breaking news
Annamayya
-
రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ‘భారతి’ విద్యార్థి ఎంపిక
కమలాపురం : రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు డీఏవీ భారతి స్కూల్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన రాజంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్తుత్యమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లా చేవూరులో జరిగే రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ విభాగం పోటీల్లో ఆ విద్యార్థిని పాల్గొంటుందన్నారు. భారతి సిమెంట్స్ సీఎంఓ సాయి రమేష్, హెచ్ఆర్ గోపాల్రెడ్డి, ఐఆర్ అండ్ పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు వైశాలితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు.ఠి -
పారిశ్రామికవేత్తల దరఖాస్తులకు అనుమతులు జారీ చేయాలి
రాయచోటి : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సింగిల్ డెస్క్ విధానం కింద గడిచిన త్రైమాసికంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రాయితీల మంజూరు అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె.కృష్ణ కిశోర్తోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
సిద్దవటం : మండలంలోని కనుమలోపల్లి గ్రామ సమీపంలోని కామాక్షమ్మ గుడి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బద్వేల్కు చెందిన షేక్ నాయబ్రసూల్(22), పి.హర్షవర్ధన్ అనే యువకులు కడప నుంచి మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో బద్వేల్కు బయలుదేరారు. వారు అతివేగంగా ప్రయాణిస్తూ కంట్రోల్ చేసుకోలేక సిద్ధవటం మండలం కనుమలోపల్లి గ్రామ సమీపంలోని కామాక్షమ్మ గుడి వద్ద రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొని రోడ్డు పక్క చెట్లలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బద్వేల్లోని మహబూబ్నగర్కు చెందిన షేక్ నాయబ్రసూల్ తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న బద్వేల్లోని మహబూబ్నగర్కు చెందిన పి.హర్షవర్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని వైద్యం కోసం పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధవటం ఎస్ఐ మహమ్మద్రఫీ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, నాయబ్రసూల్ మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు.మరొకరికి గాయాలు -
పకడ్బందీగా లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలు
రాయచోటి జగదాంబసెంటర్ : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంలో నిర్దేశించిన అంశాలను పకడ్బందీగా అమలు చేస్తూ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గర్భస్థ పిండ లింగ నిర్ధారణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిషేధిత చట్టంలోని నిబంధనల మేరకు స్కాన్ సెంటర్లు లేదా డయాగ్నస్టిక్ సెంటర్లు లింగ నిర్ధారణ చేసినట్లయితే కఠినచర్యలు తప్పవన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ చట్టంపై అవగాహన కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా పోలీసు అధికారులతో వైద్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓ, శిశు సంక్షేమ శాఖ అధికారి, ఎన్జీఓలు, డీఎల్ఏసీ కమిటీ మెంబర్లు, ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
స్కౌట్ యూనిట్ ఏర్పాటు తప్పనిసరి
రాయచోటి : అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం సూచించారు. రాయచోటిలోని డైట్ కేంద్రంలో మంగళవారం పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, యూనిట్ లీడర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఉన్న 39 పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్ కార్యకలాపాల కోసం సమగ్ర శిక్షణ ద్వారా కేటాయించిన రూ.50 వేలను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి స్కౌట్ శిక్షణ దోహద పడుతుందన్నారు. అనంతరం స్కౌట్లో శిక్షణ పూర్తి చేసిన యూనిట్ లీడర్లకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ఏఎంఓ షపీవుల్లా, స్కౌట్ మాస్టర్, గైడ్ కెప్టెన్స్ పాల్గొన్నారు. -
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి
రాజంపేట : జిల్లా కేంద్రంగా పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటను చేయాలని రాజంపేట బార్ అసోసియేషన్ తీర్మానించింది. మంగళవారం బార్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు అధ్యక్షతన రాజంపేట కోర్టు క్లాంపెక్స్లోని బార్ ఆఫీసులో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కొండూరు శరత్కుమార్రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు మాట్లాడుతూ రాజంపేట జిల్లా చేయడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేటను జిల్లా చేస్తానని ప్రకటించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాఫర్బాషా, న్యాయవాదులు నాసరుద్దీన్, ఛాయాదేవి, కోసూరు సురేంద్రబాబు, కేఎంఎల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవం.. కారాదు విషాదం
● నేడు ప్రారంభం కానున్న వినాయక చవితి వేడుకలు ● జాగ్రత్తలు పాటిస్తే మేలు ● అత్యుత్సాహం వద్దురాజంపేట టౌన్ : జీవితం ఎంతో విలువైనది. అయితే కొంత మంది పండుగలు, ఉత్సవాల సందర్భంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించే క్రమంలో.. ప్రాణాలనే పోగొట్టుకుంటుండటం చాలా బాధాకరం. ముఖ్యంగా వినాయక చవితి వేడుకలు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ ఆనందం ఉరకలేస్తుంది. ఆ సమయంలో కొంత మంది వివిధ విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా ఏదో ఒకచోట విషాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి అపశ్రుతులు లేకుండా వేడుకలు సంతోషంగా ముగియాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. బుధవారం నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నందున పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చవితి వేడుకల్లో జరుగుతున్న అపశ్రుతులను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోలీసు అధికారుల సూచనలను పాటిస్తే వినాయక చవితి వేడుకలు ఆనందదాయకం కాగలవు. గతంలో జరిగిన సంఘటనలు రెండేళ్ల క్రితం వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఓ వ్యక్తి పాతబస్టాండ్ సర్కిల్లో ట్రాక్టర్పై నుంచి ఫల్టీకొట్టబోయి అదుపు తప్పి.. తల మధ్యభాగం రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో ఆ వ్యక్తి అక్కడే కదలలేని స్థితికి చేరుకొని జీవచ్చవంలా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించగా తలలోని నరాలు బాగా దెబ్బతినడంతో దాదాపు పది రోజులు చికిత్స పొంది చివరికి మృత్యువాత పడ్డాడు. ఆయన అత్యుత్సాహం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ● 2021లో రాజంపేట పట్టణం కృష్ణానగర్కు చెందిన జగన్నాథం అనే విద్యార్థి.. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో నీటమునిగి మృతి చెందాడు. వినాయకుడి ఊరేగింపు ఆలస్యం కావడంతో చీకటి పడింది. చీకటిలో వినాయకుడిని నీళ్లలోకి దించే క్రమంలో.. జగన్నాథం నీళ్లలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. ఆయన మృతి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ● గతేడాది తుమ్మల అగ్రహారానికి చెందిన ఓ వ్యక్తి టపాసులున్న కవర్ పట్టుకొని ఉండగా.. టపాసుల అగ్గిరవ్వలు కవర్లో పడ్డాయి. దీంతో కవర్లో ఉన్న టపాసులన్ని ఒక్కసారిగా పేలడంతో చేతివేళ్లు తెగిపోయి చెయ్యి చిధ్రమయింది. దీంతో ఆయన డ్రైవర్ వృత్తికి దూరం కావాల్సి వచ్చింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ● వినాయకుడిని కొలువు దీర్చేందుకు మండపాలు కట్టే సమయంలో విద్యుత్ షాక్ కొట్టకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలి. ● భారీ విగ్రహాలను వాహనాల్లోకి ఎక్కించే, మండపాల్లో కొలువు దీర్చే సమయంలో పిల్లలను దూరంగా ఉంచాలి. ● మండపాల్లో దీపాలను వెలిగించే సమయంలో డెకరేషన్కు సంబంధించిన దుస్తులు, పేపర్లు వంటివి దగ్గరలో లేకుండా చూసుకోవాలి. ● విగ్రహాలను చీకటి పడకముందే నిమజ్జనం చేయాలి. ● నిమజ్జనం చేసే సమయంలో పెద్దలు మాత్రమే నీటిలో దిగాలి. ● కర్రసాము వంటివి చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ● ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా చూసుకోవాలి. ప్రాణాలు వెలకట్టలేనివి ఈ ప్రపంచంలో ఒక్కసారి పోతే తిరిగి తెచ్చుకోలేనిది ప్రాణం ఒక్కటే. వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రజలు, భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. – బి.నాగార్జున, అర్బన్ సీఐ. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
కొండాపురం : మండల పరిధిలోని లావనూరు సమీపంలో సాయిబాబాగుడి దగ్గర మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజనేయులు(24), శివకుమార్ (27) దుర్మరణం చెందారు. వీరు బైకుపై వస్తుండగా స్కార్పియో వాహనం ఢీ కొన్నట్లు కొండాపురం ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని దుగ్గుపల్లె వద్ద పంప్ హౌస్లో నాలుగురోజుల నుంచి అక్కడ పని చేసి తిరిగి కొండాపురానికి బైకుపై వస్తుండగా లావనూరు వద్ద స్కార్పియో వాహనం ఢీ కొంది. రామంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. శివకుమార్ను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందినవారని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. -
గంజాయి మొక్కలు తొలగింపు
సుండుపల్లె : గంజాయి మొక్కలను పెంపకం చేస్తున్న వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. మండల పరిధిలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ ఆరోగ్యపురం బిడికికి చెందిన మూడే సుబ్బరామ నాయక్ తన ఇంటి పరిసరాల్లో గంజాయి మొక్కలను పెంచుతున్నాడన్న విశ్వసనీయ సమాచారంతో తనతో పాటు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఎకై ్సజ్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులు వెళ్లి మూడే సుబ్బరామనాయక్ ఇంటి పరిసరాలలో పెంచుకుంటున్న సుమారు 10 గంజాయి మొక్కలను సమూలంగా తొలగించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తి అరెస్టుతంబళ్లపల్లె : ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు...ఆర్టీసీ డ్రైవర్ రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో ఉండగా, మండలంలోని పెండేరివారిపల్లెకు చెందిన చంద్రశేఖర్ (48) సోమవారం మధ్యాహ్నం దాడి చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్ఐ మంగళవారం నిందితుడు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక వేంపల్లె : రాష్ట్ర స్థాయిలో జరిగే యోగా పోటీలకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికై నట్లు ఆర్కేవ్యాలీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా తెలిపారు. వేంపల్లెలో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కడప జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా పోటీల్లో విద్యార్థులు 6 బంగారు, 5 వెండి, 5 రాగి పతకాలతోపాటు 4 మెరిట్ స్థానాలు సాధించడం విశేషమన్నారు. -
సత్తా చాటిన దంపతులు
పెద్దతిప్పసముద్రం: మండలంలోని కమ్మచెరువుకు చెందిన వీరిద్దరూ వరుసకు బావ, బామర్ది. చిన్ననాటి నుంచి కలసి మెలసి చదువుకున్నారు. వీరి విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ స్కూళ్లలోనే సాగింది. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో ఇద్దరూ ఎస్జీటీలుగా ఎంపికయ్యారు. కమ్మచెరువుకు చెందిన ఎం.వేమనారాయణ, అలివేలమ్మ దంపతుల కుమారుడు నవీన్కుమార్ డీఎస్సీ ఫలితాల్లో 84.40 మార్కులు సాధించాడు. ఇదే గ్రామానికి చెందిన టి.గంగులప్ప, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు టి.విష్ణువర్దన్ డీఎస్సీ ఫలితాల్లో 70.20 మార్కులు సాధించాడు.సత్తా చాటిన దంపతులుపెద్దతిప్పసముద్రం మండలంలోని పులికల్లు పంచాయతీ బొంతలవారిపల్లికి చెందిన వెంకట్రమణారెడ్డి, సుబ్బమ్మ దంపతుల కుమారుడు బి.మధూకర్రెడ్డి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనతో పాటు అతని భార్య సునీత డీఎస్సీ పరీక్షలు రాశారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మధూకర్రెడ్డి 81.37 మార్కులతో జిల్లాలో 9వ ర్యాంకు సాధించి ఇటు మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా, అటు పీజీటీగా జోన్–4లో 20వ ర్యాంకు సాధించాడు. భార్య సునీత కూడా 74.62 మార్కులతో జిల్లాలోని మహిళా విభాగంలో 16వ ర్యాంకు సాధించి ఇటు సోషియల్ స్కూల్ అసిస్టెంట్గా, 81.05 మార్కులతో అటు ఎస్జీటీగా ఎంపికై ంది. ఒకొక్కరు రెండేసి ఉద్యోగాలకు ఎంపికై న దంపతులను బంధువులు, ఆత్మీయులు అభినందించారు.మెరిసిన గొర్రెల కాపరి కుమారుడుకలికిరి : కలికిరి మండలం మర్రికుంటపల్లి గ్రామం అలకంవారిపల్లికి చెందిన అలకం శివయ్య, లక్ష్మీదేవిల కుమారుడు అలకం వెంకటరమణ ఇటీవల విడుదలైన డీఎస్సీ మెరిట్ లిస్ట్లో 14వ ర్యాంకు సాధించి ఫిజిక్స్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు గొర్రెలు కాపరులుగా ఉంటూ తనను చదివించారని, వారి ఆశలు వమ్ము కాకుండా కష్టపడటంతో ఉద్యోగం సాధించినట్లు వెంకటరమణ తెలిపారు. -
చవితి వేడుకలకు సర్వం సిద్ధం
● నేడు వినాయక చవితి ● జిల్లాలో 3800 విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ● పూజా సామగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడిన మార్కెట్లు ● ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన ముస్లిం నాయకులురాయచోటి : వినాయక చవితిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 9 గంటల నుంచే సందడి నెలకొంది. రోడ్లన్నీ గణపతిని తీసుకు వెళ్లే లారీలు, ట్రాక్టర్లు, ఉత్సాహం ఉరకలేస్తున్న యువకుల కేకలతో మార్మోగాయి. విగ్రహాలను విక్రయించే షెడ్ల వద్ద భక్తుల హడావుడి కనిపించింది. ఉత్సాహ వంతులైన యువకులు డబ్బుకు వెనుకాడక నచ్చిన విగ్రహాన్ని తీసుకెళ్లారు. పండుగనాడు ఉదయం శాస్త్రోక్తంగా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఏర్పాట్లు పూర్తి అన్నమయ్య జిల్లాలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సరుకులు, పూలు, పండ్లు, పత్రి, చెరుకు గడలు, మొక్కజొన్న కంకులు కొనుగోలు చేసేందుకు తరలివచ్చిన జనంతో జిల్లా పరిధిలోని రాయచోటి, మదనపల్లి, రాజంపేట, పీలేరు, కోడూర్, కొత్తకోట కేంద్రాలలోని మార్కెట్ ఆవరణాలు కిక్కిరిసిపోయాయి. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాల విక్రయ కేంద్రాలు కొనుగోలు దారులతో రద్దీగా మారాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉత్సవ కమిటీల నిర్వాహకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు కోలాహలంగా మారాయి. యువకులు ఉత్సాహంతో విగ్రహాల ఏర్పాట్లపై దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా ఉత్సవ కమిటీలుగా ఏర్పడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. చూడముచ్చటగా మండపాలు వినాయక మండపాలను నిర్వాహకులు రంగురంగుల అలంకరణలు, విద్యుత్ దీపాల వెలుగులలో చూడముచ్చటైన నిర్మాణాలతో సెట్టింగులను వేసి సిద్ధం చేశారు. జిల్లా కేంద్రమైన రాయచోటి, మదనపల్లి, రాజంపేటతోపాటు జిల్లాలోని 30 మండలాల్లో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను అంగరంగ వైభవంగా పూర్తి చేశారు. మండపాలను అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం సాయంత్రం కల్లా వినాయక విగ్రహాలను పలు ప్రాంతాల నుంచి మండపాలకు చేరవేశారు. ఒకరికంటే ఒకరు భారీ విగ్రహాలు, వివిధ రూపాలతో ఉన్న గణనాథుని విగ్రహాలను నెలకొల్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పలు మండపాల నిర్వాహకులు లక్కీడ్రా ద్వారా ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు తదితర ఆకర్షణీయమైన బహుమతులతో లక్కీడ్రాలను చేపడుతున్నారు. మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ అన్నమయ్య జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల కేంద్రాలతోపాటు పల్లె ప్రాంతాల్లో సైతం ఈ ఏడాది భారీగా గణనాథుని ఉత్సవాల నిర్వహణకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలోని 30 మండలాల పరిధిలో 3800 విగ్రహాల ఏర్పాటుకు జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతులు ఇచ్చింది. జిల్లా పోలీస్ అధికారుల సూచనలు మేరకు విగ్రహాల ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు గడప గడపన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రత్యేక నిఘా చవితి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసులు ఆయా మండపాల వద్ద బందోబస్తు చేపట్టనున్నారు. నవరాత్రులు పూజలందుకున్న అనంతరం వినాయక నిమజ్జనాలను చేపట్టనున్నారు. మదనపల్లెలో పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్న భక్తులు మదనపల్లెలో మట్టి విగ్రహాలు పంపిణీకి సిద్ధం చేసిన ముస్లిం నాయకుడు పఠాన్ ఖాదర్ఖాన్విగ్రహాలను విక్రయ కేంద్రాల నుంచి మండపాలకు తరలిస్తున్న ఉత్సవ కమిటీల సభ్యులు వెల్లివిరిసిన మత సామరస్యంమదనపల్లె : వినాయక చవితి వేడుకల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. కొందరు ముస్లింలు లంబోదరుడిపై భక్తితో.. ఉత్సవాల్లో పాలుపంచుకోవడం విశేషం. 11 ఏళ్లుగా మట్టి విగ్రహాలు ఉచితంగా అందిస్తున్న మదనపల్లెకు చెందిన హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ఖాన్ 12వ ఏడాది కొనసాగించారు. మంగళవారం మదనపల్లెలోని తాజ్ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖాదర్ఖాన్ 1,000 మందికి విగ్రహాలు పంపిణీ చేశారు. పూజకు అవసరమైన సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఖాదర్ఖాన్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో ఏ పండుగ జరిగినా కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకొంటూ.. మతసామరస్యానికి ప్రతీకగా నిలవాన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏటా చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి స్థానిక నేతలు, సంఘాల ప్రతినిధులు హాజరై ఖాదర్ఖాన్ను ప్రశంసించారు. మదనపల్లెలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్సిద్దిక్ మట్టి వినాయకుని విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేశారు. -
మట్టి విగ్రహం.. పర్యావరణ హితం
రాయచోటి : పర్యావరణ హితం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. కావున అందరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని పేర్కొన్నారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, రాయచోటి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాయచోటి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ సుధా, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, మున్సిపల్ కమిషనర్ జి.రవి, ఏఈఈ అనీల్కుమార్రెడ్డి, అనాలసిస్ట్ సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. శాంతియుతంగా జరుపుకోవాలి రాయచోటి : వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఆయన మంగళవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిష్ట వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘనంగా వీరభద్రస్వామి జయంత్యుత్సవం రాయచోటి టౌన్ : రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి జయంత్యుత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం స్వామివారి జయంతి సందర్భంగా మూలవిరాట్కు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి యాలివాహనంపై కొలువు దీర్చి, పుర వీధుల్లో ఊరేగించారు. -
పంచముఖ గణపతిం భజేహం
● రాజంపేటలో అరుదైన ఆలయం రాజంపేట టౌన్ : రాజంపేట మండలం ఇసుకపల్లె రోడ్డులోని రాజీవ్ స్వగృహ ప్రాంతంలో నిర్మితమైన పంచముఖ విష్ణుగణపతి ఆలయం.. అనతికాలంలోనే ఎంతో విశిష్టత సంతరించుకుంది. సాధారణంగా వినాయక స్వామి ఆలయాల్లో వక్రతొండంతో ఉన్న విగ్రహాలను భక్తులు కొలువుదీర్చుతారు. అయితే రాజీవ్ స్వగృహ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించిన వినాయక స్వామి ఆలయంలో.. పంచముఖ విష్ణుపతిని కొలువుదీర్చారు. చుట్టూ చుట్టుకున్న ఆదిశేషుడిపై.. ఈ గణనాఽథుడు ఆశీనులై ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇదిలా వుంటే ఆదిశేషుడిపై ఆశీనులయ్యే అర్హత ఒక విష్ణువుకు మాత్రమే ఉంటుంది. అయితే అక్కడి పంచముఖ విష్ణుగణపతి ఆలయంలో వినాయకుడు తన అంకం (తొడ)పై లక్ష్మీదేవిని కూర్చోపెట్టుకొని ఆదిశేషుడుపై ఆశీనులు కావడం వల్ల స్వామివారు పంచుముఖ విష్ణుగణపతిగా ప్రసిద్ధి చెందారు. పంచముఖ వినాయక స్వామి ఆలయం దేశంలో తొలుత మహారాష్ట్రాలోని షిర్డీ క్షేత్రంలో వెలసింది. రాజంపేట మండలంలోని రాజీవ్ స్వగృహ ప్రాంతంలో వెలసిన పంచముఖ విష్ణుగణపతి ఆలయం రెండవది కావడం విశేషం. మూలవిరాట్కు మరో ప్రత్యేకత రాజీవ్ స్వగృహ సమీపంలో వెలసిన పంచముఖ విష్ణుగణపతి ఆలయంలోని మూలవిరాట్ను శ్రేష్టమైన కృష్ణశిలతో రూపొందించారు. అలాగే ఆలయంలో ఉన్న నవగ్రహాలకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఈ నవగ్రహాలు సతీవాహన సమేతంగా కొలువుదీరడం విశేషం. సతీవాహన సమేతంగా కొలువైన నవగ్రహాలు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేవు. ఈ ఆలయంలో దక్షిణా మూర్తి, పంచముఖ ఆంజనేయ స్వామి, గాయత్రీదేవి, శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి దేవదామూర్తులు కూడా కొలువై ఉన్నారు. విగ్రహాలను నిర్వాహకులు మహాబలిపురంలోని శిల్పులతో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆలయాన్ని కూడా మహాబలిపురానికి చెందిన శిల్పులతో నిర్మింప చేయించడం విశేషంగా చెప్పుకోవచ్చు. -
ఆందోళనలు.. ఆర్తనాదాలు
కూటమి సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టిన రోజు నుంచి ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు., పాలనా వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని, ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న విమర్శలు సర్వత్రా విసిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్పై గ్రామగ్రామాన ప్రజలు రగిలిపోతున్నారు.తాము అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామన్న చంద్రబాబు ఇప్పుడు అంధులు,, దివ్యాంగులు ఆర్తనాదాలు పెట్టేలా చేస్తున్నారు. ● చంద్రబాబూ మాపై ఎందుకు కక్ష ● కలెక్టర్ కార్యాలయం ఎదుట నినదించిన దివ్యాంగులు. ● కలెక్టర్కు వినతుల సమర్పణ నా పేరు లక్ష్మీ లావణ్య. కలకడ కోన. 2020 నుంచి పె న్షన్ వస్తోంది. వికలత్వ ప ర్సెంటేజ్ 73 శాతం ఉంది. అలాంటిది ఇప్పుడు నేను అనర్హురాలునని చెబుతున్నారు. ఇన్ని రోజులు ఉన్న వికలత్వం ఇప్పుడు ఎలా పోయిందో అధికారులే చెప్పాలి. న్యాయం చేయాలి నా పేరు శివ. 2015 నుంచి పెన్షన్ వస్తోంది. నా వికల త్వం పర్సెంటేజీ 64 శాతం ఉంది. అలాంటిది ఇప్పుడు పర్సెంటేజీ తగ్గించారు. ఫింఛన్ పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాను. ఫెన్షన్ రాదని చెబుతున్నారు.ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. కూటమి ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ చేయాలి. పరిశీలన చేసే డాక్టర్లను విచారించి మాకు న్యాయం చేయాలి. నా పేరు గున్నామంతి బాలాజీ. నాకు 87 శాతం వికలత్వం ఉంది. ఒకరి సాయం లేకుండా నడవలేను. అందుకే నాకు రూ.200 పించన్ ఇస్తున్నప్పటి నుంచి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు రూ.6వేలు వచ్చేది. అదే జీవనాధారం. అలాంటిది ఇప్పుడు నేను వికలాంగుడిని కాదంట.. పెన్షన్ రాదని చెబుతున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా తొలగించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెరిఫికేషన్ పేరుతో ఉన్న వాటిని తొలగిస్తున్నారు. అర్హత ఉంటేనే ఇన్ని రోజులు ఇచ్చింది. అలాంటిది ఇప్పుడు పరిశీలన పేరుతో తొలగించడం సరికాదు. జేసీ ఆదర్శ్రాజేంద్రన్కు వినతి పరత్రం అందజేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న దివ్యాంగుల జేఏసీ నాయకులు రాయచోటి టౌన్ : అయ్యా చంద్రబాబూ మాపై కోపం ఎందుకంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హత పేరుతో అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ దివ్యాంగుల సంఘం నాయకులు, వికలాంగులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం దివ్యాంగుల జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో పర్సెంటేజీ లను తగ్గించి, ఉన్న పెన్షన్లను తొలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు కలెక్టరేట్ ఎదురుగా రెండు గంటలకు పైగా ఆందోళనను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. అర్హత లేని వారిని తొలగించినా ఫర్వాలేదు కానీ, అర్హత ఉండి రాజకీయాల పేరుతో పెన్షన్లను తొలగిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తమ గోడు వినేందుకు కలెక్టర్ తమ దగ్గరకు రావాలని దివ్యాంగులు పట్టుబట్టారు. ఫిర్యాదుల స్వీకరణ తరువాత కలెక్టర్ దివ్యాంగులను తన దగ్గరకు పలిపించుకొని వారి వినతులను స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్కు కూడా వినతిపత్రం అందజేశారు. దివ్యాంగులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. చూడగానే వైకల్యం కనిపిస్తున్నా దివ్యాంగులని అనిపించకపోవడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దివ్యాంగ పింఛన్ల ఏరివేతకు ప్రాధాన్యమిచ్చింది. పరిశీలన పేరుతో వికలాంగులను వేధించడం మానుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల దివ్యాంగుల సంఘాల నాయకులతో ఆందోళనలు చేపడతాం. – ఖలీల్, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం సుండుపల్లె అధ్యక్షుడు చంద్రబాబు మోసపూరిత మాటలతో దివ్యాంగు ల ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఆయన అసలు రూపం చూపిస్తున్నాడు. పరిశీలన పేరుతో ఉన్న పెన్షన్లను తొలిగించడం ఎంత వరకు న్యాయం.. ఇప్పటికే నాలుగైదు లక్షల మందికి పెన్షన్లను తొలిగించారు. ఇంకా తొలగించే ప్రక్రియ జరుగుతోంది. ఇలా ఎన్నికలకు ముందు ఒక మాట.. అధికారం వచ్చాక మరో మాట మాట్లాడటం చంద్రబాబుకు మామూలే అని మరోసారి నిరూపితమైంది. – రహెమాన్ ఖాన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
● సన్నిహిత సంబంధమే హత్యకు కారణం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడురాయచోటి టౌన్ : మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఈ నెల 18వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండల పరిధిలోని దేవళంపల్లె ఫారెస్టులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ వి. సుధాకర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసి మృతురాలు మదనపల్లె మండలం, పొన్నేటిపాలెం, సవరంపల్లె గ్రామానికి చెందిన శ్రీదేవిగా గుర్తించారు. ఆమె ఫోన్ డేటా ఆధారంగా నిందితుడు సుండుపల్లె మండలం, మడితాడు గ్రామం నాయనివారిపల్లెకు చెందిన గురిగింజకుంట శివప్రసాద్ నాయుడుగా గుర్తించారు. మృతురాలితో నిందితుడు సన్నిహితంగా మెలిగేవాడని, ఈ క్రమంలో ఆమెను డబ్బుల కోసం వేధించేవాడని తెలుసుకున్నారు. దీంతో ఆమె తనతో ఉన్న సన్నిహిత సంబంధం గురించి అందరికీ చెబుతానని బెదిరించేది. డబ్బులు ఇవ్వకపోగా తననే బెదిరిస్తావా అని మనసులో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నెల 4వ తేదీ శివప్రసాద్ నాయుడుకు ఫోన్ చేసి తనను కలవాలని కోరింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు ఆమెను బైకుపై మదనపల్లె నుంచి చిన్నమండెం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఆమె చీరను మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసును తీసుకున్నాడు. తర్వాత అప్పటికే తన వెంట బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమైపె పోసి నిప్పు పెట్టాడు. బంగారు గొలుసు సుండుపల్లెలోని కీర్తన ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.1,31,000 రుణం తీసుకున్నాడు. సాంకేతిక పరి/్ఞానంతో నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకుని ఈ నెల 24వ తేదీ స్వచ్ఛందంగా లొంగిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పెడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటాద్రి, రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బోర్డులు పీకేసి..భూములపై కన్నేసి
● ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాకు అక్రమార్కుల యత్నాలు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు గుర్రంకొండ : విలువైన ప్రభుత్వం భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు స్థలాన్ని పరిశీలించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను అక్రమార్కులు మాయం చేస్తూ.. కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకొన్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలోని గుర్రంకొండ పట్టణానికి సమీపంలోని చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం పక్కనే ఎన్హెచ్ 340 జాతీయ రహదారి సమీపంలో కోట్లాది రుపాయలు విలువచేసే ఫ్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వేనంబర్ 87/8లో రెండు ఎకరాల భూమికి సంబంధించి ఇంతవరకు ఎవ్వరికీ పట్టా ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో భూముల విలువ పెరిగిపోయింది. ఎకరం రూ.2 కోట్ల వరకు ఉంది. దీంతో కొంతమంది కబ్జాదారుల కన్ను ఈ భూమిపై పడింది. దీనిని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారులు సదరు భూమిని కబ్జాదారుల నుంచి కాపాడుకోవడానికి సర్వే పనులు చేపట్టారు. జేసీబీతో సరిహద్దుల వద్ద కందకాలు తవ్విస్తుండగా వాటిని కొంతమంది కూటమినేతలు అడ్డుకుని రెవెన్యూ ఆధికారులను అక్కడి నుంచి పంపించేసిన సంఘటనలు ఉన్నాయి. కొన్నాళ్లుగా గుంభనంగా ఉన్న కబ్జాదారులు అప్పట్లో మళ్లీ కబ్జా ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. ఈనేపథ్యంలో రెండునెలల క్రితం రెవెన్యూ అధికారులు సదరు స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వేనెంబరు 87/8లో ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలేదని, ఇందులో ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.వీటిని అక్రమార్కులు పీకేశారు. మండలంలోని ఖండ్రిగ గ్రామంలో ప్రభుత్వస్థలంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని 503–8లో వంక పోరంబోకు స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని చదును చేసుకొన్నారు. మురాద్బీ కుంటకు వర్షపునీరు చేరే ఈ వంకను ఆనవాళ్లు లేకుండా చేశారు. జేసీబీలతో వంకను ధ్వంసం చేసి ప్లాట్లు విక్రయించడానికి సిద్ధం చేసుకొన్నారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వోలు, సర్వేయర్లు రెండునెలల క్రితం వంకస్థలాన్ని సర్వేచేశారు. రూ. కోటి విలువచేసే మొత్తం 25 సెంట్ల మేరకు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేల్చారు. ఈనేపథ్యంలో రెవెన్యూ అధికారులు మురాద్బీ వంక వద్దకఆక్రమణ గురైన ప్రభుత్వంలో హెచ్చరిక బోర్డు నాటించారు. ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని ఇక్కడ ఎవరైనా ప్రవేశిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటాని అధికారులు హెచ్చరించారు. హెచ్చరిక బోర్డులు మాయం గుర్రంకొం మండలంలోని చిట్టిబోయనపల్లె, ఖండ్రిగ గ్రామాల్లో గతంల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మాయయ్యాయి. రెండు చోట్ల బోర్డులను ఆక్రమణ దారులు తొలగించేశారు. అసలు అక్కడ హెచ్చరిక బోర్డులు ఉన్నట్లు ఆనవాళ్లు లేకుండా చేసేశారు. దీంతో రూ. 5 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు మళ్లీ కబ్జా చేసి, విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.సదరు ప్రభుత్వస్థలాల్లో ఇప్పటికే అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టడం గమనార్హం. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అసలు రెవెన్యూ ఆధికారులు అలాంటప్పుడు ప్రభుత్వ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు నాటడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గుర్రంకొండ మండలం చిట్టిబోయనపల్లె ఫ్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు నాటుతున్న రెవెన్యూ అధికారులు, బోర్డు తొలగించిన దృశ్యం మళ్లీ మొదలైన కబ్జా యత్నాలు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు నాటిన తరువాత గుంభనంగా ఉన్న కబ్జాదారులు మళ్లీ ప్రభుత్వ భూములను కబ్జా చేసే యత్నాలు మొదలు పెట్టారు. బోర్డులు నాటిని భూముల్లో ఉన్న వేప, ఇతర చెట్లను నరికి వేశారు. ఇప్పటికే కొన్ని చెట్లను నేలకూల్చి తరలించేసి భూమిని చదును చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సదరు భూమిలో చదును చేసే పనుల్లో భాగంగా బయట ప్రాంతాల నుంచి మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. మురాద్బీ వంకను చాలా వరకు చదనుచేశారు. వంక రూపురేఖలు మార్చేసి ప్లాట్లు వేసి విక్రయించడానికి సిద్ధం చేశారు. దీంతో ఇక్కడ వంక ఆనవాళ్లు కనుమరుగయ్యాయి.ఇప్పటికే మట్టికుప్పలు భూమిలో దర్శనమిస్తుండడం గమనార్హం. రెవెన్యూ అదికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని రోజురోజుకు భూ ఆక్రమణ పనులు మొదలు పెడుతుండటం గమనార్హం. ప్రభుత్వ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు తొలగించిన సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. చిట్టిబోయనపల్లె, ఖండ్రిగ గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో మళ్లీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. – సదాశివప్ప నాయుడు, ఆర్ఐ. గుర్రంకొండ. -
ఒంటిమిట్ట రామాలయంలో పవిత్రాల సమర్పణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా సోమవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతారామలక్ష్మణుల ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం బాలబోగం, చతుష్టానార్చన, పవిత్రహోమం, మధ్యాహ్నం ఆరాధన, శాత్తుమొర, తీర్థప్రసాద గోష్టి చేపట్టారు. అనంతరం ఉదయం 9 గంటలకు శ్రీ సీతాసమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు. యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, విశ్వక్సేనులవారికి, ధ్వజస్తంభానికి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి ప్రశాంతి, సూపరిటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
రాజ్యసభ సభ్యుడు మేడాపై దుష్ప్రచారం శోచనీయం
