఖీ చేసి రికార్డులు సరిగ్గా లేక పోవడంతో సీజ్ చేశారు. ఆ లారీని స్టానిక పోలీస్స్టేషన్లో అప్పగించారు. జిల్లా గనుల శాఖ అధికారులు తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటామని ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. -
పాలిసెట్లో ఉత్తమ ర్యాంకులు
తిరుపతి అర్బన్: విశ్వం విద్యా సంస్థల్లో శిక్షణ పొందిన విద్యార్థులు పాలిసెట్–2026 ఉత్తమ ర్యాంకులు సాధించారని విశ్వం విద్యా సంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యా సంస్థల్లో 2026 సంవత్సరం పాలిటెక్నిక్ ఎంట్రెన్స్కు శిక్షణ పొందిన విద్యార్థులు 100 శాతం అర్హత సాధించారని చెప్పారు. తమ విద్యార్థి వెల్దుర్తి మోక్షిత్ 120కి 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఎస్వీయూ రీజన్లోనూ, జిల్లాలో స్థాయిలోనూ మొదటి ర్యాంకు దక్కించుకున్నారని వెల్లడించారు. అలాగే 2026 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశ్వం టాలెంట్ స్కూల్ విద్యార్థిని కే. గీతిక 300 మార్కులకు 285 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రథమ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వం విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి, కరస్పాండెంట్ తులసి విశ్వనాథ్ రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.పోటీ పరీక్షలకు సంబంధించిన వివరాలకు 8688888802, 9399976999 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. -
పవిత్ర లడ్డూ ప్రసాదమేదీ !
జమ్మలమడుగు: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగే నారాపురస్వామి బ్రహ్మోత్సవాల్లో తిరుమల లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడంపై భక్తుల్లో అసంతృప్తి నెలకొంది. ఏటా వైశాఖ మాసంలో జరిగే నారాపురస్వామి బ్రహ్మోత్సవాలలో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సైతం స్వామి వారి అలంకారాలను వీక్షించటానికి సాయంత్రం పూట వేలాది మంది వస్తుంటారు. ఉత్సవాల్లో స్వామివారం పవిత్ర లడ్డూ ప్రసాదం లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. కల్యాణోత్సవాన్ని తిలకించలేమా! నారాపుర స్వామి బ్రహ్మోత్సవాలలో బుధవారం సాయంత్రం స్వామి వారికి కల్యాణోత్సవం జరగనుంది. రూ.300 రుసుం చెల్లించిన వారికి మాత్రమే ఈ కల్యాణోత్సవంలో పాల్గొనాలని.. చెల్లించనివారు బయటి నుంచి వీక్షించే విధంగా టీటీడీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీంతో భక్తులు భగ్గుమంటున్నారు. గతంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని భక్తులందరూ తిలకించేవారు. టీటీడీలో కలిసి దాదాపు 20 సంవత్సరాలు.. నారాపుర స్వామి ఆలయాన్ని సుమారు రెండు దశాబ్దాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో టీటీడీలో వీలినం చేశారు. అప్పటి నుంచి స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయ ప్రకారం స్వామి వారికి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో తిరుమల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు ఇప్పటివరకు టీటీడీ అధికారులు లడ్లు సరఫరా చేయలేదు. సాధారణ సమయంలో లడ్డూ ప్రసాదం లేకున్నా పర్వాలేదు గానీ.. ఉత్సవాల సమయంలోనైనా లడ్డు ప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల లడ్లు అందుబాటులోకి తేవాలి.. నారాపురస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ తిరుమల లడ్డు ప్రసాదం అందుబాటులోనికి తీసుకురావాలి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. లడ్డూ ప్రసాదం లేకపోవడంపై భక్తులు నిరాశ చెందుతున్నారు. టీటీడీ అధికారులు అలోచించి భక్తులకు తిరుమల లడ్డు ప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలి. – భూతమాపురం సుబ్బారావు, న్యాయవాది, జమ్మలమడుగు. -
ఆలయాల్లో చోరీలకు పాల్పడే ముఠా ఆటకట్టు
● నలుగురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్ ● 4 కిలోల వెండి, బంగారు ఆభరణాలు స్వాదీనం ● ఎస్పీ ధీరజ్ వివరాల వెల్లడిమదనపల్లె టౌన్ : ఆలయాలను లక్ష్యంగా చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రమాదకర అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించారు. నిందితులను మదనపల్లె పోలీసులు పట్టుకుని, వారి వద్ద నుంచి రూ. 5 లక్షలకు పైగా విలువ చేసే సుమారు 4 కిలోల వెండి కిరీటాలు, బంగారు తాళి బొట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఎలా పట్టుకున్నాంటే.. జిల్లాలోని పలు దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న దొంగతనాలను సీరియస్గా తీసుకుని పోలీసుల ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం స్థానిక చంద్ర కాలనీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారిని మహారాష్ట్రకు చెందిన అనికేత్ కై లాస్ కసరోడే (27), సునీల్ దేవరావు సూర్యవంశీ (24), మనీష్ గోపాల్ వడివే (21), ప్రకాష్ మన్సారం ఖరే(18)లుగా గుర్తించారు. వారంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఆలయాల్లో హుండీలు, విగ్రహాల ఆభరణాలను దోచుకుంటున్నట్లు వారు నేరం అంగీకరించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలివే నిందితుల వద్ద నుంచి 3 వెండి కిరీటాలు, శటారి, శంఖు చక్రం, పంచామృతం గిన్నె వంటి సుమారు 4 కిలోల వెండి వస్తువులతోపాటు మూడు బంగారు తాళిబొట్లు, 2 బంగారు గిన్నె బొట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుంది. ఈ ముఠా వాయల్పాడు, బత్తలపల్లితోపాటు గుంటూరు, ఒంగోలు జిల్లాల్లోనూ చేతివాటం ప్రదర్శించినట్లు విచారణలో వెల్లడైంది. పోలీస్ బృందాన్ని అభినందించిన ఎస్పీ క్లిష్టమైన ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన మదనపల్లె డీఎస్పీ బి.పావని, టూ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, ఎస్ఐలు నాగేశ్వరరావు, రామాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, క్రైమ్ టీం సభ్యులు భద్రానాయక్, హరిశంకర్రెడ్డిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఆలయాల రక్షణ కమిటీలదే దేవాలయాల రక్షణ పోలీసులదే కాదని, కమిటీలది కూడా అని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆభరణాలు పరిరక్షించుకోవాలని పేర్కొ న్నారు. రాత్రి వేళల్లో సెక్యూరిటీ గార్డులను నియమించుకుంటే ఇలాంటి చోరీలను అరికట్టవచ్చన్నారు. అలాగే హుండీ నగదును ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమ చేయాలని సూచించారు. అనుమా నాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100/112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి, మదనపల్లి డీఎస్పీ బి.పావని, టూటౌన్ ఎస్ఐలు నాగేశ్వరరావు, రామాంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్మార్ట్గా మంట పెడుతున్నారు !
● మధ్యాహ్న భోజన కార్మికులపై ‘స్మార్ట్’కిచెన్ పిడుగు ● స్మార్ట్ కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజనం అందించే దిశగా అడుగులు ● ఇప్పటికే నాలుగు మండలాల్లో అమలు ● త్వరలో మిగతా మండలాల్లో కూడా అమలుకు శ్రీకారం కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులు తమ ఉపాధిని కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే నాలుగు మండలాల్లో ఈ స్మార్ట్ కిచెన్ను ప్రారంభించి అక్కడ నుంచి మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలకు తరలించి పిల్లలకు వడ్డిస్తున్నారు. ఇక మిగిలిన మండలాల్లో కూడా త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా చేస్తే తమ పరిస్థితేంటని జిల్లాలో సుమారు 2980 మంది మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను తొలగించే కుట్ర చేయడంతో పాటు .. కూటమి వర్గీయుల జేబులు నింపేందుకే స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి.... మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తోంది. 1500 నుంచి 2000 వేల మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ కిచెన్ ఉంటుందని విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి ఒకటి లేదా రెండు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కడప, సీకేదిన్నె, జమ్మలమడుగు, దేవగుడిలలో స్మార్ట్ కిచెన్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ నుంచి పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తూ పిల్లలకు వడ్డిస్తున్నారు. మిగతా మండలాల్లో కూడా చాలా మేర స్మార్ట్ చికెన్ షెడ్డు నిర్మాణ దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశ్నార్థకంగా కార్మికుల భవిష్యత్తు... జిల్లావ్యాప్తంగా 20 ఏళ్లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారికి నెలకు రూ. 3 వేల గౌరవ వేతనంతోపాటు హైస్కూల్లో విద్యార్థికి రూ. 8.55, ప్రాథమిక పాఠశాలల్లో రూ. 5.50 చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు. చాలీ చాలనీ జీతాలతో ఏళ్ల తరబడి ఆ వృత్తిలో కొనసాగుతున్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటుతో ఉపాధి కోల్పోతామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లో వంట తయారీ చేస్తూ కూటమి ప్రభుత్వం చిరుకూలీల పొట్టకొడుతోంది. పొమ్మనలేక ‘స్మార్ట్’గా మంట పెడుతోంది. అవును.. ఇన్నాళ్లు వంటనే నమ్ముకుని బతుకుతున్న మధ్యాహ్న భోజన కార్మికలోకం తమ ఉపాధిని ‘స్మార్ట్ కిచెన్’ లాగేసుకుంటుందేమోనని కలవరపడుతోంది. పాఠశాలలో పిల్లలకు వంట ఏజెన్సీలు వేడివేడిగా అన్నం వండి వడ్డిస్తున్నారు. ఎక్కడో వండిన అన్నం అన్ని పాఠశాలకు వాహనాల్లో తీసుకొచ్చి వడ్డిస్తే అధి చల్లబడడంతోపాటు మెత్తగా తయారవుతుంది. ఏ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అక్కడే కొనసాగించాలి. – చాన్బాషా, మధ్యాహ్న భోజన పథక గౌరవాధ్యక్షుడు ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ కిచెన్ విధానంతో జిల్లాలో చాలా మంది పేద మహిళల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. ఇప్పటికే మా డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. చాలా మంది ఏళ్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఎన్నడు ఇలాంటి ఇబ్బందులు కలగలేదు, స్మార్ట్ కిచెన్ విధానాన్ని వెనక్కు తీసుకోవాలి. – మేరీ, మధ్యాహ్న భోజనం వర్కిర్ యూనియన్ నాయకురాలు -
ఉపాధి కూలీలకు ‘ఫేస్ యాప్ కష్టాలు’
● ఇబ్బంది పడుతున్న వేతనదారులు ● వెంటాడుతున్న సాంకేతిక కష్టాలు ● పాత పద్ధతి మేలు అంటున్న కూలీలుగాలివీడు : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీలకు సాంకేతికత శాపంగా మారింది. ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫేస్ రికగ్నిషన్’ (ముఖ గుర్తింపు) హాజరు విధానం క్షేత్రస్థాయిలో విఫలమవుతోంది. గాలివీడు మండలంలోని మారుమూల గ్రామాల్లో సిగ్నల్ సమస్యలు, యాప్ సర్వర్ లోపాల కారణంగా కూలీలు పనుల కంటే హాజరు కోసమే ఎండలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం తమ కడుపు కొట్టేలా ప్రవర్తిస్తోందని, తక్షణమే పాత పద్ధతిలోనే హాజరు సేకరించాలని వేతనదారులు డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర అవస్థలు మండలంలోని ఉపాధి హామీ కూలీలకు సాంకేతిక కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల పేద కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సమస్యలు ఫెస్ యాప్ ప్రారంభించినప్పటి నుంచి మండలంలోని మారుమూల గ్రామాల్లో ఉపాధి పనుల కోసం వచ్చిన కూలీలు పని కంటే ఎక్కువగా హాజరు కోసమే వేచి చూడాల్సి వస్తోంది. ఐరిస్ నమోదులో జాప్యం జరుగుతోంది. ఉదయాన్నే పనులకు వెళ్లిన కూలీలు గంటల తరబడి ఐరిస్ (కంటి గుర్తింపు) నమోదు కోసం నిరీక్షించాల్సి వస్తోంది. సిగ్నిల్ సమస్యలతో.. క్షేత్ర స్థాయిలో సిగ్నల్ సమస్యలు లేదా యాప్లో తలెత్తుతున్న సాంకేతిక లోపాల వల్ల హాజరు నమోదు కావడం లేదు. దీనివల్ల కష్టపడి పని చేసినా, హాజరు పడకపోతే వేతనం రాదనే భయం కూలీలను వెంటాడుతోంది. పనులకు దూరం : ఈ కొత్త నిబంధనల వల్ల పనులకు సమయం వృథా అవుతోందని, ఆసలు పని కంటే ఈ యాప్ల గోలే ఎక్కువగా ఉందని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి తిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వేతనదారులు పడే ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నిబంధనలతో కూలీలు పనులకు దూరమయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తున్నాం కూలీలు ఫెస్ యాప్ తీసుకునే సమయంలో సంకేతిక సమస్యలు తలెత్తుతున్నప్పటికీ, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నాం. సర్వర్ డౌన్ అయినప్పుడు ఫొటోలను సేవ్ చేసుకుని తదుపరి అప్లోడ్ చేస్తున్నాం. ఈ క్రమంలో సమయం కూడా వృథా అవుతోంది. – రామచంద్ర, ఏపీఓ, గాలివీడు -
అంతర్ జిల్లా చైన్ స్నాచర్ల అరెస్ట్
● రూ.11.62 లక్షల బంగారం స్వాధీనం ● ముఠాగా ఏర్పడిన ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులుమదనపల్లె టౌన్ : పీలేరు నియోజకవర్గంలోని వేర్వేరు మండలాల్లో వరుసగా చైన్ స్నాచింగ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్, ఏఎస్పీ వేంకటాద్రి, డీఎస్పీలు పావని, కృష్ణమోహన్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి, ఎస్సైలు తిప్పేస్వామి, రవీంద్రబాబు, సీసీఎస్ క్రైమ్ బృందం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. వాల్మీకిపురంలోని మదనపల్లి తిరుపతి హైవే రోడ్డు, ఏటిగడ్డ శివాలయం సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,62,500 విలువైన 77 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠా నాయకుడు జరిపిటి రెడ్డెప్ప (30), రొంపిచర్లకు చెందిన పెద్దకోట్ల సుబ్రమణ్యం (38), కేవీపల్లెకు చెందిన అరవలోకేష్ (32), వాల్మీకిపురం, మదనపల్లికి చెందిన బర్లపల్లి అంజలి, సుజాత(45)లు ముఠాగా ఏర్పడి మహిళలతో మాట కలిపి మోసం చేసి చైన్ స్నాచింగ్లకు పాల్పడే వారు. జల్సాల కోసమే నేరాలు నిందితులు రెడ్డెప్ప, సుబ్రమణ్యం, లోకేష్ ముగ్గురు స్నేహితులు. తమ విలాసాలకు, చెడు అలవాట్లకు డబ్బు సరిపోకపోవడంతో సులభంగా సంపాదించేందుకు దొంగతనాల బాట పట్టారు. వీరు గుర్రంకొండ, వాయల్పాడు, రొంపిచెర్ల, కలకడ మండలాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడే వారు. చోరీ చేసిన సొత్తును దాచడంలో మహిళా నిందితులు అంజలి, సుజాత సహకరించే వారని పోలీసుల విచారణలో తేలింది. చైన్ స్నాచర్స్ నుంచి వివిధ కేసులకు సంబంధించి 77 గ్రాముల బంగారంతోపాటు చైన్లు, ఉంగరాలు, చెంప సరాలు స్వాధీనం చేసుకున్నారు. గుర్రంకొండ, వాయల్పాడు, కలకడ, రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లలో నమోదైన ఆరు కేసులను ఛేదించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు సిబ్బందికి ప్రశంసలు చైన్ స్నాచింగ్ ముఠాను పట్టుకున్న వాయల్పాడు సీఐ బి.రాఘవరెడ్డి, ఎస్సైలు తిప్పేస్వామి, రవీంద్రబాబు, రమేష్తోపాటు సిబ్బంది అబ్దుల్లా, రాఘవరెడ్డి, దొరబాబు, రవీంద్ర నాయక్, సుబ్రమణ్యంలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
వైఎస్సార్సీపీ నేత వెంకటరామిరెడ్డికి నివాళి
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని కోనంపేటకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు చిలేకంపల్లి వెంకటరామిరెడ్డి(39) సోమవారం సాయంకాలం రాయచోటి గాలివీడు రింగ్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం కోనంపేటలో నిర్వహించిన వెంకటరామిరెడ్డి అంత్యక్రియల్లో లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్రెడ్డి, ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీపీ రెడ్డయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మాజీ సింగల్ విండో ప్రెసిడెంటు మెరుసుపల్లి ఎర్రంరెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువ నాయకులు రామాపురం మండల నల్లగుట్టపల్లి మాజీ ఎంపీటీసీ సూరం వెంకటసుబ్బారెడ్డికి వెంకటరామిరెడ్డి బావమరిది కావడంతో.. వెంకటరామిరెడ్డి మరణ వార్తతో రామాపురం, లక్కిరెడ్డిపల్లి మండలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వెంకటరామిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
