breaking news
Annamayya
-
అవినీతికి సిమెంట్ పూత
మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశలో భాగంగా అన్నమయ్య జిల్లాలో చేపట్టిన పుంగనూరు ఉపకాలువ (పీబీసీ) లైనింగ్ పనుల పర్యవేక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. కాంట్రాక్టు సంస్థ ఏ పనులు చేస్తోంది, ఒప్పందం మేరకు పనులు సాగుతున్నాయా లేదా అనే అంశాన్ని పట్టించుకోవడం లేదు. ఆదివారం తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట శివారులో నిర్వహించిన లైనింగ్ పనులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.పీబీసీకి ఇరువైపులా కాంట్రాక్టు సంస్థ రూ.366 కోట్లతో కాంక్రీట్ లైనింగ్, బండరాళ్లపై షార్ట్ క్రీటింగ్ పనులు చేయాలి. షార్ట్ క్రీటింగ్ చేయాల్సిన చోట నిబంధనలకు తిలోదకాలిచ్చారు. మట్టిపై చేయాల్సిన కాంక్రీటు లైనింగ్ పనులనే మార్చేశారు. భవనాలకు రంగులు వేసినట్టుగా.. గోడలకు సిమెంట్ పూత పూసినట్టుగా లైనింగ్ పనులు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం నాలుగు అంగుళాల మందంతో కాంక్రీట్తో లైనింగ్ పనులు చేయాలి. కానీ, ఇది కనీసం ఒక అంగుళం మందం కూడా లేదు. నీరు ప్రవహిస్తే అంతే! కాంక్రీట్ లైనింగ్ చేయకుండా షార్ట్ క్రీటింగ్తో కాలువకు సిమెంట్ పూత కారణంగా కాలువలో ఒక్కసారిగా నీళ్లు ప్రవహిస్తే కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సిమెంట్ పూత పూస్తున్న కారణంగా అది మట్టిపై నిలబడేలా లేదు. నీళ్లు పడితే సిమెంటు జారి పడిపోయే అవకాశం ఉంది. ఫలితంగా ప్రభుత్వం రూ.366 కోట్లతో పనులు చేపట్టినా నిష్ఫలమయ్యే దుస్థితి దాపురించింది. ఇక్కడ సాంకేతిక సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఒప్పందానికి విరుద్ధంగా పనులు సాగిపోతున్నాయి. పర్యవేక్షించాల్సిన ప్రాజెక్టు అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. గత వారం ఇక్కడి పనులను క్వాలిటీ కంట్రోల్ సీఈ శేషుబాబు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసినా అధికారుల్లో కదలిక కనిపించడం లేదు. -
వైఎస్సార్ పథకాలు శాశ్వతం
రాజంపేట టౌన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు పదిలంగా, శాశ్వతంగా ఉంటాయని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి పేర్కొన్నారు. అమెరికాలోని ఫీనిక్స్ అరిజోనాలో ఆదివారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ముందస్తు కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ యూఎస్ఏ ప్రతినిధులు నిర్వహించారు.సతీష్ రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కో–ఆర్డినేటర్ అలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్సీపీ యూఎస్ఏ కనీ్వనర్ పెద్దమల్లు చంద్రహాస్రెడ్డి, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు విజయసాగర్రెడ్డి కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పథకాలు సక్రమంగా అమలై పేద, మధ్య తరగతి ప్రజలకు సంపూర్ణంగా అందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి సీఎం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.జగన్తోనే రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరగలవని అన్నారు. తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యూఎస్ఎ ప్రతినిధులు పోలా వాసవిరాజ్«దీరజ్రెడ్డి, సోమశేఖర్రెడ్డి, ఎర్రపురెడ్డి, బలరామ్రెడ్డి, ఆదిమొరెడ్డి, శ్రీధర్రెడ్డి, వంశీ, చెన్నారెడ్డి, భరత్, భరత్రెడ్డి పాటిల్, శ్రీనివాస్, అంజిరెడ్డి, అనుదీప్, సాయిరోహిత్, ప్రణీత్, లీలాకట్ట తదితరులు పాల్గొన్నారు. -
వినాయక విగ్రహం చోరీ కేసులో నిందితుల అరెస్టు
పెనగలూరు : పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ ఆవరణంలో గత నెల 24వ తేదీ వినాయక విగ్రహాన్ని చోరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బీవీ రమణ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. నందలూరు మండలం మదనగోపాలపురం గ్రామానికి చెందిన చుక్కా రవి ఆధ్వర్యంలో పది మంది పురుషులు, ముగ్గురు మహిళలు కలిసి వినాయక విగ్రహాన్ని చోరీ చేశారు. నిందితుల్లో రవితో పాటు పాత చిట్వేలికి చెందిన కనిశెట్టి వెంకట సుబ్బయ్య, సుబ్బరాయుడు, ఆర్.భాస్కర్, ఈటమాపురానికి చెందిన చంద్ర, బైరాజు, సుధాకర్ రాజులతోపాటు చుక్కారవి వియ్యంకుడు నెల్లూరు జిల్లా మనుబోలుకు చెందిన సురేష్, నెల్లూరులోని రాపూరు లక్ష్మమ్మ, మునిస్వామి, వేలు రెడ్డి, పూజారి గోకిల రమేష్, ముసునూరు పుల్లారెడ్డి, పెనగలూరుకు చెందిన దాసరి వెంకట నరసమ్మ, సుఖదేవ్ కలక్వాడ్ శ్యామ్లు ఉన్నారు. వినాయక విగ్రహాన్ని బయటకు తీసి ట్రాక్టర్కు కట్టుకొని ఓదేటావారిపల్లి గ్రామానికి వెళ్లే దారి వరకు ఈడ్చుకుంటూ వెళ్లి అక్కడ ట్రాక్టర్లో ఎక్కించుకొని నేరుగా ఈటమాపురం చెరువులోకి తీసుకెళ్లారన్నారు. చెరువులో విగ్రహాన్ని దింపి గుప్త నిధులకోసం పూజలు చేసి సమ్మెటతో రాతి వినాయక విగ్రహాన్ని పగులకొట్టి పడేశారన్నారు. పూర్వకాలంలో వజ్రాలు, బంగారం రాతి విగ్రహంలో పెట్టి ఉంటారనే నమ్మకంతో వీరు విగ్రహాన్ని చోరీ చేసి పగులకొట్టారని తెలిపారు. ఎలాంటి నగలు దొరకకపోవడంతో పగులకొట్టిన విగ్రహం ముక్కలను కుంటలో పడేశారన్నారు. కొండూరు క్రాస్ వద్ద శనివారం వీరు గుంపుగా ఉండటంతో విచారించగా గత నెలలో వినాయక విగ్రహం చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా కారు, నాలుగు మోటార్ సైకిళ్లు, ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు కోసం ఎస్పీకి ప్రతిపాదించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు సుబ్బరాయుడు, రవిశంకర్, సిబ్బంది రాముడు, నాగయ్య, గోపాలకృష్ణ, సుజిత, నాగేశ్వరమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో మండలంలోని టి. చదిపిరాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురం పట్టణం రాం నగర్కు చెందిన ముద్దల బాలాజీ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మృతుడు మండలంలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం బాలాజీ తన విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలోమార్గ మధ్యంలో టి.చదిపిరాళ్ల వద్దకు రాగానే కమలాపురం నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ విద్యా సాగర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు చిన్న వయస్సు గల కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాలాజీ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వైఎస్సార్సీపీ నాయకులకు స్విమ్స్లో వైద్య పరీక్షలు
సాక్షి టాస్క్ఫోర్స్ : కడపలో మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందులలోని రింగ్రోడ్డు చుట్టూ ఉన్న వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ తోరణాలు, జెండాలు కట్టిన విషయం విదితమే. దీనిపై అప్పట్లో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఇతర వైఎస్సార్సీపీ నాయకులు పులివెందుల డీఎస్పీని, మున్సిపల్ కమిషనర్ను కలిసి టీడీపీ తోరణాలు తొలగించాలని వినతిపత్రాలు సమర్పించారు. అధికారులు స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్తోపాటు ఇతర వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న తోరణాలను తొలగించారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసు అప్పట్లో జిల్లాలో ఉన్న హోం శాఖ మంత్రి అనిత, పులివెందుల టీడీపీ నాయకుల ఆదే శాల మేరకు పోలీసులు దాదాపు 18 మంది వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అనంతరం వారిని పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా అక్కడ వైఎస్సార్ సీపీ నాయకులు పార్నపల్లె కిశోర్, సాతుపాటి రాజేష్, తావేటి మల్లికార్జున, షేక్ మస్తాన్, పార్నపల్లి వెంకట చలపతి, సాతుపాటి వెంకటపతిలు తమను పోలీసులు అకారణంగా కొట్టారని మెజిస్ట్రేట్ ఎదుట వాపోయారు. దీంతో పులివెందుల మెజిస్ట్రేట్ వారికి పులివెందుల గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రిపోర్టుల్లో అవకతవకలు అప్పట్లో పులివెందుల మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆరుగురికి పులివెందుల జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలనివేదికల్లో అనేక అవకతవకలు జరిగాయని సమాచారం. వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో వైద్యులు, సూపరింటెండెంట్పై పులివెందుల పోలీసులు అధికార పార్టీ నాయకులచే ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా నివేదికలు తయారు చేసుకున్నారు. దీంతో ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు వైద్య పరీక్షల నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆరుగురికి మరలా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి కేంద్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, సీఐలు చాంద్బాషా, వెంకట రమణ పెద్ద ఎత్తున పైరవీలు చేశారు. వీరు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్తో మంతనాలు జరపడం మీడియా సాక్షిగా బయట పడింది. అంతేకాకుండా కర్నూలు డీఎస్పీ కూడా తమకేమాత్రం సంబంధం లేకున్నా ఆస్పత్రికి వెళ్లి నివేదికలను మేనేజ్ చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో మరలా ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు తమకు జరిగిన అన్యాయంపై సాక్ష్యాధారాలతో హైకోర్టుకు నివేదించి ప్రైవేటు కంప్లైంటు వేశారు. దీంతో హైకోర్టు మరలా వీరికి తిరుపతి స్విమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పులివెందుల సీఐ చాంద్బాషాను ఆదేశించింది. తిరుపతి స్విమ్స్లో వైఎస్సార్సీపీ నాయకులు హైకోర్టు ఆదేశాలతో వైఎస్సార్సీపీ నాయకులను శనివారం ఉదయం 7 గంటలకు పులివెందుల నుంచి అర్బన్ సీఐ చాంద్బాషా ఆధ్వర్యంలో తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, రూరల్ సీఐ వెంకట రమణలు నివేదికలు తమకు అనుకూలంగా ఉండాలని మేనేజ్ చేసినట్లు సమాచారం. నిష్పక్షపాతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని అధికార పార్టీ నాయకులతో స్విమ్స్ ఆస్పత్రి పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. టీడీపీ తోరణాల తొలగింపు ఘటనలో అక్రమ కేసు పోలీసుల థర్డ్డిగ్రీపై హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి స్విమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
కురబలకోట ; కురబలకోట మండలం ముదివేడు మార్గంలో శనివారం బైక్ను బొలెరో వాహనం ఢీకొన్న సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. అంగళ్లులో గొర్రెల సంతలో గొర్రెలు విక్రయించి బొలెరో వాహనంలో పెద్దమండ్యం, ముసలికుంటకు వెళుతుండగా ముదివేడు ఫారెస్టు మార్గంలో ఎదురుగా వచ్చిన బైక్ను ఢీకొంది. హఠాత్తుగా బ్రేఽక్ వేయడంతో బొలెరా వాహనం కూడా బోల్తాపడింది. ఈ ఘటనలో బొలెరో లోని దట్టెనాయక్ తాండాకు చెందిన కృష్ణా నాయక్ (60), బాలాజీ నాయక్ (30), బండ్రేవు లక్ష్మయ్య (50), ముసలికుంట మల్రెడ్డి (45), రామాంజనేయ రెడ్డి (28)గాయపడ్డారు. బైక్లో వస్తున్న గాలివీడు ప్రాంతం బలిజ పల్లెకు చెందిన మహేష్ (32) కూడా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు స్టేషన్లో నిర్బంధించి దురుసుగా ప్రవర్తించారు మదనపల్లె సిటీ : గౌతమ బుద్ధుని తల నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసనదీక్ష చేస్తుంటే ఎస్పీ ఆదేశాలతో పోలీసు స్టేషన్కు తరలించి దురుసుగా ప్రవర్తించారని భారతీయ అంబేద్కర్ సేన (బాస్) వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్ ఆరోపించారు. జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. శనివారం స్థానిక బెంగళూరు రోడ్డులో దీక్ష శిబిరం వద్దకు పోలీసులు వద్దకు వచ్చి దురుసుగా ప్రవర్తించి బలవంతంగా నెట్టివేశారన్నారు. దీంతో ఎడమ మోకాలిపై గాయమైందన్నారు. అనంతరం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. శివప్రసాద్ను బాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గణపతి, పాలకుంట శ్రీనివాసులు, ముత్యాల మోహన్, బాస్ నాయకులు ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
పీలేరు రూరల్ : ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి పీలేరు పట్టణం రాజీవ్ నగర్ కాలనీలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రాజీవ్నగర్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్ (30) యమహా షోరూంలో పని చేస్తున్నాడు. తరచూ బంధువులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన నివాసంలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. కుక్కల దాడిలో జింకకు గాయాలు తంబళ్లపల్లె : కుక్కల దాడిలో కృష్ణ జింక తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. బెంగళూరు ఎన్.మల్లికార్జునరెడ్డి బండ్రేవు వద్ద ఉన్న తన తోట నుంచి స్వగ్రామం గోపిదిన్నెకు వస్తుండగా రోడ్డు పక్కన రెండు ఊర కుక్కలు కృష్ణ జింకపై దాడి చేయడం గమనించాడు. వెంటనే కుక్కల బారి నుంచి జింకను కాపాడి తన తోట వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఫారెస్టు బీట్ ఆఫీసర్ రామరాజ్. వెటర్నటీ డాక్టర్ ఇందులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం వారు 104 పశువైద్య అంబులెన్స్లో సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన జింకకు చికిత్స చేశారు. తీవ్ర గాయాలు కావడంతో అదే అంబులెన్స్లో మదనపల్లె పశువైద్యశాలకు తరలించారు. గంజాయి విక్రేత అరెస్టు సిద్దవటం : కడప నగరం శంకరాపురం ప్రాంతానికి చెందిన రెడ్డి సురేష్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా అరెస్టు చేసినట్లు ఒంటిమిట్ట సీఐ బాబు తెలిపారు. సిద్దవటం పోలీసు స్టేషన్లో శనివారం సీఐ మాట్లాడుతూ సిద్దవటం మండలం భాకరాపేటలో గంజాయి అమ్ముతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. దీంతో తమ సిబ్బందితో వెళ్లి అక్కడి మూడు రోడ్లు కూడలిలో గంజాయి విక్రయిస్తున్న రెడ్డి సురేష్ను అదపులోకి తీసుకొని అతని వద్దనుంచి 1కిలో 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు రెడ్డిసురేష్ను విచారించగా విశాఖపట్టణం సమీపంలోని చింతపల్లి గ్రామంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి వైఎస్సార్ కడప జిల్లా పరిసర ప్రాంతాలలో గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించేవాడని తెలిసిందన్నారు. ఈ మేరకు నిందితుడిని సిద్దవటం కోర్టులో హాజరు పరచగా జడ్జి 15 రోజులు రిమాండుకు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ, పోలీసులు పాల్గొన్నారు. భర్తపై వేధింపుల కేసు నమోదు ముద్దనూరు : మండలంలోని పెనికలపాడు గ్రామానికి చెందిన నాగవేణి అనే మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. నాగవేణికి కడపకు చెందిన వెంకటసుబ్బయ్యతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన అతను గత 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
లోక్ అదాలత్లో 210 కేసులు పరిష్కారం
రాయచోటి టౌన్ : రాయచోటి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో 210 కేసులు పరిష్కరించినట్లు జిల్లా 3వ అదనపు న్యాయమూర్తి సీనియర్ సివిల్ జడ్జి ఎస్. ప్రవీణ్కుమార్, జూనియర్ సివిల్ జడ్జి టి. కేశవ, జూనియర్ సివిల్ జడ్జి పి. రాజన్ ఉదయ్ ప్రకాష్లు తెలిపారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిష్కారమైన 210 కేసుల్లో 204 కేసులు క్రిమినల్ కేసులు కాగా, మిగిలిన ఆరు సివిల్ కేసులు అని తెలిపారు. ఈ కేసుల ద్వారా కక్షిదారులకు మొత్తం 62 లక్షల, 24 వేల, 466 రూపాయలు చెల్లించినట్లు పేర్కొన్నారు. వీటిలో ప్రధానంగా భార్యాభర్తలకు సంబంధించిన వివాదంలో 20 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతానికి 15 లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. అలాగే ఒక చెక్ బౌన్స్ కేసులో రూ.2,49,000 చెల్లించారన్నారు. లోక్ అదాలత్ల ద్వారా సత్వరమే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పీపీటీ రామకృష్ణ, ఏజీపీ మౌనిక, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది పీఎన్ శ్రీనివాసులు, జి.రామచంద్రయ్య, మోహన్ బాబు, కె. చంద్రమోహన్ రెడ్డి, జి. సురేంద్ర, వీవీ రమణ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి
కడప కార్పొరేషన్ : డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం యూనివర్సిటీ వద్ద విద్యార్థులు చేస్తున్న నాలుగో రోజు నిరవధిక నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని నెలకొల్పారన్నారు. గత ప్రభుత్వంలోనే జీఓ నంబర్–42 ద్వారా యూనివర్సిటీలో లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆ పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేసి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీఓఏ) పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చొరవ చూపి సీఓఏ అనుమతి వచ్చేలా చర్యలు తీసుకొని యూనివర్సిటీకి కేటాయించిన స్థలం శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. మంత్రి లోకేష్ స్పందించపోతే పెద్ద ఎత్తున ఉద్యమం విద్యార్థుల దీక్షలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురుప్రసాద్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి. సాయిదత్త, ఏఐఎస్ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి. రవి తదితరులు మద్దతు ప్రకటించి దీక్షల్లో కూర్చున్నారు. ఈ సమస్యపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు శివారెడ్డి, సాయి కుమార్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ శేఖర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్, నగర కార్యదర్శి తేజ పాల్గొన్నారు. సాయిరెడ్డి, రామ్, మేఘసాయి, పవిత్ర, సుష్మ, సుధీర్, సుధాకర్, ఆదిత్య, వసంత్, సింధు, మోహన్, మనోజ్ దీక్షల్లో కూర్చున్నారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం కడప ఎడ్యుకేషన్ : ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల విద్యార్థి యువజన సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డిని కలిసి వినతిప్రత్రం సమర్పించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఐక్యవేదిక నాయకులు ఎం.అంకన్న, సుబ్బారాయుడు, జయవర్ధన్, నాగరాజు, నాగేశ్వరరావు, మహేష్ ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ నాలుగో రోజుకు చేరిన విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై శనివారం మోటకట్ల సమీపంలో కారు– ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు... మండల పరిధిలోని శెట్టిపల్లె గ్రామానికి చెందిన జయనారాయణరెడ్డి, అలివేలమ్మ, రెడ్డెమ్మలు సొంత పనుల నిమిత్తం కారులో రాయచోటి వెళుతుండగా మోటకట్ల మిట్ట సమీపంలోకి రాగానే ఎదురుగా ఆటో రావడంతో అదుపు తప్పి రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ జాన్తో పాటు కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టపాసులు పేల్చిన కేసులో విచారణ లక్కిరెడ్డిపల్లి : టపాసులు పేల్చిన సంఘటనలో లోకేష్ అనే వ్యక్తి జాతీయ మానవహక్కుల కమిషన్కు చేసిన ఫిర్యాదు మేరకు శనివారం తిరుపతి సీఐడీ ఎస్పీ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. తమ సిబ్బందితో కలిసి మండలంలోని కుర్నూతల అగ్రహారంలో గ్రామస్తులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐ కొండారెడ్డి, ఎస్ఐ రవీంద్రబాబు, వీఆర్ఓలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
రాయచోటి టౌన్ : అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచుకున్న 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని తమిళనాడుకు చెందిన ఆండీ గోవిందన్ అనే అంతర్ రాష్ట్ర స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ ( పరిపాలన) యం. వెంకట్రాద్రి తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించే క్రమంలో శనివారం సుండుపల్లె మండలం రాయవరం గ్రామం కావలిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో రూరల్ సీఐ వరప్రసాద్, సుండుపల్లె ఎస్ఐ యం. శ్రీనివాసులుతో పాటు టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడులలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 26 దుంగలు స్వాధీనం చేసుకున్నారన్నారు. వీటి విలువ సుమారు రూ.81 లక్షలు అవుతుందన్నారు. వీటితో పాటు తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా, జమునా తాలూకా, సారా మందయ్ గ్రామానికి చెందిన ఆండి గోవిందన్ అనే స్మగ్లర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో పదిమంది నిందితులు పరారయ్యారని వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. అరెస్టయిన నిందితుడిపై ఖాజీపేట, దువ్వూరు, మైదుకూరు, టి. సుండుల్లెలోని పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి దుంగలతో పాటు ఒక కీప్యాడ్ ఫోన్, రెండు గొడ్డళ్లు, రెండు కొడవళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అటవీ సంపద ఎర్రచందనం అన్నారు. అలాంటి ఎర్రచందనాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా గుర్తుపెట్టుకోవాలన్నారు. సమీప ప్రాంతాలలో ఎవరైనా ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డే, రాయచోటి డీఎస్పీ యంఆర్ కృష్ణమోహన్, రూరల్ సీఐ వరప్రసాద్, సుండుపల్లె ఎస్ఐ యం. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రూ. 81 లక్షల విలువైన 26 దుంగలు స్వాధీనం -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
సుండుపల్లె : బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల రక్షణ అధికారి రామలక్ష్మీ అన్నారు. శనివారం మండలంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల, ఎంఎన్ఆర్ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాలు, లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహం చేయడం నేరమని అందుకు సహకరించిన వారికి లక్ష రూపాయలు జరిమానాతో పాటు రెండు సంవత్సరాలు జైలుశిక్ష పడుతుందని తెలిపారు. పాఠశాలలో గానీ ఇతర ప్రదేశాలలో గానీ పిల్లలను వేధించడం, పిల్లలకు తెలియకుండా ఇతర ప్రదేశాలకు తరలించడం వంటి పనులు ఎక్కడైనా జరిగితే 1098 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్స్ సంస్థ కో ఆర్డినేటర్ రవీంద్రనాథ్, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక
పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నారు. సోమ వారం సాయంత్రం 5గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా పులివెందులలోని భాకరాపురంలో ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఆ రోజు పులివెందులలోనే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు చేరుకుని అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులర్పించనున్నారు. అక్కడ నుంచి పులివెందులకు చేరుకుంటారు. మంగళవారం సాయంత్రం బెంగుళూరుకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పర్యటన వివరాలు: ఈనెల 7న సాయంత్రం పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు 5గంటలకు చేరుకుంటారు. ఈనెల 8న మంగళవారం ఉదయం పులివెందులలోని తన స్వగృహం నుంచి ఉదయం 6.45గంటలకు వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 7.30గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. 8.15గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45గంటలకు పులివెందుల క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటలకు పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజలతో మమేకం కానున్నారు. -
వైభవం..ధ్వజారోహణం
నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు సునీల్కుమార్, పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సాయిస్వామి ఆధ్వర్యంలో ధ్వజ స్తంభంపై గరుడ చిహ్నంతో ఉండే పతాకాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి సౌమ్యనాధుడు శ్రీదేవి భూదేవితో కలిసి యాలివాహనంలో పురవీధుల్లో ఊరేగుతూ భక్తజన కోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. ● బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పల్లకీసేవ, గ్రామోత్సవం, తిరుమంజనం, రాత్రి హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం ఉంటుందని ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. -
రూ.10 కోట్ల అడ్వాన్స్?
మదనపల్లె: ఏదైనా అభివృద్ధి పని జరిగితే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించడం ఉండదు. అందులోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించారా లేదా అని ఒకటికి రెండుసార్లు పర్యవేక్షించి, పరిశీలించాక..క్వాలిటీ కంట్రోల్ అధికారుల ధృవీకరణ ఇచ్చాక బిల్లులు పెడతారు. ఇందులోనూ జరిగిన మొత్తం పనికి బిల్లు పెట్టడం ఎక్కడా ఉండదు. కొంత బిల్లు తగ్గిస్తారు. అయితే హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పెద్దగా పట్టించుకోని అధికారులు స్వామిభక్తిని చాటుకుంటున్నారు. అందుకు నిదర్శనం పుంగనూరు ఉపకాలువ (పీబీసీ), కుప్పం ఉపకాలువ (కేబీసీ) పనులే. ఈ పనులకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో అంచనాకు రాకముందే బిల్లులన్నీ చెల్లించేందుకు సిద్ధమై అందుకు చర్యలన్నీ పూర్తి చేశారు. పనులు విలువ రూ.536 కోట్లు పీబీసీలో 117.767 కిలోమీటర్ల లైనింగ్, షార్ట్ క్రీటింగ్ పనులను ప్రభుత్వం నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి రూ.480.22 కోట్లతో నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టింది. తర్వాత ఈ పనుల విలువను రూ.366 కోట్లకు కుదించి కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం చేసుకుంది. కేబీసీకి సంబంధించి రెండు రీచ్లుగా పనులకు టెండర్లు నిర్వహించగా సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎక్సెస్తో పనులు దక్కించుకుంది. ఒకటో రీచ్ను రూ.81,43,61,130తో టెండర్ పలవగా రూ.85,46,72,008 కోట్లకు, రెండో రీచ్ను రూ.80,35,99,740 కోట్లతో టెండర్ పిలవగా రూ.84,33,77,923 కోట్లతో రిత్విక్ ప్రాజెక్ట్స్ పనులు దక్కించుకుంది. ఈ మేరకు ఏప్రిల్లో కాలువల పనులు మొదలయ్యాయి. చకచకా రూ.150 కోట్ల బిల్లులు రెండు ఉప కాలువలకు సంబంధించి జరిగిన పనులపై ప్రాజెక్టు అధికారులు వెంటనే బిల్లులకు సిద్ధమయ్యారు. కుప్పం కాలువ పనులు సీఎం చంద్రబాబు సన్నిహితుడైన ఎంపీ సీఎం రమేష్ సంస్థ కావడంతో పనులు చాలా వేగంగా జరిగాయని, వాటికి అంచనా కట్టిన అధికారులు బిల్లుల మంజూరుకు ఆగమేఘాల మీద రికార్డులు సిద్ధం చేశారు. మొదటి రీచ్కు రూ.42,58,17,772, రెండో రీచ్కు రూ.44,81,98,813, పుంగనూరు కాలువకు రూ.60 నుంచి 63 కోట్లలోపు బిల్లులను సిద్ధం చేసి కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు జరిగేలా చిత్తూరు పే అంట్ అకౌంట్స్ ఆఫీసర్ కార్యాలయానికి నివేదించారు. ఈ స్థాయిలో ఒకేసారి బిల్లులు పెట్టడం అరుదైన విషయమని ప్రాజెక్టు అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. దీనికి ముఖ్యంగా అధికారుల్లో చోటుచేసుకున్న స్వామిభక్తే కారణమని అంటున్నారు. 90 కిలోమీటర్ల కుప్పం కాలువ పనుల పర్యవేక్షణ బాధ్యత కేవలం ఒక ఈఈ, ఒక డీఈకే అప్పగించారు. పుంగనూరు కాలువకు సంబంధించి కూడా ఒకరిద్దరు డీఈలకే ఎక్కువ కిలోమీటర్ల పనులు అప్పగించారు. వీరి పర్యవేక్షణ పరిధిలోని పనులకే ఎక్కువ మొత్తంలో బిల్లులు పెట్టినట్టు తెలుస్తోంది. వీరికి కాలువ పనుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇలా బిల్లుల రూపంలో భక్తి ప్రదర్శిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. సీఈ నివేదికలోగా జరిగిపోవాలి ఈస్ట్కోస్ట్ క్వాలిటీ కంట్రోల్ సీఈ శేషుబాబు ఈ రెండు కాలువల్లో జరుగుతున్న పనులను పూర్తిగా పరిశీలించారు. గతంలో ఏ అధికారి కూడా పనుల నాణ్యతపై కాలువల్లో జరిగిన పని మొత్తాన్ని పరిశీలించిన దాఖలాలేవు. అయితే శేషుబాబు మొత్తం పరిశీలించి వెళ్లగా, దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. పరిశీలన ముగిసి ఒకరోజు మాత్రమే గడవడంతో ఆ నివేదికలో ప్రతికూల అంశాలను ప్రస్తావిస్తే బిల్లుల చెల్లింపుపై ప్రభావం చూపుతుందని అధికారులు పీఏఓ కార్యాలయ అధికారులపై ఒత్తిడి తెస్తూ బిల్లులకు ఆమోదం తెలిపి మంజూరు చేయాలని కోరుతున్నట్టు తెలిసింది. నివేదిక ప్రభుత్వ పరిశీలనలోకి వెళ్లాక బిల్లులకు బ్రేక్ పడే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్న తరుణంలో ఒత్తిళ్లతో ఒకట్రెండోజుల్లో మొత్తం బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులే చెబుతుండటం విశేషం. పర్యవేక్షణ లేదనే సీఈ రాక రెండు ఉపకాలువల లైనింగ్, షార్ట్ క్రీటింగ్ పనుల విషయంలో తిరుపతి క్వాలిటీ కంట్రోల్, మదనపల్లె ఉన్నతాధికారుల పర్యవేక్షణ నామమాత్రం కావడంవల్లే క్వాలిటీ కంట్రోల్ సీఈ శేషుబాబు విచారణకు వచ్చినట్టు చెబుతున్నారు. సీఈ పరిశీలనతో ఇక్కడి క్వాలిటీ కంట్రోల్ అధికారుల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడి అధికారులు కాంట్రాక్టు సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో జరిగే పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. రూ.150 కోట్ల బిల్లులు చెల్లింపునకు సిద్ధం పీఏఓ నుంచి నేడో రేపో మంజూరు పీబీసీలో రూ.10 కోట్ల మేర అడ్వాన్స్ల చెల్లింపు? స్వామిభక్తి చాటుకుంటున్నహంద్రీ–నీవా అధికారులు పుంగనూరు ఉపకాలువకు సంబంధించిన పనుల విషయంలో డీఈ వెంకట ప్రతాప్ కాంట్రాక్టు సంస్థ పనులు చేయకనే అడ్వాన్స్ రూపంలో రూ.10 కోట్లకుపైగా మంజూరు చేశారని సమాచారం. ఈ అడ్వాన్స్, జరిగిన పని కలుపుకుని తాజాగా బిల్లులు పెట్టారని తెలిసింది. పని జరక్కనే అడ్వాన్స్ రూపంలో బిల్లులు ఇవ్వడం జరగదు. అయినప్పటికీ ఇచ్చారని చెబుతున్నారు. దీనిపై డీఈ వెంకట ప్రతాప్ వివరణ కోరగా అడ్వాన్స్ నిధులు మంజూరు చేయలేదని స్పష్టం చేశారు. -
10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్
రాయచోటి: జిల్లాలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్ను ఈ నెల 10న నిర్వహిస్తున్నామని, తల్లి పేరుతో ప్రతి విద్యార్థి మొక్క నాటడం ద్వారా తల్లిదండ్రులు, పర్యావరణం పట్ల బాధ్యత పెంపొందుతాయని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. పిల్లల తల్లిదండ్రులను పాఠశాలలతో సమన్వయం చేసి విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టుల గురించి తల్లిదండ్రులతో చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి రవి, పాఠశాల విద్యాశాఖ ప్రతినిధి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ -
ఎవరికీ చెప్పుకోలేఖ!
● చదువుకోలేక పోతున్నందుకు చావే శరణ్యమంటూ నిర్ణయం ● ఫీజు విషయమై కాలేజీ యాజమాన్యం అవమానించారని ఆవేదన ● లేఖ రాసి ఇంటినుంచి అదృశ్యమైన ఫార్మసీ విద్యార్థిని ● పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు ● తిరుపతిలో దొరికిన ఆచూకీమదనపల్లె: ‘అమ్మా..నాన్నలకు.. నేను ఈ ఒత్తిడి చదువు చదవలేకపోతున్నా, మీకు చాలాసార్లు ఈ విషయం చెప్పాను. అయినా నావల్ల కావడం లేదు. నేను సున్నితం అని మీకు తెలుసు కద నాన్నా.. అందుకే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నా..’ అంటూ మదనపల్లె రూరల్ మండలం సీటీఎం గ్రామంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మూడో ఏడాది ఫార్మసీ కోర్సు చదువుతున్న విద్యార్థిని శ్వేతశ్రీ చంద్ర (21) రెండు పేజీల లేఖ రాసి శుక్రవారం ఇంటినుంచి అదృశ్యమైన ఉదంతం సంచలనం కలిగిస్తోంది. లేఖలో ఫీజు విషయంగా ప్రస్తావించి అవమానపడినట్టు ఆవేదనకు గురైంది. విద్యార్థిని విషయంలో కళాశాల యాజమాన్యం కఠినంగా వ్యవహరించడం ప్రధాన కారణమా అన్న చర్చ సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు మదనపల్లె రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాలు.. ● పెద్దతిప్పసముద్రం మండలం పట్టెంవాండ్లపల్లెకు చెందిన సూర్యనారాయణ కుటుంబం కుమార్తె శ్వేతశ్రీచంద్ర చదువుకోసం సీటీఎం నేతాజీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇక్కడి ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో చదివిస్తున్నారు. అయితే చదువు విషయంలో తనకు ఇబ్బందులున్నాయని లేఖ ద్వారా తల్లిదండ్రులకు చెప్పుకున్నా వెలుగులోకి రాని కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ సాగాల్సి ఉంది. తల్లిదండ్రులపేరుతో విద్యార్థిని శ్వేతశ్రీచంద్రరాసిన లేఖలో ‘అమ్మా..నాన్నలకు.. నన్ను ఇక్కడ చదివించాలని అనుకుంటున్నారు. కాని నేను చదవలేను. నాకు ఈ ఒత్తిడి భరించడం, బాధపడటం నా వల్ల కావడం లేదు. ఈ కళాశాలలో నేను చదవలేను. మీరు ఎన్ని చెప్పినా వినను. నేను మానసికంగా చాలా ఒత్తిడి భరిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నా మెంటల్ కండిషన్ ఏమీ బాగలేదు. నాకు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం దొరకడం లేదు. నేను చెప్పి చెప్పి అలసిపోయాను. అందుకే చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయా. ఇక్కడ చదువుతూ అవమానపడటం నావల్ల కాదు. నాకు మీతో చెప్పే ధైర్యం లేదు. బతకడానికి ధైర్యం సరిపోవడం లేదు. అందుకే దూరంగా వెళ్లి చచ్చిపోతున్నా. నేను సున్నితం అని తెలుసు కదా, అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ప్రతిసారీ ఈ కాలేజీలో వాళ్లు ఫీజు కోసం అవమానపర్చడం, నేను ఫీజు కట్టకుండా అవమానంగా ఒకదాన్నే తలదించుకుని ఉండటం నావల్లకాదు డాడీ. మళ్లీ మళ్లీ మీకు చెప్పి ఇబ్బంది పెట్టలేను. అందుకే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయా డాడీ. అయామ్ వేరీ’ అంటూ చాలా విషయాలను రాసింది. ఈ రెండు పేజీల లేఖలో ఒకచోట ఈనెల రెండో తేదీన రాసినట్టు తేది, సంతకం చేసింది. తర్వాత అదేపేజిలో రాసిన విషయాల కింద మూడో తేదీ వేసింది. ఇంకో పేజీలో ఐయామ్ సారీ, గుడ్బై అంటూ పలుచోట్ల రాసింది. అంటే ఈ లేఖను రెండు రోజుల్లో రాసినట్టుంది. ఫిర్యాదుపై కేసు నమోదు ఇంటినుంచి అదృశ్యమైన కుమార్తె శ్వేతశ్రీచంద్ర లేఖ చూడగానే తల్లిదండ్రులు, బందువులు మదనపల్లె తాలూకా పోలీస్స్టేషన్ చేరుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి శనివారం ఫిర్యాదు చేశారు. తండ్రి సి.సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ గాయత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మహతి ఫార్మసీ కళాశాలలో చదువుతున్న శ్వేతశ్రీచంద్ర శుక్రవారం ఉదయం కళాశాలకు బయలుదేరగా తర్వాత అదృశ్యమైంది. తర్వాత పలుచోట్ల ఆచూకీ కోసం వెతికినా కనిపించకపోవడంతో శనివారం తమకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. శ్వేతశ్రీచంద్ర శుక్రవారం ఉదయం 11.30–12 గంటల మధ్య ఇంటినుంచి వెళ్లినట్టు గుర్తించామని, ప్రస్తుతం ఎక్కడుందో కనిపెట్టేందుకు సాంకేతిక సహకారంతో చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ● శ్వేతశ్రీచంద్ర తిరుపతిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో పోలీసులు తిరుపతికి బయలుదేరి వెళ్లారు. నిన్ను వదిలి ఉండలేం తల్లీ వచ్చేయి కన్నీటిపర్యంతమైన శ్వేతశ్రీ తల్లిదండ్రులు తమబిడ్డ ఫీజు కట్టలేదని కళాశాలలో ఫోటో తీసి కళాశాల యాజమాన్యం అవమానించిందని విద్యార్థి శ్వేతశ్రీ చంద్ర (21) తల్లిదండ్రులు సూర్యనారాయణ, సుజాత కన్నీటిపర్యంతమయ్యారు. శ్వేతశ్రీ అదృశ్యంపై ఫిర్యాదు చేశాక శనివారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందారు. తమబిడ్డ మహాతి ఫార్మసీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోందని చెప్పారు. మొదటి, రెండో సంవత్సర ఫీజులు చెల్లించామని, మూడో ఏడాదికి చెందిన ఫీజులో కొంత మొత్తం గత శనివారం కట్టాం, మిగిలింది ఈ శనివారం చెల్లించేందుకు సిద్దమైనట్టు చెప్పారు. ఈ విషయమై కళాశాలకు వెళ్లి తమబిడ్డను చదువుకోనివ్వాలని వేడుకోగా ప్రిన్సిపాల్ బాబు అవమానకరంగా మాట్లాడారని అన్నారు. తర్వాత కళాశాలకు వెళ్లిన శ్వేతశ్రీ చంద్రను ఫీజు కట్టలేదని ఫోటో తీసి అవమానించారని విలపించారు. నా బిడ్డను కాపాడండి ఆమె లేకుండా ఉండలేం.. ఆమె డాడి అసలే బతకలేడు అంటూ సుజాత విలపించింది. కాగా కళాశాలలో శ్వేతశ్రీని ఎవరూ అవమానించలేదని, రెండు సంవత్సరాల ఫీజు పెండింగ్లో ఉందని, ఇంకా కట్టలేదని మహాతి కళాశాల కరెస్పాండెంట్ అమరనాథరెడ్డి చెప్పారు. -
హామీలు అమలు చేయిద్దాం
ప్రభుత్వం మెడలు వంచుదాం..● ఎన్నికల ప్రణాళిక అమల్లోకూటమి ప్రభుత్వం విఫలం ● బాబుష్యూరిటీ–మోసం గ్యారెంటీపై ఇంటింటా ప్రచారం ● రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు, కడప మేయర్ సురేష్బాబు రాయచోటి: కూటమి నేతల హామీలకు ష్యూరిటీ లేదని..మోసాలే గ్యారెంటీ అని రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు, కడప మేయర్ కె.సురేష్బాబు పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటిలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి గడికోట శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా నాయకులతో కలిసి కె.సురేష్బాబు పాల్గొన్నారు. అమలు చేయలేని హామీలను గుప్పించి ప్రజలను మోసగించి ఎన్నికల్లో గెలుపొందిన ఈ ప్రభుత్వం మెడలు వంచుదాం..హామీలు, సంక్షేమ పథకాలను అమలు చేయిద్దామన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీని ఇంటింటా ప్రచారం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్లా భావించి హామీలు అమలు చేశారన్నారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్య పెట్టారన్నారు. ఇదే విషయాన్ని ఇంటింటికెళ్లి చంద్రబాబు మోసాలను వివరించాలని.. జగన్ హయాంలో ఏ విధంగా పథకాలు అందాయో తెలియజేయాలని పార్టీశ్రేణులను సురేష్బాబు కోరారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ, మండల నాయకులు, కార్యవర్గ సభ్యులు, అనుబంధాల విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ● ప్రజల్లోకి కూటమి ప్రభుత్వ మోసాలను తీసుకెళ్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఓట్లు వేయించుకుని అవసరం తీరాక హామీలను గాలికి వదిలేశారని విరుచుకుపడ్డారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం ఇంతవరకూ అందలేదన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా, ఉద్యోగాలు కల్పించకుండా, నిరుద్యోగభృతి చెల్లించకుండా యువతను దగా చేశారన్నారు. 18 ఏళ్లు నిండి 59 ఏళ్ల వయస్సు వరకు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఏడాది దాటినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు వివరించి, ఏవిధంగా మోసం చేశారో ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు శ్రీకాంత్రెడ్డి పిలుపునిచ్చారు.ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, ఒక బటన్ నొక్కితే చంద్రబాబునాయుడు మేనిఫెస్టో వివరాలు. మరో బటన్ నొక్కితే కూటమి వాగ్ధానాలు నెరవేరక పోవడం వల్ల ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో లెక్కలు.. వివరాలు.. చూపిస్తాయని శ్రీకాంత్రెడ్డి వివరించారు. ● ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గాంధీ, అంబేడ్కర్ లాంటి మహానేతలతో తనను పోల్చుకుంటూ నేడు బాబా అవతారంలో ప్రజలను మోసగించడానికి ముందుకు వచ్చారని హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు ఆర్.రమేష్కుమార్రెడ్డి విమర్శలు గుప్పించారు. లోకేష్ యువగళం పేరుతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కొత్తగా దొంగ బాబా అవతారం ఎత్తాడని.. ఆయనే చంద్రబాబా అంట.. అని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్లాగా తాను కూడా పేద ఇండ్లలో నివాసం ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహాత్మాగాంధీకి అంబేడ్కర్లకు 70 వేల కోట్ల రూపాయల వ్యాపారసంస్థలు ఉన్నాయా.. వారి బిడ్డలు మంత్రులు అయ్యారా అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో దోపిడీ జరుగుతోందని, పీ4 కాదు ఏ4 నడుస్తోందని తెలిపారు. రౌడీలకు, గూండాలకు టికెట్లు ఇచ్చాడని, వారు పెట్టుబడి పెట్టామని చెబుతూ దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. లక్కిరెడ్డిపల్లెలో 19 మంది వైఎస్సార్సీపీ నేతలపై దర్యాప్తు చేయకుండానే పోలీసులు అక్రమ కేసులు పెట్టారన్నారు. బాంబులు తయారుచేసే చట్టాన్ని ప్రయోగించారన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో ప్రజలు బతుకుతున్నారన్నారు. రాష్ట్రంలో 40 శాతం ఓట్లు వేసిన వైఎస్సార్సీపీ వారికి సంక్షేమాలు ఇవ్వనంటున్నాడని, సంక్షేమ పథకాలు ఆపితే చంద్రబాబు చెప్పినట్లుగా కాలర్ పట్టుకుని నిలదీస్తామన్నారు. సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు మేలు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్కళ్యాణ్లు బాండ్లు ఇచ్చారని, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నపుడు ఎవరూ రోడ్లపైకి వచ్చింది లేదన్నారు. కూటమి పాలనలో ఏడాదిలోనే ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కారని రమేష్కుమార్రెడ్డి విమర్శించారు. ● కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అధికారంలోకి వచ్చాక గాలిలో కలిసిపోయాయని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీసీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. అవినీతి, అరాచకం, అక్రమ వసూళ్లు, తోపుడు బండ్ల నుంచి బడా వ్యాపారసంస్థల వరకు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి మండలానికి గ్రామానికి, ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీని బలపరచాలని కోరారు. ● సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దేవనాథరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్బాషా, నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మాట్లాడారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి ఉత్సాహంతో, క్రమశిక్షణతో నిర్వహించి రాయచోటి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని నాయకులు కోరారు. ప్రజల్లో చైతన్యం నింపి టీడీపీ మోసాలపై స్పష్టతనిస్తూ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను వివరించాలని నేతలు సూచించారు. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలులో విఫలమైందని ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం: ఆకేపాటిఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియనిది కాదన్నారు. ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం ఆయనకు తెలిసిన విద్య అని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి రోడ్డుపైకి వస్తేనే చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. నేడు రైతులు ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబుకు కనికరం లేదన్నారు. -
శాస్త్రోక్తంగా సౌమ్యనాథుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
నందలూరు: నందలూరులోని సౌమ్యనాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ చేపట్టారు. ముందుగా సాయంత్రం 6 గంటల నుంచి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. అర్చకులు నవధాన్యాలు, కలశస్థాపనలు, పూర్ణకుంభ ప్రతిష్ట, పుణ్యాహవచనా బియ్యం, నెయ్యి, బెల్లం, టెంకాయలు, తమలపాకులు సమకూర్చారు.పాంచరాత్ర ఆగమ పండితుల బృందంతో కలశస్థాపన చేసి హోమం నిర్వహించారు. ఆగ్నేయమూలలో వెలసి ఉన్న పుట్ట వద్ద పూజలు జరిపారు. పుట్టమన్ను సేకరించి అంకురార్పణ మంటపంలో ఏర్పాటు చేసిన 12 పాలికలలో ఉంచారు. అందులో నవధాన్యాలు చల్లి అంకురింప చేసే కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం మూలవర్లు, ఉత్సవర్లకు తిరుమంజనం కార్యక్రమం జరిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ధ్వజారోహణం, రాత్రికి యాళి వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. -
ఆర్టీసీలో పదివేల ఉద్యోగాలు ఖాళీ
రాయచోటి టౌన్ : ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఏపీ పీటీడీ(ఎంప్లాయీస్ యూనియన్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ.నరసయ్య డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎంప్లాయీస్ నాయకులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 రకాల డిమాండ్లతో జులై 4, 5వ తేదీలలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడంతోపాటు టీ/ భోజన విరామ సమయంలో ధర్నా, గేట్ మీటింగ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2020లో గత ప్రభుత్వ విలీనం చేసిన తరువాత వివిధ కారణాలతో ఆరేళ్లుగా పదోన్నతులు లేకుండా పదవీ విరమణ చేశారని చెప్పారు. 3000 మందికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం అన్ని అనుమతులు పొంది ముఖ్యమంత్రి ఆదేశాల కోసం పెండింగ్లో ఉందన్నారు. 11వ పీఆర్సీ, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో రిటైడ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ చెల్లించలేదన్నారు. హెల్త్కార్డుల ద్వారా సరైన వైద్య సౌకర్యాలు అందపోవడంతో ఏటా 350 మంది చనిపోతున్నారని అన్నారు. డబుల్ డ్యూటీ చేస్తున్న సిబ్బందికి ప్రస్తుతం ఇస్తున్న దానికంటే వేతనం పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్పీ.బాబు, జిల్లా గౌరవాధ్యక్షుడు పి.నాగభూషణంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సి.ఆనందబాబు, జిల్లా కోశాధికారి కొండా ఈశ్వర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శరత్బాబు, రాయచోటి డిపో అధ్యక్షుడు ఎస్ఏ.సమద్, కార్యదర్శి జిఎం.రెడ్డి, గ్యారేజీ కార్యదర్శి మనోజ్ పాల్గొన్నారు. -
దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వీరుడు అల్లూరి
రాయచోటి : దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అన్నారు. స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి అదనపు ఎస్పీ శుక్రవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కొని గిరిజనులకు సీతారామరాజు అండగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్.కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ ఎం.శ్రీనివాసులు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శంకరమల్లయ్య, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం.తులసీరాం, రిజర్వు ఇన్స్పెక్టర్లు విజె.రామకష్ణ, టి.జాన్, జోసఫ్, ఎం.పెద్దయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వరాజ్య సంగ్రామంలో అల్లూరి మహోజ్వల శక్తి రాయచోటి : స్వరాజ్య సంగ్రామ చరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని డీఆర్ఓ మధుసూదన్రావు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సీతారామరాజు చిత్రపటానికి డీఆర్ఓ శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి స్వాతంత్య్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సీఈఓ సాయి గ్రేస్లీ, మేనేజర్ వివి.సుబ్బరాయుడు, డీఈఓ సుబ్రహ్మణ్యం, ఏపీ టూరిజం అధికారి నాగభూషణం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా అదనపు ఎస్పీ -
● సొగసైన సురక్షితమైన ప్రయాణం
పవిత్రమైన, సుందరమైన శేషాచలం అటవీ కొండలు, పాలకొండల సముదాయంలో గువ్వలచెరువు ఘాట్ ఉంది. ఈ ప్రాంతం అందమైన అటవీ ప్రాంతం, వర్షాకాలంలో ఎటు చూసి నా పచ్చదనం.. జలపాతాల సోయ గాలు కనువిందు చేస్తుంటాయి. అలాంటి ప్రకృతి మధ్య సొరంగ మార్గం ఏర్పాటు కావడంతో.. ఆ ఏరియా అంతా పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఈ మార్గం గుండా ఇప్పటికే హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వాపార, వ్యవసాయ రంగానికి సంబంధించి ఉత్పత్తులు రవాణా అవుతున్నాయి. ఉదాహరణకు మన జిల్లా నుంచి సిమెంట్, మైనింగ్, అరటి, బత్తాయి తదితర వస్తువులు గువ్వలచెరువు ఘాట్ మీదుగా పీలేరు, చిత్తూరు, చైన్నె, మదనపల్లె, బెంగళూరు తదితర ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఫ్యాక్టరీలకు మిషనరీ, ఇతర పరిశ్రమలకు సంబంధించిన విడి భాగాలు, కెమికల్స్తోపాటు టమోటా తదితర కూరగాయలు, కొబ్బరి బొండాలు.. ఇలా పలు రకాల వస్తువులు భారీ వాహనాల్లో వస్తుంటాయి. వీటిలో కొన్ని వివిధ కారణాల చేత ఘాట్ మలుపుల్లో చిక్కుకొని ప్రమాదాలకు గురి అవుతున్నాయి. సొరంగ మార్గం ఏర్పాటైతే దాదాపు ఒక గంట ప్రయాణం కలిసి రావడంతోపాటు సుఖంగా.. సురక్షితంగా ప్రయాణం సాగించడానికి వీలుకలుగుతుంది. -
ప్రశాంతంగా మొహర్రం పండుగ జరుపుకోండి
– జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు రాయచోటి : జిల్లా ప్రజలు మొహర్రం పండగను ప్ర శాంతంగా జరుపుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. గ్రామ పెద్దలు, చిన్నా, పెద్దా తేడాలేకుండా ఉత్తేజ భరితంగా జరుపుకొనే ఈ వేడుకలలో అల్లర్లకు తావుండరాదని హెచ్చరించారు. సోదరభావంతో మెలగాలని, చట్ట విరుద్ధగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు కడప అర్బన్ : అనుమానంతో భార్యను వేధింపులకు గురి చేస్తూ గొంతునులిమి హత్య చేసిన కేసులో నిందితుడైన భర్త జరిపిటి మల్లికార్జున(41)కు జీవిత ఖైదు, రూ. 1,60,000 జరిమానా విధిస్తూ జడ్జి జిఎస్.రమేష్కుమార్ తీర్పు ఇచ్చారు. తంబళ్లపల్లి మండలం మేకావారిపల్లికి చెందిన జరిపిటి మల్లికార్జునకు కడప ఏఎస్ఆర్ నగర్కు చెందిన తమ్మిశెట్టి రమాదేవి కుమార్తె గంగాదేవితో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మల్లికార్జున పండ్లను విక్రయిస్తూ జీవించేవాడు. భార్య జరిపిటి గంగాదేవి(25)ని రోజూ అనుమానంతో వేధించాడు. 2019 మార్చి, 3న ఉదయం గొంతు నులిమి హత్య చేసినట్లు మృతురాలితల్లి తమ్మిశెట్టి రమాదేవి ఫిర్యాదు చేసింది. అప్పటి తాలూకా సీఐ ఎస్.విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేసి మల్లికార్జునను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తు అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో సాక్ష్లాతో సహా నేరం నిరూపణ కావడంతో కడప కోర్టు జడ్జి మల్లికార్జునకు జీవిత ఖైదు, రూ.1,60,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. సీఐ టి.రెడ్డెప్ప, కోర్ట్ కానిస్టేబుల్ ఎం.రఘురాముడు, కోర్ట్ మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ రాజులను ఎస్పీ ఈజి.అశోక్ కుమార్ అభినందించారు. ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలి రో జున వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు– చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి న నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 77.3 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మ న్విత్ రెడ్డి 167 బంతులో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. సయ్యద్ షాహుల్ హుస్సేన్ 63 పరుగులు చేశాడు చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 3 వికెట్లు, ధనుష్రెడ్డి 3 వికెట్లు, తేజేష్2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో..... కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో కర్నూలు –అనంతపురం జట్లు తలపడ్డాయి, ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్లో 59.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 213 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని విష్ణు వర్దన్ నాయుడు 68 పరుగులు, విఖ్యాత్ 4 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని నవదీప్ 4 వికెట్లు, టివి సాయి ప్రతాప్ రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 29 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 139 పరుగులు చేసింది. ఆ జట్టులోని కెహెచ్ వీరారెడ్డి 62 పరుగులు చేశాడు. యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు కడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల పీపీఎస్ పరిధిలో జరిగిన మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో పోరుమామిళ్ల టౌన్ బెస్త వీధికి చెందిన షేక్ జిలానీ బాషా(26), కలసపాడు మండలం కట్టకిందపల్లికి చెందిన కారు నాగేంద్ర ప్రసాద్(25), పోరుమామిళ్లలోని తురకకోట వీధికి చెందిన షేక్ మహబూబ్ బాషా(26) లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కడప నాలుగో ఏడీజే కోర్టు జడ్జి జి.దీనాబాబు తీర్పు ఇచ్చారు. పోరుమామిళ్ల పీఎస్ పరిధిలోని రామాయపల్లి శ్వశానం వద్ద 2019 జూలై, 11న హత్య జరిగింది. ముగ్గురు నిందితులు మతి స్థిమితం లేని యువతిని గొంతు నులిమి హత్య చేశారు. అప్పటి వీఆర్ఓ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మోహన్రెడ్డి కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో యువతి గొంతు నులిమి హత్యచేసినట్లు రుజువు కావడంతో శుక్రవారం ముగ్గురికీ పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. సీఐ మోహన్ రెడ్డి, సీఐడీ శ్రీనివాసులు, కొండారెడ్డి, వెంకట సుబ్బయ్యలను ఎస్పీ అభినందించారు. రైళ్లలో పోలీసుల తనిఖీలు కడప కోటిరెడ్డిసర్కిల్ : గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. కడప రైల్వే స్టేషన్తోపాటు ఎర్రగుంట–కడప మార్గంలో ముంబై నుంచి చైన్నె ఎగ్మోర్ వెళ్తున్న రైలులో కడప మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ఈగల్, రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, పోలీసు, డాగ్ స్క్వాడ్ టీంలతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ బాలస్వామిరెడ్డి మాట్లాడుతూ జనరల్ బోగి నుంచి ఏసీ బోగీల వరకు అన్నింటినీ తనిఖీ చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలన కొరకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఏర్పాటుచేశారని, ఈ నెంబర్కు సమాచారం అందిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ తనిఖీలలో కడప వన్టౌన్ ఎస్ఐ అమర్నాథ్రెడ్డి, కడప రైల్వే ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి, స్పెషల్ పార్టీ, ఈగల్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. -
మొహర్రం ఉత్సవాలకు సర్వం సిద్ధం
చిన్నమండెం: మొహర్రం ఉత్సవాల నిర్వహణకు చిన్నమండెంలో సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమం శనివారం జరగనుంది. ఇందుకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లాహుస్సేనీ పాల్గొనే ఈ కార్యక్రమానికి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మార్గదర్శకుల ఎంపిక పూర్తిచేయాలి: కలెక్టర్ రాయచోటి: పేదరికం నిర్మూలనకు పీ–4 సర్వే ద్వారా మండలాల వారీగా గుర్తించిన బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర సచివాలయం నుంచి పి–4పై జిల్లా కలెక్టర్లు, మంత్రులు ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫిరెన్సు హాల్ నుంచి వీడియో కాన్ఫిరెన్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి, జేసీ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 66వేల బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. వీరికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే పి–4 లక్ష్యమన్నారు. -
మానవత్వం మరచిన ఆటో డ్రైవర్
కలికిరి : మానవత్వం మంట గలిచింది. అకస్మాత్తుగా మృత్యువాత పడిన అభాగ్యుడిని ఆదుకోవాల్సింది పోయి.. రోడ్డు పక్కన పడేసి వెళ్లిన వైనం శుక్రవారం వెలుగు చూసింది. కలికిరి మండల పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమల మండలం మిట్టూరుకు చెందిన ఎన్.రమేష్(48) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం కలికిరికి చికిత్స నిమిత్తం భార్య, మనుమరాలితో వచ్చాడు. చికిత్స అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా కలికిరి కందూరు రోడ్డు మార్గంలో యల్లంపల్లి బస్టాపు వద్ద దాహమేస్తోందని అడిగి ఆటో నిలుపుమన్నారు. నీళ్లు తాగుతుండగా పక్కకు ఒరిగి ప్రాణాలొదిలాడు. ఆటోడ్రైవర్ ఆ మృత దేహాన్ని రోడ్డుపక్కన పెట్టేసి అతని భార్య, చిన్న పాపను వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో మృతుడి భార్య రోదిస్తుండటంతో అటుగా వెళుతున్న గుట్టపాళెం సర్పంచ్ రెడ్డివారి వెంకటరెడ్డి గమనించి మృతదేహాన్ని తరలించడానికి వాహనం ఏర్పాటుచేసి మానవత్వం చాటుకున్నారు. మృతదేహాన్ని, మహిళను, చిన్నారిని రోడ్డుపక్కన వలిలేసి వెళ్లిన ఆటో డ్రైవరు తీరుపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన మృతదేహాన్ని దించి వెళ్లిన వైనం -
ఆలోచనకు పదును.. సృజనకు అదును
కడప ఎడ్యుకేషన్ : ఇన్స్పైర్ మనక్– 2005 అవార్డులకు వేళయింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి.. వారి చిట్టి బుర్రలకు పదునుపెట్టి... కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి.. వారిని భావి భారత శాస్త్ర వేత్తలుగా తయారుచేయాలనే లక్ష్యంతోభాగంగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డిఎస్టి) ఏటా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లా స్థాయిలో ప్రతిభ చూసిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులకు బాల శాస్త్రవేత్తలుగా నామకరణం చేసి రాష్ట్రపతి అవార్డు అందజేస్తారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు త్వరపడాల్సి ఉంది. అర్హతలు... ఎంపికలు ఇలా వైఎస్సార్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఇన్స్పైర్ మనక్కు దరఖాస్తు చేసేందుకు అర్హు లు. వారంతా తమ సైన్సు టీచర్ను గైడ్గా ఏర్పాటుచేసుకుని ఈ పరిశోధనలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు. స్థానిక సమస్యలను తీర్చే విధంగా ఆలోచనలుండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచన ఎంపిక చేసి అందుకు అవసరమైన ప్రాజెక్టు రూపొందించాలి. విద్యార్థి, తండ్రి పేర్లు, తరగతి నమోదు చేసి విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు రాత పూర్వకంగా సంబంధిత వెబ్ సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయి ప్రతిభా వంతులను ప్రకటిస్తారు. తర్వాత రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగం నిమిత్తం బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ దరఖాస్తుకు గడువు సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉంది. దరఖాస్తు చేసుకునే విధానం ఇలా... ఇన్స్పైర్ అవార్డు మనాక్లో పాల్గొనేందుకు విద్యార్థులు ముందుగా www.inrpireawardrdrt.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. స్కూల్ ఆఽథారిటీ ఆప్షన్ను ఎంపిక చేయాలి. అందులో న్యూ రిజిస్ట్రేషన్ అప్షన్ను ఎంపిక చేయాలి. పాఠశాల వివరాలను పొందుపరిచి సేవ్ చేయాలి. సంబంధిత దరఖాస్తు జిల్లా అథారిటీకి చేరుతుంది. ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మొయిల్ ఐడీకి యూజర్ ఐడితో కూడిన లింక్ వస్తుంది. ఆ ఐడీతో పాస్వర్డు క్రియేట్ చేయాలి. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టు వివరాలను అందులో నమోదుచేయాలి. జాగ్రత్తలు పాటించాలి... విద్యార్థులు తయారు చేసే ప్రాజెక్టులలో స్థానిక సమస్యలను ప్రతిబింబించి.. వాటికి పరిష్కార మార్గాలు చూపేలా ఉండాలి. పాతవైనా తాజా పరిస్థితులకు అన్వయించి పరిష్కారం చూపాలి. నమూనాల పొడవు, వెడల్పు ఒక మీటరు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు రిపోర్టులో నమూనా పరిచయం, పనిచేసే తీరు, ఉపయోగించే పరికరాలు, తయారీ విధానం, పనిచేసే తీరు. ఫలితాల అనువర్తనాలు తప్పని సరిగా ఉండాలి. ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చే న్యాయ నిర్ణేతలకు నమూనా చూపించి ప్రాజెక్టు గురించి తడబాటు లేకుండా వివరించాలి. ఎంపిక పక్రియ... విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు, నమూనాలను జిల్లా స్థాయి ప్రదర్శనలో ఉంచుతారు. జిల్లా స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి పంపుతారు. అక్కడ విజయం సాధిస్తే జాతీయ స్థాయిలో పదర్శించే అవకాశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికై న వాటిని ఐఐటి, నీట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు అప్పగిస్తారు. వాటిని వారు గొప్ప నమూనాలుగా రూపొందిస్తారు. ఉత్తమ ప్రదర్శనల నుంచి జాతీయ స్థాయిలో పదర్శనలకు అవకాశం ఉంటుంది. వీటిలో పలు ప్రాజెక్టులను ఫైనల్గా ఎంపిక చేసి రాష్ట్రపతి భవన్లో జరిగే వారోత్సవాల్లో ప్రదర్శిస్తారు. ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం పెటెంట్ హక్కులు మంజూరు చేస్తుంది. ఇన్స్పైర్మనక్ –2025కు దరఖాస్తుల ఆహ్వానం బాల మేధావులకు గొప్ప అవకాశం సెప్టెంబర్ 15వ తేదీ వరకు నమోదుకు గడువు విద్యార్థులను ప్రోత్సహించండి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే సైన్సు ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రాజెక్టుల రూపకల్పనలో వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోని నూతనత్వాన్ని ప్రతిబింబించేలా ప్రాజెక్టు సిద్ధం చేసుకోవాలి. ఇందుకు అన్ని పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు కృషిచేయాలి. అనుమానాలుంటే జిల్లా సైన్సు అధికారిని సంప్రదించాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి ప్రతి పాఠశాలల నుంచి... ఇన్స్పైర్ మనక్ నామినేషన్ల నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంది. ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు భాగస్వాములు కావాలి. ఇందులో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకు ప్రతి ౖసైన్సు ఉపాధ్యాయుడు కృషి చేయాలి. – ఎబినైజర్, జిల్లా సైన్సు అధికారి -
బుద్ధ విగ్రహం తల తొలగింపు వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం
మదనపల్లె రూరల్ : తథాగతుడు గౌతమ బుద్ధుడి విగ్రహానికి తల తొలగించడాన్ని నిరసిస్తూ భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) చేపట్టిన దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరింది. కేసును తప్పుదోవ పట్టించి, నిందితుల్ని కాపాడేందుకు మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ ప్రయత్నిస్తున్నారంటూ పది మంది బౌద్ధులు అరగుండు, అర మీసంతో వినూత్నంగా శుక్రవారం నిరసన తెలియజేశారు. దళిత సేన కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో దళిత సేన సభ్యులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. బీడా శ్రీనివాస్ మాట్లాడుతూ బుద్ధుడి తల తొలగించిన మతోన్మాదులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామన్నారు. బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీయం శివప్రసాద్ మాట్లాడుతూ బుద్ధ విహారను మానవ వికాస కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రెండు కోట్ల రూపాయలతోపనులు చేశామన్నారు. కొందరు ఉన్మాదులు పని గట్టుకొని ఒక్కొక్కటీ ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాలూకా సీఐ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ప్రత్యేక పోలీస్ బృందం ద్వారా కేసును ఇన్వెస్టిగేట్ చేయించాలని డిమాండ్ చేశారు. అనంతరం దీక్షా శిబిరం వద్దకు పోలీసులు చేరుకుని దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ముత్యాల మోహన్, చాట్ల బయన్న, గంపల రమణ, వై.గంగాధర్, తలారి కష్ణ, నాగరాజు, నీరుగట్టి రమణ, కోనేటి దివాకర్, ఆవుల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
కడప మీదుగా వెళ్లే జాతీయ రహదారి –40 మార్గంలో కీలకమైన గువ్వల చెరువు ఘాట్ ఉంది. ఇక్కడ ప్రమాదకర మలుపులు ఉన్నందున.. తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇక్కడ సొరంగ మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా సురక్షిత ప్రయాణానికి అవకాశ
కడప రూరల్: కర్నూలు, చిత్తూరు మధ్యలో కడప అనుసంధానంగా ఉండే జాతీయ రహదారి–40 మార్గం ఎంతో కీలకమైనది. ఈ ఘాట్ కడప నగరానికి దాదాపు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. వాహనదారులు, ముఖ్యంగా భారీ వాహనదారులు ఈ ప్రమాదకర మలుపుల్లో వెళ్లాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. నాలుగు వరసల దారి.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కడప గువ్వల చెరువు ఘాట్ వద్ద ప్రమాదాల నివారణకు, సురక్షిత ప్రయాణానికి సొరంగ మార్గం నిర్మించాలని సంకల్పించింది. ఆ మేరకు అంచనా వ్యయం రూ.920 కోట్లుగా నిర్ణయించింది. ఇక్కడ ప్రస్తుతం వాహనాలు రాకపోకలు సాగించడానికి దాదాపు 30 అడుగుల రహదారి ఉంది. సొరంగ మార్గం నిర్మించే ప్రాంతంలో కడప వైపు నుంచి చిన్న బిడికి గ్రామం వద్ద నుంచి.. ఘాట్కు ఆవలి వైపు ఉన్న గువ్వలచెరువు ప్రాంతం వరకు దాదాపు 7–8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో సొరంగ మార్గం (టన్నెల్) దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉండనుంది. అంటే మొత్తం 7–8 కిలో మీటర్ల వరకు (సొరంగ మార్గంతో కలిపి) వాహనాలు రాకపోకలు సాగించడానికి నాలుగు వరుసల రహదారులను నిర్మించనున్నారు. ఈ టన్నెల్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసేది అత్యున్నత స్ధాయి నిపుణులు నిర్ధారించాల్సి వుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి నేషనల్ హైవే టన్నెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్తో మరి కొంతమంది నిపుణులు ఇక్కడికి వచ్చి.. ప్రాథమికంగా ఈ ప్రాంతాలను పరిశీలించి వెళ్లినట్లుగా తెలిసింది. కాగా ఈ మార్గానికి అటవీ, పర్యావరణ తదితర శాఖల నుంచి అనుమతులు రావాల్సి వుంది. మలుపుల్లో తరచూ మృత్యు ఘంటికలు ఇక్కడ చాలా ఏళ్ల క్రితం బ్రిటీష్ హయాంలో రోడ్డును నిర్మించారు. ఈ ఘాట్ మార్గంలోనే ఇప్పుడు అంద రూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఒక అంచనా ప్రకా రం ఈ మార్గంలో ఒక నిమిషానికి ఒక వాహనం వెళ్తోంది. పలు రకాల వాహనాలు ముఖ్యంగా భారీ వాహనదారులకు ఈ ఘాట్ విషమ పరీక్షను పెడుతుంది. ఇక్కడ అత్యంత జాగ్రత్తగా వాహనం నడపక పోతే ప్రమాదం జరుగుతుంది. ఒక అంచనా ప్రకారం ఒక నెలలో 2–3 ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణ నష్టం కూడా సంభిస్తుంటుంది. కడప వైపు నుంచి ప్రయాణించే వైపు ఘాట్లో ఉండే.. శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న మలుపు, ఆ పైన ఉన్న మలుపుల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గువ్వలచెరువు నుంచి కడప వైపు వచ్చే మార్గంలో మొదటి మలుపు వద్ద కూడా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రమాదాలకు సొరంగ మార్గంతో దాదాపుగా అడ్డుకట్ట పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ● గువ్వల చెరువు ఘాట్లో ఏర్పాటుకు సన్నాహాలు ● రూ.920 కోట్ల అంచనా వ్యయం ● మొత్తం 7 కిలోమీటర్ల దారి ● అందులో 3 కి.మీ సొరంగం ● టన్నెల్తో ప్రమాదాలకు అడ్డుకట్ట ● వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే ప్రతిపాదనలు నాడే ప్రతిపాదనలు ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలోనే పలు ప్రాజెక్ట్లు పూర్త య్యా యి. ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేశా రు. జాతీయ రహదారులతోపాటు జిల్లా, గ్రామీ ణ రోడ్లకు మహర్దశ పట్టింది. అందులో భాగంగానే గువ్వలచెరువు ఘాట్లో సొరంగ మార్గానికి ప్రతిపాదనలు పంపారు. కాగా వైఎస్సార్ మరణానంతరం ఈ పనులు ముందుకు సాగలేదు. -
ఇప్పుడంతా తలకిందులు!
అంతా నా వాళ్లే అని భావించిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్విప్లవాత్మక మార్పులతో మహిళా సాధికారతకు బలమైన పునాదులు వేశారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయం.. ఇవన్నీ ఏవీ చూడకుండా అర్హత ఉన్న వారందరికీ అండగా నిలిచారు. విలక్షణమైన పథకాలతో అక్కచెల్లెమ్మలకు అడుగడుగునా అండగా నిలిచి రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు. ఒక మహిళ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం బాగు పడుతుందని.. కుటుంబాలు బాగు పడితే ఊరు అభివృద్ధి చెందుతుందని..అలా ఊళ్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తన పాలనలో ప్రత్యక్షంగా నిరూపించారు. ఫలితంగా మహిళా ఆర్థిక స్వావలంబన సాకారమై పూర్తిగా నిలదొక్కుకునే దశలో కూటమి నేతల ‘మాయాఫెస్టో’ ఆ విప్లవాత్మక అడుగులకు బ్రేక్ వేసింది. వెరసి ఇపుడు చిరు వ్యాపారాలన్నీ పడకేశాయి. ఆశలు అడియాశలయ్యాయి. చేయి పట్టుకుని నడిపించే భరోసా కరువైంది. అడుగులు ఎలా ముందుకు వేయాలో తెలియక క్రాస్రోడ్లో నిలుచున్నారు. రమ సరస్వతి – రాయలసీమ జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన నీలమ్మ (పేరు మార్చాం) దిగువ మధ్యతరగతికి చెందిన సాధారణ గృహిణి. టైలర్. అమ్మ ఒడి, జగనన్న చేదోడు, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ సున్నా వడ్డీ లాంటి పథకాలతో ఆ కుటుంబం చాలా లాభపడింది. అంతకు ముందు కేవలం బట్టలు కుట్టడం వరకే పరిమితమైన ఆమె ఈ పథకాలతో వచ్చిన డబ్బును కొట్టుకు పెట్టుబడిగా మలచుకుంది. దగ్గర్లో ఉన్న టౌన్లోని హోల్సేల్ షాపులో ఖాతా తెరిచి.. ఫాల్స్, పెట్టీకోట్లు, బ్లౌజ్ పీసెస్ లాంటి వాటిని తెచ్చుకొని ఇంట్లోనే ఓ గదిని చిన్న మ్యాచింగ్ సెంటర్లా మార్చుకుంది. ఓవైపు బట్టలు కుడుతూనే ఆ చిన్న ఊర్లో ఆడవాళ్ల మ్యాచింగ్ దుస్తుల అవసరాలనూ తీరుస్తూ వాళ్లు పట్నానికి వెళ్లే ఖర్చు, సమయాన్నీ ఆదా చేస్తోంది. ‘జగనన్న పెట్టిన పథకాలు చాలానే వచ్చాయి మా కుటుంబానికి. వాటిల్లో కొన్నిటికి నేరుగా నా అకౌంట్లోనే డబ్బు పడటంతో అవి వేస్ట్ కాకుండా నా కుట్టు మిషన్ పనికి వాడుకున్నాను. మొదటి రెండు నెలలు వేస్ట్గానే ఖర్చయిపోయాయి. మేము బాగు పడాలని ఆయప్ప ఇచ్చిన డబ్బులు అలా వేస్ట్ అయినందుకు కొంచెం బాధ పడ్డాను. తర్వాత మా ఆడబిడ్డే సలహా ఇచ్చింది. కుట్టు పని వచ్చు కదా వదినా.. ఇంట్లోనే టైలర్ షాప్ లాంటిది పెట్టుకోవచ్చు కదా అని! నిజమే అనిపించింది. పెట్టాను. అంతకు ముందు కాళ్లతో తొక్కే మిషనే ఉండేది నాకు. పథకాల డబ్బుతో ముందు కరెంట్ మిషన్ కొనుక్కున్నా.. తర్వాత మెటీరియల్ తెచ్చుకున్నా. ఏ నెలకు ఆ నెల ఖాతా తీర్చేసి అప్పు లేకుండా చేసుకున్నా. కానీ గవర్నమెంట్ మారిపోయి.. డబ్బులు రాక మళ్లీ అప్పుల్లో పడింది జీవితం. ఇప్పుడు ఇదివరకంతటి మెటీరియల్ తీసుకురాలేకపోతున్నా! ఓ నాలుగు నెలలుగానైతే బ్లౌజులు కుట్టడం వరకే పరిమితమైపోయా’ అని చెబుతోంది నీలమ్మ. సమీనా వ్యాపారవేత్త అయింది..సమీనా (పేరు మార్చాం)ది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతం. నలుగురు పిల్లలు, తాగుబోతు భర్త, వితంతు అత్త, వ్యవసాయ కూలీగా పనిచేసే మరిది ఉన్న ఉమ్మడి కుటుంబం. పెద్దకొడుకు చదువులో చురుకు. ఆర్థిక పరిస్థితి బాలేక చదువు మానిపించి పనిలో పెట్టింది. అలా ఆమె, కొడుకు, మరిది కష్టపడ్డా అప్పులతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేది సమీనా. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆమె రాత మారింది. కుటుంబం బాగు పడింది. వాళ్ల అత్తగారికి రూ.మూడు వేలు పెన్షన్ వస్తుండటంతో ఆమె భారం తగ్గింది. వైఎస్సార్ చేయూతకు దరఖాస్తు చేసుకుని ఆ బెనిఫిట్ పొందిన సమీనా ఊర్లోనే చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంది. భర్తనూ అందులో కూర్చోబెట్టి బేరం బాధ్యతను అప్పగించి తాగుడు వ్యసనానికి దూరం చేసింది. ఆమె పెద్దకొడుకు పై చదువుల కోరికను జగనన్న విద్యా దీవెన తీర్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి బెంగళూరులో మంచి కంపెనీలో చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు. కొట్టు మీద వస్తున్న ఆదాయంతో మరిదికి ఓ ఆటో కొనిపెట్టింది. ఆటో తోలుతూ ఆర్థికంగా వెసులుబాటు తెచ్చుకున్న ఆ మరిదిని వెదుక్కుంటూ వచ్చింది పెళ్లి సంబంధం. పెళ్లయింది. ఆ జంట వైఎస్సార్ షాదీ తోఫా అందుకుంది. దాంతో కొత్త కాపురానికి కావల్సిన వస్తువులు కొనుక్కున్నారు. ఆ వరుడి ఆటో మెయింటెనెన్స్కు వైఎస్సార్ వాహన మిత్ర తోడ్పడింది. ‘మా కుటుంబం ఈరోజు కడుపు నిండా తిండి తినడమే కాదు, మా షాపులో ఓ అబ్బాయికి జీతం ఇవ్వగలిగే స్థితికీ రాగలిగామంటే కారణం జగన్ సారే! ఆయప్ప ఇచ్చిన పథకాలు మా కుటుంబాన్నే మార్చేశాయి. ఈ ఊర్లో మాలాగా ఇంకెన్నో కుటుంబాలు బాగుపడ్డాయి’ అని చెప్పింది సమీనా.. తన కిరాణా కొట్టుకు వచ్చిన ఓ వ్యక్తికి ఉప్మా రవ్వ పొట్లం కట్టిస్తూ.వైఎస్సార్ కడప జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆశ ( పేరు మార్చాం) విడో. పెద్దగా చదువుకోలేదు. పైగా పోలియో. ఆమెను పోషించే ఆర్థిక స్థోమత ఆమె అత్తకు లేనందున పుట్టింటికి వచ్చేసింది. అన్న పంచన చేరింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేరింది. అప్పుడే ఆమెను ఆదుకుని అన్న మీద ఆధారపడే ఆగత్యాన్ని తప్పించేసింది వైఎస్సార్ ఆసరా పథకం. ‘ఈ పథకం కింద వచ్చిన డబ్బు నాకు నిజంగానే ఎంతో ఆసరాగా నిలిచింది. స్వతంత్రంగా బతికే ధీమానిచ్చింది’ అని చెప్పింది ఆశ.ఆ ఐదేళ్లు అంతా సాఫీగా..నీలమ్మ, సమీనా, ఆశే కాదు.. రాయలసీమలోని ఆ మూడు జిల్లాల్లోని ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. అమ్మ ఒడి నుంచి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ (రైతులకు), స్వయం సహాయక బృందాల సున్నా వడ్డీ రుణాలు, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వాహన మిత్ర, ఆరోగ్య ఆసరా, ఈబీసీ నేస్తం, ఆరోగ్య శ్రీ, కళ్యాణమస్తు, హౌజింగ్.. తదితర పథకాల డబ్బు నేరుగా మహిళల పేరు మీదే బ్యాంకు ఖాతాలో పడటంతో.. ఆ డబ్బును కుటుంబ ప్రగతికే ఖర్చు పెట్టారు. ఇంటిని బాగు చేయించుకున్నారు. ఇంట్లో అవసరమైన వస్తువులను అమర్చుకున్నారు. స్కూల్కు వెళ్లే పిల్లలకు సైకిళ్లు కొనిపెట్టారు. మునుపటిలా ఆర్థిక ఇబ్బందులు ఇంటి ఇల్లాలి బంగారం మీద, పిల్లల చదువు మీద ప్రభావం చూపించలేదు వైఎస్సార్ జగన్ హయాంలో! ఈ పథకాల ద్వారా వచ్చిన డబ్బుతో ఆర్థిక అవసరాలు తీరాయి. ఖర్చు లేకుండా పిల్లల చదువు సాగింది. తాకట్టులో ఉన్న ఇల్లాలి బంగారం తిరిగి ఆమె ఒంటి మీదకు చేరింది. అదనంగా ఇంకొంత కొని కూతురి పెళ్లి కోసం దాచగలిగింది. అదివరకు పస్తులున్న కుటుంబాలు సైతం పౌష్టికాహారాన్ని తినగలుగుతున్నామని ఆరోగ్యకరమైన నవ్వుతో చెబుతున్నారు. ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది.. జగనన్న పంపించిన ఫ్యామిలీ డాక్టర్.. గ్రామ ఆరోగ్యాన్ని కాపాడిందని చెప్పారు గ్రామ ప్రజలు. రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు ఒకరకంగా విప్లవాత్మక స్కీమ్స్ అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు రైతులు. సాగంటేనే అప్పుల కుప్ప అని భయపడ్డ రైతన్నలకు ఆ స్కీమ్స్ అండగా నిలిచాయి. వెరవక వ్యవసాయం చేసే భరోసానిచ్చాయి. వాటివల్ల రైతులు మొదటిసారి చేతులనిండా డబ్బు చూశారు. ఈ స్కీమ్స్ అన్నిటికీ స్త్రీలే ఖాతాదారులవడంతో ఒకరకంగా వాళ్లు ఆర్థిక స్వావలంబనను సాధించినట్టయింది. పొదుపు.. మదుపు గత ప్రభుత్వ సమయంలో ఇంట, బయట అన్ని పనులకు ఆర్థి కంగా కుటుంబం మహిళల మీదే ఆధార పడటంతో ఆడవాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రణాళికా బద్ధంగా కుటుంబ ఆర్థిక నిర్వహణ సాగింది. అవసరాల ప్రాధాన్యంగా ఖర్చును నిర్ణయించుకున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు, మదుపులను సాగించారు. స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలు, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో ఎంట్రప్రెన్యూర్స్ (వ్యాపారవేత్తలు) అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పథకాలతో ఇంటి ఆర్థిక పరిస్థితే కాదు గ్రామీణ ప్రమాణాలు ఊహించని రీతిలో మెరుగుపడ్డాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన పంచవర్ష ప్రణాళికలు, ఇతర ఆర్థిక ప్రణాళికలన్నీ కసరత్తు చేస్తోంది దీనికోసమే కదా! అన్నేళ్ల శ్రమ సాధించలేనిది అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలోని ఈ సంక్షేమ పథకాలు సాధించగలిగాయి. సంక్షేమం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది అని పెదవి విరిచిన నిపుణులంతా వైఎస్ జగన్ పథకాలను మనసారా అభినందిస్తున్నారు. గ్రామ సచివాలయం, వలంటీర్స్ ఏర్పాటు నుంచి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్), నాన్ డీబీటీ దాకా పలు పథకాలు దేశానికే ఆదర్శం అని కొనియాడుతున్నారు. భారత్ లాంటి దేశాలకు ఇలాంటి సంక్షేమ పథకాలే అనుసరణీయమని ప్రపంచ స్థాయి సదస్సులో ఉదాహరణగా చూపుతున్నారు. కరోనా సమయంలో సైతం మార్కెట్లో మనీ రొటేట్ చేసిన ఈ పథకాల మీద ప్రతి దేశం అధ్యయనం చేయాలని సూచనలిస్తున్నారు. క్రాస్ రోడ్లో లక్షలాది మంది జీవితాలు అంత ఆర్థికోన్నతికి పాటుపడ్డ ఆ పథకాలు ఇప్పుడు.. తెలుగుదేశం కూటమి పాలనలో దిక్కుమొక్కు లేకుండా పోయాయి. ఏడాది గడిచినా.. ఇచ్చిన హామీల అమలు కనిపించడం లేదు. అందుకే ఊళ్లల్లో పరిస్థితి మళ్లీ దిగజారడం మొదలైంది. ఎవరిని కదిలించినా తీరని అసంతృప్తి. ఎవరి ఖాతా తెరుచుకోలేదు. కొనుగోలు శక్తి లేదు. మార్కెట్లో కళ లేదు. నత్తనడకనైనా నడుస్తుందంటే గత అయిదేళ్లలో మహిళలు జాగ్రత్తపడ్డ ఆదా వల్లనే! వాళ్ల ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ వల్లనే! అదైనా ఇంకెన్నాళ్లు నడిపించగలమనే బెంగను వ్యక్తపరస్తున్నారు అక్కచెల్లెమ్మలు.అభివృద్ధి పేరుతో ఉన్న డబ్బంతా అమరావతికే మళ్లించి మిగిలిన రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారనే బాధను అత్యధికులు వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమంతో అభివృద్ధి సాధ్యమని వైఎస్ జగన్ నిరూపిస్తే.. అభివృద్ధి నినాదంతో ఒక వర్గం సంక్షేమాన్నే కాంక్షిస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి అని యువత, ఉద్యోగులు, మహిళలు, రైతులు అభిప్రాయ పడుతున్నారు. గ్రామ సచివాలయం, వలంటరీ వ్యవస్థ ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ, విద్య, వైద్యంలో సంస్కరణలు, సంక్షేమ పథకాల ద్వారా స్త్రీ సాధికారత వంటివాటితో గ్రామ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడి గాంధీ గ్రామ స్వరాజ్య కలను వైఎస్ జగన్ నెరవేరిస్తే.. అధికార కేంద్రీకరణతో నేటి ముఖ్యమంత్రి గ్రామాలను ధ్వంసం చేస్తున్నారని వాపోతున్నారు అన్ని వర్గాల వారు. ఇప్పుడు ఏపీలోని పల్లెల్లో జీవం లేదు. ఉత్సాహం కరువై.. నిరాశ, నిస్పృహల నిలయంగా కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ మేనిఫెస్టో ముఖ్యమంత్రి అయితే.. చంద్రబాబు మానిప్యులెటివ్ ముఖ్యమంత్రి అని చెబుతున్నారు ప్రజలు. గత ప్రభుత్వ పాలనలో క్రమం తప్పకుండా అందిన సాయంతో నిలదొక్కుకునే దిశగా వేగంగా అడుగులు పడ్డాయని, ఇంకొన్నేళ్లు ఆ సాయం అలానే అంది ఉంటే లక్షలాది కుటుంబాలు పూర్తిగా గాడిన పడేవనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో పరిస్థితి అంతా తలకిందులైందని ఇప్పుడు ఊరూరా వినిపిస్తున్న మాట. ఎందరి జీవితాలోఇప్పుడు క్రాస్ రోడ్లో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏడాదిగా ప్రస్తుత ప్రభుత్వ పాలన చూసిన ఈ లబ్దిదారులందరూ తామంతా మోసపోయామని కుమిలిపోతున్నారు. అదే విషయాన్ని ‘సాక్షి’తో చెబుతూ తమ పేర్లు రాయొద్దని కోరారు. ఈ లెక్కన కూటమి ప్రభుత్వ పాలన ఎలా సాగుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దుర్మార్గపు ప్రభుత్వ తీరుపై గళం విప్పడానికి ఇప్పుడిప్పుడే ధైర్యం కూడగట్టుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు తాము చేయాల్సింది మాత్రం చేస్తామని బల్లగుద్ది చెప్పారు. -
రైల్ వన్ యాప్.. ఉపయోగించుకోండి ఇలా..
రాజంపేట: భారతీయ రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సేవలందించేందుకు రైల్ వన్యాప్ను రైల్వేశాఖ పట్టాలెక్కించింది. రైల్వేల ద్వారా మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఒకే యాప్ను డిజైన్ చేసింది. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) పేరిట తీసుకొని.. ఈ యాప్ ద్వారా అన్ని సేవలను అత్యంత వేగంతో యాక్సిస్ చేసే వీలుంటుంది.ప్రయాణికులకు అందే సేవలు టికెట్ బుకింగ్, రిజర్వేషన్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్ బుకింగ్ ప్లాన్మై జర్నీ టూల్ ద్వారా వివిధ తరగతులలో కోటాలో టికెట్ల బుకింగ్ అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ రైలు స్థితి తెలుసుకోవడం ఎలా..? రైలు స్థితి, ప్లాట్ఫాం నంబరు, ఆలస్యం తదితర వివరాలు కోచ్పొజిషన్ పీఎన్ఆర్ స్టేటస్, రీఫండ్ ముందస్తు రిజర్వేషన్ టికెట్ ప్రస్తుత స్థితి గతులు, టికెట్ పీఎన్ఆర్ నంబరు ద్వారా సీటు కన్ఫర్మేషన్ స్టేటస్, రైళ్ల రద్దు, రిజర్వేషన్ రద్దు తదితర సేవలు ఫుడ్ ఆర్టరింగ్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరజిం కార్పొరేషన్ లిమిటెట్ (ఐఆర్టీసీ) యాప్ ద్వారా వివిధ రైల్వేస్టేషన్లకు చేరుకునేందుకు ముందుగా.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, రైల్వేస్టేషన్కు రైలు చేరుకున్నాక సీటు వద్దకే ఫుడ్ చేర్చడంయాప్ ఎలా డౌన్లోడ్.. ఆండ్రాయిడ్ ఫోన్లలోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీలుంది. httpr://pay.goofe.com/sotre/a ppr/detair?orf.crir.akam ఐవోఎస్ యాప్ నుంచి... httpr://appr.appe.com/in/a pp.raione/id 6473384334 ఉపయోగించే విధానం..యాప్ను డౌన్లోడ్ చేశాక. రైల్కనెక్ట్ లేదా యూటీఎస్ యాప్ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి.కొత్త వినియోగదారులు మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.mPIN లేదా బయోమెట్రిక్ ద్వారా సులభంగా లాగిన్ కావచ్చు.ప్లాన్ మై జర్నీ లేదా మై బుకింగ్ వంటి ఆప్షన్లను ఉపయోగించి సేవలను యాక్సెస్ చేయవచ్చు.ఇవీ ప్రయోజనాలు..ఒకే యాప్లో ఐఆర్టీఎస్ రైల్ కనెక్ట్, యూటీఎస్, రైల్మదద్, ఎన్టీఈఎస్, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి సేవలు బహుళ యాప్ల అవసరం తగ్గించి, డివైస్ స్టోరేజి ఆదా చేసుకోవచ్చు. సరళమైన ఇంటర్సేఫ్, సింగల్ సైన్–ఆన్ ద్వారా ఉపయోగం సులభతరం2025 డిసెంబర్ నాటికి కొత్త పీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నిమిషానికి 1.5 లక్షల టికెట్స్ బుకింగ్, 40 లక్షల ఎంక్వైరీలు నిర్వహించగల సామర్థ్యం. -
కుంటు‘బడి’న చదువులు!
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని ఓ మోడల్ ప్రైమరీ పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వం నలుగురు టీచర్లు, ఒక హెచ్ఎంను కేటాయించింది. ఇందులో ఇద్దరు టీచర్లను బదిలీపై ఇక్కడ నియమించగా, వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. అయితే రిలీవర్లు లేక వారు పాత స్కూల్లోనే కొనసాగుతున్నారు. ఈ మోడల్ ప్రైమరీ స్కూలులో ఐదుగురు టీచర్లు ఉన్నా, పనిచేస్తున్నది ముగ్గురే. ఉపాధ్యాయుల బదిలీల తర్వాత రాష్ట్రంలో వేలాది పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి, అమరావతి: సర్కారు బడిలో చదువులు చతికిలపడ్డాయి. అస్తవ్యస్త బదిలీలతో బోధన కుంటుపడింది. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూళ్లలో నియమించిన టీచర్లు కొత్త పోస్టులో బాధ్యతలు తీసుకున్నా, వారు పాత పాఠశాలల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా స్కూళ్లలో అధికారికంగా టీచర్లను నియమించినా, గతేడాది ఉన్న పరిస్థితే కొనసాగుతోంది. గత నెలలో పాఠశాల విద్యాశాఖలోని దాదాపు 67వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. వీరిలో 6వేల మందికి పీఎస్ హెచ్ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు.అయితే, వీరు పదోన్నతులు తీసుకున్నా... పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. మరోపక్క ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలో ఉపాధ్యాయులు లేక అవస్థలు మొదలయ్యాయి. దాదాపు 40శాతం మంది బదిలీ అయిన స్థానాల్లో రిపోర్టు చేసి, తిరిగి పాత స్కూళ్లలోనే కొనసాగుతున్నారు. వచ్చే నెలలో విద్యార్థులకు ఫార్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు జరగనున్నాయి. కానీ, ఇక్కడ స్కూళ్లల్లో చదువు చెప్పేవారు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. డీఎస్సీ తర్వాతా కష్టమే? పాఠశాల విద్యాశాఖ ఇటీవల బదిలీల్లో 67వేల మంది టీచర్లకు స్థానచలనం కల్పించింది. వీరిలో ఎస్జీటీలు 31వేల మంది, స్కూల్ అసిస్టెంట్లు 28వేలు, ఎంపీఎస్ హెచ్ఎంలు 5,717, గ్రేడ్–2 హెచ్ఎంలు 1,500, భాషా పండితులు 1,199, పీఈటీలు 344 మంది ఉన్నారు. వీరిలో ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందినవారు, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా పదోన్నతి పొందినవారు రిలీవర్లు లేక పాత పోస్టుల్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేశాక పదోన్నతులు పొందినవారు రిలీవ్ అవుతారని విద్యాశాఖ ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం16,437 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించింది. ఖాళీలు అంతకు రెట్టింపు ఉన్నాయి. చాలా జిల్లాల్లో ఖాళీలు 700 ఉండగా, నోటిఫైడ్ పోస్టులు 200 నుంచి 250 వరకు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నోటిఫైడ్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, మిగిలిన ఖాళీల పరిస్థితి ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కొత్త టీచర్లను ఇప్పుడు బదిలీ అయినవారి స్థానాల్లో నియమిస్తారా? లేక పూర్తిగా ఖాళీగా ఉన్న స్థానాల్లో నియమిస్తారా? అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కొత్త టీచర్లతో ఖాళీలను భర్తీ చేస్తే, బదిలీ అయిన టీచర్లు పాత పోస్టుల్లోనే కొనసాగాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతున్నారు. వచ్చేవారం డీఎస్సీ తుది ‘కీ’డీఎస్సీ–2025 పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగిశాయి. మొత్తం 66 పేపర్లలో సగానికి పైగా పేపర్లకు ప్రాథమిక కీ ప్రకటించగా, కొన్నింటికి సోమవారం నాటికి ‘కీ’ విడుదల చేయనున్నారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ ‘కీ’ని వచ్చే వారాంతానికి విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. దానిపైనా అభ్యర్థులకు 10 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తీసుకుని ఈ నెల 25 నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఆగస్టులో అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
పట్టాలెక్కిన రైల్వేవన్ యాప్ !
రాజంపేట : భారతీయ రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సేవలందించేందుకు రైల్వేవన్యాప్ను రైల్వేశాఖ పట్టాలెక్కించింది. రైల్వేల ద్వారా మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఒకే యాప్ను డిజైన్ చేసింది. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) పేరిట తీసుకొని.. ఈ యాప్ ద్వారా అన్ని సేవలను అత్యంత వేగంతో యాక్సిస్ చేసే వీలుంటుంది. ప్రయాణికులకు అందే సేవలు ● టికెట్ బుకింగ్, రిజర్వేషన్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్ బుకింగ్ ● ప్లాన్మై జర్నీ టూల్ ద్వారా వివిధ తరగతులలో కోటాలో టికెట్ల బుకింగ్ ● అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ రైలు స్థితి తెలుసుకోవడం ఎలా.. ● రైలు స్థితి, ప్లాట్ఫాం నంబరు, ఆలస్యం తదితర వివరాలు ● కోచ్పొజిషన్ పీఎన్ఆర్ స్టేటస్, రీఫండ్ ● ముందస్తు రిజర్వేషన్ టికెట్ ప్రస్తుత స్ధితి గతులు, టికెట్ పీఎన్ఆర్ నంబరు ద్వారా సీటు కన్ఫర్మేషన్ స్టేటస్, రైళ్ల రద్దు, రిజర్వేషన్ రద్దు తదితర సేవలు ఫుడ్ ఆర్టరింగ్.. ● ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరజిం కార్పొరేషన్ లిమిటెట్ (ఐఆర్టీసీ) యాప్ ద్వారా వివిధ రైల్వేస్టేషన్లకు చేరుకునేందుకు ముందుగా.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, రైల్వేస్టేషన్కు రైలు చేరుకున్నాక సీటు వద్దకే ఫుడ్ చేర్చడం యాప్ ఎలా డౌన్లోడ్... ● ఆండ్రాయిడ్ ఫోన్లలోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీలుంది. httpr://pay.goofe.com/sotre/a ppr/detair?orf.crir.akam ఐవోఎస్ యాప్ నుంచి... httpr://appr.appe.com/in/a pp.raione/id 6473384334 ఉపయోగించే విధానం.. ● యాప్ను డౌన్లోడ్ చేశాక. రైల్కనెక్ట్ లేదా యూటీఎస్ యాప్ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి. ● కొత్త వినియోగదారులు మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ● mPIN లేదా బయోమెట్రిక్ ద్వారా సులభంగా లాగిన్ కావచ్చు. ● ప్లాన్ మై జర్నీ లేదా మై బుకింగ్ వంటి ఆప్షన్లను ఉపయోగించి సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. ● ఒకే యాప్లో ఐఆర్టీఎస్ రైల్ కనెక్ట్, యూటీఎస్, రైల్మదద్, ఎన్టీఈఎస్, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి సేవలు ● బహుళ యాప్ల అవసరం తగ్గించి, డివైస్ స్టోరేజి ఆదా చేసుకోవచ్చు. ● సరళమైన ఇంటర్సేఫ్, సింగల్ సైన్–ఆన్ ద్వారా ఉపయోగం సులభతరం ● 2025 డిసెంబర్ నాటికి కొత్త పీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నిమిషానికి 1.5 లక్షల టికెట్స్ బుకింగ్, 40 లక్షల ఎంకై ్వరీలు నిర్వహించగల సామర్థ్యం. స్పీడ్గా అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చిన యాప్ ఐఆర్టీఎస్తో ఫుడ్ ఆర్డరింగ్ నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్ లక్ష్యం -
బుద్ధుడి విగ్రహ ధ్వంసంపై నిరసన
రాయచోటి టౌన్ : మదనపల్లె రూరల్ పరిధి అంకిశెట్టిపల్లె సమీపంలోని బుద్ధుడి కొండపై ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం ధ్వంసంపై రాయచోటిలో నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయ సముదాయంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటం వద్ద భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లం తాతయ్య మాట్లాడుతూ బుద్ధుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని ఆరోపించారు. గతంలో కూడా మూడు సార్లు ఇలాగే చేశారని, దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అలాంటి దురాగతానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికై నా అధికారులు దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి రామాంజులు, బాస్ కుటుంబ సభ్యులు సి.రెడ్డెయ్య రాజు, పక్కీరయ్య, ఏ.నాగేశ్వరావు, సి.పామయ్య, జె.లక్షుమ్మయ్య, శ్రీరాములు, మురళీ తదితరులు పాల్గొన్నారు. -
మైదుకూరులో పట్టపగలే చోరీ
15 తులాల బంగారు, రూ.10 వేలు అపహరణ మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో గురువారం పట్టపగలే ఓ ఇంటిలో చోరీ జరిగింది. వేద వ్యాస హైస్కూల్ పక్కనే ఉన్న ములపాకు జంగంరెడ్డి చిన్న సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంటిలో దుండగులు చొరబడి బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వాయపల్లెకు చెందిన చిన్న సుబ్బారెడ్డి ఆరేళ్ల కిందట మైదుకూరులో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెకు వివాహం కాగా, ఇద్దరు కుమారులు ఉద్యోగ రీత్యా ఇతర చోట్ల ఉన్నారు. గురువారం చిన్న సుబ్బారెడ్డి భార్య మునెమ్మ వరి నాట్లకు వెళ్లగా, ఆయన గ్రామం వద్ద సాగు చేసిన పసుపు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దుండగులు.. ఇంటి ప్రధాన ద్వారం తాళాన్ని గడెలతో సహా పెకలించి లోపలికి ప్రవేశించారు. ఇంటిలో కుడి వైపున బెడ్ రూమ్లో ఉన్న బీరువా తలుపులను పగులగొట్టి అందులో ఉంచిన 22 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించారు. పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న భార్యభర్తలు తలుపులు పగలగొట్టి ఉండటం చూసి.. ఆందోళనతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు వస్తువులు, నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని భావించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ సీఐ రమణారెడ్డి సిబ్బందితో కలిసి బాధితుల ఇంటికి చేరుకుని పరిశీలించారు. కడప నుంచి వేలి ముద్రల నిపుణులను పిలిపించారు. వారు ఇంటిలోని బీరువా, ఇతర వస్తువులపై పడిన వేలి ముద్రలను సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భవన నిర్మాణ కార్మికుడి హత్య
మదనపల్లె రూరల్ : భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు రెండో భార్య హత్య చేసిందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి మదనపల్లి మండలంలో వెలుగు చూసిన ఘటనకు సంబంధించి, కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలం కొత్తవారిపల్లె పంచాయతీరెడ్డి గాని పల్లెకు చెందిన వీరభద్ర కుమారుడు వి.చంద్రశేఖర(42) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. పలమనేరుకు చెందిన మహిళతో వివాహం కాగా, కొంత కాలం క్రితం ఆమె చంద్రశేఖర్ను వదిలి వెళ్లిపోయింది. అనంతరం రమాదేవిని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి దీక్షిత(9) చైతన్యకుమార్(5) సంతానం ఉన్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర మద్యానికి బానిసై, పనులకు వెళ్లడం పూర్తిగా మానేశాడు. దీంతో కుటుంబంలో తరచు గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి వివాదం ఏర్పడి తీవ్ర గొడవ జరిగింది. గొడవ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన విషయం బయటకు తెలియలేదు. అయితే గురువారం రాత్రి చంద్రశేఖర ఇంట్లోనే మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. భార్య రమాదేవిని విచారణ చేస్తే సరైన సమాధానం ఇవ్వకపోగా, ఎప్పుడు చనిపోయాడు తనకు తెలియదంటూ సమాధానం దాటవేసింది. అంతేకాకుండా మృతుడి శరీరం, తలపై రక్త గాయాలు ఉండడంతో, అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తాలుకా సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర మృతిపై భార్య రమాదేవిని పోలీసులు ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు చంద్రశేఖర తమ్ముడు మహేష్ కుమార్ మాట్లాడుతూ... తన సోదరుడు మృతికి రమాదేవి కారణమని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కాగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే చంద్రశేఖర్ మృతి చెంది ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. రెండో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ వెల్లడి -
దేవదాయ ఆస్తులను కాపాడుకుందాం
రాయచోటి టౌన్ : దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన ఆస్తులను కాపాడుకొనేందుకు మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు తిరుపతి మల్టీజోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రంలోని జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ పట్టెం గురుప్రసాద్లతోపాటు అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల దేవదాయ శాఖ, తనిఖీ, కార్యనిర్వహణ అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి మార్గదర్శకాలు సూచించారు. వాటిలో ముఖ్యమైనవి కింది విధంగా ఉన్నాయి. ● కార్యనిర్వహణ అధికారుల ఆధీనంలో ఉన్న దేవదాయల ప్రాపర్టీ రిజిస్టర్లపై పరిశీలన ● రెవెన్యూ వివరాలు నమోదు కాని వివరాల పరిశీలన ● ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు అప్పీలు చేయవల్సిన వివరాల పైన.. ● 1బి. పట్టాదార్ పాస్ పుస్తకాలలో దేవాలయాల పేర్లు చేర్చడం, దాని కోసం మీ సేవ ద్వారా తహసీల్దార్లకు అర్జీలు ఇవ్వడం ● సంస్థల సర్వీస్ ఇనామ్ వివరాలు (ఐఎఫ్ఆర్/ఇనామ్–బి రిజిస్టర్/ఆర్ఎస్ఆర్ ప్రకారం ● సంస్థల భూముల లీజు/ షాప్స్, ఇతరత్రా లైసెన్స్ ఆమోదం ఉత్తర్వులు ● దేవదాయ చట్టం సెక్షన్ 83 కింద ఇప్పటి వరకు ఆక్రమణదారులకు జారీ చేసిన (ఎవికే షన్ నోటీస్) తొలగింపు నోటీసులు ● 11/33 ఏళ్ల లీజు ప్రతిపాదనలు ● జీవో 60 ప్రకారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన భూ రక్షణ కమిటీ సమావేశంలో జారీ చేసిన ఆదేశాలు ● సామూహిక ఆక్రమణల (మాస్ ఎంక్రోచ్మెంట్) స్థితి వంటి విషయలపై చర్చించి అధికారులందరికీ మార్గదర్శకాలు జారీ చేశారు. వీటన్నింటినీ అమలు చేయాలని ఆదేశించారు. -
విద్యార్థులపై మందుబాబు దాడి
చిన్నమండెం : విద్యార్థులపై తాగుబోతు దాడి చేసిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని బోనమల ప్రభుత్వ పాఠశాలలో పలువురు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాబు(పుష్ప) మద్యం తాగి.. ఆ విద్యార్థులపై మధ్యాహ్నం ఉపాధ్యాయులు లేని సమయం చూసుకొని దాడి చేశాడు. దీంతో గాయపడ్డ పలువురు విద్యార్థులను వెంటనే 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు లేనిది చూసి తమను తాగుబోతు చేతులు మడమ తిప్పాడని పలువురు పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ఆందోళన
రాయచోటి టౌన్ : మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు 36 జీవోను అమలు చేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్లు డిమాండ్ చేశారు. గురువారం రాయచోటి పట్టణం ఎన్జీవో కాలనీలోని వాటర్ ట్యాంక్ ఎదుట తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ మాట్లాడుతూ పని గంటలు పెంచారు కానీ వేతనాలు మాత్రం రూ.15 వేలు ఇస్తున్నారన్నారు. కార్మికులతో సమానంగా రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వయో పరిమితి 62 ఏళ్లకు పెంచి అప్కాస్ కొనసాగించాలన్నారు. 6 ఏళ్లకు వయో పరిమితి పెంచకపోతే పర్మినెంట్ చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయకపోవడానికి కార్మికుల్ని దగా చేయడమేనన్నారు. అనంతరం కార్యదర్శి శంకరయ్య మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అలాగే అప్కాస్ కొనసాగించి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, ఇంజినీరింగ్ కార్మికులు చెన్నయ్య, రాంబాబు, దేవా, రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ
ప్రొద్దుటూరు రూరల్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, రూరల్ పరిధిలోని హోటళ్లు, బిర్యాని సెంటర్లు, చికెన్ పకొడ సెంటర్లను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుచి, శుభ్రత, లైసెన్స్ లేకుండా హోటళ్లు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరులోని చిన్న, పెద్ద హోటళ్లపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఖాదరబాద్లోని మహ్మద్ బిర్యాని సెంటర్, డీ మార్ట్ ఎదురుగా ఉన్న లక్ష్మీనరసింహా బిర్యాని సెంటర్, సాగర్ రెస్టారెంట్, బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్, సుందరాచార్యుల వీధిలోని చికెన్ పకోడ సెంటర్లను తనిఖీ చేసినట్లు చెప్పారు. చికెన్ పకోడ తయారు చేస్తున్న వారు వినియోగించే ఆయిల్ బాగలేదని గమనించామన్నారు. కొందరికి నోటీసులు జారీ చేశామని, తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. టీపీసీ మీటర్తో ఆయిల్ను చెక్ చేశామన్నారు. మహ్మద్ బిర్యాని సెంటర్ నుంచి మటన్ బిర్యాని, చికెన్ కర్రీ ఐటమ్స్, బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్లోని కొన్ని పదార్థాలను ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ శాంపిల్స్లో ఏమైనా రిమార్క్ వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ ప్లాంట్ నిర్వాహకులతో పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్ నడపకూడదన్నారు. తప్పనిసరిగా అనుమతులు తీసుకుని స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాలన్నారు. ఆమె వెంట కొత్తపల్లె, గోపవరం గ్రామ పంచాయతీల కార్యదర్శులు రామమోహన్రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కమలాపురం : కమలాపురం మండలంలోని కంచన్నగారిపల్లె గ్రామ సమీపంలో పెన్నా నది వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ విద్యా సాగర్ తెలిపారు. గురువారం ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్ఐ పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి పెన్నా నది వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కాగా అనుమతులు లేకుండా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. మోటారు సైకిల్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు పులివెందుల రూరల్ : పులివెందుల మండలం కనంపల్లె – ఓదులపల్లి తండా గ్రామాల మధ్యలో గురువారం మోటార్ సైకిల్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం ఉడుములకుర్తి నుంచి ద్విచక్ర వాహనంలో గంగరాజు తన కుమారులు ఈశ్వర్, దేవేంద్రతోపాటు భార్యతో కలిసి పులివెందులలోని సర్వజన ఆసుపత్రికి వస్తుండగా.. కనంపల్లె గ్రామ సమీపంలోని ఓదులపల్లె తండా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈశ్వర్, దేవేంద్రతోపాటు గంగరాజు, అతని భార్యకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
పెనగలూరు: పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీషు పోస్టు కసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీషు పోస్టు (గెస్ట్ ఫ్యాకల్టీ) అర్హులైన వారి నుంచి ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీషు కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. ఈనెల 8వ తేదీ డెమో క్లాసులు కళాశాలలో ఉదయం పది గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. డెమో క్లాసుల అనంతరం ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. కావున అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నీరు భూమిలోకి ఇంకిపోవాలి సంబేపల్లే: వర్షపు నీరు, మురికి నీరు భూమిలోకి ఇంకిపోయే విధంగా డ్రేనేజీలు ఉండాలని ఉపాధి పీడీ వెంకటరత్నం తెలిపారు. గురువారం మండల పరిధిలోని రెడ్డివారిపల్లెలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ గుర్తించారు. ఇళ్లలో నుంచి వస్తున్న నీరు మ్యాజిక్ డ్రైన్కు అనుసంధానం చేసి భూమిలోకి ఇంకిపోయే విధంగా నిర్మాణం చేపట్టాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఇలాంటి మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాలు ఎక్కడ అవసరమో చూడాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మధబాబు, ఏపీఓ రెడ్డిజవహర్, జేఈ వెంకట చలపతి తదితరులు పాల్గొన్నారు. 80 శాతం రాయితీతో రైతులకు డ్రోన్లు మదనపల్లె రూరల్: వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం 80 శాతం రాయితీతో రైతులకు డ్రోన్లను అందిస్తోందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ అఽధికారిగా బాధ్యతల స్వీకరణ అనంతరం గురువారం తొలిసారిగా మదనపల్లె పర్యటనకు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డ్రోన్ల సహాయంతో రైతులు ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసుకోవచ్చన్నారు. డ్రోన్ ఒకో యూనిట్ఽ ధర రూ.9.80. ఇందులో రైతుల వాటారూ.1.96లక్షలు పోనూ, మిగిలిన రూ.8లక్షలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. జిల్లాలో తొలిసారిగా పీటీఎం మండలంలో వెంకటేశ్వర గ్రూప్కు డ్రోన్ మంజూరుచేశామన్నారు. జిల్లాలో 97 శాతం ఈకేవైసీ పూర్తయిందన్నారు. అనంతరం ఏడీఏ ఆర్.రమేష్తో కలిసి మండలంలోని అంకిశెట్టిపల్లెలో రైతు లక్ష్మీ ఫీల్డ్ విజిట్లో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంభించి భవిష్యత్తులో ఆర్థికంగా, సుస్థిరంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం డి.వెంకట్మోహన్, ఏఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. ఇదేం సుపరిపాలన
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడప సెవెన్రోడ్స్: ఎన్నికల సమయంలో ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటిని అమలు చేయకుండా, తగుదునమ్మా అంటూ ‘సుపరిపాలనకు తొలి అడుగు–ఇంటింటికి మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి అధ్యక్షతన గురువారం కడపలో జరిగిన ఆ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసు భద్రత లేకుండా వెళితే సుపరిపాలన గురించి ప్రజలే చెబుతారన్నారు. చంద్రబాబు మోసాలను గ్రామగ్రామాన ఎండగడతామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడిచిపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక కిలో రూ. 2 బియ్యాన్ని రూ. 5.25కు, పెంచారని, మద్యనిషేధం ఎత్తేశారని, విద్యుత్ చార్జీలు ఐదుసార్లు పెంచారని వివరించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సైతం నెరవేర్చలేదన్నారు. గత ఎన్నికల్లో బాబు మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టగా హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసగించారని ఆరోపించారు. సంపద సృష్టిస్తానని చెప్పి విపరీతంగా అప్పులు చేస్తున్నారని, అయినా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. సాంకేతిక కారణాల పేరిట తల్లికి వందనం పథకంలో భారీగా కోతలు విధిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 50 ఏళ్లకు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు 69 లక్షల మంది ఉండగా, ఎంతమంది మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చారంటూ నిలదీశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా త్రికరణ శుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకున్నా కరోనా సమయంలో సైతం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామిలన్నీ నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు పీ4 అంటున్నారని విమర్శించారు. బాబు, రేవంత్వి డైవర్షన్ పాలిటిక్స్ పోలవరం–బనకచర్ల విషయంలో గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఈ సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానంగా అన్నారు. ప్రజల్లో తమ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు బనకచర్ల అంశాన్ని ఇరువురు వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచనే లేదన్నారు. 2014లో గోదావరి జలాలను పెన్నాకు తరలించే బృహత్తర కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చి మోసగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై జగన్మోహన్రెడ్డికి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు. ఎన్నికల హామీలు తుంగలో అప్పులు తేవడం తప్ప సంక్షేమం లేదు బనకచర్లపై బాబు, రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
పురాతన ఆలయం.. సుమనోహర క్షేత్రం
నందలూరు: అన్నమయ్య జిల్లా నందలూరులోని సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. సుందర మనోహర క్షేత్రం..శిల్ప సౌందర్య సోయగం స్వామి భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నారు. తెలుగురాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ భక్తులు ఉన్నారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 4న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. 5న ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాలివాహనం, 6న ఉదయం పల్లకీసేవ, రాత్రి హంసవాహనం, 7న ఉదయం పల్లకీ సేవ, రాత్రి సింహవాహనం, 8న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హనుమంతు వాహనం, 9న ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనం, 10న ఉదయం సూర్యప్రభ రాత్రికి చంద్రప్రభ వాహనం, 11న ఉదయం కళ్యాణోత్సవం, రాత్రి గజవాహనం, 12న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 13న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణం, 14న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.బ్రహ్మోత్సవాలకు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతల నుంచి భక్తులు వేల సంఖ్యలో రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. ప్రత్యేకత: బ్రహ్మమానన పుత్రుడు, త్రిలోక సంచారి నారదుడు నందలూరు గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయలంలో స్వామి వారి మూలవిరాట్ను ప్రతిష్టించారని శాసనాలు ధృవీకరిస్తున్నాయి. శిల్పకళానైపుణ్యానికి ప్రతీక.. ఈ గుడి చోళుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా చెప్పవచ్చు.చోళరాజులు 11వ శతాబ్దంలో ఆలయం నిర్మించి స్వామికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు శాసనాల్లో ఉంది. చోళ, పాండ్య రాజులు 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు గాలిగోపురం కట్టించాడు. నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూరు, హస్తవరం గ్రామాలను దానంగా ఇచ్చినట్లు శాసనాల్లో ఉంది. కాగా నిరంత్ర అనే రాజు పూర్వం నిరంతపురం గ్రామాన్ని నిర్మించగా, గ్రామం బహుదానది వెల్లువలో కొట్టుకుపోయింది. తర్వాత నలంద అనే రాజు ఈ స్థలాన్ని సందర్శించి నందలూరు పేరుతో గ్రామాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. తాళ్లపాక అన్నమాచార్యులు వేంకటే శ్వరునిపై పలు శృంగార కీర్తనలు ఈ ఆలయంలో కూర్చొని రచించినట్లు ఆధారాలున్నాయి. ● ఎటువంటి దీపం లేకున్నా.. కోర్కెలు తీర్చే దేవుడు గర్భగుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరతాయనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. కోర్కెలుతీరాక గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. సంతానం కలగని వారు స్వామిని ప్రార్థిస్తే కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. 5 నుంచి సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు 11న కల్యాణోత్సవం 12న రోథోత్సవం భారీఎత్తున తరలిరానున్న భక్తులు సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూలవిరాట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయాన్ని నిర్మించడం ఒక అద్భుతం.గర్భగుడి ప్రధాన ద్వారానికి వందగజాల దూరం నుంచి కూడా స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఏడాదిలో ఏదో ఒకరోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు నిర్మించారు. స్వామి వారి మూలవిరాట్ను గమనిస్తే తిరుమలలోని శ్రీనివాసుడు కటి హస్తంతో తన పాదాలను శరణు కోరండి పునీతులు కండి అని ప్రబోధిస్తుంటే నందలూరులోని శ్రీ సౌమ్యనాథుడు తనను నమ్మి శరణు వేడితే కోరిన కోర్కెలు తీరుస్తానంటూ అభయ హస్తంతో ప్రశాంత స్వరూపుడై దర్శనమిస్తాడు.ఆలయం లోపల విశాలమైన యాగశాల, యోగ నరసింహస్వామి, గణపతి, ఆంజనేయస్వామిలకు చెందిన చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద కోనేరు ఉన్నది. స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ శ్రీవారి తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా దీనిని నిర్మించారు.ఆలయ కుడ్యాల పైభాగాన మత్స్య ఆకారం కనిపిస్తుంది. బహుదానది వరదల వల్ల ఆలయంలో ఉన్న మత్స్యం ప్రాణంతో నీటిలో కలిసిపోతుందని భక్తుల నమ్మకం. -
పారిశుధ్య పనులపై దృష్టి సారించాలి: కలెక్టర్
సంబేపల్లె: మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె పంచాయతీలో గురువారం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారించాలని పంచాయతీ అధికారులు, పారిశుధ్య సిబ్బందికి సూచించారు. నారాయణరెడ్డిపల్లె గ్రామంలో ఎన్ని నివాసాలు ఉన్నాయి, రోజుకు ఎంత చెత్త వస్తుంది అనే విషయంపై ఆరాతీశారు.అనంతరం పొన్నేళ్ళవాండ్లపల్లెలో ప్రజలతో కలెక్టర్ ముఖా ముఖి నిర్వహించారు. చెత్త సేకరణకార్యక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీఓ రాధమ్మ, ఎంపీడీఓ రామచంద్ర ,పంచాయతీ కార్యదర్శి రవీంద్ర తదితరలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కార్డు రోగులకు ఉచిత వైద్యం అందివ్వాలి రాయచోటి: ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కార్డు ఉన్న రోగుల దగ్గర నుంచి ఆసుపత్రుల యాజమాన్యం ఎటువంటి నగదు తీసుకోకుండా ఉచిత వైద్యం అందివ్వాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రొటోకాల్ను ట్రస్టుతో ఎంప్యానల్ అయిన ఆసుపత్రులన్నీ పక్కాగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన ఆరోగ్యశ్రీ క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్యశ్రీ సమన్వయకర్త లోకవర్ధన్ జిల్లాలోని వివిధ ఆసుపత్రుల యాజమాన్యం పైన వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్కు వివరించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా అమరావతి హాస్పిటల్స్ యాజమాన్యం రూ.2500 తీసుకున్నారని, బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో రూ.16 వేలు, దేశాయ్ హాస్పిటల్స్లో తీసుకున్న నగదు తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టుతో ఎంప్యానల్ అయిన ఆసుపత్రులన్నీ ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ పథకంలో ఆసుపత్రుల యాజమాన్యం రక్తపరీక్ష, సీటీ స్కాన్ తదితర సేవలకు ఎటువంటి నగదును తీసుకోరాదన్నారు. కీళ్ల సమస్యల గురించి వచ్చే వారిని తప్పుదారి పట్టించరాదన్నారు. రోగులను మానవతా దృక్పథంతో చూడాలన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో జిల్లాలోని వివిధ రోగుల దగ్గర నుంచి అందిన ఫిర్యాదుపలై సమీక్షిస్తూ ఆసుపత్రుల యాజమాన్యం తీసుకున్న నగదును తిరిగి రోగులకు ఇచ్చేశారా లేదా అని అడగ్గా ఇచ్చేశామని సమాధానం ఇచ్చారు. అనంతరం ఆసుపత్రుల యాజమాన్యం తీసుకున్న నగదులో 50 శాతం జరిమానా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త లోకవర్ధన్, జిల్లాలోని వివిధ ఆసుపత్రుల నిర్వాహకులు, ఫిర్యాదుదారులు తదితరులు పాల్గొన్నారు. విజన్ ప్రణాళికల రూపకల్పనకు కృషి చేయాలి జిల్లా, నియోజకవర్గ విజన్ ప్రణాళికల రూపకల్పనకు కమిటీలతో పటిష్టమైన సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.వీసీలో కలెక్టర్ శ్రీధర్, జేసీ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్రావు పాల్గొన్నారు. -
ప్రొటెక్షన్ వాచర్పై ఎలుగుబంటి దాడి
ఒంటిమిట్ట: మండల పరిధిలోని చింతరాజుపల్లి అటవీ ప్రాంతంలో గురువారం అటవీశాఖ ప్రొటెక్షన్ వాచర్ బొడ్డే వెంకటయ్య (48)పై ఎలుగుబంటి దాడి చేసింది. చింతరాజుపల్లి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆపీసర్ నాగు నాయక్ కథనం మేరకు దాసర్లదొడ్డి వద్ద బేస్ క్యాంపు నిర్వహిస్తున్న ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లలో ఒకరైన బొడ్డే వెంకటయ్యపై రెండుపిల్లలను ప్రసవించిన ఎలుగుబండి దాడి చేసింది. అక్కడే ఉన్న బీట్ ఆఫీసర్ సుబ్రమణ్యంతో కలిసి మిగిలిన ప్రొటెక్షన్ వాచర్లు ముగ్గురు ఎలుగుబంటిని చెదరగొట్టారు. ఈ దాడిలో వెంకటయ్య కుడి మోకాలుకు తీవ్రగాయాలయ్యాయి. ఎఫ్బీఓ సుబ్రమణ్యం ఒంటిమిట్ట అటవీశాఖ కార్యాలయానికి సమాచారం అందించగా అటవీశాఖ వాహనంలో వెంకటయ్యను ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం వెంకటయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగు నాయక్ తెలిపారు. మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి కడప సెవెన్రోడ్స్(వైఎస్సార్ జిల్లా) : జిల్లాలోని మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సూచించారు. గురువారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో మహిళా సర్పంచులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. తొలుత మహత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ మహిళా సర్పంచులు పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలు చైతన్యవంతులు అయితేనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని తెలిపారు. రేపు జాతీయ లోక్ అదాలత్ కడప అర్బన్: జాతీ య న్యాయసేవాధికారసంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాధికారసంస్థ కడప ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం 08562 258622, 244622 నంబర్లో సంప్రదించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ సి యామిని, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ గురువారం తెలిపారు. -
ఆ ఇద్దరూ కరుడుగట్టిన ఉగ్రవాదులు
సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కొత్తపల్లెలో పోలీసులు అరెస్టు చేసిన అబూబకర్ సిద్దిఖ్ అలియాస్ అమానుల్లా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్లు కరుడుగట్టిన ఉగ్రవాదులని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. తమిళనాడుకు చెందిన వీరు టెక్నికల్గా నిపుణులని, పక్కాగా పథకం వేసి బాంబు పేలుళ్లకు పాల్పడడంలో సిద్ధహస్తులని పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిని జూన్ 30న తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.రాయచోటి పోలీసు పరేడ్ మైదానం వద్ద గురువారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో డీఐజీ కోయ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే...‘‘అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 20 ఏళ్లుగా రాయచోటిలో ఉంటున్నారు. తప్పుడు పేర్లతో గుర్తింపు కార్డులు పొందారు. అబూ బకర్ సిద్దిఖ్ తమిళనాడు నాగూరు, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మధురై తిరుమంగళం, వేలూరులో జరిగిన పలు ఘటనల్లో నిందితుడు. సామూహిక దాడులు, పేలుళ్లు, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడంపై అతడి మీద కేసులు నమోదయ్యాయి.⇒ మహమ్మద్ అలీపై చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్లో, పోలీసు కార్యాలయం వద్ద బాంబు పెట్టడంపై కేసులు నమోదయ్యాయి. ఈ చర్యకు పాల్పడిన రోజే.. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చిలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 1999లో కొచ్చి–కుర్లా ఎక్స్ప్రెస్లో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.⇒ 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లలో అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ ప్రమేయం ఉంది. అప్పుడు రాయచోటి నుంచే కార్యకలాపాలు సాగించారు. స్థానికంగా పేద కుటుంబాల మహిళలను వివాహమాడి చిరు వ్యాపారాలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పోలీసులు తమిళనాడు పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టి.. భారీ కుట్రను భగ్నం చేశాయి.అల్ ఉమ్మా సంస్థతో అనుబంధంఉగ్ర సంస్థ అల్ ఉమ్మాతో అబూబకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీకి అనుబంధం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఉగ్ర సంస్థ. ఐసిస్ తరహా భావజాలం కలిగినది. నిందితులు గతంలో విదేశాలకు వెళ్లి వచ్చారు. వీరి వద్ద దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్క్ల మ్యాప్లు దొరికాయి.రాయచోటి నుంచే పలు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు? ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు జరిపారు? సహాయ సహకారాలు అందించినవారెవరు? ప్రతి విషయం క్షుణ్ణంగా విచారిస్తున్నాం. పేలుడు సామగ్రి ఎలా వచ్చింది? బంధువులు, స్నేహితులు, ఇతర సంబంధాలు అన్ని అంశాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం. స్థానికంగా శిక్షణ ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు. అబూబకర్, మహమ్మద్ అలీలను తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారు. ఈ కేసుపై నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి.సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు..ఉగ్రవాదులు ఉంటున్న ఇళ్లను తనిఖీ చేయగా సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు, భారీఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తువులు లభించాయి. వీటితో కర్ణాటకలోని మల్లేశ్వరం లాంటి 30 బాంబు పేలుళ్లకు పాల్పడవచ్చు. దాదాపు 50 ఐఈడీలు తయారు చేయగల సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం.పోలీసులను అడ్డుకున్న నిందితుల భార్యలు సోదాలకు వెళ్లినప్పుడు అబూబకర్ భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీమ్లు మహిళా పోలీసులపై దాడికి యత్నించారు. పేలుడు పదార్థాల గురించి వీరికి తెలుసా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. మహిళలు ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. కోర్టు రిమాండ్ విధించడంతో కడప కేంద్ర కారాగారానికి తరలించాం.⇒ ఉగ్రవాదుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలతో పాటు నాలుగు సూట్కేస్ బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. భయం.. భయం..రాయచోటిలో ఉగ్రజాడ తెలిసినప్పటి నుంచి అందరిలో భయం నెలకొంది. ఉగ్రవాదులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా చిన్న సమాచారం కూడా వెలుగులోకి రాకపోవడాన్ని పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు, తమిళనాడు పోలీసుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. ఎస్పీ విద్యాసాగర్నాయుడు, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులను టీమ్లుగా విభజించారు. ఉగ్రవాదుల ఇంటి చుట్టుపక్కల వారిని ఇప్పటికే విచారించిన పోలీసులు.. బంధువులు, స్నేహితులపై దృష్టిసారించారు. రోజూ డీఎస్పీ కార్యాలయానికి పలువురిని తీసుకొచ్చి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలు, సెల్ఫోన్ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. -
రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్కేసు బాంబులను ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. -
బతకాలనే ఆశ ఉంది.. అధిక వడ్డీలు చెల్లించలేక చనిపోతున్నా!
మదనపల్లె రూరల్ : ‘సమాజంలో గౌరవంగా బతకాలని చాలా కోరికగా ఉంది. అప్పుల వాళ్లు ప్రాణం తీసేస్తున్నారు. గంట గంటకు టెన్షన్. నిద్రపోయి చాలా రోజులైంది. ఆరోగ్యం బాగోలేదు. దేనికీ పనికి రాకుండా అయిపోయాను. వడ్డీలకు వడ్డీలు, అధిక వడ్డీలు కట్టలేకపోతున్నాను. అందరి దగ్గర నీచమైన మాటలు అనిపించుకుంటున్నాను. విధిలేని పరిస్థితుల్లో చచ్చిపోతున్నా’... భార్య, బిడ్డ నన్ను క్షమించండంటూ రియల్టర్ రాజేంద్రబాబు చివరిగా సెల్ఫోన్లో సెల్ఫీ సూసైడ్ వీడియో తీసుకుని తనువు చాలించాడు. మదనపల్లెలో కొద్దిరోజుల క్రితం వెలుగుచూసిన కాల్మనీ వ్యవహారం సద్దుమణగక ముందే పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్పులబాధ తాళలేక, అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం కలిగించింది. పట్టణంలోని అమ్మినేనివీధికి చెందిన బొజ్జ రాజేంద్ర(55) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి అమ్మినేనివీధి, కృష్ణానగర్లో రెండు సొంత ఇళ్లు ఉన్నాయి. కృష్ణానగర్లోని ఇంటి కింది భాగంలో రెండు వార్డు సచివాలయాలకు అద్దెకు ఇచ్చి, పై భాగంలోని ఇంటిలో రియల్ ఎస్టేట్ ఆఫీసు నిర్వహిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా పట్టణానికి చెందిన పలువురి వద్ద అప్పులు తీసుకున్నాడు. ఇటీవల కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవడం, వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించడంతో అప్పుల వాళ్లకు చెల్లింపులు చేయలేకపోయాడు. పరువు, ప్రతిష్టలు కాపాడుకునేందుకు వడ్డీలు చెల్లించేందుకు అధిక వడ్డీకి కొత్త అప్పులు తీసుకోవడం, వాటికి వడ్డీలు చెల్లించలేక, ఇచ్చిన వారు ఇంటివద్దకు వచ్చి నిలదీస్తుంటే తట్టుకోలేకపోయాడు. బజారులో అందరి ముందు తక్కువచేసి మాట్లాడటం, తన గురించి చెడు ప్రచారం చేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. గతంలోనూ ఆత్మహత్యకు ప్రయత్నించి, చివరి నిమిషంలో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ, ఇటీవల అప్పుల వాళ్ల వేధింపులు అధికమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం కృష్ణానగర్లోని కార్యాలయంలో సెల్ఫీ సూసైడ్ వీడియో తీసుకున్న తర్వాత రూములోని ఫ్యాన్ కొక్కీకి తాడు తగిలించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ పోలీసులు ఘట నాస్థలానికి చేరుకుని, మృతుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బొజ్జా రాజేంద్రకు భార్య లత, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె రిషిత ఉన్నారు. అధికమవుతున్న వడ్డీ వ్యాపారుల వేధింపులు.. పట్టణంలో మధ్యతరగతి, బడుగు, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తులు అధికంగా ఉన్నారు. వీరి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకున్న వడ్డీ వ్యాపారులు, డైలీ, వీక్లీ, మంత్లీ పద్ధతుల్లో 100 కి రూ.10 నుంచి 45 వరకు వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. చివరకు మహిళలను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసే స్థితికి వచ్చారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై బాధిత మహిళల ఆవేదనను...అప్పు తీర్చేందుకు వ్యభిచారం చేయమంటున్నారంటూ మీడియా వెలుగులోకి తెచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సెల్ఫీ సూసైడ్ వీడియోలో రియల్టర్ రాజేంద్ర అప్పుల భారం అధికమై ఆత్మహత్య మదనపల్లెలో అధికమవుతున్న కాల్ విష నాగులు -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వీరబల్లి : మండలంలోని వంగిమళ్ల పంచాయతీ పర్వతయ్యగారిపల్లికి చెందిన పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి (70) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం సుబ్బారెడ్డి ఊరిబయట రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంత మామిడి తోటలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు తోట వద్దకు వెళ్లి చూడగా మోటార్ స్టార్టర్ వద్ద రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నాడు. వారు మృతదేహ్నాని ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి, రూరల్ సీఐ వరప్రసాద్లు తమ సిబ్బందితో వెళ్లి సుబ్బారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. పలు అనుమానాలు వ్యక్తం కావడంతో సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులను విచారించారు. విద్యుత్ తీగలు తగులుకొని మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తల, కాళ్లకు గాయాలు ఉండటంతో స్థానికులు కొందరు సుబ్బారెడ్డి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో రూరల్ సీఐ వరప్రసాద్ సిబ్బందితో మామిడి తోటలోకి వెళ్లి పరిశీలించారు. సుబ్బారెడ్డి దుస్తులు, పాదరక్షలకు ఉన్న రక్తపు మరకలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
8 తులాల బంగారం, రూ.30 వేలు చోరీ
సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామంలో రోడ్డు నంబర్ 10వ వీధిలో గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి ఓ ఇంటిలో 8 తులాల బంగారు, రూ. 30 వేల నగదును చోరీ చేశారు. బాధితుడు మోదుగుల నరసింహులు వివరాల మేరకు.. మాధవరం–1 గ్రామంలో ఉన్న తన తండ్రి నరసింహులు(68) ఆదివారం ఉదయం మృతి చెందాడన్నారు. తన తండ్రి మృతదేహాన్ని తన భార్య లక్ష్మిప్రసన్న పొత్తప్పి గ్రామానికి తీసుకెళ్లిందన్నారు. తండ్రి మరణ వార్త తెలుసుకుని తాను కువైట్ నుంచి సోమవారం పొత్తపికి వచ్చానన్నారు. అంత్యక్రియల అనంతరం బుధవారం మాధవరం–1 గ్రామానికి వచ్చామన్నారు. తమ ఇంటి తాళాలు పగులగొట్టి, లోపల ఉన్న బీరువాను తెరిచి దుస్తులను చిందర వందరగా పడేసి ఉండటాన్ని గమనించామన్నారు. ఇంట్లో ఉన్న 8 తులాల బంగారు, రూ. 30వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ను అపహరించుకొని వెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎస్ఐ మహమ్మద్రఫీ, ఏఎస్ఐ సుబ్బరామచంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కడప నుంచి క్లూస్టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ షాక్తో కార్మికుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : విద్యుత్ పోల్ మరమ్మతులకు వెళ్లిన కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా మారిన సంఘటన బుధవారం పట్టణంలో జరిగింది. బుధవారం ఉదయం ఎన్టీఆర్ సర్కిల్లోని విద్యుత్ పోల్ను టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో స్తంభం పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో మరమ్మతుల నిమిత్తం విద్యుత్శాఖ అధికారులు, కాంట్రాక్టర్ రిటైర్డ్ విద్యుత్శాఖ ఏడీ నరసింహకు బాధ్యతలు అప్పగించారు. ఆయన తన వద్ద పనిచేసే నిమ్మనపల్లె మండలం తవళం పంచాయతీ ఉంటావారిపల్లెకు చెందిన రామప్ప కుమారుడు వెంకటరమణ(35)కు పనులు పురమాయించారు. దీంతో వెంకటరమణ విద్యుత్ పోల్ మరమ్మతుల కోసం పైకి ఎక్కి పనిచేస్తుండగా, ఆపైన ఉన్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలి షాక్కు గురయ్యాడు. కింద పడే క్రమంలో మధ్యలో ఉన్న వైర్లపై పడి వేలాడుతూ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న విద్యుత్ సిబ్బంది, సరఫరా నిలిపివేసి, స్థానికుల సహాయంతో గాయపడిన వ్యక్తిని కిందకు దించి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అయితే, ఈ ఘటనలో విద్యుత్శాఖ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పోల్ మరమ్మతులు చేసే సమయంలో విద్యుత్ సరఫరా లేకుండా చూడటంతో పాటు లైన్మెన్ పర్యవేక్షణలో చేయాల్సిన పనులను ఎవరూ లేకుండా నిర్వహించడంపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్కు గురై తీవ్రగాయాలతో పడి ఉన్న బాధితుడిని కిందకు దించి ప్రభుత్వ ఆస్పత్రికి పంపి చేతులు దులుపుకున్నారన్నారు. బాధితుడి పరిస్థితిపై చలించిన బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్, సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్కు ఫోన్ చేస్తే సమాధానం రాలేదు. -
మహిళ ఆత్మహత్య
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం కుమ్మరపల్లి పంచాయతీ మన్నేరువాండ్లపల్లెకు చెందిన మన్నేరు లత(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. మన్నేరువాండ్లపల్లెకు చెందిన వితంతువు మన్నేరు లతను అదే గ్రామానికి చెందిన ఏనుగుల శివ అనే వ్యక్తి గత కొంతకాలంగా తనను ప్రేమించాలని లేకపోతే తాను చనిపోతానని వేధిస్తున్నాడు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన యువకుడి మృతి కలికిరి : వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయనపల్లి సమీపం టోల్గేటు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు వినేష్(27) తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎల్లయ్య కుమారుడు వినేష్ ప్రమాదంలో మృతి చెందడంతో పలువురు ప్రముఖులు సర్పంచ్ను పరామర్శించారు. మృతదేహాన్ని బుధవారం సాయంత్రం స్వగ్రామం అంకెంవారిపల్లికి తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మృతునికి భార్య, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కంట తడిపెట్టించాయి. మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం – ములకలచెరువు వాసి మృతి ములకలచెరువు : మహారాష్ట్రలోని పూణే సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు వాసి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ములకలచెరువు వినాయక్ నగర్లో ఉంటున్న పి.రమణకు నర్సరీ ఎరువుల ఫ్యాక్టరీ ఉంది. దీంతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వెజిటెబుల్ నర్సరీలు ఉన్నాయి. నర్సరీ పనుల మీద పి.రమణ తన సొంత బొలేరో వాహనంలో ఒంటరిగా మంగళవారం మహారాష్ట్రలోని గురిహత్నుర్ వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో పి.రమణ(45) తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు సమచారం అందించి, పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బుధవారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ములకలచెరువు పోలీసులు వెల్లడించారు. గండి టెండర్లు .. కొన్నింటికే ఆమోదం చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి బుధవారం నిర్వహించిన టెండర్లలో అదికారులు కొన్నింటిని మాత్రం ఆమోదించి మరి కొన్నింటిని తిరస్కరించారు. ఉత్సవాలకు సంబంధించి ఫోటో, వీడియో కవరేజి, ప్రత్యేక భజంత్రీలు, స్వాగత ఆర్చీలకు సంబంధించిన టెండర్లకు ఆమోదం తెలిపినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ప్రత్యేక పూల అలంకరణ, విద్యుద్దీపాలంకరణకు సంబంధించి ఎవరూ టెండర్లలో పాల్గొన లేదని ఆయన తెలిపారు. పందిళ్లు, బారికేడ్లకు సంబంధించి ఇద్దరు మాత్రమే వచ్చి ఒకే ధరను కోట్ చేయడంతో వాటిని తిరస్కరించామన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ సూపరింటెండెంట్ రమణమ్మ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
సంబేపల్లె : చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై మోటకట్ల శివాలయం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. మండల పరిధిలోని వంగమళ్లవాండ్లపల్లెకు చెందిన క్రిష్ణారెడ్డి, భార్య నాగులమ్మలు స్కూటీలో మోటకట్ల సమీంలోని కుండల షాపు వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మోటకట్ల శివాలయం సమీపంలోకి రాగానే సంబేపల్లె వైపు నుంచి బైకుపై వస్తున్న భాస్కర్రెడ్డి అదుపు తప్పి భార్యాభర్తలు వెళుతున్న స్కూటీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు భాస్కర్రెడ్డికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు కలికిరి(వాల్మీకిపురం) : రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే రాజకీయ ఒత్తిళ్లతో అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన సంఘమిత్రలు నల్లంకి సుమలత(వి.ఒ.–6), నల్లంకి రేఖ(వి.ఒ–1) లను డీఆర్డీఎ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులుగానీ, సమాచారం ఇవ్వకుండా విధులనుంచి తొలగించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వీరి వినతిని పరిశీలించిన హైకోర్టు తొలగించిన సంఘమిత్రలను విధుల్లోకి తీసుకోవాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా డీఆర్డీఏ అధికారులు హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ తొలగించిన సంఘ మిత్రలను విధుల్లోకి తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. తమకు న్యాయం జరగక పోవడంతో బాధిత సంఘమిత్రలు తిరిగి కోర్టు ధిక్కారంపై హైకోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. లైసెన్స్ ఉన్న షాపుల వద్దే మద్యం కొనుగోలు చేయాలి రాయచోటి టౌన్ : లైసెన్స్ పొందిన రిటైల్ మద్యం షాపు వద్ద మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ రాయచోటి సీఐ గురుప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వివాహాలు, పార్టీలు, ఇతర వేడుకలకు తాము మద్యం తగ్గింపు ధరలకే సరఫరా చేస్తామని మోసం చేసే వారున్నారన్నారు. అలాంటి వారు నకిలీ మద్యం విక్రయిస్తారన్నారు. అలాంటి మద్యం సేవించడం వలన ఆరోగ్యాలు పాడవడంతో పాటు కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతారని చెప్పారు. అలాంటి అనుమానిత వ్యక్తుల వివరాలను టోల్ ఫ్రీ నంబర్ 14405కు కానీ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి నంబర్ 7981216391 కు ఫోన్ తెలియజేయాలని కోరారు. -
పీఎం సూర్యఘర్ యోజనను సద్వినియోగం చేసుకోండి
రాయచోటి : ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ జానకీ రామ్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటిలోని సాయి శుభ కళ్యాణ మండపంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాయచోటి డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు, ఉద్యోగులు, కార్మికులతో ముఖాముఖి నిర్వహించి సెక్షన్ల వారిగా పథకంపై సమీక్ష చేపట్టారు. మండల అధికారులకు ఆ సెక్షన్లో పనిచేసే సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. సూర్యఘర్ యోజనకు సంబంధించిన కాంట్రాక్టర్లతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.78వేలు సబ్సిడీ ఇస్తుందన్నారు. ఈ పథకం కింద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వలన కరెంటు బిల్లును ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి మేలు చేయవచ్చన్నారు. ఒకసారి పెట్టుబడి పెట్టి సోలార్ ప్యానల్ అమర్చుకోవడం ద్వారా 25 సంవత్సరాలపాటు సున్నా కరెంటు బిల్లుతో సంతోషంగా జీవించవచ్చన్నారు. ఈ పథకానికి బ్యాంకు ఏడుశాతం వడ్డీతో 90 శాతం రుణం ఇస్తుందన్నారు. సోలార్ ప్లాంట్ అమర్చేవారికి ఒక కిలోవాట్స్ రూ.30వేలు, రెండు కిలో వాట్స్ను రూ.60వేలు, మూడు కిలో వాట్స్కు రూ. 78 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. సోలార్ ప్లాంట్ అమర్చుకునే బీసీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 20 వేలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.చంద్రశేఖర్ రెడ్డి, విద్యుత్ శాఖ రాయచోటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చాంద్బాషా, విజయ్ కుమార్ రెడ్డి, నాగమునిస్వామి, అధికారులు, సిబ్బంది, వినియోగదారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
లక్ష్యాలను సాధించేలా పనిచేయాలి
రాయచోటి: రాయచోటి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వర్ణాంధ్ర–2047 విజన్ అమలులో భాగంగా రాయచోటి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, రాయచోటి ఆర్డీఓ, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్–2047 తీసుకొస్తే దానికి అనుబంధంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర–2047 విజన్ రూపకల్పనకు నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాసులు, నియోజకవర్గ మండలాల తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి -
నేడు ప్రైవేటు పాఠశాలలు మూత
రాజంపేట రూరల్: ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యంపై ఫీల్డ్ అధికారులు పంపిస్తున్న సందేశాలు, హెచ్చరికలు వంటి చర్యలకు ప్రతిస్పందనగా గురువారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలను మూసివేయనున్నట్లు అపుస్మా జిల్లా కార్యదర్శి రాఘవరెడ్డి వేంకటేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల పై ఫీల్డ్ అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వహణకు ఏదైనా అంతరాయం ఏర్పడితే అది 10 వేల మంది యాజమాన్యాలను ప్రభావితం చేస్తుందన్నారు. అదే విధంగా 3లక్షల మంది సిబ్బందిని, 40 లక్షల మంది విద్యార్థులను కూడా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే వారే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. తాళ్లపాక చెన్నకేశవస్వామికి గరుడ వాహనం రాజంపేట: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామికి సర్పంచ్ శ్యామనబోయిన గౌరీశంకర్, నాగమణి దంపతులు గరుడ వాహనంను అందచేశారు. బుధవారం అన్నమయ్య ధ్యానమందిరం ఆవరణలో ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీకి గరుడ వాహనం తయారుచేయించి అప్పగించారు. ఈ సందర్భంగా తాళ్లపాక సర్పంచ్ మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవస్వామిని తాళ్లపాక అన్నమాచార్యులు పూజించి, ఆరాధించారన్నా రు. అటువంటి స్వామికి తాము గరుడ వాహనం చేయించి ఇవ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, టీటీడీ సిబ్బంది, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన గాలివీడు: కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కోసం ఆర్డీఓ శ్రీనివాసులు స్థలాన్ని పరిశీలించారు. బుధవారం మండలంలోని తూముకుంట గ్రామంలో తహసీల్దార్ భాగ్యలతతో కలసి అనువైన స్థలం కోసం ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిలయన్స్ సంస్థ సహకారంతో 100 ఎకరాల్లో బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటులో భాగంగా స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. సేంద్రియ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ వంటి వ్యర్థాలతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ భవానీ శంకర్, మండల సర్వేయర్ మురళీ, హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళారులను నమ్మి విత్తనాలు కొనుగోలు చేయవద్దు ఒంటిమిట్ట: వరి సాగు చేసేందుకు దళారులను నమ్మి వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయరాదని, అలా చేస్తే ప్రభుత్వం రైతులకు జవాబుదారితనంగా ఉండదని కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్ర నాయక్ తెలియజేశారు. బుధవారం మండలంలోని చెర్లోపల్లి, నడింపల్లి గ్రామ పొలాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వరినాటు వేసే ప్రతి రైతు నారు కొనలు తుంచి నాటాలని, దీనివలన కాండం తొలుచు పురుగు ఉధృతిని తగ్గించవచ్చని, అలాగే పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము వేసి దుక్కిలో కలియదున్నడం వలన మొక్కలకు పోషకాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, వీఏఏ చంద్రమోహన్, వీహెచ్ఏ ప్రియదర్శిని, ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంటు
రాజంపేట : అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలకు భారతి సిమెంటు పటిష్టమైనదని భారతి సిమెంటు టెక్నికల్ ఇంజినీర్ ఎస్. శ్రీకాంత్రెడ్డి, మార్కెటింగ్ అధికారి రమణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్ సమీపంలోని మేసీ్త్రలకు సిమెంటు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారతి సిమెంటు ప్రతినిధులు మాట్లాడుతూ భారతి సిమెంటు రోబోటెక్ టెక్నాలజీతో తయారవుతుందన్నారు. ఇతర కంపెనీల సిమెంటు ఐదు గంటల్లో సెట్ అయితే, భారతి ఆల్ట్రా ఫాస్టు రెండు గంటల్లోనే సెట్ అవుతుందన్నారు. అనంతరం 50 మంది మేసీ్త్రలకు లక్ష రూపాయల ఉచిత బీమా బాండ్, బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంటు డీలర్ రవి, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
రాయచోటిలో అలజడి
రాయచోటి: ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం. ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది. పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆధారాలు లభ్యం: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇరువురి అరెస్టు అనంతరం వారి గృహాల్లో పోలీసులు మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు అణవణువునూ శోధించారు. కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ రెండు గృహాలను సీజ్ చేశారు. వివాహాలపై.. ఒకవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తూనే మరోవైపు ఎవరికి అనుమానం రానివ్వకుండా ఇద్దరు ఉగ్రవాదులు సంసార సాగరంలో కొనసాగారు. అబూబకర్ గాలివీడు మండల పరిధిలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె జన్మించి అనారోగ్యంతో మృతిచెందింది. మహమ్మద్అలీ పట్టణంలోని బిరాంసాహెబ్వీధికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి వివాహానికి, ఇతర కార్యకలాపాలకు సహకరించిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే తీవ్రవాదుల భార్యలను, వారి బంధువులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. వీరితో పాటు వీరికి అన్ని రంగాలలో సహకరిస్తున్న మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిఘా నీడలో రాయచోటి.. దేశంలోనే వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేయడంతో జిల్లా ఎస్పీ రాయచోటిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. పట్టణంలోకి ప్రవేశిస్తున్న వాహనాలతో పాటు, వివిధ అంశాలపై నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు భారీగా పేలుడు పదార్థాల సామగ్రి, సాంకేతిక పరికరాలు, ఉగ్రవాదుల సమాచారం లభ్యం ఉగ్రవాదుల గృహాలను సీజ్ చేసిన పోలీసులు ఎస్పీ అదుపులో ఉగ్రవాదుల కుటుంబసభ్యులు -
9 నుంచి అంగన్వాడీల సమ్మె బాట
రాయచోటి టౌన్ : ఈనెల 9వ తేదీ నుంచి అంగన్వాడీలు సార్వత్రిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ అనుబంధం) జిల్లా కార్యదర్శి నాగేశ్వరి జిల్లా సీ్త్ర శిశు సంక్షేమశాఖ సూపరింటెండెంట్ లక్ష్మిదేవికి నోటీసులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా కనీస వేతనాలు, ఈఎస్ఐ, పెన్షన్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు లేకుండానే అంగన్వాడీలు పని చేస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు యాప్ల పేరుతో పని భారం పెంచుతున్నారన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణుక, శశికళ, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. -
లైనింగ్ పనుల్లో ఉల్లంఘనలు?
● నివేదికపై అధికారుల్లో గుబులు గత టీడీపీ ప్రభుత్వంలో కుప్పం ఉపకాలువ, ఇతర ప్రాజెక్టు పనుల్లో ఇష్టారీతిన పనులు చేసిన కాంట్రాక్టు సంస్థలు అదనపు పని పేరుతో రూ.122 కోట్ల దోచుకున్నారు. కొద్దిపాటి పనులకు కోట్లలో అంచనాలు పెంచుకుని యధేచ్ఛగా దోపిడీపర్వం సాగించారు. ఈ పరిస్థితులను మళ్లీ పునరావృత్తం చేసి షార్ట్ క్రీటింగ్ పని పెరిగిందని, ఒప్పందం కంటే అధిక వ్యయభారం, పనులకు ఆటంకాలు అన్న కారణాలను చూపి ఒప్పంద వ్యయాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఈ శేషుబాబు ఇచ్చే నివేదికలో పొందుబరిచే అంశాలపై అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. లైనింగ్ పనుల్లో ఉల్లంఘనలు నిజమేనని తేలిన కారణంగా వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తారని భావిస్తున్నప్పటికి అధికారులను కాపాడేందుకు నివేదికను మార్చడం లేదా తొక్కిపెట్టే ప్రయత్నాలు జరగవచ్చని అంటున్నారు. మదనపల్లె: హంద్రీ – నీవా ప్రాజెక్టులో భాగమైన జిల్లాలోని పుంగనూరు ఉపకాలువ (పీబీసీ), చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉపకాలువ (కేబీసీ)లో చేపట్టిన లైనింగ్ పనుల నాణ్యత, నిబంధనల ఉల్లంఘనలపై ఈస్ట్కోస్ట్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ శేషుబాబు మూడు రోజుల పర్యటన బుధవారం సాయంత్రం ముగిసింది. రూ.169 కోట్లతో కేబీసీ, రూ.366 కోట్లతో పీబీసీలో లైనింగ్, షార్ట్ క్రీటింగ్ పనులను కాంట్రాక్టు సంస్థలు చేపట్టాయి. కూటమి ప్రభుత్వంలో పనులెలా చేసినా తమను ప్రశ్నించే వారే లేరన్న ధీమాతో ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంపై క్వాలిటీ కంట్రోల్ సీఈ సోమవారం జిల్లాలోని పీబీసీలో జరిగిన పనులపై మొదలు పెట్టిన పరిశీలన..మంగళవారం కేబీసీ రీచ్–1లో, బుధవారం కేబీసీ రీచ్– 2లో జరిగిన లైనింగ్, షార్ట్ క్రీటింగ్ పనులను పరి శీలించి తనిఖీలు చేశారు. దీనిపై ఆయన స్వయంగా చేసుకున్న పరిశీలన సందర్భంగా ప్రాజెక్టు అధికారుల వద్ద, పరిశీలన సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా పరిశీలన పూర్తి చేయడంపై ప్రాజెక్టు అధికారుల్లో గుబులు రేపుతోంది. ఇంతకీ సీఈ ఏం పరిశీలనలో కనిపించిన అంశాలపై స్థానిక అధికారులతో చర్చించలేదని తెలిసింది. ఆయన మాటల్లో కొన్ని అంశాలపై చేసిన సూచనలే పెద్ద ఉల్లంఘనలుగా భావిస్తున్నారు. మట్టికి షార్ట్ క్రీటింగ్ ఎందుకు? లైనింగ్ పనుల్లో మట్టికాలువపై చేసే లైనింగ్ పనికి చెల్లించే సొమ్ము కంటే షార్ట్ క్రీటింగ్కు చెల్లించే ధర ఎక్కువ. దీన్ని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టు సంస్థలు మట్టి కాలువపైనా షార్ట్ క్రీటింగ్ చేయడాన్ని గుర్తించి ఈ అంశాన్ని లెవనెత్తి అధికారులను ప్రశ్నించారని అధికార వర్గాలు చెప్పాయి. మట్టికాలువకు షార్ట్ క్రీటింగ్ చేసి అధిక మొత్తంలో ధర పొందడమే కాకుండా ఒప్పందానికి మించి బిల్లు పొందవచ్చని కాంట్రాక్టు సంస్థలు ఈ ఎత్తుగడ వేశారని అంటున్నారు. దీన్ని సీఈ పసిగట్టడంతో ఇకపై ఎలా ముందుకు వెళ్తారన్న దానిపై చూడాల్సి ఉంది. ఈ పరిస్థితి పరిశీలించాక షార్ట్ క్రీటింగ్ పనులు అవసరమైన మేరకే చేయించడం, ఆపై అనవసరంగా వద్దు అని సూచన చేశారని తెలిసింది. రెండు కాలువల్లోనూ పరిశీలించిన అంశాలల్లో కాంట్రాక్టు సంస్థల ఉల్లంఘనలు ఉన్నట్టు తేలిందని సమాచారం. మట్టి కాలువపైనా షార్ట్ క్రీటింగ్పై ఆరా షార్ట్ క్రీటింగ్ అవసరమైన మేరకే చేయాలని సూచన పీబీసీ, కేబీసీలో పనులపై ముగిసినక్వాలిటీ కంట్రోల్ సీఈ విచారణ ఇచ్చే నివేదికలో ఏముంటుందోనని అధికారుల్లో టెన్షన్ -
వరకట్న వేధింపులపై కేసు నమోదు
ఒంటిమిట్ట : మండలంలోని కొత్తమాధవరం గ్రామం అంకాలమ్మ గుడి వద్ద నివాసం ఉంటున్న చొప్పా జానకీ ప్రసన్న (21)ను వరకట్నం కోసం వేధిస్తున్నారని బుధవారం ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. చొప్పా జానకీ ప్రసన్నకు ఏడు నెలల క్రితం చొప్పా సురేష్ అనే వ్యక్తితో ప్రేమ వివాహమైంది. వివాహం అయిన కొంతకాలం వరకు తన భర్త సురేష్ తనతో సఖ్యతగా ఉండేవాడని, కానీ మూడు నెలల నుంచి రూ. 5 లక్షలు కట్నం తీసుకురావాలని తన భర్త సురేష్, అత్త లక్షుమ్మ, మామ వెంకట సుబ్బయ్య, ఆడబిడ్డ మౌనిక వేధిస్తున్నారని తెలిపారు. ఈ వేధింపులు తాళలేక ఆమె నిద్రమాత్రలు మింగడంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని బుధవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కనగంటి విజయ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ ప్రదక్షిణ గావించి గర్భాలయంలో ఉన్న మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెంచిన వేతనాలు ఇవ్వాలి కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప రిమ్స్ మెడికల్ కళాశాలలో దినసరి వేతనం కింద పనిచేస్తున్న వారికి పెంచిన వేతనాలను ఇవ్వాలని జిల్లా కార్మికశాఖ అధికారి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్కిల్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికులుగా నిర్ణయించిన మేరకు వేతనాలను ఇవ్వాలని సూపర్వైజర్ ఎస్వీ సాయికృష్ణారెడ్డిని ఆదేశించారు. -
వీరభద్రస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
రాయచోటి టౌన్ : రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ప్రధాన ఆలయాలతోపాటు ఉప ఆలయాలకు భక్తులు 95 రోజుల పాటు సమర్పించిన నగదు, కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా రూ.19,55,945, నిత్యాన్నదానానికి రూ.1,12,888 వచ్చింది. అలాగే హుండీలలో బంగారం 53.600 గ్రాములు, వెండి 1.800 కిలోలు వచ్చినట్లు ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని రాయచోటి పట్టణంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా దేవదాయశాఖ అధికారి సి. విశ్వనాథ్ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. ఇద్దరు ఫీల్డ్అసిస్టెంట్ల సస్పెన్షన్ మదనపల్లె రూరల్ : ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. పట్టణంలోని వెలుగు మండల మహిళా సమాఖ్య కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులపై 19వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి డ్వామా పీడీ వెంకటరత్నం ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. సామాజిక తనిఖీ ప్రజావేదికలో హౌసింగ్కు సంబంధించి బిల్లులను లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు ఇచ్చినట్లు విచారణలో తేలడంతో.. కోళ్లబైలు వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ రెడ్డిశేఖర్, కొత్తవారిపల్లె ఫీల్డ్అసిస్టెంట్ కిరణ్కుమార్ను సస్పెండ్ చేశారు. అలాగే ఉపాధి వేతనాల చెల్లింపులు, మస్టర్ల హాజరు లెక్కింపులో తప్పిదాలు, పని ప్రదేశం తేడాలు వంటి తప్పిదాలపై మండలంలోని 25 పంచాయతీల్లో రూ.54 వేల రికవరీకి ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. రూ.18,500 వేల జరిమానా విధించారు. 61 పనులకు సంబంధించి ఏపీడీ ఆధ్వర్యంలో రీ ఎంక్వయిరీకి ఆదేశించారు. ఆర్థిక సమ్మిళితత్వంపై విస్తృత ప్రచారం రాయచోటి : జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సమ్మిళితత్వం కోసం విస్తృత ప్రచారం చేయాలని జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులను జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్థిక సమ్మిళితత్వంపై గోడపత్రికను ఆవిష్కరించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో జరగబోయే ప్రచార కార్యక్రమాలను ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక క్యాంపుల ద్వారా నిర్వహించాలని తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర పథకాలను ప్రజలందరికీ తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జలాశయాల్లో చేపల వేట నిషేధం కొండాపురం : జిల్లాలోని గండికోట జలాశయం, బ్రహ్మసాగర్, సోమశిల వెనుక జలాలలో చేపల వేట నిషేధించినట్లు ఉప మత్య్ససంచాలకులు నాగయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజంగా చేపల సంతానోత్పత్తి జూలై 1 నుంచి ఆగస్టు31 వ తేది వరకు ఉంటుందని.. ఈ 62 రోజులపాటు మత్య్సకారులు ఎవరు చేపలు పట్టకూడదని ఆయన హెచ్చరించారు. చేపల వేటకు పోతే ప్రభుత్వ నియమ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జలాశయాలల్లో వేటకు వెళ్లితే మత్స్యకారుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
పచ్చ పత్రిక కథనం బూటకం
పెద్దతిప్పసముద్రం : తంబళ్లపల్లిలో అదే తాలిబన్ల రాజ్యం అంటూ ఓ పచ్చ పత్రికలో ప్రచురితమైన వార్తపై బాధిత గ్రామస్తులు స్పందించారు. ఇదంతా బూటకపు కథనమని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మండలంలోని పులికల్లు పంచాయతీ చిన్న వెంకట్రమణగారిపల్లి (సీవీ పల్లి)కి చెందిన ముస్తాని చిన్నప్ప, ముస్తాని జయరాం కుటుంబీకులు మంగళవారం మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పల్లెలో కొంత మంది టీడీపీ నాయకులు తమ దాయాదుల నడుమ చిచ్చు పెడుతూ గొడవలకు ప్రేరేపిస్తున్నారన్నారు. 20 ఏళ్ల క్రితమే ప్రజల సౌకర్యం కోసం రోడ్డుకు స్థలాన్ని కేటాయించారన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి సిమెంటు రోడ్డు కూడా గతంలోనే వేయించారన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇదే గ్రామంలో ఉంటున్న ఓ టీడీపీ సానుభూతిపరుడు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు వేశాడన్నారు. అప్పట్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముళ్ల కంపలను తొలగించేసినా కూడా మళ్లీ అదే వ్యక్తి ప్రజల రాకపోకలకు అసౌకర్యాన్ని కల్పిస్తూ రోడ్డులో మూగజీవాలు, ద్విచక్ర వాహనాలతో అడ్డుకట్ట వేశాడని ఆరోపించారు. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న పల్లె ప్రజలపై దాయాదుల మధ్య చిచ్చు పెట్టి అగ్నికి ఆజ్యం పోసి ఒకరి కోసం 10 మందిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉనికి కోసం రాజకీయ రంగు పులమడం టీడీపీ సానుభూతిపరులకు తగదని హితవు పలికారు. ఏడు కుటుంబాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న సదరు వ్యక్తి అసౌకర్యం కల్పించనని చెబితే రోడ్డులోని రాళ్లను తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బాధితులు స్పష్టం చేశారు. అగ్నికి ఆజ్యం పోసింది టీడీపీ సానుభూతిపరులే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు పోలీసుల చొరవతో కంపలు తొలగించినా మళ్లీ రోడ్డులో మూగజీవాలతో అడ్డు కట్ట -
పోలీసులకు అగంతకుడి పట్టివేత
పెద్దతిప్పసముద్రం : స్థానిక ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న ఓ పెట్రోల్ పంపులోకి గుర్తు తెలియని ఓ అగంతకుడు మంగళవారం వేకువ జాము జొరబడేందుకు ప్రయత్నించాడు. లోపల నిద్రిస్తున్న పెట్రోల్ పంప్ ఆపరేటర్లు కట్టెతో తచ్చాడుతున్న అగంతకుడిని గుర్తించి అప్రమత్తమై దుండగుడిని పట్టుకునేందుకు బయటకు వచ్చారు. తక్షణం దుండగుడు పక్కనే ఉన్న మరుగుదొడ్డి లోనికి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అనంతరం పెట్రోల్ పంప్ సిబ్బంది ఎస్ఐకు సమాచారం ఇవ్వగా పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గుర్తుతెలియని అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలో ఇటీవల జరుగుతున్న వరుస చోరీల కారణంగా పోలీసులు రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తూ అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా వేస్తున్నారు. బైకుల దొంగ అరెస్టుయశవంతపుర : అతని కన్ను పడితే ఎలాంటి బైక్ అయినా మాయం అవుతుంది. ఘరానా ద్విచక్ర వాహనాల దొంగను బెంగళూరు హెచ్ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 40 లక్షల విలువగల 32 బైక్లను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన హేమంత్ (23) నిందితుడు. ఇటీవల విభూతిపురలో జరిగిన బైకు చోరీ కేసులో విచారించి మదనపల్లి మొయిన్రోడ్డులో నివాసం ఉంటున్న హేమంత్ను అరెస్ట్ చేశారు. హొసకోట, విజయపురలోనూ బైకులను చోరీ చేశాడు. 20 బైకులను మదనపల్లెలోని తన స్నేహితులకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన బైకులను మదనపల్లె మెయిన్ రోడ్డులోని ఖాళీ జాగాలో దాచి ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకుని తరలించారు. 250 గ్రాముల గంజాయి పట్టివేత సింహాద్రిపురం : వాహనాల తనిఖీలో గంజాయి పట్టుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం పోలీసు సిబ్బందితో కలిసి ఆయన సింహాద్రిపురం – పార్నపల్లె రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా 250 గ్రాముల గంజాయి దొరికింది. దీనిపై సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను రిమాండ్కు తరలించారు. -
కాపాడుకోవడం కష్టంగా ఉంది
ఇప్పుడు టమాటా పంటను కాపాడుకోవడం చాలా కష్టంతోపాటు ఖర్చుతో కూడుకొంది. ధరలు పెరుగుతున్నా వైరస్లు, తెగుళ్లు.. వాతావారణంలో వస్తున్న మార్పుల కారణంగా దిగుబడి తగ్గిపోతోంది. ఉన్న పంటనైనా కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. – రెడ్డిమోహన్, రైతు, చెరువుమొరవపల్లె, గుర్రంకొండ సబ్సిడీపై మందులు ఇవ్వాలి ఊజి వైరస్ నివారణకు సరైన మందులు లేకపోవడంతో.. వేగంగా విస్తరిస్తోంది. పంట భారీగా దెబ్బతిని వినియోగానికి ఉపయోగపడటం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన పురుగు నివారణ మందులను సబ్సిడీపై సరఫరా చేయాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. – ఎండపల్లి బాలకృష్ణారెడ్డి, రైతు సంఘ నాయకుడు, రాయచోటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి టమాటాలకు మార్కెట్లో అనుకూల ధరలు లేకపోవడంతో.. రైతులు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఏప్రిల్, మేలలో పంటకు సరైన ధర లేకపోవడంతో కోతలు కోయకుండా వదిలేశారు. అలాంటి తోటలలో ఊజి వైరస్ ఎక్కువ ఉంటుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. తెగులు సోకిన మొక్కలు తొలగించి, పురుగు నివారణ మందులు వాడటం వల్ల అరికట్టవచ్చు. – ఎస్.సుభాషిణి, జిల్లా ఉద్యానవన అధికారిణి -
దళిత యువకునిపై అమానుష దాడి
కలికిరి(వాల్మీకిపురం) : దళిత యువకునిపై జరిగిన అమానుష దాడి ఘటన వాల్మీకిపురం మండల పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు... మండలంలోని చింతపర్తి గ్రామం కోటపల్లికి చెందిన గురునాథ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే గ్రామం బోయపల్లి నుంచి కూలీలను తన ఆటోలో పని చేసే ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. ఆటో డ్రైవర్ గురునాథ తన భార్యకు ఫోన్ చేశాడన్న అనుమానంతో బోయపల్లికి చెందిన భార్గవ ఈ నెల 27న గురునాథను బోయపల్లి సమీపంలోని ఓ తోటలోకి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అమానుషంగా దాడి చేసి గాయపరిచాడు. దాడిలో గురునాథ చేయి విరిగింది. చెవికి రక్త గాయాలయ్యాయి. దాడి ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. తనపై దాడికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మూడు రోజుల క్రితం బాధితుడు గురునాథ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కనీసం దాడి ఘటనపై విచారించకుండా కాలయాపన చేస్తుండటంతో మాలమహానాడు నేతలతో కలిసి మంగళవారం వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలపారు. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెల మోహన్ మాట్లాడుతూ ఓ దళితునిపై దాడి జరిగితే పోలీసులు రాజకీయ ఒత్తిడితో కేసు నమోదు చేయక పోవడం దుర్మార్గమన్నారు. దళిత యువకునిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోక పోతే మాలమహానాడు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహానాడు నేతలు గుండా మనోహర్, శివయ్య, వెంకటస్వామి, సుధా, నాగార్జున, ప్రశాంత్, బాధితుని తల్లిదండ్రులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా -
శభాష్.. పోలీస్..!
కురబలకోట : రాష్ట్రంలో సంచలనం కలిగించిన మండలంలోని చెన్నామర్రి వద్ద కర్ణాటక రాష్ట్రం బాగేపల్లెకు చెందిన ట్రావెలర్ టెంపోను సోమవారం ఉదయం ఢీకొట్టి వెళ్లిపోయిన కంటైనర్ మిస్టరీని గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. దీని వెనుక కఠోర శ్రమతో పాటు సకాలంలో అప్రమత్తమై వివిధ కోణాల్లో జల్లెడ పట్టి శోధించి సాధించారు. తిరుమల దైవ దర్శనానికి వెళ్లి స్వగ్రామానికి వెళుతున్న ట్రావెలర్ టెంపోను ఢీకొన్న సంఘటనలో మేఘర్స్ (16), చరణ్ (17), శ్రావణి (24) అక్కడికక్కడే విగత జీవులుగా మారిన విషయం తెలిసిందే. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టి వెళ్లిపోయిన కంటైనర్ను చైన్నెలో ఉండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ముదివేడు స్టేషన్కు మంగళవారం తీసుకు వచ్చారు. ప్రమాదం సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో జరగ్గా వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ముగ్గురి మృతికి కారణమై మరో పది మందికి తీవ్ర గాయాలు కావడానికి కారణమైన కంటైనర్ వెళ్లిపోవడాన్ని పోలీసు అధికారులు కూడా తీవ్రంగా పరిగణించారు. ప్రతిష్టాత్మకంగానే కాకుండా చాలెంజ్గా తీసుకున్నారు. అప్పటికప్పుడే దీన్ని కనిపెట్టడానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో మదనపల్లె డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు, నిమ్మనపల్లె ఎస్ఐలు దిలీప్కుమార్, తిప్పేస్వామి ఆధ్వర్యంలో మూడు టీమ్లు ఏర్పాటయ్యాయి. కదిరి నుండి చైన్నె వరకు హైవే పొడవునా 150 పైగా సీసీ కెమెరాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. మార్గంలోని ఆరు టోల్గేట్లు, మరెన్నో చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. కదిరి టోల్గేటు మీదుగా ప్రమాద సమయానికి ముందుగా మూడు కంటైనర్లు వచ్చినట్లు గుర్తించారు. వీటిలో ప్రమాదానికి కారణమైన కంటైనర్ కోసం జల్లెడ పట్టారు. ఎట్టకేలకు లభించిన ఆధారాలను బట్టి చైన్నెలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కూడా వరుసగా మూడు కంటైనర్లు ఉండడంతో ప్రమాదానికి కారణమైన వాహనం కోసం మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. ట్రావెలర్ టెంపోను ఢీకొట్టి ఉండడంతో ఓ కంటైనర్కు డ్రైవర్ వైపుగా గీతలు, రాసుకున్న ఆనవాళ్లు ఉండడంతో పసిగట్టారు. డ్రైవర్ హరిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించారు. వెంటనే కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. ఓవర్ టేక్ చెయబోయి ప్రమాదవశాత్తు ఈ ప్రమాదానికి కారణమైనట్లు డ్రైవర్ హరి (42) చెబుతున్నట్లు సమాచారం. డ్రైవర్ది తమిళనాడులోని చెంగల్పట్టు. ప్రమాదంతో బాధితులు, పరిసర ప్రాంతాల వారు దాడి చేస్తారన్న భయంతో వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇతను తమిళనాడు నుండి కియోకార్లకు సంబంధించి ముడి సరుకులను అనంతపురం జిల్లాలోని కియో కార్ల తయారీ కేంద్రంలో అన్లోడ్ చేసి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన మూడు గంటలలోనే కారణమైన కంటైనర్ ను గుర్తించడంతో పాటు దానిని స్వాధీనం చేసుకుని డ్రైవర్ను పట్టుకున్న పోలీసుల ప్రతిభను జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు అభినందించారు. శోధించి..ఛేదించారు చెన్నామర్రి ప్రమాద ఘటనలో మూడు గంటల్లోనే కంటైనర్ గుర్తింపు కర్ణాటక వాసుల మృతి కేసులో పోలీసుల అదుపులో డ్రైవర్ప్రమాదం ఎలా జరిగింది.? కురబలకోట : మండలంలోని చెన్నామర్రి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసులు మృతి చెందిన ఘటనను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. ముగ్గురి ప్రాణాలు కోల్పోయి మరో పది మంది తీవ్రంగా గాయపడ్డ ఘటన జరిగిన ప్రదేశాన్ని మంగళవారం త్రిసభ్య కమిటీ జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, హైవే డీఈ శివరాం, ఎంవీఐ శివలింగయ్య, ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కారణాలను అధ్యయనం చేశారు. అధిక వేగం, డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోండం, నిర్లక్ష్య ధోరణి, సిగ్నల్ లోపం తదితర వాటిని ప్రధాన కారణాలుగా భావించారు. వేగ నియంత్రణకు స్పీడు బ్రేకర్లు వేయాలని నిర్ధారించారు. అదే విధంగా ప్రమాదకర మలుపుల వద్ద సిగ్నల్స్, హెచ్చరిక బోర్డుల ఏర్పాటుతో పాటు మరిన్ని చర్యలు తీసుకోవడానికి సంకల్పించారు. మండల కేంద్రం కురబలకోటకు వెళ్లే జంగావారిపల్లె హైవే క్రాస్ వద్ద స్పీడు బ్రేకర్లు వేయాల్సిన అవసరం ఉందని ఆ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించేవారు ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.కర్ణాటక వాసుల మృతి ఘటనపై త్రిసభ్య కమిటీ పరిశీలన -
రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు
కలికిరి : తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిలో వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయనపల్లి సమీపంలో గల టోల్గేట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎల్లయ్య కుమారుడు వినేష్ సొంత పనుల నిమిత్తం మదనపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. గండబోయనపల్లి సమీపంలోని టోల్గేటు వద్ద కర్ణాటకకు చెందిన కెఎ36ఎం 9619 తూఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో వినేష్కు తీవ్ర గాయాలు కాగా, తూఫాన్ వాహనం రోడ్డుపైన ఫల్టీ కొట్టింది. వాహనంలో ఉన్న వారికి ప్రమాదం తప్పింది. వినేష్ను స్థానికులు కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. చౌకదుకాణం మూత.. తప్పని వెతనందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ రైల్వేగేట్ సమీపంలోని చౌకదుకాణం మంగళవారం మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ ఇవ్వాలని చెప్పినప్పటికీ మొదటి రోజే చౌకదుకాణానికి బీగాలు వేయడంతో రేషన్ దుకాణానికి వచ్చిన ప్రజలు అవస్థలు పడ్డారు. చౌకదుకాణం మూసివేయడంపై ఆర్ఐ సుశీల్కుమార్ను వివరణ కోరగా రేషన్ డీలర్ బంధువులు చనిపోవడంతో కడపకు వెళ్తున్నామని తహసీల్దార్ అమరేశ్వరి వద్ద పర్మిషన్ తీసుకుని డీలర్ వెళ్లారని ఆర్ఐ తెలిపారు.ఆటో బోల్తామదనపల్లె రూరల్ : ఆటో బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో జరిగింది. సోమల మండలం నంజంపేటకు చెందిన విజయ్(42), చోటేసాబ్(62), నంజంపేట వడ్డిపల్లెకు చెందిన రమణ(49) ముగ్గురూ కలిసి మదనపల్లె మండలం వలసపల్లె వద్ద కట్టెలు కొట్టేందుకు కూలిపనులకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలోని పెద్దూరు సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చౌడేపల్లె పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
కల.. నిజమైన వేళ !
వారంతా శ్రమజీవుల బిడ్డలు. తల్లిదండ్రుల కష్టాలు కళ్లారా చూశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని.. కన్న వారి కలలను నిజం చేయాలని కలగన్నారు. కష్టపడి చదివారు.. వారి కష్టానికి ఫలితం దక్కింది. మహానేత వైఎస్సార్ స్థాపించిన ట్రిపుల్ ఐటీలో సీటు దక్కింది. కల సాకారమైన వేళ.. వారి కళ్ల నిండా సంతోషం కనిపించింది. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. వేంపల్లె (వైఎస్ఆర్ జిల్లా) : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాయలం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కై లాస్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ● రెండు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా 1010 సీట్లకు సంబంధించి అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా.. 878 మంది విద్యార్థులు హాజరై ప్రవేశాలు పొందారు. త్వరలో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. జూలై 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డైరెక్టర్ తెలిపారు. వైఎస్సార్ను స్మరించుకున్న విద్యార్థులు రాష్ట్ర నలుమూలల నుంచి అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు వచ్చారు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వారు స్మరించుకున్నారు. ఆయన ఈ ట్రిపుల్ఐటీలను స్థాపించడం వల్లే తమ లాంటి పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశం వచ్చిందన్నారు. ఆయనను ఎన్నటికీ మరువలేమన్నారు. భావిభారత ఇంజినీర్లుగా దేశానికి సేవ చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతామని అడ్మిషన్లు పాందిన విద్యార్థులు తెలిపారు. ట్రిపుల్ ఐటీలో ముగిసిన అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం 878 మంది అడ్మిషన్లు పొందిన విద్యార్థులు -
ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం
రాయచోటి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలకు తెలియపరిచే బాధ్యతను ప్రతి ఒక్కరం తీసుకుందామని వైఎస్ఆర్సీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అభిమానులు, ఆత్మీయులకు పిలుపునిచ్చారు. మంగళవారం రాయచోటిలోని సుగవాసి స్వగృహంలో గుంటిమడుగు, కాటిమాయకుంట గ్రామాలకు చెందిన ప్రజలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయమాటల కారణంగా ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్న వైఎస్ఆర్సీపీ పాలనను కాదని కూటమి పార్టీలకు ప్రజలు ఓట్లు వేశారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని వదిలి, కూటమి నేతల ధన, సంపద, సంక్షేమంతో ముందుకు సాగుతోందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదింపి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి వైఎస్ఆర్సీపీ పాలన తేవడానికి కృషి చేయాలన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. త్వరలోనే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గ్రామాలలో పర్యటించి కూటమి పాలన అవినీతి, జగన్మోహన్రెడ్డి పాలనలో అందిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిద్దామన్నారు. అనంతరం రెండు గ్రామాల పరిధిలోని ప్రజల పరిస్థితులు, సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీలో చేరిన జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ఆ గ్రామాల నాయకులు గజమాలలు వేసి, శాలువాలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి రూరల్ మండల పరిధిలోని గుంటిమడుగు, కాటిమాయకుంట గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఖాదర్వల్లి, కర్నపు రమణారెడ్డి, కొక్కంటి రెడ్డప్పరెడ్డి, శేఖర్రెడ్డి, దేవనాథరెడ్డి, అమరనాథరెడ్డి, నల్లగుండ్లపల్లి మహేష్రెడ్డి, రామచంద్రారెడ్డి, బొంకు బాబురెడ్డి, రాఘవరెడ్డి, నడిపి రెడ్డయ్య, ఖాదర్బాషా, వడిపల్లి రాజా, షేక్ అబ్బాస్, షేక్ ఆదిల్, ఇలాహి, మహమ్మద్, దేవర నాగేంద్ర, ఫజిల్, షేక్ అజ్గర్, షేక్ బాబ్జీ, పంగ రఘురామ, సాయి, తిరుమల, రామయ్య, వెంకటరమణ, గుంటిమడుగు మాజీ డీలర్ రమణ, పెద్దివీటి ఆంజనేయులు, మహేష్, మనోహర్, నాగేశ్వర, అంజి, రమణ, రామాంజనేయులు, బాబు తదితరులు పాల్గొన్నారు. అభిమానులు, ఆత్మీయులతో వైఎస్ఆర్సీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం -
జూనియర్ బాలుర ఫుట్బాల్ విజేత సత్యసాయి జిల్లా
మదనపల్లె సిటీ : మదనపల్లె సమీపంలోని వేద పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఫైనల్స్లో సత్యసాయి జిల్లా విజేతగా నిలిచింది. గత మూడు రోజుల నుంచి పలు జిల్లాల జట్ల మధ్య పోటీలు జరుగుతున్నాయి. ఫైనల్స్లో సత్యసాయి, తిరుపతి జట్లు పోటీపడగా సత్యసాయి జిల్లా విజయం సాధించి విజేతగా నిలిచింది. రన్నర్స్గా తిరుపతి జట్టు, తృతీయ స్థానంలో అనంతపురం జట్టు నిలిచాయి. ఈ టోర్నమెంటులో బెస్ట్ ప్లేయర్స్ను ఎంపిక చేసి వారిని ఈనెల మూడవ వారంలో అమృతసర్లో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంటుకు పంపనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్కుమార్, మురళీధర్ తెలిపారు. విజేతలకు వేదా పాఠశాల కరస్పాండెంట్ రామలింగారెడ్డి, పోతబోలు సర్పంచు ఈశ్వరయ్యలు ట్రోఫీ, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కోచ్లు సిరాజ్, చినబాబు, శ్రీనివాస్, మహీంద్ర, కమలేష్, బాలాజీ, నరేంద్ర పాల్గొన్నారు. -
వివాహిత హత్య కేసులో నలుగురి అరెస్టు
పీలేరు రూరల్ : వివాహిత హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన లోకనాథరెడ్డి, జీవనజ్యోతి దంపతుల కుమార్తె ఇందుజా (30)కు ఐదేళ్ల క్రితం పీలేరు మండలం కాకులారంపల్లె పంచాయతీ బందారువాండ్లపల్లెకు చెందిన వరంపాటి శంకర్రెడ్డి కుమారుడు వరంపాటి విజయశేఖర్రెడ్డితో వివాహమైంది. విజయశేఖర్రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం కలిగి భార్య అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గతనెల 28న రాత్రి ఇందుజాను హతమార్చాలని విజయశేఖర్రెడ్డి, తన తల్లి శాంతమ్మ, అక్క సునంద, అవ్వ కంభం అమ్మన్నమ్మలతో కలిసి పథకం పన్నాడు. ఆ రోజు రాత్రి పక్క గ్రామంలో గంగజాతర ఉండడంతో గ్రామస్తులు ఎవరూ లేని సమయం చూసుకుని పథకం ప్రకారం ఇందుజాను కొట్టి గొంతునులిమి హత్య చేశారు. తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించేందుగా సమీప వ్యవసాయ బావిలో మృతదేహాన్ని పడేశారు. తన తల్లి సలహా మేరకు తిరిగి మృతదేహాన్ని ఇంటి వద్దకు చేర్చారు. ఇందుజా నిద్రలోనే మృతి చెందినట్లు ప్రచారం చేశారు. మృతురాలి తల్లి జీవనజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయం వెలికి తీశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ యుగంధర్, ఎస్ఐ లోకేష్ పాల్గొన్నారు. -
టెంపో మీదకు దూసుకొచ్చిన కంటైనర్!
కురబలకోట (అన్నమయ్య జిల్లా): వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ టెంపోను ఢీకొట్టి ముగ్గురి ప్రాణాలను బలిగొంది. పదిమందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని బాగేపల్లెకు చెందిన నరసింహారెడ్డి, రామచంద్రప్ప, శివప్ప కుంటుంబాలకు చెందిన 15 మంది తిరుమల దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చెన్నామర్రి వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్ ఒక్కసారిగా వీరు ప్రయాణిస్తున్న ట్రావెలర్ టెంపోను ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో మేఘర్‡్ష(16), చరణ్(17), శ్రావణి(24) అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108, పోలీస్ వాహనాల్లో మదనపల్లె ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్ణాటకలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ మంజునాథ కోమాలోకి వెళ్లారు. టెంపోను ఢీకొట్టిన కంటైనర్ లారీతో పాటు డ్రైవర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చెన్నామర్రి మిట్ట రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, మరో పదిమంది గాయపడడం పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
గుళ్లు..గోపురాలు చూసేందుకు వచ్చాం
పెద్దతిప్పసముద్రం : ఏదో గుళ్లు, గోపురాలు చూసేందుకు వచ్చాం..ఇదేం అధికారిక కార్యక్రమం కాదు అని తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన వెంట 12 వాహనాల్లో ఎస్ఈ, ఈఈ, డీఈలు, కాంట్ట్రాకర్లతో కలసి పెద్దతిప్పసముద్రంలోని హంద్రీనీవా కాలువ పంప్ హౌస్కు విచ్చేశారు. కాంట్రాక్టర్ క్యాంపు వద్దకు వెళ్లారు. కాలువ పనులను పరిశీలించారు. అంతమంది అధికారులతో వచ్చిన సీఈని కలిసిన మీడియా ప్రతినిధులు ఆకస్మిక పర్యటన వివరాలను తెలియజేయాలని కోరారు. మీరు రాసుకునే అంత వివరాలైతే ఏం లేవు, ఏదో గుళ్లు, గోపురాలను చూడటానికి వచ్చామని సమాధానం ఇచ్చారు. ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యే పర్యటన లాగా కాన్వాయ్ను తలపించేలా 12 వాహనాల్లో హెచ్ఎన్ఎస్ఎస్ అధికార బృందం రావడం వివరాలను గోప్యంగా ఉంచడం వెనుక మతలబు ఏమిటో అధికారులకే ఎరుక. అధికారులు పర్యటించిన ప్రాంతంలో సీఈ చెప్పినట్టు గుళ్లు, గోపురాలు లేవు. కరువుతో బీళ్లు వారిన పొలాలు, పారని హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువ కనిపిస్తాయి. గుళ్లు, గోపురాలు లేని కాంట్రాక్టర్ క్యాంపు వద్దకు ఎందుకు వెళ్లారు. ఆయన వెంట అధికారుల బృందం ఎందుకొచ్చిందో ఆయనే చెప్పాలి. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఒంటిమిట్ట: మండలంలోని మల్లేశ్వరపురానికి చెందిన అలిశెట్టి లక్ష్మీదేవి (57) సోమవారం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు జూన్ 14వ తేదీన అలిశెట్టి లక్ష్మీదేవి, ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురు విద్యుత్ త్ వైర్ల విషయమై వారి దాయాదులైన మరో వర్గానికి చెందిన ఆరుగురితో ఘర్షణ పడ్డారు. జూన్ 14న ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. వారి మధ్య సఖ్యత కుదరకపోవడంతో జూన్ 28వ తేదీ రెండో వర్గంలోని 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా జూన్ 29వ తేదీన అలిశెట్టి లక్ష్మీదేవి అనారోగ్యంతో కడపలోని ప్రైవేటు ఆసు పత్రిలో చేరగా అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అలిశెట్టి లక్ష్మీదేవి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఆమె చిన్న కూతురు శిరీషా జూన్ 14వ తేదీన జరిగిన ఘర్షణలో తన తల్లికి లోపల గాయాలు తగలడంతో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలై మృతి చెందినట్లు అనుమానంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుమారుడితో సహా తండ్రి అదృశ్యంమదనపల్లె రూరల్ : కుమారుడితో సహా తండ్రి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని కొత్త ఇండ్లు రంగారెడ్డి కాలనీకి చెందిన నారాయణ కుమారుడు మునిరత్నం(42) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి మద్యానికి తీవ్రంగా బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈక్రమంలో ఒకసారి కుమార్తెను ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. కొద్దిరోజుల తర్వాత కూతురు ఇంటికెళ్లాలని పట్టుబట్టడంతో తీసుకువచ్చి ఇంటివద్ద దింపేశాడు. ఈ క్రమంలో ఈనెల 23న భార్య ఆదిలక్ష్మితో గొడవపడి కుమారుడు మనోజ్కుమార్(7)ను వెంటతీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదిలక్ష్మి సోమవారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కార్మిక వేతన భారం మేం భరిస్తాం
మదనపల్లె : రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులు తమ సమస్యలపై రెండునెలలుగా ఆందోళనలు, దీక్షలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో మొట్టమొదటగా అన్నమయ్యజిల్లా మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ స్పందించింది. మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు 27 రోజులుగా దీక్షలు చేస్తున్నా స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకాని, ఆ పార్టీ నేతలు కాని పట్టించుకోలేదు. కనీసం పరామర్శించి డిమాండ్లు ఏమిటో అడిగింది లేదు. కార్మికుల సమస్యలపై మానవీయ కోణంలో మున్సిపల్ కౌన్సిల్ స్పందించింది. సోమవారం సాయంత్రం నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్మికులు హాలు ముందు బైఠాయించారు. వారు డిమాండ్ చేస్తున్న వేతనాలపై వైస్ చైర్మన్ జింకా చలపతి, కౌన్సిలర్ ప్రసాద్లు సమావేశంలో చర్చించారు. మున్సిపాలిటి తరపున వ్యత్యాస వేతనం చెల్లించేందుకు మున్సిపాలిటీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇప్పుడు చెల్లిస్తున్న వేతనానికి ఎంత అదనంగా అడుగుతున్నారో ఆ మొత్తాన్ని మదనపల్లె మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లిస్తామని ప్రకటించి ఈ మేరకు తీర్మాణం చేస్తున్నట్టు ప్రకటించారు. సేవలకు ప్రతిరూపం పదవీ విరమణరాయచోటి : రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలంపాటు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందడం వారి సేవల కు ప్రతి రూపమని జిల్లా కలెక్టర్ ఛామకూ రి శ్రీధర్ అన్నారు. సోమవారం పదవీ విరమణ పొందిన మదనపల్లి హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ దైవాదీనంలను కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ, పదవీ విరమణలు సర్వసాధారణమన్నారు. రెవెన్యూ శాఖలో సుదీర్ఘకాలంపాటు విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ నరసింహ కుమార్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి ఒంటిమిట్ట : గత నెల 24వ తేదీ ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణ వేదిక వద్ద కడప–చైన్నె జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న సాయి ప్రకాష్ (25) సోమవారం మృతి చెందాడు. పోలీసు వివరాల మేరకు జూన్ 24వ తేదీన మంత్రాలయం నుంచి కడప వైపు వెళ్తున్న సాయి ప్రకాష్ ద్విచక్ర వాహనానికి రాజంపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురుగా రావడంతో రెండు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సాయి ప్రకాష్ తలకు తీవ్ర గాయం కావడంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం సోమవారం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సాయి ప్రకాష్ తండ్రి నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.రాష్ట్రంలో మొదట స్పందించిన మదనపల్లె మున్సిపాలిటీ -
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న ప్రజల ఫిర్యాదుల పట్ల అలసత్వం చేయరాదని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ -
వైద్యుడు.. కనిపించే దేవుడు
ఒక్కమాటలో చెప్పాలంటే వైద్యులు దేవుళ్లతో సమానం. మనిషి అనారోగ్యం బారిన పడిన సమయంలో వైద్యుడు చేసే సేవలు వెలకట్టలేనివి. తల్లి జన్మనిస్తే.. వ్ర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, రిస్క్తో కూడిన శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చినప్పుడు వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వివిధ జబ్బులతో మనిషి బాధపడాల్సి వస్తుంది. రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. అనేక మంది వైద్యులు మానవత్వంతో పేదలకు, అభాగ్యులకు వైద్యం అందించి వారి ప్రాణాలను నిలుపుతున్నారు. అందుకే వైద్యో నారాయణో హరి అంటుంటారు పెద్దలు. రోగి పరేషాన్కు ఏ ఆపరేషన్ చేయాలో వైద్యుడికే తెలుస్తుంది. నాడి పట్టి గుండె గుబుళ్లను గుర్తించి దిగులును దూరం చేసే కనిపించే దేవుడే వైద్యుడు.రాజంపేట టౌన్ : వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. అందువల్లే వైద్యులకు సమాజంలో ఎంతో గుర్తింపు, గౌరవం దక్కుతుంది. కొన్ని రకాల జబ్బుల బారిన పడిన వారి వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు కూడా భయపడుతుంటారు. అయితే అలాంటి రోగుల వద్దకు కూడా వెళ్లి వైద్యం చేసేది ఒక్క వైద్యుడు మాత్రమే. ప్రతి శాఖలో ఉద్యోగులకు, చివరికి దినసరి కూలీలకు కూడా సెలవులుంటాయి. కాని వైద్యులకు మాత్రం సెలవు ఉండదు. కొన్ని సందర్భాల్లో క్షణం తీరిక కూడా ఉండదు. పిల్లలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు కూడా కొంత మంది వైద్యులకు సమయం ఉండదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. చేదు అనుభవాలు.. వైద్యులకు ఆదివారాలు ఉండవు. ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటే ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే. రోగి ప్రాణాలను నిలిపేందుకు వైద్యులు తమ జీవితాలను కూడా త్యాగం చేస్తుంటారు. అలాంటి వైద్యులకు ఒక్కో మారు చేదు అనుభవాలు సైతం ఎదురవుతుంటాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు సరైన సమయానికి వైద్యుడి వద్దకు తీసుకురాలేక చివరి దశలో వైద్యుడి వద్దకు తీసుకొస్తే వైద్యుడు ఆ మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో వైద్యుడు మనిషి ప్రాణాలను కాపాడలేక పోతాడు. ఆ సందర్భంలో మృతుని కుటుంబ సభ్యులు ముందూ వెనకా ఆలోచించకుండా ఆందోళనకు దిగడం, దాడులు చేయడం అక్కడక్కడా జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరమనే చెప్పాలి. మానసిక ఒత్తిడి ఎక్కువే.. వైద్యులకు వ్యక్తిగత జీవితాల్లో మానసిక ఒత్తిళ్లు ఎక్కువే ఉంటాయి. వృత్తిలోని సాధకబాధకాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది వైద్యులు అదే వృత్తిలో ఉన్న వారిని తమ జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. రోజంతా రోగుల సేవలో కనిపించే వైద్యులు వేడుకలు, పండుగల్లో కనిపించడం చాలా అరుదు. అందులో ఇబ్బందులున్నా ఎదుర్కొంటారు కాని ఇతరులకు చెప్పరు. అలాంటి వైద్యులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జగన్ హయాం నుంచి పల్లెలకు విస్తరించిన వైద్య సేవలు.. ఒకప్పుడు చిన్నపాటి జ్వరం, జలుబు వంటివి చేసినా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎంతో దూరంలో ఉండే పీహెచ్సీలకు లేకుంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆసుపత్రులకు వచ్చి వైద్య సేవలు పొందేవారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన 104 వాహనాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇంటిముంగిటకే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 104 వాహనాల ద్వారా వైద్య సిబ్బంది నెలలో రెండు రోజులు మాత్రమే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. అయితే 2019వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి సచివాలయంలో వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకున్నారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇప్పుడు వైద్య సేవలు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. పూర్వజన్మ సుకృతం వైద్యవృత్తిలో ఎంతో సంతృప్తి ఉంటుంది. రోగులకు వైద్య సేవలు అందించడం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తాను. నేను ఎంతో ఇష్టంగా ఈ వృత్తిని ఎంచుకున్నాను. అనేక సర్జరీలు చేశాను. సర్జరీలు విజయవంతంగా పూర్తి అయిన ప్రతిసారి ఎంతో ఆనందంగా ఉంటుంది. సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు ఉన్న ఈ వృత్తిలో నేను ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. – డాక్టర్ పాలనేని వెంకట నాగేశ్వరరాజు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట పేదల వైద్యుడు జీవీ సుబ్బారెడ్డిరాజంపేట పట్టణంలో దాదాపు యాభై ఏళ్లుగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జీవీ సుబ్బారెడ్డి పేదల డాక్టర్గా గుర్తింపు పొందారు. నామమాత్రపు ఫీజుతో ఆయన మెరుగైన వైద్యం అందిస్తారు. అందువల్ల ఆయన వద్దకు ఇప్పటికీ పెద్దఎత్తున పేద ప్రజలు వైద్యం పొందేందుకు వస్తుంటారు. నామమాత్రపు ఫీజు కూడా ఇచ్చుకోలేని వారి వద్ద ఆయన ఒక్కపైసా కూడా తీసుకోకుండానే వైద్యం అందిస్తారు. అందువల్లే డాక్టర్ జీవీ.సుబ్బారెడ్డిని రాజంపేట ప్రాంత ప్రజలు పేదల డాక్టర్ అని ఎంతో అభిమానిస్తారు. మీ సేవలకు వందనం రోగుల ప్రాణాలు కాపాడటంలో శక్తి వంచన లేకుండా శ్రమించే దేవుళ్లు నేడు డాక్టర్స్ డే -
వేర్వేరు ఘటనల్లో ఆరుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాద ఘటనల్లో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలచెరువు మండలం అడవిచెరువు గ్రామానికి చెందిన పెద్దినాయుడు(30), అమరనారాయణ(45), అతని భార్య అనూరాధ(40), ప్రతాప్నాయుడు(38) తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి సోమవారం ఉదయం కారులో తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, మార్గమధ్యంలోని చింతపర్తి సమీపంలో హైవే వద్ద వాహనం అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మదనపల్లె మండలం పోతబోలుకు చెందిన వెంకటరమణ కుమారుడు పి.గంగాద్రి(32) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె జెడ్పీహైస్కూల్ నుంచి ఉపాధ్యాయురాలిని తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంలో వెళ్లాడు. మార్గమధ్యంలో ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి కుడి కాలు విరిగింది. అదేవిధంగా బీహార్కు చెందిన టైల్స్ కార్మికులు అశోక్సహానీ(45) ములకలచెరువులో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. సోమవారం రూమ్ నుంచి పని ప్రదేశానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా, వాహనం అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తగిలిన గాయంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. దీంతో గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. -
ఉపాధిలో అంతులేని అవినీతి
రాయచోటి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకంలో అవినీతి అంతులేకుండా పోయిందని జిల్లాలోని ప్రజాప్రతినిధులు విమర్శించారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు సోమవారం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. డిమాండ్లు ● ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకుంటున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలి ● రైతు, కూలీ శ్రామికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదని స్పష్టం చేశారు. ● ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీల ద్వారానే నిర్వహించి కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలి. ● సర్పంచులకు తల్లికి వందనం పథకం తక్షణమే వర్తింప చేయాలి ● కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1150 కోట్లు స్థానిక సంస్థలకు బకాయి లేకుండా తక్షణమే జమ చేయాలి. ● జీఓ ఎంఎస్ 11ను రద్దు చేసి, గాలిలో తేలుతున్న 1350 మంది పంచాయతీ సెక్రటరీలకు నియామకాలు చేపట్టాలి. 10 నెలలుగా వేతనాలు లేకుండా బాధపడుతున్న వారి జీతాలను వెంటనే విడుదల చేయాలి. ● స్థానిక సంస్థల బలోపేతం కోసం జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీల గౌరవ వేతనాలను పెంచి, వాయిదా లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ పంచాయతీ వింగ్ అధ్యక్షుడు మాసన వెంకటరమణ, రాష్ట్ర పంచాయతీ విభాగ సెక్రటరీ గాలివీటి ప్రవీణ్రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సూరం వెంకటసుబ్బారెడ్డి, మేధావుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు జానం రవీంద్ర, కోడూరు పంచాయతీరాజ్ అధ్యక్షుడు శివశంకర్రెడ్డి, రాజంపేట పంచాయతీరాజ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, కౌన్సిలర్ సుగవాసి ఈశ్వర్ప్రసాద్, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, సర్పంచ్ రామాంజులు, హరినాథరెడ్డిలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్సీపీ నేతలు -
హోరాహోరీగా ఫుట్బాల్ చాంపియన్ షిప్ పోటీలు
మదనపల్లె సిటీ : రాష్ట్ర స్థాయి బాలుర జూనియర్ ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. మదనపల్లె సమీపంలోని వేదా పాఠశాలలో సోమవారం వివిధ జిల్లాల జట్ల మధ్య పోటీలు నిర్వహించారు. సెమీ ఫైనల్స్లో సత్యసాయి–అనంతపురం జిల్లా జట్లు పోటీపడగా 2–0 స్కోరుతో సత్యసాయి జిల్లా జట్టు విజయం సాధించింది. మరో సెమీ ఫైనల్స్లో తిరుపతి–విశాఖపట్నం జట్లు పోటీ పడగా 7–4 స్కోరుతో తిరుపతి జట్టు గెలుపొందింది. ఫైనల్స్కు సత్యసాయి, తిరుపతి జట్లు చేరాయి. మంగళవారం తిరుపతి–సత్యసాయి జట్ల మధ్య పోటీ జరగనుంది. పోటీలను ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్కుమార్, మురళీధర్, మహేంద్ర, సిరాజ్, ఇర్షాద్, బాలాజీ, పవన్, చినబాబు పర్యవేక్షించారు. -
బస్సు ఢీ కొని యువకుడి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం ఎస్.ఉప్పరపల్లి వద్ద సోమవారం ఉదయం హైదరాబాదు నుంచి పాండిచ్చేరి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చైన్నె నుంచి ఎర్రగుంట్లకు పల్సర్ బైక్పై వెళ్తున్న బి.గోపాల్ (25)ను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ లక్ష్మీప్రసాద్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.వివాహిత అదృశ్యంమదనపల్లె రూరల్ : వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. సుండుపల్లెకు చెందిన మాధవి(20)కి, పట్టణంలోని మారుతీనగర్కు చెందిన చేనేత కార్మికుడు విజయ్కుమార్తో పదినెలల క్రితం వివాహమైంది. ఆమె ఇంటి వద్దే ఉంటుండగా, భర్త విజయ్కుమార్ స్థానికంగా చేనేత పనులకు వెళ్లేవాడు. ఈనెల 26న ఉదయం 7 గంటలకు విజయ్కుమార్ పనులకు వెళ్లి పది గంటలకు టిఫిన్ చేసేందుకు ఇంటికి రాగా, భార్య మాధవి కనిపించకపోవడంతో ఆమె సెల్కు ఫోన్చేశాడు. సమాధానం రాకపోగా ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో పలుచోట్ల కుటుంబ సభ్యులతో కలిసి గాలించాడు. ఆచూకీ లభించకపోవడంతో సోమవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.గుప్త నిధుల కోసం తవ్వకాలుకొండాపురం : మండల పరిధిలోని పాత తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోని శివాలయంలో ఆదివారం రాత్రి గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. గండికోట జలాశయంలో ముంపునకు గురైన గ్రామాల్లో ఆలయాల్లో గుప్త నిధులు ఉంటాయని దొంగలు టార్గెట్ చేస్తున్నారు. పాత తాళ్లప్రొద్దుటూరు లోని శివాలయం గుడిలో శివ లింగం చుట్టు తవ్వకాలు చేపట్టడంతో సోమవారం మండల తహసీల్దార్ గుర్రప్ప, స్థానిక పోలీసులు పరిశీలించారు. ముంపు గ్రామాల్లో జనసంచారం లేకపోవడంతో పురాతన ఆలయాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
టీడీపీ నాయకుల దౌర్జన్యం
రాయచోటి : కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూ ఆక్రమణలే కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములను సైతం దౌర్జన్యంగా ఆక్రమించి సొంతం చేసుకుంటున్న ఉదంతాలు జిల్లాలో తరచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సొంత నియోజకవర్గంలో భూఆక్రమణలు వెలుగుచూస్తున్నాయి. గాలివీడు మండలం కొర్లకుంట పంచాయతీ చావిడిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పేరం సురేంద్రారెడ్డి పేరున ఉన్న 65 సెంట్ల పట్టా భూమిని టీడీపీ నాయకులు దౌర్జన్యంతో ఆక్రమించి కంచ వేసేశారు. గ్రామ పొలంలోని సర్వే నంబర్ 183/1లో 0.65 ఎకరాల పట్టా భూమిలో ఉన్న వేపచెట్లను నరికి తరలించుకుపోయారు. ఈ విషయంపై స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. గత కొన్ని నెలలుగా సురేంద్రారెడ్డికి చెందిన నిమ్మతోటకు నీరు వేసుకోవడానికి కూడా ఇబ్బందులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. భూ ఆక్రమణల సమయంలో ఘర్షణకు దిగిన వైఎస్సార్సీపీ నాయకులపైన కేసులు బనాయించి ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెట్టాలన్న దురుద్దేశంతోనే స్థానిక నాయకులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. సురేంద్రారెడ్డి భూమిలోని చెట్లను తొలగించి జేసీబీల సాయంతో భూమి అంతా చదును చేసి రాత్రికి రాత్రే మామిడిమొక్కలు నాటి ఆ పొలం చుట్టూ రాళ్లు నాటి కంచె వేశారు. భూఆక్రమణ సమయంలో స్థానికంగా ఉన్న టీడీపీ నేత తన అనుచరులతో కలిసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేసినట్లు స్థానిక వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన వన్–బి, అడంగల్, ఆర్హెచ్ నకల్ నమూనాలలో కూడా సురేంద్రారెడ్డి పేరున రికార్డు అయింది. స్థానిక టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, ఆక్రమణల విషయంపై గాలివీడు తహసీల్దార్, పోలీస్స్టేషన్, జిల్లా కలెక్టర్ స్థాయి వరకు విన్నవించుకున్నా న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి భూమి రికార్డులను పరిశీలించి, గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్సీపీ కార్యకర్తల పట్టా భూమి ఆక్రమణ రెవెన్యూ, పోలీసు కార్యాలయాల చుట్టూ తిరిగినా జరగని న్యాయం -
డెంగీ నివారణకు కృషి చేద్దాం
రాయచోటి టౌన్ : డెంగీ నివారణకు కృషి చేద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్. లక్ష్మీనరసయ్య పిలుపునిచ్చారు. సోమవా రం రాయచోటి జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాతీయ డెంగీ వారోత్సవ పోస్టర్లు ఆవిష్కరించారు.అనంతరంమాట్లాడుతూ ఈడి స్ విజిప్టి దోమ కాటుతో డెంగీ వస్తుందన్నారు. దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎంపీహెచ్ ఈఓవై శ్రీనివాసుల రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీలో ప్రారంభమైన అడ్మిషన్ల ప్రక్రియ వేంపల్లె : వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమవారం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కై లాస్ ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామానికి చెందిన బి.మేఘన తొలి అడ్మిషన్ పొందగా.. సత్యసాయి జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన బి.హరీష్ రెండవ అడ్మిషన్, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామానికి చెందిన బి.మహేశ్వరి మూడవ అడ్మిషన్ పొందారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా ఎంపికై న మొదటి, మూడు ర్యాంకుల విద్యార్థులకు ప్రవేశ పత్రాలతోపాటు బహుమతులను ప్రదానం చేశారు. తొలి రోజు 538 మందికి అడ్మిషన్లు పిలవగా, 481 మంది హాజరై అడ్మిషన్లను పొందారు. వెఎస్సార్ను స్మరించుకున్న విద్యార్థులు రాష్ట్ర నలుమూలల నుంచి అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు వచ్చారు. ఈ నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని వారు స్మరించుకున్నారు. ఆయన ఈ ట్రిపుల్ఐటీలను స్థాపించడం వల్లే తమ లాంటి పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశం వచ్చిందన్నారు. ఆయనను ఎన్నటికీ మరువలేమన్నారు. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య అనుమానాస్పద మృతి
పీలేరు(అన్నమయ్య): అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ బందారువాండ్లపల్లెలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన లోకనాథరెడ్డి, జీవనజ్యోతి కుమార్తె ఇందుజా (30)కు ఐదేళ్ల క్రితం బందారువాండ్లపల్లెకు చెందిన వరంపాటి శంకర్రెడ్డి కుమారుడు విజయశేఖర్రెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంపాటు వారి సంసారం సజావుగా సాగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. విజయశేఖర్రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం కలిగి వుండడంతో తరచూ భార్య భర్తలు గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇందుజా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పీలేరుకు చేరుకుని తమ కుమార్తెను అత్తింటివారే కడతేర్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్రెడ్డి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి, బంధువుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అన్నమయ్య జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురి కావడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.చదవండి: ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో? -
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడటంతో వారిని మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ముళ్ల పొదల్లో ఆలయం హుండీ
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు వ్యాసరాయ చెరువు కట్టపై వెలసిన గంగమ్మ ఆలయం హుండీని రెండు నెలల క్రితం గుర్తు తెలియని దుండగులు అపహరించుకెళ్లారు. హుండీని పగల గొట్టేందుకు దుండగులు విఫల యత్నం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం చెరువు కట్ట కింద సమీప ముళ్ల పొదల్లో దుండగులు పడేసిన హుండీని పశువుల కాపరులు గుర్తించారు. విషయం తెలుసుకున్న చెరువు సంఘం అధ్యక్షుడు మండ్లిపల్లి రమేష్ బాబు, ఆలయ పూజారి నరసింహులు, పెద్ద నీరుగట్టి రెడ్డెప్పలు ఘటనా స్థలానికి చేరుకుని హుండీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హుండీ తాళాలు తీసి అందులో ఉన్న రూ.1,400ల నగదును ఆలయ పూజల కోసం వినియోగించాలని పూజారికి అందజేశారు. మండలంలో ఇటీవల జరుగుతున్న వరుస చోరీల కారణంగా ప్రజలు హడలెత్తిపోతున్నారు. చోరీల విషయంపై ఎస్ఐ హరిహర ప్రసాద్ను వివరణ కోరగా గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరించినా, అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించినా తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించామన్నారు. -
బి.కొత్తకోటలో తమ్ముళ్ల రచ్చ!
బి.కొత్తకోట : టీడీపీ వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఆదివారం స్థానిక షాదీమహల్లో బి.కొత్తకోట పట్టణ టీడీపీ కమిటీ ఎన్నిక కోసం పార్టీ శ్రేణులు సమావేశమయ్యారు. పోటీలో ఉండాలనుకున్న నాయకుల పేర్లను సిద్ధం చేసుకుంటున్న స్థానిక నాయకులను కొందరు మా పేర్లు రాసుకోండి అంటూ డిమాండ్ చేశారు. దీంతో మొదలైన గొడవ తోపులాటకు దారితీసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి వ్యతిరేక వర్గీయులు కమిటీ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. పట్టణంలోని సీనియర్లు, పదవులను కోరుతున్న నాయకులతో అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇంతలో కొండ్రెడ్డి వర్గంతోపాటు జయచంద్రారెడ్డి వర్గీయులు సమావేశానికి హాజరయ్యారు. పార్టీలో ఉంటున్న సీనియర్లు, కష్టపడిన వారికి కమిటీల్లో చోటు కల్పించాలని జయచంద్రారెడ్డి వర్గ నాయకులు డిమాండ్ చేశారు. దీనికి అందరూ బరిలో నిలబడవచ్చని వ్యతిరేక వర్గం సూచించింది. దీంతో ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసుకొంటూ తోసుకున్నారు. కుర్చీలతో కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. సవాళ్లు విసురుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్ఐ భాస్కర్నాయక్, పోలీసులు షాదీమహల్ చేరుకున్నారు. వివాదం వద్దంటూ పోలీసులు వారించారు. ఈ వివాదంతో కమిటీ ఎన్నిక జరగకుండానే సమావేశం ముగిసింది.టీడీపీ పట్టణ కమిటీ ఎన్నికలో ఉద్రిక్తత -
వాటర్ ట్యాంకుపైకి ఎక్కి నిరసన
మదనపల్లె : స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని రక్షిత మంచినీటి పథకం ట్యాంకుపైకి ఎక్కిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆదివారం నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ కార్మికులు 26 రోజులుగా దీక్షలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కార్మికులు ట్యాంకుపైకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డెప్ప, గోపాలకృష్ణ, సజాద్, నాగరాజు, బాబు, కన్నయ్య, రాజేశ్వరి పాల్గొన్నారు. మొహర్రం ఉత్సవాలు ప్రారంభం చిన్నమండెం : మొహర్రం ఉత్సవాలలో జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన చిన్నమండెం పీర్లమకాన్లో ఆదివారం పీర్లను నిర్వాహకులు కొలువుదీర్చారు. ఈ సందర్భంగా పలు పూజాదిక్రతువులను నిర్వహించారు. జులై 5న పీర్ల పండుగ మహోత్సవంలో భాగంగా గంధపు పీరుకు పలు కార్యక్రమాలను నిర్వహించనుండగా కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుస్సేని పాల్గొననున్నారు. 108 వాహనంలో ప్రసవం ఒంటిమిట్ట : పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళ శనివారం అర్థరాత్రి 108 వాహనంలోనే ప్రసవించింది. అంబులెన్స్ టెక్నీషియన్ నాగబాబు వివరాల మేరకు ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి పంచాయతీ మారయ్య గారి పల్లెకు చెందిన జరీనా తన మూడవ కాన్పుకు పురిటి నొప్పులు మొదలు కావడంతో స్థానిక పీహెచ్సీకి ఓ ప్రైవేటు వాహనంలో వచ్చారు. అక్కడ ఉన్న స్టాఫ్నర్స్ కడప రిమ్స్కు తీసుకెళ్లాలని రెఫర్ చేయడంతో అక్కడి నుంచి జరీనాను 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలో భాకరాపేట గ్రామ సమీపంలో జరీనాకు ప్రసవం నొప్పులు ఎక్కువ కావడంతో 108 అంబులెన్స్లో ఉన్న టెక్నీషియన్ నాగబాబు డెలివరీ చేశారు. జరీనా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. 108 వాహనం పైలెట్ భాస్కర్ కూడా సహకరించారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం
పుల్లంపేట : విధి ఆడిన వింత నాటకంలో తండ్రీ, కూతురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. పుల్లంపేట మండలం, దళవాయిపల్లి గ్రామానికి చెందిన బుక్కా వెంకట సుబ్బారెడ్డి (45), కుమార్తె బుక్కా స్నేహలత (18)లు శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుక్కా వెంకట సుబ్బారెడ్డి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. పది రోజుల క్రితం ఇంటికి రావడంతో ఇంటిల్లిపాది ఆనందంగా గడిపారు. హైదరాబాదులో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న కుమార్తె స్నేహలత తండ్రి రావడంతో ఇంటికి వచ్చింది. చిట్వేలిలో చదువుతున్న కుమారుడిని పిలుచుకుని వచ్చేందుకు వెంకటసుబ్బారెడ్డి తన కుమార్తె స్నేహలతను తీసుకుని శనివారం బైకుపై బయలుదేరారు. చిట్వేలి నుంచి తిరిగి వస్తుండగా రాజంపేట సమీపంలో అతివేగంగా వచ్చిన స్కార్పియో వాహనం వీరి బైక్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో కుమార్తె స్నేహలత అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి వెంకట సుబ్బారెడ్డిని ఆసుపత్రికి తరలించగా గంట వ్యవధిలోనే మృతి చెందాడు. కుమారుడు వెంకటరమణారెడ్డి(13) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖాళీ బిందెలతో మహిళల నిరసన సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినా స్పందించలేదని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం వారు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక మహిళలు మాట్లాడుతూ గత రెండు వారాలుగా తాగునీరు రావడం లేదన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యను పరిష్కరించి తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పారిజాతం, లక్ష్మిదేవి, ఈశ్వరమ్మ, పద్మావతి, వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల పేరుతో మోసంకడప అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూర్బా కళాశాలల్లో కేరీర్ కౌన్సెలింగ్ డెవలప్మెంట్ అధికారి(సీసీడీఓ) పేరిట ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ కడపకు చౌటుపల్లె రోడ్డులో నివాసముంటున్న రవి అలియాస్ రఫి కొంతమంది నిరుద్యోగులను నమ్మ బలికించాడు. ఒక్కో నిరుద్యోగి వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి 6.50 లక్షల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు రవి అలియాస్ రఫీ నివసిస్తున్న ఇంటి వద్ద ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ రవి అలియాస్ రఫీ తమకు ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ ఒకొక్కక్కరి దగ్గరి నుంచి రూ. 6:50 లక్షలను తీసుకున్నాడన్నారు. నిరుద్యోగులైన తమకు ఉద్యోగం వస్తే అప్పు ఎలాగైనా తీర్చుకోవచ్చనే ధైర్యంతో తొలుత కొందరు డబ్బులిచ్చి ఉద్యోగాల్లో చేరారన్నారు. సంబంధిత అధికారి సంతకం చేసిన నియామక ఉత్తర్వులను తీసుకుని 2024 ఆగస్టులో ఉద్యోగాల్లో చేరారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లగా అక్కడున్న అధికారులు కూడా తమను ఉద్యోగాల్లో చేర్చుకున్నారని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఉద్యోగాల్లో చేరామన్నారు. మూడు నెలల పాటు పని చేశామన్నారు. తరువాత ఉన్నతాధికారులు నిర్వహించిన తనిఖీల్లో తమ నియామకాలు చెల్లవంటూ రద్దు చేసి ఇళ్లకు పంపించారన్నారు. -
రెండు కార్లు ఢీ
సంబేపల్లె : చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై మండల పరిధిలోని మొటుకువాండ్లపల్లె క్రాస్ సమీపంలో రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ నగర్కు చెందిన చరణ్తేజ్ అమ్మ లక్ష్మీదేవి, మామలు తిమ్మరాజు, గుర్రప్పలతో కలిసి అన్నమయ్యజిల్లా కేవీపల్లె మండల గ్యారంపల్లె సమీపంలోని గురుకుల పాళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం సర్టిఫికెట్ పరిశీలనలో భాగంగా కళాశాలకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకటశివారెడ్డి, అమ్మ జయమ్మ, భార్య వెంకటేశ్వరమ్మ, కొడుకు ఉమాకాంత్రెడ్డి, కూతురు శిరీషా, మామ రామిరెడ్డి, అత్త లక్ష్మీదేవమ్మలు కారులో అరుణాచలం శివున్ని దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అదుపు తప్పి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటశివారెడ్డి, గుర్రప్ప మినహా అందరికీ గాయాలయ్యాయి. వెంటనే వారిని రాయచోటి ప్రభ్వుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని సంబేపల్లె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతిబద్వేలు అర్బన్ : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని తొట్టిగారిపల్లె పీహెచ్సీ వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య ప్రాణాలు కోల్పోయినట్లు బద్వేలు మండలం గుండంరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు తన భార్య అయిన పామూరి పెంచలమ్మ మూడవ కాన్పులో ఆదివారం తెల్లవారుజామున ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అధికంగా రక్తస్రావం అవుతుండడంతో తొట్టిగారిపల్లె పీహెచ్సీ ఏఎన్ఎంను సంప్రదించగా ఆసుపత్రి వద్దకు తీసుకువెళ్లాలని సూచించడంతో ఆటోలో పీహెచ్సీకి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. రక్తస్రావం ఆగకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో పట్టణంలోని మరొక ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. 8 మందికి గాయాలు -
జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఇవ్వాలి
మదనపల్లె : అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్దికి ప్రభుత్వం రూ.10వేల కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో మదనపల్లెలో నిర్వహించే జిల్లా రెండవ మహాసభలపై నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు, తాగునీటి సమస్యలు, ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టని ప్రభుత్వం రాందేవ్ బాబాకు హార్సిలీహిల్స్ను కట్టబెట్టేందుకు ఎందుకంత తొందరని ప్రశ్నించారు. బాబాకు హార్సిలీహిల్స్పై అడుగు స్థలం ఇచ్చినా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కడప–బెంగళూరు రైల్వేమార్గం పనులు పూర్తి చేయించాలని కోరారు. బీటీ కళాశాలను విశ్వవిద్యాలయం చేయాలన్నారు. యోగా ప్రచారం కోసం రూ.300 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వానికి సమస్యలు పట్టకపోయినా మదనపల్లెకు విమానాశ్రయం కట్టిస్తానని ప్రకటించడం హస్యాస్పదమని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మదనపల్లె ప్రాంత రైతాంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నరసింహులు, మహేష్, కృష్ణప్ప, సాంబశివ, మనోహర్రెడ్డి, సుమిత్రమ్మ, మురళి, చిన్నయ్య, శీను పాల్గొన్నారు. -
బైకుతో హోంగార్డును ఢీకొన్న మైనర్ బాలుడు’
కలికిరి : వాహనాల తనిఖీలలో భాగంగా వాహనాన్ని ఆపిన హోంగార్డును మైనర్ బాలుడు బైకుతో ఢీకొని వెళ్లిపోయాడు. దీంతో హోంగార్డుకు కుడి కాలు విరిగింది. పోలీసుల కథనం మేరకు.. కలికిరి పట్టణ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హోంగార్డు చింతల ప్రతాప్ రెడ్డి వాహనాలను ఆపుతున్నాడు. అటుగా వచ్చిన మైనర్ బాలుని వాహనాన్ని ఆపాడు. అతను ఆపకుండా హోంగార్డును ఢీకొని వెళ్లాడు. ప్రమాదంలో హోంగార్డుకు వాహనం తగిలి కిందపడ్డాడు. కాలు విరిగి గాయాలపాలయ్యాడు. దీంతో పోలీసులు అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికి త్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. ఈ మేరకు మైనర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్కానిస్టేబుల్ మదనమోహన్ రెడ్డి తెలిపారు. -
ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్టు
నందలూరు : మండలంలోని నందలూరు గ్రామ పంచాయతీ దుర్గాపురం క్రాస్ రోడ్డు వద్ద ముగ్గురు దొంగలను పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 25 లక్షలు విలువ చేసే 250 గ్రాముల బంగారం, రూ.14 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఆదివారం మధ్యాహ్నం దుర్గాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి ఆవుల సంజయ్య, ఆవుల ఈశ్వరమ్మ, ఆవుల ప్రమీల అనే వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఈమేరకు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంటకు చెందిన వారన్నారు. వీరిపైన నందలూరులో రెండు కేసులు, వేంపల్లి, పులివెందుల, అనంతపురం 3వ టౌన్, ఆళ్లగడ్డ టౌన్, నంద్యాల వన్ టౌన్లలో దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. అంతర్ జిల్లాల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు.రూ.25 లక్షల బంగారు నగలు స్వాధీనం -
నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం
రాయచోటి జగదాంబసెంటర్ : కూటమి ప్రభుత్వం చేసే అవినీతి పనులపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీన కలెక్టర్కు వినతిపత్రం సమర్పించే కార్యక్రమం ఉంటుందని రాయచోటి నియోజకవర్గ పంచాయతీ విభాగం ప్రెసిడెంట్ మాసన వెంకటరమణ, రాష్ట్ర పంచాయతీ విభాగం సెక్రటరీ గాలివీటి ప్రవీణ్రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ సూరం వెంకటసుబ్బారెడ్డి, మేధావుల ఫోరం రాయచోటి నియోజకవర్గ అధ్యక్షుడు జానం రవీంద్ర, చిట్లూరు సర్పంచ్ రామాంజులు, వైఎస్సార్సీపీ నాయకులు పేయల శివశంకర్, సంజీవయ్య, హజరత్ ఖాదర్వలీ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా కువైట్లో ఏపీఎన్ఆర్టీఎస్ ఎత్తివేత!
రాజంపేట : ఉమ్మడి కడప జిల్లాలో ఆంధ్రా కువైట్గా ప్రసిద్ధికెక్కిన రాజంపేటలో ఏపీఎన్ఆర్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) కార్యాలయం ఎత్తివేశారు. దీంతో గల్ఫ్ వాసులను ఆదుకునే పరిస్ధితులు లేకుండా పోయాయి. కువైట్ దేశం వలన రాజంపేటలోని ఎస్బీఐ రాష్ట్రంలోనే మొదటి స్ధానంలో నిలిచింది. ఎన్ఆర్ఐ ఖాతాలను బట్టి రాజంపేట ఆంధ్రా కువైట్గా పేరు గడించింది. ఈ నేపథ్యంలో రాజంపేటను గుర్తించి, గల్ఫ్ దేశాలలో ఉండే వారి కోసం ప్రవాసాంధ్రులకు సేవలందించేందుకు గాను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో న్యూ బోయనపల్లె(కడప–రేణిగుంట జాతీయరహదారి)లో ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఖాళీ చేశారు. రాయలసీమ జిల్లాల కోసం రాజంపేటలో ఏర్పాటు.. రాయలసీమ జిల్లాలలోని గల్ఫ్వాసుల కోసం రాజంపేటలోనే ఏపీఎన్ఆర్టీఎస్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇప్పుడు భవన యజమాని టూ లెట్ బోర్డు పెట్టేశారు. దీంతో ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయం ఎత్తివేసినట్లుగా గల్ఫ్వాసులు గుర్తించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎడారి దేశాలకు.. రాయలసీమలో ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి అధికంగా ఎడారి దేశాలకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. జీవనోపాధి కోసం నాలుగు దశాబ్దాలుగా ఎడారి దేశాలకు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా కువైట్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, అబుదాబి, లెబనాన్, మస్కట్ దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అధికంగా 60 శాతం చదువురాని వారు ఉన్నారు. మోసాలపాలైన వారి కోసం.. మోసానికి గురై జైలుపాలై అనేక సమస్యలలో ఇరుక్కున్నవారు కూడా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీఎన్ఆర్టీఎస్ను బలోపేతం చేశారు. సీమలో గల్ఫ్వాసులు అధికంగా ఉన్న కారణంగా రాజంపేటలో సొసైటీ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా వందలాది మంది గల్ఫ్ బాధితుల సమస్యలకు పరిష్కారం చూపారు. గల్ఫ్దేశాలలో జీవించేందుకు, వారిలో నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాలకు వెళ్లేవారు, నివసిస్తున్న వారి కోసం హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సురక్షిత వలసలపై వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలలో అవగాహన కార్యక్రమాలను సొసైటీ నిర్వహించింది. సొసైటీ ద్వారా దేశ వ్యాప్తంగా 200 కంటే ఎక్కువ మందిని కో–ఆర్టినేటర్లను నియమించారు. ఏపీఎన్ఆర్టీఎస్ ఏమేమి చేసిందంటే.. ప్రవాసాంధ్రులకు సహాయనిధి, భరోసా బీమా, ఆన్లైన్ ఐటీ శిక్షణ, ఏపీ పోలీసు ఎన్ఆర్ఐ సెల్, ఫ్రీ–డిపార్టుమెంట్ ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీఎన్ఆర్టీఎస్ ట్రస్ట్ కనెక్టు టు ఆంధ్రా, పెట్టుబడులు సలహాలు, పవిత్ర నాణేలు, ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కేంద్రం, పాస్పోర్టులో సలహాలు, మరణించిన ఎన్ఆర్టీఎస్ బంధువులకు ఎక్స్గ్రేషియా, అధునాతన ఐటీ కోర్సులలో ఆన్లైన్ శిక్షణ , అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ, అంతర్జాతీయ కంపెనీలలో నియామకాల సౌకర్యం వంటి ఉచిత సేవలను అందజేశారు. జగన్న పాలనలో గల్ఫ్ బాధితులకు భరోసా ఏపీఎన్ఆర్టీఎస్తో ఎందరికో ఆపన్నహస్తం కూటమి పాలనలో సేవలకు మంగళంఏపీఎన్ఆర్టీఎస్తో విదేశాలలో ఉన్నవారికి భరోసా ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా విదేశాలలో ఉన్నవారికి భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ సొసైటీ ద్వారా విస్తతృంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ దిశగా అనేక మంది విదేశీ బాధితులను ఆదుకునేందుకు సొసైటీ ముందుకు నడిచేలా జగనన్న ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ను తీర్చిదిద్దింది. చిల్లా కిరణ్, యూఎస్ఏ, వెంకటరెడ్డిపల్లె, రైల్వేకోడూరుజగనన్న పాలనలో ఏపీఎన్ఆర్టీఎస్ బలోపేతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన పాలనలో ఏపీఎన్ఆరీటీఎస్ బలోపేతం చేశారు. అప్పటి వరకు ఇలాంటి సొసైటీ ఒకటి ఉందనేది చాలా వరకు తెలియదు. వైఎస్సార్సీపీ పాలనలో సొసైటీ ద్వారా ఎందరో గల్ఫ్ బాధితులను ఆదుకున్నారు. కోవిడ్–19లో తనదైన రీతిలో సేవలందించారు. రాయలసీమలో గల్ఫ్ వాసుల కుటుంబాలు అధికంగా ఉన్నాయి. ఆ దృష్ట్యా రాజంపేటలో సొసైటీ ఏర్పాటు చేశారు. –గోవిందు నాగరాజు, వైఎస్సార్సీపీ గల్ఫ్ కో–కన్వీనర్, కువైట్ -
గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న లక్కిరెడ్డిపల్లెలోని అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంగమ్మా ..కరుణించమ్మా.. సకాలంలో వర్షాలు కరుపించు తల్లీ అంటూ భక్తులు అంటూ వేడుకున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు -
మీలో ఉందా.. ఆలోచనా శక్తి!
మదనపల్లె సిటీ: విద్యార్థుల్లో, ఆలోచన శక్తిని పెంపొందించి పరిశోధనల వైపు ఆసక్తిని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇన్స్పైర్మనాక్ అవార్డుల పేరుతో ప్రోత్సహిస్తుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ , డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రస్తుత విద్యా సంవత్సరం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున అందజేసి ప్రోత్సహిస్తుంది. విద్యాశాఖ పరిధిలోని అన్ని యజమాన్యాలు, ప్రభుత్వం, ప్రైవేట్, కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూల్స్, అన్ని పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఇన్స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర ,జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 2025–26 ఇన్స్పైర్ మనాక్ అవార్డుల ప్రదర్శనకు ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. ఏటా ప్రతిష్టాత్మకంగా.... కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఏటా ఇన్స్పైర్ మనాక్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ,రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఈ సరికొత్త వేదికను రూపొందించారు. దీనిలో అన్ని ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. జిల్లాలో 304 ఉన్నత, 162 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దీని కోసం 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు తరగతికి ఒకరు వంతున పాఠశాలకు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే అవకాశం ఉంది. 2008–09 నుంచి ఏటా నిర్వహించే ఇన్స్పైర్ మనాక్ పోటీలకు ప్రభుత్వ, ప్రైవేటు మేనేజ్మెంట్ల పాఠశాలల నుంచి ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. వెబ్సైట్లో నమోదు ఇలా.. విద్యార్థులు వెబ్సైట్ www.inspireaawards. gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిల్లా అథారిటీ ఆమోదం తర్వాత విద్యార్థి మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింకు వస్తుంది. యూజర్ ఐడీకి పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాలి.విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంకు లేదా తపాలా ఖాతా, ఆధార్ నంబర్లను నమోదు చేయాలి. ఎంచుకున్న ప్రాజెక్టును సంక్షిత్తంగా వెబ్సైట్లో నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషికం అందిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఇన్స్పైర్ మనాక్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్ ,జపాన్ సందర్శన అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కాలేజీ విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశం కూడా ఉంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్సు అధికారులను సంప్రదించాలి. ప్రోత్సహించాలి విద్యార్థులలో పరిశోధనలపై ఆసక్తిని పెంచడానికి,పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి ఇన్స్పైర్ మానక్ అవార్డులు మంచి అవకాశం. ఆసక్తి ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ప్రాజెక్టులు తయారు చేయించాలి. –మార్ల ఓబుల్రెడ్డి, జిల్లా సైన్సు అధికారిచక్కని అవకాశం విద్యార్థులు తమలోని సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు ఇన్స్పైర్ మనాక్ ఒక చక్కని అవకాశం. ఈ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి. జిల్లా నుంచి అధికంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్లో గొప్ప శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశం లభిస్తుంది. –సుబ్రమణ్యం, డిఈఓతొలుత పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను పరిష్కరించేలా ఐడియా ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి వివవరాలు నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించి బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబర్, ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి,సంబంధిత రైటప్ వెబ్సైట్లో ఎంటర్ చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతను సంబంధించి అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టుల ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 తేదీ వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసుకునే విధానం ఇన్స్పైర్ మనాక్ నామినేషన్ల నమోదుకు శ్రీకారం సెప్టెంబర్ 15 వరకు గడువు -
● ఐదు మండలాలు జిల్లాలోకి...
మదనపల్లె: అడక్కుంటే అమ్మైనా అన్నం పెట్టదు అన్నది సామెత. అయితే పుంగనూరు నియోజకవర్గ ప్రజలు తాము ఉంటున్న చిత్తూరుజిల్లా నుంచి తప్పించి అన్నమయ్య జిల్లాలోకి విలీనం చేయండని అడగకపోయినా ప్రభుత్వమే రాజకీయ నిర్ణయం తీసుకుని విభజన చేస్తోంది. ఏదైనా సమస్య ఉంటే ప్రజలే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విన్నవించుకుంటారు. అయితే ఎవరూ అభ్యర్థించకపోయినా ఒక ప్రాంత ప్రజలను, భౌగోళికంగా అనువైన పరిస్థితుల నుంచి తప్పించి మరో ప్రాంతంలో కలిపితే దాన్ని రాజకీయ విభజన అని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిత్తూరుజిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్యజిల్లాలోకి కలపాలంటూ ప్రజల నుంచి వినతులు లేకపోయినా ప్రభుత్వం రాజకీయ విభజన చేపట్టింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడుతూ ఉత్తర్వు రావడం, అదేరోజు అన్నమయ్యజిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. నెలరోజుల గడువుతో అభ్యంతరాలను ఆహ్వనించిన ప్రభుత్వం ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి విలీనం చేసేందుకు సిద్ధమైపోయింది. అభ్యంతరం లేకుండా విభజన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరుజిల్లాను విభజించి కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ విషయంలో ఒక్క అభ్యంతరం లేకుండా ప్రజలకు అనుకూలమైన విధంగా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడిజిల్లాకు చెందిన పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరుజిల్లాలో ఉంచేసి, మిగిలిన తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలను అన్నమయ్యజిల్లాలో కలిపారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీనితో సునాయసంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగిసింది. పుంగనూరు నియోజకవర్గం చిత్తూరులో కొనసాగించే విషయంలోనూ అభ్యంతరాలు లేవు. అంటే నియోజకవర్గ ప్రజలు చిత్తూరులో కొనసాగేందుకు సముఖత వ్యక్తం చేశారు. కూటమి రాగానే విభజన మంత్రం అందుకుంది. అడక్కుండానే మార్పు పుంగనూరు నియోజకవర్గ ప్రజలు తమను అన్నమయ్యజిల్లాలోకి విలీనం చేయాలన్న విన్నపాలు తెరపైకి తేలేదు. ఇప్పుడున్న స్థితినే కోరుకున్నారు. డివిజన్ కేంద్రం మదనపల్లెకు రావడం కంటే చిత్తూరు కేంద్రం దగ్గరని ఇక్కడి ప్రజలకు తెలుసు. మదనపల్లెకు చౌడేపల్లి, పుంగనూరు పట్టణం మినహా మిగిలిన సోమల, సదుం, పులిచర్ల, రొంపిచర్ల మండలాలు భౌగోళికంగా పాలనాపరంగా చిత్తూరు దగ్గరలో ఉంటుంది. పులిచర్ల మండలం చిత్తూరు, తిరుపతిజిల్లా కేంద్రాలకు సమీపంలో ఉంటుంది. మిగిలినవన్నీ మదనపల్లెకు దూరంగా ఉంటాయి. దీన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం మదనపల్లె డివిజన్లో కలిపేసేందుకు నిర్ణయించింది. పెద్దిరెడ్డిపై కక్షతోనే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై రాజకీయంగా కక్ష సాధించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. తప్పుడు ఆరోపణలతో ఇబ్బందులకు గురి చేసే యత్నాలు సాగాయి. అందులో నిజాలు లేవని తేలిపోవడంతో ప్రభుత్వం రాజకీయంగా దెబ్బతిసేలా అభివృద్ధి పనులు, రిజర్వాయర్ల పనులను అడ్డుకుంది. అయినా దాహం తీరని ప్రభుత్వం పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరునుంచి వేరుచేసి అన్నమయ్యజిల్లాలో కలిపేందుకు సిద్ధమై ఈ మేరకు చర్యలు పూర్తి చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిత్తూరుజిల్లాలో పుంగనూరు ఉంచడంపై ఒక్క అభ్యంతరం లేదు ప్రస్తుతం ఎవ్వరూ అడక్కపోయినా అన్నమయ్యజిల్లాలో కలిపేందుకుప్రభుత్వం నుంచి చకచకా ఆదేశాలు, అమలు పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, ఒక మున్సిపాలిటీని అన్నమయ్య జిల్లాలోకి విలీనం చేయనున్నారు. అయితే పులిచర్ల మండలం మదనపల్లె డివిజన్లోకి మారే విషయంలో ప్రజల నుంచి చిత్తూరు కలెక్టరేట్కు అభ్యంతరాలు వచ్చాయి. అలాగే అధికార టీడీపీ నేతలు చిత్తూరు లేదా తిరుపతి డివిజన్లో కొనసాగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అన్నమయ్యజిల్లాలోకి ఐదు మండలాలు కలిపితే అవి మదనపల్లె రెవెన్యూ డివిజన్లోకి కలుపుతారు. వీటిలో రొంపిచర్ల పీలేరుకు దగ్గర్లో ఉంటుంది, మదనపల్లెకు 80 కిలోమీటర్లకుౖపైగా దూరం కాబట్టి రాయచోటి డివిజన్లో కలిపే అవకాశం లేకపోలేదు. దీంతో మండలాల సంఖ్య 35కు, పుంగనూరు మున్సిపాలిటీతో కలిపి మున్సిపాలిటీల సంఖ్య నాలుగుకు చేఽరుతుంది. ఒక నగర పంచాయతీ ఉంటుంది. 32.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పుంగనూరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,29,261 మంది. ఇది భౌగోళికంగా తూర్పున తిరుపతిజిల్లా, పశ్చిమాన కర్ణాటక, ఉత్తరాన అన్నమయ్యజిల్లా సరిహద్దు కలిగి ఉంది. ఈ విలీనం తర్వాత అన్నమయ్యజిల్లా స్వరూపం మారిపోనుంది. -
బంగారు భవిత
గ్రామీణ విద్యార్థులకు వేంపల్లె: గ్రామీణ పేదవర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచనలకు రూపమే ట్రిపుల్ ఐటీలు. వీటిని ఆర్జేయూకేటీ నిర్వహిస్తోంది. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తెలిపారు. ఉదయం 9 గంటలకు క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈనెల 23న రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు ఎంపిక జాబితా విడుదల చేశారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈనెల 30 వ తేదీ, జులై 1వ తేదీలలో ఎంపికై న విద్యార్థులకు కౌన్సెలింగ్ పక్రియ ఉంటుంది. ఈ పక్రియకు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమార స్వామిగుప్తా తెలిపారు. రెండు రోజుల్లో 1,060 మందికి కౌన్సెలింగ్ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో భాగంగా రెండు రోజుల్లో ప్రత్యేక కేటగిరీ మినహా 1060మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 30వ తేదీ (సోమవారం) 530 మంది అభ్యర్థులకు, జూలై 1వ తేదీన 530 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్కు అవసరమైనవి పదోతరగతి హాల్ టికెట్, పదోతరగతి మార్కుల జాబితా, టెన్త్ టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), మీసేవా కేంద్రం నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత మీసేవా కేంద్రం ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, అభ్యర్థి, అతని తల్లిదండ్రుల రెండు పాసు పోర్టు ఫొటోలు, రేషన్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు లోన్ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డు అందజేయాలి. విద్యార్థులు ఎలా రావాలంటే .. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు తదితర జిల్లాల వైపు నుంచి వచ్చేవారు వేంపల్లె బస్టాండుకు చేరుకున్న తర్వాత అక్కడి నుండి ప్రతి నిమిషానికి ఇడుపులపాయకు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. వేంపల్లె నుంచి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి 15 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంది. అంతేకాకుండా వేంపల్లె బస్టాండు, నాలుగు రోడ్ల కూడలిలో దిగిన తర్వాత అక్కడనుండి వీరన్నగట్టుపల్లి మీదుగా ట్రిపుల్ ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి. ● క్రమశిక్షణ..ఉత్తమ విద్యాబోధన ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనలో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన విద్యాబోధన, క్రమశిక్షణ, ఉత్తమ సామాజిక స్పృహ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ సొంతం. ఉదయం 7గంటలకు అల్పాహారం, అనంతరం అసెంబ్లీ, 8 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు, ఒంటిగంట వరకు భోజన విరామం, మళ్లీ ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్, 6గంటల వరకు ఆటలు, రాత్రి 7గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్ ఇవి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్ కు సమానమైన పీయూసీ కోర్సును, తర్వాత నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్యను బోధిస్తారు. ‘ట్రిపుల్ ఐటీలో చేరిన తర్వాత విద్యార్థులు మొదటి, రెండు సంవత్సరాలు (పీయూసీ) ఏడాదికి రూ.45 వేలు, తర్వాత నాలుగేళ్లు (ఇంజనీరింగ్) ఏడాదికి రూ.50వేల చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదుపోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్కు ఏర్పాట్లు పూర్తి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఆర్కే వ్యాలీ ట్రిపుల్ క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో 530 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి కొత్తగా వచ్చిన విద్యార్థులకు భోజనం వసతి, మౌలిక వసతులు తదితర ఏర్పాట్లు చేశారు. ముందుగా ట్రిపుల్ ఐటీ ముఖద్వారం వద్ద విద్యార్థులు టోకెన్ తీసుకుని సెంట్రల్ లైబ్రరీలో దరఖాస్తు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుంది. నేటి నుంచి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 30వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని తెలిపారు. క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు మదనపల్లె సిటీ: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి గౌస్భాషా అన్నారు. మదనపల్లె సమీపంలోని వేద పాఠశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే షాజహాన్బాషా ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచి క్రీడపట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పుట్బాల్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్కుమార్, మురళీధర్, రాష్ట్ర పరిశీలకులు సిరాజ్అహ్మద్, చినబాబు,కమలేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి, వైజాగ్ జిల్లాల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. రెడ్డెమ్మా..కరుణించమ్మా... గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. భక్తులు అమ్మవారికి వేకువజామునే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానం ఆచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు.రాయలసీమ జిల్లాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. -
నిబంధనలు గాలికి..
కడప అగ్రికల్చర్: కడప కలెక్టరేట్ ఆవరణలోని ఉద్యాన, వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండోరోజు ఉమ్మడి కడపజిల్లా సచివాలయ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు బదిలీ కౌన్సెలింగ్ కొనసాగింది. రెండోరోజు కూడా అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారు. ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. కూటమి నేతలు ఇచ్చిన లెటర్లతోపాటు వారి ఫోన్లకే ప్రాధాన్యత కల్పించినట్లు పలువురు ఉద్యోగులు ఆరోపించారు. కూటమి నేతలు చెప్పిన వాళ్లకే మంచి స్థానాలను కేటాయించారని చర్చించుకున్నారు. వ్యవసాయ సహాయకులకు సంబంధించి 94 మందికి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో కూడా స్పౌజ్, మెడికల్ కేసులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. ప్రభుత్వ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా తమకు అన్యాయం చేశారని పలువురు బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక డిజేబుల్ అమ్మాయిని లక్కిరెడ్డిపల్లె నుంచి రాజుపాలెం మండలానికి బదిలీ చేసినట్లు, మరో మెడికల్ గ్రౌండ్ ఉన్న అబ్బాయిని పెద్దముడియం నుంచి వీఎన్పల్లెకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని మెరపెట్టుకున్నా అధికారులు పెడచెవిన పెట్టారని తెలిసింది. అలా ఒకరిద్దరికి కాకుండా చాలా మందికి అన్యాయం జరిగినట్లు తెలిసింది. కౌన్సెలింగ్కు వచ్చిన అభ్యర్థులను ర్యాంకుల వారీగా పిలిపించి వారికి వచ్చిన స్థానాలను కేటాయించారు. అయితే ఈ స్థానాలను తరువాత ఇచ్చే అర్డర్లో కనపరుస్తారా లేక అధికార పార్టీ నేతలు చెప్పిన వాళ్లకు కట్టుబెడతారా అనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బదిలీల్లో అన్యాయం జరిగిన వ్యవసాయ సహాయకులంతా ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రెండవ రోజు కూడా సరైన వసతులు లేక వ్యవసాయ సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఉద్యానశాఖ సహాయకులకు సంబంధించి రెండోరోజు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉద్యాన, వ్యవసాయ సహాయలకు బదిలీలకు సంబంధించి డీఏఓ చంద్రనాయక్ డీహెచ్ఓ రవిచంద్రబాబులు మాట్లాడుతూ రెండో రోజు బదిలీల కౌన్సిలింగ్ను కూడా సిఫారస్సులకు తావు లేకుండా నిర్వహించామని తెలిపారు. ● రైతు సేవా కేంద్రాలకు వచ్చిన ఎరువులును విక్రయించగా వచ్చిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లించకుండా గతంలో కొందరు వ్యవసాయ సహాయకులు సొంతానికి వాడుకున్నారు. ప్రస్తుత బదిలీల్లో డబ్బులు వాడుకున్న వారికి ఈ వ్యవహారం గుదిబండగా మారింది. బకాయి డబ్బులను చెల్లిస్తేనే బదిలీకి అనుమతి ఇస్తామని, లేకుంటే లేదని అధికారులు వారికి సూచించినట్లు తెలిసింది. దీంతో బకాయిలు ఉన్న కొంతమంది డబ్బులు చెల్లించగా అధిక మొత్తంలో బకాయిలు ఉన్న వారు మాత్రం చెల్లించలేకపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అధికారులు వారితో ఒప్పందం తీసుకుని బదిలీలో చోటు కల్పించినట్లు తెలిసింది. రెండోరోజు మెడికల్ గ్రౌండ్, స్పౌజ్ కేసులకు అన్యాయం అధికారి పార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట అన్యాయం జరిగిందని ఆందోళన -
లేబర్ కోడ్లు రద్దు కోరుతూ జులై 9న దేశవ్యాప్త సమ్మె
రాయచోటి : కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు డిమాండ్ చేశారు. ఇందుకోసం జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. శనివారం రాయచోటిలోని సీఐటీయూ కార్యాలయంలో కౌలు రైతు సంఘం నాయకులు రమేష్బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.రామచంద్ర, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ల అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెప్పు కోసమే ప్రధాని మోడీ కార్మికవర్గం మీద భారాలు వేస్తూ లేబర్ కోడ్లను తెచ్చారన్నారు. విశాఖ ఉక్కు లాంటి సంస్థలో కార్మికులను తొలగించి ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటే రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న విజన్ 2047 బూటకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆఫీస్ బేరర్స్ రవికుమార్, భాగ్యలక్ష్మీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
క్వాంటమ్ కంప్యూటింగ్ జీవన విధానాన్ని మార్చే టెక్నాలజీ
కురబలకోట : క్వాంటమ్ కంప్యూటింగ్ జీవన విధానాన్ని మార్చే టెక్నాలజీ కాగలదని పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ బి. సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అనంతపురం జేఎన్టీయూతో కలసి క్వాంటమ్ న్యూరో మార్పిక్ కంప్యూటింగ్ ఫర్ సస్టైనబుల్ జనరేటివ్ ఏఐపై ఐదు రోజుల పాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ లక్షల సంవత్సరాలు పట్టే లెక్కల్ని క్వాంటమ్ కంప్యూటర్లు నిమిషాల్లో చేయగలవన్నారు. భవిష్యత్తులో భద్రతా వ్యవస్థలు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థికం, మీడియా, కమ్యూనికేషన, సైబర్ భద్రత, విద్య, వాతావరణం, ఖగోళ పరిశోధన వంటి రంగాలను ప్రభావితం చేసేలా జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. విద్యార్థులు, యువత ఈ రంగంలో రాణిస్తే కీలకమైన స్థానానానికి చేరుకోవచ్చన్నారు. -
డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో భాగంగా శనివారం మూడో రోజు కడప –కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 14 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 97 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ఆ జట్టులోని విష్ణు వర్దన్ నాయుడు 134 బంతుల్లో 100 పరుగుల సెంచరీ చేసి నాటౌట్గా నిలిచాడు. సాయి గణేష్ 72 పరుగులు చేశాడు. కడప జట్టులోని శివశంకర్ 3 వికెట్లు, ఆర్దిత్రెడ్డి 2 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో 765 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన నెల్లూరు–అనంతపురం మ్యాచ్లో ఆనంతపురం జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శనివారం మూడో రోజు 173 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 99.2 ఓవర్లలో 405 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 211 బంతుల్లో 135 పరుగులు, షాహుల్ హమీద్ 89 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి 3 వికెట్లు, కేహెచ్ వీరారెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 24.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి 37 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని షాహుల్ హమీద్ 2 వికెట్లు తీశాడు.కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో 6 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు విజయం -
భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
వీరబల్లి : దళిత, గిరిజనుల భూములు ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యుడు సిద్దిగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ గడికోట గ్రామ పరిధిలోని వేల్పుల మిట్ట హరిజనవాడ, గిరిజనులలు వాడల్లో ఉన్న వారికి సర్వే నెంబరు. 1128/7, 1128/9లో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా ఒక్కొక్కరికి ఎకరా చొప్పున పంపిణీ చేశారన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆ భూములను జేసీబీల ద్వారా చదును చేసే ప్రయత్నం చేస్తూ దళిత, గిరిజనుల కుటుంబాలను భయపెడుతున్నారన్నారు. అధికారులు స్పందించి దళితులకు న్యాయం చేయాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసి దుర్మరణం
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న రోడ్డుప్రమాదంలో ప్రకాశంజిల్లా వాసి దుర్మరణం చెందిన ఘటన శనివారం కర్ణాటక సరిహద్దులోని రాయల్పాడు సమీపంలో జరిగింది. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లె పంచాయతీ ముర్గాని గ్రామానికి చెందిన ఎరుకులయ్య కుమారుడు పెద్దిరెడ్డి గారి పేరారెడ్డి(32) ద్విచక్రవాహనంలో మదనపల్లె మీదుగా బెంగళూరు వైపు వెళుతున్నాడు. మార్గమధ్యంలోని కర్ణాటక సరిహద్దు రాయల్పాడు వద్ద ఎదురుగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పేరారెడ్డిని స్థానికుల సహాయంతో రాయల్పాడు పోలీసులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి జేబులోని ఆధార్కార్డు, సెల్ఫోన్లోని నంబర్ల ఆధారంగా ఆచూకీని గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాయల్పాడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
బనకచర్ల గేమ్ ఛేంజర్ కాదు
రాయచోటి టౌన్ : బనకచర్ల గేమ్ ఛేంజర్ కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టే ప్రాజెక్టు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే బనకచర్ల గేమ్ఛేంజర్ అని మాట్లాడుతున్నారన్నారు. గేమ్ ఛేంజర్ అంటే ఏమిటి.. ? దీని వలన ప్రజలకు ఏమి మేలు జరుగుతుందనే ఆలోచన నాయకులకు లేదా అని ప్రశ్నించారు. బనక చర్ల క్రాస్కు రూ.85 వేల కోట్లతో టెండర్లు పిలుస్తామని చంద్రబాబు చెబుతున్నారన్నారు. బనక చర్ల క్రాస్కు పోలవరం నుంచి రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి నీళ్లు వదిలితే ఇక్కడ కొత్తగా ఆయకట్టు పెరుగుతుందా అని అడిగితే సమాధానం లేదన్నారు. ఆయకట్టు స్థిరీకరిస్తున్నారా అని అడిగినా స్పందన లేదన్నారు. రాజధానిలో భవన నిర్మాణాల కోసం అడుగుకు రూ.12000 నుంచి 15000ల మధ్య రేటుతో టెండర్లు పిలవడం చూస్తే ఎంత ప్రజాధనం వృథా అవుతుందో తెలుస్తుందన్నారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఈ రకమైన దోపిడీ చేయడం సరైనదేనా అని అడుగుతున్నామన్నారు. రాయచోటి ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎంతో కష్టపడి ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, పీవీ మిథున్రెడ్డిల సహకారంతో 45 శాతం పనులు పూర్తి చేయించామన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయమంటే పలికే వారు లేరన్నారు. రాజధాని పే రుతో జరుగుతున్న అవినీతిని బయటకు రానీయ కుండా దృష్టి మరల్చేందుకే చంద్రబాబు బనకచర్ల క్రాస్ను తెరపైకి తెచ్చారన్నారు. చంద్రబాబు నా యుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగు ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం ఇవ్వడం లేదన్నారు. వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారని అది ప్రజాస్వామ్యంలో జరగదన్నారు. ఎఎవరికీ అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు కృషి చేశా.. తొలుత తాను ఎమ్మెల్యే అయినప్పుడు గల్లా అరుణ కుమారి ద్వారా రూ.60 కోట్లతో రాయచోటిలో రింగ్ రోడ్డును నిర్మింపచేశానన్నారు. దాంతో రూ.15 వేల కోట్ల రియల్ ఎస్టేట్ జరిగిందని, అది సంపద సృష్టి అన్నారు. తహసీల్దార్ స్థాయిలో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే మాటలు కాకుండా ప్రతిపక్షం అడుతున్న వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రహిమాన్, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్, పట్టణ అధ్యక్షుడు నవాజ్, ఎస్పీఎస్ రిజ్వాన్, కౌన్సిలర్లు గౌస్ఖాన్, అల్తాఫ్, సుగవాసి ఈశ్వర్ప్రసాద్, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, మేధావుల ఫోరం నియోజక వర్గం అధ్యక్షుడు జానం రవీంద్ర యాదవ్, ఖలీల్, చిన్నమండెం సుక్కా అంజనప్ప తదితరరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసు నమోదు
సిద్దవటం : మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇతరులకు ఇబ్బందికరంగా మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లీబిడ్డల అదృశ్యం బి.కొత్తకోట : తల్లి, ఇద్దరు బిడ్డల అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు..బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన బత్తుల వాసు 14 ఏళ్ల క్రితం సునీలను వివాహం చేసుకున్నాడు. వీరికి సందీప్, కీర్తన సంతానం. శుక్రవారం ఉదయం వాసు పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాడు. ఇంటిలో చూడగా భార్య, పిల్లలు కనిపించలేదు. ఆందోళనకు గురైన వాసు సోదరుడు ఆంజనేయులతో కలిసి బి.కొత్తకోట, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీనితో వాసు ఫిర్యాదు మేరకు అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మొయిందిపల్లికి చెందిన రేవూరి శంకరయ్య (50)ను రైల్వేస్టేషన్కు వెళ్లే దారిలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై రాత్రి 10 గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించి కేసు నమోదు చేశారు. -
పంజంకు కన్నీటి వీడ్కోలు!
సాక్షి రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్: వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ పంజం సుకుమార్రెడ్డి (64)కి పార్టీ నేతలు, శ్రేణులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆప్యాయంగా పలుకరించడమే కాకుండా నవ్వుతూ మాట్లాడే పంజం సుకుమార్రెడ్డిని తలుచుకుని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్యంతో చైన్నెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే. శనివారం ఉదయం అంత్యక్రియుల నిర్వహించారు. అంతకుముందు అన్నమయ్య, వైఎస్సార్ కడప, తిరుపతితో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి నివాళి అర్పించారు. పంజం కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. నేతల నివాళి రైల్వేకోడూరు మండల పరిధిలోని అనంతరాజుపేట పంచాయతీ తూర్పుపల్లిలో పంజం సుకుమార్రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న పార్టీ కీలక నేతలు నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, కడప పార్లమెంట్ పరిశీలకులు, స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, ఆర్టీసీ మాజీ రాష్ట్ర చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, వత్తలూరు సాయికిషోర్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ సలహాదారుడు సంబటూరు ప్రసాద్రెడ్డి తదితరులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకుని శుక్రవారం రైల్వేకోడూరుకు వచ్చిన సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి పంజం సుకుమార్రెడ్డి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సుకుమార్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పంజం సందీప్రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే జనసేన, టీడీపీ నాయకులు కూడా పంజం సుకుమార్రెడ్డికి నివాళులర్పించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నాయకురాలు ముక్కా వరలక్ష్మి కూడా నివాళులర్పించారు. ఘనంగా అంతిమ వీడ్కోలు తూర్పుపల్లిలోని పంజం సుకుమార్రెడ్డి ఇంటి వద్ద నుంచి అంతిమ యాత్ర సాగింది. పార్టీ శ్రేణులు, నేతలు, గ్రామస్తులు, కుటుంబీకులు భారీగా పాల్గొన్నారు. ఇంటి వద్ద నుంచి పంజం సుకుమార్రెడ్డి వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. పార్టీపట్ల నిజాయితీ కలిగిన నాయకుడు: మాజీమంత్రి పెద్దిరెడ్డి సీనియర్ నాయకులు పంజంసుకుమార్రెడ్డి మృతి చెందడం భాదాకరమని, అలాగే తను నమ్మిన పార్టీ, వైఎస్ఆర్ కుటుంబం పట్ల నిజాయితీకలిగిన నాయకుడని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సుకుమార్రెడ్డి రాజకీయాల్లో ఉన్ననాటి నుంచి తనకు పరిచయం ఉందని తెలిపారు. పార్టీ పటిష్టతకు నిబద్ధతతో పని చేసేవాడని తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ, అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండలు అన్ని వేళలా ఉంటాయని తెలిపారు. కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు సుకుమార్రెడ్డి పార్థివదేహం వద్ద నివాళులర్పించిన పెద్దిరెడ్డి, అంజద్బాషా తదితరులు -
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక లక్ష్మీహాలు సమీపంలో నివాసముంటున్న రాజకుళ్లాయమ్మ అనే మహిళ ఈనెల 18న కడప రిమ్స్లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఐదు రోజుల క్రితం రాజకుళ్లాయమ్మ కడప రిమ్స్ నుంచి పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పసికందును రాజకుళ్లాయమ్మ స్నేహితురాలు కుమారి అపహరించి తీసుకెళ్లింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలు కుమారి తమ బంధువుల ఇంటి దగ్గర ఉండడంతో పులివెందుల పోలీసులు ఆమెను అరెస్టు చేసి పులివెందుల స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ మాట్లాడుతూ రాజకుళ్లాయమ్మ, కుమారి ఇద్దరూ పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నారని తెలిపారు. కుమారి శుక్రవారం రాజకుళ్లాయమ్మ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందును అపహరించి తీసుకెళ్లిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే పసికందును కిడ్నాప్ చేసిన నిందితురాలిని అరెస్ట్ చేశామన్నారు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. -
కొత్తరైలు మార్గంలో తొలిప్రయాణం!
రాజంపేట: హైదరాబాద్ నుంచి తిరుపతికి కొత్తమార్గంలో తొలి ప్రయాణం అందుబాటులోకి రానుంది. జూలై 4 నుంచి నాందేడ్–తిరుపతి మధ్య తిరిగే రైలును పిడుగురాళ్ల–శావల్యపురం మధ్య నూతనంగా నిర్మించిన మార్గం ద్వారా మార్కాపురం, నంద్యాల, కడప మీదుగా తిరుపతికి తొలిసారిగా నడపనున్నారు. నెమలిపురి, రొంపిచెర్ల రైలు కూత తొలిసారి వినపడనుంది. జూలై 11, 18, 25 తేదీల్లో తిరుపతికి, జూలై 6, 13, 20, 27 తేదీల్లో నాంధేడ్కు ఈ రైలు ప్రయాణిస్తుంది. టైమింగ్స్ ఇలా.. నాందేడ్లో సాయంత్రం 4.30కి, బాసరకు 6గంటలకు, నిజమాబాద్కు 6.25కు చేరుకుంటుంది. కామారెడ్డి మీదుగా మేడ్చల్కు రాత్రి 8గంటలకు, చెర్లపల్లెకు 9.30గంటలకు వస్తుంది, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడిమీదుగా పిడుగురాళ్లకు రాత్రి 12.30గంటలకు చేరుకుంటుంది. దొనకొండ,మార్కాపుం రోడ్, కంభం, గిద్దలూరు మీదుగా నంద్యాల ఉదయం 5.30గంటలకు వస్తుంది. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కడపకు 8.50కి చేరుకుంటుంది. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మధ్యాహ్నాం 12.30 గంటలకు చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో తిరుపతిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరుతుంది. కడపకు 4.15కు, నంద్యాలకు 7,45గంటలకు చేరుకుంటుంది. నాంధేడ్కు మరుసటిరోజు ఉదయం 9.30గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి–నాందేడ్ మధ్య ప్రత్యేక రైలు జిల్లా వాసులు బాసర, షిర్డీ వెళ్లేందుకు అనుకూలం -
●హార్సిలీహిల్స్ బాబాదే
పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ను యోగాగురువు రాందేవ్ బాబాకు ఇచ్చేసినట్టే అన్న సంకేతాలను సీఎం చంద్రబాబు ఇచ్చేశారు. హార్సిలీహిల్స్కు చరిత్ర ఉంది, రాందేవ్ బాబా వెల్నెస్ సెంటర్ ప్రారంభిస్తే అందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పిస్తానని ఆయనను ఉద్దేశించి ప్రకటించారు. ఏప్రిల్ 14న పతంజలి ప్రతినిధులు హార్సిలీహిల్స్లో పర్యటించి వెళ్లాక రాందేవ్ బాబా స్వయంగా ఈనెల 25న హార్సిలీహిల్స్ వచ్చి బాగుంది ప్రపంచ స్థాయి వెల్నెస్ సెంటర్ ప్రారంభిస్తామని ప్రకటించి..హార్సిలీహిల్స్ నచ్చేసిందని నేరుగానే చెప్పేశారు. ఇక్కడినుంచి వెళ్లిన రెండోరోజే చంద్రబాబు సమక్షంలో హార్సిలీహిల్స్ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తానని రాందేవ్ బాబా చెప్పడం, దానికి చంద్రబాబు కొనసాగింపుగా వెవెల్నెస్ సెంటర్ కోసం అన్ని వసతులు కల్పించడమేకాక మినీ విమానాశ్రయం కూడా కడతానని అడక్కనే వరం ఇచ్చేశారు. దీంతో త్వరలోనే హార్సిలీహిల్స్ పతంజలి ఖాతాలోకి జమకావడం ఖాయమైపోయింది. మదనపల్లె: ఉట్టికి ఎగరలేదుకాని స్వర్గానికి నిచ్చెన వేసిందనేది సామెత. ఇప్పుడీ సామెత సీఎం చంద్రబాబుకు సరిగ్గా అతుకుతుంది. కరువు, పంటలకు గిట్టుబాటు ధర లేదు, పెట్టిన పెట్టుబడిలో పైసా తిరిగి పొందక రైతులు వందల కోట్లు నష్టపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. రైతు సమస్యలను కనీసం పట్టించుకోని సీఎం చంద్రబాబు మదనపల్లెకు మినీ విమానాశ్రయం కడతానంటూ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం జరిగిన టూరిజం పెట్టుబడుల సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు మదనపల్లె ప్రాంతం ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు, రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా ఇక్కడికి మినీ విమానాశ్రయం తెస్తానని ప్రకటించడం పక్కా వ్యాపార దృక్ఫథంతో వ్యవహరిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. శాశ్వత కరువును పారదోలడంపై ఏనాడూ సమీక్షించని చంద్రబాబు బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ను రాందేవ్ బాబాకు ఇచ్చేందుకు, ఆయన కోసమే అన్నట్టుగా మదనపల్లెలో మినీ విమానాశ్రయం కడతానంటూ గొప్పగా ప్రకటించడంపై మేధావులు, కార్మిక నేతలు మండిపడుతున్నారు. మదనపల్లె డివిజన్ రైతులు ఏడాదికాలంలో పండించిన దోస, కర్భూజ, టమాట, వేరుశెనగ, అల్లనేరేడు, మామిడి, వంగ పంటలకు కనీస ధర లేదు. ప్రతిపంటలోనూ తీవ్ర నష్టాలు చవిచూశారు. వీటిపై స్పందించని సీఎం చంద్రబాబు వ్యాపార సంస్థల కోసం విమానాశ్రయం తెస్తాననడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అవసరం లేకున్నా... 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు మదనపల్లెలో పర్యటించి ఇక్కడ విమానాశ్రయం కడతానని ప్రకటించారు. ఇక్కడ విమానాశ్రయం కట్టాల్సినంతటి అవసరం లేదు. ఆ స్థాయిలో ఫ్యూజిబులిటీ కూడా లేదు. ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ, 130 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట అంతర్జాతీయ, 120 కిలోమీటర్ల దూరంలో కడప విమానాశ్రయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడి ప్రజల చెవుల్లో పూవ్వులు పెట్టేందుకు ప్రయత్నించి విమానాశ్రయం పెడతానంటూ ప్రకటించారు. దీనిపై జోకులు వేసుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించారు. అయితే ఈ మారు బాబా రాందేవ్ కోసమే అన్నట్టు ఆయన సమక్షంలో మదనపల్లెకు మినీ విమానాశ్రయం కడతానంటూ ప్రకటించారు. మదనపల్లె (హార్సిలీహిల్స్) అంతర్జాతీయ స్థాయి వెల్నెస్ సెంటర్గా అభివృద్ధి చెందాలని, అందుకు మినీ విమానాశ్రయం తెస్తామని, ఎవరూ అడక్కపోయినా, దాని అవసరం లేకపోయినా ప్రకటించి అందర్ని విస్తుపోయేలా చేశారు. మదనపల్లె చుట్టూ మూడు విమానాశ్రయాలు ఉన్నా, ఇక్కడికి విమానాశ్రయం అవసరం లేకున్నా మళ్లీ ఆదే పాట పాడిన చంద్రబాబు వ్యాపార సంస్థల కోసమే ఈ మాటను లెవనెత్తారు. దీనివల్ల సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు ఒరిగేదేమి లేదు. రైతుల నోట్లో మట్టికొట్టి.. మదనపల్లెకు విమానాశ్రయం అంటున్న సీఎం చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రైతాంగ సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి రైతుల నోట్లో మట్టి కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రూ.8,175,91 కోట్ల విలువైన మదనపల్లె డివిజన్కు చెందిన సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసి రైతులకు తీరని ద్రోహం చేశారు. రూ.759.50 కోట్ల ముదివేడు ప్రాజెక్టు, రూ.1,217.49 కోట్ల పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులు నిలిపివేత, రూ.4,373.23 కోట్ల గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టు అనుసంధానం పనులు రద్దు, రూ.1,825.69 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని రద్దు చేసి ప్రజల, రైతుల అభివృద్ది ఆకాంక్షలపై నీళ్లు చల్లారు. 2014–19లో ఇచ్చిన హామీల్లో కొన్ని.. రైతుల కష్టాలకు దిక్కులేదు.. మదనపల్లెకు విమానాశ్రయమట 2019 ఎన్నికలకు ముందు ఇదేపాట పాడిన వైనం ఇప్పుడు మినీ ఏయిర్పోర్ట్ కడతానని ప్రకటన పారిశ్రామికాభివృద్ధి కోసం బెంగుళూరు నుంచి అనంతపురంజిల్లా మీదుగా తంబళ్లపల్లె మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలను కలుపుతూ రింగ్ రోడ్ నిర్మాణం.. జిల్లాలో పాడిరైతుల ద్వారా 50 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి పెంచేలా ప్రణాళిక.. హర్టికల్చర్ హబ్గా తంబళ్లపల్లె.. పల్లెల్లో 400 నుంచి 500 పశువులకు వసతికి పశువుల హాస్టళ్లు, బయోగ్యాస్ ఉత్పత్తి.. తంబళ్లపల్లె టమాట రైతులకు రూ.10కోట్ల ప్యాకేజీ.. టమాట ఆధారిత పరిశ్రమను స్థాపనకు పెప్సికో కంపెనీతో సంస్థల ఏర్పాటు.. కురబలకోట మండలంలోని హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఐటీ సంస్థలను స్థాపన. ఇలా పదుల సంఖ్యలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదు. -
ఖాజావలి కుటుంబానికి అండగా ఉంటాం
రాయచోటి టౌన్ : భవనం పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాయపాటి ఖాజావలి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అన్నమయ్య జిల్లా విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఖాజావలి కడప పట్టణంలోని అశోక్ నగర్లో తన ఇంటిపై తన భార్యతో కలిసి తాల్బార్ పట్ట కప్పేప్రయత్నంలో ఇంటి పైకప్పు సిమెంట్ రేకులు పగిలి కిందపడ్డాడన్నారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడన్నారు. ఆయనకు భార్య మాబున్నిసాతో పాటు నలుగురు ఆడపిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. వారి కుటుంబానికి పోలీస్ శాఖ అండ ఉంటుందని చెప్పారు. అంతకు ముందుగా పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దహన సంస్కారాల కోసం రూ.1లక్ష నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ యం. శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ యం. పెద్దయ్య, అన్నమయ్య, కడప పోలీసులు పాల్గొన్నారు. -
రహదారి కబ్జాకు కూటమి నాయకుల యత్నం
రాజంపేట రూరల్ : ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి నాయకుల అరాచకాలకు, కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనేది బహిరంగ రహస్యం. తాము చేసేది చట్టం.. చెప్పిందే న్యాయంగా కూటమి నాయకుల తీరు కొనసాగుతుంది. అందుకు ఉదాహరణగా మండల పరిధిలోని ఊటుకూరు పంచాయతీలో శుక్రవారం పట్ట పగలు రహదారిని కబ్జా చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నించడాన్ని చెప్పుకోవచ్చు. రహదారి కోసం పోరాటం.. ఊటుకూరు పంచాయతీలోని సర్వే నెంబరు 224, 225లలో గల 3 ఎకరాల పట్టా భూమిలోకి వెళ్లేందుకు రహదారి కోసం వైఎస్సార్సీపీ కార్యకర్త జగదాభి నాగేశ్వరరాజు కొన్ని సంవత్సరాలు పోరాటం చేశారు. చివరకు హై కోర్టు 2023లో నాగేశ్వరరాజుకు అనుకూలంగా రహదారి నిర్నాణం కోసం తీర్పునిచ్చింది. అదే విధంగా రెవిన్యూ, ఇరిగేషన్శాఖ అధికారులు పలు పర్యాయాలు వివాద స్థలంను సందర్శించి అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నాగేశ్వరరాజుకు రహదారిని నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అధికారులతో పాటు పోలీసుల సమక్షంలో 2023లో రహదారిని నిర్మించుకున్నారు. కబ్జాకు యత్నం.. రహదారిని నిర్మించిన స్థలం 1947 సర్వే నెంబరులోని 43 సెంట్లు ఆర్ఎస్ఆర్ ప్రకారం గయ్యాళీ పొరంబోకుది. కూటమి ప్రభుత్వంకు చెందిన చేజర్ల వాసుదేవరాజు ఈ స్థలంను కబ్జా చేసుకునేందుకు దౌర్జన్యంకు యత్నించారు. శుక్రవారం ఉదయం పాత రహదారిపై జేసీబీని ఉంచి వాసుదేవరాజు అతని మనుషులు మాటు వేసి ఉన్నారు. పొలంలో ఉన్న నాగేశ్వరరాజు ఇంటికి వెళ్లగానే రహదారిని జేసీబీతో తొలగించాలనేది వారి పన్నాగం. అయితే పొలం నుంచి తమ ఇంటికి వెళతున్న నాగేశ్వరరాజు జేసీబీ ఆగి ఉండటం చూసి అనుమానం వచ్చి జేసీబీ డ్రైవర్ను నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పసాగాడు. అనంతరం మాటు వేసిన వాసుదేవరాజు అతని మనుషలను చూపించాడు. దౌర్జన్యం ఆపై దాడి.. విషయం బయట పడటంతో మాటు వేసిన వాసుదేవరాజు అతని మనుషులు దాదాపు 20 మంది జేసీబీ వద్దకు వచ్చి నాగేశ్వరరాజుతో వాగ్వివాదంకు దిగారు. నాగేశ్వరరాజు జేసీబీకి అడ్డు పడటంతో మూకుమ్మడిగా దౌర్జన్యంచేసి ఆపై విచక్షణా రహతంగా దాడి చేసి గాయ పరిచారు. సమాచారం అందుకున్న మన్నూరు పోలీసులు సంఘటనా స్థలం వద్దకు వచ్చి మందలించటంతో వాసుదేవరాజు వర్గం తగ్గింది. ప్రాణాపాయం తప్పి తీవ్ర గాయాల పాలైన నాగేశ్వరరాజును వారి కుటుంబ సభ్యులు పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నాగేశ్వరరాజును మన్నూరు సీఐ కుళాయప్ప తన సిబ్బందితో వచ్చి వివరాలు అడిగి తెలుసుకొని ఫిర్యాదు స్వీకరించారు. తనకు వాసుదేవరాజు వలన ప్రాణహాని ఉందన్నారు. వ్యవసాయమే ఆధారం.. నాకు ఉన్న 3 ఎకరాలే నాకు జీవనాధారం. నాకు ఉన్నది ముగ్గురు అమ్మాయిలే. నాకు ఎవరు లేరు. నాకు వ్యవసాయమే ఆధారం. నా పిల్లలను పోషించాలన్నా నేను జీవించాలన్నా ఆ పొలమే దిక్కు. ఆ భూమికి దారి లేకుంటే మా కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకోవాల్సిందే. దయతో ఉన్నత అధికారులు స్పందించి తమ పొలంకు ఉన్న రహదారి కబ్జా కాకుండా కాపాడాలని నాగేశ్వరరాజు వేడుకుంటున్నాడు. -
మతసామరస్యానికి ప్రతీక మొహర్రం
రాజంపేట టౌన్ : ఇస్లాం క్యాలెండర్ ప్రకారం గురువారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి నెల మొహర్రం కావడంతో హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం పదిరోజుల పాటు సంతాప కార్యక్రమాలు జరుపుకుంటారు. అందువల్ల శుక్రవారం జిల్లాలోని వివిధ పట్టణాల్లో అనేక గ్రామాల్లో పీర్ల చావిడిలలో పీర్లను కొలువుదీర్చారు. ఇదిలావుంటే మొహర్రం నెలలోనే ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ రసూలల్లా సొల్లేల్లాహు అలైహి వసల్లం మనవళ్లు ఇస్లాం మత వ్యాప్తి కోసం కర్బాలా మైదానం (సౌదీ)లో పది రోజుల పాటు యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో వారి వంశానికి చెందిన 72 మంది అసువులు బాసి వీరమరణం పొందారు. వారిని స్మరించటానికి ప్రతి ఏడాది మొహర్రం నెలలో పది రోజుల పాటు కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పీర్లు కొలువుదీరాయి. ఈసందర్భంగా పీర్లను కొలిచేవారు చదివింపులు చేసి ప్రార్థనలు చేస్తారు. మత సామరస్యానికి ప్రతీక.. మొహర్రం మత సామరస్యానికి ప్రతీక అని చెప్పాలి. అనేక గ్రామాల్లో మొహర్రం ను హిందువులే ముందు ఉండి జరిపిస్తారు. కొన్ని గ్రామాల్లో హిందువుల ఇంటి నుంచి పీర్లు వెళ్ళడం, కొన్ని సాంప్రదాయమైన కార్యక్రమాలు సైతం హిందువులే చేపడతారు. ఈ సాంప్రదాయాలన్నీ కూడా అనాదిగా వస్తున్నాయి. పీర్ల పండుగను పురస్కరించుకొని చేపట్టే సాంప్రదాయమైన కార్యక్రమాలను హిందు, ముస్లీంలు గౌరవంగా కూడా భావిస్తారు. ఇక ధనవంతులు పీర్ల వేడుకకు లక్షలాది రూపాయిలు కూడా వెచ్చిస్తారు. ఈసందర్భంగా ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను సైతం ఆహ్వానించి అట్టహాసంగా పీర్ల పండుగ నిర్వహిస్తారు. గ్రామాల్లో కోలాహల వాతావరణం మొహర్రం సందర్భంగా పట్టణాల్లోకంటే గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పలు ప్రాంతాల్లో పీర్ల వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తారు. అందువల్ల ఆయా గ్రామాల ప్రజలు తమ బంధువులను, మిత్రులను, ఆత్మీయులను సైతం మొహర్రంకు ఆహ్వానిస్తారు. ఇక ప్రజలు ఒక కుటుంబ సభ్యుల్లా రాత్రి వేళల్లో పీర్లచావిడి వద్దకు చేరి సాంప్రదాయమైన కార్యక్రమాలు చేపడతారు. పీర్లను ఊరేగించే సమయంలో యువత ఆనందానికి ఆకాశమే హద్దు అన్న విధంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపడతారు. అలాగే నిత్యం రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అందువల్ల మొహర్రం నిర్వహించే గ్రామీణ ప్రాంతాల్లో పదిరోజుల పాటు సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రారంభమైన మొహర్రం కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొలువుదీరిన పీర్లు గ్రామాల్లో సందడి వాతావరణం -
ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రం తనిఖీ
మదనపల్లె రూరల్ : మదనపల్లెలోని జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఏఆర్డీ, ఐసీటీసీ కేంద్రాలను జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వి. భాస్కర్ తనిఖీ చేశారు. శుక్రవారం ఏఆర్టీ,ఐసీటీసీ విభాగాల్లోని పలు రికార్డులను పరిశీలించారు. వైద్య సేవలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్టీ, ఐసీటీసీ ద్వారా రోగులకు మరిన్ని వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇదివరకు మదనపల్లె ప్రభుత్వాసుపత్రి ఏఆర్టీ కేంద్రాన్ని చిత్తూరు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం వారు తనిఖీలు చేసేవారని, ఇకపై కడప జిల్లా పరిధిలోకి ప్రభుత్వం మార్చిందన్నారు. ఆసుపత్రిలో హెచ్ఐవీ బాధితులకు అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న మందులు, పరీక్షల కిట్లు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. కొన్ని రకాల కిట్లు కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రాన్ని వేరే భవనంలోకి మార్చడంపై సూపరింటెండెంట్ డాక్టర్ కోటేశ్వరితో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం జిల్లా అకౌంటెంట్ ఎస్. అప్రోజ్, ప్రోగ్రాం అధికారి అబ్దుల్ సాదిక్, ఐసీటీసీ సిబ్బంది జయకుమార్, పుల్లయ్యనాయుడు, దీప్తి పాల్గొన్నారు. -
విద్యుత్ వాడకంపై అవగాహన పెంచుకోవాలి
రాయచోటి టౌన్ : విద్యుత్ వాడకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాయచోటి ట్రాన్స్కో డివిజన్ శాఖ సూపరింటెంటెంట్ ఇంజనీరు ఆర్.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాయచోటి విద్యుత్ డివిజన్ శాఖ కార్యాలయంలో విద్యుత్ భద్రతా వారోత్సవాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని అప్పుడే విద్యుత్ వినియోగంపై సరైన ప్రణాళిక ఉంటుందన్నారు. విద్యుత్ వాడకంలో అనేక సందర్భాలలో జాగ్రత్తలు పాటించకుండా ఉండటంతో ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాగే అధిక విద్యుత్ వినియోగం చేస్తుంటామన్నారు. అనేక చోట్ల విద్యుత్ లైన్లు ఉన్నప్పటికీ ఆ లైన్ కిందనే ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటారని, దీని వలన ప్రమాదాలు జరుగుతుంటాయని, కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతుంటారన్నారు. విద్యుత్ లైన్ కింద ఇళ్ల నిర్మాణాలు చేయరాదని సూచించారు. ఈ క్రమంలో ఏడు సూత్రాలు కలిగిన పోస్టర్ ప్రజల అవగాహన కోసం ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. -
కాల్మనీ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
రాయచోటి జగదాంబసెంటర్ : కాల్మనీ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు కాల్ మనీ వేధింపుల బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో ఏకాంబరంరెడ్డి, ఖాదర్వల్లి, ఆనంద్, అనురాధ అనేవారు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి అప్పులు ఇచ్చి వారి చేత ఖాళీ చెక్కులు, బాండ్లు తీసుకుని అత్యధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా, తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాల్మనీ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని అన్నారు. అత్యధిక వడ్డీలు, వేధింపులు తట్టుకోలేక గౌరీ లాంటి వారు బహిరంగ ప్రకటన చేయగలిగారు కానీ, చాలా మంది బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ మోసపూరితంగా ఉండే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఖాళీ చెక్కులు, బాండ్లు ఇవ్వకూడదని సూచించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కు ఫోన్చేసి కాల్మనీ వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాల్ మనీ బాధితులు గౌరీ, సుజాతలతో పాటు సీపీఎం నాయకులు రామాంజులు, రామచంద్ర, మాధవ తదితరులు పాల్గొన్నారు. -
పరుగుల సునామీ సృషించిన కడప జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో రెండవ రోజు కడప జట్టు పరుగుల సునామీ సృష్టించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో కడప జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 401 ఓవర్నైట్ స్కోర్తో శుక్రవారం రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు 175.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 765 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని ఆర్. ప్రణీల్రెడ్డి తన బ్యాటింగ్తో విజృంభించి 477 బంతుల్లో 39 ఫోర్లతో 353 భారీ పరుగులు చేశాడు. టి.సుదర్శన్ 161 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు, ఎన్. విష్ణు సాయి 68 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లిఖార్జున 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 7 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 194 ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 77 ఓవర్లలో 524 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎ. జయంత్ కృష్ణ 37 ఫోర్లు, 3 సిక్సర్లతో 221 అత్యధిక పరుగులు చేశాడు. కెహెచ్ వీరారెడ్డి 175 బంతుల్లో 157 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని తేజ 4 వికెట్లు, లోకేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 72 పరుగులు చేశాడు. 353 పరుగులు చేసిన కడప బ్యాట్స్మెన్ ప్రణీల్రెడ్డి 765 భారీ స్కోరు చేసిన కడప జట్టు -
నియంతను తలపిస్తున్న చంద్రబాబు
కూటమి పాలనలో సంక్షేమం.. అభివృద్ధి లేదు: రాజ్యసభ సభ్యుడు మేడా కూటమి పాలనలో సంక్షేమం..అభివృద్ధి లేవని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సంపద సృష్టిస్తామని తరచూ చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు తన నారా కుటుంబానికి, తన కోటరీ వాళ్లకు మాత్రమే సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయమని అడిగిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యకర పాలనకు తెరతీశారన్నారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వంపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాయచోటి: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, చంద్రబాబు నియంతను తలపిస్తున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రాయచోటిలో శుక్రవారం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి కంటే మెరుగ్గా పథకాలను అందిస్తామని చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మోసపోయిన రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని అయన అన్నారు.ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఎవరైనా అడిగితే మీ నాలుక మందం అయిందని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా సమయంలోనూ అప్పటి సీఎం జగన్ ఏ సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయకుండా వంద శాతం హామీలను నెరవేర్చారన్నారు. ప్రజలకు నేరుగా రూ.3 లక్షల కోట్ల నిధులను అందించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. మాట తప్పడం చంద్రబాబు నైజం అన్నారు. 2014 సమయంలోనూ జాబు రావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చిన తరువాత లక్షలాది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించారని మాజీ మంత్రి గుర్తు చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గడప గడపకు వెళ్లి కూటమి పాలన వైఫల్యాలను తెలియపరుస్తూ గత వైసీపీ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలకు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు అర్థం అవుతాయన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి జగన్ మోహన్ రెడ్డి పాలనకు, కూటమి నయవంచన పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలన్నారు. జిల్లా రాజకీయాలలో మంచి ప్రాధాన్యం కలిగిన సుగవాసి కుటుంబం నుంచి వచ్చిన బాలసుబ్రమణ్యం ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీలో చేరడం సంతోషమన్నారు. జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. పార్టీలో ఆయనకు మంచి ప్రాధాన్యత, భవిష్యత్తు ఉంటాయని మాజీ మంత్రి చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సుగవాసి సుబ్రమణ్యం, నిస్సార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ● సూపర్ సిక్స్తో పాటు 146 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒకటి రెండు మినహా ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్లపై కూడా కూడా అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణం అన్నారు. లక్కిరెడ్డిపల్లి మండలంలో ఎన్నికల సమయంలో టపాసులు పేలి కన్ను దెబ్బతిందన్న నెపంతో మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, రమేష్కుమార్రెడ్డి, ఎంపీపీ సుదర్శన్రెడ్డిలతో సహా 19 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. బద్వేలులో శ్రీకాంత్రెడ్డి అనే పార్టీ వర్గీయుడి ఇంటిని అక్రమంగా కూల్చేశారన్నారు. మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు ప్రజల వద్దకు వస్తారని, ఏఏ హామీలు నెరవేర్చారో చెప్పే వరకు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలన్నారు. ● జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తుంటే టీడీపీకి గుండెలు అదురుతున్నాయని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి అన్నారు. రాష్ట్రంలో జగన్కు రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోందన్నారు. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త జగన్ అడుగుజాడల్లో అడుగేసి పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా కూటమి పాలనపై వ్యతిరేకత వినిపిస్తోందన్నారు. ఇదే విషయాన్ని పార్టీ ఆదేశానుసారం ప్రజలలోకి వెళ్లి కూటమి పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని చెప్పారు. ● చంద్రబాబు పాలనపై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పల్లెలు, పట్టణాలలో ఎక్కడకు వెళ్లినా టీడీపీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలే నిర్భయంగా చెబుతున్నారన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. 2029లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం అని అన్నారు. ● కూటమి పాలనలో రైతుల పరిస్థితి దీనంగా మారిందని మదనపల్లె ఇన్చార్జి నిస్సార్అహమ్మద్ ధ్వజమెత్తారు. కూటమి నాయకుల స్వప్రయోజనాలు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. మామిడి, టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు లేక పూర్తిగా నష్టపోయారన్నారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. ● చంద్రబాబు పాలనలో ధన ఉన్మాదం రాజ్యమేలుతోందని జెడ్పీ మాజీ చైర్మన్, ఇటీవల టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరగడం లేదని ఆ పార్టీల్లో ని 164 శాసనసభ్యులలో ఎవరైనా కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పినవవి ఒకటి, అధికారంలోకి వచ్చిన తరువాత ఇంకొకటి చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలను మేలుకొలపాలన్నారు. మీలో ఒక్కడిగా, తోడుగా ఉండి వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేస్తానని బాలసుబ్రమణ్యం ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, ఏపీఎండీసీ మాజీ ఛైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు షమీంఅస్లాం, జిల్లా మహిళా నాయకురాళ్లు అజంతమ్మ, మహిత తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలియజేయాలి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పనిచేయాలి
రాయచోటి: స్వర్ణాంధ్ర విజన్–2047 పకడ్బందీ అమలులో భాగంగా నియోజకవర్గ యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సచివాలయ సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుపరిపాలన తొలి అడుగు, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్పై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్పెషల్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది ప్రధాన సూత్రాలతో కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించుకొని జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. డేటా మేనేజ్మెంట్,, డేటా అనాలసిస్లో సచివాలయ సిబ్బంది చురుగ్గా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి రాయచోటి: జిల్లా కేంద్రంలో ఈవీఎంలను భద్రపరిచి గోదాము వద్ద 24–7 ప్రకారం నిరంతరం పటిష్ట నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా రాయచోటి పట్టణం మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు బీయులు, సీయూలు, వీవీ ప్యాట్లను, అక్కడ భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె మధుసూదన్రావు, ఆర్డీఓ ఏ శ్రీనివాస్, తహసీల్దార్ నరసింహకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గంలో అక్కులప్ప మదనపల్లె రూరల్: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యవర్గంలో మదనపల్లెకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బండపల్లి అక్కులప్పకు మరోసారి అవకాశం లభించింది. ఒంగోలులో ఈనెల 25, 26 తేదీల్లో రెండురోజుల పాటు జరిగిన 36వ రాష్ట్ర మహాసభల్లో అక్కులప్ప రాష్ట్ర కార్యవర్గంలోకి ఎన్నికయ్యారు. వరుసగా మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించిన ఆయనకు ఏపీయూడబ్ల్యూజేతో సుమారు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. 1996లో మొదటిసారి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై న అక్కులప్ప, ఆపై జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఏపీయూడబ్ల్యూజేలో వివిధ హోదాల్లో పనిచేశారు. అన్నమయ్యజిల్లా నుంచి జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న అక్కులప్పను తాజాగా రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల సెగ కురబలకోట: కూటమి ప్రభుత్వంపై ఏడాదికే ఉద్యోగ వర్గాల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. వివిధ శాఖల ఉద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. బదిలీల జీఓలో అస్పష్టత ఉందని ఇటీవల సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తాజాగా గ్రామ కార్యదర్శులు సమస్యల పరిష్కారం కోసం శనివారం సామూహిక సెలవులో వెళుతున్నారు. పని భారం ఎక్కువ, గ్రూప్ మీట్స్ అధికం కావడం, పీజీఆర్ఎస్ పనులు,ఇతర శాఖల అధికారుల పెత్తనం, సర్వేల భారం, తీవ్రమైన పనితో వ్యాధులు బారిన పడటం, విధి నిర్వహణలో తీవ్ర వత్తిడి కారణంగా అకాల మరణాలు సంభవించడంతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కల్టెక్టర్ను కలసి వినతి పత్రం ఇస్తున్నట్లు పంచాయతీ కార్యదర్సుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల్లో సామూహిక సెలవు కోరుతూ ఎంపీడీఓలకు గ్రామ కార్యదర్శులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కురబలకోట ఎంపీడీఓ గంగయ్యకు కూడా మండలంలోని గ్రామ కార్యదర్సులు సామూహిక సెలవులో వెళుతున్నట్లు వినతి పత్రం అందజేశారు. పాలనలో అనుభవం ఉందని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వరుసగా వివిధ శాఖల ఉద్యోగులు నిరసనల పర్వం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
పంజం సుకుమార్ రెడ్డి మృతి తీరనిలోటు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి (64) ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. అనారోగ్యంతో చైన్నెలో శుక్రవారం పంజం సుకుమార్రెడ్డి మృతిచెందిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తదితరులు అనంతరాజుపేటలో పంజం మృతదేహాన్ని సందర్శించారు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. 40 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పంజం సుకుమార్ రెడ్డి గత ప్రభుత్వంలో జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్గా, డీఆర్యూసీసీ సభ్యుడిగా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అనంతరాజుపేట సర్పంచ్గా, ప్రైవేట్స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పలు పదవులు చేపట్టారు. తనదైన శైలిలో వాటికి వన్నె తెచ్చారు. వైఎస్సార్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ప్రముఖుల నివాళి పంజం సుకుమార్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, ‘సాక్షి’ ఎడిటర్ రక్కసి ధనుంజయరెడ్డి, మాజీఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, భూమన అభినయ్రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, వత్తలూరు సాయికిశోర్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి తదితర నాయకులు పంజం స్వగ్రామానికి చేరుకున్నారు. సుకుమార్రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ముస్తాక్, సీనియర్ నాయకులు కుమార్ రెడ్డి, రామనాథంలు పంజం సుకుమార్రెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. నేడు అంత్యక్రియలు: వైఎస్సార్సీపీ నాయకులు పంజంసుకుమార్రెడ్డి భౌతికకాయానికి శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం అనంతరాజుపేటకు రానున్నారు. పంజం మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు. -
వైఎస్సార్సీపీ సీనియర్ నేత పంజం సుకుమార్రెడ్డి మృతి
రైల్వేకోడూరు అర్బన్: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ పంజం సుకుమార్రెడ్డి (64) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు పార్టీ నేతలు సంతాపం తెలిపారు. సుకుమార్రెడ్డి రాజకీయాల్లో తొలి నుంచి వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ మండలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2000–2011 మధ్య అనంతరాజుపేట పంచాయతీ సర్పంచ్గా రెండు పర్యాయాలు ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంచాయతీలో వైఎస్సార్ హార్టికల్చర్ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్గా నియామకమై ప్రభుత్వ పథకాలను రైతులకు అందించడంలో ఎంతో కృషి చేశారు. కోడూరు డాల్ఫిన్ డేల్ పేరిట విద్యాసంస్థను ప్రారంభించి నాణ్యమైన విద్య అందించారు. -
భర్త ఇంటి ముందు బైఠాయింపు
నందలూరు: తన భర్తతో తనను కలిపి న్యాయం చేయాలంటూ ఓ మహిళ అత్తగారి ఇంటి ముందు తండ్రితో కలిసి బైఠాయించిన సంఘటన నందలూరులో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని అరవపల్లికి చెందిన హనుమంతు మురళి, శ్రీలక్ష్మీ కుమారుడు దేవేంద్రప్రసాద్కు వేంపల్లెకు చెందిన యనమల వెంకటనారాయణ, లక్ష్మీదేవిల కుమార్తె శారదతో 2014లో వివాహమైంది. నాలుగు సంవత్సరాల పాటు సంసారం సజావుగా సాగింది. 2018లో అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధలు రావడంతో తన పుట్టింటికి శారద వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ప్రసాద్ కోర్టును ఆశ్రయించి తన భార్య ఆరోగ్యం సరిగా లేదంటూ కోర్టును పెడదోవ పట్టించి 2021లో విడాకులు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న శారద పోలీసులకు ఫిర్యాదు చేసి రాజంపేట కోర్టును ఆశ్రయించడంతో జులై 2024లో విడాకులను రద్దు చేసింది. అప్పటి నుంచి తన భర్తను కలవాలని ప్రయత్నిస్తుంటే ఈ రోజు, రేపు, మాపు అంటూ సంవత్సరం నుంచి కాలం గడిపి తనను అత్తగారింటికి రానివ్వలేదని వాపోయారు. తిరిగి తాము గురువారం పోలీసులను ఆశ్రయించామన్నారు. వారు తన భర్తకు ఫోన్ చేయగా వెంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటికి తాళాలు వేసుకుని పరారయ్యారని తెలిపారు. పెద్దలు, పోలీసులు తనను తన భర్తతో కలిపి తన సంసారాన్ని నిలబెట్టాలని బాధితురాలు వేడుకుంటోంది. -
ఎన్నికలప్పుడు బాణసంచా పేలి గాయపడ్డానని ఇప్పుడు కేసు!
రాయచోటి/లక్కిరెడ్డిపల్లె: అదిగో పులి అంటే.. ఇదుగో తోక అన్నట్లుంది కూటమి పాలనలో పోలీసుల వ్యవహార శైలి. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు బాణసంచా కాల్చడంతో అప్పట్లో తాను గాయపడ్డానంటూ ఓ టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేయడమే తరువాయి.. పోలీసులు కేసు కట్టడం విస్తుగొలుపుతోంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కుర్నూతుల అగ్రహారానికి చెందిన లోకేశ్ అనే యువకుడు 14 నెలల కిందట ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ నాయకులకు స్వాగతం పలుకుతూ బాణసంచా కాల్చాడు. ఆ క్రమంలో కంటి వద్ద గాయమైంది. అతడి చికిత్స కోసం అప్పట్లో వైఎస్సార్సీపీ నేతలు రూ.3 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందించారు. ఎన్నికల తర్వాత టీడీపీలో చేరిన లోకేశ్.. ఇప్పుడు టీడీపీ పెద్దల సూచనతో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులకు ఉపక్రమించాడు. ‘వారు బాణసంచా తెచ్చి కాల్చమని చెప్పారు. అది కాల్చినందువల్లే అప్పట్లో నా కంటికి గాయమైంది’ అంటూ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం విచారించాలని మానవ హక్కుల కమిషన్ లక్కిరెడ్డిపల్లె పోలీసులకు సూచించింది. ఇదే అవకాశంగా టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో పోలీసులు కక్ష పూరితంగా 326, 420 సెక్షన్స్, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, రమేష్రెడ్డి, ఎంపీపీల సంఘం జిల్లా అధ్యక్షుడు, లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ సుదర్శన్రెడ్డి సహా 19 మందిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఎవరికీ నోటీసులు ఇవ్వకుండానే అరెస్టులకు ఉపక్రమించారు. గురువారం సాయంత్రం సుదర్శన్రెడ్డిని అరెస్ట్ చేశారు. మిగతా వారందరినీ అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. వాస్తవానికి ఆ ప్రమాద సమయంలో శ్రీకాంత్ రెడ్డి వేరే మండలంలో ప్రచారంలో ఉన్నప్పటికీ కేసు నమోదు చేయడం రెడ్బుక్ దుర్మార్గానికి పరాకాష్ట. నిజానికి తనంతట తానే బాణసంచా కాల్చుతూ.. ఆ క్రమంలో అప్పుడు గాయపడి, ఇప్పుడు ఫిర్యాదు చేయడం దారుణమని.. దీనిపై పోలీసులు నిజానిజాలు విచారించకుండానే తప్పుడు కేసులు పెట్టడం సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. -
భవనం మీద నుంచి కింద పడి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి
కడప కోటిరెడ్డి సర్కిల్ : అన్నమయ్య జిల్లాలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాయపాటి ఖాజావలీ (50) ప్రమాదవశాత్తు భవనం మీద నుంచి కిందపడి మృతి చెందినట్లు చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు గురువారం సాయంత్రం కడప అశోక్ నగర్ లోని తమ ఇంటి సిమెంటు రేకులపై వర్షం నీళ్లు పడకుండా ప్లాస్టిక్ పట్ట కప్పేందుకు తన భార్యతో కలిసి పైకి ఎక్కారు. ఇద్దరూ పట్ట కప్పుతుండగా ఖాజావలీ నిలుచున్న ప్రదేశంలో ప్రమాదవశాత్తు సిమెంటు రేకులు విరగడంతో పైనుంచి కింద పడ్డాడు. తల వెనుక భాగంలో రక్త గాయమై ముక్కు నుంచి రక్తం కారుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతని భార్య బంధువులతో కలిసి నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇతనికి భార్య మాబున్నీ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బూత్ కమిటీ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల వాగ్వాదం
నందలూరు : నందలూరు షాదీఖానాలో గురువారం నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి వాగ్వాదం చేసుకున్నారు. కుటుంబ సాధికారత సమితి (కేఎస్ఎస్) కమిటీలు వేసేటప్పుడు తమకు ఎందుకు చెప్పలేదని కొంత మంది టీడీపీ నాయకులు ప్రశ్నించడంతో వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన నాయకులందరికీ చెప్పాల్సిన అవసరం లేదని కొంత మంది నాయకులు తెలపడంతో వాగ్వాదం మొదలైంది. నందలూరు మండల పరిశీలకుడు ఆరే సుధాకర్నాయుడు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. రాజంపేట టీడీపీ ఇన్చార్జిని ప్రకటించకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేశారు. -
బైకులు ఎదురెదురుగా ఢీకొని యువకుడి దుర్మరణం
మదనపల్లె రూరల్ : బైకులు ఎదురెదురుగా ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ పట్రవారి పల్లెకు చెందిన కృష్ణమూర్తి, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు హరీష్ (24), తన బంధువు, వృత్తిరీత్యా డ్రైవర్ అయిన బాబు మోహన్(25)తో కలసి స్కూటీలో వ్యక్తిగత పనులపై పుంగనూరుకు వెళ్లారు. అక్కడి నుంచి బాబు మోహన్ టాటా ఏస్ వాహనం తీసుకుని బయలు దేరాడు. హరీష్ స్కూటీ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరి వస్తుండగా, మదనపల్లె సమీపంలోని వలసపల్లి పంచాయతీ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద, పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన బైక్ మెకానిక్ స్వామినాథ్ (28) మద్యం మత్తులో, మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో వేగంగా వెళ్లి స్కూటీని ఢీకొన్నాడు. ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న హరీష్ ఎగిరి దూరంగా పడటంతో తలకు తీవ్ర గాయమై, చెవులు, ముక్కులలో అధిక రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి వెళ్లాడు. వెనుకనే టాటా ఏస్ వాహనంలో వస్తున్న బాబు మోహన్ గుర్తించి అదే వాహనంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు హరీష్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్వామినాథ్ కూడా తీవ్రంగా గాయపడటంతో చికిత్స అందించారు. హరీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. మృతుడు పట్రావారిపల్లె వాసి మరో యువకుడికి తీవ్ర గాయాలు -
ఏటీఎం కార్డు తస్కరించి రూ.25 వేలు డ్రా
నందలూరు : మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏటీఎంలో ఓ వ్యక్తికి మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డు తస్కరించి రూ.25 వేలు డ్రా చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుడు విశ్రాంత ఉపాధ్యాయుడు సానిపాటి నరసింహులు వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి తన ఏటీఎం కార్డును చోరీ చేసి ఎస్బీఐ ఏటీఎంలో రూ.25 వేలు డ్రా చేసుకున్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపారు. నాటు సారా కేసులో ఒకరి అరెస్టురైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం బుడిగుంటపల్లి పంచాయతీ, దేశెట్టిపల్లి క్రాస్ వద్ద నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి ఐదు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ తులసీ మాట్లాడుతూ నాటుసారా, అక్రమ మద్యం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కు ప్రాధాన్యం పెంచాలి కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో స్పోర్ట్స్ రంగంలో తలెత్తిన ఫేక్ సర్టిఫికెట్స్ సమస్యలపై దృష్టి సారిచి వాటికి అడ్డుకట్ట వేసి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కు ప్రాధాన్యత పెంచాలని ఏపీపీఈటీస్ అండ్ ఎస్ఏపీఈ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కిరణ్, సభ్యులు కోరారు. ఈ విషయమై రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాయచోట్లోని స్టేట్ గెస్ట్హౌస్లో కలసి వినతిపత్రం అందజేశారు. -
గొడవ పడొద్దన్నందుకు కత్తితో దాడి
మదనపల్లె రూరల్ : తోడికోడళ్ల మధ్య సమస్య ఏర్పడి గొడవ జరిగితే, పుట్టింటి వారు వచ్చి గొడవ ఎందుకని ప్రశ్నిస్తే కత్తితో దాడి చేసిన ఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. సత్యసాయి జిల్లా కదిరి పట్టణం రాజీవ్ నగర్కు చెందిన అమృత ను, మదనపల్లె పట్టణం కుమారపురంలో ఉన్న మున్సిపల్ ఉద్యోగి శ్రీనివాసులుకు ఇచ్చి 15 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. శ్రీనివాసులు తన ఇద్దరు అన్నదమ్ములైన శంకర, గోవిందుతో కలిసి ఒకే కాంపౌండ్లో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం శ్రీనివాసులు ఇంటి వద్ద లేని సమయంలో అమృతకు తోడికోడళ్లయిన మంగమ్మ, అనసూయమ్మతో వివాదం ఏర్పడి, ఘర్షణ చోటు చేసుకోగా, వారందరు కుటుంబ సభ్యులతో కలిసి అమృతపై దాడి చేసి కొట్టారు. ఈ విషయం ఆమె పుట్టింటి వారికి చెప్పడంతో, వారు పది మందితో కలిసి కుమారపురానికి వచ్చారు. గొడవెందుకని మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే, అనసూయమ్మ కుమార్తె భారతి ఇంట్లో ఉన్న సత్తూర్ ( కత్తి)తో అమృత ఆడపడుచు అయిన శివకుమార్ భార్య సురేఖ (30)పై దాడి చేసింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. మిగతా వారైనా శంకర, గోవిందు, భువనేశ్వరి, మంగమ్మ అనసూయమ్మలు కదిరి నుంచి వచ్చిన అమృత బంధువులపై దాడి చేశారు. దాడిలో కళ్యాణ్ కుమార్ (30), రాజ్యలక్ష్మి(27) గాయపడ్డారు. స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వన్ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మదనపల్లెలో కాల్ మనీ కీచకులు
మదనపల్లె రూరల్ : సరిగ్గా ఏడేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వంలో విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మనీ విష సంస్కతి విస్తరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు, అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో అప్పు కట్టలేదని మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా శిక్షించిన ఘటన మరువక ముందే.. మదనపల్లిలో వడ్డీ కోసం వ్యభిచారం చేయమని ఒత్తిడి తెచ్చేంతగా రాక్షసులు బరి తెగించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటిదే మదనపల్లెలో జరుగుతున్న వ్యవహారంపై సాక్షి వెలుగులోకి తెచ్చిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధిత మహిళ గౌరీకి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. మదనపల్లె కాల్ మనీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కుప్పంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనలో తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు, మదనపల్లెలో రజక సామాజిక వర్గానికి చెందిన చెందిన బీసీ మహిళ, మరికొందరు బడుగు జీవులపై జరుగుతున్న అన్యాయాలపై కనీస స్పందన లేకపోవడంపై విమర్శలను సంధిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడే ముఠాలు మదనపల్లెలో అధికమయ్యాయి. డైలీ, వీక్లీ, మంత్లీ.. పేరుతో వందకు పది రూపాయల నుంచి 45 రూపాయల వరకు, ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ష్యూరిటీగా ఉంచుకొని ఎడాపెడా రుణాలను ఇచ్చేస్తున్నారు. అప్పు తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లించకపోయినా, కాస్త ఆలస్యం చేసినా ఇళ్ల వద్దకు వెళ్లి వారిని దుర్భాషలాడటం, లైంగికంగా వేధింపులకు గురి చేయడం సర్వసాధారణమైపోయింది. కాల్ మనీ పేరిట మహిళలను వేధించిన వారికి ఉన్న పలుకుబడులు బాధితులకు న్యాయం జరగనీయకుండా చేస్తున్నాయి. మదనపల్లెలో నీరుగట్టువారిపల్లె, రామారావు కాలనీ, అనప గుట్ట, కురవంక, వీవర్స్ కాలనీ, బసినికొండ, ప్రశాంత్ నగర్ తదితర ప్రాంతాల్లో ముఖ్యంగా చేనేత కార్మికులు నివసించే చోట వడ్డీ వ్యాపారం విస్తృతంగా కొనసాగుతోంది. వడ్డీ రాక్షసుల ఆగడాలపై బాధిత మహిళలు బుధవారం సాక్షితో మాట్లాడారు. తమ పేర్లు వెల్లడించవద్దని కోరుతూ తాము ఎదుర్కొన్న వేధింపులను ఏకరువు పెట్టారు. అప్పులు తీర్చమని తమపై ఒత్తిడి తెస్తూ వడ్డీ వ్యాపారులు మానసికంగా శారీరకంగా తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. వాటిని భరించలేక పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తే, మధ్యవర్తుల ద్వారా రాజీమార్గాలను ఎంచుకొని, తరువాత తమ వద్ద నుంచి తీసుకున్న ఖాళీ బ్యాంకు చెక్కులతో కోర్టులో కేసులు వేసి వేధిస్తున్నారని తెలిపారు. రుణాల చెల్లింపు కోసం తమ వద్ద ఆస్తులను రాయించుకుని వేధిస్తున్నారన్నారు. వీరి బాధల నుంచి బయటపడేందుకు జిల్లా స్థాయి పోలీస్ అధికారులను, తాము సంప్రదించాలని భావిస్తున్న విషయాన్ని ముందే పసిగట్టి, తమకంటే ముందే జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి తమపై ఫిర్యాదు చేసి సోషల్ మీడియాలో తమను దోషులుగా చిత్రీకరించి, వారి వేధింపులను ఆగడాలను కనుమరుగయ్యేలా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. స్థానిక పోలీసులకు వారి ఆగడాలపై ఫిర్యాదులు చేస్తే పట్టించుకోకుండా వడ్డీ రాక్షసులకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలున్నాయి. అప్పు తీసుకున్న పాపానికి వడ్డీలకు వడ్డీ చెల్లించినా, తమకు రుణ బాధల నుంచి విముక్తి కలగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వడ్డీ వ్యాపారుల కోరల నుంచి తమను రక్షించాలని బాధితులు కోరుతున్నారు. మనిషి ఆర్థిక అవసరాలను అవకాశంగా తీసుకొని వ్యాపారులు దోచుకుంటున్నా, అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని, వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి, వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారే టార్గెట్గా జరిగే వడ్డీ వ్యాపారాలను కూటమి సర్కార్ సీరియస్గా తీసుకుంటుందని హెచ్చరించిన హోం మంత్రి అనిత... మదనపల్లె ఘటనపై చర్యలు తీసుకోకవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాక్షి కథనం బాధితురాలు గౌరీకి మహిళా సంఘాల మద్దతు వడ్డీ రాకాసురులపై గళం విప్పిన బాధిత మహిళలు -
మున్సిపల్ వైస్ చైర్మన్, మహిళా కౌన్సిలర్, మరో 16 మంది పై కేసు నమోదు
రాయచోటి : రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ పి.దశరథరామిరెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ పి.విజయమ్మతోపాటు మరో 16 మందిపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇరిగేషన్ రిటైర్డ్ డీఈ మండెం ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ బి.వి. చలపతి తెలిపారు. రాయచోటి పట్టణ పరిధిలోని 553 సర్వే నంబరులో భూ తగదా విషయంపై దశరథరామిరెడ్డి తన అనుచరులతో కలిసి మే 22వ తేదీన దాడికి ప్రయత్నించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. అప్పటి నుంచి రాజీకి ప్రయత్నించగా కుదరకపోతే కేసు నమోదు చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే తమపైన కేసు నమోదు చేశారని మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డి మీడియాకు తెలిపారు. రైతుపై ఆర్టీసీ కార్గో సిబ్బంది దాడిరాయచోటి : మామిడి పండ్ల ప్యాకెట్లను పార్సల్ చేయడానికి వెళ్లిన రైతుపై ఆర్టీసీ కార్గో సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. రాయచోటి పట్టణం కొత్తపేటలో నివాసం ఉంటున్న రైతు బాబు రెడ్డి (30) తోటలో పండించిన మామిడికాయలను బంధువులకు పంపించేందుకు రెండు ప్యాకెట్లను తీసుకొని రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో గల పార్సెల్ సర్వీస్ సెంటర్కు వెళ్లారు. రైతు తెచ్చిన ప్యాకెట్లు చిన్నవిగా ఉండటంతో రెండు కలిపి ఒకటిగా పంపుకోవచ్చని అక్కడున్న ఆర్టీసీ సిబ్బంది బాబు రెడ్డికి సూచించారు. రెండిటిని కలిపి ఒకే ప్యాకేజీలో పార్సల్ చేయాలని కొరియర్ సిబ్బందికి సూచించారు. పార్సెల్ సర్వీస్ లో పనిచేస్తున్న అంజి నాయక్, సాయి అనే యువకులు ఆ మామిడి పండ్లు రెండు పార్సెల్ ఒకటిగా పంపించడం కుదరదని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు పార్సెల్ పంపేందుకు వచ్చిన రైతు పై దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. పార్సెల్ సర్వీస్ లో పనిచేసే అంజి నాయక్, సాయి లు ఇద్దరు కలిసి వేయింగ్ మిషన్ తో బాబు రెడ్డి తలపై బలంగా కొట్టడంతో పాటు తీవ్రంగా గాయపరిచారు. దాడిలో బాబు రెడ్డి తీవ్రంగా గాయపడమే కాకుండా అతని జేబులో ఉన్న 50 వేలు నగదు కూడా గల్లంతయిందని బాధితుడు వాపోయాడు. తీవ్రంగా గాయపడిన బాబు రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మామిడి పండ్లు పార్సల్ పంపేందుకు వెళ్లిన రైతు బాబురెడ్డిపై దాడి చేసిన ఆర్టీసీ కార్గో సిబ్బందిని కఠినంగా శిక్షించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ప్రొద్దుటూరు క్రైం : పట్టణ శివారు ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొద్దుటూరు ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ప్రొద్దుటూరు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. దాడిలో సీకే దిన్నె మండలంలోని మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బి.రామాంజనేయులు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇతను స్థానికంగా ఉన్న పలు కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామన్నారు. -
భారీ స్కోరు దిశగా కడప జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో కడప జట్టు భారీ స్కోరు దిశగా ఆడుతోంది. తొలి రోజు గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో కడప, కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 93 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణీల్ రెడ్డి తన బ్యాటింగ్తో విజృంభించి 291 బంతుల్లో 23 ఫోర్లతో 201 పరుగులు చేశాడు. గురు విఘ్నేష్ 147 బంతుల్లో 15 ఫోర్లు, 6 సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లికార్జున 2 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం కిక్రెట్ మైదానంలో.. అదే విధంగా కేఓఆర్ఎం కిక్రెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో నెల్లూరు, అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 50.4 ఓవర్లకు 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మన్విత్రెడ్డి 48, సయ్యద్ షాహుల్ హుస్సేన్ 32 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు, వరుణ్ సాయి నాయుడు 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 34 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి, 107 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేయగా జయంత్ కృష్ణ 78 పరుగులు చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.డబుల్ సెంచరీ చేసిన కడప బ్యాట్స్మెన్ ప్రణీల్ రెడ్డి -
‘వందేభారత్’ ట్రయల్ రన్ విజయవంతం
కడప కోటిరెడ్డిసర్కిల్: దేశంలో అధిక వేగంతో నడుస్తున్న రైళ్లలో ఒకటైన వందే భారత్ రైలు గురువారం కడప– రేణిగుంట మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. కాచిగూడ–చైన్నె మార్గంలో వందేభారత్ రైలు నడిపేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. కాగా 130 కి.మీ. స్పీడ్తో రైలు నడిచినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని రైల్వే అధికారులు గుర్తించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ మార్గంలో వందేభారత్ రైలు నడిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 220 మంది హాజరు కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం జరిగిన కౌన్సెలింగ్కు 86001వ ర్యాంకు నుంచి 104000 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 220 మంది అభ్యర్థులు తమ కౌన్సెలింగ్ను పూర్తి చేసుకుని ధృవ పత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఎస్ఆర్ లక్ష్మి ప్రసాద్, వెరిఫికేషన్ ఆఫీసర్లు వసుంధర, మల్లేశ్వరమ్మ, లావణ్య, రాజేష్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నేటి కౌన్సెలింగ్కు... నేడు నిర్వహించబోయే కౌన్సిలింగ్కి జిల్లావ్యాప్తంగా 104001 నుంచి 120000 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు రావాలని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలి సుండుపల్లె: గొర్రెలు, మేకల పెంపకం దారులు తమ జీవాలకు నట్టల నివారణ మందును తప్పకుండా వేయించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ గుణశేఖర్పిళ్లై పేర్కొన్నారు. గురువారం సుండుపల్లె మండల కేంద్రానికి సమీపంలోని ఈడిగపల్లెలో గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందులను వేసినట్లు ఆయన తెలిపారు. జులై 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని మేకలు, గొర్రెల కాపర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మూగజీవాలకు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పశువైద్యాధికారులు సూచ నలు పాటించి నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ విజయ్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ మాలకొండయ్య, డాక్టర్ శ్రీధర్రెడ్డి, సంబేపల్లి పశువైద్యాధికారి లోకేష్, ఏడీ వెంకటేశ్వరరెడ్డి, గోపాలమిత్ర సిబ్బంది పాల్గొన్నారు. -
నెత్తురోడ్లుతున్నాయ్!
రహదారులు నెత్తురోడుతున్నాయి. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. నిద్ర లేమి.. వెరసి రోడ్డు ప్రమాదాలతో ఎరుపెక్కాయి. ఇటీవల జిల్లాలో జరిగి న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోతున్న ఈ ఘటనలు ఆయా కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. 2025 మే 26న గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారు లారీ ఢీ కొన్న ప్రమాదాలల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ● గత వారంలో రాయచోటి నుంచి హైదరా బాదుకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.జాతీయ రహదారి వెంబడి ఇష్టానుసారంగా వాహనాలు నిలపకుండా చూడాలి. నిబంధనల మేరకు ముందు, వెనుక వాహనాలకు రిఫ్లైక్టింగ్ స్టిక్కర్లు అతికించాల్చిన అవసరం ఉంది. ఇవి రాత్రి వేళల్లో వాహనచోదకునికి ముందు వాహనం ఉందనే విషయాన్ని సృష్టంగా కనిపించేలా చేస్తుంది. వేగ నియంత్రణ, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా చూడాలి. అతి వేగంతో దూసుకెళుతున్న వాహనాలను నిఘా కెమెరాలతో గుర్తించి వెంటనే కళ్లెం వేయాలి. సంబంధిత వాహన యజమాని సెల్ఫోన్కు సందేశం పంపి అప్రమత్తం చేయాలి. బ్లాక్ స్పాట్లలో సూచిక బోర్డులు, విద్యుద్దీపాలు, రహదారి మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించేలా చూడాలి. రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయాలను అమలు చేయాలి. వాష్ అండ్ గో కార్యక్రమాన్ని పున:ప్రారంభించాలి. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించాలి. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి. కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో సమారు 307 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు 172 మంది మృత్యువాత పడగా 364 మంది క్షతగాత్రులయ్యారు. వేగ నియంత్రణ అమలు చేయకపోవడం, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెట్టకపోవడంతోనే ప్రమాదాలు జరగుతున్నాయి. అధికారులు ఈ విషయాల్లో పున: సమీక్షించాల్సిన అవసరం ఉంది. కారణాలెన్నో...... మితి మీరిన వేగం, మద్యం మత్తు, ఓవర్ టేక్, అకస్మాత్తుగా వాహనం నిలపడం, ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం తదితర విషయాలు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారులపై లారీలను ఇష్టానుసారంగా నిలిపేస్తున్నారు. హోటళ్లు, డాబాలు, ఇతర దుకాణాల వద్ద హైవేకి అనుకొని ఆపుతున్నా రు. ఈ క్రమంలో వెనుక వచ్చే వాహనాలు వేగాన్ని నియంత్రించలేక వాటిని ఢీ కొంటున్నాయి. లారీలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా విశ్రాంతి స్థలాల్లో మాత్రమే నిలపాల్సి ఉన్న అక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండటంతో రోడ్లకు అనుకొని, చెట్ల కింద ఆపడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రైవేట్ బస్సులు అధికంగా రాత్రి వేళ తిరుగుతుంటాయి. ఈ క్రమంలో అందులో క్లీనర్గా పని చేసే వారు అరకొర డ్రైవింగ్తో అప్పుడప్పుడు వాహనాలు నడుపుతున్నారు. రాత్రి వేళ ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించడం, ముందు వెళుతున్న వాటిని వేగంగా అధిగమించే క్రమంలో పట్టుకోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తీర్మానం చేసినా.... ఉమ్మడి జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 70 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక డ్రమ్ములు, బారికేడ్లు, రహదారుల మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ విద్యుద్దీపాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రోడ్ సేప్టీ సమావేశాల్లో తీర్మానించారు. అది కార్యరూపం దాల్చినా కేవలం ఒకటి రెండు చోట్లకే పరిమితమైంది. అనంతరం అధికారులు అటు వైపు దృష్టి సారించిన దాఖల్లా లు లేవు. ఇప్పటికై నా అధికారులు స్పదించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. నిద్ర మత్తులో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు గతంలోనే గుర్తించారు. వాహన డ్రైవర్ల నిద్ర మత్తు తొలగేలా వాష్ అండ్ గో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ప్రమాదాలు కొంతమేర తగ్గుముఖం పట్టా యి. కాలక్రమంలో దీనికి బ్రేక్ పడింది. సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు ఇలా చేస్తే... ఒకరి నిర్లక్ష్యం..మరొకరికి ప్రాణ సంకటం మితిమీరిన వేగంతోనేరోడ్డు ప్రమాదాలు ఐదు నెలల్లో172 మంది మృత్యువాత రోడ్డు నిబంధలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం రోడ్డు నియమ నిబంధలను ఉల్లంఘించే వాహనదారులపై కేసులు నమోదు చేస్తాం. వాహనాల వేగ నియంత్రణను అరికట్టేందుకు స్పీడ్ లేజర్ గన్లతో తనిఖీలు చేపడుతున్నాం. మద్యం మత్తుల్లో వాహనాలను నడిపితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. –నిరంజన్రెడ్డి, ఇన్చార్జ్ జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్, వైఎస్ఆర్ జిల్లా 2020 825 307 970 2021 861 368 949 2022 801 403 837 2023 631 372 730 2024 664 321 737 2025 307 172 364 మే వరకు -
డ్రగ్స్ మహమ్మారి అణుబాంబు కంటే ప్రమాదకరం
డ్రగ్స్రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ డ్రగ్స్రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల సమాజానికి, మనకు, మన భవిష్యత్తు తరాల వారికి ఎంత ప్రమాదకరమో తెలియజేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు, విద్యాసంస్థలు మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో పెద్దఎత్తున పాల్గొన్నట్లు చెప్పారు. మదనపల్లిలో ఆరువేల మందితో, రాజంపేటలో రెండువేల మందితో, ఇలా ప్రతి మండలాలలో 500 మందితో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాయచోటి: డ్రగ్స్ మహమ్మారి అణుబాంబు కంటే ప్రమాదకరమని, దాని నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మంత్రి రాంప్రసాద్ రెఢ్డి, జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తదితరులు రాయచోటి పట్టణం శివాలయం సర్కిల్ నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి భారతదేశమే కాదు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోందన్నారు. దీనిని మొక్కగా ఉన్నప్పుడే తుంచివేసే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ● జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా చేయడం ద్వారా కేసులు పడి తద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.మాదక ద్రవ్యాలు వినియోగించినా, అమ్మినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా నేరంగా పరిగణిస్తారన్నారు. దీనికి ఏడు సంవత్సరాలు జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఎవరైనా వినియోగించి చనిపోయినా అమ్మినవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటమని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణపై అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీ, డీఈఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -
5 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
రాజంపేట: నందలూరు సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 5 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరితో కలిసి గురువారం తాళ్లపాక, సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవోలునటేష్బాబు, ప్రశాంతి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవ వివరాలు: జూలై 05 ఉదయం 10.30 నుంచి 11గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైవుతాయి. ప్రతి రోజు ఉదయం 8గంటలకు , రాత్రి 7గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. 6న హంసవాహనం, 7న సింహవాహనం,8న హనుమంతవాహనం, 9న గరుడవాహనం, 10న సూర్యప్రభ, చంద్రప్రభవాహనం ,11న కల్యాణోత్సవం, 12 రథోత్సవం, 13న చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం ఉంటాయి. 11న జరిగే కల్యా ణోత్సవంలో గృహస్తులు (ఇద్దరు)రూ.500 చెల్లించి పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేయనున్నారు. జూలై 14న సాయంత్రం పుష్పయాగం జరుగుతంది.. టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు , దాస సాహిత్య ప్రాజెక్టుల ద్వారా ప్రతి రోజు ఆధ్యాత్మిక , భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా తాళ్లపాకలో జూలై 05 నుంచి 15వతేది వరకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
రాయచోటి జగదాంబ సెంటర్ : మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు 36 జీఓ అమలు చేయాలని రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, శంకరయ్య మాట్లాడుతూ పని గంటలు పెంచి కేవలం రూ.15 వేల వేతనం ఇస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులతో పాటు రూ.21 వేలు వేతనం ఇవ్వాలన్నారు. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచి ఆప్కాస్ కొనసాగించాలని లేదంటే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల ధర్నాకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఫయాజ్బాషా, సలీం మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కార్మికులు దేవా, రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మీ, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు. -
నా ప్లాటుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలి
పులివెందుల టౌన్ : తన ప్లాటుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని బాధితురాలు శ్రీపతి రామమునెమ్మ కోరారు. బుధవారం పట్టణంలోని స్థానిక శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థలం విషయంలో తనకు అన్యాయం చేసిన టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్కుమార్రెడ్డి, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎస్పీ అశోక్కుమార్లకు విన్నవించానన్నారు. తన స్థలాన్ని పునరుద్ధరించి రక్షణ కల్పించాలన్నారు. అలాగే ప్రభుత్వ కాలువ ఆక్రమణలతో పాటు సంబంధిత మున్సిపల్, రిజిస్ట్రేషన్ అధికారులపై కూడా విచారణ జరపాలని కోరారు. తన ప్లాటు నెంబర్ 10ను మల్లెల రాజేశ్వరి నుంచి కొనుగోలు చేశానని, రెవెన్యూ ఖాతాలో తన పేరు కూడా నమోదైందన్నారు. అయితే టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్కుమార్రెడ్డి అసలైన అమ్మకందారుతో కలిసి అక్రమ లాభార్జన కోసం అదే లింక్ డాక్యుమెంట్ను ఉపయోగించి దొంగ రిజిష్టర్ చేయించుకున్నారన్నారు. అలాగే తన స్థలంతోపాటు పక్కన ఉన్న ప్రభుత్వ కాలువ భూమిని కూడా విజయ్కుమార్రెడ్డి ఆక్రమించాడని, మున్సిపల్ అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించారన్నారు. ఈనెల 23వ తేదీ సోమవారం రాత్రి విజయ్కుమార్రెడ్డి, లక్షుమయ్యలతోపాటు మరికొంతమంది రాత్రివేళ నిబంధనలకు విరుద్ధంగా తన స్థలంలోకి ప్రవేశించి సిమెంట్ నిల్వ కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ధ్వంసం చేసి జేసీబీ ద్వారా స్థలాన్ని చదును చేశారన్నారు. -
హార్సిలీహిల్స్ పతంజలికేనా?
బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ టూరిజం యూనిట్ను కూటమి ప్రభుత్వం పతంజలి సంస్థకు కట్టబెట్టేస్తుందా అన్న అనుమానాలను నిజం చేస్తూ గురువారం పతంజలి సంస్థ రాందేవ్ బాబా స్వయంగా ఇక్కడికి వస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసే పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. హార్సిలీహిల్స్ను ప్రైవేటు పరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సాక్షి పలు కథనాలు ప్రచురించింది. ఏప్రిల్ 23 ‘స్టెర్లింగ్ పోయే..పతంజలి’ వచ్చే శీర్షికన సాక్షి ప్రచురించిన కథనం నిజమే అని స్పష్టం అవుతోంది. చైన్నెకి చెందిన స్టెర్లింగ్ కంపెనీకి పర్యాటకశాఖ యూనిట్ను కట్టబెట్టేందుకు ప్రయత్నించి, అందుకు ఆస్తులను పరిశీలించుకునేందుకు సంస్థ బృందానికి అధికారిక అతిథి మర్యాదలను కల్పించారు. తర్వాత వెలుగులోకి రాని కారణాలతో ఆ సంస్థ వెనక్కు వెళ్లింది. తర్వాత పతంజలి ప్రతినిధుల బృందం ఏప్రిల్ 14న హార్సిలీహిల్స్ వచ్చి ఇక్కడి పరిస్థితులు, అతిథి గృహాలు, రెస్టారెంట్, ఖాళీ స్థలాలను పరిశీలించి వెళ్లింది. ఈ బృందం రాందేవ్ బాబాకు ఇక్కడి పరిస్థితులు వివరించి ఉంటారని, దీనితో ఆయనే స్వయంగా ఇక్కడికి వస్తున్నట్టు అర్థమవుతోంది. అధికారికంగా బాబా పర్యటన షెడ్యూలులో గురువారం ఉదయం డెహ్రాడూన్ నుంచి విమానంలో తిరుపతికి చేరుకుని, అక్కడికి సమీపంలోని కొన్నిచోట్ల పరిశీలనలు జరిపాక మధ్యాహ్నం హార్సిలీహిల్స్ చేరుకుంటారు. ఇక్కడి పర్యాటకశాఖ యూనిట్ను పరిశీలిస్తారని, మధ్యాహ్నం టూరిజం రెస్టారెంట్లో భోజనం చేస్తారని షెడ్యూలులో పేర్కొన్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల మేరకు పతంజలి కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అనువైన ప్రాంతంగా భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. కాగా స్టెర్లింగ్ సంస్థకు టూరిజంను ఇచ్చేసి ప్రైవేటు పరం చేస్తారన్న ఆందోళనతో ఉన్న ఉద్యోగులకు ఆ సంస్థ తప్పుకోవడంతో ఊరట చెందారు. తర్వాత పతంజలి ప్రతినిధులు పరిశీలించి వెళ్లినప్పటి నుంచి తీవ్ర ఆందోళనతో ఉన్నారు. 2000లో ఇక్కడ పర్యాటకశాఖ యూనిట్ ప్రారంభం నుంచి దీన్ని నమ్ముకుని పని చేస్తున్న సిబ్బంది, కార్మికులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. పతంజలికి అప్పగిస్తే తమ బతుకులు ఏం కావాలని మధనపడుతున్నారు. పాతికేళ్లుగా టూరిజంను నమ్ముకున్న సిబ్బంది ఇప్పుడు మరో ఉపాధి వెతుక్కునే పరిస్థితుల్లో లేరు. అందులోనూ 45 నుంచి 50 ఏళ్లు వయసు దాటిన సిబ్బంది ఉన్నారు. వీరు మళ్లీ కొత్తగా ఉద్యోగాల కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో లేరు. ఈ పరిస్థితుల్లో రాందేవ్బాబా రాక, అనంతర పరిణామాలపై ఏం జరుగుతుందో అన్న ఆందోళన సిబ్బందిలో వ్యక్తం అవుతోంది. ఆయన వచ్చి వెళ్లాక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 14 టూరిజం యూనిట్ను పరిశీలించిన బృందం నేడు రాందేవ్ బాబా రాక ఉద్యోగుల్లో ప్రైవేటుకు ఇచ్చేస్తారా అన్న ఆందోళన -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
రామసముద్రం : రామసముద్రం మండలం చెంబకూరు –మదనపల్లె రోడ్డు మార్గంలోని బలిజపల్లె వద్ద గత శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని దిగువపల్లెకి చెందిన లక్ష్మీ నరసమ్మ(65) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కృష్ణమ్మ, శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కాగా వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనివాసులును మెరుగైన వైద్యం కోసం చైన్నె ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య మదనపల్లె రూరల్ : ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి (55) మృతి చెందిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. బెంగళూరు రోడ్డు చిప్పిలి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి నైలాన్ తాడుతో ఉరి వేసుకోగా, దాదాపు రెండు రోజుల క్రితం సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీసు స్టేషన్లో సంప్రదించాలని తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ఏడుగురు జూదరుల అరెస్టు రాయచోటి : రాయచోటి మండలం, ఎండపల్లి పంచాయతీ, రామిరెడ్డిగారిపల్లి సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఎస్ఐ విష్ణువర్దన్ ఆధ్వర్యంలో ఏడుగురు జూదరులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
బీటెక్ రవి బంధువు వీరంగం
సాక్షి టాస్క్ఫోర్స్ : పులివెందుల నియోజకవర్గంలో రోజురోజుకు టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు. దాడులు, బెదిరింపులతో చెలరేగిపోతున్నారు. ఏదో ఒక రకంగా భయపెట్టి పంతం నెగ్గించుకోవాలన్న ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారం అండగా ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో పెట్రేగి పోతున్నారు. ఎక్కడ చూసినా గొడవలు, బెదిరింపులతో ప్రత్యర్థులను బెదరగొట్టి పని కానిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. వేంపల్లె మండలం ట్రిపుల్ ఐటీ ఓల్డ్ క్యాంపస్ పరిధిలో ఉన్న జైస్వాల్ కంపెనీకి చెందిన క్యాంటీన్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి బంధువు, వేంపల్లె మండల ఇన్చార్జి అయిన రఘునాథరెడ్డి రెచ్చిపోయారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, మేము నడుపుకోవాలంటూ బెదిరింపులకు దిగడంతోపాటు ఏకంగా అక్కడ ఉన్న జైస్వాల్ కంపెనీ మేనేజర్ ఖాన్పై దాడులకు తెగబడ్డారు. ప్రత్యేకంగా రెండు వాహనాలతోపాటు బైకుల్లో వచ్చిన రఘునాథరెడ్డి, అతని అనుచరులు బీభత్సం సృష్టించారు. ఈ వ్యవహారంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఘటనలతో టీడీపీ ప్రతిష్ట మరింత దిగజారుతోందని ఆ పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ ఓల్డ్ క్యాంపస్లో క్యాంటీన్ మేనేజర్పై దాడి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని జైస్వాల్ కంపెనీ వారికి బెదిరింపులు -
అతిగా మద్యం తాగి..
మదనపల్లె రూరల్ : అతిగా మద్యం తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని చిత్తూరు బస్టాండు టౌన్ హాలుకు సమీపంలో షాపు రూముల ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి మంగళవారం ఉదయం నుంచి అక్కడే ఉంటూ మద్యం సేవిస్తున్నాడని బుధవారం మధ్యాహ్నం వరకు మెలకువగానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అతిగా మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని పరిస్థితి విషమించి మృతి చెంది ఉంటాడని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్టౌన్ పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అభివృద్ధికి పరిశ్రమలే కీలకంరైల్వేకోడూరు అర్బన్ : సమాజంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందడానికి పరిశ్రమలే కీలకమని జిల్లా సబ్ కలెక్టర్ వైఖోమ్ నదియా దేవి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అనంతరాజుపేట పంచాయతీలో ఉన్న రామదాస్ మినరల్స్ కంపెనీ ఏర్పాటుకు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో అవసరమన్నారు. అలాగే చుట్టు పక్కల నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. అలాగే స్థానిక ఎంపీటీసీ మల్లికార్జున మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మిల్లు యజమానులు, అధికారులు పాల్గొన్నారు. -
రాజంపేటలో తెలుగు తమ్ముళ్ల గొడవ
రాజంపేట : రాజంపేట తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల గొడవ తారాస్థాయికి చేరింది. బుధవారం స్ధానిక రోడ్లు భవనాల అతిథి గృహం (అన్నమయ్య అతిథి గృహం)లో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు వర్గీయులు ఇన్చార్జి విషయంపై గొడవకు దిగారు. ఇన్చార్జి లేకుండానే సమావేశం ఏమిటి అని ప్రస్తావన తెరపైకి వచ్చింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన కొందరు, రాజు వర్గానికి చెందిన కొందరి మధ్య సవాళ్లు విసురుకున్నారు. పార్టీ సర్వనాశనమవుతోందని పరస్పరం దూషించుకున్నారు. వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. తోపులాట కొనసాగింది. ఇరువర్గాలను శాంతింప చేసే పనిలో కొందరు తమ్ముళ్లు మధ్యస్తం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సమావేశం రసభాసగా మారిపోయింది. టీడీపీ కార్యాలయంగా గుర్తింపు పొందిన ఆర్అండ్బీ అన్నమయ్య అతిథి గృహంలో ఇరువర్గాల అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. పరిశీలకుడు శివ ఎదుట తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఇంతవరకు రాజంపేట ఇన్చార్జి ఎవరనేది అధిష్టానం తేల్చకపోవడంతో ఇరు వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన జువ్వాది అదృష్టదీపుడు సమావేశంలో బత్యాల చెంగల్రాయుడుకు మద్దతుగా నిలిచారు. అయితే ఇది జీర్ణించుకోలేని చమర్తి వర్గం వారు రగిలిపోయారు. టీడీపీ నాయకుడు ఆనంద్ మరికొంతమందితో వాదులాట తారా స్థాయికి చేరింది. ఇక చేసేదేమీలేక సమావేశాన్ని అర్థంతరంగా ముగించేశారు. కులాల వారీగా టీడీపీలో నేతలు విడిపోయారు. పరస్పరం వాదోపవాదాలు పరిశీలకుని ఎదుటే బాహాబాహీ టీడీపీలో బయటపడిన వర్గ విభేదాలు -
మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకోలేరా?
మదనపల్లె రూరల్ : మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు.. అఘాయిత్యాలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని అఖిల భారత మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రశ్నించారు. బుధవారం ఆమె మదనపల్లెలో వడ్డీ రాక్షసుల ఆగడాల పై స్పందిస్తూ.. వేధింపులకు గురైన గౌరీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు జరిగిన అన్యాయంపై ఆరా తీశారు. మరికొంతమంది బాధితులతో మాట్లాడిన అనంతరం గౌరీతో కలిసి స్థానిక ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక అవసరమున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారులు వారికి అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ, వారి వద్ద నుంచి అసలు కన్నా పదింతలు ఎక్కువగా వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. మదనపల్లెలో గౌరీ అనే మహిళకు స్థానికంగా ఉంటున్న మాజీ సైనికుడు ఏకాంబరరెడ్డి, ఆదివేని ఆనంద్, అతని భార్య మంజుల, బండి హరినాథ్, అతని భార్య అనురాధలు అప్పు ఇచ్చారన్నారు. వారి అప్పు తీర్చేసినా ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధించడం, డబ్బులు కట్టలేని పక్షంలో వ్యభిచారం చేసి చెల్లించమని బలవంత పెట్టడం, అంతు చూస్తామని బెదిరించడం విచారకరమన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిందితులకు మరింత ఊతమిచ్చినట్లు అయిందన్నారు. ఈ సమావేశంలో బాధితురాలు గౌరి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు, జిల్లా ఇన్చార్జి సాయి లక్ష్మి, అన్నమయ్య జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, చిత్తూరు జిల్లా కన్వీనర్ భువనేశ్వరి, మదనపల్లె పట్టణ కమిటీ సభ్యులు రెడ్డి ప్రసన్న, షాహినా పాల్గొన్నారు.అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి రమాదేవి -
సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
నందలూరు : టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జులై 5న ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలు ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు దర్శనం, తాగునీరు, ప్రసాదాలు పంపిణీలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహరం, డిప్యూటీ ఈఓలు నటేష్బాబు, శివప్రసాద్, ప్రశాంతి, డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, పట్టణీకరణ నిపుణుడు శ్రీరాముడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తాళ్లపాక ఆలయాలను అభివృద్ధి చేస్తాంరాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్ధలి తాళ్లపాకతోపాటు అలయాలను అభివృద్ధి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్ధానం జెఈవో వీరబ్రహ్మం తెలిపారు. టీటీడీ అధికారులతో కలిసి తాళ్లపాకలోని సిద్దేశ్వరస్వామి ఆలయం, 108 అన్నమయ్య విగ్రహ ప్రాంతం,. ప్రారంభానికి నోచుకోని శ్రీవారి ఆలయంను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6నుంచి 15వతేది వరకు తాళ్లపాకలోని చెన్నకేశవ, సిద్దేశ్వరస్వామి ఆలయాల వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పరిశీలించామన్నారు. కార్యక్రమంలో టీటీడీ డీఎఫ్ఓ ఫణికుమార్, డిప్యూటీ ఈఓ నటేష్బాబు, శివకుమార్, ప్రశాంతి, ఇంజనీరింగ్ ఎస్ఈ మనోహర్, ఈఈ సుమతి, విద్యుత్ ఎస్ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం -
శాఖల సమన్వయంతోనే ఆదాయం పెంపు
రాయచోటి: అన్ని శాఖల సమన్వయంతోనే వార్షిక ఆదాయం పెంపు సాధ్యమని, పన్నుల పరిధిలోని అన్నింటినీ తీసుకురావడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్లో జీఎస్టీ ఆదాయంపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ జీఎస్టీ అధికారి, జిల్లా పంచాయతీశాఖ మున్సి పాల్టీలు, మున్సిపల్ కార్పోరేషన్లు, ఆడిట్ శాఖ తదితర శాఖల జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమయ్యే ఆదాయాన్ని పన్నులు ద్వారా సమీకరిస్తుందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర జీఎస్టీ ఆదాయాన్ని పెంచడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి, రాజంపేట సబ్ కలెక్టర్లు మేఘస్వరూప్, వైఖోమ్ నదియా దేవి, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా జీఎస్టీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడిన యోధులను స్మరించుకునేందుకే.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడిన యోధులను స్మరించుకునేందుకే రాజ్యాంగ హత్య దినం జరుపుకుంటున్నామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ హత్య దినంను నిర్వహించారు. డీఆర్ఓ మధుసూదనరావు, అదనపు ఎస్పీ వెంకటాద్రి మాట్లాడారు. ● జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
టీడీపీలో కలవరం!
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. పార్టీ అధిష్ఠానం టీడీపీలో గట్టి పట్టున్న వారిని పట్టించుకోకపోవడం, నియోజకవర్గ ఇన్ఛార్జిలనుప్రకటించకపోవడం, ప్రస్తుత సర్కార్లో అవినీతి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా మిన్నకుండిపోతుండడం వంటి ఘటనలతో పార్టీలో సీనియర్ నాయకులు మనస్థాపం చెందుతున్నారు. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన వారికి కాకుండా అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టీడీపీ అధిష్ఠానం పదవులు కట్టబెడుతుండడంపై కూడా పార్టీలోని సీనియర్ నాయకులు రగలిపోతున్నారు. ప్రధానంగా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను టీడీపీ కరివేపాకులా వాడుకుని వదిలేసిందన్నది మెజార్టీ ప్రజల నుంచి అభి ప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలోనే ఎన్ని అవమానాలకు గురిచేసినా పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన మాజీ జెడ్పీ చైర్మన్, టీడీపీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ దివంగత సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యంను పార్టీ అధిష్టానం అవమానాలకు గురి చేయడంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసి టీడీపీకి రాజీనామా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీలో కలవరం మొదలైంది. రాజంపేట నుంచి పోటీ చేసినా... ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీ చేశారు. పాలకొండ్రాయుడు కుటుంబం నుంచి రాయచోటికి అవకాశం పరిశీలించాలని పదేపదే అడిగినా కాదని, రాజంపేట నియోజకవర్గం అప్పగించారు. అయినా బాలసుబ్రమణ్యం వెనుకంజ వేయకుండా రాజంపేట టీడీపీ టిక్కెట్పై పోటీ చేశారు. ఏరు దాటకముందు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా.. టీడీపీ అధిష్టానం వ్యవహరించడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఓడిపోయిన అభ్యర్థికి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టకుండా నాన్చుడు ధోరణితో ముందుకు వెళ్లింది. అంతవరకు బాగానే ఉన్నా మరోపక్క ఇంకో నాయకుడిని అదే నియోజకవర్గంలో ప్రోత్సహించడం వెనుక పొమ్మనకుండానే పొగబెట్టినట్లు అర్థమవుతోంది. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నమయ్య జిల్లాలో ఇదే బాటలో మరికొందరు