Annamayya
-
దగా డీఎస్సీపై యువత ధ్వజం
● ప్రతిభకు ఉద్యోగాలు ఇవ్వకుంటే పరీక్షలెందుకు ? ● ఉద్యోగాలను అంగడి సరుకులా అమ్ముకుంటారా ! ● మదనపల్లె కలెక్టరేట్ ఎదుట హోరెత్తిన యువజన నినాదం ● డీఎస్సీ అక్రమాలపై తీవ్ర ఆగ్రహం ● మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ సాక్షి, మదనపల్లె: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కార్ ప్రతిభకు పాతరేసి, ఉద్యోగాలను అమ్ముకోవడంపై యువతలో నిరసన పెల్లుబికింది.అక్రమాల డీఎస్సీపై చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులను వంచించిన ప్రభుత్వం తక్షణమే డీఎస్సీను రద్దు చేసి, బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని నినాదాలతో హోరెత్తించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ పిలుపుతో సోమవారం యువజన విభా గం నిర్వహించిన చలో కలెక్టరేట్ కార్య క్రమం మదనపల్లెలో విజయవంతమైంది. మెగా డీఎస్సీ నియామకాలు అక్రమాలమయమని.. వాస్తవాలు కళ్లకు కనిపిస్తున్నా ప్రభుత్వం ఇంకా నటిస్తోందని, తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. మీరు నిర్వహించింది ప్రతిభగల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే డీఎస్సీ కాదని, అది ఉద్యోగాలను అమ్మకానికి పెట్టిన దళారు ల సెలక్షన్ కమిటీ అని నినాదాలతో హోరెత్తించింది. ప్రదర్శన, ధర్నా : వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యరంలో చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం కోసం వివిధ ప్రాంతాల నుంచి పార్టీ యువజన శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మిషన్ కాంపౌండ్ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, స్థానిక సమన్వయకర్త నిసార్ అహ్మద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్లతో ర్యాలీ ప్రారంభమైంది. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో కలెక్టరేట్ వద్దకు చేరుకున్నా రు. అక్కడ పోలీసులు అడ్డుకుని గేట్లు వేశారు. తర్వాత కొద్దిమందిని లోపలికి పంపించారు. తర్వాత గంటకుపైగా కలెక్టరేట్ ఎదుట యువజన విభాగం శ్రేణులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు ధర్నా నిర్వహించా రు. అనంతరం డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ విధుల్లో ఉన్న ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ మాధవకృష్ణారెడ్డికి నేతలు వినతి పత్రం అందజేశారు.పరిశీలకురాలు అనీషారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నేతలు శివప్రసాద్రెడ్డి, కిషోర్, కిశోర్కుమార్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి, దావూద్, కౌషిక్, వాసుదేవరెడ్డి, షేక్ ఇర్ఫాన్, ఖాదర్, హేమంత్, ద్వారకనాధరెడ్డి, పవన్, నాగరాజు రెడ్డి, ఆనంద్, శరత్ రెడ్డి, అశోక్, యూనిస్, ఫిరోజ్, ఆనంద్ రెడ్డి, చక్రధర్, గౌతం, భాస్కర్, బాలాజీ పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్లో ప్రధాన బుకీ అరెస్ట్
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో కడప తాలూకా పీఎస్ సీఐ పి.నరసింహరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ మహమ్మద్రఫీ తమ సిబ్బందితో కలిసి ప్రధాన క్రికెట్ బుకీ ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డిని ఆదివారం రాత్రి అక్కాయపల్లి శాస్త్రి నగర్లో అరెస్ట్ చేశారు. సోమవారం కడప డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని అక్కాయపల్లె శాస్త్రినగర్లో ప్రధాన నిందితుడు ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డి ఇంటిలో కడప తాలూకా సీఐ నరసింహరాజు తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశారు. నిందితుడు తన ల్యాప్టాప్, మొ బైల్ ఫోన్లు, వై–ఫై రూటర్ ద్వారా తన సబ్ బుకీలైన వారికి యూజర్ ఐడీలు, యూఆర్ఎల్ లింకులు పంపించి, వాటి ద్వారా ప్రజల నుంచి డబ్బును స్వీకరిస్తూ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే కస్టమర్లను ప్రోత్సహించేందుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని 12 విలువైన మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ వుంచినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద నుంచి రూ.7,00,550 నగదు, ల్యాప్టాప్, ఐదు మొబైల్ ఫోన్లు, ఒక వైఫై రూటర్, నగదు కౌంటింగ్ మిషన్, 12 ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డిని నడిపిస్తున్న ప్రధాన నిర్వాహకుడు, మోడమీదపల్లెకు చెందిన అంబవరం మాధవరెడ్డి అలియాస్ మోడమీదపల్లె మాధవరెడ్డి, పులివెందులకు చెందిన నరేష్, గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గోల్డ్ శేఖర్, చెన్నూరుకు చెందిన గుగ్గిళ్ల చాణక్య, రెడ్డెయ్యరెడ్డి, హరినాథ్ అలియాస్ శ్రీహరి, ఆమంచి కళ్యాణ్ చక్రవర్తి, షేక్ ఇంతియాజ్, జయప్రకాష్ అలియాస్ చంటితోపాటు ఇంకా కొంతమంది ఉన్నట్లు వెల్లడైందని డీఎ స్పీ తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
దొంగ అనుకుని చితకబాదిన గ్రామస్తులు
పుంగనూరు : దొంగ అనుకుని ఓ వ్యక్తిని గ్రామస్తులు చితకబాదిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఆదివారం మండలంలోని దిగువపల్లెలో బోరుబావుల వద్ద కేబుల్ వైర్లు దొంగతనం చేస్తున్నాడని రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లెకి చెందిన బాబాసాహెబ్ను గ్రామస్తులు వైర్లు, కర్రలతో తీవ్రంగా చితకబాదారు. ఈ దాడిలో బాబాసాహెబ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఢీకొన్న కారుమదనపల్లె టౌన్ : బైక్పై వెళ్తున్న రైతును ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ములకలచెరువు సీఐ ప్రతాప్ ఆదివారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం గందోడిపల్లికి చెందిన రైతు రెడ్డప్పరెడ్డి(55) అన్నమయ్య జిల్లా పి.కొత్తకోటలో వ్యాపారులు అప్పుగా తీసుకున్న ఎరగ్రడ్డల డబ్బు వసూలు చేసుకుని రావడానికి బైక్పై బయలుదేరాడు. మార్గంమధ్యలోని పులికల్లు మిట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతు రెడ్డప్పరెడ్డిని ములకలచెరువు 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైతు మృతి -
ఉపాధి కూలీని కాటేసిన పాము
పెద్దమండ్యం : పాముకాటుతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని దిగువపల్లె పంచాయతీ తుమ్మలవంకతండాలో ఆదివారం జరిగింది. వివరాలలోకి వెళితే.. తుమ్మలవంకతండా సమీపంలో యర్రకోటాల బండ వద్ద జలధార ఫీడర్ ఛానల్ పూడికతీత పనులను తండాకు చెందిన కూలీలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఈ పనులు చేస్తుండగా మూడే వెంకటరమణ నాయక్ భార్య సుశీలమ్మ(65) పాముకాటుకు గురైంది. దీంతో ఆమె అక్కడే కుప్పకూలడంతో కూలీలు హుటాహుటిన చికిత్సల కోసం తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్ ఆమె అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. పాముకాటుతో కూలీ మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఉపాధి కూలీలు అధికారులను కొరారు. శివాలయంలో కొండ చిలువ కలకలంముద్దనూరు : మండల పరిధి చింతకుంట గ్రామంలోని కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండచిలువను చూసిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం గ్రామస్తులే కొండచిలువను కొండలో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.వృద్ధురాలి మృతి -
హార్సిలీహిల్స్పై సండే సందడి
సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. కుటుంబాలతో వచ్చిన పర్యాటకులు సందడి చేస్తూ.. పిల్లలు, పెద్దలు ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులకు సెలవులు ఉండటం, బక్రీద్ అనంతరం వచ్చిన ఆదివారం కావడంతో రద్దీ అధికంగా నెలకొంది. పర్యాటకులు ప్రకృతి సందర్శన ప్రాంతాలైన గాలిబండ వ్యూ పాయింట్లు, అటవీశాఖ పర్యావరణ సముదాయంలో ప్రకృతి అందాలను తిలకించారు. అటవీశాఖ పార్కులో చిన్నారులు సందడి చేశారు. ప్రకృతి అధ్యయన కేంద్రం తిలకించి అటవీ విషయాలను తెలుసుకున్నారు. జిల్లాతోపాటు శ్రీ సత్యసాయి, అనంతపురం, కడప, చిత్తూరు, కర్ణాటక, తమిళనాడుకు చెందిన పర్యాటకులు సేద తీరేందుకు వచ్చారు. రద్దీ కారణంగా కొండ రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. -
జిల్లా హాకీ జట్టు ఎంపిక
మదనపల్లె సిటీ: స్థానిక బీటీ కాలేజీ హాకీ క్రీడా మైదానంలో ఆదివారం జిల్లా సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు జరిగాయి.జిల్లా నలుమూలల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపిక కమిటీలో జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, సీనియర్ హాకీ క్రీడాకారుడు ఆసిఫ్ సభ్యు లుగా వ్యవహరించారు. తుది జట్టు వచ్చేవారం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారు జూన్ 12 నుంచి 15 వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగే రాష్ట్ర సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. కార్యక్ర మంలో డీఎస్డీఓ చంద్రశేఖర్, హాకీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జలజ, సీనియర్ హాకీ క్రీడాకారుడు హితేష్రావు, ఆసీఫ్, పిట్టు, రెడ్డి పాల్గొన్నారు. సాక్షి, మదనపల్లె: జిల్లాలో విద్యుత్ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం దృష్టికి తీసుకురావాలని డిస్కం జిల్లా ఎస్ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి వినియోగదారులు ఫోన్ ద్వారా తమ సమ స్యలను తెలియజేయాలని కోరారు. 94408 17449 నంబర్కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కురబలకోట: అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో టాప్ 20 కళాశాలగా ట్రిపుల్ ఏ రేటింగ్ లభించినట్లు ప్రిన్సిపాల్ రామనాథన్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎన్పీటీఈఎల్ ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు, అధ్యాపకులు 7484 మంది ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. కళాశాలకు టిపుల్ ఏ రేటింగ్తో పాటు టాప్ 20లో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో ఒకటో ర్యాంకు గుర్తింపు లభించినట్లు చెప్పారు. ఎన్పీటీఈఎల్ ద్వారా కళాశాలకు విశిష్ట గుర్తింపు లభించడం పట్ల చాన్స్లర్ డాక్టర్ నాదెళ్ల విజయ భాస్కర్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. -
నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతును సకాలంలో ఆసుపత్రికి తరలించడంతోపాటు, ఆయన వద్ద ఉన్న సుమారు లక్ష రూపాయల నగదును కుటుంబ సభ్యులకు అప్పగించి మొలకలచెరువు 108 సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం గందోడిపల్లికి చెందిన రైతు రెడ్డిప్పరెడ్డి(55) అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలోని వ్యాపారులకు అప్పుగా ఇచ్చిన ఎరగ్రడ్డల డబ్బు వసూలు చేసుకునేందుకు వస్తుండగా, మార్గ మధ్యంలోని పులికల్లు మిట్ట వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న మొలకలచెరువు 108 సిబ్బంది మధుసూదనరెడ్డి, శబరీష్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రైతు రెడ్డిప్పరెడ్డి మృతి చెందాడు. ప్రమాద స్థలంలో రైతు వద్ద లభించిన సుమారు లక్ష రూపాయల నగదును 108 సిబ్బంది భద్రపరిచి, మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు కృషి చేయడమే కాకుండా, నగదును నిజాయితీగా అప్పగించిన 108 సిబ్బందిని స్థానికులు, బాధిత కుటుంబీకులు అభినందించారు. -
అయ్యో.. అప్పుడే నూరేళ్లు నిండాయా!
● కారు ఢీకొని బాలుడి మృతి ● కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులుకేవీపల్లె : ‘అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండాయా’ అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మండలంలోని కలికిరివాండ్లపల్లె వద్ద ఆదివారం కారు ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలిలా వున్నాయి. మదనపల్లెకు చెందిన ప్రసాద్ కుమారుడు త్రినేష్(6) కలికిరివాండ్లపల్లెలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం త్రినేష్ రోడ్డుపైకి రావడంతో పీలేరు నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ త్రినేష్ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అక్కడికి బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మల్లయ్యకొండకు బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6, 6.30 గంటలకు బస్సులు బయలుదేరతాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయని తెలిపారు. సాక్షి, మదనపల్లె: స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం(పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఫిర్యాదులను అధికారులు స్వీకరిస్తారని తెలిపారు.సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో కూడా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది.అమ్మా..కరుణించమ్మా అని వేడుకున్నారు. అర్చకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి చీరసారె సమర్పించి భక్తి చాటు కున్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. -
మాలేపాడులో రోడ్డు దిగ్బంధంతో ఉద్రిక్తత
మదనపల్లె టౌన్ : మదనపల్లి మండలంలోని మాలేపాడులో టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దారి, భూ వివాదాల కారణంగా టీడీపీలోని ఓ వర్గానికి చెందిన మధుకర్రెడ్డిని పొలాల్లో ఉండే కాయలు కోయనీయలేదని.. అదే పార్టీకి చెందిన మరో వర్గంలోని జాఫర్ బాషా దారి నిలేశాడు. ఇప్పుడు మధుకర్రెడ్డి రహదారిని మూసి జాఫర్ బాషాను రాకుండా రోడ్డు దిగ్బంధం చేయడంతో వివాదం తలెత్తి ఆదివారం ఉదయం రెండు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో మాలేపాడులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మాలేపాడుకు చేరుకుని గొడవలు జరగకుండా సర్ది చెప్పి రెండు వర్గాలకు దారి సమస్య పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మాట్లాడించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వివాదం సద్దుమణిగింది. -
ఓట్ల తొలగింపును అడ్డుకుంటాం
రాయచోటి అర్బన్: ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఎల్ఏలు కీలకమని, ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనని, అక్రమంగా చేస్తున్న ఓట్ల తొలగింపును అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)లో బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ)ల పాత్ర కీలకమైనదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అక్రమంగా చేపట్టిన ఓట్ల తొలగింపు ప్రక్రియను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓట్లు జాబితాలో ఉండేలా నిబద్ధతతో పని చేయాలని బీఎల్ఏలకు సూచించారు. ఇతర పార్టీలు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులతో అభ్యంతరాలు ఉంటే తక్షణమే నిబఽంధనల ప్రకారం సంబంధిత బూత్ లెవల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అర్హుల ఓటు తొలగకుండా, అనర్హుల పేర్లు చేర్పులు జరగకుండా చూడాలన్నారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫారం–6,7 తో పాటు జాబితాలో దొంగ ఓటర్లను ఎలా గుర్తించాలి, అర్హత ఉన్నప్పటికీ ఓటర్లను ఉద్దేశపూర్వకంగా ఎలా తొలగిస్తారు అనే విషయాలను స్క్రీన్పై వివరించారు. ప్రతి ఓటు ఎంతో విలువైనది, ఒక్క గ్రామంలో ఒక్క ఓటు, మండలం, నియోజకవర్గ స్థాయికి చేరేసరికి వేలల్లో మార్పు చూపుతుందని, అది గెలుపును ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల అయ్యేవరకు జాగ్రత్తగా, బాధ్యతగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలనను కొనసాగిస్తోందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ఇటీవల నిర్వహించిన మహానాడులో వైఎస్ జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారనే కానీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించ లేదన్నారు. రెండేళ్ల పాలనలో వారు చెప్పుకునేదానికి ఏ సంక్షేమ, అభివృద్ధి పథకం లేవన్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తీసేసి, ఈ ప్రాంత ప్రజల కలలను చిదిమివేశారని ఆయన ధ్వజమెత్తారు. ● త్వరలో రాబోయే స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా తోడుగా, అండగా ఉంటామని శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత జగన్ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకుని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, రాయచోటి మున్సిపల్ మాజీ చైర్మన్ ఫయాజ్ బాషా, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు , మాజీ ప్రజాప్రతినిధులు , బూత్ కమిటీ ఏజంట్లు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి అర్హులైన వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను పోగొట్టుకోకుండా చూడాలి. ఎస్ఐఆర్ జరిగిన ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్లు, మధ్యప్రదేశ్లో 34లక్షలు, గుజరాత్లో 68లక్షలు, తమిళనాడులో 74లక్షలు, పశ్చిమబెంగాల్లో 91లక్షల ఓట్లు తొలగించారు. అందువల్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. దీన్ని బీఎల్ఏలు క్షుణ్ణంగా పరిశీలించి తగిన విధంగా ఎదుర్కోవాలి. – ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు బీఎల్ఏలు సైనికుల్లా పని చేయాలి వైఎస్సార్సీపీ బీఎల్ఏలు నెల రోజుల పాటు సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ అనుంబంధ సంఘాలతో సమన్వయం చేసుకుని పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగకుండా కృషి చేయాలి. ఇప్పటి వరకు గమనిస్తే ఎస్ఐఆర్ జరిగిన అన్ని రాష్ట్రాల్లో భారీగా ఓట్ల తొలగింపు జరిగింది. రాబోవు అన్ని రకాల ఎన్నికలను సమర్థఽవంతంగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలి. – సురేష్ బాబు, వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంటరీ పరిశీలకులు ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమ్మరీ రివిజన్ , ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ల గురించి రీసోర్స్ పర్సన్ , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి వివరించారు. ఎస్ఐఆర్లో రెండు ఫేజ్లు ప్రీ ఎన్యూమరేషన్, ఎన్యూమరేషన్లు ఉంటాయన్నారు. ప్రీ ఎన్యూమరేషన్లో బీఎల్ఓలు 2025 ఓటరు జాబితాను 2002 ఓటరు జాబితాతో అనుసంధానం చేస్తారని తెలిపారు. ఎన్యూమరేషన్లో 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ అయిన వారికి ఫారం వివరాలతో ఫ్రీ ఫిల్డ్గా వస్తుందని, వారు కేవలం ఫొటో అంటించి , సంతకం చేసి బీఎల్ఓకు ఇవ్వాలన్నారు. మ్యాపింగ్ కాని వారికి వారు ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు నింపి , బంధుత్వ ఆధారాలు, అవసరమైన పత్రాలు సమర్పించాలన్నారు. మ్యాపింగ్ నిరూపించుకోలేని వారు ప్రభుత్వం నిర్దేశించిన 13 పత్రాలలో ఏవైనా రెండు సమర్పించాలన్నారు. బీఎల్ఏలు, స్థానిక నాయకులు ప్రతి ఇంటినీ సందర్శించి , ఓటర్లలందరికీ పాస్ పోర్టు సైజ్ ఫొటోతో పాటు గుర్తింపు కార్డును రెడీగా పెట్టుకోమని చెప్పాలని ఆమె సూచించారు. బీఎల్ఏ రోజుకు 50 ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించవచ్చునన్నారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, అన్నమాచార్య కరస్పాండెంట్ ఎల్లారెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కమిటీ సభ్యులు జల్లా సుదర్శన్ రెడ్డి, యధుభూషణ రెడ్డి, రాయలసీమ ఇన్చార్జి నరసింహారెడ్డి, సర్కాజీ, చిదంబర్ రెడ్డి తదితరులు బీఎల్ఏలకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
●పట్టుబడిన బియ్యమే సాక్ష్యం
సాక్షి, మదనపల్లె: జిల్లా నుంచి కర్ణాటకకు నిత్యావసర బియ్యం పక్కదారి పడుతోంది. గతంలో జరిగిన దాడుల్లో ఈ విషయం వెలుగుచూసింది. అయితే దీనిపై జిల్లా స్థాయిలో దాడులు, తనిఖీలు తగ్గడమేకాక కఠినమైన చర్యలు లేకపోవడంతో అక్రమంగా తరలిపోతున్న బియ్యాన్ని కట్టడిచేసే మార్గాలు లేకపోతున్నాయి. ప్రధానంగా మదనపల్లె, బి.కొత్తకోట, బురకాయలకోట కేంద్రాలుగా రేషన్బియ్యం దందా దర్జాగా సాగుతోంది. పేదలకు నిత్యవసర చౌకడిపోల ద్వారా కిలో బియ్యం రూపాయికే పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం అక్రమ వ్యాపారులకు ప్రధాన వనరుగా మారింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజమార్గంలో చేస్తున్న అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన విజిలెన్న్స్, పౌరసరఫరాల శాఖలు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా అక్రమ వ్యాపారులు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. వ్యక్తుల ద్వారా సేకరణ మదనపల్లె, బి.కొత్తకోటల్లో అక్రమ రేషన్బియ్యం నిల్వ గోదాములు నిర్వహిస్తుండటం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బంగార్పేట, కోలారు ప్రాంతాలకు, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలానికి చెందిన వ్యక్తులు తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల నుంచి రేషన్బియ్యాన్ని సేకరిస్తుంటారు. అక్రమ బియ్యం రవాణా చేస్తున్న వ్యాపారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల ద్వారా ఆయా ప్రాంతాలనుంచి పేదలకు రేషన్బియ్యం కిలోకు రూ.10 నుంచి రూ.14 వరకు చెల్లిస్తామని ఆశచూపి సేకరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సేకరించిన బియ్యాన్ని ఆటోలు, రవాణా వాహనాల్లో బి.కొత్తకోట, మదనపల్లెల్లోని గోదాములకు తరలించి, రాత్రివేళల్లో కర్ణాటక సరిహద్దును దాటించి ఆ రాష్ట్రంలోని బంగారుపేట మిల్లులకు తరలిస్తున్నట్టు సమాచారం. అక్కడి మిల్లుల్లో బియ్యానికి పాలిష్ చేసి కొత్త బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి వాటిని తిరిగి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో 4,29,269 రేషన్ కార్డులు జిల్లాలో మొత్తం 4,29,269 నిత్యావసర రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మదనపల్లె నియోజకవర్గంలో 89,668 కార్డులు, పీలేరు నియోజకవర్గంలో 88,589, పుంగనూరు నియోజకవర్గంలో 68,410, రాయచోటి నియోజకవర్గంలో 96,626, తంబళ్లపల్లె నియోజకవర్గంలో 85976 కార్డులు ఉన్నాయి. అలాగే జిల్లాలో మొత్తం 992 నిత్యావసర చౌక ధరల డిపోలు నడుస్తున్నాయి. వాటిలో మదనపల్లెలో 164, పీలేరులో 258, పుంగనూరులో 159, రాయచోటిలో 208, తంబళ్లపల్లెలో 203 చౌక డిపోలు ఉన్నాయి. ఈ రేషన్ కార్డులకు ప్రతినెల చౌక డిపోల ద్వారా 6481.789 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కనుమరుగైన దాడులు ప్రభుత్వం పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలు, రవాణాపై విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ బృందాల దాడులు కరువయ్యాయి. ఒకవేళ దాడులు చేసిన చౌకడిపోల్లో నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టేస్తున్నారు. బి.కొత్తకోటలో గతవారం ఒక చౌకడిపో నుంచి బియ్యాన్ని వాహనంలో తరలిస్తున్న వ్యవహారం బట్టబయలైంది. ఇలాంటి ఘటనలు సాగుతున్నా దాడులు లేవు. దీనిపై సరైన చర్యలు చేపట్టాల్సి ఉంది. మదనపల్లె, బి.కొత్తకోట కేంద్రాలుగా కర్ణాటకకు భారీగా తరలిపోతున్న సబ్సిడీ బియ్యం సరిహద్దులో తనిఖీలు నామమాత్రం దాడులు మరచిన విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. మదనపల్లె రూరల్, రామసముద్రం, బి.కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం మండలాల సరిహద్దుల్లో గతంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వీటిని తొలగించడంతో ఇప్పుడు ఈ మార్గాల్లో వెళ్లే అక్రమ బియ్యం వాహనాలను తనిఖీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. మదనపల్లె సమీపంలో చీకలబైలు వద్ద ఎకై ్సజ్, మార్కెటింగ్శాఖ చెక్ పోస్టులు ఉన్నప్పటికీ పౌరసరఫరాల శాఖ చెక్ పోస్ట్ లేదు. అక్రమ బియ్యంపై ఈ శాఖల ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. దీంతో పగలు రాత్రి తేడా లేకుండా బియ్యం కర్ణాటక బాట పడుతోంది. మూడేళ్లక్రితం బి.కొత్తకోట కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై అప్పటి ఎస్ఐ రామమోహన్ దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 6.5 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమో దు చేశారు. ఇదే గోదాముపై దాడిచేసిన రెవెన్యూ అధికారులు 20 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మదనపల్లెలోని ఈశ్వరమ్మకాలనీ, ఇండిస్ట్రీయల్ ఎస్టేట్లోని రెండు రైస్మిల్లుల్లో రేషన్ బియ్యం పట్టుబడింది. గతవారం బి.కొత్తకోటలో ఓ చౌకదుకాణం నుంచి తరలిస్తుండగా 22 బస్తాల బియ్యం పట్టుబడింది. మదనపల్లె రైస్మిల్లులో రేషన్ బియ్యం పట్టుబడిందంటే ఈ దందా ఎంత యథేచ్ఛగా సాగుతోందో అర్థమవుతుంది. గతేడాది రెడ్డీస్ కాలనీలో 150 క్వింటాళ్లకుపైగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఎక్కడెక్కడ గోదాములు నిర్వహిస్తున్నారో తెలిసినా ఎందుకు పట్టించుకోకపోవడం వెనుక కారణ మేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. పోలీసులు ఒకసారి కర్ణాటక వ్యాపారిపై కేసు నమోదు చేయగా, మళ్లీ అదేవ్యక్తి గోదాము నుంచి రెవెవెన్యూ అధికారులు రేషన్బియ్యం సాధ్వీనం చేసుకొన్నారు. అయితే ఈ అక్రమ దందాను మాత్రం నిలువరించలేకపోతున్నారు. -
మృతదేహంతో రోడ్డెక్కిన కుటుంబ సభ్యులు
● న్యాయం చేయాలని డిమాండ్ ● అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వెల్లడికలకడ : తమ వాడిని కొట్టి చంపారని, పోలీసులు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డెక్కారు. కలకడ మండలం కె.బాటవారిపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన రామానాయక్ కుమారుడు బాబునాయక్(48) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాబునాయక్ మృతి పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని మృతుడి భార్య శంకరమ్మ, కుటుంబ సభ్యులు.. మృతదేహంతో చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై కె.బాటవారిపల్లె బిసి కాలనిలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గంట సమయం పైగా రోడ్డుపై రాకపోకలను నిలిపి వేశారు. ఈ సమస్యపై స్పందించిన కలకడ పోలీసులు న్యాయం చేస్తామని పోస్ట్మార్టం ఆధారంగా కేసు ముందుకు సాగుతుందని తెలిపినా మృతుడి బంధువులు వినలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న కేవీపల్లె ఎస్ఐ బీవీ శివకుమార్ అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
చెరువులో పడి వ్యక్తి మృతి
మదనపల్లె టౌన్ : దుస్తులు ఉతకడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మదనపల్లె మండలం సీటీఎం కొత్తపేటకు చెందిన బాలాజీ(45) ఆదివారం చిన్నతిప్పసముద్రం చెరువుకు బట్టలు ఉతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పొరపాటున లోతైన నీటిలో పడి మునిగి పో యాడు. గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానికులు తాలూకా పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప ఫైర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలాజీ మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణంచిన్నమండెం : మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం మల్లూరు క్రాస్ సమీపంలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని విజయనగరం రమణమ్మ(35) అనే మహిళ దుర్మరణం చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన విశ్వనాథ్ సతీమణి రమణమ్మ సొంత పనుల నిమిత్తం రాయచోటికి వెళ్లేందుకు మల్లూరు క్రాస్ వద్దకు వెళ్తుండగా.. కొండారెడ్డి మామిడి తోట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వ్యక్తి ఆత్మహత్యాయత్నం చౌడేపల్లె : కుటుంబ కలహాల కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం మండలంలోని పరికిదొనపంచాయతీ నుంజార్లపల్లెలో చోటుచేసుకుంది. స్థానికుల కథథనం మేరకు... వెంకటచలపతినాయుడు(49)కు కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెంది గడ్డి నివారణ మందు తాగి అపస్మారస్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నైతిక విలువలు, వృత్తి నైపుణ్యాలతో విశ్వసనీయతకడప సెవెన్రోడ్స్ : జర్నలిజంలో నైతిక విలువలు, వృత్తి నైపుణ్యం, కచ్చితత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవడం ద్వారా మీడియా పట్ల ప్రజల్లో విశ్వాసం బలపడుతుందని రాష్ట్ర సీఆర్ మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణ విలేకరులకు నిర్వహించిన రెండు రోజుల పునశ్చరణ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. అన్నమయ్య జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పురుషోత్తం, సీనియర్ జర్నలిస్టు కొర్రా విజయ్కుమార్, తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు జనార్దన్, కర్నూలుకు చెందిన డెస్క్ సీనియర్ జర్నలిస్టు నవీన్కుమార్ చౌదరి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రామసుబ్బారెడ్డి, సమాచార పౌరసంబంధాల ఏడీ పద్మజ, పెద్ద సంఖ్యలో విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డులో రైతుపై దాడి
పుంగనూరు : మార్కెట్ యార్డులో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ , రైతులపై దాడులు చేస్తుండటంతో.. వారు శనివారం రాత్రి మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి, ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం మిట్టచింతవారిపల్లెకి చెందిన రైతు వెంకటరమణ రాత్రి 10 గంటల సమయంలో టమాటాలు ట్రాక్టర్లో వేసుకుని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న లారీ డ్రైవర్ ట్రాక్టర్కు అడ్డుపెట్టి దూషించడం జరిగింది. దీనిపై రైతు వెంకటరమణ ప్రశ్నించే సమయంలో డ్రైవర్, అతని అనుచరులు కలసి.. వెంకటరమణను కిందకు పడేసి కొట్టి గాయపరిచారు. దీనిపై రైతులు రాత్రి గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. కమీషన్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, అడిగితే ప్రైవేటు వ్యక్తులచే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు అన్సర్బాషా, రమణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులతో సీఐ మాట్లాడారు. దాడి చేసిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని, ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.గేటుకు తాళం వేసి రైతుల ఆందోళన -
కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం!
ప్రకృతి ఒడిలో సేదతీరాలని వెళ్లిన ఆ దంపతులకు, అదే ప్రకృతి కడుపుకోత మిగుల్చుతుందనడానికి ఆ కొండపై ఉన్న ఆ చిన్న సమాధే సాక్ష్యం. సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులో చల్లని గాలులతో మురిపించే హార్సిలీ హిల్స్ వెనుక ఒక శతాబ్దం నాటి గుండె బరువెక్కించే వింత విషాదం దాగి ఉంది.అప్పట్లో ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్గా పనిచేసిన డబ్ల్యూ.డి. హార్సిలీ ఈ కొండను కనుగొని, ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధుడయ్యారు. ఆ మమకారంతోనే తన నిండు గర్భిణి అయిన భార్యను తీసుకుని కొండపై వేసవి విడిదికి వచ్చారు. అంతా సంతోషంగా సాగుతున్న వేళ.. 1864 మే 31న ఆ తల్లి కడుపు పండింది, ఒక పసికందు పుట్టాడు. కొండంత ఆనందంతో ఆ తండ్రి ఉప్పొంగిపోయాడు. కానీ, విధి ఆ సంతోషాన్ని ఒక్క రోజు కూడా నిలవనీయలేదు.పురిట్లోనే ఆ పసిగుండె ఊపిరి ఆగిపోయింది. దీంతో ఆ దంపతుల రోదన కొండ గుహల్లో ప్రతిధ్వనించింది. ఆ బిడ్డకు ‘జార్జ్ హార్సిలీ’ అని నామకరణం చేసి, కొండపై తమకున్న ప్రేమకు గుర్తుగా ఆ పసికందు మృతదేహాన్ని అక్కడే ఖన నం చేశారు. ఇప్పటికీ ఆ చిన్నారి సమాధి.. పర్యాటకులను పలకరిస్తూ ఆనాటి కలెక్టర్ దంపతుల హృదయ వేదనను మౌనంగా కథలుగా చెబుతూనే ఉంది. –సాక్షి, మదనపల్లెనట్టనడుమ ఒక్కరోజు కూడా లేని జీవితం -
● ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వాల్మీకిపురం: ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక షిరిడిసాయి కళ్యాణమండపంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని, ఏజెంట్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను, అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు క్యాడర్ సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లారి తిమ్మారెడ్డి, ఇక్బాల్ అహ్మద్, సతీష్ రెడ్డి, రత్నశేఖర్రెడ్డి, దండు జగన్మోహన్ రెడ్డి, చక్రధర్, ఉదయ్ కుమార్, శివానంద రెడ్డి, కేశవ రెడ్డి, వెంకట్రమణ, రాంపల్లి రమేష్, కమలాకర్ రెడ్డి, ముక్తియార్, రమేష్ రెడ్డి, వెంకట్రమణా రెడ్డి, జమీర్ అలీఖాన్, అప్పల్లా, నక్కా చంద్రశేఖర్, నీళ్లభాస్కర్, శ్రీధర్రాయల్, ఇబ్రహిం, ఇర్ఫాన్, సాధిక్, శివారెడ్డి, జయచంద్ర, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల తొలగింపునకు బాబు కుట్రలు
సాక్షి, మదనపల్లె: ‘సర్’ కార్యక్రమం ద్వారా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, అభిమానుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. ఆ కుట్రలను తిప్పి కొట్టాలని వైఎస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం బి.కొత్తకోటలో తంబళ్లపల్లె నియోజకవర్గం, మదనపల్లెలో నియోజకవర్గ బీఎల్ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఓట్ల తొలగింపుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తారని అన్నారు. సర్ విషయంలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పుంగనూరులో 90 వేల ఓట్ల తొలగింపునకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లలో చాలామంది బెంగళూరు, పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. వారిని స్వగ్రామాలకు రప్పించి ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించాలని కోరారు.సర్ విషయంలో క్యాడర్ను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని అన్నారు. దీనికోసం మాజీ సీఎం వైఎస్.జగన్ పరిశీలకులను పంపి దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ బీఎల్ఏలు ప్రతి బూతులోని ఓటర్లను పరిశీలించాలన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అధికార ంలో ఉన్న పార్టీలు సర్ కారణంగా అధికారం కోల్పోవడమే గాక ఇద్దరు ముఖ్యమంత్రులు ఓటమిపాలయ్యారని గుర్తు చేశారు. ఏపీలో స్థానిక ఎన్నికలను సర్ తర్వాత నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 20 నుంచి 30 ఓట్లు తొలగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటును పరిశీలించాలని కోరారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ తంబళ్లపల్లెను సర్ ద్వారా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. దీనిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ సర్పై అవగాహన కల్పించారు. మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా బూత్ కమిటి అధ్యక్షులు నడివీధి సుధాకర్, పరిశీలకులు అనీషారెడ్డి, బాబ్జాన్, జింకా చలపతి, సీనియర్ నేత శ్రీనాథ్ రెడ్డి, మాజీ చైర్మన్ మనూజ, మాజీ వైస్ చైర్మన్ నూర్ ఆజం, జిల్లా ఉపాధ్యక్షులు పాగొండ ఖలీల్,హరీష్కుమార్ రెడ్డి, కొండా సిద్ధార్థ, రెడ్డిశేఖర్ రెడ్డి, జడ్పిటిసిలు ఉదయ్ కుమార్, రామచంద్రారెడ్డి, ఎస్ఏ కరీముల్లా, షేక్ ఇర్ఫాన్ పాల్గొన్నారు. బి.కొత్తకోటలో జరిగిన సమావేశానికి హాజరైన బీఎల్ఏలు, నాయకులు, మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్రంలో ఆకేపాటి సర్పై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి బీఎల్ఏల శిక్షణలో రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి,జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి -
ప్రజలకు చంద్రబాబుపై అపనమ్మకం
రాజంపేట: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అపనమ్మకం ఏర్పడిన పరిస్ధితులు నేడున్నాయని, గత ఎన్నికల్లో ఓటువేశామని బాధపడుతున్నారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి విమర్శించారు. శనివారం మేడాభవన్లో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారన్నారు. టీడీపీ రెండేళ్లపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని గుర్తుచేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా చంద్రబాబు పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండేళ్ల పాలన మోసపూరితమని, ప్రజలకు వెన్నుపోటు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. మండల, నియోజకవర్గ స్ధాయిలో నిరసనలు జయప్రదం చేయాలన్నారు. వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. స్ధానికసంస్ధలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో నందలూరు మండలాధ్యక్షుడు మేడా విజయభాస్కర్రెడ్డి, నందలూరు వైఎస్సార్సీపీ కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కలీం,మోదుగల చంద్రశేఖర్, రాజశేఖర్రెడ్డి, గంగినాయుడు, మోహన్రెడ్డి, నాగసుబ్బయ్య, సోమిశెట్టి ప్రభాకర్,ఆల్విన్ విజయుడు, మహిళనాయకురాలు పల్లెమాధవి,మైనార్టీ ప్రతినిధులు షాజహాన్, జుల్ఫీకర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మేడారఘునాథరెడ్డి -
టెట్ మినహాయింపునకు చట్ట సవరణ చేయాలి
సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 20 నుంచి 30 సంవత్సరాల కింద ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులను ఇప్పుడు టెట్ పాస్ కావాలంటే కష్టతరమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విద్యాహక్కు చట్టంలో సవ రణలు చేయాలని డిమాండ్ చేశారు. 2010 కు ముందు సర్వీస్లో చేరిన ఉపాధ్యాయులకు, పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. – ఆదిరెడ్డి శ్యామసుందరరెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్లమెంట్లో చట్టం చేయడమే ఏకై క మార్గం టెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే పార్లమెంటులో చట్టం చేయడమే ఏకై క మార్గం. రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం వల్ల లక్ష లాది మంది ఉపాధ్యాయులు గందరగోళంలో పడ్డారు. ఉపాధ్యాయులు ఒకవైపు పాఠ శాలల్లో విద్యా బోధన చేస్తూ, మరోవైపు టెట్ పరీక్షలకు సిద్ధం కావడం ఆచరణలో చాలా కష్టతరం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ జరిగేలా చూడాలి. –మాదన విజయ కుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. -
రాయచోటిని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
రాయచోటి : రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ శాఖ చేపడుతున్న క్లీన్స్వీప్ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి ఎస్సీ కాలనీలోని సాయిబాబా వీధిలో నిర్వహిస్తున్న క్లీన్స్విప్ కార్యక్రమాన్ని ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కాలువలు,డ్రైనేజీలు శుభ్రపరిచే పనులను తనిఖీ చేసి పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇంటింటా చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించాలని, తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించే విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్లలోనే చెత్తను వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కలెక్టర్ కోరారు. రోడ్లు, కాలువలు, ఖాళీస్థలాల్లో చెత్త వేయడం పూర్తిగా మానుకోవాలని తెలిపారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మీకులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాయచోటిలో నలభైరోజులుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా 122 కిలోమీటర్ల డ్రైనేజీలలో 95 కిలోమీటర్లమేర పూడికతీత, శుభ్రపరిచే పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
ఆర్టీసీ బస్సులు ఢీ
– నలుగురికి గాయాలు గాలివీడు: మండలపరిధి అరవీడు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం క్రాస్ సమీపంలో శనివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొ న్న ఘటనలో నలుగురు గా యపడ్డారు. ఈ ఘటనలో గాయత్రి, పూజిత, సోమే శ్వరతో పాటు బస్సు డ్రైవర్ ఎం. తిరుమలయ్య గా యాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మదనపల్లె టౌన్: పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కుటుంబీకులు, వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని కోళ్లబైలు పంచాయతీ, వైఎస్ జగన్ కాలనీలో నివాసం ఉంటున్న మంజునాథ కుమారులు రేవంత్ కుమార్ (15), రంజిత్ (13) స్థానిక నీరుగట్టువారిపల్లెలోని చౌడేశ్వరి కల్యాణ మండపం వద్ద ఉన్న ఆలయానికి పూజ కోసం వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి బైక్పై కాలనీకి వెళ్తుండగా, అమ్మ చెరువుమిట్ట మూడురోడ్ల కూడలి వద్ద మరో బైక్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు.స్థానికులు క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె టౌన్: గుడికి విద్యుత్ దీపాలతో డెకరేషన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె పట్టణం బసినికొండ లో నివాసం ఉంటున్న అరుణ్ (20) పోతపోలు గ్రామం సిద్ధమ్మగారిపల్లెలో ఉన్న రాముల గుడిలో పూజలు జరుగుతుండ టంతో డెకరేషన్ పనుల కోసం వెళ్లాడు. గుడి పైకి ఎక్కి రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరిస్తు ఉండగా ప్రమాద వశాత్తు కాలుజారి కిందపడ్డాడు. దీంతో తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితున్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు, అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుంగనూరు: అతివేగంగా వస్తున్న బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు గాయపడగా , వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బోడినాయునిపల్లెకి చెందిన భానుప్రసాద్ (25), గుట్టపల్లెకి చెందిన రేవంత్(23) ఇద్దరు ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా పట్టణంలోని కొత్తయిండ్లు సమీపంలో ఎదురుగా మదనపల్లె నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భానుప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. రేవంత్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు భానుప్రసాద్ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్కు ఆసుపత్రికి తరలించారు. పిడుగుపాటుతో మహిళ మృతి ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవాలయం సమీపంలో ఉంటున్న కొట్టు అంజనమ్మ(36) పిడుగుపాటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి గాలివాన భీభత్సం సృష్టించింది. చిలంకూరు గ్రామం సమీపంలో పిడుగు శబ్దంతోపాటు మెరుపు రావడంతో అంజనమ్మ ఆ శబ్దానికి గుండె పోటు వచ్చి కుప్పకూలి పోయింది. స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు మహేష్ కూడా ఈ పిడుగు శబ్దానికి కింద పడ్డాడు.అతన్ని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కడప రిమ్స్కు తరలించారు.గాయపడిన రంజిత్, రేవంత్ కుమార్ -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. ములకలచెరువు మండలం, సోంపాల్యం పంచాయతీ, గొడ్డావుల కోటకు చెందిన మంజునాథ భార్య మీనాక్షి (32) కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంటనే ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ములకల చెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పశువుల లారీ సీజ్ మదనపల్లె టౌన్: నిబంధనలకు విరుద్ధంగా 28 పశువులను ఒకే లారీలో ఊపిరి ఆడకుండా కుక్కి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన డ్రైవర్ ఆర్ముగం, క్లీనర్ గౌతమ్ పులివెందుల, కదిరి ప్రాంతాల్లో తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి పలమనేరు వైపు తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి సీటీఎం రోడ్డులోని తట్టివారిపల్లె జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ లారీ పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పశువులను చీకటివారిపల్లె గోశాలకు తరలించి పశువైద్యులతో చికిత్స అందించారు. కేసు నమోదు చేసి అక్రమ రవాణా వెనుక ఉన్నవారిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు తెగిన చేయి వాల్మీకిపురం: పాడిఆవులకు పచ్చిగడ్డిని యంత్రంతో కత్తరిస్తుండగా అందులో రైతు చేయి చిక్కుకుపోయి ప్రమాదవశాత్తు తెగిపోయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు..పట్టణానికి చెందిన రమేష్బాబు (48) కొంత భూమిని కౌలుకు తీసుకొని అందులో పశువులకు మేత వేసుకొని పాడి ఆవులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం పశువుల మేతను కత్తిరించేందుకు యంత్రంలో గడ్డి వేసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు రైతు కుడి చేయి యంత్రంలో చిక్కుకొని తెగిపోయింది. కుటుంబ సభ్యులు బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు మదనపల్లెకు రెఫర్ చేశారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో శస్త్ర చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
కలకడ : కలకడ మండలం, కె.బాటవారిపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన రామానాయక్ కుమారుడు బాబునాయక్ (48) అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. కేవీపల్లె ఎస్ఐ బీవీ శివకుమార్ కథనం మేరకు..బాబునాయక్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం మద్యం తాగడానికి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. శనివారం ఉదయం బాబునాయక్ భార్య శంకరమ్మ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. శనివారం ఉదయం చిత్తూరు–కర్నూలు జాతీయరహదారి పక్కన కె.బాటవారిపల్లె బస్స్టాప్ ఎదురుగా ఉన్న కార్పెంటర్దుకాణం(కొయ్యలమిషన్) వద్ద బాబునాయక్ మృతిచెంది ఉండటం గుర్తించి కలకడ పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన మల్లేష్, రెడ్డెప్ప లతో కలిసి తన భర్త మద్యం తాగినట్లు తెలిసిందని, ఆయన మృతిపట్ల తనకు అనుమానాలు ఉన్నాయని శంకరమ్మ పోలీసలకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఎస్ఐ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.బాబునాయక్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఆరు దశాబ్దాల బంధానికి అరుదైన ముగింపు !
రాజంపేట: రైల్వే చరిత్రలో చారిత్రాత్మక అధ్యాయం మొదలుకానుంది. అక్టోబరు 2, 1966లో ఆవిర్భవించిన దక్షిణ మధ్య రైల్వేతో కడప రైల్వే విభాగానికి ఉన్న ఆరు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది . కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్ర కారం, జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దేశంలోనే 18వ జోన్గా ఏర్పాటైన దక్షిణకోస్తా రైల్వేజోన్ పరిపాలన అధికారికంగా ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు సికింద్రాబాద్తో ఉన్న జోన్ బంధం వీడి, ఇకపై విశాఖ జోన్తో కొత్త ప్రస్థానం మొదలవుతుంది. ఏపీ విభజన చట్టం హామీల మేరకు వైజాగ్ రైల్వే జోన్ పురుడు పోసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కొత్త జోన్ ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో శాశ్వత భవన నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, తాత్కాలికంగా ఎంపిక చేసిన ‘డెక్’ భవనంలో జోనల్ ఆఫీసును ఏర్పాటు చేశారు. జూన్ 1న ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సాధారణంగానే ఈ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కొత్త జోన్లోనూ కడపకు అన్యాయమేనా..? విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జోన్పై కడప జిల్లా వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ, జిల్లా రైల్వే రంగంలో దశాబ్దాలుగా నలుగుతున్న పెండింగ్ సమస్యలు ఎటూ తేలడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్లో ప్యాసింజర్ రైళ్లు నడిపించాలనే డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. దశాబ్దాల కల అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్ పనులు పెండింగ్లోనే ఉండిపోయాయి. ముద్దనూరు–ముదిగుబ్బ, కంభం–ప్రొద్దుటూరు, భాకరాపేట–గిద్దలూరు రైలుమార్గాలు కేవలం సర్వేలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రమైన కడప రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తామన్న హామీ మూలనపడింది. ఒకప్పుడు అత్యంత కీలక కేంద్రమైన నందలూరులో ప్రత్యామ్నాయ రైల్వే పరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. కనీసం అన్ని రైళ్లకు ఇక్కడ వాటరింగ్ సదుపాయం కల్పించే ప్రతిపాదన కూడా పెండింగ్లో పడింది. కొత్త జోన్ కేంద్రమైన విశాఖపట్నానికి వెళ్లేందుకు జిల్లా వాసులకు కనీసం ఒక్క ప్రత్యక్ష రైలు కూడా అందుబాటులో లేదు. కొత్త జోన్కు వెళ్లే ఏకై క రైలు తిరుమల ఎక్స్ప్రెస్ మాత్రమే కావడం, అది ఎప్పుడూ రద్దీగా ఉండటంతో జిల్లా ప్రజలు, రైల్వే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. జిల్లా మీదుగా ఇప్పటివరకు కనీసం ఒక్క వందేభారత్ రైలు కూడా నడపలేదు. ఆదాయానికి గండి.. బదిలీల తర్జనభర్జనలు కొత్తగా ఏర్పాటు కాబోతున్న దక్షిణ కోస్తా జోన్ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ఈస్ట్కోస్ట్ పరిధిలోని అత్యంత కీలకమైన ’కెకె లైన్’ (కోరాపుట్–కిరండూల్ లైన్) తిరిగి ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలోనే ఉండిపోవడంతో దాదాపు రూ. 9,950 కోట్ల ఆదాయాన్ని కొత్త జోన్ నష్టపోతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కొత్త జోన్కు రూ. 25 వేల కోట్ల ఆదాయం ఉండాల్సి ఉండగా, ఈ మార్పుల వల్ల రూ. 17,500 కోట్ల ఆదాయం మాత్రమే ఉంటుందని అంచనా. మరోవైపు, జోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల వ్యవహారంపై రైల్వే శాఖలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వీటిపై డీఆర్ఎంలతో రైల్వేబోర్డు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కొందరు ఉద్యోగులు తెలంగాణా ప్రాంతంలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. సదరన్ రైల్వే జోన్లో భాగంగా 1956లో ఏర్పాటైన గుంతకల్ డివిజన్, అక్టోబరు 2, 1977లో దక్షిణ మధ్య రైల్వే జోన్లో విలీనమైంది. ఇప్పుడు దక్షిణకోస్తా జోన్లోకి వెళ్లడంతో దీని సరిహద్దుల్లో పలు మార్పులు చేర్పులు జరిగాయి. రేపటి నుంచే దక్షిణకోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు సికింద్రాబాద్ వీడి.. విశాఖ ‘డెక్’భవనం గూటికి కడప రైల్వే ఆదాయం కోల్పోవడంపై విమర్శలు సీమ రైల్వేలకు న్యాయం చేయాలని ఎంపీల డిమాండ్ కృష్ణపట్నం–ఓబులవారిపల్లె ప్యాసింజర్ లైన్, కడప–బెంగళూరు ప్రాజెక్టులపై జిల్లా వాసుల ఆశలు కొత్తగా ఏర్పాటైన దక్షిణకోస్తా జోన్కు రావలసిన ఆదాయాన్ని రాబట్టడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ జోన్కు రావాల్సిన భారీ ఆదాయం ఈస్కోస్ట్ జోన్లోకి వెళ్లిపోయింది. ఈ విషయమై లోక్సభలో కూడా ప్రస్తావించాను. తిరుపతి కేంద్రంగా బాలాజీ (తిరుపతి) డివిజన్ చేయాలన్న డిమాండ్ను నెరవేర్చకుండానే జోన్ను ప్రారంభించడం బాధాకరమని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. – పీవీ మిథున్రెడ్డి, రాజంపేట ఎంపీ దక్షిణ మధ్య రైల్వే నుంచి 60 ఏళ్ల తర్వాత విడిపోయి దక్షిణకోస్తా రైల్వేలోకి బదిలీ అయిన రాయలసీమ రైల్వేలకు ఇప్పుడైనా పూర్తి న్యాయం చేయాలి. వైఎస్సార్ కడప జిల్లా మీదుగా కొత్త రైళ్లను తీసుకురావాలి. వైఎస్సార్ మానసపుత్రిక అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీమ రైల్వే ధిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైలు మార్గాలను పూర్తి చేసే దిశగా నూతన ఎస్సార్ యాజమాన్యం ఆలోచన చేయాలి. అలాగే తిరుపతి డివిజన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు -
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ మూల విరాట్లకు పంచామృతాభిషేకం జరిపారు.టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి మూలవిరాట్లను గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. వేంపల్లె : మండల పరిధి నాగూరు గ్రామంలోని హరిజనవాడకు చెందిన గ్రీన్ అంబాసిడర్ వేమా నాగన్న (55) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసు లు తెలిపారు. వేమా నాగన్న విధుల్లో భాగంగా ఈ నెల 27న మూడు చక్రాల రిక్షాపై నాగూరుకు బయలు దేరారు. మార్గం మధ్యలో రిక్షా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వివరించారు. ఆయనకు భార్య మేరీ సువర్ణ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య విద్యలో విద్యార్థి ప్రతిభ కడప సెవెన్రోడ్స్ : కడపకు చెందిన వసంత్ మౌని విహంత్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్లో ప్రతిభ చాటారు. ఈ పరీక్షలో ఆయన అఖిల భారతస్థాయిలో 26వ ర్యాంకును సాధించారు. న్యూరో సర్జరీ విభాగంలో ఓపెన్ కేటగిరి కింద ఎయిమ్స్, నిమ్హాన్స్, జిప్మర్, పీజీ ఐ చండీఘర్లలో 31 సీట్లు మాత్రమే ఉండ గా, అందులో ఒకటి ఆయన కై వసం చేసుకున్నా రు. కడపలోని సింగారెడ్డి ఎన్క్లేవ్లో నివాసముంటున్న కాంట్రాక్టర్ వెంకట సుబ్బారెడ్డి కుమారుడైన విహంత్రెడ్డి పూణెలోని ఆర్మ్డ్ ఫోర్స్డ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీలో ఎంఎస్ జనరల్ సర్జరీని పూణెలోని భారతి విద్యాపీ ఠ్ కళాశాలలో పూర్తి చేసి ఇప్పుడు న్యూరో సర్జరీ విభాగంలో సీటు పొందారు. కడప ఎడ్యుకేషన్: కడప నాగారాజుపేటకు చెందిన దివంగత వేపరాల వీర భాస్కర్ రావు (రిటైడ్ హెడ్ మాస్టర్ సీఎస్ఐ స్కూల్) మనవరాలు పెట్లు కావ్య, కుమారుడు వేపరాల గోయల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించారు.విజయవాడకు చెందిన హలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్తిక దండంగి ఆధ్వరంలో 2026 ఫిబ్రవరి 2న పలు దేశాలకు చెందిన 777 మంది ‘ది లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఎంసెంబల్’ చేశారు. 777 మంది గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొన్నారు. వీరిలో కడప కు చెందిన పెట్లు కావ్య, వేపరాల గోయల్ ఉన్నారు. ఈ నెల 29న హైదరాబాద్ గౌచ్చిబౌలి విక్టరీ చర్చిలో జరిగిన కార్యక్రమంలో పాస్టర్ అగస్తిక దండంగి చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందుకున్నారు. కావ్య, గోయల్ -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: అప్పుల బాధ తాళలేక రైతు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మాలేపాడు పంచాయతీ, ఆవుల పల్లెకు చెందిన వెంకటేష్ (38)కు సుమారు 8 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. పంటల సాగు కోసం తన పొలంలో ఏడు బోర్లు వేశాడు. ప్రస్తుతం టమాటా ఇతర కూరగాయ పంటలను పండించాడు. అయితే బోర్లలో నీళ్లు అడుగంటి పోవడంతో పంటలకు సరిపడా నీళ్లు లేక ఎండు ముఖం పడుతున్నాయి. ఇప్పటికే 7 బోర్లు, వ్యవసాయ పంటల సాగు, ఇతర ఖర్చులకోసం సుమారు 20 లక్షలకు పైగా అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక జీవితంపై విరక్తి చెందాడు. కూరగాయ పంటలకు తెచ్చిన గడ్డి మందును పొలంలోనే తాగాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి, అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రుయాకు వెళ్లాలని సూచించారు. కుటుంబీకులు వెంకటేశును స్థానకంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. -
శేష జీవితం ప్రశాంతంగా గడపండి
జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లె టౌన్: సమాజ రక్షణ కోసం దశాబ్దాల పాటు అంకితభావంతో పనిచేసిన పోలీసులు శేష జీవితాన్ని కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని జిల్లా ఎస్పీ ధీరజ్ ఆకాంక్షించారు. శనివారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ముగ్గురు ఏఎస్ఐలైన మాబూ సాహెబ్ (కలికిరి పీఎస్), పి. వెంకటరమణ (రామాపురం పీఎస్), ఎం. శేఖర్ రావు (రైల్వేకోడూరు పీఎస్)లకు జిల్లా పోలీసు యంత్రాంగం తరపున ‘ఆత్మీయ వీడ్కోలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి రిటైర్డ్ అధికారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. పోలీసు అధికారులు సుదీర్ఘ సర్వీసు పూర్తి చేయడంలో వారి జీవిత భాగస్వాముల పాత్ర వెలకట్టలేనిదని ఎస్పీ కొనియాడారు. తోటి సిబ్బందిని వదిలి వెళ్తుండటంతో పదవీ విరమణ పొందిన అధికారులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి బీఎల్ఏ సైనికుడే !
● ఓటర్ల జాబితా వైఎస్సార్సీపీ గెలుపునకు తొలిఅడుగు ● వైఎస్ జగన్ను సీఎంగా చేసుకోవాలన్నదే ధ్యేయం ● ఎమ్మెల్సీ టీ. కల్పలతారెడ్డి రాజంపేట: స్ధానికసంస్థల ఎన్నికల్లో ప్రతి బూత్లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ సైనికుడని, ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏదేనని శాసనమండలి సభ్యురాలు,అన్నమయ్య జిల్లా బీఎల్ఏ పరిశీలకురాలు టీ.కల్పలతారెడ్డి అన్నారు. శుక్రవారం రాజంపేట మండలం ఆకేపాటి ఎస్టేట్లో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ బీఎల్ఏ విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాయే వైఎస్సార్సీపీ గెలుపునకు తొలి అడుగు అని అన్నారు. బీఎల్ఏలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాపై పట్టు సాధించాలన్నారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లను రకరకాలుగా తొలిగించేందుకు టీడీపీ నాయకులు కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు. దానిని బీఎల్ఏలు అడ్డుకోవాలన్నారు. మళ్లీ 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ధ్యేయంతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్క బీఎల్ఏ సర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్పోలా శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీలు మేడా విజయభాస్కర్రెడ్డి, గాలివీటి రాజేంద్రరెడ్డి, కేంద్రకార్యాలయ పరిశీలకులు నరసింహారెడ్డి. ఎస్ఈసీ సభ్యుడు చొప్పాఎల్లారెడ్డి, రాయలసీమ బూత్ కమిటి కన్వీనరు తల్లెం భరత్కుమార్రెడ్డి, జిల్లా బూత్కమిటి నేత నడివీధి సుధాకర్, మండలకన్వీనర్లు టక్కోలు శివారెడ్డి, దొడ్డిపల్లెభాస్కర్రాజు, జె. కృష్ణరావుయాదవ్, నీలకంఠేశ్వరరెడ్డి, సిద్ధవరం గోపిరెడ్డి,బెహరన్ వైఎస్సార్సీపీ కన్వీనరు ఓర్సు నాగరాజు, నాయకులు గొబ్బిళ్ల త్రినాధ్,పాపినేని విశ్వనాధరెడ్డి, దండుగోపి,వడ్డెరమణ, మహిళనేతలు ఏకులరాజేశ్వరీరెడ్డి, రక్కాసి శ్రీవాణి, పల్లె మాధవి పాల్గొన్నారు. సర్పై బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలి. నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి.ఓట్లు తొలగింపునకు గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలదే. స్థానికసంస్ధలలో వైఎస్సార్సీపీ సత్తా చాటుకునేందుకు సమష్టిగా కృషిచేయాలి. బూత్ స్ధాయిలో వైఎస్సార్సీపీ ఓట్లకు గండిపడకుండా చూసుకోవాలి. – సురేష్బాబు, వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరీశీలకుడు ఒక ఓటు కూడా పొగొట్టుకోకూడదు. ఆ దిశగా బీఎల్ఏలు పనిచేయాలి. సర్లో బీఎల్ఏలదే కీలకపాత్ర.అది గుర్తుంచుకోవాలి. చంద్రబాబుకు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలో ఉన్నాయి. ఇటీవల పలు రాష్ట్రాలలో ఓట్ల తొలగింపుతో నేతలు ఓటమి పాలయ్యారు. అందువల్ల ఓట్ల తొలిగింపునకు అడ్డుకట్టవేసే విధంగా బీఎల్ఏలు పనిచేయాలి. – ఆకేపాటి అమర్నాఽథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట స్థ్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురాలి.సమష్టిగా గెలుపునకు కృషిచేయాలి. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజలు గ్రహించారు.రెండేళ్లలో హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రె డ్డిని మళ్లీ సీఎంను చేసుకోవాలంటే బీఎల్ఏలు కీలకపాత్ర పోషించాలి. ఓట్ల తొలిగింపుకు కుట్రలు తెరలేస్తాయి. వాటిని అడ్డుకొని మన ఓట్లను కాపాడుకోవాలి. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న నాయకులు -
31న హాకీ జట్టు ఎంపిక
మదనపల్లె సిటీ: జిల్లా సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక ఈనెల 31న నిర్వహించనున్నట్లు అన్నమయ్య హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పీ.వీ.ప్రసాద్, జి.శివప్రసాద్ తెలిపారు. స్థానిక బీటీ కాలేజీ హాకీ మైదానంలో ఉదయం 10 గంటలకు జరుగుతుందన్నారు. క్రీడాకారులు 1.1.1992 లేదా ఆ తర్వాత జన్మించినవారు అర్హులన్నారు. పదో తరగతి మార్కుల జాబితా, పుట్టినతేదీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు జూన్ రెండో వారంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంటులో పాల్గొంటారని పేర్కొన్నారు. మదనపల్లి (కురబలకోట): ప్రజల ఆరోగ్యవంతమైన జీవనానికి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రజల భాగస్వామ్యం ఆవశ్యకమని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. తంబళ్లపల్లి నియోజక వర్గ గ్రామాలకు రూ.70.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 22 ఈ–ఆటో రిక్షాలను శుక్రవారం మదనపల్లి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ నిశాంత్కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి చెత్త సేకరణ, తడి–పొడి వ్యర్థాలు వేరు చేయడం ఘన వ్యర్థాల నిర్వహణలో ఈ–ఆటో రిక్షాలు కీలక పాత్ర వహిస్తాన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులతో ఒక్కో వాహనం రూ. 3.20 లక్షల వ్యయంతో సమకూర్చినట్లు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ పరిశుభ్ర గ్రామాల నిర్వహణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, డీఎల్పీఓ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. కలికిరి: జిల్లాలోని బీడు భూములను సాగులోకి తీసుకురావడమే జలధార ప్రాజెక్టు లక్ష్యమని జిల్లా వ్యవసాయాధికారి శివన్నారాయణ అన్నారు. కలికిరి కేవీకే కార్యాలయంలో శుక్రవారం పీలేరు నియోజకవర్గ పరిధిలోని రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ప్రాజెక్ట్ జలధార ఉద్దేశంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 3272 చెరువులను జలధార కార్యక్రమం ద్వారా నీరు నింపడం జరుగుతుందని, దీంతో చెరువుల ఆయకట్టు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని బోర్లలో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయన్నారు. జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి , జిల్లా పశుసంవర్దకశాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై మాట్లాడారు. రాయచోటి: విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడాలంటే ప్రాథమిక దశలోనే కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించాలని.. ఈ లక్ష్యంతోనే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ డాక్టర్ అనురాధ తెలిపారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్కు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం రాయచోటి మండలం, ఎగువ అబ్బవరంలోని ఆర్చనా కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 29 నుంచి జూన్ 2వ తేది వరకు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణను నిర్వహించడం జరుగుతుందన్నారు. శిక్షణ ప్రారంభోత్సవంలో డాక్టర్ అనురాధ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం – 2020, నిపుణ్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి మూడో తరగతి పూర్తయ్యే నాటికి చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించడమే ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. విద్యార్థులు వయస్సుకు తగిన అభ్యసన స్థాయికి చేరుకోవడానికి ఉపాధ్యాయులు సమర్థవంతమైన బోధన పద్దతులను అవలంబించాలని సూచించారు. డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఇన్చార్జ్ అసదుల్లా, సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్ జనార్దన్, ఏపిఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఆటో బోల్తా: ఐదుగురికి తీవ్ర గాయాలు
గాయపడిన వాణి వెంకటేష్ హైదర్ సాబ్ రమణ నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): నిమ్మనపల్లె మండలంలోని మర్రిబండ వద్ద శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నిమ్మనపల్లె 108 సిబ్బంది జస్వంత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఆటో డ్రైవర్ వెంకటేష్, ప్రయాణీకులు వాణి, హైదర్ సాబ్, రమణతో పాటు మరో వ్యక్తిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాళ్లు, చేతులు విరగడంతో వెంకటేష్, హైదర్ సాబ్లను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూమి మాది..!
● ఆక్రమణ నాటకం వారిది ● అధికారులు విచారించి న్యాయం చేయాలి: బాధితుల వేడుకోలు మదనపల్లె టౌన్: భూములు మావి, రెవెన్యూ రికార్డులన్నీ మా పేరుపైనే ఉన్నాయి. కానీ మా భూములు కబ్జా చేసి నిందలు మాపైనే వేస్తూ నాటకాలు ఆడుతున్నారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి తమకు న్యాయం చేయాలని కురబలకోట మండలం, చేనేత నగర్కు చెందిన రావూరి అమరనాథ్ రెడ్డి, ఎరజ్రేనువారిపల్లెకు చెందిన రెడ్డెమ్మ, వై.అమరనాథ్ రెడ్డి దంపతులు, నందిరెడ్డిగారిపల్లెకు చెందిన ఫైరోజ్ ఖాన్ లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వారు మదనపల్లె ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. ఎరజ్రేనువారిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 605–1, 606, 677 భూ వివాదానికి సంబంధించి అన్ని రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయని రావూరి అమరనాథరెడ్డి తెలిపారు. నిబంధనల మేరకు 1979లో కొనుగోలు చేసిన స్థలంలోకి తమను రానివ్వకుండా కబ్జాదారులు ఎం. బాలకష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి అధికార పార్టీ అండతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన వద్ద ఉన్న రికార్డులను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ భూవివాదంతో గతంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి, సర్వే అనంతరం అన్ని రిపోర్టులు తమకే అధికారికంగా ఇచ్చారన్నారు. వై.అమరనాథ్ రెడ్డి, రెడ్డమ్మ దంపతులు మాట్లాడుతూ.. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని దాయాదులు వెంకటరమణారెడ్డి కబ్జా చేసి భూమిలోకి రానివ్వకుండా అడ్డుకుంటు ఉన్నారన్నారు. ఆ వ్యక్తి రెండు నకిలీ ఖాతాలను తయారు చేసుకుని, తమ భూములను ఆక్రమించుకున్నాడన్నారు. అధికారుల రీ సర్వేలోనూ ఆన్ లైన్ తమకే చేసినా ఇంకా దౌర్జన్యం చేస్తున్నారని, ఇటీవలే తనపై దాడి కూడా చేశారన్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. 605–1 లో తమకు వారసత్వంగా 8.80 ఎకరాల భూమి ఉందని, ఎన్. బాలకృష్ణారెడ్డి, జయరామి రెడ్డి లు కబ్జాచేసి తమను పొలంలోకి రానివ్వడం లేదని ఫైరోజ్ ఖాన్ ఆరోపించాడు. పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేయగా, రీ సర్వే చేయనివ్వకుండా బాలకృష్ణా రెడ్డి, జయరామిరెడ్డి లు అధికారులను అడ్డుకుంటున్నా రన్నారు. ఉన్నతాధికారుల స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. -
బూత్లెవల్ ఏజెంట్ కీలకంగా వ్యవహరించాలి
రైల్వేకోడూరు అర్బన్: నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ చెందిన ప్రతి 252 బూత్ లెవల్ ఏజంట్లు సర్ ప్రక్రియలో కీలక భూమిక పోషించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అదికారప్రతినిధి, మాజీఎమ్మెల్యే, ఇన్చార్జి కొరముట్ల శ్రీనివాసులు శక్రవారం తెలిపారు. స్థానిక రాజ్కళ్యాణ మండపంలో జరిగిన సర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, రాజంపేట, కడప పరిశీలకులు సురేష్బాబు, కొండూరుఅజయ్రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా నియోజవర్గంలో ఓట్ల తొలగింపుపై పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏ దృష్ఠి పెట్టాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ పరిశీలకులు నరసింహారెడ్డి, సహదేవరెడ్డి, పంజంవేణుగోపాల్రెడ్డి, సాయికిషోర్రెడ్డి, చెవుశ్రీనివాసులురెడ్డి, జెట్పీటీసీరత్నమ్మ, రాయలసీమ బూత్కన్వీనర్ తల్లెంభరత్కుమార్రెడ్డి, క్రిష్ణారెడ్డి, , వెంకటరెడ్డి, సీహెచ్రమేష్, నందాబాల, విజయ్కుమార్రెడ్డి, సుదర్శన్రెడ్డి, సతీష్రెడ్డి పాల్గొన్నారు. -
జనగణమన... స్వాగతంబున!
ఈ ఫొటోలో కనిపిస్తున్న బోర్డు కేవలం ఒక పట్టణ ఆహ్వాన సూచిక కాదు, కాల గర్భంలో దాగి ఉన్న ఒక గొప్ప చరిత్రకు సజీవ సాక్ష్యం! విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అడుగుజాడల గుర్తులను మోస్తున్న మదనపల్లె పట్టణం ఇప్పుడు సరికొత్తగా పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఆయన ఇక్కడి థియోసాఫికల్ కాలేజీలో విడిది చేసినప్పుడే, మన జాతీయ గీతం ‘జనగణమన’ను బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. ఆ చారిత్రక క్షణానికి గౌరవంగా పీకేఎం(పలమనేరు, కుప్పం, మదనపల్లె) – ఉడా (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఒక అద్భుతమైన లోగోను సిద్ధం చేసింది. రవీంద్రుని రూపం, చుట్టూ ప్రకృతి అందాలు, సంప్రదాయ కలశం, గోవులతో కూడిన ఈ లోగో బోర్డులను బెంగళూరు, తిరుపతి, కడప, చిత్తూరు రహదారుల వెంబడి ఏర్పాటు చేస్తున్నారు. మదనపల్లెలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ ఈ బోర్డులు ఇకపై స్వాగతం పలుకుతూ ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేయనున్నాయి. –సాక్షి, మదనపల్లె -
మైనింగ్ అడ్డుకుంటాం
సాధుకొండలో మైనింగ్ను అడ్డుకుంటాం. జగనన్న పాలనలో శైవ భక్తుల మనోభావాలకు పెద్దపీట వేశాం. కొండలను కాపాడటమేకాక ఆలయ అభివృద్ధికి కృషి చేశాం. మైనింగ్ పేరుతో దోచుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు పన్నాగం వేశారు. రహస్యంగా బిడ్లను ఆహ్వనించిన ప్రభుత్వం ఇప్పుడు ఏపీఎండీసీ ద్వారా సర్వే చేయించేందుకు పూనుకోవడం ఏకపక్షమే. తంబళ్లపల్లె ప్రజలు, భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లకూడదు. మల్లయ్యకొండల జోలికి వస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవు. –పీవీ.మిథున్రెడ్డి, రాజంపేట ఎంపీ భక్తులు ఊరుకోరు పవిత్ర శైవ పుణ్యక్షేత్రంగా వర్దిల్లుతున్న మల్లయ్యకొండల సముదాయంలోని సాధుకొండలో మైనింగ్ కోసం సర్వే చేస్తే భక్తులు ఊరుకోరు. 2006 నుంచి మైనింగ్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొండల్లో శివనామస్మరణ తప్ప మరో ధ్వని వినపడకూడన్న కృతనిశ్చయానికి కట్టుబడింది. భక్తుల కోసం ఊహించని స్థాయిలో సౌకర్యాలు కల్పించాం. ఇప్పుడు మైనింగ్ పేరుతో కొల్లగొడతామంటే ప్రజలు, భక్తులు ఒప్పుకోరు. –పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే -
మత్తు మందు చల్లి.. బంగారు గొలుసు అపహరణ
లింగాల : లింగాల మండలం అంబకపల్లె గ్రామంలో పట్టపగలే మహిళ మెడలోని రూ.5 లక్షల విలువైన మూడున్నర తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలు..చిల్లర దుకాణం నిర్వహిస్తున్న కేతిరెడ్డి సరళ వద్దకు శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ముఖాలకు మాస్కులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు సరకులు కొనేందుకు వచ్చారు. ఆమె సరకులు ఇస్తుండగా ముఖంపై మత్తు మందు చల్లి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. నిందితులు పులివెందుల వైపు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జగదీశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ట్రావెల్ బస్సు బోల్తా – ముగ్గురికి గాయాలు గోపవరం : మండలంలోని నెల్లూరు – ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు రెండో మలుపు వద్ద శుక్రవారం తెల్లవారుజామున బీసీవీఆర్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సు విజయవాడ నుంచి కదిరికి వెళుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కడప జిల్లా కె.రాజుపాలెంకు చెందిన జయప్రసాద్, అనంతపురం జిల్లా తలుపులకు చెందిన పవన్కుమార్, అనంతపురం జిల్లా కదిరికి చెందిన శ్రీనివాసులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బస్సు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. బద్వేలు రూరల్ ఎస్ఐ రంగారావు, సిబ్బంది ఘటన ప్రాంతానికి చేరుకు ని బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ముద్దనూరు: మండలంలోని చెర్లోపల్లెకు చెందిన కుంచపు భారతి (37) కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. భారతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవారన్నారు. గురువారం నొప్పి భరించలేక విషద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అడిగేదెవరు..ఆపేదెవరు
● పోలీస్స్టేషన్ ముందు నుంచే దర్జాగా వెళుతున్న ఇసుక టిప్పర్లు ● సవాల్ విసురుతున్న ఇసుకాసురులు గుర్రంకొండ: పోలీసులా... అయితే మాకేంటీ అంటూ ఇసుకాసురులు పోలీస్స్టేషన్ ముందే దర్జాగా టిప్పర్లను తీసుకెళుతున్నారు. రేయింబవళ్లు ఇసుక అక్రమ రవాణా షరా మామూలుగా మారింది. దీని గురించి అడిగేవారు..ఆడ్డుకొనేవారు ఎవరూ లేక పోవడంతో ఇష్టానుసారం ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. ఇసుక టిప్పర్ రోడ్డుపై వెళ్లిందంటే వాహనం వెనుక వెళ్లే ద్విచక్రవాహనదారుల కళ్లుమండిపోవాల్సిందే. గాలికి ఇసుక కొట్టుకువచ్చి కళ్లలో పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జనావాసాల మధ్యలో వెళ్లేటప్పుడు ఇసుకపై పట్టగానీ, నర్సరీ జాలీగానీ ఏర్పాటు చేసుకోక పోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా తీరు మార్చుకోని ఇసుకాసురులు అధికారులకు, పోలీసులకు సవాల్ విసురుతూ పోలీస్స్టేషన్ ముందు నుంచే పట్టకట్టకుండా ఇసుక టిప్పర్లను తిప్పుతుండడం గమనార్హం. జిల్లా నలుమూలల నుంచి ఇసుక టిప్పర్లు గు ర్రంకొండ మీదుగా మదనపల్లె, కర్ణాటక వైపు నిత్యం వెళుతుంటాయి. గతంలో టిప్పర్లపై ఇసుక గాలికి ఎగిరి వెనుకవైపు వచ్చే వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్లాస్టిక్ పట్టగానీ నర్సరీ జాలీగానీ ఏర్పాటు చేసుకొని వెళ్లేవారు. ప్రస్తుతం ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇష్టానుసారం జనవాసాల మధ్యలో వెళుతుండడం గమనార్హం. ప్రతిరోజు గంటకోమారు ఇసుక టిప్పర్ వెళుతుండడంతో కష్టాలు తప్పడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే పోలీస్స్టేషన్ ముందు వైపు నుంచే దర్జాగా ఇసుక టిప్పర్లు వెళుతున్నా పట్టించుకోవడం లేదు.దీంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో దిక్కుతోచని స్థితిలో ద్విచక్రవాహన దారులు, గ్రామస్తులు ఉన్నారు. ఇటీవల పోలీసులు ఇసుక టిప్పర్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. దీంతో కొద్దిరోజుల పాటు జాగ్రత్తగా వీటిని తిప్పారు. అయితే మళ్లీ వారం రోజుల నుంచి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇసుక టిప్పర్లను తిప్పుతుండడం గమనార్హం. పోలీస్స్టేషన్ ముందే వాహనాలను నిలిపి జరిమానాలు విధించే పోలీసులు వాళ్ల కళ్లముందే ఇసుక టిప్పర్లు వెళుతున్నా చూసీచూడనట్లు వ్యహరిస్తుండడం విమర్శలు దారితీస్తోంది. ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలను రోజులో రెండుమార్లు నిలిపి జరిమానాలు విధించే పోలీసులకు ఇసుకటిప్పుర్లు కనిపించడం లేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. -
ఆరోగ్య భారతి
కమలాపురం : సమాజ సంక్షేమానికి భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) పెద్దపీట వేస్తోంది. పరిశ్రమ నెలకొల్పిన ప్రాంతమైన వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో భారతి సిమెంట్స్, అపోలో టెలీమెడిసిన్ నెట్ వర్కింగ్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆన్సైట్ వైద్య సంరక్షణను టెలీమెడిసిన్ ఆధారిత స్పెషాలిటీ కన్సల్టేషన్లతో కలిసి గ్రామీణులకు ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డిజిటల్ క్లినిక్ రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ను అపోలో టెలిమెడిసిన్ నెట్ వర్కింగ్ ఫౌండేషన్ అమలు చేస్తూ, కార్యచరణ రూపొందించింది. నిరంతర సేవలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రముఖ అపోలో హాస్పిటల్స్ పర్యవేక్షణలో 2015లో ఫ్యాక్టరీ ఎదుటే రూ. 50 లక్షల వ్యయంతో టెలీక్లినిక్ను ఏర్పాటు చేశారు. అపోలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో రోజుకు దాదాపు 40 నుంచి 50 మంది రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ఫ్యాక్టరీ సమీప గ్రామాల ప్రజలతో పాటు కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో క్లినిక్కు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. చికిత్స చేయడంతో పాటు మందుల పంపిణీ, రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వైద్య సేవలు అందించారు. అపోలో పర్యవేక్షణలో డిజిటల్ క్లినిక్ నిర్వహణ -
కళ్లు తేలేస్తున్న కోళ్లు
గుర్రంకొండ: అటు వ్యవసాయం.. ఇటు ఉద్యానవన పంటలు చేతికందక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన జిల్లా రైతాంగాన్ని.. తాజాగా పౌల్ట్రీ (కోళ్ల) పరిశ్రమ సంక్షోభం మరింత కోలుకోలేని దెబ్బతీస్తోంది. జిల్లాలో ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరడంతో పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఎల్నినో ప్రభావంతో పాటు భానుడి భగభగలకు తట్టుకోలేక ఊపిరి వదులుతున్నాయి. చేతికొచ్చే దశలోనే మృత్యువాత.. పతి కోళ్ల ఫారమ్లోనూ రోజుకు సగటున 30 నుంచి 40 కోళ్లు చనిపోతున్నాయి. కొన్నిచోట్ల 15 నుంచి 25 రోజుల వయసున్న కోళ్లు చనిపోతుండగా, మరికొన్ని చోట్ల తీరా అమ్మకానికి సిద్ధంగా ఉన్న చివరి దశ కోళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నాయి. లక్షలాది రూపాయల మేత తినిపించి, కంటికి రెప్పలా కాపాడి, తీరా లాభాలు చేతికొచ్చే సమయంలోనే కోళ్లు మృత్యువాత పడుతుండడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు.గుదిబండగా మారిన ‘కంపెనీ’ ఒప్పందాలు..కోడిపిల్లలను రైతులకు ఇచ్చే సమయంలో సాధారణ మరణాల (మోర్టాలిటీ) నష్టాన్ని పూడ్చడానికి ప్రతి 1000 పిల్లలకు అదనంగా 50 పిల్లలను కంపెనీలు ఉచితంగా ఇస్తాయి. అంటే 10 వేల కోళ్లు పెంచే రైతుకు అదనంగా 500 పిల్లలు వస్తాయి. ఈ అదనపు కోళ్లు చనిపోతే రైతుకు ఎటువంటి నష్టం ఉండదు. కానీ, ఈ ఏడాది ఎండల తీవ్రత వల్ల మరణాల సంఖ్య ఆ పరిమితిని ఎప్పుడో దాటిపోయింది. ఆ 500 మార్జిన్ దాటి చనిపోయే ప్రతి అదనపు కోడి నష్టాన్ని, దాని మేత ఖర్చును పూర్తిగా రైతే భరించాలనే నిబంధన పౌల్ట్రీ రైతుల మెడకు ఉరితాడుగా మారింది. జేసీబీలతో గోతులు తీసి పూడ్చివేత ఎండల తీవ్రతను తగ్గించేందుకు పగటిపూట కోళ్ల ఫారాల రేకుల షెడ్లపై నిరంతరం నీటిని చల్లుతున్నారు. మరికొందరు రైతులు రేకుల షెడ్లపై కొబ్బరి మట్టలు (టెంకాయ పట్టలు), చెరువుల్లో లభించే జమ్ము (గడ్డి వంటి మొక్కలు)ను కోయించి వేస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. దీంతో చేసేదేమీ లేక రైతులు చనిపోయిన వేలాది కోళ్లను జేసీబీలతో పెద్ద పెద్ద గోతులు తీయించి పూడ్చిపెడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పౌల్ట్రీ రైతాంగాన్ని ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తక్షణమే ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్నినో ఎఫెక్ట్: కుప్పకూలుతున్న పౌల్ట్రీ పరిశ్రమ భానుడి భగభగలకు జిల్లాలో రోజుకు 21 వేల కోళ్లు మృతి రోజుకు రూ.35 లక్షల మేర బూడిద కంపెనీల ‘మార్జిన్’ నిబంధనలురైతులకు శాపం అదనపు మరణాల భారమంతావారి నెత్తినే! షెడ్లపై జమ్ము వేసి నీళ్లు చల్లుతున్నా దక్కని ఫలితం మృతిచెందిన కోళ్లను జేసీబీలతో గోతులు తీసి పూడ్చివేత -
దగా డీఎస్సీ రద్దు చేయాలి
సాక్షి, మదనపల్లె: నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నేతలు ధ్వజమెత్తారు. దగా డీఎస్సీ రద్దయ్యేదాకా పోరు ఆగదని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభా గం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. శుక్రవారం మదనపల్లె అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మెగా డీఎస్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డీఎస్సీ ఎంపికల విషయంలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర చక్రధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష పేరుతో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 3.36 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాస్తే, మెరిట్ లిస్టులు బయటపెట్టకుండా, అభ్యర్థుల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపడం వెనుక ఉన్న కుట్ర దాగుందని ఆరోపించారు. అర్ధరాత్రి వేళ డేటాబేస్ నుంచి ప్రతిభావంతులైన అభ్యర్థుల వివరాలను ఎందుకు డిలీట్ చేశారు, సెలెక్టెడ్ అని మెసేజ్ పంపి, ఆ తర్వాత మార్కులు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతలను ప్రైవేట్ కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించడం, ఆ ఉద్యోగి జిల్లా టాపర్గా, జోన్–2 ర్యాంకర్ అవ్వడం పేపర్ లీక్ ముందే జరిగిందని అర్థమవుతోందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఒక్కొక్కరినుంచి ఒక్కో పోస్టును రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్ మాట్లాడుతూ మైదానంలో అడుగుపెట్టని ఆటగాళ్లకు బోగస్ సర్టిఫికేట్లతో డీఎస్సీలో టీచర్ పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. మూడు పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థికి కేవలం ఒక్క పోస్టుకే కాల్ లెటర్ పంపి దాదాపు నాలుగు వేల మంది ఉన్నత ఉద్యోగ అవకాశాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత పోస్టులు ఇవ్వాలి అని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా వాటిని బేఖాతర్ చేశారన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి న్యాయవ్యవస్థనే మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేసిన డీఎస్సీ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ చేశారు. విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారని అన్నారు. ఈకుంభకోణానికి బాధ్యత వహించి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్ భరత్, మదనపల్లి అధ్యక్షులు అశోక్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి హేమంత్, తంబలపల్లె నియోజవర్గం అధ్యక్షులు అభిలాష్రెడ్డి, పీలేరు నియోజకవర్గం అధ్యక్షు లోకనాథం, జిల్లా కార్యదర్శి పూర్ణచంద్ర, నాయకులు గిరీష్ , సీనియర్ విద్యార్థి విభాగం, ద్వారకనాథ్ రెడ్డి, పీలేరు భువనేశ్వర్ రెడ్డి , లోకనాథ్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, జిల్లా ఎస్టీ సెల్ నాయకులు పీలేరు చిన్న, నిమ్మలపల్లి మండల అధ్యక్షులు ప్రశాంత్, జిల్లా కార్యదర్శి ఆఫ్రిత్ , సీనియర్ విద్యార్థి విభాగం నాయకులు షేక్ మౌలాలి , కొండ వెంకటరమణారెడ్డి , రావూరి హరికృష్ణ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నేతలు డిమాండ్ మదనపల్లెలో వైఎస్సార్సీపీ విద్యార్థి పోరు -
యువతకు క్రీడలు ఎంతో అవసరం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు : గ్రామీణ యువతకు క్రీడలు ఎంతో అవసరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సుగాలిమిట్ట గ్రామంలో మిథున్ దళం క్రికెట్ టోర్నమెంట్ను పెద్దిరెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్సీపీ జిల్లాయూత్వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో మిథున్దళం టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి క్రీడాకారులు, అభిమానులు, గిరిజన మహిళలు ఘనస్వాగతం పలికారు. ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రికెట్ ఆడి ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి క్రీడలను ప్రోత్సహించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం క్రీడలను విస్మరించిందని ఆరోపించారు. క్రీడాకారులు పెద్దిరెడ్డి జిందాబాద్...మిధున్రెడ్డి జిందాబాద్ అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ భాస్కర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి రెడ్డెప్ప, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బాణావత్ మునీంద్రనాయక్, పార్టీ నాయకులు భానుప్రసాద్, రాజేష్, సురేష్, ప్రశాంత్రెడ్డి, డాబా శ్రీనివాసులు, ఆంజినాయక్, శ్రీనివాసులునాయక్, వేణునాయక్, మోహన్నాయక్, బాబునాయక్, రాజునాయక్, రషీదబేగం తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బర్సీ మహోత్సవం
కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, జహీరియా స్వర్గీయ పీఠాధిపతి హాజి జహీరుద్ధీన్ షా ఖాద్రి బర్సీ మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి పీఠాధిపతి, సజ్జాద్–ఏ–నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి, దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో బర్సీ మహోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త జన సందోహం నడుమ పీఠాధిపతి నివాసం నుంచి జహీరియా దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామి వారి మజార్లపై గంధం ఎక్కించి, పూల చాదర్లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహ నిర్వహించారు. రాత్రి నాత్ చదివారు. అనంతరం బయాన్ చేశారు. పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా, గౌస్పాక్, జియా మాలిక్, సర్ఫరాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండాయన’
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిమదనపల్లె టౌన్: మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, వారిపై నేరాలకు పాల్పడే వారికి త్వరితగతిన శిక్షలు పడేలా జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ దండాయన’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. శుక్రవారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ‘స్పీడ్ ట్రయల్ మానిటరింగ్’విధానాన్ని జిల్లాలో వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, గృహ హింస, పొక్సో కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలపై నేరాల్లో (క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్) 16 కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడేలా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. సంచలనాత్మక కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ. జి.శంకర మల్లయ్య, కోర్ట్ మానిటరింగ్ ఇన్స్పెక్టర్ జె. ప్రసాద్ బాబు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె. సురేష్ కుమార్ రెడ్డి, డీసీఆర్ బి, ఎస్ఐ.బి. సహదేవి, తదితరులు పాల్గొన్నారు. -
మమనాడు!
సాక్షి, అన్నమయ్య: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో, జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ కార్యక్రమం తీవ్ర నిరాశను మిగిల్చింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి, సంక్షేమం శూన్యం కావడంతో జనాలు, చివరికి సొంత పార్టీ క్యాడర్ కూడా సభలకు రావడానికి ఆసక్తి చూపలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అధిష్టానం ఆగ్రహానికి గురికాకూడదనే భయంతో, స్థానిక నేతలు జిల్లా అధికారులను అడ్డుపెట్టుకుని డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించారు. కొన్ని చోట్ల డబ్బులు ముట్టజెప్పి మరీ సభలను నింపే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తమ్ముళ్ల అంతర్గత విభేదాలు, కొట్లాటలు ఈ మహానాడు వేదికగా బహిర్గతమయ్యాయి. పుంగనూరు: వీధికెక్కిన ‘మూడు ముక్కలాట’ అధిష్ఠానం ఆదేశాలను తుంగలో తొక్కడంలో పుంగనూరు తమ్ముళ్లు ముందు నిలిచారు. నియోజకవర్గ నేత చల్లా రామచంద్రారెడ్డి, వ్యాపారవేత్త మధుసూదన్ నాయుడుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో మహానాడు మూడు ముక్కలైంది. మధుసూదన్ నాయుడు వర్గం ఒక ప్రైవేట్ హోటల్లో విడిగా సభ పెట్టి చల్లాపై బహిరంగ యుద్ధం ప్రకటించగా..చల్లా వర్గం పట్టణంలోని ట్రావెలర్స్ బంగ్లాలో సమావేశం జరుపుకుంది.వీరు కాకుండా మైనార్టీ నేతలు, మాజీ కౌన్సిలర్లు కలిసి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మూడో సభ నిర్వహించారు. ఈ మూడు చోట్లా జనం లేక డ్వాక్రా మహిళలతోనే తూతూమంత్రంగా కానిచ్చేశారు. రాయచోటి: మంత్రి వెళ్లగానే ఖాళీ.. జిల్లా అధ్యక్షుడే డుమ్మా! మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ప్రాతినిధ్యం వహించే రాయచోటిలో గ్రూపు తగాదాలు పీక్స్కు చేరాయి. మంత్రి ఉన్నంతసేపు కాస్తో కూస్తో కనిపించిన జనం, ఆయన వెళ్లగానే తిరుగుముఖం పట్టారు. దీనికి తోడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్బాబు వర్గం ఈ సభలకు పూర్తిగా దూరంగా ఉంది. జిల్లా అధ్యక్షుడే సొంత నియోజకవర్గాన్ని వదిలేసి వేరే ప్రాంతాల్లో తిరగడం ఇక్కడి తీవ్ర విభేదాలకు అద్దం పడుతోంది. మదనపల్లె: ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే బహిష్కరణ షాక్! మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్బాషకు వ్యతిరేక వర్గం నుంచి గట్టి షాక్ తగిలింది. ఆయన ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని బలమైన ప్రత్యర్థి వర్గం, వారి అనుచర క్యాడర్ మొత్తం పూర్తిగా బహిష్కరించింది. దీంతో అక్కడ కూడా సభలన్నీ వెలవెలబోయి, కుర్చీలు మాత్రమే మిగిలాయి. పుంగనూరు: ఈడిగపల్లె వద్ద మధుసూదన్ నాయుడు నిర్వహించిన సభపుంగనూరు: మరో వర్గం మాజీ కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు నిర్వహించిన సభ జిల్లాలో వెలవెలబోయిన‘పసుపు పండగ’ జనం కరువుతో డ్వాక్రా మహిళలతో సరిపెట్టిన వైనం అధికారులు, పైసలే అండగా..మొక్కుబడి కార్యక్రమం ఐక్యత శూన్యం.. అంతటా గ్రూపుల రాజ్యం పుంగనూరులో ‘మూడు ముక్కలాట’ రాయచోటి, మదనపల్లెలో బహిష్కరణల పర్వం -
రైలు కింద పడి వ్యక్తి మృతి
ములకలచెరువు : రైలు కింద పడి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఇందిరా కాలనీకి చెందిన అబ్దుల్(30) బుధవారం రాత్రి నాగర్కోయల్ రైలు కింద పడి మృతిచెందాడు. గమనించిన రైల్వే సిబ్బంది కదిరి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ములకలచెరువువాసిగా నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అనారోగ్యంతో ఆత్మహత్యపుంగనూరు : మండలంలోని బండ్లపల్లెలో నివాసం ఉన్న శ్రీనివాసులు(43) శ్రీనివాసులు కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు శ్రీనివాసులను కాపాడేందుకు ప్రయత్నించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంటల బీమా అన్నదాతల హక్కు
పులివెందుల/వేముల : ప్రకృతి ప్రకోపానికి గురై, అకాల గాలివానల వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం తక్షణమే మానవత్వంతో స్పందించి ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. వేముల మండలంలోని మీదిపెంట్ల గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి తోటలను వైఎస్సార్సీపీ మండల ఇన్ఛార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకట బయపురెడ్డిలతో కలిసి గురువారం ఆయన స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నేలకొరిగిన తోటలను చూసి చలించిపోయిన ఎంపీ, బాధితులతో మాట్లాడి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. బలవంతంగా ప్రీమియం కటింగ్.. తీరా చూస్తే సాంకేతిక సాకులు! ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పంటల బీమా అనేది రైతుల హక్కు అని, బీమా సంస్థ బాధ్యత తీసుకుని నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. రైతులకు ఇష్టం లేకపోయినా.. 2025లో పంట రుణాలు పొందిన ప్రతి రైతు వద్ద ఎకరాకు రూ. 3,000ల చొప్పున, హెక్టారుకు రూ.7,560ల చొప్పున బ్యాంకులు బలవంతంగా ప్రీమియం సొమ్మును కట్ చేసి రుణాలు రెన్యువల్ చేశారన్నారు. వేముల మండలానికి సంబంధించి దాదాపు 900 మంది రైతులు ఈ విధంగా ప్రీమియం చెల్లించారని, దీని కవరేజీ 2025 జూలై నుంచి 2026 మే వరకు వర్తిస్తుందని గుర్తుచేశారు. కళ్లముందే ఇన్సూరెన్స్ గడువు ఉన్నప్పటికీ, సాంకేతిక సాకులు చూపడం దారుణమన్నారు. వాతావరణ బీమా అంటేనే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా వర్షపాతం, గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకుని బీమా అందించాల్సి ఉంటుందని ఎంపీ వివరించారు. కానీ జిల్లాలో వెదర్ స్టేషన్లు చాలా చోట్ల సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ‘మరి పంటల బీమాకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి రైతుల వద్ద ప్రీమియం వసూలు చేశారు?‘ అని అధికారులను నిలదీశారు. ప్రభుత్వాలు కూడా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వహించొద్దని, మీ నిర్లక్ష్యానికి మీరే బాధ్యత వహించి తప్పనిసరిగా ప్రతి రైతుకూ బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
మృతదేహంతో పోలీస్స్టేషన్ వద్ద ధర్నా
పుంగనూరు : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు కలసి పోలీస్స్టేషన్ వద్ద ధర్నా , రాస్తారోకో నిర్వహించిన సంఘటన సోమల పోలీస్స్టేషన్ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాంపల్లెకి చెందిన రామ్చరణ్(21) అనే యువకుడు ఈనెల 19న రాత్రి నంజంపేట నుంచి రాంపల్లెలోని తన ఇంటికి వెళ్తుండగా అతివేగంగా ఎదురుగా వస్తున్న టాటాఏసి వాహనం రామ్చరణ్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామ్చరణ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గ్రామస్తులు , కుటుంబ సభ్యులు కలసి ఆ యువకుడికి వైద్యచికిత్సలు అందించేందుకు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఈ మృతదేహాన్ని అంబులెన్స్లో తిరుపతి నుంచి సోమలకు తరలించారు. మార్గ మధ్యంలోని సోమల పోలీస్స్టేషన్ వద్ద అంబులెన్స్లో మృతదేహాన్ని పెట్టి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తిరుపతి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి హుటాహుటిన సోమలకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. -
లోతుగా దుక్కు.. లాభాలు దక్కు!
● జిల్లాలో ప్రారంభమైన ముందస్తు వర్షాలు ● ముమ్మరమైన వ్యవసాయ పనులు ● ఖరీఫ్లో 79,773 హెక్టార్ల పంటల సాగు లక్ష్యం ● కలుపు, చీడపీడల నివారణకు తొలి వర్షాలే సరైన సమయంకడప అగ్రికల్చర్ : ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల దిగుబడిని దెబ్బతీసే ప్రధాన సమస్య ‘కలుపు’ మరియు ‘చీడపీడలు’. ఈ యాజమాన్య ప్రక్రియను తొలి వర్షాలు కురిసినప్పటి నుంచే ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం 79,773 హెక్టార్లలో పంటల సాగును వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించగా, జూన్ 1 నుంచి సీజన్ అధికారికంగా ప్రారంభం కానుంది. వాలుకు అడ్డంగా దున్నాలి! ప్రస్తుతం కురుస్తున్న వానలను రైతులు సద్వినియోగం చేసుకుని తమ పరిధిలోని మాగాణి, మెట్ట, బీడు భూములను వెంటనే దున్నుకోవాలి. ముఖ్యంగా దుక్కులను లోతుగా దున్నడంతో పాటు వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. దీనివల్ల వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా పొలాల్లోనే ఆగుతుంది. ఇది నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకేందుకు అనుకూల పరిస్థితిని కల్పిస్తుంది. ఫలితంగా భూమి ఎక్కువ తేమను గ్రహించి, ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. చెత్తాచెదారం కాల్చవద్దు.. ఎరువుగా మార్చండి చాలా మంది రైతులు పంటల నూర్పిడి పూర్తయిన తర్వాత, భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల పొలంలో మొండి కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయి నేలను నిస్సారంగా మారుస్తాయి. అంతేకాకుండా పంట చేతికి రాగానే పొలంలో మిగిలిపోయే ఎండు ఆకులు, కోయకాడలను తగలబెడుతుంటారు. అలా కాల్చకుండా వదిలేసిన చెత్తను, ఇప్పుడు కురుస్తున్న వర్షం పదునులో లోతు దుక్కులు చేయడం ద్వారా సులభంగా మట్టిలో కలిసిపోయేలా చేయవచ్చు. ఇవి కొద్ది రోజుల్లోనే కుళ్లిపోయి, భూమికి అద్భుతమైన సేంద్రియ ఎరువుగా మారి భూసారాన్ని పెంచుతాయి. పక్షుల వేట.. చీడపీడల కోట బద్దలు! వేసవిలో పొలాలు ఖాళీగా ఉన్నప్పుడు పంటలను ఆశించే పురుగుల కోశస్థ దశలు, గుడ్లు, లార్వాలు మరియు తెగుళ్లు కలుగజేసే శిలీంధ్రాలు నేల అడుగున నిద్రావస్థలో దాగుంటాయి. ఇప్పుడు లోతు దుక్కులు చేయడం వల్ల నేల పొరలు తలకిందులై, ఇవన్నీ పైకి వస్తాయి. పొలం దున్నుతున్న సమయంలో నాగలి వెంట వచ్చే కొంగలు, కాకులు ఈ పురుగులను ఏరి తిని నాశనం చేస్తాయి. మిగిలినవి ఎండ తీవ్రతకు చనిపోతాయి. వర్షం పడగానే మొలకెత్తే కలుపు విత్తనాలు కూడా పంటల సాగుకు ముందే రెండు సార్లు దుక్కులు చేయడం వల్ల నశిస్తాయి. రసాయనాలతో దెబ్బతింటున్న నేలరైతులు శ్రమ తగ్గించుకోవడానికి విచ్చలవిడిగా రసాయన కలుపు మందులను పిచికారీ చేయడం వల్ల భూమిలోని సహజ సిద్ధమైన సారవంతం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే రసాయన మందుల వాడకాన్ని తగ్గించి, రైతులు ముందస్తు సేద్యం, లోతు దుక్కులు వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని అధికారులు కోరుతున్నారు. కాగా, ఈ ఖరీఫ్లో జిల్లాలో ప్రధానంగా సజ్జ, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, పత్తి, వేరుశనగ, సన్ఫ్లవర్, సోయాబీన్ తదితర ఆరుతడి పంటలు సాగు కానున్నాయి.రైతులు లోతు దక్కులు చేపట్టాలి ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం పదునుతో రైతులు తమ బీడు భూములను లోతుగా దుక్కులు చేసుకోవాలి. దీంతో వ్యవసాయ భూమి సారవంతంగా మారుతుంది. లోతు దుక్కులతో భూమిలో ఉన్న చీడపీడలలతోపాటు కలుపు నివారణతో నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. దీంతోపాటు భూమిలో తేమ శాతం పెరుగుతుంది. – మట్టా సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి, వైఎస్సార్జిల్లా -
అంతర్జాతీయ పోటీలకు రామాపురం క్రీడాకారిణి
రామాపురం : మండలంలోని గోపగుడిపల్లి గ్రామం గొల్లపల్లికి చెందిన యనపడ్డ గోవిందు కుమార్తె యనపడ్డ సంజన అంతర్జాతీయ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ కు ఎంపిక కావడం మండలానికి గర్వకారణమైంది. అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారిణి , కోచ్ ప్రసన్న జయశంకర్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం అనంతరం ఏపీ స్టేట్ జూనియర్ బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ ఎంపికలో సంజన అద్భుత ప్రతిభ ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. పుదుచ్చేరిలో మే 22 నుంచి 28 వరకు నిర్వహించిన నేషనల్ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో సంజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చూపింది. చిన్న వయస్సులోనే రాష్ట్ర స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు,గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అక్రమాలపై పోరుబాట
సాక్షి అన్నమయ్య: అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ నిరుద్యోగులను డీఎస్సీ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి తర్వాత డీఎస్సీ మెరిట్ లిస్ట్ లాంటిది చూపించకుండా ముందుకు వెళ్లడం..అందులో అనేక అనుమానాలు ఉన్నా వాటిని నివృత్తి చేయకపోవడం.. జిల్లా కమిటీలకు సంబంధం లేకుండా వ్యవహారాన్ని నడిపించడంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎక్కడిక్కడ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ప్రత్యేక సంస్థ అయిన సీబీఐ ద్వారా విచారణ జరపాలని కోరుతోంది. డీఎస్సీలో గోల్ మాల్ జరిగిందని నిరుద్యోగులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా.. విద్యా రంగ వ్యవస్థను వారి గుప్పిట్లో పెట్టుకుని బయటకు తెలియకుండా నడుపుతున్న వ్యవహారంపై వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుని పార్టీ అధిష్టానం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని అంబేడ్కర్ సర్కిల్లో ఆందోళన నిర్వహించనున్నారు. వైఎస్సార్సీపీ డిమాండ్లు ఇవి.. ● డీఎస్సీ నియామకాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో న్యాయ విచారణ జరపాలి. ● ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్, నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్టు సిబ్బంది పాత్రపై పూర్తి విచాణ జరపాలి. ● మెరిట్ లిస్టులు, మార్కులు, ఎంపిక వివరాలను పూర్తిగా ప్రజలకు వెల్లడించాలి. ● అక్రమంగా ఎంపికై న వారిపై చర్యలు తీసుకుని, నిజమైన అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి. ● డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ● స్పోర్ట్స్ కోటా, రిజర్వేషన్, కాల్ లెటర్లలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక విచారణ జరపాలి. ● కోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేసి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలి. ● ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. డీఎస్సీలో జరిగిన వ్యవహారాలపైకదులుతున్న నిరుద్యోగులు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలకు పిలుపునిచ్చిన పార్టీ అధిష్టానం నేడు మదనపల్లెలో అంబేడ్కర్ సర్కిల్ వద్ద నిరసన -
త్యాగానికి ప్రతీక బక్రీద్
మదనపల్లె సిటీ : బక్రీద్ ప్రార్థనలను జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశద్ధలతో జరుపుకున్నారు. గురువారం మదనపల్లె, రాయచోటి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజవర్గ కేంద్రాలతో పాటు వాల్మీకిపురం, గుర్రంకొండ,బి.కొత్తకోట, చిట్వేలి, లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రాల్లో ఈద్గాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాలలో మతగురువులు,ఉలేమాలు, ముఫ్తీలు ధార్మికోపన్యాసం చేశారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతియే బక్రీద్ పరమార్థమని పేర్కొన్నారు. ప్రవక్త హజరత్ ఇబ్రహీం సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి స్వార్థాన్ని వీడి ఆదర్శవంత సమాజాన్ని నిర్మించాలన్నారు. ఇస్లాం సూచించిన పంచసూత్రాలను పాటించాలన్నారు. ధాన,ధర్మాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు అలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా మసీదుల నుంచి ముస్లింలు ఖబ్రస్థాన్లకు వెళ్లి పూర్వీకుల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు. మదనపల్లెలో ఈద్గాలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్అహ్మద్ బక్రీద్ శుభాకాంక్షలు సందేశం ద్వారా పంపారు.భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు -
పరిశోధన...పరివేదన!
● జిల్లాలో ఏడాది కాలంలోనే 14 ఘోరాలు ● 5 కేసుల్లో నేటికీ దొరకని హంతకులు ● చార్జ్షీట్లు వేయడంలో పోలీసుల వైఫల్యం ● కోర్టుల్లో వీగిపోతున్న కేసులు! మదనపల్లె టౌన్: జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జిల్లావ్యాప్తంగా సాగుతున్న హత్యల పరంపర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటివరకు వివిధ స్టేషన్లలో ఏకంగా 14 హత్య కేసులు నమోదు కాగా, పోలీసులు కేవలం 9 కేసుల్లోనే నిందితులను అరెస్ట్ చేయగలిగారు. మిగిలిన 5 కేసుల్లో హంతకులు నేటికీ పరారీలో ఉన్నారు. నిందితులు దొరకని ఆ ‘5’ మిస్టరీ కేసులు ఇవే! వాల్మీకిపురం: భూతగాదాల నేపథ్యంలో రైతు హత్య. ఇద్దరు స్నేహితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. మదనపల్లె: బోడుమల్లు దిన్నెలో రైతు రాజశేఖర్ రెడ్డి మర్డర్ జరిగి మూడేళ్లయినా ప్రధాన నిందితులు దొరకలేదు. పీలేరు: ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య. ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు. తంబళ్లపల్లె: పాత కక్షలతో కూలీ హత్య. నిందితులు కర్ణాటకకు పారిపోయినా పట్టుకోలేకపోయారు. రామసముద్రం: గుర్తుతెలియని మృతదేహం లభ్యం. ఇది హత్యా లేక ఆత్మహత్యా అన్నది కూడా తేల్చలేదు. మండలాల వారీగా హత్యల లెక్కలు: మదనపల్లె–3, రాయచోటి–2, పీలేరు–2, తంబళ్లపల్లె–2, వాల్మీకిపురం–1, కురబలకోట–1, నిమ్మనపల్లె–1, సోమల–1, రామసముద్రం–1 చొప్పున జిల్లాలో హత్యలు జరిగాయి. వైఫల్యానికి అసలు కారణాలు ఇవే! జిల్లాలో 24 స్టేషన్లు ఉండగా, 6 సీఐ, 28 ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో ఎస్సై 3 నుండి 4 హత్య కేసులు డీల్ చేయాల్సి వస్తోంది. పైగా క్లూస్ నమూనాలు కడప ల్యాబ్కు పంపితే రిపోర్ట్ రావడానికి 3 నెలలు పడుతోంది. ఈ లోపే నిందితులు ఆధారాలు మాయం చేస్తున్నారు. సైబర్ సెల్లో సిబ్బంది లేకపోవడంతో నిందితుల ఫోన్ డేటా తెప్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కాగా, జిల్లాలోని 180 మంది రౌడీషీటర్లపై నిఘా కరువైంది. గత 6 నెలల్లో జరిగిన 3 హత్యల్లో రౌడీషీటర్ల హస్తం ఉన్నా ముందస్తు చర్యలు లేవు. అలాగే 2022 నుంచి ఇప్పటివరకు పలు కేసుల్లో పోలీసులు ఛార్జ్షీట్లు దాఖలు చేయలేదు. ఫలితంగా కోర్టుల్లో విచారణ మందగించి నిందితులు సులభంగా బెయిల్స్ తెచ్చుకుంటున్నారు. -
పశువుల అక్రమ తరలింపు రెండు వాహనాలు సీజ్
పీలేరురూరల్ : పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలు సీజ్ చేసి పది పశువులను గోశాలకు తరలించినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో పీలేరు మండలం తలపుల నుంచి పది పశువులతో రెండు వాహనాలు పుంగనూరుకు వెళుతుండగా స్థానిక క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు ఆపి పరిశీలించారు. అయితే వాహనదారులు పశువుల తరలింపుకు సంబంధించి సరైన సమాధానం చెప్పకపోవడం, తగిన పత్రాలు చూపించకపోకపోవడంతో వాహనాలను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. పశువులను చిన్నగొట్టిగల్లు గోశాలకు తరలించారు. పుంగనూరుకు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వైఎస్సార్ కడపలో హాల్టింగ్స్
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా వాసులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ సరికొత్త తీపి కబురు అందించింది. కడప మీదుగా బీహార్కు నేరుగా ప్రయాణించేందుకు వీలుగా సరికొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక రైలుగా నడుస్తున్న తిరుపతి–రక్సల్ ఎక్స్ప్రెస్ను క్రమబద్ధీకరిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిని 17433/17434 నంబర్లతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా ప్రకటించారు. జూన్ 1న తిరుపతిలో ఈ రైలు అధికారికంగా ప్రారంభం కానుంది. తిరుగు ప్రయాణంలో జూన్ 4న రక్సల్లో ఈ రైలు (17434) బయలుదేరుతుంది. అంతర్జాతీయ సరిహద్దు.. నేపాల్కు మార్గం సుగమం ఈ రైలు చివరి స్టాపేజ్ అయిన రక్సల్ జంక్షన్ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో, ఇండో–నేపాల్ సరిహద్దు వెంబడి ఉన్న ఒక కీలకమైన రైల్వే కేంద్రం. ఇది భారతదేశానికి, పొరుగున ఉన్న నేపాల్లోని ప్రముఖ పారిశ్రామిక నగరమైన ’బిరగంజ్’కు మధ్య వాణిజ్యం, ప్రయాణానికి ప్రధాన రవాణా కేంద్రంగా కొనసాగుతోంది. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల నేపాల్ వెళ్లే పర్యాటకులకు, భక్తులకు మార్గం ఎంతో సుగమం కానుంది. జ్యోతిర్లింగ దర్శనం.. ఉత్తర భారత పట్టణాలకు అనుసంధానం ఈ రైలు ప్రయాణం ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన ’బాబా బైద్యనాథ్ ధామ్’ (దేవ్ఘర్) సందర్శించుకునేందుకు ఉమ్మడి కడప జిల్లావాసులకు సువర్ణావకాశం లభిస్తుంది. ఈ రైలు మార్గంలో జార్ఖండ్ రాజధాని రాంచీ, ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్తో పాటు దుర్గ్, గోండియా, బిలాస్పూర్, ఝార్సుగూడ, రూర్కెలా, బొకారో స్టీల్ సిటీ, ధన్బాద్, ఝాఝా, జాసిదిహ్, చిత్తరంజన్, బరౌని, దర్భంగా, సమస్తీపూర్, సీతామర్హి వంటి ఉత్తరభారత దేశంలోని ప్రధాన పారిశ్రామిక, పట్టణాలకు నేరుగా ప్రయాణసౌకర్యం లభించనుంది. తెలంగాణాలో హాల్టింగ్స్ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణాతో ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుసంధానమయ్యేలా ఈ రైలు నడవనున్నది. కృష్ణా జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట జంక్షన్, పెద్దపల్లి జంక్షన్, మంచిర్యాల, సిర్పూర్ కాగజనగర్ స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. వలస కార్మికులు, ఉద్యోగులకు వరం ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో బీహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు స్థిరపడ్డారు. అలాగే గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని విభాగాలలో బీహార్తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైల్వే ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లాలంటే ఇప్పటివరకు గూడూరు జంక్షన్కు లేదా విజయవాడకు వెళ్లి, అక్కడ వేరే రైళ్లు మారాల్సి వచ్చేది. తాజా తిరుపతి–రక్సల్ ఎక్స్ప్రెస్తో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్ పడినట్లయింది. 17433/34 రక్సల్–తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మొత్తం 24 బోగీలు ఉంటాయి. ఇందులో సెకండ్ ఏసీ – 3 కోచ్లు, థర్డ్ ఏసీ – 5 కోచ్లు, స్లీపర్ కోచ్లు – 10, జనరల్ కోచ్లు – 4, ఎస్ఎల్ఆర్ – 2 కోచ్లు 1 నుంచి ‘తిరుపతి–రక్సల్’వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభం కడప, ఎర్రగుంట్ల మీదుగా బీహార్కు నేరుగా రైలు సరికొత్త రైలును ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ఒకే రైలు.. ఎన్నో ప్రయోజనాలు కడప మీదుగా జ్యోతిర్లింగ దర్శనం నేపాల్కు మార్గం సుగమం ఉత్తర భారత కార్మికులు,ఉద్యోగుల కష్టాలకు చెక్ వైఎస్సార్ కడప జిల్లాలోని రైలుమార్గంలో ప్రస్తుతానికి కడప, ఎర్రగుంట్ల స్టేషన్లలో మాత్రమే తిరుపతి–రక్సల్ రైలు ఆగనున్నది. అయితే రాజంపేట పార్లమెంట్ పరిధిలోని రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట, మరియు ఎంతోమంది రైల్వే ఉద్యోగులు, కార్మికులకు నిలయమైన ప్రముఖ రైల్వేకేంద్రం నందలూరు స్టేషన్లలో కూడా ఈ రైలుకు హాల్టింగ్ ఇస్తే స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రయాణికులు కోరుతున్నారు. ఆ దిశగా రైల్వేశాఖ యోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆందోళనకు తరలి రండి
డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తరలి రావాలని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిశోర్ దాస్ పిలుపునిచ్చారు. మదనపల్లెలోని అంబేడ్కర్ సర్కిల్లో ఉదయం 9.30గంటలకు ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ మోసం చేస్తున్న తీరుపై ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. పార్టీలు, వర్గాలకతీతంగా తరలి వచ్చి మద్దతు తెలియజేయాలని కోరారు. – జంగంరెడ్డి కిశోర్ దాస్, వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, అన్నమయ్య -
● తంబళ్లపల్లె: రోడ్డున పడ్డ విభేదాలు.. కారు అద్దాలు ధ్వంసం!
తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య శత్రుత్వం పతాక స్థాయికి చేరింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ములకలచెరువు బస్టాండ్ సర్కిల్లో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కేక్ కట్ చేసేందుకు ఆయన వర్గీయులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నకిలీ మద్యం కేసులో ఇరుక్కున్న జయచంద్రారెడ్డి వర్గానికి చెందిన రమేష్ అనే నాయకుడు తన కారులో అక్కడికి చేరుకుని మొబైల్లో వీడియో తీయడం మొదలుపెట్టాడు. దీనిని శంకర్ యాదవ్ వర్గీయులు తీవ్రంగా అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన శంకర్ వర్గీయులు రమేష్ కారు అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ఛార్జ్ లేని ఈ నియోజకవర్గంలో మహానాడు ‘ఎవరికి వారే యమునా తీరం’లా సాగింది. -
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : కర్ణాటక రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నిమ్మనపల్లి మండల యువకుడు మృత్యువాత పడ్డాడు. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం మేరకు.. నిమ్మనపల్లి మండలం, వెంగంవారిపల్లెకు చెందిన రఘునాథరెడ్డి కుమారుడు వెర్రి హరీష్ (26) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో శని, ఆదివారం గంగ జాతర ఉందని తల్లిదండ్రులు హరీష్ను ఇంటికి రమ్మని కోరారు. దీంతో హరీష్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరి వస్తుండగా, మార్గమధ్యంలోని హెచ్ క్రాస్– కై వారం మధ్యలో టీవీఎస్ ఎక్సెల్లో వస్తున్న వృద్ధుడు హఠాత్తుగా రోడ్డుకు అడ్డు రావడంతో, బుల్లెట్ ఢీకొని హరీష్ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న చింతామణి రూరల్ పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం చింతామణి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.నిమ్మనపల్లి యువకుడు మృతి -
ప్రతిభ ఫ్లైట్ ఎక్కించింది
సాక్షి, మదనపల్లె: పదవ తరగతి పరీక్షల్లో హైసూ్కల్ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరిని విమానంలో ప్రయాణం చేయిస్తానని చెప్పిన బి.కొత్తకోట మండలం గోళ్లపల్లె హైసూ్కల్ హెచ్ఎం శాంతకుమారి చెప్పినట్టుగానే ఇద్దరు విద్యార్థులకు విమానంలో ప్రయాణం చేయించారు. పదవ తరగతి పరీక్షల్లో గుడిసెవారిపల్లెకు చెందిన విద్యార్థి వరుణ్సందేశ్రెడ్డి, చందనలు 600 మార్కులకు 555 మార్కులు సాధించారు. హైస్కూల్ ఫలితాల్లో ఈన ఇద్దరే ప్రథమం కావడంతో బుధవారం హెచ్ఎం శాంతకుమారి విద్యార్థులతో కలిసి తిరుపతి నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తొలిసారి విమానం ఎక్కి ప్రయాణించి విద్యార్థులు ఈ అనుభూతిని మరచిపోలేమని, హెచ్ఎం ప్రోత్సాహంతోనే ఈ అవకాశం దక్కిందని అన్నారు. విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలన్న తపనతోనే విమాన ప్రయాణం కల్పించినట్లు శాంతకుమారి చెప్పారు. దీనిపై ఎంఈవో రెడ్డిశేఖర్ హెచ్ఎంను, విద్యార్థులను అభినందించారు. -
తహసీల్దార్, ఆర్ఐ రాలేదని దళితుల ధర్నా
కలెక్టర్ చర్యలు తీసుకోకుంటే అర్ధనగ్నప్రదర్శన పుంగనూరు: ప్రతినెల జరిగే ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశానికి తహసీల్దార్, ఆర్ఐతో పాటు 27 శాఖల అధికారులు రాకపోవడంతో దళిత నేతలు ధర్నా చేసి , నిరసన తెలిపారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్,మానిటరింగ్ కమిటి సమావేశం నిర్వహించారు. అధికారులు, తహసీల్దార , ఆర్ఐ కూడా రాకుండా దళితులను అవమానపరుస్తున్నారని దళిత సంఘాల ప్రతినిధులు అశోక్, నరసింహులు, శంకరప్ప, చెన్నరాయుడు లు మండిపడ్డారు. నామమాత్రపు సమావేశాలు ఎందుకంటూ బహిష్కరించి , తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి, నినాదాలు చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని , లేకపోతే అర్ధనగ్నప్రదర్శనలతో ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు పెంచుపల్లి కృష్ణ, రమణ, రాజ, శంకర, రామకృష్ణ, తోటనరసింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పులిచెర్ల (కల్లూరు) : కల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.... కల్లూరు –పీలేరు జాతీయ రహదారిలో పెట్రోల్ బంకువద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపేట పంచాయతీ శాంతి నగర్కు చెందిన లక్మ్యయ్య(50 )స్వగ్రామం నుంచి పీలేరుకు ద్విచక్రవాహనంలో వెళుతుండగా పీలేరు నుంచి ఎదురుగా వస్తున్న ఈచర్ లారీ వాహనం ఢీకొనడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకొన్న కల్లూరు పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతి అదృశ్యంరొంపిచెర్ల : రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల గ్రామ పంచాయతీలో యువతి అదృశ్యమైనట్లు మహిళ తల్లి భాగ్యలక్ష్మీ రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం చండ్రామాకులపల్లె గ్రామ పంచాయతీ బంటిమిట్టకు చెందిన బెంగళూరు భాగ్యలక్ష్మీ తన కుమారై జోష్న (19)ను కె.వి.పల్లె మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ పెద్ద కమ్మపల్లెకు చెందిన ఆంజినేయులుకు ఇచ్చి వివాహం చేశామని తెలిపారు. వీరు రెండు నెలల క్రితం రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల గ్రామ పంచాయతీ నడింపల్లెలో భూమి లీజుకు తీసుకుని టమాట పంట సాగు చేశారని తెలిపారు. అయితే ఈ నెల 21వ తేది తన కూతురు పక్కింటి వారితో మాట్లాడి వస్తానని భర్త ఆంజనేయులకు చెప్పి వెళ్లిందని తెలిపారు. అయితే ఎంత సేపటికీ ఇంటికి రాక పోవడంతో గ్రామంలో గాలించామని తెలిపారు. అయితే కొందరు ఆర్టీసీ బస్సులో పీలేరుకు వెళ్లిందని తెలిపారన్నారు. బంధువుల ఇళ్లు గాలించామని ఎక్కడా ఆచూకీ లేదన్నారు. తన కుమార్తె పెళ్లికాక ముందు చండ్రా మాకులపల్లెకు చెందిన సద్దాంబాషా అనే వ్యక్తితో చనువుగా ఉండేదని తెలిపారు. అతని మీద అనుమానం ఉందని రొంపిచెర్ల పోలీసులకు తల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూదన్ బుధవారం తెలిపారు. ఇనుప వస్తువులు దొంగలించిన వ్యక్తి అరెస్ట్ఎర్రగుంట్ల : యర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామ సమీపంలో ఉన్న మెగా ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలోని స్టోర్లో ఉన్న ఇనుప వస్తువులను దొంగిలించిన అరూప్ కూమర్ బెర అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మెగా ఇంజినీరింగ్ కంపెనీలో స్టోర్ ఇన్ఛార్జిగా అరూప్ కుమార్ బెర పని చేస్తున్నారన్నారు. స్టోర్లో ఉన్న సుమారు రూ. 3.09 లక్షలు విలువైన 13 టన్నుల ఇనుప ప్లేట్లను దొంగిలించారన్నారు. కంపెనీ హెచ్ఆర్ వినోద్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేంపల్లి రోడ్డులోని పెద్దనపాడు సాయిబాబు ఆలయం వద్ద నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. బీహార్ వాసి అరెస్ట్ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండులో గంజాయి కలిగి ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన గంగూలి కుమార్ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్టీసీ బస్టాండు ఆవరణంలో బుధవారం బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన గంగూలి కుమార్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో టూ టౌన్ సీఐ వంశీనాథ్ అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా సుమారు 200 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. -
ప్రతిభ ఫ్లైట్ ఎక్కించింది
సాక్షి, మదనపల్లె: పదవ తరగతి పరీక్షల్లో హైస్కూల్ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరిని విమానంలో ప్రయాణం చేయిస్తానని చెప్పిన బి.కొత్తకోట మండలం గోళ్లపల్లె హైస్కూల్ హెచ్ఎం శాంతకుమారి చెప్పినట్టుగానే ఇద్దరు విద్యార్థులకు విమానంలో ప్రయాణం చేయించారు. పదవ తరగతి పరీక్షల్లో గుడిసెవారిపల్లెకు చెందిన విద్యార్థి వరుణ్సందేశ్రెడ్డి, చందనలు 600 మార్కులకు 555 మార్కులు సాధించారు. హైస్కూల్ ఫలితాల్లో ఈన ఇద్దరే ప్రథమం కావడంతో బుధవారం హెచ్ఎం శాంతకుమారి విద్యార్థులతో కలిసి తిరుపతి నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తొలిసారి విమానం ఎక్కి ప్రయాణించి విద్యార్థులు ఈ అనుభూతిని మరచిపోలేమని, హెచ్ఎం ప్రోత్సాహంతోనే ఈ అవకాశం దక్కిందని అన్నారు. విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలన్న తపనతోనే విమాన ప్రయాణం కల్పించినట్టు శాంతకుమారి చెప్పారు. దీనిపై ఎంఈవో రెడ్డిశేఖర్ హెచ్ఎంను, విద్యార్థులను అభినందించారు. -
ఘాట్ రోడ్డులో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని అయిదవ మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడిన విషయం తెలిసిందే. అయితే ఆ గ్యాస్ ట్యాంకర్ నుంచి బుధవారం ఎట్టకేలకు ఫైర్, ఐఓసీఎల్, పోలీసు అధికారులు కలసి మరో మూడు గ్యాస్ ట్యాంకర్లు తెప్పించి అందులోకి గ్యాస్ మార్పించారు. బుధవారం క్రేన్ల సహాయంతో రోడ్డుపై అడ్డంగా పడిన ట్యాంకర్ను రోడ్డుపై నిలుపగలిగారు. మధ్యాహ్నం సమయానికి వాహనాలను యథావిధిగా గువ్వలచెరువు ఘాట్ రోడ్డు గుండా అనుమతించి ట్రాఫిక్ సరి చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలి కడప ఎడ్యుకేషన్ : పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో వంట సిబ్బంది పాత్ర కీలకం అని ఏరువాక కేంద్ర సమన్వయకర్త డాక్టర్ ఎన్. కృష్ణప్రియ అన్నారు. ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద వంట మనుషులు, సహాయకులు మరియు కిచెన్ మేనేజర్లకు ‘‘స్మార్ట్ కిచెన్ మేనేజ్మెంట్’’పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, వంటగది పరిశుభ్రత, వంటకు ముందు ముడి పదార్థాల శుభ్రపరిచే విధానాలు మరియు పోషక విలువలు కోల్పోకుండా కూరగాయలను కట్ చేసే శాసీ్త్రయ పద్ధతులపై అవగాహన కల్పించారు. వంటగదుల్లో సరైన నిల్వ విధానాలు, పురుగుల నివారణ చర్యలపై కేవీకే అధినేత డా. వి.శిల్పకళ సాంకేతిక అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ ముగించున్న వంటమనుషులు, సహాయకులతోపాటు కిచెన్ మేనేజర్లకు సర్టిఫికెట్లు అందజేశారు.● బోల్తాపడిన ట్యాంకర్ నుంచి క్షేమంగా గ్యాస్ బదిలీ ● ఎట్టకేలకు క్రేన్ల సహాయంతో ట్యాంకర్ను నిలిపిన వైనం -
● అక్రమ కమీషన్ సొమ్మును తిరిగి ఇప్పిస్తాం
సాక్షి, మదనపల్లె: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో దళారీలు, మండీ యజమానుల దందా మళ్లీ పడగ విప్పింది. చంద్రబాబు సర్కార్ సంక్షేమాన్ని కేవలం మాటలకే పరిమితం చేసి, క్షేత్రస్థాయిలో అన్నదాతల ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రైతులను దళారుల దోపిడీ నుంచి రక్షించేందుకు తీసుకొచ్చిన చరిత్రాత్మక ఉత్తర్వులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. మార్కెట్ యార్డుల్లో మండి యజమానులు రైతులను నిలువునా దోచుకునేందుకు సర్కార్ పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 10 శాతం కమీషన్ పేరిట రైతుల నుంచి రోజుకు రూ.కోట్ల సొమ్ము దోచుకుంటున్నా మార్కెటింగ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. రూ.వందల కోట్ల వ్యాపారం.. దళారుల పాలు! ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా రైతులు టమాటా పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మదనపల్లె, ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ, పుంగనూరు మార్కెట్ యార్డులకు ప్రతి నెలా వేల టన్నుల టమాటా విక్రయానికి వస్తుంది. సీజన్ సమయంలో టమాటా విలువ ఒక్కరోజుకే రూ.కోట్లలో ఉంటుంది. నిబంధనలు ఏం చెబుతున్నాయి? వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మార్కెట్ యార్డుల్లో రైతులు అమ్మే పంట ఉత్పత్తుల ధర నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయకూడదు. పంటను కొనుగోలు చేసే వ్యాపారుల (బయ్యర్స్) నుంచే యూజర్ చార్జీల కింద 1 శాతం వసూలు చేయాలి. దీనివల్ల రైతుపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. కానీ అమలు చేయాల్సిన మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో ఈ దందా జిల్లా అంతటా యథేచ్ఛగా సాగుతోంది. ములకలచెరువులో రైతుల ఆందోళనతో బట్టబయలు టమాటా రైతుల నుంచి జరుగుతున్న 10 శాతం కమీషన్ వసూళ్ల వ్యవహారం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా, మంగళవారం ములకలచెరువు మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రైతులు ఉప్పెనలా నిరసనకు దిగడంతో ఈ దోపిడీ అధికారికంగా వెలుగులోకి వచ్చింది. అధికారి సంచలన నిజం: °Æý‡-çܯ]l çÜ…§ýl-Æý‡Â…V> OÆð‡™èl$ ¯éĶæ$-MýS$yýl$ ç³§ýlÃ-¯é¿ýæÆð‡yìlz.. "rÐ]l*-sê OÆð‡™èl$ÌS ¯]l$…_ AçÜË$ MýSÒ$-çÙ-¯Œl G…™èl Ð]lçÜ*Ë$ ^ólĶæ*-Í?" A° Ð]l*Æð‡PsŒæ M>Æý‡Å-§ýlÇØ ¯]lÒ¯Œl MýS$Ð]l*ÆŠæ Æð‡yìlz° °ÌS-©-Ô>Æý‡$. ©°MìS çÜÐ]l*-«§é¯]l…V> M>Æý‡Å§ýlÇØ çܵ…¨-çÜ*¢.. Æ>çÙ‰-ÐéÅç³¢…V> A°²^øsêÏ 10 Ô>™èl… MýSÒ$-çÙ-¯Œl Ð]lçÜ*Ë$ ^ólçÜ$¢¯]l² Ð]l*r ÐéçÜ¢-Ð]lÐól$¯]l° OÆð‡™èl$ÌS Ýë„ìSV> A…X-MýS-Ç…-^éÆý‡$. ©…™ø Ð]l¬ÌSMýS-ÌS-^ðl-Æý‡$Ð]l# Ð]l*Æð‡PsZϯ]l* D §øí³yîl Ķæ$£ól-^èleV> ÝëVýS$-™èl$¯]l²r$Ï çܵçÙt-OÐðl$…-¨.-⚠️ ఏడీ త్యాగరాజురైతుల నిరసన తీవ్రరూపం దాల్చడంతో మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ త్యాగరాజు రంగంలోకి దిగి సర్దుబాటు చర్యలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ..‘టమాటా మండి యజమానులు జిల్లాలో ఏ మార్కెట్లోనూ కమీషన్ వసూలు చేయరాదు. అలా వసూలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కొత్త రైతు చట్టాల నిబంధనల మేరకు రైతుల నుంచి కమీషన్ వసూలు చేయడం పూర్తిగా తప్పు. ఇప్పటికే రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసిన కమీషన్ను తిరిగి వసూలు చేసి రైతులకు ఇప్పిస్తాం. దీనికోసం మండి యజమానులు ఇచ్చిన రసీదులను రైతులు మాకు అందజేయాలి. ఆ రసీదుల ఆధారంగా ఏ మండీ కమీషన్ వసూలు చేసిందో గుర్తించి, వారి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి రైతులకు ఇప్పిస్తాం‘ అని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు సర్కార్ ఇప్పటికై నా కనువిప్పి, గత ప్రభుత్వం అమలు చేసిన రైతు అనుకూల ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని, కేవలం రసీదులు అడగడం వంటి సాకులు చెప్పకుండా క్షేత్రస్థాయిలో దళారుల దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి సర్కార్ ‘గ్రీన్ సిగ్నల్’ జగనన్న తెచ్చిన 1% ‘యూజర్ చార్జ్’ నిబంధనను తుంగలో తొక్కినచంద్రబాబు ప్రభుత్వం! మార్కెట్ యార్డుల్లో బహిరంగంగా దళారీల రాజ్యం! మదనపల్లె, ములకలచెరువు, పుంగనూరు, గుర్రంకొండల్లో నిలువు దోపిడీ! రోజువారీ కోట్లాది రూపాయలటర్నోవర్పై 10 శాతం కమీషన్ల వేటు! రాష్ట్రవ్యాప్తంగా దోపిడీ నిజమేనని రైతుల సాక్షిగా ఒప్పేసుకున్న మార్కెట్ సెక్రటరీ! కార్యాలయాల ముట్టడితోదిగొచ్చిన ఏడీ త్యాగరాజు ‘కమీషన్ సొమ్ము వెనక్కి ఇప్పిస్తాం!’అంటూ హామీ -
హత్యాయత్నం కేసులో భర్త అరెస్టు
పెద్దతిప్పసముద్రం : ఒంటిపై కిరోసిన్ పోసి హత్యా యత్నానికి పాల్పడిన, కట్నం కోసం వేధింపులకు గురి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పరమేశ్ నాయక్ తెలిపారు. బుధవారం ఎస్ఐ తెలిపిన కథనం మేరకు వివరాలిలా.. మండలంలోని అంకిరెడ్డిపల్లికి చెందిన కోనమ్మ (60), బయప్ప (65) దంపతుల కుమారుడు బయారెడ్డి (35)కి ఇదే పంచాయతీలోని తోకలవారిపల్లికి చెందిన స్ఫూర్తి (30) అనే యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగింది. కాగా.. భర్తతో పాటు అత్తా, మామల వేధింపులు తాళలేక నెల రోజుల క్రితం స్ఫూర్తి తోకలవారిపల్లికి చేరుకుంది. తన భార్య కాపురానికి రాలేదని భర్త ఆమైపె మరింత అనుమానం పెంచుకున్నాడు. ఈ తరుణంలో ఈ నెల 26న బయారెడ్డి ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ తీసుకుని తోకలవారిపల్లిలో ఉన్న భార్య స్ఫూర్తి, ఆమె పిన్నమ్మ సుజాతల ఒంటిపై పోసి హత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్ఫూర్తి ఫిర్యాదు మేరకు భర్తపై హత్యాయత్నం, అత్తా, మామలపై అదనపు కట్నం కోసం వేధింపుల కేసు నమోదు చేసి ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసామని ఎస్ఐ తెలిపారు. అనంతరం హత్యా యత్నానికి పాల్పడిన బయారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపామని ఎస్ఐ పేర్కొన్నారు.అత్తా, మామలపై వరకట్న వేధింపుల కేసు -
ముదివేడులో దళిత మహిళపై దాడి
మదనపల్లె టౌన్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న దళిత మహిళపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన బుధవారం కురబలకోట మండలం ముదివేడులో వెలుగు చూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. ముదివేడుకు చెందిన బి. రాజమ్మ (50) తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లకూడదని అదే వీధిలో నివసించే ఆఫ్సల్, హసీనా, షాహిన తదితరులు ఆమెను అడ్డుకున్నారు. పూర్వీకుల నుంచి వాడుకలో ఉన్న దారిలో పోకుండా మరే దారిలో వెళ్లాలని రాజమ్మ ప్రశ్నించడంతో ఆగ్రహించిన పలువురు ఆమైపె మూకుమ్మడిగా దాడి చేసి అసభ్యకరంగా దూషించారని ఆరోపించింది. దాడిలో గాయపడిన రాజమ్మను కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
శాంతియుతంగా బక్రీద్ జరుపుకోవాలి
మదనపల్లె టౌన్ : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపు కోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆకాంక్షించారు. ఈసందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. పండుగ వేళ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా పోలీస్ అధికారులను సిబ్బందిని ఆయన ఆదేశించారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పండుగ పూట ఎలాంటి అపోహలకు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా చూడాలని అధికారులకు సూచించారు. సామాజిక మాధ్యమాలపై పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ ఉంచిందని ఎస్పీ స్పష్టం చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్న్స్ట్రాగామ్ వంటి సామాజిక వేదికల్లో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా గానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గానీ అభ్యంతరకర పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ -
మదనపల్లెకు టమాటా వరద
● విక్రయానికి 1,080 టన్నులు సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్ యార్డ్కు టమాటా వరదలా వచ్చి పడుతోంది. పది రోజులుగా కొద్దిగా పెరుగుతూ వచ్చిన దిగుబడి బుధవారం భారీగా వచ్చింది. ఏకంగా 1,080 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. గతంతో పోలిస్తే అత్యధిక ఏ గ్రేడ్ రకం ధర కిలో రూ.26 పలికింది. అంటే గత రెండు రోజులు కిలో 30 పలికింది. దిగుబడి పెరగడంతో కిలో రూ.4 తగ్గింది. సోమవారం ఏ గ్రేడ్ అత్యధిక ధర కిలో రూ.30 పలకగా 873 టన్నుల టమాట వచ్చింది. మంగళవారం ఏ గ్రేడ్ అత్యధిక ధర కిలో రూ.30 పలికితే విక్రయానికి 895 టన్నులు వచ్చింది. బుధవారం దీనికి మించి వచ్చింది. ఈ టమాట దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో జరుగుతున్న సీపీఎల్ సీజన్ 2లో పాయ్ వైస్రాయ్ జట్టు ఫైనల్కు చేరింది.బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆదిత్య బిఆర్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాయ్ వైస్రాయ్ జట్టు 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ జట్టులో జహీర్ అబ్బాస్ 28 బంతుల్లో 54 పరుగు చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దిత్య బిఆర్ జట్లు 147 పరుగులకే ఆలౌలైంది. జహీర్ అబ్బాస్కు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రటరీ సతీష్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేశారు. -
భూకబ్జాదారుల నుండి మా భూములు కాపాడండి
మదనపల్లె టౌన్ : వంశపారంపర్యంగా వచ్చిన తమ వ్యవసాయ భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎరజ్రేనువారిపల్లి గ్రామ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్లో బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. కురబలకోట మండలం, సంధిరెడ్డిగారిపల్లి పంచాయతీ ఎరజ్రేనువారిపల్లి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్లు 605–1, 595, 677 పరిధిలోని సాగు భూములను తాము దాదాపు 100సంవత్సరాలకు పైగా వారసత్వంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. 2023 నుంచి కొందరు వ్యక్తులు కలిసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ముదివేడు పోలీస్ స్టేషన్న్ లో కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి భూములకు రక్షణ కల్పించాలని బాలకృష్ణారెడ్డి, రెడ్డప్ప రెడ్డి, సుధాకర్ రెడ్డి, సావిత్రి విజ్ఞప్తి చేశారు.ఎరజ్రేనువారిపల్లి రైతుల వేడుకోలు -
పిడుగు పాటుకు ఉపాధి కూలీకి గాయాలు
సంబేపల్లె : మండల పరిధిలోని అడవికమ్మపల్లె గ్రామం బండకాడ హరిజనవాడకు చెందిన ఆంజనేయులు పిడుగుపాటుకు గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఆంజనేయులు గ్రామ సమీపంలోని పొలాల్లో జరుగుతున్న ఉపాధి పనికి వెళ్లాడు . ఈ క్రమంలోనే బుధవారం ఉరుములతో కూడిన వర్షం పడటంతో ఒక్కసారిగా పెద్దశబ్దం రావడంతో పిడుగు పడి పెద్దశబ్దం వచ్చినట్లు తోటి కూలీలు తెలిపారు. అప్పటికే ఆంజనేయులకు గాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరామర్శించిన ఉపాధి అధికారులు : పిడుగుపాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులను ఉపాధి ఏపీడీ మధుబాబు, ఎంపీడీఓ సురేష్, ఏపీఓ రెడ్డిజవహర్లు పరామర్శించారు. -
జనగణనను పారదర్శకంగా నిర్వహించాలి
గాలివీడు: ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జిల్లాలో జనగణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాయచోటి డివిజన్లోని గాలివీడు, రామాపురం మండలాల్లో జరుగుతున్న జన గణన–2026 ఎన్యుమరేషన్ ప్రక్రియను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి జనగణన పూర్తిచేసిన గృహాలకు వేసిన డోర్ నంబర్లు, ఆన్లైలో నమోదు చేసిన సమాచారాన్ని రికార్డులతో సరిపోల్చి పరిశీలించారు. అలాగే ఖాళీగా ఉన్న, తాళం వేసిన గృహాలను ప్రత్యేకంగా పరిశీలించిన కలెక్టర్, ఆ గృహాలపై చుట్టుపక్కల వారిని అడిగి సమాచారం సేకరించారు. గాలివీడు మండలంలో బ్లాక్ నంబర్లు 47, 48, రామాపురం మండలంలో 47వ బ్లాక్ పరిధిలో పలు గృహాలను తనిఖీ చేసి, డోర్ నంబర్లు, యాప్లో నమోదైన సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా మండలాలలో ఎన్ని ఖాళీ గృహాలు, తాళం వేసిన గృహాలు ఉన్నాయని కలెక్టర్ ప్రశ్నించగా, గాలివీడులో 2147 ఖాళీ, 55 తాళం వేసినవి, రామాపురం మండలంలో 1620 ఖాళీ, 76 తాళం వేసిన గృహాలు ఉన్నట్లు తహసీల్దార్లు వివరించారు. అనంతరం పలు అంశాల గురించి చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు భాగ్యలత, వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
దివ్యత్యాగాలకు ప్రతీక బక్రీద్
మదనపల్లె సిటీ : దివ్య త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను గురువారం ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ పండుగను ఈద్ ఉల్ అజ్ హా అని కూడా పిలుస్తారు. ఇస్లాం కాలమానంలోని 12వ నెల జిల్హజ్జా. ఈనెలలోని పదవ తేదీన పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు ఓ చారిత్రక నేపథ్యం ఉంది. ప్రవక్త హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు సంతానం కలగకుండా ఉంటే ఆ దంపతులు అనేక సంవత్సరాలు దైవప్రార్థనలు చేస్తారు. వారి ప్రార్థనలు ఫలించి తన 80వ ఏట ముదసలి వయసులో వారికి సంతానం కలుగుతుంది. అతనిని హజరత్ ఇస్మాయిల్గా నామకరణం చేస్తారు. ముదసలి వయసులో జన్మించిన తన ఏకై క కుమారుడు హజరత్ ఇస్మాయిల్ను వారు అత్యంత గారాబంతో పెంచుకుంటూ ఉంటారు. ఇదిలాఉండగా ప్రవక్త హజరత్ ఇబ్రహీంకు ఒక రోజు కల వస్తుంది. ఆ కలలో దైవం అతనితో మాట్లాడుతూ తనకు అత్యంత ప్రీతిపాత్ర అయిన దానిని దైవమార్గంలో బలి ఇవ్వమని కోరుతుంది. మరుసటి రోజు ఉదయం ప్రవక్త హజరత్ ఇబ్రహీం దైవమార్గంలో తన కిష్టమైనటువంటి అనేక వస్తువులను దైవమార్గంలో ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ ప్రతి రోజు ఆ కల అలాగే వస్తూ ఉంటుంది. దీంతో ప్రవక్త హజరత్ ఇబ్రహీంకు అర్థమవుతుంది. తనకు అత్యంత ప్రీతి పాత్ర అయినటువంటి తన ఏకై క సంతానమైన హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం బలిని దైవం కోరుకుంటోందని, దీనిని గ్రహించిన హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం తనకు అత్యంత ప్రీతి పాత్ర అయినటువంటి తన ఏకై క సంతానమైన హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను దైవమార్గంలో బలి ఇవ్వడానికి సిద్ధపడుతారు. మరుసటి రోజు ప్రవక్త హజరత్ ఇబ్రహీం తన ఏకై క సంతానమైన హజరత్ ఇస్మాయిల్ ను స్నానం చేయించి నూతన బట్టలు ధరింపజేస్తారు. అనంతరం తన భార్య, కుమారునితో మాట్లాడుతూ తనకు దైవం నుంచి వచ్చిన కల గురించి వివరిస్తారు. దీనికి వారు సమ్మతి తెలుపుతారు. మరుసటి రోజు ఉదయం ప్రవక్త హజరత్ ఇబ్రహీం తన కుమారుడిని ఊరి బయటకు తీసుకెళ్లి పదునైన కత్తితో బలి చేయడానికి సిద్ధపడుతారు. ఓ వైపు దైవాజ్ఞకే పెద్దపీట వేసి తన కుమారుడిని బలి చేయుటకు నిర్ణయం తీసుకుంటారు. కత్తితో గొంతును కోయడానికి ఎంత ప్రయత్నించినా ఆ కత్తి తెగదు. కోపంతో కత్తిని విసరివేయగా ఆ సమయంలో దైవవాణి వినిపిస్తుంది. ఓ ప్రవక్త హజరత్ ఇబ్రహీం నీకు దైవాజ్ఞ ఎక్కువో పుత్ర వాత్సల్యం ఎక్కువో కనుగొనుటకు నీకు పెట్టిన పరీక్షలో నీవు నెగ్గావు. నేను నీ కుమారుని బలి కోరుకోవడం లేదంటూ ఆకాశం నుంచి ఓ దుంబాను పంపించి ఖుర్బానీ చేయమని ఆదేశించడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ముస్తాబైన ఈద్గాలు: జిల్లా కేంద్రమైన మదనపల్లెతో పాటు రాయచోటి, పీలేరు, వాల్మీకిపురం, పుంగనూరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు, రాజంపేట, బి.కొత్తకోట ప్రాంతాలతో పాటు పలు మండల కేంద్రాల్లోని ఈద్గాలు బక్రీద్ పండుగకు ముస్తాబు చేశారు. ఖుర్బానీ మూడు భాగాలుగా చేయాలి ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. ఖుర్బానీ ద్వారా వచ్చిన మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక వంతు పేదలకు, రెండో భాగాన్ని బంధుమిత్రులకు ఇవ్వాలి. మరో భాగాన్ని తన కోసం వినియోగించాలి. –హాఫీజ్ ఇక్బాల్ సాహెబ్, ప్రభుత్వ ఖాజీ, మదనపల్లెనేడు ఈద్–ఉల్–అజ్హా పర్వదినం -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయం
పీలేరు రూరల్ : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ధ్యేయమని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు శవన్నగారి బాలాజి అన్నారు. బుధవారం స్థానిక కోటపల్లె శ్రీనివాస కల్యాణమండపంలో జిల్లా అభ్యాసవర్గ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సాధించడానికి తమ సంఘం కృషి చేస్తోందన్నారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తిరిగి పునరుద్దరించే వరకు తమ సంఘం పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అనురాధ, ఎంఈవో రెడ్డిబాషా, ఆపస్ జిల్లా అధ్యక్షులు మంద నరసింహులు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, సహఅధ్యక్షులు పచార్చర్ల సుధాకర్, సంఘ కార్యకర్త కొండారెడ్డి, ఆర్థిక కార్యదర్శి శివశంకర్, నాయకులు వేణుగోపాల్, సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, వెంకటరామిరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం
రామసముద్రం : ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక గ్రామం సుమారు 20గంటల పాటు అంధకారంలో చిక్కుకున్న సంఘటన రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కెసి.పల్లి పంచాయితీ గుంతఎంబాడీ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఈ విషయంపై గ్రామస్తులు ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇవ్వగా కొంతసేపట్లో మరమ్మతులు చేసి సరఫరా ఇస్తామని చెప్పి మిన్నకుండిపోయారు. దీంతో రాత్రంతా అంధకారం మధ్య గ్రామస్తులు జీవనం సాగించారు. మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం వరకు కూడా లైన్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డికి, లైన్ మాన్ రాజశేఖర్ కు విన్నవించినా ఇదిగో... అదిగో అంటూ కాలయాపన చేశారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు ల్యాప్ టాప్, మొబైల్ లకు ఛార్జింగ్ లు లేక పక్క గ్రామాలకు, సబ్ స్టేషన్ లకు వెళ్లి ఛార్జింగ్ లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు 20గంటల వరకు విద్యుత్ లేకపోవడంతో గ్రామంలో తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడి వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీశారు. దీనిపై ట్రాన్స్ కో ఏఈ మస్తాన్ కు సమాచారం ఇచ్చేందుకు ఫోన్లు చేసినా ఆయన స్పందించలేదు. మధ్యాహ్నం లైన్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డికి ఫోన్లు చేసి ఒత్తిడి చేయడంతో ఆయన వచ్చి మరమ్మతులు చేశారు. అయితే ఒక గ్రామం 20 గంటల పాటు అంధకారంలో ఉన్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 గంటల పాటు అంధకారంలో గుంత ఎంబాడి లాప్ టాప్, మొబైల్ చార్జింగ్ ల కోసం పక్క గ్రామాలకు పరుగులు తీసిన ఉద్యోగులు -
బొల్లవరం ప్లాట్ల వేలానికి ఏర్పాట్లు చేయండి
ప్రొద్దుటూరు: మున్సిపాలిటీ పరిధిలోని బొల్లవరం ప్లాట్ల వేలానికి ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రెవెన్యూ రీ సర్వే, జనగణనపై ఇన్చార్జి అధికారులైన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజుతో మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా చేపడుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రికార్డులను పరిశీలించారు. సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసులు, టీపీఓ చంద్రమోహన్, ఏఈలు సురేంద్ర, దస్తగిరి పాల్గొన్నారు. -
బస్సులో పొగలు
వాల్మీకిపురం : స్థానిక తరిగొండ వెంగమాంబ ఆర్చీ సమీపంలో గుర్రంకొండ నుంచి వాల్మీకిపురం వస్తున్న బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బుధవారం రాత్రి గుర్రంకొండ నుంచి తరిగొండ మీదుగా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు వాల్మీకిపురం సమీపంలోకి చేరుకుంది. స్థానిక తరిగొండ ఆర్చీ సమీపంలో ఒక్కసారిగా బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో బస్సులో ఉన్న దాదాపు 30 మంది ప్రయాణికులు ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించి బస్సులో నుంచి కిందకు దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులో నుంచి వస్తున్న పొగలపై నీరు చల్లారు. బస్సులో ఉన్న బ్యాటరీ వైర్లు షార్ట్ కావడంతో పొగలు వ్యాపించినట్లు గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. నెల రోజులుగా మండలంలో ఎక్కడబడితే అక్కడ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు నిలిచిపోతుండడంతో ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి కండీషన్లో ఉండే బస్సులను నడపాలని ప్రయాణికులు, మహిళలు కోరుతున్నారు. -
చిరుజల్లుల తొలకరిలో..
సాక్షి, అన్నమయ్య: వేసవికాలంలో సూర్య భగవానుడి ప్రచండ వేడిగాలులకు, భానుడి భగభగలకు బెంబేలెత్తిన అన్నమయ్య జిల్లా ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం లభించింది. దాదాపు మూడు, నాలుగు నెలలుగా ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు.. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వీస్తున్న చల్లగాలులతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకటి రెండు రోజులుగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై, ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండడంతో వాతావరణం మొత్తం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జూన్ నుంచి వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగా వాతావరణం ఇలా చల్లబడటం మంచి పరిణామమని జిల్లా వాసులు భావిస్తున్నారు.రాయచోటిలో అత్యధిక వర్షపాతంజిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల్లో భాగంగా రాయచోటి నియోజకవర్గంలో అత్యధికంగా 54.6 మి.మీ. రికార్డు వర్షపాతం నమోదైంది. అలాగే అత్యల్పంగా కలకడ మండలంలో 2.4 మి.మీ. వర్షం కురిసింది.ఉన్నఫళంగా వర్షం తీవ్రత పెరగడంతో పాటు ఈదురు గాలులు ముంచెత్తడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వేసవి వేడితో అల్లాడుతున్న వాతావరణం ఈ ఆకస్మిక వానలతో ఒక్కసారిగా చల్లదనంతో నిండిపోయింది. ఉపాధికి పోయి... పిడుగుపాటుకు గురై! వాతావరణం చల్లబడి ఉపశమనం లభించినప్పటికీ, జిల్లాలో పిడుగుపాట్లు తీవ్ర ఆందోళన కలిగించాయి. అన్నమయ్య జిల్లాతో పాటు పొరుగున ఉన్న వైఎస్సార్ జిల్లాలో మూడు, నాలుగు చోట్ల భారీగా పిడుగులు పడ్డాయి. సంబేపల్లె మండలంలో ఉపాధి హామీ పనికి వెళ్లిన ఒక కూలీ పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని అడవి కమ్మపల్లె గ్రామం బండకాడ హరిజనవాడకు చెందిన ఆంజనేయులు బుధవారం ఉదయం గ్రామ సమీపంలో ఉపాధి కూలి పనులకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఆంజనేయులుపై పిడుగు పడింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు గమనించి, తక్షణమే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు, కూలీలు ఎవరూ చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.’అబ్బా.. ఏం ఎండలు’.. తోటల్లో నేలరాలిన మామిడి ఏడాది వేసవి కాలంలో జిల్లా వ్యాప్తంగా ’వేసవి దెబ్బ... అబ్బా’ అనేలా రికార్డు స్థాయిలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి చివరి వారం మొదలుకొని మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అదరగొట్టడంతో భూగర్భ జలాలు కూడా చాలావరకు తగ్గుముఖం పట్టాయి. మధ్యాహ్న సమయంలో రోడ్లు, మార్కెట్లు బోసిపోయి కనిపించాయి. కాగా, ప్రస్తు తం కురిసిన వర్షం జనాలకు ఉపశమనం కలిగించినప్పటికీ, బలమైన గాలుల ధాటికి తోటల్లోని మామిడికాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి. చేతికొచ్చిన పంట ఇలా నేలపాలు కావడంతో మామిడి రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాయచోటిలో అత్యధికంగా 54.6 మి.మీ. వర్షపాతం నమోదు కలకడలో అత్యల్పంగా 2.4 మి.మీ.. సంబేపల్లెలో ఉపాధి హామీ పనులకు వెళ్లి.. పిడుగుపాటుకు గురైన కూలీ రాత్రి వేళల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ముంచెత్తిన వాన తోటల్లో నేలరాలిన మామిడికాయలు -
బక్రీద్ శుభాకాంక్షలు
పుంగనూరు: బక్రీద్ను పురస్కరించుకుని ముస్లింలకు రాష్ట్ర మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వారు విడివిడిగా మాట్లాడుతూ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఐకమత్యానికి, క్రమశిక్షణకు ముస్లింలు ప్రతీకగా నిలుస్తారని కొనియాడారు. రాయచోటి అర్బన్: త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా బక్రీద్ నిలుస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బక్రీద్ పండుగను భక్తిశ్రద్దలతో , శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. మత సామర్యం వెల్లివిరియాలన్నారు. ఈ సంధర్భంగా ముస్లిం సోదరులకు శ్రీకాంత్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మదనపపల్లె సిటీ: తల్లికి వందనం పథకం ప్రయోజనాల కోసం విద్యార్థులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు తెరవాలని జిల్లా సాంఽఘిక సంక్షేమశాఖ అధికారి దామోదర్రెడ్డి తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అమలుకు జూన్ నెలలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన షెడ్యూలు కులాల విద్యార్థులు తప్పనిసరిగా విద్యార్థి పేరు మీద నూతన బ్యాంకు ఖాతా లేదా పోస్టల్ బ్యాంకు ఖాతా తెరవాలన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 31వతేదీలోపు బ్యాంకు ఖాతా, ఎన్పీసీఐ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మదనపల్లె టౌన్: జలధార పనుల్లో వేగం పెంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) శివ్ నారాయణ శర్మ పేర్కొన్నారు. నిమ్మనపల్లె మండలం, రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీలో చేపడుతున్న జలధార పనులను బుధవారం ఎంపీడీవో, తహసీల్దార్ తపశ్వణి, ఏపీఓ, ఇరిగేషన్ ఏఈ,ఫీల్డ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పనులను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేసి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం నిమ్మనపల్లిలోని బహుదా డ్యాంను జాయింట్ కలెక్టర్ సందర్శించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి వనరుల సంరక్షణ, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లె టౌన్: జాతీయ రహదారి–71 నిర్మాణానికి భూములు కోల్పోయిన బాధిత రైతులందరికీ ఆమోద యోగ్యమైన పరిహారం అందజేస్తామని మదనపల్లె సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి హామీ ఇచ్చారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎనన్హెచ్ అధికారులు, బీకేపల్లి, బసినికొండ, వెంకప్పకోట గ్రామాల రైతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, భూసేకరణలో నష్టపోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. నష్టపరిహారం త్వరితగతిన అందేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పీవీ మిధున్రెడ్డి -
కొత్తిమీర మూట దించుతూ తెగిపోయిన చెవి
రామసముద్రం : కొత్తిమీర మూట దించుతూ ప్రమాదవశాత్తు చెవి కమ్మకు తగలడంతో చెవి తెగిన సంఘటన బుధవారం రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చింతామణికు చెందిన మంజుల(40) రామసముద్రం మండలం నారిగానిపల్లి వద్ద కొత్తిమీర కోసేందుకు కూలీలతో పాటు వచ్చింది. అయితే కోసిన కొత్తిమీర మూటలను వాహనానికి లోడు చేస్తుండగా ప్రమాదవశాత్తు మూట చెవి కమ్మపై జారడంతో కమ్మతో సహా చెవి తెగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. గమనించిన కూలీలు ఆమెను హుటాహుటిన చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యాధికారి నాగరాజు ఆధ్వర్యంలో స్టాఫ్ నర్స్ శిల్ప కుట్లు వేసి చికిత్స చేశారు. సిబ్బంది రమణ, నాగేంద్ర పాల్గొన్నారు. -
సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది: టీడీపీ నేత
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో కాపులు ముఖ్యమంత్రి కావాలన్నది తమ చిరకాల ఆకాంక్ష అని.. కాపు యువత ఇదే కోరుకుంటోందని తెలుగుదేశం పార్టీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనుకుందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదన్నారు.సీఎం పదవి చేపట్టలేని సిగ్గు లేని జాతి తమదని, ఎంతకాలం తాము బ్రోకర్లుగా, జోకర్లుగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. రానురాను కాపు జాతికి సిగ్గు, పౌరుషం తగ్గిపోతోందన్నారు. టీడీపీ అంటే కమ్మ, జనసేన అంటే కాపు పార్టీ అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనకు కులం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా పవన్కు కులం అవసరం లేదనుకుంటే కాపు జాతి వద్దని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కాపు కులం లేకపోతే పవన్ కళ్యాణ్, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేవారా?. పవన్ ఈ రోజు మాత్రం రాణించగలిగే వాడా అంటూ ప్రశ్నించారు. కాపు కులం గురించి పవన్ తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని అన్నారు. పవన్కు ఆ ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యమన్నారు.కాపులను దూరం పెట్టే పనిలో పవన్..గత ఎన్నికల్లో కాపు జాతి పవన్ కళ్యాణ్ను సొంతం చేసుకుందని... కానీ పవన్ కళ్యాణ్ కాపులను దూరం పెట్టే పనిలో ఉన్నారని ఓవీ రమణ అన్నారు. కాపు కార్పొరేషన్కు రూ.100 కోట్లు కూడా కేటాయించని ప్రభుత్వంలో కాపు నేతగా ఉన్న పవన్ కళ్యాణ్కు ప్రశ్నించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాపులు, ఎస్సీ, ఎస్టీలు కలిసి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నారని, పవన్ ఇలాగే ఉంటే రాష్ట్రంలో కొత్త నాయకుడు పుట్టుకొస్తాడన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు రాబోతున్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డ వారికి గుర్తింపు లేదన్నారు. తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలను ఎదుర్కొని విజయ్ ఎదిగారని గుర్తు చేశారు. మరి పవన్ ఎందుకు ఎదగకూడదని, ఆ దిశగా పవన్ ఆలోచించాలని సూచించారు. -
‘సర్’సన్నాహక చర్యలు వేగవంతం చేయాలి
మదనపల్లె సిటీ: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026 ముందస్తు సన్నాహక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్యాదవ్ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు, బూత్ లెవల్ అధికారులు నియామకం, శిక్షణ కార్యక్రమాలు, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ, పంపిణీ, బీఎల్ఓల కిట్ల అందజేత, బీఎల్ఓల గౌరవ వేతనాల చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, నియోజకవర్గ ఈఆర్వో లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ నిశాంత్కుమార్ -
శిరోభారం!
మినీ మహానాడుకు కాదేదీ అనర్హం! సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘వర్చువల్ మహానాడు’ జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్కు పెద్ద శిరోభారంగా మారింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఈ నెల 27, 28 తేదీల్లో ఆన్లైన్ విధానంలో సాగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధిష్టానం నుంచి హుకుం జారీ కావడంతో స్థానిక నేతలు మల్లాగుల్లాలు పడుతున్నారు. 78 క్లస్టర్లు.. భారీ ఖర్చులు ఈ కార్యక్రమం కోసం జిల్లా వ్యాప్తంగా 40 మండలాలు, 9 మున్సిపాలిటీలను కలిపి మొత్తం 78 క్లస్టర్లుగా విభజించారు. జిల్లా కేంద్రమైన కడపలోనే ఏకంగా 14 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్లో కార్యకర్తలు వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, భోజన వసతులు కల్పించాలని అధిష్టానం ఆదేశించింది. అయితే, ఈ భారీ వ్యయాన్ని భరించలేక, అటు ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జ్లను డబ్బులు అడగలేక.. స్థానిక కేడర్ తీవ్ర అసహనం, అనాసక్తి వ్యక్తం చేస్తోంది. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్కుమార్రెడ్డిల మధ్య ఉన్న తీవ్రస్థాయి విభేదాల వల్ల కార్యక్రమ నిర్వహణపై పరిశీలకులు మల్లాగుల్లాలు పడుతున్నారు. పరిశీలకుల పర్యవేక్షణ... సగానికి పైగా మండలాలు వెనుకడుగు వర్చువల్ మహానాడు నిర్వహణకు నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని అధిష్టానం నియమించింది. క్షేత్రస్థాయి ఏర్పాట్లపై పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం దృష్టికి వెళ్తోంది. అయితే, ఇప్పటికి సగానికి పైగా మండలాలు కనీసం స్క్రీన్లు కూడా బుక్ చేసుకోలేదు. 78 క్లస్టర్ల పరిధిలో డిజిటల్ మహానాడు నిర్వహణ అత్యంత కష్టతరంగా మారినట్లు పరిశీలకులు గుర్తించారు. అన్ని ప్రాంతాల్లో ఇది విజయవంతం అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో పరిశీలకులు ఇన్ఛార్జీలతో అత్యవసర సమాలోచనలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన ‘మినీ మహానాడు’ సమావేశాల వేది కల ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని మద్రాసు రోడ్డులో ఉన్న పవిత్ర ధార్మిక సంస్థ టీటీడీ కళ్యాణమండపాన్ని, మినీ బైపాస్లోని గురుకుల్ విద్యాపీఠ్ పాఠశాలను ఈ రాజకీయ వేడుకల కోసం ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించాల్సిన ధార్మిక వేదిక ల్లో, చిన్న పిల్లలు చదువుకునే విద్యాసంస్థల్లో పచ్చ జెండాలు కట్టి హంగామా చేస్తుండటంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. –కడప కార్పొరేషన్మరోవైపు బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి వీరారెడ్డి రాజకీయ వారసుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రితేష్రెడ్డిని పార్టీ ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ కింద పక్కన పెట్టేసిందనే చర్చ సాగుతోంది. రితేష్రెడ్డితో ఎలాంటి నిమిత్తం లేకుండానే, డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డికి వర్చువల్ మహానాడు నిర్వహణ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. ఈ పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సీరియస్గా పరిగణించినట్లు సమాచారం. మాజీ మంత్రి వీరారెడ్డి అనుచరులంతా మహానాడుకు గైర్హాజరు కావాలనే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అట్లూరు నుంచి భారీగా సమీకరణ చేపట్టి మహానాడు సక్సెస్ చేయాలనే దిశగా డీసీసీబీ చైర్మన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రితేష్రెడ్డి పట్ల అసమ్మతి నేతలందర్నీ వేదికపైకి తీసుకువచ్చే దిశగా మంతనాలు ఆరంభించినట్లు సమాచారం. వర్చువల్ మహానాడుకు వ్యయం తడిసిమోపెడు ఖర్చులకు వెనుకంజ వేస్తున్న తమ్ముళ్లు! 78 క్లస్టర్లలో నిర్వహణ కష్టతరం బద్వేల్లో రితేష్రెడ్డిపై ‘యూజ్ అండ్ త్రో’ పాలిటిక్స్! -
చెరువులో పడి బాలిక మృతి
ములకలచెరువు : దుస్తులు ఉతికేందుకు వెళ్లిన ఒక బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... మండలంలోని మద్దినాయునిపల్లి పంచాయతీ ఉచ్చోళ్లపల్లెకు చెందిన నందిని(15) ఊరి పక్కలో ఉన్న తిమ్మసంద్రం చెరువు వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. అక్కడ దుస్తులు ఉతుకుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. ఎంతసేపటికీ నందిని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు చెరువు వద్దకు చేరుకొని గాలించారు. చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక బి.కొత్తకోట కస్తూరిభా పాఠశాలలో 9వ తరగతి చదువుతుండేది. సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉండేది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండో పెళ్లి చేయలేదని ఆత్మహత్య పుంగనూరు : తొలి భార్య మరణించడంతో రెండో పెళ్లి చేయాలని కోరినా.. తల్లిదండ్రులు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బోడేవారిపల్లెలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన మనోహర్కు గతంలో వివాహమైంది. భార్య మృతి చెందింది. ఒంటరిగా ఉన్న మనోహర్ తనకు రెండవ పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులను కోరాడు. వారు అంగీకరించకపోవడంతో ఇంట్లో పురుగుల నివారణ మందు తాగాడు. దీనిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. దారి వివాదం.. రైతుపై దాడి మదనపల్లె టౌన్: దారి వివాదం తలెత్తి రైతుపై ప్రత్యర్థులు దాడి చేసిన సంఘటన మంగళవారం పీటీఎం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ములకలచెరువు మండలం దేవల చెరువు పంచాయతీ మామిడి గుంపుల పల్లెకు చెందిన శేషాద్రిరెడ్డి(50)కి అదే ఊరికి చెందిన నారాయణరెడ్డి వర్గానికి దారి విషయమై గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం శేషాద్రిరెడ్డి తన పొలం వద్దకు వెళుతుండగా తమ భూమిలో ఉన్న దారి గుండా వెళ్లరాదని నారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో నారాయణరెడ్డి వర్గీయులు శేషాద్రిరెడ్డి పై దాడి చేసి గాయపరిచారు. బాధితుడిని చికిత్స కోసం కుటుంబీకులు మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోడి పందెం ఆడుతున్న ఆరుగురి అరెస్ట్ రాయచోటి : రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న కోడిపందెం (కాక్ ఫైట్) స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన దాడిలో ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేసినట్లు రాయచోటి అర్బన్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నాలుగు బైకులు, ఐదు సెల్ఫోన్లు, ఒక కోడి, వెయ్యి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలియజేశారు. -
పురుగులతో మల్బరీ తోటకు తీవ్ర నష్టం
రామసముద్రం : రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి మల్బరీ తోటపై పురుగులు దాడి చేసి తీవ్రంగా నష్టపరిచాయి. రాత్రి పేడ పురుగుల్లాంటి రెక్క పురుగులు తోటపై దాడి చేయడంతో గమనించి రైతులు టార్చిలైట్లు వేసుకొని వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆకులను మొత్తంగా కొరికి తినేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటను రాత్రికి రాత్రే పురుగులు పడి పూర్తిగా నాశనం చేయడంతో పట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పట్టు పురుగులకు వేయాల్సిన ఆకులపై ఆకస్మాత్తుగా పురుగులు దాడి చేయడంతో ఆకులు పూర్తిగా కత్తిరించాయని, దీంతో పట్టు పురుగుల పెంపకానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పట్టుపరిశ్రమ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే ఆదుకుని పురుగుమందులు, నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. లబోదిబోమంటున్న రైతులు -
30న జాబ్మేళా
మదనపల్లె సిటీ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఈనెల 30న జాబ్మేళా నిర్వహించనున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వనజ తెలిపారు. మెగా జాబ్మేళాలో 12 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు మేళా జరుగుతుందన్నారు. ఎస్ఎస్సి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు హాజరుకావచ్చునన్నారు. పూర్తి వివరాలకు 95532 02509, 63016 12761 నంబర్లలో సంప్రదించాలని కోరారు. వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో నాక్ అవుట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో క్వాలిఫైయర్ 1 విజేతగా ఎన్కే స్పోర్ట్స్ విజయం సాధించి ఫైనల్స్కు చేరుకొంది. ఇందులో ఫ్రతిభ చూపిన ప్రణవ్ రెడ్డికి మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అవార్డును ఆంధ్ర రంజి ప్లేయర్ జ్ఞానేశ్వర్ అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, సునీల్, క్రీడాకారులు పాల్గొన్నారు. పెద్దమండ్యం: మండలంలోని ముసలికుంటలో మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లిన వలిపి వెంకట్రమణ (65) అనే కూలి వడదెబ్బకు గురై మృతి చెందాడు. నల్లచెరువు కాలువ పూడికతీత పనుల్లో భాగంగా గడ్డపారతో తవ్వుతుండగా ఆయన ఒక్కసారిగా వాంతులు చేసుకుని కుప్పకూలాడు. తోటి కూలీలు హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఏపీఓ సురేంద్రనాథ్రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్ మృతదేహానికి నివాళులర్పించారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూలీలు కోరారు. కడప అర్బన్: కడప రిమ్స్ ప్రాంగణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2025 సంవత్స రానికి ఆయా ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. డ్యూటీ అటెండర్, జూనియర్ అసిస్టెంట్,ప్లంబర్ తదితర పోస్టులను భర్తీ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జమున పత్రాలు అందజేశారు. మదనపల్లె సిటీ: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దామోదర్రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బీటీ కాలేజీ ఆవరణలోని జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయంలో హాస్టల్ వార్డన్లకు సమీక్షా సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు పూర్తి చేయాలన్నారు. వసతిగృహాల్లో విద్యార్థులకు అందించే సేవలు గురించి వివరించి అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. పదో తరగతిలో వసతిగృహ విద్యార్థులు జగదీశ్వరరెడ్డి 583, వినయ్ 579 మార్కులు సాధించారన్నారు. వీరిని ఈనెల 29న విజయవాడలో జరిగే కార్యక్రమానికి సంబంధిత వార్డన్లు తీసుకెళ్లాలన్నారు. ఏఎస్డబ్యూఓలు రాములునాయక్, గంగిరెడ్డి, క్రిష్ణ, వార్డన్లు పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా పుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ జిల్లా సీనియర్ బాలుర జట్ల ఎంపిక నిర్వహించారు. జిల్లాలో ని పలు ప్రాంతాల నుంచి సుమారు 50 మందికిపైగా క్రీడాకారులు ట్రయల్స్లో పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యదర్శి కె.మురళీధర్ తెలిపారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వారి ప్రతిభ, ఫిట్నెస్,ఆటతీరును పరిశీలించి తుది జిల్లా జట్టుకు 20 మందిని ఎంపిక చేస్తామని వివరించారు. కార్యక్రమంలో పుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దిలీప్కుమార్, కిరణ్, మహేంద్రనాయక్, రతీష్, చంద్ర,చెన్నకేశవ, జాన్ కమలేష్, బాలాజీ, అంజనప్ప పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులు పాటించాలి
గుర్రంకొండ: పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయా అధికారి శివనారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని నడిమిఖండ్రిగలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో యాజమాన్య పద్ధతుల పాటించడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో వర్షాభావ ప్రాంతాల రైతులను దృష్టిలో ఉంచుకొని పీఎమ్డీఎస్ మోడల్ కింద 15కిలోల బరువుతో 25 నుంచి 30 రకాల విత్తనాలున్న ప్రత్యేక కిట్లను రైతులకు అందిస్తున్నామన్నారు. ● జిల్లాలోని రైతులు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కచ్చితంగా కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ సంఖ్య ఆధారంగానే రైతుభరోసా ఉంటుందన్నారు. ఈ సంఖ్యను పొందని రైతులు నిర్ణీత గడువులోగా సమీప రైతు సేవాకేంద్రాలకు వెళ్లి ఆన్లైన్లో విశిష్ట సంఖ్య కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎవో రత్నమ్మ, వీఏఏ వెంకట్, ఎఈవో రాజేష్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ -
రైతు భరోసా కేంద్రం శిలాఫలకం ధ్వంసం
రాయచోటి : వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని జీర్ణించుకోలేని కొంత మంది ఆకతాయిలు విధ్వంసాలకు దిగుతున్నారు. తాజాగా రాయచోటి రూరల్ మండలం మాధవరం గ్రామంలో నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ రంగ సేవలను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సచివాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది. గ్రామ గ్రామాన లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు, అందులోని వ్యవస్థలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. ఈ కేంద్రాల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఇప్పటికే అనేక ప్రాంతాలలో స్థానికంగా ఉన్న కొంత మంది కూటమి పార్టీలకు చెందిన ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మాధవరం గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది. కారు ఢీకొని వ్యక్తికి గాయాలు మదనపల్లె టౌన్: కారు ఢీకొనడంతో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మట్లివారిపల్లె పంచాయతీ గొడ్డిన్లవారిపల్లెకు చెందిన రైతు ఎస్.శ్రీరాములు (55) పురుగు మందులు కొనుగోలు చేసేందుకు బైక్పై గుర్రంకొండకు వెళ్లారు. మందులు కొనుగోలు చేసి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యంలోని కురబలకోట మండలం మంకు వారిపల్లె మలుపు వద్దకు రాగానే మదనపల్లె డిఈఓ కార్యాలయానికి విధులకు వస్తున్న సిబ్బంది కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ముదివేడు టోల్ ప్లాజా అంబులెన్స్కు సమాచారం అందించగా వారు క్షతగాత్రుడిని చికిత్సల కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భూసార పరీక్షలకు ఇదే అదును
● మట్టి నమూనాల సేకరణకు శ్రీకారం ● భూమిలో సమతుల్యత సాధించడమే లక్ష్యం ● అధిక దిగుబడి పొందేందుకు అవకాశం గుర్రంకొండ : ఎట్టకేలకు ప్రభుత్వం భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టింది. తద్వారా పంటల సాగులో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. జిల్లాలో 2023 పంట పొలాల మట్టి నమూనాల సేకరణే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రైతుల పొలాల్లో మట్టిసేకరణ పనులు చేపడుతున్నారు. భూసార పరీక్షలకు ఇదే అనువైన సమయం. సారం కోల్పోయిన భూమిలో పోషక విలువలు సమతుల్యత సాధించడమే దీని ఉద్దేశం. ఏడాది, మూడేళ్ల కొకమారు.. బోర్లు, బావులు, సాగునీటి కాలువల ద్వారా ఏడాది పొడువునా నీటిసౌకర్యం ఉన్న పొలాల్లో ఏడాదికొకమారు భూసార పరీక్షలు చేయించాలి. ప్రతి మూడు సీజన్లకొకమారు భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశముంది. వర్షాధార పంటల సాగు భూముల్లో మూడేళ్ల కొకమారు భుసార పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. రైతులు పంటలు సాగు చేసిన ప్రతి సారి భూమిలో నత్రజని, భాస్వరం వినియోగం ఎక్కువగా ఉంటుంది. భూసార పరీక్షలో భూమిలో ఎంత మేరకు వీటి శాతం తగ్గిందో తెలుసుకోవచ్చు. తద్వారా పంటసాగు చేసే ముందు పొలంలో తగినంత మేరకు వీటని పిచికారి చేస్తే భూసారం మళ్లీ యథాస్థితికి చేరుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల పొలం గుల్ల బారిపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఏప్రిల్, మే నెలలు అనుకూలం భూసార పరీక్షల కోసం పొలాల్లో గానీ, భూమిలో గానీ మట్టినమూనాలను సేకరించేందుకు ఏప్రిల్, మే నెలలు అనుకూలంగా ఉంటాయి. ఏడాదిలో ఈ రెండు నెలల్లో చాలా వరకు పొలాల్లో పంటలు సాగు ఉండదు. దీంతో బీడు భూములు అధికంగా ఉంటాయి. అప్పడు మట్టినమూనాలు సేకరిస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయనేది వ్యవయసాయాధికారుల నమ్మకం. 21 రోజుల్లో ఫలితం మట్టి నమూనాలను వ్యవసాయ శాఖ ల్యాబ్కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. వీటి ఫలితాలను 21 రోజుల తరువాత ప్రకటిస్తారు. ఆర్బీకే సిబ్బంది భూసార పరీక్షల ఫలితాన్ని సదరు పొలం రైతుకు తెలియజేస్తారు. తద్వారా సదరు పొలంలో నత్రజని, పొటాష్, భాస్వరం, కాల్షియం, ఐరన్తోపాటు ఉదజని సూచిక, సేంద్రీయ కర్బనం వంటివి ఎంత మేరకు ప్రస్తుతం భూమిలో ఉన్నాయో ఫలితాలు సూచిస్తాయి. దీంతో పొలంలో భుసారాన్ని పెంపొందించేందకు ఏలాంటి పోషక విలువలు కలిగిన ఎరువులు వాడాలో సూచిస్తారు. జిల్లాలో 2020 మట్టి నమూనల సేకరణే లక్ష్యంజిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2023 పొలాల్లో మట్టినమూనాలు సేకరణే లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ సీజన్లోనే పొలాల్లో మట్టిసేకరణ చేసి ఫలితాలను ఇవ్వాలనే లక్ష్యం నిర్దేశించుకొన్నారు. త్వరగా లక్ష్యం చేరుకోవాలనే ఉద్దేశంతో మట్టిసేకరణ పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది మట్టినమూనాలను సేకరిస్తున్నారు. -
వెల్లువెత్తిన రైతుల నిరసన
సాక్షి, మదనపల్లె : ములకలచెరువులో రైతాంగం నిరసన వెల్లువెత్తింది. మార్కెట్లో రైతులు తీవ్రంగా నష్టపోకుండా అధికారులు అండగా నిలవాలని రైతు సంఘం నాయకులు కోరారు. టమాట రైతుల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ములకలచెరువు మార్కెట్లో అమలు అయ్యేలా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తంబళ్లపల్లె నియోజకవర్గం వర్గానికి చెందిన రైతులు, రైతు సంఘ నాయకులు పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ములకలచెరువు మూడు రోడ్ల కూడలి నుంచి రైతులు ప్లకార్డులు, బ్యానర్తో మార్కెట్ యార్డు వరకు ప్రదర్శన నిర్వహించారు. జాక్ పాట్ నిలిపివేయాలని, కమీషన్ రద్దు చేయాలని, 15 కిలోల క్రేట్ల విధానం అమలు చేయాలని, తలసరి మట్టం వరకే టమాట ఉండాలన్న డిమాండ్లతో రైతులు ఈ కార్యక్రమం చేపట్టారు. మార్కెట్ కార్యాలయం వద్దకు చేరుకుని గంటన్నరకు పైగా నిలుచొని నిరసన వ్యక్తం చేశారు. దోపిడీకి గురవుతున్న రైతులను కాపాడాలని, ప్రభుత్వ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని నినాదాలు చేశారు. వ్యాపారులు నిబంధనలు పాటించి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ఇవ్వండి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు వద్దకు మార్కెట్ కార్యదర్శి నవీన్ కుమార్రెడ్డి వచ్చారు. రైతులు తమ సమస్యలను ఆయనకు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకుడు బి.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ములకలచెరువు మార్కెట్లో రైతుల నుంచి కమీషన్ ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. జాక్ పాట్ విధానంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, వేలంపాటలో రైతు పంటకు పలికే ధర ఒకటైతే రసీదులో మరో ధర రాస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి అన్యాయాలు ఇకపై జరగకుండా అరికట్టాలని డిమాండ్ చేశారు. పంట పెట్టింది మొదలు ఎరువులు, పురుగుమందులు, టమాట నారు, కూలీల సమస్యలు, పెరిగిన పెట్టుబడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పంట దిగుబడి మార్కెట్కు తెస్తే రైతులను నిలువునా మోసం చేస్తున్నారని, ఇకపై ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కార్యదర్శికి విన్నవించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మేరకు మార్కెట్లో నిబంధనలు అమలు కాకుంటే వచ్చే నెల 10 తర్వాత రైతులతో ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. కమీషన్ తిరిగి ఇప్పిస్తాం ములకలచెరువు మార్కెట్లో 10 శాతం కమీషన్ వసూలుపై రైతు సంఘ నాయకులు పద్మనాభరెడ్డి కార్యదర్శి నవీన్ కుమార్రెడ్డిని ప్రశ్నించారు. ఆయన కమీషన్ వసూలును అంగీకరిస్తూనే ఏడీ త్యాగరాజతో ఫోన్లో రైతులతో మాట్లాడించారు. మొదట ఏడీ కలెక్టర్ సమక్షంలో 10 శాతం కమీషన్ వసూలుకు రైతులు అంగీకరించారంటూ చెప్పుకొచ్చారు. తర్వాత దీనిపై మాట మార్చిన ఆయన రైతుల నుంచి ఎక్కడ కూడా కమిమీషన్ వసూలు చేయరాదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటిదాకా వసూలు చేసిన కమీషన్కు సంబంధించిన రసీదులు తమకు సమర్పిస్తే సంబంధిత మండిల నుంచి తిరిగి వసూలు చేయిస్తామని హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో ఏ మార్కెట్ లోనైనా కమీషన్ వసూలు చేస్తే రైతులకు తిరిగి ఇప్పిస్తామని ప్రకటించారు. అనంతరం కార్యదర్శి నవీన్కుమార్రెడ్డికి రైతులు మార్కెట్లో అమలు చేయాల్సిన డిమాండ్లను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల చెందిన టమాట రైతులు పాల్గొన్నారు. ములకలచెరువులో భారీ ర్యాలీ మార్కెట్లో వ్యాపారుల దోపిడీ అరికట్టాలి అధికారులు రైతాంగం పక్షాన నిలవాలి ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయండి రైతు సంఘం నాయకులు డిమాండ్ -
రాయచోటిలో వర్షం
రాయచోటి: రాయచోటిలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం మామిడి పంటకు మరింత నష్టాన్ని చేకూర్చింది. ఇప్పటికే ఓ వైపు ధరల్లేక.... మరోవైపు దళారుల దోపిడీతో తల్లడిల్లుతు న్న రైతులకు మంగళవారం రాత్రి కురిసిన భారీ గాలులతో కూడిన వర్షం నట్టేటా ముంచింది. వర్షం కారణంగా నేలరాలిన మామిడిచెట్లు కాయలతో పాటు రానున్న రోజుల్లో మామిడికి ఊజి పురుగు సోకి తినడానికి కూడా పనికిరాకుండా పోతాయన్న భయం పట్టుకుంది. చాలా ప్రాంతాలలో చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే విధంగా రామాపురం మండలం చిట్లూరు పంచాయతీలోని చంద్రయ్య ఇంటి సమీపంలో టెంకాయ చెట్టుపై పిడుగు పడింది. మామిడికి మరింత నష్టం -
నాయుళ్లే.. నిర్దేశకులు!
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామంటూ సీఎం చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకోవడంలో దిట్ట. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పచ్చ చొక్కాల పిఫార్సులకు, పైసల సంచులకే పెద్ద పీట వేస్తున్నారు. కడప రిమ్స్ హాస్పిటల్ శానిటేషన్ సూపర్వైజర్ల నియామకాల్లో కూటమి నేతలు చేసిన పంపకాల బాగోతం, కాంట్రాక్టర్ల వసూళ్ల పర్వం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. నిబంధనల ముసుగులో పాతవారిపై వేటు! రిమ్స్ హాస్పిటల్ శానిటేషన్ కాంట్రాక్టును తిరుపతికి చెందిన ’పద్మావతి హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్’ సంస్థ అధినేత భాస్కర్ నాయుడు దక్కించుకున్నారు. ఆయన ఏడు విభాగాల్లో కాంట్రాక్టును కొనసాగిస్తూ.. పాత శానిటేషన్ సూపర్వైజర్లను తొలగించేందుకు పక్కా స్కెచ్ వేశారు. డిగ్రీ అర్హత ఉండాలని, 50 ఏళ్ల లోపు వారికే ఛాన్స్ అంటూ కొత్త షరతులు పెట్టి, అప్పటికే పనిచేస్తున్న దాదాపు 40 మందిని రోడ్డున పడేశారు. తీరా ఆ ఖాళీలను ’ఎల్లో బ్యాచ్’ సిఫార్సులతో భర్తీ చేయడం గమనార్హం. మంత్రిని మించిన ’సూపర్ బాస్లు’.. ఎమ్మెల్యేలకే సింహభాగం! ఈ నియామకాల్లో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కంటే చిత్తూరు జిల్లాలోని ఇద్దరు ’నాయుడు’లే తాము సూపర్బాస్లమని నిరూపించుకున్నారు. సదరు నాయుడు ద్వయం సిఫార్సు చేస్తే వారికి ఒక్కొక్కరికి 3 పోస్టుల చొప్పున కేటాయించిన కాంట్రాక్టర్.. స్వయంగా శాఖా మంత్రి సత్యకుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డిల సిఫార్సులకు మాత్రం రెండేసి పోస్టులు ఇచ్చి సరిపెట్టారు. ఇక కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి సిఫార్సు చేసిన 11 మందిలో 8 మందిని, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచైతన్యరెడ్డి సిఫార్సు చేసిన 7 మందిని నియమించి ఎమ్మెల్యేలకే అగ్రస్థానం కల్పించారు. ఎమ్మెల్సీకి ఒకటే.. అధికారులకూ వాటాలు! కూటమిలో ఉన్న మిగిలిన నేతలను, అధికారులను సృప్తి పరిచేందుకు కూడా ఈ పోస్టులను నైపుణ్యంగా పంచారు. ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి సిఫార్సుకు కేవలం ఒకే ఒక్క పోస్టు దక్కగా, రిమ్స్ ప్రిన్సిపల్, హెల్త్ ఇన్స్పెక్టర్ల సిఫార్సులకు ఒక్కొక్క పోస్టు ఇచ్చారు. నిబంధనల ప్రకారం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రిన్సిపల్ను కాదని.. సీఎస్, ఆర్ఎంఓ సిఫార్సులకు ఏకంగా 3 పోస్టులు కేటాయించడం హాస్పిటల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిఫార్సుల పర్వం ఒకవైపు నడుస్తుంటే.. మరోవైపు ఈ శానిటేషన్ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంట్రాక్టర్ ప్రతినిధులు కాసుల కనకవర్షంగా మార్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్హతలు, సిఫార్సులు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ప్రతినిధుల జేబులు నింపితేనే పోస్టింగ్ ఆర్డర్లు చేతికిచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబుగారి మార్క్ ’పారదర్శకత’ రిమ్స్ ఉద్యోగాల పంపకాల్లో ఇలా బట్టబయలైందని బాధితులు మండిపడుతున్నారు. కడప రిమ్స్ ఉద్యోగాల్లో పచ్చ నేతల‘పంపకాల’ జాతర! శానిటేషన్ సూపర్ వైజర్ పోస్టులపంపకాల్లో కూటమి నేతల జులుం! ఆరోగ్యశాఖ మంత్రి కంటే‘నాయుడు ద్వయం’ సిఫార్సులకేకాంట్రాక్టర్ పెద్దపీట! నిబంధనల ముసుగులో పాతవారికిఉద్వాసన.. తమ్ముళ్లకు అగ్రతాంబూలం! విద్యార్హతల సాకుతో పాతవారికి ఉద్వాసన.. ’ఎల్లో బ్యాచ్’కు అగ్రతాంబూలం! -
రెచ్చిపోతున్న రౌడీమూకలు
● పీలేరులో బెంబేలెత్తుతున్న ప్రజలు ● నిత్యం దాడులు జరుగుతున్న వైనం ● కనిపించని లా అండ్ ఆర్డర్ యువకులపై కర్రలతో దాడి చేస్తున్న దృశ్యం టీడీపీ నాయకుడు కత్తితో ప్రదర్శన సాక్షి టాస్క్ఫోర్స్ : పీలేరు పట్టణంలో రోజురోజుకు రౌడీమూకలు రెచ్చిపోతున్నారు. రాత్రి సమయంలో మద్యం తాగిన యువకులు ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని తీవ్రంగా గాయపడిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు పూర్తిగా విఫలం కావడంతో రౌడీమూకల అల్లర్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారం క్రితం కొత్తపల్లె రోడ్డులో కొంత మంది యువకులు మరో ముగ్గురి యువకులపై కర్రలతో విచక్షణా రహితంగా కొట్టి గాయపరచిన దృశ్యాలు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాధితులు పీలేరు, తిరుపతి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా సాయిగుడి వీధిలో రెండు నెలల క్రితం పట్టపగలు ముగ్గురిపై దాడి చేసి కాళ్లు విరగగొట్టి, తలలు పగలు గొట్టిన సంఘటన తెలిసిన విషయమే. టీడీపీ నాయకుడి బర్త్డేకి హంగామా పీలేరు పట్టణం నాలుగు రోడ్ల కూడలిలో వారం క్రితం ఓ టీడీపీ నాయకుడి బర్త్డేకి ఆయన అనుచరులు పెద్ద హంగామా సృష్టించారు. నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చుతూ సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించారు. ట్రాఫిక్కు పూర్తిగా అంతరాయం కల్గించారు. బహిరంగంగా కత్తి చూపిస్తూ హల్చల్ చేశారు. అదే రోజు ఓ వైపు పీలేరు ఎమ్మెల్యే కార్యక్రమం జరుగుతుండగా, మరోవైపు టీడీపీ కార్యకర్తలు హంగామా చేస్తుండడంతో ప్రజలు విస్తుపోయారు. పీలేరులో పోలీస్ వ్యవస్థ ఉందా, లేదా ? అని చర్చించుకోవడం గమనార్హం. -
భయపెడుతున్న ధరలు
వరుసగా పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల వల్ల నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. సామాన్య, మధ్యతరగతి వారికి ఇది అదనపు భారమే. పెరిగిన ధరలు భయపెడుతున్నాయి. –స్వాతి, కడప క్రాస్, కురబలకోట మండలం కొనాలంటే ఆలోచించాలి పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి వారు బతకలేరు. పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలతో నిత్యావసర వస్తువులు, సరుకులు, కూరగాయలు, ప్రయాణ ఖర్చులతో పాటు ప్రతిదీ రేట్లు పెరిగాయి. ఏది కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. –డి. కళావతి, అంగళ్లు, కురబలకోట మండలం పెరిగిన ధరలతో అదనపు భారం ఓ వైపు మండుతున్న ఎండలు మరో వైపు పెరిగిన ధరలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. పెరిగిన ధరలతో అదనపు భారం పడుతోంది. ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ప్రజలను ఏమార్చడానికి పాలకులు మాత్రం పొదుపు నాటకాలు ఆడుతుండడం సిగ్గుచేటు. –మొలక త్రివేణి, అంగళ్లు -
టీడీపీ మాజీ సర్పంచ్ దౌర్జన్యకాండ
● రైతుకు తెలియకుండా పొలంలో ఫారంపాండ్ పనులు ● న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో బాధితుడు ఫిర్యాదు పెద్దతిప్పసముద్రం : మండలంలోని సంపతికోటలో టీడీపీకి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి వాటర్షెడ్ అధికారులను కను సైగలతో శాసిస్తూ ఇష్టారాజ్యంగా ఫారంపాండ్ పనులు చేసి రూ.లక్షల ప్రజాధనంతో జేబులు నింపుకొంటున్నాడు. పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు, పక్క మండలాల్లో కాపురాలు ఉంటూ వ్యవసాయ భూములు కలిగిన రైతుల భూములను గుర్తించడం.. వారికి కనీస సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టి జేబులు నింపుకోవడం పరిపాటిగా మారింది. ఇదేమిటని రైతులు ఎవరైనా గట్టిగా నిలదీస్తే బిల్లులు కాగానే రూ.లక్షల అంచనాతో చేపట్టిన ఫారంపాండ్ గుంతలను పూడ్చేస్తున్నా.. సంబంధిత అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించడంతో ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉదాహరణకు బి.కొత్తకోటలో కాపురం ఉంటున్న ఎంఎస్.అమీర్ బాబా అనే రైతుకు మండలంలోని సంపతికోట పంచాయతీ సమీపంలోని ఎర్రవంక వద్ద ఉన్న సర్వే నంబర్ 554/1లో 5.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ పొలంలో బోరు లేనందున రైతు కేవలం ఖరీఫ్ సీజన్లో మాత్రమే పొలం వద్దకు వచ్చేవారు. అయితే సదరు టీడీపీ నాయకుడు భూమి కలిగి ఉన్న రైతుకు కనీస సమాచారం ఇవ్వకుండా వాటర్షెడ్ ద్వారా రూ.1.85 లక్షల అంచనాతో ఫారంపాండ్ పనులు పూర్తి చేసేశాడు. ఇటీవల విషయం తెలుసుకున్న బాధిత రైతు తన పొలంలో ఎందుకు ఫారంపాండ్ పనులు చేపట్టావని ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యం చేయడమే గాక నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని వాపోయాడు. ఈ విషయంపై తాను వాటర్షెడ్ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో తనకు న్యాయం చేయాలని ఈ నెల 25న మదనపల్లిలో జరిగిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశానని రైతు మంగళవారం పేర్కొన్నాడు. సదరు టీడీపీ నాయకుడు గతంలో కూడా ఇదే పంచాయతిలోని వల్లీసాబ్ అనే రైతు పొలంలో ఇలాంటి పనులు చేపట్టి బిల్లులయ్యాక జేసీబీ యంత్రంతో గుంతలు పూడ్చేసి రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేసినా అధికారులు మిన్నకుండిపోవడం గమనార్హం. ఈ విషయంపై వాటర్షెడ్ పీవో ఖాజా మొహిద్దీన్ను వివరణ కోరగా.. ఇలాంటి పనులు ఎవరు, ఎన్ని చేపట్టినా వారి డిపాజిట్ సొమ్ము నుంచి రికవరీ చేసుకుంటామని, ఈ విషయం డ్వామా పీడీ దృష్టికి కూడా వెళ్లిందని, సమగ్రమైన విచారణ చేపడతామన్నారు. -
అధైర్య పడకండి.. భవిష్యత్తు మనదే
పుంగనూరు : కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడిచినా ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని, అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఎవరూ అధైర్యపడకండి.. భవిష్యత్తు మనదేనని రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ క్యాడర్కు భరోసా ఇచ్చారు. మంగళవారం జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్పతో కలసి ఆయన పట్టణం, మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏటవాకిలి గ్రామంలో సుమారు రూ.1.50 కోట్లతో నిర్మించిన శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి, అక్కదేవతల ఆలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాంపల్లెలో మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క హామీ కూడా నేరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తప్పుడు హామీలతో గెలవడం, అధికారంలోకి రాగానే హామీలు విస్మరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దెవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతి హామీని నేరవేర్చారని స్పష్టం చేశారు. దళారీలకు, అక్రమాలకు చోటు లేకుండా సుమారు 2.37 కోట్ల మందికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేయడం జరిగిందన్నారు. ఎంతో పారదర్శకమైన పరిపాలన సాగించి, క్యాలెండర్ను విడుదల చేసి, పరిపాలన, సంక్షేమ పథకాలు అమలు చేసి, చరిత్ర సృష్టించిన ఏకై క వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమైందని, ఎన్నికలు ఎప్పుడు పెట్టిన వైఎస్సార్సీపీని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి అక్కిసాని భాస్కర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్సిపి రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, జింకా వెంకటాచలపతి, వైఎస్సార్సిపి జిల్లా యూత్వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్దీన్ షరీఫ్, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, జిల్లా బిసి సెల్ కార్యదర్శి వెంకట్రమణ, మండల పార్టీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి, వైఎస్సార్సిపి జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి జయరామిరెడ్డి, నాయకులు నాగేంద్ర, బాబు, రామమోహన్రెడ్డి, రాజారెడ్డి, శంకరప్ప, రెడ్డెప్ప, నంజుండప్ప పాల్గొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
తొలిరోజు పరీక్ష ప్రశాంతం
మదనపల్లె సిటీ: జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 1533 మంది విద్యార్థులకు 1233 మంది హాజరయ్యారు. మదనపల్లె పట్టణంలోని వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాల, నెహ్రు మున్సిపల్ ఉన్నత పాఠశాల, ఉర్దూ మున్సిపల్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం పరిశీలించారు. తొలిరోజు పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఓఈ తెలిపారు. గజ వాహనంపై మల్లమ్మ సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్పై వెలసిన ఏనుగు మల్లమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు, అర్చనలు, మహా మంగళహారతి నిర్వహించారు. రాత్రి మల్లమ్మ ఉత్సవ విగ్రహాన్ని గజ వాహనంపై కొండ రోడ్లపై ఊరేగించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో తరలివచ్చి పూజలు నిర్వహించారు. దరఖాస్తుల ఆహ్వానం కడప సెవెన్రోడ్స్ : పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈఓ ఐజే విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవా రంగంలో అర్హులైన వారు హెచ్టీటీపీఎస్://అవార్ుడ్స.జీఓవీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హార్డ్, సాఫ్ట్ కాపీలను ఈనెల 31వ తేదీలోపు పోస్టుద్వారాగానీ, లేదా స్టెప్ కార్యాలయంలో అందజేయవచ్చని తెలిపారు. వివరాలకు 98494 97011 నెంబరులో సంప్రదించాలని కోరారు. జూన్ 5న పది ఇంగ్లీషు పరీక్షమదనపల్లె సిటీ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఈనెల 28వతేదీ జరగాల్సిన ఇంగ్లీషు పరీక్ష జూన్ 5న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈనెల 28వతేదీ బక్రీద్ను పురస్కరించుకుని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిన ట్లు తెలిపారు. దీంతో ఆ రోజు జరగాల్సిన ఇంగ్లీ షు పరీక్ష తేదీ మార్పు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు. -
హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లపై విచారణ
● ఈనెల 21న కడపలో ఉద్యోగులతో ● విచారణ జరిపిన సీఈసాక్షి, మదనపల్లె : హంద్రీ–నీవా ప్రాజెక్టు మదనపల్లె సర్కిల్–3లో జరిగిన అక్రమ ఉద్యోగ నియామకాలు, అక్రమ పదోన్నతుల వ్యవహరాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఆగస్టు ఏడున హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లు శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడం, చర్యలు తీసుకోవాల్సిన సర్కిల్ అధికారులు జాప్యం చేయడంతో ప్రభుత్వ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అయ్యాక అక్రమ పదోన్నతులపై ఎస్ఈ నుంచి ఈఎన్సీకి నివేదికలు వెళ్లాయి. అప్పటినుంచి ఈ వ్యవహరంపై విచారణ, చర్యలు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి వాస్తవ నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం రాయలసీమ రీజియన్ క్వాలిటీకంట్రోల్ చీఫ్ ఇంజనీర్ను విచారణాధికారిగా నియమించింది. దాంతో ఆయన విచారణ మొదలుపెట్టారు. కడపలో విచారణ మదనపల్లె సర్కిల్ పరిధిలో అక్రమ ప్రమోషన్లు పొందిన వారికి విచారణ అధికారి నోటీసులను జారీ చేశారు. ఈనెల 14న జారీచేసిన నోటిసుల్లో ఈనెల 21న కడప సీఈ కార్యాలయంలో విచారణకు హజరుకావాలని పేర్కొన్నారు. ఆ మేరకు విచారణ నిర్వహించారు. అక్రమ పద్ధతిలో ప్రమోషన్లు పొందిన వారినుంచి ఉద్యోగ నియామకానికి సంబంధించిన రికార్డులు, నియామకం, పదోన్నతికి సంబందిత ఉత్తర్వులు, విద్యార్హత ధృవీకరణ పత్రాలను పరిశీలించడంతోపాటు వీరికి పదోన్నతులు కల్పించిన ఎస్ఈ ఏవరు, దీనికి సంబంధించి అనుకూలమైన నివేదికలు ఎవరిచ్చారు, ప్రభుత్వ స్థాయిలో అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా పదోన్నతులు కల్పించారు అన్న అంశాలపై విచారణ జరిపినట్టు తెలిసింది. ఇదీ జరిగింది మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలో డిప్లొమా (ఈసీఈ)విద్యతో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగికి 2013 మార్చిన ఏడున టెక్నికల్ అసిస్టెంట్ నుంచి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పదోన్నతి ఇవ్వడమేకాక 2022 జూలై ఒకటిన టెక్నికల్ ఆఫీసర్గా మరోసారి ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ పొందేందుకు కావాల్సిన విద్యార్హతకు దూర విద్య ద్వారా అభ్యసించేందుకు అనుమతి కోరడంతో ఈ అక్రమ పదోన్నతులు వెలుగుచూశాయి. అలాగే సర్కిల్లోని కుప్పం డివిజన్లో పని చేస్తున్న బ్లూ ప్రింటర్ ఆపరేటర్లు వై.చెన్నయ్య, కే.అబ్బిరెడ్డెయ్య, కదిరి డివిజన్లో పని చేస్తున్న పి.ఖాదర్బాషాల విద్యార్ఘతలను పట్టించుకోకుండా పదొన్నతులు కల్పించారు. ప్రయోషన్ పొందాలంటే..నిబంధనల ప్రకారం ట్రేడ్ టెస్ట్ (డ్రాఫ్ట్స్’ మ్యాన్) సివిల్ లేదా మెకానికల్ కోర్సులో అర్హత సాధించాలి. దీన్ని పక్కనపెట్టి ముగ్గురికి టెక్నికల్ అిిసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. వీటిని గుర్తించిన ఈఎన్సీ మదనపల్లె ఎస్ఈకి మెమో జారీ చేశారు. మరిన్ని అక్రమ ప్రమోషన్లు మదనపల్లె సర్కిల్లో ఎస్ఈగా అదనపు బాధ్యతలను నిర్వర్తించిన ఓ ఎస్ఈ హయాంలో మరికొన్ని అక్రమ ప్రమోషన్లు జరిగినట్టు వెలుగులోకి వస్తున్నాయి. ఐదేళ్లక్రితం పనిచేసిన ఓ ఎస్ఈకి కొన్ని ప్రమోషన్లకు ఆమోదం ఇవ్వాలని ఓ ఉద్యోగి నివేదికలను సిద్దంచేసి ఒత్తిడి చేశారు. నివేదికను పరిశీలించిన ఆ ఎస్ఈ ఇందులో తిరకాసు ఉందని గుర్తించి ఆయన ఈ ఫైల్ను అక్కడితో నిలిపివేశారు. ఒత్తిడి పెరగడంతో అసలు ప్రమోషన్లు ఇవ్వొచ్చో లేదో స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఆ ఎస్ఈ ప్రభుత్వ అభిప్రాయం కోరడంతో ఈ వ్యవహరం అంతటితో ఆగిపోయింది. అయితే ఆయన బదిలీ కావడంతో ఆ ఉద్యోగి తిరిగి చక్రం తిప్పారు. ఎస్ఈగా అదనపు బాధ్యతలను చేపట్టిన కొత్త ఎస్ఈ సంబంధిత ఉద్యోగి ప్రతిపాదించిన అక్రమ ప్రమోషన్లకు వెనకాముందు ఆలోచించకుండా ఆమోదం తెలిపిన విషయం ఇప్పడు చర్చనీయాంశమైంది. దీంతో వెలుగులోకి రాని ఈ అక్రమ ప్రమోషన్లపైనా విచారణ జరుగుతోందా లేదా అనేది తెలియరాలేదు. -
అధికారులకు ప్రజల గోడు వినిపించడం లేదు.. సమస్యల పరిష్కారంపై కాసింతైనా చిత్తశుద్ధి చూపించడం లేదు. సమస్యల పరిష్కారానికి పథకాలు ఎన్ని పెడుతున్నా ఆచరణలో అమలు కావడం లేదు.. కలెక్టరేట్కు వస్తున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ఒకటా రెండా.. వేల సంఖ్యలో వచ్చిన అర్జీలే మ
● సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్కు క్యూ కట్టిన జనం ● భూ సమస్యలకు రెవెన్యూ యంత్రాంగమే కారణం ● రీ సర్వేతో రైతుల జీవితాలతో చెలగాటం మదనపల్లి (కురబలకోట): మదనపల్లిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి అర్జీలు వెల్లువెత్తాయి. జేసీ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్రెడ్డి అర్జీలను స్వీకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సమస్యలతో వచ్చిన వారు అర్జీల ఆన్లైన్కు బారులు తీరారు. ముఖ్యంగా 90 శాతం మంది భూసమస్యలపై అర్జీలు ఇవ్వడం గమనార్హం. దీన్ని బట్టి జిల్లా స్థాయిలో భూ సమస్యల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్లుగా అర్జీలు ఇస్తున్నా ఆశించిన స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు వాపోయారు. ఉన్నతాధికారులు పరిష్కరించాలని సూచించినా మండల స్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవంలో ఉన్న భూమి ఆన్లైన్ కాలేదని, భాగపరిష్కారం, 22ఎ భూమికి పరిష్కారం లభించలేదని, భూ కబ్జాలు, భూ అక్రమణలు, రెవెన్యూ ఉద్యోగుల లంచగొండితనం, ఆర్ఓఆర్ నమోదు లోపాలు, చుక్కల భూముల చిక్కులు, పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వడంలేదని, వన్బీకి డిజిటల్ కీ లేదని. రీ సర్వేలో భూమి విస్తీర్నం తగ్గించి ఇవ్వడం, భూ రికార్డులు ఉన్నా ఆన్లైన్ చేయడం లేదని, ఒకరి భూమిని మరొకరికి ఆన్లైన్ చేయడం,ఎఫ్లైన్, భూ సరిహద్దులు చూపకపోవడం, రీ సర్వేలో ప్రలోభాలకు తలొగ్గి అవకతవకలు వంటి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. ● గ్రీవెన్స్డేలో భారత చైతన్య యువజన పార్టీ పీఏసీ పాల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థుల హక్కులు, ప్రైవేటు టీచర్ల సమస్యలు, అనుమతి లేని విద్యా సంస్థల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ● పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లికు చెందిన పలువురు తమకున్న అరకొర భూములను బస్సుల కంపెనీ పరిశ్రమ పేరుతో స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఇదే జరిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని వాపాయా రు. న్యాయం చేయాలని వినతి పత్రమిచ్చారు. ● జలధార ప్రాజెక్టులో మొదటి స్థానంలో ఉన్నట్లుగా చంకలు గుద్దుకుంటున్న కలెక్టర్ కార్యాలయం పీజేఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) సమస్యల పరిష్కారంలో మదనపల్లి నియోజక వర్గం రాష్ట్రంలో 136వ స్థానంలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం విఫలమైందనడానికి ఇదే నిదర్శనం. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో.. ఏం సమాధానం ఇస్తారో చూడాలి. ఎన్నికల ముందు రైతుల సంక్షేమం కోసంపాటుపడతామన్నారు. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం రైతులను, వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. భూమి రైతులకు ఆస్తి మాత్రమే కాదు జీవనాధారం. భూ ఆక్రమణలు, భూ దోపిడీలు ఎక్కువయ్యాయి. రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యమైంది. భూ సమస్యలు పరిష్కరించే దిక్కులేదు. ఎన్ని అర్జీలు ఇచ్చినా న్యాయం జరగడం లేదు. – చిన్న వెంకట్రమణ నాయుడు, రైతు సంఘం నాయకుడు, ఎండపల్లి, ములకలచెరువు మండలం వంద శాతం కళ్లు కన్పించవు. సదరన్ సర్టిఫికెట్ కూడా ఉంది. 2011 నుంచి వికలత్వ పింఛన్ వచ్చేది. పింఛన్ ఐడీ నెంబరు 131466. ఉన్నట్టుండి నిలుపుదల చేశారు. ఆస్తిపాస్తులు లేవు. ఇదే ఆధారం. ఎందుకు పింఛన్ రద్దయ్యిందో అర్థం కావడం లేదు. గ్రీవెన్స్డేలో రెండేళ్లుగా అర్జీలు ఇవ్వడం తప్ప పరిష్కారం కన్పించడం లేదు. ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం పోతోంది. – ఎం.శంకర, అంధుడు, శ్రీరామ పురం, ములకలచెరువు మండలం పక్కా ఇంటి కోసం రెండేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. గ్రీవెన్స్డేలో అర్జీలు ఇస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇద్దరం అంధులమే. అయినా అధికార యంత్రాంగానికి జాలి కలగడం లేదు. పింఛన్ సొమ్ముతో బతుకుతున్నాం, పక్కా ఇల్లు వచ్చినా కట్టుకోలేమన్న భయంతో టిడ్కో ఇళ్లు కావాలని ఆశిస్తున్నాం. అధికారులు దయ చూపితే ఓ ఇంటివారం అవుతాం. – వెంకట్రమణ, అమృత, అంధ దంపతులు, నేతిగుంటపల్లి, పుంగనూరు మండలం -
పేదలపై పెనుభారం
డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్టానుసారం పెట్రోల్, డీజిల్పై పన్నులు వేస్తుండడంతోనే ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. తద్వారా నిత్యావసర వస్తువులు ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పెంచిన ధరలు తగ్గించాలి. – భానుప్రకాష్రెడ్డి, ఎర్రగుంట్లపల్లె పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. రోజు రోజుకు ధరలు పెంచుతుండడంతో పలువురు డ్రైవర్లు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశంలో డీజిల్, పెట్రోల్పై పన్ను భారం మోపడం తీవ్ర అన్యాయం. – చక్రధర్, పీలేరు -
వాస్తవ వివరాలతో వినతులివ్వాలి
కడప సెవెన్రోడ్స్ : గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేస్తున్న తమకు వాస్తవాలతో కూడిన వినతులనే అందజేయాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ప్రజలు, కుల సంఘాలకు సూచించారు. సోమవారం కడప కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో ఆయన ప్రజలు, వివిధ సంఘాలు, పార్టీల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.3 ద్వారా, సుప్రీం కోర్టు వివిధ తీర్పుల మేరకు ట్రిపుల్ టెస్ట్ నిబంధనలు అమలు చేసేందుకు కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతం నిర్ణయించేందుకు రాజ్యాంగ బద్దంగా, శాసీ్త్రయంగా అధ్యయనం చేయడం కమిషన్ ప్రధాన ఉద్దేశమన్నారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి వాటి ప్రభావాన్ని అంచనా వేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు తాము సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ శ్రీధర్ మాట్లాడారు. బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ సి.మల్లికార్జున, జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం, జిల్లా పంచాయతీ అధికారి వెంకట సుబ్బయ్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ హజరతయ్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎస్.కృష్ణ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కులగణన నిర్వహించాకే రిజర్వేషన్లు పెంచాలి రాష్ట్రంలో కుల గణన నిర్వహించిన తర్వాతనే బీసీల జనాభా నిష్పత్తి ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు లేట్లపల్లి శివరాం కోరారు. సోమవారం బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతిపత్రమిచ్చారు. బీసీలకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లు 2011 జనాభా ఆధారంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం 2021 సంవత్సరం ఆధారంగా రాష్ట్రంలో జనగణన జరుగుతోందన్నారు. అందులో కుల గణన నిర్వహించాక స్పష్టమైన, శాసీ్త్రయ బద్దమైన బీసీల జనాభా శాతం తేలుతుందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కేటాయించే విధంగా ప్రభుత్వానికి సమర్పించే నివేదికల్లో పొందుపరచాలన్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తే న్యాయస్థానాలు అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు. ● బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి కులాల వారీగా వర్గీకరణ చేయాలని దూదేకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకేసుల బాదుల్లా, డీజీ అక్బర్ అలీలు కోరారు. ● రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున కోరారు. ● రాష్ట్ర వెనుకబడిన తరగతుల జాబితా గ్రూప్–ఇలో ఉన్న ముస్లిం వర్గాలను కేంద్ర జాబితాలో చేర్చడం ద్వారా ఓబీసీలుగా ప్రకటించాలని ఏఐసీసీ కో ఆర్డినేటర్ ఎస్ఏ సత్తార్ కోరారు. 2007 జులై 7న అప్పటి సీఎం వైఎస్సార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడిన 15 వర్గాలకు చెందిన ముస్లింలను బీసీ–ఈ గ్రూపుగా చేర్చారని పేర్కొన్నారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా -
కొత్తజోన్తోనైనా.. డబుల్డెక్కర్ వచ్చేనా?
● తిరుపతి–విశాఖ మధ్య పరుగులు ● దారి మళ్లింపుతో జిల్లావాసులకు తప్పని ప్రయాసరాజంపేట : ముంబై–చైన్నె మార్గంలో వందేభారత్ రైలు నడిపించాలని రైల్వేశాఖ యోచించడం లేదు. కొన్నేళ్ల క్రితం జిల్లా మీదుగా నడిచిన డబుల్ డెక్కర్ కనుమరుగైంది. దారి మళ్లింపు నిర్ణయంతో ఈ పరిస్థితి తలెత్తింది. త్వరలో కొత్తజోన్ కేంద్రంగా విశాఖపట్నం ఏర్పడుతుండటంతో తిరుపతి–విశాఖ మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ను కడప వరకు పొడిగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. వారానికి మూడురోజులు కాకుండా నిత్యం ఈ రైలును నడపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కేంద్రంతో జిల్లా రైల్వే ఉద్యోగులు, కార్మికులు అవసరం లేకపోవడంతో ఇప్పుడు డబుల్ డెక్కర్ రైలు పొడిగిస్తే రాకపోకలకు మెరుగైన అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో కాచిగూడ–తిరుపతి మధ్య నడిచిన డబుల్ డెక్కర్ను ఆదాయం రావడం లేదని జిల్లాకు ఈ రైలును దూరం చేశారు. హాల్టింగ్స్ ఇవ్వడంలో సడలింపు లేకపోవడంతోనే డబుల్ డెక్కర్ను ఈ మార్గంలో నడిపించలేకపోయారనే విమర్శలున్నాయి. విశాఖ–తిరుపతి మధ్య నిత్యం రద్దీ ఇప్పటికే విశాఖ – తిరుపతి మధ్య ఉన్న రైళ్లు చాలకపోవడంతో నెల రోజుల ముందే వెయింటింగ్ లిస్ట్ సిద్ధమవుతోంది. దీంతో ఈ మార్గంలో మరిన్ని రైళ్లు నడపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డబుల్డెక్కర్ రైలును ఈ రద్దీ మార్గంలో నడపాలనే దిశగా అడుగులు వేయడానికి కారణమైంది. కడప వరకు పొడిగిస్తే ప్రయాణికులకు ఊరట వారంలో మూడురోజులు తిరుపతి–విశాఖపట్నం(22708) మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలు రాత్రి 10 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. రాత్రి తిరుపతిలో 9.40 గంటలకు విశాఖకు బయలుదేరుతుంది. ఈ ఖాళీ సమయంలో కడప వరకు డబుల్ డెక్కర్ను తీసుకొస్తే జిల్లా ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. తిరుపతిలో రాత్రి వరకు.. తిరుపతిలో డబుల్ డెక్కర్ రైలు రాత్రి వరకు లూప్లైనులో ఖాళీగా ఉంటోంది. దీనిని కడప వరకు పొడిగిస్తే విజయవాడ, విశాఖపట్నం వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుందని జిల్లా వాసులు కోరుతున్నారు. కడప, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరులో హాల్టింగ్ కల్పిస్తే రాజధానికి వెళ్లేందుకు మరో రైలు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి సోమవారం, గురువారం, శనివారం రోజుల్లో. తిరుపతి నుంచి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో నడుస్తుంది. జూన్ 1 నుంచి ఎసీవోఆర్లో జిల్లా రైలు మార్గంలో విలీనం కావడం వల్ల ఈ రైలు అటు రైల్వే ఉద్యోగులు, కార్మికులతో పాటు విశాఖ, విజయవాడకు వెళ్లేందుకు దోహదపడుతుందనే డిమాండ్ తెరపైకి వచ్చింది.రైల్వేశాఖ చర్యలు తీసుకోవాలి జిల్లా మీదుగా వందేభారత్ రైలు ఇప్పట్లో నడిచే అవకాశాలు కనిపించడం లేదు. తిరుపతి–విశాఖ మధ్య నడిచే డబుల్డక్కర్ను కడప వరకు నడిపించేందుకు రైల్వేశాఖ చర్యలు తీసుకోవాలి. జిల్లా మీదుగా రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు సరైన రీతిలో రైళ్లు అందుబాటులేవు. ఉన్న తిరుమల గుంతకల్ వరకు పొడిగించడంతో ఆ రైలులో ప్రయాణం కష్టతరం. – డా.బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఐఎంఏ, రాజంపేటవిజయవాడ వెళ్లేందుకు అనుకూలం డబుల్ డెక్కర్ రైలును కడప వరకు పొడిగిస్తే రాజధాని, కొత్త రైల్వేజోన్ కేంద్రానికి వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు జిల్లా మీదుగా పరుగులు తీసిన ఈ రైలును ప్రతి రోజూ నడిపిస్తే విజయవాడ వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. రైల్వేశాఖ కడపకు పొడిగింపు ప్రతిపాదన చేయాలి. – షమీవుల్లాఖాన్, మాజీ ఏజీపీ, నందలూరు -
గుక్కెడు నీళ్లివ్వలేరా!
ఎండలు మండుతున్నా ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వడానికి అధికారులకు మనసు రావడం లేదు. ఈ చిత్రమే దీనికి సాక్ష్యం. ఓ కుర్చీ.. అందులో రెండు నీళ్ల బాటిళ్లు.. చిన్న అట్టపెట్టెలో ఓఆర్ఎస్ప్యాకెట్లు.. దీనికి కాపలాగా ఓ సెక్యూరిటీ గార్డు.. అర్జీ చేతబట్టుకుని దూరాన్ని..భారాన్ని లెక్కచేయకుండా కలెక్టరేట్కు వచ్చిన అర్జీదారుల దాహం తీర్చడానికి అధికారుల ‘ప్రత్యేక’ ఏర్పాట్లట ఇవి. ఈ రెండు నీళ్లబాటిళ్లతోనే వందలాది మంది దప్పిక తీర్చుకోవాలట మరి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు అద్దంపట్టే దృశ్యమిది. అసలే విపరీతమైన వేడి, ఆపై ఉక్కపోత ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమగోడు చెప్పుకొని పరిష్కరించుకోవాలని కలెక్టరేట్కు వచ్చారు. తా గడానికి గుక్కెడు నీళ్లు దొరక్క దాహానికి అల్లాడిపోయారు. కలెక్టరేట్లో నీటి సౌకర్యం కల్పించకపోవడంపై జనం మండిపడ్డారు. – సాక్షి, మదనపల్లె -
బాధితులకు భరోసా కల్పించండి : ఎస్పీ
మదనపల్లె టౌన్ : ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. సోమవారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి, వారి సమస్యలు ఆలకించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఆయా సమస్యలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు, మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యమిచ్చి, సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కాంక్రీట్ మిల్లర్ బోల్తా : కార్మికుడికి తీవ్రగాయాలు ఠిమదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో కాంక్రీట్ మిల్లర్ యంత్రం బోల్తాపడటంతో కార్మికుడి చేయి పూర్తిగా తెగిపోయింది. పోలీసుల కథనం మేరకు గొల్లపల్లికి చెందిన రమేష్ కుమారుడు పవన్ కల్యాణ్ (24) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నారు. సోమవారం పట్టణంలోని ఎంఎల్ఎల్ ఆసుపత్రి సమీపంలో ఓ ఇంటి పునాది పనులు చేస్తుండగా కాంక్రీట్ మిల్లర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్ యంత్రంలో చిక్కుకుపోవడంతో ఆయన చేయి పూర్తిగా తెగిపోయింది. అప్రమత్తమైన సహచర కార్మికులు, స్థానికులు బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణ స్థలాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని పోలీసులు సూచించారు. గువ్వలచెరువు ఘాట్రోడ్డులో గ్యాస్ ట్యాంకర్ బోల్తాచింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని ఐదో మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. రక్షక్ వాహన సిబ్బంది నరసింహులు బాధితుడిని వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక అధికారులు, ఐఓసిఎల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సీకేదిన్నె మండల సీఐ బాలమద్దిలేటి ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించి రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఘటనా స్థలంలోనే ఫైర్ ఇంజిన్లు, సిబ్బందిని ఉంచి మంగళవారం గ్యాస్ ట్యాంకర్ను యథాస్థితికి తీసుకొస్తామని తెలిపారు. -
సీపీఎల్–2 విజేతలుగా ఎన్కే స్పోర్ట్స్, హైపెరియన్ జట్లు
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో గత 15రోజులుగా సీపీఎల్–2 క్రికెట్ మ్యాచ్లు సాగుతున్నాయి. సోమవారం ఉదయం ఆదిత్య బీఆర్, ఎన్కే స్పోర్ట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిత్య బీఆర్ జట్టు 183 పరుగులు చేయగా.. ఎన్కే స్పోర్ట్స్ జట్టు 184 పరుగులు చేసి విజయం సాధించింది. ఇందులో హేమాద్రి నాయుడు 25 పరుగులు చేసి 3 వికెట్లు సాధించి మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ అవార్డును సీడీసీఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్ అందించారు. మధ్యాహ్నం నితిన్ వారియర్స్, హైపెరియన్ జట్టు మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైపెరియన్ జట్టు 153 పరుగులు చేయగా.. నితిన్ వారియర్స్ జట్టు 140 పరుగులకు ఆలౌటైంది. హైపెరియన్ ప్లేయర్ సూర్యచరణ్ 3 వికెట్లు తీయడంతో మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. మ్యాన్ఆఫ్ది మ్యాచ్ ట్రోఫీని తిరుపతికి చెందిన మారుతి హాస్పిటల్ అధినేత డాక్టర్ మారుతి కృష్ణ అందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ సునీల్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఇంధన ధరల పెంపుతో సామాన్యుడిపై భారం
రాయచోటి అర్బన్: పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేస్తూ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు ప్రభుత్వాలు విధిస్తున్న భారీ పన్నుల భారం ప్రజలపై మోపడం దారుణమన్నారు. ఇంధన ధఱల పెరుగుదల ప్రభావంతో రవాణా చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటున్నాయని, దీని వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచారనన్నారు. మే 15న పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.3 చొప్పున పెంచగా, మే 19వ తేదీన పెట్రోల్పై మరో రూ.0.95లు, డీజిల్పై రూ.0.97లు పెంచారని తెలిపారు. మే 23న పెట్రోల్పై రూ.0.97లు, డీజిల్పై రూ.99లు పెంచి, మే 25న పెట్రోల్పై రూ.2.87లు, డీజిల్పై రూ.2.85లు ెపెంచారని వివరించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.10లు వరకు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తూ ప్రజలపై మరింత భారం మోపుతోందని మండిపడ్డారు. వెంటనే ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
సదుం : సదుం మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..సోమల మండలం గురికానివారిపల్లెకి చెందిన రాజశేఖర్ (31) సదుం మండలంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని బైక్లో ఇంటికి బయలు దేరాడు. నడిగడ్డ సమీపంలో గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి.. రొంపిచెర్ల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని మృతి చెందినట్లు ఎస్ఐ మధుసూధన్ సోమవారం తెలిపారు. గురువారం రాత్రి చైన్నై–అనంతపురం జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనంపై నుంచి గుర్తు తెలియని వ్యక్తి కింద పడి త్రీవంగా గాయ పడ్డారు. అతన్ని చికిత్స కోసం అన్నమ్మయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడని తెలిపారు. తిరుపతి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
పది రోజులు..నాలుగు మార్లు..!
● వరుసగా పెరుగుతున్న పెట్రోల్ డీజల్ ధరలు ● తాజాగా పెట్రోలుపై రూ. 2.84, డీజల్పై రూ2.86 చొప్పున పెంపు ● వరుస పెంపుదలపై వాహనదారుల ఆగ్రహం సాక్షి అన్నమయ్య : కూటమి సర్కార్ హయాంలో పెట్రోలు, డీజల్ మంట భయపెడుతోంది. ఎప్పుడూ లేని తరహాలో కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగుమార్లు ధరలు పెంచడం వాహనదారుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక రూపాయి కాదు...రెండు రూపాయలు అంతకన్నా కాదు..పెట్రోలు, డీజల్పై ఏకంగా రూ.8 వరకు పెంచుకుంటూ పోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెంచిన ఇంధన ఛార్జీలు తగ్గింపు కోరుతూ కూటమి పార్టీలు మినహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాలు, ప్రజా సంఘాలు పోరుబాటకు సంకల్పించాయి. ఇంధన ధరలు ౖపైపెకి... జిల్లాలో వాహనదారులపై ఇంధన ధరల పెంపు పెను ప్రభావం చూపనున్నాయి. జిల్లాలో కంటైనర్లు, లారీలు, బస్సులు, జీపులు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దాదాపు ఆరు లక్షలకు పైగా ఉన్నాయి. ప్రతినిత్యం వాహనాలు బయటికి కదలాలంటే పెట్రోలు, డీజల్ అవసరం. తాజాగా ధరల పెంపు కారణంగా పెట్రోలు రూ. 116.66, డీజల్ రూ. 104.38కు చేరుకుంది. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుండగా, మరోవైపు వాహనాల వినియోగానికి సంబంధించిన ఇంధన ధరలు ౖపైపెకి చేరుకుంటున్నాయి. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన రెండేళ్లలోనే ఇంత భారీగా పెంచుకుంటూ పోవడం వాహనదారులను కుదిపేస్తోంది. పెనుభారం జిల్లాలో 120కి పైగా ఇంధనం సరఫరా చేసే బంకులు ఉన్నాయి. ప్రతినిత్యం డీజల్ 1.90 లక్షల లీటర్లు, పెట్రోలు 2.10 లక్షల లీటర్లు అమ్మడవుతోంది. ఇంధన కొనుగోలుపై వాహనదారులకు పెద్ద ఎత్తున వాత పడుతోంది. ప్రతినిత్యం డీజల్, పెట్రోలు కొనుగోలుపై రూ. 12 లక్షలకు అదనపు భారం పడుతోంది. ఈ లెక్కల నెలకు రూ. 3.69 కోట్లకు పైగా వాహనదారులు భరించాల్సి వస్తోంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు ౖపైపెకే పోతుండడంతో ఆందోళన కలిగించే పరిణామం. కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు వివిధ పద్దుల్లో సుమారు రూ. 8 వరకు పెంచుకుంటూ పోయారు. లీటరుపై సరాసరిన రూ.8 అంటే....ఒక వ్యక్తి వాహనానికి 10 లీటర్ల పెట్రోలు పట్టిస్తే అదనంగా రూ.80 భరించాల్సి వస్తోంది. రాష్ట్రంలో పెట్రోలు, డీజల్ ధరల పెంపు నిర్ణయం సరికాదు. పది రోజుల వ్యవధిలో నాలుగుమార్లు ధరలు పెంచుతూ వచ్చారు. అందులోనూ లీటరుపై ఒక్కోసారి ఒక్కోరకంగా పెంచడంతో వాహన దారులపై పెను ప్రభావం చూపుతోంది. కూటమి సర్కార్లోని పెద్ద లు మాత్రం ఇంధన పొదుపు అంటూ సామాన్యులపై భారం మోపడం ఎంతవరకు స మంజసం. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే ప్రజా ఉద్యమాలు తప్పవు. ఇప్పటికై నా పెంచిన ధరలు తగ్గించాలి. – జంగంరెడ్డి కిశోర్దాస్, జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, అన్నమయ్య జిల్లా -
కోర్కెలు తీర్చే కల్పవల్లి.. కోర్టులో గంగమ్మ
మదనపల్లె సిటీ : కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కోర్టులో గంగమ్మను భక్తులు కొలుస్తున్నారు. మదనపల్లె పట్టణం కోర్టు ఆవరణంలో వెలసిన గంగమ్మ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మంగళవారం రాత్రి తిరునాలతో జాతర ప్రారంభమవుతుంది. జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్దీపాలతో అలంకరించారు. దీంతోపాటు పటేల్రోడ్డు, బెంగుళూరు రోడ్డు, సొసైటీ కాలనీ, రాటకొండ వీధి, అమినేనివీధి, మల్లికార్జున సర్కిల్, కదిరిరోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రదాన కూడళ్లులో అమ్మవారు, వివిధ దేవతా మూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆలయ చరిత్ర కోర్టు ఆవరణంలో వెలసిన గంగమ్మ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. సుమారు 300 ఏళ్ల కాలంలో నాడు కర్ణాటకలోని బాగేపల్లె ప్రాంతంలో పుట్టిన అమ్మవారిని జోళెపాలెం వంశస్థులు మదనపల్లెకు తీసుకువచ్చారు. స్థానికులకు అనారోగ్యం చేసినప్పుడు అమ్మవారిని వేడుకుని ఆరోగ్యం కుదట పడాలని వేడుకున్నారు. అమ్మవారి దయతో అందరూ ఆరోగ్యంగా ఉండటంతో అప్పటి నుంచి అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తున్నారు. అమ్మవారికి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. కోర్టు ఆవరణంలో మార్పురి వంశస్థులు అమ్మవారిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. కల్లుకుండలకు పూజలు కోర్టులో వెలసిన గంగమ్మ జాతరకు ప్రత్యేకంగా ఉంది. తొలి రోజు శాస్త్రివీఽధిలోని రాటకొండ వంశస్తులైన రాటకొండ బాబురెడ్డి నివాసం ఉంచి కల్లుకుండలు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి వద్ద ఉంచి పూజలు చేస్తారు. కృష్ణానగర్లోని కుమ్మరి శ్రీరాములు వంశస్తులు తయారు చేసిన అమ్మవారి ప్రత్యేక విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. బుధవారం ఉదయం తిరునాల వైభవంగా జరుగుతుంది. జాతరకు మదనపల్లె పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.నేడు రాత్రి తిరునాల -
భూ ఆక్రమణకు యత్నిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : ప్రత్యర్థులు తమ భూములు ఆక్రమించుకుని చంపేందుకు కుట్ర పన్నారని కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లె పంచాయతీ ఎరజేనువారిపల్లెకు చెందిన రెడ్డమ్మ ఆరోపించారు. సోమవారం మదనపల్లెలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త అమర్నాథరెడ్డికి చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రత్యర్థులు కుట్రలు పన్నుతున్నారని వాపోయారు. భూ సర్వే చేయించేందుకు అధికారులను తీసుకెళ్తే సర్వే చేయకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రత్యర్థులైన బాలక్రిష్ణారెడ్డి, మంజునాథరెడ్డి, బయ్యారెడ్డి, సుధాకర్రెడ్డి, చిన్ని తదితరులు తనను హతమార్చాలని దారి కాస్తున్నారని ఆరోపించారు. తన భూములను సర్వే చేయించి తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కట్నం కోసం వేధింపులపై.. మదనపల్లె టౌన్ : కట్నం కోసం గర్భిణిని అని కూడా కనికరం లేకుండా తనను అత్తింటి వారు గెంటేశారని రామసముద్రం మండలం, గజ్జి గంగన్నపల్లెకు చెందిన ఎస్.సుబ్రహ్మణ్యం భార్య మౌనిక ఆరోపించారు. మదనపల్లి ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజిఆర్ఎస్లో ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను 9 నెలల గర్భంతో ఉండగా ఓ యువతి మాయలోపడి ఆమె చెప్పినట్లు వింటూ తనను అదనపు కట్నం కోసం అత్తింటి నుంచి గెంటేశారని ఆరోపించారు. ఈ విషయమై రామసముద్రం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా కానిస్టేబుల్ శాంతమ్మ తనను విచారించకుండానే తెల్ల కాగితంలో సంతకం చేయించుకుని, కేసు రాజీ కుదిర్చామని చెప్పారని విలపించారు. రామసముద్రం పోలీస్స్టేషన్లో కేసు కట్టకుండా పుంగనూరుకి చెందిన సల్మా హ్యూమన్ రైట్స్ అని చెప్పుకొంటూ తనకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబీకులతో కలసి తన వద్ద ఉన్న సుమారు రూ. 3 కోట్ల ఆస్తిని ఇప్పటికే కాజేశారని, తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. -
విజేతలుగా ఆదిత్యా బీఆర్, పాయ్వైస్రాయ్
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రికెట్ క్రీడామైదానంలో సీసీఎల్–2 క్రికెట్ పోటీలు ఆదివారం జరిగాయి. ఉదయం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆదిత్యా బీఆర్ జట్టు, హైపెరియన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆదిత్యా బీఆర్ జట్టు 225 పరుగులు చేసి విజయం సాధించగా.. హైపెరియన్ జట్టు 206 పరుగులు చేసి ఓటమి పాలైంది. మధ్యాహ్నం పయ్వైస్రాయ్, స్పార్టన్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో స్పార్టన్ వారియర్స్ 211 పరుగులు చేయగా.. పాయ్వైస్రాయ్ జట్టు 212 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్లో జహీర్ అబ్బాస్ మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అవార్డును కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో విజయ్కుమార్, సతీష్యాదవ్, శ్రీధర్కుమార్, సునీల్ కుమార్, ప్యానెల్ అంపైర్స్ హసన్షావలి, కిరణ్, క్రీడాకరులు పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ
సాక్షి, మదనపల్లె: జిల్లాలో విద్యుత్ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం దృష్టికి తీసుకురాలాలని డిస్కం జిల్లా ఎస్ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు 94408 17449 నంబర్కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాక్షి, మదనపల్లె: స్థానిక కలెక్టరేట్లో సోమ వారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి తమ ఫిర్యాదులను అందజేయవచ్చని తెలిపారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఫిర్యాదుల సేకరణ జరుగుతుందన్నారు.సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్పై వెలసిన ఏనుగు మల్లమ్మ జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. మల్లమ్మ విగ్రహానికి వెండి ఆభరణాలు, నాగపడిగ, కవచం ధరింపజేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి జరిగిన వేడుకలో వల్లభ ఉత్సవ విగ్రహాన్ని అశ్వ వాహనంపై కొలువుదీర్చి హార్సిలీకొండ రహదారులపై ఊరేగించారు. భక్తులు తరలివచ్చి మల్లమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల సందడి మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.హిందువులతో పాటు ముస్లీంలు ఆలయానికి తరలిరావడం విశేషం. మదనపల్లె సిటీ: ఫుట్బాల్ జిల్లా జూనియర్స్,సబ్ జూనియర్స్ బాలుర జట్ల ఎంపిక స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సుమారు వందకుపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 30 మందిని ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యదర్శి కె.మురళీధర్ తెలిపారు. వీరికి 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వారి ప్రతిభ,ఫిట్నెస్,ఆటతీరును పరిశీలించి తుది జట్టుకు 20 మంది క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దిలీప్కుమార్, ఎంఈఓ అంజనేయులు, ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేంద్ర, అసోషియేషన్ ఉపాధ్యక్షుడు చంద్రకళ, జాన్ కమలేష్, బాలాజీ పాల్గొన్నారు. -
పుంజుకున్న టమాట ధర
సాక్షి, మదనపల్లె: మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాట ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈనెల ప్రారంభం నుంచి మెల్లగా పెరుగుతూ వచ్చిన తర్వాత ఈనెల 20న కిలో రూ.34కు చేరింది. తర్వాత మళ్లీ తగ్గుముఖం పట్టిన ధరలు ఆదివారం మళ్లీ పెరిగాయి. కిలో అత్యధిక ధర రూ.30 పలకగా, రెండో గ్రేడ్ లో అతి తక్కువ ధర కిలో రూ.16 పలికింది. అయితే ప్రస్తుత ధరలు ఆశాజనకంగా ఉండడం రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఎప్పుడూ ధరల పతనంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఈ పరిస్థితి కొంత ఊరట లభించింది. ఇలా పలుకుతున్న ధరలు మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు గత 15 రోజులుగా ఇలా ఉంటున్నాయి. అత్యధిక ధర వివరాలు పరిశీలిస్తే..ఈనెల 10న కిలో రూ.23, 11న రూ.24, 12న రూ.26, 13న రూ.28, 14న రూ.29, 15న రూ.30, 16న రూ35, 17న రూ33, 18న రూ.34, 19న రూ.32, 20న రూ.34, 21న రూ.31, 22న రూ.28, 23న రూ.29, 24న రూ.30 పలికింది. విక్రయానికి 7,643 టన్నులు ఈనెల 10 నుంచి ఆదివారం వరకు మదనపల్లె మార్కెట్ కు 7,643 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల నుంచి రైతులు టమాటను ఇక్కడికి తరలించి విక్రయించుకుంటారు. ఈ 15 రోజుల్లో ఈ నెల 18 నుంచి టమాట దిగుబడి భారీగా పెరిగింది. 18న 502 టన్నులు, 19న 598 టన్నులు, 20న 580 టన్నులు, 21న 587 టన్నులు, 22న 650 టన్నులు, 23న 671 టన్నులు రాగా ఇప్పటిదాకా అత్యధికంగా ఆదివారం 698 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. మదనపల్లె మార్కెట్ నుంచి ఆదివారం 7 రాష్ట్రాలకు టమాట ఎగుమతి అయింది. ఒడిస్సా, పశ్చిమబంగా, తెలంగాణ చత్తీస్గడ్, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళం లతోపాటు ఏపీలోనే విజయవాడ, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, అనకాపల్లిలకు ఎగుమతి అయ్యాయి. మళ్లీ కిలో రూ.30 -
ఆగి ఉన్న లారీని ఢీకొని స్కూటరిస్టు మృతి
పీలేరురూరల్/సదుం : ఆగివున్న లారీని బైక్ ఢీకొనడంతో స్కూటరిస్టు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి వేపులబైలు పంచాయతీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సదుం మండలం ఊటుపల్లెకు చెందిన ఎన్. మంజునాథ (37) వేపులబైలు పంచాయతీలో భారత్ పెట్రోలియం బంకులో పంపుమ్యాన్గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి ద్విచక్రవాహనంలో పీలేరుకు వచ్చి తిరుగుప్రయాణమయ్యాడు. టీ స్టాల్ వద్ద ఆగివున్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంజునాథను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. -
అగ్గిపెట్టె విషయమై.. కత్తితో దాడి
రాయచోటి : అగ్గిపెట్టె విషయమై మద్యం మత్తులో నెలకొన్న ఘర్షణ కత్తులతో దాడి చేసుకునే వరకు దారి తీసింది. ఈ దాడిలో కొత్తపల్లి రెడ్డిసాయి(20) తోటి మిత్రుల చేతిలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.... పాత రాయచోటికి చెందిన రెడ్డిసాయి, ఆర్ కె శివ, పుల్లయ్యలు సమీప నివాస ప్రాంతాల్లో నే శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు మద్యం తాగుతూ కాలాన్ని వెల్లదీసినట్లు పోలీసులు తెలిపారు. రెండున్నర గంటల సమయంలో సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె తేవాలని ఆర్ కె శివ, పుల్లయ్యలు రెడ్డి సాయికి చెప్పారు. ఈ సమయంలో తాను అగ్గిపెట్టెను తేలేనని చెప్పడంతో ముగ్గురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ముగ్గురి మధ్య మాట మాటా పెరిగడంతో ఆర్.కె.శివ, పుల్లయ్యలు కత్తులతో రెడ్డి సాయి ఛాతి, కడుపుపై పొడిచినట్లు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న రెడ్డి సాయిని చూసిన స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
మొరాయించిన సర్వర్లు.. భక్తులకు ఇక్కట్లు
● బోయకొండలో ఊహించని రీతిలో రద్దీ ● సుమారు 25 వేల మంది హాజరుచౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం ఊహించని రీతిలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలనుంచి సుమారు 25 వేల మంది తరలివచ్చారని ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో టికెట్లు పంపిణీ చేసే సర్వర్లు పనిచేయకపోవడంతో గంటల తరబడి ఇబ్బందులు పడాల్సివచ్చింది. సర్వర్లు మోరాయించడంతో అధికారులు మ్యాన్యువల్ టికెట్లను పంపిణీ చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతంలో మౌలిక వసతులతోపాటు తాగునీటి కోసం భక్తులు అవస్థలు పడ్డారు. కొందరు భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకొని చేతివాటం చూపారు. కూల్డ్రింక్స్, తాగునీటిని ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించారు. కోరికలు తీరిన వారు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రసాదాల కౌంటర్లో టికెట్లు లేక ప్రసాదాలు తీసుకోకుండానే నిరాశతో వెనుతిరిగారు.దీంతో ప్రసాదాల కౌంటర్ ఖాళీగా కనిపించింది. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడ్డారు. ఒక్కరోజు ఆదాయం.. రూ:20 లక్షలు బోయకొండ ఆలయం వద్ద వివిధ రకాల సేవా టికెట్ల విక్రయాల ద్వారా ఆలయానికి ఆదివారం రూ:20 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాబో యే రోజుల్లో ఏర్పాట్లపై దృష్టిసారిస్తామని చెప్పారు. -
జీవాలను ఎత్తుకెళ్లిన దొంగలు
రాజుపాళెం : నూతనంగా నిర్మించుకున్న రేకుల షెడ్డులో కొంతమంది గుర్తు తెలియని దొంగలు జీవాలను ఎత్తుకెళ్లిన సంఘటన రాజుపాళెం మండలంలోని వెంగళాయపల్లె ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వెంగళాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కంపమల్ల దావీదు అలియాస్ రవి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జీవాల పెంపకం తోడ్పాటు నిస్తుందని భావించి అప్పు చేసి కాలనీ సమీపంలో గాదెగూడూరు గ్రామానికి వెళ్లే రహదారిలో రోడ్డు పక్కనే రేకుల షెడ్డు నిర్మించుకున్నాడు. అందులో జీవాలతో పాటు కోళ్లను పెంచుకుంటున్నాడు. ఈక్రమంలో 15 పొట్టేళ్లు, ఒక గొర్రె, ఒక మేక, ఒక మేకపోతును శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు చుట్టు ఉన్న కంచెను కత్తిరించి షెడ్డుకు ఉన్న వాకిలి తీసి ఎత్తు కెళ్లారు. రాత్రి రవి అక్కడే నిద్రించాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జీవాలు లేవని రవి గుర్తించాడు. అప్పటి నుంచి ఈ సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు తెలిపారు. ఎస్ఐ ప్రణయ్కుమార్ రెడ్డి, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన తీరును బాధితుడు రవిని అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించి దొంగలను గుర్తించేందుకు ఎస్ఐ చర్యలు చేపట్టారు. దొంగలు ఎత్తుకెళ్లిన జీవాల విలువ దాదాపు రూ.2,90,000 ఉంటుందని, అలాగే రూ.9 వేలు విలువ చేసే సెల్ ఫోన్ కూడా దొంగలించినట్లు బాధితుడు రవి వాపోయాడు. గాయపడిన జింకజమ్మలమడుగు : పెద్దముడియం మండలం కల్వటాల గ్రామ సమీపంలో ఉన్న సోలార్ ప్యానల్స్లో దూరి జింకకు తీవ్ర గాయాలయ్యాయి. ఈవిషయాన్ని తెలుసుకున్న సెక్యూరిటీ మాధవ మునిరెడ్డి తన సిబ్బందితో కలిసి దానిని రక్షించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఫారెస్టు అధికారులు గాయాలైన జింకకు పశుసంవర్థకశాఖ వైద్యులతో వైద్యం చేయించారు. అనంతరం అడవిలో వదిలేశారు. -
ఊరూరా మద్యం
● వేకువజామునే తెరుస్తున్నమద్యం షాపులు ● అర్దరాత్రి వరకు నిర్వహించేబార్లు, వైన్ షాపులతోశాంతి భద్రతలకు విఘాతం ● 24 గంటల పాటు విచ్చలవిడిగావైన్ షాపుల్లో అమ్మకాలు ● అడ్డూ అదుపూ లేకుండాఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్న మద్యం ప్రొద్దుటూరు క్రైం: రాత్రి 10 దాటిందంటే చాలు... పాలు దొరకదు.. ఇక కాఫీ..టీ తాగాలంటే తెల్లవారే వరకు ఆగాల్సిందే. అదే ఆరోగ్యానికి హాని కలిగించే మద్యం మాత్రం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.. పల్లె.. పట్టణం తేడా మద్యం షాపులు ‘బార్లా’ తెరిచి ఉంటాయి.. ఇదీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు తీరు. అడ్డూ అదుపూ లేకుండా దొరికే ఈ మందు మహమ్మారి అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. జిల్లాలో దాదాపుగా మద్యం షాపులు, బార్లు అధికార కూటమి నేతలవి, వారి బినామీలవి కావడంతో ఎకై ్సజ్, పోలీసు అధికారులు చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. పైగా కొందరు పోలీసు, ఎకై ్సజ్ అధికారులు నెలవారి మామూళ్లు తీసుకోవడంతో ఇక మద్యం వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ● జిల్లాలో 141 మద్యం దుకాణాలు, 28 బార్లు ఉన్నాయి. మద్యం షాపుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లలో ఉదయం 10 నుంచి అర్దరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించుకునేలా కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే అర్దరాత్రి వరకు బార్లు తెరచి ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసు అధికారులు 11 గంటలకే మూయిస్తున్నారు. వేకువ జామునే మద్యం అమ్మకాలా.. వైస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ జరిగేది. దీని వల్ల ఖచ్చిత సమయపాలన పాటించేవారు. నాడు ఉదయం 11 గంటలకు వైన్ షాపులు తెరచి రాత్రి 9 గంటలకు మూసేవారు. 9 గంటల తర్వాత తిరిగి మరుసటి రోజు 11 గంటల వరకు బయట ఎక్కడా మద్యం దొరికేది కాదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. మంచి నీళ్లైనా దొరుకుతాయో లేదో గానీ మందు మాత్రం ఎంత కావాలన్నా సులభంగా లభిస్తోంది. వేకువజామున 5.30 గంటల నుంచే ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో వైన్ షాపులు దర్శనం ఇస్తున్నాయి. బార్లు కూడా మద్యం షాపులకు పోటీగా ఉదయాన్నే తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వం అనుమతిచ్చిన పర్మిట్ రూంలలో నిల్చొని మాత్రమే మద్యం తాగేందుకు వెసులుబాటు ఉంది. అయితే జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లో బార్లను తలపించేలా తనివితీరా కూర్చొని తాగేందుకు వసతులు ఏర్పాటు చేశారు. కొన్ని వైన్ షాపుల్లో బార్లను మించిన లైటింగ్ డెకరేషన్, సిట్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. రాత్రి షాపులు మూసిన తర్వాత అక్కడి వాచ్మెన్, నైట్ డ్యూటీ సిబ్బంది ద్వారా ఎమ్మార్పీ కంటే రూ. 20కి అదనంగా మద్యం విక్రయిస్తున్నారు. ఇలా ఉదయం షాపులు తెరిచే వరకు రాత్రంతా మద్యం విక్రయాలు చేస్తున్నారు. గ్రామాల్లో వాడ వాడలా మద్యం అమ్మకాలు జిల్లాలోని అనేక గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. అధికార టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఈ అనధికార విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పెరిగిన మద్యం ధరలతో మందు బాబులు ఇబ్బంది పడుతుండగా వైన్షాపుల్లో కంటే అదనంగా రూ. 20లకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారు. గ్రామాల్లో అధిక శాతం పేద, బడుగు, బలహీన వర్గాల వారే ఉన్నారు. పగలంతా కష్టపడి సంపాదించిన కూలి డబ్బులను రాత్రి అయ్యే సరికి మద్యానికి ధార పోస్తున్నారు. కూలి డబ్బులను ఇంటికి తీసుకుపోకుండా దారిలోనే బెల్ట్ షాపులకు వెళ్లి ఖర్చు చేస్తున్నారు. అఽధికార పార్టీ నాయకులు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులను లెక్కచేయడం లేదు. పోలీసు అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే తమ ప్రభుత్వం ఉందంటూ వారిపైనే ఎదురు తిరగబడుతున్నారు. మద్యం మత్తులో గొడవలు జరగడం, చంపుకోవడం లాంటి ఘటనలు నిత్యం జిల్లాలో ఎక్కడో ఒక చోటు చేసుకుంటున్నాయి. మద్యమే అన్ని అనర్ధాలకు కారణంగా నిలుస్తోంది. ఇటీవల ప్రొద్దుటూరులోని నెహ్రూరోడ్డులో మద్యం మత్తులో ఒక వ్యక్తి తన తల్లిని ధూషించడానే కారణంతో తన స్నేహితుడినే కత్తితో పొడిచి చంపేశాడు – ఒక వ్యక్తి కొత్తగా కూల్డ్రింక్ షాపు ప్రారంభించాడు. అయితే షాపు ప్రారంభిస్తున్న సందర్భంగా స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చాడు. పార్టీలో మద్యం తాగి ఫుల్ కై పులో ఉన్న స్నేహితులు డబ్బు బాకీ విషయమై గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి రాడ్డుతో కొట్టడంతో సొంత స్నేహితుడి తలకు రక్తస్రావమై కింద పడిపోయాడు. రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్, ఈశ్వరెడ్డినగర్, పెన్నానగర్, కేహెచ్ఎం స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో మైనర్లు బ్యాచ్లుగా ఏర్పడి మద్యం తాగుతున్నారు. జిల్లాలోనే ప్రొద్దుటూరుకు వాణిజ్య కేంద్రంగా మంచి పేరుంది. దీంతో అన్ని వ్యాపారాలతో పాటు మద్యం వ్యాపారం కూడా ఇక్కడ జోరుగా జరుగుతుంది. 365 రోజులు బార్లు, మద్యం షాపులు కళకళ లాడుతుంటాయి. అయితే ఇక్కడ ఇతర రాష్ట్రాల మద్యాన్ని విక్రయిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో అనేక మార్లు ఎకై ్సజ్ అధికారులు గోవా, హర్యాణా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరిలో కారుతో సహా 174 లీటర్ల గోవా మద్యాన్ని ప్రొద్దుటూరు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే అదే నెలలో హర్యాణా రాష్ట్రానికి చెందిన సుంకం చెల్లించని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారుతో సహా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో శనివారం ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి ప్రొద్దుటూరులో పెద్ద మొత్తంలో గోవా మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చెందిన పామిడి ఆకుల ఇర్ఫాన్, నందిండ్ల బాషా అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రెండు కార్లు, 750 ఎంఎల్ సామర్థ్యం గల 480 గోవా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గృహ సర్వేలపై అపోహలు వద్దు
పెద్దతిప్పసముద్రం: ప్రభుత్వ సిబ్బంది చేపడుతున్న గృహాల సర్వేపై డేటా చోరీ అవుతుందేమోనన్న అపోహలను ప్రజలు విడనాడాలని డీఆర్వో చంద్రశేఖర్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో జరుగుతున్న సర్వేను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో విలేకరులతో మాట్లాడుతూ మండలంలో పెండింగ్లో ఉన్న 15 శాతం జనగణన సర్వేను సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ప్రతి ఇంటినీ ఖచ్చితంగా సర్వే చేయాలని అదే విధంగా తప్పిపోయిన గృహ యజమానుల వివరాలను సేకరించాలని, శెలవుల్లో బయట ప్రాంతాలకు వెళ్ళిన వారిని ఆరా తీయాలని సూచించామన్నారు. సర్వేలో నమోదైన వివరాల్లో తప్పిదాలు ఉంటే వాటిని సవరించేలా చొరవ చూపుతున్నామన్నారు. -
పది అడ్వాన్స్ సప్లిమెంటరీకి సన్నద్దం
మదనపల్లె సిటీ: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. ఈనెల 25వతేదీ నుంచి జూన్ నాలుగో తేదీ వరకు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి–2026 పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ప్రస్తుతం జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్ష రుసుం, ఇతర చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మదనపల్లెలో 5, రాయచోటిలో 4, రాజంపేటలో 3, రైల్వేకోడూరులో 2, బి.కొత్తకోట 2, గుర్రంకొండ, కలికిరి,పీలేరులో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు అన్ని ప్రభుత్వ శాఖలు నిమగ్నమయ్యే విధంగా ఇటవల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఉత్తర్వులు జారీ చేశారు. పది తప్పిన విద్యార్థులు 3,020 మంది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని 3,020 మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. బాలికలు 1,168 మంది, బాలురు 1,852 మంది ఉన్నారు. 19 మంది డిపార్టుమెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, 200 మంది ఇన్విజిలేటర్లకు విధులు కేటాయించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఓపెన్ పరీక్షలు సైతం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ పది, ఇంటర్మీడియట్కు సైతం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 25 (సోమవారం) నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జిల్లాలో 19 కేంద్రాలు -
బస్సును ఢీకొన్న బైక్
బి.కోడూరు : మండలంలోని పాయలకుంట్ల పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఎంపీపీ పాఠశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్వేలు పట్టణంలోని చాపలవీధికి చెందిన శెశెట్టిసుభాష్ (21) అక్కడికక్కడే మృతిచెందాడు.వివరాల్లోకి వెళితే చాపలవీధికి చెందిన శెశెట్టిసుధాకర్, అనురాధలకు ఇద్దరు కుమారులు. కుటుంబ సభ్యులతో కలిసి పోరుమామిళ్లలోని ఎల్లమ్మ జాతరకు వెళ్లార. జాతర ముగిశాక కుటుంబసభ్యులు కారులో, ఇద్దరు అన్నదమ్ములు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. పోరుమామిళ్ల నుంచి బద్వేలు వస్తున్న ఆర్టీసీ బస్సు రామచంద్రాపురం సమీపంలోని స్పీడ్బ్రేకర్ వద్ద బ్రేకు వేయడంతో వెనుక వైపు ద్విచక్ర వాహనంలో వస్తున్న సుభాష్, శివసాయిరామ్ బస్సును ఢీకొట్టారు. దీంతో సుభాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. శివసాయిరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కడపకు తీసుకెళ్లారు. సుభాష్ అన్నమాచార్య కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శివసాయిరామ్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బి.కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు. లారీ, ద్విచక్రవాహనం ఢీకొని.. మైదుకూరు : మైదుకూరు శివారులో కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తుపాకుల బ్రహ్మక్క (45) అనే మహిళ మృతి చెందగా ఆమె భర్త రత్నం, కుమార్తె మేరీ గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం శ్రీరాములపేట పరమేశ్వర నగర్కు చెందిన రత్నమ్మ భార్య కుమార్తెతో కలిసి దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ఉన్న చర్చికి ప్రార్థనల కోసం వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వారు తిరిగి వస్తుండగా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగరం వద్ద వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. సంఘటనలో రత్నం భార్య బ్రహ్మక్క అక్కడికక్కడే మృతి చెందింది. రత్నం, కుమార్తె మేరీకి గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్లో మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేర్చారు.రత్నం పక్కటెముకల వద్ద గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బ్రహ్మక్క మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం -
హార్సిలీహిల్స్అతిథి గృహానికి బ్రిటిష్ పెంకులు
బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ను బ్రిటిష్ ప్రభుత్వం వేసవి విడది కేంద్రంగా ప్రకటిసూ్త్ 1869 మే4న జీవోఎంఎస్ నంబర్ 11579 జారీచేసింది. దట్టమైన ఈ కొండంతా రిజర్వ్ఫారెస్ట్ కావడంతో అతిథి గృహం నిర్మాణం కోసం ఈ కొండను కనుగొన్న డబ్ల్యూడి. హార్సిలీ ఉమ్మడి కడపజిల్లా కలెక్టర్ కావడంతో ఆయన మద్రాసు ప్రభుత్వ అనుమతి కోరారు. ఈ వినతికి అనుమతి ఇస్తూ 1869 జూన్ 9న జీవోఎంఎస్ నంబర్ 4162ను జారీచేసింది. దీంతో కొండపై తొలి అతిథి గృహం నిర్మాణం జరిగింది. దీనికి వినియోగించిన పెంకులను హార్సిలీ ఇంగ్లాండ్ నుంచి ఓడలో పెంకులను మద్రాసుకు తెప్పించి, అక్కడినుంచి కొండపైకి రవాణా చేయించుకున్నారు. ఇంగ్లాండ్లో 1865లో బేస్డ్ మిషన్ టైల్ వర్క్స్ అనే కంపెనీ పెంకులను తయారు చేసినట్టు వాటిపై వివరాలున్నాయి. అటవీశాఖ అతిథిగృహాల్లో ఒకటైన ఇప్పటి కళ్యాణీ అతిథిగృహంగా పిలుచుకునే గదే తొలి అతిథిగృహం –సాక్షి, మదనపల్లె -
● కుప్పంలో ఉండాల్సిందే
సాక్షి, మదనపల్లె: దశాబ్దకాలం నుంచి మదనపల్లెలోనే తిష్ట వేసిన హంద్రీనీవా డివిజన్–12 అధికార యంత్రాంగం ఇక్కడనుంచి కుప్పానికి కదిలేలా ఏప్రిల్ 16న ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మదనపల్లె నుంచి కుప్పానికి తరలి వెళ్లాల్సిన కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగులు వెళ్తారా, వెళ్లరా అన్నది భేతాళుడి ప్రశ్నలా మారింది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పలు ప్రత్యేక కథనాలను ప్రచురించింది. దీనిపై స్పందించాల్సిన అధికారులు అప్పట్లో తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం నుంచే ఆదేశాలను అందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.వివరాల్లోకి వెళితే. ● హంద్రీనీవా రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి 1991 నుంచి మదనపల్లెలో సర్కిల్ నెంబర్–3 ఎస్ఈ కార్యాలయం కొనసాగుతోంది. దీని పరిధిలోనే ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లాలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొంత భాగం దీని పరిధిలోకి వస్తుంది. ఇందులోనే మదనపల్లె డివిజన్–12 కార్యాలయం కుప్పం ఉపకాలువల నిర్వహణకు సంబంధించింది. దీన్ని కుప్పానికి తరలించాలని 2015 మార్చి 26న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తరువు జారీ చేసింది. దీని అనుసరించి కుప్పంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం, పలమనేరు, వి కోటలో ఒకటి రెండు సబ్ డివిజన్ కార్యాలయాలు, కుప్పంలో మూడు, నాలుగు సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే అధికార యంత్రాంగం విధులు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటిదాకా మదనపల్లె ఎస్ఈ కార్యాలయం నుంచే ఈ అధికార యంత్రాంగం అంతా విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. కార్యాలయం ఓ చోట.. విధులు మరోచోట! మదనపల్లె డివిజన్–12 పరిధిలో కుప్పం, కుప్పం ఉపకాలువ పనులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన రెండు రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ, కాలువల్లో నీటి నిర్వహణ, మళ్లింపు తదితర పనులు పర్యవేక్షించాలంటే కుప్పం నుంచే విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ అధికారులు మదనపల్లె దాటి వెళ్లడానికి సుముఖత చూపించడం లేదు. ప్రతీసారి ఏదో ఒక సాకు చెబుతూ కాలం గడిపేస్తున్నారు. కుప్పంలో ప్రభుత్వ భవనాలు లేవని, అద్దె భవనాల్లో సౌకర్యాలు లేవని, అందువల్ల మదనపల్లెలోని కార్యాలయాలు కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని విన్నవించారు. అంతేనా కాలువ పనులు పూర్తి కావడంతో ఇక్కడ కార్యాలయాల నిర్వహణ ఆర్థిక భారమని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి తిరుపతి, అనంతపురం సీఈలకు ఈ విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఇద్దరు సీఈలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కుప్పం ఈఈ కార్యాలయంపై తరలలేదని సాక్షిలో ప్రచురితమైన కథనాలు మదనపల్లె ఎస్ఈ కార్యాలయం కిందే కొనసాగుతున్న కుప్పం ఈఈ కార్యాలయం మదనపల్లెను వీడని హంద్రీనీవా అధికారులు చంద్రబాబు నియోజకవర్గమైనాప్రభుత్వ ఆదేశాల ధిక్కారం మదనపల్లె డివిజన్–12 కుప్పంలోనే ఉండాలని తాజా ఉత్తర్వు మదనపల్లె డివిజన్–12 కార్యాలయం, సబ్ డివిజన్లో కుప్పం నియోజకవర్గంలో కొనసాగాల్సిందేనంటూ జల వరుణుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (పాలన) ఎంఎల్ఎన్. వరప్రసాద్ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక రూపంలో ఇచ్చారు. ఈ మేరకు కుప్పంలో ఈఈ కార్యాలయం, ఇతర చోట్ల సబ్ డివిజన్లు కొనసాగడం, అక్కడి నుంచే విధులు నిర్వహించాలని ఉత్తర్వు జారీ చేశారు. అంటే ప్రస్తుతం మదనపల్లెలోని డివిజన్–12 కుప్పంలో ఏర్పాటు చేసి అక్కడ నుంచి విధులు నిర్వహించాలన్న విషయాన్ని ప్రభుత్వం పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇవి మదనపల్లె ఎస్ఈ కార్యాలయానికి ఏప్రిల్ 24న అందాయి. ఇంతవరకు ప్రాజెక్టు అధికార యంత్రాంగంలో కనీస చలనడం లేదు. -
అనంత నిమ్మకు ప్రపంచ గుర్తింపు దిశగా అడుగులు
మదనపల్లె (కురబలకోట) : నోటికి పులుపుతో పాటు ప్రత్యేక రుచి శుచి నాణ్యతకు పేరొందిన అనంతపురం నిమ్మకాయకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు వచ్చేందుకు అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ బౌగోళిక (జీఐ) గుర్తింపు కోసం ధరఖాస్తు చేసినట్లు వీసీ యువరాజ్ ఆదివారం తెలిపారు. ఈ నిమ్మ ఇప్పటికే మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఇది చిన్న పండే అయినా తాజాదనం, ఉత్సాహం చురుకుదనానికి ప్రతీకగా భావిస్తారన్నారు. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా దీనికి విశిష్ట లక్షణాలు ఏర్పడ్డాయన్నారు. అనంతపురంలోని అవని ఫారం ల్యాబ్ టెక్నాలజీస్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా మిట్స్ ఐపీఎఫ్సీ, ఆర్ అండ్డీ కీలక పాత్ర వహిస్తున్నాయన్నారు. జీఐ ట్యాగ్ లభిస్తే అనంత నిమ్మకు ప్రపంచ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఆపై మరింత గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.జీఐ ట్యాగ్కు మిట్స్ ధరఖాస్తు -
● స్థలాలైనా ఇస్తారా?.. అంతా అయోమయం!
సాక్షి, మదనపల్లె: మదనపల్లె మండల పరిధిలోని తట్టివారిపల్లె లేఅవుట్లో టిడ్కో ఫ్లాట్లు ఖరారైన నిరుపేదలకు కూటమి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇళ్లు కట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడమే కాకుండా.. లబ్ధిదారులు గతంలో చెల్లించిన డిపాజిట్ సొమ్మును అధికారికంగా వెనక్కి ఇచ్చేసేందుకు (రిఫండ్) ప్రభు త్వం సిద్ధమైందని టిడ్కో అధికారులు స్పష్టం చేశారు. డిపాజిట్లు వెనక్కి.. ఫ్లాట్లు లేవని తేల్చేసిన సర్కార్! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు పొందిన పేదలు తమకు కేటాయించిన ఫ్లాట్ల రకాన్ని బట్టి ప్రభుత్వానికి భారీగా డిపాజిట్లు చెల్లించారు. 365 చదరపు అడుగుల ఫ్లాటుకు: ఒక్కో లబ్ధిదారుడు రూ.12,500 చొప్పున చెల్లించారు(మొత్తం 720 మంది). 430 చదరపు అడుగుల ఫ్లాటుకు: ఒక్కో లబ్ధిదారుడు రూ.25,000 చొప్పున డిపాజిట్ చేశారు (మొత్తం 336 మంది). ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు 25 శాతంలోపే జరిగాయనే సాకుతో ఈ రెండు రకాల నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. అప్పటి నుండి పేదల సొమ్ము ప్రభుత్వం వద్దే మురిగిపోయింది. ప్రస్తుతం ఈ సొమ్మును లబ్ధిదారులకు వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని టిడ్కో అధికారులు వివరించారు. ఈ నిర్ణయంతో 1,056 మంది పేదలకు టిడ్కో అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు రావనే విషయం పూర్తిగా తేలిపోయింది. మదనపల్లె పేదల టిడ్కో ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర ‘25% పనుల’ సాకుతో 365, 430 అడుగుల ఫ్లాట్ల ప్రాజెక్టు రద్దు టిడ్కో... డబ్బు వెనక్కు తీస్కో అంటూ లబ్ధిదారులకు వంచన! రోడ్డున పడ్డ 1,056 మంది నిరుపేద కుటుంబాలు మరోవైపు, టిడ్కో ఫ్లాట్లు కోల్పోయిన ఈ 1,056 మంది లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఇంటి స్థలాలు కేటాయించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ పేదలకు స్థలాలు ఎక్కడ ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? అనే విషయాలపై ప్రభుత్వం వద్ద ఎలాంటి విధివిధానాలు కానీ, స్పష్టత కానీ లేదు. అటు ఆశ పెట్టుకున్న టిడ్కో ఇల్లు దక్కక, ఇటు ప్రత్యామ్నాయ స్థలం ఎక్కడో తెలియక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టపోయిన తమకు తక్షణమే న్యాయం చేయాలని లబ్ధిదారులు మదనపల్లెలో డిమాండ్ చేస్తున్నారు. -
కోతీ బావ.. ఎందాక నీ తోవ!
పొట్టకూటి కోసం ఆటోలో కూలి పనులకు వెళ్లిన మహిళా కూలీలకు శనివారం ఊహించని ‘వింత’ ప్రయాణీకుడు తారసపడ్డాడు. పెద్దపంజాణి మండలం లింగమనాయునిపల్లెకు చెందిన కొందరు కూలీలు ఆటోలో చౌడేపల్లె మండలం దొనపల్లెకు బయలుదేరారు. తెల్లవారకముందే ఆటో స్టార్ట్ అవ్వగానే.. ఒక కోతి బావ దర్జాగా వచ్చి ఆటో ఎక్కేసింది. కాసేపు షికారు చేసి దిగిపోతుందిలే అనుకుంటే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోను, అందులోని కూలీలను అస్సలు వదల్లేదు. ముఖ్యంగా మునిరత్నమ్మ అనే కూలీపై మనసు పారేసుకున్న వానరరాజు.. ఆమె పక్కనే సీటు ఖరారు చేసుకున్నాడు. ఆమె ఆటో ఎక్కితే ఎక్కడం, కిందకు దిగితే దిగడం చేస్తూ నీడలా వెంటాడాడు. మధ్యలో ’మా సీట్లో నువ్వేంట్రా బాబూ’ అంటూ తోలేయడానికి ప్రయత్నించిన శ్రావణి అనే కూలీకి గట్టిగా ‘కాటు’ రుచి చూపించి సైలెంట్ చేసేశాడు. ఇలా కూలీలకు తోడుగా సుమారు 25 కిలోమీటర్ల దూరం ఆటోలోనే ఉచితంగా ప్రయాణించాడు. ‘కూలి కోసం మేము వెళ్తే.. మమ్మల్ని ఆడుకోవడానికి దేవుడే ఈ వానరాన్ని పంపాడేమో‘ అంటూ కూలీలు నవ్వుకున్నారు. ఆటోలో మనుషులతో పాటు దర్జాగా ప్రయాణిస్తున్న కోతిని చూసి రోడ్డుపై వెళ్లే జనాలు నోరెళ్లబెట్టారు. ఈ సరదా దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. –రసూల్, చౌడేపల్లె -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
చౌడేపల్లె : చౌడేపల్లె పలమనేరు మార్గంలోని చిట్రెడ్డి పల్లె సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చౌడేపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం, పాపన్నలు కలిసి చిట్రెడ్డిపల్లె సమీపంలోని ఓ చెరువులో చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టుకొని బైక్పై చౌడేపల్లెకు వెళుతుండగా మార్గమధ్యలో ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బైక్ ఢీకొంది ఈ ఘటనలో సుబ్రహ్మణ్యంకు కాలు విరిగింది. పాపన్నకు తలకు బలమైన గాయాలైయ్యాయి.క్షతగాత్రులను 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని దంపతులకు.. మదనపల్లె టౌన్ : M>Æý‡$ ÉîlMö° §ýl…ç³-™èl$Ë$ ¡{Ð]l…V> V>Ķæ$-ç³-yìl¯]l çÜ…çœ$-r¯]l Ôèæ°-ÐéÆý‡… ¼.Mö-™èl¢Mør Ð]l$…yýl-ÌS…ÌZ fÇ-W…-¨. »ê«¨™èl$Ë$ ™ðlÍ-í³¯]l ÑÐ]l-Æ>-Ë$.. Ð]l$§ýl¯]lç³ÌñæÏ ç³rt-׿…, ¯]lMýSPÌS¨¯ðl² ™é…yéMýS$ ^ðl…¨¯]l õßæÐ]l$…™Œæ ¯éĶæ$MŠS, A™èl° ¿êÆý‡Å }Ðé×ìæ O»ñæMýS$ÌZ Ý÷…™èl ç³°-Ò$§ýl ¼.Mö-™èl¢Mør Ð]l$…yýlÌS…, ^èlÍ Ð]l*Ñ$yìl {V>Ð]l$…ÌZ° º…«§ýl$-Ð]l#ÌS C…sìæMìS ºÄ¶æ$Ë$ §ólÆ>Æý‡$. MýS$Æý‡-º-ÌSMør Ð]l$…yýlÌS…, ^ðl¯é²-Ð]l$ÆŠ‡-ి Ð]l§ýlªMýS$ ÐðlâýæÏV>¯ól O»ñæMŠS¯]l$ Ððl¯]l$MýS ¯]l$…_ ÐólVýS…V> Ð]l_a¯]l K M>Æý‡$ ÉîlMö-sìæt…-¨. {ç³Ð]l*§ýl…ÌZ §ýl…ç³™èl$ÌSMýS$ ¡{Ð]l V>Ķæ*ÌS-Ķæ*ÅÆ‡$$. Ý린-MýS$Ë$ „ýS™èl-V>-{™èl$-ÌS¯]l$ Ð]l$§ýl¯]l-ç³ÌñæÏ hÌêÏ {糿¶æ$-™éÓ-çÜ$-ç³-{†MìS ™èlÆý‡-Í…^éÆý‡$. Ð]l¬¨-Ðólyýl$ ´ùÎ-çÜ$Ë$ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ §ýlÆ>Åç³#¢ ^ólçÜ$¢¯é²Æý‡$. M>Æý‡$ {OyðlÐ]lÆŠ‡ ç³Æ>-ÈÌZ E¯é²yýl$. -
ఒక్క ఓటు తొలగించకుండా చూడాలి
సదుం: ‘సర్’ సర్వేలో పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. నియోజవర్గ నేతలతో తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. టీడీపీ నాయకులు అనర్హులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తే అభ్యంతరం వ్యక్తం చేయాలన్నారు. కార్యక్రమ ప్రాధాన్యత గుర్తించి సర్వే ముగిసే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరూ సమన్వయం చేసుకుని, కష్టపడి పని చేసి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు జింకా చలపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, బూత్ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
వడలుతున్న మొక్క
గుర్రంకొండ : భానుడి వేడిమి ప్రభావం టమాటా నారుమొక్కలపై పడడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో 60 పైసలు ఉన్న ధర ప్రస్తుతం రూ.1.60 వరకు పెరిగాయి. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు టమాటా పంట సాగువైపు దృష్టి సారించారు. అయితే అఽందుకు తగ్గట్టుగా నారు మొక్కలు లభించకపోవడంతో నర్సరీల్లో వీటికి డిమాండ్ ఏర్పడింది. ఓవైపు కొత్తగా సాగు చేయడానికి నారు మొక్కలు దొరక్క.. మరోవైపు కష్టపడి నాటిన మొక్కలు ఎండల తీవ్రంగా చనిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. స్థానిక నర్సరీల్లో వీటికి డిమాండ్ ఉండడంతో కర్ణాటక, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల నుంచి నారు మొక్కలను దిగుమతి చేసుకొంటున్నారు. గత నెలవరకు మార్కెట్లో టమాటాకు గిట్టుబాటు ధరలు లేక పోవడంతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రైతులు ఈ పంట సాగు వైపు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం మార్కెట్లో 25కేజీల క్రీట్ ధర రూ. 780 నుంచి రూ. 800వరకు, 15కేజీల చిన్న క్రీట్ ధర రూ. 380 నుంచి రూ. 420 వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 5280 ఎకరాల్లో టమాటా పంట సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎకరా పంటసాగు చేయడానికి 7 వేల నారుమొక్కలు అవసరమవుతాయి. ఎండల ధాటికి కనీసం వందకు 20 నుంచి 30 నారు మొక్కలు చనిపోతున్నాయి. దీంతో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటేందుకు రైతులు నర్సరీల వైపు పరుగులు తీస్తున్నారు. ఎండల ప్రభావంతో నర్సరీల్లో పెంచుతున్న టమాటా నారుమొక్కలు సరిగా పెరగడంలేదు. ఎదుగుదల దీంతో వీటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. కర్ణాటక నుంచి నారుమొక్కల దిగుమతి ఎన్నడూ లేని విధంగా జిల్లా రైతులు కర్ణాటక రాష్ట్రం నుంచి టమాటా నారును దిగుమతి చేసుకొంటున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో వీటికి డిమాండ్ లేదు. మార్కెట్లో టమాటా ధరలు పడిపోవడంతో రైతులు ఆ రెండునెలల్లో పంటసాగు చేపట్టడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో జిల్లాలోని నర్సరీల్లో టమాటా నారు మొక్కలు పుష్కలంగా అందుబాటులో ఉండేవి.కానీ కొనేవారు లేక వదిలేశారు. చాలా నర్సరీల్లో చనిపోయిన, ముదిరిపోయిన నారుమొక్కలను కుప్పలు తెప్పలుగా బయట పారబోశారు. గత పదిహేను రోజులుగా ధరలు పుంజుకోవడంతో రైతులు నారు మొక్కల కోసం ఎగబడుతున్నారు. ప్రస్తుతం స్టాకు లేకపోవడంతో డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతులు కర్ణాటక రాష్ట్రంలోని శ్రీనివాసపురం, కోలార్, చింతామణితోపాటు రాష్ట్రంలోని అనంతపురం, పుట్టపర్తి జిల్లాలోని నర్సరీల నుంచి టమాటా నారుమొక్కలు దిగుమతి చేసుకొని పంటలు సాగుచేసుకొంటున్నారు. ప్రస్తుతం నర్సరీల్లో టమాటా నారుమొక్కల ధరలు గతంతో పోల్చుకొంటే మూడు రెట్లు అధికంగా పెరిగాయి. మార్చి, ఏప్రిల్నెలల్లో ఒక నారుమొక్క రూ. 60 పైసలు లోపే లభించేవి. ఎండల ప్రభావం, నారుమొక్కలకు ఉన్న డిమాండ్ తో ప్రస్తుతం రూ. 1 నుంచి రూ. 1.60వరకు ధర పెరిగింది. నర్సరీ యజమానులు ఇష్టానుసారం ధరలు పెంచేయడంతో రైతులపై మోయలేని భారం పడుతోంది. టమాటా నారుపై భానుడి ప్రతాపం రూ.60పైసల నుంచి రూ.1.60కి పెరిగిన ధరలు నర్సరీల్లో మొక్కలకు డిమాండ్ జిల్లాలో 5280 ఎకరాల్లో పంటసాగుకు సన్నద్ధంనారుమొక్కలకు డిమాండ్ ఉంది గత రెండునెలలతో పోల్చుకొంటే ఈనెలలో టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పంట సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల టమాటా నారుమొక్కలకు డిమాండ్ ఏర్పడింది.అయితే ఇక్కడి నర్సరీల్లో అశించినంత మేరకు నారుమొక్కలు దొరకడంలేదు. దీంతో బయటి ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. – వెంకటరమణ, చారావాండ్లపల్లెఎండ వేడిమికి చనిపోతున్నాయి ప్రస్తుతం ఎండ వేడిమికి కొత్తగా పంటసాగు చేస్తున్న పొలాల్లో నారుమొక్కలు చనిపోతున్నాయి.ఎండల ప్రభావం టమాటా పంటపై ప్రభావం చూపిస్తోంది. నారుమొక్కలు నాటిన నెలరోజుల వరకు మొక్కలను కాపాడుకోవడం కష్టంగా మారుతోంది. సాయంత్రం పూట నారుమొక్కలపై నీటిని స్ప్రే చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఎండల ప్రభావంతో వందకు 20 నుంచి 30 మొక్కలు చనిపోతున్నాయి, – సుధాకర్, గంగిరెడ్డిపల్లె -
మళ్లీ జనాభా లెక్కించండి
సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట నగర పంచాయతీలో జనాభా తగ్గుదలకు కారణాలు ఏమిటి అనే అంశంపై శనివారం జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. పట్టణంలోని వార్డుల్లో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. ఎన్యుమరేటర్లు సేకరించిన వివరాలపై ఆరా తీశారు. వివరాలు ఎలా నమోదు చేశారు, ఎక్కడ పొరపాటు జరిగాయి అన్న అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల కంటే ఇప్పుడు నమోదు చేసిన జనాభా లెక్క ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఇళ్ల వివరాలు నమోదు చేస్తున్న ఎన్యుమరేటర్లు సంబంధిత ఇంటిలో ఎంతమంది ఉన్నారన్న సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవాలని కోరారు. వలసలు వెళ్లినవారు, ఉపాధి ఉద్యోగాలకు వెళ్లిన వారి వివరాలు కూడా ముఖ్యమని, ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. 31 లోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ బావాజాన్, ఎంపీడీవో అబ్దుల్ సుకుర్, కమిషనర్ రమాదేవి, వివిధ శాఖల సిబ్బంది, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఓ -
నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు
సాక్షి, మదనపల్లె: స్థానిక డిస్కం డివిజన్ కార్యాలయంలో ఆదివారం వినియోగదారులు విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని గంగాధరం శనివారం తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు డివిజన్ కార్యాలయ కౌంటర్లలో సిబ్బంది విధుల్లో ఉంటారని బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు. సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్పై వెలసిన ఏనుగు మల్లమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఆలయ నిర్వాహకులు విశేష ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మూడు రోజులపాటు జరిగే జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం అశ్వ వాహనం, సోమవారం గజవాహనం, మంగళవారం హంస వాహనంపై మల్లమ్మ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించనున్నారు. సాక్షి, మదనపల్లె: వర్షాలు మొదలవకముందే ఫీడర్, సప్లయ చానల్స్ పనులు పూర్తి చేయా లని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వెంకటరత్నం ఆదేశించారు. శనివారం ఆయన బి.కొత్తకోట మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి పనులను తనిఖీ చేశారు. పనులను పరిశీలించి కూలీల సమస్యలను ఆరా తీశారు. ఎండ, వేడి అధికంగా ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేయాలని కూలీలను కోరారు. కూలీలు వేతనాల చెల్లెంపుకు సంబంధించి ఇబ్బందులు పడవద్దని, సకాలంలో వేతనాలు అందుతాయని చెప్పారు. కూలీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీఓ వెంకటేష్ ను ఆదేశించారు. రాయచోటి టౌన్: బీసీల కులగణనను అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిరవహించాలని అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇడగొట్టు నాగేశ్వరావు డిమాండ్ చేశారు. సోమవారం డెడికేటేడ్ కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు మెయిల్ ద్వారా పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో గృహ గణన ఫార్మేట్లో ఓబీసీల గృహ గణన లెక్కించే కాలమ్ లేకపోవడం సరికాదన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో డెడికేటెడ్ కమీషన్ సుప్రీం కోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్లో సంతృప్తికరంగా అమలు జరిగేలా రాష్ట్రంలో బీసీల కులగణన ద్వారా డేటా సేకరించాలని కోరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన జనగణన వివరాలు బీసీ కుల గణనతో సహా అన్ని స్థాయిల పాలన కేంద్రాలలో నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని కోరారు. -
ఈ కారు ఎవరిదో..
రొంపిచెర్ల : రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో రోడ్డు పక్కనే మూడు నెలలుగా గుర్తు తెలియని కారు ఉంది. ఈ కారును ఎవరైనా ఎర్రచందనం తరలించేందుకు తెచ్చి అక్కడ వదిలి వెళ్లారా? గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసి ఇక్కడ వదిలి వెళ్లారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు నంబరు ఏపీ02 ఎజడ్ 7181 గా ఉంది. గుర్తు తెలియని కారుపై స్థానిక పోలీసులు విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ప్రజలు కోరుతున్నారు. సరస్వతీ నిలయంపై దాడి!రాజంపేట : నియోజకవర్గంలోని నందలూరు మండలం లేబాక జిల్లా పరిషత్ హైస్కూల్(సర్వసతినిలయం)ంపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో విద్యాసంస్ధలపై కూడా రాజకీయ వర్గ వైషమ్యాలు చుట్టుముడుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. దొంగలు బీరువాలపై తమ ప్రతాపం చూపారు. బీరువాల్లో హైస్కూల్కు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. కొన్ని రికార్డులు కనిపించడంలేదని సమాచారం. హైస్కూల్ హెచ్ఎం రాజేశ్వరి నందలూరు పోలీసులకు పిర్యాదు చేశారు. లక్షలాది విలువ చేసే టీవీ, కంప్యూటర్లు ఉన్నా.. గుర్తుతెలియని వ్యక్తులు హెచ్ఎం కార్యాలయంలో లక్షలాది విలువ చేసే టీవీ, కంప్యూటర్లు ఉన్నా వాటి జోలికి వెళ్లకపోవడంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం బీరువాలను ఉద్దేశపూర్వకంగా పగులగొట్టినట్లు తెలుస్తోంది. సంఘటనకు కారకులు ఎవరు అన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు.● రికార్డులు మాయం ● లేబాక హైస్కూల్లో ఘటన -
విద్యార్థి మృతి కేసులో అరెస్టు
మదనపల్లె టౌన్ : ఎంబీఏ విద్యార్థి అనుమానస్పద మృతి కేసులో శనివారం 2వ పట్టణ పోలీసులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఆఫీస్ సబార్డినేటర్ గోవర్ధన్ నాయక్ (28)ను అరెస్టు చేశారు. 2వ పట్టణ సీఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు మండలం, పాలెం పల్లె పంచాయతీ, కుక్కలపల్లి గ్రామానికి చెందిన గంగరాజు కురబలకోట మండలం, అంగళ్లులోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. గంగరాజు గత నెల 8వ తేదీన మదనపల్లె పట్టణం, ఇందిరా నగర్లో ఉంటున్న తన స్నేహితుడు గోవర్ధన్ నాయక్ ఇంటికి వచ్చాడు. గోవర్ధన్ నాయక్ మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సబార్డినేటర్గా పనిచేస్తున్నాడు. అదే రోజు రాత్రి గంగరాజు మిద్దైపె నుంచి కింద పడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం కావడంతో మృతుని కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సాక్ష్యారాలు సేకరించి, గోవర్ధన్ నాయక్ పాత్రపై అనుమానం రావడంతో శనివారం అతన్ని ఆర్టీసీ బస్టాండు వద్ద అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. అంధకారంలో జిల్లా ప్రభుత్వాసుపత్రి మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులు అరగంట పాటు అంధకారంలో కాలం వెళ్లదీశారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కరెంటు పోయింది. ఆ సమయంలో ఆస్పత్రికి ఉన్న జనరేటర్ పనిచేయకపోవడంతో ఆస్పత్రి అత్యవసర విభాగంతో పాటు వార్డుల్లో ఉన్న రోగులు, వారి అటెండర్లు చీకట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవారి భక్తుడికి అస్వస్థత ఒంటిమిట్ట : తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తరిగి వస్తుండగా తెలంగాణకు చెందిన శ్రీవారి భక్తుడు ముత్తన్న(48) అస్వస్థతకు గురయ్యాడు. ఒంటిమిట్ట పీహెచ్సీ డాక్టర్ భావన తెలిపిన వివరాల మేరకు..తిరుమల శ్రీ వెంకటేశ్వర్వ స్వామి దర్శనం అనంతరం స్వస్థలానికి కారులో వెళుతున్న తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, బోడు గ్రామానికి చెందిన ముత్తన్న అనే వ్యక్తి ఒంటిమిట్ట సమీపంలోకి రాగానే అస్వస్థతకు గుర్రయ్యాడు. కాల్షియం లోపం ఉన్న ముత్తన్న గత రెండు రోజులుగా మందులు మింగకపోవడంతోనే ఈ సమస్య ఎదురైందనితెలిపారు,సకాలంతో చికిత్స అందించడం వల్ల ఆరోగ్యం మెరుగు పడటంతో కొద్ది సేపటికి ముత్తన్న అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. -
‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మదనపల్లె సిటీ: బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అఽధికారి డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. శనివారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బడిలో కొత్తగా విద్యార్థులను చేర్చుకునే కార్యక్రమంలో భాగంగా అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్రోల్ మెంట్లో రాయలసీమలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. యూడైస్లో కనిపించని విద్యార్థుల వివరాలు సేకరించాలన్నారు. బడి తెరిచేలోపు అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ, డివైఈఓ లోకేశ్వరెడ్డి, ఎంఈఓ రెడ్డిశేఖర్, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. డీఈఓ డాక్టర్ సుబ్రమణ్యం -
నిషేధిత గడ్డి మందు ఆమ్మకాల నిలిపివేత
గుర్రంకొండ : మండలకేంద్రమైన గుర్రంకొండలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి నిషేధిత గడ్డిమందు అమ్మకాలను వ్యవసాయాధికారులు నిలిపివేశారు. శనివారం ఎవో రత్నమ్మ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా పలు దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకొన్నారు. వాటి అమ్మకాలను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీటిని విక్రయిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కీటకనాశన చట్టం 1968 ప్రకారం ఈ మందులను 60 రోజుల పాటు నిషేధించారన్నారు. -
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
తంబళ్లపల్లె : తంబళ్లపల్లె నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జి లేకపోవడంతో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈనెల 27,28 తేదీల్లో పార్టీ తలపెట్టిన వర్చువల్ మహానాడు ఏర్పాట్లపై శనివారం వెలుగు కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే కొందరు కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని, పార్టీ కోసం కష్టపడేవారిని ఎందుకు పిలవరని నిలదీశారు. మండలపరిషత్ అభివృద్ధి పనుల నిధులను వాటాలు పెట్టుకుని స్వాహా చేస్తున్నారని ఓ వర్గంవారు మరో వర్గంపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. చేసేది లేక టీడీపీ మండల అధ్యక్షులు సమావేశాన్ని నిలిపివేశారు. బయటకురాగానే కొందరు మండల పార్టీ అధ్యక్షుడు, మహిళా నాయకురాలు సిద్దమ్మలపై దుర్బాషలాడటంతో బాహాబాహాకి దిగారు. ఈ పంచాయితీ పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. ఈ విషయమై ఎస్.ఐ అనిల్కుమార్ వివరణ ఇవ్వగా ఇరువర్గాలు ఇది పార్టీ విషయమని, మేము చర్చించుకుంటామని వెళ్లిపోయినట్లు తెలిపారు.బాహాబాహీకి దిగిన తెలుగు తమ్ముళ్లు -
దశరథరామిరెడ్డికి పెద్దిరెడ్డి పరామర్శ
రాయచోటి : తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ధైర్యం చెబుతూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దశరధరామిరెడ్డిపై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకుడిపై దాడి జరగడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రాజకీయ కక్ష్యలతో హింసకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఘటన అని పేర్కొన్నారు. ప్రజా సేవకుడిపై కత్తులు, దాడులు సంస్కృతి సరికాదని, ఇది పూర్తిగా అరాచకానికి నిదర్శనమని తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఎవరైనా ఎంత పెద్దవారైనా చట్టం ముందు తలవంచాల్సిందేనని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి పూరుఇ్త భద్రత కల్పించాలని,రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకొని దుండగులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిషత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. దశరథరామిరెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్య సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ పార్టీ ఎల్లప్పుడూ ఆయనకు అండగా ఉంటుందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.దశరధరామిరెడ్డిపై దాడి దారుణం -
మదనపల్లెను సుందరంగా ఉంచుదాం
సాక్షి, మదనపల్లె : మదనపలె్ల్ పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా ఉంచేందుకు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో భాగస్వాములు కావాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని అనిబిసెంట్ కూడలి నుంచి బెంగళూరు రోడ్డు బస్ స్టాండ్ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి కలెక్టర్, జేసీ శివ్నారాయణ్ శర్మ, కమిషనర్ ప్రమీల స్వయంగా చెత్తాచెదారం తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో వచ్చే నాలుగు వారాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు చెప్పారు. విజిబుల్ క్లీన్లీనెస్ లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని, మున్సిపల్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, ప్రజలందరి భాగస్వామ్యంతో పరిశుభ్రమైన పట్టణంగా మదనపల్లెను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తున్న షాపులు, హోటళ్లు, గృహ యజమానులకు అవగాహన కల్పిస్తామని, మార్పు రాకపోతే జరిమానాలు విధింపు, షాపుల సీజ్ చేస్తామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మొదటి వారంలో ప్రజలకు అవగాహన కల్పించడం, పరిశుభ్రత పాటించేలా ప్రోత్సహించడం, నిబంధనలు ఉల్లంఘించే షాపులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు.కలెక్టర్ నిశాంత్ కుమార్ -
దశరథరామిరెడ్డిపై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి అర్బన్ : తిరుపతిలో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని శుక్రవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు దశరథరామిరెడ్డిపై దాడికి పాల్పడి రెండు కాళ్లు, చేతులు విరగొట్టి ప్రాణాపాయ స్థితికి చేర్చారని ఆరోపించారు. ఘటన జరిగి 19 రోజులు గడిచినా ఇప్పటికి నిందితులను గుర్తించి అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనుకాకుండా వెంటనే నిందితులను అరెస్టు చేయాలయన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు, రోజు రోజుకూ పెరుగుతున్నాయని మండిపడ్డారు. దశరథరామిరెడ్డికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనంద రెడ్డి , సంబేపల్లె మండల వైఎస్సార్సీపీ నాయకులు వీవీ ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ దండు నాగభూషణ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జంగం రెడ్డి కిషోర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
జనాభా ఎందుకు తగ్గింది
సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట నగర పంచాయతీలో జనాభా తగ్గుదల అనుమానంగా ఉంది.. జనాభా పెరగాలి కానీ తగ్గడం ఏమిటి.. ఇలా ఎందుకు జరుగుతుందంటూ కేంద్ర గృహ గణన బృందం స్థానిక అధికారులను ప్రశ్నించింది. శుక్రవారం కేంద్ర గణన అసిస్టెంట్ డైరెక్టర్ సుప్రజ్, డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ అగర్వాల్, జిల్లా సెన్సెస్ అధికారి రెడ్డి విష్ణుప్రియ, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి లక్ష్మిపతి బి.కొత్తకోటలో గృహ గణనపై తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని రెండు వార్డుల్లో స్వయంగా పర్యటించి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఉండడం కనిపించాయి. తక్షణమే బృందం మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. జనాభా లెక్కల వివరాలను పరిశీలించారు. 2021లో ఉన్న జనాభా కంటే 2026లో మూడు వేల జనాభా తగ్గడం గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్ రమాదేవిని బృందం ప్రశ్నించింది. ఇక్కడినుంచి వలసలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుందని వారికి వివరించారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అక్కడ సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన గణన వివరాలు, పెండింగ్ అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెలాఖరులోగా గృహ గణకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఇంటిని నమోదు చేయాలని ఆదేశించారు. తాళాలు వేసి ఉన్నవారి ఫోన్ నంబర్ల ఆధారంగా వారిని సంప్రదించాలని సూచించారు. వారి వివరాలను నమోదు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న గృహాలకు సంబంధించిన వివరాలు కూడా మరోసారి పరిశీలించి నమోదు చేయాల్సిందేనని పేర్కొన్నారు. ఖాళీ ఇళ్లు, తాళాలపై కేంద్ర బృందం ఆశ్చర్యం -
హోరాహోరీగా సీపీఎల్ –2
వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో సీపీఎల్ –2 క్రికెట్ మ్యాచ్లు హోరాహోరీగా జరుగుతున్నాయి. శుక్రవారం హైపెరియన్, ఎన్కే స్పోర్ట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎన్కే స్పోర్ట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లుకు 186 పరుగులు చేసింది. హైపెరియన్ ప్లేయర్ సల్మాన్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన హై పెరియన్ జట్టు 18.3 ఓవర్లకు 4 వికెట్ల తేడాతో 191 పరుగులు చేసి విజయం సాధించింది. సోహన్ రెడ్డి 45 బంతుల్లో 83, జయంత్ రెడ్డి 23 బంతుల్లో 53 పరుగులు చేశారు. సోహన్రెడ్డికి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు, ట్రోఫీని స్థానిక ఎంపీడీవో మనోహర రాజు, పంచాయతీ ఈవో రవీంద్రనాథ్ అందించారు. మధ్యాహ్నం స్పార్టన్ వారియర్స్, ఆదిత్య బీఆర్ జట్ల మధ్య జరిగి మ్యాచ్ను స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి టాస్ వేసి ప్రారంభించారు. ఆదిత్య బిఆర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. జట్టులో రెడ్డిరుషీల్ 59 బంతుల్లో 95 పరుగులు చేసి నాటవుట్గా నిలిచాడు. 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్పార్టన్ వారియర్స్ 18.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటయింది.ఈ కార్యక్రమంలో సునీల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీని అడ్డుకునే కుట్ర పుంగనూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్రెడ్డిలు పుంగనూరు మండలం మేలుందొడ్డిలో సుమారు రూ.10 వేల కోట్లతో జర్మన్ పెప్పర్మోషన్ ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీకి 850 ఎకరాల భూ సేకరణ చేపట్టారు. ఫ్యాక్టరీకి అనుమతులు మంజూరు చేసి , పడమట కరువు ప్రాంతమైన పుంగనూరును పరిశ్రమల కారిడార్గా ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బస్సుల ఫ్యాక్టరీ పనులు పెండింగ్లో పడ్డాయి. ఇలా ఉండగా టీడీపీ చోటా నాయకులు కొంత మంది ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా మేలుందొడ్డి ప్రాంతంలో బస్సుల ఫ్యాక్టరీకి భూసేకరణ చేయవద్దంటూ శుక్రవారం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై పుంగనూరు ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వం మంజూరు చేసిన ఫ్యాక్టరీ ద్వారా సుమారు 10 వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇలాంటి పనులను అడ్డుకోవడంతో నిరుద్యోగ యువతి, యువకులు టీడీపీ నాయకుల చర్యలను నిరసిస్తున్నారు. -
సర్ను ఆయుధంగా వినియోగిస్తారు
సదుం: వైఎస్సార్ సీపీనీ ఓడించేందుకు సర్ (Special Intensive Revision –ప్రత్యేక సమగ్ర సవరణ)ను ఆయుధంగా ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దుర్భుద్ధితో సీఎం చంద్రబాబు ఉన్నారని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటరు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో పుంగనూరు నియోజకవర్గ పార్టీ బీఎల్ఏలకు శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. వారితో పాటు పార్టీ నాయకులు ఓట్ల సవరణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి వివరించారు.సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలలో 40 శాతం ఓట్లు వచ్చినా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యామంటే ఎన్నికలు ఎలా జరిగాయో ఆలోచించాలన్నారు. మళ్లీ అటువంటివి పునరావృతం కాకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ఎన్నికల మాదిరిగానే మేనేజ్ చేసి మళ్లీ అధికారంలోకి రావచ్చనే భావనతో చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో రూ. 2.63 లక్షల కోట్ల అప్పు చేసినా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. కానీ 23 నెలలకే రూ.2.74 లక్షల కోట్లు అప్పు చేసినా సంక్షేమ పథకాల అమలు లేదని, హామీలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చడం లేదని చెప్పారు. కొత్తగా ఒక పింఛన్ కూడా మంజూరు కాలేదన్నారు. డబ్బంతా అమరావతిలో నీరు పూడ్చేందుకు, మొక్కలు నాటేందుకు, అద్దాలకు, రోడ్లకే వెచ్చించే నెపంతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మాణ పనుల ఖర్చులను చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పేదరికాన్ని మరింత పెంచేలా పిల్లలను కనాలని కోరుతున్నారని, ఉన్న వారికే చదువు, వైద్యం లభించడం కష్టంగా మారిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని తెలియజేశారు. రెండు నెలల్లోనే జీతాల చెల్లింపు కూడా ఆలస్యమయ్యే దుర్భర పరిస్థితులు రానున్నట్లు చెప్పారు. వారి అక్రమాలను బిజేపీ పెద్దలు సైతం ప్రశ్నించే పరిస్థితులలో లేరని, ఎక్కడ ప్రశ్నిస్తే తమకు దుర్మార్గుడైన చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తాడోనని మిన్నకుంటున్నారని పేర్కొన్నారు. రెండేళ్లుగా ఎంత మంది పార్టీ నాయకులు హత్యలు, కేసులు, దాడులకు గురయ్యారో.. గ్రామాలను వదిలి వెళ్లారో గుర్తుకు తెచ్చుకుని రోషంతో పని చేయాలన్నారు. సర్ కార్యక్రమాన్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తే పార్టీకి విజయం ఖాయమని స్పష్టం చేశారు. భూమన మాట్లాడుతూ పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో సర్ బలీయమైన ప్రభావం చూపిందని, వారందరికంటే చంద్రబాబు దానిని ఉపయోగించడంలో మరింత నేర్పరి అని చెప్పారు. ప్రతి బూత్ పరిధిలో పార్టీ మద్దతుదారులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగకుండా జాగ్రత్త పడాలన్నారు. మళ్లీ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యం కావాలన్నారు. పార్టీ కార్యక్రమాలు మొదటగా పుంగనూరు నియోజకవర్గంలోనే ప్రారంభం అవుతున్నాయని, అలాగే సర్ అవగాహన కార్యక్రమం రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడ ప్రారంభించామన్నారు. జిల్లాలో చంద్రబాబు భయపడే ఏకై క వ్యక్తి పెద్దిరెడ్డి మాత్రమేనన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి సర్లో అక్రమాలు చోటచేసుకోకుండా అడ్డుకోవాలన్నారు. చంద్రబాబు ఇప్పటికే వాళ్ల బీఎల్ఏలకు వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించడంపై కుట్రపూరిత శిక్షణ ఇచ్చాడని చెప్పారు. కార్యక్రమంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ చిత్తూరు పార్లమెంటరీ పరిశీలకుడు రాజశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గ పరిశీలకులు జింకా చలపతి, అనీషారెడ్డి, భరత్, వెంకటేశ్ రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, రమేశ్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పలు విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవగాహన సమావేశంలో పెద్దిరెడ్డి, భూమన ప్రతి ఓటుహక్కు విలువ గుర్తించాలి రాష్ట్రంలోనే తొలిసారి అన్నమయ్య జిల్లాలో కార్యక్రమం -
నిలువు దోపిడీ నిజమే!
● ప్రత్యక్షంగా అంగీకరించిన మార్కెట్ కార్యదర్శి ● నోటీసులతో మొదలైన చర్యలు సాక్షి, మదనపల్లె: ములకలచెరువు మార్కెట్ యార్డులో టమాటా రైతుల నిలువు దోపిడీ కొనసాగుతోందన్న విషయం మార్కెట్ అధికారుల మాటల్లోనే తేటతెల్లమైంది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శ్రీసాక్షిశ్రీప్రచురిస్తున్న వరుస కథనాలు నిజాలేనని అధికారులు పరోక్షంగా అంగీకరించారు. గురువారం శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన హమేషా తమాషా చెయ్యరా కథనంపై మార్కెట్ కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి అత్యవసరంగా మండీ యజమానులతో సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఈ సమావేశంలో ఇకపై రైతులు విక్రయానికి తెచ్చిన టమాట క్రేట్లకు జాక్ పాట్ తీసుకోకూడదని, నెలాఖరులోగా 15 కిలోల క్రేట్లను విధిగా వినియోగంలోకి తీసుకురావాలని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే అధికారుల సాక్షిగా ఏళ్ల తరబడి ములకచెరువు మార్కెట్లో జాక్ పాట్ తీస్తున్నారని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన మాటలే సాక్ష్యంగా నిలుస్తున్నాయని రైతులు అంటున్నారు. స్వయంగా మార్కెట్ కార్యదర్శి జాక్ పాట్ ఉండకూడదని సమావేశంలో స్పష్టంగా చెప్పారంటే ఇప్పటిదాకా ఈ దోపిడీ కొనసాగుతున్నట్టే కదా అని రైతులు చర్చించుకుంటున్నారు. తద్వారా రైతులు ఎన్ని రూ.కోట్ల ఆదాయాన్ని నష్టపోయి ఉంటారో అంచనా వేయొచ్చు. ఇలా ఉండగా 15 కిలోల క్రేట్ల విధానం అమలు చేసేందుకు ఇంతకాలం అధికారులు ఎందుకు వెనకడుగు వేశారన్న చర్చ కూడా రైతుల్లో జరుగుతోంది. 15 కిలోల క్రేట్లను అమలు చేయాలని ఆదేశించామని అదే విషయాన్ని కార్యదర్శి, ఏడీలు పదే పదే చెబుతూ వచ్చారు. ఆచరణలో మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు. ‘సాక్షి’కథనాలతో టమాట రైతులకు తాము ఏ విధంగా నష్టపోతున్నామో, మోసాలకు గురి అవుతున్నామో పూర్తిగా అర్థం చేసుకున్నారు. దాంతో రైతుల్లో 15 కేట్ల విధానం కావాలని, జాక్ పాట్ రద్దు చేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో చివరకు మార్కెట్ కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి మండీ యజమానులతో సమావేశం నిర్వహించడమే కాక గట్టి ఆదేశాలు ఇచ్చారు. నెలాఖరునుంచే 15 కిలోల క్రేట్లను అమలు చేయాలని, జూన్ 15 నాటికి పూర్తిస్థాయిలో అమలు కావాలని ఈ మేరకు ఆయన గురువారం రాత్రి మండీ యజమానులకు నోటీసులు జారీ చేశారు. అమలు చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నట్టు కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి శుక్రవారం చెప్పారు. -
విద్యుత్ షార్ట్సర్క్యూట్తో చెలరేగిన మంటలు
పులిచెర్ల(కల్లూరు): కల్లూరు పులిచెర్ల మార్గంలోని జి.నూర్బాషా(55) ఇంటిలో దూదితో పరుపులు కుట్టి అమ్ముకుంటున్నాడు. ఈక్రమంలో శుక్రవారం విద్యుత్ మిషన్ సహాయంతో దూదిని బేళ్లనుంచి విడదీస్తుండగా విద్యుత్ షార్ట్సర్క్యూట్కారణంగా మంటలు చెలరేగాయి. దూది,మిషన్లు కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ వారికి విషయం తెలియజేయడంతో వారు ఫైర్ ఇంజిన్తో మంటలను ఆర్పేసారు. ఏమేరకు నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది. జోరుగా నిషేధిత లాటరీ వ్యాపారం పుంగనూరు: పట్టణంలో బహిరంగంగా నిషేధిత లాటరీ టికెట్ల వ్యాపారం జోరుగా సాగుతుండటంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని తూర్పుమొగసాల, సెంటర్లాడ్జి, కొత్తపేట, కొత్తయిండ్లు, ఎన్ఎస్.పేట ప్రాంతాలలో లాటరీ విక్రయాలతో పేద కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్నారి నోటికి చేపల గాలం కలకడ : చేపలను పట్టేందుకు వేసే గాలం చిన్నారి బేబీ(2)కి ఆడుకునే బొమ్మలా అనిపించడంతో నోటిలో పెట్టుకుంది, దీంతో అదికాస్త నోటిలో చిక్కుకున్న సంఘటన కలకడలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన రవి దంపతులు కలకడ మండలం గుడిబండ సమీపంలో తాత్కాలిక షెడ్లు వేసుకుని నెల రోజుల నుంచి నివాసం ఉంటున్నారు. మండలంలోని చెరువులు, కుంటల్లోని ముళ్లపొదలు, కంపచెట్లు కొట్టి బొగ్గులు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి చిన్నారి షెడ్లో ఆడుకుంటూ చేపల గాలాన్ని నోట్లో పెట్టుకొని లాగడంతో ఇరుక్కుపోయింది. కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నించినా గాలం రాకపోవడంతో చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు గాలం తీయడం కష్టతరమని భావించి తిరుపతికి రెఫర్ చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. -
నూతన నియామకం
సాక్షి, మదనపల్లె: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన నేతలను పార్టీ పదవుల్లో నియమిస్తూ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా పీలేరు నియోజకవర్గానికి చెందిన పోతపు కేశవరెడ్డి, రాయచోటి నియోజకవర్గానికి చెందిన కురుమయ్య గారి రమేష్ రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మదనపల్లె నియోజకవర్గానికి చెందిన కోటూరి ఈశ్వర్, ఐటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన ముండ్ల సంజీవరెడ్డి, రాజంపేట నియోజకవర్గానికి చెందిన జి.ప్రవీణ్ కుమార్ రాజులను నియమించారు. మదనపల్లె సిటీ: ప్రవేశ పరీక్ష రాసి సీటు రాని విద్యార్థులకు ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఏపీఎస్డబ్యూఆర్ఈఐ సొసైటీ జిల్లా సమన్వయ అధికారిణి ఏ.ఉదయశ్రీ తెలిపారు. కడప చిన్నచౌక్లోని అంబేద్కర్ గురుకులంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఐదో తరగతి బాలికలకు ఈనెల 26న, బాలురకు 27న.. ఇంటర్ మొదటి ఏడాది బాలికలకు ఈనెల 29న, బాలురకు 30న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఖాళీగా ఉన్న సీట్లను ఎంపిక చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. మదనపల్లె సిటీ: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈనెల 25వ తేదీన వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల అధికారులతో కడప కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారిణి తెలిపారు. వెనుబడిన కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధా రణ ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు అందజేయాలన్నారు. మదనపల్లె సిటీ: ఫుట్బాల్ సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ జిల్లా జట్లు ఎంపిక ఈనెల 23, 24తేదీల్లో జరుగుతుందని జిల్లా ఫుట్బాల్ అసోసియేషియన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 23వతేదీ ఉదయం 9 గంటలకు సీనియర్ పురుషుల జట్లు ఎంపిక జరు గుతుందని పేర్కొన్నారు. 24వతేదీ ఉదయం 9 గంటలకు సబ్ జూనియర్, జూనియర్ కేటగిరీలో బాలబాలికల పుట్బాల్ జట్లు ఎంపిక జరుగుతుందన్నారు. వివరాలకు అబ్రహాం 89194 91555, బాలాజీ 8096607782 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. పుంగనూరు: మాజీ మున్సిపల్ చైర్మన్ హజీ పి.వాహిదున్నిసా (76) శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ మిథున్రెడ్డి బెంగళూరుకు తరలించి చికి త్స చేయిస్తున్నారు. అయితే బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో ఆమె మృతి చెందారు. 1995–2000 వరకు పుంగనూరు మున్సిపల్ చైర్మన్గా ఆమె సేవలందించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్రెడ్డి ఆమె మృతికి సంతాపం తెలిపారు. మాజీ చైర్మన్లు కొండవీటి నాగభూషణం, అలీమ్బాషా ఆమె భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. కురబలకోట: శాసీ్త్రయ పద్ధతులు, నూతన సాంకేతికతతోనే అధిక దిగుబడులు సాధ్యమని అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ అన్నారు. కనసానివారిపల్లి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందాలంటే ’ఏపీఎఐఎంఎస్’ నమోదు తప్పనిసరన్నారు. అనంతరం పలు సూచనలు చేశారు. -
ఎమ్మెల్యే వరదకు అవమానం
సాక్షి ప్రతినిధి, కడప: పసుపు జెండాను నమ్ముకున్న సీనియర్లకు విలువ లేదు.. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకు కనీస మర్యాద లేదు! అంతా తానై, తన కోటరీ చెబితేనే అపాయింట్మెంట్లు అనే చందంగా సాగింది వైఎస్సార్ కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. అటు కడప, ఇటు కొండాపురంలో జరిగిన సమావేశాల సరళి చూస్తే, కేవలం తన చుట్టూ భజన చేసే ‘అనుకూల’ వర్గానికే లోకేష్ పెద్దపీట వేశారని, జెండా మోసిన అసలైన కార్యకర్తలను నడిరోడ్డుపై నిలబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే వరదకు అవమానం రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, వయసులోనూ, అనుభవంలోనూ పెద్దవారైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి మంత్రి లోకేష్ పర్యటనలో తీవ్ర అవమానం ఎదురైంది. శుక్రవారం ఉదయం లోకేష్ను కలిసేందుకు మైనార్టీ నేత ముక్తియార్తో కలిసి వరదరాజులరెడ్డి ఆయన కార్వాన్ వద్దకు వచ్చారు. అయితే ఒక నియోజకవర్గ ఎమ్మె ల్యే, సీనియర్ నేత అని కూడా చూడకుండా.. ‘ముందస్తు అనుమతి లేదు, అపాయింట్మెంట్ కష్టమే‘ అంటూ లోకేష్ పర్సనల్ సెక్రెటరీ ముఖం మీదే చెప్పేయడం గమనార్హం. దాదాపు గంటసేపు పడిగాపులు కాసినా లోకేష్ నుంచి పిలుపు రాకపోవడంతో, వరదరాజులరెడ్డి తీవ్ర అవమానంతో వెనుతిరగాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధికే ఈ పరిస్థితి ఉంటే ఇక తమ గతేంటని ‘తెలుగు తమ్ముళ్లు’ చెవులు కొరుక్కుంటున్నారు. జాతీయ ఉపాధ్యక్షుడికే స్టేజీ కింద స్థానం దీనికి ముందు గురువారం సాయంత్రం జరిగిన కడప నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ అవమానాల పర్వం కొనసాగింది. పార్టీ జెండానే సర్వస్వంగా భావించే ఎంతోమంది కిందిస్థాయి నాయకులకు ఈ సమావేశంలో అసలు అనుమతే దక్కలేదు. ఒకవేళ లోపలికి వెళ్లగలిగినా, సీనియర్లకు దక్కిన మర్యాద శూన్యం. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న హరిప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి లాంటి కీలక నేతలను సైతం స్టేజీపైకి రానివ్వలేదు. సీనియర్లకు నో ఎంట్రీ..కోటరీకే పెద్దపీట గంటసేపు పడిగాపులు కాసినాఎమ్మెల్యేకు దక్కని అపాయింట్మెంట్ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్,రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్రెడ్డిలకుస్టేజీ కిందనే సీట్లు -
బోయకొండలో గాడితప్పిన పాలన
పుంగనూరు: రెండేళ్లు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం శ్రీబోయకొండ పాలకవర్గ చైర్మన్ పదవికి మాత్రం ఎవరినీ నియమింలేదు. దీంతో తమ్ముళ్ళు తీవ్ర నిరాశ ,నిసృహలకు లోనవుతున్నారు. పాలన గాడితప్పతోంది. ఉమ్మడి జిల్లాల్లో రెండోస్థానంలో ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఏటా రూ.15 కోట్ల రూపాయలు ఆదాయం ఉంది. రెండేళ్లవుతున్నా చైర్మన్ నియామకం త్రిశంఖు స్వర్గంలో పడటంతో అధికారులు ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తూ..ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. వీరితో పాటు కాంట్రాక్టర్లు భక్తులపై దాడులు సైతం చేస్తుండటంతో భక్తజనం భయాందోళనలకు లోనవుతున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా చౌడేపల్లె మండలం బోయకొండ ఆలయం వెలుగొందుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డిల కృషితో సుమారు రూ.200 కోట్లు ఖర్చు చేసి ఆలయాన్ని సుందరంగా మార్చి వేశారు. ఆలయ హోదాను డీసీ స్థాయికి పెంచి, ఎప్పటికప్పుడు పాలకవర్గాన్ని నియమించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అధికార పార్టీకి చెందిన వారు పలు అవినీతి అక్రమాలకు పాల్పడటం, భక్తులపై దాడులు, దౌర్జన్యాలు చేయడం వివాదస్పదమౌతోంది. నియంత్రించాల్సిన అధికారులు అధికార పార్టీకి చెందిన ఒక వర్గానికే మద్దతు ఇవ్వడంతో మరో రెండు గ్రూపులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం, బహిరంగంగా విమర్శించడం జరుగుతోంది. కుర్చీకోసం.... శ్రీ బోయకొండ గంగమ్మ పాలకవర్గం ఏర్పాటుకు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 7న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 27లోపు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ మేరకు 115 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగుదేశం తరపున ఎస్కె.రమణారెడ్డి, లక్ష్మీపతిరాజు, జనసేన తరపున చిన్నారాయల్ విడివిడిగా తమ గ్రూపు డైరెక్టర్లు 13 మందితో కలసి దరఖాస్తు చేసుకున్నారు. ఎస్కె.రమణారెడ్డి అధిష్టానంతో నేరుగా చైర్మన్ పదవి కోసం పైరవీ చేస్తున్నారు. మరో నాయకుడు లక్ష్మీపతిరాజు స్థానిక ఇన్చార్జితో కలసి మంతనాలు సాగిస్తున్నారు. జనసేన నాయకుడు చిన్నరాయల్ తన పార్టీ నేతలు, బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలతో ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైర్మన్ నియామకం రెండేళ్లుగా జరగకపోగా, నిర్ణయం నారావారి చేతుల్లో నలిగిపోతోంది.ఆలయానికి చైర్మన్ను నియమించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతోందని భక్తులు అంటున్నారు. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ నియామకం, ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై లక్ష్మీపతిరాజు గురువారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును బెంగళూరు విమానాశ్రయంలో కలిశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. కాగా దీనిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. చౌడేపల్లె మండలంలోని బోయకొండ ఆలయం చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మ అక్రమాలు, దౌర్జన్యాలతో విసిగిపోతున్న భక్తజనం త్రిశంఖు స్వర్గంలో చైర్మన్ నియామకం నారావారి చేతుల్లో నలుగుతున్న నిర్ణయం -
గుర్తుతెలియని వాహనం ఢీ: యువకుడు దుర్మరణం
మదనపల్లె టౌన్: హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శుక్రవారం వేకువజామున మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొంది గ్రామానికి చెందిన ఎరప్ప్ర నాయుడు కుమారుడు ఏ. శ్రీరాములు నాయుడు (35) శుక్రవారం తెల్లవారుజామున పాలెంకొండలో కూలీల కోసం వైపు హైవేపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సీటీఎం చెరువు సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం శ్రీరాములు నాయుడును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. -
పెళ్లికి నిరాకరించారని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: ప్రేమించిన వ్యక్తితో పాటు వారి తల్లి దండ్రులు తన పెళ్లికి నిరాకరించారని ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం చౌడేపల్లి మండలం, బోయకొండ షికారి పాల్యంలో చోటు చేసుకున్న ఘటనపై వివరాలు.. షికారి పాలెంకు చెందిన శివయ్య ఏసమ్మల కుమార్తె శివాని (22) కర్ణాటక రాష్ట్రం, మైసూర్, మండియా జిల్లా, షికారిపురంలో తన మేనత్త దగ్గర ఉంటోంది. అక్కడ చదువుకునేది. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన వస్తాద్, పప్పిల కుమారుడు రాఘవ(25)ను ప్రేమించింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేసినట్లు ఆరోపించింది. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, రాఘవ మాట మారుస్తున్నాడని తెలిపింది. ఈ విషయాన్ని తన మేనత్తతో చెప్పడంతో ఆమె తీసుకొచ్చి స్వగ్రామమైన బోయకొండలో తనను వదిలిపెట్టి వెళ్లి పోయిందని తెలిపింది. తనను మోసం చేసి పెళ్లికి రాఘవ, అతని తల్లి దండ్రులు నిరాకరించడంతో బోయకొండలో విషం తాగింది. కుటుంబీకులు బాధితురాలని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. చౌడేపల్లి పోలీసులు కేసు విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యలతో.. మదనపల్లె టౌన్: కుటుంబ సమస్యల కారణంగా ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దతిప్ప సముద్రం మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలో కానుక మాకుల పందికొచ్చిందిన అజంతుల్లా కుమారుడు ఫయాజ్(27) సమస్యల కారణంగా మనస్థాపం చెంది పురుగుమందు తాగాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువు సుందరీకరణతో ఆహ్లాదకర వాతావరణం
జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ పీలేరురూరల్: చెరువు సుందరీకరణతో ఆహ్లాదకర వాతావరణం ప్రజలకు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డితో కలసి అయ్యపునాయుని చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అయ్యపునాయునిచెరువుకు పింఛా నది నుంచి మంచినీటి సరఫరాకు 2.5 కిలో మీటర్లు పైపులైన్లు వేయడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.చెరువులో పేరుకుపోయిన పూడికలు తొలగించాలన్నారు. వాటర్షెడ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో చెరువుకట్టపై చిన్నారుల కోసం చిల్డ్రన్ పార్క్, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పైపులైను ఏర్పాటుకు రూ. 3 కోట్లు, చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్కు రూ. 46 లక్షలు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. తహసీల్దార్ ఎం. శివకుమార్, ఇరిగేషన్ డీఈ చావ్లానాయక్, వాటర్షెడ్ ఏపీడీ లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పరిహారం ఇవ్వక అష్టకష్టాలు పడుతున్నాం
గండికోట ప్రాజెక్టు కింద ఫేస్–3లో మా గ్రామం ముంపులోకి పోయింది. మా గ్రామానికి మొత్తానికి 600 పైగా ఉండగా 23 మందికి మాత్రమే పరిహారం చెల్లించారు. మిగిలిన వారికి పరిహారం రాక అష్టకష్టాలు పడుతున్నాం. పరిహారం ఇచ్చి మా గ్రామ నిర్వాసితులను ఆదుకోవాలని కోరుతున్నాం. –జి.నారాయణరెడ్డి, నిర్వాసితుడు, పి.అనంతపురం గ్రామం ప్రాథమిక పాఠశాలలు రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో భవనాలు లేక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. పాలకులు చొరవ చూపి భవనాలు నిర్మించాలి. గ్రామంలో తాగునీళ్లు లేక ఇక్కట్లు పడుతున్నాం. డ్రైనేజీ సిమెంట్ రోడ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి. –భూమిరెడ్డి ప్రతాపరెడ్డి, తాళ్ల ప్రొద్దుటూరు భూములు అమ్ముకోలేం.. ప్రభుత్వం పరిహారం ఇవ్వదు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే పరిహారం 24 లక్షలు ఇస్తామంటూ యువగళంలో నారాలోకేష్ రాజోళి ముంపురైతులతో సమావేశం పెట్టి మరీ చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఇప్పటివరకు భూములకు పరిహారం గాని రాజోళి నిర్మాణం గురించి ప్రస్తావనే లేదు. మా భూములకు ప్రభు త్వం అవార్డులు పాస్ చేసింది. మా అవసరాలకు భూములు అమ్ముకుందామంటే రిజిష్ట్రేషన్లు కావడంలేదు. ప్రభుత్వమేమో పరిహారం ఇవ్వడంలేదు. ఇలాగైతా మేమెలా బతకాలి. –విశ్వనాథరెడ్డి, చదిపిరాళ్లదిన్నె, రాజోళి ముంపు బాధితులు -
రూ.2.07 కోట్లు స్వాహాపై కేసు లేదు
సాక్షి, మదనపల్లె: మదనపల్లె డివిజన్లోని నిమ్మనపల్లె వ్యవసాయ పరపతి సహకార సంఘంలో రూ.2.07 కోట్ల సంఘ నిధుల స్వాహాపై పోలీసు కేసు నమోదు కాకపోవడంపై సహకార శాఖ అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిమ్మనపల్లె సింగిల్ విండో సీఈఓగా పనిచేసిన హరినాథ్రెడ్డి రుణాలు మంజూరు చేసి వాటి సొమ్మును రికవరీ చేసినా జమ చేయలేదని వెలుగులోకి వచ్చింది. దీనిపై సహకార శాఖ అధికారులు విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా సహకార అధికారి గురుప్రకాష్ విచారణ అధికారిగా హబీబుల్లాను నియమించారు. ఇప్పుడు ఈ నిధుల స్వాహాపై సమగ్ర విచారణ సాగుతోంది. విచారణ సందర్భంగా హరినాథ్రెడ్డి బంగారం లేకున్నా, పెట్టినట్లు రికార్డులు సృష్టించాడు. ఊరు, పేరు లేని వ్యక్తుల పేరిట రుణాలు మంజూరు చేసి వాటిని సొంతంగా వాడుకున్నాడు. బంగారం పేరిట రుణాలు ఇచ్చినట్టు రికార్డులో పేర్కొన్నప్పటికీ వారికి సంబంధించిన చిరునామాలు, ఫోన్ నంబర్లు లేవు. హరినాథ్ రెడ్డి ఫోన్ నంబర్ రాయడం, తనిఖీల్లో బంగారం కనిపించకపోవడం, రుణాలు తిరిగి చెల్లించినట్టుగా న మోదు కావడం గుర్తించారు. దీంతో రూ.2, 07,80,000 నిధులను హరినాథ్ రెడ్డి స్వా హా చేసినట్లు నిర్ధారణ చేశారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణ మార్చి 7న నిమ్మనపల్ల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటిదాకా కేసు మాత్రం నమోదు కాలేదు. అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ విషయమై నిమ్మనపల్లె ఎస్సై రామకృష్ణను వివరణ కోరగా కేసు నమోదు చేయలేదని చెప్పారు. సహకార అధికారుల విచారణలో తేలిన వాస్తవ నివేదికను, వాటి రికార్డులను ఇవ్వాలని అధికారులను కోరినట్టు చెప్పారు. వీటిని అందజేశాక కేసు నమోదు చేస్తామని తెలిపారు. నిమ్మనపల్లె సింగిల్ విండో వ్యవహారం