మదనపల్లెకు ‘108’ కష్టాలు
● జిల్లా కేంద్రమైనా పాత చిన్నగది కేటాయింపు ● ఆక్సిజన్ సిలిండర్ల నిల్వ నిల్ ● అత్యవసరానికి వెంపర్లాడాల్సిందే సాక్షి, మదనపల్లె: జిల్లా కేంద్రం మదనపల్లెకు 108 సేవల కష్టాలు వెంటాడుతున్నాయి. ఉండాల్సిన వసతులు, సౌకర్యాలు లేకపోగా రెండు లక్షల జనాభా కలిగిన పట్టణం, లక్షల దాకా ఉన్న రూరల్ మండలం జనాభాకు ఒకే అంబులెన్స్ సేవలందిస్తోంది. అది కూడా తిరుపతికి రెఫర్ కాకపోతేనే. ఈ పరిస్థితుల్లో 108 సేవలపై నీలి నీడలు అలముకుంటున్నాయి. ప్రభుత్వం సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఎదురుచూస్తున్నారు. ఒక్కటే అంబులెన్స్ ఆరోగ్యశ్రీ కింద నిర్వహణలో ఉన్న 108 అంబులెన్స్ సేవలు పెరగడం లేదు. నాలుగు నెలల క్రితం వరకు డివిజన్ కేంద్రంగా ఉన్న మదనపల్లె తర్వాత జిల్లా కేంద్రమైంది. అప్పటి 108 సేవలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. రెండు లక్షల జనాభా కలిగిన పదనపల్లె పట్టణం, లక్షన్నర జనాభా దాటిన మదనపల్లె రూరల్ మండలం కలిపి మూడున్నర లక్షల జనాభాకు ఒక అంబులెన్స్ మాత్రమే ఉంది. ఈ జనాభాకు సేవలు అందించడం అటుంచితే.. ఎప్పుడు రెఫరల్ కేసులు పడతాయో తెలియవు. కేసు వచ్చిందంటే ఇక తిరుపతికి వెళ్లి రావాలి. అంతవరకు ఇక్కడ సేవలు అందించేందుకు వీలు లేదు. ఫలితంగా అత్యవసర సేవలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉన్నది ఒక అంబులెన్స్ మాత్రమే అయినా సేవలు మాత్రం తిరుపతి వరకు అందిస్తున్నారు. ఫలితంగా ఇక్కడ అత్యవసర పరిస్థితి వస్తే ప్రైవేటు సేవలే దిక్కు. ఆక్సిజన్ నిల్వలు లేవు జిల్లా కేంద్రంలో 108 సేవలు అందించడం కోసం ఆక్సిజన్ సిలిండర్లను స్థానికంగా నిల్వ ఉంచాల్సి ఉంది. 100 కిలోల సామర్థ్యం కలిగిన సిలిండర్లు 20కి పైగా స్టాక్ ఉంచాలి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాలయాన్ని, గదులను కేటాయించాల్సి ఉంది. అయితే ఈ ఏర్పాటు చేయకపోవడంతో స్టాక్ పెట్టుకోవడానికి అవకాశం లేకపోయింది. ఇక్కడి నుంచి రెఫరల్ కేసుతో అంబులెన్స్ తిరుపతికి వెళితే అక్కడి ఏజెన్సీ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అందుబాటులో ఉన్న సిలిండర్ ఖాళీ అయితే అత్యవసర ఆక్సిజన్ కోసం దిక్కులు చూడాల్సిందే. పాత చిన్న గది కేటాయింపు రహదారి, భవనాల శాఖ అతిథి గృహాల ఆవరణలో ఓ పాడుబడిన చిన్న గదిని 108 కోసం కేటాయించారు. ఇక్కడ విధుల్లో ఉన్న అంబులెన్స్ నిలిపి ఉంచుతున్నారు. ఏదైనా సేవల కోసం సిబ్బంది ఇక్కడి నుంచే అంబులెన్స్ తీసుకెళ్తారు. ఈ చిన్న గదిలో విధుల్లో ఉన్న సిబ్బంది ఉండాల్సి వస్తోంది. చిన్న సౌకర్యం కూ డా లేని ఈ గదిలో సిబ్బంది ఇబ్బందులు పడుతు న్నారు. జిల్లా కేంద్రానికి తగ్గట్టుగా భవనం కేటాయింపు జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఎక్కడ ఉంచుతారన్న ప్రశ్న తలెత్తుతుంది. నిర్లక్ష్యమే 108 సేవలకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శలు వస్తున్నాయి.స్థానికంగా ఆక్సిజన్ సిలిండర్లు నిలువ ఉంచుకునే ఏర్పాట్లు ఇంతవరకు చేయకపోవడం, పట్టణం, మండలానికి కలిపి ఒకే అంబులెన్స్ సేవలు కొనసాగిస్తుండటంతో మెరుగైన ఫలితాలు కనిపించడం లేదు. ప్రధానంగా జిల్లాలోని 25 మండలాలకు, 26 అంబులెన్సులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు నిలువ ఉంచుకుని చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రతిపాదించాం జిల్లా కేంద్రమైన మదనపల్లెకు మరో మూడు అంబులెన్సులు అవసరమని, మంజూరు చేయాలని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కు ప్రతిపాదనలు పంపించామని జిల్లా 108 మేనేజర్ సుబ్రమణ్యం చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్ల స్టాకును పీలేరులో ఉంచుతున్నట్టు చెప్పారు. -
దాడులు చేస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం
తిరుపతి తుడా: ‘రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై రోజురోజుకూ అధికార పార్టీ కార్యకర్తలు, నేతల దాడులు అధికమయ్యాయి. దశరథరామిరెడ్డికి రెండు కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. తలపై తీవ్రంగా గా యపరిచారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు మాత్రం దుండగులపై కేసులు పెట్టకుండా దశరథరామిరెడ్డిపైనే కేసు నమోదు చేశారు. అధికారపార్టీకి కొమ్ముకాయకుండా నిందితు లను గుర్తించి అరెస్ట్ చేయాలి’ అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. మంత్రి మండిపల్లె రామ్ప్రసాద్రెడ్డి అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని సోమవారం సాయంత్రం వారు పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దశరామిరెడ్డిపై కూటమి నేతలు విచక్షణా రహితంగా దాడిచేయడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఎమెమల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, పరామర్శించారు. అనంతరం వారు దశరథరామిరెడ్డి సతీమణిని కలిసి దాడికి సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. -
గంజాయి మత్తులో యువకుడిపై దాడి
మదనపల్లె టౌన్: గంజాయి మత్తులో ఓ యువకుడు తన ప్రత్యర్థిపై బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అన్నమయ్య జిల్లాలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘటనపై బాధితుడి కథనం.. తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలం, తురకపల్లి కు చెందిన మహబూబ్ బాషా కుమారుడు షాబాన్ మొహిద్దిన్(25), ఇంటికి సమీపంలో ఉన్న మైదానానికి మధ్యాహ్నం వెళ్లాడు. అప్పటికే అక్కడ గంజాయి మత్తులో ఉన్న అదే ఊరికి చెందిన బాబు బుడన్ కొడుకు సయ్యద్ ఖదీర్ బీర్ బాటిల్ తెచ్చి పాత కక్షల కారణంగా షాబాన్ మొహిద్దినిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇతన్ని స్థానికుల సాయంతో కుటుంబీకులు మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. పెద్దమడ్యం పోలీసులు విచారణ చేస్తున్నారు. -
వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మదనపల్లె సిటీ: వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ది అధికారి జి,చంద్రశేఖర్ అన్నారు. సోమవారం డీఎస్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్రీడా శిబిరాలను సందర్శించారు. మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలోని హాకీ, బాస్కెట్బాల్ శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. కోచ్లు అందిస్తున్న శిక్షణ విధానం, క్రీడాకారుల హాజరు,మైదాన సదుపాయాలు, క్రీడాసామాగ్రి వినియోగంపై సమీక్షించారు.కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ నాగరాజు, క్రీడాభారతి సెక్రటరీ నరేష్బాబు పాల్గొన్నారు. పీలేరు గ్రామ పంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ పీలేరు : పీలేరు గ్రామ పంచాయతీ ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకుంది. సోమవారం ఐఎస్ఓ పరిశీలకులు కేరళకు చెందిన లీడ్ ఆడిటర్ జార్జ్, విజయవాడకు చెందిన సీపీఆర్లు కె. ఆశ, ఎం. కల్యాణి పీలేరు గ్రామ పంచాయతీకి కార్యాలయాన్ని సందర్శించారు. ఐఎస్వో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు, పౌరులకు అందజేస్తున్న సేవలు, నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితితో జిల్లాలో ఐఎస్వో సర్టిఫికెట్ అందుకున్న తొలి గ్రామ పంచాయతీగా పీలేరు నిలవడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణతో ఫలితాలు సాధ్యం సాక్షి, మదనపల్లె: కృషి, క్రమశిక్షణతో కూడిన విద్య మంచి ఫలితాలు సాధిస్తుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా ప్రభుత్వ హై స్కూల్లో చదివి అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులను సోమవారం ఆయన జ్ఞాపికలతో సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు. ఇంటర్లో ఆసక్తి, లక్ష్యాలకు అనుగుణంగా సబ్జెక్టులను ఎంపిక, ప్రణాళికతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఆర్డి.వైష్ణవి (595), జి.ఆది విష్ణు(592), జి.కీర్తన( 591), డి.అఖిల( 591), ఎన్.సుష్మాతాజ్ ( 590)లతో కలెక్టర్ ముచ్చటించారు. డీఈఓ సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, పాల్గొన్నారు. సత్వరమే అర్జీలకు పరిష్కారం మదనపల్లెఅర్బన్: ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదన్నారు. మాజీ సర్పంచ్ కుటుంబంపై దాడి రామాపురం: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మరో దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామపురం మండలం కల్పనాయిని చెరువుకు చెందిన వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ రామకృష్ణ కుటుంబంపై టీడీపీ అనుచరులు దాడి చేశారు. బాధితుల కథనం మేరకు.. రామకృష్ణ తన స్థలంలో ఇళ్లు నిర్మించేటప్పుడు రెండు అడుగుల స్థలం వదిలివేయగా, ఆ స్థలాన్ని కలుపుకొని నరసింహులు అనే వ్యక్తి నిర్మాణం చేపట్టాడు. గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి నరసింహులను హెచ్చరించినా ఫలితం లేకపోయింది. టీడీపీ అనుచరులు జోక్యం చేసుకుని రామకృష్ణ వైఎస్సార్సీపీకి చెందినవాడనే కారణంగా నరసింహులును రెచ్చగొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. పెద్దలు వెళ్లిపోయిన అనంతరం కర్రలు, కొడవళ్లతో దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనలో రామకృష్ణ (67), ఆయన భార్య లక్ష్మీదేవి (65), సోదరి లక్ష్మమ్మ (70) తీవ్రంగా గాయపడ్డారు.లక్ష్మీదేవికి తలకు బలమైన గాయం కాగా, ప్రస్తుతం తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రామకృష్ణకు భుజం, మణికట్టు, తలకు, లక్ష్మమ్మకు చేయి, కాలుకు గాయాలయ్యాయి. ఈ ఘటన వెనుక టీడీపీకి చెందిన రమేష్, దిలీప్ అనే వ్యక్తులు ఉన్నారని బాధితులు పేర్కొన్నారు. మూడు రోజులుగా పోలీసులను ఆశ్రయిస్తున్నా తమ ఫిర్యాదును తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
మదనపల్లె టౌన్: అర్బన్ హెల్త్ సెంటర్కు వైద్య చికిత్సల కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య సిబ్బందిని ఆదేశించారు. మదనపల్లె పట్టణం, త్యాగరాజ వీధిలో ఉన్న యూపీహెచ్సీని సోమవారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులను పలకరించారు. సక్రమంగా వైద్యం అందుతుందా లేదా అని అడిగి తెలుసు కున్నారు. బాధితులకు న్యాయం చేయాలి మదనపల్లె టౌన్: మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హాజరయ్యారు.అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్జీలను పరిశీలించి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చిన్నమండెంకు చెందిన బాధిత వృద్ధ రైతు సుబ్బారెడ్డి తన సమస్యను చిన్నమండెం పోలీసులు పట్టించుకోలేదని తెలియజేశారు. పుంగనూరు మండలం, ఎల్లారు బైలుకు చెందిన సుబ్రహ్మణ్యం తల్లి పేరున ఉన్న పట్టా భూమిని వీఆర్వోఓ శ్రీనివాసులు మరొకరికి చెందేలా గోల్ మాల్ చేశాడని, మదనపల్లెకు చెందిన ఏపీఎస్ఈబీ యూనియన్ 28 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి రిస్టర్ చేసుకున్న భూమిని రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి రామకృష్ణారెడ్డి నకిలీ పత్రాలతో కబ్జా చేశాడని ఫిర్యాదు చేశారు. ఇవే కాకుండా సుమారు 110 మంది బాధితులు భూ.. రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
ఆటవిక రాజ్యం.. అనాగరిక పాలన
● ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ లేదు ● ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ● దశరథరామిరెడ్డికి అండగా నిలుస్తాం ● వైఎస్సార్సీపీ నేతలు ఆకేపాటి, కొరముట్ల, చింతల భరోసా సాక్షి, మదనపల్లె: రెండేళ్ల కూటమి పాలన ఆటవిక రాజ్యంగా మారిందని, రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఆదివారం రాయచోటిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరామిరెడ్డిపై టీడీపీ మూకల పాశవిక దాడి, హత్యాయత్నం ఘటనపై ఆ పార్టీ నేతలు సోమవారం మదనపల్లెలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు జి.షమీంఅస్లాం, మున్సిపల్ మాజీ చైర్మన్ వి.మనూజ, పార్టీ నేతలు కార్యాలయంలో ఎస్పీని కలిశారు. రాయచోటిలో దశరథరామిరెడ్డిపై జరిగిన దాడి, హత్యాయత్నం, ఆస్తినష్టం గురించి ఎస్పీకి వివరించారు. మూకదాడిలో గాయపడిన బాధితుల గురించి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు దారుణమని, తక్షణమే చర్యలు తీసుకొని బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని విన్నవించారు. దీనిపై స్పందించిన ఎస్పీ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నేతలు ఆ తర్వాత తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. రక్షణ ఎక్కడ? కూటమిపాలన వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అన్నారు. అధికార అండతో దాడులకు తెగబడుతున్నారని, ఆస్తులను ఆక్రమిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దశరథరామిరెడ్డిపై పైశాచికంగా జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని తెలిపారు. దౌర్జన్యానికి పాల్పడి హత్యాయత్నానికి తెగబడటం ఆటవిక రాజ్యం కాదా అని ప్రశ్నించారు. ప్రశాంతమైన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు. . దశరథరామిరెడ్డి పై జరిగిన దాడికి ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, తామంతా అండగా ఉన్నామని చెప్పారు. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు, దశరథరామిరెడ్డికి న్యాయం జరిగేదాకా పార్టీ అండగా ఉంటుందని, పోరాటం చేస్తామని అన్నారు. ఫ్యాక్షన్కు ఆజ్యం పోస్తున్నారా? ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్లీ ఆజ్యం పోస్తున్నారా అని టీడీపీ నేతలను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను రాయచోటిలో మళ్లీ పునరావృతం చేస్తున్నారని అన్నారు. దశరథరామిరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడి అశాంతి సృష్టించారని అన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలప్పుడే దౌర్జన్యాలు రాయచోటిలో ఎన్నికల సమయంలోనే దౌర్జన్యాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఎన్నికలప్పుడు పోలింగ్, సమయాల్లో నాయకులు పైన దాడులు జరిగాయని గుర్తు చేశారు. చట్టాలని గౌరవించని వారు, న్యాయస్థాలను గౌరవించని వారు ఫ్యాక్షన్ నాయకులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఉందని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాయచోటి ఘటనలో పాల్గొన్న వారిని అరెస్ట్చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయచోటి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధితులకు పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. బీహార్ గా మారింది రాష్ట్రం బీహార్గా మారిపోయిందని మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. చంద్రబాబు పాలనలో ఫ్యాక్షన్ పడగ విప్పిందని అన్నారు. రాయచోటి ఘటన శాంతిభద్రతలను ప్రశ్నిస్తోందన్నారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో ఫ్యాక్షన్ను అణగదొక్కితే చంద్రబాబు రాయచోటి ఘటనను ఖండించకుండా ఇంకా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎస్పీకి పూర్తిగా వివరించామని, న్యాయం చేయాలని కోరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. -
ఫలం.. నిష్ఫలం !
● జిల్లాలో పతనమైన మామిడి ధరలు ● జిల్లాలో 34 వేల ఎకరాల్లో వివిధ రకాల మామిడి సాగు ● గత ఏడాది ధర లేక అల్లాడిపోయిన మామిడి రైతు ● ప్రసుత్తం కూడా అవే పరిస్థితులు పునరావృతం సాక్షి అన్నమయ్య : మామిడి రైతులకు కష్టకాలం వెంటాడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులతో రైతు కుదేలవుతున్నాడు. వీరిని ఆదుకోవాల్సిన కూటమి సర్కార్ కూడా చూసీచూడనట్లు వ్యవహారిస్తోంది. ఽమామిడికి సంబంధించి సీజన్ మొదట్లోనే అమ్ముకుంటే ధరలు ఉంటాయని ఆశించిన రైతుకు ఆశాభంగం తప్పలేదు. చివరికి 15 రోజుల కిందట ఒక మోస్తరు ధరలు పలికినా....ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో పతనమయ్యాయి. నాటురకం కాయలను అడిగే వారు లేరంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. అంతేకాదు...కొనుగోలు చేసే వ్యాపారులు కూడా టన్ను నాటురకం కాయలను కేవలం 4–5 వేలకు అడుగుతున్నారు. గతేడాది అనుభవించిన విపత్కర పరిస్థితుల నుంచి బయటపడదామనుకున్నా ఈసారి కూడా అలాంటి పరిస్థితుల్లో ఉత్పన్నమవుతుండడంతో మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. పాతాళంలోకి ధరలు అన్నమయ్య జిల్లాలో మామిడి ధరలు పూర్తిస్థాయిలో పతనమయ్యాయి. యుద్ద నేపథ్యం కావచ్చు...ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు లేకపోవడం కావచ్చు....ఇతర కారణాలేవైనా మామిడి రైతులకు మాత్రం కిష్ల పరిస్థితులు తప్పడం లేదు. ఈసారి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దిగుబడి కూడా అంతంతమాత్రంగా ఉంది. చివరకు బేనీషా లాంటి కాయలకు కూడా మంచి ధర లభించడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ప్రతిసారి తప్పని తిప్పలు రాష్ట్ర వ్యాప్తంగా మామిడి రైతులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో సుమారు 34 వేల హెక్టార్లలో పంట సాగులో ఉంది. అయితే ధరలు లేకపోవడంతో దిగుబడులు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతిసారి అన్నదాతకు ఇలాంటి క్లిష్ట పరిస్థితులే ఎదురవుతున్నా ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు మామిడి సీజన్ ఉంటుంది. జిల్లాలోని పుంగనూరు, మదనపల్లె, పీలేరు, రాయచోటితోపాటు గతంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వేకోడూరు, రాజంపేట పరిసర ప్రాంతాల్లో మామిడి మార్కెట్ విస్తారంగా ఉంది. అయితే ప్రస్తుతం ధరలు లేకపోవడంతో మార్కెట్లు కూడా కళ తప్పాయి. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండీలకు కూడా దిగుబడి లేకపోవడంతో సరుకు రాకపోవడం, ధరలు లేకపోవడంతో మండీలు ఖాళీగా కనిపిస్తుండటం గమనార్హం. గిట్టుబాటు ధర లేక.... పధానంగా లాల్ బహార్, బేనీషా, ఖాదర్, తోతాపురి, ఇమామ్ పసంద్, చెరుకు రసం, సువర్ణ రేఖ, దసేరి, మలుగ్బా తదితర రకాలు సాగులో ఉన్నాయి. ప్రతి ఏడాది నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడం లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని మామడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గుజ్జు పరిశ్రమలకు సంబంధించి అయినా మంచి ధర నిర్ణయించి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రతిసారి మామిడి రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లేక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. మామిడి రకం 15–20 రోజుల కిందట ప్రస్తుతం (టన్ను రూ. లలో) (టన్ను రూ.లలో) బేనీషా 60–70 వేలు 35 వేలు తోతాపురం 35 వేలు 10–15 వేలు ఇమామ్ పసంద్ 1.15–1.30 లక్షలు 65–70 వేలు లాల్ బహార్ 50 వేలు 15 వేలు ఖాదర్ 80 వేలు 30 వేలు చెరుకు రసం 40 వేలు 20 వేలు సువర్ణ రేఖ 70 వేలు 35 వేలు మగుల్బా 70–80 వేలు 50 వేలు దసేరి 80 వేలు 35 వేలు కేసరి లక్ష 40 వేలు మల్లిక 90 వేలు 65 వేలు అతి మధురం 1.20 లక్షలు 60 వేలు నాటురకాలు 25–30 వేలు 5–6 వేలు ప్రస్తుతం దిగుబడి లేకపోవడంతో మండీలకు కాయలు రావడం లేదు. అనేక రకాలు సాగు చేస్తున్నా కాయలు మాత్రం రావడం లేదు. ధరలు పది పదిహేను రోజుల కిందట ఓ రకంగా ఉన్నా....ప్రస్తుతం ఆశించిన మేర లేవు. దీంతో వచ్చిన కాయలనే గ్రేడింగ్ చేసి అవసరమైన ప్రాంతాలకు పంపుతున్నాం. తాము తోటల మీద తిరుగుతున్నా కాయలు లేకపోగా, ధరలు కూడా ఆశించిన మేర లేవు. – బి.మోహన్రెడ్డి, బీఎంఆర్ ఫ్రూట్స్ యజమాని -
తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు
ఎర్రగుంట్లకు చెందిన శ్రీనివాసులుకు కుమారుడు సునీల్బాబు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కుమారుడి వయస్సు 9 ఏళ్లు. తన కుమారుడికి కండరాల క్షీణత వ్యాధి సోకినట్లు నాలుగేళ్ల క్రితం తెలిసింది. అప్పటి నుంచి అతను చేయని ప్రయత్నమంటూ లేదు. నయం కాని వ్యాధి అయినా కుమారుడిపై మమకారంతో అనేక ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం సునీల్బాబు మంచానికే పరిమితయ్యాడు. తన శక్తి మేరకు కుమారుడి వైద్యం కోసం ఖర్చు చేశాడు. పనికి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితి వారిది. సునీల్బాబును ఇక ఎక్కడికీ తీసుకెళ్ల లేక వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంచుకొని మందులు వాడుతున్నాడు. -
గుండెపోటుతో హైదరాబాద్ వాసి మృతి
కలికిరి : గుండెపోటుకు గురై హైదరాబాద్ వాసి మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం కలికిరిలో చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్ నగరం ప్రగతి నగర్కు చెందిన కనుకుంట్ల రాజేందర్(60) కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన ఆర్.శ్రీనివాసులు రెడ్డికి స్నేహితుడు. రాజేందర్ హైదరాబాద్లో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ... బెంగళూరు, చింతామణి, మదనపలె ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం హైదరాబాదు నుంచి బెంగళూరు, చింతామణికి వచ్చి కలికిరికి వచ్చాడు. రెండురోజుల తర్వాత శ్రీనివాసులు రెడ్డి సొంత పనుల నిమిత్తం హైదరాబాదు వెళ్లాడు. రాజేందర్ మిత్రుడి రూములో ఉన్నాడు. ఆదివారం ఉదయం శ్రీనివాసులు రెడ్డికి ఫోన్ చేసి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పాడు. దీంతో అతని సూచన మేరకు స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. స్టేట్బ్యాంక్ సమీపంలో టిఫిన్ చేసి రోడ్డుపైకి వచ్చి గుండె పోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు మృతుని సెల్ఫోన్ ఆధారంగా శ్రీనివాసులురెడ్డికి సమాచారమిచ్చారు. స్నేహితుని ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుడు కనుకుంట్ల రాజేందర్ ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్కు స్వయాన సోదరుడు. మృతుని భార్య వసంత కూడా తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా మృతుడు మరో రెండు నెలల్లో పదవీ విరమణ పొందనున్నట్లు సమాచారం. ఎక్కడినుంచో వచ్చి హఠాన్మరణం చెందడం స్థానికులను కలచివేసింది. -
భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం తంబళ్లపల్లె మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధితుడి కుటుంబీకులు, జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. అన్నమయ్య జిల్లా, చిన్నమండెంకు చెందిన పెద్ద రెడ్డప్ప భార్య నాగవేణి అలిగి వారం రోజుల క్రితం పుట్టినిల్లు అయిన తంబళ్లపల్లె మండలంలోని కోటకొండకు పిల్లల్ని కూడా వదిలేసి వచ్చేసింది. పిల్లల్ని వెంట బెట్టుకుని ఆదివారం అత్తగారి ఇంటికి వచ్చిన పెద్ద రెడ్డప్ప తన భార్యను కాపురానికి రావాలని అభ్యర్థించాడు. ఆమె రానని తెగేసి చెప్పడంతో మనస్థాపం చెంది అత్తగారి ఇంటిలోనే విషద్రావణం తాగాడు. పెద్ద రెడ్డప్పను తన ఇద్దరు పిల్లలు 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పెద్ద రెడ్డప్ప వెంట చిన్నపిల్లలు ఉండడంతో జిల్లా ఆస్పత్రిలోనే ఉంచి, వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. అవుట్ పోస్టు పోలీసుల సమాచారంతో తంబళ్లపల్లె పోలీసులు కేసు విచారిస్తున్నారు. -
వలస కార్మికుడిపై రాళ్లతో దాడి
మదనపల్లె టౌన్ : టమాటా మండీలో పనిచేస్తున్న వలస కార్మికుడిపై తన ప్రత్యర్థి రాళ్లతో దాడి చేసిన సంఘటన ఆదివారం సాయంత్రం కురబల కోట మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. బీహార్కు చెందిన 100 మంది వలస కూలీలను మూడు నెలల క్రితం శ్యాంసుందర్ పనుల నిమిత్తం అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని కురబలకోట మండలం, అంగళ్లు టమాటా మండికి తీసుకు వచ్చాడు. శ్యాంసుందర్ చెప్పినట్లు వినడం లేదని, వారితో తగువు పడ్డా డు. దీంతో మాటమాట పెరిగి వలస కూలి అయిన జూనాముఖియా (29)పై శ్యాం సుందర్ రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితున్ని సహచర కూలీలు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నాడు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యంపై ఫిర్యాదుమైదుకూరు : పట్టణంలోని కొత్తకొట్టాలుకు చెందిన బుచ్చిగారి నందిని అనే 18 ఏళ్ల యువతి కనిపించడం లేదని ఆదివారం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందిని తల్లి కువైట్కు వెళ్లింది. తండ్రి పుల్లయ్య ఉన్నాడు. యువతి తన మేనత్త సుభాషిణి సంరక్షణలో కొత్తకొట్టాలు ప్రాంతంలో ఉంటోంది. ఇటీవల కడపలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. శనివారం రాత్రి నుంచి తన మేనకోడలు కనిపించడం లేదని సుభాషిణి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బైక్ను ఢీ కొట్టిన కారు.. ఒకరికి తీవ్రగాయాలురాజంపేట : పట్టణంలోని జీకేఎస్సార్ కల్యాణమండపం(తిరుపతి బైపాస్రోడ్డు)లో ఆదివారం గుర్తుతెలియని కారు, బైక్ను ఢీ కొట్టింది. బైక్పై వెళుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఢీ కొట్టిన కారు వెళ్లిపోయింది. పోలీసులు సంఘటన స్ధలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణపాయం లేదని పోలీసులు తెలిపారు. టిడ్కో ఇళ్లలో విద్యుత్ వైర్ల చోరీకి యత్నంఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న టిడ్కో ఇళ్లలో ఉన్న విద్యుత్ వైర్ల చోరీకి దొంగలు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన టిడ్కో నిర్వాహుకులు దొంగను పట్టుకుని దేహశుద్ది చేశారు. మున్సిపల్ కమిషనర్కు సమాచారం అందించారు. మున్సిపల్ కమిషనర్ శేషఫణి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. బ్యాగ్ తనిఖీ చేశారు. బ్యాగ్లో ఉన్న విద్యుత్వైర్ల కట్టర్లను స్వాఽధీనం చేసుకున్నారు. -
అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలి
మదనపల్లె సిటీ : అభిమానులు సామాజిక,సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల ఆదరా భిమానాలు పొందాలని ప్రముఖ తెలుగు సినీ హీరో సప్తగిరి అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక శ్రీకృష్ణ కల్యాణమండపంలో హెల్పింగ్మైండ్స్ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్పింగ్మైండ్స్ రక్తదాన శిబిరాలు, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హెల్పింగ్మైండ్స్ సంస్థ నిర్వాహకులు అబూబకర్సిద్దిక్,సభ్యులు పాల్గొన్నారు. పడవ కాల్చివేతలింగాల : లింగాల మండలం పార్నపల్లి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పడవను కాల్చివేశారు. డ్యామ్లో ఎవరు చేపలు పట్టకుండా.. గస్తీ తిరిగేందుకు కాంట్రాక్టర్ పడవను ఏర్పాటు చేశారు. మత్సకార సంఘానికి సంబంధించిన చిన్నకోట్ల, పెద్దకోట్ల, పార్నపల్లి గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులకు చేపల కాంట్రాక్టర్ అయిన తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన యాదగిరి ఒక గస్తీ పడవను మత్స్యకార సంఘానికి ఇచ్చారు. శనివారం రాత్రి దీనిని డ్యామ్ వద్ద ఉంచి మత్స్యకారులు ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు పాత ఆటో టైర్లను పడవలో వేసి నిప్పు పెట్టినట్లు మత్స్యకారులు తెలిపారు. ఆదివారం ఉదయం వద్దకు వెళ్లగా పడవ కాలిపోయిందని చెప్పారు.మత్స్యకార సంఘం సర్పంచ్ సూర్యనారాయణ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బోటు విలువ సుమారు రూ. 4,70,000 ఉంటుందని ఆయన అన్నారు. లింగాల ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి సీబీఆర్ వద్దకు వెళ్లి పడవను పరిశీలించారు. సీబీఆర్పై ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.సినీ హీరో సప్తగిరి -
రెడ్డెమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీంలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించడం గమనార్హం. పాముకాటుతో కౌలు రైతు మృతివాల్మీకిపురం : పాముకాటుతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని అయ్యవారిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. అయ్యవారిపల్లికి చెందిన నాగమల్లు (65) వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా గ్రామంలో రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని రూ.2 లక్షలు అప్పు చేసి భూమి సాగు చేస్తున్నాడు. ఎకరం వరి, ఎకరం పశుగ్రాసం వేసుకొని పాడి ఆవులతో జీవనం సాగిస్తున్నాడు. గత మూడు రోజుల కిందట పశుగ్రాసం తీసుకొచ్చేందుకు నాగమల్లు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ పాము కాటు వేసింది. అపస్మారక స్థితిలో ఉన్న నాగమల్లును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. యువతి ఆత్మహత్య ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని సంజీవనగర్లో లావణ్య (22) అనే యువతి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సంజీవనగర్లో నివాసం ఉంటున్న మాధవ్ కుమార్తె లావణ్య డిగ్రీ వరకు చదువుకుంది. ఈమె పట్టణంలోని ఒక ఈఎన్టీ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఈమెకు ఇటీవల ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఐతే పెళ్లి చేసుకోవడానికి యువతి నిరాకరించడంతో తల్లిదండ్రులు దండించారు. దీంతో యువతి రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం 5 గంటలు దాటినా లావణ్య నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు కొడుతూ ఎంత పిలిచినా ఆమె పలకలేదు. దీంతో తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే ఉరి వేసుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నాలుగేళ్ల తర్వాత తెలిసింది
నా పేరు గిరిధర్రావు. ప్రొద్దుటూరు గౌరవమ్మకట్ట వీధిలో నివాసం ఉంటున్నాను. బట్టలషాపులో గుమస్తాగా పని చేస్తాను. మా కుమారుడు శ్రీనివాసరావుకు ప్రస్తుతం 11 ఏళ్లు. బాబు పుట్టగానే రెండున్నరేళ్లకు నడిచాడు. 4 ఏళ్ల వయసులో స్కూల్కు పంపించాం. స్కూల్లో నడస్తూనే కింద పడిపోయాడు. మాకు అర్థం కాక స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్తే డాక్టర్ జయచంద్రారెడ్డి గుర్తించి బాబుకు డీఎండీ (డుచ్చెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ) వ్యాధి అని చెప్పారు. తర్వాత బెంగళూరు, కేరళ ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఇప్పటికీ రూ. 10 లక్షల వరకు ఖర్చు అయింది. ప్రస్తుతం బాబు నడవలేడు కూర్చోలేడు మంచానికే పరిమితమయ్యాడు. పిజియోథెరపి, మందులకు గాను నెలకు రూ. 40 వేల వరకు ఖర్చు అవుతోంది. రెండేళ్ల క్రితం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకు మంజూరు కాలేదు. హాస్పిటల్కు, ఎక్కడికై నా బయటికి వెళ్లాల్సి వస్తే బాబును నా వీపున పెట్టుకొని మోసుకెళ్తాను. నేను, నా భార్య శిల్ప ఎక్కడికి వెళ్లకుండా బాబును చూసుకుంటున్నాం. -
పాపం పసివాళ్లు..
ప్రొద్దుటూరు క్రైం : మస్క్యులర్ డిస్ట్రోఫీ.. ఇది ప్రాణాంతక వ్యాధి.. వ్యాధి సోకిన పిల్లలు నాలుగు అడుగులు కూడా వేయలేరు, సరిగా కూర్చోలేరు, మెట్లెక్కలేరు.చచ్చు బడుతున్న శరీరంతో నరకయాతన అనుభవిస్తుంటారు ఈ వ్యాధిగ్రస్తులు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యం కాకున్నా వస్తుంటుంది. ప్రతి 3 వేల మంది మగపిల్లల్లో ఈ వ్యాధి ఒకరికి సోకుతుంది. వ్యాధి కారణంగా కండరాల బలహీనత ఏర్పడుతుంది. సాధారణంగా అయితే నాలుగేళ్ల వయసులో మొదలై ఊహించినంత శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారు తీవ్రమైన కండరాల క్షీణతకు గురవుతారు. నడవలేక పోవడం, కూర్చోలేక మంచానికే పరిమితమవుతారు. వయసు పెరిగేకొద్దీ శ్వాసకోశ వ్యాధులు కూడా చిన్నారులను వేధిస్తాయి. కడప జిల్లాలో ఈ వ్యాధితో బాధపడే చిన్నారులు 30 మందికి పైగా ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. గతంలో ఈ వ్యాధికి మందు లేదు. అయితే ఇటీవల ఈ కండరాల క్షీణత వ్యాధికి అమెరికాలో ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నట్లు కొందరు వైద్యులు చెబుతున్నారు. అయితే ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ. 25 కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు. అంత పెద్ద మొత్తం వెచ్చించి ఇంజెక్షన్ వేయించడం అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధిన పడిన చిన్నారుల కుటుంబాలను ఆదుకొని వారికి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జిల్లాలో 30కి పైగా డీఎండీ బాధితులు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతంలో 10 మందికి పైగా డీఎండీ బారిన పడిన చిన్నారులు ఉన్నారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, పోట్లదుర్తి, అల్లాడుపల్లెతో పాటు జిల్లా వ్యాప్తంగా 30 మంది చిన్నారులు డీఎండీ వ్యాధి బారిన పడినట్లు వైద్యులు చెబుతున్నారు. పలువురు డీఎండీ బాధిత చిన్నారులు జిల్లా ఆస్పత్రి, కడప రిమ్స్లో కేంద్రంలో వైద్యసేవలు, పిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఇది అందరికి తెలిసిన వ్యాధి కాదని, దీనిపై అవగాహన అవసరమని వైద్యులు చెబుతున్నారు. నడవడంలో ఇబ్బంది పడటం, తరచూ పడిపోవడం, కాళ్లు, చేతుల్లో కండరాల బలహీనత, 10 ఏళ్లకే నడక కోల్పోవడం, శ్వాసతీసుకోవడంలో, గుండె పనితీరులో సమస్యలు తదితర ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా భావించాలన్నారు. కండరాల క్షీణత వ్యాధికి ప్రస్తుతం ఖచ్చితమైన నివారణ లేనప్పటికీ చికత్సతో వ్యాధి పురోగతిని తగ్గించవచ్చన్నారు. ఫిజియోథెరపీ, గుండె, శ్వాసకోశ చికిత్సలు కండరాల పనితీరును కాపాడటానికి సహాయపడతాయని తెలిపారు. చిన్నారుల ప్రాణాలను హరిస్తున్న మస్క్యులర్ డిస్ట్రోఫీ ప్రొద్దుటూరులో ఒకే ఇంట్లో ఇద్దరికి కండరాల క్షీణత వ్యాధి జిల్లాలో 30 మందికి పైగా వ్యాధి గ్రస్తులుపిల్లలు పుట్టగానే వారి బోసినోటి నవ్వులు, బుడిబుడి నడకలను చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోతారు. వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్ది ఉన్నతవంతులుగా చూడాలని పరితపిస్తుంటారు. అయితే వారి ఆశలను డీఎండీ వ్యాధి చిదిమేస్తోంది. ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడపాల్సిన ఈ చిన్నారులు ఇక ఎప్పటికీ అడుగులు వేయలేరని తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండె తట్టుకోగలదా.. డుచ్చెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన కండరాల క్షీణత వ్యాధి చిన్నారుల ప్రాణాలను హరిస్తోంది. -
ఇద్దరు కుమారులకు డీఎండీ వ్యాధి
ప్రొద్దుటూరుకు చెందిన ఈశ్వరయ్య హమాలీ పని చేస్తుంటాడు. ఆయనకు వీరేంద్ర, రవీంద్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వీరేంద్ర 6 ఏళ్ల వయసులో సరిగా నడవలేక పోవడంతో పాటు కింద పడుతుంటంతో హాస్పిటల్లో చూపిస్తే డీఎండీ వ్యాధి సోకిందని చెప్పారు. తిరుపతి, ఏలూరు తదితర హాస్పిటళ్లలో చూపించారు. చివరగా ఏలూరు హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించి ఈ వ్యాధి నయం కాదని చెప్పడంతో తండ్రి ఈశ్వరయ్యకు ప్రాణం పోయేంత పని అయింది. ఇక చేసేదేమి లేక ఇంటికి వచ్చి వీరేంద్రను స్థానికంగా, కడప రిమ్స్లో వైద్యం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది జూలైలో 15 ఏళ్ల వయసులో వీరేంద్ర మృతి చెందాడు. పెద్ద కుమారుడి మృతి నుంచి తేరుకొనక ముందే గుండె పగిలే వార్తను ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు వినాల్సి వచ్చింది. రెండో కుమారుడు రవీంద్రకు కూడా డీఎండీ వ్యాధి ఉన్నట్లు తల్లిదండ్రులకు తెలిసింది. పెద్ద పిల్లాడి మాదిరిగానే కింద పడటం, కూర్చోలేకపోవడం తదితర లక్షణాలు కనిపించడంతో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు డీఎండీ వ్యాధి ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రవీంద్ర వయసు 6 ఏళ్లు. లేవలేడు.. అడుగులు వేయలేడు. స్థానిక ఆస్పత్రుల్లోనే బాలుడికి వైద్యం చేయిస్తున్నారు. -
● ప్రాణం తీసిన ఈత సరదా
అట్లూరు : సరదా కోసం ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన అట్లూరులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. అట్లూరు మండలం తంబళ్లగొంది గ్రామానికి చెందిన చిల్లు కొండమ్మ, నరసింహులు కుమారుడు పవన్ కుమార్ (16) ఆదివారం తోటి స్నేహితులతో కలిసి అట్లూరు గ్రామ పొలాల్లో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు పవన్కుమార్ నీట మునిగిపోవడంతో తోటి పిల్లలు స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఎస్ఐ నాగకీర్తన సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో బద్వేలు నుంచి అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. ఎట్టకేలకు సాయంత్రం 7 గంటలకు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షల్లో 450 మార్కులు సాధించినట్లు విద్యార్థి బంధువులు తెలిపారు.సింహాద్రిపురం : ఈత సరదా ఒకరి ప్రాణం తీసింది. ఆదివారం జరిగిన సంఘటన సంబంధించిన వివరాలు.. దిద్దికుంట గ్రామంలో ఆదివారం దేవర కార్యక్రమం తలబెట్టారు గ్రామంలో బంధువులు ఇంటికి శనివారం తాడిపత్రికి చెందిన వల్లెపు హరి(19) వచ్చాడు. ఇతను డిప్లమో చేస్తున్నాడు. ఆదివారం సరదాగా తోటి స్నేహితులతో సంపు వద్దకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు సంపులో జారి పడటంతో స్నేహితులు రక్షించలేని పరిస్థితుల్లో కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయాడు. అయితే జరిగిన విషయం గ్రామంలో తెలపడంతో పైర్ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని వెలుపలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేయాల్సి ఉంది. -
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన ఐదుగురు అరెస్ట్
నిమ్మనపల్లె(మదనపల్లె టౌన్) : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న టెకీ సహా ఐదుగురిని నిమ్మనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె డీఎస్పీ పావని ఆదివారం సాయంత్రం మీడియాకు తెలిపిన వివరాలు.. మదనపల్లె నియోజకవర్గం లోని నిమ్మనపల్లె మండలానికి చెందిన కొందరు ఐపీఎల్ క్రికెట్ నేపథ్యంలో బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు అందిన పక్క సమాచారంతో ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో వెళ్లి పిట్టావాండ్లపల్లి వద్ద నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా నేరం అంగీకరించారని చెప్పారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ. 3,59,700 లక్షల నగదును సీజ్ చేశారు. నిమ్మనపల్లె దిగువ వీధికి చెందిన మహీంద్ర సింగ్ (33), వినయ్ కృష్ణ సింగ్ (30), అగ్రహారానికి చెందిన రెడ్డి ప్రసాద్ (26), దిగువపల్లి గంగా పురం సాయి కుమార్ (28), హేమంత్ సింగ్ (26) లను పట్టుకోవడంతో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. -
‘ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు’
రాయచోటి: పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై దాడి జరిగిందని, ఇది ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదనడానికి నిదర్శమన్నారు ఎంపీ మిథున్రెడ్డి. నిన్న దశరధరామిరెడ్డికి తనపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారని, నిన్నే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు దాడి జరిగేది కాదన్నారు. కూటమి నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని, ఇప్పటివరకూ ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి 40 స్టేషన్లలో తిప్పుతున్నారని, మరి ఇప్పుడు కళ్ల ముందే టీడీపీ మూకలు రెచ్చిపోయి ఒక వైఎస్సార్సీపీ నేతపై దాడి చేస్తే పోలీసులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. -
పచ్చమూకల పాశవికం
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటిలో పచ్చమూకలు విధ్వంసం సృష్టించాయి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అనుచర మూకలు కత్తులు, రాడ్లతో రెచి్చపోయాయి. వైఎస్సార్సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి పై హత్యాయత్నానికి తెగబడ్డాయి. కోర్టు స్టేటస్ కో విధించిన స్థలం వివాదం విషయంలో మంత్రి అనుచరులు జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో దశరథ రామిరెడ్డి తమ మాట వినడంలేదన్న అక్కసుతో సుమారు 100 మందికిపైగా యువకుల సాయంతో స్థలంలో నిర్మాణాలను చేపట్టారు. స్టేటస్ కో ఉన్నా దౌర్జన్యంగా మంత్రి అనుచరులు ఆదినారాయణరెడ్డి, అతని భార్య సుమన భూమిలో నిర్మాణాలను చేపట్టడానికి యత్నిస్తున్నారని అన్నమయ్య జిల్లా ఎస్పీ, స్థానిక డీఎస్పీ, సీఐలకు శనివారం దశరథరామిరెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదుపై పోలీసుల వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని దశరథరామిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డి ఆదివారం ఉదయం తన కళ్యాణమండపం ఎదురుగా ఉన్న నిర్మాణ ప్రాంతానికి వెళ్లి ప్రశ్నించడంతో అక్కడే ఉన్న పచ్చ మూకలు ఒక్కసారిగా కత్తులు, రాడ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో దశరథరామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతోపాటు కల్యాణ మండపం మేనేజర్ జాకీర్, అనుచరుడు దేరంగుల ఆంజనేయులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మంది దశరథరామిరెడ్డి అనుచరులు, పార్టీ కార్యకర్తలు పచ్చమూకల దాడిలో గాయపడ్డారు. ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో పడి ఉన్న దశరథరామిరెడ్డి, ఆంజనేయులు, జాకీర్ను రక్షించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అనుచరులు తీవ్రంగా యత్నించారు. పచ్చమూకల బరితెగింపుతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కళ్యాణ మండపంలో విధ్వంసం.. వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడడంతోపాటు ఆయన కల్యాణ మండపంలోనూ పచ్చమూకలు విధ్వంసం సృష్టించాయి. మండపం తలుపులను ధ్వంసం చేసి అద్దాలను బద్దలు కొట్టారు. లోపల ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులను పగలగొట్టారు. సమీపంలోనే ఉన్న దశరథరామిరెడ్డి వాహనాన్ని కూడా పగలగొట్టారు. 108 వాహనాన్నీ అడ్డుకున్నారు తీవ్రంగా గాయపడిన దశరథరామిరెడ్డితోపాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు వచి్చన 108 వాహనాన్నీ పచ్చమూకలు అడ్డుకున్నాయి. దీంతో దశరథరామిరెడ్డి భార్య విజయమ్మ కొంతమంది అనుచరులతో ఘటన స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న భర్తను, మరో ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై దశరథరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నుంచి ఎస్ఐ జహీర్బాషా వివరాలు సేకరించారు. కోర్టు స్టేటస్ కో ఇచ్చినా ఆదినారాయణ రెడ్డి, అతని భార్య దౌర్జన్యంగా కల్యాణమండపం ఎదురుగా ఉన్న స్థలంలో నిర్మాణాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నించడానికి వెళ్లిన తనపై ఆదినారాయణ రెడ్డి మంత్రి అనుచరులతో దాడి చేయించారని పోలీసులకు రాయించిన వాంగ్మూలంలో తెలిపారు. భూమన పరామర్శ తిరుపతి తుడా: టీడీపీ గూండాల హత్యాయత్నంతో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి పరామర్శించారు. దాడి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని, హత్యాయత్నాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టలేరని భూమని పేర్కొన్నారు. -
వైభవం.. వెంకన్న రథోత్సవం
మదనపల్లె సిటీ: శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఆపద మొక్కులవాడా గోవిందా...అనాధరక్షక గోవిందా...అంటూ స్వామి నామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగుతూ భక్తజనం పరవశించారు. మదనపల్లె పట్టణం దేవళంవీధిలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 10.35 గంటలకు బ్రహ్మ రథోత్సవం కన్నుల పండవగా సాగింది. రథాన్ని పుష్పాలతో అలంకరించి ఉత్సవ మూర్తులను రథంపై ఆశీనులను చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నవీన్, ఈఓ రమణ టెంకాయ కొట్టి రథాన్ని ముందుకు లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు గోవింద స్మరణలతో రథంను ముందుకు లాగుతూ సాగారు. ఆధ్మాతిక వాతావరణంతో కొనసాగింది. రథం ముందు కొలాటాలు, భజన గీతాలు, ప్రత్యేక వాయిద్యాలు అలరింపజేశాయి. సాయంత్రం హోమం,ప్రాకారోత్సవం చేశారు. -
ఖరీఫ్ సాగు..నా!
మదనపల్లె: జిల్లాలో వరుస కరువులతో త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సేద్యం సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం గత రెండు ఖరీఫ్ సీజన్లలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, తీవ్ర వర్షాభావం, పంటల పెట్టుబడి దక్కకపోవడం, ప్రభుత్వం నుంచి కనీస సహకారం లేకపోవడంతో రైతులు ఈ ఖరీఫ్ లో పంటలు సాగు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోంది. లక్ష్యం 61 వేల హెక్టార్లు రాబోయే ఖరీఫ్లో జిల్లాలో 61,500 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గత రెండు ఖరీఫ్లలో నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఈ లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం. ఈ విస్తీర్ణానికి సంబంధించి హెక్టారుకు ఎంత దిగుబడి తీసుకురావాలో అంచనాలు కూడా సిద్ధం చేశారు. ఇందులో ఒక్క వేరుశనగ నుంచే 60 వేల టన్నుల దిగుబడి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలాగే మొక్కజొన్న 15,450 టన్నులు, కందులు 4225 టన్నులు, సజ్జలు 2500 టన్నులు, రాగులు 2200 టన్నులు, చిరుధాన్యాలు 750 టన్నులు, పెసలు 250 టన్నులు, మినుములు 250 టన్నుల దిగుబడి కలుపుకుని ఈ ఖరీఫ్లో మొత్తం 85,625 టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఈ లక్ష్యాలు సాధించడం చాలా కష్టమని గత అనుభవాలను బట్టి స్పష్టమవుతోంది. తగ్గిన విస్తీర్ణం, ప్రభుత్వ నిర్లక్ష్యం జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ సాగు ఆందోళనకర పరిస్థితుల్లోకి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోతుంది. సాగు లక్ష్యాల్లో 50 శాతం కూడా సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సేద్యాన్ని ప్రోత్సహించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి రైతులను సాగు వైపు మళ్ళించే విషయంలో కూటమి ప్రభుత్వం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. రైతులకు పరిహారమే ఇవ్వలేని ప్రభుత్వం యొక్క వర్షాభావ ఆందోళనకర పరిస్థితులపై ఏ మేరకు స్పందిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితులను దష్టిలో ఉంచుకుంటే రైతులు ఖరీఫ్లో పంటల సాగుకు మొగ్గుచూపుడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో మున్ముందు చూడాలి. జిల్లాలో 90 శాతం రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే సకాలంలో రుతుపవనాలు రావడం, వర్షాలు కురిస్తే రైతులు పంటలు సాగు చేసి దిగుబడులు సాధించవచ్చు. దీనివల్ల జిల్లా రైతంగం ఆర్థిక పరిస్థితి, జీడీపీ మెరుగవుతుంది. ఫలితంగా జిల్లాలో పంటలు పండి పొలాలు పచ్చదనంతో నిండిపోతాయి. రైతుల కష్టాలు తీరుతాయి. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత ఖరీఫ్లో అన్న అనుమానాలు రైతాంగంలో నెలకొంది. ఇటీవల ఎల్ నినో ప్రభావం ఉండబోతుందంటూ వస్తున్న వార్తలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు కురవక కరువు పరిస్థితులు నెలకొంటే, పెట్టుబడి నష్టపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించుకుంటున్నారు. ప్రభావం కూడా ఈ ఖరీఫ్లో ఉండబోయే పరిస్థితి కనిపిస్తోంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదలైన తొలి ఖరీఫ్ సేద్యమే కరువుతో మొదలైంది. ఖరీఫ్ పంటల సాగు లక్ష్యం మేరకు జరగలేదు. రైతులకు ఆధారమైన వాణిజ్యపంట వేరుశనగ సాగు నామమాత్రమే. తీవ్ర వర్షలోటు కారణంగా పంటలకు నష్టం వాటిల్లడంతో కూటమి ప్రభుత్వం జిల్లాలో 19 మండలాల్లో కరువున్నట్టు ప్రకటించింది. ఇందులో 12,585 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. 23,987 మంది రైతులకు రూ.21.49 కోట్ల పరిహారం చెల్లించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటిదాకా పైసా పరిహారం ఇవ్వలేదు. 2025 ఖరీఫ్కూడా నష్టాలను మిగిల్చింది. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె, మదనపల్లె, గాలివీడు, వీరబల్లి, వాల్మీకిపురం, రామాపురం, కురబలకోట, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో కరువు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖరీఫ్లో రైతులు 2,560.74 హెక్టార్లలో పంటలు నష్టపోయారని 4,904 మంది రైతులకు రూ.4.54 కోట్ల పరిహారం ఇవ్వాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటిదాక ఊసేలేదు. 2026 ఖరీఫ్ సాగు లక్ష్యం (హెక్టార్లలో) వరుస కరువులు, భారీగా తగ్గుతున్న సాగు విస్తీర్ణం ప్రశ్నార్థకంగా మారిన సేద్యం వర్షాధారంపైనే ఆధారపడినజిల్లా రైతాంగం ఈ ఖరీఫ్ సాగులక్ష్యం61,500 హెక్టార్లు కరువు, పంట నష్టాలపైకూటమి ప్రభుత్వ రిక్త హస్తం -
డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో ఆకతాయిలపై నిఘా ముమ్మరం చేసి, వారి ఆట కట్టించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నిఘా వ్యవస్థను సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ విజిబుల్ పోలీసింగ్ను ముమ్మరం చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్ ) వెంకటాద్రి తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను జోడించిందన్నారు. మదనపల్లి, రాయచోటి పట్టణాలలోని రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. నేల మీద పోలీసులు గస్తీ తిరుగుతుంటే, ఆకాశం నుంచి డ్రోన్ కెమెరాలు ప్రతి కదలికను రికార్డు చేస్తున్నాయన్నారు. దీంతో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బందిని అప్రమత్తం చేసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం శక్తి బృందాలు క్షేత్ర స్థాయిలో చురుగ్గా పని చేస్తున్నాయన్నారు. కాలేజీలు, బస్టాండ్లతోపాటు రద్దీగా ఉండే వ్యాపార సముదాయాల వద్ద నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆకతాయిలు ఆడ పిల్లలు, మహిళల్ని వేధింపులకు పాల్పడుతుంటే డ్రోన్ విజువల్స్ ఆధారంగా వారిని వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే డ్రోన్ నిఘా ద్వారా తప్పించుకోవడం అసాధ్యమన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100/112 లేదా స్థానిక పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. -
● టీచర్ల స్థలాలు కొట్టేసే పన్నాగం
సాక్షి ప్రతినిధి, కడప: ‘మీకు అండగా మేముంటాం. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. న్యాయం చేస్తాం. మహానాడు నిర్వహణకు అడ్డుచెప్పొద్దు’.. సరిగ్గా ఏడాది క్రితం టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ నేతలతో తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు అన్న మాటలివి. ఆపై సీఎం చంద్రబాబుతో హామీ ఇప్పించారు. శాలువాలతో సన్మానం చేయించారు. స్వయంగా కలెక్టర్ పర్యవేక్షించి టీచర్లకు ప్లాట్స్ కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఇంత చెప్పినా టీచర్లు హైరానా పడ్డారు. ఏడాది గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అయ్యవార్లు కుయ్యో.. మొర్రో ప్లాట్స్ అప్పగించండంటూ వేడుకుంటున్నా కనికరం చూపెట్టడం లేదు. హామీ ఇచ్చిన కలెక్టర్ పట్టించుకోవడమే మానేశారు. ● 1989లో టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ 88 ఎకరాలు కడప రూరల్ పబ్బాపురం గ్రామ పరిధిలో కొనుగోలు చేసింది. అందులో 1430 మంది ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలు కేటాయించారు. అప్పట్లో ఆ భూమి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు.. కాలక్రమేపి రింగ్రోడ్డు అందుబాటులోకి రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత 2006లో తమ సమ్మతి లేకుండా కొనుగోలు చేశారని శోత్రియందారులు కొందరు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు నకిలీ రైత్వారీ పట్టాలు పుట్టుకొచ్చాయి. వెబ్ ల్యాండ్లో లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్ తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలుగు తమ్ముళ్లు నమ్మబలికారు. సరిగ్గా గత ఏడాది ఇదే మే నెలలో హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులతో సమావేశమై ఆ స్థలంలో మహానాడు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. అప్పటికే ఏర్పాటు చేసుకున్న ప్లాట్స్ నంబర్ రాళ్లు తొలగించి చదును చేసి చక్కబెట్టుకున్నారు. టీచర్ల పట్ల లోపించిన చిత్తశుద్ధి టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కొనుగోలు చేసిన భూమిని చేజిక్కించుకోవాలని కొందరు అక్రమార్కులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో దౌర్జన్యం చేస్తున్నారు. ఇది వరకూ అనేక పర్యాయాలు ఉన్నతాధికారుల దృష్టికి అయ్యవార్లు తీసుకెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించినా టీచర్లకు దశాబ్దాల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అవే స్థలాలపై తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుండటంతో వ్యవహారం మరింత జఠిలమైంది. అప్పటి వరకూ ఉన్న టీచర్స్ ప్లాట్స్ రాళ్లు, హద్దులు చెరిపేశారు. యథావిధిగా టీచర్స్ ప్లాట్స్ అప్పగిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు జిల్లా కలెక్టర్ వరకూ అందరూ హామీ ఇచ్చారు. సమస్య పరిష్కరించి టీచర్లకు ప్లాట్స్ అప్పగించడంలో తెలుగు తమ్ముళ్లకు చిత్తశుద్ధి లోపించింది. మహానాడు నిర్వహణకు సహకారం కోసం అనేక మాటలు చెప్పిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు దాటవేస్తున్నారు. హద్దులు చెరిపేసి మహానాడు నిర్వహణ ఏడాది అవుతున్నా పరిష్కారానికి నోచుకోని సమస్య సీఎం హామీ ఇచ్చినా నెరవేర్చని వైనం ఆందోళనలో అయ్యవార్లు టీచర్లు హౌస్ బిల్డింగ్ సొసైటీ, శోత్రియందారుల మధ్య ఉన్న విభేదాలు ఆసరాగా చేసుకొని తెలుగు తమ్ముళ్లు కొంత స్థలాన్ని కొట్టేసే పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. 35 ఏళ్ల క్రితం కేటాయించిన స్థలాల్లో తగ్గించి కొత్తగా ప్లాట్స్ వేసుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వులను సైతం పరిగణనలోకి తీసుకోకుండా చెప్పినట్లు వింటే సరే, లేదంటే మీ ఇష్టం అన్నట్లుగా టీచర్ల ప్రతినిధులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సన్మానం చేయించిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు వితండవాదం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. -
నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి సిటీ: తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్న పరీక్షకు విద్యార్థులను 11గంటల నుంచి లోనికి అనుమతించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,542 మంది పరీక్షకు హాజరుకానున్నారని, విద్యార్థులు నిర్లక్ష్యం వహించకుండా సమయానికి రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయనున్నట్లు తెలిపారు. సదుం: చిత్తూరు జిల్లా సీనియర్ పురుషుల, మహిళల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు స్థానిక పోలీసు క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మమతారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయని చెప్పారు. క్రీడా కారులకు వయో పరిమితి లేదని, పురుషులు 85 కిలోలు, మహిళలు 75 కిలోల లోపు బరువు ఉండాలన్నారు. హాజరయ్యే వారు ఒరిజినల్ ఆధార్ కార్డుతో రావాలన్నారు. ఎంపికై న వారు ఈనెల 7 నుంచి 10 వరకు నెల్లూరు జిల్లా దువ్వూరులో జరిగే 13వ రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల బీచ్ కబడ్డీ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీంద్ర రెడ్డి తెలిపారు. వివరాలకు 9490005167, 8555046157, 9440345455 నంబర్లలో సంప్రదించాలన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప జయనగర్ కాలనీలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 6న జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు 2010 జనవరి 1 తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులన్నారు. ఎంపికై న క్రీడాకారులు జూన్ మొదటి వారంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలల్లో పాల్గొంటారని తెలిపారు. కడప అగ్రికల్చర్: కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) నూతన కో–ఆర్డినేటర్ (అధిపతి)గా డాక్టర్ శిల్పకళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కో–ఆర్డినేటర్గా పనిచేస్తున్న అంకయ్యకుమార్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శిల్పకళకు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లా రైతులకు అధునిక వ్యవసాయ పద్దతులకు సంబంధించి శిక్షణలు అందిస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా పనిచేస్తానని తెలిపారు. డాక్టర్ శిల్పకళకు శాస్త్రవేత్తలు అభినందనలు తెలిపారు. కడప ఎడ్యుకేషన్: ఇంటర్మియట్ విద్యలో భాగంగా నాన్ టిచింగ్ సిబ్బందికి శనివారం కడపలోని ఇంటర్ ఆర్జేడీ కార్యాలయంలో నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. కడప కర్నూల్, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించి నాన్ టీచింగ్ సిబ్బందికి ఆర్జేడీ సురేష్కుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు రికార్డు అసిస్టెంట్ల నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. కర్నూల్ జిల్లాలో ముగ్గురికి, అనంతపురం జిల్లాలో ఒకటిరికి, వైఎస్సార్కడప జిల్లాలో ఇద్దరికి పదోన్నతులు లబించాయి. కార్యక్రమంలో నాన్టిచింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరాజు, వైఎస్సార్కడప జిల్లా అధ్యక్షులు సురేష్, ఆర్జేడీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: డిజిటల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 30 మందికి పదోన్నతులకు సంబంధించిన కౌన్సెలింగ్ను శనివారం జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకట సుబ్బయ్య నిర్వహించారు. వీరికి పంచాయతీ గ్రేడ్–5 సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించనున్నారు. రెండు, మూడు రోజుల్లో పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. -
ఆదివారం
సత్యమేవ జయతేశాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం 3-5-2026ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం మూలవిరాట్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకు లు వీణా రాఘవాచార్యులు పట్టువస్త్రా లు, పూలతో మూల విరాట్లను అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. –ఒంటిమిట్టwww.sakshi.com‘గ్రామం ప్రగతిపథంలో ఉంటే ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు’ -
అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టిన కారు
ములకలచెరువు: కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చంద్రశేఖర్, నందిని, ఆదినారాయణమ్మలు కారులో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ములకలచెరువు షాదీమహల్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జుగా మారింది. కారులోని చంద్రశేఖర్(36) నందిని((20), ఆదినారాయణమ్మ(56)లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో ములకలచెరువు పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు -
అన్నమయ్య కీర్తనలకు తెలుగుసాహిత్యంలో విశేషస్థానం
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలకు తెలుగుసాహిత్యంలో విశేషస్థానం ఉంటుందని రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. శనివారం అన్నమాచార్యుల జయంత్యుత్సవాల సందర్భంగా తాళ్లపాకలోని అన్నమయ్య విగ్రహమూర్తికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమాచార్యుని కీర్తనలు తెలుగుసంస్కృతికి ప్రతి రూపాలన్నారు. మహానేత వైఎస్సార్ పాలనలో అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకకు స్వర్ణయుగమనే చెప్పవచ్చునన్నారు. దివంగత సీఎం వెఎస్సార్ తాళ్లపాకను సందర్శించారన్నారు. అలాగే అన్నమయ్య వంశీకుల సంక్షేమానికి వైఎస్ఆర్ కృషి మరిచిపోలేనిదన్నారు. ఇప్పటికి ఆ సంప్రదాయం కొనసాగుతోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్నమయ్య ఉద్యానవనంలో శ్రీవారి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. అలాగే టీటీడీ పాలకలమండలి తాళ్లపాకలో అన్నమయ్య ధాన్యమందిరం నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశారన్నారు. 2029లో వైఎస్జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, అందుకు ఆ దేవదేవుని ఆశీస్సులు తప్పక ఉంటాయన్నారు. రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు డీలరు సుబ్బరామిరెడ్డి, దండుగోపి, దాసరి పెంచలయ్య,, శేఖర్, తాళ్లపాకకు చెందిన గ్రామస్తులు ఉద్దండం సుబ్రమణ్యం తదితర పెద్దలు పాల్గొన్నారు ● తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. అనంతరం టీటీడీ వారు ఎమ్మెల్యేను సన్మానించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి -
సర్వేల్లోనే కొత్త రైల్వేలైన్లు
● మొన్న ముదిగుబ్బ–ముద్దనూరు ● తాజాగా రాయచోటి–కదిరి ● కదలికలేని కడప–బెంగళూరు మార్గం రాజంపేట: ఉమ్మడి కడప జిల్లాలో కొత్త రైల్వేలైన్లు సర్వేలకే పరిమితమవుతున్నాయనే విమర్శలున్నాయి. దశాబ్దాలుగా కేంద్రంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వా ల ఏలుబడిలో కొత్త లైన్లు సర్వేల్లోనే ఆగిపోయాయి. ముద్దనూరు–ముదిగుబ్బ ముదిగుబ్బ–ముద్దనూరు రైల్వేలైన్ను తీసుకొచ్చారు. 2025–2026 బడ్జెట్లో 75 కి.మీ దూరం ఉన్న ఈ లైన్కు సర్వే కింద రూ.16 లక్షలు కేటాయించిన సంగతి తెలిసిందే. 110 కి.మీ దూరం ఉన్న ముద్దనూరు–పులివెందుల–శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం లైన్కు రూ.2.75కోట్ల ఫైనల్ లోకేషన్ సర్వేకు కేటాయించారు. అయితే ఈ రెండు లైన్ల పురోగతి లేదు. కడప–బెంగళూరు ముందుకెళ్లేదెపుడో.. దివగంత సీఎం వైఎస్సార్ మానసపుత్రిక కడప – బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణం కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2010 సెప్టెంబర్లో అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప దీనికి శ్రీకారం చుట్టారు. ఈ రైలుమార్గానికి 2008–2009 బడ్జెట్లో ఆమోదం లభించింది. రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణపనులు కదిలాయి. 258 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 1, 531 భూసేకరణతో ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ లక్ష్యం ఐదేళ్లు కాదు కదా.. 15ఏళ్లు దాటిపోయేలా కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు. కడప–బెంగళూరు రైలుమార్గం నాలుగుఫేజ్ల్లో నిర్మాణం చేపట్టేలా రైల్వే నిర్ణయించుకుంది. మొదటి దశలో రూ.153 కోట్ల్ల కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20 కోట్లు రైల్వే వ్యయం చేసింది. ఈ దశలో 21.8 కిలోమీటర్ల వరకు చేపట్టారు. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయంచేశారు. పెండ్లిమర్రి లైన్ వేశారు. అక్కడితో లైన్ ఆగిపోయింది. దీని పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం వాటాను ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇవ్వకపోగా తాజాగా రాయచోటి–హిందుపురం లైన్ తీసుకొచ్చారు. దీంతో కడప–బెంగళూరు రైలుమార్గం ఇక అంతేనా.. అన్నమానాలు రాయచోటి వాసుల్లో నెలకొన్నాయి. ఎంపీ మిథున్రెడ్డి కృషి కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణం కోసం ఎంపీ మిథున్రెడ్డి పట్టుబట్టారు. లోక్సభలో ఈ అంశంపై ప్రశ్నించారు. రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ క్రమంలో ఈ లైన్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదు. ఈ లైన్ నిర్మాణానికి రైల్వేమంత్రి ముందుకువచ్చే అవకాశాలు కనిపించలేదు. పుంగనూరు, మదనపల్లె వంటి ప్రధాన పట్టణాల మీదుగా వెళ్లే ఈ రైలుమార్గం త్వరితగతిన పూర్తికావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కంభం–ప్రొద్దుటూరు రైల్వేలైన్ ప్రకాశం జిల్లా కంభం–జిల్లాలోని ప్రొద్దుటూరు రైల్వేలైన్ సర్వేకు పరిమితమైంది. ప్రతిపాదనతో ఊరిస్తోంది. 2023–2024లో కోటిరూపాయిలు కేటాయించారు. కంభం రైల్వేస్టేషన్ గుంటూరు–నంద్యాల మార్గంలో ఉంది. ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గంలో ప్రొద్దుటూరు ఉంది. ఈ రైల్వేలైన్ పట్టాలు ఎక్కలేదు. 2009–2010లో లైన్ సర్వే చేశారు. 142 కి.మీ లైన్కు రూ.900 కోట్లు అంచనా వ్యయం చేశారు. 2013–2024లో రైల్వే ఈలైన్పై దృష్టి సారించారు. ఎన్డీఏ ప్రభుత్వలో దీనిని పక్కనపెట్టేశారు. కలగానే గిద్దలూరు–భాకరాపేట యూపీఏ ప్రభుత్వంతోనే భాకరాపేట–గిద్దలూరు(ప్రకాశం) లైన్ నిర్మాణం కాలగర్భంలో కలిసిపోయిందనే విమర్శలున్నాయి. ఈలైన్ సిద్ధవటం, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు మీదుగా వెళ్లేలా సర్వే రూపొందించారు. 150 కిలోమీటర్ మేర లైన్ ఉంటుంది. పదేళ్ల క్రితం ప్రాథమికంగా ఇంజినీరింగ్ కమ్ సర్వే నిర్వహించారు. అప్పట్లో సర్వేకు రూ.కోటి కేటాయించారు. ఈలైన్ ఇప్పుడు అతీగతీ లేదని బద్వేలు ప్రాంతవాసులు పెదవివిరిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పెండ్లిమర్రి వద్ద ఆగిపోయిన కడప–బెంగళూరు రైలు మార్గం రైల్వేమంత్రి వైష్ణవ్కు వినతి పత్రం ఇస్తున్న ఎంపీ మిథున్రెడ్డి(ఫైల్) -
ప్రమాదాలకు నిలయంగా ఫ్లెక్సీలు
రాయచోటి : ప్రచార ఆర్భాటాలు, నాయకులను ప్రసన్నాలు చేసుకోవడానికి, వ్యాపారం ప్రారంభోత్సవాల పేర్లతో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు వాహనదారులు, ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పంచాయతీ, మున్సిపల్, రోడ్లు భవనాల జాతీయ రహదారుల శాఖల అధికారుల అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. రాయచోటి పట్టణంలోని ప్రధాన రహదారులు, కార్యాలయాల సముదాయాలు, డివైడర్లు, కూడల్లో అడ్డదిడ్డంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. కొయ్యలు, స్తంభాలు, గోడలకు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కొద్దిరోజులకే ఒరిగిపోయి రోడ్ల మీదకు వాలుతున్నాయి. దీంతో ఆ రహదారిన వెళ్లే ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఒక్కొక్కసారి అనుకోకుండా కొయ్యలు విరిగిపోవడం వల్ల వేగంగా వెళ్తున్న వాహనాలు, ప్రజలపైన పడి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలలో విచ్చలవిడిగా వెలుస్తున్న ఫ్లెక్సీలు ఎక్కువ ప్రమాదాలకు నిలయంగా మారాయి. గురువారం రాత్రి భారీగా వీచిన ఈదురు గాలులకు రాయచోటి పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్, నేతాజీ సర్కిల్, మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పడిపోయాయి. ఈ సమయాలలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదాలు తప్పిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న రాజకీయ, వ్యాపార ప్రకటనల ఫ్లెక్సీల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అనుమతులు లేకుండా అడ్డదిడ్డంగా వెలుస్తున్న వైనం -
ఆ సైనికుడి త్యాగం.. అజరామరం
● అమర జవాన్ ట్రస్టు ఫౌండర్ ఏడు కొండలు ● ఘనంగా సాయితేజ విగ్రహ ఆవిష్కరణ సాయితేజ కుటుంబ సభ్యులను ఊరేగింపుగా తీసుకొస్తున్న విద్యార్థినులు విగ్రహావిష్కరణలో అమర జవాన్ ట్రస్టు నాయకులు కురబలకోట : దేశ సేవలో అమరుడైన సాయితేజ మరుపురాని సైనికుడని, అంతేకాదు తెలుగు వారికి గర్వకారణమని ఉభయ తెలుగు రాష్ట్రాల అమర జవాన్ ట్రస్టు ఫౌండర్, చైర్మన్ మామిడి ఏడు కొండలు కొనియాడారు. సైన్యంలో పని చేస్తూ త్రివిధ దళాధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటూ 2021లో తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ అమరుడైన విషయం తెలిసిందే. కురబలకోట మండలం రేగడకు చెందిన సాయితేజ విషాదకర సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని తెలుగు వారిని ఎంతగానో కలచి వేసింది. శుక్రవారం అంగళ్లు మార్గంలోని విశ్వం కళాశాల బైపాస్ సర్కిల్లో అమర జవాన్ ట్రస్టు ఆధ్వర్యంలో విశ్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి నేతృత్వంలో సాయితేజ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత విశ్వం కళాశాల నుంచి భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏబీపీఎస్ఎస్పీ అధ్యక్షులు పాలేటి రాంబాబు మాట్లాడుతూ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి స్మృతిని నిలబెట్టుకోవడం బాధ్యతగా భావించాలన్నారు. విశ్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ సాయితేజ తమ కళాశాలలో డిగ్రీ వరకు చదవడం కళాశాలకు గర్వ కారణమన్నారు. విధి నిర్వహణలో అమరుడై తమ కళాశాల దగ్గర అతని విగ్రహావిష్కరణ జరగడం మరింత గౌరవంగా భావిస్తున్నామన్నారు. విద్యార్థులకు స్ఫూర్తి, ప్రేరణదాయకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీపీఎస్ఎస్పీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకట్రమణారెడ్డి, రవీంద్రబాబు నాయుడు, సాయితేజ తల్లిదండ్రులు మోహన్, మాజీ ఎంపీటీసీ భువనేశ్వరి, సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ, కుమార్తె దర్సిని, స్కూల్ ఎడ్యుకేషన్ రీపార్మ్స్ కమిటీలో రాష్ట్ర రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ మాజీ సభ్యులు బి.ఈశ్వరయ్య, సుదర్సన్, మాజీ సైనిక అసోసియేషన్ నాయకులు కంచెర్ల శ్రీనివాసుల నాయుడు, ఎం.వెంకట్రమణారెడ్డి, ప్రతాప్రెడ్డి, వెంకటస్వామితోపాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం సాయితేజ అమరుడైన సమయంలో జగన్ ప్రభుత్వం వీరి కుటుంబానికి అండగా నిలిచింది. అప్పటి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ద్వారా రూ.50 లక్షల ఎక్స్గ్రేషియాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందజేసింది. సాయితేజ భార్య శ్యామలకు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అంతేగాకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించి జగన్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. సాయితేజ కుటుంబాన్ని సగౌరవంగా చూసుకున్నారు. -
దప్పిక తీర్చుకోవడానికి వెళ్లి..
– బావిలో పడి మహిళ మృతి చౌడేపల్లె : అసలే భగభగ మండే ఎండ.. కష్టపడి పొలం వద్ద పని చేస్తుండగా మధ్యాహ్న సమయంలో దప్పిక తీర్చుకోవడానికి బావి వద్దకు వెళ్లిన మహిళను మృత్యువు కబళించిన సంఘటన వెంగళపల్లెలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంగళపల్లెకు చెందిన సుధాకర్కు బైరెడ్డిపల్లె మండలం బాపలనత్తంకు చెందిన సోముశేఖర్, ప్రభావతిల కుమార్తె గౌతమి(27) అలియాస్ సుజాతకు సుమారు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ పెద్దకొండామర్రి చెరువు కింద గల పొలం వద్దకు వెళ్లారు. పంట సాగు కోసం తోలిన సేంద్రియ ఎరువును పొలంలో చెల్లాచెదురు చేస్తుండగా.. గౌతమికి దాహం వేయడంతో నీరు తాగడానికి బావి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఎంత సేపటికీ భార్య రాకపోవడంతో బావి వద్దకు వెళ్లిన భర్త కేకలు వేయగా.. చుట్టుపక్కల వారి సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. తనతోపాటు కష్టపడి పని చేస్తూ క్షణాల వ్యవధిలో భార్య మృతి చెందడంతో భర్త కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో వెంగళపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పదిలో బీవీకే విద్యార్థుల ప్రభంజనం
తిరుపతి సిటీ: తిరుపతి బైరాగిపట్టెడలోని బీవీకే విద్యా సంస్థల విద్యార్థులు గురువారం విడుదలైన పదో తరగతి పలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా సీఈఓ అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ బీవీకే విద్యార్థులు పది ఫలితాల్లో రికార్డు స్థాయిలో మార్కులు సాధించి, ప్రబంజనం సృష్టించారని తెలిపారు. విద్యార్థులు కే వినతి 597, జాహ్నవి 595, జోష్యంత్ 592, మాన్యసాయి 591 సాధించారని చెప్పారు. 570 మార్కులకు పైగా 102 మంది విద్యార్థులకు రావడం పాఠశాలకు గర్వకారణమన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా బోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తమ పాఠశాల లక్ష్యమని చెప్పారు. నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులను మెరిట్ స్టూడెంట్స్గా తీర్చిదితున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందించారు. ● మందు పార్టీ వద్ద చెలరేగిన వివాదం ● ఇరువురు పరస్పరం దాడి చౌడేపల్లె : ఓ మామిడి తోటలో ఏర్పాటు చేసుకున్న మందు పార్టీ వద్ద చెలరేగిన వివాదం తారా స్థాయికి చేరింది. మాటకుమాట పెరగడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగి, తర్వాత కారుకు నిప్పు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల పంచాయతీ చిప్పిలివారిపల్లెకు చెందిన హరిబాబు, అతని స్నేహితులు మరికొందరితో కలిసి కాగతి సమీపంలోని ఓ మామిడి తోటలో గురువారం రాత్రి మందు పార్టీ ఏర్పాటు చేసుకొన్నారు. అదే గ్రామానికి చెందిన మునిరాజ చౌడేపల్లె పోలీస్స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి హరిబాబుతోపాటు మరికొందరు కలిసి తామందరం ఉన్న చోటికి రావాలని ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో హరిబాబు, మునిరాజ మధ్య మాటకుమాట పెరగడంతో పరస్పరం దాడి చేసుకున్నారు. అక్కడి నుంచి హరిబాబు చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి, తర్వాత పుంగనూరు ఆసుపత్రికి వెళ్లాడు. ఇంతలో ఏమి జరిగిందో ఏమో కానీ చిప్పిలివారిపల్లెలో హోంగార్డు మునిరాజ ఇంటి సమీపంలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న కారుపై అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గమనించిన స్థానికులు అదుపు చేయలేకపోవడంతో పుంగనూరు నుంచి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ సాయిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనకు కారకులుగా అనుమానిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా కారుకు ఎవరు నిప్పు పెట్టారు? ఎందుకు పెట్టారో.. పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. -
కోర్టులో అనుచిత ప్రవర్తనపై రేంజర్ సస్పెన్షన్
పుంగనూరు : ఓ క్వారీ లైసెన్సు, భూముల కేటాయింపు విషయంలో హైకోర్టుకు 18 పేజీల నివేదికలను తారుమారు చేసి, మార్చి 3న హైకోర్టులో నేరుగా హాజరై అనుచితంగా, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించిన పుంగనూరు ఫారెస్ట్ రేంజర్ శ్రీరాములును సస్పెండ్ చేస్తూ అటవీశాఖ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ డాక్టర్ పీవీ చలపతిరావు ఉత్తర్వులు జారీ చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలం పాలెంపల్లెకి చెందిన ఓ క్వారీ యజమాని లైసెన్సు, క్వారీ భూముల ఆక్రమణతో క్వారీ నిర్వహణలపై రాష్ట్ర హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి అటవీశాఖ కౌంటర్ దాఖలు చేసింది. 3 నుంచి 18 పేజీల నివేదికలు తారుమారు చేసి కోర్టును తప్పుదోవ పట్టించే వారని, దీనివల్ల అటవీశాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హైకోర్టు విచారణలో వెల్లడైంది. దీనిపై హైకోర్టు మార్చి 3వ తేదీన అటవీశాఖ అధికారులు హైకోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పుంగనూరు రేంజర్ శ్రీరాములు కూడా మార్చి 3న హైకోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా రేంజర్ క్రమశిక్షణా రహితంగా న్యాయమూర్తి ఎదుట ప్రవర్తించడం, అహంకార పూరితంగా మాట్లాడటం, తప్పుడు నివేదికలు కోర్టుకు సమర్పించడంతోపాటు అదే నివేదికలను రెండు సార్లు మార్చి సమర్పించడంపై హైకోర్టు ఫారెస్ట్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి రేంజర్ అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ చర్యలపై బీఎఫ్వో నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈ నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం రేంజర్ శ్రీరాములును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే సస్పెన్షన్ కాలంలో శ్రీరాములు అనుమతి లేకుండా పుంగనూరు వదిలి వెళ్లరాదని ఆదేశించారు. పుంగనూరు ఎఫ్ఆర్వోగా ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
ఘనంగా నృసింహ జయంతి
గుర్రంకొండ: మండలంలోని తరిగొండలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, నృసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రియ భక్తులరాలైన ప్రముఖ రచయిత్రి వెంగమాంబ జన్మస్థలం తరిగొండ గ్రామం. ఇక్కడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలోనే వెంగమాంబ ఆలయం ఉంది. వెంగమాంబ, నరసింహస్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం ఉదయం 6గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిపారు. 10గంటలకు ఆలయ ప్రాంగణంలో తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి అభిషేకాలు, ప్రత్యేకపూజలు జరిపారు. టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో మాతృశ్రీ వెంగమాంబ సంకీర్తన గోష్టిగానం, హరికథా కాలక్షేప తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ● మండలకేంద్రమైన గుర్రంకొండలో గురువారం నృసింహస్వామి జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయఅర్చకులు కిరణ్కుమార్శర్మ పాల్గొన్నారు. కురబలకోట: కురబలకోట మండలంలోని వివిధ గ్రామాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న టమాటా, వరి పంటలను గురువారం స్థానిక వ్యవసాయ అధికారి వినుత, హార్టికల్చర్ అధికారి భూదేవి పరిశీలించారు. బుధవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసి టమాటా, వరి పంటలతో పాటు విద్యుత్ శాఖకు నష్టం సంభవించిన విషయం విదితమే. పంట నష్టం అంచనా వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.మరో వైపు విద్యుత్ శాఖకు కూడా నష్టం వాటిల్లింది. కుక్కరాజు పల్లి క్రాస్ వద్ద చెట్టు పడి దెబ్బతిన్న 33 కేవీ లైన్ను పునరుద్ధరించారు. కొత్త గూడెం పల్లిలో దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు పనులు చేపట్టి విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్కో ఏఈ శంకర్ రెడ్డి తెలిపారు. -
వైభవంగా హంసవాహన సేవ
చౌడేపల్లె: మండలకేంద్రంలోని శ్రీఅభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారు హంస వాహనంపై విహరించారు. అర్చకులు రాజశేఖరధీక్షితులు, కుమారస్వామి, మహేష్లు ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు.అనంతరం హంస వాహనంపై కొలువుదీర్చి మేళ తాళాలు నడుమ పురవీధుల్లో ఊరేగించారు.ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా బ్రాహ్మణసంఘంవారు వ్యవహరించారు. మదనపల్లె టౌన్: మదనపల్లె పట్టణ శివారు కాలనీకి చెందిన ఓ బాలిక గత నెల 22న ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రసవం విషయం గత గురువారం వెలుగులోకి రావడంతో డీఎస్పీ పావని స్పందించారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. గర్భానికి కారణమైన వారి పేరు చెప్పడానికి బాలిక కుటుంబీకులు నిరాకరించారు. ఈ క్రమంలో చైల్డ్వెల్ఫేర్ కమిషన్(సీడబ్ల్యూసీ) సూపర్ వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమోటోగా తాలుకా పోలీస్ స్టేషన్ లో పెళ్లికాకుండానే బాలికను తల్లిని చేసిన నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసులో పట్టణ శివారు కాలనీకి చెందిన ఓ యువకుడిన గురువారం సాయంత్రం బెంగళూరు రోడ్డులోని చిప్పిలి పాల డైరీ సమీపంలో డీఎస్పి అరెస్టు చేశారు. అనంతరం నిందితున్ని స్థానిక కోర్టులో హాజరపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. -
● పేదింట మార్కుల పంట
పెద్దతిప్పసముద్రం: కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త అకాల మరణం ఆమెను బాధించింది. ఆరునెలల పసిపిల్లాడి భారం ఆమైపెనే పడింది. అయినా కూడా ఆత్మస్థైర్యంతో కష్టపడి కూలి పనులు చేస్తూ కన్న బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటూ చదివించింది. గురువారం వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో తన బిడ్డ మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతో ఆ తల్లి ఆనందంతో ఉప్పొంగిపోయింది. లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరస్వతీ దేవి నిండుగా దీవించిందని సంబరపడింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రంగసముద్రానికి చెందిన దాలి పార్వతమ్మ, శంకర్ దంపతులకు ఒక్కగానొక్క సంతానం పవన్ సాయి. తల్లి కష్టాన్ని చూస్తూ ఎదిగిన పవన్ చదువుపై మక్కువ పెంచుకున్నాడు. రంగసముద్రం జెడ్పీ హైస్కూల్లో పది పూర్తి చేశాడు.తాజాగా విడుదలైన ఫలితాల్లో పవ్సాయి మండల స్థాయిలో 589 మార్కులు సాధించి మొదటి ర్యాంక్ సాధించాడు. భవిష్యత్తులో ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని ఈ విద్యార్థి పేర్కొన్నాడు. ఎంఈఓలు నారాయణ, గౌస్పీర్, హెచ్ఎం సరస్వతితో పాటు ఉపాధ్యాయులు పవన్సాయిని అభినందించారు. -
నారసింహా...గోవిందా
మదనపల్లె సిటీ: మదనపల్లె మండలం సీటీఎంలో వెలసిన శ్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మరథోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మి నరసింహస్వామి గోవిందా... ప్రహ్లాద వరద గోవిందా.. జయ జయ సింహా ..జయ నరసింహా అంటూ భక్తులు కీర్తించగా గోవింద నామస్మరణతో సీటీఎం పురవీధులు మార్మోగాయి. బ్రహ్మరథోత్సవం నాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే రథాన్ని నడిపి శ్రీవారు పురవీధుల్లో విహరించేందుకు సహరించి భక్తులంతా స్వామిని దర్శించుకునేలా చూస్తారని భక్తుల నమ్మకం. ఆలయంలో ఉదయం అర్చక బృందం రుషికేశవ్, మంజువిక్రమ్, ఆదిత్యచార్యులు, రామాచార్యులు తేరు ముందు అస్థాన పూజలు నిర్వహించారు. స్థానిక ప్రముఖులు రథం వద్ద జరిగిన తొలి పూజల్లో పాల్గొని తర్వాత రథంపై శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు. ఒకవైపు ఎండలు మండుతున్నా భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని రథంపైకి మిరియాలు, దవనం చల్లేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. ధార్మిక సేవా ఆధ్వర్యంలో ధూళోత్సవం నిర్వహించారు. వైభవంగా లక్ష్మినారసింహుడి బ్రహ్మరథోత్సవం -
వైభవంగా అశ్వవాహన సేవ
చౌడేపల్లె: మండలకేంద్రంలోని బజారువీఽఽధిలో వెలసిన శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంలో కొలువుదీర్చారు. రాజశేఖర ధీక్షితులు, కుమార స్వామి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాల ధ్వనుల మధ్య శివపార్వతుల ఉత్సవ మూర్తులు పురవీదుల్లో ఊరేగించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా అన్నం వంశస్థులు వ్యవహరించారు. స్వర్ణ గ్రామం అందరి లక్ష్యం కలకడ : స్వర్ణ గ్రామం మన అందరి లక్ష్యంగా పనిచేయాలని జిల్లా జీఎస్డబ్ల్యూఎస్ అధికారి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కదిరాయచెర్వు పంచాయతీలో విచారణ చేశారు. సిబ్బంది సచివాలయానికి సమయానికి హాజరు అవుతున్నారా, ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని అడిగితెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది వ్యక్తిగతంగా అందిస్తున్న సేవలు, ఉన్నతాదికారులకు అందించే నివేదికలు ఎందుకు అధ్వానంగా ఉన్నాయని అడిగారు. అనంతరం కె.బాటవారిపల్లె పంచాయతీలో జనగణనపై జరుగుతున్న సర్వే తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీప్యూటి ఎంపీడీఓలు చక్రపాణి, శ్రీనివాసులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు విశ్వనాథ్, నందిని తదితరులు పాల్గొన్నారు. అధికారి వైఖరికి నిరసన మదనపల్లె టౌన్: వాణిజ్య పన్నుల శాఖ అధికారి వైఖరిని నిరసిస్తూ బుధవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మదనపల్లెలో నిరసన తెలిపింది. రాష్ట్ర శాఖ ఆదేశాలతో మదనపల్లె వాణిజ్య పన్నులశాఖ అధిపతి బాబు అహ్మద్ వైఖరికి నిరసనగా, స్థానిక వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రమోషన్ల కోర్రీలు పెట్టడం, అవమాన కరంగా మాట్లాడటం, అసభ్య పదాలు వాడటం, ఉద్యోగులకు కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు చేపట్టిన నిరసనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గురుప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ. గంగయ్య గౌడ తదితరులు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ షఫీ, రవి కుమార్ నాయక్, ఉమాశంకర్, శ్రీనివాస రాజు, సతీష్ కుమార్, శివయ్య, బాలాజీ, గంగాధర్, ఖళీలుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి యువకుడు మృతి
కలికిరి: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన కలికిరి పట్ట ణ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కలి కిరి పట్టణం కొత్తపేట వీధికి చెందిన ఎస్.జాకీర్ హుస్సేన్ (33) బుధవారం ఉదయం కలికిరి పెద్దచెరువు వద్దకు బహిర్బూమికి వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడ్డాడు. నీటిలో వ్యక్తి తల కొంతమేర కనిపిస్తుండటం, ఒడ్డున చెప్పులు ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పీలేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చి, వారి సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుని అక్క మహమ్మద్ జై అప్సానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుని భార్య ఏడాది క్రితం మరణించింది. తల్లిదండ్రులను కోల్పోయిన వీరి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పిడుగు పడి 16 గొర్రెలు మృతి – రూ. 2.50 లక్షలు నష్టం గుర్రంకొండ: పిడుగు పడి 16 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని శెట్టివారిపల్లె పంచాయతీ ఎస్. కొత్తపల్లె వద్ద జరిగింది. బాధిత గొర్రెల కాపరులకు రూ. 2.50 లక్షలు నష్టం వాటిల్లింది. శె శెట్టివారిపల్లె పంచాయతీ అరిగెలవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు, మంజుల దంపతులు 60గొర్రెలను కాసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం యథావిధిగా గొర్రెల మందను గ్రామానికి సమీపంలో పొలాల్లో నిలిపారు. సాయంత్రం పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. ఎక్కువ సమయం ఉరుముల శబ్దాలు రావడంతో మందలోని గొర్రెలు భయాందోళన చెందాయి.దీనికి తోడు చిన్న పాటి వర్షం మొదలవడంతో గొర్రెలు నలుదిక్కులకు పారిపోయాయి. 16 గొర్రెలు పొలానికి సమీపంలోని చింత, వేపచెట్టుకింద ఉన్నాయి. ఇంతలోనే పెద్ద ఎత్తున శబ్దం చేస్తూ పిడుగు గొర్రెల మంద ఉన్న చెట్ల పైన పడింది. ఈసంఘటనలో 16 గొర్రెలు ఆక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో గొర్రెల కాపరులు రోదించారు. మృతి చెందిన గొర్రెల విలువ రూ.2.50 లక్షలు వరకు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. రిమ్స్లో గుర్తు తెలియని మృతదేహం కడప అర్బన్: కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో వైద్య సేవల కోసం గుర్తు తెలియని వ్యక్తి (45)ని ఈనెల 28వ తేదీన రాత్రి తీసుకుకొచ్చారు. వైద్యులు అతన్ని పరీక్షించి మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు తెలియజేశారు. గొర్రెల మందపై వీధి కుక్కల దాడి రామాపురం: రామాపురం మండలం సరస్వతీపల్లి దళితవాడలో నివసించే పిల్లిండ్ల ఆంజనేయులు కు చెందిన గొర్రెల మందపై బుధవారం తెల్లవారుజామున వీధి కుక్కల గుంపు దాడి చేశాయి. 40 గొర్రెలను కొరికి చంపాయి. ఉదయం గొర్రెలను బయటకు తీసుకెళ్లేందుకు వెళ్లిన ఆంజనేయులు మృతి చెందిన 40 గొర్రెలను చూసి విలపించాడు.రూ. 5 లక్షల విలువైన గొర్రెలను కోల్పోవడం వల్ల కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నట్లు వాపోయారు.,గ్రామస్తులు విషయాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వీ ఆర్ఓ యామినిని సంఘటన స్థలానికి పంపి నష్టాన్ని అంచనా వేసి,నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. పసికందు మృతదేహం లభ్యం రామసముద్రం: అప్పుడే పుట్టిన పసికందును కన్నతల్లి కడతేర్చి పొలాల్లో పారవేసి వెళ్లిన దుర్ఘటన ప్రజలను కలచివేస్తోంది. ఈ సంఘటన రామసముద్రం మండలం చెంబకూరు సమీపంలోని ఎలకపల్లి రోడ్డు మార్గంలో బుధవారం జరిగింది. ఎస్ ఐ హృషీకేశవ్ రెడ్డి తెలిపిన కథనం ఎలకపల్లి సమీపంలోని మామిడి తోపులో గుర్తుతెలియని పసికందును పొలం యజమానురాలు గమనించింది. విషయం తెలియడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ ఐ హృషీకేశవ్ రెడ్డి, తహసీల్దార్ అజారుద్దీన్ తన సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను, చుట్టుపక్కల ప్రజలను ఆరా తీశారు. అనంతరం పసికందు మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పసికందు ఎవరన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈతకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతి
వాల్మీకిపురం: ఈతకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మూగలమర్రి పంచాయతీలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని ఆరమడకకు చెందిన రాజారెడ్డి కుమారుడు రంజిత్ కుమార్ రెడ్డి (32) మంగళవారం మధ్యాహ్నం గ్రామస్తులతో కలిసి ఈతకు వెళ్లాడు.అతను గల్లంతు కావడంతో అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9గంటలైనా ఆచూకీ తెలియరాకపోవడంతో బుధవారం ఉదయం మళ్లీ గాలించారు. కొత్తపల్లిచెరువులో నుంచి రంజిత్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకొని, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట చింతల ఆనంద రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, రెడ్డిశేఖర్ రెడ్డి, నీళ్ల భాస్కర్, కేశవ రెడ్డి, యోగేంద్ర రెడ్డి, తదితరులు ఉన్నారు. -
కురబలకోటలో వడగళ్ల వాన
కురబలకోట: కురబలకోట మండలంలోని కడప క్రాస్, దిగువబోయపల్లి పరిసర గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వర్షానికి టమాటా, వరి పంటలు దెబ్బతిన్నాయి. 45 నిమిషాల పాటు పడిన వడగళ్ల వానకు ఇటీవల కొత్తగా నాటిన టమాటా దెబ్బతింది. కడప క్రాస్ కు చెందిన ఏవీ లక్ష్మిదేవమ్మకు చెందిన మూడు ఎకరాల టమాటా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇంకా నేలను పట్టుకుని నిలబడక ముందే వడగళ్ల దెబ్బకు విరిగిపోయి తలవంచినట్లుగా మారా యని తెలిపారు. పరిసర ప్రాంతాల్లో 70 ఎకరాలకు పైగా పంటకు నష్టం సంభవించినట్లు రైతులు వాపోయారు. వడగళ్ల వాన కడగండ్లను మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెట్లు పడి కూలిన కరెంటు స్తంభాలు మండలంలోని వివిధ ప్రాంతాల్లో 70 ఎకరాలకు పైగా పంటకు నష్టం సంభవించినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. మరో వైపు విద్యుత్ శాఖకు కూడా నష్టం వాటిల్లింది. కుక్కరాజు పల్లి క్రాస్ వద్ద పెద్ద చెట్టు విరగడంతో 33 కేవీ లైన్ దెబ్బతింది. కడప క్రాస్, పిచ్చలవాండ్లపల్లి తదితర ప్రాంతాల్లో ఏడు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణకు శరవేగంగా చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్కో ఏఈ తెలిపారు. హార్సిలీహిల్స్పై అంధకారం బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్పై బుధవారం రాత్రి అంధకారం నెలకొంది. సాయంత్రం గాలి వాన కారణంగా విద్యుత్ సరఫరా తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో సాయంత్రం ఐదు నుంచి రాత్రంతా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. కొండంత చీకటితో నిండిపోయింది. ఇక్కడ విడిది చేసిన పర్యాటకులు గదులకే పరిమితమయ్యారు. ఘాట్ రోడ్డులో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఏఈ మాట్లాడుతూ గాలి కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బోయపల్లి దగ్గర విద్యుత్లైన్పై విరిగి పడిన చెట్టును తొలగిస్తున్న సిబ్బంది కడప క్రాస్లో వర్షానికి పడ్డ వడగళ్లు రైతుల కష్టం నిమిషాల్లో నేల మట్టం దెబ్బతిన్న టమాటా, వరి పంటలు -
కడప రాయుడి కోనేటి విహారం
తెప్పపై స్వామి వారి విహారం కడప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుడు పగలంతా దుష్ట శిక్షణతో అలిసి సాయంత్రం కోనేటిలో చల్లగాలితో ఆనందించాలని తెప్పపై కొలువుదీరాడు. అలా...అలా...విహరించి ఆనందించారు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం తెప్పోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు సాయంత్రం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం చేసి పల్లకిలో కొలువుదీర్చారు. అర్చకులు మయూరం కృష్ణమోహన్ బృందం వేదమంత్రోచ్ఛాటనలతో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకు వెళ్లి పుష్కరిణిలో సిద్ధం చేసి ఉన్న తెప్పలో కొలువుదీర్చారు. పూజల అనంతరం మంగళహారతులు ఇచ్చి మొదట వేదమంత్రోచ్ఛాటనలతో తెప్ప పుష్కరిణిలో తొలి ప్రదక్షిణ చేయించారు. రెండవమారు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు గాయకులు భక్తిగీతాలాపనతో తెప్పతో ప్రదక్షిణ నిర్వహించారు. మూడవమారు స్వామి, అమ్మవారు మంగళ వాయిద్యాల మధ్య ప్రదక్షణ చేశారు. మంగళ హారతులు అనంతరం స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. –కడప సెవెన్రోడ్స్ విశేష అలంకారంలో స్వామి, అమ్మవారు -
ట్రిపుల్ఐటీలో విద్యార్థుల ధర్నా
వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో విద్యాభాస్యం పూర్తి చేసి న విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని బుధవారం రాత్రి ట్రిపుల్ఐటీ అకాడమిక్ బ్లాక్–1 వద్ద ధర్నా చేపట్టారు. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమకు రావాల్సిన స్కాలర్షిప్ బకాయిల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా స్కాలర్షిప్ నిధులు విడుదల కాకపోవడంతో ఫీజుల చెల్లింపులు ఆగిపోయాయని, దీనివల్ల సర్టిఫికెట్లు పొందే విషయంలో, ఉన్నత చదువుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని డెరెక్టర్ కార్యాలయం వద్ద వారు బైఠాయించారు. ప్రభుత్వం స్పందించి తమ స్కాలర్షిప్ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. -
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం
కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లె టౌన్: జిల్లా వ్యాప్తంగా రౌడీ మూకలను అణచివేయాలని కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి, డీఎస్పీ పావనితో కలిసి జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై డేగకన్ను వేయాలని, అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై స్పందిస్తూ.. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, బ్లాక్ స్పాట్లను గుర్తించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ బి.పావని తో పాటు పలువురు సీఐలు, పాల్గొన్నారు. -
ఫారెస్ట్ అధికారి కారు ఢీ: ముగ్గురికి గాయాలు
మదనపల్లె టౌన్: నిమ్మనపల్లెలో ఫారెస్ట్ అధికారి కారు ఢీకొని ఒకే కుటుంబంలోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లి మండలం, గార బురుజు వద్ద రాచవీటి వారి పల్లి కు చెందిన భాస్కర్ (45), సుజాత (40), భారతి (25) రోడ్డు పక్కన ఆటో కోసం వేచి ఉండగా, అటవీ శాఖ అని రాసి ఉన్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని స్థానికులు చికిత్స కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నారు. కాగా ప్రమాదానికి కారణమైన ఫారెస్ట్ అధికారి ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. చేనేత కార్మికుడిపై కత్తితో దాడి మదనపల్లె టౌన్: ఉత్తరప్రదేశ్ (యూపీ)కు చెందిన చేనేత కార్మికుడిపై యూపీకి చెందిన మరో చేనేత కార్మికుడు కత్తితో దాడి చేశాడు. బుధవారం రాత్రి మదనపల్లెలో జరిగిన ఘటనపై బాధితుడు తెలిపిన వివరాలు. యూపీ రాష్ట్రం కోట్వర్, వారణాసికి చెందిన ఇబ్రహీం కొడుకు మహమ్మద్ ఖాసీమ్ (32) మదనపల్లెకు వచ్చి నీరుగట్టువారిపల్లెలో మగ్గాలు నేస్తున్నాడు. ఈ క్రమంలో యూపీ కోట్వర్ కు చెందిన మరో చేనేత కార్మికుడు కూడా నీరుగట్టుపల్లి, రామిరెడ్డి లే ఔట్ లోనే మగ్గాలు నేస్తున్నాడు. ఇద్దరూ కలసి మద్యం తాగేందుకు గాలిమిషన్ వద్ద ఉన్న మద్యం షాపుకు వచ్చారు. తాగి ఇంటికి వెళుతూ గొడవపడ్డారు. మాటమాటా పెరిగి హబీబ్ తన వద్ద ఉన్న కత్తితో మహమ్మద్ ఖాసీమ్ను పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు బైక్ అదుపుతప్పి కిందపడి.. మదనపల్లె టౌన్: ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపుతప్పి కిందపడటంతో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగిన ఘటనపై బాధితుని కుటుంబీకుల కథనం.. బొమ్మన చెరువు పంచాయితీ, దండువారిపల్లి కు చెందిన రైతు గంగరాజు 48, సొంత పని మీద బైక్లో మదనపల్లెకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా కోట వారిపల్లి క్రాసు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపుతప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని డప్పు కళాకారులకు.. మదనపల్లె టౌన్: కారు ఢీకొని డప్పు కళాకారులు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం సాయంత్రం గుర్రంకొండ మండలంలో జరిగింది. ఎస్ఐ రవీంద్ర కథనం మేరకు.. మండలంలోని మర్రిపాడు పంచాయతీ, భూమకం వారి పల్లికు చెందిన నరసింహులు (60), తరిగొండ రెడ్డి వారి పల్లి కు చెందిన లక్ష్మన్న (63) గుర్రంకొండ మండలంలోని నడిమి చర్ల గ్రామం, ప్యారంపల్లిలో ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియల్లో డప్పు వాయించడానికి వెళ్లారు. అంత్యక్రియల అనంతరం రోడ్డు పైకి వచ్చి నీటి తొట్టి వద్ద కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటుండగా ఓ కారు వేగంగా వచ్చి, వీరిని కొట్టి వెళ్ళిపోయింది. స్థానికులు గమనించి తీవ్రంగా గాయపడిన నరసింహులు, లక్ష్మన్నలను చికిత్సల నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి, నరసింహులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుర్రంకొండ ఎస్ఐ రవీంద్ర తెలిపారు. గాయపడిన నరసింహులు, లక్ష్మన్న -
టమాట ధర తగ్గుముఖం
మదనపల్లె: టమోటా ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం మదనపల్లి మార్కె ట్లో మొదటి రకం రూ.30 పలికింది. రెండో రకం కిలో రూ.24 పలికింది. కాగా బుధవారం మార్కెట్కు 305 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. టమాట దిగుబడులు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం ధరలపై కనిపిస్తోంది. ఆదివారం 256 టన్నులు, సోమవారం 250 టన్నులు, మంగళవారం 292 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. మదనపల్లె: జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో మదనపల్లెలో మే ఒకటి నుంచి ఎల్.జీ. గిరి రావు స్మారక ఉచిత హాకీ శిక్షణా శిబిరాన్ని బిటి కళాశాల హాకీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్, జిల్లా హాకీ సంఘ అధ్యక్షుడు పి.వి.ప్రసాద్ బుధవారం తెలిపారు. మే ఒకటి నుంచి 31 వరకు జరిగే ఈ శిక్షణకు మదనపల్లి, పరిసర ప్రాంతాల విద్యార్థిని, విద్యార్థులు శిక్షణలో పాల్గొని హాకీ క్రీడలో నైపుణ్యం పెంచుకోవాలని కోరా రు. ఈ శిక్షణ శిబిరంలో వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కడప కోటిరెడ్డిసర్కిల్: కడప–విశాఖపట్టణం–కడప మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్ప్రెస్ను గుంతకల్లు వరకు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. మే 12 నుంచి గుంతకల్లు–విశాఖపట్టణం (18522), మే 13వ తేది నుంచి విశాఖపట్టణం–గుంతకల్లు (18521) తిరుమల ఎక్స్ప్రెస్ను నడపనున్నారని తెలిపారు. విశాఖపట్టణంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు బయలుదేరి మరుసటిరోజు కడపకు ఉదయం 7.03 గంటలకు చేరుకుని ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి మీదుగా గుంతకల్లుకు 11.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి గుంతకల్లులో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి కడపకు సాయంత్రం 5.40 గంటలకు చేరుకుని మరుసటిరోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్టణానికి చేరుతుందని ఆయన వివరించారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపోలో పనిచేసేందుకు ఆన్కాల్ డ్రైవర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కడప డిపో మేనేజర్ నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30వ తేది డీఎం కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. 21 సంవత్సరాలు దాటి హెవీ లైసెన్స్ పొంది 18 నెలలు పూర్తయిన వారు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. ఇతర వివరాలకు తమ కార్యాలయంలోగానీ, 73828 60968 నెంబరులో సంప్రదించాలని వివరించారు. పులివెందుల రూరల్: ఏపీ కార్ల్ సీఈఓగా పశుసంవర్థక శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న దామోదర్ నాయుడును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పశుసంవర్థక రంగంలో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రొద్దుటూరు రూరల్: మండలంలోని దొరసానిపల్లె గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్న జింకా అంజనీకుమార్ ఆర్ఎంపీ క్లినిక్ను బుధవారం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలు వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు మాత్రమే సేవలు అందించాలన్నారు. అంతకంటే ఎక్కువ వైద్యం అందించి రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ బీఏ వరప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
స్వచ్ఛ పథం తప్పనిసరి
జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ కురబలకోట: జిల్లాలో ప్రతి బుధవారం స్వచ్చ పథం కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ సూచించారు. కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లి సచివాలయ పరిధిలో విశ్వం కళాశాల మార్గంలో స్వచ్చ పథం కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. రోడ్లు పరిశుభ్రతను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్చ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం గ్రామంలోని అన్ని రోడ్లను విధిగా పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. రోడ్లు పక్కన పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని, వ్యర్థాలను తొలగించాలన్నారు. దీనిని యాప్లో నమోదు చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీఓ గంగయ్య, డిప్యూటి ఎంపీడీఓ బాలమూర్తి, పంచాయతీ డెవలప్మెంట్ అధికారి రఘునాథ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
తొందర పాటు సరికాదు
పిల్లలు ఫెయిలైతే తల్లిదండ్రులు తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పదో తరగతి అంటే పెద్ద వయసేమి కాదు. మరోసారి మంచిగా చదివి ఉత్తీర్ణత సాధించాలని ప్రోత్సహించాలి. అప్పుడే విద్యార్థులు క్షణికావేశానికి లోనుకాకుండా ఉంటారు. పెద్దగా చదువుకోలేనివారు పదో తరగతి పరీక్షల్లో తప్పిన వారు సైతం ప్రస్తుతం వ్యాపారాల్లో రాణించి ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుంది. తల్లిదండ్రులు దానిని గుర్తించి పిల్లలను దిశగా ప్రోత్సహించాలి. –డాక్టర్ సుబ్రమణ్యం, డీఈఓ,అన్నమయ్య జిల్లా -
చిన్నారులకు అంగన్ వేడి
రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రతకు మానవులతో పాటు పశుపక్షాదులు విలవిలలాడుతున్నాయి. వడదెబ్బకు భయపడి జనసంచారంలేక రోడ్లు కళావిహీనంగా ఉన్నాయి.దీని నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్వేశంతో విద్యార్థులకు వేసవిసెలవులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల విద్యా సంస్థలకు ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటించారు.అయితే అంగన్వాడీ కేంద్రాలకొచ్చే చిన్నారులకు మాత్రం ప్రకటించడంలో సర్కార్ చోద్యం చూస్తోంది.ఫలితంగా కొందరు రావడం లేదు. ● వేసవి తీవ్రతతో విలవిల ● తగ్గుతున్న హజరు శాతం ● సెలవులు ప్రకటించని ప్రభుత్వం ● పక్క రాష్ట్రాల్లో మాత్రం హాలిడేస్ మదనపల్లె సిటీ: ఎండలకు వాడిపోతున్న చిన్నారుల ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదు.భానుడు భగభగ మండిపోతుంటే ఎండలకు చిన్నారులు ఎలా వస్తారనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణాలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చారు.కానీ ఇక్కడ వేసవి సెలవులు ప్రకటించాలన్న ఆలోచన రాకపోవడం గమనార్హం. అన్నమయ్య జిల్లాల్లో 1792 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటల్లో సంరక్షణ పొందుతున్న వారికి పౌష్టికాహారం అందించి, ఆటపాటలు, అక్షరాలు నేర్పించడం కార్యకర్తల విధులు. ఏడాది పొడవునా కేంద్రాల్లో చిన్నారులకు ఇదే పద్ధతి కొనసాగుతోంది.అయితే వేసవి సమీపించడంతో రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.కానీ అంగన్వాడీ కేంద్రాలకు దీన్ని వర్తింపజేయలేదు.దీంతో ఎండలకు చిన్నారులను పంపించేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. మండుతున్న ఎండలకు పెద్దలే గడపదాటి కాలు బయటికి పెట్టడానికి భయపడుతుంటే పిల్లలను ఎలా పంపిస్తామని ప్రశ్నిస్తున్నారు. కొందరు చిన్నారులు కేంద్రాలకు వస్తున్నా అక్కడవారికి గాలి లేకపోవడంతో ఉక్కపోతకు విలవిలలాడి పోతున్నారు. వీరిని సముదాయించలేక ఆయాలు తంటాలు పడుతున్నారు. వేసవిలో చిన్నారులను కేంద్రాల్లో ఉంచాలని చెబుతున్న ప్రభుత్వం వారికి చిరుతిండ్లు అందించడంలో శ్రద్ధ చూపడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలవులపై స్పష్టత లేదు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు,ఆయాలకు చెరో 15 రోజులు సెలవులు ఇవ్వాల్సి ఉంది. మే 1 నుంచి 15 వరకు ఒకరికి, 15 నుంచి 30 వరకు ఒకరు సెలవు లు తీసుకోవచ్చు.అయితే దీనిపై స్పష్టత కొరవడింది.ఒకవేళ వంతుల వారీగా కార్యకర్తలు,అయాలు సెలవులు తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించినా ఆయాలు చేసే పనులు మేము చేయాలా అనే ధోరణిలో అంగన్వాడి కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం.చిన్నారుల పరిశుభ్రత పని ఆయాలదని, వారి పని కార్యకర్తలు చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. డిమాండ్లు పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేం అడగకుండానే వివిధ రకాల హామీలు ప్రకటించారని, కానీ ఒక్కటీ నెరవేర్చక పోగా తమపై విపరీతమైన పనిభారం మోపడం ఎంతవరకు సమంజసమని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నా రు. తమ న్యాయమైన డిమాండ్లు నేరవేర్చాలని ఎండలు లెక్క చేయ కుండా ఒకవైపు వీరు పోరాటాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి జాలి, దయ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎండలు మండిపోతున్నా కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా కక్ష పూరిత ధోరణి అవలంభిస్తోందని యూనియన్ నేతలు మండిపడుతున్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు : 1792 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు : 34,354 3–6 సంవత్సరాల బాలలు : 20,460 గర్భిణులు : 7,477 బాలింతలు : 6,230వైఎస్సార్ కడప జిల్లా కలసపాడులోని అంగన్వాడి కేంద్రం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలి. ఎండలు మండిపోతున్నాయి. చిన్నపిల్లలు, గర్భిణులు ఎండలకు అంగన్వాడీ కేంద్రాలకు రాకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అంగన్వాడీలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. – విజయ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స యూనియన్ జిల్లా నాయకురాలు. ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బయటకు రావాలంటే భయంగా ఉంది. ఇలాంటి సమయంలో అంగన్వాడీ కేంద్రాలు నడపడటం సరి కాదు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకు వేసవి సెలవులు ఇవ్వాలి. గర్భిణులు, బాలింతలకు ఇంటి వద్దే రేషన్ అందజేయాలి. – హరిశర్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు


