breaking news
Annamayya
-
‘శ్రీకాంత్రెడ్డి జిల్లాను తెస్తే.. నువ్వు ముక్కలు చేస్తావా?’
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటా అంటూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో తొడగొట్టి మరీ చెప్పిన మాటలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాయచోటిలో ఆయన తీరుపై అసంతృప్తి.. క్రమక్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారుతోంది. తాజాగా రాయచోటిని మదనపల్లిలో కలపడంపై కేబినెట్లో సంతకం చేసిన మంత్రి రాంప్రసాద్రెడ్డి.. బయటకు వచ్చి కంటతడి పెట్టారు. అయితే ఆయనది డ్రామా అంటూ రాయచోటి ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నాడు గడికోట శ్రీకాంత్రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని రాయచోటికి జిల్లాను తెచ్చారు. దానిని నిలబెడతానని.. లేకుంటే మీసం తీసేస్తానంటూ రాంప్రసాద్రెడ్డి శపథం చేశారు. ఈ క్రమంలో.. ఇప్పుడు మీసం తీసేస్తారంటూ అంటూ రాజకీయ ప్రత్యర్థులు సెటైరలు సంధిస్తున్నారు. శ్రీకాంత్రెడ్డి పదవీ త్యాగంతో జిల్లాను తీసుకొస్తే..రాంప్రసాద్రెడ్డి మంత్రి పదవి కోసం జిల్లాను ముక్కలు చేశాడంటున్న రాయచోటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జిల్లా కేంద్రంలో రాయచోటిని తొలగించి మదనపల్లికి మార్చడంపై ఇటు ముస్లిం మత పెద్దల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. శుక్రవారం జిల్లా కేంద్రం మార్పునకు నిరసగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి. ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేయాలని.. అన్నమయ్య జిల్లాలోనే యధావిధిగా కొనసాగించాలని మత పెద్ద సర్కాజి షర్ఫుద్దీన్ హుస్సేని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించలేని పక్షంలో రాయచోటిని కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారాయన. ‘‘జిల్లా కేంద్రం లేనప్పుడు పన్నుల భారం కూడ తోలగించి రాయచోటిను వైఎస్ఆర్ జిల్లాలో విలీనం చేయండి అని కోరుతున్నారాయన. -
ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం తగదు
రాయచోటి : సమస్యల పరిష్కారం కోరుతూ పరిష్కార వేదికకు వచ్చిన ప్రజా ఫిర్యాదులకు చట్టపరిధిలో సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా విని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారంలతో ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో తక్షణ న్యాయం అందించాలని ఆదేశించారు. -
పిల్లల కోసం గేటు వద్ద నిరీక్షణ
వాల్మీకిపురం : స్థానిక తరిగొండ రోడ్డులోని ఏపీ ఉర్దూ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రులు గేటు బయటే నిరీక్షించాల్సిన దుస్థితి ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం స్థానిక ఉర్దూ మైనార్టీ బాలికల పాఠశాలలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చామని చెప్పినా పాఠశాల యాజమాన్యం లోనికి అనుమతించ లేదని రాయచోటి, సుండుపల్లికు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు అహమ్మద్బాషా, ఖాదీరూన్లు కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో మెయిన్ గేటు వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ నవమల్లిక మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి నెల రెండవ శనివారం మాత్రమే తల్లిదండ్రులకు అనుమతి ఉంటుందని, ఎప్పుడు పడితే అప్పుడు తమ పిల్లలను చూడాలని వస్తే అనుమతించేది లేదని తెలిపారు. -
నందలూరు చెరువులో రూ.40 లక్షల కేంద్ర నిధులు నీళ్లపాలు
నందలూరు : నందలూరు కన్యకల చెరువులో శ్యాంప్రసాద్ ముఖర్జీ రూరల్ డెవలప్మెంట్ పథకానికి సంబంధించి రూ.45 లక్షలతో నిర్మించతలపెట్టిన చిల్డ్రన్పార్కు నిధులు నీళ్లపాలయ్యాయి. ఈ విషయంపై సోమవారం స్థానిక ఎంపీడీఓ సభా భవనంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. నందలూరు కన్యకల చెరువులో చిల్డ్రన్ పార్కు నిర్మాణంపై వైస్ ఎంపీపీ అనుదీప్ అభ్యంతరం వ్యక్తంచేశారు. జిల్లా పరిషత్ సీఈఓ ఈ నిర్మాణం చూసి వెళ్లినప్పటికి లక్షలాది రూపాయలు బిల్లుచేసి కాంట్రాక్టర్ చేతికి అందజేశారన్నారు. చిల్డ్రన్పార్కు నిర్మితంపై పర్యవేక్షణ కొరవడిందని, ఏ విధంగా కేంద్రం నిధులను మంజూరు చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం నీటిలో పార్కు ఉందని, ఎవరికీ ఉపయోగపడటంలేదని, గుడ్డిగా బిల్లు చేయడం వెనుక సీఈఓ ఆంతర్యమేమిటని ధ్వజమెత్తారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు నిర్మాణానికి చెరువులో అనుమతులు ఏ విధంగా ఇచ్చారన్నదే ఇప్పుడు అంతుపట్టిన అంశమన్నారు. ఇదే విషయంపై ఎంపీపీ మేడా విజయభాస్కర్రెడ్డి కూడా చెరువులో చిల్డ్రన్పార్కు కేవలం కాంట్రాక్టర్ లబ్ధి కోసం బిల్లు మంజూరు చేసినట్లుగా ఉందని జెడ్పీ సీఈఓ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మండల పరిషత్లో తీర్మానం చేయాలని ఎంపీపీ మేడా అధికారులను ఆదేశించారు. తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్, కేంద్రానికి పంపాలన్నారు. అంగన్వాడీల పనితీరుపై అసంతృప్తి మండలంలో అంగన్వాడీల పనితీరుపై మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అసంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రభుత్వ లక్ష్యాలను అంగన్వాడీ సెంటర్ల నిర్వాహకులు అధిగమించడంలేదన్నారు. గౌరవవేతనం ఇవ్వండి మహాప్రభో.. మండల పరిషత్ సమావేశంలో ఎంపీటీసీలు తమకు రావాల్సిన గౌరవ వేతనం ఇవ్వండి మహాప్రభో అని మండల సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మండల కో–ఆప్షన్ సభ్యుడు కలీం మాట్లాడుతూ ఇంతవరకు ఎంపీటీసీలకు రావాల్సిన గౌరవ వేతనం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ అమరేశ్వరి, ఎంపీడీఓ కేఆర్ఎం ప్రసాద్, వైస్ ఎంపీపీలు అనుదీప్, తుమ్మల భావన, ఎంపీటీసీలు కొండూరు రమేష్బాబు, మోదుగుల సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. కన్యకలచెరువులో మునిగిన చిల్డ్రన్ పార్కు మండల మీట్లో వైస్ ఎంపీపీ అనుదీప్ ధ్వజం కొరవడిన పర్యవేక్షణ..బిల్లుల మంజూరు జెడ్పీ సీఈఓ వైఖరిపై ఎంపీపీ మేడా ఆగ్రహం -
ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసుల మెరుపుదాడి
● రూ. 61 లక్షల విలువైన దుంగలు స్వాధీనం ● ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు ● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిరాయచోటి : అన్నమయ్య జిల్లాలోని శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం రవాణాపై పోలీసులు మెరుపుదాడి చేసి రూ. 61 లక్షలు విలువగల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున చేపట్టిన దాడిలో ఎర్రచందనంతోపాటు ఇద్దరు స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోందన్నారు. తమిళనాడు స్మగ్లర్లతో చేతులు కలిపి కొందరు స్థానికులు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయన్నారు. ఈ క్రమంలో వీరబల్లి మండల పరిధిలోని కురవపల్లి–ఉప్పరపల్లి రోడ్డు దేవదాశి చెరువు వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారన్నారు. 617 కేజీల బరువు ఉన్న 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ సుమారు రూ. 61,70,000 ఉంటుందన్నారు. అలాగే ఒక కారు, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అన్నమయ్య జిల్లా, గడికోట గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల చంద్రమోహన్ (38), తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లాకు చెందిన రమేష్ వట్టన్ (38)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులో వీరబల్లి మండలానికి చెందిన ఇద్దరు, రాయచోటి మండలానికి చెందిన ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం మేరకు సమర్థవంతంగా పనిచేసి కేసును ఛేదించిన రాయచోటి రూరల్ ఇన్స్పెక్టర్ ఎస్కె రోషన్, రెడ్ శాండిల్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ టీవీ కొండారెడ్డి, వీరబల్లి ఎస్ఐ సుస్మిత, టి.సుండుపల్లి ఎస్ఐ హుస్సేన్ వారి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
మండిపడుతున్న జనం
● అన్ని వేళ్లూ మంత్రి వైపే.. ● జిల్లా కేంద్రం రాయచోటి మార్పుతో రగిలిపోతున్న జనం సాక్షి అమరావతి : అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పుతో రాయచోటిలో అలజడి నెలకొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా కేంద్రం విషయంలో మార్పు ఉండదని మంత్రి చెప్పిన మాటలను నమ్మిన ప్రజలు ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ఒక్కసారిగా మార్పు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లారు. గతంలో 2024 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాయచోటి ప్రజల సాక్షిగా ఏవేవో చేస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా ఇప్పుడు మాత్రం జిల్లా కేంద్రం మార్పుతోపాటు ఏకంగా రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపడంపై కాక రేగుతోంది. అందులోనూ జిల్లా కేంద్రానికి అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైతే తాను రాజీనామా చేస్తానంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి గట్టిగా చెప్పడంతో రాయచోటి ప్రజల్లో ధైర్యం ఉండేది. పైగా మదపల్లెను జిల్లాగా ప్రకటించిన తర్వాత కూడా రాయచోటిలో మంత్రి ఆధ్వర్యంలో అన్నమయ్యకు జిల్లా కేంద్రంగా రాయచోటినే కొనసాగింపు సంకేతాలు వచ్చాయంటూ ఇటీవల టీడీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం..అంతలోనే కేంద్రం మార్పుతో రాయచోటి ప్రజలు మండిపల్లి కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్ 4న పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లా ఏర్పడింది. అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న రాయచోటిని ఇప్పుడు మదనపల్లెలో కలుపుతూ మంత్రివర్గం తీర్మానించింది. అయితే మంత్రి మండిపల్లి మాటలను పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రికి ఏదో ఒకటి చెప్పినా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మీదనే ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. మూడు నియోజకవర్గాలతో జిల్లా అంటూ ప్రచారం సరిగ్గా నెలరోజుల కిందట మదనపల్లెను జిల్లాగా ప్రకటించిన అనంతరం రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు కలిపి జిల్లాగా ఉంటుందని సబ్ కమిటీ సమావేశానంతరం వివరిస్తూ వచ్చారు.ప్రస్తుతం రైల్వేకోడూరును తిరుపతిలో, రాజంపేటను వైఎస్సార్ కడపలో, రాయచోటిని మదనపల్లెలో కలుపుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాయచోటిలో పార్టీల నాయకులు, జేఏసీ ఉద్యమ బాట పట్టారు. బాబు మాటలు నీటి మీద రాతలు అన్నమయ్యకు సంబంధించి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచుతాం...మార్పు చేయకుండా అభివృద్ధి చేస్తాం..నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ అపార వనరులు ఉన్నాయి. పండ్ల తోటలకు ప్రసిద్ది. పూర్తి స్థాయిలో అబివృద్ది చే స్తాం. మన అభ్యర్థిని గెలిపించడంటూ 2024 సార్వత్రిక ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు రాయచోటిలోని నేతాజీ సర్కిల్ జిరిగిన బహిరంగసభలో మాట్లాడిన మాటలు...జిల్లా కేంద్రం మార్పు చేస్తే రాజీనామా చేస్తా! అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. జిల్లా కేంద్రం మార్చాల్సిన పరిస్థితి వస్తే నేను రాజీనామా చేయడానికి కూడా వెనుకాడను. మీసం మెలేసి తొడగొట్టి చెబుతున్నా..ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు...జిల్లాకేంద్రం మార్పు ఉండదు. – రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి -
జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థిని ప్రతిభ
మదనపల్లె సిటీ : న్యూఢిల్లీలో జరిగిన యూత్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన యూత్ గేమ్స్ నేషనల్ ఛాంఫియన్షిప్ పోటీల్లో కరాటే విభాగంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ అర్షియా అంజుమ్ ప్రతిభ కనబరిచింది. విద్యార్థిని 9వ తరగతి చదువుతుంది. ఈనెల 26వతేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగిన కరాటే పోటీల్లో 54 కేజీల బాలికల విభాగంలో గోల్డ్మెడల్ సాధించింది. సోమవారం పాఠశాలలో జరిగిన అభినందన సభలో హెచ్ ఎం సుబ్బారెడ్డి అర్షియా అంజుమ్ను అభినందించారు. కార్యక్రమంలో పీడీ సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అర్జీలకు సత్వర పరిష్కారం రాయచోటి : పీజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో బాధ్యతగా పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కడప అగ్రికల్చర్ : కడప కలెక్టరేట్లోని డీఆర్డీఏ మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు రక్షిత సాగుపై షేడ్ నెట్ – పాలీ హౌస్ల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్ సోమవారం తెలిపారు. ఆసక్తి కలిగిన రైతులు పాల్గొనాలని కోరారు. -
కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజంపేట రెవెన్యూ డివిజన్కు శాపంగా మారనుంది. బద్వేలు విడిపోయిన తర్వాత కేవలం రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మంట్లను ఆధారం చేసుకొని డివిజన్ పాలన కొనసాగేది..ఇప్పుడు రైల్వేకోడూరు డివిజన్ నుంచి లెఫ్ట్ అయింది. ఇ
● రాజంపేట వాసుల్లో ఆందోళన ● తిరుపతిలోకి రైల్వేకోడూరు ● డివిజన్లోని ఐదు మండలాలు లెఫ్ట్ ● కడపలోకి రాజంపేట అసెంబ్లీ సెగ్మంట్ రాజంపేట : బ్రిటీషు కాలం నుంచి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కొనసాగిన రాజంపేటకు మరో ముప్పు పొంచి ఉంది. డివిజన్ పరిధిలో ఉన్న రైల్వేకోడూరు నియోజకర్గాన్ని తిరుపతి జిల్లాలోకి విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో రెవెన్యూ డివిజన్లో ఉన్న ఐదుమండలాలు తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయాయి. ఫలితంగా రెవెన్యూ డివిజన్ విస్తరణ రీత్యా బలహీనపడింది. నాలుగుమండలాలకు డివిజన్ డౌటే.. రాజంపేట రెవెన్యూ డివిజన్లో ఇప్పుడు ఒక్క రాజంపేట నియోజకవర్గం ఉంది. ఇందులో ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు ఇప్పటికే కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతున్నాయి. ఇక ఉండేది నందలూరు, రాజంపేట, వీరబల్లి, సుండుపల్లె మండలాలు. ఈ మండలాల పరిస్ధితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారనుంది. డివిజన్ ఎత్తివేస్తే కడప రెవెన్యూ డివిజన్లోకి విలీనం చేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బద్వేలు డివిజన్లో 12 మండలాలు.. మూడేళ్ల క్రితం రాజంపేట డివిజన్ నుంచి బద్వేలు విడిపోయింది. ఆ డివిజన్లో అట్లూరు, బి.కోడూరు, బద్వేలు, బ్రహ్మంగారిమఠం, చాపాడు, దువ్వూరు, గోపవరం, కలసపాడు, ఖాజీపేట, మైదుకూరు, పోరుమామిళ్ల, కాశీనాయన మండలాలున్నాయి. వీటన్నింటిని బద్వేలు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ పాలన కొనసాగుతోంది. జిల్లా కలెక్టరేట్ తర్వాత..జిల్లా కలెక్టరేట్ తర్వాత రాజంపేట సబ్కలెక్టరేట్ స్థా నం రాజంపేటది. జిల్లా కేంద్రంతో సమానంగా ఐఏఎస్ల పాలన ఇక్కడ కొనసాగింది. 1915లో 13 ఎకరా లకుపైగా విస్తీర్ణంలో సబ్కలెక్టరేట్ ఏర్పాటైంది. రాజంపేట, రైల్వేకోడూరు ఉమ్మడి నియోజకవర్గానికి ఈ సబ్కలెక్టరేట్ ప్రజాస్వామ్యపరంగా ప్రత్యేక భూమిక పోషించింది. ఇది వందేళ్లను పూర్తి చేసుకుంది. బ్రిటీషుకాలం నుంచి ఐఏఎస్ల రాజ్యం..1953 నుంచి రాజంపేట డివిజన్ కేంద్రంగా చేసుకొని సబ్కలెక్టర్లు పనిచేశారు. బ్రిటీషుకాలం నుంచి ఎందరో ఐఏఎస్లు ఇక్కడ సబ్కలెక్టర్లుగా పనిచేశారు. సీనియర్ ఐఎఎస్లు ఎంఎస్రాజాజీ, సతీనాయర్, డి. ఆరోరా, సి.రామచంద్రమూర్తి, టీఎస్ రంగాచారి, వల్లియప్పన్, ఎంఆర్సాయ్, మిన్నీమాథ్యుస్, జానకికృష్ణమూర్తి, ఎకే గోయల్, సతీసుజామన్, రణబీర్సుధన్, అజయ్జైన్, ప్రీతిమీనా, కేతన్గార్గ్ వైఖోమా నైదియాదేవి, ఇప్పుడు భావనలు సబ్కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రెవిన్యూశాఖ పేరు ఇనుమడింప చేశారు. జిల్లాలో సగంభాగం రెవెన్యూ పాలన రాజంపేట సబ్కలెక్టరేట్ నుంచిఏ జరిగేది. డివిజన్ల ఏర్పాటు తర్వాత రాయచోటి కడప డివిజన్కు, జమ్మలమడుగులో ఉన్న బద్వేలును రాజంపేట డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు.డివిజన్లు అయిన తర్వాత ఆర్డీవోలుగా కొంతమంది పనిచేశారు. అలాగే ఆర్డీఓ క్యాంప్ ఆఫీసు, క్వార్టర్స్తోపాటు రెవెన్యూహోం, జడ్జి క్వార్టర్స్, సభాభవనం లాంటి భవనాలు ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కొనసాగిన రాజంపేటలో వివిధ ప్రభుత్వశాఖల కార్యాలయాల తరిలింపు ప్రభావం చూపనుంది. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఎపీఎస్పీడీసీఎల్, ఐసీడీఎస్, అటవీశాఖ, పోలీసుశాఖ తదితర కార్యాలయాల డివిజన్ స్థాయి అధికారులు కొనసాగింపు ప్రశ్నార్థకరంగా మారునంది. కేవలం నాలుగు మండలాలకు డివిజన్ కార్యాలయాలు, అధికారులు ఉండరనే వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇక్కడి ప్రాంతీయులు ఆవేదన చెందుతున్నారు. -
జిల్లా కేంద్రం మార్పుపై రాయచోటిలో ఆందోళనలు
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగిస్తూ మదనపల్లె జిల్లా కేంద్రంలో కలుపుతున్నట్లు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయచోటిలో ఆందోళనలు మిన్నంటాయి. సోమవారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత ర్యాలీలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు పాల్గొని సంఘీభావవాన్ని తెలిపారు. రాయచోటిలోని శివాలయం చెక్పోస్టు నుంచి సాగిన ర్యాలీ జూనియర్ కళాశాల, నేతాజీ సర్కిల్, బస్టాండు రోడ్డు, వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా తిరిగి బంగ్లా సర్కిల్కు చేరుకుంది. నేతాజీ సర్కిల్లో మానవహారం చేపట్టి మదనపల్లె వద్దు రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అన్ని విధాలుగా వెనుకపడిన రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కేంద్రంగా ఉంచుతామని హామీ ఇచ్చి నేడు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అందులో రాయచోటిని విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా ప్రజలు రాయచోటిలోని రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల విస్మయానికి గురైన రాయచోటి ప్రాంత ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేస్తూ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని వైఎస్పార్సీపీ నాయకులు, ఉద్యోగ, ప్రజా సంఘాలతో పాటు కూటమి పార్టీలోని నేతలు సైతం ప్రకటనల ద్వారా కోరుతున్నారు. -
జిల్లాకు మదనపల్లె పేరు ఉంచాలి
మదనపల్లె రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంపై స్థానికులు సంతోషంగా లేరని, జిల్లాకు మదనపల్లె పేరు పెట్టాలని మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీయం.శివప్రసాద్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...అన్నమయ్య పేరుతోనే జిల్లా కేంద్రంగా మదనపల్లె అంటూ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షించడం లేదన్నారు. మదనపల్లె పవిత్రభూమి, మదనపల్లె జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత మాది అని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. మదనపల్లె జిల్లా 114 సంవత్సరాల ఆకాంక్ష అని, నెరవేరుతోందని ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో మదనపల్లె పేరుతో జిల్లా ఉండదన్న ప్రకటన తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. సమావేశంలో జిల్లా సాధనసమితి సభ్యు లు ముత్యాలమోహన్, చాట్ల బయన్న, రెడ్డిప్రసాద్, రాయల్ సూరి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక కమిషన్తో బీసీ కులగణన చేపట్టాలి
మదనపల్లె రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా రిజర్వేషన్ల అమలుకు ముందస్తుగా, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక కమిషన్ ద్వారా కులగణన నిర్వహించాలని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బహుజనసేన ఆధ్వర్యంలో బీసీ ప్రతిఘటన నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీల కులగణన చేపట్టి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–340 ద్వారా వెనుకబడిన తరగతులకు న్యాయం చేసే దిశగా కర్నాటక, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాల తరహాలో జనగణనలో కులగణన చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సీపీఐ సాంబశివ, ఏఐటీయూసీ ముబారక్, వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు, వడ్డెర సంఘం కృష్ణయ్య, బీసీ ఆటోయూనియన్ రాఘవేంద్ర యాదవ్, విద్యార్థి సంఘ నాయకులు ఉత్తన్న, రజకసంఘం నాయకుడు ఎస్కే.రెడ్డెప్ప, మైనారిటీ నాయకులు ఇస్మాయిల్, పౌరహక్కుల సంఘం నాగేశ్వరరావు, బహుజనసేన జయశంకర్ పాల్గొన్నారు. -
వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ వారు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. నేడు తెల్లవారుజామున 1:35 నిమిషాల నుంచి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ రామాలయ అంకనాలలో నుంచి ఉత్తర ద్వారం వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలలతో అందంగా అలంకరించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. మంగళవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రామాలయం తూర్పు వైపు ఉన్న అన్నప్రసాద కేంద్రం పక్కనే అన్నప్రసాదాలను భక్తులకు వడ్డిస్తారు. సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటుచేసినట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు తెలిపారు. శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో.. నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామి వారికి లక్ష తులసి అర్చన, ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. -
జిల్లా పాత స్వరూపం
రాయచోటి రాజంపేట, రైల్వేకోడూరు మదనపల్లె తంబళ్లపల్లె పీలేరు మదనపల్లె : అన్నమయ్యజిల్లాను మూడుజిల్లాల్లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం వెనుక టీడీపీకి అనుకూలమైన పరిస్థితులు సృష్టించుకోవడం కోసమే చివరి అస్త్రం రాజకీయ విభజన అంశం ప్రయోగించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒక జిల్లా ఏర్పాటై మనుగడలోకి వచ్చాక ఆ జిల్లా ఉనికినే లేకుండా చేయడం వెనుక రాజకీయ కారణాలే కీలకంగా మారినట్టు చర్చ మొదలైంది. దీనికి గత, ప్రస్తుత రాజకీయ అంశాలు ప్రస్తాపనకు వస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో టీడీపీకి రాజకీయంగా అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఎలాగైనా పట్టు నిలుపుకొవాలన్న ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగుతున్నాయి. ప్రత్యర్థి వైఎస్సార్సీపీని ఎదుర్కునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా, ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలన్న ప్రయత్నాలు సాధ్యపడలేదు. దీనికితోడు అధికారంలోకి ఉన్నా టీడీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో భౌగోళికంగా అన్నమయ్యజిల్లా స్వరూపం మొదట మార్చినా ఇప్పుడు జిల్లానే లేకుండా పోతోంది. టీడీపీకి అభ్యర్థులెవరు? కూటమిగా ఎన్నికల్లో పోటీచేసి రాయచోటి, మదనపల్లె, కోడూరు, పీలేరుల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. తంబళ్లపల్లె, రాజంపేటలో ఓటమి మిగిలింది. ప్రస్తుత పరిస్థితికి వస్తే..వచ్చే ఎన్నికల్లో కోడూరులో కూటమి తరపున పోటీ చేసే బలమైన అభ్యర్థి కరువు. గత ఎన్నికల, వచ్చే ఎన్నికల పరిస్థితి వేరు కాబట్టి వైఎస్సార్సీపీకి ఉన్న బలమైన క్యాడర్, అభ్యర్థి టీడీపీ లేదా కూటమికి లేదు. రాయచోటిలో గత ఎన్నికల్లో 2,495 స్వల్ప తేడాతో వైఎస్సార్సీపీ ఓడింది కాని, టీడీపీకి ఘనమైన విజయం కాదు. తాజా పరిస్థితుల మేరకు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి అఖండ విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ టీడీపీ తరపున ఎవరు బరిలో ఉన్నా ఓటమి తప్పదని పరిశీలకులు చెబుతున్నారు. ఇక తంబళ్లపల్లెలో టీడీపీకి నకిలీమద్యం తయారీ మరకతో తలెత్తుకుని ప్రజల్లోకి వెళ్లలేకపోతోంది. ఇన్చార్జి జయచంద్రారెడ్డిపై నకిలీమద్యం కేసు నమోదై, పార్టీనుంచి సస్పెన్షన్ కావడంతో నాయకత్వ లోపంతో ఉంది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే శంకర్కు టికెట్ కాదనడంతో ఆయన తంబళ్లపల్లెకు, పార్టీకి దూరమయ్యారు. ఇక్కడ టీడీపీకి అభ్యర్థి కోసం వెతుకులాట తప్పదు. మదనపల్లెలో వైఎస్సార్సీపీ కేవలం నాలుగు వేల పైచిలుకు ఓట్లతో ఓడింది. దీనికి కారణాలేమైనా ఇప్పుడు టీడీపీ పరిస్థితి గందరగోళంలో పడింది. వచ్చే ఎన్నికలకు కొత్త అభ్యర్థి బరిలో ఉంటారన్న ప్రచారం ఉంది. స్థానిక ఎమ్మెల్యేకు అధిష్టానంతో దూరం పెరిగిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయనకు తిరిగి అభ్యర్థిత్వంపై అనుమానాలు ఉన్నప్పటికి మదనపల్లెలో టీడీపీ మళ్లీ గెలవడం కష్టమే. అందుకనే పఠాన్ ఖాదర్ఖాన్కు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ప్రత్యామ్నాయ నేతగా ప్రోత్సహిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు అంటున్నారు. పీలేరులో టీడీపీ ఎమ్మెల్యేదే నాయకత్వం. అయితే పార్టీ నిర్ణయాలపైనా, మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అనుకూల వాతావరణం, గెలుపు అవకాశాలు అంత సులువుకాదని పరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకోడవమే కాక బలమైన నాయకత్వం ఉంది. మంత్రి ప్రాధాన్యత తగ్గుతుందా రాయచోటి నియోజకవర్గం కొత్త మదనపల్లె జిల్లాలోకి విలీనం, జిల్లా కేంద్రాన్ని రాయచోటినుంచి మదనపల్లెకు మార్చడం ద్వారా మంత్రి రాంప్రసాద్రెడ్డి ప్రాధాన్యతను తగ్గించాలన్న చర్యగా పార్టీ వర్గాలు చర్చించుకొంటున్నాయి. టీడీపీ కొత్త పార్లమెంట్ అధ్యక్షుడు ప్రసాద్ నియామకంలో అధిష్టానం మంత్రి అభిప్రాయం తీసుకోలేదని చెబుతున్నారు. మదనపల్లె జిల్లా ప్రకటన వెలువడిన తర్వాత పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్రెడ్డి చంద్రబాబును కలిసి ధన్యావాదాలు చెప్పగా ఇకపై జిల్లా వ్యవహారాలు, పాలనాపరమైన అంశాలను చూసుకోవాలని చెప్పినట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. దీన్నిబట్టి చూస్తే మంత్రికి కొత్తజిల్లాలో ప్రాధాన్యత తగ్గే పరిస్థితి ఉందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పెద్దిరెడ్డి ధాటికి తట్టుకోలేక రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఎన్నిపాట్లు పడినా సాధ్యం కావడం లేదు. 1984, 1999లో రెండుసార్లు తప్ప టీడీపీ ఎంపీ పదవిని గెలుచుకోలేకపోయింది. రాజకీయ సమీకరణలను మార్చేస్తూ 2014లో ఎంపీ పదవికి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన పీవీ మిథున్రెడ్డి హ్యట్రిక్ విజయం సాధించారు. మిథున్రెడ్డిని ఓడించాలని చేయని ప్రయత్నం లేదు, చివరకు మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డిని పోటిచేయించి ఓడించాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ, వైఎస్సార్సీపీ బలానికి దీటుగా టీడీపీ నిలవలేకపోతుంది. దీంతో ఎంపీగా ఎవరు పోటిచేసినా గెలిచే అవకాశాలు లేకపోవడం, పోటి ఇచ్చే అభ్యర్థి దొరకని పరిస్థితుల్లో ప్రతి ఎన్నికలోనూ టీడీపీకి కొత్త అభ్యర్థులే కావడం దీనికి నిదర్శనం. కొత్త స్వరూపం ఉనికి కోసమే రాజకీయ విభజన రాజంపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీకి నిరాశజనక పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో పోటీ ఇచ్చే అభ్యర్థులెవరు? రాయచోటిలో గెలవలేమనే మదనపల్లెలో విలీనం మంత్రి రాంప్రసాద్ ప్రాధాన్యతకు చెక్ -
రాజకీయ కుట్ర లేకుండా అభివృద్ధి చేయాలి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని ఉంటే కడపజిల్లా, లేకుంటే తిరుపతి బాలాజీ జిల్లాలో కలపాలని రాజంపేట, రాయచోటి ఎమ్మెల్యేలతో కలిసి 2023 లోనే తెలియజేశానని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పద్ధతి ప్రకారం జిల్లాలు ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం హామీలు ఇచ్చి చిచ్చు పెట్టారని అన్నారు. బలమైన ప్రతి పక్షం గొంతెత్తడంతో ఏమీ చేయలేక కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు తిరుపతిలో కలపడం స్వాగతించదగ్గ విషయమని తెలిపారు. కానీ రాజకీయ కుట్రలకు అనుగుణంగా విభన చేయడమేకాక అభివృధిలో నిర్లక్ష్యం చేస్తే సహించమని తెలిపారు. అన్ని రంగాల్లో రైల్వేకోడూరుకు తిరుపతి జిల్లాలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
వెలగచర్లలో కూటమి నాయకుల భూకబ్జా
పెనగలూరు : పెనగలూరు మండలం, కొండూరు పంచాయతీ వెలగచర్ల రెవెన్యూ పొలంలో ఆదివారం ప్రభుత్వ భూమిని (ఏడబ్ల్యూ) కూటమి నాయకులు కబ్జా చేసినట్లు గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ అమరేశ్వరికి వినతిపత్రం సమర్పించారు. వెలగచర్ల రెవెన్యూ పొలంలో సర్వే నంబర్లు 676, 871, 880, 883, 874లతోపాటు మరికొన్ని సర్వే నంబర్లతో కలిపి ప్రభుత్వ భూమి దాదాపు 102 ఎకరాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ భూమిని దాదాపు 12 సంవత్సరాలుగా గ్రామ ప్రజలు కలిసికట్టుగా కబ్జా కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ భూమిపై జేసీ కోర్టులో కూడా పెండింగ్లో ఉన్నట్లు వారు వివరించారు. అయినప్పటికీ ఈనె 28వ తేదీన ఆదివారం సెలవు కావడంతో కూటమి నాయకులు జేసీబీ, డోజర్లు పెట్టి పట్టపగలే ప్రభుత్వ భూమిని చదును చేశారని వారు తెలిపారు. రెవెన్యూ అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఒక్కరోజే 30 ఎకరాలకుపైగా భూమిని జేసీబీతో చదును చేశారన్నారు. కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ చదును చేసిన భూమిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు -
మాజీ సైనికుడి భూ ఆక్రమణకు యత్నం
మదనపల్లె : మాజీ సైనికుడినైన తన భూమిని రియల్టర్లు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తూ దాడి చేసి బెదిరిస్తున్నారని బాధితుడు లక్ష్మిప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక అనిబిసెంట్ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీలేరు మండలం బోడుమల్లవారిపళ్లెలో తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన 1.17 ఎకరాల భూమిని పక్కనే ఉన్న రియల్టర్లు ఆక్రమించే ప్రయత్నం చేయగా అడ్డుకోబోయిన తమపై దాడిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా న్యాయం చేయాలని కోరారు. మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ లక్ష్మిప్రసాద్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితులపై చర్యలు తీసుకుని నాయ్యం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. సమావేశంలో మాజీ సైనికులు రెడ్డెప్పరెడ్డి, దామోదర్రెడ్డి, జనార్దన్, సుబ్బరాయుడు, లక్ష్మిపతి, హరినాథ్రెడ్డి పాల్గొన్నారు. -
యువకుడిపై హత్యాయత్నం కేసులో ఇరువురి అరెస్టు
కడప అర్బన్ : మద్యం మత్తులో పవన్ అనే యువకుడిపై పిడిబాకుతో దాడి చేసిన కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కడప టూ టౌన్ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదరావు తెలిపారు. సోమవారం కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్న్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 25న శంకరాపురం నివాసి నల్లిపోగు పవన్ క్రిస్మస్ పండుగ సందర్భంగా తన అమ్మమ్మ దండు వీరమ్మ నివాసమైన మాసాపేటకు వచ్చాడు. అదే రోజు మధ్యాహ్నం దొరలగోరీల వద్ద మద్యం తాగుతున్న మున్నంగి హర్ష అలియాస్ హర్షవర్దన్, గజ్జల కీర్తన్, గజ్జల ఏసుబాబుల వద్దకు పవన్ వెళ్లాడు. అందరూ కలిసి మొదట మద్యం తాగారు. పవన్కు హర్షవర్దన్కు మధ్య మనస్పర్థలు ఉండేవి. గతంలో తనపై కేసులు ఉన్నాయంటూ గంజాయి అమ్ముతున్నట్లు ప్రచారం చేసి అల్లరి పాలు చేశావంటూ హర్షవర్దన్ పవన్ను దూషించాడు. దీంతో పవన్ అక్కడి నుంచి నిర్మల కాన్వెంట్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వెనుక నుంచి ముగ్గురు పవన్ను వెంబడించి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో మున్నంగి హర్ష అలియాస్ హర్షవర్దన్ పిడిబాకుతో పవన్పై దాడికి యత్నించగా, తప్పించుకునే క్రమంలో పవన్ తలపై తీవ్ర రక్తగాయమైంది. అదే సమయంలో గజ్జల కీర్తన్, గజ్జల ఏసుబాబులు పవన్న్ను కింద పడేసి కొట్టారు. పవన్ కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని అతని మేనమామ దండు పెంచలయ్య 108 అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మున్నంగి హర్ష అలియాస్ హర్షవర్దన్, గజ్జల కీర్తన్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన పిడిబాకును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు గజ్జల ఏసుబాబు పరారీలో ఉన్నాడని తెలిపారు. గొడవల జోలికి వెళితే తాట తీస్తాం శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా.. గొడవలకు వెళ్లినా చూస్తూ ఊరుకోమని వారి తాటతీస్తామని టూటౌన్ సీఐ ప్రసాద్ రావు హెచ్చరించారు. యువకునిపై దాడి చేసిన కేసుకు సంబంధించి ఇరువురు నిందితులను సోమవారం సాయంత్రం మాసాపేట సర్కిల్ నుంచి కృష్ణా సర్కిల్ వరకు పోలీసులు నడిపించారు. -
‘క్యాబినెట్లో వ్యతిరేకించకుండా ఇలా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి?’
రాయచోటి: రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి. చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటు పొడవడమేని, అది మరోసారి రుజువైందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు అంశం కూటమి కక్షలో భాగమేనన్నారు. క్యాబినెట్లో వ్యతిరేకించకుండా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి? అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై మండిపడ్డారు శ్రీకాంత్రెడ్డి. జిల్లా కేంద్రం కోసం,జిల్లా కోసం పోరాటాలు కొనసాగిస్తామని, రేపు(మంగళవారం) రాయచోటిలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు శ్రీకాంత్రెడ్డి. కాగా, రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు సీఎం చంద్రబాబు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.రాయచోటి జిల్లా కేంద్రం రద్దు అంశానికి సంబంధించి ఏపీ కేబినెట్లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు. -
బాబు మరో మోసం.. రాయచోటి ప్రజలకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.కాగా, ఏపీ కేబినెట్లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు. -
పందెం కో ‘ఢీ’!
● కోడిపందేలకు సిద్ధమవుతున్న నిర్వాహకులు ● సంప్రదాయమంటున్న ప్రజలు ● చర్యలు తప్పవంటున్న పోలీసులురాయచోటి జగదాంబసెంటర్ : తెలుగు వారి పెద్దపండుగ సంక్రాంతి.. పండుగ దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో సందడి నెలకొంది. సంబరాల వేళ భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగు రంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల సందడితో పాటు సంప్రదాయం పేరుతో కోడిపందాలు ఎక్కువగా నిర్వహిస్తారు. ఈ కోడిపందేలకు పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. పందాలకు అవసరమైన పందెం కోడిపుంజులకు గత 3, 4 నెలల నుంచి తర్ఫీదు ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్చరిక ప్రకటనలు, కోడిపందేల స్థావరాలపై దాడులు, కేసులు నమోదు కొనసాగుతున్నాయి. పందెం కోడిపుంజులకు డిమాండ్.. ఈ సంక్రాంతికి పందెం కోడిపుంజులకు మంచి గిరాకీ ఉంది. జాతి రకాన్ని, రంగును బట్టి రూ.5 వేలు నుంచి రూ.1 లక్ష వరకు ధర పలుకుతుంది. పందెం కోడి పుంజులకు రారాజుగా చెప్పుకునే నల్ల చెవళకు రూ.5 వేల నుంచి రూ.75 వేల వరకూ డిమాండ్ ఉంది. కక్కీరా, కల్లికల నెమలి, కాకి నెమలి, ఎర్ర నెమలి, కాకి డేగ, పచ్చకాకి డేగ, డేగ, పండు డేగ, కాకి, పంగళి చవళతో పాటు పలు రకాలు ఉన్నాయి. వీటి డిమాండ్ను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. కోస మాంసానికీ గిరాకీ.. ఏటా కోస మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. నాలుగైదేళ్ల క్రితం 3 కిలోల కోస మాంసం రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉండేది. కోస మాంసం రుచి చూసినవారు వాటి కోసం ఎగబడతారు. అదే సమయంలో పందెంరాయుళ్లు అధికారులకు, అనధికారులకు, అభిమానులకు, బంధువులకు కోస మాంసాన్ని ఇవ్వడంతో మరింత డిమాండ్ పెరిగింది. గతేడాది ఒక్కో కోసను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు విక్రయించారు. ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు, కోస మాంసం ప్రియులు పేర్కొన్నారు. పందెం కోడికి.. కాస్ట్లీ ఫుడ్ రాజంపేట టౌన్ : సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదల గురించి అందరికి తెలిసిందే. అయితే పందెం కోళ్లకు పెట్టే ఆహారం, వాటి పట్ల తీసుకునే జాగ్రత్తల గురించి తెలిస్తే ఎవరికై నా ఆశ్చర్యం కలగక తప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే పందెం రాయుళ్లు పందెంకోళ్ల ఆహారం, వాటి ఆరోగ్యం పట్ల వెయ్యి కళ్లతో పర్యవేక్షిస్తూ చంటిబిడ్డలా చూసుకుంటున్నారు. పందెంరాయుళ్లు వేళకు భోజనం తినక పోయినా పందెం కోళ్లకు మాత్రం ఏ సమయానికి ఏ ఆహారం ఇవ్వాలి, ఎలాంటి వ్యాయామం చేయించాలో అన్నింటిని క్రమం తప్పకుండా చేస్తున్నారు. సంక్రాంతి దగ్గర పడుతుండటంతో పందెం కోళ్ల పట్ల మరింత శ్రద్ధ చూపుతున్నారు. నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పందెం కోళ్ల బాగోగులను అనుక్షణం చూసుకుంటున్నారంటే అతిశయోక్తి అనిపించక తప్పదు. పందెకోళ్లకు ఇస్తున్న ఆహారం, వాటి పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను కొత్తగా చూసే వారికి ‘పందెం కోడా.. మజాకా’ అనిపిస్తోంది. అన్నీ పోషక ఆహారాలే.. పందెం రాయుళ్లు పందెం కోళ్లకు నిత్యం పోషక ఆహారాలను అందిస్తున్నారు. ఇందుకు కొంత మంది రోజుకు ఐదు వందల రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. పోషక ఆహారాలైన నాటుకోడి గుడ్లు, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, రాగులు, సద్దలు, తెల్లజొన్నలు వంటివి ఉదయం నుంచి సాయంత్రం వరకు విడతలవారీగా తినిపిస్తున్నారు. పందేనికి మూడు రోజుల ముందు నుంచి అదనపు బలం కోసం బీ కాంప్లెక్స్ మాత్రలను కూడా తినిపించనున్నట్లు పందెం రాయుళ్లు చెబుతున్నారు. కొంత మంది నీళ్ల విషయంలోను శ్రద్ధ చూపుతున్నారు. కోళ్లకు మినరల్ నీటినే తాపిస్తున్నారు. పందెం కోళ్లను దగ్గరుండి చూసుకోలేని వారు రోజుకూలీ ఇచ్చి ప్రత్యేకంగా ఒకరిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రత్యేక కసరత్తు.. పందెం రాయుళ్లు పందెం కోళ్లపై ప్రత్యేకమైన కసరత్తే చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పందెం కోళ్లతో ఈత కొట్టిస్తున్నారు. ఈత కొట్టించే అవకాశం లేని వారు కోడిని నీళ్లల్లో ముంచుతున్నారు. అలాగే నోటిలో నీళ్లు పోసుకొని కోడి ముఖంపై ఆ నీటిని గట్టిగా ఊదుతున్నారు. ఇలా చేయడం వల్ల బరిలో అలసట లేకుండా ప్రత్యర్థి కోడిపై వేగంగా తమ కోడి పోరాడగలదని పందెంరాయుళ్లు చెబుతున్నారు. కోడి ఈకల్లో పేలు చేరకుండా గోరువెచ్చటి నీటిలో వేప ఆకులు వేసి స్నానం చేయిస్తారు.నిబంధనలు అతిక్రమిస్తే చర్యలే పోలీసుల చట్ట నిబంధనలను అతిక్రమించి సంక్రాంతి పండుగలో కోడిపందాలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పందాలు, జూదగాళ్లకు వ్యతిరేకంగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసుల నిఘా పెంచాం. సంక్రాంతిని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలి. నిబంధనలు అతిక్రమించి పందేలు వేస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడం. – చలపతి, అర్బన్ సీఐ, రాయచోటి -
రాయచోటిలో బంద్ ప్రశాంతం
● స్వచ్ఛందంగా దుకాణాలు మూత ● రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంచాలని ఉధృతమైన ఆందోళనలు రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచో టిని తొలగించి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలను దిక్కుకొకటి చొప్పున కలుపుతున్నారన్న వార్తల ప్రచారంపై రాయచోటిలో ఆందోళనలు ఉధృతమయ్యా యి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై రాయచోటిలో ఒక్కసారిగా నిరసనలు, ఆందోళన లు మిన్నంటాయి. రెండురోజులుగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన రాయచోటి బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి బంద్కు సంపూర్ణ మద్దత్తును ప్రకటించారు.ఉద్యోగులు, ప్రజా సంఘాలు పలు రాజకీయ పార్టీల నేతలు బంద్కు మద్దతుగా నిలిచారు. బంద్ ప్రభావంతో ఉదయం పది గంటల వరకు బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ రాయచోటిలోని శివాలయం చెక్ పోస్టు నుంచి చిత్తూరు జాతీయ రహదారి మీదుగా నేతాజీ సర్కిల్ వరకు సాగింది. అన్ని వర్గాల ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఆర్టీసీ బస్సులు తిరిగాయి. జిల్లా విభజన చేయాలన్న ఆలోచన కూటమి నేతల కుట్రలో భాగమేనని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు, ఉద్యోగ, ప్రజా సంఘాలతోపాటు కూటమి పార్టీలోని నేతలు సైతం ప్రకటనల ద్వారా బహిర్గతం అవుతున్నారు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆత్మహత్యలకై నా సిద్ధమని యువకులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. శనివారం సాయంత్రం ఇద్దరు యువకులు విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంపై ఆదోళనలను ఉధృతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా సాధన కమిటీ నాయకులు చెబుతున్నారు. పోలీసు బందోబస్తు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని రద్దు చేసి పక్క జిల్లాల్లోకి మార్పు చేస్తున్నారన్న వదంతులతో నెలకొన్న ఆందోళనలను అదుపు చేయడానికి పోలీసులు భారీ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ చలపతిల శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. -
ప్రజల మనోభావాలతో ఆడుకుంటారా
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మదనపల్లె : జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల మనోభావాలతో చెలగాటమాడితే జనం మిమ్మల్ని గంగలో కలుపుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆదివారం ఎస్టీయూ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమరనాథరెడ్డిలను రాజకీయంగా ఎదుర్కోలేక జిల్లాను మూడు ముక్కలుగా చేసి మూడు జిల్లాల్లో కలిపి చేస్తున్న ప్రయత్నాలను చేతకానితనంగా పేర్కొన్నారు. రాజకీయంగా వారిని చేతనైతే ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. రాజకీయ కక్షలకు ప్రజల మధ్య చంద్రబాబు విభేదాలు సష్టిస్తున్నారని విమర్శించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు జిల్లాలూ మారుస్తామంటే కుదరదన్నారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ ను చూసుకొని తనకు ఎదురులేదని చంద్రబాబు వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలోకి రాయచోటిని కలపవద్దని..రాజంపేట, కోడూరుతో జిల్లా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు కౌలు ఇవ్వలేరా అప్పులతో రాజధాని నిర్మిస్తున్న చంద్రబాబు సంపద సృష్టి ప్రగల్భాలు ఏమయ్యాయని ఈశ్వరయ్య ప్రశ్నించారు. వేలకోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు, అలాంటిది రాజధానికి భూములు ఇచ్చిన కౌలు రైతులకు,స్థలాల కోసం రూ.300 కోట్లు ఇవ్వలేరా అని నిలదీశారు. మదనపల్లెలో ఆదివారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ ఎప్పుడో అన్నారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తున్నారన్నారు. రాజధానిలో వర్షపు నీళ్లు తోడేందుకు రూ.450 కోట్లు ఖర్చుపెట్టినట్టు ప్రభుత్వమే చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. వైద్య కళాశాలలో ప్రైవేట్ కు అప్పగించి ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూలగొట్టడం ఖాయమన్నారు. -
అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తే చరిత్రహీనులవుతారు
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ విడదీయవద్దని , రద్దు చేయకూడదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, భావోద్వేగాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే వారెవరైనా చరిత్ర హీనులవుతారన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన అన్నమయ్య జిల్లాను మొదట విభజించి, ఇప్పుడు పూర్తిగా రద్దు చేయాలనే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమైన ఆలోచనగా ఆయన అభివర్ణించారు. 17 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి ఏ చిన్నపాటి మేలు చేయలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు సాధించుకున్న జిల్లాకే మంగళం పాడాలని చూడటం అన్యాయమని అన్నారు. 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన అన్నమయ్య జిల్లాను యథాతధంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయచోటి ప్రాంతానికి అభివృద్ధి జరిగిందంటే దివంగతం సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమేనని స్పష్టం చేశారు. కరోనా వంటి పరిస్థితుల్లోనూ జిల్లా కేంద్రం ఏర్పడిన అనతి కాలంలోనే రాయచోటి పట్టణం గణనీయంగా అభివృద్ధి చెందిందని, మూడో గ్రేడ్ మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘనతేనని గుర్తుచేశారు. రాయచోటిలో మంచి జరుగుతున్న దశలో రాజకీయ కక్షతో జిల్లా కేంద్రాన్ని లేకుండా చేయాలను కోవడం, జరిగిన మంచిని విచ్చిన్నం చేస్తుండటం ప్రజలను ఆవేదనకు గురిచేస్తోందన్నారు.బ్రిటీషర్ల పాలన నుంచి కూడా 1800లో ఏర్పడిన జల్లాలు ఎక్కడా రద్దు కాలేదని, అన్నమయ్య జిల్లాకు సంబంధించి చంద్ర బాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధకు గురి చే స్తోందన్నారు. జిల్లాల పునర్విభజనపై ఆదివారమే నిర్ణయం తీసుకోనున్న నేపఽథ్యంంలో మరోసారి ప్రశ్నిస్తున్నామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
తండ్రి కోసం.. కుమారుడి మృతదేహం ఎదురుచూపు
కురబలకోట : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆదివారం మృతి చెందిన కుమారుడి మృతదేహం సౌదీలోని తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న విషాదకర సంఘటన కురబలకోటలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు..మండల కేంద్రం కురబలకోటకు చెందిన కె. తన్వీర్ (24) మూడు రోజుల క్రితం మదనపల్లి నుండి బైక్లో స్వగ్రామానికి వస్తూ మార్గ మధ్యంలోని గౌనివారిపల్లి వద్ద ప్రమాద వశాత్తు డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి జిల్లా ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు. జీవనోపాధి కోసం సౌదీలో ఉన్న తండ్రి కె. రెడ్డిబాషా రాక కోసం మృత దేహాన్ని ఇంటి వద్ద ఉంచారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కన్నీరు మున్నీరవుతున్నారు. మా కుమార్తె ఆచూకీ తెలపండిప్రొద్దుటూరు కల్చరల్ : వారం రోజులుగా కనిపించకుండా పోయిన తమ కుమార్తె ఆచూకీ తెలపాలని సీతం పల్లెకు చెందిన కొల్లుబోయిన వీరప్రతాప్, వెంకటలక్షుమ్మ దంపతులు కోరారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ కుమార్తె ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటల తర్వాత కనిపించకపోవడంతో అంతా వెతికామన్నారు. తర్వాత రోజు ఉదయం చాపాడు మండలం రామదాసుపల్లెకు చెందిన రాకేష్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు తెలిసిందన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీని కలువగా మహిళా పోలీస్ స్టేషన్కు రెఫర్ చేశారన్నారు. వారం రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ కుమార్తె బతికుందో లేదో తెలియడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికై నా పోలీసులు తమ కుమార్తె ఆచూకీ కనుగొనాలని కోరారు. ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని యువకుడి మృతిరాజుపాళెం : మండలంలోని అయ్యవారిపల్లె–టంగుటూరు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వంగల నూర్ బాషా (25) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు, ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సు టంగుటూరు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీ కొనడంతో యువకుడు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన నూర్బాషాను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. గ్రామ పంచాయతీ విభజన యత్నాలపై ఆగ్రహం కలసపాడు : మండలంలోని మహానందిపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలకు తెలియకుండా, దండోరా వేయకుండా అధికారులు ఆదివారం గ్రామపంచాయతీ విభజనపై గ్రామసభ నిర్వహించారు. ఉం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా దండోరా వేయకుండా సెలవుదినమైనప్పటికీ పంచాయతీ విభజన ఎలా చేస్తారని ప్రజలు మండిపడుతున్నారు.కురబలకోటలో విషాదం -
ఆసుపత్రి వృత్తుల విలువను చాటిన కేజీబీవీ విద్యార్థి
కురబలకోట : జిల్లా కేంద్రం రాయచోటి సాయి శుభా కళ్యాణ మండపంలో శనివారం అర్థరాత్రి వరకు జరిగిన జిల్లా స్థాయి వృత్తి వికాస ప్రదర్శనలో కురబలకోట కేజీబీవీ విద్యార్థిని దీపికకు జిల్లా స్థాయిలో గుర్తింపు లభించింది. ఆసుపత్రిలో వివిధ వృత్తుల నిర్వహణపై ఆమె ప్రతిభావంతమైన ప్రదర్శనతో జిల్లాలోనే మొదటి బహుమతి సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఆసుపత్రి వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మాసిస్టులు, రేడియాలజీ టెక్నిషియన్లు, వార్డుబాయ్స్, రిసెప్షనిస్టులు, అంబులెన్స్ అత్యవసర సేవలు, భద్రతా సిబ్బంది, అటెండర్, పారిశుధ్య కార్మికులు వంటి విభిన్న వృత్తుల ప్రాధాన్యతను చక్కగా ప్రదర్శించారు. దీంతో న్యాయ నిర్ణేతలతోపాటు అతిథులు ఈమెకు ప్రథమ బహుమతి ప్రదానం చేసి సత్కరించారు. కబ్జాలను అడ్డుకోండిసాక్షి టాస్క్ఫోర్స్ : బొమ్మవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1107, 1109లో అగ్రవర్ణాల వారు దళితుల భూములను లాక్కుని కబ్జాలకు పాల్పడుతున్నారని, ఆ గ్రామ దళితులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు. క్షేత్రస్థాయిలో విచారించి అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులను దళితవాడ గ్రామస్తులు కోరుతున్నారు. దాదాపు నాలుగు ఎకరాల భూమిలో చదును చేసి బోరు కూడా వేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని న్యాయం చేయాలని దళితవాడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ముగ్గురు మండీ యజమానులకు నోటీసులు గుర్రంకొండ : ప్రభుత్వ నిబంధనలను పాటించని ముగ్గురు టమాటా మండీల యజమానులకు నోటీసులు జారీచేశామని వాల్మీకిపురం మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరి చంద్రమౌళి, వైస్ చైర్మన్ నౌషాద్ అలీ తెలిపారు. ఆదివారం స్థానిక మార్కెట్యార్డు ఉప కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మార్కెట్ కమిటీ నిబంధనల మేరకు మార్కెట్ యార్డుకు 8 కిలోమీటర్ల పరిధి వరకు ఎవరూ కూడా ప్రైవేట్ టమాటా మండీలను నిర్వహించకూడదన్నారు. అలా నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. మదనపల్లె మార్కెట్యార్డులో జాక్పాట్లను ఫూర్తిగా రద్దు చేశారన్నారు. ఇదే విధానాన్ని ఇక్కడి మండీల యజమానులు పాటించాలన్నారు. కమీషన్లు పదిశాతం బదులు నాలుగు శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. వచ్చేనెల నుంచి 25 కేజీల టమాటా క్రీట్ల స్థానంలో 15 కేజీల క్రీట్ల విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి సునీల్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులేమైనా యంత్రాలా!
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయులను యంత్రాలుగా భావిస్తూ, నిరంతరం బోధనేతర కార్యక్రమాలతో విద్యా బోధనకు దూరం చేస్తూ వేధింపులకు గురిచేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. కడప యూటీఎఫ్ భవన్లో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు విద్యాశక్తి పేరుతో వందరోజుల ప్రణాళిక రూపొందించి, పండుగలు, సెలవు దినాలలో పనిచేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు పరీక్ష నిర్వహించి, అదే రోజు సాయంత్రానికల్లా మార్కులు ఆన్లైన్లో నమోదు చేయాలని ఒత్తిడి చేయడం సరైనది కాదన్నారు. ముస్తాబు కార్యక్రమం పేరుతో ఉపాధ్యాయులపై మరింత ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయులకు తగినంత సమయం కేటాయించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే ప్రణాళిక రూపొందించాలి కానీ ముస్తాబు, బోధనేతర పనుల ద్వారా ఉపాధ్యాయుల బోధన సమయాన్ని హరించే విధంగా ప్రణాళికలు రూపొందించడం వెనుక ప్రభుత్వ విద్యా రంగాన్ని పతనావస్థకు తీసుకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు భావించవలసి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.నాగార్జున రెడ్డి, జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సి ల్ సభ్యులు, వివిధ విభాగాల కన్వీనర్లు పాల్గొన్నారు. -
ఆదుకునేవారు లేరు
గ్రామాల్లో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా వూరింది. వరుసగా పంటలు పండక నష్టపోతున్నా ఆదుకొనేవారు లేరు. ప్రభుత్వ సబ్సీడీ పథకాలు అందడంలేదు. ప్రతి ఏడాది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయం తప్పితే మరే పనిచేయలేకున్నాం. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడంలేదు. – రెడ్డిమోహన్, కౌలురైతు, గుర్రంకొండ. జిల్లాలో కౌలురైతులకు ఎలాంటి సాయం అందడం లేదు. ఏడాదిన్నర కాలంగా ఒక్కరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం రాలేదు. కనీసం సబ్సీడీపై ఎరువులు, విత్తనాలు కుడా ఇవ్వడం లేదు. బ్యాంకర్లు బ్యాంకులవైపు కౌలురైతులను రానివ్వడం లేదు. పంటనష్టపరిహారం అందలెదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – రమేశ్బాబు, జిల్లా కౌలురైతుల సంఘం కార్యదర్శి, టి.రాచ పల్లె నేను మూడు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని బొప్పాయి సాగు చేశాను. వైరస్లు, బొప్పాయిపై నల్లమచ్చలు ఏర్పడిన కారణంగా పంట దెబ్బతింది. ధరలు పూర్తిగా పడిపోయాయి. తోటలో కాయలను కిలో రూ.1 కి ఇస్తామన్నా వ్యాపారులు రాలేదు. పంటసాగుకు ఖర్చుచేసిన పెట్టుబడి కూడా రాలేదు. పంటనష్టపోయినా నాకు నష్టపరిహారం కూడాఅందలేదు. – వెంకటరమణారెడ్డి, కౌలురైతు, దిగువ బురుజుపల్లె -
మాజీ సర్పంచ్పై దాడి
మదనపల్లె రూరల్ : వైఎస్సార్సీపీ నాయకుడు, కోటవారిపల్లె మాజీ సర్పంచ్ సొక్కం రాజశేఖర్పై ఆదివారం కొందరు యువకులు దాడి చేశారు. సొక్కం రాజశేఖర్, కొత్తపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇంటి నుంచి మదనపల్లెకు కారులో వెళుతుండగా ఈశ్వరమ్మకాలనీ వద్ద గొడవ జరిగింది. మదనపల్లె–రామసముద్రం మార్గంలో ఈశ్వరమ్మకాలనీ వద్ద రహదారి పనులు జరుగుతున్నాయి. వాహనాల రాకపోకలన్నీ సింగిల్ వేలో సాగుతున్నాయి. ఈ క్రమంలో సొక్కం రాజశేఖర్ వెళుతున్న కారు, ఈశ్వరమ్మకాలనీకి చెందిన యువకులు వెళుతున్న కారు ఎదురెదురు పడ్డాయి. రోడ్డు నుంచి పక్కకు ఎవరు తొలగాలనే విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ సర్పంచ్ కారు రోడ్డు దిగాలంటూ యువకులు హంగామా చేయడంతో, ఆయన కారు నుంచి కిందకు దిగి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో వారు మూకుమ్మడిగా ఆయనపై దాడిచేశారు. జరిగిన ఘటనపై మాజీ సర్పంచ్ సొక్కం రాజశేఖర్, తాలూకా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చంద్రమోహన్కు ఫిర్యాదు చేశారు. కడపలో అగ్నిమాపక శాఖ క్రీడలు కడప అర్బన్ : కడప నగరంలో అగ్నిమాపకశాఖ అధికారుల పర్యవేక్షణలో ఆదివారం క్రీడలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు ఈనెల 30న గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు. అక్కడ ఎంపికై న వారిని రాజస్థాన్లో జరిగే నేషనల్ ఫైర్ సర్వీస్ గేమ్స్కు పంపనున్నారు. -
చంద్రబాబూ..వాల్మీకి,బోయల గోడు పట్టించుకోండి
మదనపల్లె రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు, వాల్మీకి, బోయల గోడు పట్టించుకోవాలని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి (వీఆర్ఎస్ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పొదల నరసింహులు కోరారు. గిరిజన రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టించి, ఆమోదం తెలిపేలా కేంద ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఇటీవల అసెంబ్లీలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, పార్లమెంట్లో ఎంపీ బైరెడ్డి శబరి, వాల్మీకి, బోయలకు ఎస్టీ రిజర్వేషన్పై చర్చించినప్పటికీ కొలిక్కి రాకపోవడం దారుణమన్నారు. 2017 డిసెంబర్ 2న అసెంబ్లీలో వాల్మీకి బోయలను గిరిజనులుగా గుర్తించాలని బిల్లును ఆమోదించడం అభినందనీయమన్నారు. అయితే ఆ బిల్లును పార్లమెంటుకు పంపినా నేటికీ పట్టించుకోకపోవడం తగదన్నారు. ఎస్టీ రిజర్వేషన్పై నాన్పుడు ధోరణిని ప్రదర్శిస్తే, వాల్మీకి బోయలు ఐక్యతతో పోరాటాలు, అసెంబ్లీ ముట్టడి, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాల ముట్టడితో ఉద్యమం ఉధృతం చేయాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో వీఆర్ఎస్ఎస్ నాయకులు బొగ్గిటి కృష్ణమూర్తి, వాల్మీకిపురం విష్ణు, ఉలసల మంజు, నరసింహులు, రెడ్డిశేఖర, శ్రీనాథ్, రవికుమార్, భానుప్రకాష్, జయచంద్ర, ప్రవీణ్, పురుషోత్తం, సందీప్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా సభ్యుల అరెస్టు
గుర్రంకొండ : గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదుకేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొన్న సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ కథనం మేరకు గుర్రంకొండ పట్టణ పరిసరాల్లో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయనే సమాచారం అందుకొన్న వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రబాబుల ఆధ్వర్యంలోని రెండు వేర్వేరు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం గ్రామానికి సమీపంలో గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలంలోని ఎల్లుట్ల పంచాయతీ పసలవాండ్లపల్లెకు చెందిన కనగాని వెంకటరమణ (40), స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గుటం సమీర్ (20), గుర్రంకొండ పట్టణం ఎస్ఎల్టీ వీధికి చెందిన షేక్ మహమ్మద్ సైఫ్ (19), తరిగొండ పంచాయతీ ఇరగన్నగారిపల్లెకు చెందిన అరుణ్కుమార్ (19)లతో పాటు ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముఠా సభ్యులపై కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకొన్న గంజాయి విలువ రూ. లక్ష వరకు ఉంటుందన్నారు. గంజాయి ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకోవడంలో మంచి ప్రతిభ కనబరిచిన వాల్మికిపురం సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ రవీంద్ర, హెడ్కానిస్టేబుల్ నాగరాజనాయక్లను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు. -
షూటింగ్బాల్ ఛాంిపియన్షిప్లో జిల్లాకు తృతీయ స్థానం
మదనపల్లె సిటీ : రాష్ట్ర సీనియర్ షూటింగ్బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా తృతీయ స్థానం దక్కించుకుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈనెల 25 నుంచి 26వ తేదీ వరకు జరిగిన రాష్ట స్థాయి పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంది. మహిళల విభాగంలో 19 జట్లు పాల్గొన్నాయి, మూడో స్థానం కోసం జరిగిన పోటీలో అన్నమయ్య జిల్లా జట్టు కాకినాడ జట్టు తలపడ్డాయి. 21–15 స్కోరుతో మూడవ స్థానం దక్కించుకున్నట్లు షూటింగ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. పురుషుల జట్టు కూడా సెమీఫైనల్స్ చేరుకుని కృష్ణ, పల్నాడు జిల్లాల జట్లుతో ఆడి నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. క్రీడాకారులను జట్టు కోచ్ యూసఫ్, మేనేజర్ సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్బాబు, సభ్యులు రెడ్డి శ్రీనివాస్, భారతి, సురేష్ తదితరులు అభినందించారు. -
ఆర్ఎస్ఎస్, బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం
మదనపల్లె : దేశ అత్యున్నత రాజ్యాంగానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వల్ల ప్రమాదం ఏర్పడిందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మదనపల్లిలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు హాజరైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చెర్మన్ డాక్టర్ కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడారు. దేశ సంపదను కార్పొరేట్ ముసుగు వేసుకున్న దోపిడిదారులకు అప్పగిస్తున్నారని, సహజ వనరులు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే అన్నారు. ప్రకృతి సంపదను అదానీకి దోచి పెట్టడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. కొంతమంది వంద సంవత్సరాల కాలంలో కమ్యునిస్టు పార్టీ ఏమి చేసిందని అంటున్నారని, ఈ దేశంలో ప్రజల హక్కులు అడిగే ధైర్యాన్ని ఇచ్చింది, ప్రజలకు పోరాట పాఠాలు నేర్పింది కమ్యునిస్టు పార్టీయే అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం సీపీఐ నేతలు ఎన్నో నిర్బంధాలు, కుట్ర కేసులు ఎదుర్కొన్నారని, ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని వివరించారు. మోడీ ప్రభుత్వం ప్రజల ఆహారపు అలవాట్ల పైన, ధరించే దుస్తులపైన ఆంక్షలు విధిస్తూ, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతోందన్నారు. హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద అనే అంశాలను తొలగించే ప్రయత్నం చేస్తోందని, రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అర్ఎస్ఎస్, బీజేపీ నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకిక ప్రజాస్వామిక వాదులపైన ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి.మహేష్, సహాయ కార్యదర్శి టి. కృష్ణప్ప పాల్గొన్నారు. ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లని ముద్ర వేస్తారా సహజ సంపదను కొల్లగొట్టడానికే ఆపరేషన్ కగార్ మదనపల్లె సదస్సులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సిపిఐ సెంట్రల్ కంట్రోల్ కమీషన్ చెర్మన్ నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య -
అన్నమయ్యకు అన్యాయం చేయొద్దు
రాజంపేట : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల ఖ్యాతిని నలుదిశలా ఇనుమడింప చేసేలా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లాకు అన్నమయ్య నామకరణం చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నమయ్య పేరు లేకుండా చేసేందుకు జరుగుతున్న ప్రతిపాదనలపై రాజంపేట ప్రాంతీయుల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద.. ఆదివారం సాయంత్రం 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద అన్నమయ్యకు అన్యాయం చేయవద్దంటూ చేసిన నినాదాలతో మార్మోగిపోయింది. రాజంపేట జిల్లా సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఉద్యమకారులు వినూత్న నిరసన తెలిపారు. అన్నమయ్య చరిత్ర కనుమరుగుచేయకండి.. రాజంపేట పార్లమెంటరీ కేంద్రంతో పుట్టిందని, సాగునీరు, తాగునీరు పుష్కలంగా ఉందని న్యాయవాదుల జేఏసీ నేత కొండూరు శరత్కుమార్రాజు అన్నారు. ఆదివారం అన్నమయ్య ఉద్యానవనంలో మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య పేరును తీసేయాలని ఆలోచన నిజమైతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. అధికారుల మాటలను పక్కనపెట్టి, అన్నమయ్య సెంటిమెంట్ను గౌరవించి, పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు పూలభాస్కర్, ప్రభాకర్నాయుడు, సికిందర్, నందకిషోర్గౌడ్, చల్లా సుధాకర్, రెడ్డయ్య, గుత్తా లతచౌదరి, కేఎంఎల్ నరసింహులు, కొండూరు విశ్వనాథరాజు, శివరామరాజు, జీవీసుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని.. అన్నమయ్య పేరు లేకుండానే చేస్తున్నారంటూ ఉద్యమకారులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తంచేశారు. మోకాళ్లపై కూర్చుని వేడుకున్నారు.అన్నమయ్య విగ్రహం వద్ద వినూత్న నిరసన -
వెలవెలబోతున్న పట్టుగూళ్ల మార్కెట్
మదనపల్లె సిటీ : మదనపల్లె పట్టుగూళ్ల మార్కెట్ వెలవెలబోతోంది. రాయలసీమలోనే రెండో అతి పెద్ద మార్కెట్. రీలర్లు, పట్టురైతులతో నిత్యం కళకళలాడేది. ప్రస్తుతం చలి ఎక్కువ కావడంతో పాటు మంచు కురుస్తుండటంతో మార్కెట్కు పట్టుగూళ్లు రావడం లేదు. దీంతో మార్కెట్ బోసిపోతోంది. మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు మదనపల్లె సిటీ : తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు తిరుగుతాయని తెలిపారు. వైకుంఠద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి సీతారామలక్ష్మణులను దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చంటిపిల్ల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, టీటీడీ ఆలయ సివిల్ విభాగం ఏఈ అమర్నాథ్రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి వివరించారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రాయచోటి : ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 29వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరగుతుందని తెలిపారు. గంగమ్మకు బోనాలు లక్కిరెడ్డిపల్లి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది.అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చారు.ఆలయ పూజారులు చెల్లు వంశీయులు వీరికి దర్శనాన్ని కల్పించారు. గంగమ్మా..కాపాడామ్మ అని భక్తులు వేడుకున్నారు.కొందరు భక్తులు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ మదనపల్లె రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం 29వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ శివశంకర్ లోతేటి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబర్ 8977716661కు కాల్చేసి సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రెడ్డెమ్మా..చల్లంగా చూడమ్మా
గుర్రంకొండ : రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం విశేషం. -
విద్యాలయానికి గర్వకారణం
శివానికి రాష్ట్రీయ బాల్ పురస్కార్ రావడం విద్యాలయానికి గర్వకారణం. జావెలిన్త్రో, పరుగుపందెంలో పారా అథ్లెటిక్స్లో అనేక పతకాలు పొందింది. ఇందుకు విద్యాలయంలోన ఫిజికల్ డైరెక్టర్, అధ్యాపకులు సహకరించారు. – ఎం.గీత, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, మదనపల్లె. అత్యుత్తమైన బాల పురస్కార్ రావడం మరింత బాధ్యత పెంచింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మరుపురాని సంఘటన. ప్రధాని మోదీ ప్రశంసించడం మరిచిపోలేను. నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పీడీలు సహకారం మరలేనిది. – యు.శివానీ, అవార్డు గ్రహీత. నవోదయ విద్యాలయ,మదనపల్లె. -
చలికి వణికి.. ప్రాణం విడిచి
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ వృద్ధురాలు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి ఆవరణలో ఆరుబయట పడుకుని చలికి తాళలేక మృత్యువాత పడిన ఘటన శనివారం జరిగింది. తంబళ్లపల్లె మండలం బలకవారిపల్లెకు చెందిన వెంకటప్ప భార్య మల్లమ్మ(75)కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స కోసం శుక్రవారం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చింది. లోనికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు శరీరం సహకరించకపోవడంతో ఓపీ బ్లాక్ సమీపంలో ఆరుబయట పడుకుంది. గమనించిన కొందరు వృద్ధురాలిని అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. చేతికి క్యాన్లా అమర్చి సూదిమందు వేశారు. చికిత్స అనంతరం ఆమె ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉండిపోయింది. రాత్రిపూట ఆస్పత్రిలో అడ్మిట్ రోగులను తప్ప మిగిలిన వారిని బయటకు పంపేయడంతో వృద్ధురాలు ఓపీ బ్లాక్ బయట స్లాబ్ కింద పడుకుంది. అయితే, రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి చలిగాలులు, మంచు అధికం కావడంతో అనారోగ్యంతో బాధపడుతున్న మల్లమ్మ, తట్టుకోలేక వణుకుతూ ప్రాణాలు విడిచింది. చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలు ఓపీ బ్లాక్ ఎదుట ఆరుబయట అందరికీ కనిపించే విధంగా పడుకుంటే, రాత్రిపూట విధుల్లో ఉన్న ఆస్పత్రి సిబ్బంది గమనించకపోవడం దారుణం. శనివారం ఉదయం వృద్ధురాలిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన అత్యవసర విభాగంలోకి తీసుకువెళ్లి డాక్టర్లతో పరీక్షలు చేయించగా, చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పట్టణంలోని బీకే.పల్లెలో నివాసం ఉంటున్న కుమార్తె మల్లీశ్వరి అంత్యక్రియల కోసం తల్లి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లింది. సెక్యూరిటీ, ఆస్పత్రి సిబ్బంది రాత్రిపూట ఓ వృద్ధురాలు ఆరుబయట పడుకున్నా గమనించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో వచ్చిన ఒకటి అరా కేసులను నిర్లక్ష్యంగా వదిలేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా సూపరింటెండెంట్, ఆర్ఎంఓ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
రైల్వే చార్జీల పెంపుతో ప్రయాణికులకు షాక్!
అన్నమయ్య జిల్లా: ఉమ్మడి కడప జిల్లామీదుగా వెళ్లే ప్రధాన రైలుమార్గాల్లో నడిచే రైళ్లలో ప్రయాణం భారం కానుంది. కొత్త చార్జీలను రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే, ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వేవర్గాల సమాచారం. జిల్లాలో మూడు రైలుమార్గాలు ఉన్నాయి. ముంబై–చెన్నై ప్రధాన రైలుమార్గం ఉండగా, ఎర్రగుంట్ల–నంద్యాల, ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైలుమార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో అప్ అండ్ డౌన్ కలిసి 30కి పైగా రైళ్లు నడుస్తున్నాయి. 25 స్టేషన్లు ఉన్నాయి. ప్రధాన రైల్వే కేంద్రాలుగా కడప, నందలూరు, ఎర్రగుంట్ల కొనసాగుతున్నాయి. ఆర్డినరీ క్లాస్కు ఒక పైసా.. ఆర్డినరీ క్లాస్కు కిలోమీటర్కు ఒక పైసా పెంచారు. పైసా లేదు.. 99 పైసలు లేదు కాబట్టి రూపాయే పడుతుందని ప్రయాణికులు అంటున్నారు. కాగా లోకల్, స్వల్ప దూరప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణించేవారికి ఎలాంటి చార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువదూరం వెళితే, ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్కు 1పైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్ప్రెస్, ఏసీ, నాన్–ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసలు చొప్పున చార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ ట్రైన్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణపు టికెట్ల విషయంలో రైల్వేశాఖ కొత్త చార్జీలను పెంచిన తరుణంలో ప్రయాణీకుల్లో ఆందోళన మొదలైంది. ఈ చార్జీలు డిసెంబరు 26 నుంచి అమలులోకి వచ్చాయి. జనరల్ బోగీలేవి.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దే శ వ్యాప్తంగా అన్ని రైళ్ల ఫారి్మసిన్లో జనరల్ కోచ్లు తగ్గించేశారనే అపవాదు పేదవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు వాటి జాడ కనుక్కొనేందుకు ప్లాట్ఫాంపై ఊరుకులు, పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఒకొక్కసారి జనరల్ బోగీలోకి ఎక్కలేక స్లీపర్కోచ్లు ఎక్కి కొంతమంది టీసీల దురుసుతనంతో నెట్టివేతకు గురైన సంఘటనలు కొకొల్లలు. ఏసీ, స్లీపర్ కోచ్లే అధికం.. ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ, స్లీపర్ కోచ్లే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ ఏసీలో త్రీటైర్.. వివిధ శ్రేణుల కోచ్లు ఉంటాయి. ఫార్మసీన్లో ఒకటి లేదా రెండు ఉంటాయి. అవి కూడా కోచ్ పొజిషన్ బట్టి స్లీపర్, ఏసీ కోచ్ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. లేడీస్కోచ్ ఉంటుంది. అటువంటప్పుడు సాధారణ ప్రయాణికులు రైలెక్కలాంటే వెనుకంజవేసే పరిస్ధితులున్నాయి. -
రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి
సిద్దవటం : ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. సిద్దవటంలోని 30 పడకల ప్రభుత్వ వైద్యశాలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులకు ఎక్కువ శాతం పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రజలే వస్తుంటారన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి గర్భిణీ వైద్యశాలలోనే కాన్పు అయ్యేటట్లు చూడాలన్నారు. గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు రూ.40 వేలు విలువ చేసే ఇంజక్షన్ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు గోపాలస్వామి, కుప్పం సుబ్బారెడ్డి, వైద్యాధికారులు డాక్టర్ చిరంజీవిరెడ్డి, డాక్టర్ ప్రకాష్, వరప్రసాద్, జ్యోత్స్న, శివాని, మురళి, తేజ వినయ్, జడ్పీటీసీ ఉపాసి శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, యూత్ కన్వీనర్ కృష్ణచైతన్య, రాజంపేట నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కేవీ సుబ్బయ్య, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ నూర్ తదితరులు పాల్గొన్నారు.రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
రాయచోటి టౌన్ : విద్యార్థి దశలోనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని, ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డాక్టర్ ఎన్ అనూరాధ పేర్కొన్నారు. శనివారం స్థానిక సాయి శుభా కళ్యాణ మండపంలో జిల్లాస్థాయి వృత్తి వికాస ప్రదర్శన జరిగింది. జిల్లాలోని 30 మండలాలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు మండల స్థాయి విజేతలుగా ఈ కార్యక్రమానికి హాజరై తమ నమూనాలను (మోడల్స్) ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్ష్యసాధనకు కష్డపడాలని సూచించారు. వృత్తుల ఆధారంగా వేసిన వేషధారణ పోటీలు చూసిన ఆమె చిన్నారులను అభినందించారు. ఈ పోటీల్లో 150 మందికి పైగా తమ ప్రతిభను ప్రదర్శించారు. టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, అనంతరం గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు,బహుమతులు అందజేశారు. కేరీర్ మోడల్స్ విభాగంలో కురబలకోట కేజీబీవీకి చెందిన దీపిక మొదటి బహుమతి, కేవీపల్లె కేజీబీవీ విద్యార్థిని ఇందు ద్వితీయ, కెసిపల్లె, రామసముద్రం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి బాలాజీ రెడ్డి తృతీయ బహుమతి గెలుచుకున్నారు. వృత్తిపర వేఫధారణ పోటీల్లో రాయచోటి జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలకు చెందిన అప్సా మొదటి బహుమతి, కేవీపల్లె గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని తనుషా ద్వితీయ, గాలివీడు జెడ్పీహెచ్ఎస్ (ఉర్దూ) విద్యార్థి ఫైరోజ్ తృతీయ బహుమతి పొందారు. చిత్రలేఖనంలో తరిగొండ జెడ్పీహెచ్లో చదువుతున్న సీఎండీ సుఫియన్ ప్రథమ, అంగళ్లు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని యం. మానస ద్వితీయ, బురకాయలపేట జెడ్పీహెచ్ఎస్లో చదువుతున్న ఆర్ఫా తృతీయ బహుమతి గెలుచుకున్నారు. కార్యక్రమంలో సర్వశిక్ష సెక్టోరియల్ అధికారులు కరుణాకర్, జనార్ధన్, వెంకట రామయ్య, సుమతి, యశోద, చంద్రశేఖర్, భాస్కర్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కె. శ్రీనివాస రాజు, మహిళా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు మాధవి,శిరీష, సైన్స్ ఆఫీసర్ ఓబుల్రెడ్డి పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదనపల్లెకు రాక
మదనపల్లె రూరల్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.వి.ఎన్ భట్టి శనివారం రాత్రి మదనపల్లెకు విచ్చేశారు. ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన మదనపల్లెలోని సొసైటీ కాలనీలో ఉన్న స్వగృహానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక రెండో అదనపు జిల్లా జడ్జి పీవీఎస్ఎన్ సూర్యనారాయణమూర్తి, జూనియర్ సివిల్ జడ్జి సుబహాన్, డీఎస్పీ మహేంద్ర, తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి భట్టి 28వ తేదీ చిత్తూరు జిల్లా చౌడేపల్లి లోని మృత్యుంజయ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. 29వ తేదీ సోమవారం మదనపల్లె నుంచి బయలుదేరి, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వెళతారు అనంతరం 30వ తేదీ తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తారని అధికారక షెడ్యూల్ ప్రొగ్రాంలో పేర్కొన్నారు. -
ప్రాణం మీది.. భద్రత బాధ్యత మాది
● హెల్మెట్, సీటుబెల్టు ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి ● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిరాయచోటి : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా వాహనదారులు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని శనివారం జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచించారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ను, ఫోర్ వీలర్ నడిపేవారు సీటు బెల్టును భారంలా కాకుండా ప్రాణ రక్షణ కవచంలా భావించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించి మరణాలలో అధికశాతం తలకు తగిలి తీవ్ర గాయాల వల్ల లేదా సీటుబెల్టు ధరించకపోవడం వల్ల వాహనం నుంచి బయటపడటం వల్ల జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబం మొత్తాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుందన్నారు. జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు హెల్మెట్, సీటుబెల్టు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. వీలైన చోట్ల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించి ప్రయాణాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ కోరారు. -
31న పింఛన్ల పంపిణీ
రాయచోటి : పింఛన్ల పంపిణీ డిసెంబర్ 31వ తేదీన చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పింఛన్దారులు డిసెంబర్ 31వ తేదీన అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరికీ వారి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మిట్స్ ఒప్పందం కురబలకోట : చైన్నెకు చెందిన హ్యాకర్స్ ఇన్పోటెక్ సంస్థతో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ రామనాధన్ శనివారం తెలిపారు. విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎరువుల దుకాణాల తనిఖీ రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏఓ) శివనారాయణ శనివారం అకస్మిక తనిఖీ చేశారు. యూరియా నిల్వలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీ ధరలకే యూరియా అమ్మాలని సూచించారు. అలా కాకుండా ఎఫ్సీవో యాక్టును అతిక్రమించి అధిక ధరలకు అమ్మితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణ మూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతంతో రైతులకు ఆదాయం
రాయచోటి : రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం ద్వారా రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందని, ఇందు కోసం జిల్లా మండల స్థాయిల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి రైతులు, వ్యాపారులను అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. శనివారం రాయచోటిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, మార్కెటింగ్ సదుపాయాల కల్పనపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు సంఘాల వారు వ్యాపార ధోరణిలో వ్యవహరించి మార్కెట్ డిమాండ్ ఆధారిత పంటల వార్షిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా రైతు పంట దిగుబడుల వివరాలను వ్యాపారులు, ఎగుమతిదారులకు అందుబాటులో ఉంచి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా మెరుగైన ధరలు కల్పించాలని అధికారులకు తెలియజేశారు. జిల్లాలో పేరుగాంచిన మామిడి రకమైన వీరబల్లి బేనీషాకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నందున దానిని అవకాశంగా తీసుకొని ఎక్కువ భాగం ఎగుమతి చేయాలని తెలిపారు. వర్క్షాప్లో అధికారులు, రైతులు, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించారన్నారు. చర్చించిన విషయాలను గ్రామస్థాయికి తీసుకుపోయి మరింత మంది రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎఫ్పీఓలను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, కావున రైతులు సంఘటితమై అధిక సంఖ్యలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడాలని, తద్వారా తమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించుకోవాలని తెలిపారు. రైతులు పండించిన పంటలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్మడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చని తెలిపారు. జిల్లా ఉద్యాన అధికారిణి ఎస్ఎస్ సుభాషిణి మాట్లాడుతూ ఎఫ్పీఓలకు పంటకోత అనంతరం నష్టాలను తగ్గించడానికి ఉద్యాన శాఖ ద్వారా కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూంలు, ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్లు, శీతల గిడ్డంగులు, సోలార్ డ్రయర్లను 35 శాతం రాయితీతో ఇవ్వనున్నట్లు చెప్పారు.ఏపీఈడీఏ మేనేజర్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు మానస, పీరూసాబ్లు మామిడిలో పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు, ఉద్యాన పంటలను మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి జి.శివనారాయణ, డీఆర్డీఏ పీడీఎం నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ వై.లక్ష్మీప్రసన్న తదితరులు జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప మహిళలు జిల్లాను ప్రపంచ ఖ్యాతికి ఎక్కించారు. ఇటీవల మహిళల వన్డే ప్రపంచ కప్లో జిల్లాకు చెందిన శ్రీచరణి ప్రతిభ చాటింది. దేశానికి కప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమె బాటలోనే మరో విద్యార్థిని గుర్రాల హరిణి ముందుకు వెళుతోంది. ఇటీవల విజయవాడలో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్–17 ఎస్జీఎఫ్ క్రికెట్ పోటీల్లో సత్తాచాటింది. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన గుర్రాల హరి, అరుణ దంపతుల కుమార్తె హరిణి పదో తరగతి వరకు చెమ్ముమియ్యాపేటలోని గంగా భవాని బాలికల హైస్కూల్లో చదివింది. ఇంటర్మీడియట్ కడప నగరంలోని శ్రీహరి జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆల్ రౌండర్ అయిన గుర్రాల హరిణి ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి అండర్–17 ఎస్జీఎఫ్ క్రికెట్ పోటీల్లో కడప జట్టు తరుపున ఆడి సత్తా చాటింది. శ్రీకాకుళం జట్టుపైన 22 బంతులకు 57 పరుగులు చేసి 3 వికెట్లు తీసింది. అటు బ్యాటింగ్లోను, ఇటు ఫాస్ట్ బౌలింగ్లోను రాణిస్తూ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంది. జనవరిలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలో సత్తా చాటి టీమ్ ఇండియాలో చోటు దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కడపలో ‘శంబాల’ యూనిట్ సందడికడప కార్పొరేషన్ : కడప నగరంలో ‘శంబాల’ యూనిట్ సందడి చేసింది. ఆ సినిమా హీరో, హీరోయిన్లు ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, సినీనటుడు సాయికుమార్లు ఎస్ఆర్ థియేటర్కు వచ్చారు. వారికి రాక్స్టార్ ఆది యువసేన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్. యూనుస్ బాషా ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు థియేటర్ వద్ద అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం థియేటర్లో నిర్వహించిన మీట్లో వారు మాట్లాడుతూ కడపకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, కడప ప్రజలు చాలా మంచి వారని కొనియాడారు. ‘శంబాల’ సినిమా అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందని, అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ ఎస్ఎండీ షఫీ, బీజేపీ యువనాయకుడు పనతల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా మార్ట్లో చేతివాటం
వాల్మీకిపురం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఉపాధి కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మహిళా మార్టును ఏర్పాటు చేశారు. అయితే వాల్మీకిపురంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్లో వెలుగు కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో నష్టాల బాట పట్టి మూసివేతకు సిద్ధంగా ఉన్నట్లు పలు విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది చేతివాటం వల్లనే మార్టు నష్టాల బాట పట్టిందని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం వ్యాపారాలు జరగకపోవడంతో నష్టాలు వస్తున్నాయని చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై శనివారం మహిళా డీపీఎం వెంకటరమణ మార్టులో తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. విచారణ చేపట్టి, అక్రమాలు జరిగి ఉంటే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.27 లక్షలు మండలంలోని 900 మహిళా సంఘాల సభ్యుల నుంచి వసూలు చేసి మార్టును ఏర్పాటు చేశారని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చైన్ స్నాచర్ అరెస్టు కలికిరి : వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ కేసులో కర్నాటక రాష్ట్రం బెంగళూరు డీజే హళ్ళి ఏరియా మోదీ రోడ్డుకు చెందిన ఫైరోజ్ను కలికిరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... కలికిరి పట్టణం క్రాస్ రోడ్డు చదివేవాండ్లపల్లిలో వృద్ధురాలు అరుణకుమారి ఒంటరిగా ఉంటోంది. ఈమె పిల్లలు ఉద్యోగ రీత్యా హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంటున్నారు. ఒంటరిగా ఉన్న ఆమె మెడలో వేసుకున్న బంగారు చైనుపై పక్కింటిలో నివాసం ఉంటున్న అబ్దుల్లా కన్ను పడింది. బెంగళూరులో వుంటున్న తన స్నేహితుడు ఫైరోజ్ను ఈ నెల 6న కలికిరికి పిలిపించాడు. ఇల్లు బాడుగకు కావాలని వృద్ధురాలిని మాటల్లో దింపిన ఫైరోజ్ చాకచక్యంగా ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ పీవీ రమణ దర్యాప్తు చేపట్టారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, కలికిరి సీఐ రామచంద్ర సాంకేతికత సాయంతో నిందితుడు కర్నాటకు చెందిన ఫైరోజ్గా గుర్తించి అరెస్టు చేశారు. మరో నిందితుడైన కలికిరికి చెందిన అబ్దుల్లా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదు
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లాను లేకుండా చేసి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పలు అంశాలు తెలియజేశారు. మధ్యాహ్నం నుంచి వస్తున్న వార్తలు చూస్తే జిల్లాలోని నియోజకవర్గాలను ఇతర జిల్లాలలో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే మాట బాధాకరంగా ఉందన్నారు. 110 ఏళ్ల రాయలసీమ చరిత్రలో జిల్లా ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశామని, ఆ జల్లాను పూర్తిగా రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. శతాబ్దాల చరిత్రలో ఏర్పడిన జిల్లాను గతంతో ఎప్పుడు రద్దు చేయడం జరగలేదని ఆయన గుర్తు చేశారు. కరువు కాటకాలతో వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గత వైఎస్సార్సీపీ హయాంలో ఎన్నో కష్టాలు పడి జిల్లాను సాధించుకుంటే , రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్ ప్రాతిపదికన ఏర్పడిన అన్నమయ్య జిల్లాను లేకుండా చేస్తామంటే ఎన్ని పోరాటాలకై నా సిద్ధమేనని తెలియజేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ప్రాతిపదికన 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన అన్నమయ్య జిల్లాను యథాతదంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశికి పటిష్ట బందోబస్తు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు అన్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను శనివారం టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, విజిలెన్స్ సిబ్బందితో కలిసి ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు, సిద్దవటం ఎస్ఐ రఫీ పరిశీలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ..వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకునేందుకు పటిష్ట భద్రత కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టీటీడీ విజిలెన్స్ వారికి సూచించామన్నారు. ఇప్పటికే 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. దొంగ తనాలు నివారించేందుకు సివిల్ డ్రస్లో ఉన్న ప్రత్యేక క్రైమ్ పార్టీని ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసు కంట్రోల్ రూమ్ ఉంటుందన్నారు. డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో కలిపి దాదాపు 100 మంది బందోబస్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
పోలీసుల సాక్షిగా.. విధ్వంసం
కురబలకోట : మండలంలోని అంగళ్లు టెర్రకోట కళాకారుల ఇళ్లపై శుక్రవారం రాత్రి అమానుష దాడి జరగడం సంచలనంగా మారింది. అదీ హైవే పక్కనే మూకలు దాడికి తెగబడి రెండు ఇళ్లను ధ్వంసం చేసి ఇళ్లలోని సామగ్రి, బీరువాలను ఇతర వస్తువులను యథేచ్ఛగా బయట పడేయడం కలకలాన్ని సృష్టిస్తోంది. ఇదంతా పోలీసుల ఎదుటే జరగడం గమనార్హం. ఇందుకు సంబంధించి బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అంగళ్లులోని హైవే పక్కనున్న కొత్త మసీదు పక్కన కుంట స్థలంలో ఎం. లక్ష్మి, ఎం. పార్వతి ఇళ్లు ఉన్నాయి. వీరి ఇళ్లకు సమీపంలో ఉన్న భాస్కర్ రెడ్డి వద్ద మూడేళ్ల క్రితం వీరు రూ. 7 లక్షలు అప్పుతీసుకున్నారు. వీరు ఇళ్లపై ఆయకం రిజిస్టర్ చేయించారు. సకాలంలో డబ్బులు చెల్లించక పోవడంతో వారి ఇళ్లు రిజిస్ట్రేషన్ అయినట్లు భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. తాము రిజిస్ట్రేషన్ చేయలేదని దీంతో ఇళ్లు ఖాళీ చేయబోమని తేల్చి చెప్పారు. దీంతో ఇద్దరూ పరస్పరం కోర్టులో కేసులు నడుపుతున్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి వీరి ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించేందుకు పథకం వేశాడు. శుక్రవారం రాత్రి తనకు తెలిసిన వారితోపాటు మదనపల్లి, అనంతపురం నుంచి 30 మందికి పైగా కిరాయి మనుషులను రప్పించాడు. వీరంతా ఒక్కసారిగా గడ్డపారలు, కట్టర్లతో రెండు ఇళ్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇళ్లలోని పెద్దలు టెర్రకోట కుండలు, బొమ్మల అమ్మకానికి హైదరాబాదు ఎగ్జిబిషన్కు వెళ్లారు. ఇదే అదనుగా భాస్కర్ రెడ్డి ఇళ్లలోని పిల్లలను, బాలింత మమతను బయటకు ఈడ్చారు. ఇళ్లలోకి చొరబడి ధ్వంసం చేశారు. ఇళ్లలోని సామాన్లు బయట పడేశారు. ఇంటిపైన రేకులను ధ్వంసం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు వచ్చినప్పటికీ దుండగులను అడ్డుకోలేకపోయారు. పైగా చూస్తూ ఉండిపోయినట్లు టెర్రకోట కళాకారులు చెబుతున్నారు. దీన్ని బట్టి పోలీసుల అండతోనే ఈ సంఘటన జరిగినట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం దుండగులు తాపీగా వెళ్లిపోయారు. శనివారం ఉదయం బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, వేణురెడ్డి, పాపులమ్మ, నందిని తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా తాత్కాలికంగా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో పోలీసుల ప్రమేయం లేదన్నారు. సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి వెళ్లి ఇరు వర్గాలను అడ్డుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. టెర్రకోట కళాకారుల ఇళ్లపై రాత్రి వేళ మూకల దాడి పిల్లలను, బాలింతను బయటకు లాగి అరాచకం కుటుంబ పెద్దలు హైదరాబాదు ఎగ్జిబిషన్కు వెళ్లి ఉండగా ఘటన -
గంగమ్మ జాతర వేలం పాటలో రూ. 28,49,000 ఆదాయం
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గ్రామంలో వెలిసినగంగమ్మ ఆలయంలో శనివారం దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా రూ. 28 లక్షల 49 వేలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 17, 18,19 తేదీల్లో జరగనున్న జాతరకు సంబంధించి వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా టెంకాయలు, పూజా సామగ్రి కోసం నిర్వహించిన వేలంపాటలో రూ. 7 లక్షలు, జాతన తలనీలాలకు రూ. 1 లక్ష, 90 వేలు, విడిదినాల్లో తలనీలాలకు రూ. 6 లక్షల, 55 వేలు, విడిదినాల్లో కొబ్బరికాయలు రూ. 7 లక్షల, 92 వేలు, షామియాన సప్లయర్స్ కోసం రూ. 5 లక్షల, 12 వేల ఆదాయం వచ్చిందని వారు తెలియజేశారు. టోల్గేట్, ఐస్క్రీమ్లు అమ్ముకొనేందుకు సంబంధించిన వేలంపాట వాయిదా పడిందని చెప్పారు. వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాకు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
వరదరాజస్వామి విగ్రహాలు, కిరీటాలు అప్పగింత
రాజంపేట రూరల్ : అతి పురాతనమైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరదరాజస్వామి ఆలయంలోని పంచలోహ విగ్రహాలను, 3 వెండి కిరీటాలను ఆలయ వంశపారంపర్యకర్త అర్చకుడు మధురభారతం మాధవశర్మ దేవదాయశాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి నూకా సుబ్బారెడ్డికి అప్పగించారు. స్థానిక శ్రీఅభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం జరిగిన కార్యక్రమంలో అర్చకుడు మాట్లాడుతూ పోలి గ్రామంలోని శ్రీవరదరాజస్వామి ఆలయంలో 150 సంవత్సరాలుగా తన ముత్తాత, తాత, తండ్రి, తాను వంశపారంపర్యంగా పనిచేశామన్నారు. ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్నందువలన అర్చకత్వానికి రాజీనామా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నూతన ప్రధాన అర్చకుడు పార్థసారథి, పోలి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రం మారుస్తారంటూ ఆత్మహత్యాయత్నం
రాయచోటి : కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రకటన, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లా కేంద్రంగా మారుస్తున్నారన్న వదంతులపై రాయచోటిలో శనివారం ఆందోళనలు ఉధృతమయ్యాయి. జేఏసీ, స్థానిక ప్రజాశక్తి సంఘాల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రాయచోటి పట్టణంలోని నేతాజీ, వైఎస్ఆర్ కూడళ్లలో ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగించరాదంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్, హసన్బాషాలు విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వెంటనే వారించి వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు సత్వరం చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నేడు బంద్కు పిలుపు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని మదనపల్లి జిల్లా కేంద్రంలో కలుపుతున్నారంటూ వచ్చిన వదంతులపై జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్లో అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు, ఉద్యోగులు, సంఘాలు పాల్గొనాలని శనివారం రాత్రి ఒక ప్రకటనలో కోరింది. -
రాతపై పట్టు.. మార్కులు రాబట్టు
● చేతిరాత పరీక్షల్లో ‘కీ’లకం ● టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఆసన్నమైన సమయం ● విద్యార్థులు దస్తూరిపై సాధన చేయాలంటున్న నిపుణులు ● ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాతపై సాధన చేయిస్తున్న ఉపాధ్యాయులురాజంపేట టౌన్ : టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు టైమ్టేబుల్ కూడా వచ్చేసింది. అత్యుత్తమ మార్కులు సాధించి మంచి గ్రేడింగ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో అనేక మంది విద్యార్థులు ఓ ప్రణాళికను సైతం రూపొందించుకొని చదవడం ప్రారంభించారు. అయితే ఏడాది పాటు చదివిన విషయాలను జవాబు పత్రంపై రాసే విధానం వల్ల కూడా మార్కులు, గ్రేడింగ్ పాయింట్లు ఆధారపడి ఉంటాయి. అయితే ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించే విద్యార్థులు తక్కువ మంది మాత్రమే ఉంటారు. విద్యార్థులు పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఎంత ముఖ్యమో చేతిరాత కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చేతిరాత నిపుణులు సూచిస్తున్నారు. చేతిరాత బాగుంటే మూల్యాంకనం చేసే వారికి సులువుగా అర్థమవుతుంది. ఫలితంగా మంచి మార్కులు వేస్తారు. చేతిరాత బాగాలేకపోతే మూల్యాంకనం చేసే వారికి సమాధానం అర్థం కాకుంటే ఒకమార్కు లేదా అర్ధ మార్కు అయినా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది గ్రేడింగ్ పాయింట్స్పై ప్రభావం చూపే అవకాశముంది. అందువల్ల విద్యార్థులు చేతిరాతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు రెండు నెలలలోపే సమయం ఉండగా, టెన్త్ పరీక్షలకు రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున విద్యార్థులు రోజుకు అర్ధగంట అయినా చేతిరాతపై సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో చేతిరాత ఎలా ఉండాలో నిపుణుల మాటల్లోనే.. ● ప్రతి విద్యార్థి ఆన్సర్షీట్ (బుక్లెట్)లో సమాధానాలను స్పష్టంగా రాయాలి. ● నాలుగు వైపులా మార్జిన్లు (బార్డర్లు) వేసుకుంటే చూసేందుకు అందంగా ఉంటుంది. ● ఒక లైనుకు మరో లైనుకు సెంటీమీటర్ గ్యాప్ ఇవ్వాలి. ● పదానికి, పదానికి తగనంత (ఒకటి లేదా రెండు అక్షరాల) స్పేస్ ఇవ్వాలి. ● బుక్లెట్లో వాక్యాలు పైకి కిందకు లేకుండా వరుస క్రమంలో ఉండాలి. ● కంటికి, పేపరుకు 30–35 సెంటిమీటర్ల దూరం ఉండాలి. ● బొటన వేలు, మూడవ వేలికి మధ్య చూపుడు వేలు సహాయంతో పెన్నును చక్కగా పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రాసే సమయంలో పెన్ను స్పీడుగా ముందుకు కదులుతుంది. ● ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి లేకుంటే ఆ ప్రభావం చేతిరాతపై కూడా పడుతుంది. ● మనసు ప్రశాంతంగా ఉంటే చేతిరాత చక్కగా వస్తుంది. -
విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు
పీలేరు రూరల్ : విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన నాగమ్మ కుమారుడు గోవిందుల చరణ్సాయి (14) స్థానిక శ్రీ భువన విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అదృశ్యమయ్యాడు. విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆచూకి తెలిస్తే 9440796744, 9440796745 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేను విమర్శించే నైతికత చమర్తికి లేదు రాజంపేట : రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డిని విమర్శించే నైతికహక్కు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజుకు లేదని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండుగోపి హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కువైట్లో అక్రమంగా నాటుసారా తయారుచేసి, అమ్ముకున్న సంగతి రాజంపేటలోని అందరికి తెలిసిందేనన్నారు. చెరువులు, పొరంబోకులు కబ్జా చేసి లేఔట్లు వేశాడన్నారు. రాజంపేటకు భూకబ్జాలను పరిచయం చేసేంది గంపశివనే అన్నారు. జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి గొంటు మణి మాట్లాడుతూ రాజంపేట మండలంలో మిట్టమీదపల్లె, ఊటుకూరు, ఆకేపాడు గ్రామాలను విడదీయాలని ప్రయత్నించిన కుట్రదారుడు చమర్తి అని దుయ్యబట్టారు. సమావేశంలో దళిత నేతలు దాసరి పెంచలయ్య, రంగాల కమలాకర్, బొజ్జా పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. బాలనర్తకి కేతనరెడ్డికి అవార్డుగాంధీనగర్(విజయవాడసెంట్రల్) : కూచిపూడి నృత్యంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న మద్దిరాల కేతనరెడ్డికి ‘నవ తెలుగు తేజం – శ్రీ లలిత శ్రావంతి అవార్డు దక్కింది. ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మద్దిరాల కేతనరెడ్డి కూచిపూడి ప్రదర్శనలో అబ్బురపరుస్తోంది. కేతన ఇప్పటికే భారతీయ శాసీ్త్రయ నృత్య ప్రపంచంలో సత్తా చాటింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరును లిఖించుకోవడం తన భవిష్యత్ లక్ష్యమని కేతనరెడ్డి తెలిపింది. -
రుణాలపేరిట మోసపోయిన మహిళ ఆత్మహత్యాయత్నం
రాయచోటికి చెందిన మహిళ నగదు కాజేసిందని ఆరోపణ మదనపల్లె రూరల్ : కేంద్ర ప్రభుత్వ సెక్టార్ లో పనిచేస్తున్నానని, రూ. 3 వేల నగదు చొప్పున కడితే రూ.5 లక్షల నగదు ఒక్కొక్కరికి రుణంగా ఇప్పిస్తానని చెప్పి రాయచోటికి చెందిన ఫరీదా అనే మహిళ తనను మోసం చేసి నగదు కాజేసిందని ఆరోపిస్తూ, మదనపల్లె రామారావు కాలనీకి చెందిన మహిళ రూప (27) శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె వెల్లడించిన వివరాల మేరకు మదనపల్లె పట్టణం రామారావు కాలనీలో నివాసం ఉంటున్న రూప తో రెండు సంవత్సరాల క్రితం రాయచోటికి చెందిన ఫరీదా అనే మహిళ తాను సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం ఇన్చార్జినని, మహిళల ఆర్థిక అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందిస్తుందని నమ్మబలికి పరిచయం పెంచుకుంది. రుణాల మంజూరుకు ఒక్కొక్కరు మూడు వేల రూపాయలు కడితే రూ.5 లక్షల రుణం వస్తుందని చెప్పింది. ఈ విషయాన్ని నమ్మి రూప దళారిగా వ్యవహరించి, తన సొంత పూచికత్తుతో 200 మందికి పైగా మహిళల వద్ద నగదు వసూలు చేసి ఫరీదా కు ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా రుణాలు మంజూరు కాకపోవడంతో డబ్బు కట్టిన మహిళలు రూపపై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయమై రూప ఫరీదాతో మాట్లాడినా, ఆమె అదిగో ఇదిగోనంటూ కాలయాపన చేసింది. అయితే నగదు చెల్లించిన మహిళలు తమ డబ్బు వాపస్ ఇవ్వాల్సిందిగా నిలదీయడంతో, ఒత్తిడి భరించలేక పోయింది. మోసం చేసిన మహిళపై రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో, ఇంటి వద్ద విషం తాగింది. టూ టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నాయకులు అరెస్ట్
● జగనన్న పుట్టినరోజు వేడుకలు చేశారని కేసు ● గుర్రంకొండ పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత ● పాకాల కోర్టులో బెయిల్ మంజూరు గుర్రంకొండ : గుర్రంకొండలో వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ ముక్తియార్ అలీఖాన్, మాజీ సర్పంచ్ జమీర్ ఆలీఖాన్లను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇటీవల పట్టణంలో నిర్వహించిన జగనన్న పుట్టినరోజు వేడుకల్లో జరిగిన సంఘటనలపై కేసు నమోదు చేశారు. దీంతో గుర్రంకొండ పోలీస్స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రాత్రంతా నాయకుల్ని పోలీస్స్టేషన్లోనే ఉంచారు. శుక్రవారం తిరుపతి జిల్లా పాకాల కోర్టులో వీరిని హాజరు పరచగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 21న మండలకేంద్రమైన గుర్రంకొండలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాత్రి వరకు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్లు కట్చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సమయంలో కార్యకర్తలు కత్తులతో కేక్ కట్ చేశారు. పచ్చమీడియా దీనిని వక్రీకరించి ప్రజలను భయాందోళనకు గురి చేశారంటూ, కత్తులతో సైర్వవిహారం చేశారంటూ వార్తలను ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం పోలీసులు రాష్ట్ర ఎండీసీ మాజీ డైరెక్టర్ హరీష్రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ ముక్తియార్ ఆలీఖాన్, మాజీ సర్పంచ్ జమీర్ అలీఖాన్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ముక్తియార్ అలీఖాన్, జమీర్ అలీఖాన్లను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకొన్న కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్ వద్దకు చేరుకొన్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డితో పాటు పలు పోలీస్స్టేషన్లకు చెందిన ఎస్ఐలు తమ సిబ్బందితో గుర్రంకొండకు చేరుకొన్నారు. పోలీస్స్టేషన్ వద్ద ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ నాయకులను పోలీస్స్టేషన్లోనే రాత్రంగా ఉంచారు. శుక్రవారం ఉదయం పదిగంటలకు ముక్తియార్ అలీఖాన్, జమీర్ అలీఖాన్లను పోలీసులు మొదటగా పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుపతి జిల్లాలోని పాకాల కోర్టులో వీరిని పోలీసులు హాజరుపరిచారు. కేసు విచారించిన జడ్జి వీరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో నాయకులు హర్షం ప్రకటించి గుర్రంకొండకు చేరుకొన్నారు. గుర్రంకొండలో పోలీసుల పహారా రెండురోజులుగా పట్టణంలో జరుగుతున్న సంఘటనలపై పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. గత రెండురోజులుగా జిల్లాలోని ఆరు పోలీస్స్టేషన్లకు చెందిన ఎస్ఐలతో పాటు పోలీసులు, ఇద్దరు సీఐలు, స్పెషల్ఫోర్స్ పోలీసులు పట్టణంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా ఈకేసులో ఇంకా 40 మందిని చేర్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. దీంతో పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష గట్టి అనవసరంగా కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. కోర్టులో బెయిల్ తీసుకొని నాయకులు ఇళ్లకు చేరుకొన్నా పోలీసులు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తుండడం గమనార్హం. రెండురోజులుగా జరుగుతున్న సంఘటనలు నియోజకవర్గంలో సంచలనం కలిగించాయి. -
పోలీసుస్టేషన్ ముందు టీడీపీ నేత భార్య నిరసన
● భర్త వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు ● పోలీసులు న్యాయం చేయడంలేదని ఆరోపణ మదనపల్లె రూరల్ : తన భర్త టీడీపీ నాయకుడు మహబూబ్ఖాన్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తమను పట్టించుకోకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానని.. అయితే, టీడీపీ నేతనైన తనపైనే కేసు పెడతావా అంటూ తన భర్త తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహబూబ్ఖాన్ భార్య జోయాఖాన్ శుక్రవారం ఆవేదన వ్యక్తంచేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ కుమార్తెతో కలిసి మదనపల్లి టూటౌన్ పోలీస్స్టేషన్ ఎదుట ఆమె నిరసన చేపట్టింది. బాధితురాలికి ఏఐటీయూసీ మదనపల్లె నియోజకవర్గం కార్యదర్శి షేక్ ముబారక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జోయాఖాన్ మాట్లాడుతూ.. తన కనీస అవసరాలకు కావాల్సిన ఆర్థిక వనరులను తన భర్త సమకూర్చకపోగా, బాధ్యత లేకుండా తిరుగుతూ తనను నిత్యం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. ఈ విషయమై టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ అతడిలో మార్పు రాలేదని ఆమె ఆరోపించింది. రెండ్రోజుల క్రితం అర్ధరాత్రి వేళ ఆయన తన ఇద్దరు స్నేహితులతో ఇంటిపైకి వచ్చి దాడిచేశాడని.. దీంతో తాను 112 నంబర్కు ఫోన్చేసి ఫిర్యాదు చేశానని తెలిపింది. అయినప్పటికీ పోలీసులు తనకు న్యాయం చేయకపోవడంతో కుమార్తెను తీసుకుని స్టేషన్ ఎదుట నిరసన చేపట్టిన్నట్లు చెప్పింది. మహబూబ్ఖాన్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ముబారక్ డిమాండ్ చేశారు. -
అన్నమయ్యా.. పాలకుల కళ్లు తెరపించవయ్యా
● గోవిందా..గోవిందా అంటూ వేడుకోలు ● రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ ● హైవేపై రాస్తారోకో చేసిన జేఏసీ నేతలు ● వంటావార్పు, నినాదాలు రాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ, పాలకుల కళ్లు తెరపించాలని వేడుకుంటూ జేఏసీ ఆధ్వర్యంలో నేతలు, వివిధ పార్టీల నాయకులు, యువకులు, విద్యార్ధులు మూకుమ్మడిగా పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహానికి వినతులు సమర్పించుకున్నారు. కడప–రేణిగుంట జాతీయరహదారిలోని 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్తో ప్రజాపోరును అన్నమయ్య ఎదుట శుక్రవారం నిర్వహించారు. గోవిందా..గోవిందా అంటూ ముక్తకంఠంతో వేడుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దృష్టి కేంద్రీకరించేలా చేయాలంటూ అన్నమయ్యను వేడుకున్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ఉద్యమకారులు కొండూరు శరత్కుమార్రాజు, చిట్వేలి రవి కుమార్, మర్రి రవికుమార్, మండెం అబూబకర్, పూల భాస్కర్, యల్లటూరు శ్రీనివాసరాజు, డా.సుధాకర్, ఉద్దండం సుబ్రమణ్యం, యద్దల సాగర్, మేడికొండు రవి, కెఎంఎల్ నరసింహా, సంజీవి, సమ్మెట శివప్రసాద్, యల్లటూరు శివరామరాజు, కొట్టే హరి, సికిందరులతో పాటు మహిళలు పాల్గొన్నారు. హైవేపై రాస్తారోకో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద ప్రజల వినతి ముగిసిన అనంతరం అన్నమయ్య ఉద్యానవనం ఎదురుగా కడప–రేణిగుంట జాతీయ రహదారిపై ఉద్యమకారులు రాస్తారోకోకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. కడప, తిరుపతి వైపు వాహనాలు బారులు తీరాయి. మన్నూరు సీఐ ప్రసాద్బాబు పర్యవేక్షణలో పోలీసు బందోబస్తును నిర్వహించారు. న్యాయవాద జేఏసీ నాయకుడు శరత్ ఆధ్వర్యంలో వంటావార్పు అన్నమయ్యకు వినతుల కార్యక్రమం అనంతరం న్యాయవాదుల జేఏసీ కన్వీనరు కొండూరు శరత్కుమార్ రాజు ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపక్కన వంట చేయించారు. ఆందోళనకారులకు వడ్డించారు. కార్యక్రమంలో శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్, బీవీఎన్ హైస్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంగా రాజంపేట ఉండాలని ఈ సందర్భంగా నినదించారు. ప్రజల వినతులను ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. -
భూవివాదంలో దాడులు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణం లక్ష్మీనగర్ పట్టా భూములకు సంబంధించి జరిగిన ఇరువర్గాల దాడులలో శుక్రవారం పది మందికి గాయాలయ్యాయి. లక్ష్మీనగర్లోని సర్వే నంబర్ 7–3, 7–5, 7–4, 13–1ఏ పట్టాభూమిని దశాబ్దాల క్రితం100 మందికిపైగా అన్ని వర్గాల పేదలు కొనుగోలు చేసారు. అయితే కోడూరు అరుంధతివాడకు చెందిన వారు కొద్ది రోజులుగా ఈ భూమి తమదేనంటూ గొడవలు పడుతున్నారు. తహసీల్దార్ అమర్నాథ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివాద స్థలాన్ని పరిశీలించి భూములు కొన్నవారే హక్కుదారులని నిర్ధారించారు. ఇటీవలే పోలీసుల సహకారంతో జేసీబీలతో చదును చేయించి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్డు వేసేందుకు యంత్రాలు పని చేస్తుండగా పోలీసుల సమక్షంలో అరుందతివాడ గ్రామస్తులు అడ్డుకొన్నారు. దీంతో ఇంటి స్థలాలు కొన్న వర్గాలకు, అరుంధతివాడ గ్రామస్తులకు మధ్య గొడవ జరిగి రాళ్లు, కట్టెలతో కొట్టుకొన్నారు. ఈ గొడవలలో అరుంధతి వాడకు చెందిన వారు రాళ్లు రువ్వారు, కర్రలతో దాడులు చేసారు. ఈ క్రమంలో ఇంటి స్థలాలకు చెందిన సుబ్బారెడ్డి, శాంతి, సురేంద్రరాజు, నాగరాజు, అనిల్కుమార్, మహేష్, కరీమున్నీసాలతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మేరకు ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురికి గాయాలు -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
● చీఫ్ జనరల్ మేనేజర్ జానకి రామ్ ● నిమ్మనపల్లె మండలంలో ‘కరెంటోళ్ళ జనంబాట’ నిమ్మనపల్లె : గృహ వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా కరెంటోళ్ల జనంబాట కార్యక్రమం చేపట్టినట్లు విద్యుత్ శాఖ తిరుపతి చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) జానకిరామ్ అన్నారు. శుక్రవారం నిమ్మనపల్లె మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ బాలినాయన పల్లెలో కరెంటోళ్ళ జనం బాట కార్యక్రమంలో విద్యుత్ శాఖ మదనపల్లె డీఈ గంగాధరంతో కలిసి పాల్గొన్నారు. విద్యుత్ సిబ్బందితో ఇంటింటా పర్యటించారు. విద్యుత్ సమస్యలు ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో విద్యుత్ కనెక్షన్, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ చర్యలపై క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు.అంతరాయాలను నివారించేందుకు పలు సూచనలు చేశారు. తరచూ ఏర్పడుతున్న అంతరాయాలను గుర్తించేందుకు 33 కేవీ ఫీడర్స్, 11కేవీ ఫీడర్లు ఎంపిక చేసుకొని, సర్వే చేసి లోపాలను పీఎంఐ సర్వే మొబైల్ యాప్లో నమోదుచేస్తారన్నారు. ఇందులో భాగంగా గాలి వీచేటప్పుడు చెట్ల కొమ్మలు తగలడం, ఒరిగిన, తుప్పుపట్టిన, పొట్టి విద్యుత్ పోల్స్, స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండి వేలాడుతున్న వైర్లు, ఇన్సులేటర్ పగుళ్లు, సపోర్ట్ వైర్లు, సపోర్ట్ స్తంభాలు లేకపోవడం తదితర సమస్యలను గుర్తించి, నమోదుచేసి అంతరాయాలను త్వరితగతిన పూర్తిగా సరిచేసి, వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామాలకు వెళ్ళినప్పుడు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను అధికారులకు తెలియజేయాలన్నారు. ఆ సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తారన్నారు. పొలాల వద్ద స్టార్టర్లు, ఎర్తింగ్ భద్రత చర్యలపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సోలార్ విద్యుత్, ఆన్లైన్ విద్యుత్ పేమెంట్లు, విద్యుత్ ఆదా, వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నిరంతరం విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్ అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ నాగరాజ, ఎల్ఎంలు పూర్ణ కుమార్, గోవిందరాజులు, ఏఎల్ఎంలు నరసింహులు, షామీర్ భాష, జెఎల్ఎంలు హర్షవర్ధన్, నరేంద్ర, అశోక్, చలపతి తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల కుప్ప!
మదనపల్లె: జిల్లాలో 501 గ్రామపంచాయతీలు ఉండగా అందులో కేవలం పీలేరు, కలికిరి, గుర్రంకొండ, వాయల్పాడు, చింతపర్తి, కురబలకోట, నాగిరెడ్డిపల్లె, రైల్వేకోడూరు మాత్రమే మేజర్ పంచాయతీలుగా ఆదాయంలో ముందున్నాయి. అయితే ఈ పంచాయతీల్లో ప్రతి ఆర్థిక సంవత్సరం వసూలు చేయాల్సిన పన్నుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఏటా కోట్లలో వసూలు చేయాల్సిన పన్నులే పంచాయతీలకు దన్నుగా నిలుస్తుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు అభివృద్ధి పనులకు, మౌలిక సౌకర్యాల కల్పనకు అండగా నిలుస్తున్నాయి. ఏటా ఆర్థిక వనరులను పెంచుకోవడం,వాటిద్వారా పంచాయతీల అభివృద్ధికి పాలన మండళ్లు శ్రద్ధ చూపించడం లేదు. దీనికితోడు వసూలు చేయాల్సిన ఇంటిపన్నుల విషయంలో అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. దీనివల్ల పంచాయతీల్లో పనులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు పన్నుల వసూళ్లకు టార్గెట్లు ఇస్తున్నా వాటి ఫలితాలు మాత్రం ఉండడం లేదని తాజా అప్పుల లెక్క చెబుతోంది. పీలేరుదే అగ్రస్థానం పన్ను బకాయిల పెండింగ్, తాజా పన్నుల వసూళ్లలో జిల్లాలో పీలేరు అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో పాత బకాయిలు, 2025–26 ఆర్థిక సంవత్సర పన్నుల వసూళ్లు పడకేసినట్టు కనిపిస్తోంది. ఒక్క పీలేరు పంచాయతీలో పాత బకాయిలు రూ.122.95 లక్షలు ఉండగా తాజా పన్ను బకాయి రూ.228.75 లక్షలు. రెండు కలిపి రూ.3.51 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇలాంటి పరిస్థితే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. వీరబల్లి మండలంలో మాత్రమే పాత, కొత్త బకాయిలు కలుపుకుని రూ.9.46 లక్షలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. పీలేరులో లాగే బకాయిలు పేరుకుపోతే పంచాయతీలు ముందుకువెళ్లే పరిస్థితులు లేవు. ఆదాయంతోనే పనులు పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీన్ అంబాసిడర్లకు వేతనాల చెల్లింపు, నీటి సరఫరా నిర్వహణ, బోర్ల నిర్వహణ ఇలాంటి పనులకు పంచాయతీకి వసూలయ్యే సాధారణ నిధులతోనే చేపట్టాల్సి ఉంటుంది. దీనికి పన్నులు సకాలంలో వసూలు కావాలి. లేదంటే నిధుల కోసం కటకటడాల్సిందే. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా వాటిని దేనికోసం వెచ్చించాలో ప్రభుత్వమే సూచిస్తుంది కాబట్టి ఆ పనులే చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో నిధుల కొరత తీరాలంటే పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. అత్యధిక బకాయిలు పంచాయతీల్లో పేరుకుపోయినపన్నుల వసూళ్లు మార్చి ముంచుకొస్తున్నా కలెక్షన్లు నిల్ రూ.3.51 కోట్లతో పీలేరు టాప్,రూ.9.46 లక్షలతో వీరబల్లి లాస్ట్ పీలేరు రూ.351.7 కోడూరు రూ.178 మదనపల్లె రూ.183 రాజంపేట రూ.96.77 కురబలకోట రూ.80.47 కలికిరి రూ.73.69 చిట్వేలి రూ.58.01 -
హెచ్చరికలు బేఖాతర్
ఒంటిమిట్ట: మండల పరిధిలోని పెన్నపేరూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 296లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిపై టీడీపీకి చెందిన గంగపేరూరు గ్రామంలోని ఓ నాయకుడి కన్ను పడింది. సుమారు ఎకరం వరకు చదును చేశారు. దీనిపై గత సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తప్పెటవారిపల్లికి చెందిన తప్పెట సుబ్బారెడ్డి స్థానిక రెవెన్యూ కార్యాలయంలో, కడప కలెక్టరేట్లోని డీఆర్వో విశ్వేశ్వరయ్యనాయుడుకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అక్కడ జరుగుతన్న ఆక్రమణలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, వీఆర్వో అంజయ్య నిలిపివేయించి, మళ్లీ అక్రమణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆక్రమణ దారుడిని హెచ్చరించారు. రెవెన్యూ వారు హెచ్చరించినా..తమ పార్టీ అధికారంలో ఉందనే ధీమాతో వారి హెచ్చరికను భేఖాతర్ చేసి బుధవారం అర్థరాత్రి ఎకరా ప్రభుత్వ భూమిని పూర్తిగా చదును చేశాడు. దీంతో తప్పెట సుబ్బారెడ్డి ఈ సమస్యను గురువారం మళ్లీ డీఆర్వో విశ్వేశ్వరయ్యనాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇది తెలుసుకున్న డీఆర్వో ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులను ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా స్థానిక రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు దారుడు తప్పెట సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై డీఆర్వో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ భూమిని చదును చేసిన ఆక్రమణదారుడు -
అధికారుల్లో గుబులు
ఒక జిల్లా అధికారి నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టడంతో ఇప్పుడు అధికార యంత్రాంగంలో గుబులు పుట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో, ప్రోటోకాల్ కలిగిన ప్రజాప్రతినిధుల విషయంలో నిబంధనలను పాటించకుంటే ఇలాంటి పరిస్థితి తమకు కలగవచ్చన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక కిందిస్థాయి అధికారుల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అన్న నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు కూడా చేపట్టారు. చివరకు ప్రజా ప్రతినిధుల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటంపై చర్యలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులు నిబంధనలను, ప్రతినిధుల హక్కులను గౌరవించేలా పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది. -
నిర్లక్ష్యానికి మూల్యం!
మదనపల్లె: చేసిన పాపం ఊరకనే పోదనేది సామెత అయితే.. చేసిన తప్పు రిటైర్మెంట్ అయినా వెంటాడుతుందని, మూల్యం చెల్లించక తప్పదని అన్నమయ్య జిల్లా డిస్కం రిటైర్డ్ సూప రిండెంటింగ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి ఉదంతం చెబుతోంది. ప్రస్తుతం ఈ ఉదంతం జిల్లా అధికార యంత్రాంగంలో గుబులు రేపుతోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిల్లా విద్యుత్ శాఖలో రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ (డీఈసీ) కీలకంగా పనిచేస్తుంది. ఈ కమిటీకి చైర్మన్ గా సీనియర్ ఎంపీ మిథున్ రెడ్డి.. కన్వీనర్, మెంబర్ కార్యదర్శిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఇందులో చైర్మన్ పాత్ర కీలకంగా ఉంటుంది. పథకం అమలును పర్యవేక్షించడానికి, కమిటీ సమావేశాల నిర్వహణను నిర్ణయించడం, తీసుకున్న నిర్ణయాలను అమలుపరచడంలో చైర్మన్కు అధికారాలు ఉంటాయి. చైర్మన్ అధ్యక్షతన కమిటీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. చైర్మన్ అనుమతి లేకుండానే.. డీఈసీ చైర్మన్ అయిన ఎంపీ మిధున్ రెడ్డి అనుమతి లేకుండానే గత డిస్కం ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి..ఈ ఏడాది మే 12న కమిటీ సమావేశం ఉందని సమాచారం పంపారు. ఈ విషయం చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి వారు నిర్ణయించిన తేదీన సమావేశం నిర్వహించాలనే అంశంపై చైర్మన్ తో సంప్రదింపులు జరిపి, అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇవేమీ లేకుండానే చంద్రశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకుని తర్వాత సమాచారం ఇచ్చారు. చైర్మన్ అధ్యక్షతన జరిగే సమావేశమే..ఆయనకు తెలియకుండా నిర్ణయించడం ద్వారా హక్కులు. అధికారాలను కాల రాసేలా ఏకపక్షంగా వ్యవహరించారు. కలెక్టర్కు ఫిర్యాదు మే 12న కమిటీ సమావేశం ఉందని అందిన సమాచారంపై ఎంపీ విస్తుపోయారు. తన ప్రమేయం లేకుండా, తన అధ్యక్షతన జరగాల్సిన సమావేశాన్ని తాను నిర్ణయించకుండానే తేదీ, సమయం ఎలా ఖరారు చేశారని ప్రశ్నిస్తూ జిల్లా కలెక్టర్కు మిథున్ రెడ్డి లేఖ రాశారు. విషయాన్ని పరిశీలించి, సమావేశం ఏర్పాటులో సరైన విధానాలను అనుసరించాలని లేఖలో కోరారు. నా హక్కులకు భంగం తన హక్కులకు భంగం కలిగించారని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఈిసీ చైర్మన్ అయిన మిథున్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. సీనియర్ ఎంపీ అయిన ఆయన లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్, అలాగే స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ కన్సల్టేటివ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఫిర్యాదుపై స్పీకర్ కార్యాలయం స్పందించింది. హక్కులకు భంగం కలిగించడం, ప్రోటోకాల్ పాటించకవడం వంటి అంశాలపై జిల్లా అధికారుల నుంచి వివరణ కోరింది. దీంతో చర్యలు మొదలయ్యాయి. రిటైర్డ్ అయినప్పటికీ.. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇప్పుడు అధికారులు చూస్తున్నారు. డీఈసీ చైర్మన్ హక్కులను హరించిన ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి ఈ అక్టోబర్ చివర్లో రిటైర్ అయ్యారు. అయితే నిర్లక్ష్యానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. రిటైరైన తర్వాత అధికారిగా ఉండాల్సిన సౌకర్యాలను నిలిపివేశారు. పెన్షన్ తో పాటు, రిటైర్మెంట్ తో ముడిపడి ఉన్న అన్ని ఆర్థిక అంశాలను నిలుపుదల చేశారు. అలాగే లోక్ సభ స్పీకర్ కార్యాలయం దీనిపై వివరణ కోరెందుకు సంబంధిత అధికారిని హాజరుకావాలని ఆదేశించే అవకాశం ఉంది. చైర్మన్ అయిన సీనియర్ ఎంపీమిథున్ రెడ్డి అధికారాలను విస్మరించిన గత డిస్కం ఎస్ఈ చైర్మన్ అనుమతి లేకుండానే గత మే 12న డీఈసీ సమావేశం స్పీకర్, కలెక్టర్లకు మిథున్ రెడ్డి ఫిర్యాదు ఎస్ఈ రిటైర్డ్ అయినప్పటికీ ఆగని చర్యలు జిల్లా అధికార యంత్రాంగంలో గుబులు -
దరఖాస్తుల ఆహ్వానం
పెనగలూరు: మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీషు సబ్జెక్టు గెస్ట్ ఫ్యాకల్టీ కోం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 50 శాతం మార్కులు కలిగిన అభ్యర్థులు దరఖాస్తును ఈనెల 28వ తేదీలోగా స్వయంగా ప్రిన్సిపాల్ చేతికి అందజేయాలన్నారు. 29వ తేదీ నుంచి డెమో క్లాసులు కళాశాలలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ అమ్మవారికి మహిళలు భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారిని ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి, కృష్ణయ్య స్వామి, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు,పూలు, నిమ్మకాయల హారాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. మహిళలు నిమ్మకాయలపై ఒత్తులు వెలిగించి హారతులు పట్టారు. అమ్మా..కరుణించమ్మా అని వేడుకున్నారు. ఈవో డివి రమణారెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాయచోటి: జిల్లా కలెక్టర్ యూనిట్ రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కలెక్టరేట్ ఏఓ నాగభూషణం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఏపీఆర్ఎస్ఏ కలెక్టరేట్ యూనిట్ ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2025–28 కాలానికి ఎన్నికై న కమిటీ పని చేయనుంది. ప్రెసిడెంట్ గా నాగభూషణం (ఏఓ), అసోసియేట్ ప్రెసిడెంట్గా శ్రావణి (ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్),, సెక్రటరీగా పి వంశీకృష్ణ (సీనియర్ అసిస్టెంట్), ఇతర పదవులకు సంబంధించిన అధికారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ ఫణికృష్ణ, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి నరసింహ కుమార్లు ఎన్నికల అధికారులుగా కొనసాగారు. కడప సిటీ: వైఎస్సార్; అన్నమయ్య జిల్లాలోని మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతు కుటుంబాలు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి భక్తవత్సలరెడ్డి తెలిపారు. ప్రొఫెఫనల్ కోర్సుల్లో అంటే ఇంజినీరింగ్, మెడిసిన్, డెంటల్, వెటర్నరీ, అగ్రికల్చర్, బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వాటిలో 2025–26 అకడమిక్ ఇయర్లో అడ్మిషన్ పొందిన మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువుల పిల్లలు ప్రధానమంత్రి ఉపకార వేతనానికి అర్హులని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కేఎస్బీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు కడపలోని సైనిక సంక్షేమ కార్యాలయం 86882 17828 నెంబరులో సంప్రదించాలన్నారు. పీలేరు రూరల్: నూతనంగా రెవెన్యూ డివిజన్గా ఏర్పడిన పీలేరులో ఆర్డీవో కార్యాలయానికి అవసరమైన భవనం కోసం పలు చోట్ల జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డి పరిశీలించారు. మదనపల్లె మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలికల వసతిగృహం, జెడ్పీ బంగా వద్ద ఉన్న గ్రామ సచివాలయం భవనం, మూతపడిన పాలశీతలీకరణ కేంద్ర భవనాలను పరిశీలించారు. రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రమేష్రెడ్డి, ట్రాన్స్కో ఈఈ చంద్రశేఖర్రెడ్డి, తహశీల్దార్ శివకుమార్, ఎంపీడీవో శివశంకర్ పాల్గొన్నారు. -
చేయి నరుక్కున్న చేనేత కార్మికుడు
మదనపల్లె రూరల్: రుణ దాతల వేధింపులు భరించలేక చేనేత కార్మికుడు చేయి నరుక్కున్న సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె వినాయకనగర్లో నివాసం ఉంటున్న వెంకటరమణ కుమారుడు నాగార్జున కుమార్(38) అ వివాహితుడు. స్థానికంగా చేనేత పనులు చేస్తూ జీ విస్తున్నాడు. తన వ్యక్తిగత అవసరాల కోసం పలువురి వద్ద రూ.2 లక్షలు అప్పు చేశాడు. వారికి నూటికి రూ.5 చొప్పున వడ్డీ చెల్లిస్తున్నాడు.కొంతకాలంగా రు ణదాతల నుంచి అప్పు చెల్లించాలని ఒత్తిడి అధికమైంది. దీంతో మానసిక క్షోభకు గురై ఇంట్లోనే కొడవలితో తనకు తానుగా చేతిని నరుక్కున్నాడు.కుటుంబసభ్యు లు అతన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
22ఏ భూ సమస్యలపై స్పెషల్ డ్రైవ్
రాయచోటి: ప్రారంభం నుంచి పరిష్కారానికి నోచుకోని 22 ఏ చుక్కల భూముల సమస్యలపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. అనేక కారణాల వల్ల 22ఏ, చుక్కల భూములకు సంబంధించిన ఎన్ఓసీలు ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. భూముల పరిష్కారంపై శుక్రవారం జిల్లా కలెక్టర్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా శుక్రవారం 22 ఎకరాల 62 సెంట్ల భూములకు సంబంధించిన ఎన్ఓసీలను జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె మండలానికి చెందిన శ్రీలత, భాస్కర్, కానాల చెంగమ్మ, హేమలత, నందకిషోర్, కురబలకోట మండలానికి చెందిన మస్తాన్ రెడ్డిల భూములకు ఎన్ఓసీలను జారీ చేశామని పేర్కొన్నారు. మరో 15 ఎకరాల 28 సెంట్ల 22ఏ భూములకు సంబంధించి 10 కేసులను విచారణ చేపట్టామని, వీటికి సంబంధించిన ఎన్ఓసీలను సోమవారం జారీ చేస్తామన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 22ఏ చుక్కల భూముల సమస్యలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, త్వరలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రికార్డుల పోర్జరీ కేసులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు అన్నారు. ఎన్ఓసీలను పొందిన లబ్ధిదారులు కలెక్టర్, పాలన యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
తప్పిపోయిన పది నిమిషాల్లోనే తల్లిదండ్రులకు అప్పగింత
రాయచోటి టౌన్ : తప్పిపోయిన పది నిమిషాల్లోనే రాయచోటి పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన రాయచోటిలో జరిగింది. గురువారం రాయచోటి పట్టణంలోని మహబూబ్ బాషా వీధికి చెందిన బి. నాగార్జున కుమారుడు శ్రీహాన్ ఉదయం ఇంటిలో నుంచి ఆడుకుంటూ వీధిలోకి వెళ్లాడు. అటు నుంచి వీధి వెంట వెళ్లిపోయిన చిన్నారి శ్రీహాన్ కనిపించలేదు. కాస్త ఆలస్యంగా ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అర్బన్ సీఐ బీవీ చలపతి తన సిబ్బంది ఎస్ఐ జాహీర్, కానిస్టేబుల్ పవన్కుమార్, దామోదర్లను వెంటనే అప్రమత్తం చేసి గాలింపునకు పంపారు. ఆదేశాలు అందుకున్న పోలీసులు వీధి వీధి గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని మటన్ కొట్టు వ్యాపారి వద్ద ఆ బాలుడు ఏడుస్తూ కనిపించడంతో విషయం తెలుసుకొని ఆయన వద్దకు వెళ్లి ఆ బాలుడిని స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
కరెంట్ షాక్తో బాలికకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : ఇంటిమిద్దైపె ఆడుకుంటుండగా, 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి నాలుగో తరగతి చదువుతున్న బాలిక తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. కోళ్లబైలు పంచాయతీ జగన్కాలనీలో నివాసం ఉంటున్న ఆనంద, శ్రావణి దంపతుల కుమార్తె రెడ్డిప్రసన్న(10) స్థానికంగా నాలుగో తరగతి చదువుతోంది. గురువారం క్రిస్మస్ సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో అదే వీధిలోని నిర్మలమ్మ ఇంటి మిద్దైపె తోటిపిల్లలతో కలిసి ఆడుకుంటుండగా, మిద్దైపె తక్కువ ఎత్తులో ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు విద్యార్థినికి తగలడంతో షాక్కు గురై తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. విద్యుత్ ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నా ఆ శాఖ అధికారులు నివారణ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
కోట్ల రూపాయల స్థలంపై కన్ను
పేదలు ఇంటిస్థలాల్లోకి వెళ్తుంటే అడ్డుకుంటున్న కోడూరు దళితవాడ గ్రామస్తులురోడ్డు పైపులైను ఇంటి స్థలాల హద్దులు ఏర్పాటు చేస్తుంటే అడ్డుకొని గొడవ పడుతున్న దృశ్యంఓబులవారిపల్లె : రైల్వేకోడూరు పట్టణ నడిబొడ్డు లక్ష్మీనగర్లో పెత్తందారులు ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా ఆన్లైన్ చేయించి దళితవాడ గ్రామస్తులను పురమాయించి కోట్ల రూపాయల పేదల ఇంటి స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల క్రితం సర్వే నంబరు. 7/3, 7/4, 7/5, 13/1ఎ సర్వే నంబర్లలో దాదాపు ఆరు ఎకరాల భూమిలో ఇంటి స్థలాలను దళితులు, నాయీబ్రాహ్మణ తదితర కులాలకు చెందిన వారు వందమందికి పైగా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వాళ్ల ఆధీనంలో ఉంది. అయితే కొందరు భూ బకాసురులకు కోట్ల రూపాయల స్థలంపై కన్ను పడింది. 2017వ సంవత్సరంలో అక్రమంగా ఆన్లైన్ చేయించుకొని కోడూరు దళితవాడ గ్రామస్తులతో కలిసి దౌర్జన్యం చేస్తున్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, రాజంపేట ఎస్పీ ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారించి పేదల పక్షాన నిలబడ్డారు. అయితే కొందరు పెత్తందారులు కోడూరు దళితవాడ గ్రామస్తులను ఉసిగొలిపి వారివద్ద ఎలాంవంటి పత్రాలు లేకున్నా కూడా పేదల స్థలాల్లోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులను సైతం లెక్కచేయకుండా తిరగబడుతున్నారు. గురువారం ఈ సర్వే నంబర్లలో నీటి పైపులైను రోడ్డు వేస్తున్న అధికారులను, స్థల యజమానులను బెదిరించి గొడవలకు పాల్పడ్డారు. వారివద్ద పత్రాలు తీసుకురమ్మని ఎన్ని మాటలు చెప్పినా మా తాతల భూమి అంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు పరిశీలించి పేద కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
అయ్యప్ప స్వాముల మినీ బస్సుబోల్తా
సంబేపల్లె : మండలంలోని చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై గురువారం రాత్రి అయ్యప్ప స్వాముల మినీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటన సంబేపల్లె మండల కేంద్రంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన 16 మంది అయ్యప్ప భక్తులు ఈ నెల 18 వ తేదీన శబరిమలై యాత్రకు వెళ్లారు. ఈ నెల 22వ తేదీన అయ్యప్పను దర్శించుకొని తిరిగి సొంత గ్రామానికి వెళుతుండగా సంబేపల్లె మండల కేంద్రానికి రాగానే అయ్యస్వాములు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. బస్సులో డ్రైవర్తో పాటు 15 మంది భక్తులు ఉన్నారు. డ్రైవర్ రాజు, ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో భక్తులు, స్థానికులు అయ్యప్ప స్వామి కాపాడాడని తలుచుకొన్నారు. సంఘటన స్థలాన్ని సంబేపల్లె పోలీసులు పరిశీలించారు. -
కేబుల్వైర్లు చోరీ
ములకలచెరువు : ములకలచెరువు, తంబళ్లపల్లి మండలాల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కేబుల్వైర్లు చోరీ చేశారు. రైతుల కథనం మేరకు.. ములకలచెరువు, తంబళ్లపల్లి మండలాల్లోని పర్తికోట, దేవులచెరువు, గుండ్లపల్లె, గోపిదిన్నె గ్రామాల్లోని పొలాల్లో వ్యవసాయ బోర్లకు అమర్చిన కేబుల్వైర్లను దొంగిలించారు. అదేవిధంగా బోయపల్లి, బోరెడ్డివారికోట, పాపిరెడ్డిగారిపల్లి –2, చెట్లవారిపల్లి పంచాయతీల్లో తాగునీటి బోర్లకు అమర్చిన కేబుల్వైర్లు సైతం ఎత్తుకెళ్లారు. సంబంధిత రైతులు లక్ష్మీపతి, లక్ష్మీకర్, శ్రీనివాసులు, మల్లికార్జున, చలపతి, శ్రీనివాసులురెడ్డి తదితరులు గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు సంబేపల్లె : చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. కలికిరి మండలం గజ్జిలవాండ్లపల్లె షేక్ ఖాదర్బాషా రాయచోటి నుంచి సొంత గ్రామానికి వెళతుండగా మోటకట్ల సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ఖాదర్బాషాను 108 సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురు కోడిపందెం జూదరుల అరెస్టు నిమ్మనపల్లె : కోడిపందెం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ విష్ణునారాయణ తెలిపారు. గురువారం మండలంలోని ముష్టూరు పంచాయతీ దిగువపల్లె సమీపంలో కోడిపందెం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడిచేశామన్నారు. ఈ దాడిలో దిగువపల్లెకు చెందిన అమరేష్ సింగ్, శ్రీకాంత్ సింగ్, నిమ్మనపల్లె దిగువవీధికి చెందిన పవన్, రామాంజులును అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి రూ.2,350 నగదు, మూడు కోళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి పుల్లంపేట : భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి స్వస్వరూపానంద తెలిపారు. గురువారం స్థానిక ఎస్బీవీడీ విద్యాసంస్థల క్రీడా మైదానంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వస్వరూపానందస్వామి మాట్లాడుతూ భారతదేశం ఆధ్యాత్మిక దేశమని, ఎందరో యోగులు, గురువులు జన్మించి మానవాళిని సన్మార్గంలో నడిపిన ఘనత భారతదేశానిదేనన్నారు. హైందవ సంప్రదాయాలు ప్రపంచ దేశాలను ఆకర్శిస్తుండడం హిందూ మతం గొప్పతనమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి హిందువులు హాజరయ్యారు. గుండె పోటుతో వైద్యుడు శశికాంత్ మృతిమైదుకూరు : మైదుకూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు సి.శశికాంత్ (52) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. శశికాంత్ తండ్రి ప్రముఖ వైద్యుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ రంగసింహ ఈనెల ఒకటో తేదీన అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. తండ్రి మృతి చెందిన 25 రోజులకే కుమారుడు మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. -
రాజకీయ కుట్రలో భాగమే డీకే.శ్రీనివాస్, కల్పజ అరెస్ట్
మదనపల్లె రూరల్ : మాజీ ఎంపీ, పారిశ్రామిక వేత్త డీకే.ఆదికేశవులునాయుడు కుమారుడు డీకే.శ్రీనివాసులు, కుమార్తె కల్పజ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పారిశ్రామిక వేత్త అమరనాథ్ స్పష్టం చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...టీటీడీ పాలకమండలి చైర్మన్గా అనేక బృహత్తర కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందిన ఆదికేశవులునాయుడు గురించి తెలియని వారు లేరన్నారు. స్థానికంగా చిత్తూరు వాస్తవ్యులైనప్పటికీ, వ్యాపారరీత్యా ఆదికేశవులునాయుడు కుటుంబం బెంగళూరులో స్థిరపడిందన్నారు. ఆరేళ్లక్రితం డీకే.శ్రీనివాసులు వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న రఘునాథ్ వారి ఇంటిలో చనిపోతే, ప్రస్తుతం రాజకీయ కుట్రతో ఆ మరణాన్ని వారికి అంటగడుతున్నారని ఆరోపించారు. వారితో 30 ఏళ్లుగా ఉన్న డ్రైవర్ను చంపాల్సిన అవసరం వారికి లేదని, అతని ఇంట్లోనే సహజంగా చనిపోయాడని పోలీసులు, కోర్టు నిర్ధారించినా తిరిగి వారిపై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. సమావేశంలో డీకే.ఆదికేశవులునాయుడు అభిమానులు రాయల్ గణి, గట్టు చంద్రశేఖర్, గల్లా భాస్కర్, నసీబ్, నరేష్నాయుడు, సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ముందంజలో సౌరాష్ట్ర జట్టు
కడప వైఎస్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఉత్సాహంగా సాగుతోంది. రెండవ రోజు గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్ర–సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 42 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన ఆంధ్ర జట్టు నిర్ణీత 71 ఓవర్లకు 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 77 పరుగులు, ఆనంద్ జోషయ్య 40 పరుగులు చేశారు. సౌరాష్ట్ర జట్టులోని మోహిత్ ఉల్వా 3 వికెట్లు తీశారు. ఉత్సాహంగా సాగుతున్న కూచ్బెహర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ -
కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు...అప్పులు...అనారోగ్యం వెరసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో వెలుగుచూసింది. కోళ్లబైలు పంచాయతీ వైఎస్సార్ కాలనీకి చెందిన రామస్వామి, శివమ్మ దంపతుల కుమారుడు హరినాథ్(32)కు తంబళ్లపల్లె మండలం మూలపల్లెకు చెందిన గంగాదేవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటూ జీవించేవారు. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నాలుగేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు. బెంగళూరు నుంచి మదనపల్లెకు వచ్చిన హరినాథ్ తల్లిదండ్రులతో పాటు ఇంట్లోనే ఉండేవాడు. కొంతకాలంగా అనారోగ్యానికి గురై పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. ఆరోగ్యం మెరుగుపడలేదు. అంతేకాకుండా చికిత్స కోసం పలుచోట్ల అప్పులు చేశాడు. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు కుటుంబ సమస్యలు, భార్య లేక ఒంటరితనం తదితర కారణాలతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించారు. ఈలోపుగా హరినాథ్ భార్య గంగాదేవి తన భర్త మృతి చెందడంపై తనకు అనుమానం ఉందంటూ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు మృతుడి భార్య గంగాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళావెంకటరమణ తెలిపారు. -
ప్రభుత్వ భూమి కబ్జా.!
సిద్దవటం : మండలంలోని పెద్దపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలో మాధవరం–1 గ్రామంలో విలువైన ప్రభుత్వ భూమిని స్థానికులతో కలిసి కొందరు ఆక్రమించే పనులు చేపట్టారు. దాదాపు 40 ఎకరాలకు పైబడిన భూమిపై మొక్కలు తొలగించి చదును చేశారు. మాధవరంలోని 937 సర్వే నంబరులో దాదాపు 154 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా మాధవరం–1లోని ఎస్కెఆర్ నగర్ దళితులు నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మా భూములు మాకే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సోమశిల వెనుక జలాల గ్రామాలు ముంపునకు గురై ఇక్కడికి గతంలో మాధవరం–1లోని ఎస్ఎఆర్ నగర్ దళితులు వలస వచ్చారు. జీవనాధారం కోసం ప్రభుత్వ భూములు మంజూరు చేయాలని అధికారులను పలుమార్లు కోరారు. వారికి భూపంపిణీ కింద పట్టాలు మంజూరు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. అయితే నేటికీ వారికి పట్టాలు మంజూరు చేయలేదు. తరచూ ఈ భూమి ఆక్రమణ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తుండటంతో సర్వే చేసి తమకు భూమి పట్టాలు ఇవ్వాలని పలుమార్లు దళితులు రెవెన్యూ అధికారులను కోరారు. ప్రస్తుతం ఆ ప్రభుత్వ భూమిని కొందరు పొక్లెయిన్ యంత్రం తెచ్చి భూమిలో చదును పనులు చేపట్టారు. ఈ భూమిపై తమకు ఒక్కొక్కరికి నాలుగు ఎకరాల పైబడి పట్టాలు ఉన్నాయంటూ కొందరు స్థానికులు చెబుతున్నారు. భూకబ్జాదారులను అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ మళ్లీ వారు రాత్రి వేళ పనులు కొనసాగిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ భూముల పక్కన నేషనల్ గ్రీన్ హైవే రహదారి నిర్మాణం కోసం పనులు కొనసాగుతుండటంతో అందరి కళ్లు ఈ భూమిపైన పడ్డాయని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన తమకు భూములు ఇచ్చేంత వరకు నిరవధిక రిలే నిరాహారదీక్షలు చేస్తామని చదును చేసిన స్థలంలో వారు ఆందోళన చేస్తున్నారు.నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టిన దళితులు -
రైతుపై హత్యాయత్నం
బి.కొత్తకోట : ఇంటిస్థల వివాదం ఓ రైతుపై హత్యాయత్నానికి దారితీసిన ఘటన గురువారం తెల్లవారుజామున మండలంలోని కంబాలపల్లెలో జరిగింది. దీనిపై సీఐ గోపాల్రెడ్డి మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా.. బీరంగి గ్రామం కంబాలపల్లెకు చెందిన శంకర (45), చౌరెడ్డి (40) మధ్య ఇంటిస్థలం విషయమై వివాదం నడుస్తోంది. ఈ వ్యవహరంపై శంకర కోర్టును అశ్రయించడంతో చంపుతానని చౌరెడ్డి బెదిరింపులకు పాల్బడుతున్నాడు. వివాద స్థలంలో చౌరెడ్డి చెత్తకుప్పలు వేస్తుండటంతో వాటిని తీసివేయాలని శంకర కుటుంబీకులు చెప్పగా వారిపైనే గొడవలకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున శంకరను చౌరెడ్డి అసభ్యంగా దూషిస్తూ, తిడుతూ చంపాలనే ఉద్దేశంతో కొడవలితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాంతో శంకర తలపై, ఎడమ చేతిపై నరకడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు లలిత, రెడ్డెప్ప, నారాయణస్వామిలు చౌరెడ్డి దాడి నుంచి శంకరను కాపాడారు. గాయపడిన బాధితుడిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య అశ్విని ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతికడప కోటిరెడ్డిసర్కిల్ : కడప రైల్వేస్టేషన్ సమీపంలోని బుగ్గవంక బ్రిడ్జి వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని గుర్తించిన వారు కడప రైల్వే సీఐ 94406 27398, ఎస్ఐ 94409 00811 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. వైఎస్సార్సీపీ గల్ఫ్, కువైట్ కమిటీల సేవలు ప్రశంసనీయం కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ గల్ఫ్, కువైట్ కమిటీల సేవలు ప్రశంసనీయమని ఆ పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు అన్నారు. మూడోసారి గల్ఫ్ కన్వీనర్గా ఎన్నికై గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, దుబాయ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దిగ్విజయంగా నిర్వహించి కడపకు విచ్చేసిన బీహెచ్ ఇలియాస్ను వారు ఘనంగా సన్మానించి అభినందించారు. ఇంటిస్థల వివాదమే కారణం -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీ శాఖ రేంజ్ అధికారి వై.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వివరాలిలా.. రాయవరం సెక్షన్ వానరాచపల్లె బీట్ పరిధిలోని తాటిమానుపెంట ప్రదేశంలో ఎర్రచందనం అక్రమ రవాణా అవుతోందనే సమాచారం రావడంతో అటవీ శాఖ సిబ్బంది రాత్రి 9 గంటల సమయంలో ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అశోక్ లేలాండ్ దోస్త్ (టీఎన్ 92జే 1679) వాహనం వీరికి ఎదురుగా వస్తుండగా వాహనంలోని ఇద్దరు వ్యక్తులు అటవీశాఖ సిబ్బందిని గుర్తించి కిందకు దూకారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పొదలలో పారిపోయారు. వాహనాన్ని పరిశీలించగా అందులో 1205 కేజీల బరువున్న 30 ఎర్రచందనం దుంగలున్నాయి. వాహనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.11,82,620, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని సానిపాయి రేంజ్ అధికారి తెలిపారు. ఈ తనిఖీలో రాయవరం డీవైఆర్ఓ రమేష్బాబు, సానిపాయి స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
బోయనపల్లెలో బీహారీల గంజాయి!
రాజంపేట : రాజంపేట మండలం బోయనపల్లె (కడప–రేణిగుంట జాతీయ రహదారి)లో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టయింది. బోయనపల్లెను వీడని గంజాయివాసన అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. కొద్దిరోజుల క్రితం గంజాయి మత్తులో కొంతమంది యువకులు నేరాలకు పాల్పడిన సంఘటనలతో మన్నూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ ప్రసాద్బాబు నేతృత్వంలో.. మన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్బాబు నేతృత్వంలో పోలీసులు బోయనపల్లెలో గంజాయి అమ్మకాలపై దృష్టి సారించారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా...బీహార్ రాష్ట్రం ముజఫర్ జిల్లా సాధూలేపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, తిరుపతి జిల్లా వడమాలపేట, లక్ష్మీపురానికి చెందిన రావెళ్ల మోహన్, బీహార్కు చెందిన మహదేవచౌదరి, రైల్వేకోడూరు మండలం సమతానగర్కు చెందిన మాడగడపాల దియా, పుల్లంపేటకు చెందిన దాసరి తరుణ్, పుల్లంపేట మండల దళవాయిపల్లెకు చెందిన కట్టే ప్రవీణ్కుమార్రెడ్డి, రాజంపేట మండలం ఇసుకపల్లె లక్ష్మీపురానికి చెందిన పిడుగు అజయ్లు బోయనపల్లెలో గంజాయి రవాణా, అమ్మకాలకు కారణంగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి పది కేజీల గంజాయి, ఆరుసెల్ఫోన్లు, రూ.3వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేసిన రిమాండ్ నిమిత్తం రాజంపేట కోర్టుకు పంపించారు. నేరమిలా.. గంజాయి కేసులో బీహార్కు చెందిన వారు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దమొత్తంలో గంజాయిని తీసుకురావడం కొనసాగుతూ వచ్చింది. తిరుపతి జిల్లా వడమాలపేటలో డాబా నడుపుతూ, వాహనాల డ్రైవర్ల ద్వారా చుట్టూ ప్రాంతాల వారికి రవాణా చేస్తున్నారు. స్థానికంగా పంపిణీ చేసుకుంటున్నారు. వినియోగదారులకు విక్రయం వంటి విధానం వల్ల గంజాయి స్మగ్లింగ్ వ్యవహారం పోలీసులు విచారణలో బహిర్గతమైంది. గంజాయి పట్టివేతలో సీఐ ప్రసాద్బాబు, పోలీసుల ప్రతిభకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి.ఏడుగురిని అరెస్టు చేసిన మన్నూరు పోలీసులు -
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
రాయచోటి: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని రాయచోటి, మదనపల్లి, పీలేరు, కోడూరు, రాజంపేట, తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏసుక్రీస్తును కొలుస్తూ భక్తులు ఆలపించిన దైవభక్తి గీతాలు అలరించాయి. ఈ సందర్భగా పాస్టర్లు ఏసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు. పలు రాజకీయ పార్టీల నేతలు చర్చిలకు వెళ్లి కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుబాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా రాజంపేటలోని చర్చిలో శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వాయల్పాడు సీహెచ్ చర్జిలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రైల్వేకోడూరులోని లూథరన్ చర్చి, రెడ్డివారిపల్లి చర్చిలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాయచోటిలోనే బేథాల కాలనీ చర్చిలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మదనపల్లిలో పురాతన సిహెచ్ఐ, లూథరన్, హలలూయ చర్చిలలో నియోజకవర్గ ఇన్చార్జి నిస్సార్ అహ్మద్ పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలతో కలిసి నిస్సార్ అహ్మద్ కేక్లు కట్ చేసి సంబరాలలో పాలు పంచుకున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక నాయకులు క్రిస్మస్ వేడుకలలో పాల్గొని పాస్టర్లు ఇచ్చిన సందేశాలను విన్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు -
జిల్లా కోసం చేపట్టే ఉద్యమానికి సంఘీభావం
రాజంపేట: రాజంపేట జిల్లా కేంద్రం కోసం చేపట్టే ఏ ఉద్యమానికై నా నా సంఘీభావం ఎల్లప్పుడూ ఉంటుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. రాజంపేట అంబేడ్కర్ సర్కిల్లో 20రోజుకు చేరుకున్న అన్నమయ్య జిల్లా సాధనసమితి ఆధ్వర్యంలో మన్నూరు(రాజంపేట పట్టణం) వాసులు చేపట్టిన రిలేనిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్ధితుల్లో విమర్శలు అనవసరమనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.తాను రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదని స్పష్టంచేశారు. రాజంపేట ప్రాంత వాసిగా తనకు కూడా రాజంపేట జిల్లా కేంద్రం కావాలనే ఉంటుందని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషిచేయాలన్నారు. కొత్త జిల్లాలో ఏర్పాటు క్రమంలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటిలను కలిపి అన్నమయ్య జిల్లాకు భౌగోళికపరంగా ఆలోచించి కేంద్రంగా ఆనాడు రాయచోటిని ఏర్పాటుచేయడం జరిగిందనేది అందరికి తెలిసిందేనన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మదనపల్లె జిల్లాను ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పుడు ఏర్పడిన భౌగోళిక పరిస్ధితుల నేపథ్యంలో కేంద్రబిందువుగా రాజంపేటను చేయాలని ఇక్కడి ప్రాంతీయులు మనోగతమే ఉద్యమరూపంలా కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేట ఎన్నికల సభలో రాజంపేటను జిల్లాకేంద్రంగా మారుస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఇక్కడి ప్రజలు ప్రస్తావిస్తున్నారన్నారు. ప్రజల మనోగతాన్ని అనుసరించి ఎన్నికల హామీని నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. చేతనైతే జిల్లా తీసుకుండి: మున్సిపల్ వైస్ చైర్మన్ సవాల్ దీక్షా శిబిరంలో రాజంపేట మున్సిపల్ వైస్చైర్మన్ మర్రి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రమే మన ధ్యేయమనేది గుర్తుపెట్టుకోవాలన్నారు. కొంతమంది రాజకీయంగా నీచంగా దిగజారిపోతున్నారన్నారు. గతంలో కూడా చెప్పామన్నారు. ప్రభుత్వంలో ఉండేది మీరు.. చేతనైతే జిల్లా కేంద్రం తీసుకురావాలన్నారు. ప్రజలను తప్పుదోవపట్టించేందుకు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. పోరాటం నుంచి వైఎస్సార్సీపీ పుట్టిందన్నారు. జిల్లా సాధించే వరకు పోరు సాగిస్తానన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీనేత, వడ్డెర సంఘం రాష్ట్రనాయకుడు వడ్డె రమణ మాట్లాడుతూ ఇప్పుడు కావాల్సింది, చేయాల్సింది రాజకీయ విమర్శలు కాదని హితవు పలికారు. మన్నూరుకు చెందిన వడ్డెరసంఘం నేత రమణ,రసూల్,కళ్యాణ్, బాలాజీ, బోనం పిచ్చయ్య, పిడుగుమల్లి, వెంకటసుబ్బారెడ్డి, నాగరాజు, నరసింహులు,గల్లా హరిప్రసాద్, ఉమ్మడి శివశంకరయ్య,చిన్నయ్య, నరసింహులతోపాటు సౌమ్యనాథాలయ మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, క్షత్రియ సంఘం నేత జీవీసుబ్బరాజు పాల్గొన్నారు. ఎన్నికల సభలో సీఎం ప్రకటించిన హామీ నెరవేర్చుకోవాలి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి -
నీళ్ల ట్యాంకర్ ఢీకొని వృద్ధురాలి మృతి
రాయచోటి టౌన్ : నీళ్ల ట్యాంకర్ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన రాయచోటి పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీలో నివాసముండే మకుర్నిసా (65) అనే వృద్ధురాలు బుధవారం రాత్రి బయటి నుంచి ఇంటిలోకి వెళుతోంది. అక్కడే ఉన్న నీళ్ల ట్యాంకర్ డ్రైవర్ ఆమెను గమనించక ట్యాంకర్ను వెనక్కు మళ్లించే క్రమంలో ఆమెను ఢీకొంది. వెనుక చక్రం కింద పడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన సంఘటనపై ట్రాఫిక్ పోలీసులు విచారణ చేస్తున్నారు. తరిగొండ దర్గాలో హుండీ ఆదాయం చోరీ గుర్రంకొండ : మండలంలోని తరిగొండ హజరత్ మురాద్షావలీ దర్గాలో రెండు హుండీలను పగులగొట్టి అందులో డబ్బులను దుండగులు చోరి చేసుకెళ్లిన సంఘన బుధవారం జరిగింది. గ్రామానికి సమీపంలో ఉన్న ఈ దర్గాకు ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. భక్తులు బాబాకు కానుకలను హుండీలో వేసి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఈనేపథ్యంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు దర్గాలోని రెండు హుండీలను పగులగొట్టి అందులో నగదును ఎత్తుకెళ్లారు. దర్గాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేసి డేటా రికార్డులు ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈరోజు యథావిధిగా దర్గా తెరవడానికి వచ్చిన దర్గా నిర్వాహకులకు హుండీలు పగులగొట్టిన దృశ్యాలు కనిపించాయి. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైకుపై నుంచి పడి మహిళ మృతిపుల్లంపేట : మండల పరిధిలోని జాగువారిపల్లె సమీపంలో బైకుపై నుంచి జారి పడి మహిళ మృతి చెందింది. మండల పరిధిలోని టి.బలిజపల్లెకు చెందిన బుజ్జినేని సిద్దమ్మ (45) తన కుమారుడు ఉపేంద్రతో కలిసి రాజంపేట నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జాగువారిపల్లె వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కింద పడడంతో సిద్దమ్మ తలకు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు. జాతీయ స్థాయి సైన్స్ఫేర్కు కడప విద్యార్థి కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రస్థాయి సైన్సు ఫేర్లో భాగంగా ఈ నెల 23, 24 తేదీలలో విజయవాడ మురళి రిసార్ట్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో కడప విద్యార్థి ఘన విజయం సాధించి సౌత్ జోన్ సైన్సుఫేర్కు ఎంపికయ్యాడు. కడప నగరం అంగడివీధి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఓ. గిరీష్ అనే విద్యార్థి గైడ్ టీచర్ మాధవి నారాయణ మార్గ దర్శకత్వంలో స్నేక్ బైట్ అలర్ట్ అనే వర్కింగ్ మోడల్ను ప్రదర్శించి తమ ప్రతిభను చాటి అందరి మన్ననలు పొందాడు. రాష్ట్రస్థాయిలో ఘన విజయం సాధించిన విద్యార్థి గిరిష్ త్వరలో నిర్వహించనున్న సౌత్ ఇండియా సైన్సుఫేర్లో పాల్గొననున్నాడు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్లో ప్రతిభ చాటిన విద్యార్థి గిరీష్, గైడ్ టీచర్ మాధవి నారాయణ, జిల్లా సైన్సు అధికారి వేపరాల ఎబినేజర్లను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ క్రిష్ణారెడ్డి, డీఈఓ షేక్ షంషుదీ్ద్న్ అభినందించారు. -
టమాటా ధరల్లో కోతలు వేస్తున్నారు
● బిల్లుల కోసం నెలల తరబడి తిప్పుకుంటున్నారు ● ఇష్టానుసారంగా జాక్పాట్ల పేరుతో దోపిడీ ● రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్కు రైతుల ఫిర్యాదుగుర్రంకొండ : రైతుల్ని దోచుకుంటున్న టమాటా వ్యాపారులపై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ రైతుకు చెందిన టమాటాల ధరలను ఇష్టానుసారం కోతలు వేస్తూ రైతులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రైతులు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయసునీతకు ఫిర్యాదు చేశారు. బుధవారం స్థానిక మార్కెట్యార్డులో ఆమె పర్యటించారు. యార్డులోపల నిర్వహిస్తున్న టమాటా మండీలను పరిశీలించారు. టమాటా క్రీట్లు, వాటి ధరలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్యార్డుల్లోని టమాటా మండీలో జరుగుతున్న అన్యాయాలపై రైతులు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులు చేసిన రైతులను వ్యాపారులు వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఏ రైతులైతే ఫిర్యాదు చేస్తారో వారి టమాటా ధరలను వేలం పాటల్లో ఇష్టానుసారం కోతలు విధించి నష్టాలపాలు చేస్తున్నారని చెప్పారు. టమాటా కొనుగోలుకు సంబంధించిన బిల్లుల తాలుకు డబ్బులు చెల్లించడానికి టమాటా మండీల యజమానులు నెలల తరబడి తిప్పుకొంటున్నారని రైతులు ఆమెకు ఫిర్యాదు చేశారు. జాక్పాట్ల పేరుతో వందకు 10 నుంచి 15 క్రీట్ల టమాటాలను ఉచితంగా వ్యాపారులు రైతుల వద్ద నుంచి లాక్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాలుగు శాతం కమీషన్ వసూలు చేయాల్సి ఉండగా పదిశాతం వసూలు చేయడంతో ఇతర మండీల ఖర్చులన్నీ రైతులపైనే మోపుతున్నారని వాపోయారు. అనంతరం ఆమె రైతుల నుద్దేశించి మాట్లాడుతూ.. మార్కెట్యార్డుల్లో నిర్వహించే టమాటా మండీల్లో జాక్పాట్లు రద్దు చేస్తున్నామని అన్నారు. ఎవరైనా వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘించి జాక్పాట్లు వసూలు చేస్తే వారి లైసెన్స్లు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. మార్కెట్యార్డు పరిధిలోని బయట ప్రాంతాల్లో ఎవరు కూడా ప్రైవేట్గా టమాటా మండీలు నిర్వహించకూడదన్నారు. ఇలా ఎవరైనా మండీలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. జనవరి నుంచి 25 కేజీల క్రీట్ల స్థానంలో 15 కేజీల టామాటా క్రీట్ల విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్శాాఖ జేడీ రామాంజనేయులు, ఏడీఎమ్ త్యాగరాజు, డీడీఎమ్ లావణ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోసూరి చంద్రమౌళి, వైస్ చైర్మన్ నౌషాద్ఆలీ, ఇన్చార్జి కార్యదర్శి సునీల్ పాల్గొన్నారు. జాక్పాట్ రద్దుకు చర్యలు మదనపల్లె రూరల్ : టమాటా మార్కెట్లలో జాక్పాట్ సిస్టం పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్శాఖ కమిషనర్ విజయసునీత తెలిపారు. బుధవారం మదనపల్లె పర్యటనలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించారు. మార్కెట్కమిటీ చైర్మన్ జంగాల శివరాంతో కలిసి మార్కెట్యార్డులో మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మార్కెటింగ్శాఖ కమిషనర్ మాట్లాడుతూ.. మదనపల్లె మార్కెట్యార్డులో సౌకర్యాల లేమి కనిపిస్తోందన్నారు. టమాటా క్రయవిక్రయాలకు సంబంధించి పెద్దసంఖ్యలో రైతులు వచ్చే మార్కెట్యార్డులో క్యాంటీన్, రైతుల వసతి కేంద్రం, డ్రెయిన్లు, చైర్మన్ ఛాంబర్తో సహా మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సి ఉందన్నారు. స్థానిక డిమాండ్కు అనుగుణంగా మార్కెట్యార్డు ఎదుట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మార్కెట్కమిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, ఇదివరకే దీనికి సంబంధించి ప్రతిపాదనలు అందాయని, త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. 25 కిలోల క్రేట్ల వినియోగంపై ఇటు రైతులు, అటు ట్రేడర్స్ పరంగా నష్టం వస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ములకలచెరువు, గుర్రంకొండ, మదనపల్లె మార్కెట్లలో యూనిఫాం సిస్టంలో చిన్న క్రేట్లు వినియోగంలోకి తెస్తామన్నారు. -
మెర్రిసే క్రిస్మస్
విద్యుత్ దీపాల వెలుగులో మదనపల్లెలోని జేసీఎం చర్చి ఏసు జననం..మహోదయం..సర్వలోకానికి కరుణోదయం. మరియపుత్రుడు భువికేతెంచే క్షణం కోసం హృదయానందంలో జనులు జేజేలు కొడుతున్నారు. క్మిస్మస్ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు క్రైస్తవ లోకం సిద్ధమైంది. మెర్రీ క్రిస్మస్..హ్యాపీ క్రిస్మస్ అంటూ క్రిస్మస్కు స్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. తేజోమయుని పుట్టిన ఘడియ రాగానే క్రైస్తవుల సంబరాలు అన్నీ ఇన్నీ కావు. కేక్లను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనేక చర్చిల్లో యవ్వనస్తులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు.మార్కెట్లలోనూ క్రిస్మస్ సందడి కనిపించింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని చర్చిల్లో ప్రత్యేక ఆరాధనలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని తెలియజేయజేస్తారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం అన్ని చర్చిల్లో సంఘకాపర్లు ప్రేమ విందులను ఏర్పాటు చేశారు. –సాక్షి నెట్వర్క్ -
ముదివేడు రిజర్వాయర్ మీరే పూర్తి చేయండి
బి.కొత్తకోట: కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది..మీరే ముదివేడు రిజర్వాయర్ పనులు చేపట్టి పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ లోక్ సభాపక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ.మిథున్ రెడ్డి టీడీపీ నేతలను కోరారు. బుధవారం బి.కొత్తకోట ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి హజరైన ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కురబలకోట మండలంలో రూ.755 కోట్లతో ముదివేడు రిజర్వాయర్ నిర్మాణం చేపడితే టీడీపీ నేతలు ఎన్జీటీలో అక్రమ కేసులువేసి పనులు నిలిపి వేయించారని అన్నారు. మీ చేతుల్లోనే ప్రభుత్వం ఉంది, అక్రమ కేసులతో పనులు ఆపివేయించింది మీరే, ఈ ప్రాజెక్టు కరువు రైతులకు ఎంత ఉపయోగకరమో ఇప్పటికై నా గుర్తించండి..మిగిలిన పనులను చేపట్టి పూర్తి చేయాలని టీడీపీ నేతలను కోరారు. మీ తప్పిదాన్ని మీరే సరి చేసుకోండి అని వారికి సూచించారు. తక్షణమే పనులు చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. దీనికోసం రైతుల పక్షాన తామే పరిహారం కోసం కోర్టును ఆశ్రయించడం జరిగిందని అన్నారు. పరిహారం విషయంలో రైతులకు న్యాయం చేయాలన్నారు. రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ముదివేడు రిజర్వాయర్ పనులు ఆగిపోవడం వల్ల కరువు ప్రాంతమైన తంబళ్లపల్లె నియోజకవర్గానికి తీరన అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువువస్తే నీటిని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. ప్రధాన కారణం నీటిని నిలువ చేసుకునే అవకాశం లేకపోవడమేనని అన్నారు. హంద్రీ–నీవా కాలువ వెడల్పు కోసం తమ ప్రభుత్వంలో రూ.2129 కోట్లతో పనులు చేపడితే...చంద్రబాబు ప్రభుత్వం విస్తరణ పనులు ఆపి కాలువకు లైనింగ్ చేయించిందన్నారు. ఈ కాలువ ద్వారా చెరువులకు కృష్ణా జలాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికి ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. కాలువ నుంచి చెరువులకు నీటిని మళ్లించి చెరువులను నింపాలని కోరారు. కృష్ణా జలాలను తరలించి నిల్వ చేయడం వల్ల భవిష్యత్తులో కరువు పరిస్థితులు వస్తే ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయని అన్నారు. అసలు తంబళ్లపల్లె ఆంధ్రాలో ఉన్నట్టుగా కూడా పాలకులు గుర్తించడం లేదని, ఇప్పటికై నా తంబళ్లపల్లె ఆంధ్రాలో ఉన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కుప్పంపై చూపుతున్న శ్రద్ధ కరువు ప్రాంతమైన మారుమూల నియోజకవర్గం తంబళ్లపల్లైపెనా శ్రద్ధ చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించాం తంబళ్లపల్లె ఆంధ్రాలో ఉందని గుర్తించండి కుప్పంపైనే కాదు ఇక్కడా శ్రద్ధ చూపండి కృష్ణా జలాలతో చెరువులను నింపాలి ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మదనపల్లె అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కృషి చేస్తున్నట్టు ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నందున కదిరి రోడ్డు నుంచి బెంగళూరు రోడ్డుకు, అక్కడినుంచి పలమనేరు రోడ్డును కలిపేలా బైపాస్ రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రికి విన్నవించినట్టు చెప్పారు. మదనపల్లె, తంబళ్లపల్లె పేద విద్యార్థులకు నాణ్యమైన కేంద్రీయ విద్య అందించాలని లక్ష్యంతో మంజూరు చేయించిన కేంద్రీయ విద్యాలయం తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కేంద్రమంత్రిని కోరినట్టు చెప్పారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాలకు కీలకమైన కడప–బెంగళూరు రైల్వే మార్గం పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ రైలు మార్గంతో పార్లమెంట్ నియోజకవర్గానికి, బెంగళూరు మధ్య రాకపోకల సౌకర్యం పెరగడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు పెరిగి ఇక్కడి ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. అలాగే తమిళనాడు, ఏపీ మధ్య రాకపోకలకు సౌకర్యంగా ఉండే చైన్నె ప్యాసింజర్ రైలు సేవలను త్వరితగతిన ప్రారంభించాలని రైల్వే మంత్రికి విన్నవించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు రెడ్డిశేఖర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాగొండ ఖలీల్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాంబశివ, మండల పరిషత్ అధ్యక్షులు ఎన్.రాధ, మోహమూద్, పూర్ణచంద్రిక, శ్యామలమ్మ, జెడ్పీటీసీలు రామచంద్ర, శివన్న పాల్గొన్నారు. -
సౌత్ జోన్ ఫెస్టివల్లో ప్రతిభ
వేంపల్లె: సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్స్లో ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. చైన్నెలో హిందూస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్స్లో దాదాపు 35 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఇందులో ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇండియన్ గ్రూప్ సాంగ్ 5వ స్థానం కై వసం చేసుకున్నారు. విద్యార్థుల ప్రతిభపై డైరెక్టర్ కుమారస్వామి గుప్తా హర్షం వ్యక్తం చేసి అభినందించారు. కడప రూరల్: కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో బుధవారం డిప్యూటీ డెమోగా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో పనిచేస్తున్న ఏడుగురు హెల్త్ ఎడ్యుకేటర్స్కు డిప్యూటీ డెమోగా పదోన్నతులు కల్పించారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. రాయచోటి: అన్నమయ్య జిల్లా విద్యార్థులు హర్షప్రియ, వినయ్లు రూపొందించిన ప్రాజెక్టు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్కు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 24వ తేదీల్లో రెండు రోజులపాటు విజయవాడలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారన్నారు. అన్ని జిల్లాల నుంచి 286 ప్రాజెక్టులను ప్రదర్శించారన్నారు. సుండుపల్లి మండలం, తిమ్మసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న హర్షప్రియ, వినయ్లు రూపొందించిన త్రీడీ ఆకారాలను అవగాహన చేసుకొని వినియోగించడం అనే ప్రాజెక్టు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్కు ఎంపికై ందన్నారు. వీరు జనవరిలో నిర్వహించనున్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్లో పాల్గొంటారన్నారు. వీరికి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి మెమెంటో, సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. గణిత ఉపాధ్యాయుడు పద్మరాజు, అశోక్ రాజు వీరికి గైడ్ టీచర్గా వ్యవహరించారు. జిల్లా విద్యాశాధికారి కె సుబ్రమణ్యం, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవులూరి చంద్రశేఖర్ విద్యార్థులను, గైడ్ టీచర్ను అభినందించారు. -
15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సిద్దవటం : కూంబింగ్ సిబ్బంది దాడి నిర్వహించి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని తమిళ కూలీని అరెస్టు చేసినట్లు రేంజర్ కళావతి తెలిపారు. సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ ఆదేశాల మేరకు కూంబింగ్ నిర్వహించామన్నారు. సిద్దవటం రేంజ్లోని గొల్లపల్లి బీటు, గొల్లపల్లి సెక్షన్ నల్లబండలు, సాలుపెంట ప్రదేశంలో మంగళవారం తమ సిబ్బందితో కూంబింగ్ నిర్వహిస్తుండగా కొందరు ఎర్రచందనం దుంగలు మోసుకొని వెళ్లడాన్ని తాము చూశామన్నారు. వారు తమ సిబ్బందిని చూసి పరారవుతుండటంతో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో ఒక తమిళ కూలీని అరెస్ట్ చేశామన్నారు. అక్కడ లభించిన 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల బరువు 479 కేజీలు ఉంటుందని, వీటి విలువ రూ.1.39 లక్షలు చేస్తుందన్నారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడిన నిందితుడు తమిళనాడు రాష్ట్రం వేలూరు తాలూకా చిన్నతటన్ కొంటై గ్రామానికి చెందిన మునిస్వామి అలియాస్ ముత్తుస్వామి అన్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టుకు హాజరుపరిచామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఓబులేసు, గొల్లపల్లి ఎఫ్బీఓ మధు, సిద్దవటం ఏబీఓ హైమావతి, ప్రొటెక్షన్ వాచర్లు, సైక్లింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. రామాపురంలో.. రామాపురం : రాయచోటి రేంజ్ రామాపురం మండలంలోని గువ్వలచెరువు తూర్పు బీటు పరిధిలో కూంబింగ్ నిర్వహించి ఒక తమిళ కూలీని అరెస్టు చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మదనమోహన్ తెలిపిన వివరాల మేరకు.. వేపమాను బోటు ప్రదేశంలో ఏడుగురు తమిళ కూలీలు ఎర్రచందనం చెట్లు నరుకుతుండగా చుట్టుముట్టి పట్టుకునేందుకు ప్రయత్నించగా తమిళనాడుకు చెందిన కన్నాబిరాన్ పట్టుబడ్డాడు. మిగిలిన వారందరూ తప్పించుకున్నారు. అతని వద్ద నుంచి రెండు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుపతి రెడ్ శాండిల్ కోర్టుకు తరలించారు. మిగిలిన ఆరుగురి కోసం అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కూంబింగ్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జి.భరణికుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె.రఘుపతిరాజు, ఫారెస్టు ప్రొచక్షన్ వాచర్లు పాల్గొన్నారు.తమిళ కూలీ అరెస్టు -
రహదారుల పనులను వేగవంతం చేయాలి
రాయచోటి : రహదారుల పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయాణ ఖర్చు తగ్గేలా చూడాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్లో పంచాయతీ రాజ్, రహదారులు, భవనాల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, నీటిపారుదల శాఖ, జాతీయ రహదారులు, డ్వామా తదితర ఇంజినీరింగ్ శాఖల పనుల పురోగతిపై జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, నాబార్డు తదితర నిధులతో చేపడుతున్న రహదారుల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ తదితర ప్రాజెక్టులను కాలపరిమితితో పూర్తి చేయాలన్నారు. జల జీవన్ మిషన్ కార్యక్రంమలో 3079 పనులలో 2615 పనులు పూర్తి చేశారని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు క్రింద జిల్లాలోని 18 మండలాలలో 3075 ప్రాంతాలకు నీటి సరఫరా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాలలో చేపడుతున్న మొత్తం 75 పనులలో 30 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల పనులపై సమీక్షిస్తూ రాయచోటి నుంచి వేంపల్లి వరకు ఎన్హెచ్ 440 రహదారిపై పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా శాఖల డివిజన్ స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
కూచ్బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. బుధవారం కడప వేదికగా వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర–సౌరాష్ట్ర జట్లు తలపడ్డాయి. తొలి రోజు టాస్ గెలిచిన ఆంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టు నిర్ణీత 66.2 ఓవర్లకు 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని వన్ష్ ఆచార్య 134 బంతుల్లో 18 ఫోర్లతో 124 పరుగులు, హర్వాన్ష్ సింగ్ 27 పరుగులు చేశారు. ఆంధ్ర జట్టులోని తోషిత్ యాదవ్ 14 ఓవర్లకు 50 పరుగులిచ్చి 3 వికెట్లు, ప్రణవ్ రెడ్డి 2 వికెట్లు, రాజేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్ర జట్టు నిర్ణీత 17 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 42 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 21 పరుగులు, హానీష్ వీరారెడ్డి 13 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
జిల్లా కేంద్రం కోసం ‘న్యాయ’పోరాటం
రాజంపేట : భావితరాల ఉజ్జ్వల భవిష్యత్తుకు రాజంపేట జిల్లా కేంద్రం చేయాల్సిన అవసరం ఉందని రాజంపేట న్యాయవాదుల జేఏసీ ప్రతినిధి కొండూరు శరత్కుమార్రాజు డిమాండ్ చేశారు. బుధవారం కోర్టు క్లాంపెక్స్ నుంచి రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు, రైల్వేకోడూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామరాజు, నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి నరసింహులు నేతృత్వంలో న్యాయవాదులు జిల్లా కేంద్రం కావాలనే డిమాండ్తో నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు జాఫర్, రామచంద్రరాజు, వల్లభరావు, సురేష్బాబు, ఇందిర, కరణం శివశంకర్నాయుడు, ఛాయాదేవి, మురళి, వెంకటసుబ్బయ్య, నాగేంద్ర, మౌలా, బాలాజీనాయుడు, కేఎంఎల్ నరసింహ, గోవర్దన్రెడ్డి, ప్రభాకర్, తౌఫిక్, శివ, రాజశేఖర్, రవిశంకర్, అక్షయ్కుమార్, వెంకటరమణ, చంద్రమౌళి, శ్రీకాంత్, షాహిద్, కోటేశ్వరరావు, మస్తాన్, శోభారాణి, సాయిప్రశాంతి, శబరి పాల్గొన్నారు. రాజంపేట కోసం ఆమరణదీక్షకై నా సిద్ధం రాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రంగా ఎంపిక చేసేంతవరకు పోరాటం ఆగదని, అవసరమైతే ఆమరణదీక్షకై నా తాను సిద్ధమని రాజంపేట మున్సిపల్ వైస్చైర్మన్ మర్రి రవికుమార్ ప్రకటించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్తో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం19వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని గత ఎన్నికల సభలో రాజంపేట వాసుల సాక్షిగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. కార్యక్రమంలో మేధావులు, సంఘసేవకులు, స్ధానికులు, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రిలే నిరాహారదీక్షకు న్యాయవాదులు సందర్శించి, సంఘీభావం తెలిపారు. -
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కూటమి ప్రభుత్వం
రాయచోటి అర్బన్: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కూటమి ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించిన కూటమి నాయకులే ఇప్పుడు ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారని తెలిపారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.2.78లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రూ.3.26లక్షల కోట్లు ఆప్పులు చేస్తే, ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు, పపన్ కల్యాణ్లు ఏకంగా 10, 15లక్షల కోట్లు అప్పులు చేశారని దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏది చేసినా ప్రజలకు, రాష్ట్రానికి ఆస్తులు సమకూరాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పక్కా భవనాలు నిర్మించి, రాష్ట్రంలో ఏకంగా 12వేల సచివాలయాలు, పీహెచ్సీలు, ఆర్బీకేలు నిర్మించినట్లు తెలిపారు. ఆనాడే ఆదానీ గూగుల్ వస్తే దాన్ని గూగుల్గా పేరు మార్చి పబ్బం గడుపుతున్నారని తెలిపారు. జగన్ పాలనలో జరిగిన విషయాన్ని ఆర్బీఐ ఇచ్చిన నివేదికలో తయారీ రంగంలో దేశంలో 5వ స్థానం, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంతో పాటు, పరిశ్రమల విషయంలో దేశంలో 8వ స్థానం, దక్షణ భారత దేశంలో మొదటి స్థానంలో , ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో మొదటి స్థానంలో వరుసగా 5 ఏళ్ల ఉండటం జగన్ పాలనలో జరిగిన ఘనతే అనిన్నారు. ఈ అంశాలపై ఎక్కడైనా ఆధారాలతో సహా చర్చకు సిద్దమని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే కూటమి పాలకులు ఆవకాయ్ అమరావతి అంటూ ప్రచార ఆర్బాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని బ్రష్టు పట్టిస్తున్నా ప్రశ్నించని ప్రభుత్వం... మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కేంద్ర ప్రభుత్వం రామ్ జీ రామ్గా మార్చుతున్నారని శ్రీకాంత్రెడ్డి తెలిపారు. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వామపక్షాలతో కలిసి ఒత్తిడి చేయడంతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి పథకాన్ని తెచ్చారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దాదాపు రూ.2 లక్షల కోట్లు రాష్ట్రానికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. అయితే 12 ఏళ్ల మోదీ పాలనలో ఈ పథకానికి చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు పేరు మార్చి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నా కూటమి పాలకులు ప్రశ్నించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు కాళ్లు ఇంచుతాం, కీళ్లు ఇంచుతామని సినిమా డైలాగులు చెబుతున్న జనసేన నాయకులు ఇటువంటి ప్రజలకు నష్టం జరిగే అంశాలపై భాగస్వామ్య పార్టీ అయిన కేంద్రంలో ఉన్న బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు , కొత్త పింఛన్లు ఇవ్వలేని స్థితిలో ఉంటే ఉపాధి పథకంలో 40శాతం వాటాగా నిధులు ఇచ్చే విధంగా తయారైన కొత్త నిబంధనలను ఈ పాలకులు ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన 26 జిల్లాలకు ఇటీవల ప్రెసిడెంటల్ అప్రూవల్ వచ్చిందని, ఈ ప్రతిపాదన గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రానికి పంపినదేనని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి సమయంలో కొత్తగా జిల్లాల విభజన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాను యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేశారు., కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహ్మాన్, పట్టణ అధ్యక్షుడు నవాజ్, కౌన్సిలర్లు సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్, షబ్బీర్ పాల్గొన్నారు. 18 నెలల పాలనలో రూ.2.78లక్షల కోట్లు అప్పు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
వినియోగదారులకు మెరుగైన సేవలు
రాయచోటి : వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు నిరంతరం చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు సూచించారు. బుధవారం రాయచోటి డైట్ కళాశాలలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ లావాదేవీల్లో జరుగుతున్న మోసాలపట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వై.సుమతి మాట్లాడుతూ తూకాల్లో మోసం జరిగినా, నాణ్యతలేని వస్తువులు విక్రయించినా, రైల్వే, విమానయానం, విద్యుత్, గ్యాస్, కొరియర్ సేవలు, ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ వ్యాపారాల్లో లోపాలు, ఎదురైన సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే వినియోగదారుల హక్కులు, కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో వినియోగదారుల ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ఆంగ్ల, తెలుగు మీడియం వారిగా ప్రథమ బహుమతికి రూ. 5 వేలు, ద్వితీయ బహుమతికి రూ. 3 వేలు, తృతీయ బహుమతికి రూ. 2 వేలు చొప్పున మొత్తం రూ. 40 వేలు, ప్రశంసా పత్రాలు, మెడల్స్ విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సింగ్ అధికారి శోభలత, జిల్లా తూనికల కొలతల ఇన్స్పెక్టర్ దివ్య, జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి షమీం బాషా, రాయచోటి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ షేక్ సుమయ, మదనపల్లి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ చిరంజీవి, జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ బాలాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కుక్క అడ్డురావడంతో..
వాల్మీకిపురం/మదనపల్లె రూరల్ : మండలంలోని అయ్యవారిపల్లి సమీపంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పుంగనూరు మండలానికి చెందిన చిరంజీవి క్రిస్మస్ పండుగకు తన చెల్లిలు ప్రభావతి, మేనల్లుడు సంతోష్ కుమార్ను పిలుచుకొని వెళ్లేందుకు వాల్మీకిపురం మండలం, దిగువబూడిదవేడు గ్రామానికి వచ్చాడు. ఇక్కడ నుంచి తన స్కూటీపై చెల్లులు ప్రభావతి, మేనల్లుడు సంతోష్ కుమార్ను తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని అయ్యవారిపల్లి సమీపంలో స్కూటీకి అడ్డంగా కుక్క దూరడంతో స్కూటీని కంట్రోల్ చేయలేక కిందపడ్డారు. ఈ ప్రమాదంలో చిరంజీవి, ప్రభావతికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆటోలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మదరసా విద్యార్థి అదృశ్యం పీలేరు : మండలంలోని వేపులబైలు పంచాయతీలో ఉన్న మదరసా (మస్జిద్–ఇ–మస్సేహియా)లోని ఓ విద్యార్థి అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కలికిరి మండలం మేడికుర్తికి చెందిన పి. మస్తాన్వలి కుమారుడు మహహ్మద్ సిద్ధిక్ (15) వేపులబైలు వద్ద గల మదరసాలో విద్యనభ్యసించేవాడు. ఈ నెల 13న సాయంత్రం మదరసా నుంచి వెళ్లిపోయిన మహమ్మద్ సిద్ధిక్ అనంతరం ఆచూకీ లేదు. మదరసా యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాయచోటి విద్యార్థిని జాతీయ స్థాయికి ఎంపిక రాయచోటి అర్బన్ : యువత ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంలో రాయచోటికి చెందిన అరమాటి సంకీర్తన రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్రం నుంచి ఎంపికై న 500 మందికి విజయవాడలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన వికసిత్ భారత్ ఛాలెంజ్లో ప్రతిభ కనబరిచి అన్నమయ్య జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపికై ంది. దేశాభివృద్ధికి 2047 లక్ష్యంగా నిర్దేశించిన పలు అంశాలపై విద్యార్థులకు చాలెంజ్ నిర్వమించారు. ఈ పోటీలో సంకీర్తన రెడ్డి సాంస్కృతిక దౌత్యం అంశంపై ప్రపంచ ప్రభావం అనే అంశంపై వ్యాసరచనతో పాటు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసింది. అ తరువాత వ్యక్తిగత ఇంటర్వ్యూలో కూడా ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికై ంది. జనవరి 12వ తేదీన ప్రధాని మోడీతో దేశాభివృద్ధి, భవిష్యత్ భారత్, వికసిత్ భారత్ అంశాలపై యువత అభిప్రాయాలు పంచుకునే అవకాశాన్ని ఆమె దక్కించుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి,పద్మజ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలోనూ సంకీర్తనరెడ్డి ప్రతిభ చాటి అన్నమయ్య జిల్లా పేరు ప్రతిష్టలు పెంచాలని పలువురు ఆకాంక్షించారు.ప్రమాదంలో గాయపడిన చిరంజీవి, ప్రభావతి -
ఆర్టీసీ అద్దె బస్సు, లారీ ఢీ
సిద్దవటం : మండలంలోని కడప–చైన్నె జాతీయ రహదారి భాకరాపేట సమీపంలోని మలినేనిపట్నం కాలనీ వద్ద బుధవారం ఆర్టీసీ అద్దె బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. రాజంపేట ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు కడప నుంచి రాజంపేట వైపు వెళ్తుండగా పూణే నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా వెళ్తూ హైవేపై నిలుపుదల చేయడంతో లారీ వెనుక ఉన్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ అద్దె బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సు డ్రవైర్ మహేంద్ర మాట్లాడుతూ హైవే రోడ్డుపై ఒక్కసారిగా లారీ బ్రేక్ వేయడంతో లారీ వెనుక ఉన్న బస్సు ఢీకొందన్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్నారు. సంఘటన స్థలాన్ని హైవే పెట్రోలింగ్ పోలీసులు పరిశీలించారు. రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడికి తీవ్ర గాయాలుకడప కోటిరెడ్డిసర్కిల్/నందలూరు : అన్నమయ్య జిల్లా నందలూరు రైల్వే స్టేషన్ యాడ్ సమీపంలో 30 సంవత్సరాల వయస్సుగల గుర్తు తెలియని యువకుడు గూడ్స్ రైలు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారాన్ని అందుకున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది క్షతగాత్రుడిని తొలుత రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతరం కడప రిమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. మాట్లాడే స్థితిలో లేకున్న ఆ యువకుడి వివరాలు తెలియాల్సింది. ఇతనికి సంబంధించిన వారు తమను సంప్రదించాలని కడప రైల్వే పోలీసులు తెలిపారు. జూదరుల అరెస్టు రాయచోటి : రాయచోటి రూరల్ మండల పరిధిలోని శిబ్యాల గ్రామం సిద్ధారెడ్డి గారిపల్లెలో పేకాట స్థావరంపై బుధవారం దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు రాయచోటి అర్బన్ ఎస్ఐ విష్ణువర్దన్ తెలిపారు. వారి నుంచి రూ.8900 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడి సమయంలో మరో ముగ్గురు తప్పించుకొని పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. -
కలెక్టరేట్లో ఘనంగా క్రిస్మస్ హైటీ కార్యక్రమం
రాయచోటి : అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రిస్మస్ హైటీ కార్యక్రమం ప్రజలందరిలో సంతోషం, ఉత్సాహాన్ని కలిగించిందని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఘనంగా క్రిస్మస్ హైటీ కార్యక్రమం నిర్వహించారు. మత భేదాలు లేకుండా అందరికీ ఉత్సాహం, స్ఫూర్తిని అందించే పండుగ క్రిస్మస్ అని కలెక్టర్ అన్నారు. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, ఆనందం అనే సందేశాన్ని అందరికీ అందిస్తుందని, ఆ సందేశాన్ని సమాజంలోని చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిదీ అన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ క్యాండిల్ వెలిగించి, కేక్ కట్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జి సుగవాసి ప్రసాద్బాబు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఇనాయతుల్లా, పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. -
కడప రాయుడి కోవెలలో కల్యాణ రాగం
కడప సెవెన్రోడ్స్: తిరుమలకు తొలిగడపగా భావించే కడప నగరంలోని దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలకు విశేష అభిషేకాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించి కల్యాణ వేదికపైగల ప్రత్యేక పీఠాలపై కొలువుదీర్చారు. అనంతరం ప్రధాన అర్చకులు మయూరం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. సాయంత్రం కల్యాణమూర్తులను ప్రత్యేక పల్లకీపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. సాక్షాత్తు వైకుంఠ వాసుడే అమ్మవార్లతో కలిసి తమ ఇంటి ముంగిటికి రావడంతో భక్తులు పులకించి పూజాద్రవ్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అర్చకులు మంగళ హారతులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు
గాలివీడు : రైతు వద్ద రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ వలలో చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ సత్యమూర్తి వ్యవహారంలో రెండవ రోజూ సోదాలు కొనసాగాయి. మంగళవారం గాలివీడు విద్యుత్ శాఖ కార్యాలయంలో డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఏఈ సత్యమూర్తి, అతని కారు డ్రైవర్ శ్రీనివాసులును కార్యాలయంలో గంటకు పైగా రహస్యంగా విచారించారు. రైతుల నుంచి మరేదైనా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారా? ఇతర ఫిర్యాదులు ఉన్నాయా? అనే కోణంలో ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం నిందితులను తదుపరి చర్యల నిమిత్తం కడపకు తరలించినట్లు తెలుస్తోంది. బర్రెల దొంగలను పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు సిద్దవటం : కడప ఇందిరానగర్కు చెందిన జనార్దన్ మరో ఇద్దరు యువకులతో కలిసి బర్రెలను దొంగిలించి వాటిని తరలిస్తుండగా సిద్దవటం మండలంలోని కమ్మపాలెం గ్రామస్తులకు అనుమానం వచ్చి వారిని పట్టుకుని సిద్దవటం పోలీసులకు అప్పజెప్పారు. చింతకొమ్మదిన్నె మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన నాగార్జున అనే పాడి రైతుకు చెందిన 10 బర్రెలను జనార్దన్ మరో ఇద్దరు వ్యక్తులు దొంగిలించి వాటిని బద్వేల్ వైపు తీసుకెళుతుండగా మంగళవారం కమ్మపాలెం గ్రామస్తులు బర్రెల పొదుగు నుంచి పాలు కారిపోతుండటం గమనించి వాహనాన్ని ఆపారు. బర్రెల చెవులకు పాడి రైతు సెల్ నంబర్ ఉండటంతో ఫోన్ చేశారు. సీకేదిన్నె మండలం బలిజపల్లికి చెందిన నాగార్జున ఫోన్లో మాట్లాడుతూ తన బర్రెలు సోమవారం నుంచి కనిపించలేదని చెప్పాడు. దీంతో కమ్మపాలెం ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి బద్వేలు వైపు తీసుకువెళ్తున్న బర్రెలను ఆపామని తెలిపారు. వెంటనే నాగార్జున సంఘటన స్థలానికి చేరుకొని కమ్మపాలెం గ్రామస్తులతో కలిసి వెళ్లి బర్రెల దొంగలను పోలీసులకు అప్పజెప్పారు. జరిగిన సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. -
క్రిస్మస్కు వేళాయె..
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ రామ గోవిందరెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఎస్వీ సతీష్ రెడ్డి, రఘురామిరెడ్డి , కొరముట్ల శ్రీనివాసులు, ఎస్బీ అంజద్బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, నరేన్ రామాంజుల రెడ్డి తదితరులుతళుక్కుమంటున్న క్రిస్మస్ స్టార్లు ఏసు రాకను సూచిస్తున్నాయి.. క్రిస్మస్ ట్రీలు ఎంచక్కా వెలుగులీనుతూ దైవ కుమారుడిని రారమ్మని ఆహ్వానిస్తున్నాయి..ఈనెల 25న ప్రపంచ పండగ క్రిస్మస్ పర్వదినానికి ప్రత్యేక ప్రార్థనల కోసం చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. ఇప్పటికే ముందస్తు వేడుకలతో జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. ఊరూవాడా చర్చిలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. – మదనపల్లిమదనపల్లెలోని జేసీఎం చర్చి -
జిల్లాలో ఎస్ఐల బదిలీలు
రాయచోటి : అన్నమయ్య జిల్లా పరిధిలో ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా.. ఎ.వెంకటేశ్వర్లు మదనపల్లి వన్ టౌన్ అర్బన్, డి. రవీంద్రబాబు గుర్రంకొండ, పి.శ్రావణి పెద్దమండ్యం, జి.శోభ లక్కిరెడ్డిపల్లి, సి.ఉమా మహేశ్వర్ రెడ్డి డీసీఆర్బీ అన్నమయ్య, టి.అనిల్ కుమార్ తంబళ్లపల్లి, ముక్కెళ్ల ప్రతాప్ ములకల చెరువు, ఎంకె నరసింహుడు సీసీఎస్–1 అన్నమయ్య, బి.రామకృష్ణారెడ్డి మదనపల్లి తాలూకా అర్బన్ పీఎస్–1, జి. చంద్రమోహన్ మదనపల్లి తాలుకా అర్బన్ పీఎస్–2, సి.తిప్పేస్వామి వాల్మీకిపురం, సి. చంద్రశేఖర్ సైబర్ క్రైమ్ సెల్ అన్నమయ్య, సి.సుస్మిత వీరబల్లి, జె.నరసింహారెడ్డి గాలివీడు, పి. రామకృష్ణ రాజంపేట అర్బన్ పీఎస్–1, పి.వెంకటేశు, రాజంపేట అర్బన్ పీఎస్–2, వై.సుమన్ పీసీఆర్–1, అన్నమయ్యకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఎస్ఐలు వెంటనే వారికి కేటాయించిన స్థానాలలో రిపోర్టు చేసుకోవాలని ఎస్పీ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఒంటిమిట్టలో ప్రధాన అర్చకుడిపై ఫిర్యాదు ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలోని ఓ ప్రధాన అర్చకుడిపై మంగళవారం ఒంటిమిట్ట పరిపాలన భవనంలో ఉన్న ఆలయ ఇన్చార్జి డిప్యూటీ ఈఓ ప్రశాంతికి ఒంటిమిట్ట గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వారి వివరాల మేరకు ప్రధాన అర్చకుడి వైఖరి వల్ల ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందన్నారు. భక్తులు వేసే కానుకలను స్వామి వారి హుండీలో పడనివ్వకుండా, భక్తుల వద్ద హారతి పల్లెం పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఒంటిమిట్ట రామాలయానికి గతంలో కంటే నేడు భక్తల తాకిడి ఎక్కువ అయినా హుండీ ఆదాయం పెరగకపోవడానికి ఆ ప్రధాన అర్చకుడి పాత్ర ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఇన్చార్జి డిప్యూటీ ఈఓ విచారణ చేపడతామని చెప్పారు. రాజంపేటలో ఎనీటైం మందు! రాజంపేట : రాజంపేట బైపాస్లో ఉన్న బార్ల వద్ద సోమవారం తెల్లవారుజామున అమ్మకాలు గుట్టుచప్పుడుగా కొనసాగించారు. అటు సివిల్, ఇటు ఎకై ్సజ్ పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికారపార్టీకి చెందిన నేతల మద్దతుతో బార్లు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. బైపాస్లో కడప వైపు వింటేజ్ రెస్టారెంట్ అండ్ బార్, తిరుపతి వైపు జీకేఎస్ఆర్ కళ్యాణమండపం వద్ద తిరుమల బార్ రెస్టారెంట్ నిర్వాహకులు అసలు ప్రభు త్వం ఉందా లేదా అన్నట్లుగా దర్జాగా నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో రాజంపేట బైపాస్లో తెల్లార్లు మద్యం లభ్యం కావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. బైపాస్లో ఇటీవల మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు అనేకం జరిగాయి. ఉదయం 10 గంటలకు తెరవాల్సిన బార్లు ఉదయం 6గంటలకే తెరిచి దర్జాగా మద్యం విక్రయిస్తున్నారు. అలాగే రాత్రి 11 గంటల వరకు కొనసాగించాల్సిన బార్లు అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. ఎనీటైం మద్యం కావాలంటే బైపాస్కు వెళ్లాల్సిందే అని మద్యం ప్రియులు అంటున్నారు. కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో నిర్వహించిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ మంగళవారంతో ముగిసింది. ఈ పోటీలలో ఓవరాల్ చాంపియన్, స్పోర్ట్స్ చాంపియన్, గేమ్స్ చాంపియన్తోపాటు వ్యక్తిగత చాంపియన్గా కడప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిలిచారు. జిల్లావ్యాప్తంగా 15 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రెండు రోజులపాటు అఽథ్లెటిక్స్ తదితర పోటీల్లో పాల్గొన్నారు. అన్ని ఈవెంట్లలో కడప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు స్థిరమైన ప్రదర్శనతో అగ్రస్థానాన్ని దక్కించుకుని చాంపియన్గా నిలిచారు. వ్యక్తిగత చాంపియన్షిప్ను కడప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన భవ్యశ్రీ దక్కించుకుంది. అలాగే వాలీబాల్, ఖోఖో, లాంగ్జంప్, బ్యాడ్మింటన్, డిస్కస్త్రో, రన్నింగ్ పోటీలలో బాలికలు తమ ప్రతిభను చాటి విజేతలుగా నిలిచారు. విజేతలకు డీఆర్డీఏ– వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతిలు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు ఫిజికల్ డైరెక్టర్ పాల్గొన్నారు. అక్రమాల వెలికితీతకే సామాజిక తనిఖీ కలకడ : జిల్లాలోని అన్ని గ్రామాలలో జరుగుతున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో అవినీతి, అక్రమాలు వెలికి తీయడానికే ప్రతి మండలంలో సామాజిక తనిఖీ చేపడుతున్నట్లు డ్వామా పీడీ వెంకటరత్నం అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గత ఏడాది ఏప్రిల్–1వతేదీ నుంచి ఈ ఏడాది మార్చి–31వతేదీ జరిగిన పనులను సామాజిక తనిఖీ బృఽందం తనిఖీ చేసి నివేదికలను బహిరంగ సభలో చదివి వినిపించారు. అవినీతికి సంబంధించి రూ.19,179 రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుప్రసాద్, అంబుడ్స్మెన్ శ్రీరాములు, కలికిరి ఏపీడీ శ్రీనివాసులు, క్లస్టర్ ఏపీడీ మధుబాబు, ఎస్టీఎం కోనయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
● డీఐజీ కోయ ప్రవీణ్ ● ముగిసిన జిల్లా పోలీసు వార్షిక క్రీడా సంబరాలు రాయచోటి : క్రీడలు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో మూడు రోజులుగా ఉత్సాహంగా సాగిన జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ – 2025 మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు కర్నూలు రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులను అందజేశారు. డీఐజీ మాట్లాడుతూ మైదానంలో ప్రదర్శించిన పట్టుదలను నేరాల నియంత్రణలోనూ చూపాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధుల్లో ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో అత్యధిక పాయింట్లు సాధించిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ జట్టు ఛాంపియన్ ట్రోఫీని కై వసం చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ‘టగ్ ఆఫ్ వార్ (తాడు లాగుట)’ పోటీ ఫైనల్లో రాయచోటి సబ్ డివిజన్ – ఏ ఆర్ జట్టు పోటీపడగా, ఏఆర్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబసభ్యలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలం
రాయచోటి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని.. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిఽథున్రెడ్డి , వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆత్మీయంగా మమేకమై వారి కష్టనష్టాలను శ్రద్దగా విని, ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కడప– బెంగళూరు రైల్వే లైనుకు నిధులు మంజూరు చేయండి... కడప – బెంగళూరు రైల్వే లైన్ పనులకు తక్షణమే నిధులు మంజూరు చేసి ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రైల్వే లైను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకమని ఎంపీ పేర్కొన్నారు. రాయచోటి ప్రాంతంలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు, బైపాస్ రోడ్డు నిర్మాణాలు అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సహకారంతో విజయవంతంగా పూర్తయ్యాయని గుర్తుచేశారు. మదనపల్లె–పీలేరు కనెక్టివిటీ రోడ్లను కూడా అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించామని తెలిపారు. కడప– బెంగళూరు రైల్వే లైనుకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారని ఎంపీ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రైల్వేలైను ప్రాజెక్టుకు మంజూరు జరగకపోతే, రాన్ను రోజుల్లో అంచనా వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. దీంతో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంపీగా మిథున్ రెడ్డి ప్రజా గొంతుకగా నిలుస్తున్నారు: శ్రీకాంత్ రెడ్డి రాజంపేట పార్లమెంటు పరిధిలోని ప్రజల సమస్యలను ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటు వేదికగా గళమెత్తి ఈ ప్రాంత గౌరవాన్ని ప్రాధాన్యతను దేశ స్థాయిలో పెంచుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. ప్రజల తరపున నిర్బయంగా పోరాడే నాయకుడిగా ఎంపీ మిథున్ రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలో ఎంపీ మిథున్ రెడ్డికి ఘన స్వాగతం.. తొలుత రాయచోటికి విచ్చేసిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పట్టణమంతా వైఎస్సార్సీపీ నినాదాలతో మార్మోగింది. చిత్తూరు రింగ్ రోడ్డు నుంచి వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో ఎంపీకి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎస్ఎన్ కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఎంపీ చేరుకోగా అక్కడ మహిళలు హారతులిచ్చారు. గజమాలతో సత్కరించారు. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీ మిఽథున్ రెడ్డికి హారతులిచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు, నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకుడు విజయభాస్కర్ను పరామర్శిస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి బీసీ నాయకుడు విజయభాస్కర్పై జరిగిన దాడి అత్యంత హేయమైనదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న విజయభాస్కర్ను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిడి తెలుసుకుని, ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే , పార్టీ శ్రేణులపై అన్యాయంగా , అక్రమంగా దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పి.దేవనాథరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆవుల విష్ణువర్థన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఫయాజ్ బాషా, వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారీ మహమ్మద్ ఖాన్, మండల కన్వీనర్ యధుభూషణరెడ్డి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి జాఫర్ అలీకాన్, కౌన్సిలర్లు, రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, సర్పంచులు, యువత పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే మా ధ్యేయం
కేవీపల్లె : ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం పనిగా పెట్టుకుందని విమర్శించారు. వారి అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉండడంతో అనతికాలంలోనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున సమస్యలపై అర్జీలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాధికారులు పార్టీలకు అతీతంగా చిత్త శుద్ధితో పని చేయాలన్నారు. తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజలు సమస్యలను నేరుగా తమకు తెలుపుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి, హరీష్రెడ్డి, డాక్టర్ ఇక్బాల్ అహ్మద్, నల్లారి తిమ్మారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
సీఎండీ శివశంకర్ పీలేరు: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిండమే లక్ష్యమని ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శివశంకర్ అన్నారు. మంగళవారం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లె పర్యటించి విద్యుత్ వినియోగంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. టాప్ సోలార్ ప్లాంట్లు, డిజిటల్ మీటర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, కనెక్షన్లు సమస్యలు, బిల్లుల వివాదాలు, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ, డిజిటల్ చెల్లింపులు వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా 14 సమస్యలుగుర్తించి పరిష్కార మార్గం చూపినట్లు తెలిపారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్దేశిత గ్రామాలు, పట్టణాల్లో పరిశీలన కార్యక్రమం చేపట్టాలని కోరారు. వినియోగదారులు తమ సమస్యలపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ సీఎం 89777 16661 నెంబర్కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్రెడ్డి, డీఈఈ అమీర్బాషా, రూరల్ ఏఈ రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలి
మదనపల్లె రూరల్ : జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కార్యదర్శి నుంచి డీపీఓ వరకు ఉదయం 7 గంటలకు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా ఉండాలని డీపీఓ రాధమ్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని డీడీఓ కార్యాలయంలో తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలకు సంబంఽధించి డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో పారిశుధ్య నిర్వహణ, స్వామిత్వ సర్వేపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో ప్రతిరోజు శానిటైజేషన్ చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణను స్వయంగా పర్యవేక్షించాలన్నారు. గ్రీన్ అంబాసిడర్లు రెండురోజులకు ఒకసారి ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్యార్డులకు తరలించి, వర్మీ ప్రొడక్షన్ చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సేకరిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో 80 శాతానికి పైగా సంతృప్తికరంగా ఉన్నట్లు నమోదు కావాలన్నారు. స్వర్ణపంచాయతీ పోర్టల్లోని క్యూఆర్ కోడ్ ద్వారానే కార్యదర్శులు పన్ను వసూళ్లు చేయాలన్నారు. రసీదులు ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని 501 గ్రామ పంచాయతీల్లో 286 గ్రామ పంచాయతీల్లో స్వామిత్వ సర్వే జరుగుతోందని, 162 పంచాయతీల్లో కొలతలు వేస్తున్నారని, 95 పంచాయతీల్లో గ్రామసభలు పూర్తయ్యాయన్నారు. డిసెంబర్ 27, జనవరి 2, 7 తేదీల్లోపు మూడు విడతలుగా అన్నిచోట్ల గ్రామసభలు నిర్వహించి 32 నోటిఫికేషన్ జారీ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీడీఓ అమరనాథరెడ్డి, డీఎల్పీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సివిల్ ఇంజినీరింగ్ పాత్ర కీలకం
కురబలకోట : వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో సివిల్ ఇంజినీరింగ్ పాత్ర కీలకమని చుట్టూ కన్పించే వివిధ నిర్మాణాల వెనుక ఇంజినీర్ల కృషి ఎనలేనిదని పూణేలోని హిల్టి టెక్నాలజీస్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్ పి. కార్తీక్ అన్నారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో అధునాతన సివిల్ ఇంజినీరింగ్ నిర్మాణ పద్ధతులపై మూడు రోజుల వర్క్షాపు సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూపకల్పన చేయబడిన నిర్మాణాలు, వంతెనలు, రహదారులు, నీటి పారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళిక ఇవన్నీ సివిల్ ఇంజినీరింగ్ రంగానికి చెందిన వన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ వంటి నూతన సాంకేతికతలు సివిల్ ఇంజినీరింగ్ను సమర్థవంతంగా మార్చాయన్నారు. దేశ అభివృద్ధికి సివిల్ ఇంజినీరింగ్ రంగం బలంగా ఉండాల్సిందేనన్నారు. భవిష్యత్ తరాలకు సుస్థిర ప్రపంచాన్ని అందించడంలో కీలకంగా నిలవనుందన్నారు. -
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
సిద్దవటం : మండలంలోని గుండ్లమూలపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వల్లూరు మండలానికి చెందిన పెద్ద పిల్లోళ్ల రెడ్డయ్య (40) అనే వ్యక్తి చెట్టుపై నుంచి కిందపడి మృతిచెందాడని ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపారు. వల్లూరు మండలం పెద్ద లేబాక ఎస్సీ కాలనీకి చెందిన పెద్దపిల్లోళ్ల రెడ్డయ్యతో పాటు మరి కొందరు కూలీలను కడపకు చెందిన చాన్బాషా అనే వ్యక్తి గుండ్లమల్లపల్లె గ్రామానికి చెట్లు కోసేందుకు తీసుకొచ్చాడు. స్థానికుడు చంద్రశేఖర్రెడ్డికి చెందిన చెట్లను చాన్బాషా కొనుగోలు చేసి వాటిని రంపం మిషన్తో కట్ చేసి అమ్ముకునే వాడు. రెడ్డయ్య అనే వ్యక్తి చెట్టుపైకి ఎక్కి రంపం మిషన్తో కొమ్మలను కట్ చేస్తుండగా మిషన్ ఇరుక్కుపోవడంతో ఆయన గొడ్డలితో కొమ్మను కొట్టే ప్రయత్నం చేశాడు. కొమ్మ విరిగి అతనిపై పడటంతో అదుపు తప్పి కింద ఉన్న కొమ్మలపై బోర్లా పడ్డాడు. కింద ఉన్న కొమ్మ రెడ్డయ్య ఛాతికి తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లీలావతి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యువకుడి ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : ప్రేమ వ్యవహారం కారణంగా మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన మదన్మోహన్(20) కార్పెంటర్గా పనిచేస్తాడు. సోషల్మీడియా ఇన్స్ట్రాగామ్ ద్వారా పెద్దమండ్యంకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే ఈ వ్యవహారంలో మనస్తాపం చెందిన మదన్మోహన్ సోమవారం ప్రేమికురాలి ఇంటి వద్దకు వెళ్లి అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి పీలేరు రూరల్ : చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ సూరప్పచెరువులో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు మండలం గూడరేవుపల్లె పంచాయతీ మర్రిమాకులపల్లెకు చెందిన బి. ఆనంద (55) తమ అల్లుళ్లు వినోద్, హరి, తమ్ముడు టి.వినోద్తో కలసి సూరప్పచెరువుకు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులో వల వేసి తీసే క్రమంలో నీటి లోపల ఉన్న పాచి తగులుకుని మునిగిపోయాడు. ఆయన అల్లుళ్లకు ఈత రాకపోవడంతో గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు చెరువులోంచి ఆనందను వెలికి తీశారు. అయితే అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. కరెంట్ షాక్తో వలస కూలీ.. రాజంపేట : రాజంపేట–రాయచోటి రహదారిలో ఎస్ఆర్పాళెం సమీపంలో కొరముట్ల హరి అనే వ్యక్తికి చెందిన రేకులషెడ్ నిర్మాణంలో కరెంట్షాక్ తగిలి పశ్చిమబెంగాల్కు చెందిన రాజ్ అనే వలస కూలీ సోమవారం మృతి చెందాడని పోలీసువర్గాలు తెలిపాయి. మృతుడు మైనర్గా భావిస్తున్నారు. రేకులషెడ్ నిర్మాణ క్రమంలో క్రేన్తో ఇనుపకడ్డీలు పైకి ఎత్తే సమయంలో అదే ప్రదేశంలో ఉన్న విద్యుత్ తీగలు తగలగానే షాక్కు గురయ్యాడు. ఆర్ఎస్రోడ్డులో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఫలితం లేకుండా పోయిందని తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై మన్నూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లుఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఈ నెల 30న జరిగే వైకుంఠ ఏకాదశికి టీటీడీ ముమ్మరంగా ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు 30వ తేదిన అర్థరాత్రి 1:35 నిమిషాలకే వైకుంఠ ద్వారా దర్శనానికి భక్తులను అనుమతిస్తునట్లు ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు తెలిపారు. -
రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించుకుందాం
రైల్వేకోడూరు అర్బన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాల్సిన బాధ్యత కుటమి ప్రభుత్వంపై ఉందని, కలిసికట్టుగా పోరాటాలు చేసైనా జిల్లా కేంద్రంగా రాజంపేటను సాధించుకుందామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. టోల్గేట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు సోమవారం సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్ర సాధన కోసం జరుగుతున్న పోరాటాలకు వైఎస్సార్సీపీ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. కూటమి నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరును మాత్రమే జిల్లాగా ఉంచడంతో ఇప్పుడు రాజంపేట జిల్లా ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని డిమండ్ చేశారు. మంగళవారం జరిగే రైల్వేకోడూరు బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పుల్లపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, ఓబులవారిపల్లి, చిట్వేలి, పార్టీ అధ్యక్షులు వత్తలూరు సాయికిషోర్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డిలు, జేఏసీ అధ్యక్షుడు ముత్యాల పెంచలయ్య, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి వైఎస్ జగన్ జిల్లా పర్యటన
పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23వ తేదీనుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమవుతారు. ఇడుపులపాయలో, పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తొలిరోజు పర్యటన ఇలా.. ఈనెల 23వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరు ఎయిర్డ్రోం నుంచి హెలీకాప్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరుతారు. సాయంత్రం 4గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.15గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4.15గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రజలతో మమేకమవుతారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. రెండో రోజు పర్యటన ఇలా.. 24వ తేదీ బుధవారం ఉదయం 9.30గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయలోని ప్రేయర్ హాలు వద్దకు బయలుదేరుతారు. 10.30గంటలకు అక్క డికి చేరుకుంటారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రేయర్ హాలు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యా హ్నం 1గంటకు ఇడుపులపాయ ప్రేయర్ హాలు వద్ద నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2గంటలకు పులివెందుల భాకరాపురంలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2గంటల నుంచి రాత్రి 7గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మూడో రోజు క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్న మాజీ సీఎం 25వ తేదీ క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం 8.10గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి పులివెందుల సీఎస్ఐ చర్చి వద్దకు బయలుదేరుతారు. 8.30గంటలకు పులివెందుల సీఎస్ఐ చర్చి వద్దకు చేరుకుంటారు. 8.30గంటల నుంచి 10గంటల వరకు పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10.20గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.30గంటలకు హెలీకాప్టర్ ద్వారా బెంగుళూరుకు బయలుదేరుతారు. నేడు పులివెందులకు చేరుకోనున్న వైఎస్ జగన్ ప్రజలతో మమేకం కానున్న మాజీ సీఎం 24వ తేదీ ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు, పులివెందులలో ప్రజా దర్బార్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగాపులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు -
మదనపల్లెలో కార్డెన్ సెర్చ్
మదనపల్లె రూరల్ : పట్టణంలో సోమవారం వేకువజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో పట్టణంలోని దక్నీపేట, అగడ్తవీధి, గౌసియా వీధి, త్యాగరాజవీధి, బడేమకాన్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన రికార్డులు లేని 61 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, నేరాల నియంత్రణే లక్ష్యంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా యువత చెడుమార్గాల్లో వెళ్లకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐలు మహమ్మద్ రఫీ, రాజారెడ్డి, పోలీస్సిబ్బంది పాల్గొన్నారు.61 ద్విచక్రవాహనాలు స్వాధీనం -
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారం
రాయచోటి : వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పోలీస్ కార్యాలయాలకు వచ్చేవారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం చేయాలని ఆదేశించారు. పెద్దమండ్యం మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు కార్యాలయానికి రాగా ఎస్పీ ఆయన వద్దకే వెళ్లి ఫిర్యాదును స్వీకరించారు. జిల్లా కార్యాలయానికి రాలేని వారు తమ సమీప పోలీసు స్టేషన్లో, సర్కిల్, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఇచ్చే ఫిర్యాదులను కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలుగానే పరిగణించి పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి -
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
● వీబీజీ–రామ్ జీ ని రద్దు చేయాలి ● సబ్ కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల నిరసనసబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న సీపీఎం కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులుసబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు తోపుకృష్ణప్ప తదితరులుమదనపల్లె రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తూ, మోదీ సర్కారు నూతనంగా తీసుకువచ్చిన వీబీ–జీ–రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపుకృష్ణప్ప డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్షాలైన సీపీఎం, సీపీఐ పార్టీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని కోరుతూ వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా రెండు పార్టీల ముఖ్యనాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ స్వాతంత్రోద్యమ కాలపు నేతల పేర్లను నిస్సిగ్గుగా తొలగించేందుకు వెనుకాడటం లేదన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కొత్త చట్టం వీబీ–జీ–రామ్–జీ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ ప్రభుత్వం మహాత్ముడిపై విద్వేషం వెళ్లగక్కుతోందన్నారు. మతోన్మాదం ప్రతిబింబించేలా కొత్త చట్టాలకు పేర్లు పెడుతోందన్నారు. రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి బీజేపీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. నూతన చట్టం రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం మోపనుందన్నారు. ఈ కొత్త బిల్లు వలన ఉపాధి హామీ కూలీలకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. వేతనాల పెరుగుదల, పనిదినాల పెంపు సవ్యంగా లేకపోవడం, సగటువేతనం రూ.240కు తగ్గించడం జరిగిందన్నారు. యూపీఏ ప్రభుత్వంలో చట్టం తెచ్చినప్పుడు కేంద్రం 90శాతం నిధులు, రాష్ట్రాలు 10 శాతం నిధులు ఉపాధి హామీకి కేటాయించాలని నిర్ణయిస్తే, ప్రస్తుత మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మీద భారం పెంచే విధంగా అడుగులు వేస్తోందన్నారు. ఓ వైపు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోందన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న రాష్ట్రాల వాటాను ఎలా భరిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి కనుక, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసపూరితమైన కుట్రలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు హరిశర్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, శేఖర్, నారాయణ, రమణ, సీపీఐ చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మురళీ, ఏఐఎస్ఎఫ్ మాధవ్, ఏఐటీయూసీ తిరుమల, చిన్నప్ప, వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భూమి ఆక్రమిస్తున్నారయ్యా..
కలెక్టరేట్ వద్ద బైఠాయించిన 84 ఏళ్ల ఈ వృద్ధురాలి పేరు షంషాద్బీ. గాలివీడు మండలం. దశాబ్దాలుగా ఈమె ఆధీనంలో సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. భూమిని కబ్జా చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు పర్యాయాలు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా ఫలి తం శూన్యం. పోలీసులు, రెవెన్యూ అధికారులకు తన ఆవేదన తెలియజేసినా అది అరణ్య రోదనగానే మిగిలింది. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద బైఠాయించిన ఈ వృద్ధురాలికి కమ్యూనిస్టు మార్కిస్టు పార్టీ నేతలు గుజ్జుల రమణయ్య, పోరెడ్డి రమణారెడ్డిలు సంఘీభావం తెలిపారు. అధికారుల తీరుపై నిరసనలో పాల్గొన్నారు. వృద్ధురాలికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
సంక్రాంతి సంబరాలకు నాంది క్రీడలు
రాజంపేట టౌన్ : సంక్రాంతి సంబరాలకు క్రీడలే తొలుత నాంది పలుకుతాయని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి తెలిపారు. మండలంలోని పోలి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ యూత్ విభాగం సీనియర్ నాయకుడు పోలి రఘునాథ్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ సంక్రాంతి హిందువులకు పెద్ద పండుగ అని, ఈ పండుగను పురస్కరించుకొని రఘునాఽథ్రెడ్డి యువతను ప్రోత్సహించేందుకు ఖర్చుకు సైతం వెనకాడకుండా క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండటం ఎంతైనా అభినందనీయమని కొనియాడారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు డి.భాస్కర్రాజు, క్రికెట్ పోటీల ఆర్గనైజర్లు పోలి సుకుమార్రెడ్డి, సి.మనోహర్రెడ్డి, గానుగపెంట కిషోర్, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు సనిశెట్టి నవీన్కుమార్, దండు గోపి, హరి, బొజ్జా పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి -
ఏసీబీ వలలో ట్రాన్స్కో ఏఈ
రాయచోటి/గాలివీడు: రాయచోటి విద్యుత్ శాఖ పరిధిలోని గాలివీడు సబ్స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సత్యమూర్తి, అతని డ్రైవర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. కడప రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జి.సీతారామరావు ఆధ్వర్యంలో సోమవారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. గాలివీడు మండలం ఎగువగొట్టివీడు గ్రామం కుమ్మరపల్లెకు చెందిన రైతు ఎర్రయ్యగారి నాగేశ్వర తన పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు గాలివీడు మండలం సబ్స్టేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ సత్యమూర్తిని కలిశారు. పొలం వద్ద ట్రాన్స్ఫర్ ఏర్పాటుకు గత ఏడాదిలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ఆధారంగా ట్రాన్స్కో అధికారులు పొలం ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ మేరకు విద్యుత్ శాఖకు డబ్బులు కూడా చెల్లించారు. శాఖపరంగా అన్ని చర్యలు తీసుకున్నా పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంలో ఇంజనీర్ రెండు వారాలుగా ఆలస్యం చేస్తూ వచ్చారు. విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు రూ.15 వేలు లంచంగా ఇవ్వాలని ఆ రైతును డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు సోమవారం రాయచోటిలోని వై జంక్షన్ శివాలయం దగ్గర రైతు యర్రగారి నాగేశ్వర నుంచి రూ.15 వేలు డబ్బులు తీసుకుంటున్న సమయంలో డ్రైవర్ ఎన్.శ్రీనివాసులుతో పాటు ఏఈ సత్యమూర్తిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. -
సమస్యకు.. పరిష్కారమేదీ !
● కలెక్టరేట్కు క్యూ కడుతున్న బాధితులు ● వ్యయ ప్రయాసలకోర్చి పదేపదే తిరుగుతున్నా దక్కని ఫలితం ● పింఛన్ రేషన్, రెవెన్యూ సమస్యలతోనే ఎక్కువమంది సతమతం ● ప్రతి సోమవారం కలెక్టరేట్లో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ● గతంలో దరఖాస్తులు ఇచ్చిన వారే పదేపదే వస్తున్న వైనం సాక్షి రాయచోటి : దూరాన్ని.. భారాన్ని లెక్క చేయకుండా కలెక్టరేట్కు వచ్చే బాధితుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. వ్యయ ప్రయాసలకోర్చి అర్జీ ఇచ్చినా ఫలితం ఉండడం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఫలితంగా బాధితులు పదే పదే కలెక్టరేట్కు కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. అర్జీ చేతబట్టి అధికారుల ఎదుట గోడు వెల్లబోసుకుంటూనే ఉన్నారు. ఈ వారం కూడా జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులు పోటెత్తారు. కలెక్టర్ నీరజ్కుమార్, జేసీ ఆదర్శ రాజేంద్రన్లు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పదేపదే తిరుగుతున్నా.. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి సుమారు 250–300 మంది వరకు వస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాక వచ్చిన వారే మళ్లీమళ్లీ వస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేకంగా తీసుకుని పరిష్కారానికి చొరవ చూపుతున్నా క్షేత్ర స్థాయిలో అధికారులు అర్జీలను బుట్టదాఖలు చేస్తున్నారు. రెవెన్యూ సమస్యలే అధికం జిల్లాలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ఎక్కువగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలే వస్తున్నాయి. ప్రధానంగా భూములు, ఆన్లైన్, మ్యూటేషన్, సర్వేలు, రికార్డుల సమస్యలు...భూముల ఆక్రమణలు, దౌర్జన్యాలు, కబ్జాల సమస్యలతోనే బాధితు లు అధికారులకుమొర పెట్టుకుంటున్నారు.అలాగే రేషన్కార్డులు, పెన్షన్లు, నిరుద్యోగులు ఉపాధి, ఇంటి స్థలాలు, గ్రామాల్లో స్థానిక సమస్యలతోనూ అనేక మంది వస్తున్నారు. నా భర్త మరణ ధృవీకరణ పత్రానికి నా ఆధార్ నెంబరు లింక్ చేసిన కారణంగా నా రేషన్ కార్డు రద్దయింది. పేద వర్గానికి చెందిన నా రేషన్ కార్డు రద్దు కావడంతో రేషన్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా రేషన్ కార్డు పునరుద్ధరించాలని అధికారులను వేడుకున్నాను. – వి.పద్మావతమ్మ, నడింపల్లె, కలికిరి మండలం, అన్నమయ్య జిల్లా -
ఆగని ఆందోళనలు
రాజంపేట టౌన్ : రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న ఆందోళనలు రోజు, రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా నిత్యం ఏదో ఒక ఆందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్రయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆర్అండ్బి బంగ్లా నుంచి సబ్కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు దారి వెంబడి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాగా ర్యాలీ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే కార్మికులంతా ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి ఆర్ఎస్ రోడ్డును దిగ్బంధించి ధర్నాకు దిగారు. ఉన్నఫళంగా కార్మికులు మెరుపు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు కష్టపడాల్సి వచ్చింది. ధర్నాను విరమించాలని కోరినప్పటికి కొంతసేపు కార్మికులు ససేమిరా అని అలాగే బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి ఆర్ఎస్ రోడ్డులో వాహనాలు బారులు తీరాయి. అనంతరం ఆందోళనకారులు సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సబ్కలెక్టర్ భావనకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా గాలి చంద్రయ్య మాట్లాడుతూ రైల్వేకోడూరు, రాయచోటికి రాజంపేట మధ్యలో ఉందని అందువల్ల రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్నారు. అన్నమయ్య జన్మస్థలం రాజంపేట ప్రాంతమని, రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా చేయడమే సముచితమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు కె.వెంకటయ్య, పొట్టి సుబ్బరాయుడు, వేముల నరసింహ, మహమ్మద్ హుస్సేన్, నన్నేసాబ్, వెంకటస్వామి, పి.సుబ్రమణ్యం, నారాయణ పాల్గొన్నారు. తీవ్రరూపం దాల్చిన రాజంపేట జిల్లా సాధన ఉద్యమం భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ మెరుపు ధర్నా ఆర్ఎస్రోడ్డు దిగ్బంధం -
నేటి నుంచి మాచుపల్లి దర్గా ఉరుసు
కడప సెవెన్రోడ్స్ : కడప నగర శివార్లలోని మాచుపల్లె గ్రామంలో వెలసిన హజరత్ సయ్యద్ షావలీ దర్గా ఉరుసు ఉత్సవాలను మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దర్గా ముజావర్ సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. ఈనెల 23న గంధోత్సవం సందర్భంగా రాత్రి 9 గంటలకు గంధం, పూలచాందిని ఫకీర్ల మేళతాళాలతో, బ్యాండు వాయిద్యాలతో గ్రామంలో మెరవణి నిర్వహించి గురువుల మజార్వద్ద సమర్పిస్తామన్నారు. అనంతరం ఫాతెహా ఉంటుందని పేర్కొన్నారు. 24న ఉరుసు సందర్భంగా వివిధ కార్యక్రమాలతోపాటు రాత్రి ఖవ్వాలీ కచేరి ఉంటుందన్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని అన్నదానం నిర్వహిస్తామన్నారు. 25న తహలీల్ ఫాతెహాతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఒంటిమిట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ధనుర్మాస పుజల్లో భాగంగా అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయ రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను ఆశీనులు చేసి, ముత్యాల ఆభరణాలు తొడిగి, పట్టు వస్త్రాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించారు. వేద పండితులు స్వామి వారి చెంత పారాయణం చేశారు. -
ఆయనో జూనియర్ అసిస్టెంట్. మున్సిపాలిటిలో పెట్రోల్ బంకు నిర్వహణ లావాదేవి పర్యవేక్షించారు. అధికారులను మభ్యపెట్టి ఆదాయాన్ని దర్జాగా దోపిడీ చేశారు. వేలు..లక్షలు కాదు.. రూ.1.23కోట్లు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు రావాల్సింది ఉందంటూ చిట్టా రాశారు. ఆపై ఎంచక్
● పెట్రోల్ పంపు నిర్వహణలో మున్సిపల్ ఉద్యోగి చేతివాటం ● మున్సిపల్ ఆదాయాన్ని దర్జాగా దోచేసిన వైనం ● ఎంచక్కా ప్రమోషన్పై బదిలీ.. సహకరించిన కమిషనర్ సాక్షి ప్రతినిధి, కడప : ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రవీణ్కుమార్ మున్సిపల్ పెట్రోలు బంకు నిర్వహణ బాధ్యతలు చూ సేవారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి స్కెచ్ వేశారు. కోటి రూపాయలకు పైగా కుచ్చుటోపీ వేసి ఇంధనం పక్కదారి పట్టించారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలకు 2022–25 వరకూ రూ. 1,23,47,318ల విలువగల పెట్రోలు, డీజల్ను అప్పుగా పట్టినట్లు, వారి నుంచి డబ్బులు రావాలంటూ తాపీగా వెల్లడించారు. ఇంత మొత్తం పెండింగ్లో ఉంటే పెట్రోల్ పంపు నిర్వహణ సాధ్యమా?అనేది ప్రశ్నార్థకం. వచ్చే ఆదాయం మొత్తం స్వాహా చేసి ప్రొద్దుటూరులో లేని ట్రావెల్స్ ఏజెన్సీల పేర్లు పొందుపర్చినట్లు కొందరు వివరిస్తున్నారు. మాతాంగి ట్రావెల్స్ 2023వ సంవత్సరం నుంచి 2025 అక్టోబరు నెల వరకు అప్పు రూ. 13,75,344 ఉన్నట్లు లెక్క రాశారు. ఈ ట్రావెల్స్ ప్రొద్దుటూరులో ఉన్నట్లు రికార్డుల్లో లేకపోవడం విశేషం. అధికారులూ అమ్ముడుబోయారా! ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులోని త్రీ టౌన్ పోలీసుస్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పెట్రోలు బంకును 2021 ఆగస్టు 18న ప్రారంభించారు. అప్పటి నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్ పెట్రోలు బంకు మేనేజర్గా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. పెట్రోల్ పంపు ద్వారా మున్సిపాలిటికి ఆదాయం లభించకపోవడంతో ఇటీవల కమిషనర్ రికార్డులు పరిశీలించారు. దాంతో ఒక్కమారుగా వ్యవహారం బహిర్గతం అయ్యింది. రూ.1.23కోట్లు విలువజేసే పెట్రోలు, డీజల్ను ప్రైవేటు వ్యక్తులకు అధికారుల అనుమతి లేకుండా అప్పుగా ఇవ్వడం వెలు గులోకి వచ్చింది. ఎవరి అనుమతి తీసుకుని మేనేజర్గా పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ అప్పులు ఇచ్చా రు అన్న ప్రశ్నలకు సమధానం లేదు. వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన కమిషనర్ సైతం మిన్నకుండిపోయారు. ప్రలోభాలకు లోబడి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. కమిషనరా మజాకా ! ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్ విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ తన సొంతమైనట్లు తాను ఆడిందే ఆట...పాడిందే పాటగా అన్నట్లుగా వ్యవహరించారు. పెట్రోల్ పంపు నిర్వహణలో లెక్కాపత్రం లేని రూ.1.23కోట్ల అవినీతిపై కమిషనర్ నాన్చుడు ధోరణి అవలంబించారు. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ సీసీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఓబులేసు తనకు తెలియకుండా అజెండాలో లేని అంశాలను పొందుపరిచారని, అతన్నిసస్పెండ్ చేయాలంటూ సిఫార్సులు చేశారు. ఒకే మున్సిపాలిటిలో పని చేసే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ల వ్యవహారంలో ఒకరిపై ఒకలా, మరొకరిపై ఇంకోలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ పంపు నిర్వహణలోని లోపాలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆడిట్ ఆఫీసర్ను నియమించాం. సదరు అధికారి క్షుణ్ణంగా రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ వారంలో నివేదిక వస్తుంది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదు పరి చర్యలు తీసుకుంటాం. – రవిచంద్రారెడ్డి, కమిషనర్,ప్రొద్దుటూరు మున్సిపాలిటీ -
ఆకేపాడు విభజనను అడ్డుకున్న గ్రామస్తులు
రాజంపేట రూరల్ : కొన్ని తరాల నుంచి 14 గ్రామాలు కలిసి ఒకే పంచాయతీగా కొనసాగుతున్న ఆకేపాడు పంచాయతీని 4 పంచాయతీలుగా విభజించాలని చూసిన కూటమి నాయకుల ప్రయత్నాలను సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి(మురళీరెడ్డి) ఆధ్వర్యంలో మూకుమ్మడిగా ప్రజలు అడ్డుకున్నారు. మండల పరిధిలోని ఆకేపాడు పంచాయతీ వడ్డుకాడపల్లిలో సోమవారం డీపీఓ రాధమ్మ ఆదేశాల మేరకు డీఎల్పీఓ మస్తాన్వలీ గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆకేపాడు పంచాయతీలోని 321 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్తాన్వలీ ఆకేపాడు పంచాయతీని 4 పంచాయతీలుగా విభజించటం ఇష్టం ఉన్న వారు వచ్చి సంతకం చేయాలన్నారు. ఏ ఒక్కరూ స్పందించలేదు. అదే విధంగా ఆకేపాడు పంచాయతీని ఒకే పంచాయతీగా ఉంచాలని కోరుకునే వారు వచ్చి సంతకం చేయాలని కోరడంతో మూకమ్ముడిగా తరలివచ్చి 321 మంది సంతకం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి సొంత పంచాయతీ ఆకేపాడు కావడం గమనార్హం. ఈ గ్రామసభలో ఈఓఆర్డీ అస్లఫ్వలీ, పంచాయతీ సెక్రటరీ కరిముల్లా, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
రాయచోటి: క్రీడలతో మానసికోల్లాసం పొందొచ్చని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా వార్షిక పోలీసు స్పోర్ట్స్– గేమ్స్ మీట్–2025 ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. 24 గంటల విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులకు క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయన్నారు. క్రీడలు గెలుపుకోసమే కాదని, కష్టాన్ని, ఓటమిని ధైర్యంగా భరించే శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్రస్థాయి పోలీసు మీట్లో డెకత్లాన్ విభాగంలో వరుసగా మూడేళ్లు గోల్డ్ మెడల్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ ఎం చెన్నయ్య నుంచి ఎస్పీ క్రీడా జ్యోతిని స్వీకరించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి మాట్లాడారు. అనంతరం పరుగుపందెం ఫైనల్ పోటీ విజేతలకు ఎస్పీ చేతులు మీదుగా మెడల్స్ను బహుకరించారు. మూడురోజులపాటు జరిగే ఈ పోటీల్లో జిల్లాలోని నాలుగు పోలీసు జోన్లు పాల్గొంటున్నాయి.అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, టెన్నీష్, షటిల్ బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్ క్రీడలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, మదనపల్లె డీఎస్పీ ఎస్ మహేంద్ర పాల్గొన్నారు. -
హార్సిలీహిల్స్పైకి ఎన్సీసీ విద్యార్థుల ట్రెక్కింగ్
బి.కొత్తకోట: అంగళ్లులోకి మిట్స్ యూనివర్సిటీకి చెందిన ఎన్సీసీ క్యాడెట్లు ఆదివారం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్పైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. కొండకింద నుంచి ఉదయం ఏడు గంటలకు ట్రెక్కింగ్ ప్రారంభించి 11 గంటలకు కొండపైకి చేరుకున్నారు. ఎన్సీసీ లెఫ్టినెంట్ నవీన్కుమార్ విద్యార్థులకు రోప్ హ్యాండ్లిగ్, హిల్స్ కై ్లంబింగ్పై శిక్షణ ఇచ్చారు. 100 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ట్రెక్కింగ్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడేలా సి సెరిటిఫికెట్, బి సర్టిఫికెట్లపై శిక్షణ ఇచ్చామని నవీన్కుమార్ తెలిపారు. -
వాసు పోస్టింగ్.. ఊస్టింగ్!
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ నేతలు అనుక్షణం సేవాభావం కలిగి ఉండాలి. సమాజ శ్రేయస్సుపై అంకితభావంతో మెలగాలి. చెప్పే మాటల్లో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి కన్పించాలి. అప్పుడే ప్రజల్లో మెప్పు, ఆయా రాజకీయ పార్టీల్లో పరపతి ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అంతే స్పీడ్గా తిరోగమనం చవిచూడాల్సి వస్తుంది. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డే తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాసు వ్యవహారశైలితో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం తాజాగా జిల్లా బాధ్యతల నుంచి తప్పించింది. జిల్లా తెలుగుదేశం పార్టీలో రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి కింగ్ పిన్... పార్టీ యావత్తు తన చుట్టే తిరిగేది. నియోజకవర్గాల్లో తాను సూచించిందే ఫైనల్. ఇది పదేళ్ల క్రితం మాట. క్రమేపీ తప్పించుకునే ధోరణి అలవాటు చేసుకున్నారు. ఉన్న కేడర్లో నమ్మకం సన్నగిల్లింది. కడప పార్లమెంటు పరిధిలో కీలక నేతగా ఉన్న ఆయన, కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. పోనీ కడప నియోజకవర్గంలో కూడా పార్టీ కేడర్కు భరోసాగా నిలిచారా?అంటే అదీ లేదు. అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనతో ఎన్నో ఏళ్లుగా టీడీపీ కోసం అంటిపెట్టుకొని వస్తున్నవారిని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. చివరికి కార్పొరేషన్ పాలకమండలిలో టీడీపీ పరువు నిలిపిన ఏకై క కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబానికి రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్నికలకు ముందు సర్వస్వం టీడీపీనే అనుకున్న వారిని క్రమేపి దూరం చేసుకుంటూ వచ్చారని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఒంటెత్తు పోకడలు...దౌర్జన్యకర ఘటనలు టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో తాను చెప్పిందే వేదం, తన మాటే శాసనం అన్నట్లు వాసు వ్యవహరించారు. కడప గడపలో వైరిపక్షానికి చెందిన రెండు బార్లు బలవంతంగా లాక్కున్న ఘటన తెరపైకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా మద్యం వ్యాపారంలో తలమునకలైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని సదరు మద్యం వ్యాపారి వాపోవడం గమనార్హం. టీడీపీ కేడర్పై అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనే ఇలాంటి దౌర్జన్యకర ఘటనలను ప్రోత్సహించేలా చేసిందని విశ్లేషకుల మాట. ఇలాంటి చర్యలతో విసిగిపోయిన టీడీపీ కేడర్ పొరుగు నియోజకవర్గానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి వద్దకు క్యూ కట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు పాటించడం, కమలాపురానికెళ్లి మరీ పుత్తాకు మొరపెట్టుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలను సరిదిద్దుకోవాలనే ఆలోచన లేకపోవడంతో అధిష్టానం వద్ద మరింత చులకన కావాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కడపలో నిర్దిష్ట అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేకపోయారు. ఎంతసేపు వైరిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇలాంటి ఘటన లన్నీ కూడా అధ్యక్ష పదవి తొలగింపునకు ప్రధాన కారణమయ్యాయని పరిశీలకులు వివరిస్తున్నారు. టీడీపీని ఏకతాటిపై నడపడంలో విఫలం కడప టీడీపీ కేడర్లో పెరిగిన అసంతృప్తి పుత్తాను ఆశ్రయిస్తూ వచ్చిన తెలుగుతమ్ముళ్లు రాజ్యసభ సీటుపై సన్నగిల్లిన ఆశలు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జమ్మలమడుగు ఇన్ఛార్జి చదిపిరాళ్ల సుబ్బరామిరెడ్డి (భూపేష్రెడ్డి)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ప్రధాన కార్యదర్శిగా జబీబుల్లా (ప్రొద్దుటూరు)ను నియమించారు. కాగా భూపేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్పై ఆశలు పెట్టుకుంటే చిన్నాన్న ఆదినారాయణరెడ్డి పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవాల్సి వచ్చింది. గ్రూపు రాజకీయాలకు, అంతర్గత విభేదాలకు తావు లేకుండా ఉండేందుకే తాజాగా జిల్లా అధ్యక్ష పదవి అప్పగించి ఉంటుందని రాజకీయ వేత్తలమాట. పైగా అధిష్టానం రిమోట్ కంట్రోల్ ద్వారా పార్టీని చక్కదిద్దేందుకు కట్టబెట్టారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
ముగిసిన టెట్ పరీక్షలు
రాయచోటి జగదాంబసెంటర్: జిల్లా వ్యాప్తంగా 4 సెంటర్లలో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 21వ తేదీ నిర్వహించిన పరీక్షలకు 4923 మంది అభ్యర్థులకు 4323 మంది హాజరయ్యారని తెలిపారు. రాజంపేట టౌన్: రాజంపేట జిల్లా సాధన కమిటీ మంగళవారం రాజంపేట బంద్కు పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు సహకరించాలని జేఏసీ నాయకులు కోరారు. బంద్ను శాంతియుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ ఉంటుందని, అందువల్ల వ్యాపారులు సంపూర్ణంగా బంద్కు సహకరించి తమ దుకాణాలను తెరవ వద్దని కోరారు. రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 22వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీలేరురూరల్: చిత్తూరు శాంతా రఘురామన్ కల్యాణమండపంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే కుంగ్ఫూ చాంపియన్షిప్ పోటీలో పీలేరు విద్యార్థులు ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా నిలిచినట్లు కుంగ్ఫూ మాస్టర్ దామోదర్ తెలిపారు. కటాస్, నాన్చాక్ విభాగంలో జరిగిన పోటీల్లో 17 మంది గోల్డ్ మెడల్, 16 మంది సిల్వర్ మెడల్, 12 మంది బ్రాంజ్ మెడల్ సాధించినట్లు చెప్పారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మ వారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీమ్లు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలిరావడం విశేషం. పీలేరురూరల్: పదో తరగతి చదువుతున్న హాస్టల్ విద్యార్తులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్. నాగేంద్రరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని కోటపల్లె బీసీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 45 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, అందులో 450 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. పీలేరు హాస్టల్లో మొత్తం 241 మందికి 227 మంది హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఉదయం, సాయంత్రం రీడింగ్ అవర్స్ విధిగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సహాయక అధికారి రవీంద్రరాజు, వార్డెన్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
హృదయ నివేదనే క్రిస్మస్
రాజంపేట టౌన్ : ప్రపంచ వ్యాప్తంగా జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. క్రీస్తు జననానికి చిహ్నంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలకు జిల్లాలోని క్రైస్తవులు, విశ్వాసులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే సెమీ క్రిస్మస్, క్రిస్మస్ ఆరాధన పాటలతో క్రైస్తవులు, విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. కాగా క్రిస్మస్ను స్వాగతిస్తూ బుధవారం రాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. క్రిస్మస్ పండుగ సమీపించడంతో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అంతటా పండుగ కోలాహలం నెలకొంది. శాంతికి, త్యాగానికి ప్రతీక క్రిస్మస్.. శాంతికి, త్యాగానికి ప్రతీక క్రిస్మస్. క్రీస్తు జననం లోకానికి పర్వదినమని ప్రపంచమంతా అభివర్ణిస్తుంది. విశ్వాసం, ప్రేమ, కరుణ, దయ, నిరీక్షణ సందేశంతో క్రీస్తు లోకానికి కొత్త మార్గాన్ని చూపారు. మనిషి తన హృదయాన్ని క్రీస్తుకు సమర్పించడమే నిజమైన క్రిస్మస్ అని క్రైస్తవులు, విశ్వాసుల ప్రగాఢ విశ్వాసం. క్రైస్తవ లోకం అన్ని వర్గాల ప్రజలతో కలిసి సంతోషంగా ఆచరించే పర్వదినమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం. క్రైస్ట్ అంటే అభిషిక్తుడు మస్ అంటే ఆరాధన అని అర్థం. ఈ పదానికి అర్థం క్రీస్తును ఆరాధించడం. యెహోవాను భూమికి కానుకగా ఇచ్చిన దినమే క్రిస్మస్.. సృష్టికర్త అయిన యెహోవా దేవుడు తన ప్రియ కుమారుని నరరూపిగా ఈ భువికి కానుకగా ఇచ్చిన పవిత్ర దినమే క్రిస్మస్. పాత నిబంధన కాలంలోని యెషయా, దానియేలు, మీకా, మలాకీ తదితర ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పే క్రిస్మస్. ఈయన పరిశుద్ధాత్మ వల్ల పవిత్రుడిగా కన్య గర్భాన జన్మించాలన్నది యెహోవా దేవుని నిర్ణయం. ఈ సంకల్పమే దూత గాబ్రియేలు ద్వారా మరియాకు అందించిన శుభ వర్తమానం. రాజాధిరాజు ప్రభువుల ప్రభువు తనను తాను తగ్గించుకొని బెత్లెహాం అనే గ్రామంలో పశువుల పాకలో జన్మించారు. క్రీస్తు జన్మించగానే ఆకాశంలో ఆయన నక్షత్రం వెలిసింది. ఈ నక్షత్ర జాడతో తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు జననాన్ని గుర్తించారు. దైవ దూత ద్వారా అమాయకులైన గొల్లలకు ఈ వర్తమానం అందింది. ఆ సమయంలో పరలోక సైన్య సమూహం స్తుతి గానాలు చేసింది. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నదే క్రీస్తు బోధన సారాంశం. దాని ప్రకారం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు నూతన దుస్తులు, కానుకలు, ఆహార పదార్థాలు ఇచ్చి దీనులను ఆదరిస్తారు. చర్చిల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాత.. సెయింట్ నికోలస్ అనే గ్రీకు బిషప్ స్ఫూర్తితో శాంటాక్లాజ్ అనే ఒక పాత్ర రూపుదిద్దుకుంది. 1823వ సంవత్సరంలో అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో శాంటాక్లాజ్ వర్ణనపై రచించిన ఏవిజిట్ ఫర్ సెయింట్ నికోలస్ అనే కవిత ఆధారంగా థామస్నెస్ట్ అనే చిత్రకారుడు శాంటాక్లాజ్ ఊహాచిత్రాన్ని గీశారు. దీని ఆధారంగా క్రిస్మస్ తాత పాత్ర రూపుదిద్దుకుంది. క్రిస్మస్ రోజున రథంపై క్రిస్మస్ తాత వస్తాడని, మంచి ప్రవర్తన గల పిల్లలకు బహుమతులు తెస్తాడని, చెడు ప్రవర్తనగల పిల్లలకు బొగ్గు ఇస్తాడని చెబుతుంటారు. క్రిస్మస్ ట్రీకి ఎంతో ప్రాధాన్యత.. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చిల్లో, క్రైస్తవులు, విశ్వాసులు తమ ఇళ్లల్లో క్రిస్మస్ ట్రీని అలంకరించుకుంటారు. ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో క్రిస్మస్ ట్రీకి సంబంధించి పలు రకాల చరిత్ర ఉంది. ఆధునిక జర్మనీ ఏర్పడిన తరువాత క్రిస్మస్ ట్రీ ప్రాచుర్యంలోకి వచ్చింది. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథరన్ మొదటి సారిగా ఎవర్గ్రీన్ అనే చెట్టును కొవ్వొత్తులతో అలంకరించినట్లు చెబుతారు. 20వ శతాబ్దంలో క్రిస్మస్ ట్రీ చర్చిలకు విస్తరించింది. కాలక్రమేణా ఈ సాంప్రదాయం అన్ని దేశాలకు విస్తరించింది. క్రిస్మస్ ట్రీ నిత్య జీవనానికి సూచికగా, అపవాదును పారదోలే సాధనంగా క్రైస్తవులు, విశ్వాసులు భావిస్తారు. క్రీస్తు జననానికి చిహ్నంగా కొనసాగుతున్న ప్రత్యేక ప్రార్థనలు జిల్లాలో క్రిస్మస్ పండుగకు ముస్తాబవుతున్న చర్చిలు ఎల్లుండి రాత్రి నుంచి ప్రారంభం కానున్న క్రిస్మస్ వేడుకలుపూర్ణ హృదయంతో ఆరాధించాలి క్రీస్తు పుట్టుకలో దేవదూతలు, జ్ఞానులు, గొర్రెల కాపరులు ఆయనను ఆరాధించారు. జ్ఞానులైన వారు తాము తీసుకొచ్చిన బంగారం, బోళము, బహుమానాలను బాలుడైన క్రీస్తుకు సమర్పించారు. పరలోకం విడిచి భూలోకమునకు వచ్చిన క్రీస్తును పూర్ణ హృదయంతో ఆరాధించాలి. మన హృదయాలను క్రీస్తుకు సమర్పించడమే నిజమైన క్రిస్మస్. – మార్టిన్ లూథరన్, పాస్టర్, బేతేలు చర్చి, రాజంపేటప్రేమ, త్యాగం, దయాగుణాలే క్రిస్మస్ క్రిస్మస్ మానవాళికి శుభదినం. క్రీస్తు ప్రబోధించిన సుగుణాలు, పరిశుద్ధత, తగ్గింపు స్వభావం, ప్రేమ, త్యాగం, దయాగుణాలను అలవరుచుకోవడమే క్రిస్మస్ సందేశం. అందువల్లే ప్రపంచమంతా ఆ శుభ ఘడియ కోసం ఎదురు చూస్తోంది. – కస్తూరి ఫోనిక, సిస్టర్, నిజస్వరూపిణి మందిరం, రాజంపేట -
విద్యుత్షాక్తో వ్యవసాయ కూలీ మృతి
నిమ్మనపల్లె : కొబ్బరి చెట్టు ఎక్కి టెంకాయలు కోస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ యల్లారబైలుకు చెందిన జయరామిరెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి(31) ఐదేళ్ల క్రితం నిమ్మనపల్లె మండలం ముష్టూరు పంచాయతీ దిగువపల్లెకు చెందిన వెంకటరమణ, రమణమ్మ దంపతుల కుమార్తె చంద్రకళను ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆమె కోరిక మేరకు ఇల్లరికం వచ్చి దిగువపల్లెలో ఉంటూ కూలిపనులకు వెళుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నిమ్మనపల్లెకు వెళ్లి చికెన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంతలోనే గ్రామంలో రోడ్డుపక్కన దుకాణం నిర్వహిస్తున్న యజమాని తమ కొబ్బరి చెట్టు నుంచి కాయలు కోయాల్సిందిగా కోరడంతో అక్కడకు వెళ్లి చెట్టు ఎక్కాడు. కాయలు కోసే క్రమంలో ఓ టెంకాయ మట్టను నరకగా, అది సగం మాత్రమే తెగి వంగిన భాగం 11 కే.వీ. విద్యుత్లైన్పై పడటంతో చెట్టుకు కరెంట్ సరఫరా కావడంతో శ్రీనివాసులురెడ్డి షాక్కు గురై అక్కడికక్కడే చెట్టుమీదనే మృతి చెందాడు. మృతుడికి కుమార్తె మేఘన(2), కుమారుడు మోక్షజ్ఞ (9నెలలు) ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. స్థానికులు రోడ్డుపై బైఠాయించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యుత్శాఖ ఈఈ గంగాధరం, ఏడీఈ సురేంద్రనాయక్, ఏఈ నాగరాజు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడి భార్య చంద్రకళ నిమ్మనపల్లె పోలీసులకు ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణునారాయణ తెలిపారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
పెద్దమండ్యం : మండలంలోని కలిచెర్ల మౌలాకా పహాడ్ వద్ద ఉన్న ఓ ఇంటి ఆవరణలో గుప్తనిధులు వెలికి తీసేందుకోసం క్షుద్రపూజలు నిర్వహించినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గుప్తనిధుల కోసం తవ్విన ఇంటి ఆవరణాన్ని, పరిసర ప్రాంతాలను ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పరిశీలించారు.అరుదైన వన్య ప్రాణుల స్మగ్లర్లు అరెస్టు రైల్వేకోడూరు అర్బన్ : అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం వన్య ప్రాణుల స్మగ్లింగ్కు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజ్కుమార్, భూపతిరాజు, జయరావ్, మొలకల సుబ్రమణ్యం, శ్రీరాములాయారి, శివ, రవికుమార్లను అరెస్టు చేశారు. ఫారెస్టు రిజర్వు అధికారి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో వారిని కోర్టులో హాజరుపరిచారు. వారివద్ద నుంచి రెండు తలల పాము, అలుగులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోదరభావంతో మెలగాలి మదనపల్లె సిటీ : హిందువులు సోదరభావంతో మెలగాలని శ్రీనివాసమంగాపురానికి చెందిన శ్రీ వశిష్ట్రాశమ శ్రీలలితా పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి స్వస్వరూపానందగిరి స్వామి అన్నారు. ఆదివారం స్థానిక శేష్మహల్ టాకీసు సమీపంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని సూచించారు. ఎన్ని మతాలు, కులాలు ఉన్నా మనమంతా ఒక్కటేనన్న భావన కలిగి ఉండాలన్నారు. వీహెచ్పీ కుటుంబ ప్రభోధన్ ప్రాంత ప్రముఖ్ పుట్టా శేషు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. కార్యక్రమంలో వీహెచ్పి నాయకులు బండి బాలాజీ, పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు. తల్లి మందలించిందని.. బాలుడి ఆత్మహత్య కేవీపల్లె : పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లి మందలించిందని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ కర్ణంవారిపల్లెలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కర్ణంవారిపల్లెకు చెందిన నాగార్జున, అనితల కుమారుడు నాగచైతన్య (16) చౌడేపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటూ పాఠశాలకు వెళ్లేవాడు. కొన్ని నెలలుగా పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఈ క్రమంలో శనివారం పాఠశాల నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడం, సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉండడంతో తల్లి మందలించింది. దీంతో క్షణికావేశానికి గురైన నాగచైతన్య ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. చిట్వేలి విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికచిట్వేలి : రాయచోటి డైట్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో వి.దివ్యశ్రీ, ఎ సుస్మిత, వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో కె చందు, పి భరత్ కుమార్, వ్యక్తిగత విభాగంలో రుకియా బాంభో, పల్స్ బయోడిగ్రీడబుల్ సానిటర్ పాడ్స్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాయని తెలిపారు. విద్యుత్ కేబుల్ వైర్లు చోరీపులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురం, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లోని పొలాల్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ చేశారు. మల్లికార్జునపురం గ్రామానికి చెందిన రైతులు మల్రెడ్డి, మస్తాన్, రామాంజనేయులు, నబీ రసూల్, సుధాకర్ల పొలాల్లోని మోటార్ల దగ్గర ఉన్న కేబుల్ వైర్లను అపహరించి తీసుకెళ్లారు. -
ఒంటిమిట్టలో మహిళ దారుణ హత్య
ఒంటిమిట్ట : మండల పరిధిలోని గుంటికాడిపల్లి గ్రామంలో ఆదివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు..రాజంపేటకు చెందిన యానాది వెంకటరమణ, ఆతని భార్య నాలుగు రోజుల క్రితం గుంటికాడిపల్లి గ్రామంలోని వెంకట సుబ్బారెడ్డి మామిడి తోటలో కాపలా ఉంటామని వచ్చి, అక్కడి గుడిసెలో నివాసం ఉన్నారు. అయితే ఆదివారం ఉదయం 11 గంటలకు మామిడి తోట యజమానులు వారి కోసం వెళ్లి చూడగా అక్కడ యానాది వెంకట రమణ భార్య వివస్త్ర అయి, ఒంటి మీద కమిలి పోయిన గాయాలతో చనిపోయి ఉంది. ఆమె భర్త వెంకటరమణ పరారీ అయ్యాడు. దీంతో కంగారు పడిన మామిడి తోట యజమానులు ఒంటిమిట్ట పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ నరసింహారాజు, ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు, సిద్దవటం ఎస్ఐ రఫీ ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని, డాగ్ స్క్వాడ్ను రప్పించి చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించారు. మృతురాలి పేరు, వివరాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. వీఆర్ఓ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు తెలిపారు. -
అన్నను హతమార్చిన తమ్ముడు
గుర్రంకొండ : కుటుంబ కలహాలతో సొంత అన్ననే తమ్ముడు కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన మండలంలోని కండ్రిగ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేక్ నజీబ్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో నజీబ్ రాయచోటిలో ఒంటరిగా ఉంటున్నారు. కండ్రిగలోని తన సొంత ఇంట్లో కుమారులు షేక్ సాదిక్ (27) షేక్ మహమ్మద్ రఫీక్ (19) కలిసి ఉంటున్నారు. సాదిక్కు పదేళ్ల క్రితం కురబలకోట మండలం ముదివేడుకు చెందిన షమీమ్తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా సాదిక్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి భార్యను హింసించేవాడు. భర్త వేధింపులు భరించలేక భార్య షమీమ్ నాలుగేళ్ల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇంట్లో అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు. ఇంట్లో ఎవరు ఉండాలనే విషయమై అన్నదమ్ములు గత కొన్ని రోజులుగా ఘర్షణ పడుతుండేవారు. మూడురోజుల క్రితం ఘర్షణ పెద్దది కావడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సాదిక్ పూటుగా మద్యం తాగి మరోసారి ఇంటి విషయమై తమ్ముడితో ఘర్షణకు దిగాడు. వివాదం పెద్దదిగా మారి బాహాబాహి తలపడ్డారు. ఇంట్లో ఉన్న కత్తితో మహమ్మద్రఫీక్ అన్న సాదిక్పై దాడి చేశాడు. ఈ దాడిలో సాదిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తమ్ముడు రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కలవారు విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ బాలకృష్ణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక వీఆర్వో ప్రతిమ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తప్పుడు పత్రాలతో వక్ఫ్భూముల ఆక్రమణకు యత్నాలు
మదనపల్లె రూరల్ : పట్టణంలోని జామియా మసీదుకు చెందిన వక్ఫ్బోర్డు భూములను తప్పుడు పత్రాలతో ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని జామియా, టిప్పుసుల్తాన్ మసీదు కమిటీ ప్రెసిడెంట్ హాజీ.గౌస్ మొహియుద్దీన్, సెక్రటరీ సికిందర్అలీఖాన్ ఆరోపించారు. ఆదివారం టిప్పుసుల్తాన్ మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీకే.పల్లె రెవెన్యూ గ్రామంలో 23.30 ఎకరాల వక్ఫ్భూమి ఉందన్నారు. ఈ భూమి ఇప్పటివరకు సబ్డివిజన్ కాలేదని, మండల తహసీల్దార్ ధృవీకరిస్తూ ఎండార్స్మెంట్ ఇచ్చారన్నారు. అయినప్పటికీ, మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చిన్నపాటి మార్పులతో సుమారు 90 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. ఈ విధంగా సృష్టించిన పత్రాలను ఆధారాలుగా చూపిస్తూ, కోర్టులో కేసులు వేసి ముస్లిం సమాజానికి చెందిన వక్ఫ్భూమిని కాజేసేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను అడ్డుకుని, వక్ఫ్భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జామియా, టిప్పుసుల్తాన్ మసీదు అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్ సర్దార్ఖాన్, జాయింట్ సెక్రటరీ అక్బర్బాషా, మెంబర్లు అబూబకర్ సిద్ధిక్, మహమ్మద్బాషా, సాజిద్అలీఖాన్, మహమ్మద్ జమీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
● పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ములకలచెరువు : మండలంలోని చౌడసముద్రం జెడ్పీహైస్కూల్లో 1972–73 సంవత్సరంలో పదోతరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అప్పటి గురువులతో పాటు అప్పటి విద్యార్థులు పాల్గొన్నారు. గురువులు రంగారెడ్డి, విశ్వనాథ్, ప్రస్తుత హెచ్ఎం అశ్వినిలను సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. పాఠశాల ఆవరణంలోని స్టేజీపై రూ. లక్ష ఖర్చు చేసి రేకులు వేయించారు. పూర్వ విద్యార్థులు పుట్టా శేఖర్గుప్తా, రత్నశేఖర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వెంకటరమణ, మల్లప్పనాయుడు, మహబూబ్బాషా, గిరిజా కుమారి తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆకేపాటి
ఒంటిమిట్ట : మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. స్థానికుల వివరాల మేరకు..రాజంపేట మండలం, శేషమాంబపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు వైష్టవి, సునీల్ బైకుపై సిద్దవటం వెళ్తుండగా ఒంటిమిట్ట పెట్రోల్ బంకు వద్దకు రాగానే లగేజ్ ఆటో ఢీ కొనడంతో బైకులోని వారిద్దరు కిందపడి రక్త గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో వారు తీవ్ర గాయాలతో రోదిస్తున్నారు. ఆ సమయంలో సిద్దవటం నుంచి రాజంపేట వెళుతున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి వారిని చూసి కారులో నుంచి సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే నందలూరు నుంచి 108 వాహనాన్ని రప్పించి, అందులో వారిని కడప రిమ్స్కు తరలించారు. -
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగదు
పీలేరురూరల్ : బోధనేతర పనులు ఉపాధ్యాయులకు చెప్పరాదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్వీఎస్ఎస్ కల్యాణమండపంలో యూటీఎఫ్ జిల్లా నాల్గవ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు భిన్నంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు చెప్పడం వల్ల చదువు పట్ల ఏకాగ్రత కోల్పోతున్నట్లు తెలిపారు. బోధనేతర పనుల నుంచి విముక్తి కల్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, నాయకులు జావెద్, శివారెడ్డి, అక్రమ్బాషా, చంద్రశేఖర్, విశ్వనాథరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఆటోలు ఢీకొని ఇద్దరికి గాయాలులింగాల : లింగాల మండలం కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆటో డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన ముని పీరా అనే వ్యక్తి ఆటోలో అనంతపురం వెళ్లి వేరుశనగ కాయలను తీసుకొస్తుండగా కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తంగనాయనపల్లె గ్రామానికి చెందిన రామాంజి అనే వ్యక్తి ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముని పీరా కంటికి తీవ్ర గాయాలు కాగా, రామాంజికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో ఆటోలు నడపడంవల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు వారు తెలిపారు. గాయపడిన వ్యక్తిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామాంజి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో ఆటోను వదిలి పరారయ్యాడు. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
మదనపల్లె రూరల్ : పంటకోతకు పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే రైతు ప్రాణాలు విడిచిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. దుబ్బిగానిపల్లె పంచాయతీ ఎనుములవారిపల్లెకు చెందిన తాతప్ప కుమారుడు చంద్రశేఖర్(58) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి భార్య రత్నమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఏడాది రబీలో తనకున్న పొలంలో వరిపంట సాగు చేశాడు. 15 రోజులుగా పంట కోత కోసం తడి ఆరబెట్టిన కారణంగా పొలం వద్దకు వెళ్లలేదు. పొలంపై వెళుతున్న 11 కేవీ విద్యుత్ వైరు తెగి కిందపడింది. ఈ విషయం తెలియని రైతు చంద్రశేఖర్ శనివారం పంట కోతలో భాగంగా వరి కోత యంత్రాన్ని పొలం వద్దకు పిలిపించాడు. పంటకోత కోసేందుకు డ్రైవర్కు దారి చూపుతూ ముందువైపు నడుస్తూ విద్యుత్ తీగ తెగిపడిన పొలంలోకి వెళ్లాడు. వెళ్లే క్రమంలో విద్యుత్ తీగను గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు కాలికి తగిలి షాక్కు గురయ్యాడు. షాక్ తీవ్రత అధికంగా ఉండటంతో అక్కడికక్కడే పొలంలోనే ప్రాణాలు విడిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ మదనపల్లె డివిజన్ ఈఈ గంగాధరం ఆదేశాలతో ఏడీఈ హరిబాబు, ఏఈ రమేష్లు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విద్యుత్ తీగలు తెగి పడిన విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
మా ఊరి రాత మారింది..
నా 70 ఏళ్ల వయసులో మా ఊరిలో ఒక్క ప్రభుత్వ భవనం ఏర్పాటైంది చూడలేదు. జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి భవనాలు నిర్మించారు. గతంలో కనసానివారిపల్లెగా ఉండేది. జగన్ పాలనలో పంచాయతీగా చేశారు. దశాబ్దాలుగా మేం ఎరుగని అభివృద్ధి పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కళ్లారా చూశాం. గ్రామస్తులు ఒక సమస్య గురించి నేతలు, అధికారులకు పదేపదే అడిగినా స్పందించడం, పరిష్కరించడం అరుదు. అలాంటిది మేం అడకపోయినా అభివృద్ధి ఫలాలను మా పల్లె ముంగిటకే తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. మా ఊరునుంచే బైపాస్రోడ్డు కూడా పోతోంది. సిమెంటురోడ్లు, మురికినీటి కాలువలు నిర్మించి మౌలిక వసతులు కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. –జి.లక్షుమ్మ, కనసానివారిపల్లి -
మా జీవిత ‘మేసీ్త్ర’
విద్యార్థులకు ఉన్నత చదువు చదవాలని ఉంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంటుంది. అయితే ఆర్థిక స్తోమత లేక వారి చదువు కుంటుపడుతుంది.. అమ్మానాన్నల ఆశలు నెరవేరేవి కావు. ఇలాంటివారి కలలను సాకారం చేసింది జగనన్న అందించిన ఫీజు రీయింబర్స్మెంట్. పీలేరు పట్టణానికి చెందిన తాపీ మేసీ్త్ర శివప్రసాద్ జగనన్న అందించిన భరోసాను ఇలా గుర్తుచేసుకున్నాడు. నాపేరు గుండ్లూరు శివప్రసాద్. మాది పీలేరు పట్టణం పద్మావతి నగర్. నా భార్య గుండ్లూరు రాజేశ్వరి గృహిణి. నేను తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాను. రోజంతా కష్టపడినా అరకొర ఆదాయం వస్తుంది. అది కుటుంబ పోషణకే సరిపోయేది. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. నా కూతురు జి. శ్రీరమ్య తిరు పతి చైతన్య కళాశాలలో బీటెక్ చదువుతుండేది. చదువు సాగేందుకు డబ్బుల గురించి ఆలోచించేవాడిని. అయితే అదే సమయంలో జగనన్న సీఎం కావడంతో శ్రీరమ్యకు 2022 –23, 2023–24 విద్యా సంవత్సరంలో రూ. 20 వేలు చొప్పున రెండేళ్లు మొత్తం రూ. 40 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరైంది. దీంతో ఆర్థికభారం తగ్గి నా బిడ్డ బీటెక్ పూర్తి చేసింది. పేదలను ఉన్నత చదువుల బాట పట్టించిన విద్యా ప్రదాత జగనన్న సేవలను ఎన్నటికీ మరువలేను. – పీలేరు రూరల్ -
ప్లాస్టిక్ నియంత్రణ అందరి బాధ్యత
కలకడ : జిల్లాను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వస్తువుల వాడకంలో నియంత్రణ ఉండాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. శనివారం కలకడలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలకడ సర్పంచ్ ప్యారీజాన్ కుమారుడు జావాద్ కలకడ చెత్తసేకరణ కేంద్రం వద్ద అధికారులతో కలిసి చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు. కలకడ చెత్త సేకరణ కేంద్రం వద్ద తయారు చేసిన సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయల పంటలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కోన గ్రామానికి చెందిన చేనేత కార్మికులు ప్రదర్శించిన పట్టుచీరలను పరిశీలించారు. స్థానికంగా విక్రయ స్థలాలకు వినియోగదారులు వచ్చే విధంగా అవగాహన పెంచాలని సూచించారు. స్వర్ణ– ఆంధ్ర, స్వచ్ఛ–ఆంధ్ర ర్యాలీలో విద్యార్థులు , పారిశుధ్యకార్మికులు, అన్నిశాఖల అధికారులతో కలిసి కలకడ వరకూ ర్యాలీ నిర్వహించి, కలకడ ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో మానవహారం ఏర్పాటు చేయించి పరిశుభ్రత పాటిస్తామని, ప్లాస్టిక్ వినియోగించం అని ప్రతిజ్ఞ చేయించారు. జీతాలు పెంచి ఆదుకోండి.... వీధులు పరిశుభ్రంగా ఉంచి రోజువారి చెత్తసేకరిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు, చెత్త సేకరణ సిబ్బంది తమకు జీతాలు పెంచాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఇంకా పలు సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీఓ, డీఎల్పీవో, సీఐ లక్ష్మన్న, తహసీల్దార్ మహేశ్వరిభాయ్, ఎంపీడీఓ భానుప్రసాద్, సింగల్విండో అధ్యక్షులు వెంకట్రమణనాయుడు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంత్కుమార్ -
సొంతింటి కల సాకారం
నా పేరు కొలకని గంగమ్మ. ఒంటిమిట్ట మండలం అరుంధతీ వాడలో ఉంటున్నాను. నా భర్త పేరు నరసింహులు. మాకు ఒక కుమారుడు. పేరు హరిబాబు. నా భర్త మద్యానికి అలవాటు పడి ఇంటి గురించి పట్టించుకోకుండా తిరుగుతుంటాడు. ఏం చేయాలో దిక్కుతోచక మా మేనమామ పేర్ల కొండయ్య ఇంట్లో నేను, నా బిడ్డ తలదాచుకుంటున్నాము. అయి తే జగనన్న సీఎం అయ్యాక అన్ని పథకాలు మాకు అందాయి. నా కొడుకు ఒంటిమిట్టలో పదవ తరగతి చదువుకున్నాడు. అమ్మ ఒడి కింద రూ. 55 వేలు వచ్చాయి. రూ.1.50 లక్షల విలువ చేసే ఇంటిపట్టా ప్రభుత్వం ఇచ్చింది. రూ.1.80లక్షల విలువ చేసే పక్కా ఇంటి నిర్మాణం చేసుకున్నాను. చేయూత కింద రూ. 56 వేలు వచ్చింది. మొత్తం మీద రూ.4.50లక్షల వరకు ఆర్థికసాయం అందిందంటే అది జగనన్న చలువే. ప్రస్తుతం పంచాయతీలో స్వీపర్గా పనిచేస్తున్నా. – రాజంపేట -
మా బిడ్డకు మాటొచ్చింది
జగనన్న ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించడంతో మా బిడ్డకు మాట వచ్చిందని షేక్ రేష్మా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఆమె మాటల్లోనే... ‘మాది లక్కిరెడ్డిపల్లి టౌన్లోని పాత మసీదు వద్ద ఉంటున్నాం. నా భర్త పేరు మహబూబ్ బాషా. మాకు ఒక కుమార్తె. పేరు అలివూర్ సుల్తానా. ఆ పాపకు పుట్టుకతో మూగ, చెవుడు. అసలే ఆడబిడ్డ, అందులోనూ మూగబిడ్డ అని ఎంతో బాధపడ్డాం. లక్షలు విలువచేసే కాక్లియర్ ఇంప్లాంటే షన్ ఆపరేషన్ చేస్తేనే మాటలు వస్తాయి, చెవులు వినబడతాయని వైద్యులు చెప్పారు. నా భర్త ఆటో తోలుతూ కుటుంబం పోషిస్తున్నాడు. మాకు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించే స్థోమత లేదు. జగనన్న ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుంటూరులోని ఈఎన్టీ ఆసుపత్రిలో మా పాపకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఇప్పడు మా పాప కొద్దికొద్దిగా మాట్లాడుతోంది. మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి. – లక్కిరెడ్డిపల్లి -
సంక్షేమ సారథి
సాక్షి రాయచోటి : రాజు బాగుంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనేది నానుడి. అందుకు తగ్గట్టుగానే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పాలన సాగింది. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ‘అన్నమయ్య’లో అపార అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాను పురోగతిబాట పట్టించింది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేట పార్లమెంటును జిల్లాగా మార్చి జిల్లా కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేశారు. అంతకుమునుపు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా ప్రత్యేకంగా వారిని కంటికిరెప్పలా ప్రభుత్వం కాపాడుకుంది. మరోపక్క అంతే వేగంగా జిల్లాను అభివృద్ధి చేసింది. ● ప్రధానంగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో రూ. 25 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాయచోటి ప్రజల దాహార్తి తీర్చేందుకు రెండవ పైపులైన్ కోసం రూ.100 కోట్లు కేటాయించగా ఇప్పటికీ పనులు జరుగుతున్నాయి. రాయచోటిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి సుమారు రూ. 100 కోట్లు కేటాయించారు. రూ. 8 కోట్లతో శిల్పారామం, కేంద్రీయ విద్యాలయం, పీజీ కళాశాల, మరో రూ. 3 కోట్లతో నగరవనం, క్రికెట్ స్టేడియం, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి 50 ఎకరాల్లో ఎంఐజీ లే అవుట్, డబల్రోడ్డు నిర్మాణాలు, మున్సిపాలిటీ పరిధిలో పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు, నూతనంగా ఆర్టీసీ బస్టాండు, రైతు బజారు, సర్కిళ్లు, ఆర్అండ్బీ అతిథిగృహం, టౌన్ పోలీసుస్టేషన్, డీఎస్పీ కార్యాలయం, ఇంకా అనేక రకాల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ● మదనపల్లెలో రూ. 500 కోట్లతో మెడికల్ కళాశాల హైలెట్గా నిర్మాణాలు కొనసాగాయి. కేంద్రీయ విద్యాలయం, మదనపల్లె వాసుల ఎన్నో ఏళ్ల కలగా ఉన్న బీటీ కళాశాలను యూనివర్శిటీ స్థాయికి తీసుకెళ్లడం, సుమారు రూ. 200 కోట్లతో గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధితోపాటు ఇతర అనేక విధాలుగా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టారు. ● తంబళ్లపల్లె నియోజకవర్గంలోనూ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. పీలేరులో కూడా రూ. 24 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, పీలేరు–తిరుపతి జాతీయ రహదారి నిర్మాణ పనులు వందలాది కోట్లతో, రైల్వేకోడూరు పరిధిలో రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జిలు, చిట్వేలి–రైల్వేకోడూరు ఫోర్లేన్రోడ్డు, రాజంపేట పరిధిలో రూ. 80 కోట్లతో పింఛా ప్రాజెక్టును దాదాపుగా పూర్తి చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా భారీగా లబ్ధి అన్నమయ్య జిల్లాలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా సుమారు రూ. 9,450 కోట్ల మేర లబ్ధి చేకూరింది. అనేక రకాల పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించారు. ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ. 1500 కోట్ల మేర ప్రయోజనం ఒనగూరింది. పేద, మధ్యతరగతి, ఇతర తారతమ్యాలు చూడకుండా పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించారు. ఊర్లు మారిపోయాయి జిల్లా వ్యాప్తంగా 525కు పైగా లే అవుట్లలో 75 వేల గృహాలకు సంబంధించి నిర్మాణాలు చేపడితే అందులో వేలాది గృహాలు పూర్తయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ కొత్త ఊర్లు ఆవిర్భవించాయి. ఇంటి నిర్మాణాలతో నూతన శోభ సంతరించుకుంది. జిల్లాలో డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 9,450 కోట్లకు పైగా లబ్ధి పునర్విభజనతో జిల్లాలో అభివృద్ధి పరుగులు జిల్లా కేంద్రం రాయచోటిలో అన్ని రకాలుగా పురోభివృద్ధి మదనపల్లెలో తలమానికంగా రూ. 500 కోట్లతో మెడికల్ కళాశాల నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు పార్టీ పిలుపు -
బాల శాస్త్రవేత్తల వేదిక సైన్స్ ఫెయిర్
● పాఠశాల విద్య, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శామ్యూల్ ● ఘనంగా సైన్స్ ఫెయిర్రాయచోటి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాల శాస్త్రవేత్తల అన్వేషణలను ప్రోత్సహించేందుకు జిల్లా సైన్స్ ఫెయిర్ ఒక అద్భుత వేదిక అని పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు శామ్యూల్ అన్నారు. రాయచోటి పట్టణం, డైట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో దాగి ఉన్న అన్వేషణాత్మక ఆలోచనలకు సైన్స్ ఫెయిర్లు పదును పెడుతున్నాయన్నారు. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలు వెతకడానికి ఇవి దోహదపడతాయన్నారు. విద్యార్థి దశ నుండే బాలలు అన్వేషణాత్మక ప్రాజెక్టులను రూపొందించడం చాలా గొప్ప విషయమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలుపుతున్న అన్నమయ్య జిల్లా సైన్స్ ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల నుంచి 330 ప్రాజెక్టులు జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించారన్నారు. వీటిలో రెండు టీచరు విభాగంలో, మరో రెండు వ్యక్తిగత విభాగం నుంచి, ఏడు గ్రూపు విభాగం నుంచి మొత్తం 11 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. జిల్లా విజేతలు ఈనెల 23, 24వ తేదీలలో విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో పాల్గొనాలన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ మిగిలిన విద్యార్థులలో చక్కటి స్ఫూర్తిని నింపిందన్నారు. సైన్స్ ఫెయిర్ను సందర్శించిన అధికారులు.. సైన్స్ ఫెయిర్ను ఆర్జేడీ, డీఈఓ, ఏపీసీ అధికారులు విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు. ప్రతి స్టాల్ను సందర్శిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల వెనుక ఉన్న శాసీ్త్రయ సూత్రాలను స్పష్టంగా వివరించడం గమనార్హం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రాజెక్టులు ప్రాయోగికత, సామాజిక అవసరాలపై దృష్టి పెట్టడం ప్రశంసనీయమని అధికారులు తెలిపారు. విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కొండూరు శ్రీనివాసరాజు, ఏఎంఓ అసదుల్లా, సెక్టోరియల్ అధికారులు జనార్దన్, డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ శివ భాస్కర్, సంఘం నాయకులు రామచంద్ర, వీరాంజనేయులు, శివారెడ్డి, నరసింహులు, జ్యూరీ సభ్యులు, గైడ్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉరకలెత్తిన ఉత్సాహండైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన –2025 ఎంతో ఉత్సాహంగా సాగింది. తమ ప్రాజెక్టులను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు ప్రదర్శించారు. ప్రదర్శనలను తిలకించడానికి వచ్చిన వారిని అబ్బురపరిచాయి. జిల్లా నలుమూలల నుంచి 330 పాఠశాలల నుంచి ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. విజేతలు.. టీచర్స్ విభాగంలో.. బి.ప్రకాష్ రెడ్డి (రాయచోటి మండలం, జడ్పీహెచ్ఎస్ కె.రామాపురం), సువర్ణాదేవి(వాల్మీకిపురం మండలం, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్) వ్యక్తిగత విభాగంలో.. జి.రుకియా (చిట్వేలి మండలం జడ్పీహెచ్ఎస్ చిట్వేలి), సిద్దార్థ రెడ్డి (బి కొత్తకోట మండలం, జడ్పీహెచ్ఎస్ గట్టు) గ్రూపు విభాగంలో... సస్టైనబుల్ అగ్రికల్చర్లో జి.నవ్య, ఎన్.అక్షిత (కలకడ మండలం ఏపీఆర్ఎస్ గర్ల్స్ కలకడ), వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ విభాగంలో టి.లాస్య రెడ్డి, జి విజయలక్ష్మీ(ఓబులవారిపల్లి మండలం, జడ్పీహెచ్ఎస్ మంగంపేట), గ్రీన్ ఎనర్జీ విభాగంలో దివ్యశ్రీ, ఎ సుస్మిత (చిట్వేలి జడ్పీహెచ్ఎస్), ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగంలో బి.ప్రకాష్, జి,మహీధర్ నాయుడు (ఏపీఎంఎస్ రామాపురం), రిక్రియేషన్లో మ్యాథమెటికల్ మోడలింగ్ విభాగంలో వి.హర్షప్రియ, ఈ.వినయ్( సుండుపల్లి మండలం, జడ్పీహెచ్ఎస్ తిమ్మ సముద్రం) , హెల్త్ అండ్ హైజిన్ విభాగంలో కె.హర్షవర్దన్, సి.మహేష్ (వీరబల్లి మండలం, జడ్పీహెచ్ఎస్ ఆర్విపల్లి), వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో కె.చందు, పి.భరత్ కుమార్ (జడ్పీహెచ్ఎస్ చిట్వేలి) -
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్ లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్ కి పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్ కి సమర్పించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, బంగారు ఆభరాణాలు వేసి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. నేడు క్రికెట్, త్రోబాల్ పోటీలు మదనపల్లె సిటీ : జిల్లా స్థాయిలో టీచర్స్కు క్రికెట్, త్రోబాల్ పోటీలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శులు నాగరాజు, ఝాన్సీరాణి తెలిపారు. రాయచోటిలోని నక్కలపల్లి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అఽథారిటీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుందన్నారు. క్రికెట్, త్రోబాల్ పోటీల్లో డివిజన్ స్థాయిలో విజేతలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రికెట్ క్రీడాకారులు తమ వెంట సొంత స్పోర్ట్స్ కిట్,అబ్డామిన్ పరికరాలు, త్రోబాల్కు వచ్చే క్రీడాకారులు తమ వెంట సొంత క్రీడాదుస్తులు, త్రోబాల్ను తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు ముగిసిన తర్వాత మూడు డివిజన్ల నుంచి ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి జిల్లా జట్టుకు ఎంపిక జరుగుతుందన్నారు. -
రాష్ట్రంలో స్కూళ్ల తలరాత మారింది
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల పంచాయతీ పరిధిలోని తల్లెంవారిపల్లె అటవీ శివారు గ్రామం. 500 ఇళ్లున్న ఈ గ్రామం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే దాకా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వ భవనం అంటూ ఒక్కటీ ఉండేది కాదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఆ ఊరు రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. అభివృద్ధి పనులు పరుగులు తీశాయి. గ్రామంలోకి అడుగు పెట్టగానే గ్రామ సచివాలయ భవనం అందంగా కనిపిస్తుంది. దానికి కొంచెం దూరంలో సకల సౌకర్యాలతో నాడు–నేడు కింద కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా హైస్కూల్ ఏర్పాటు అయ్యింది. నగరాలు, పట్టణాల్లో ఉండే స్కూళ్లను మరిపిస్తూ రూపు దిద్దుకున్న ఈ స్కూల్లో ఇప్పుడు తల్లెంవారిపల్లెతో పాటు గాదెల పంచాయతీలోని ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, అరుంధతివాడ, కొత్తపల్లి అరుంధతివాడ, కొత్తపల్లి దళితవాడలతో పాటు జీవీ పురం, నూకనపల్లె, కిష్టంపల్లె గ్రామాల నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు.పాములేరు వంకపై పాఠశాల రక్షణ గోడ సైతం నిర్మించారు. అన్నదాతలను అన్ని విషయాల్లో చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం వెలిసింది. చుట్టుపక్క గ్రామాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటైంది. తల్లెంవారిపల్లె–కొత్తపల్లె, జీవీపురం–తల్లెంవారిపల్లె గ్రామాలకు సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఇలా తక్కువ సమయంలో గ్రామం అభివృద్ధిపథంలో దూసుకెళ్లింది. ఎంతలో ఎంత మార్పు.. అని గ్రామస్తులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. – ఓబులవారిపల్లె -
క్వారీలతో పల్లె రోడ్లు ఛిద్రం
మదనపల్లె రూరల్: మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీలోని క్వారీలతో పల్లె రోడ్లు ఛిద్రమైపోతున్నాయని, వాటి నుంచి వచ్చే దుమ్ముతో పంటపొలాలు దెబ్బతింటున్నాయని, పేలుడు శబ్దాలతో ఇళ్లలో ఉండలేకున్నామని రైతులు ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ఇచ్చిన అర్జీపై సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి స్పందించారు. రైతుల సమస్యను నేరుగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మైనింగ్ సిబ్బందితో కలిసి పర్యటించారు. రోడ్ల దుస్థితిని నేరుగా పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మదనపల్లె మండలం రామసముద్రం రోడ్డు నుంచి కోటవారిపల్లె, ఉడుంవారిపల్లెకు వెళ్లే రహదారి, క్వారీలకు సంబంధించిన భారీ వాహ నాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వర్షాకాలంలో ప్రయాణానికి ఏమాత్రం అనువుగా లేకపోగా, మోకాలిలోతు గుంతలతో ప్రయాణం నరకంగా తయారైందన్నారు. దీనికితోడు క్వారీల నిర్వహణతో వెలువడే దుమ్ము, ధూళి కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పేలుళ్ల ధాటికి ఇళ్లలో ఉండలేకున్నామని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ గ్రామానికి వచ్చి, రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా పోతోందన్నారు. దీనికితోడు క్వారీ నిర్వాహకులు కొండలపై నుంచి దిగువకు నీరు వచ్చే సప్లై ఛానల్స్, చెక్డ్యామ్లను పూర్తిగా మూసివేశారన్నారు. దీంతో గొర్రెలు, పశువులకు తాగునీటి వసతి లేకపోగా, మేపేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. క్వారీలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేటప్పుడు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తామని, గ్రామాల్లో మౌలికవసతులు కల్పిస్తామని, అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం తప్పితే, పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. రైతుల సమస్యలు తెలుసుకున్న సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి...క్షేత్రస్థాయిలో తాను గమనించిన అంశాలు, రహదారుల దుస్థితిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్రెడ్డి, మండల ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ సొక్కం సత్యనారాయణ, రైతు సురేష్, వీఆర్వో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. దుమ్ము, శబ్దాలతో నిత్యం నరకం సబ్ కలెక్టర్ చల్లాకల్యాణికి రైతుల వినతి -
సీమ అస్తిత్వ చిరునామా గజ్జెల మల్లారెడ్డి
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకొని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించిన అభ్యుదయ రచయిత గజ్జెల మల్లారెడ్డి అని కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. యోగి వేమన విశ్వ విద్యాలయం తెలుగు శాఖ, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గజ్జెల మల్లారెడ్డి శత జయంతి సదస్సు శుక్రవారం విశ్వవిద్యాలయంలోని మొల్ల సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం భాషల పట్ల వారధిగా పనిచేయడానికి కేంద్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. గజ్జెల మల్లారెడ్డి రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకున్నాడని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించాడన్నారు. అభ్యుదయ సాహిత్యానికి కడప జిల్లా కవులు ప్రధాన భూమిక పోషించారని, వారిలో రాచమల్లు రామచంద్రా రెడ్డి , కేతు విశ్వనాథ రెడ్డి, సొదుం జయరాం, గజ్జెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారని అన్నారు. మల్లారెడ్డి వేమన లాగే ప్రజల్లో తిరిగాడని, అందుకే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు కవిత్వంగా మార్చాడన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావాలన్నారు. గజ్జెల మల్లారెడ్డి సరళమైన భాషలో, క్లుప్తంగా,వ్యంగ్యాత్మంగా రాస్తారని అన్నారు. రాజకీయ విమర్శ చాలా సూటిగా ఉంటుందని ఉదహరించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య టి.శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు వృత్తి బాధ్యతతో పాటు ఒక ప్రవృత్తిని ఎంచుకొని ముందుకు సాగితే భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని, ఒకవేళ మన ప్రవృత్తి సాహిత్యం అయితే జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రాసిన శ్రీగజ్జెల మల్లారెడ్డి జీవిత చరిత్ఙ్ర పుస్తకం(మోనోగ్రాఫ్)ను అతిథులు ఆవిష్కరించారు. తెలుగు శాఖాధిపతి, కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా మండలి సభ్యులు, సదస్సు నిర్వాహకులు ఆచార్య ఎం. ఎం.వినోదిని స్వాగతం పలికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ ఎం. ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ గజ్జెల మల్లారెడ్డి నిరంతరం రాజకీయాలను పరిశీలిస్తూ వర్తమాన అంశాలను కవిత్వంగా, వ్యాసాలుగా రాసేవారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ సంచాలకులు ఆచార్య పిసి వెంకటేశ్వర్లు గజ్జెల మల్లారెడ్డి ఆత్మకథ అయిన ఆత్మసాక్షిపై మాట్లాడారు. మల్లారెడ్డి అనువదించిన సుహృల్లేఖనం, దమ్మపథం గ్రంథాలపై ప్రముఖ విమర్శకులు డా. పి. సంజీవమ్మ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు మేడిపల్లి రవికుమార్ మాట్లాడారు. గజ్జెల మల్లారెడ్డి గేయాల్లోని నిర్మాణ పద్ధతులను తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర రెడ్డి ఉదాహరణలతో వివరించారు. ఈ సదస్సులో కేంద్ర అకాడెమీ ప్రతినిధి టి.ఎస్. చంద్రశేఖర రాజు, సాహిత్య తెలుగు శాఖ ఆచార్యులు పి.రమాదేవి, జి. పార్వతి, ఆర్ట్స్ డీన్ ఆచార్య కె. గంగయ్య, పరిశోధకులు,పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం -
కార్మికుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : మిద్దైపె నుంచి పడి భవననిర్మాణ కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఎస్టేట్ విజయనగర్కాలనీకి చెందిన వీరభద్ర(55) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నా డు. బాబూకాలనీలో ఓ ఇంటిపై పనులు చేస్తుండ గా, అక్కడ అమర్చిన సారువ కొయ్యలు బ్యాలె న్స్ తప్పడంతో మిద్దైపె నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కరెంట్షాక్తో యువకుడికి తీవ్రగాయాలు మదనపల్లె రూరల్ : కరెంట్షాక్తో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. చీకలబైలుకు చెందిన రామకృష్ణ కుమారుడు కరుణాకర్ అలియాస్ కర్ణ(17) ఎలక్ట్రిక్ లైటింగ్ పనులు చేసేవాడు. శుక్రవారం మండలంలోని శానిటోరియం సమీపంలోని ఓ చర్చికి క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ అలంకరణ చేస్తుండగా, వైరును పైకి వేసే క్రమంలో 11కేవీ.విద్యుత్ తీగలపై పడి కరెంట్ షాక్కు గురై చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గా యపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బా ధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి త రలించారు. చికిత్సలు అందించిన అనంతరం ప రిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. కారు – ద్విచక్రవాహనం ఢీ – భార్యభర్తలకు తీవ్ర గాయాలు పీలేరురూరల్ : కారు – ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్ర గాయాలైన సంఘటన పీలేరు శివారు ప్రాంతం బోడుమల్లువారిపల్లె సమీపంలో చోటు చేసుకుంది. సుండుపల్లె మండలం గొల్లపల్లెకు చెందిన ఆనంద్ (30), భార్య శ్రావణి (27) పీలేరులో టీ హోటల్ పెట్టుకుని జీవనం సాగించేవారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్యభర్తల తోపాటు కుమారుడు అభయ్కుమార్ ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కాణిపాకం వెళుతున్న కారు బోడుమల్లువారిపల్లె వద్ద వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిరువురూ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ ఆనంద్, శ్రావణి -
సౌత్జోన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
మదనపల్లె సిటీ: జేఎన్టీయూ సౌత్జోన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ప్రశాంత్ ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జేఎన్టీయూ సౌత్జోన్ ఇంటర్ యూనివర్శిటీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నాడు. ప్రతిభ కనబరిచి త్వరలో జరిగే సౌత్జోన్ పోటీలకు ఎంపికయ్యాడు. కాలేజీలో శుక్రవారం కాలేజీ డైరెక్టర్ రామమోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ రాయుడు, అధ్యాపకులు అభినందించారు. కురబలకోట: అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంఐటీఎస్–ఐపీఎఫ్సీ మదనపల్లె మద్దతుతో మదనపల్లె పట్టు –పట్టు చీరల కోసం భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ కోసం దరఖాస్తు సమర్పించినట్లు యూనివర్సిటీ వీసీ సీ.యువరాజ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టుచీరలు నాణ్యత, మెరుపు,తేలిక లాంటి అల్లికకు ప్రసిద్ధి చెందాయన్నారు. మిట్స్ ఛాన్సలర్ ద్వారకనాథ్ మాట్లాడుతూ రైతులు,నేత కార్మికులు తయారీదారులు జీఐ ట్యాగ్ సంభావ్య ప్రయోజనాలపై ఆశాభావంతో ఉన్నారన్నారు. రాయచోటి టౌన్: ఈ నెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య, వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి వైద్యశాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 0–5 సంవత్సరాల లోపు పిల్లలు 1,78,150 మంది ఉన్నారని తెలిపారు. వీరికి పోలియో చుక్కలు వేయడానికి 1615 బూత్లు ఏర్పాటు చేశామన్నారు. పోలియో చుక్కలు వేయడానికి 6648 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి 100 శాతం పోలియో లేని దేశం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాయచోటి: జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి పది సంవత్సరాల పైబడి క్లైమ్ చేయని బ్యాంకు అకౌంట్లలోని నగదును జిల్లా పరిపాలనకు వినియోగించుకునేలా.. జిల్లా కలెక్టర్ అకౌంట్లోకి బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులు, బ్యాంకుల ప్రతినిధులను జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖలకు సంబంధించి బ్యాంకు అకౌంట్లపై జిల్లా సంయుక్త కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మొదట జిల్లాకు సంబంధించి వంద అకౌంట్లను గుర్తించి బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు,బ్యాంకర్లను ఆదేశించారు. నిల్వ ఉన్న నగదును జిల్లా పరిపాలనకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
డిజిటల్ ప్రయోగాల వినియోగంపై శిక్షణలో మడితాటి
రాయచోటి టౌన్ : ఢిల్లీ (ఎన్సీఈఆర్టీ)లో సాంఘికశాస్త్రం బోధనలో అమలు పరుస్తున్న డిజిటల్ ప్రయోగాల (వర్చువల్ ల్యాబ్స్)పై నిర్వహిస్తున్న జాతీయ స్థాయి శిక్షణలో రాయచోటి డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి పాల్గొన్నారు. గత రెండు రోజులు (18,19) రోజులు నిర్వహించిన ఈ శిక్షణలో భాగంగా ఆయన పాల్గొని సాంఘిక శాస్త్రం బోధనపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ట్రైనర్లు పాల్గొని సాంఘికశాస్త్ర బోధన అంశాలపై డిజిటల్ ప్రయోగాల అమలు వలన పాఠ్యపుస్తకాలలోని కఠినమైన భావాలను విద్యార్థులకు సులభతరంగా అర్థం అయ్యే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి శిక్షణ వలన బోధన –అభ్యాసన పక్రియ మరింత ఆసక్తిగా మారుతుందని తెలిపారు. వర్చువల్ ల్యాబ్స్, యానిమేషన్లు, ఇంటరాక్టీవ్ మ్యాప్స్. సిమ్యులేషన్స్ ద్వారా భౌగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి అంశాలపై విద్యార్థులకు అనుభావత్మకంగా (లెర్నింగ్ బై డూయింగ్) నేర్చుకొనే అవకాశం లభిస్తుందన్నారు. డిజిటల్ పద్దతి ద్వారా విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందిస్తుందన్నారు. ఈ శిక్షణలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర పి బెహరా, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ బింజా, అనేక రాష్ట్రాల నుంచి ఎన్సీఈఆర్టీ అధ్యాపకులు, డైట్ అధ్యాపకులు పాల్గొన్నారని తెలిపారు. -
ఉపాధి హామీ సవరణలకు వ్యతిరేకంగా నిరసన
మదనపల్లె రూరల్ : గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్ని, పార్లమెంటులో చట్ట సవరణ చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సవరణలకు వ్యతిరేకంగా శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం, వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ... ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలను రద్దు చేయాలన్నారు. చట్టబద్ధహక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దుచేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఉపాధిహామీ పథకం పేరును మార్చడం మహాత్ముడిని అవమానించడమేనన్నారు. ఉపాధిహామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్తబిల్లుతో నామమాత్రంగా మారుతుందన్నారు. 10 నుంచి 40 శాతం రాష్ట్రాలపై భారం పెంచారన్నారు. ఇప్పటివరకు పథకం అమలుకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న 90శాతం నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై వేలకోట్లు అదనపు భారం వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ప్రభాకర్రెడ్డి, సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరిశర్మ, ఆటో యూనియన్ నాయకులు శ్రీరాములు, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు మోహన్రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పామూరి సుబ్రమణ్యంపై కేసు నమోదు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వద్ద నిత్యాన్నదానం కేంద్ర ఏర్పాటు పనులను నిలిపి వేసిన వ్యక్తి పామూరి సుబ్రమణ్యంపై శుక్రవారం టీటీడీ అధికారులు కేసు నమెదు చేశారు. పోలీసుల వివరాల మేరకు..ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆవరణలో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు లో భాగంగా ఈ నెల 12 వ తేదిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు పనులు నిర్వహిస్తుండంగా పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి తమ స్థలం అంటూ ఆ రోజు ఆ పనులను నిలిపి వేయడంపై 19వ తేదీ ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పామూరు సుబ్రమణ్యంపై కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బి.మహేశ్వర్ రెడ్డి (ఏఆర్ పీసీ 422) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఏఆర్ పీసీ మహేశ్వర్ రెడ్డి మృతి పట్ల జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బంది అకాలమరణం పొందడం బాధాకరమన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్ఐ శివరాముడు.. కడప నగరం రవీంద్ర నగర్లోని బి.మహేశ్వర్ రెడ్డి స్వగృహం వద్దకు వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాగా మహేశ్వర్ రెడ్డి 1994బ్యాచ్ కు చెందిన వ్యక్తి. భార్య, కుమార్తె ఉన్నారు. శనివారం పోలీస్ లాంఛనాలతో మహేశ్వర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు. -
పునఃప్రారంభం అయిన నిత్యాన్నదాన కేంద్రం పనులు
టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులతో వాదిస్తున్న పామూరు సుబ్రమణ్యం పునఃప్రారంభం అయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ఆవరణలో ఈ నెల 11వ తేది ప్రారంభం అయ్యి 12వ తేది ఆగిపోయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు శుక్రవారం టీటీడీ అధికారులు పునఃప్రారంభించారు. అసలు విషయానికి వస్తే...ఈ నెల 11న రామాలయం ఆవరణలోని నామల వనం పక్కనే ఉన్న పార్కులో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులను ప్రారంభించారు. అయితే టీటీడీ పనులు ప్రారంభించిన ప్రదేశం తమది అంటు పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకుని అతని హద్దు వరకు కంచె వేసేందుకు సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి అక్కడ టీటీడీ చేస్తున్న తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు ఆగిపోయాయి. దీంతో స్థానికంగా ఉన్న ఆలయ టీటీడీ అధికారులు విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు సమస్య పరిష్కారానికి టీటీడీ వీజీవో(విజిలెన్స్, భద్రత అధికారి) గిరిధర్ శుక్రవారం ఒంటిమిట్ట రామాలయం వద్దకు చేరుకున్నారు. సమస్యాత్మకంగా ఉన్న తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న నిత్యాన్నదానం కేంద్రానికి సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించి, అక్కడ పనులకు ఆటంకం కలిగించేందుకు పామూరు సుబ్రమణ్యం ఏర్పాటు చేసిన సిమెంట్ స్తంభాలను స్థానిక పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న పామూరు సుబ్రమణ్యం ఘటన స్థలానికి చేరుకుని తమ స్థలానికి నష్టపరిహారం అందించి, అందులో ఏ పనులైనా చేసుకోవాలని వారితో వాదించారు. అయితే ఆయన వాదన విన్న వీజీవో గిరిధర్ తమది అంటున్న స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉంటే కోర్టు ఆదేశాలతో రావాలని ఆయన తెలిపారు. అంత వరకు ఇక్కడ పనులు ఆపే అర్హత వారికి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేది ఏమీ లేక పామూరు సుబ్రమణ్యం కోర్టు ఆదేశాలతో వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సీఐ నరసింహారాజు, టీటీడీ సివిల్ విభాగం డీఈ నాగరాజు, ఏఈ అమర్ నాథ్ రెడ్డి, స్థానిక విజిలెన్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