రాజంపేట : రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిపై ఎల్లోమీడియా, కూటమి ప్రభుత్వ అనుకూల ఛానళ్లు దుష్ప్రచారం చేయడం శోచనీయమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి అన్నారు. సోమవారం తన స్వగృహంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే మేడా కుటుంబానికి ఎంతో అభిమానం ఉందన్నారు. ప్రాణం ఉన్నంత వరకు, రాజకీయాలలో మేడా రఘునాథరెడ్డి కుటుంబం జగన్రెడ్డిని వీడి వెళ్లరని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని భావించే వ్యక్తి మేడా రఘునాథరెడ్డి అన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే విధంగా పాలన సాగించాలే కానీ తమకు అనుకూలమైన మీడియా ద్వారా మేడాపై బురదచల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. -
బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు
నిమ్మనపల్లె : బైక్ అదుపు తప్పి యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. వెంగంవారిపల్లె పంచాయతీ కొత్తకొండసానివారిపల్లెకు చెందిన బాలకృష్ణ కుమారుడు నవీన్(25) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో నిమ్మనపల్లెకు వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలోని చిన్నల్లవారిపల్లె వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితికి వెళ్లగా గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. ఆటో బోల్తా పడి .. మదనపల్లె రూరల్ : ఆటో బోల్తా పడి వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం పుంగనూరు మండలంలో జరిగింది. నేతిగుట్లపల్లెకు చెందిన మహేశ్వర(40) మరి కొందరితో కలిసి ఆటోలో పుంగనూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలోని రాంపల్లి వద్ద ఒక్కసారిగా కుక్కలు అడ్డురావడంతో ఆటో ఆదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో మహేశ్వరతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. కొందరు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా తీవ్రంగా గాయపడిన మహేశ్వరను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
మట్టి విగ్రహాలనే వినియోగించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : వినాయక చవితి పండుగలో ప్రజలు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్తో కలిసి గణేష్ నవరాత్రి వేళ పర్యావరణహిత మట్టి విగ్రహాలు వినియోగంపై కలెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడటం వల్ల చెరువులు, నదులు కాలుష్యం అవుతున్నాయన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. సమస్యలకు సత్వర పరిష్కారం రాయచోటి టౌన్ : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.అనంతరం మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నిశితంగా అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలోగా సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. శాంతియుతంగా వినాయక చవితి జరుపుకోవాలి:జేసీ రాయచోటి : వినాయక చవితి పండుగ సామరస్యానికి ప్రతీక అని, పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా సంబంధిత అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణిలతో కలిస జాయింట్ కలెక్టర్ శాంతియుత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలు శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని జేసీ సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలు ఉపయోగించకుండా మట్టి వినాయకులను ప్రోత్సహించాలని నిర్వాహకులను కోరారు. నిమజ్జన ఘాట్ల వద్ద లైటింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు, రక్షణ బృందాలు వంటి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ మధుసూదన్రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు,మతపెద్దలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి
రాజంపేట : పుల్లంపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న భూ ఆక్రమణలను అడ్డుకొని పేదలను ఆదుకోవాలని పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి కోరారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏఓ శ్రీధర్రావుకు వినతిపత్రం అందజేసిన అనంతరం కబ్జా భూముల వివరాలను ఎంపీపీ మీడియాకు వివరించారు. పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం గ్రామంలో ముద్దా సుబ్బారెడ్డి సతీమణి లక్ష్మినరసమ్మ పేరు మీద 324 సర్వే నెంబరులో 3 సెంట్లు స్థలం ఉందన్నారు. ఈ 3 సెంట్ల స్థలాన్ని ఆసరాగా తీసుకొని వీరి కుమారుడు ముద్దా సుభాష్రెడ్డి అలియాస్ గంగిరెడ్డి సమీపంలో పలువురి భూములను 40 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారన్నారు. ఇదే విషయంపై పుల్లంపేట తహసీల్దార్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఇందులో ఉన్న గ్రామ కంఠం భూమి 6 ఎకరాలను కూడా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. వెంబులూరు సుబ్బన్న, చెన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి వంటి వారితో పాటు ఎంతో మందిని ఇబ్బంది పెట్టి వారి భూములను అక్రమించుకున్నారన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వీరికి బంధువు కావడంతో రెచ్చిపోయి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దళితుల భూములకు అండగా ఉండాల్సిన పుల్లంపేట తహసీల్దార్ అధికార పార్టీ నాయకులకు, ఆక్రమణదారులకు వత్తాసు పలకడమేమిటని ఆయన ప్రశ్నించారు.పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి -
చిన్నారి మృతిపై అనుమానాలు
● కళాశాల సీసీ పుటేజీలో వెలుగు చూసిన వాస్తవాలు ● 13 రోజుల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టంకురబలకోట : ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొరుగింటి నీటి నిల్వ తొట్టెలో పడి చనిపోయాడని భావించి తల్లిదండ్రులు లేకలేక కలిగిన రెండేళ్ల పసిబిడ్డకు గుండె పగిలిన మనసుతో అంత్యక్రియలు నిర్వహించారు. దేవుడు మనకే ఎందుకు ఇంత క్షోభ మిగిల్చాడని కన్నీరు మున్నీరుగా విలపించారు. కానీ అసలు కథ సీసీ కెమెరాల ద్వారా వెలుగు చూసింది. బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోలేదని అనుమానాలకు దారితీసింది. దీంతో బిడ్డను పూడ్చిన 13 రోజుల తర్వాత సోమవారం తవ్వి తీసి అక్కడే డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె బసినికొండకు చెందిన చిన్నరెడ్డెప్పకు, కురబలకోట మండలంలోని భార్గవికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల వరకు పిల్లలు కలుగకపోవడంతో ఎన్నో పూజలు, మొక్కుబడులు చేశారు. రెండేళ్ల క్రితం ఎం. శ్యామ్ కృష్ణ జన్మించాడు. లేక లేక కలిగిన ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు. ఈ క్రమంలో భార్గవి ఈనెల 11న పెద్దకటవలోని పుట్టింటికి భర్త, బిడ్డతో కలసి వచ్చింది. 12న ఉదయం రెండేళ్ల చిన్నారి శ్యామ్ కృష్ణ ఒంటరిగా ఆడుకుంటూ కొంత దూరంలో ఉన్న పొరిగింటి వైపు వెళ్లాడు. ఆ తర్వాత కన్పించకుండా పోయాడు. ఊరంతా వెతికారు. చివరకు గంట తర్వాత పొరిగింటిలో బయట ఉన్న నీటి తొట్టెలో శవమై కన్పించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. బిడ్డ ప్రమాదవశాత్తు పడి చనిపోయాడని భావించి అదే రోజు బాధాతప్త హృదయంతో అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటికీ అనుమానం ఉంటే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పినా పసిబిడ్డకు పోస్టుమార్టం సరికాదని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రెండు రోజుల తర్వాత ఆ ఊరిని ఆనుకుని ఉన్న కళాశాల కెమెరాలను పరిశీలించారు. బిడ్డ పొరిగింటి వరకు వెళ్లడం అదే సమయంలో కొంత సేపటికే అదే ఊరికి చెందిన ఓ జంట ఆ ఇంటివైపు రావడం తిరిగి వెళ్లడం దృశ్యాలు కన్పించాయి. ఒక వైపు బిడ్డ మరో వైపు జంట పొరిగింటి వైపుగా వెళ్లినట్లుగా ఉన్న దృశ్యాలు మాత్రమే సీసీ కెమెరాలో కన్పిస్తున్నాయి. దీంతో అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తల్లిదండ్రులు బిడ్డ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బిడ్డ మృతిపై ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. దీంతో రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో తహసీల్దారు ధనుంజయులు సమక్షంలో డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే భూమిలో పాతిపెట్టిన అమాయక పసిబిడ్డ మృతదేహాన్ని 13 రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం చేసిన దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు పొంగుకొస్తున్న దుంఖాన్ని ఆపుకోలేకపోయారు. అమాయక ప్రాణానికి న్యాయం జరగాలని తలచుకున్నారు. అంగళ్లు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సోషల్ వర్కర్ తుమ్మచెట్లపల్లె నాగరత్న పాల్గొన్నారు. -
‘భాగ్యలక్ష్మి’ సందడి
మదనపల్లె : స్థానిక సీటీఎం రోడ్డులో చందన షాపింగ్ మాల్ ను సినీనటి ఐశ్వర్య రాజేష్, బాల నటుడు రేవంత్ (బుల్లి రాజు) చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైంది. స్థానికులు, అభిమానులు హాజరై సందడి చేశారు.ఇక్కడి వారి ఆత్మీయత, ఆదరణ మరువలేనిదన్నారు. తొలి రోజే వందల మంది షాపింగ్ ప్రియులు ఆసక్తితో కావాల్సిన వాటిని బంపర్ ఆఫర్లతో కొనుగోలు చేసి సంబరపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, డి.రమేష్, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మునిసిపల్ చైర్మన్ మనూజా పాల్గొన్నారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం తగదు
పీలేరు : ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్య ధోరణి తగదని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబిర్, కోశాధికారి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పీలేరులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. పీఆర్సీ అమలు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి పాతన పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షుడు రాధాకృష్ణ, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు చెంగల్రాయుడు, ఆదినారాయణ, వెంకటరమణ, విజయ్కుమార్, పీరయ్య, చిన్నరెడ్డెప్ప, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
దరఖాస్తుకు నేడు చివరి తేదీ
రాజంపేట : రాజంపేట అబ్కారీశాఖ పరిధిలో రెండు బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజని రాజంపేట అబ్కారీశాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిక తెలిపారు. సోమవారం ఇక్కడ మాట్లాడుతూ చివరిరోజున డీడీల రూపంలో బ్యాంకుల ద్వారా, డిపాజిట్ చేసుకోవాలన్నారు. ఆఫ్లైన్, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాయచోటి జగదాంబసెంటర్ : ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 28వ తేదీ నుంచి సంబంధిత జిల్లాల్లోనే ప్రారంభమవుతుందని మెగా డీఎస్సీ–2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఒక రైతుకు ఒక బస్తా మదనపల్లె : మదనపల్లెలో యూరియా కోసం వచ్చిన రైతులకు వ్యవసాయశాఖ అధికారులు ఒక రైతుకు ఒక బస్తాను పంపీణీ చేయాలని డీలర్లను కోరారు. సోమవారం మదనపల్లె ఎరువుల దుకాణాల వద్ద రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో బస్తా యూరియా కోసం క్యూలో నిలబడి తీసుకెళ్లారు. రైతులకు అవసరమైనంత యూరియా ఉందని, అయితే ఒకేసారి తీసుకువెళ్లడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని వ్యవసాయశాఖ ఏఓ నవీన్కుమార్రెడ్డి చెప్పారు. ఒక పంటకు ఒక విడతకు ఒక బస్తా యూరియా సరిపోతుందని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీ అర్హత నిబంధన సవరణ రాయచోటి జగదాంబసెంటర్ : పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీల అర్హత నిబంధనలలో సవరణలు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు కనీసం 2 సంవత్సరాల సేవ పూర్తి చేయాలనే షరతు మినహాయించినట్లు, ఈ నేపథ్యంలో సేవా పరిమితి అవసరం లేదన్నారు. అదే విధంగా వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న పరస్పర మార్పిడి బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వారికి 31.07.2027లోపు పదవీవిరమణ పొందబోయే వారు అంతర్ జిల్లా బదిలీలకు అర్హులు కారని గమనించాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 24 నుంచి 27వ తేదీల వరకు, ఎంఈఓ వెరిఫికేషన్ ఈ నెల 25 నుంచి 28 వరకు, డీఈఓ వెరిఫికేషన్ ఈ నెల 26 నుంచి 29 వరకు, పాఠశాల విద్య డైరెక్టర్కు సమర్పణ ఈ నెల 30 నుంచి 31వ తేదీ వరకు, డైరెక్టర్ కార్యాలయ పరిశీలన సెప్టెంబర్ 1 నుండి 2వ తేదీ వరకు ఉంటుందని డీఈఓ తెలియజేశారు. -
ఆటో దగ్ధం
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని ఓబనపల్లి దళితవాడలో ఇంటి ముందు నిలిపి ఉంచిన కనుపర్తి రాజేంద్రకు చెందిన ఆటోను సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పోలీసులు నిందితులను శిక్షించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. -
బాధితులకు చట్టపరిధిలో అండగా నిలవండి
రాయచోటి : న్యాయం కోసం పోలీసు స్టేషన్ గడప తొక్కిన బాధితులకు చట్టపరిధిలో అండగా నిలవాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలిచ్చారు. అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ స్వీకరించారు. సైబర్ మోసాలు, కుటుంబ సభ్యుల వేధింపులు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసాలు, ప్రేమ పేరుతో మోసాలు లాంటివి అధికంగా ఉన్నాయి. ప్రతి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా నేరుగా ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళల ఫిర్యాదులకు ప్రాముఖ్యతనిస్తూ సమగ్రంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. -
కల్వర్టులో లారీ బోల్తా
సిద్దవటం : సిద్దవటం గ్రామ శివారులోని స్విమ్మింగ్ పూల్ వద్ద ఆదివారం రాత్రి లారీ కల్వర్టులో పడిన ప్రమాదంలో నందలూరుకు చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాసులకు గాయాలయ్యాయి. లారీ కోడూరు నుంచి మామిడి కట్టెలు లోడు చేసుకొని ఆదివారం రాత్రి గోపవరంలోని సెంచురియన్ ప్లే ఉడ్ ఫ్యాక్టరీకి బయలుదేరింది. స్విమ్మింగ్ పూల్ వద్ద ఎత్తుగా ఉండటంతో అక్కడ డ్రైవర్ గేర్ మార్చుకోలేకపోవడంతో వెనక్కు వచ్చి కల్వర్టులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శ్రీనివాసులకు గాయాలు కాగా స్థానికులు సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
చేనేత నగర్లో చోరీ
కురబలకోట : మండలంలో చేనేత నగర్లోని ఎస్.బాషా ఇంటిలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటిలోని రూ.లక్ష నగదు, బీరువాలో దాచిన రూ.3 లక్షలు విలువ చేసే బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఎస్.బాషా కుటుంబీకులు ఆదివారం రాత్రి బ్రాహ్మణ ఒడ్డుపల్లె కాలనీలోని కూతురి ఇంటికి వెళ్లారు. ఇతని ఇళ్లు చేనేత నగర్ చివరలో ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం పసిగట్టిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి రెండు బీరువాలు పగుల గొట్టి వీటిని చోరీ చేశారు. సోమవారం ఉదయం బాషా కుటంబీకులు ఇంటికి వచ్చి చూసి నిశ్చేష్టులయ్యారు. ఇంటి పని ప్రారంభించడానికి బాధితుడు దాచిన రూ.లక్ష సొమ్ము దొంగల పాలు కావడంతో అతని ఇంటి కలలు ఆవిరయ్యాయి. సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికనందలూరు : రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 21వ తేదీన జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఎం.యేసుప్రియ, ఎస్.మన్సూర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్రాజు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ సుస్మిత, పీఈటీ జగన్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజంపేట జిల్లా హామీని సీఎం నెరవేర్చాలిరాజంపేట : రాజంపేట జిల్లా ప్రకటనపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెరవేర్చాలని జిల్లా సాధన సమితి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం అన్నమయ్య అతిఽథి గృహంలో నేతలు భేటీ అయ్యారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాజంపేటలో ఇచ్చిన హామీ మేరకు రాజంపేటను జిల్లా చేయాలనే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి జేఏసీ నేతలు పూల భాస్కర్, ఉద్దండం సుబ్రమణ్యం, గీతాంజలి రమణ, నందగోపాల్, జువ్వాజి మోహన్, సుదర్శన్, షేక్ అస్లాం, విద్యార్థి సంఘం నేత నాగేశ్వరనాయుడు, రమణనాయుడు, రఘుపతినాయుడు, పోకల ప్రభాకర్, మహదేవయ్య, డీఎస్రావు తదితరులు పాల్గొన్నారు. భర్త, బంధువులు వేధిస్తున్నారని ఫిర్యాదుకడప అర్బన్ : కడప నగరంలోని మరియాపురానికి చెందిన వసంతకు, కలికిరికి చెందిన ప్రవీణ్కుమార్కు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వసంత, తన భర్తతోపాటు, అత్త, బంధువులు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా సీఐ టి.రెడ్డెప్ప తెలిపారు. -
మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు
రాయచోటి : జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మాదక ద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాల నివారణ, రవాణాను అరికట్టేందుకు ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 530 ఉన్నత పాఠశాలల్లో 430 ఈగల్ క్లబ్స్ను ఏర్పాటు చేశామన్నారు. మందుల షాపులలో డాక్టర్ రాసిన చీటీలు లేకుండా మందులు ఇవ్వరాదని, తరచూ మందుల షాపులను తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. జిల్లాలో పోలీసు శాఖ వారికి ఇప్పటికే 735 అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. గంజాయి డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు, డ్రగ్స్ గంజాయి బానిసత్వం నుండి బయటకు రండి తదితర పోస్టర్లను జేసీ ఆవిష్కరించారు. సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఏఈఎస్ జోగేంద్ర, డీఎస్పీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఆగి ఉన్న లారీని ఢీకొన్న విద్యార్థికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉన్న ఘటన శనివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు గౌతమ్(18) మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. శనివారం కళాశాల ముగించుకుని ఆలస్యంగా ద్విచక్రవాహనంలో రాత్రి ఇంటికి బయలు దేరాడు. మార్గమధ్యంలోని గ్రీన్వ్యాలీ స్కూల్ సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్లి ఢీకొన్నాడు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. -
రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. జిల్లా జూనియర్ బాల,బాలికల షూటింగ్ బాల్ జట్ల ఎంపికమదనపల్లె సిటీ : మదనపల్లె పట్టణం పుంగనూరు రోడ్డులోని గ్రీన్వ్యాలీ స్కూల్లో ఆదివారం జిల్లా షూటింగ్ బాల్ బాల,బాలికల జట్ల ఎంపిక జరిగింది. జిల్లా నలుమూలల నుంచి సుమారు వందమంది క్రీడాకారులు పాల్గొన్నారని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్ నెలలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంటులో పాల్గొంటారని తెలిపారు. జిల్లా అసోసియేషన్ చైర్మన్ జునైద్ అక్బరీ అభినందించారు. కార్యక్రమంలో ఏషియన్ గోల్డ్ మెడలిస్టు యూసుఫ్, అసోసియేషన్ సభ్యులు భారతి, మండల స్కూల్ గేమ్స్ కో ఆర్డినేటర్ శివశంకర్, సెలక్షన్ కమిటీ సభ్యులు కుమార్ నాయక్, జయంత్, తిరుమలేష్, పీడీలు గురు, మణి, లత, మంజుల, చిన్నప్ప, మౌనిక పాల్గొన్నారు. కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు సింహాద్రిపురం : మండల కేంద్రంలో క్షుద్ర పూజలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంలో ఈద్గా సమీపంలో వెన్నపూసపల్లెకు వెళ్లె దారిలో క్షుద్ర పూజలు పలుమార్లు జరుపుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కాక ఆ దారిన తరచూ వెళ్లే రైతులు, అలాగే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. -
బొజ్జ గణపయ్య పండుగ .. ఉపాధి మెండుగా
● చిరు వ్యాపారులు, వివిధ రంగాలకార్మికులకు చేతినిండా పని● 27 నుంచి ప్రారంభం కానున్న గణపయ్య వేడుకలురాజంపేట టౌన్ : నాణేనికి ఒకవైపు కాదు రెండువైపులా చూడాలి అంటుంటారు పెద్దలు. అలాగే వినాయచవితి వేడుకలు అంటే భక్తిభావం, సందడైన వాతావరణం అన్న అభిప్రాయమే ప్రజల్లో నాటుకు పోయింది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. హిందువులకు పెద్ద పండుగ సంక్రాంతి. అయితే సంక్రాంతి పెద్ద పండుగ అయినప్పటికి ప్రధానంగా దుస్తులు, నిత్యావసర సరుకుల వ్యాపారులకు ఆదాయాన్ని ఇస్తుంది. అయితే వినాయక చవితి పండుగ చిరువ్యాపారులకు, వివిధ రంగాల కార్మికుల, రైతుల కడుపు నింపుతుంది. వినాయక చవితి ప్రారంభానికి ముందు నుంచే అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. అందువల్ల ఈ ఉత్సవాలపై అనేక మంది ఆశలు పెట్టుకుంటారు. మరో రెండు రోజుల్లో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో చవితి వేడుకల సందడి ప్రారంభం కానుంది. అందువల్ల ఇప్పటి నుంచే వివిధ రంగాల కార్మికులు చవితి ఉత్సవాలకు సంబంధించిన పనులు జోరుగా చేస్తున్నారు.కళాకారులకు పండగే..సెల్ఫోన్ అందుబాటులోకి వచ్చాక కాలక్షేపానికి, వినోదానికి కొదవలేదనే చెప్పాలి. అందువల్ల అనేక కళలు కూడా అంతరించిపోయాయి. అయితే వినాయక చవితి సందర్భంగా గాన, నృత్య, మిమిక్రి, మ్యాజిక్షో, సన్నాయి వాయిద్యం, డ్రమ్స్ వాయించే కళాకారులకు చేతినిండా పని లభించి కనీసం ఓ రెండు నెలల పాటు వారి కుటుంబాల పోషణ సాఫీగా సాగిపోతుంది. జిల్లాలో వందలాది మంది కళాకారులు వివిధ కళలను నమ్ముకొని జీవిస్తున్నారు. వారిలో అనేక మంది కళల ద్వారా వచ్చే ఆదాయంతో జీవించే వారు కూడా లేకపోలేదు. అలాంటి వారికి వినాయక చవితి నిజంగా కడుపునింపే పండుగ అనే చెప్పాలి. కాగా చవితి ఉత్సవాలు జరిగినన్ని రోజులు పురోహితులకు కూడా ఉపాధి లభిస్తుంది.చిరు వ్యాపారులకు, రైతులకు సైతం..కొన్ని రోజుల పాటైనా ఇబ్బందులు లేకుండా చిరు వ్యాపారులు, రైతుల కడుపునింపేందుకు వినాయక చవితి వేడుకలు ఎంతగానో దోహదపడతాయి. చవితి వేడుకలు జరిగినన్ని రోజులు ప్రధానంగా పూలు, పండ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. అందువల్ల వ్యాపారులకు, రైతులకు కొంతమేర ఆదాయం సమకూరి వారి కుటుంబ పోషణకు దోహదపడనుంది.కార్మికులకు ఉపాధి..వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అసంఘటిత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఇందులో ఎలక్ట్రీషియన్, దినసరి కూలీలు, ట్రాక్టర్ డైవర్లకు చేతినిండా పని దొరుకుతుంది. ఇందువల్ల చవితి ఉత్సవాలు జరిగినన్ని రోజులు అసంఘటిత కార్మికుల్లో కొంత మందికి మెండుగా ఉపాధి దొరుకుతుంది. -
రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగించాలని అన్నమయ్య జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. ఆదివారం రాయచోటి పట్టణంలోని సాయిశుభ కళ్యాణ మండపంలో అత్యవసర సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలించాలన్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని వారు కోరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సీఎం చంద్రబాబుతో చర్చించి జిల్లా కేంద్రం మార్పును అడ్డుకోవాలని.. లేనిపక్షంలో ఉద్యమానికి సన్నద్ధం అవుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా సాధన సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ బయారెడ్డి, సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి, మదన్మోహన్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, విజయభాస్కర్, గంగిరెడ్డి, రామాంజులు, ప్రకాష్, మైనార్టీ నేత ఇర్షాద్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్రెడ్డి, న్యాయవాది రెడ్డప్పరెడ్డి, భాస్కర్రాజు పాల్గొన్నారు. -
‘అగ్నివీర్’కు 159 మంది అర్హత
తిరుపతి రూరల్ : అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ రాత పరీక్షలో ఎస్వీ డిఫెన్స్ అకాడమికి చెందిన 159 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆ అకాడమి చైర్మన్ బి.శేషారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చామని, వారు ఉద్యోగంలో చేరడానికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అర్హత సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. -
విద్యాసాగర్ ఆస్పత్రిలో 500 రొబొటిక్ శస్త్ర చికిత్సలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : బోన్, జాయింట్ కేర్లో అద్భుతమైన ప్రయాణంలో మరొక పెద్ద మైలురాయిని విద్యాసాగర్ ఆసుపత్రి అధిగమించిందని, తమ ఆస్పత్రిలో 500 రోబోటిక్ మోకాళ్ల శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందని ఆస్పత్రి ఎండీ డాక్టర్ సి.విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. ఆస్పత్రిలో ఆదివారం ఆయన కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నొప్పి నుంచి నూతన జీవితం వరకు ప్రయాణించిన అనేక మంది రోగుల చిరునవ్వులు చూడడం ఆత్మ సంతృప్తిని ఇస్తోందన్నారు. తమ ఆస్పత్రిలో గత 15 ఏళ్లుగా ఎముకలు, కీళ్ల సంరక్షణలో విశేష సేవలందిస్తూ 7500 లకు పైగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ విజయం అధునాతన జాయింట్ రీప్లేస్మెంట్ సాంకేతికతలో ఒక ముందడుగు అన్నారు. రాయలసీమలో జాయింట్ కేర్ కోసం ప్రపంచ స్థాయి సీఓఆర్ఐ రోబోటిక్ సాంకేతికతను పరిచయం చేసిన మొదటి ఆసుపత్రిగా విద్యాసాగర్ హాస్పిటల్ , పాక్షిక, సంపూర్ణ మోకాళ్ల మార్పిడి శస్త్రచిత్సలతోపాటు హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. 500 రోబోటిక్ మోకాళ్ల శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకోవడం తమ బృందం అంకితభావానికి, ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, రిటైర్డ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నాగముని రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ కె.చిన్నపరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య అధ్యక్షుడు డాక్టర్ ఆర్.రంగనాథ రెడ్డి, సైకాలజిస్ట్ ఓవీ రెడ్డి,, కడప నగరంలోని ప్రముఖ డాక్టర్లు, పెన్షనర్లు పాల్గొన్నారు. -
ఈడబ్ల్యుఎస్ విధానాన్ని ఎత్తివేయాలి
రాయచోటి జగదాంబసెంటర్ : ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలని జేఏసీ చైర్మన్ ఎం.రంగనాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటి పట్టణలలోని ఎన్జీఓ హోంలో ఏపీ బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చట్టసభలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. పెన్షనర్ల హక్కులను హరించే ఆర్థిక బిల్లు 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోహిణి కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చింతం నాగరాజు, బీసీఎఫ్ జనరల్ సెక్రటరీ కుమార్యాదవ్, డి.శంకర్, బీసీఈ చంద్ర, జిల్లా బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యక్షురాలు దివిటి పద్మయాదవ్, మహిళా సెక్రటరీ కందుకూరి సుమితాగౌడ్, జనరల్ సెక్రటరీ కందుకూరి రామయ్య, జాయింట్ సెక్రటరీ ఎల్.గంగాధర్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గంగాధర్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ప్రజా కంటక పాలన
రాయచోటి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా కంటక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. రాయచోటిలోని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకం, అవినీతి, బంధుప్రీతి, దోపిడీలు అధికమయ్యాయని ఆరోపించారు. పథకాల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాలలో భారీగా కోత విధించారన్నారు. ఈ క్రమంలోనే దివ్యాంగుల పెన్షన్లలో నిజమైన అర్హులకు కూడా కోతకోసి వారికి గుండె కోతను మిగిల్చారన్నారు. చిలమత్తూరులో మహిళా ఎంపీపీపై టీడీపీ నాయకులు భౌతికంగా దాడి చేయడం దారుణమన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో సాక్షాత్తు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనకు సంబంధం లేని పోలింగ్ కేంద్రాలలో దౌర్జన్యం, అరాచకాలకు తెర తీశారన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, కేంద్రం నిధులు దోచేయడమే కూటమి ప్రభుత్వ పాలన పనిగా పెట్టుకొందన్నారు. పంచాయతీరాజ్ విభాగంలో 1130 సెక్రటరీలకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. మీడియా సమావేశంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి -
దారిమళ్లిన నాంధేడ్ వీక్లీ!
రాజంపేట: ప్రస్తుతం నాంధేడ్ నుంచి ధర్మవరం మధ్య నడుస్తున్న (07189/17190) వీక్లీ ప్రత్యేక రైలు దారిమళ్లనుంది. ఈ రైలు ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లె, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, వినుకొండ, నంద్యాల, ఎర్రగుంట్ల , కడప , తిరుపతి, పాకాల మార్గాల్లో నడిచేది. వచ్చే నెల నుంచి ఈ రైలు నిజమాబాద్, పెద్దపల్లె, వరంగల్ , విజయవాడ, గుడూరు, తిరుపతి, పాకాల మీదుగా నడపనున్నారు. ● మొదటిసారిగా పీలేరు, మదనపల్లె, కదిరి నుంచి ఉత్తర తెలంగాణాలోని జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లె, వరంగల్తో పాటు ఖమ్మం జిల్లాకు కూడా అనుసంధానం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి పీలేరు, కలికిరి , మదనపల్లె, కదిరి వెళ్లడానికి నేరుగా సౌకర్యం లేదు. ఇప్పుడు ఈ ప్రత్యేకరైలుతో తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, వికరాబాదు, గద్వాల ప్రాంతాలలో ఇప్పటికే మదనపల్లె, పీలేరు, కలికిరి అనుసంధానమై ఉన్నాయి. ● నాంధేడ్ ప్రత్యేక రైలుతో ఉత్తర తెలంగాణాతో మదనపల్లె , పీలేరుకు రైలుసౌకర్యం లభించినట్లైంది. సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఎగువమార్గంలో 4ట్రిప్లు, 07190 నంబరుతో ధర్మవరం నుంచి ఈ ఎక్స్ప్రెస్రైలు నడవనుంది. ● ప్రత్యేక ఎక్స్ప్రెస్రైలు 07189 నంబరుతో సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో నాంధేడ్లో సాయంత్రం 4.30కి బయలుదేరి, మరుసటిరోజు సాయంత్రం ధర్మవరం జంక్షన్కు 5గంటలకు చేరుకుంటుంది. అన్నమయ్య జిల్లాలో పీలేరు, మదనపల్లెరోడ్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ఈ రైలులో అధునాతన ఎల్హెచ్బీ బోగీలు ఉన్నాయి. ఐఆర్టీఎస్ పోర్టల్లో బుకింగ్ సౌకర్యం కూడా ప్రారంభమైంది. -
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, శాత్తుమొర, నివేదన, కుంభారాధన నిర్వహించారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు జరిపారు. ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, విశ్వక్సేనులవారికి, గరుడాళ్వార్కు, యాగశాలలోని హోమగుండాలకు, ధ్వజస్తంభానికి , ఆలయం ఎదురుగా ఉన్న భక్తసంజీవరాయస్వామికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సూపరిటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, భక్తులు పాల్గొన్నారు. -
సైబర్ చట్టాలపై అవగాహన అవసరం
మదనపల్లె రూరల్ : సైబర్ చట్టాలపై న్యాయవాదులు అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ వి.రాధాకృష్ణ కృపాసాగర్ అన్నారు. పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అండ్ సైబర్ లాపై వర్క్షాపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లను శిక్షించడం, హానికరమైన ఆన్లైన్ కార్యకలాపాల నుంచి ప్రజలను రక్షించడం, డిజిటల్ డేటాను భద్రపరచడం సైబర్ చట్టాల ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి. వాటిని నిరూపించాలంటే ఏఏ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇచ్చే సాక్ష్యాలు చెల్లుబాటు అవుతాయా లేదా..? ఏఏ పద్ధతుల్లో వాటిని నిరూపిస్తే చెల్లుబాటవుతాయి. వాటిపై వచ్చే అభ్యంతరాలను ఎలా నివృత్తి చేయాలనే అంశంపై న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. అనంతరం మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ వి.రాధాకృష్ణ కృపా సాగర్ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి సూర్యనారాయణమూర్తి, న్యాయమూర్తులు శ్రీలత, సుభాన్, శిరీష, కీర్తన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.అమరనాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.మనోహర, ఉపాధ్యక్షులు ఎ.వి.శివకుమార్రెడ్డి, రెడ్డి నాగులు, ఎం.ఎ.బాషా, అహ్మద్ నజీరుద్దీన్ షేక్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్.వి.రాధాకృష్ణ కృపా సాగర్ -
ఏపీలో ప్రజాస్వామ్య హననం
మదనపల్లె : మదనపల్లె మండలం బుద్ధునికొండ (నల్లగుట్ట)పై జులై 2న బుద్ధుడి విగ్రహం తలనరికిన ఘటనపై కార్యక్రమాల నిర్వహణకు అనుమతి లేకపోవడంతో శనివారం తమిళనాడు, కర్ణాటకలో దళిత సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. కర్ణాటక శ్రీనివాసపురంలో దళిత సంఘర్షణ సమితి (డి.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం ఎదుట సభ జరిగాయి. తమిళనాడు పేర్ణంబట్టులో వీసీకే పార్టీ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతోందని విమర్శించారు. స్వయం సమృద్ధి సాధించాలి రాయచోటి టౌన్ : స్వయం సహాయక సంఘాల ద్వారా స్వయంగా ఉత్పత్తులను తయారు చేసి వ్యాపారాలు సాగిస్తూ స్వయం సమృద్ధి సాధించాలని జిల్లా మెప్మా పీడీ పి. లక్ష్మిదేవి అన్నారు. శనివారం రాయచోటి మెప్మా కార్యాలయ ఆవరణంలో ఓపెన్ మెప్మా అర్బన్ మార్కెట్ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ ఇళ్ల వద్ద తయారు చేసే వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించుకునేందుకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో మెప్మా అధికారి అబ్బాస్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. వరికోత వాహనం బోల్తా బి.కొత్తకోట : తమిళనాడు నుంచి ములకలచెరువు వెళ్తున్న వరికోత యంత్రం కలిగిన వాహనం బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయడ్డాడు. శనివారం మండలంలోని జాతీయ రహదారి కనికలతోపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి డ్రైవర్ యువరాజ్ (30) వరికోత యంత్రంతో మదనపల్లె నుంచి ములకలచెరువు వెళ్తున్నాడు. వాహనం ఇంజిన్ బోల్టు ఊడిపోవడంతో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో డ్రైవర్కు గాయలయ్యాయి. బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. సీఐ గోపాల్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్య లింగాల : లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెలుగు భానుప్రకాష్ (22) అనే విద్యార్థి నంద్యాల జిల్లా పాణ్యం ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం విద్యార్థి కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భానుప్రకాష్ తల్లిదండ్రులు రాంభూపాల్, సరస్వతి హుటాహుటిన ఆర్జీఎం కళాశాల వద్దకు వెళ్లారు. అప్పటికే కళాశాల యాజమాన్యం, పోలీసులు భానుప్రకాష్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భానుప్రకాష్ శుక్రవారం ఆయన తండ్రికి తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పెట్టాడని పోలీసులు తెలిపారు. దీనిపై భానుప్రకాష్ తండ్రి తాను మెసేజ్ చూసుకోలేదని, తనకు అంతటి చదువు రాదని కళాశాల యాజమాన్యం తన కుమారుడిని ఏమో చేసిందని విద్యార్థి తల్లిదండ్రులతోపాటు, బంధువులు ఆసుపత్రి వద్ద బోరున విలపించారు. -
ఆగని భూ కబ్జాలు !
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వేకోడూరు నియోజకవర్గంలో భూ ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక్కడి ద్వితీయ శ్రేణి నాయకులు అగ్రనాయకుల అండదండలతో కొన్ని భూములను అడ్డదారిలో ఆక్రమించి కబ్జా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని స్వాహా చేసి విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి నేతల కన్ను పడితే కబ్జా కావాల్సిందే అన్న చందంగా వీరి హవా నడుస్తోంది. కూటమిలో వర్గపోరు ఉన్నప్పటికీ ఇలాంటి ఆక్రమణల విషయంలో అంతా కలిసిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాఘవరాజపురం సబ్స్టేషన్ వద్ద ఆర్అండ్బీ స్థలం, మైసూరావారిపల్లి ఈద్గా భూమి తంతంగం మరువక ముందే మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీలో భూములపై వీరి కన్ను పడింది. రెడ్డివారిపల్లి పరిధిలో 2001 సంవత్సరంలో బయనపల్లి గ్రామానికి చెందిన కస్తూరి వెంకటయ్య అనే వ్యక్తి 557 సర్వే నంబర్లో తన 1.57 ఎకరాల భూమిలో కాళహస్తి నారాయణమ్మకు 30.05 సెంట్ల భూమిని డాక్యుమెంట్ 1698– 2001లో విక్రయించి పుల్లంపేటలో రిజిస్టర్ చేశారు. కొత్తగా రెడ్డివారిపల్లికి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండడంతో కొందరి కన్ను దీనిపై పడింది. అక్రమ అగ్రిమెంట్లతో రెండు నెలల క్రితం రిజిస్టర్ అయినట్లు తెలుపుతూ అధికారులతో కుమ్మకై ్క భూమిని చదును చేసి మరలా చేతులు మార్చి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్తో భూమి ఆక్రమణకు యత్నం -
డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం
డీఎస్సీ– 2025 ఫలితాల్లో గాలివీడు విద్యార్థి పొడిదాసరి సురేష్ కుమార్ ఎస్జీటీ విభాగంలో 47 ర్యాంక్ సాధించాడు.పట్టణంలోని సలాదివాండ్లపల్లిలో ఉండే పొడిదాసరి గంగులు,అమ్ములు దంపతుల కుమారుడు సురేష్ కుమార్ కష్టపడి చదివి రెండో ప్రయత్నంలో రాణించి టీచర్ పోస్టును సాధించాడు.పదో తరగతి వరకు స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో చదివిన సురేష్ ఇంటర్,టీటీసీ రాయచోటిలోని ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి చేశాడు.తండ్రి తిరిగిరాని లోకాలకు పోయినా, తల్లి గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టపడి తనను చదివించిందని గుర్తుకు చేసుకున్నాడు.తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇంతటి విజయాన్ని సాధించానని చెబుతున్నాడు.మదనపల్లె సిటీ:/ గాలివీడు: పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ –2025లో అర్హత సాధించిన ఉపాధ్యాయ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ సమాయత్తమైంది. ర్యాంకు సాధించిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందుతాయని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్లెటర్ను డౌన్లోడ్ చేసుకుని తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఇటీవల తీసుకున్న కులధ్రువీకరణ పత్రం, గెజిడెట్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల సర్టిఫికెట్ జిరాక్స్లు, 5 పాస్పోర్టు సైజు ఫొటోలు తీసుకుని వారికి కేటాయించిన తేదీల్లో సర్టిపికెట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కు హాజరుకాకముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు తప్పని సరిగా హాజరు కావాలి. అలా హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.వారెవ్వా... రవీంద్రా...!ఆయన ఆర్మీ జవాన్. మదనపల్లె సొసైటీకాలనీకి చెందిన రవీంద్ర ప్రాథమిక, ఉన్నత, కళాశాల విద్య ప్రభుత్వ పాఠాలలు, కాలేజీలో అభ్యసించారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో ఆర్మీలో చేరారు. అక్కడ విధదులు నిర్వహిస్తూనే దూర విద్య ద్వారా డిగ్రీ,పీజీ కోర్సులు పూర్తి చేశారు. 16 సంవత్సరాలు పాటు దేశానికి సేవ చేసి రెండు సంవత్సరాల క్రితం మదనపల్లెకు చేరుకున్నాడు. ఇక్కడే ఉపాధ్యాయ విద్య బీఎడ్ పూర్తి చేశారు. అనంతరం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రాసి ఏకంగా 138 మార్కులు సాధించాడు.గత ఏడాది విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్కు దరఖాస్తు చేశారు.తనకున్న అర్హతలతో అయిదు టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. తిరుపతిలోని ఓ కోచింగ్ కేంద్రంలో శిక్షణ పొందారు. డీఎస్సీ పరీక్షల్లో సత్తాచాటారు. ఏకంగా అయిదు పోస్టుల్లోనూ అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రంలో 72.76 మార్కులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో 9వ ర్యాంకు సాఽధించారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ గణితంలో 73.32 మార్కులతో 34వ ర్యాంకు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సైన్సులో 80.75 మార్కులతో జోనల్ స్థాయిలో 88వ ర్యాంకు, టైన్డ్ గ్రాడ్యుయేట్ గణితంలో జోనల్ స్థాయిలో 62.59 మార్కులతో 180 ర్యాంకు సాధించారు. దీంతో పాటు సెకండరీ గ్రేడ్ విభాగంలో 84.11మార్కులతో114 ర్యాంకు సాధించి ప్రతిభ చాటారు. ఆయన భార్య రమాభార్గవి రామసముద్రం మండలంలోని జంగాపల్లి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పని చేస్తున్నారు.ఆయన్ను రూటా రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ఖాన్, ఎస్టీయు, యుటిఎఫ్ సంఘ నాయకులు అయూబ్ఖాన్, రమాదేవి, హేమలతలు అభినందించారు. -
ఇళ్ల స్థలాలపై ఆస్తిహక్కు కల్పించేందుకు స్వమిత్వ
సిద్దవటం : ఇళ్ల స్థలాలపై ఆస్తిహక్కు కల్పించేందుకు ప్రభుత్వం స్వమిత్వ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మీ తెలిపారు. సిద్దవటం మండల పరిషత్ సభా భవనంలో శనివారం పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లతో స్వమిత్వపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో స్వమిత్వలో వైఎస్సార్ కడప జిల్లా నాల్గవ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్ రమణారెడ్డి, డీఎల్పీఓ విజయ్ భాస్కర్, ఈఓపీఆర్డీ మెహెతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. భూ వివాదంలో ముగ్గురిపై దాడి నిమ్మనపల్లె : పొలం వద్ద దారి కోసం ఏర్పడిన వివాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురిపై కొందరు దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. అగ్రహారం పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన జి.శ్రీనివాసులురెడ్డి(40)కు అదే గ్రామంలోని వెంకటరమణారెడ్డి, ఉదయ్శేఖర్రెడ్డి, వేణుగోపాల్రెడ్డిలతో పొలం దారి విషయమై వివాదం నడుస్తోంది. ఈ విషయమై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా అధికారులు విచారించి శ్రీనివాసులురెడ్డికి అనుకూలంగా ఎండార్స్మెంట్ ఇచ్చారు. దీంతో నిమ్మనపల్లె ఎస్ఐ ప్రత్యర్థి వర్గంలోని వ్యక్తులను స్టేషన్కు పిలిపించి ఈ విషయమై అధికారుల సూచనల మేరకు నడచుకోవాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయని చెప్పి బైండోవర్ చేశారు. ఇంటికి వెళ్లిన ప్రత్యర్థులు మాపై ఫిర్యాదు చేస్తావా అంటూ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై దాడిచేసి కర్రలతో కొట్టారు. దాడిలో శ్రీనివాసులురెడ్డితో పాటు అతడి భార్య యమున, సోదరి రేణుక గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. డీఏపీ ద్రావణం పిచికారీతో మంచి దిగుబడులు లక్కిరెడ్డిపల్లి : ప్రతి పంటకు డీఏపీ చల్లకుండా లిక్విడ్తో స్ప్రే చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివనారాయణ పేర్కొన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా శనివారం బి.ఎర్రగుడి పంచాయతీలోని చెంచర్లపల్లి, ఎర్రగుడి, మామిడిగారి పల్లి గ్రామాలలోని వేరుశనగ, కంది, ఆముదం పంటలకు డీఏపీ లిక్విడ్ స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కేవలం లీటరు రూ. 500 అని, డీఏపీ బస్తా అయితే రూ. 1700 అని లిక్విడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ జయరాణి, ఏఓ రాజకుమారి, ఏఈఓ అనూష, ఆర్ఎస్ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై కొలుములపల్లి సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద శనివారం తెల్లవారుజామున కారును గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ ప్రాంతానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు తిరుమల దర్శనం కోసం వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ నిర్లక్ష్యంగా నడిపిన కారణంగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు దెబ్బతింది. ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్ ఆపకుండా పారిపోయినట్లు సమాచారం. గోపవరం : సెంచురీ పానెల్స్ పరిశ్రమను ఆర్డీఓ చంద్రమోహన్ శనివారం పరిశీలించారు. తహసీల్దార్ త్రిభువన్రెడ్డి, ఏడీఏ వెంకటసుబ్బయ్య, ఏఓ విజయరావుతో కలిసి పరిశ్రమలో జరుగుతున్న పనులను పరిశ్రమ ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం యూరియా కొరత ఉన్నందున పరిశ్రమలో ఉపయోగించే యూరియాపై ఆరా తీశారు. పరిశ్రమలో ఉపయోగించే యూరియాను కూడా స్థానిక వ్యవసాయాధికారుల ద్వారా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయానికి వాడే యూరియా కాదని నిర్ధారించారు. అనంతరం పరిశ్రమలో తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. -
ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆగస్టు 24 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకుకార్పణ ఘట్టాలు నిర్వహించారు. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడురోజులపాటు పవిత్రోత్సవాలు జరుపుతుంటారు. పవిత్రోత్సవాలలో భాగంగా ఆగస్టు 24న యాగశాలలో పవిత్ర ప్రతిష్ట, శయానాధివాసం, 25న పవిత్ర సమర్పణ, 26న వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. కార్యక్రమంలో ఆలయ సూపరిటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, అర్చకులు పాల్గొన్నారు. -
గండి క్షేత్రంలో ముగిసిన శ్రావణ మాస ఉత్సవాలు
అమావాస్య కారణంగా చివరి శనివారం భారీగా తగ్గిన భక్తుల రద్దీ చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శ్రావణ మాసం చివరి శనివారం భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ఇందుకు అమావాస్యే కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని పరవశించి పోయారు. వాహనాలను పోలీసులు అద్దాలమర్రి క్రాస్, ఇడుపులపాయ క్రాస్ల వద్దనే నిలిపి వేశారు. దీంతో భక్తులు కాలినడకన గండికి చేరుకొని దర్శించుకున్నారు. కొందరు భక్తులు వేంపల్లె, చక్రాయపేట, నాగలగుట్టపల్లె, వేముల తదితర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల కోసం గండి శ్రీవాసవీ నిత్యాన్నదాన సత్రంతో పాటు పలు చోట్ల దాతలు పెద్ద ఎత్తున అన్నదానాలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య చైర్మన్ కావలి కృష్ణతేజ, పాలకమండలి సభ్యులతో పాటు ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య, ఆర్కేవ్యాలీ ఎస్ఐ రంగారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు రాజారమేష్, రాజగోపాలాచార్యులు, రఘుస్వామి, వేద పారాయణం రామ మోహనశర్మలు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. వైభవంగా స్వామి వారి క్షేత్రోత్సవం, ఆస్థానం శ్రావణ మాసం ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి క్షేత్రోత్సవం, ఆస్థానం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పల్లకిలో పూలాలంకరణ మధ్య ఉత్సవ మూర్తి విగ్రహాన్ని ఉంచి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం ఆస్థానం నిర్వహించి ఈ ఏడాది శ్రావణ మాస ఉత్సవాలను ముగించారు. -
వైద్య కళాశాలను ప్రారంభించాలి
మదనపల్లె : కూటమి ప్రభుత్వంలో మదనపల్లె వైద్య కళాశాల నిర్మాణం కాసుల కోసమే ఆగిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరితో రూ.72 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. శనివారం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, సీపీఎం నాయకులతో కలిసి మదనపల్లెలో ఆగిపోయిన కళాశాల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023లో పనులు పూర్తిచేసి 2024 లో కళాశాలను ప్రారంభించాల్సి ఉండిందన్నారు. మదనపల్లెలో రూ. 472 కోట్లతో నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే పూర్తిగా నిర్మాణాలను ఆపేసి కళాశాలను ప్రారంభించలేదన్నారు. నిర్మాణ ప్రాంతంలో రూ.10 కోట్ల విలువైన సామగ్రి దుస్థితికి చేరిందన్నారు. వైద్య కళాశాల ప్రారంభం కోసం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు హరిశర్మ, రామకృష్ణ, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నల్లగుట్టపై పోలీసు పహారా
మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె పంచాయతీ సర్వే నంబర్.15లోని నల్లగుట్టపై బుద్ధవిగ్రహాన్ని తిరిగి ప్రతిష్టిస్తామని, బౌద్ధసమ్మేళనం నిర్వహిస్తామని బాస్, దళిత సంఘర్షణ సమితి నాయకులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో...పోలీస్, రెవెన్యూ శాఖ నిషేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. శనివారం నల్లగుట్ట చుట్టూ 5 కి.మీ.ల పరిధిలో ప్రజలు గుమికూడకుండా, ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించకుండా పెద్దసంఖ్యలో పోలీసులు పహారా కాశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించి, ద్విచక్రవాహనాలపై వెళుతున్న వారిని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ మహేంద్ర సిబ్బందితో కలిసి అంకిశెట్టిపల్లె పంచాయతీలోని నల్లగుట్ట వద్ద పరిస్థితిని సమీక్షించారు. పోలీసులకు పలుసూచనలు చేస్తూ, బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందును టూటౌన్ సీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు -
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
కలకడ: స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పిలుపునిచ్చారు. శనివారం కలకడ మండల కేంద్రంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర‘ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.జూలై చివరి వారం నుంచి జిల్లాలో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. నీరు నిల్వ ఉంటే దోమలు, ఇతర కీటకాలు విస్తరించి మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీజనల్ , అంటువ్యాధులను నివారించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావడం అత్యవసరమని కలెక్టర్ తెలిపారు.ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ గా పాటించాలని తెలిపారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమ అమలుపై ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కలకడ నుంచి తిరిగి వెళుతూ చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై యూనియన్బ్యాంక్–కలకడ శాఖ ముందు భాగంలో మురుగునీరు నిల్వ ఉండటం చూసిన కలెక్టర్ జాతీయరహదారి అధికారులకు వెంటనే సమాచారం అందించి తొలగించాలని డిప్యూటీ ఎంపీడీఓ ప్రతాప్రెడ్డిని ఆదేశించారు. నీటిలో లార్వాలు వృద్ధి చెందకుండా మలాథియాన్ పిచికారి చేశారు. ఈకార్యక్రమంలో తహాసీల్దార్ మహేశ్వరిబాయ్, సీఐ లక్ష్మన్న, డిప్యూటీ ఎంపీడీఓ ప్రతాప్రెడ్డి, సర్పంచ్లు ప్యారీజాన్, విశ్వనాథ, ఎంఈఓ మునీంద్రనాయక్,జావాద్, జిలానీ, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
పెద్ద దర్గాకు ఉత్సవ శోభ
కడప సెవెన్రోడ్స్ : భక్తుల పాలిట కొంగుబంగారమై నిలుస్తూ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక సూఫీ పుణ్య క్షేత్రమైన కడప పెద్దదర్గాకు ఉరుసు శోభ చేకూరింది. ఈనెల 24వ తేదీ నుంచి మూడు రోజులపాటు దర్గా 10వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేనీ చిష్టి ఉల్ ఖాద్రి సాహెబ్ ఉరుసు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధోత్సవం, సోమవారం ఉరుసు, మంగళవారం తహలీల్ ఫాతెహా నిర్వహిస్తారు. ఉరుసురోజు ఖవ్వాలీ కచేరీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దర్గాతోపాటు దర్గా ఆవరణం విద్యుద్దీపాలతో కాంతులీనుతూ భక్తులను ప్రత్యేకంగా ఆకర్శిస్తోంది. నేటి నుంచి ఉరుసు -
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
రాయచోటి: జిల్లాలో రసాయనిక ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకో వాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్సు హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ యూరియా కొరత రానివ్వకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రసాయనిక ఎరువులు కృత్రిమ కొరత సృష్టించే డీలర్లు, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రసాయనిక ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలించినా, తగినన్ని నిల్వలు లేవని నివారించినా సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాలలో అవసరమైన రసాయనిక ఎరువుల కొరత రానీవ్వకుండా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రైతుల డిమాండ్ను ఆసరాగా చేసుకుని అనవసరమైన వేరే ఉత్పత్తులను, పోషకాలను లింక్ చేసి అమ్మితే చర్యలు తీసుకొని, వారి లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఒక ఎకరాకు ఒక యూరియా బస్తా సరిపోతుందని రైతులు ఆందోళన చెందకుండా అవసరం మేరకు వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరితోపాటు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి -
విద్యార్థుల మృతిపై ఎంపీ మేడా తీవ్ర విచారం
● మృతుల కుటుంబాలకు రూ. 50 వేల సాయం ● ఎంపీ మేడా రఘునాథ రెడ్డి రాజంపేట (ఒంటిమిట్ట) : రాజంపేట మండల పరిధిలోని బాలరాజుపల్లి చెయ్యేరు నదిలో ఎనిమిది మంది విద్యార్థులు ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు ఇసుక ఊబిలో చిక్కుకొని మృతి చెందిన ఘటనపై రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు వారు తమ ప్రగాడ సానుభూతి తెలిపి మృతులకు సంబంధించిన బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున తమవంతు సహాయంగా ప్రకటించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు చెరువులలో నీటి ప్రవాహం ఉధృక్తంగా ఉందని, ఈతకు వెళ్లే యువకులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు, విద్యార్థులు సరదాగా, ఆకతాయితనంగా ఈతకు వెళ్లి ఇలా మృతి చెందితే తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలిస్తాయన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే రాజంపేట నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసి ఈత నేర్చుకోవాలన్న వారికి అందుబాటులో ఉంచుతామన్నారు. -
ప్రాణాలు తోడేస్తున్నారు..!
కొండలు.. గుట్టలు.. వాగులు.. వంకలు.. ఏవైనా టీడీపీ నాయకుల అక్రమ దోపిడీకి విలవిలలాడుతున్నాయి. ఇసుక, మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకుని.. అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ఏడాదిన్నర పాలనలోనే అక్రమార్కులు ఎంత బరి తెగించారో.. తవ్విన ప్రదేశాల్లో ఏర్పడిన గోతులు చూస్తేనే తెలుస్తోంది. వాటి వద్ద ఎలాంటి రక్షణ చర్యలు లేక ప్రమాదకరంగా మారాయి. గోతుల్లో నీరు నిలవడంతో.. సరదాగా ఈతకు అని దిగిన అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. రాయచోటి: నదుల్లో నీటి ప్రవాహం పెరగడంతో పరీవాహక ప్రాంతాలకు సరదాగా ఈత కోసం వెళ్లిన యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. పచ్చనేతలు తోడేసిన ఇసుక మడుగులు వారిని బలి తీసుకుంటున్నాయి. ఇసుక, మట్టితో పచ్చ నేతలు కోట్ల రూపాయలు ఆర్జిస్తుండగా.. విహార యాత్రలకు, పశువుల కాపర్లుగా వెళ్లిన వారు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంచుమించు కొంత కాలంగా ఈ తరహా ఘటనలు ప్రధానంగా పెన్నా, బహుదా, చెయ్యేరు, పాపాఘ్ని తదితర నదుల మడుగుల్లో వెలుగు చూస్తున్నాయి. మొన్న నెల్లూరు, చిన్న నంద్యాల ఘటనలు మరువకముందే అన్నమయ్య జిల్లాలోని బహుదా నదిలో ఊబిలను తలపించే మడుగుల్లో.. బంగారు భవిష్యత్తు ఉన్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ మధ్యకాలంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని నదులు ప్రవహిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో పచ్చ నేతల కనుసన్నల్లో ఇసుక, మట్టి చోరీకి గురైంది. జిల్లాలోని బహుదా, పింఛా, చెయ్యేరు, పెన్నా, మాండవ్య, పాపాఘ్ని నదుల్లో ఎక్కడ చూసినా బావులు, మడుగులను తలపించేలా గుంతలు కనిపిస్తున్నాయి. సరదా కోసం వెళ్లిన యువతీ యువకుల ప్రాణాలను తీస్తున్నది పచ్చ నేతలు తవ్విన ఇసుక మడుగులేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే గురువారం రాజంపేట సమీపంలోని చెయ్యేరు నదిలో అన్నమాచార్య యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సాంబత్తిన దిలీప్ (22), కె.చంద్రశేఖర్(22), పి.కేశవ (22)లు ఇసుక మడుగుల్లో ప్రాణాలు వదిలారు. నదులు, చెరువులను చెరబట్టిన పచ్చ నేతలు కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలోని నదులు, చెరువులలోని ఇసుక, మట్టిని చెరబట్టారు. విచ్చలవిడిగా జేసీబీ, ఈటాచ్, బుల్డోజర్లతో నదీగర్భాన్ని చీల్చి టిప్పర్లు, లారీల సాయంతో ఇసుక, మట్టిని దోచుకెళ్లి నదులు, వాగులు, వంకలు, చెరువులకు గర్భశోకాన్ని మిగిల్చారు. అధికారులు ముందుగా గుర్తించి ఇసుక రీచ్లను ఎంపిక చేసిన ప్రాంతాలలో.. మనుషుల సాయంతో ట్రాక్టర్లకు ఎత్తుకుని నదుల నుంచి ఇసుకను తరలించాల్సి ఉంది. రీచ్లను అధికార బలంతో దక్కించుకున్న తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి.. యంత్రాలతో విచ్చలవిడిగా తరలించి ధన దాహం తీర్చుకుంటున్నారు. జాగ్రత్తలు పాటించాలి ప్రకృతి అందాలు, నదీ ప్రవాహాలు, ప్రాజెక్టుల వీక్షణ లో యాత్రికులు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి ప్రమాదాల నివారణకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మృత్యుకుహరాలుగా మారిన గోతులు ఇసుక, మట్టిని దోచేస్తున్న తమ్ముళ్లు ప్రమాదకరంగా నదులు,చెరువులు, వాగులు -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
రాయచోటి: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యతగా పరిగణించి పరిష్కరించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వారు ఉద్యోగుల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులు తమ బాధ్యతలను గుర్తించి మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు. వేతనాల చెల్లింపు, బదిలీలకు సంబంధించిన అర్జీలే అధికంగా వచ్చినట్లు తెలిపారు. అన్ని సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత శాఖాధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిష్కార చర్యలు వివిధ మండలాల నుంచి ఐదుగురు వీఆర్ఓలు డిప్యుటేషన్ నిమిత్తం దరఖాస్తు చేసుకోగా కలెక్టర్ అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డీఆర్ఓకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ కారణాలతో సస్పెండ్ అయిన నలుగురు ఉద్యోగులను రీ–ఇన్షియేషన్ చేసేందుకు ఫైల్ సర్క్యూట్ చేయాలని డీఆర్ఓను ఆదేశించారు. పీటీఎం మండలంలో తహసీల్దార్ వీఆర్ఓగా విధుల్లో చేర్చుకోవడం లేదని బాధితుడు దరఖాస్తు సమర్పించగా.. వెంటనే విధుల్లో చేర్చుకోవాల్సిందిగా జారీ చేయాలని కలెక్టర్ డీఆర్ఓను ఆదేశించారు. వీఆర్ఓ మంజునాథ్ 2016లో పరీక్షల నిమిత్తం సెలవుపై వెళ్లినందుకు ఆ సెలవును రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్ఓను ఆదేశించారు. డిజిటల్ అసిస్టెంట్ గోపాల్ నాయక్ కెవిపల్లి మండలం నుంచి పీలేరు ప్రాంత సమీపంలో మార్పు చేయాలని దరఖాస్తు చేసుకోగా తగు చర్యలు తీసుకొని మార్పు చేయాలని డీపీఓను కలెక్టర్ ఆదేశించారు. మరో ఇరవై మంది ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఉద్యోగులకు భరోసా కల్పించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మధుసూదన్ రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్రలో ముందుండాలి స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణాంధ్రలో రాష్ట్రంలోనే మన జిల్లా ముందుండాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్తో కలిసి స్వామిత్వ, శానిటేషన్, సాసా, కౌసల్యం సర్వే, హౌసింగ్, పెన్షన్ తదితర అంశాలపై రాజంపేట, మదనపల్లె ఆర్డీవోలతోపాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. శానిటేషన్ మెరుగుదలకు ప్రతి 250 ఇళ్లకు ఒక గ్రీన్ ఎంబాసిటర్ నియామకం తప్పనిసరని సూచించారు. పంచాయతీ సెక్రటరీలు ప్రతి రోజు ఉదయం 6–8 గంటల మధ్య ఫీల్డ్ పరిశీలన చేసి చెత్తసేకరణ పర్యవేక్షణ చేయాలన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో కాలేజీలు, పాఠశాలలు, హాస్టళ్లలో వ్యాసరచన పోటీలు నిర్వహించి, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన హోంగార్డులకు అభినందనలు
రాయచోటి : హోంగార్డ్స్గా పనిచేస్తూనే కానిస్టేబుల్గా ఎంపికై న వారిని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు అభినందించారు. అన్నమయ్య జిల్లా పోలీసు విభాగంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ ఇటీవల ఏపీ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పరీక్షలలో ఎంపికై న ఐదుగురికి ఎస్పీ పుష్పగుచ్చాలు, శాలువాలు, సర్టిఫికెట్లతో ప్రత్యేకంగా సన్మానించారు. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ద్వారా విజయాన్ని సాధించగలిగారని కితాబిచ్చారు. హోంగార్డ్స్ నుండి కానిస్టేబుల్ స్థాయి సాధించడం తమ తోటివారికి స్ఫూర్తిదాయకమన్నారు. మీరు చూపిన ఆత్మవిశ్వాసం, పట్టుదల యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఉద్యోగంలోకి వచ్చిన తరువాత కూడా అదే ఆదర్శాన్ని కొనసాగిస్తూ నియమ నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలన్నారు. అలాగే పోలీస్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా కీలకం కావడంతో అందులో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. జి సంజీవ్, సి గంగాధర్, బి విజయ్ కుమార్ నాయకు, టిఎం ఖాజాఫీర్, ఎం నరసింహులు కానిస్టేబుల్ ఉద్యోగాలను పొందిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, ఏఆర్ డీఎస్పీ ఎం శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం పెద్దయ్యలు పాల్గొన్నారు. -
ఒంటి మిట్ట రామాలయానికి రాజకీయ రంగు
● రామాలయ పరిసరాలలో వెలసిన టీడీపీ బ్యానర్లు ● చోద్యం చూస్తున్న టీటీడీ ఆలయ అధికారులు ● బ్యానర్లపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న భక్తులు రామాలయ సూచిక బోర్డును సైతం టీడీపీ బ్యానర్లతో కప్పేసిన దృశ్యం ఒంటిమిట్ట రామాలయాన్ని కనిపించకుండా టీడీపీ బ్యానర్లు ఏర్పాటు ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం పచ్చరంగు పులుముకుంది. రాజంపేట టీడీపీ ఇన్చార్జ్గా చమర్తి జగన్ మోహన్ రాజును పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో శుక్రవారం చమర్తి జగన్ మోహన్ రాజు నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహణలో భాగంగా గురువారం రాత్రి చమర్తి జగన్ మోహన్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒంటిమిట్టలో భారీ ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లు ఏర్పాటుకు సంబంధించి తెలుగు తమ్ముళ్లు ఒంటిమిట్ట రామాలయ్నా కూడా వదలకుండా బ్యానర్లను కట్టారు. దీంతో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లాల్సిన దేవాలయం చెంత రాజకీయ రంగు పులవడంపై రామయ్య భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ ఆలయ అధికారులు చోద్యం చూస్తూ నోరు మెదపకపోవడం గమనార్హం. -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
రాయచోటి : మెరుగైన సేవలతో నాణ్యమైన విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా అందించేలా చర్యలు చేపట్టాలని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్రావు ఆదేశించారు. శుక్రవారం రాయచోటిలో జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసానుకూల అవగాహనపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కె.సంతోష్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సుకు జిల్లాలోని రాయచోటి, రాజంపేట, పీలేరు, మదనపల్లి డివిజన్లలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. వినియోగదారులు సంస్థకు దేవుళ్లతో సమానమని కె.సంతోష్రావు అన్నారు. వారికి మెరుగైన సేవలందించే క్రమంలో విద్యుత్ సరఫరాను అంతరాయం లేకుండా, లోవోల్టేజీ సమస్య రాకుండా చూడాలన్నారు. ఉద్యోగులు కార్మికులు వారి పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉంటూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అలా లేని వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులతో సత్సంబంధాలను కొనసాగించాలని తెలిపారు. అర్బన్, మండల హెడ్ క్వార్టలలో లో వోల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాలలో అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను అమర్చాలన్నారు. సదస్సులో చీఫ్ జనరల్ మేనేజర్ జానకిరామ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై మండల అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పి.యుగంధర్, ఈశ్వర్రెడ్డి, వై.చంద్రశేఖర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, గంగాధర్, డిప్యూటీ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు సదస్సులో పాల్గొన్నారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్రావు -
ఒంటిమిట్ట అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక నిపుణుల బృందం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఒంటిమిట్టలో ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందో టీటీడీ సివిల్ విభాగం అధికారులతో కలిసి ప్రత్యేక నిపుణుల బృందం ప్రణాళిక అధికారి రాముడు, ఆర్కిటెక్చర్ అనిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రామాలయ పరిసరాల్లోని రామ కుటీరం, శృంగిశైలి పర్వతం, ఒంటిమిట్ట చెరువు, రామతీర్థం, నాగేటితిప్ప పర్వతం, కల్యాణ వేదిక ప్రాంతం, వావిలి కొలను సుబ్బారావు కుటీరాన్ని సందర్శించారు. అనంతరం ప్రణాళిక అధికారి రాముడు మాట్లాడుతూ విజయవాడలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణుల సంస్థ వారి పరిశీలనలో ఎక్కడ అభివృద్ధి జరిగితే భక్తులకు సౌకర్యంగా ఉంటుందో ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ పరిశీలనలో అన్నదాన కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, ఒంటిమిట్ట చెరువును ట్యాంక్ బండ్ చేయడం, చెరువులో శ్రీరాముడి భారీ విగ్రహం ప్రతిష్టించడం, శృంగిశైలి పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయించడం, శ్రీరామ ప్రాజెక్ట్, పార్వేటి ఉత్సవం జరిగే నాగేటి తిప్ప పర్వతాన్ని అందంగా తీర్చిదిద్దడం, ఒంటిమిట్ట క్షేత్రానికి విచ్చేసే భక్తులు ఉండేందుకు వసతులు కల్పించడం, ఒంటిమిట్టలో ఎండ తీవ్రతను తగ్గించేందుకు ఎక్కువ ప్లాంటేషన్ చేయించి, సాధారణ ఉష్టోగ్రత కంటే 6 డిగ్రీలు తగ్గించేలా చర్యలు తీసుకోవడం వంటివి తమ దృష్టిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సివిల్ విభాగం ఎస్ఈ మనోహర్, ఈఈ సుమతి, ఏఈ అమర్నాథ్రెడ్డి సాల్గొన్నారు. ప్రత్యేక నిపుణుల బృందం పరిశీలన -
సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దు
● నల్లగుట్టపై కార్యక్రమాలకు అనుమతి లేదు ● ఐదుకిలోమీటర్ల పరిధి వరకు నిషేధాజ్ఞలు ● నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలోని నల్లగుట్టలో గౌతమబుద్ధ విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని సోషల్మీడియాలో వ్యాప్తి చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి, సీఐ కళావెంకటరమణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ...పట్టణానికి చెందిన పీటీయం.శివప్రసాద్ ఈనెల 23వతేదీ నల్లగుట్టపైన బుద్దవిగ్రహ ప్రతిష్టకు ప్రజలు తరలిరావాల్సిందిగా సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. నల్లగుట్ట చుట్టుపక్కల ఐదుకిలోమీటర్ల పరిధి వరకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టరాదని, ప్రజలు గుమికూడరాదని ఎంసీ.నెం.358/2025 కింద 21వ తేదీన నిషేధిత ఉత్తర్వులు జారీ చేశామన్నారు. నిషేధాజ్ఞలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కొనసాగుతాయన్నారు. ఈ విషయమై పీటీఎం.శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళితే, ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా, అతని ఫిర్యాదును కొట్టివేయడం జరిగిందన్నారు. అంకిశెట్టిపల్లె గ్రామరెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్.15లోని నల్లగుట్ట పూర్తిగా ప్రభుత్వానికి చెందిన భూమి, ఇందులో ఎవరూ ప్రవేశించరాదని కంచెను ఏర్పాటుచేశామన్నారు. శనివారం పట్టణంలో ర్యాలీ, నల్లగుట్టపై బుద్ధుని విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని, ఒకవేళ ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై వేసిన కేసును హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తామన్నారు. -
మదనపల్లెలో ఏసీబీ సోదాలు
మదనపల్లె రూరల్ : పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసులో ఏఓగా పనిచేస్తున్న మూడే బాలునాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో...శుక్రవారం ఉదయం మదనపల్లె పట్టణంలోని కురవంక రవీంద్రనగర్లోని బాలూనాయక్ కుమారుడు శ్రీకాంత్ ఇంట్లో ఏసీబీ తిరుపతి సీఐ నరసింహారావు, రామారావుకాలనీలోని వియ్యంకుడు వాలేనాయక్ ఇంట్లో ఏసీబీ సీఐ హమీద్ఖాన్ ఆధ్వర్యంలో రెండు బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. పత్రాలను పరిశీలించారు. అయితే సోదాలకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించలేదు.ఇంటి దారి విషయమై వ్యక్తిపై దాడిమదనపల్లె రూరల్ : ఇంటి దారి విషయమై కొందరు కలిసి వ్యక్తిపై దాడిచేసిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. కొత్తవారిపల్లె పంచాయతీ ఓబిరెడ్డిగారిపల్లెకు చెందిన చలపతిరెడ్డి కుమారుడు లోకేష్రెడ్డి(42)కు తన ఇంటికి దారి విషయమై స్థానికులైన రామకృష్ణారెడ్డి, సోమనాథరెడ్డితో వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఈ విషయమై రామకృష్ణారెడ్డి తన అనుచరులు రెడ్డిగానిపల్లెకు చెందిన మునిరాజ, ఓబిరెడ్డిగారిపల్లెకు చెందిన సోమనాథరెడ్డి, రెడ్డెప్పరెడ్డితో కలిసి లోకేష్రెడ్డిపై దాడికి పాల్పడి కర్రలతో తీవ్రంగా కొట్టారు. కత్తితో చంపేస్తామని బెదిరించారు. దాడిలో లోకేష్రెడ్డి తీవ్రంగా గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు బాధితులు తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాతోనే విద్యార్థులు మృతి
రాజంపేట రూరల్ : చెయ్యేరులోని ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ దొరికితే అక్కడ అక్రమంగా తరిలించటం వలనే ఇంజినీరింగ్ విద్యార్థులు బలి అయ్యారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అభిప్రాయపడ్డారు. మండల పరిధిలోని బాలరాజుపల్లి వద్ద గల చెయ్యేరులోకి దిగి అన్నమాచార్య యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్థులు గురువారం మృతి చెందారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఉన్న వారి మృత దేహలను శుక్రవారం ఎమ్మెల్యే ఆకేపాటి చూసి చలించిపోయారు. వారికి నివాళులు అర్పించి వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైద్యులు డాక్టర్ అనీల్కుమార్తో చర్చించి వేగంగా పోస్టు మార్టం పనులు పూర్తి చేసి మృతి చెందినవారి తల్లిదండ్రులకు సహకరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడతూ ఎన్నో ఆశలతో విద్యనిభ్యశిస్తున్న విద్యార్థులు మృతి చెందటం భాదాకరమన్నారు. వారి తల్లిదండ్రుల కలలను నేరవేర్చే క్రమంలో ఈతకు వెళ్లి మృతి చెందటం విచారకరమన్నారు. మృతి చెందిన వారిలో రాజంపేట మండలం గాలివారిపల్లి చెందిన సోంబెత్తిన దిలీప్కుమార్, ఒంటిమిట్ట మండలం మడపంపల్లికి చెందిన కొత్తూరు చంద్రశేఖరరెడ్డి , పోరుమామిళ్లకు చెందిన పీనరోతు కేశవ ఉన్నారన్నారు. వీరికి ప్రభుత్వం నష్ట పరిహరం చెల్లించి ఆదుకోవాలన్నారు. ఆకేపాటి వెంట వైఎస్సార్సీపీ నాయకులు పీ.విశ్వనాథరెడ్డి, దండు గోపీ, దాసరి పెంచలయ్య, జీవీ సుబ్బరాజు, మల్లికార్జునరెడ్డి, న్యాయవాదులు మూరి గోవర్దనరెడ్డి, పాటూరు భరత్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి -
బాధితులకు న్యాయం జరగాలి
రాయచోటి : సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్షక్షపడేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు కోర్టు మానిటరింగ్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పోలీసు స్టేషన్లకు చెందిన కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. కోర్టులలో చార్జ్ షీటు ఫైల్ చేసిన అనంతరం కోర్టు ద్వారా సంబంధిత కేసులలో సిసి నెంబర్లను తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పెండింగ్ సమన్లు జారీ అయ్యేలా, వారెంట్లు అమలు జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతనంగా అమలులోకి వచ్చిన బీఎన్ఎస్ఎస్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి కోర్టు కానిస్టేబుల్ విధిగా తన పోలీసు స్టేషన్కు సంబంధించి కోర్టులో హాజరవుతున్న ప్రతి కేసు గురించి అవగాహన పెంచుకొని సరియైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ ఎ ఆదినారాయణ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఎం తులసీరామ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి రాజా, రమేష్, టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ టి మధు, ఎస్ఐ జి రవికుమార్, కోర్టు మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
24న షూటింగ్బాల్ జట్ల ఎంపిక
మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణ సమీపాన ఉన్న పుంగనూరురోడ్డులోని గ్రీన్వ్యాలీ పాఠశాలలో ఈ నెల 24న జిల్లా బాల,బాలికల షూటింగ్బాల్ జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు. 2006 ఏప్రిల్ 1 తరువాత పుట్టినవారు అయి ఉండాలన్నారు. ఆధార్కార్డు తీసుకుని రావాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ : 6281881022ను సంప్రదించాలని వివరించారు. రాయచోటి: మాతా శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణలు ఇస్తున్నట్లు డీఐఓ డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. రాయచోటిలోని కె.రామాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లాలోని పీహెచ్సీ, యూసీహెచ్సీలలో పని చేస్తున్న వైద్యులకు సమీకృత ఎక్కువ ప్రమాదం గల గర్భిణుల జాడను గుర్తించి వారికి సుఖ ప్రసవం నిర్వహించడంపై రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శుక్రవారం ముగింపు కార్యక్రమానికి డీఐఓ హాజరై మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన వారు జిల్లాలో పని చేస్తున్న వైద్యులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు డాక్టర్ కిజియా, డాక్టర్ లీలా, వైద్యులు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రామచంద్రారెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని కోరంపేట దేవలంపల్లి పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో ఆయన పర్యటించి దోమల నివారణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించేలా గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్ గున్యా, టైపాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈయన వెంట సబ్ యూనిట్ ఆఫీసర్ జి.జయరామయ్య, పి.రవీంద్ర, కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ బి.రేఖ నాయక్, డి.దేవాదానం, ఎంపీహెచ్ఈఓ, ఆరోగ్య కార్యకర్తలు ఓబులేశు, రాజేంద్ర ప్రసాద్, క్రిస్టపర్వి, బీబీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాయచోటి జగదాంబసెంటర్: విద్యార్థుల్లో కళాత్మక నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా 12 అంశాలతో కళా ఉత్సవ్ – 2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు కళా ఉత్సవ్ జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. స్థానిక డైట్ కళాశాలలో కళా ఉత్సవ్ – 2025కు సంబంధించిన రిజిస్ట్రేషన్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, సంప్రదాయ కథ చెప్పడం వంటి 12 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలోని 50 మండలాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని వివరించారు. పోటీల్లో పాల్గొనే వారు రాయచోటి డైట్ కళాశాలలో వ్యక్తిగతంగా గానీ 9440246825 నంబర్కు వాట్సాప్ ద్వారా గానీ, గూగుల్ ఫామ్ ద్వారా గానీ తమ పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు. -
సామూహిక సెలవులో పంచాయతీ కార్యదర్శులు
రాయచోటి టౌన్ : రాయచోటి మండల పరిధిలోని పలు గ్రామ సచివాలయాలలో విధులు నిర్వర్తించే పంచాయతీ కార్యదర్శులు సామూహిక సెలవు ప్రకటిస్తూ ఎంపీడీఓ సురేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయచోటి పరిధిలోని చెన్నముక్కపల్లె గ్రామ సచివాలయ కార్యదర్శి శ్రీనివాసులు, గొర్లమొదివీడు కార్యదర్శి రమాదేవి, శిబ్యాల కార్యదర్శి వెంకటరమణ, పెమ్మాడపల్లె కార్యదర్శి సాజియా, దిగువ అబ్బవరం కార్యదరి శివలక్ష్మి, కాటిమాయకుంట కార్యదర్శి మల్లికార్జునలను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. దీనిని నిరసిస్తూ సామూహికంగా సెలవుపై వెళుతున్నట్లు తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తే క్రిమినల్ కేసులు గాలివీడు : అక్రమంగా మట్టి తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ భాగ్యలత హెచ్చరించారు. ఈనెల 20 వ తేదీన సాక్షి దినపత్రికలో ‘పెద్ద చెరువును చెరబట్టారు‘ అనే శీర్షికతో వెలువడిన కథనంపై స్పందించిన తహసీల్దార్ గురువారం పెద్దచెరువులో మట్టి తరలిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువులోకి ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాలు వెళ్లకుండా మార్గాలను మూసివేస్తూ ట్రెంచ్ (గొయ్యి) తీయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గుట్టలు, వాగులు, వంకలు, చెరువుల్లో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తే క్రిమినల్ కేసులు పెట్టి జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేస్తామన్నారు. అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన రాజంపేట : అటవీ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే దాడిని నిరసిస్తూ ఏపీ ఫారెస్టు జూనియర్ ఆఫీసర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాజంపేటలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కేవీ సుబ్బయ్య, అధ్యక్షుడు రవిశంకర్(రాజంపేట యూనిట్) మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ ఫారెస్టు మినిస్టీరియల్ అసోసియేషన్, ఏపీఎన్జీఓ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
భూ వ్యవహారంలో హోంగార్డు జోక్యం
● చేనేత కార్మికులకు బెదిరింపులు ● డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులుమదనపల్లె రూరల్ : భూ వ్యవహారాల్లో హోంగార్డు రాజశేఖర్ జోక్యం చేసుకుని, చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కలిగిన చేనేత కార్మికులను బెదిరిస్తున్నాడని బాధితులు డీఎస్పీ మహేంద్రకు ఫిర్యాదు చేశారు. గురువారం నీరుగట్టువారిపల్లెకు చెందిన చేనేత కార్మికులు డీఎస్పీ మహేంద్రను కలిసి తమకు జరిగిన అన్యాయంపై విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కోళ్లబైలు పంచాయతీ సర్వే నంబర్.605–2బీలో 20 ఏళ్ల క్రితం సుమారు 50 మంది చేనేత కార్మికులు ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నామన్నారు. అప్పట్లో సరైన మౌలిక వసతులు లేని కారణంగా ఇళ్ల నిర్మాణం చేయలేకపోయామన్నారు. ప్రస్తుతం రోడ్లు, ఇతర వసతులు సమకూరడంతో గ్రామ సచివాలయం నుంచి ప్లాన్ అనుమతులు పొంది ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తే కొందరు వ్యక్తులు కావాలనే అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారన్నారు. పదిరోజుల క్రితం భూములను దున్నేసి వెళ్లారన్నారు. దీనిపై తాలూకా పోలీస్ స్టేషన్లో సీఐకు ఫిర్యాదు చేశామన్నారు. రెండు రోజుల క్రితం భవన నిర్మాణ సామగ్రి భద్రపరచుకునేందుకు చిన్నపాటి షెడ్రూమ్లు ఏర్పాటు చేసుకుంటుంటే, రాత్రి 10 గంటల సమయంలో మంజునాథ్, హోంగార్డు రాజశేఖర్లు జేసీబీతో వాటిని ధ్వంసం చేసి నష్టం కలిగించారన్నారు. మూడేళ్లుగా కొందరు వ్యక్తులు కావాలనే భూముల విషయంలో ఇబ్బందులు పెడుతుండటంతో కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామన్నారు. ప్రస్తుతం చట్టపరమైన అన్ని అనుమతులతో ఇళ్ల నిర్మాణాలకు వెళుతుంటే, హోంగార్డు రాజశేఖర్ సహాయంతో దౌర్జన్యం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. చేనేత కార్మికులమైన తాము కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూముల్లో ఇతరుల జోక్యం లేకుండా, ఇళ్లు నిర్మించుకునేందుకు పోలీసు శాఖ సహకరించాలని కోరారు. -
ఫార్మసీ రంగానిదే ప్రధాన భూమిక
రాజంపేట : నేటి సమాజంలో ఫార్మసీ రంగానిదే ప్రధాన భూమిక అని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి అన్నారు. గురువారం జాతీయ స్థాయి సదస్సులో మొదటి బహుమతి సాధించిన రుక్సానా బేగం, అధ్యాపకురాలు సుష్మితను ఆయన అభినందించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఫార్మసీ రంగంలో రాణిస్తే దేశ, విదేశాలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అన్నమాచార్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత మాట్లాడారు. కార్యక్రమంలో అన్నమాచార్య ఫార్మసీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదంలో నైట్ వాచ్మన్ మృతిచిన్నమండెం : మండల పరిధిలోని వండాడి గ్రామం తూర్పుపల్లె దళితవాడకు చెందిన కొండిగారి రామచంద్రయ్య(57) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వండాడి గ్రామ సచివాలయంలో నైట్వాచ్మన్గా పనిచేస్తున్న రామచంద్రయ్య అంగడికి వెళ్తుండగా ద్విచక్రవాహనం రామచంద్రయ్యను ఢీకొంది. వెంటనే క్షతగాత్రుడిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ రామచంద్రయ్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలి
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి నీతి అయోగ్ సంస్థ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల వలన విశేష ఫలితాలు సాధించామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో జరిగిన సంపూర్ణ అభియాన్ సమ్మాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ పాల్గొన్నారు. నీతి అయోగ్ సూచించిన ఆరు పరిమితుల్లో లక్కిరెడ్డిపల్లి, కోడూరు, కురబలకోట మండలాల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేసి అభివృద్ది సాధించారన్నారు. కురబలకోట మండలం బంగారు పతకాన్ని, కోడూరు మండలం వెండి పతకాన్ని, లక్కిరెడ్డిపల్లి మండలం కాంస్య పతకాన్ని అందుకున్నట్లు జేసీ వెల్లడించారు. అంతకు ముందు కలెక్టరేట్ ఆవరణంలో చేతి వృత్తుల మహిళలు తయారు చేసిన వస్తు ప్రదర్శనల స్టాల్ను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ పెద్దయ్య, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ ఐసీడీఎస్ పీడీ హైమావతి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.జేసీ ఆదర్శ రాజేంద్రన్ -
బస్సు పాసుల జారీ కౌంటర్ నిర్వాహకుడి తొలగింపు
రాజంపేట : రాజంపేట ఆర్టీసీ డిపోలో బస్పాస్ జారీ కౌంటర్ నిర్వాహకుడు కిషోర్ను విధుల నుంచి తొలగించామని రాజంపేట డిపో మేనేజర్ రమణయ్య తెలిపారు. గురువారం తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. గత కొంతకాలంగా విద్యార్థుల బస్సు పాసుల జారీ విషయంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. హార్టికల్చర్ విద్యార్థి అభిషేక్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక అందజేస్తామన్నారు. రెండు, మూడు రోజులుగా చార్జీలు చెల్లించి కళాశాలకు వెళుతున్న విద్యార్థికి అయిన చార్జీలు తాను చెల్లించి, బస్సు పాసు రెన్యువల్ చేసి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ మాధవి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీయూడబ్ల్యుజే జిల్లా నాయకుడు భాస్కర్ తదితరులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీఎంను కోరారు. -
కుట్రలో భాగంగానే దివ్యాంగ పింఛన్ల తొలగింపు
రాయచోటి: దివ్యాంగ పెన్షన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పెన్షన్లు తొలగింపుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నవాటిని తొలగించే పనిలో పడిందన్నారు. తొలి విడతగా దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్లపై కన్నేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే కొత్త పంథాకు తెరదీసి రీ వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ పేరిట వికలాంగులంతా మరోసారి వైద్యుల వద్దకు వెళ్లి సదరం సర్టిఫికెట్ చేయించుకోవాలని షరతు పెట్టిందన్నారు. వికలత్వం ఎంత ఉందో వైద్యులతో ధ్రువీకరించి పర్సంటేజీతో సర్టిఫికెట్ను తీసుకురావాలని, కొత్త నిబంధలను ప్రవేశపెట్టిందన్నారు. దీంతో గత పది, పదిహేనుళ్లుగా పింఛన్ తీసుకుంటున్న వికలాంగులు సైతం మళ్లీ సదరం సర్టిపికెట్లు కోసం దరఖాస్తు చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకున్నారన్నారు. దివ్యాంగులను మానవతా దృక్పతంతో ఆదుకోవాల్సింది పోయి వారి జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త పెన్షన్లను మంజూరు చేసేవారన్నారు. అదే తరహాలో కూటమి ప్రభుత్వం చేయాలని కోరారు. ● జిల్లాలో 3774 మందికి పింఛన్లను తొలగిస్తున్నట్లు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఒక్క రాయచోటి నియోజకవర్గంలో 915 మందికి నోటీసులు ఇచ్చారన్నారు.సెప్టెంబర్ నుంచి వీరికి పెన్షన్లు వచ్చే అవకాశం ఉండదేమోనని శ్రీకాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల శోకం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాలుకోసం నడవలేనివారిని తరచూ ఆసుపత్రుల చుట్టూ తిప్పడం సమంజసం కాదన్నారు. ● గత జగన్ ప్రభుత్వంలో పింఛన్దారుడు మృతి చెందితే మరుసటి నెల నుంచే ఆయన భార్యకు (స్పౌజ్) పెన్షన్ మంజూరు అయ్యేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ సైట్ను క్లోజ్ చేయడంతో ఈ తరహా పెన్షన్లు మంజూరు ఆగిపోయిందన్నారు. 2024 నవంబర్ తర్వాత మృతి చెందిన వారికి మాత్రమే స్పౌజ్ పింఛన్లను ఈ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. వీటినే కొత్త పెన్షన్లు అన్నట్టుగా కూటమి నాయకులు హడావిడి చేశారన్నారు. సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వమే సక్రమంగా ఇచ్చిందని తెలిపారు. ● నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు, దివ్యాంగులకు పెన్షన్ వస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వీటిని తొలగించడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే పింఛన్లను పునరుద్ధరించాలని శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి -
గంజాయి సరఫరా చేయలేదని హత్య
● ఎట్టకేలకు వీడిన పశ్చిమ బెంగాల్ వాసి హత్యకేసు మిస్టరీ ● ఇద్దరి అరెస్టు, మరో ముగ్గురి కోసం గాలింపుమదనపల్లె రూరల్ : సీటీఎం రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పదంగా పడవేసిన పశ్చిమ బెంగాల్ వాసి హత్యకేసు మిస్టరీ వీడింది. గంజాయి సరఫరా చేస్తానని డబ్బులు తీసుకుని, సరుకు పంపిణీ చేయకపోవడంతో గంజాయి వ్యాపారుల మధ్య జరిగిన వివాదంతోనే పశ్చిమబెంగాల్ వాసిని దారుణంగా హత్యచేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు రైలు పట్టాలపై పడేసినట్లు రైల్వే పోలీసులు విచారణలో నిగ్గు తేల్చారు. గురువారం కదిరి ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లో హత్యకేసు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యలో మరో ఇద్దరి ప్రమేయం ఉందని, వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ధర్మవరం ప్రభుత్వ రైల్వే పోలీసు సీఐ అశోక్కుమార్ కథనం మేరకు.. పశ్చిమబెంగాల్ ముషీరాబాద్ జిల్లా ఇమాంనగర్కు చెందిన ఎస్.కే.మైమూల్ కుమారుడు షేక్ ఖాదీర్(30) ఐదేళ్ల క్రితం మదనపల్లె సమీపంలోని అంగళ్లుకు జీవనోపాధి నిమిత్తం వచ్చాడు. స్థానికంగా బేల్దారి పనులతో పాటు జేసీబీ కూలిపనులకు వెళ్లేవాడు. వీటితో పాటు ఒరిస్సా నుంచి ఎక్కువ మొత్తంలో గంజాయి తీసుకువచ్చి కిలో రూ.24వేల చొప్పున మదనపల్లెలో విక్రయించేవాడు. ఈ క్రమంలో మద్యం, గంజాయి తాగే అలవాటు ఉన్న మదనపల్లె మండలం బసినికొండలో నివాసం ఉండే పఠాన్ ఆసిఫ్ఖాన్(40)తో ఖాదీర్కు పరిచయం ఏర్పడింది. ఆసిఫ్ తల్లి గంజాయి విక్రేతగా అరెస్ట్ అయి గతంలో జైలుకు వెళ్లి వచ్చింది. ఆసిఫ్ తల్లి తెచ్చిన గంజాయిని తాగడంతో పాటు విక్రయించేవాడు. ఖాదిర్ వద్ద గంజాయిని కొనుగోలుచేసి స్నేహితులైన మౌలా, సుల్తాన్తో పాటు మరికొంతమందికి అమ్మేవాడు. నెలరోజుల క్రితం రెండు కిలోల గంజాయి కావాలని ఆసిఫ్, పశ్చిమబెంగాల్వాసి ఖాదిర్కు రూ.50వేల రూపాయలు ఇచ్చాడు. అయితే ఖాదిర్, ఆసిఫ్కు గంజాయి కానీ డబ్బులు కానీ ఇవ్వలేదు. ఈ విషయం ఆసిఫ్ తన మిత్రులైన మౌలా, సుల్తాన్లకు చెప్పడంతో వారు ముగ్గురు, మరో ఇద్దరిని వెంటబెట్టుకుని మొత్తం ఐదుగురు ఈనెల 15వతేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంగళ్లులో నివాసం ఉంటున్న ఖాదిర్ రూమ్కు చేరుకున్నారు. అతడిని బలవంతంగా సుల్తాన్కు చెందిన టయాటో ఇథియోస్ కారులో ఎక్కించుకుని కర్నాటకలోని రాయల్పాడు సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకువెళ్లారు. సాయంత్రం వరకు అతడిని అక్కడే ఉంచి, గంజాయి ఎక్కడ ఉంచావో చెప్పాల్సిందిగా నీలగిరి కర్రలతో కొట్టారు. ఖాదిర్ ప్రస్తుతం తన వద్ద గంజాయి లేదని తెప్పించి ఇస్తానని చెప్పడంతో అక్కడ నుంచి తిరిగి కారులో ఎక్కించుకుని రాత్రి 7 గంటల సమయంలో వన్టౌన్ పరిధిలోని దేవళంవీధిలోని ఇంటికి తీసుకువచ్చి, మరోసారి కర్రలతో తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తాళలేక ఖాదిర్ చనిపోయాడు. ఈ విషయం ఆసిఫ్, సుల్తాన్కు చెప్పగా, రైలు పట్టాలపై ఖాదిర్ శవాన్ని పడేస్తే ఏదో రైలు కింద పడి చనిపోయాడని భావిస్తారని చెప్పడంతో ఆటోలో మౌలాతో పాటు ఖాదిర్ శవాన్ని తీసుకుని 16వతేదీ తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో మదనపల్లె రోడ్ రైల్వేస్టేషన్ దగ్గరలోని రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ఖాదిర్ శవాన్ని రైలు పట్టాలపై పడేసేందుకు ఆసిఫ్, మౌలాలు తీసుకువెళుతుండగా, అంతలో ఒక వాహనం అటువైపుగా రావడంతో లైట్ల వెలుగు వారిపై పడటంతో తప్పించుకునే క్రమంలో బ్రిడ్జి మెట్లపై మృతదేహాన్ని పడేసి వచ్చిన ఆటోలో పారిపోయారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కీ మాన్ రైలు ట్రాక్ కిందిభాగంలో శవం ఉందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లో క్రైమ్నెం.14/2025 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. శవం పడి ఉన్న తీరు, ఒంటిపై ఉన్న గాయాలను గమనించి అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేస్తుండగా, పశ్చిమబెంగాల్కు చెందిన ఖాదిర్గా గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకు గురైనట్లు నిర్ధారించుకుని, కేసును హత్యకేసుగా మార్పుచేశారు. విచారణలో చివరిసారిగా ఖాదిర్ ఆసిఫ్తో కలిసి వెళ్లినట్లు గుర్తించి అతడి కోసం రైల్వే పోలీసులు గాలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆసిఫ్, మౌలాలు నేరుగా కదిరి రైల్వే పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. వీరి నుంచి ఆటో స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుల్లో షేక్ మౌలా మదనపల్లె వన్టౌన్ పరిధిలో రౌడీషీటర్, 2016లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్యకేసులో మరో నిందితుడైన రౌడీషీటర్, 2016 మదనపల్లె వన్టౌన్ పరిధిలోని హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుల్తాన్తో పాటు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు రైల్వే సీఐ అశోక్కుమార్ తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులు ఆసిఫ్, మౌలాలను గుంతకల్లు రైల్వే కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరిచినట్లు తెలిపారు. మదనపల్లె వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవళం వీధిలో హత్య జరిగినట్లు విచారణలో తేలడంతో కేసును మదనపల్లె వన్టౌన్కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సీఐ అశోక్కుమార్, ఎస్ఐ బాలకృష్ణ, హెడ్కానిస్టేబుల్ మహబూబ్బాషా, సిబ్బందిని గుంతకల్లు రైల్వే పోలీస్ ఎస్పీ రాహుల్మీనా, సబ్ డివిజన్ డీఎస్ఆర్పీ శ్రీనివాసాచారి అభినందించారు. -
సార్వత్రిక విద్య..ఉన్నతికి సోపానం
ఎస్ఎస్సి కోర్సులో చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి 14 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి ఉండదు. చదవడం, రాయడం తెలిసి ఉండాలి. దర ఖాస్తుతో పాటు టీసీ,రికార్డు షీటు, పుట్టినతేదీ ద్రువీకరణ పత్రం, ఇంటర్కు 10వ తరగతి మార్కుల జాబితా, ఎస్ఎస్సి టీసీని దరఖాస్తుతో పాటు అందజేయాలి. ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థుల కులధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. మదనపల్లె సిటీ: మధ్యలో చదువు మానేసిన, ఉత్తీర్ణులు కాలేపోయినా వారి విద్యాసక్తిని నెరవేర్చేందుకు సార్వత్రిక విద్య విధానం (ఓపెన్ స్కూల్) ఉపయోగకరంగా ఉంటోంది. ఈ విధానంలో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడిన వారు ఎంతో మంది ఉన్నారు. 14 ఏళ్ల నుంచి బడి మధ్య మానేసిన వారు సార్వత్రిక పాఠశాలలో చేరి 10వ తరగతి చదువుకునేందుకు అవకాశం ఉంది. అంతేగాక 15 ఏళ్లు నిండి పదో తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్లో చేరి చదువుకునే వెసులుబాటుంది. ఇది వరకు ఇంటర్మీడియట్ చదివి అనుత్తీర్ణులై, మధ్యలో మానేసిన వారు కూడా ఈ విధానంలో పూర్తి చేయవచ్చు. మహిళలు, వివిధ వృత్తులు, వ్యాపార రంగంలో ఉన్న వారికి, ఉద్యోగులకు, వివిధ సంఘాల సభ్యులు,సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి చదువుకునేందుకు ఓపెన్ స్కూల్ చక్కని మార్గం. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యాక డిగ్రీ, పీజీ తదితర కోర్సులతో పాటు పోటీ పరీక్షల్లో తమ ప్రతిభ చాటుకునే వీలుంది. ● పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ( ఏపీ ఓపెన్ స్కూల్) ద్వారా ప్రభుత్వం సువార్ణవకాశం కల్పిస్తోంది. ఈ సర్టిఫికెట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉంది. వీరు ఎలాంటి ఉద్యోగానికై నా అర్హులే. చదువుపై ఆసక్తి ఉన్న పలువురు ఓపెన్ స్కూల్ ద్వారా పది, ఇంటర్ పూర్తి చేసి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అభ్యాసకులకు విద్యను మరింత చేరువ చేసేలా ప్రభుత్వం ఓపెన్ స్కూల్ తరగతులు నిర్వహిస్తోంది. ప్రవేశాలు ఇలా: జులై నెల నుంచి ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.200 అపరాధ రుసుంతో సెప్టెంబర్ 15 వతేదీ వరకు అడ్మిషన్ పొందవచ్చు. కనీసం 24 కాంట్రాక్టు తరగతులు ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ అడ్మిషన్ పొందిన వారికి ప్రతి ఆదివారం, నెలలో రెండో శనివారం అధ్యయన కేంద్రాల్లో 30 కాంట్రాక్టు తరగతులు నిర్వహిస్తారు. కనీసం 24 కాంటాక్టు తరగతులకు హాజరైన వారిని మాత్రమే అనుమతిస్తారు. సార్వత్రిక పాఠశాలలో చేరే వారికి స్టడీ మెటీరియల్ సరఫరా చేస్తారు. ఐదేళ్లలో పూర్తి చేయాలి: అభ్యాసకులు నిర్ణీత ఐదేళ్లలో తొమ్మిది సార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్ పరీక్షలు రాసేవారు మాత్రం 10 పాసై రెండేళ్ల వ్యవధి ఉంటే ఐదు సబ్జెక్టులు ఒకేసారి రాసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల వ్యవధి లేకపోతే నాలుగు సబ్జెక్టులు రాసి, రెండేళ్లు పూర్తయిన తర్వాత మిగిలిన ఒక సబ్జెక్టును రాసుకోవచ్చు. అడ్మిషన్ పొందిన అనంతరం ఐదేళ్లలో తొమ్మిది సార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందకపోతే తిరిగిర కొత్తగా అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లకు గుర్తింపు ఉంది సార్వత్రిక పాఠశాలలో చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు అందించే సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఎంసెట్, డైట్సెట్ వంటి పరీక్షలతో పాటు ఇంటర్ అర్హతతో పొందే అన్ని ఉద్యోగాలకు అర్హులే. ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తుకు గడువుపెంపు జిల్లాలో టెన్త్కు 35, ఇంటర్కు 31 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. పదో తరగతిలో 100 మందికి, ఇంటర్లో నాన్ సైన్స్లో 40, సైన్స్లో100 మందికి అవకాశం ఉన్నాయి. అడ్మిషన్ పొందిన వెంటనే స్టడీ మెటీరియల్ అందిస్తారు. ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో ఆయా అధ్యయన కేంద్రాల్లో కాంట్రాక్టు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతితో పాటు ఇంటర్లో ఆర్ట్స్ గ్రూపులైన హెచ్ఈసీ, సీఈసీ, సైన్స్ గ్రూపులైన ఎంపీపీ, బైపీపీ, ఎంబైపీసీ, ఎంఈసీలో ప్రవేశాలు పొందవచ్చు. ఈ సర్టిఫికెట్లు ఉన్నత చదువులకు , ఉద్యోగాలకు, పదోన్నతులకు ఉపయోగపడుతున్నాయి. అభ్యర్థులు పదో తరగతి మార్కుల జాబితా లేదా జనన ధ్రువీకరణ పత్రం, టీసీ, ఆధార్కార్డు, కులఽధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్, ఫోటో, సంతకంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
మట్టి గణపతే.. మహా గణపతి
రాజంపేట టౌన్ : పండుగల్లోకెల్లా వినాయక చవితి పండుగ సంబరమైంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలు కలిసి మెలసి చవితి ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటారు. ఈనెల 27వ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉత్సవాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వినాయక చవితిని జరుపుకోవాలంటే ప్రధానంగా కావాల్సింది గణపయ్య విగ్రహం. అయితే చాలా మంది మార్కెట్లో సులువుగా దొరికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీఓపీ)తో తయారు చేసిన రంగురంగుల బొజ్జ గణపయ్యలను తెచ్చుకొని పూజిస్తారు. అయితే రసాయనాలతో తయారు చేసిన ఈ విగ్రహాల కంటే మట్టి విగ్రహాలను పూజిస్తే పర్యావరణానికి ఎంతో శ్రేయస్కరమని విద్యావంతులు చెబుతున్నారు. అలాగే సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే ముడిసరుకుతో చేసే వినాయక ప్రతిమలనే పూజించాలని పురాణాలు కూడా చెబుతున్నాయి. మట్టితో మనిషికి విడదీయరాని బంధం మట్టికి, మనిషికి విడదీయరాని బంధం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే మానవ మనుగడ ప్రకృతితో ముడిపడి వుంది. ప్రకృతి ఆరాధనతో మొదలైన పూజలు ఇప్పుడు విగ్రహ ఆరాధన వరకు వచ్చాయి. సాధారణంగా మిగతా దేవతా మూర్తుల విగ్రహాలను కళాకారులు రాయితో మలుచుతారు. అయితే వినాయక చవితి ఉత్సవాల అనంతరం స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేయాల్సి వున్నందున కళాకారులు సులువుగా విగ్రహాలను తయారు చేసేందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో గణపయ్య విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇటీవల కాలంలో విగ్రహాల ఏర్పాటు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. జిల్లాలో వేల సంఖ్యల్లో పెద్ద విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాల వల్ల పర్యావరణానికి పెనుముప్పు సంభవించే ప్రమాదముందని విద్యావంతులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. కొంతలో కొంత మార్పు.. గతంలో కంటే ప్రస్తుతం కొంత మార్పు వచ్చిందనే చెప్పాలి. వినాయక చవితి సందర్భంగా ఇళ్లల్లో కొలువుదీర్చే గణపయ్యలను ముఖ్యంగా విద్యావంతులు, పర్యావరణ ప్రేమికులు మట్టితో చేసిన విగ్రహాలనే కొలువుదీర్చి పూజలు చేస్తున్నారు. అందువల్ల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కళాకారులు మట్టితో చిన్న విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వినాయక చవితి పండుగకు అతి తక్కువ సమయం ఉండటంతో వ్యాపారులు మట్టితో తయారు చేసిన విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. మట్టితో తయారు చేసే విగ్రహాలకు మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే వీధుల్లో, గ్రామాల్లో ఏర్పాటు చేసే భారీ గణపయ్యలను కూడా మట్టితో చేసే విగ్రహాలనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మట్టి విగ్రహాలతో కలిగే ప్రయోజనాలు ఇవీ ● సహజ సిద్ధంగా లభించే బంకమట్టితో చేసే విగ్రహాలు త్వరగా నీటిలో కరిగిపోతాయి. ● మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసినా నీటి వనరులకు ఎలాంటి నష్టం ఉండదు. ● కాలుష్యానికి ఎలాంటి హాని చేయదు. అందువల్ల స్వచ్ఛమైన గాలి, వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. రసాయన విగ్రహాల వల్ల కలిగే అనర్థాలు ● ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాలు త్వరగా నీటిలో కరగవు. ఈ విగ్రహాల్లో జిప్సం, మెగ్నీషియం, పాదరసం, సీసం, కాడ్మియం, కార్బన్ వంటి అవశేషాలు ఉంటాయి. ● ఇలాంటి విగ్రహాలు నీటిని కలుషితం చేస్తాయి. ఈ నీటిని తాగితే జీర్ణకోశ వ్యాధులు సంక్రమిస్తాయి. ● నీటిలో ఉండే చేపలు వంటి జీవరాసులు కూడా రోగాల బారిన పడతాయి. ● రసాయనాలు కలిసిన నీటి మూలంగా శరీరంలో నరాలపై ప్రభావం చూపి కేన్సర్ వ్యాధికి దారితీస్తుంది. అలాగే చర్మవ్యాధులు సోకుతాయి. ● రసాయనిక రంగులు కలిసిన నీరు పంట పొలాలకు చేరితే దిగుబడులు తగ్గిపోతాయి. అలాగే ఆహార ఉత్పత్తులను కలుషితం చేస్తుంది.ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు వద్దు.. మట్టి గణపతే ముద్దు -
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం
మదనపల్లె: జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి వాటిని సంరక్షించాల్సిక కీలక బాధ్యత తహసీల్దార్లదే అని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. గురువారం స్థానిక ఆదిత్య కళాశాలలో డివిజన్లోని తహసీల్దార్లు, వీఆర్ఓలకు రెవెన్యూ పాలనలో పారదర్శకత, సమయపాలన, ప్రజా సమస్యల పరిష్కారంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్ర, సబ్కలెక్టర్ చల్లా కళ్యాణీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి కలెక్టర్ మాట్లాడతూ రీ సర్వేలో అనవసరంగా జాయింట్ ఎలిమెంట్స్ పెడితే రైతులు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఇబ్బందులు పడతారన్నారు. ప్రభుత్వ భూములు, కాలిబాట, పాదదారి, బండిబాట, నీటి వనరులు, చెరువులు ఆక్రమణలకు గురైతే స్పష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా రెవెన్యూశాఖకు చెడ్డపేరు రాకుండా, నిజాయితీగా పని చేయాలని కోరారు. పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన వినతులు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులు, భూ వివాదాలు, రీసర్వే, సుమోటో ఇంటిగ్రేటేడ్ సర్టిఫికేట్, ఏడీఎస్బీ పోర్టల్, రస్తా వివాదాల్లో రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. సమస్యలపై వచ్చే ప్రజలకు పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని సూచించారు. నిర్లక్ష్యంగా సేవలు అందిచండం ద్వారా రెవెన్యూశాఖకు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు జావాబుదారిగా పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపే అధికారులపై కఠినచర్యలు తప్పవని, ఉద్యోగ భద్రతను కోల్పోతారని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
ఆటో ఢీ కొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఆటో ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. బి.కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు జయంత్కుమార్ (27) వ్యవసాయకూలి పనుల నిమిత్తం సీటీఎంకు వచ్చాడు. పనులు ముగించుకుని సాయంత్రం కూలీలతో పాటు ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా సీటీఎం అంగళ్లు సమీపంలోని పెట్రోల్ బంకు సమీపంలో మరో ఆటో వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో కుడి కాలు, చేయి విరిగాయి. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాఽధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
అంగన్వాడీలను మోసగిస్తున్న కూటమి ప్రభుత్వం
రాజంపేట రూరల్ : అంగన్వాడీలను కూటమి ప్రభుత్వం అడుగడుగునా మోసగిస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బ్లాక్ డే సందర్భంగా గురువారం సీఐటీయూ ఆద్వర్యంలో అంగనవాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు రూ.26వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలన్నారు. సీఐటీయూ ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం.విజయమ్మ, సెక్టార్ లీడర్లు ఎం.శివజ్యోత్స్న, లక్ష్మిదేవి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
20 పోలింగ్ కేంద్రాల పెంపునకు ప్రతిపాదనలు
పీలేరురూరల్ : పీలేరు అసెంబ్లీ 163 నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 20 పోలింగ్ కేంద్రాలు పెంచేందుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి బి. అమరనాథరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గం ఓటర్లలో పురుషులు 1,15,105 మంది, మహిళలు 1,19,954, ఇతరులు 21 మంది ఉన్నట్లు తెలిపారు. మొత్తం 2,35,080 ఓటర్లు ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో 1200 ఓటర్ల కంటే మించిన పోలింగ్ కేంద్రాలు 20 ఉన్నాయని, వాటిని పునర్విభజన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివకుమార్, డీటీ ప్రసాద్, ఏఎస్ఓ రెడ్డెప్పనాయుడు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి,అన్నమయ్య: ఈత సరదా విద్యార్థులు ప్రాణాలు తీసింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. రాయచోటి రహదారి బాలరాజుపల్లి సమీపంలో ఉన్న చెయ్యేరు ఇసుక క్వారీ గుంతలో ఈతకొట్టేందుకు విద్యార్థులు వెళ్లారు. అయితే ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థులు క్వారీ గుంతలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతి చెందిన వారిలో సోంబత్తిన దిలీప్(22) గాలివారిపల్లి రాజంపేట మండలం,కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి(22) మంటపంపల్లి ఒంటిమిట్ట మండలం. పెన్నరోతు కేశవ (22) పోరుమామిళ్లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థుల మరణంపై సమాచారం అందుకున్న రాజంపేట ఏ ఎస్పీ ,రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కక్ష.. వివక్ష
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి చూపించిన ఉదారత ఏ ముఖ్యమంత్రి చూపలేదు. అంతకుముందు పక్కా ఇళ్లు మంజూరు చేసినా ఇంటికి అందించిన యూనిట్ విలువ సొమ్మును ప్రతినెలా తిరిగి కంతుల వారీగా చెల్లించేలా రుణాలు ఇచ్చేవారు. ఒక్కో నియోజకవర్గానికి ఇన్నేసి ఇళ్లే అంటూ రేషన్ కోటాలా ఇళ్లు కేటాయించేవారు. వైఎస్.రాజశేఖర్రెడ్డి సీఎం అయ్యాక అవసరమైనన్ని గృహాలను మంజురు చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఈ విధానాలకు స్వస్తి పలికారు. జిల్లాలో 78,221 మందికి పేదలకు పక్కా గృహాలను మంజూరు చేశారు. వీరికి లేఔట్లు, సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించారు. ఒక్కో లబ్ధిదారునికి తిరిగి కట్టనవసరం లేని రూ.1.80 లక్షలు అందించారు. ఇదికాక రుణంగా ఒక్కొక్కరికి రూ.35 వేల రుణం మంజూరు చేయించారు. లేఔట్లలో కోట్లు ఖర్చు చేసి సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ పేదలపై కక్ష కట్టి వ్యవహరిస్తోంది. ● ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్ధిదారులకు ప్రభుత్వం నోటీసులు ● ఇల్లు కట్టకుంటే..మేమిచ్చిన డబ్బువాపసు చేయండంటూ హుకుం జారీ ● ఇళ్లను రద్దు చేస్తామంటూ హెచ్చరికలు మదనపల్లె: పేదల ఇబ్బందులు తీర్చి, వారికి చేయూత ఇవ్వాల్సిన కూటమి ప్రభుత్వం కక్ష కట్టి వివక్ష చూపుతోంది. బడా పారిశ్రామిక వేత్తలకు, బడా సంస్థకు రెడ్కార్పెట్ పరచి వారికి అడిగినవి, అడగని రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం నిరుపేదలు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంజూరైన ఇళ్లపై కక్ష కట్టింది. అంతటితో ఆగలేదు మీకు మేం డబ్బులిచ్చాం..ఇల్లు కట్టుకోలేదు..వెంటనే ఇంటి పనులు చేపట్టాలి, లేదంటే మేం మీ ఖాతాలకు చెల్లించిన మొత్తాలను తిరిగి చెల్లించండి. తర్వాత ఇంటిని రద్దు చేస్తామంటూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పేదలకు గృహనిర్మాణశాఖ నోటీసులు జారీ చేస్తోంది. వీటిని అందుకున్న పేదలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అడగకనే పెంచారు జిల్లాలో 78,221 మందికి పక్కా గృహాలు మంజూరవ్వగా వారిలో 58,070 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గా ల లబ్ధిదారులు ఉన్నారు. ఎస్సీలు 12,188 మంది, ఎస్టీలు 3,432 మంది, బీసీలు 42,450 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయి. వీరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు ఒక్కో లబ్ధిదారునికి అదనంగా మంజూరు చేశారు. ఈ నిధులను సబ్ ప్లాన్ నిధుల నుంచి కేటాయించారు. గుర్తించిన వారికి ఇంటిస్థాయిని బట్టి నిధులను రూ.15వేల నుంచి ఆపైన సొమ్మును వారి ఖాతాలకు జమ చేశా రు. ఇలా అదనపు నిధులను ఇవ్వాలన్న డిమాండ్లు లబ్ధిదారుల నుంచి లేనప్పటికి ప్రభుత్వం ఇచ్చేసింది. నోటీసులతో అలజడి మేం మీ ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు ఖాతాకు నిధులు జమ చేశాం, మీరు ఇంటి పనులు చేపట్టలేదంటూ గృహనిర్మాణశాఖ మండల స్థాయిలో సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈ, ఎంపీడీఓ సంతకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు నోటీసులు పంపుతున్నారు. వీటిని అందుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున ఎంత మంజూరైంది, అదనంగా ఎంత చెల్లించారో తెలుపుతూ మీరు ఇంటిపని ఇంకా మొదలుపెట్టలేదు. నోటీసు అందిన వారంలోగా పని మొదలుపెట్టకపోతే ప్రభుత్వం వారి తరపున మీకు అందిన డబ్బులను తిరిగి వెన క్కి తీసుకుని, మీకు ఇల్లు అవసరం లేదని భావించి రద్దు చేసేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని మీకు తెలియజేస్తున్నాము అంటూ నోటీసుల్లో హెచ్చరికను జారీ చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మంజూరైన ఇంటిని రద్దు చేస్తే మళ్లీ ఇళ్లు రావన్న ఆందోళనలో ఉన్నారు. ఇస్తున్న నోటీసులు ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్దిదారులకే ఇవ్వడం విశేషం. సమస్యను వదిలేసి... జిల్లాలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్ర మం ద్వారా పేదలకు 78,221 మందికి పక్కా గృహా లు మంజూరయ్యాయి. ఈ నిర్మాణాలు వివిధ స్థా యిల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాక ముందు దాకా ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగంగా జరుపుకున్నారు. కూటమి అధికారంలోకి రావడంతోనే పనుల్లో జాప్యం నెలకొంది. దీనిపై క్షేత్రస్థాయిలో సమీక్షించి నిర్మాణాలపై సరైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. దీంతో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఏటా విధిస్తున్న లక్ష్యాలను అందుకోలేని పరిస్థితి నెలకొంది. అసలు సమస్య ఎక్కడుంది, ఎందుకీ పరిస్థితి నెలకొంది, లబ్ధిదారులకు ఇంకా కల్పించాల్సిన సౌకర్యాలు, తొలగించాల్సిన ఇబ్బందులను విస్మరించింది. దీని ఫలితమే జిల్లాలో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ప్రభావం చూపుతోంది. పెద్దతిప్పసముద్రం మండలంలో మైనార్టీ బీసీ మహిళకు ఇచ్చిన నోటీసు జిల్లాలో గృహ లబ్ధిదారుల వివరాలు నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదల పక్కా గృహాలకు ఇచ్చిన అదనపు నిధులను వెనక్కు తీసుకుంటామని, ఇంటిని రద్దు చేస్తామన్న హెచ్చరికల నోటీసుల అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ వర్గాల్లో అత్యధికులు పేదలే కావడంతో ఇళ్ల నిర్మాణాలపై ప్రభావం కనిపిస్తోంది. రాయచోటి 2,040 496 11,186 13,722 పీలేరు 2,433 863 10,184 21,436 రాజంపేట 2,308 520 4,770 7,598 కోడూరు 1,897 612 2,306 4,815 తంబళ్లపల్లె 1,579 458 6,051 8,088 మదనపల్లె 1,931 483 7,953 10,367 మొత్తం 12,188 3,432 42,450 58,070 -
శభాష్.. వివేక్
– కుందూలో కొట్టుకుపోతున్న వృద్ధురాలిని కాపాడిన యవకుడు రాజుపాళెం : పాపం.. ఆ అవ్వకు ఎంత కష్టమొచ్చిందో.. ఎవరికీ చెప్పుకునే మార్గం లేదో.. ఏమో.. జీవితంపై విరక్తి చెంది కుందూ నదిలో దూకింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ యువకుడు గమనించి సాహసం చేసి నీళ్లలోకి దూకి ఆమెను రక్షించాడు. వివరాలు ఇలా.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మల్లెవేముల గ్రామానికి చెందిన గుర్రమ్మ (68) రాజుపాళెం మండలం వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో దూకేందుకు అటువైపు వెళ్లింది. అయితే ఆ సమయంలో కుమ్మరపల్లె గ్రామానికి చెందిన భజంత్రి వివేకానంద ద్విచక్ర వాహనంలో ఆ దారిలో వెళుతున్నాడు. వృద్ధురాలు నీళ్ల వైపు వెళ్తుండటం గమనించి తన వాహనాన్ని ఆపి ఆమెను అనుసరించాడు. అంతలోనే ఆమె కుందూ నది పాత వంతెన మెట్ల వద్ద నీళ్లలో కొట్టుకుపోతూ కనిపించింది. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా భారీగా ప్రవహిస్తున్న నీళ్లలోకి దూకి వృద్ధురాలిని బయటకు తీశాడు. ఎందుకు నదిలో దూకాల్సి వచ్చిందని వివేక్ ఆమెను అడుగగా సమాధానం చెప్పలేక పోయింది. ఈ విషయాన్ని ఎస్ఐ వెంకటరమణకు, సచివాలయ ఉద్యోగులకు వివేక్ తెలపడంతో వెంటనే వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్రమ్మ వివరాలను ఎస్ఐ అడిగి తెలుసుకొని కుమారులను, బంధువులను పిలిపించారు. చికిత్స నిమిత్తం చాగలమర్రిలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె కోలుకోవడంతో కుమారుడు ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా, వృద్ధురాలిని కాపాడిన వివేక్ను ఎస్ఐతో పాటు ఇన్చార్జి తహసీల్దార్ మనోహర్రెడ్డి, మహిళా పోలీసు షాహిదా, సచివాలయ ఉద్యోగులు, గుర్రమ్మ బంధువులు ప్రశంసించారు. మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి(65) ఒకరు మృతి చెందాడు. రెండు రోజుల కిత్రం అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన అతనికి జీఈ వార్డులో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో అతను మంగళవారం రాత్రి మృతి చెందాడు. -
బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరమే
ఖాజీపేట : ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరంగా మారుతుందని మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. ఖాజీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టుకు సుమారు రూ.80వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయని వాటిని పూర్తి చేయాలన్నారు. రాజోలు జలాశయం నిర్మాణానికి రూ.1,300 కోట్లు నిధులు అవసరమని చెప్పారని, దానికే నిధులు లేనప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట వద్ద ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు మరమ్మతుల కోసం, అలాగే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని సూచించారు. ప్రజల కనీస అవసరాలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. వాట్సాప్ పాలన, క్వాంటామ్ వ్యాలీ, పీ–4, ఏఐ... ఇలా హైటెక్ ఆలోచనలు మంచివే అయినా, అమలు తీరు ఎలానో చూడాలన్నారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదని, ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. మైదుకూరు నియోజక వర్గంలో రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రిలో మందులు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మంత్రులు పల్లెల్లో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. సంక్షేమ పథకాలతోపాటు ప్రజల కనీస అవసరాలను గుర్తించి పనులు చేయకపోతే కూటమి పాలన కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి -
పూర్ణాహుతితో ముగిసిన దేవునికడప బాలాలయం
కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో బాలాలయ నిర్మాణం పూర్తయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి దశ కింద రూ.15 లక్షలతో బాలాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, అనంతరం తులాలగ్నంలో బాలబింబ ప్రతిష్ఠ, బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ భట్టర్, మయూరం కృష్ణమోహన్, తివిక్రమ్, కృష్ణ తరుణ్ నిర్వహించారు. అనంతరం బాలాలయంలో వెలిసిన స్వామి, అమ్మవార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.బాలాలయంలో స్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠ దర్శనానికి క్యూలో నిలబడిన భక్తులు -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
అట్లూరు : బద్వేలు నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ కూటమి నాయకులు, కార్యకర్తలు వాలిపోతున్నారు. మండల పరిధిలోని ఎస్.వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 60, 61 లలో సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే టీడీపీకి చెందిన ఓ కార్యకర్త గత రెండు రోజులుగా యంత్రాలతో చదును చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ భూమిలో ఇది ప్రభుత్వ భూమి, ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ అధికారం మాదే కదా హెచ్చరిక బోర్డులు ఏమవుతాయని అతిక్రమించి చదును చేయడం మండల ప్రజలను విస్మయానికి గురిచేసింది. గతంలో ఈ భూమి ప్రజా ప్రయోజనాల అవసరాల కోసమని కేటాయించామని, అయితే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి ఈ విలువైన భూమిని ఆక్రమించడం ఏమిటని స్థానిక టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. తహసీల్దార్కు ఫిర్యాదు.. టీడీపీ కార్యకర్త సర్వే నంబర్ 60, 61 లలో సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని బుధవారం స్థానిక తహసీల్దారుకు ఎస్.వెంకటాపురం కాలనీకి చెందిన యేసన్న, ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కాలనీ వాసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడి కాలనీ వాసుల ప్రయోజనాలకు ఉంచాలని కోరారు. తహసీల్దార్ వివరణ.. ఈ విషయమై తహసీల్దార్ సుబ్బలక్షుమ్మను వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే అక్కడికి సిబ్బందిని పంపించి పనులు నిలుపుదల చేయించామన్నారు. సంబంధిత వ్యక్తి తనకు ఆ భూమిపై హక్కు పత్రాలు ఉన్నాయని వివరణ ఇచ్చారని, సంబంధిత పత్రాలను పరిశీలించిన తర్వాత ఆర్డీఓకు నివేదిక పంపుతామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేంత వరకు ఆ భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. -
మామిడిలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలి
లక్కిరెడ్డిపల్లి : మామిడిలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించడంతో మంచి ఫలితాలు సాధించవచ్చని ఉద్యానశాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.మానస పేర్కొన్నారు. బుధవారం మండలంలోని దప్పేపల్లి, కోనంపేట, మద్దిరేవుల గ్రామాలలోని మామిడి రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన మొక్కలతోపాటు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రైతు పొలంలో ఆర్కబోరల్ కంట్రోల్ అనే మందు కాండం తొలిచే పురుగు నివారణకు వాడే విధానం గురించి వివరించారు. అనంతరం ఉద్యానశాఖ అధికారి సింధూరి మాట్లాడుతూ రైతులు సమగ్రమైన యాజమాన్య పద్ధతులు వాడటం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కేశవయ్య, చంద్రమ్మ, ఉద్యాన సిబ్బంది, మామిడి రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఫిలాటెలి స్కాలర్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప పోస్టల్ డివిజన్ పరిధిలో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీన్దయాళ్ స్పర్శ యోజన ఫిలాటెలి స్కాలర్ షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్ తెలిపారు. బుధవారం నగరంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 –26 విద్యా సంవత్సరానికి ఈ స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించారన్నారు. మంచి విద్యా రికార్డు, ఫిలాటెలి అభిరుచి కలిగిన విద్యార్థులకు ఫిలాటెలి క్విజ్, ప్రాజెక్ట్ ఆధారంగా స్కాలర్షిప్ ఇస్తారన్నారు. నెలకు రూ. 500 చొప్పున ఏడాదికి రూ. 6 వేలు ఇస్తారన్నారు. ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో 6, 9 తరగతుల మధ్య చదువుతూ ఉండాలన్నారు. పాఠశాలలో ఫిలాటెలీ క్లబ్ సభ్యుడిగా ఉండటం లేదా వ్యక్తిగత ఫిలాటెలి డిపాజిట్ ఖాతా కలిగి ఉండాలన్నారు. ఈ ఫిలాటెలి రాత పరీక్ష సెప్టెంబర్ 30న ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 16 లోపల దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు పోస్టాఫీసులో సంప్రదించవచ్చన్నారు. -
నియామకం
రాజంపేట: వైఎస్సార్సీపీ పురపాలక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, రాజంపేట పురపాలకసంఘం వైస్ చైర్మన్గా మర్రి రవి కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్రకార్యాలయం నుంచి నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని బుధవారం ఇక్కడి విలేకర్లకు మర్రి రవి తెలిపారు. మర్రి రవి ఎంపికపట్ల కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు హర్షం వ్యక్తంచేశారు. కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వైస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ నెల 25న కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని విశ్వ విద్యాలయం వీసీ విశ్వనాథకుమార్ తెలిపారు. ఇందులో భాగంగా బీఎఫ్ఏ (ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పం మరియు బి.డెస్ ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు కౌన్సిలింగ్ ఉంటుదని వివరించారు. దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో 25వ తేదీ తప్పకుండా హాజరు కావాలని తెలిపారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు కూడా డైరెక్ట్ అడ్మిషన్స్ కోసం ఒరిజినల్ (అసలు ధృవపత్రాలు) సర్టిఫికెట్స్ తో హాజరు అయి అదే రోజు అడ్మిషన్స్ పొందవచ్చుని తెలిపారు. సమాచాం కోసం www.ysrafu.ac.inను సందర్శించాలని వీసీ విశ్వనాథ్కుమార్ తెలిపారు. రాయచోటి: ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా స్థాయి కళా ఉత్సవ్–2025 పోటీలను రాయచోటి డైట్ ప్రాంగణంలో సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం తెలిపారు. బుధవారం డైట్లో దీనికి సంబంధించిన పోస్టర్లను డీఈఓ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. గాత్ర, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, సంప్రదాయ కథ చెప్పడం వంటి విభాగాలలో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, కళా రూపాలను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9,10, 11,12 తరగతుల విద్యార్థులు పోటీలకు అర్హులను వివరించారు.ఇతర వివరాలకు జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి, ఫోన్ నెంబరు. 9440246825లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు తిరుపతి శ్రీనివాస్, శివ భాస్కర్, వెంకట సుబ్బారెడ్డి, గిరిబాబు యాదవ్, కేదర్నాథ్, శివప్రసాద్, కలిముల్లా, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు క్రైం: నూతన బార్ పాలసీ ప్రకారం ఇక నుంచి బార్లలో అర్దరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని కడప ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఈఎస్ రవికుమార్ బుధవారం ప్రొద్దుటూరు ఎకై ్సజ్స్టేషన్కు వచ్చారు. స్థానికంగా ఉన్న పాత బార్ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 41 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. కడప జిల్లాలో 29, అన్నమయ్య జిల్లాలో 12 బార్లు ఉన్నాయన్నారు. ఈ నెల 26లోగా దరఖాస్తులు చేసుకోవాలని, 28న బార్లకు డ్రా తీయనున్నట్లు తెలిపారు. గతంలో ప్రొద్దుటూరులోని బార్లకు లైసెన్స్ ఫీజు రూ. 1.45 కోట్లు ఉండగా ఇప్పుడు రూ. 55 లక్షలకు తగ్గించినట్లు చెప్పారు. సమయ పాలన పాటించని మద్యం షాపులు, బార్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రొద్దుటూరులో గంజాయి అక్రమ రవాణా నిరోధానికి కృషి చేస్తున్న ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డిని అభినందించారు. -
దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై నిరాహార దీక్ష చేపడతా
ప్రొద్దుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై తాను నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగుల ఉసురు తప్పక తగులుతుందన్నారు. ఆయన పింఛన్లను తొలగించిన దివ్యాంగులతో కలసి బుధవారం సాయంత్రం తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 66.39 లక్షల పింఛన్లు ఉండగా, ఇప్పుడు 62.19 లక్షల పింఛన్లు మాత్రమే ఉన్నాయని, 4.19 లక్షల పింఛన్లను ప్రభుత్వం తొలగించిందన్నారు. గత 14 నెలల్లో ప్రభుత్వం ఒక్కరికీ కొత్త పింఛన్ మంజూరు చేయలేదని పేర్కొన్నారు. అలాగే గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కొత్త పింఛన్లను ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని బట్టి పేదలపై ఆయనకు ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 581 మందికి పింఛన్లను తొలగిస్తూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతుందని అనుకున్నామే కానీ ఓటేసిన సాధారణ పేదలను కూడా ఇబ్బంది పెడుతోందన్నారు. ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వంలో మంచం మీద నుంచి లేవలేని వారికి రూ.10వేలు, పెరాలసిస్ వ్యాధి గ్రస్తులకు రూ.5వేలు పింఛన్ ఇస్తుండగా, చంద్రబాబు మంచం మీద ఉన్న వారికి రూ.15వేలు, పెరాలసిస్ వ్యాఽధి గ్రస్తులకు రూ.10వేలు చొప్పున పెంచుతున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారని రాచమల్లు తెలిపారు. ఇప్పడు ఈ విధంగా వికలత్వం శాతం తక్కువగా ఉందని అసలుకే ఎసరు పెట్టారన్నారు. -
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
రాయచోటి: రెవెన్యూ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులు, భూముల రీసర్వే, భూమి రికార్డుల శుద్ధి, రికార్డుల అప్డేషన్ తదితర అంశాలపై బుధవారం రాయచోటిలోని పంక్షన్ హాల్లో రెవెన్యూ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల మేరకు సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వీఆర్ఓలు, తహసీల్దార్లు, ఆర్డీఓలను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన పనుల్లో కొంత గ్యాప్ కనిపిస్తోందన్నారు. సరియైన పరిజ్ఞానం లేకపోవడం, తెలుసుకోవాలన్న జిజ్ఞాస లోపించడం వల్ల ఆలస్యాలు జరుగుతున్నాయని కలెక్టర్ అన్నారు. జిల్లాలో రీసర్వే జాయింట్ ఎల్పీఎంల సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. దీంతో 965 కుటుంబాలు రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారన్నారు. కోర్టు వివాదాలు, పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు మినహా ఇతర భూ వివాదాల పరిష్కారంలో అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా నిబంధనల ప్రకారం పనులు చేయాలనిఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ -
జాతీయ స్థాయి శిక్షణా కార్యశాలకు ఉపాధ్యాయుడి ఎంపిక
చిట్వేలి : శాసీ్త్రయ పారిశ్రామిక పరిశోధనా మండలి వారు జిజ్ఞాస కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 30 మంది ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో బాగంగా చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఎ.శివనారాయణ గౌడ్ బెంగళూరులోని జాతీయ వైమానిక అంతరిక్ష ప్రయోగశాలలో ఏరో డైనమిక్స్ విమాన విడి భాగాలు, నానో మెటీరియల్స్పై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి సంస్థ డైరెక్టర్, జిజ్ఞాస మోడల్ అధికారి డాక్టర్ వీపీఎస్ నాయుడు ద్వారా సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు, ఉపాధ్యాయ సిబ్బంది శివనారాయణ గౌడ్ను అభినందించారు. -
కలిసి కట్టుగా దోమలను నివారిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్: అందరూ కలిసి కట్టుగా దోమలను నివారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు.ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా బుధవారం రాయచోటిలోని శివ నర్సింగ్ కాలేజీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమలు కుట్టడం ద్వారా మలేరియా వ్యాధి వ్యాపిస్తుందన్నారు. ఆడ అనాఫిలస్ దోమలు మలేరియా పరాన్నజీవిని మోసుకుపోతాయని, ఇవి కుట్టినప్పుడు పరాన్నజీవి మనుషుల రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుందన్నారు. దోమల నుంచి రక్షణ పొందేందుకు దోమ తెరలను వాడాలని సూచించారు. సర్ రోనాల్డ్రాస్ అనే శాస్త్రవేత్త 1902 ఆగస్టు 20న దోమలో మలేరియా పరాన్నజీవిని కనిపెట్టిన రోజు అని చెప్పారు. ఆ మహనీయునికి నివాళులు అఅర్పిస్తున్నామని తెలిపారు.జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి, శివ నర్సింగ్ కళాశాల డైరెక్టర్ భాస్కర్, డిప్యూటీ హెల్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహమ్మద్రఫీ, బలరామరాజు, సబ్ యూనిట్ అధికారి జయరాం, ఎంపీహెచ్ఈఓ శ్రీనివాసులునాయక్, ఎల్టీ శివ పాల్గొన్నారు. సిద్దవటం (ఒంటిమిట్ట): సిద్దవటం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను బుధవారం ఆర్బీఎస్కె జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదని వైద్య సిబ్బందికి సూచించారు. గర్భిణులకు స్కానింగ్ తీసిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు ఇవ్వాలే తప్ప పుట్టబోయే బిడ్డ వివరాలు తెలియజేయరాదన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నగేష్, డాక్టర్ ప్రకాష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టణ శివారు ఇళ్లే టార్గెట్.!
● వరుస చోరీలకు పాల్పడుతున్న దుండగులు ● హడలెత్తిపోతున్న ప్రజలు గుర్రంకొండ : గుర్రంకొండ పట్టణంలో శివారు ఇళ్లే టార్గెట్గా దుండగులు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఓ వైపు గంజాయి ముఠాసభ్యులు మరోవైపు బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల సంచారంతో పట్టణ ప్రజలు హడలెత్తిపోతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ పట్టణం రోజురోజుకు వ్యాపార కేంద్రంగా ఆభివృద్ధి చెందుతోంది. దీంతో స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. నాలుగు మండలాల ప్రజలు ఇక్కడ ఇళ్ల కట్టుకొని నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించుకొంటున్న ఇళ్లతో పాటు గ్రామానికి శివారు ప్రాంతాల్లో నివాసముండే ఇళ్లలో ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల నిర్మాణంలో ఉండే ఇళ్లలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణంలో వినియోగించే వస్తువులతోపాటు మెటీరియల్ను చోరీ చేసుకువెళుతున్నారు. పట్టణంతో పాటు ఇందిరమ్మకాలనీ, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం ఉన్న ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. మోటార్లు, ఎలక్ట్రికల్ వస్తువులు, గ్రానైట్ యంత్రాలతో పాటు వివిధ రకాల వస్తువులను చోరీ చేస్తున్నారు. దీంతో ఇంటి నిర్మాణం వద్ద వస్తువులు ఉంచాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. దీంతో పలువురు రాత్రిళ్లు కాపలా ఏర్పాటు చేసుకొంటున్నారు. వీటితోపాటు గ్రామ శివారు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొన్న చోట ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల సైకిళ్లు, ఇళ్ల పరిసరాల్లో ఉంచిన వస్తువులను రాత్రిళ్లు చోరీ చేస్తున్నారు. దీంతో రాత్రిళ్లు పట్టణ శివారు ప్రాంతాల్లో సంచరించాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బయటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో పాటు గంజాయి మత్తుకు అలవాటు పడిన పలువురు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. స్థానిక బస్టాండులోనూ ఇటీవల వరుసగా మూడు చిల్లర దుకాణాల్లో చోరీలు జరిగాయి. రేకుల షెడ్లు పైకప్పు రేకులను తొలగించి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీలకు సంబంధించి పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్కు చేరని కేసులు ఎన్నో ఉన్నాయి. చోరీలు జరిగినా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు పలువురు భయపడి మిన్నకుండిపోతున్నారు. దీంతో దుండగులు పట్టణంలో యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో జరుగుతున్న చోరీలపై గట్టి నిఘా పెట్టాం. చోరీ జరిగిన ఇళ్లకు సంబంధించిన యజమానులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఇళ్ల పరిసరాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తుంటే మాకు సమాచారం ఇవ్వాలి. – రఘురామ్, ఎస్ఐ, గుర్రంకొండ. -
24 నుంచి ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని టీడీడీ అధికారులు బుధవారం తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆగస్టు 23వ తేది సాయంత్రం ఆరు గంటలకు అంకుకార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఆల య పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 24న ఉదయం చతుష్టానార్చన, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం పవిత్రహోమం, నివేదన, శాత్తుమొర జరగుతాయన్నారు. 25న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 26న ఉదయం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్ష, సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్ల ఊరేగింపు జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రాజంపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పారిశ్రామిక శిక్షణా సంస్థ జిల్లా కన్వీనర్ సి.రామ్మూర్తి బుధవారం తెలిపారు. టెన్త్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోపు iti.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం తమకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. వెరిఫికేషన్ చేయించుకున్న వారి పేర్లు మాత్రమే మెరిట్ జాబితాలోకి వస్తాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు ఈనెల 29వ తేదీ ప్రభుత్వ ఐటిఐలలో, 30వ తేదీ ప్రైవేట్ ఐటీఐలలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. -
అటవీ ఉద్యోగులపై శ్రీశైలం ఎమ్మెల్యే దాడి అమానుషం
రాజంపేట : శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి , ఆయన అనుచరులు , విధులు నిర్వహిస్తున్న అటవీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి, వారిపై దాడి చేయడం అమానుషమని రాష్ట్ర అటవీ శాఖ జూనియర్ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కేవీ సుబ్బయ్య పేర్కొన్నారు. మంగళవారం రాత్రి శ్రీశైలం చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న డీఆర్వో, ఇద్దరు బీట్ అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడం దారుణమన్నారు. అతిథి గృహంలో బంధించి చిత్రహింసలు పెట్టారన్నారు. గాయపడినవారంతా ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అటవీ శాఖమంత్రి పవన్ కళ్యాణ్లు తక్షణమే స్పందించాలన్నారు. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా మార్పు మదనపల్లె రూరల్ : అనుమానాస్పదంగా మృతి చెందిన పశ్చిమబెంగాల్ యువకుడి కేసును పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకేసుగా మార్పు చేస్తున్నట్లు రైల్వే సీఐ అశోక్కుమార్ తెలిపారు. ఈనెల 16వ తేదీ సీటీఎం– అంగళ్లు రోడ్డులోని రైల్వే అండర్బ్రిడ్జి వద్ద ట్రాక్ పక్కన పశ్చిమబెంగాల్ ముషీరాబాద్ ఇమామ్నగర్కు చెందిన ఖదీర్(30) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఘటనపై రైల్వేపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, పోస్టుమార్టం నివేదికలో ఖదీర్ హత్యకు గురైనట్లుగా నివేదిక అందింది. దీంతో రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతి కేసును హత్యకేసుగా మార్పుచేశారు. అయితే ఈ కేసులో గంజాయి నిందితులు అనుమానితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
రామసముద్రం : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామసముద్రం మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం చొక్కాడ్లపల్లి పంచాయతీ కనగాని గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వారం క్రితం భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన సుబ్రమణ్యం తన పొలంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహం కాలేదని.. ములకలచెరువు : మనస్తాపంతో పురుగుల మందు తాగి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... మండలంలోని చౌడసముద్రం పంచాయతీ చెట్లవారిపల్లెకు చెందిన జి. వంశీకృష్ణారెడ్డి (30)కు వివాహం కాలేదు. డిగ్రీ వరకు చదువుకొని ఇంటి వద్దే ఉంటున్నాడు. వయస్సు వచ్చినా వివాహం కాలేదని, ఉద్యోగం సైతం లేకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యతో గొడవ పడి.. మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో భార్యతో గొడవపడి భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. కొత్తపల్లె పంచాయతీ కొత్త ఇండ్లుకు చెందిన నరసింహులు కుమారుడు కటారి రమేష్(45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య ప్రమీల, కుమారుడు క్రాంతి, కుమార్తె అనుష్క ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా రమేష్ మద్యానికి బానిసై తరచూ ఇంట్లో భార్యతో గొడవపడేవాడు. ప్రతిసారీ తాను చనిపోతానంటూ బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. అనంతరం మనస్తాపం చెందిన రమేష్ ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తరచూ బెదిరించడం మామూలే కదా అని కుటుంబ సభ్యులు కొంత సమయం వేచి చూశారు. అయినా తలుపు తీయకపోవడంతో కుమారుడు గదిలోకి తొంగిచూడగా, రమేష్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే స్థానికుల సహాయంతో తలుపులు తీసి రమేష్ను కిందకు దించి హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షిస్తుండగానే, పరిస్థితి విషమించి మృతి చెందాడు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
సమస్యల పరిష్కారంపై నిబద్ధత అవసరం
రాజంపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. మంగళవారం రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రాజంపేటలోని బైపాస్లో ఉన్న కళాంజలి కల్యాణ మండపంలో రెవెన్యూ పరిపాలన, పారదర్శకత, సమయపాలన, ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పని చేయడంపై రెవెన్యూ శాఖ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన వినతులను సకాలంలో పరిష్కారించాలన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ వివాదాల దరఖాస్తులు, భూముల రీసర్వే, రికార్డుల అప్డేషన్ తదితర అంశాల్లో రెవెన్యూ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. ప్రతి అధికారి నిజాయితీ, పారదర్శకతో సేవలందించాలన్నారు. ప్రజలను కార్యాల యాల చుట్టూ తిప్పుకోవద్దన్నారు. నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వరాదన్నారు. మెరుగైన సర్వీసులు అందించాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా పని తీరు మెరుగుపరుచుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ మెజిస్టీరియల్ పవర్స్, భూమి రికార్డుల శుద్ధి, భూ ఆక్రమణలపై విచారణ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించామన్నారు. డీఆర్వో మాట్లాడుతూ ప్రజలతో వ్యవహరించే విధానం తీరుతెన్నుల గురించి వివరించారు. సమావేశంలో రాజంపేట సబ్కలెక్టర్ భావన తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద చెరువును చెరబట్టారు
గాలివీడు : మట్టి మాఫీయా బరితెగింపునకు అడ్డు అ దుపూ లేకుండా పోతోంది. వాగులు, వంకలు, గుట్ట లు ఇలా ఒకటేమిటి కనిపించిన ప్రతి చోటా మట్టిని తరలిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. అడ్డుకట్ట వేయలేని రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేసింది. తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పెద్ద చెరువులో జేసీబీ యంత్రాలతో విచ్చలవిడిగా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మంగళవారం ఉదయం దర్జాగా జేసీబీ సాయంతో ట్రాక్టర్లకు మట్టిని నింపి ప్రధాన రహదారులపై తరలిస్తుంటే కనీసం అటువైపు కన్నెత్తి చూసే వారు లేరు. మొన్న పేరాలగుట్ట, నిన్న గుర్రాల మిట్ట నేడు పెద్ద చెరువు ఇలా ఒకటేమిటి కనబడిన చోటల్లా మట్టిని తవ్వి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిద్రావస్థలో ఉన్నారంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. -
● బోర్డులకే పరిమితమైన 4 శాతం కమిషన్
ప్రభుత్వ నిబంధనల మేరకు నాలుగుశాతం కమీషన్ మాత్రమే వసూలు చేయాలి. ప్రతి మండీ వద్ద ఇప్పటికీ 4శాతం మాత్రమే కమీషన్ అనే బోర్డులు ఉన్నాయి. అయితే పేరుకే బోర్డులు వేశారు తప్ప నిబంధనలు అమలు కావడలేదు. పదిశాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. మార్కెట్యార్డుకు టమాటాలను తీసుకొచ్చే రైతుల దగ్గర 10శాతం కమీషన్తో పాటు క్రీట్ కూలీ రూ.2, క్రీట్ బాడుగ రూ.2 వసూలు చేస్తున్నారు. దీంతో ఒక క్రీట్ మార్కెట్యార్డుకు చేరేసరికి కోతకూలీ, రవాణా ఖర్చులు, మండీల ఖర్చులు కలుపుకొంటే రు. 24 నుంచి రూ. 30 వరకు ఖర్చు వస్తోంది. -
మోదీన్ సాహెబ్ పల్లెలో విష జ్వరాలు
సిద్దవటం : మండలంలోని మోదీన్ సాహెబ్ పల్లె ఎస్సీ కాలనీలో దాదాపు 10 మందికి విష జ్వరాలు సోకి గత వారం రోజులుగా మంచానికే పరిమితమయ్యారు. గ్రామంలో అధిక వర్షాల కారణంగా అపరిశుభ్రత పేరుకు పోవడంతో దోమలు కుట్టడం వల్ల జ్వరాలు వ్యాపించాయని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారు. గ్రామస్తులు వైద్య సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో మంగళవారం మాధవరం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వర పీడితులను గుర్తించి మందులను అందజేశారు. గ్రామంలో అపరిశుభ్రత వల్ల, సీజనల్ వ్యాధులు వ్యాపించాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ శ్రావణి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
దాడి కేసులో నలుగురు టీడీపీ నాయకుల అరెస్టు
మదనపల్లె రూరల్ : తంబళ్లపల్లె నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరులో భాగంగా ఈనెల 15వతేదీ శుక్రవారం శంకర్యాదవ్ వర్గంలోని ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి కేసులో నలుగురు టీడీపీ నాయకులను మంగళవారం అరెస్టు చేశారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన మేరకు... ఈనెల 15న తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలం అవికేనాయక్ తండా సర్పంచ్ నటరాజ్ నాయక్(30), ములకలచెరువు మండల నాయునివారిపల్లెకు చెందిన ఐటీడీపీ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ సాగర్(35)పై మదనపల్లె మండలం చిప్పిలి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనం, కారులో వెంబడించి కర్రలు, రాడ్లతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తాలూకా సీఐ కళావెంకటరమణ విచారణలో భాగంగా నలుగురు టీడీపీ వ్యక్తులు దాడికి పాల్పడినట్లు గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కురబలకోట మండలం గౌడసానిపల్లెకు చెందిన పోలూరు శివశంకర(47), మదనపల్లె పట్టణం చౌడేశ్వరినగర్కు చెందిన రెడ్డివారి కార్తీక్రెడ్డి(24), కురబలకోట మండలం మట్లవారిపల్లెకు చెందిన రాజోళ్ల హరినాథ్(26), మదనపల్లెకు చెందిన పూసా శ్రీకాంత్రెడ్డి(25) ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు, కేజీబీవీ పాఠశాలల కాంట్రాక్టు ఉద్యోగులు కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వనందుకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా మాట్లాడుతూ జీతాలు ఇవ్వాలని అనేక పర్యాయాలు గ్రీవెన్సెల్లో, సర్వశిక్ష అభియాన్ అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వేతనాలు అందక కుక్లు, అసిస్టెంట్ కుక్లు, వాచ్మెన్లు, పార్ట్ టైమ్ టీచర్ల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం, ఆటంకం కలిగించకుండా విధులు నిర్వహిస్తూ వస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించే విషయంలో మంత్రి నారా లోకేష్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్కు వినతిపత్రం సమర్పించారు. -
సమయం కావాలంటున్నారు
టమాటా మండీల్లో చిన్న టమాటా క్రీట్లు ఏర్పాటు చేయడానికి వ్యాపారులు కొంత సమయం కావాలంటున్నారు. రెండునెలల క్రితం మార్కెట్కమిటీపాలక వర్గ సమావేశంలో ఈవిషయమై తీర్మానం చేశారు. ఆప్ప డు వ్యాపారులు అంగీకరించి ఇప్పుడు సమ యం కావాలంటున్నారు. పదిశాతం కమీషన్, జాక్పాట్ విధానం ఇంకా కొనసాగిస్తున్నారు.దీనిపై చర్యలు తీసుకొంటాం. – కుమార్రెడ్డి, మార్కెట్కమిటీకార్యదర్శి, వాల్మీకిపురం రైతులకు సమాధానం చెప్పాలి పాలకవర్గం తీసుకొన్న నిర్ణయాలు అమలు చేయాలి. లేని పక్షంలో పాలకవర్గంతో పాటు అధికారులు,వ్యాపారులు రైతులకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ నిబంధనలు మండీల్లో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వ్యాపారులు కూడా నిబంధనలకు లోబడే వ్యాపారాలు నిర్వహించాలి. –తరిగొండ నౌషాద్ఆలీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, వాల్మీకీఫురం -
శ్రీవారి భక్తులపై పోలీసుల దాడి అమానుషం
పీలేరు : అక్రమ లిక్కర్ కేసులో అరెస్టు అయిన రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ శ్రీవారి భక్తులు గోవిందనామస్మరణతో శ్రీవారి మెట్ల మార్గంలో ప్రశాంతంగా వెళుతున్న తరుణంలో పోలీసులు దాడి చేయడం అమానుషమని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీలేరు నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి పాదయాత్రగా వెళుతున్న భక్తులపై పోలీసులు బూటు కాళ్లతో తన్నడం, కొట్టడం, ఈడ్చడం ఆటవిక చర్య అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నాయకుల ఆదేశాలతోనే పోలీస్ అధికారులు ఇష్టానుసార వ్యవహరించారన్నారు. మదనపల్లె : శ్రీవారి మెట్ల మార్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కాలినడకన శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి, విద్యార్థి సంఘం నాయకుడు చక్రీధర్ను చిత్రహింసలకు గురిచేయడం అన్యాయమన్నారు. నియోజకవర్గ స్టూడెంట్ యూత్ అధ్యక్షుడు అశోక్ రాయల్, సోషల్ మీడియా అధ్యక్షుడు సోము, పూర్ణ, పాదం దీపక్, బాలకృష్ణ, కౌశిక్ రెడ్డి, శివ, అనిల్, చరణ్, అష్రఫ్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. నీరుగట్టువారిపల్లె మార్కెట్ యార్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (40) నడుచుకుంటూ వెళుతుండగా, నీరుగట్టువారిపల్లెకు చెందిన సురేష్ నాయక్ ద్విచక్రవాహనంలో వేగంగా వెళుతూ ఢీకొన్నాడు. ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి వెళ్లగా, సురేష్నాయక్ సైతం గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. టూటౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. బైక్ ఢీకొని.. బైక్ ఢీకొని మెకానిక్ తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఫిషింగ్పేటలో నివాసం ఉన్న అయూబ్ఖాన్(55) బసినికొండలోని కారు షెడ్లో టింకర్గా పనిచేస్తున్నాడు. సాయంత్రం షెడ్వద్దకు బైక్లో వెళుతుండగా, పుంగనూరు రోడ్డులోని మున్సిపల్ బోర్డు సమీపంలో వెనుకనుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనం అయూబ్ఖాన్ను ఢీకొంది. ప్రమాదంలో కుడికాలు విరగ్గా, స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. -
నిబంధనలకు తూట్లు.. రైతులకు పాట్లు
గుర్రంకొండ: జిల్లాలోని వాల్మీకిపురం, గుర్రంకొండ, కలికిరి, కలకడ, పీలేరుల్లో మార్కెట్ యార్డులు ఉన్నాయి.వీటిల్లో ప్రభుత్వ నిబంధనలు అమలు కాక పోవడంతో రైతులు నష్టపోతున్నారు. వాల్మీకీపురం కొత్త మార్కెట్కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం జూన్నెల 16న గుర్రంకొండ మార్కెట్యార్డు ఉపకార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వ్యాపారులను పిలిపించి పాలకవర్గం సమావేశంలో తీసుకున్న నిబంధనలను అన్ని మండీలలో వ్యాపారులు అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం మండీల్లో అమలు చేస్తున్న 30 కేజీల క్రీట్ల స్థానంలో 15 కిలలో టమాటా క్రీట్లు ఏర్పాటు చేయాలి. జాక్పాట్ విధానం ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, తక్షణం దానిని రద్దు చేయాలన్నారు. ఇకపై వంద క్రీట్లకు 10 టమాటా క్రీట్లు జాక్పాట్ పేరుతో రైతుల వద్ద నుంచి తీసుకోకూడదన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాలుగుశాతం కమిషన్ మాత్రమే రైతుల వద్ద నుంచి వసూలు చేసుకోవాలని, పదిశాతం కమీషన్ తీసుకోకూడదని హెచ్చరించింది. అయినా కొత్తపాలకవర్గం విధానాలు ఒక్కటి కూడా మార్కెట్ యార్డుల్లో అమలుకు నోచుకోక పోవడం గమనార్హం జాక్పాట్ పేరుతో నిలువుదోపిడీ రెండునెలల క్రితం జాక్పాట్లు రద్దు చేయాలని మార్కెట్ కమిటీపాలక వర్గం ఆదేశాలు జారీ చేసింది. అయినా రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. పడమటి మండలాల్లో మదనపల్లె తర్వాత గుర్రంకొండ మార్కెట్యార్డు అతిపెద్దది. ప్రతినిత్యం 40 నుంచి 50 లారీలోడ్ల టమాటాలు ఇక్కడికి వస్తుంటాయి. సుమారు 30 టమాటా మండీలు నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడి వచ్చి టమాటాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే స్థానిక వ్యాపారులు జాక్ పాట్ పేరుతో రైతులను దగా చేస్తున్నారు. జాక్ పాట్ ఉండకూడదనేది ప్రభుత్వ నిబంధన. అయితే నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా జాక్పాట్లు నిర్వహిస్తున్నారు. ప్రతి వందక్రీట్లకు 10క్రీట్లు జాక్పాట్ వదులుతున్నారు. రైతులు వేలంపాటకు సిద్ధంగా ఉంచిన క్రీట్లపై మరో సారి ఎత్తుగా టమాటాలను వ్యాపారులు పోస్తున్నారు. మళ్లీ వేలం పాటల సమయంలో జాక్పాట్ అంటూ వందకు పదిక్రీట్లు తీసుకొంటున్నారు. ఈ లెక్కన వందక్రీట్లకు జాక్పాట్ పేరుతో 12క్రీట్లకు పైగా వ్యాపారులు దోచుకొంటున్నారు. మార్కెట్కమిటీ పాలకవర్గం ఆదేశాలు ఎక్కడా పాటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. 15కిలోల టమాటా క్రీట్ల అమలు ఏది? వాల్మీకిపురం మార్కెట్కమిటీ పరిధిలోని అన్ని మండీల్లో 15కిలోల టమాటా క్రీట్ల విధానం అమలు చేయాలని మార్కెట్ కమిటీ పాలకవర్గం వ్యాపారులను ఆదేశించింది. తమకు కొన్ని రోజుల గడువు కావాలని, తప్పకుండా ఈ విధానాన్ని అమలు చేస్తామని టమాటా వ్యాపారులు అంగీకరించారు. దీంతో రైతులకు జాక్పాట్ బెడద తప్పుతుందని పాలకవర్గం భావించింది. అయితే ఇంతవరకు చిన్న టమాటా క్రీట్లను ఏ ఒక్క మండీలోనూ అమలు చేయకపోవడం గమనార్హం. దీంతో రైతులు ఇప్పటికీ పెద్ద క్రీట్ల రూపంలో నష్టపోతున్నారు. వేలంపాట ధరలో కోతలు మండీల్లో వేలం పాటలో పాడిన ధరల్లో కూడా ఇప్పటికీ కోతలూ విధిస్తున్నారు. రూ. 1000 క్రీట్ ధర పలుకుతుంటే వేలం పాటలో అవే ధరలు పాడి మళ్లీ రశీదుల్లో లెక్కకట్టే సమయంలో రూ. 50 నుంచి రూ.100 వరకు కోత విధిస్తున్నారు. అందరి ముందర ఒక ధర పాడుకొని బిల్లుల్లో మాత్రం కోత విధిస్తున్నారు. ఓ వైపు జాక్పాట్, మరోవైపు 10 శాతం కమీషన్లు, వేలం పాట ధరల్లో కోతలతో రైతులు నష్టపోతున్నారు. మార్కెట్యార్డులో నాలుగుశాతం కమిషన్, జాక్పాట్ రద్దు అని నామమాత్రపు బోర్డులు పెట్టిన దృశ్యం మార్కెట్ కమిటీ పాలకవర్గంఆదేశాలను పట్టించుకోని వ్యాపారులు టమాట ధరల్లో కోతలు కర్షకుడికి తప్పని ఇబ్బందులు -
నాపైనే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తావా.. నీకు బస్సుపాస్ ఇవ్వనుపో !
● రాజంపేట ఆర్టీసీ డిపోలో కౌంటర్ నిర్వాహకుడి బెదిరింపు ● ఆర్టీసీ అధికారులు చెప్పినా పట్టించుకోని వైనం ● సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విద్యార్థి రాజంపేట : రాజంపేట డిపోలో బస్సు పాసుల జారీ విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసిన ఫలితంగా, ఆర్టీసీ బస్టాండులో బస్పాస్ కౌంటర్ నిర్వాహకుడు కిషోర్ ఉద్యానవన కళాశాల విద్యార్థి కె.అభిషేక్కు పాసు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. బాధిత విద్యార్థి కథనం మేరకు వివరాలిలా.. రైల్వేకోడూరు నియోజకవర్గం అనంతరాజుపేటలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అభిషేక్ సీజన్ పాస్ తీసుకొని రోజు కళాశాలకు వెళ్లి వస్తుంటాడు. బస్ పాస్ రెన్యూవల్ చేసేందుకు వెళ్లిన ఈ విద్యార్థికి కౌంటర్ నిర్వాహకుడి నుంచి చేదు అనుభవం ఎదురైంది. పాసు రెన్యూవల్ చేయకుండా నిరాకరించారు. అంతటితో ఆగకుండా విద్యార్థిని బెదిరించారు. ఈ విషయాన్ని సదరు విద్యార్థి డీఎం రమణయ్య, సీఐ మాధవీలత దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించారు. నిర్వాహకునితో మాట్లాడారు. మీరెన్నయినా చెప్పండి నేను అభిషేక్కు పాస్ ఇవ్వను, ఇస్తే నా విలువ పోతుంది, బస్పాస్ కౌంటర్కు రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో వారు చేతులెత్తేశారు. తిరిగి ఈ విద్యార్థి జిల్లా కలెక్టర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అలాగే సబ్కలెక్టర్ భావన దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వేడుకున్నాడు. గత నెలలో ఈ విద్యార్థి అభిషేక్ బస్సు పాసుల జారీ విషయంలో రూ.40 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. అప్పటి నుంచి కిషోర్ విద్యార్థిపై కక్షపెంచుకున్నాడు. సోమవారం పాసు రెన్యూవల్కు వెళితే నాపై ఫిర్యాదు చేస్తావా, నీకెంత ధైర్యం, పాసు ఇవ్వను ఎవరికై నా చెప్పుకోపో అంటూ దురుసుగా బెదిరించాడు. గత 30 సంవత్సరాలుగా కిషోర్ ఇక్కడ పాతుకుపోయి డిపో అధికారులను సైతం లెక్క చేయడంలేదని ఇతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. డీఎంపై కలెక్టర్ ఫిర్యాదు రాజంపేట ఆర్టీసీ బస్టాండులో బస్పాసు కౌంటర్ నిర్వాహకుడు కిషోర్ వ్యవహారశైలికి అడ్డుకట్టవేయకుండా, హార్టికల్చర్ విద్యార్థి అభిషేక్కు పాసు ఇవ్వకుండా నిరాకరించిన వ్యవహారంపై డీఎం రమణయ్యపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ను కలిసి బస్పాసుల జారీలో నిర్లక్ష్యం, అక్రమ వసూలు తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. బస్ రిజర్వేషన్లు, బస్పాసులు, ఏఎన్ఎల్ అన్నీ ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్లనే ఈ పరిస్ధితి అన్నారు. ఇప్పటికై నా విచారణ కమిటీని నియమించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి, అన్నమయ్య: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంట శుభకార్యం జరగగా.. ఆ వివాహ రిస్పెప్షన్కు హాజరైన వైఎస్ జగన్ నూతన వధువరులను ఆశీర్వదించారాయన. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు అనురాగ్ రెడ్డి వివాహం వరదీక్షిత రెడ్డితో జరిగింది. ఈ వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. హెలిపాడ్ నుంచి వివాహ వేదిక వరకు పెద్దఎత్తున అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అందరికీ ఆప్యాయంగా అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదిలారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సెంట్రల్ జైలులో అవినీతి కిరణం!
సాక్షి ప్రతినిధి, కడప : సత్ప్రవర్తన నేర్పించాల్సిన సిబ్బంది స్వయంగా ఖైదీలకు తప్పుడు నడతను అలవాటు చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఎంజాయ్ చేసేందుకు కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లుగా అవినీతి ‘కిరణం’ అండ చూసుకుని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ బంకులో చోటుచేసుకున్న అవినీతి విషయంలో ఇప్పటికీ చర్యల్లేవు. వెరసి కడప సెంట్రల్ జైలులో తప్పు మీద తప్పులు దొర్లుతున్నాయి. కడప కేంద్ర కారాగారం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఖైదీలకు కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ఓ ఉన్నతాధికారిది అందెవేసిన చేయిగా చెప్పుకొస్తున్నారు. గతంలో కొందరు ఖైదీలకు ఏకంగా 600 రోజులు ఉపశమనం కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై లోకాయుక్తకు ఫిర్యాదులు వెళ్లినా నిష్ప్రయోజనమే అయింది. ఉన్నతాధికారి భయాందోళనలకు గురి చేయడంతో సిబ్బంది మౌనం దాల్చారు. ఖైదీలచే నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులో సుమారు రూ.7లక్షలు అవినీతికి ఆస్కారమిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఓ డిప్యూటీ జైలర్ను బాధ్యుడిని చేస్తూ నివేదికలు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. అలాగే కేంద్ర కారాగారం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు రూ.3.15 కోట్లు ప్రిజనర్స్ డెవలప్మెంట్ నిధి ద్వారా మంజూరు చేశారు. అందులో మెటీరియల్ కొనుగోలు కమిటీతో సంబంధం లేకుండా రూ.1. 3 కోట్లు ఏకంగా హెడ్ ఆఫీసును తప్పుదారి పట్టించి ప్రొసీజర్స్ను ఉల్లంఘించారు. ఇలాంటివి తరచూ చోటుచేసుకుంటుండడంతో సిబ్బంది సైతం పెడదారి పట్టినట్లు సమాచారం. సీఎంఓకు ఫిర్యాదుల పరంపర.. కడప సెంట్రల్ జైలు ఉన్నతాధికారి ఒకరు ఇష్టానుసారంగా వ్యవహరించారని ప్రొసీజర్స్ ఉల్లంఘించారని, సివిల్ వర్క్స్లో అవినీతికి పాల్పడ్డారని అనేక ఫిర్యాదులు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు, హోంమంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇదివరకూ పర్యవేక్షణాధికారిగా పనిచేసి అవినీతికి పాల్పడిన వ్యక్తికే అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టారని చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నట్లు సమాచారం.కడప కేంద్ర కారాగారంలో విచారణకడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో గతంలో జరిగిన వైద్య శిబిరం, ఇతర అంశాలపై సమగ్రంగా విచారణ జరపాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, జైళ్ల శాఖ విజయవాడ కారాగారం సూపరింటెండెంట్ ఇర్ఫాన్, కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఇర్విన్ను సభ్యులుగా చేర్చి కమిటీ నియమించారు. ఇందులో భాగంగా గతంలో కడప కేంద్ర కారాగారంలో వైద్యుడిగా పనిచేసిన డాక్టర్ ప్రవీణ్ను డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి పిలిపించి పలు అంశాలపై విచారించారు. మంగళవారం డాక్టర్ పుష్పలత, తర్వాత బాధ్యులైన కొందరిని పిలిపించి విచారించనున్నారు. అలాగే పోలీస్ శాఖ, జైళ్ల శాఖ, రెవిన్యూ శాఖల నుంచి కమిటీలో నియమితులైన అధికారులు ఆయా శాఖల వారిని విచారించనున్నారు. పెట్రోల్ బంక్లో రూ.7లక్షలు విలువైన ఆయిల్ స్వాహా కాంపౌండ్ వాల్ నిర్మాణంలో నిబంధనలు పాటించని వైనం ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన ఓ ఉన్నతాధికారి దొంగ చేతికి తాళమిచ్చినట్లుగా అదనపు బాధ్యతలు -
మంత్రి ఇలాఖా.. ఉచిత ప్రయాణం ఇలాగా..!
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు పడుతున్న పాట్లు వర్ణణాతీతం. ప్రభుత్వం ఆర్బాటంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి అవసరమైన బస్సులను ఏర్పాటు చేయడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కడప. తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, రాజంపేట, కదిరి బస్సుల కోసం గుంపులు గుంపులుగా ప్రయాణికులు పడిగాపులు కాయడం కనిపించింది. ఉన్న బస్సులను కూడా సకాలంలో తిప్పకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఆర్టీసీ బస్టాండ్లలో వేచి ఉండాల్సి వస్తోంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సొంత జిల్లా కేంద్రమైన రాయచోటిలో బస్సుల కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. -
సిమెంట్ లారీ ఢీకొని హోంగార్డు దుర్మరణం
మదనపల్లె రూరల్ : సిమెంట్ లారీ ఢీకొని హోంగార్డు దుర్మరణం చెందిన ఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం కోటకొండ తాండాకు చెందిన షేకే నాయక్, చౌడమ్మ దంపతుల కుమారుడు ఈశ్వర్ నాయక్(50) మదనపల్లెలో హోంగార్డు యూనిట్లో పనిచేస్తూ సబ్ కలెక్టరేట్ కార్యాలయ నైట్డ్యూటీ విధులు నిర్వహిస్తుంటాడు. సొసైటీ కాలనీ గేటులో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య లక్ష్మీబాయి స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తోంది. కుమారుడు హర్షవర్ధన్ నాయక్ ఇంజనీరింగ్ పూర్తిచేసి సివిల్స్కు ప్రిపేర్ అవుతుండగా, కుమార్తె భవ్యశ్రీ డిగ్రీ చదువుతోంది. ఈశ్వర్ నాయక్ సోమవారం స్వగ్రామమైన కోటకొండ తాండా నుంచి ద్విచక్రవాహనంలో విధులకు హాజరయ్యేందుకు మదనపల్లెకు వస్తుండగా, మార్గమధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద సిమెంట్ కంటైనర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఈశ్వర్నాయక్ తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. స్థానికులు ముదివేడు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా ఈశ్వర్ నాయక్కు ఇద్దరు అక్కలు ఈశ్వరమ్మ, శంకరమ్మ, చెల్లెలు పార్వతి ఉండగా, వారి కుటుంబాలకు అన్ని విషయాల్లోనూ చేదోడువాదోడుగా ఉండే సోదరుడు మృతి చెందడంతో వారు జిల్లా ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. -
తలసేమియా బాధితుడికి పీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం
రాయచోటి జగదాంబసెంటర్ : రామాపురం మండలం నీలకంఠ్రావుపేట గ్రామానికి చెందిన పఠాన్ జాబీర్ అహమ్మద్ కుమారుడు షకీల్ అహమ్మద్ తలసేమియా వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. ఈ వ్యాధి చికిత్సకు లక్షలాది రూపాయలు అవసరమవుతుండగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబానికి వైద్యఖర్చులు భారంగా మారాయి. తమ కుమారుడి విషమ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ షకీల్ తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డిని ఆశ్రయించారు. ఆయన వెంటనే స్పందించి ఎంపీ పీవీ మిథున్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసును ప్రధానమంత్రి జాతీయ ఉపశమననిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) పరిధిలోకి తీసుకురావాలని, తగిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ మిథున్రెడ్డి కూడా వెంటనే స్పందిస్తూ షకీల్ మెడికల్ డాక్యుమెంట్లు, సంబంధిత ధ్రువపత్రాలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. వారి చొరవకు స్పందనగా ప్రధానమంత్రి కార్యాలయం, షకీల్కు బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్లో మేజర్ తలసేమియా చికిత్స నిమిత్తం రూ.3 లక్షల ఆర్థికసాయాన్ని మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ మిథున్రెడ్డికి, వెంటనే స్పందించి మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
దళారుల మోసాన్ని అరికట్టండి
ఓబులవారిపల్లె : దళారుల చేతిలో బొప్పాయి రైతులు మోసపోతూనే ఉన్నారని, కలెక్టర్ స్వయంగా నిర్ణయించిన ధర కంటే రైతులకు తక్కువగా చెల్లిస్తున్నారని రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వేకోడూరు బొప్పాయి పంట రేట్లు దళారులు తగ్గించడంతో ఈనెల 1వ తేదీన జిల్లా కలెక్టర్ బొప్పాయి రైతులతో, దళారులతో సమావేశం నిర్వహించారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కనీస ధర రూ. 9 అమలు చేయాలని, 6వ తేదీ నుంచి పది రూపాయలు అమలు చేయాలని నిర్ణయించారన్నారు. 6వ తేదీ వరకు రూ.9 అమలు చేసిన దళారులు ఆ తర్వాత ఎనిమిది రూపాయలకు, ప్రస్తుతం ఏడు రూపాయలకు తగ్గించారని ఆరోపించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస ధర రూ.15గా నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్, రైతు సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన మహిళ దారుణ హత్య
చిన్నమండెం : మదనపల్లె మండలంలో అదృశ్యమైన ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘటన వెలుగు చేసింది. వివరాలు ఇలా.. ఈ నెల 10వ తేదీన మదనపల్లె మండలం పొన్నేటిపాలెం పంచాయతీ సవరంవారిపల్లెకు చెందిన శ్రీదేవి(45) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆమె బావ వాసు మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఆమె అదృశ్యం కేసును ఛేదించినట్లు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ సుధాకర్ తెలిపారు. శ్రీదేవికి ఆమె అక్క అల్లుడైన శివకుమార్ నాయుడుతో వివాహేతర సంబంధం ఉండేదన్నారు. ఈ క్రమంలో శివకుమార్ నాయుడు తన మోటార్ సైకిల్లో శ్రీదేవిని ఎక్కించుకుని చిన్నమండెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఆమె చీరతో గొంతుకు ఉరివేసి చంపివేశాడన్నారు. అక్కడే పెట్రోల్ పోసి కాల్చివేశాడన్నారు. శ్రీదేవి కాల్డేటా ఆధారంగా శివకుమార్నాయుడును అదుపులోకి తీసుకోగా ఈ విషయాలు తెలిశాయన్నారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఐదుగురు బైక్ దొంగల అరెస్టుజమ్మలమడుగు : బైకుల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు యువకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం స్థానిక అర్బన్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 10వతేదీన ప్రొద్దుటూరు రఽహదారిలో హోండా యాక్టివా చోరీకి గురైందంటూ బాధితుడు కొక్కొకోల రామమోహన్ ఫిర్యాదు చేశాడన్నారు. ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా సోమవారం తమకు దొంగల సమాచారం అందిందన్నారు. ప్రొద్దుటూరు రోడ్డులోని ఎస్ఆర్ పెట్రోల్బంకు వద్ద సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు యువకులు తమ సిబ్బందిని చూసి వాహనాలు వెనక్కి తిప్పుకుని వెళుతుండటంతో సిబ్బంది పట్టుకున్నారన్నారు. వారిని విచారించగా బైకుల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి పది లక్షల రూపాయల విలువ గల 9 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ లింగప్ప, ఎస్ఐ హైమావతి, దేవదాసు, రియాజ్, నాగేంద్ర, శివ పాల్గొన్నారు.మిస్టరీని ఛేదించిన పోలీసులు -
ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర అమలు చేయాలి
రాజంపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్రను అమలు చేసి ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవాలని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ సర్కిల్ పాత బస్టాండు వద్ద సోమవారం ఆటో డ్రైవర్లతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణ పేరుతో 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన మోటారు చట్టం 106(1)(2)ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు, మోటారు కార్మికులకు రూ.15వేలు అందించే వాహనమిత్ర పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20న సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ నాయకులు సురేష్, నాయక్, ఆకాష్, హరీ, నరసింహ, మహమ్మద్ పాల్గొన్నారు. -
నూతన మద్యం పాలసీతో 11 బార్లకు టెండర్లు
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నూతన మద్యం పాలసీ విధానంలో 11 బార్లకు టెండర్లు వేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. సోమవారం రాయచోటి ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బార్ కోసం నాలుగు అంత కన్నా ఎక్కువ టెండర్లు వచ్చే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. అంత కన్నా తక్కువ టెండర్లు వస్తే దానికి సంబధించి లాటరీ తీయబడదన్నారు. 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 28వ తేదీ జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ తీస్తామని తెలిపారు. మదనపల్లె మున్సిపాల్టీలో–5, రాయచోటి మున్సిపాల్టీలో–3, రాజంపేట మున్సిపాల్టీలో–2, పీలేరు టూరిజం సెంటర్లో–1 చొప్పున ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ప్రతి బార్కు రూ.5లక్షలు అప్లికేషన్ ఫీజుతో పాటు రూ.10 వేలు ప్రాసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తాన్ని ఎలాంటి పరిస్థితిలో తిరిగి వెనక్కు ఇవ్వరన్నారు. బార్లు మూడు సంవత్సరాల పాటు నిర్వహించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ గురుప్రసాద్ పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
మదనపల్లె రూరల్ : ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండకు చెందిన ఇమామ్బాషా కుమారుడు షేక్ చాంద్బాషా(65) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పొలం దున్నేందుకు ట్రాక్టర్ తీసుకుని స్థానికంగా ఓ యజమాని పొలంలో పనిచేసేందుకు వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టర్లో నుంచి రోడ్డుపక్కనే ఉన్న కుంటలో పడిన చాంద్బాషా నీట మునిగి మృతిచెందాడు. అయితే, పనులకు వెళ్లిన చాంద్బాషా ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించడంతో నీటికుంటలో బయటపడ్డాడు. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులును విచారించగా తమకు ఫిర్యాదు అందలేదన్నారు. అవినీతి ఆరోపణలపై విచారణఓబులవారిపల్లె : చిన్న ఓరంపాడు జేఎల్ఎం ఖలీల్పై గ్రామ రైతులు చేసిన అవినీతి ఆరోపణలపై సోమవారం రైతులతో విద్యుత్ శాఖ విజిలెన్సు అధికారులు విచారణ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ విజిలెన్స్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. చోరీ జరిగిన ఇంట్లో క్లూస్ టీమ్ తనిఖీలుగాలివీడు : మండల కేంద్రమైన గాలివీడులోని గౌతమ్ పాఠశాల వద్ద ఆటో డ్రైవర్ మల్లయ్య ఇంట్లో జరిగిన రూ.3 లక్షలు నగదు,12 తులాల బంగారం చోరీకి సంంధించి సోమవారం క్లూస్ టీమ్ సభ్యులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం స్థానిక ఎస్ఐ రామకృష్ణతో కలిసి దొంగల జాడ కోసం చోరీ జరిగిన ఇంటిని జల్లెడ పట్టారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, చోరీపై గల సందేహాలను కుటుంబ సభ్యులను అడిగి ఆరా తీశారు. లారీ ఢీ కొని యువకుడి మృతిచాపాడు : మైదుకూరు–ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని కేతవరం గ్రామ సమీంపలో సోమవారం లారీ ఢీ కొని మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన ఎల్లనూరు సునీల్కుమార్(31)అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు సునీల్ కుమార్ ఉదయం కేఏ01ఏవీ 8756 నెంబరు గల బైక్లో మైదుకూరుకు వెళుతుండగా ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న టీఎల్ 88జే 2621 నెంబరు గల లారీ బైక్ను ఢీ కొంది. సునీల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
ఉపాధిలో అవినీతి కొండంత.. తేల్చింది గోరంత
● సామాజిక తనిఖీ బృందం చేతివాటం ● వెలుగుచూడని అవినీతి అక్రమాలుగుర్రంకొండ : ఉపాధిహామీ పనుల్లో అధికారులు, సిబ్బంది చేసిన అవినీతిని బట్టబయలు చేసేందుకు సామాజిక తనిఖీ బృందం విచారణ నిర్వహిస్తుంది. అలాంటి సామాజిక తనిఖీ బృందం సభ్యులే అవినీతికి పాల్పడి వెలుగు చూడాల్సిన అవినీతిని కప్పిపుచ్చి కొండంత అవినీతిని గోరంతగా చూపించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. మండలంలోని 15 గ్రామ పంచాయతీల పరిధిలో 2024–25 ఏడాదికి రూ.5.50 కోట్ల మేరకు ఉపాధి హామీ పనులు జరిగాయి. సుమారు పదిహేను రోజుల పాటు సామాజిక తనిఖీ బృందం సదరు ఉపాధి హామీ పనులపై విచారణ జరిపారు. ఇటీవల మండల కేంద్రమైన గుర్రంకొండలో సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించి గ్రామాల వారీగా ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతి చదివి వినిపించారు. అయితే సామాజిక తనిఖీ బృందం సభ్యులు పలు గ్రామాల్లో జరిపిన విచారణలో చేతి వాటం ప్రదర్శించారనే విషయం ఆలస్యం వెలుగు చూస్తోంది. డబ్బులు ముట్టజెప్పినప్పటికీ కొంతమంది సామాజిక తనిఖీ బృందం సభ్యులు తమను మోసం చేసి బహిరంగ సభలో తప్పులను ఎత్తి చూపారంటూ ఉపాధిహామీ సిబ్బంది బహిరంగంగా విమర్శిస్తున్నారు. మచ్చుకు ఉదాహరణగా మండల కేంద్రానికి సమీపంగా ఉండే ఒక గ్రామంలో ఓ డీఆర్పీ ఆ గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించారు. విచారణలో రూ. 3 లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు తేలింది. అయితే ఈ విషయాన్ని సామాజిక తనిఖీ బహిరంగ సభలో బయట పెట్టకూడదంటూ సదరు డీఆర్పీతో బేరసారాలు సాగించారు. రూ. 50 వేలు నుంచి బేరం ప్రారంభించి రూ.20 వేలుకు అంగీకరించారు. దీంతో సదరు గ్రామంలో అసలు అవినీతే జరగనట్లు బహిరంగ సభలో నివేదిక సమర్పించడం గమనార్హం. ఇదే మండల కేంద్రానికి సమీపంలోని మరో గ్రామానికి సంబంధించి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను అకారణంగా సస్పెండ్ చేశారు. అయితే అప్పటికే సదరు ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఎలాంటి తప్పులు చేయలేదని సామాజిక తనిఖీ బహిరంగ సభలో చెప్పే విధంగా బేరం కుదుర్చుకొని రూ.20 వేలు అప్పటికే ముట్టచెప్పారు. ఆయినా బహిరంగసభలో ఫీల్డ్ అసిస్టెంట్ తప్పు చేసిందంటూ సదరు డీఆర్పీ చదివి వినిపించడంతో ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన నాయకులు, కుటుంబ సభ్యులు సదరు డీఆర్పీని నానా దుర్భాషలాడినట్లు సమాచారం. తప్పులు కప్పిపుచ్చుతానని నమ్మబలికి రూ.20 వేలు తీసుకొ ని ఎలా బహిర్గతం చేస్తావంటూ డీఆర్పీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. పలు గ్రామాల్లో బేరసారాలు కుదుర్చుకొన్న అనంతరం చివరగా రూ. 5.50 కోట్ల మేరకు జరిగిన ఉపాధి హామీ పనుల్లో కేవలం రూ. 2,39,372 మాత్రమే అవినీతి జరిగినట్లు తేల్చి చేతులు దులుపుకోవడం కొసమెరుపు. వాస్తవంగా పలు గ్రామాల్లో జరిగిన ఉపాధి పనుల్లో రూ. 25 లక్షల మేర అవినీతి జరిగినట్లు సమాచారం. కేవలం సామాజిక తనిఖీ బృందం సభ్యులు చేతివాటం ప్రదర్శించి అవినీతిని తొక్కిపెట్టి, అవాస్తవాలు సామా జిక తనిఖీ బహిరంగ సభలో చదివి వినిపించారని బాహాటంగా స్వయంగా ఉపాధి హామీ సిబ్బందే చర్చించుకోవడం గమనార్హం. అధికారులు ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయని ప్రజలు అంటున్నారు. -
నేడు ఆకేపాడుకు వైఎస్ జగన్ రాక
కడప కార్పొరేషన్/రాజంపేట : అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం ఆకేపాడుకు ఈనెల 19వ తేదీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షనన్లో ఆయన పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు వైఎస్ జగన్ రాజంపేట మండలం బాలిరెడ్డిగారిపల్లె హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన ఆకేపాడు చేరుకుని, ఆకేపాటి ఎస్టేట్స్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్కుమార్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. హెలిప్యాడ్ పరిశీలన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి ఆకేపాడుకు చేరుకోనున్నారు. ఇందుకోసం హెలీప్యాడ్ సిద్ధం చేశారు. సోమవారం ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి హెలీప్యాడ్ను పరిశీలించారు.ఎమ్మెల్యే వెంట స్ధానిక వైఎస్సార్సీపీనేతలు పాల్గొన్నారు. -
మద్యం కేసులో ముద్దాయిలకు దేశ బహిష్కరణ !
● కువైట్కు మళ్లీ రాకుండా నిషేధిత జాబితాలో పేర్లు ● అరెస్టు అయిన వారిలో కడప జిల్లా వాసులు రాజంపేట : కల్తీమద్యం, నాటుసారా బాధితులను కువైట్ దేశం బహిష్కరించింది. దేశం విడిచివెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వారు కూడా కువైట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఎవరెవరు ఉన్నారనేది మాత్రం ఇండియన్ ఎంబీసీ వెల్లడి చేయడంలేదు. దీంతో గల్ఫ్ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. భవన నిర్మాణ కార్మికులలో అలజడి కల్తీ మద్యం దుర్ఘటనతో విస్తృత తనిఖీల్లో భాగంగా కువైట్ పోలీసులు ముతల్లా (కొత్తగా నిర్మితమవుతున్న ప్రాంతం)లో తనిఖీలు చేశారు. అనధికారికంగా అనేక మంది తెలుగువారు ఉండటాన్ని గుర్తించారు. వారిని అరెస్టు చేశారు. ఆర్టికల్ 20 కింద వచ్చిన వారంతా నివాసపత్రాలు సరిగ్గా లేకపోవడంతో కార్మికులను కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ప్రాంతంలో భవన నిర్మాణ, కార్మిక రంగానికి చెందిన వారు అధికంగా ఉన్నట్టు అక్కడివారు తెలియజేశారు. బేల్దారి, పెయింటర్స్, కూలీలుగా పనిచేసేందుకు కువైట్కు వెళ్లిన వారి కుటుంబాల్లో అలజడి మొదలైంది. ఈ వింగ్లో ఉమ్మడి కడప జిల్లా నుంచి అనేకమంది వెళ్లారని కువైట్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 18 కింద కువైట్లో ఉన్న కార్మికులలో అనేక మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మహబుల్లాలో 23 మందికి పైగా ప్రాణాలను విషాదకరంగా బలి తీసుకున్నట్లుగా 71 మంది వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశారు. ఇలా ఉంటే మహబుల్లాలో తనిఖీ చేసిన అక్కడి పోలీసులు 278 మందిని అరెస్టు చేయగా ఇందులో ఉమ్మడి కడప జిల్లా వాసులు కూడా ఉన్నారనే సంకేతాలు గల్ఫ్ కుటుంబీకుల ద్వారా అందుతోంది. ఏపీలో పలు జిల్లాలకు చెందిన తెలుగువారు కూడా కల్తీ మద్యం దుర్ఘటనలో బాధితులుగా ఉన్నారని సమాచారం సంబంధీకులకు చేరుతోంది. తిరిగి రాకుండానే.. విషపూరిత మద్యం తాగి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాసాంధ్రులందరూ మరోసారి కువైట్కు రాకుండా ఆ దేశాధికారులు వారి పేర్లను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో అప్పులు చేసి కువైట్ వెళ్లిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. అటు అనారోగ్యం, మరోవైపు అప్పులతో ఇంటిముఖం పడుతున్నారు. తిరిగి తాము కోలుకుంటామో లేదా అన్న బెంగ బాధితులను వెంటాడుతోంది. కువైట్కు వెళ్లి నాలుగు రాళ్లు వెనుకేసుకుందామని అనుకుంటే కల్తీ, నాటుసారా నట్టేట ముంచేసింది. కల్తీమద్యం కేంద్రాలకు సీల్ వేస్తున్న కువైట్ పోలీసు కువైట్లో నాటుసారా కేంద్రంలో పట్టుబడిన తయారీదారులు -
దేవునికడప ఆలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం
కడప సెవెన్రోడ్స్ : దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనుల ప్రక్రియ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. బాలాలయ సంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, బాలబింబాలకు జలాధివాసం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆల య ఇన్స్పెక్టర్ పి.ఈశ్వర్రెడ్డి పర్యవేక్షించారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించి బుధవారం బాలాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తారు. తిరుమల–తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారు, అండాళమ్మ వారి గర్భాలయాన్ని, విమాన గోపురాన్ని, రాజ గోపురాలకు మరమ్మతులు చేపడుతున్నారు. దీంతో స్వామి, అమ్మవార్ల మూల విరాట్కు బదులుగా గర్భాలయం ఎదురుగా మండపంలో బాలాలయం నిర్మాణం చేపట్టారు. జీర్ణోద్ధరణ పనులు పూర్తయ్యే వరకు భక్తులు బాలాలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాల్సి ఉంటుంది. స్వామి, అమ్మవార్లకు నిర్వహించే నిత్య, నైమిత్తిక, కామ్య కై ంకర్యాలు యథావిధిగా బాలాలయంలో నిర్వహిస్తారు. ● రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దేవుని కడప ఆలయం ఒకటి. తిరుమల తొలిగడపగా పే రున్న ఈ ఆలయంలోని స్వామిని జనమే జయ మహారాజు ప్రతిష్ఠించారని చెబుతారు. కై ఫీయత్తు ల ప్రకారం తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయ రాజగోపురం, దేవుని కడప ఆలయ రాజగోపురం ఒకేసారి నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్క డి ఆలయంలోని రాజగోపురంతోపాటు ముఖ మండపం, గర్భాలయం, అంతరాళం, ప్రాకారం, మట్లి అనంత భూపాలుడు నిర్మించినట్లు తెలుస్తోంది. వైదుంబులు, ఓరిగంటి రాజులు, వల్లూరు పాలకులు, సంబెటరాజులు, సాళు వ, సంగమ, తులువ వంశీకులు ఈ క్షేత్రం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు పలుమార్లు కడప రాయుడిని దర్శించినట్లు చరిత్ర చెబుతోంది. పురా తన ఆలయం కావడంతో టీటీడీ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది. -
భూమి ఆన్లైన్ కోసం బాధ భరిస్తూ..
రాయచోటి : రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఊపిరితిత్తు ల వ్యాధితో బాధపడుతున్న తనకు ఊపిరిపోయేలా ఉందని బాధితుడు మర్రిపాటి శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి ఆక్సిజన్ సిలిండర్తో తనకున్న సమస్యను గ్రీవెన్స్సెల్లో కలెక్టర్కు విన్నవించుకోవడానికి వచ్చారు. కలకడ మండలం రాతిగుంటపల్లి పంచాయతీ దేవలపల్లికి చెందిన మర్రిపాటి శంకరయ్యకు నడిమిచర్ల పంచాయతీలోని సర్వే నంబర్ 733/1లో 5 ఎకరాల 19 సెంట్లు భూమి ఉంది. 1970లో దళితులకు ప్రభుత్వం పట్టాలిచ్చి వ్యవసాయం చేసుకొనేలా అవకాశం కల్పించిందన్నారు. అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ భూమి గ్రామానికి చెందిన వెంకటరాయుడు, రెడ్డప్పల పేరు మీద ఆన్లైన్ అయిందన్నారు. భూమికి సంబంధించిన రికార్డులు కూడా మా దగ్గరే ఉన్నాయన్నారు. రికార్డుల ప్రకారం మా భూమిని సర్వే చేసి మా పేరున ఆన్లైన్ చేయాలని కలకడ తహసీల్దార్ను కోరామన్నారు. స్థానికంగా ఉన్న వీఆర్ఓ, సర్వేయర్, డీటీలు కలిసి మా భూమి మాకు చెందనీయకుండా ఇతరులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టర్కు ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తనకు వైద్యుల సలహా మేరకు రోజుకు 17 గంటలు ఆక్సిజన్ను సిలిండర్ ద్వారా తీసుకోవాల్సి ఉందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నాకు భార్య పిల్లలు కూలి పనిచేసి వైద్యం అందిస్తున్నారన్నారు. అనారోగ్యంతో ఉన్న నేను నా భార్యతో కలిసి స్థానిక రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా వారి నుంచి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితిలో కలెక్టర్కు సమస్యను విన్నవించుకోవడానికి వచ్చినట్లు శంకరయ్య తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్తో కలెక్టరేట్కు వచ్చిన బాధితుడు -
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : సమస్యలపై అర్జీలు అందించే వారికి అండగా నిలిచి చట్టపరిధిలో వాటిని పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను ఎస్పీ స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులకు వేధింపులు, భూ ఆస్తి వివాదాలు తదితర సమస్యల గురించి ఫిర్యాదుదారులు విన్నవించుకున్నారు. వీటిపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు. ఒంటిమిట్ట రామయ్యకు రూ.10లక్షల ఆదాయం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి నెలవారి హుండీ ఆదాయం సోమవారం టీటీడీ అధికారులు లెక్కించారు. జూలై 18 నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా 10 లక్షల, 23 వేల, 681 రూపాయల నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వైభవంగా పల్లకీసేవ రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడుకి భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి ఆలయంలోని మూల విరాట్లకు అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. మాఢవీధిలో, ఆలయ ఆవరణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్యస్వామి,శేఖర్ స్వామి, రాచరాయ యోగీ స్వామి, భక్తులు పాల్గొన్నారు. పింఛా ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సుండుపల్లె : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పింఛా ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరదనీరు వచ్చింది. ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ఈనేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. సోమవారం సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్తో కలిసి జిల్లా కలెక్టర్ పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. పింఛా ప్రాజెక్టు కెపాసిటీ 327.60 ఎంసీఎఫ్టీలకు చేరుకుందన్నారు. ప్రాజెక్టు నుంచి కిందకు నీటిని విడుదల చేయడంతో కుడికాలువ ఆయకట్టు ద్వారా 2,211 ఎకరాలకు, ఎడమ కాలువ ఆయకట్టు ద్వారా 1,562 ఎకరాలకు మొత్తం 3,773 ఎకరాలకు సాగు, తాగునీటి అవసరాలకు నీటిని అందించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అదే విధంగా ప్రాజెక్టు దిగువున ఉన్న గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ వెంకట్రామయ్య, డీఈ చెంగల్రాయులు, తహసీల్దార్ మెహబూబ్చాంద్, నీటిపారుదల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని కేశలింగాయపల్లెకు సమీపంలో రోడ్డు నిర్మాణంలో భాగంగా తవ్విన కల్వర్టు గుంతలో పడి స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గుగ్గిళ్ల జగదీష్ (18) అనే యువకుడు మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఏడుగురు 20 ఏళ్లలోపు యువకులు మండలంలోని గంజికుంటలో ఓ వివాహ వేడుక సందర్భంగా డీజే ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్నారు. శనివారం రాత్రి కాలనీ నుంచి రెండ బైకుల్లో గంజికుంటకు వెళ్లారు. రాత్రి 12 గంటల తర్వాత గంజికుంట నుంచి వారు తిరిగి వస్తుండగా కేశలింగాయపల్లె సమీపంలో మైదుకూరు – తాడిచర్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తవ్విన కల్వర్టు గుంతలో నలుగురు ప్రయాణిస్తున్న బైక్ పడిపోయింది. బైక్పై ఉన్న ముగ్గురికి స్వల్పగాయాలు కాగా జగదీష్ తలకు తీవ్ర గాయమైంది. అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. -
మహిళల ఉచిత ప్రయాణానికి 8400 బస్సులు
పీలేరురూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలలో సీ్త్ర శక్తి పథకంలో భాగంగా 8400 బస్సు సర్వీసులు మహిళ ఉచిత ప్రయాణానికి నడుపుతున్నట్లు విజయవాడ ఆర్టీసీ మెకానికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి. చెంగల్రెడ్డి అన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా పీలేరులోని ఆర్టీసీ గ్యారేజ్లో బస్సుల కండీషన్ను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నరు. ఈ కార్యక్రమంలో డీఎం బి. నిర్మల, సీఐ ధనుంజయలు, గ్యారేజ్ ఎంఎఫ్ హరినాథరెడ్డి, బస్టేషన్ మేనేజర్ బాబునాయక్, రెడ్డెప్ప, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఆర్టీసీ ఈడీ టి. చెంగల్రెడ్డి -
అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ
మదనపల్లె రూరల్ : పశ్చిమబెంగాల్వాసి అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు రైల్వే సీఐ అశోక్కుమార్ తెలిపారు. ఆదివారం పశ్చిమబెంగాల్వాసి ఖదీర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉపాధికోసం పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్ ఇమామ్నగర్కు చెందిన ఎస్.కే.మైముల్ కుమారుడు ఎస్.కే.ఖదీర్(30) మదనపల్లెకు వచ్చి రోడ్డు, భవననిర్మాణ పనులు చేస్తూ కురబలకోట మండలం రైల్వేబ్రిడ్జి సమీపంలో షెడ్ నిర్మించుకుని మరో ఇద్దరితో కలిసి ఉంటున్నాడు. నెలరోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈనెల 15 శుక్రవారం తనకు పరిచయస్తుడైన ఆటోడ్రైవర్తో కలిసి ఇంటి నుంచి వెళ్లాడు. శనివారం మదనపల్లె మండలం సీటీఎం రైల్వే అండర్బ్రిడ్జి సమీపంలో శవమై కనిపించాడు. ఆటోడ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసు విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. రూ. 85 వేలు పలికిన గణేష్ లడ్డూపీలేరురూరల్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక ప్రియదర్శిని కళాశాలలో గణేష్ లడ్డూకు వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గణేష్ సెంటర్ల నుంచి పోటీ పడి హెచ్చుపాట ద్వారా శ్రీ సాయి వీజీపీ పెయింట్స్ అండ్ ఎలక్ట్రికల్స్ యజమానులు పురుషోత్తంరెడ్డి, గుణశేఖర్రెడ్డి, రెడ్డిశేఖర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి మిత్రబృందం గణేష్ లడ్డూను రూ. 85 వేలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మోహన్రెడ్డి, శ్రీధర్, రమణ, సుధాకర్, సుదర్శన్రెడ్డి, దినకర్, నవీన్కుమార్, కృపాల్బాబు మాట్లాడుతూ ఈ నెల 27న గణేష్ విగ్రహాలు నెలకొల్పి అనంతరం 31న ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సౌదీ అరేబియాలో కుమార్లకాల్వ వాసి మృతి చక్రాయపేట : జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన చక్రాయపేట మండలం కుమార్లకాల్వకు చెందిన షేక్ నూర్బాషా(38) మృతి చెందాడు. ఆదివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12–30 గంటలకు మృతి చెందినట్లు అక్కడ ఉన్న అతని మిత్రులు కుటుంబీకులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి నూర్బాషా బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇతను బతుకు దెరువు నిమిత్తం 15 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని దమామ్కు వెళ్లాడు. ఐదు నెలల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చి భార్యా బిడ్డలు, బంధుమిత్రులతో హాయిగా గడిపి తిరిగి దమామ్ వెళ్లాడు. ఆదివారం విధులకు హాజరయ్యేందుకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూమ్లోకి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. బాత్రూం నుంచి ఎంత సేపటికి రాకపోవడంతో మిత్రులు వెళ్లి చూడగా కిందపడి మృతిచెంది ఉన్నాడు. ఈ విషయాన్ని నూర్బాషా మిత్రులు కుమార్లకాల్వలోని కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. విషయం తెలియగానే వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య గౌసియా, ఆర్షియా, రియాజ్, రిజ్వాన్ అనే 10 సంవత్సరాల లోపు పిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. -
మట్టితో మనుగడ.. మార్పుతో కదలిరా..
మదనపల్లె సిటీ : వినాయచవితి వచ్చేస్తోంది. నవరాత్రులు అధ్యాత్మిక వైభవాన్ని చాటుతాయి. అయితే అత్యధికులు పర్యావరణ హితాన్ని విస్మరిస్తున్నారు. పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) ప్రతిమలనే ప్రతిష్టిస్తున్నారు. కొందరు మాత్రం ప్రకృతి ప్రేమికులుగా ప్రత్యేకత చాటుతున్నారు. మట్టి, చింతపిక్కల పొడి, గోమయం, ప్రతిమలు రూపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెల 27న వినాయచవితిని పురస్కరించుకుని ఇటు వైపు అడుగేయాల్సిన ఆవశ్యకత ఉంది. తొలి పూజ అందుకునే గణేశుడిని మట్టితో తీర్చిదిద్దినా. ఏ ఆకృతిలో కొలిచినా ఆలకిస్తారని గుర్తించాలి. జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు అంచనా. వీటిలో అతి తక్కువగా పర్యావరణహి హితమైనవే ఉంటున్నాయి. చిన్న మట్టి ప్రతిమలను ఇంటింటా స్వచ్ఛందంగా పంపిణీ చేస్తున్నారు. పీవీపీతో నష్టాలు తెలుసుకో.. పీవోపీ ప్రతిమలు నీటిలో కరగవు. ముడిపదార్థాలు, రంగుల్లో వాడే రసాయనాలు ముప్పుగా మారుతాయి. నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. చేపలు, ఇతర జలచరాలు హాని కలిగిస్తాయి. మానవ నాడీ వ్యవస్థ, ఊపరితిత్తులు, కిడ్నీలపై ద్రుష్పభావాన్ని చూపుతాయి. చర్యవ్యాధులు, ప్రమాదకర క్యాన్సర్లకు దారి తీస్తుంది. కృత్రిమ రంగులతో బురదలో మేలు చేసే క్రిములు చనిపోతాయి. ముందు నుంచే కార్యాచరణ ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ మండలి ముందు నుంచి ప్రేరణ కల్పించాలి. మట్టిప్రతిమల తయారీదారులను ప్రోత్సహించాలి. విస్తృతంగా అవగాహన సదస్సులు,సమావేశాలు నిర్వహించి చైతన్యం తేవాలి. పెద్ద విగ్రహాల తయారీకి తర్ఫీదు ఇవ్వాలి. పదేళ్లుగా మట్టి గణపతి ప్రతిమలు పంపిణి మదనపల్లె పట్టణానికి చెందిన హెల్పింగ్ మైండ్స్ సంస్థ 2016 నుంచి ప్రతి ఏటా మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా పండుగకు ముందుగానే పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. అందరికీ ఉచితంగా వినాయకుని ప్రతిమలతో పాటు వివిధరకాల మొక్కలు అందించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల జరిగే పర్యావరణ కాలుష్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు. సేదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. మదనపల్లెకు చెందిన సేదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పఠాన్ ఖాదర్ఖాన్ ఏటా వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుని ప్రతిమలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రతిమలతో పాటు పూజాసామగ్రి(పత్రి) కూడా అందిస్తున్నారు. మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమల వల్ల పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో తయారు చేసిన ప్రతిమల వలన జరుగు అనర్థాలు , పర్యావరణ కాలుష్యం గురించి వివరిస్తున్నారు. అలాగే పట్టణంలోని సుబ్బారెడ్డి లేఅవుట్కు చెందిన శ్రీ సత్యసాయి ధ్యానమండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుని ప్రతిమలను అందిస్తున్నారు.పర్యావరణ హిత ప్రతిమల వైపు దృష్టి అవశ్యం సంకల్పంతో సాధ్యమే పర్యావరణ హితమైన మట్టి ప్రతిమల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సంకల్పించుకోవాలి. నేల,నీటి కాలుష్యానికి కారణమయ్యే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు అవగాహన కల్పించాలి. – మోహన్వల్లి, అధ్యాపకులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, మదనపల్లెపర్యావరణ పరిరక్షణే ధ్యేయం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏటా వినాయక చవితి సందర్భంగా మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమలను ప్రజలకు అందిస్తున్నాం. ప్లాస్టర్ఆఫ్ ప్యారీస్తో తయారు చేసే వినాయకుని విగ్రహాలు, ప్రతిమలు హానికరమైన రసాయనాలు కలిగి ఉండటం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పండుగ సందర్భంగా ప్రతిమలతో పాటు వివిధ రకాల మొక్కలను కూడా పంపిణీ చేస్తున్నాం. – అబూబకర్ సిద్దీఖ్, హెల్పింగ్మైండ్స్ వ్యవస్థాపకులు, మదనపల్లె -
రూ.3కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు యత్నం
● కమ్యూనిటీ పర్పస్ స్థలంలో కంచె నిర్మాణం ● అడ్డుకున్న స్థానికులు, పంచాయతీ సిబ్బందిమదనపల్లె రూరల్ : మదనపల్లె–తిరుపతి మెయిన్రోడ్డుకు ఆనుకుని తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్ రోడ్నెం.4లో రూ.3 కోట్ల విలువైన పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ఆదివారం కొందరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. జేసీబీతో స్థలాన్ని చదును చేసి చుట్టూ కంచె వేసేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పంచాయతీ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆక్రమణ యత్నాన్ని అడ్డుకున్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ రవి మాట్లాడుతూ.. బసినికొండ రెవెన్యూ గ్రామం సర్వేనెం.88, 89, 91లో 23 ఎకరాల 69 సెంట్లు భూమిని దేవతానగర్ పేరుతో లేఔట్ వేసి విక్రయించారన్నారు. లేఔట్కు సంబంధించి కమ్యూనిటీ పర్పస్ కోసం కొంత స్థలాన్ని పంచాయతీకి రాసివ్వడం జరిగిందన్నారు. కొంతకాలం తర్వాత కమ్యూనిటీ పర్పస్ స్థలంలో నిర్మాణాలు, ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తుండటంతో కోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. అప్పటి నుంచీ ఇప్పటివరకు స్థలం ఖాళీగానే ఉందని, అయితే ఆదివారం ఉదయం స్థలాన్ని చదునుచేసి కంచె వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు తెలపడంతో అడ్డుకున్నామన్నారు. డీఎల్పీఓ, ఎంపీడీఓకు సమాచారం తెలిపామని, కోర్టుకు సంబంధించిన ఆర్డర్ను వారికి చూపించి వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని ఆక్రమణదారులకు సూచించారు. ఆక్రమణకు యత్నించిన దేవతా మురళీకృష్ణ మాట్లాడుతూ...దేవతానగర్ లేఔట్ స్థలం మొత్తం తమ కుటుంబానికి చెందిందని, అప్పట్లో పంచాయతీ అధికారులకు స్థలం రాసిఇస్తే వారు తీసుకోలేదన్నారు. తర్వాత స్థలాన్ని తాము ఇతరులకు అమ్మివేసినట్లు చెప్పారు.దీనిపై కొంత వివాదం జరగడంతో 2011లో కోర్టుకు వెళ్లామన్నారు. 14 ఏళ్ల తర్వాత 2025 జూలై 29న కేసు కొట్టివేస్తూ తీర్పు రావడంతో తమ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. అయితే వివాదాస్పద స్థలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం, చీటింగ్కు సంబంధించి పోలీసులు నమోదుచేసిన క్రిమినల్ కేసును మాత్రమే కొట్టివేయడం జరిగిందని, స్థలంకు సంబంధించి కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొనలేదని పంచాయతీ సెక్రటరీ రవి తెలిపారు. పంచాయతీకి కేటాయించిన స్థలం మెయిన్రోడ్కు ఆనుకుని ఉండటం, బహిరంగ మార్కెట్లో రూ.3 కోట్లకు పైగానే ధర పలుకుతుండటంతో ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, జిల్లా పంచాయతీ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తట్టివారిపల్లె మాజీ సర్పంచ్, ఎంపీటీసీ తట్టి శారదమ్మ, నాగరాజరెడ్డి, స్థానికులు కోరారు. -
పూర్వ విద్యార్థుల కలయిక
తంబళ్లపల్లె : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1974–75 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వపు విద్యార్థులు 50 ఏళ్ల తరువాత కలుసుకోవడం విశేషం. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. నాటి విద్యార్థులు సుమారు 34 మంది హాజరయ్యారు. అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ గత స్మృతులు నెమరువేసుకున్నారు. నాటి గురువులను స్మరించుకున్నారు. మృతి చెందిన గురువులు, సహచర విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం వహించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డు జిల్లా జడ్జి క్రిష్ణప్ప, ఆడిటర్ చంద్ర, మల్లికార్జున గ్రూపు థియేటర్ యజమాని కుళాయిరెడ్డి, మెడికల్షాపు సుధాకర్, మానవత సంస్థ నారాయణరెడ్డి, శంకర్, నలంద రామచంద్రారెడ్డి, క్రిష్ణారెడ్డి, పీజె వెంకటరమణారెడ్డి, పోస్టు రామచంద్రారెడ్డి, దీనదయాల్, గంగుల్రెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిలో చోరీ
గాలివీడు : మండల కేంద్రమైన గాలివీడులోని గౌతమ్ స్కూలు సమీపంలో శనివారం రాత్రి ఓ ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు బీగాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆటో డ్రైవర్ ఎం.మల్లయ్య శనివారం తన అత్తగారింటికి వెళ్లడంతో గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలో ఉన్న రూ. 3 లక్షల నగదు, 12 తులాల బంగారు నగలను అపహరించినట్లు బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. దొంగతనం చేసిన నగదు, బంగారు ఆభరణాల రశీదుల వివరాలను స్టేషన్లో సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండల ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టరాదని, బ్యాంకు లాకర్లో భద్ర పరుచుకోవాలన్నారు. అలాగే ఊర్లకు వెళ్లే సమయంలో సమాచారం పోలీసు స్టేషన్లో తెలియజేస్తే ఆ ఇంటిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రస్తుతం జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నారు. రామాలయంలో చోరీ మండల పరిఽధిలోని నూలివీడు గ్రామం బోడసానివాండ్లపల్లెలో నూతనంగా ప్రారంభించిన రామాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రూ. 50 వేలు విలువ కలిగిన వెండి ఆభరణాలను దొంగిలించారు. స్థానికులు ఆదివారం ఆలయానికి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్లు తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.రూ. 3 లక్షల నగదు, 12 తులాల బంగారు నగల అపహరణ -
రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించిన ఘటన శనివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం పంచాయతీ నేతాజీకాలనీకి చెందిన నజీర్ఖాన్ (40) రైల్వేక్వార్టర్స్కు చెందిన అమరనాథ్ (38) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వచ్చారు. తిరిగి రాత్రి సీటీఎంకు వెళుతుండగా మార్గమధ్యలో శానిటోరియం వద్ద వేగంగా వెళ్లి ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొని, పక్కనే వస్తున్న కారుపై పడ్డారు. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను తిరుపతికి రెఫర్ చేశారు. -
విష జ్వరంతో విద్యార్థి మృతి
వేంపల్లె : వేంపల్లె పట్టణం శ్రీరాం నగర్ వీధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి బింగి రఘువరన్ ఆదివారం సాయంత్రం విష జ్వరంతో మృతి చెందాడు. కళాశాల రోడ్డులోని శ్రీరామ్నగర్లో నివాసముంటున్న బింగి ఓబులేసు, భారతిలకు ఇద్దరు పిల్లలు ఉండగా, రఘువరన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం విద్యార్థికి జ్వరం రావడంతో వేంపల్లెలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చూపించినట్లు తండ్రి ఓబులేసు తెలిపారు. రఘువరన్కు జ్వరం తగ్గకపోవడంతో కడప రిమ్స్కు తరలించి చికిత్స చేసి మెదడుకు జ్వరం సోకినట్లు వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్, రుయాకు తీసుకెళ్లారు. అయితే స్విమ్స్, రూయాలో బెడ్లు లేకపోవడంతో తిరిగి కడప రిమ్స్కు తీసుకొచ్చి రఘువరన్కు చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీరామ్నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కోళ్లబైలులో ఆక్రమణల తొలగింపు
మదనపల్లె రూరల్ : కోళ్లబైలులో కబ్జాల జోరు శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. కోళ్లబైలు పంచాయతీ శేషాచలనగర్లో అక్రమంగా వేసిన పునాదులు, నిర్మాణాలను కూల్చివేశారు. స్థానికంగా ఇంటి నిర్మాణాలు జరుపుతున్న వారిని తమ పట్టాలు తీసుకుని ఆదివారం తహసీల్దార్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. దీంతో సుమారు 15మందికి పైగా తమ పట్టాలను తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. 2008లో చేనేత కార్మికులమైన తమకు రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేశారని, అయితే..అధికారులు కేటాయించిన స్థలం కొండలు, గుట్టలు కావడంతో ఆర్థిక ఇబ్బందులతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయామన్నారు. ప్రస్తుతం నిర్మాణాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి లబ్దిదారుల నుంచి పట్టాలు, ఆధార్, రేషన్కార్డు జిరాక్స్లు తీసుకున్నారు. రెవెన్యూ సిబ్బందితో పట్టాలు, లబ్దిదారుల అర్హతను పరిశీలిస్తామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులై ఉంటే, తదుపరి నిర్ణయం తెలుపుతామన్నారు. అప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని వారికి సూచించారు.ఇంటి పట్టాలపై తహసీల్దార్ విచారణ -
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం పోరాడదాం
ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఒంటిమిట్ట: భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం కోసం పోరాడాలని ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తన స్వగృహంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..5 రోజుల క్రితం ఒంటిమిట్ట మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో నన్ను గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరూ, భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇంత కంటే దీటుగా పోరాడి వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలన్నారు. ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్రాజు, పచ్చ ముసుగు వేసుకుని విధులు నిర్వహించిన అధికార యంత్రాంగం అందరూ వైఎస్సార్సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగారన్నారు. నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. మొదటి సారిగా ఒంటిమిట్ట మండలంలో హింసాత్మక వాతావరణం నెలకొన్న ఎన్నికలను మండల ప్రజలు చూశారన్నారు. ఈ హింసాత్మక ఎన్నికలతో ప్రజల్లో వైఎస్సార్సీపీపై సానుభూతి పెరిగి, వచ్చే ఏ ఎన్నికల్లోనైనా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కూండ్ల ఓబుల్ రెడ్డి, దున్నూతల లక్ష్మీనారాయణరెడ్డి, మేరువ శివనారాయణ, శేఖర్ రెడ్డి, రాజమోహన్ నాయుడు, రాజశేఖర్రాయల్, గురుమోహన్ రాజు, మనోహర్ రెడ్డి, వెంకట కృష్ణ రెడ్డి, గంగిరెడ్డి, రవిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, పాండురంగారెడ్డి, అబ్బిరెడ్డి, జాకీర్ హుసేన్, శేషారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
హోదా మరిచారు!
కడప సెవెన్రోడ్స్: పంద్రాగస్టు రోజు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధికారుల మధ్య తలెత్తిన వివాదం ఇంకా సమసిపోలేదు. ఇరువర్గాలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాలని రెవెన్యూ అధికారులు పట్టుబడుతున్నారు. ఈ మొత్తం వివాదానికి కారణమైన ప్రొటోకాల్ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ప్రొటోకాల్ లేని టీడీపీ నేతలకు ప్రభుత్వ కార్యక్రమాలు, జిల్లా సమీక్షా కమిటీ లాంటి ముఖ్యమైన సమావేశాల్లో పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే భర్త ప్రభుత్వ హోదానా! తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి ఎటువంటి ప్రభుత్వ హోదా లేదు. ఆయనేం ప్రజాప్రతినిధి కాదు. అయినా ‘ఎమ్మెల్యే భర్త’గా డీఆర్సీ సహా ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదికపై దర్శనమిస్తుంటారు. అంతటితో ఆగకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రభుత్వ వేదికల నుంచి రాజకీయ విమర్శలు గుప్పించినా కలెక్టర్ సహా ఏ అధికారి అడ్డు చెప్పలేదు. పలుమార్లు ఈ విషయాలు పత్రికల్లో ప్రచురితమైనా అధికారులు స్పందించలేదు. ఇప్పుడు తమవంతు వచ్చేసరికి ప్రొటోకాల్ గురించి మాట్లాడితే దాని విలువ ఏముంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎద్దుల ఈశ్వర్రెడ్డి ప్రస్తావన ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఓమారు ఎమ్మెల్సీగా, నాలుగు పర్యాయాలు కడప లోక్సభ సభ్యునిగా ప్రజలకు విశేష సేవలు అందించిన కమ్యూనిస్టు నాయకుడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏదైనా ప్రజా సమస్యలపై కలెక్టర్ వద్దకు వచ్చినపుడు తొలుత చీటీ రాసి పంపించేవారట. ‘నేరుగా వెళ్లండి సార్...’ అంటూ అధికారులు చెప్పినా సున్నితంగా తిరస్కరించేవారు. కలెక్టర్ అనుమతి వచ్చాకే చాంబర్లోకి వెళ్లి సమస్యను విన్నవించేవారు. ఆయన హూందాతనం గురించి ఈ సందర్బంగా పలువురు సీనియర్ ఉద్యోగులు, నగర పౌరులు చర్చించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు తొలుత ప్రొటోకాల్ క్రమాన్ని తెలుసుకుని హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారిక సమీక్షలో సైతం పచ్చ నేతలకు పెద్ద పీట వేస్తుంటే.. విధులు పక్కనబెట్టి ‘నిధుల’ కోసం పాకులాడుతుంటే.. ఇక ‘హోదా’ ఏముంటుంది.. నేతలు చెప్పినదానికల్లా తలాడిస్తుంటే... నిత్యం వారి చెప్పుచేతల్లో బందీలయితే.. ‘కుర్చీ’ల రగడే జరుగుతుంది.. ప్రజాప్రతినిధులా ‘బాధ్యత’ లేకుండా ప్రవర్తిస్తున్నారు.. అధికారులా విధి నిర్వహణను మానేశారు.. ‘ఇద్దరూ’ కలిసి హోదాని.. హూందాతనాన్ని గోదాట్లో కలిపారు.. రెవెన్యూ తీరు వల్లే కడప ఎమ్మెల్యే కుర్చీ రగడ -
ఉమ్మడి కడప జిల్లాలో గుబులు
కువైట్లో నాటుసారా మృతులు..రాజంపేట: కువైట్లో చోటుచేసుకున్న కల్తీమద్యం/నాటుసారా దుర్ఘటనలు ఉమ్మడి కడప జిల్లాలోని గల్ఫ్ కుటుంబీకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అక్కడ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ఇక్కడి వారి కుటుంబాల్లో ఆందోళన కూడా పెరుగుతోంది. వీరిలో తెలుగువారు ఉన్నారని, పైగా.. కడపకు చెందిన వారు నలుగురు ఉన్నారనే వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి. వివరాలివీ.. ● ఉమ్మడి కడప జిల్లాలోని కడప, రాజంపేట, రాయచోటి, బద్వేలు, రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలో అనేకమంది కువైట్లో వివిధ రకాల చిన్నాచితక పనులకు వెళ్లారు. ఇలా అప్పులు చేసుకు వెళ్లిన పేదవర్గాలను అక్కడి నాటుసారా తయారీ ముఠా సభ్యులు ఆకట్టుకుని, కొద్దికాలంలోనే అప్పులు తీర్చుకోవచ్చని ఆశచూపి, వారిని బరిలోకి దింపుతున్నారు. కువైట్లో మద్యం లభ్యంకాదు కాబట్టి అక్కడ అక్రమంగా నాటుసారాతో పాటు నకిలీ మద్యం వీరి ద్వారా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అహమది, ఫెహల్, మంగాఫ్ ప్రాంతాల్లోని ప్రైవేటు అపార్టుమెంట్లలో రహస్యంగా నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్నాయని కువైట్ పోలీసులు గుర్తించి ఇటీవల వాటిపై దాడులు చేసి బట్టీలు ధ్వంసం చేశారు. నిర్వాహకులను అరెస్టుచేశారు. ఇలా అక్కడ నాటుసారా వ్యాపారం చేస్తున్న వారిలో రాజంపేట, రైల్వేకోడూరుకు చెందిన కొంతమంది ఉన్నారని తెలిసింది. 23 మంది మృతి.. మరోవైపు.. అక్కడ మిథనాల్–కలుషిత ఆల్కహాల్ సేవించి పలువురు మృత్యువాత పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దుర్ఘటనలో 23 మంది మరణించారు. వీరిలో ఆసియా దేశాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. తెలుగువారి వివరాలు అధికారికంగా వెలువడలేదు. కానీ, మృతుల్లో.. చికిత్స పొందుతున్న వారిలో ఉమ్మడి కడప జిల్లా వారున్నారని వస్తున్న వార్తలు ఇక్కడి వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అక్కడ నాటుసారా తాగే వారిలో మనవారున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే, కల్తీ మద్యం బారినపడి కొంతమంది కంటిచూపు కోల్పోయారని.. మరికొందరు పక్షవాతానికి గురైయ్యారని.. ఇంకొందరి కిడ్నీలు పాడైనట్లు వస్తున్న వార్తలు వీరిని మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. 23 మంది మృత్యువాత మృతుల్లో నలుగురుకడప వాసులు ఉన్నట్లు ప్రచారం -
వైఎస్ జగన్ పర్యటన ఖరారు!
రాజంపేట: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19న రాజంపేట మండలం ఆకేపాడు రానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయిందని రాజంపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆకేపాటి అనిల్కుమార్రెడ్డి ఆదివారం విలేకర్లకు తెలిపారు.రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆకేపాటి సాయిఅనురాగ్రెడ్డి, వరదీక్షితా నవదంపతుల రిసెప్షన్కు వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేసి, నవదంపతులను ఆయన ఆశీర్వదించనున్నారన్నారు. ఆకేపాటి ఎస్టేట్లో రిసెప్షన్ వేడుక జరగుతుందని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రాజంపేటకు హెలీక్యాప్టర్లో వస్తారన్నారు. ఇందుకోస హెలీప్యాడ్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఉదయం పది గంటలకు బయలుదేరుతారన్నారు. తిరిగి ఆకేపాడు ఎస్టేట్ నుంచి 12.35 గంటలకు బయలుదేరి బెంగళూరుకు వెళతారన్నారు. వైఎస్జగన్మోహన్రెడ్డి వస్తున్న తరుణంలో భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని,, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆకేపాటి అనిల్రెడ్డి తెలిపారు. పర్యటన వివరాలు.. ఉదయం 10గంటలకు బెంగళూరులోని యలహంక నుంచి బయలుదేరుతారు. రోడ్డుమార్గంలో 10.20కి చేరుకుంటారు, 10.30గంటలకు జక్కురు ఎయిర్డ్రోమ్ నుంచి హెలీక్యాప్టర్లో బయలుదేరుతారు. 11.30గంటలకు ఆకేపాడులోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో 11.40గంటలకు ఆకేపాటి ఎస్టేట్కు చేరుకుంటారు. 12 గంటల నుంచి 12.15 వరకు ఆకేపాటి ఎస్టేట్లో ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్రెడ్డి తనయుడు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొంటారు. 12.25కు హెలీప్యాడ్కు చేరుకుంటారు. 12.35కు జక్కూరు ఎయిర్డ్రోమ్ బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.40 గంటలకు బయలుదేరి 2గంటలకు యలహంకలోని రెసిడెన్సీకి చేరుకుంటారు. 19న ఆకేపాడుకు రాక షెడ్యూల్ వివరాలు వెల్లడి -
మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 5.30 గంటలకు, 6.30 గంటలకు మదనపల్లె డిపో నుంచి బయలుదేరి మల్లయ్యకొండకు చేరుతుందన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసు నడుస్తుందన్నారు. భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. రాజంపేట టౌన్: హిందీ ప్రచారసభ హైదరాబాద్ వారు నిర్వహించే ప్రథమ, మధ్యమ, ఉత్తమ, విశారత్, భూషణ్, విద్వాన్ పరీక్షలకు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రేమ్చంద్ హిందీ భవన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.సర్తాజ్ హుస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోతరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులన్నారు. సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో పరీక్షలు ఉంటాయన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు హిందీపండింట్ ట్రైనింగ్ చేసేందుకు, డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారన్నారు. మరిన్ని వివరాలకు 6303701314 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 18వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని పేర్కొన్నారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భక్తుల అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. మరికొందరు తలనీలాలు సమర్పించారు. హిందువులతోపాటు ముస్లీమ్లు ఫూజలు నిర్వహించారు. కర్ణాటకా, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో సోమవారం మొదటి సంవత్సరం నూతన బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చాన్స్లర్ నాదెళ్ల విజయ భాస్కర్ చౌదరి తెలిపారు. ఇందుకు రియా అనే హ్యుమనాయిడ్ రోబో స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. బెంగళూరు నుండి తీసుకొచ్చారు. రోబో గురించి వినడం చదవడం ఆపై సినిమాల్లో చూడటం తప్ప ఈ ప్రాంత వాసులు ప్రత్యక్షంగా చూడడం ఇదే తొలిసారి. విద్యార్థులకు స్వాగతం పలకడంతో పాటు ముఖా ముఖి నిర్వహించనుంది. అతిథిగా అలరించనుంది. విద్యార్థులతో ఇది ప్రత్యక్ష ఇంటరాక్ట్ చేయనుంది. మిట్స్ క్యాంపస్లో నూతన ఉత్సాహాన్ని ఇనుమడింపజేయనుంది. 19న ప్రేరణాత్మక వక్తి యండమూరి వీరేంద్రనాధ్ హాజరవుతున్నట్లు తెలిపారు. -
కోళ్లబైలులో కబ్జాల జోరు
● ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు ● ఆక్రమిత స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నాయకులు ● అధికారంలో ఉన్నది మేమే... మీకేమీ కాదంటూ భరోసా ● నిజమని నమ్మి మోసపోతున్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు మదనపల్లె రూరల్ : కోళ్లబైలు. పేరుకు పంచాయతీ అయినప్పటికీ, పట్టణానికి ఆనుకుని ఉండటం, చుట్టుపక్కల కొండలు, గుట్టలు...కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాలు ఉండటంతో... అటు కబ్జాకోరులకు, ఇటు రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా...కోళ్లబైలు ఆక్రమణలను అరికట్టిన దాఖలాలు లేవు. ఎవరికి వారు సొసైటీలు, కులసంఘాలు, కమ్యూనిటీ భవనాలు, గుడుల పేరుతో కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేసి, రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని యథేచ్ఛగా విక్రయించుకుంటున్నారు. పట్టణంలో భూముల ధరలు అమాంతం పెరిగిన నేపథ్యంలో.. మధ్యతరగతి, చేనేత వర్గాలకు చెందిన అమాయకులు తక్కువ ధరకు వస్తున్నాయని ఆశతో, దళారుల మాయమాటలు నమ్మి మోసపోయి స్థలాలను లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. తాము అమ్మే స్థలాలకు దొంగ పట్టా సృష్టించి ఇవ్వడంతో పాటు పునాది వేసి ఇల్లు నిర్మాణం జరుపుకుని, కరెంటు మీటరు వచ్చేంతవరకు తమదే పూచీ అంటూ కబ్జారాయుళ్లు భరోసా ఇస్తుండటంతో నిలువునా నమ్మి మోసపోతున్నారు. కోళ్లబైలు పంచాయతీలో సుమారు 2వేలకు పైగా ఇళ్లు నిర్మించి ఉంటే, అందులో అసలైన లబ్ధిదారులు, అర్హులు 1,200 మంది ఉంటే.. మిగిలిన 800 ఇళ్లు బినామీలు, అనర్హులు, అక్రమమార్గంలో దక్కించుకున్నవే ఉన్నాయి. ఇవన్నీ రెవెన్యూ, పంచాయతీ అధికారులకు తెలిసి జరుగుతున్నప్పటికీ, వారు రాజకీయ జోక్యం, డబ్బులకు ఆశపడి తమకెందుకులే అని వదిలేస్తున్నారు. ఎప్పుడైనా మీడియాలోనో, లేక స్థానికంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగి ఆక్రమణల విషయం బయటకు వచ్చినప్పుడు రెండు రోజులు రెవెన్యూ అధికారులు హడావిడి చేసి, ఐదారు పునాదులు జేసీబీతో తొలగించి ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోళ్లబైలు పంచాయతీలో దళారుల దందాలు అధికమయ్యాయి. టీడీపీలో ద్వితీయశ్రేణి నాయకులుగా చెప్పుకుంటున్న నాయకులు కోళ్లబైలును అడ్డాగా చేసుకుని ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు వెళ్లి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే.. అధికార పార్టీ నాయకుడినని బెదిరించడం, ఎమ్మెల్యే నుంచి ఫోన్ చేయించడం చేస్తున్నారు. దీంతో వాళ్లు తమకెందుకులే అని వదిలేసి పోతుంటే, తమ్ముళ్లు దర్జాగా కోటీశ్వరులైపోతున్నారు. ఏడాది క్రితం వరకు టూవీలర్స్లో తిరిగి, అంతంతమాత్రంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు.. 14నెలలకే బొలేరో, ఇన్నోవా వాహనాలతో ఎమ్మెల్యే కాన్వాయ్లో తిరిగే స్థాయికి ఎదిగారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కోళ్లబైలు పంచాయతీకి ర్యెగులర్ వీఆర్వోను నియమించకపోవడంతో ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతున్నాయి. కోళ్లబైలుపై మదనపల్లె సబ్ కలెక్టర్, తహసీల్దార్ ప్రత్యేక దృష్టి సారించి, ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే తప్ప ఆక్రమణలకు అడ్డుకట్ట పడే అవకాశం లేదు. పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే గుట్టలు చదును చేసి, కోళ్లబైలు రూపు రేఖలు మారిపోయే అవకాశం ఉంది. కోళ్లబైలు పంచాయతీ శేషాచల కాలనీలో అక్రమ నిర్మాణాలు, వెలుగుస్కూల్ వెనుక వైపున టీడీపీ నాయకుడు సొసైటీ రామచంద్ర చేసిన అక్రమ నిర్మాణాలు కోళ్లబైలు పంచాయతీ వెలుగు స్కూల్ వెనుక వైపున చేస్తున్న అక్రమ నిర్మాణాలకు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారు. కబ్జాకోరులతో కుమ్మకై ్క ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరుపుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం, కరెంటు మీటర్లు ఇప్పించడం చేస్తున్నారు. 15–20 లక్షల విలువచేసే స్థలాలు కబ్జా అవుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కబ్జాలు చేసిన వారిపైన, సహకరించిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలి. – మురళీ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి. -
పశ్చిమ బెంగాల్ వాసి అనుమానాస్పద మృతి
మదనపల్లె రూరల్ : పశ్చిమ బెంగాల్వాసి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం గ్రామ సచివాలయం సమీపంలోని అంగళ్లు రైల్వే అండర్ బ్రిడ్జిపైన, ట్రాక్కు పక్కగా గుర్తు తెలియని మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, ఘటన జరిగిన ప్రాంతం రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని వెళ్లిపోయారు. దీంతో రైల్వే హెడ్కానిస్టేబుల్ మహబూబ్బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మార్చురీ గదికి తరలించారు. మృతదేహంపై గాయాలు ఉండటం, మృతుడి ఒంటిపై బనియన్, డ్రాయర్ మాత్రమే ఉండటం, మృతదేహం విసిరిపడేసినట్లుగా ఉండటంతో స్థానికులు ఎవరో హత్యచేసి రైల్వే ట్రాక్పై పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి సీటీఎం రైల్వేట్రాక్ వద్ద హత్యకు గురయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మృతుడి ఫోటో చూసి గుర్తుపట్టిన పట్టణానికి చెందిన కాంట్రాక్టర్, జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతుడి వివరాలను తెలియజేశారు. మృతుడు పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్కు చెందిన ముజమ్మిల్ కుమారుడు ఖదీర్(30)గా తెలిపాడు. కొన్నేళ్లుగా ఉపాధిలో భాగంగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో పనిచేస్తుంటాడన్నాడు. కురబలకోట మండలం రైల్వేబ్రిడ్జి సమీపంలో చిన్న రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని, మరో ఇద్దరితో కలిసి ఉంటూ స్థానికంగా రోడ్డు పనులకు వెళ్లేవాడన్నారు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం షెడ్ నుంచి వెళ్లిన ఖదీర్ తిరిగి రాలేదు. సెల్ స్విచ్ ఆఫ్ కావడంతో, అతడితో పాటు ఉంటున్న ఇద్దరు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శనివారం అనుమానాస్పద స్థితిలో ఖదీర్ శవమై కనిపించాడు. కదిరి రైల్వే పోలీస్ హెడ్కానిస్టేబుల్ మహబూబ్బాషా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఖదీర్ మృతికి గల కారణాలు విచారణలో తేలాల్సి ఉంది. -
విష పురుగు కుట్టి రైతు మృతి
సిద్దవటం : రైతు పొలానికి నీరు కట్టేందుకు వెళ్లాడు. వరికి నీరు కడుతుంటే విషపురుగు కుట్టి రైతు మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. సిద్దవటం మండలం వెలుగుపల్లె గ్రామానికి చెందిన రైతు పాజర్ల వెంకటయ్య(45) అలియాస్ పుల్లయ్య శనివారం తన వరి పంటకు నీరు కట్టేందుకు వెళ్లాడు. అక్కడ పొలానికి నీరు కడుతుండగా నీళ్లలో విషపురుగు వెంకటయ్యను కుట్టింది. దీంతో వెంకటయ్య పొలం పక్కనే ఉన్న రైతు వెంగయ్యకు చెప్పడంతో ఆయన వెంకటయ్యను ద్విచక్రవాహనంలో భాకరాపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా వైద్యుడు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లగా కడప రిమ్స్ వైద్యుడు డాక్టర్ దినేష్ పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య వెంకటసుబ్బమ్మ, కూతురు లక్ష్మిదేవి ఉన్నారు. మృతుని భార్య వెంకటసుబ్బమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తెలిపారు. -
నూతన నియామకం
కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన వారిని పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శులుగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తంబళ్లపల్లెకు చెందిన కుమార్నాయుడు, పీలేరుకు చెందిన బి.రవికుమార్రెడ్డి, జె.రాజగోపాల్రెడ్డిలను నియమించారు. నందలూరు: నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ అరవపల్లెలోని శ్రీ కృష్ణ గీతా మందిరం వద్ద శనివారం ఉదయం కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణుని కల్యాణం వైభవంగా జరిగింది. అనంతరం కల్యాణం లడ్డూ వేలంపాట నిర్వహించగా రూ.3 లక్షలు పలికింది. భారత పురావస్తు శాఖ మాజీ ఉద్యోగి చెంగారి రామాంజనేయులు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నాడు. కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో నూతన నియామకాలు జరిగాయి. ఈ మేరకు చాన్స్లర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి ప్రకటించారు. డాక్టర్ డి. ప్రదీప్కుమార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా, మార్పూరి ప్రతిభ అదనపు రిజి స్ట్రార్, డాక్టర్ సాయికుమార్ కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్గా నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో చాన్స్లర్ ఎన్. ద్వారకనాథ్ పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: వరుస సెలవుల నేపధ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆదివారం రాత్రి తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఆదివారం రాత్రి 9.10 గంటలకు ఈ రైలు (07097) తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట మీదుగా సికింద్రాబాద్కు ఉదయం 10.00 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ఇదే రైలు (07098) సికింద్రాబాదులో సోమవారం సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో తిరుపతికి మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు చేరుతుందన్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని, ప్రయాణకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాయచోటి: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ డాక్టర్ గౌతు లచ్చన్న భావితరాలకు స్ఫూర్తి అని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.దేశంలో సర్దార్ వల్లబాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకై క వ్యక్తి లచ్చన్న అని అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న వీవీ గిరి, నేతాజీ సుబాష్ చంద్రబోస్ తదితర జాతీయ నాయకులతో కలిసి భారతదేశ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని అనేక పర్యాయాలు జైలుకు వెళ్లారన్నారు. గాంధీజీ పిలుపునకు స్పందించి స్వాతంత్య్రోద్యమంలో చేరాడన్నారు. 1930లో మహాత్మగాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారని, దీనికి ప్రభావితుడైన లచ్చన్న బారువా సమీపంలో ఉన్న సముద్రపు నీరుతో ఉప్పు తయారు చేసి విక్రయించగా వచ్చిన డబ్బుతో ఉద్యమాన్ని నడిపారన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ విజె రామకృష్ణ, ఎస్ఐలు ఆర్ఎస్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అద్దె ఇల్లే గతి
కురబలకోట మండలం చేనేత నగర్కు చెందిన కుమారి చేనేత కార్మికురాలు. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు పక్కా గృహం మంజూ రు కాకపోవడంతో ఇంటికోసం దర ఖాస్తు చేసుకుంది. సొంతిల్లు లేని కారణంగా అద్దె ఇంట్లో ఉంటున్న కారణంగా అద్దె భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభు త్వం పక్కా గృహం మంజూరు చేస్తే సొంతింటి కలను సాకారం చేసుకుంటానని చెబుతోంది కుమారి. ప్రభు త్వం ఇలాంటి పేదల సొంతింటి కలను ఎప్పుడు సాకారం చేస్తుందో. ● ఇళ్ల నిర్మాణాలకు రూ.4 లక్షలుఇస్తామని చంద్రబాబు హమీ ● అధికారంలోకి వచ్చి ఏడాది దాటినాపేదలకు ఎదురుచూపులే.. ● ఇప్పటికే మంజూరు కోసం45,079 దరఖాస్తులు పెండింగ్ -
దివ్యాంగ పింఛనుదారుల కడుపు కొట్టారు !
కురబలకోట : అనర్హత పేరుతో కూటమి ప్రభుత్వం దివ్యాంగ పింఛనుదారుల కడుపుకొట్టింది. అనర్హత వేటు పడటంతో కళ్లలో కన్నీళ్లు.. చేతుల్లో వణుకుతో దివ్యాంగులు అల్లాడిపోతున్నారు. ఇన్నాళ్లు పింఛన్ వస్తుందన్న ధైర్యంతో బతుకు వెళ్లదీశాం. ఇక మాకు దిక్కెవరు దేవుడా..అంటూ పింఛన్లు రద్దయిన దివ్యాంగులు నిట్టూరుస్తున్నారు. ప్రతి సచివాలయం పరిధిలో 20 నుంచి 30 శాతానికి పైగా పింఛన్లు రద్దు చేశారు. రీవెరిఫికేషన్ తర్వాత దివ్యాంగ సర్టిఫికెట్లను సచివాలయాల్లో ఆన్లైన్లో ఉంచారు. వీటిని చూసి పలువురు దివ్యాంగులు షాక్కు గురయ్యారు. 90 శాతం వికలత్వం ఉన్న వారికి 85 లోపు వేశారు. దీంతో వీరికి ఇక నుంచి రూ.15 వేలు పింఛన్ రాదు. వీరికి సాధారణ దివ్యాంగుల్లా రూ.6 వేలు పింఛన్కు మాత్రమే అర్హులు. అదే విధంగా రూ.6 వేలు వచ్చే పింఛన్దారులకు కూడా కోత కోశారు. వికలత్వం 40 శాతం కంటే తక్కువగా ఉందని అనర్హత వేటు వేశారు. విషయం తెలుసుకున్న దివ్యాంగులు షాక్కు గురవుతున్నారు. కుమిలిపోతూ కంటతడి పెడుతున్నారు. వీరికి నోటీసులు జారీ చేస్తున్నారు. అనర్హత వేటుకు గురైన వారు మళ్లీ అప్పీల్ చేసుకోవచ్చని చెబుతున్నారు. మండలంలో 1045 దివ్యాంగ పింఛన్లు ఉన్నాయి. ప్రతి సచివాలయ పరిధిలో పింఛన్లలో అనర్హతకు గురైనవారున్నారు. రీ వెరిఫికేషన్కు మళ్లీ సచివాలయ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటిలో వాళ్లు చూసినా చూడకున్నా పింఛన్ సొమ్ముతో కాలం వెల్లదీసేవారు. అలాంటిది వికలత్వ శాతం తక్కువగా ఉందని అనర్హత వేటు వేయడం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు. ఉన్న ప్రాణానికి ఉపద్రవంలా కూటమి ప్రభుత్వ తీరు మారిందని పలువురు విమర్శిస్తున్నారు. రీ వెరిఫికేషన్ ముసుగులో అనర్హత వేటురూ.15వేలు పింఛన్ కోల్పో యానని వేదన పడుతున్న దివ్యాంగుడు బాబా ఫకృద్దీన్ కూటమి ప్రభుత్వం పింఛన్ సొమ్మును పెంచినట్లు పెంచి రీ వెరిఫికేషన్ పేరుతో అనర్హత వేటు వేయడం విచారకరం. నాకు గతంలో 90 శాతం వికలత్వ సర్టిఫికెట్ ఉండేది. నెలకు రూ.15 వేలు పింఛన్ వచ్చేది. రీ వెరిఫికేషన్లో నాకు 76 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ వచ్చింది. 85 శాతం అంతకు పైగా ఉంటేనే రూ.15 వేలు పింఛన్ వస్తుంది. దీంతో నాకు ఇక నుండి రూ.15 వేలు పింఛన్ రాదు. నెలకు రూ. 6 వేలు మాత్రమే వస్తుంది. ఇది కూటమి ప్రభుత్వ ద్రోహం..కుట్ర. నాకు రెండు కాళ్లు పనిచేయవు. ఉన్న చోటు నుండి కదలలేను. పైగా ఎంబీఏ చదివిన నిరుద్యోగిని. ఎలాంటి పనులు చేసుకోలేను. కనికరం లేకుండా వికలత్వ శాతం తగ్గించి నా కడుపు కొట్టారు. గతంలో 90 శాతం వికలత్వం ఉన్నట్లు ఇచ్చారు. ఇప్పుడు 76 శాతం ఉన్నట్లు ఇచ్చారు. అప్పటి డాక్టర్కు ఇప్పటి డాక్టర్కు తేడా ఏమిటో చంద్రబాబు ప్రభుత్వమే చెప్పాలి. చంద్రబాబుకు ఎవ్వరూ దొరకనట్లు దివ్యాంగులతో పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వానికి మాలాంటి వారి ఉసురు తగలకపోదు. – కె. బాబా ఫకృద్దీన్, బాధిత దివ్యాంగుడు, కురబలకోట -
వీళ్లేమైనా పాలెగాళ్లా !
మదనపల్లె : చట్టాన్ని అతిక్రమించి దాడులకు పాల్పడ్డానికి వీళ్లేమైనా వీరులు, శూరులా.. పాలెగాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు వీరెంత అంటూ తంబళ్లపల్లె టీడీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి.శంకర్యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మదనపల్లెలో దాడికి గురై స్థానిక ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన వర్గీయులు సాగర్కుమార్, నటరాజ నాయక్లను శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు.. దాడి చేసిన వ్యక్తులు ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ ఇంకా ఉన్నాయని హెచ్చరించారని శంకర్ దృష్టికి తేగా 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటివి ప్రోత్సహించలేదని, ఏదైనా చట్ట పరిధిలో చూసుకోవాలని దాడులు చేయడం ఏం సంస్కృతని ప్రశ్నించారు. బాధితులకు చట్టపరంగా న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు బిల్డర్ రమణ, పాలగిరి సిద్దా, నారాయణస్వామిరెడ్డి, ఆనందరెడ్డి, బంగారు వెంకటరమణ, సురేంద్ర యాదవ్, వైజీ రమణ, మైసూర్ శీనా, తెలుగు యువత శ్రీనాథరెడ్డి, సుదర్శన్రెడ్డి ఉన్నారు. -
19న ఆకేపాడుకు వైఎస్ జగన్ రాక
రాజంపేట: రాజంపేట మండలంలోని ఆకేపాడుకు ఈనెల 19న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. ఈనేపథ్యంలో శనివారం హెలీప్యాడ్ ఏర్పాట్లను రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పరిశీలించారు. రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్కుమార్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని నవదంపతులను ఆశీర్వదించనున్నారు. హెలీప్యాడ్ ఏర్పాట్ల పరిశీలన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడి రాకకు సంబంధించి హెలిప్యాడ్ను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పరిశీలించారు. ఆకేపాటి ఎస్టేట్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో హెలీప్యాడ్ను (బాలిరెడ్డిగారిపల్లె సమీపంలో) ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, ఆకేపాటి సోదరులు పాల్గొన్నారు. -
మండలాల వారీగా ఇళ్ల కోసం అందిన దరఖాస్తులు
మదనపల్లె: మేం అధికారంలోకి వస్తే..పేదలు ఇళ్లు నిర్మించుకోవడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీగా ప్రకటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. కోటలు దాటిన మాటలేమో అక్కడే ఉండిపోయాయి. పేదలేమో ఇళ్ల మంజూరు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల కోసం స్థలాలు, పక్కా గృహాల మంజూరుపై ఇంతవరకు పట్టించుకోలేదు, కనీసం సమీక్ష కూడా జరగలేదు. దీంతో జిల్లాకు చెందిన పేదలు తమకు స్థలాలు ఎప్పుడిస్తారు, పక్కా ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారని ఎదురుచూస్తున్నారు. మేమొస్తే అని చెప్పి.. మేమొస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం అని నోటికొచ్చిన హామీలు, మరోవైపు సూపర్ సిక్స్ ఊకదంపుడుతో ప్రజలను నమ్మించిన కూటమి పార్టీలు ఇప్పుడు వాటి అమలుపై తీరికలేకపోయింది. హామీల అమలు కోసం కళ్లు కాయలు కాస్తాయా అన్నంతగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పేదలు ఇళ్ల స్థలాలు, అందులోనూ ఇళ్ల నిర్మాణాల కోసం రూ.4 లక్షల ఆర్థిక సహయం అందించే పథకం కోసం ఆశలు పెట్టుకున్నారు. ఏడాది దాటినా ప్రభుత్వం ఇంతవరకు పేదలకు ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు. జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు 78,221 పక్కా గృహాలను మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. 2024 జూన్ 3 నాటికి 34,906 గృహ నిర్మాణాలను పూర్తి చేయించగా, లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున చెల్లించింది. దీనికోసం బిల్లులు, మెటిరియల్, సిమెంట్ కలిపి రూ.826 కోట్లు ఖర్చు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదు. పైసా ఖర్చు చేయలేదు. జిల్లాలో 45,079 దరఖాస్తులు కొత్తగా ఇళ్ల మంజూరు కోసం గృహ నిర్మాణశాఖ జిల్లాలో పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఏడాదిగా స్వీకరిస్తున్న ఈ దరఖాస్తుల్లో ఇప్పటిదాకా 45,079 అందాయి. ఇందులో జిల్లాలోని 30 మండలాల నుంచి 41,688, నాలుగు పట్టణ ప్రాంతాల నుంచి 3,391 దరఖాస్తులు అందాయి. వీటిపై నివేదికలు సిద్ధం చేశారుకాని ప్రభుత్వం నుంచి మంజూరుకు ఆదేశాలు లేకపోవడంతో నివేదికలు అలాగే మురిగిపోతున్నాయి. పూర్తిస్థాయిలో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తే వీటి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తుండగా ఆదేశాలు అందగానే డీపీఆర్లను తయారు చేసేందుకు ఉపక్రమించనున్నారు. డీపీఆర్ పంపాక వాటికి అనుమతులు వచ్చి నిర్మాణాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రం నిధులతోనే... కొత్తగా పేదల నుంచి అందిన దరఖాస్తులకు కేంద్రమే పక్కా ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలపై ఒక్కపైసా కూడా భారం మోసే పరిస్థితులు కనిపించడం లేదు. దీనితో పేదల ఇళ్ల నిర్మాణాలను పీఎంఏవై కింద మంజూరు చేయించుకుని, కేంద్ర నిధులతో ఇళ్ల నిర్మాణాలు చేయించేలా ప్రభుత్వం చూస్తోంది. దీనివల్ల నిధులన్నీ కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రప్రభుత్వం నుంచి పైసా నిధులు ఇచ్చే అవకాశం లేకుండా చూసుకుంటోంది. నివేదిక సిద్ధం జిల్లాలో కొత్తగా పేదలకు పక్కా ఇళ్ల మంజూరు కోసం నివేదికలు సిద్ధం చేశాం. అర్హులైన పేదల నుంచి పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలైన మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని పేదల నుంచి అందిన దరఖాస్తులను సిద్ధం చేసి ఉంచాం. ప్రభుత్వ ఆదేశాలు అందగానే వాటిని మంజూరు కోసం నివేదిస్తాం. –రమేష్రెడ్డి, ఇన్చార్జ్ పీడీ, రాయచోటి : : : : : : : : : :చిన్నమండ్యం 2,225 గాలివీడు 3,007 కేవిపల్లె 1,087 కలకడ 1,547 పీలేరు 4,133 రామాపురం 964 రాయచోటీ 599 సంబేపల్లె 1,195 చిట్వేలి 917 కోడూర్ 1,064 నందలూర్ 327 ఓబులవారిపల్లె 1,092 పెనగలూర్ 1,103 పుల్లంపేట 816 రాజంపేట 1,070 టి.సుండుపల్లె 2,130 వీరబల్లి 878 బి.కొత్తకోట 1,339 కలికిరి 1,519 కురబలకోట 1,613 మదనపల్లె 1,741 ములకలచెరువు 1,394 నిమ్మనపల్లె 826 పెద్దతిప్పసముద్రం 1,247 పెద్దమండ్యం 816 రామసముద్రం 1,082 రాయచోటి (పట్టణం) 1,372 రాజంపేట (పట్టణం) 422 బి.కొత్తకోట (పట్టణం) 628 మదనపల్లె (పట్టణం) 969 -
ఆరా తరహాలో డీటీఈ ఎర్నింగ్ యాప్క్లోజ్..!
అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసిన మరో కొత్త మోసం కురబలకోట : వీడియో టాస్కులు చూడండి..డబ్బులు సంపాదించండి..స్పిన్ గిఫ్ట్తోపాటు వారానికోసారి మనీ విత్ డ్రా అంటూ ప్రచారంలోకి వచ్చిన ఆరా ఎర్నింగ్ యాప్తో ఇటీవల వేల మంది మోసపోయారు. ఈ మోసాన్ని మరువక మునుపే ఇదే తరహాలో ఉన్న డీటీఈ ఎర్నింగ్ యాప్ క్లోజ్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. మూడు వారాలుగా డబ్బు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించి నిట్టూరుస్తున్నారు. చెప్పుకుంటే సిగ్గు చేటు అన్నట్లుగా బాధితులు గమ్మున ఉంటున్నారు. ఆరా యాప్ బాధితులు కూడా ఇందులో ఉండడం విశేషం. బాధితుల కథనం మేరకు.. ఆరా తరహాలో ఆరునెలల క్రితం డీటీఈ ఎర్నింగ్ యాప్ ప్రచారంలోకి వచ్చింది. రూ. 2 వేలు డిపాజిట్ చెల్లిస్తే డీవన్, రూ.10 వేలు డిపాజిట్ చెల్లిస్తే డీ టు ఇలా డిపాజిట్కు తగ్గట్టుగా ప్లాన్ ప్రకటించారు. డిపాజిట్ చెల్లించి యాడ్స్ చూస్తే అధికంగా డబ్బు వస్తుందని ప్రచారంలోకి వచ్చింది. కొంత కాలం ప్రతి శుక్రవారం విత్ డ్రాల్స్ జరిగాయి. ఆశకుపోయి చాలా మంది చేరారు. అయితే వరుసగా మూడు వారాలుగా విత్ డ్రా కాలేదు. టెక్నికల్ సమస్య అని ఒక వారం, ఆడిట్ జరుగుతోందని ఇంకో వారం నమ్మబలుకుతూ వచ్చారు. ఈ శుక్రవారమైనా వస్తుందని ఆశించారు. తీరా చూస్తే నో డేటా అని యాప్లో కన్పించింది. అంతేకాదు రూ. 1380 అదనంగా చెల్లించి ఈకేవైసీ చేసుకుంటే ఐడీ యాక్టివ్ అవుతుందని మెసేజ్ పెట్టారు. యాప్ పనిచేయకపోవడం ఆపై కొత్త నిబంధనలు పెట్టడం విత్ డ్రాల్స్ను నిలిపి వేయడంతో ఈజీ మనీ ఆశలు ఆవిరయ్యాయి. పైగా యాడ్స్ కూడా ఓపన్ కాలేదు. దీంతో వరుసగా మూడు శుక్రవారాలు డబ్బులు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించి ఆశలు వదిలేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా డీటీఈ యాప్ నిర్వాహకులు ఎక్కడుంటారన్నది ఎవ్వరికీ అంతుబట్టిని విషయం. ఇదో తరహా సైబర్ మోసం. ప్రధాన కార్యాలయం యూఎస్ఏలోని న్యూయార్క్, కొలరాడోలో ఉన్నట్లు యాప్లో సమాచారం పొందుపరిచారు. నిర్వాహకులను ప్రత్యక్షంగా చూసిన వారు గాని మాట్లాడిన వారు గాని లేరు. మెసేజ్ల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండెడ్స్ నైక్, అడిడాస్, వెర్సాస్, డిఫ్టిక్, బోస్, టయోటా లాంటి కంపెనీలతో కూడిన యాడ్స్ పెట్టారు. నిర్ణీత డిపాజిట్టు చెల్లించి యాడ్స్ చూడడం వల్ల డబ్బు వస్తుందని ఆశ పడ్డారు. చివరకు నిరాశను మిగిల్చింది. మోసపోతారు..జాగ్రత్త అని ఎంత చెప్పినా ఆశ ముందు ఇవి పనిచేయలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. డీటీఈ ఎర్నింగ్ యాప్ నిర్వాహకులు మాత్రం దమ్ముంటే పట్టుకోండన్నట్లుగా భారీ దోపిడికి పాల్పడి యాప్ను పథకం ప్రకారం క్లోజ్ చేసి చేతులెత్తేశారు. ఇలాంటి కేసులు పోలీసులకే సవాల్గా మారుతున్నాయి. -
పులకించిన గండిక్షేత్రం
చక్రాయపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధి శ్రావణ మాసం నాలుగో శనివారోత్సవం సందర్భంగా భక్తులతో పులకించిపోయింది. రాయలసీమ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం దాతలు పెద్ద ఎత్తున అన్నదానాలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజ పాలకమండలి సభ్యులుతో పాటు,ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య,ఆర్కేవ్యాలీ, ఎస్సై రంగారావు ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు నిర్వహించారు.సాంస్కృతిక కార్యక్రమాలు అలరింప జేశాయి. ఆలయ ప్రధాన,ఉప ప్రధాన, అర్చకులు కేసరి,రాజారమేష్, రఘుస్వామి, వేదపా రాయణం రామ మోహణ శర్మలు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. -
దేవునికడప ఆలయ జీర్ణోద్ధరణ పనులు
కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ పనులకు తిరుమల–తిరుపతి దేవస్థానం సమయాత్తమైంది. ప్రాచీన ఆలయం కావడంతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి వారు, పద్మావతి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారి గర్భాలయాలు, విమాన గోపురాలు, రాజగోపురం మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో ఆలయంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి, అమ్మవార్ల మూల విరాట్కు బదులుగా బాలాలయంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చనున్నారు. ఈనెల 18వ తేది సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై 20వ తేది పూర్ణాహుతితో ముగుస్తారు. ఆరోజు నుంచి గర్బగుడి ఎదురుగా ఉన్న మండపంలో నిర్మించే బాలాలయంలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవచ్చు. ● బాలాలయ నిర్మాణ పనులు ప్రారంభం -
గురువులపై దిద్దుబాటు బరువు
మదనపల్లె సిటీ: కూటమి ప్రభుత్వం విద్యావిధానాలు విద్యార్థులతో పాటు గురువులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. సెల్ఫ్ అసెస్మెంట్ విధానం ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. మార్కుల నమోదు, రికార్డుల అప్లోడ్ తదితర పనులతో బోధనకు సమయం ఉండదని, విద్యా ప్రమాణాలు కుటుపడున్నాయని ఉపాధ్యాయుల వాదన. కొత్త విధానంలో ప్రతి విద్యార్థికి సబ్జెక్టు ఒకటి చొప్పున అసెస్మెంట్ పుస్తకాన్ని నిర్దేశించారు. అందులోనే ఏడాది పాటు నిర్వహించే పరీక్షల జవాబు పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ప్రాజెక్టు వర్క్ మార్కుల పట్టికల పేజీలను జతచేశారు. ఏడాదికి నాలుగు సార్లు జరిగే ఫార్మెటివ్ పరీక్షలకు 35 మార్కులతో పాటు స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్, రెస్పాన్స్, ప్రాజెక్టు వర్క్ల పేరుతో 5 మార్కుల వంతున మరో 15 మార్కులు నమోదు చేయాలి. ఏడాదికి రెండు సార్లు జరిగే సమ్మెటివ్ పరీక్షలను 80 మార్కులు వంతున నిర్వహిస్తారు. జిల్లాకు 4,59,405 లక్షల పుస్తకాలు: ప్రాథమిక పాఠశాలల్లో 1,2 తరగతులకు మూడు సబ్జెక్టులుంటాయి. అధే విధంగా 3,4,5 తరగతులకు నాలుగు, 6,7 తరగతులకు 6 సబ్జెక్టులు, 8 నుంచి 10 తరగతి వరకు ఏడు సబ్జెక్టుల పుస్తకాలు ప్రతి విద్యార్థికి ఉంటాయి. వీటిని విద్యా సంవత్సరం ఏడాది పాటు మాత్రమే కాకుండా ఆ విద్యార్థి స్కూల్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా భద్రపరచాల్సి ఉంటుంది. జిల్లాలో 2,191 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు 6,90,333 పుస్తకాలు కావాల్సి ఉండగా 4,59,405 అసెస్మెంట్ పుస్తకాలు వచ్చాయి. ఈనెల 11నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అసెస్మెంట్ పుస్తకంలో విద్యార్థులు తమ అపార్ నంబరు, పరీక్ష కోడ్ రాసి బబ్లింగ్ చేయాలి. పుస్తకంలో జవాబులు రాయడంతో పాటు అందులో పొందుపరిచిన ఓఎంఆర్ షీట్ సరైన సమాధానాలకు బబ్లింగ్ చేయాలి. వీటిని సరిగ్గా ఉండేలా ఉపాధ్యాయుడు చూడాలి. వెంటనే మూల్యాంకనం చేయాలి. ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తున్న అంశాలు: ● పరీక్షల అనంతరం అదే రోజు లేదా తక్షణం మూల్యాంకనం చేసి రిపోర్టులు పంపాల్సి రావడం. ● ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా మార్కుల ఆప్లోడ్లో సాంకేతిక సమస్యలు. ● చిన్న పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు అన్ని బాదద్యతలు చేపట్టడం వల్ల పాఠ్యాంశాల బోధనకు సమయం ఉండదు. ● ప్రతి విద్యార్థికి సబ్జెక్టుకు ఒక పుస్తకం ఉండడం వల్ల వాటిని ఏడాది పాటు స్కూల్లో సంరక్షణ క్లిష్టతరం. సమయం పెంచాలి అసెస్మెంట్ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి ప్రస్తుతం నిర్దేశించిన సమయం సరిపోదు. ఒక్కో విద్యార్థితో పుస్తక రూపంలో జవాబు పత్రాలను రాయించడం కష్టతరమైన పని.అసెస్మెంట్ పుస్తకాన్ని విద్యార్థి భద్రంగా ఉంచకపోతే ఉపాధ్యాయలకు రిమార్కు, విద్యార్థులందరికీ సబ్జెక్టు వారీగా ఆ పుస్తకాలను ఏడాది పాటు భద్రంగా ఉండచడం ఉపాధ్యాయులకు భారంగా మారుతుంది. –పురం రమణ, యూటీఎఫ్ జిల్లా కారదర్శి ఏకోపాధ్యాయ పాఠశాలలో అమలు సాధ్యం కాదు ప్రాథమిక విద్య పరీక్ష విధానంలో నూతనంగా అమలు చేస్తున్న సెల్ప్ అసెస్మెంట్ బుక్ సిస్టం ఏకోపాధ్యాయ పాఠశాలలో సాధ్యం కాదు. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఆధారంగా ఆ స్కూల్ టీచర్ చేతే ప్రశ్నపత్రాన్ని రూపొదించే విధానం ఇందులో తీసుకురావాలి. అదే విధంగా ప్రశ్నపత్రాలలో సరళమైన భాష వాడాలి. –మధుసూదన్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి అసెస్మెంట్ విధానంలో పుస్తక మూల్యాంకనం ఒక్కో సబ్జెక్టుకు ప్రత్యేకంగా పుస్తకాలు ఉపాధ్యాయులదే మూల్యాంకన బాధ్యత తలలు పట్టుకుంటున్న గురువులు -
బైక్లు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
బి.కొత్తకోట : ఎదురెదుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి స్థానిక పీటీఎం రోడ్డులో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం మేరకు..పీటీఎం మండలం ముంతగోగులపల్లెకు చెందిన శ్రీహరి (21), బి.కొత్తకోట మండలం కంబాలపల్లెకు చెందిన విష్ణు (21)లు బైక్పై బి.కొత్తకోట నుంచి మల్లెలకు బయలుదేరారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి వెంకటరమణ (70) పీటీఎం నుంచి బైక్పై బి.కొత్తకోటకు వస్తున్నారు. ఈ రెండు బైక్లు పీటీఎంరోడ్డులోని రాజా ఫంక్షన్ హాలు వద్దకు రాగానే ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరమణ తలకు తీవ్ర గాయమైంది. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. కారు ఢీకొని వృద్ధురాలి మృతి పీలేరురూరల్ : కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గాయంవారిపల్లె వద్ద జరిగింది. సదుం మండలం కమ్మొళ్లపల్లె పంచాయతీ బల్లావారిపల్లెకు చెందిన కె. సుగుణ (65) శనివారం తన కుమార్తె ఇంటికి మండలంలోని గాయంవారిపల్లెకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో పీలేరు – మదనపల్లె జాతీయ రహదారి గాయంవారిపల్లె బస్టాప్ వద్ద రోడ్డుపైకి వచ్చింది. ఈ సమయంలో మదనపల్లె వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. దారి కోసం ఘర్షణ రామసముద్రం : దారి కోసం గొడవ పడిన వివాదంలో ఒక వ్యక్తికి గాయాలైన సంఘటన రామసముద్రం మండలంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మానేవారిపల్లి పంచాయతీ మిట్టచీమనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు వెళ్లే దారిలో గ్రామానికి చెందిన వెంకటరెడ్డి తదితరులు దారిని మూసివేశారు. ఇది గమనించిన శ్రీనివాసులు తన ఇంటి వద్ద కళ్ల వేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, సుధాకర్, వంశీ, చిన్నప్పలు దాడి చేశారు. దీంతో శ్రీనివాసులు తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబీకులు రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వేడుకలు
రాయచోటి టౌన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు దినోత్సవం సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం రాయచోటిలో వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గ్రూప్ –1 అధికారుల వరకు సభ్యులు ఉన్న సంఘం తమదేనన్నారు. జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్సీ ఎరియర్స్, డీఏ ఎరియర్స్, సరెండర్ లీవ్స్ పెండింగ్లో ఉన్నాయన్నారు. వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం రండి టీ తాగుతూ..మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు ఏ. సాయికుమార్, కోశాధికారి సురేష్ బాబు, ఉపాధ్యక్షులు నాగేంద్రప్రసాద్, వేణు, పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు రాజా, రమేష్, శ్రీను, మణికంఠ, నాగదేవ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. పోలీసుల కవాతు విజయవంతం – పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రాయచోటి : జిల్లా పోలీసు పేరెడ్ మైదానంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకలలో పోలీసులు ప్రదర్శించిన కవాతు విజయవంతం కావడంపై పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అభినందించారు. దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం ఈ కవాతులో స్పష్టంగా కనిపించాయన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు కృషి చేయాలని ఆకాంక్షించారు. తాగునీటి కోసం అగచాట్లు సిద్దవటం : మండలంలోని సంటిగారిపల్లె గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులకు గత 5 రోజులుగా తాగునీరు రాకపోవడంతో పొలాల్లోకి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి చెందిన మంచినీరు మోటారు చెడిపోవడంతో కాలనీలోని దాదాపు 40 కుటుంబాలకు తాగునీరు రావడం లేదన్నారు. దీంతో ప్రతి రోజు గ్రామ సమీపంలోని పొలాల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. తాగునీటి సమస్య గురించి సంబంధిత అధికారులకు తెలియజేసినా స్పందించలేదని వాపోయారు. ఉన్నతాధికారులు తమ కష్టాలను గుర్తించి ఎస్సీ కాలనీకి తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు.