Annamayya
-
ఎలక్ట్రీషియన్ ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్య కారణాలతో ఎలక్ట్రీషియన్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మదనపల్లెలో వెలుగు చూసింది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లుకు చెందిన హరి ప్రసాద్ (32) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతనికి భార్య నాగవేణి రెండు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా హరిప్రసాద్ కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. వ్యాధులను బాగు చేసుకునేందుకు పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. అయినా పరిస్థితి మెరుగు పడకపోగా నానాటికి క్షీణిస్తూ ఉండడంతో మానసికంగా కుంగిపోయాడు. వారం రోజుల క్రితం భార్య నాగవేణి కుమారుడిని, ఆమె పుట్టిల్లు అయిన చౌడేపల్లి మండలం చదళ్ల పంచా యతీ బోయపల్లెలో విడిచిపెట్టి వచ్చాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు విచారణ చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో.. మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు, భార్య అనారోగ్యం, అప్పులు తదితర కారణాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం ములకలచెరువు మండలంలో వెలుగు చూసింది. మండలంలోని మద్దినాయన పల్లె పంచాయతీ నాయనవారిపల్లెకు చెందిన పెద్ద రెడ్డప్ప కుమారుడు శంకర (39) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతని భార్య రాధమ్మ స్థానికంగా అంగన్వాడీ టీచర్గా పని చేస్తూ ఉంది. ఆరు నెలల క్రితం ప్రమాదం కారణంగా రాధమ్మకు కాలు విరిగింది. ఆమెకు చికిత్స చేయించడానికి పలువురి వద్ద శంకర, దాదాపు రూ 10 లక్షలు అప్పులు చేశాడు. ఇటీవల కొంతకాలంగా రుణ దాతల నుంచి ఒత్తిడి అధికం కావడం. దీనికి తోడు కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవలు జరుగుతుండడం, తదితర కారణాలతో మనస్తాపం చెంది, బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో ములకలచెరువు పోలీసులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. జీవితంపై విరక్తితో.. లింగాల : మండలంలోని తాతిరెడ్డిపల్లె గ్రామంలో గురువారం గవిరెడ్డి శివారెడ్డి (60) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చాలా కాలం నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆలనా పాలనా చూసేందుకు భార్య లేకపోవడంతోపాటు గతంలోనే కుమారుడు మృతి చెందాడు. దీంతో ఆయన జీవితంపై విరక్తి చెంది తన పాత ఇంట్లో దంతెలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లింగాల పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
మోడీ సర్కారు బాటలో రాష్ట్ర ప్రభుత్వం
మదనపల్లె రూరల్ : కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్తంగా కార్మికవర్గం సమ్మెకు సన్నద్ధమవుతున్న దశలో రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మిక హక్కులపై దాడి చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు బాటలో రాష్ట్ర ప్రభుత్వం కార్మికలోకంపై పెనుదాడి చేసిందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో, కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కసారిగా దిగమింగిందన్నారు. ఎనిమిది గంటల పనిదినం ఆచరణలో ఎప్పుడో తొమ్మిది గంటలకు చేరుకోగా, తాజా మంత్రివర్గ సమావేశంలో దానిని పది గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. మహిళా సాధికారత పేరుతో మహిళలకు కూడా నైట్షిఫ్ట్ల భారాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న కాలంలో ఏఐ విస్తరించి, మానవ శ్రమను తగ్గిస్తున్న ఆధునిక యుగంలో పనిగంటలు తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణమన్నారు. కార్మిక సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో లేబర్ కోడ్స్ అమలును నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. -
లారీ ఢీకొని వీఆర్ఓ దుర్మరణం
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో రామచంద్రాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురం మండలానికి చెందిన వీఆర్ఓ ఈశ్వరయ్య (59) మృతి చెందారు. టి.చదిపిరాళ్లకు ఇన్చార్జి వీఆర్ఓగా పని చేస్తున్న ఈశ్వరయ్య గురువారం జంగంపల్లెలో రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు డీలర్ సతీష్ అలియాస్ నానిని తన బైక్లో ఎక్కించుకుని చదిపిరాళ్ల నుంచి బయలుదేరారు. మార్గ మధ్యంలో రామచంద్రాపురం వద్దకు రాగానే కడప నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ ఈశ్వరయ్య బైక్ను ఢీ కొంది. ఈ ఘటనలో ఈశ్వరయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక ఉన్న నాని ఎగిరి పడటంతో కాలు విరిగింది. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం కమలాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ఈశ్వరయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా మృతునికి భార్య, వివాహిత కుమార్తె ఉన్నారు. ఈశ్వరయ్య అందరితో కలివిడిగా ఉండటంతో ప్రజలు ఆసుపత్రికి తండోపతండాలుగా చేరుకున్నారు. ఈశ్వరయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ ఒత్తిడి, టార్గెట్ల కారణంగానే ఈశ్వరయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. ఇది ప్రభుత్వ హత్యే.. వీఆర్ఓ ఈశ్వరయ్యది ప్రభుత్వ హత్యే అని ప్రభుత్వ మాజీ ఉద్యాన సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ప్రచార ఆర్భాటాల కోసమే క్షేత్ర స్థాయి సిబ్బందిపై పని ఒత్తిడి పెంచారన్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న భోజనం కూడా తినకుండానే రేషన్ సరుకుల పంపిణీ కోసం ఫింగర్ వేయడానికి వెళ్లిన ఈశ్వరయ్య ఇలా మృత్యువాత పడటం విచారకరమన్నారు. వీఆర్ఓ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు అన్ని రకాల బెనిఫిట్స్ అందించి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
యోగాంధ్రతో ఆరోగ్యాంధ్ర సాధించాలి
సిద్దవటం : యోగాంధ్ర ద్వారా జీవన శైలిలో మార్పులు పొంది ఆరోగ్యాంధ్ర సాధించాలని కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటంలోని మట్లిరాజుల కోట పార్కు ప్రాంతంలో గురువారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుతూ , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్రలో భాగంగా సిద్దవటం మట్లిరాజుల కోటలో యోగాను ఏర్పాటు చేశామన్నారు. రోజుకు కేవలం 30 నిమిషాలు యోగా చేస్తే శారీరక దృఢత్వం, మానసిక శాంతి, సిద్ధిస్తాయన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి యోగా ఒక ఉత్తమ మైన మార్గం అని ఆయన తెలిపారు. జిల్లా యోగా స్పెషల్ ఆఫీసర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఇలాంటి యోగా కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో నిర్వహించే యువతలో ఆరోగ్య చైతన్యం, పెరుగుతుందన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి యోగా నిర్వహించడం ఒక ఉత్తమమైన మార్గం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్స్ మాధవి, ప్రసాద్, మెప్మా పీడీ కిరణ్కుమార్రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ జయసింహ, తహసీల్దారు తిరుమలబాబు, ఎంపీడీఓ ఫణిరాజకుమారి, ఎస్.ఐ మహమ్మద్రఫీ, వైద్యులు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ రంగలక్ష్మి, డాక్టర్ మురళి, ఎస్. ఎం.డి హమీద్, పంచాయతీరాజ్ ఏఈ నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ మాధవీలత, ఈఓపీఆర్డీ మోహతాబ్ యాస్మిన్, వెలుగు ఏపీఎం సుజాత, సీసీలు, ఉపాధి ఏపీఓ నరసింహులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, బెటాలియన్ పోలీసులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్పై దాడి
మదనపల్లె రూరల్ : ఆటో డ్రైవర్పై నలుగురు వ్యక్తులు దాడి చేసిన సంఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. మండలంలోని పోతబోలు పంచాయతీ గాండ్లపల్లికు చెందిన మహేష్(33) ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం పట్టణంలోని చిత్తూర్ బస్టాండ్ నుంచి ఆటోలో ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళుతుండగా, మార్గమధ్యంలోని సీటీఎం రోడ్డులో ప్రమాదవశాత్తు మరో ద్విచక్ర వాహనాన్ని స్వల్పంగా ఢీకొన్నాడు. ఆటో ఆపి ద్విచక్ర వాహనదారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే, ద్విచక్ర వాహనం లోని ఇద్దరు వ్యక్తులతో పాటు మరో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు కలిసి మహేష్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. స్థానికుల సాయంతో మహేష్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందాడు. దాడి ఘటనపై టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డు ప్రమాదంలో కదిరి వాసికి తీవ్ర గాయాలు మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో కదిరివాసి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన బాలాజీ నాయక్ (35), కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి చౌడేపల్లి మండలం బోయకొండకు వచ్చారు. మొక్కుబడి తీర్చుకుని తిరిగి స్వగ్రామానికి పయనమయ్యారు. కుటుంబ సభ్యులను వ్యానులో ఎక్కించి, బాలాజీ నాయక్ ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యంలోని వలసపల్లె వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. జీపు– ఆటో ఢీకొని ఇరువురికి తీవ్ర గాయాలు లక్కిరెడ్డిపల్లి : రాయచోటి–వేంపల్లి మార్గమధ్యంలోని నెహ్రూ నగర్కు వెళ్లే సమీపంలో గురువారం ఆటో–జీపు ఢీ కొన్న సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న డ్రైవర్తోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆంజనేయులుతోపాటు జీప్ డ్రైవర్ బాబా అనే వ్యక్తిని 108 ద్వారా లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం రాయచోటి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
గ్యాస్ సిలిండర్ పైప్ లీకేజీతో..
మదనపల్లె రూరల్ : గ్యాస్ సిలిండర్ పైప్ లీకేజీతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో రూ. 99 బాక్స్ బిర్యానీ సెంటర్ హోటల్ నడుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం హోటల్ బాగా రద్దీగా ఉన్న సమయంలో, సిలిండర్ నుంచి స్టౌ కు వెళ్లే గ్యాస్ పైప్ లీకేజీతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అదే సమయానికి బిరియాని పార్సిల్ తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చిన, నీరు గట్టు వారి పల్లెకు చెందిన రామ్మోహన్ (38), నక్కలదిన్నెకు చెందిన మునెమ్మ (40), పట్టణానికి చెందిన సురేంద్ర (36), మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించి బాధితులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో దాదాపు 60 మందికి పైగా ఉన్నారు. హోటల్ నిర్వాహకులు వంట వండే ప్రదేశానికి సమీపంలోనే పార్సిల్స్ కట్టిస్తుండటంతో ప్రమాదం జరిగిన సమయంలో వినియోగదారులు గాయపడ్డారు. -
చిత్తూరు,అనంతపురం జట్ల విజయ ఢంకా
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ – 23 వన్డే క్రికెట్ టోర్నీ చిత్తూరు, అనంతపురం జట్లు విజయ ఢంకా మోగించాయి. గురువారం వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు జట్టుపై చిత్తూరు జట్టు 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 50.0 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీనారాయణ అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శించాడు. 102 బంతులను ఎదుర్కొని 10 బౌండరీలు, 3 సిక్సర్ల సహాయంతో 112 పరుగులు (సెంచరీ) చేశాడు. నికిత్ గౌడ్ 60 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని మాధవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 297 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెల్లూరు జట్టు 42.2 ఓవర్లలో 202 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని మన్విత్ రెడ్డి 52, అర్జున్ 37 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని బాలాజీ 4, రెడ్డి ప్రకాష్ 3 ముఖేష్ 2 వికెట్లు తీసుకున్నారు. కేఎస్ఆర్ఎం మైదానంలో... కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వేరొక మ్యాచ్లో కర్నూలు జట్టుపై 3 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 38.1 ఓవర్లలో 196 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని నయీముల్లా 59, కనీష్ 51 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లికార్జున 4, దీపక్ 2, షేక్ కామిల్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 34.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులోని మహేంద్ర రెడ్డి 67, అర్జున్ టెండూల్కర్ 40 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని కనిష్ 3, సాబ్జాన్ బాషా 2 వికెట్లు తీసుకున్నారు. -
మహానాడు ఉల్లంఘనలు కనిపించలేదా?
మదనపల్లె : ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సులకు జరిమానా విధించడం సరైన చర్య అయితే అవే నిబంధనలు ఉల్లంఘించి కడపలో జరిగిన టీడీ పీ మహానాడుకు జనం తరలించడానికి ఏ నిబంధనలతో ప్రైవేటు విద్యాసంస్థల బ స్సులకు అనుమతి ఇచ్చారో ప్రజలకు చె ప్పాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు ఉ ల్లంఘించారని మదనపల్లె నుంచి నడుస్తున్న ప్రైవేటు బస్సులకు రవాణా శాఖ అధికారులు జరిమానా వేశారన్నారు. అవే నిబంధనలు ఉల్లంఘించి కడపలో జరిగిన టీడీపీ మహానాడుకు మదనపల్లి నియోజకవర్గం నుంచి ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులు ఏ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంపారో ఆర్టీఓ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు బస్సుల విషయంలో ఒకలా, ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సుల పట్ల మరోలా వ్యవహరించడం పట్ల వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశం ఏమిటని ప్రశ్నించారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలేటిపల్లె సమీపంలో జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాణికుమారి (52) మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ39 ఏజెడ్ 2259 నెంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు రాయచోటి వైపు నుంచి కడపకు వస్తుండగా ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొంది. ఇదే సమయంలో రాయచోటి వైపు నుంచి వస్తున్న ఏపీ 39 క్యూవీ 0525 నెంబర్ గల కారు వేగాన్ని అదుపుచేయలేక స్విఫ్ట్ డిజైర్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారులో స్వయంగా వాహనాన్ని నడుపుతున్న కడప రాఘవేంద్ర టౌన్షిప్లో నివాసం ఉంటూ రామాపురం మండలం సరస్వతిపల్లె ఎంపీపీ స్కూలు ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న రాణికుమారి అక్కడికక్కడే మృతి చెందారు. రాయచోటి వైపు నుంచి వస్తుండిన మరో కారులో ప్రయాణిస్తున్న రాయచోటి డిప్యూటీ డీఈఎంఓ అధికారి దేవశిరోమణితోపాటు కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన రాణికుమారికి భర్త పుల్లయ్య, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. రాణి కుమారి కారులో నుంచి హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ నరసింహులు బ్యాగులను స్వాధీనం చేసుకుని అందులోని సుమారు 50 తులాలకుపైగా బంగారు ఆభరణాలతో కూడిన రెండు బ్యాగులను చింతకొమ్మదిన్నె పోలీసులకు ఇచ్చారు. వారు వాటిని సంఘటన ప్రాంతంలోనే మృతురాలి బంధువులకు అప్పగించారు. గాయపడిన దేవశిరోమణి కడప నగరంలోని రాజారెడ్డి వీధి నివాసురాలు, ఈమె కారు డ్రైవర్ పెంచల బాబు కూడా కడపలోనే ఉంటున్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లలోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోక పోవడం గమనార్హం. ఈ రోడ్డు ప్రమాదంపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాయచోటి డిప్యూటీ డీఈఎంఓ దేవశిరోమణికి తీవ్ర గాయాలు -
వేర్వేరు కేసుల్లో 16 మంది అరెస్టు
రాయచోటి టౌన్ : వేర్వేరు కేసుల్లో 16 మందిని అరెస్టు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి తెలిపారు. రాయచోటి రూరల్ పరిధిలోని ఎగువ అబ్బవరం గ్రామానికి చెందిన ఆవుల గంగిరెడ్డి తన ఇంటి ముందు నుంచి మట్టి, ఇసుకను ట్రాక్లర్ల ద్వారా తరలిస్తూ ఉండటంతో అభ్యంతరం తెలిపాడు. దీనిపై ట్రాక్టర్ యజమానితో పాటు మరి కొందరు ఆయనతో గొడవపడ్డారు. ఈ విషయమై ఈ నెల 2వ తేదీ తమసీల్దార్కు ఫిర్యాదు చేసేందుకు గంగిరెడ్డి మోటార్ బైకుపై వెళుతుండగా అడ్డగించి దాడి చేసి గాయపరిచారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను గురువారం ఎస్ఐ విష్ణువర్దన్ అరెస్టు చేశారు. అలాగే రెండేళ్ల క్రితం ఒక అమ్మాయి విషయమై గొడవ పడిన సంఘటనలో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు బారికేడ్లు వితరణ రాయచోటి టౌన్ : రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లతో పాటు రాయచోటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు భారతి సిమెంట్ యాజమాన్యం బారికేడ్లు వితరణ చేసింది. గురువారం కంపెనీ ప్రతినిధులు రాయచోటి ట్రాఫిక్ సీఐ విశ్వనాథరెడ్డికి వీటిని అందజేశారు. వీటిని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి, సిబ్బంది రమణారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, డీలర్లు పి. రాజ, ఎం.లియాఖత్ ఆలీఖాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్ విజేత కడప కడప వైఎస్ఆర్ సర్కిల్ : గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్లో వైఎస్సార్ కడప జిల్లా జట్టు విజయం సాధించినట్లు కడప జర్నలిస్టు టీం మేనేజర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. గుంటూరు పోలీసు గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చిత్తూరు జట్టుపై భారీ విజయం సాధించి కప్పును కై వసం చేసుకుందన్నారు. నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జట్ల పైన విజయం సాధించారన్నారు. కడప టీం సభ్యుడు పఠాన్ సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు
సంబేపల్లె : మండల పరిధిలోని శెట్టిపల్లె, నారాయణరెడ్డిపల్లె గ్రామాలలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో పలువురు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు ... మండల పరిధిలోని నాగిరెడ్డిగారిపల్లెకు చెందిన దొరబాబు, అక్క పద్మావతమ్మతో కలిసి ద్విచక్రవాహనంలో శెట్టిపల్లె నుంచి సొంత గ్రామానికి సీకే రోడ్డుపై వెళుతుండగా గంగన్నగారిపల్లె సమీపంలోని మలుపు వద్దకు రాగానే శెట్టిపల్లె నుంచి దేవపట్లకు వెళుతున్న కారు అదుపు తప్పి ముందు వెళుతున్న బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న దొరబాబు, పద్మావతితో పాటు మరొకరికి గాయాలయ్యయి. గాయపడిన వారిని 108 సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే సంబేపల్లె అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన నాగేంద్ర తన భార్య హరితతో కలిసి చిన్నమండెంకు వెళుతుండగా నారాయణరెడ్డిపల్లె పంచాయతీ ముదివాండ్లపల్లె సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
తహసీల్దార్లకు ప్రశంసా పత్రాలు
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపిన తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రశంసాపత్రాలను అందించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కలికిరి, కోడూరు మండలాల తహసీల్దార్లకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కోడూరు మండలం చియ్యవరం గ్రామంలో 25 ఏళ్లుగా పరిష్కారం కాని దారి సమస్యను తహసీల్దార్ మహబూబ్చాంద్ గ్రామస్తులతో మాట్లాడి శాంతియుతంగా పరిష్కరించారని పేర్కొన్నారు. అలాగే కలికిరి మండలం పారపట్ల గ్రామంలోని కురువపల్లెల్లో 20 ఏళ్లుగా ఉన్న దారి సమస్యను తహసీల్దార్ మహేశ్వరీబాయి గ్రామస్తులతో మాట్లాడి శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించారని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం దొరకని దారి సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం చూపడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు. -
రాజంపేటలో ఢిల్లీ రైల్కు హాల్టింగ్!
రాజంపేట: అధ్యాత్మికనగరం తిరుపతి నుంచి దేశరాజధానికి రాజంపేట, నందలూరు, కడప మీదుగా నడిచే ఢిల్లీ రైలు ఏపీసంపర్క్ క్రాంతి (12708/12707)రైలుకు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో హాల్టింగ్ ఇచ్చారు. దక్షిణమధ్య రైల్వే జీఎం ఆదేశాల మేరకు గుంతకల్ డివిజనల్ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి రాజంపేటలో ఏపీ సంపర్క్ క్రాంతిరైలు ఆగుతుందని రైల్వే వర్గాలు ధ్రువీకరించాయి. ఈ మేరకు డివిజన్ కేంద్రానికి ఎస్సీ రైల్వే జీఎం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. గత 17 సంవత్సరాలుగా ఢిల్లీ రైలు రాజంపేట మీదుగా నడుస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని అధ్యాత్మిక కేంద్రాల నుంచి ఢిల్లీకి వేగవంతమైన ప్రయాణానికి నేరుగా అనుసంధానం చేయడానికి అప్పటి రైల్వేమంత్రి లాలుప్రసాద్యాదవ్ సంపర్క్ క్రాంతిరైళ్లను తీసుకొచ్చారు. 2005 మార్చి రైల్వేబడ్జెట్లో ప్రకటించారు. అదే సమయంలో సికింద్రాబాద్ జోనల్ ప్రధానకార్యాలయం, సికింద్రాబాద్ జంక్షన్ ఢిల్లీ నిజాముద్దీన్కు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్రైలును జూలై 2005లో పట్టాలెక్కించారు. దివంగత సీఎం వైఎస్సార్ చొరవతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలుపై పడింది. ఈ రైలును అధ్యాతికనగరం తిరుపతి నుంచి కడప, రాజంపేట పార్లమెంటరీ కేంద్రాలైన రాజంపేట, కడప మీదుగా సికింద్రాబాద్ వరకు నడిపించాలని రైల్వేమంత్రిత్వశాఖను కోరారు. 2007లో ఈ రైలు సికింద్రాబాద్ టు ఢిల్లీకి నడిచింది.దీనిని తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, నందలూరు, కడప ,గుత్తి, డోన్, కర్నూలు, మహబూబ్నగర్ మీదుగా పొడిగించారు. ● సీమ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఉమ్మడి కడపజిల్లా వాసులు ఢిల్లీకి వెళ్లడానికి ఒక్కరైలు కూడా లేదు. వీరు ఢిల్లీ, ఉత్తరాది నగరాలకు వెళ్లాలంటే రేణిగుంటకు వచ్చి, అక్కడి నుంచి కేరళ ఎక్స్ప్రెస్ ద్వారా వయా నెల్లూరు, గూడూరు మీదుగా వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే వైఎస్సార్ చొరవ వల్ల ఇప్పుడు నేరుగా జిల్లా మీదుగా దేశరాజధానికి వెళ్లేందుకు రైలు అందుబాటులోవచ్చింది. హర్షణీయం ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు హాల్టింగ్ కల్పించడం హర్షణీయం. ఈ రైలు మన ప్రాంతం మీదుగా వెళ్లడానికి దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి కారణం ఇప్పుడు ఈ రైలుకు హాల్టింగ్ రావడం వెనుక ఎంపీ మిథున్రెడ్డి కృషి ప్రశంసనీయం. రైలు రాజంపేటలో ఆగడం వల్ల అటు తెలంగాణాకు, దేశరాజధానికి వెళ్లేందుకు అదనంగా మరో రైలు ఉన్నట్లే. –పోలా శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజంపేట జిల్లావాసులకు శుభవార్త ఢిల్లీ రైలు హాల్టింగ్కు ఎంపీ పీవీ మిథున్రెడ్డి కృషి ఫలించింది. ఎట్టకేలకు రైల్వేఅధికారులు హాల్టింగ్ను ఈనెల 11 నుంచి అమలుచేయనున్నారు. జిల్లా వాసులకు శుభవార్త. –తల్లెం భరత్కుమార్రెడ్డి, డీఆర్యుసీసీ,సభ్యుడు, రాజంపేట రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్కు వినతిపత్రం అందచేస్తున్న వైఎస్సార్సీపీ లోక్సభ ఫ్లోర్లీడర్ పీవీ మిథున్రెడ్డి (ఫైల్) 11నుంచి అమలుకు సన్నాహాలు -
ఖాకీ క్రౌర్యం.. పోయిన ప్రాణం
● పేకాట వ్యవహారంలో నారాయణరెడ్డిపై గంజాయి కేసు ● డబ్బుల ఇవ్వకపోవడంతోనే నమోదు ● బెయిల్పై వచ్చినా..ఇబ్బంది పెట్టిన వైనం ● ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్త ఖాజీపేట: పోలీసులు పెట్టిన తప్పుడు కేసు, ఆపై వేధింపులు.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నా యి. ఒక కుటుంబాన్ని వీధిన పడేలా చేశాయి. ఇద్దరు చిన్నారులను తండ్రిని కోల్పోయిన వారిగా మార్చా యి. పేకాట కేసులో తీసుకొచ్చిన వారిపై ఖాజీపేట పోలీసులు కేసులు నమోదు చేయకుండా.. డబ్బులు బేరసారాలు చేయడం, కుదరక పోవడంతో గంజాయి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన దుంపలగట్టు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణమైంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు చెక్కర ఫ్యాక్టరీ సమీపంలో మే 6న పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడులు చేయడానికి వారు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో.. అక్కడికి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేశారు. సుమారు 12 మంది పేకాట ఆడేందుకు వస్తున్నట్లు అనుమానించారు. అందులో దుర్గం ఖాదర్ బాషా, సిద్దంగారి గురుమహేశ్వర్రెడ్డి, రెడ్యం శివలక్ష్మినారాణరెడ్డి, మాచుపల్లి గుర్రప్ప, ఇరగంరెడ్డి భరత్రెడ్డి, నాగూర్ బాషా, కమాల్బాషా, లక్ష్మిరెడ్డి, నాగేంద్రరెడ్డి, ఫరూక్, కుమార్రెడ్డి, లోకేష్రెడ్డిలు పేకాట ఆడేందుకు వెళ్తున్నట్లు అనుమానించారు. వారిని మే 6న ఖాజీపేట పోలీస్స్టేషన్కు పిలిపించి విచారణ చేశారు. అయితే పేకాట ఆడలేదని వారిలో కొందరు చెప్పారు. దీంతో అప్పుడు కేసు నమోదు చేయకుండా పంపించారు. అనంతరం 7, 8వ తేదీల్లో పిలిపించారు. వారిలో కొందరిని డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. ఇవ్వక పోవడంతో 9న పేకాటతోపాటు గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు 12 మందిపై కేసు నమోదు చేశారు. 2.570 గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు, రూ 20,500 నగదు, 52 పేక ముక్కలు దొరికినట్లు కేసు కట్టారు. అందులో 9 మందిని అరెస్ట్ చేసి కోర్డుకు పంపించారు. ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నట్లు కేసులో కనపరిచారు. రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డి ఆత్మహత్య ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డిని నిందితునిగా చేర్చి, అతనిపై గంజాయి కేసు నమోదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మే 9న అరెస్టయిన అతను మే 29న కండీషన్ బెయిల్పై బయటికి వచ్చాడు. వచ్చిన తరువాత కూడా తనను పోలీసులు చేసిన చిత్రహింసలకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులకు వివరించాడు. దెబ్బలను తన భార్య సుభాషిణికి చూపించాడు. తనకు ఎలాంటి సంబంధం లేని కేసులో ఇరికించారని భార్య వద్ద తీవ్ర మనోవేదన వ్యక్తం చేశాడు. దీనికి తోడు కండీషనల్ బెయిల్పై రావడంతో.. ప్రతి వారంలో రెండు సార్లు పోలీస్స్టేషన్కు వచ్చి సంతకాలు చేసి పోవాల్సి వచ్చింది. సంతకాలకు వెళ్లినప్పుడల్లా డబ్బుల కోసం వేధిస్తున్నట్లు భార్య దగ్గర వాపోయాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్ తీగలు పట్టుకుని.. బుధవారం రాత్రి ఇంటిలో నుంచి బయటికి వెళ్లిన నారాయణరెడ్డి పుష్పగిరికి వెళ్లే రహదారిలోని ట్రాన్స్ఫార్మర్ వైరు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ చూసిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో.. అప్పటికే వెతుకుతున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. అయినా వెంటనే చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. ● తన భర్త నారాయణరెడ్డి మృతికి ఖాజీపేట సీఐ మోహన్ వేధింపులే కారణం అని రెడ్యం సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.‘నా భర్త నారాయణరెడ్డి పోలీసుల వేధింపులతోనే చనిపోయాడు. మా కుటుంబానికి దిక్కు లేకుండా చేశారు. ఇద్దరు బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాకు ఉన్న పెద్ద దిక్కు లేకుండా చేశారు. ఇందుకు కారణం పోలీసులే.. ఇప్పుడు నా భర్త మృతికి బాధ్యత ఎవరు తీసుకుంటారు. నాకు న్యాయం చేయాలి’ అని నారాయణరెడ్డి భార్య గుండెలవిసేలా రోదించింది. ఆమె ఆవేదన అక్కడి వారిని కంటతడి పెట్టించింది. నా భర్త మృతికి బాధ్యత ఎవరిదీ? -
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రాజంపేట టౌన్: భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛాముకూరి పిలుపునిచ్చారు. రాజంపేట–రాయచోటి మార్గంలో ఉన్న నగరవనంలో గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.కలెక్టర్ శ్రీధర్, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి , ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిధులుగా పాల్గొని మొక్కలను నాటారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది నిర్వహించే వనమహోత్సవం నాటికి జిల్లాలో 21 లక్షల మొక్కలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి పెరిగే కొద్ది పుడమి తల్లికి కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నింగి, నేల, గాలి కలుషితం అవుతున్నాయన్నారు. ఇది మానవ మనుగడకు శ్రేయస్కరం కాదని తెలిపారు. ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ మాట్లాడుతూ ప్రాణవాయువు కోసం ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పెంచాలని తెలిపారు. కాగా రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్కలెక్టర్లు వైఖోమ్ నైదియాదేవి, మేఘస్వరూప్, డిఎఫ్ఓ ఆర్.జగన్నాధ్సింగ్, రాజంపేట ఏఎస్పీ మనోజ్రామనాధ్హెగ్డె, సబ్డీఎఫ్ఓలు జి. సుబ్బరాజు, ఎస్.శ్రీనివాసులు మొక్కలను నాటారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణకు పూర్తిస్థాయి సన్నద్ధత రాయచోటి: జిల్లాలో ఆరు కేంద్రాలలో మెగా డిఎస్సీ పరీక్ష నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఒకటిన్నర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత సమయానికి మించి నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు. జిల్లాలో ఆరు కేంద్రాలలో ఈనెల 6వ తేదీ నుండి జూన్ 27 వరకు మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. 17851 మంది మెగా డీఎస్సీ పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. మదనపల్లెలో మూడు, రాజంపేటలో ఒకటి, రాయచోటిలో రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. కొన్ని రోజులు మూడు సెషన్లలో పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలోని ప్రజలు జనాభా నిర్వహణ విధానంలో అభిప్రాయాలను ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం జనాభా నిర్వహణ విధానంపై ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. -
● చట్టాలు ఉన్నా అమలు ఎక్కడా?
గుర్రంకొండ: ఖరీఫ్సీజన్ ప్రారంభమైంది. వ్యవసాయపనులు ముందుకు సాగడం లేదు.ఎరువుల కొరతే దీనికి కారణం. అంతేకాకుండా ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద ధరలు, స్టాకు వివరాలుగానీ తెలియజేసే సమాచార బోర్డులు లేక పోవడం గమనార్హం. కాగా రైతులు కొనుగోలు చేసే ఎరువులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ఈక్రమంలో అన్నదాత అవసరాన్ని, నిస్సహాయతని ఆసరాగా తీసుకొని నకిలీ విత్తనాలు,నకిలీ ఎరువులను అంటగట్టే అవకాశం లేకపోలేదు. రైతులను కాపాడేందకు విత్తనచట్టం ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో రైతుల పరిస్థితి కొనబోతే కొరివి ఆమ్మబోతే అడవి అన్నచందనంగా మారింది. నెలరోజులుగా ఇదే పరిస్థితి.. జిల్లాలోని 452 రైతుసేవాకేంద్రాల్లో నెలరోజులుగా ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.కొన్ని కేంద్రాల్లో ప్రస్తుతం పొటాష్, జిప్సమ్ మాత్రమే అందుబాటులో ఉంచారు. మరికొన్ని కేంద్రాల్లో వాటితోపాటు మిగిలిన ఎరువులు 40 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. వర్షాలు సమృద్ధిగా కరుస్తుండడంతో జిల్లాలోని రైతులు వేరుశనగ, ఇతర ఆరుతడిపంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పొలాలను దక్కులు చేసుకొని విత్తనాల కోసం వేచిచూస్తున్నారు. పలువురు రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి సాగుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎరువులు మాత్రం అంతంత మాత్రంగానే అందుబాటులో ఉండడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్సీజన్ ప్రారంభానికి ముందే అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం రైతుసేవా కేంద్రాల్లో డీఎఫీ, కాంప్లెక్స్లు. యూరియాల స్టాకు అంతంతమాత్రమే. ప్రైవేట్ డీలర్ల నిలువుదోపిడీ జిల్లాలో రైతులను ప్రైవేట్ ఎరువుల దుకాణాల డీలర్లు ఇష్టారాజ్యంగా నిలువుదోపిడీ చేస్తున్నారు.రైతుసేవాకేంద్రాల్లో అంతంతమాత్రంగానే ఎరువులు ఉండడంతో రైతులు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించి డీలర్లు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తూ దోచుకొంటున్నారు. కొనుగోలుచేసిన ఎరువులు, పురుగుల మందులకు రశీదులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులను మోసగిస్తున్నా చర్యలేవీ.. ప్రైవేట్ డీలర్లు ఇష్టానుసారం రైతులను మోసగిస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. విత్తనాలు, కొనుగోలు సమయంలో విత్తన చట్టం ద్వారా సంబంధిత విత్తనాల డీలర్లపై కఠిన చర్యలు చేపట్టే వీలుంది. విత్తన చట్టం 1966, విత్తన నిబంధనలు1968, విత్తన నియంత్రణ–1983 చట్టాల ఆధారంగా అతిక్రమణలు, ఉల్లంఘనలు వర్తించేలా చట్టాన్ని రూపొందించారు. విత్తన విక్రయాల్లో మోసాలకు పాల్పడే వారిపై విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983 క్లాజ్ 3 కింద నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయా దుకాణాల్లో విత్తనాలను జప్తు చేయడంతో పాటు అత్యవసర సరకుల చట్టం 1955 సెక్షన్–ఎ ప్రకారం జరిమానా విఽధించాలి. ఇన్ని చట్టాలు ఉన్నా అధికారులు మాత్రం అమలు చేయడంలో మీన వేషాలు లెక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ పంటలు బాగా పండాలంటే సాగునీటితో పాటు ఎరువులూ కీలకమే. సకాలంలో వాటిని వేయకపోతే పంట ఎదుగుదల, దిగుబడి నాణ్యతపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో అరకొర నిల్వలు ఉన్నాయి. ఇదే అదనుగా భావించి ప్రైవేట్ ఎరువుల దకాణాల యజమానులు రైతులు ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమైనా రైతుసేవా కేంద్రాల్లో అరకొర నిల్వలు రైతులను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఎరువుల దుకాణా యజమానులు షాపుల ముందు కనిపించని ధరల సమాచారం బోర్డులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో డీలర్లు పురుగుల మందులు, ఎరువులను ఆఽధిక ధరలకు విక్రయిస్తున్నారు. అసలే పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటుధరలు లేవు. మరోవైపు ఎరువుల దుకాణాల యజమానులు ఇష్టానుసారంగా ఎక్కువ ధరలకు అమ్ముతూ రైతుల్ని దోచుకొంటున్నారు. ఎరువుల కోసం వ్యయ ప్రయాసలు పడుతున్నాం. – నరసింహులు, రైతు, కొత్తపల్లె ఎరువులు అందుబాటులో లేవు రైతు సేవాకేంద్రాల్లో అన్ని రకాల ఎరువులు అందుబాటులో లేవు. జిప్సం, పొటాష్ మాత్రమే ఇస్తున్నారు. డీఏపీ, యూరియా వంటి అవసరమైన ఎరువులు ఇవ్వడం లేదు. ఖరీఫ్సీజన్ పంటలు సాగు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నాం. అవసరమైన అన్ని రకాల ఎరువులు అందుబాటు ఉంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. –రమణమ్మ, రైతు, గుట్టకిందపల్లె జిల్లాలో సూమారు 484 ప్రైవేట్ ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీటిలో 187 విత్తన విక్రయ డీలర్లు కాగా మిగిలిన దుకాణాల్లో ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తుంటారు. నిబంధనల ప్రకారం ప్రతి ప్రైవేట్ ఎరువుల, విత్తనాల విక్రయ దుకాణాల్లో తప్పనిసరిగా విత్తన లైసెన్స్లను ప్రదర్శించాలి. లేకుంటే నోటీసులు ఇచ్చి దానికి సరైన సమాధానం ఇవ్వక పోతే విత్తననియంత్రణ ఉత్తర్వులు 1986 క్లాజ్–5 ప్రకారం డీలర్ లైసెన్స్ రదు చేయడానికి వ్వవసాయాధికారులకు పూర్తి అధికారం ఉంది. అలాగే విత్తనాలు విక్రయించే దుకాణాల్లోనూ, దుకాణం ముందు వైపు కచ్చితంగా ధరలు, స్టాకుల సమాచారాన్ని తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలి.లేకపోతే విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజ్ 8 ప్రకారం ఆయా దుకాణాల్లో విత్తనాల అమ్మకాలు నిలుపుదల చేయవచ్చు. విత్తనాల కొనుగోలు సమయంలో రైతులకు తప్పనిసరిగా డీలర్లు రశీదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే విత్తననియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజ్ 9 ప్రకారం డీలర్కు నోటీసు ఇచ్చి సమాధానం చెప్పక పోతే లైసెన్స్ రద్దు చేయవచ్చు. కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం 1966సెక్షన్–7 ప్రకారం విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983 క్లాజ్ 8–ను అనుసరించి డీలర్ లైసెన్స్ రద్దు చేస్తారు. రైతుల సంక్షేమం కోసం ఇన్ని చట్టాలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. -
హామీలు అమలు చేయలేని చంద్రబాబు
మదనపల్లె రూరల్ : నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారైనా వెన్నుపోటు పొడవకుండా పరిపాలన చేశారా అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు హామీ ఇచ్చి వాటిని అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి శ్యామల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రదర్శనగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఏఓ రాఘవేంద్రకు, కూటమిపాలనలో ప్రజలు మోసపోయిన వైనంపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ...1994 ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు సొంతమామ నందమూరి తారకరామారావుకు వెన్నుపోటు పొడిచారంట అని తన చిన్నవయస్సులో విన్నానని, 2024 ఎన్నికల తర్వాత ప్రజలకు ఆయన పొడిచిన వెన్నుపోటును ప్రత్యక్షంగా చూస్తున్నానన్నారు. చంద్రబాబు అంటే వెన్నుపోటు, వెన్నుపోటు అంటే చంద్రబాబు అని, ఒక్కసారైనా ప్రజలకు వెన్నుపోటు లేకుండా పరిపాలన చేశారా అని ప్రశ్నిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన పొడిచిన వెన్నుపోటు గురించి చెప్పాలంటే ఎక్కడ నుంచి ఆరంభించాలో అర్థం కావడం లేదన్నారు. పసికందుల నుంచి రక్షణ కల్పించలేని కూటమిప్రభుత్వం, ఆడపిల్లలకు పొడిచిన వెన్నుపోటు నుంచి మొదలుపెట్టాలా..? అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కూటమి నాయకుల నుంచి మొదలుపెట్టాలా..? రైతుల కన్నీటితడి నుంచి ప్రారంభించాలా..? ఎండీయూ వాహనాలు రద్దుచేసి కొన్ని లక్షల కుటుంబాలను రోడ్డుమీదకు లాగేసిన దగ్గర నుంచి మొదలుపెట్టాలా.? డీఎస్సీ అభ్యర్థులను అతి దారుణంగా వెన్నుపోటు పొడిచారని...ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. కూటమిప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మరచిపోతే వాటిని గుర్తుచేసేందుకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి సిద్ధంగా ఉంటారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తకు ఎదురునిలబడి మాట్లాడలేని పరిస్థితిలో కూటమిప్రభుత్వం ఉందన్నారు. చివరకు బడి కెళ్లే పిల్లలు...పదో తరగతి పిల్లలను సైతం కూటమిప్రభుత్వం దారుణంగా వెన్నుపోటు పొడిచిందన్నారు. అదేదో సామెత చెప్పినట్లు...పనిగల పనిమంతుడు పందిరి వేస్తే...తాటాకు తగిలి ఊడిపోయిందంట.. అన్నట్లు కూటమి ప్రభుత్వం పరిస్థితి తయారైందన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు, ఒకసారి సీఎంగా పనిచేసిన జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసిన అప్పుల్లో, 40శాతం అప్పులు మొదటిఏడాదిలోనే చంద్రబాబు చేసేశారన్నారు. మళ్లీ అధికారంలోకి వైఎస్.జగన్ వస్తారని, ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకుంటామని, అప్పటివరకు కూటమిప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, నాయకులు ఎన్ఆర్ఐ దండుశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సీహెచ్.రామచంద్రారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కేశవరెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీ మేరీ, రోలింగ్ మల్లిక తదితరులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించేది వైఎస్సార్ సీపీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల -
పీఎం సూర్యఘర్ పథకం కింద రాయితీ
రాయచోటి : ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం క్రింద మూడు కిలోవాట్ల పవర్కు కేంద్ర ప్రభుత్వం ద్వారా 78 వేల రూపాయలు రాయితీ ఇస్తారని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్ శాఖ ఎస్ఈ,ఈఈలు, నెడ్క్యాప్ సిబ్బంది, జిల్లాలో సోలార్ ఇన్స్టాల్ చేసే వెండర్లు, ఎంపీడీఓలు తదితరులతో జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ పవర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకునే రిజిస్ట్రేషన్లు పెరగాలని విద్యుత్ శాఖ సిబ్బందిని,ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.సమావేశంలో ఎస్పీడీసీఎల్ శాఖ ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఈఈలు, డీఈలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఆవులు, ఒంటెల వధ నిషేధం.. చట్టరీత్యా నేరం.. ఆవులు, ఆవుదూడలు, ఒంటెల వధ నిషేధం మరియు చట్టరీత్యా నేరమని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై జంతు హింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ ‘ఆవులు, దూడలు, ఒంటెల వధఽ నిషేధం, చట్టరీత్యా నేరం’ అనే అంశంపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్పిళ్లై పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
వంచనపై గర్జన
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో “వెన్నుపోటు దినం’ కార్యక్రమం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఆందోళనకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. సీఎం చంద్రబాబు వ్యవహారశైలిపై వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులను కూడా కొనసాగించకుండా దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఒరిగింది శూన్యమని చంద్రబాబు ఏడాదికే విఫలమయ్యారని ఆరోపించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రమైన కడపలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈర్యాలీ కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ కూడలి, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరింది. ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఏఓ శంకరయ్యకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్ పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి జనం పోటెత్తారు. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీ‹Ùరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా పాత ఆర్టీసీ బస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ చేరింది. అనంతరం ఆర్డీఓ వెంకటేశంకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్ నుంచి మొదలైన ఈ ర్యాలీ శ్రీరాములుపేట మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరింది. అనంతరం కమిషనర్ మల్లికార్జునకు వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ లక్షి్మదేవి, మాజీ ఆప్కాబ్ ఛైర్పర్సన్ మల్లేల ఝాన్సీ, పార్టీ నేతలు పోరెడ్డి నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, కోనేటి సునంద తదితరులు పాల్గొన్నారు. మైదుకూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ అంకాలమ్మ దేవాలయం మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ ఉదయభారతికి వినతి పత్రం సమరి్పంచారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ రాజగోపాల్రెడ్డి, కుడా మాజీ ఛైర్మెన్ గురుమోహన్ తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి మొదలైన ఈ ర్యాలీ నారాపురం దేవాలయం, తేరు రోడ్డు, పెద్ద పసుపుల మోటు, సంజామల మోటు, ఎస్బీఐ, పాతబస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ ఆర్డీఓ సాయిశ్రీ కి వినతి పత్రం సమరి్పంచారు. అలాగే యర్రగుంట్లలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సు«దీర్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమరి్పంచారు. ఆయా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల నేతలు హృషికేశవరెడ్డి, రఘునాథరెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు. కమలాపురం పట్టణంలోని ఖాజీపేట రోడ్డులో ఉన్న గయాజ్ ఫిల్టింగ్ స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శివరామిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ బాలయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఉత్తమారెడ్డి, వీరారెడ్డి, జీఎన్ భాస్కర్రెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రఘునాథరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసం గ్యారంటీ అని రుజువు చేశారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదు. సూపర్సిక్స్ పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోనికి వచ్చాక వాటి అమలు మరచిపోయారు. బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటి అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ అంటూ రుజువు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్షా 75 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అమరావతి అభివృద్ధి అంటూ టెండర్లు ప్రక్రియ ప్రారంభించి కమీషన్ రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఎంత మంది పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం అన్నారు. ఇప్పటి వరకు వేయకుండా తల్లులకు వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ పథకం ఊసేలేదు. , రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేలు ఇస్తామన్నారు. అదీ లేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు అన్నారు. వాలంటీర్లకు నెలకు పదివేల ఇస్తామన్నారు. ఇంత వరకు ఈ పథకాలను అమలు చేయకుండా ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు. మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలందరికీ వెన్నుపోటు పొడవడం నైజంగా మారింది. పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. – పి.రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రైతులను నిండా ముంచారు.. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు ఇవ్వలేదు. చంద్రబాబు , పవన్ కల్యాణ్, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలను మరచిపోయారు. జమ్మలమడుగు లో దాలి్మయా పరిశ్రమ వల్ల మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆ గ్రామాల ప్రజలకు న్యాయంజరిగిన తర్వాతే దాలి్మయా రెండోప్లాంట్ ప్రారంభం అవుతుందని ప్రజాభిప్రాయ సేకరణకు ముందు గ్రామాల్లో తిరిగి చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో మాట మార్చి సిమెంట్ పరిశ్రమకు మద్దతు పలికి గ్రామ ప్రజలను మోసం చేశారు. కూటమి నేతలు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోనికి రాగానే వాటిని తుంగలోతొక్కారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. – రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీవెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలతోపాటు 143 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, ప్రజలను వెన్నుపోటు పొడవటం పెద్ద లెక్కకాదు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ముస్లిం మైనారీ్టలకు అన్యాయం చేసే వక్ఫ్ బిల్లుకు బాబు మద్దతిచ్చి మోసం చేశారు. హామీలు పక్కనబెట్టి అక్రమ కేసులు బనాయిస్తూ.. అరాచక పాలన చేస్తున్నారు. చిన్నారులపై , మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. అభివృద్ధిని పక్కనబెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. – అంజద్బాషా, మాజీ డిప్యూటీ సీఎం ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. ఏడాది పాలన నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే కడపలో మహానాడు నిర్వహించారు. మహానాడు సందర్భంగానైనా ఈ జిల్లాకు ఏం చేస్తారో చెప్పలేదు. బిర్యానీ ప్యాకెట్లు, మద్యం, నగదు ఇచ్చి జనాన్ని మహానాడుకు తరలించారు. మేము నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి కూటమి నేతలు అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. – సురేష్ బాబు, కడప మేయర్ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలేదీ.. ? కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు హామీల సంగతి ఏమైంది. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు బకాయి ఉన్న 4 డీఏలను విడుదల చేసి పీఆర్సీ వేసి, ఐఆర్ ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయగా, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి మళ్లీ ప్రజలను క్యూ లైన్లలో నిలబెడుతూ ఇబ్బందులు పెడుతోంది. – ఎంవీ రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి పులివెందులలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. వారం రోజుల క్రితం వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టారని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ జెండాలు, తోరణాలను వైఎస్సార్ విగ్రహం వద్ద తొలగించారు. ఈ నేపథ్యంలో వాటిని తొలగించినందుకు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసుల అత్యుత్సాహంతో హత్యాయత్నం కేసు దాదాపు 15మంది వైఎస్సార్సీపీ నాయకుల మీద నమోదు చేసిన విషయం విదితమే. అందులో ఎస్టీ కులానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు చలపతిని కూడా కేసులో ఇరికించడంతో అతను పులివెందుల సబ్జైలులో రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి 12గంటల ప్రాంతంలో నగరిగుట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీను మరికొంతమంది వ్యక్తులతో కలిసి చలపతి ఇంటికి చేరుకుని వారి ఇంట్లో ఉన్న మహిళలపై దాడి చేశారు. మంగళవారం అర్థరాత్రి చలపతి కుటుంబ సభ్యులు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బుధవారం మధ్యాహ్నం చలపతి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే దాడి జరిగిన విషయాన్ని పులివెందుల సీఐకి ఫోన్ చేసి ఇప్పటికే అక్రమ కేసు పెట్టి చలపతిని జైలులో ఉంచారని, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. వెంటనే బాధితుల ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులమీద కేసు నమోదు చేయాలని ఎంపీ గట్టిగా డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించిన ఎంపీ కేసు నమోదు చేయాలని డిమాండ్ -
ఉత్సాహంగా అండర్–23 క్రికెట్ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్– 23 వన్డే క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగుతోంది. బుధవారం వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చిత్తూరు జట్టుపై 7 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు 45.1 ఓవర్లలో 217 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని రెడ్డి రుషిల్ 60, లోహిత్ లక్ష్మీనారాయణ 80 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 3, ప్రదీప్ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 218 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 25.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని కే హెచ్. వీరారెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శించి 125 పరుగులు (సెంచరీ) చేసి నాటౌట్గా నిలిచాడు. 69 బంతులను ఎదుర్కొని 14 బౌండరీలు, 7 బౌండరీ సిక్సులు సహాయంతో 125 పరుగులు చేశాడు. అర్జున్ టెండూల్కర్ 27 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని మహమ్మద్, రెడ్డి ప్రకాష్, డేనియల్ లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. కేఎస్ఆర్ఎం మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప జట్టుపై 13 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు 31.0 ఓవర్లలో 145 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్ రెడ్డి 28, అఖిల్ సాలుంకే 26 పరుగులు చేశారు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ 4, చెన్నారెడ్డి 3, విజయ భావేంద్రారెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 146 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 37.4 ఓవర్లలో 132 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవి చూసింది. ఆ జట్టులోని నాగ చాతుర్య 32, షేక్ ఆదిల్ హుస్సేన్ 40 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సాత్విక్ 3, సయ్యద్ అతిక్ సల్మాన్ 3, మాధవ్ 2 వికెట్లు తీసుకున్నారు. -
భారీగా మొబైల్ఫోన్లు రికవరీ
రాయచోటి : పోలీస్ బృందం చేపట్టిన మొబైల్ ఫోన్ల రికవరీ సత్ఫలితాలను ఇస్తోంది. అన్నమయ్య జిల్లా పోలీసుల పరిధిలో ఏడో విడతగా 601 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి శభాష్ అనిపించుకున్నారు. ఒక కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 601 మొబైల్ఫోన్లను రికవరీ చేసి బుధవారం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు చేతుల మీదుగా ఫోన్లు పోగొట్టుకున్న వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2024 నవంబర్ నుంచి మే నెల 2025 వరకు 1300 మొబైల్ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగతనంపై ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక బృందం ద్వారా ఫోన్ల రికవరీ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను వాడుకోవడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. నెల రోజుల వ్యవధిలో జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎస్.మహమ్మద్అలీ, టెక్నికల్ అనాలిసిస్ వింగ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి.జాన్ జోసెఫ్ ఆధ్వర్యంలో సైబర్ క్రైం సిబ్బంది మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సంయుక్తంగా పనిచేశాయన్నారు. ఇప్పటి వరకు రూ.3.16 కోట్ల విలువ గల 1627 మొబైల్ ఫోన్లను 7 విడతలలో రికవరీ చేశామని తెలిపారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేస్తామని చెప్పారు. మొబైల్ ఫోన్ పోతే.. మొబైల్ ఫోన్ పోతే జిల్లా పోలీస్ ఎల్ఎంటీఎస్ వాట్సాప్ నెంబర్ 8688830012కు హాయ్ అని మెసేజ్ చేసిన వెంటనే మీరు ఒక గూగుల్ లింక్ను రిసీవ్ చేసుకుంటారన్నారు. ఆ లింకును క్లిక్ చేసి మీ వివరాలు, మీ మొబైల్ ఐఎంఈఐ నెంబర్లు మొదలగు వివరాలను తెలియపరుస్తూ ఆ మొబైల్ను కొన్న బిల్ పేపర్ లేదా మొబైల్ బాక్స్ను మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలని వివరించారు. లేదా సీఈఐఆర్ httpr://w-ww/-c-e-ir.g-o-v.i n/H-o-me/i ndex.jr p లింకును నొక్కడం ద్వారా పోయిన మొబైల్స్ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్ఐఆర్ కట్టకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా సులభతరం చేశామని చెప్పారు. అపరిచితుల నుంచి ఫోన్లను కొనరాదు.. సెల్ఫోన్ దుకాణం నిర్వాహకులు అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయరాదని ఎస్పీ సూచించారు. అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కలిగిన బాక్సు ఉంటేనే కొనుగోలు చేయాలని తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి.. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరీకి గురైన వాటి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ప్రత్యేక బృందాలు మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా మొబైల్ఫోన్లను రికవరీ చేశారన్నారు. ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో కృషి చేసిన సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ ఎస్.మహమ్మద్అలీ, టెక్నికల్ అనాలసిస్ వింగ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి.జాన్ జోసఫ్, సైబర్ క్రైమ్ సిబ్బంది, మొబైల్ రికవరీ బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బందికి రివార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు పి.రాజారమేష్, కె.రాజారెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ తులసీరామ్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు మధు, రాఘవరెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శంకరమల్లయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, పెద్దయ్య, ఇతర పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూ.1.20 కోట్ల విలువ గల 601 మొబైల్ఫోన్లు అప్పగింత 7వ విడత మొబైల్ ఫోన్ల రికవరీ మేళా మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు -
రోడ్డు ప్రమాదంలో జార్ఖండ్ వాసి మృతి
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జార్ఖండ్ వాసి మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. వలసపల్లె పంచాయతీ మొలకలదిన్నె వద్ద బీడీఎస్ ఫంక్షన్ హాల్లో జార్ఖండ్కు చెందిన సర్ఫరాజ్ (27) పనిచేస్తున్నాడు. అతనికి ప్రతిరోజు సాయంత్రం జిమ్కు వెళ్లే అలవాటు ఉండటంతో, బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో మదనపల్లెలోని జిమ్ సెంటర్కు బయలుదేరాడు. మార్గమధ్యంలోని డ్రైవర్స్ కాలనీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై అధిక రక్తస్రావమై తీవ్ర గాయాల పాలయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిన తాలూకా పోలీసులు వాహనం అదుపుతప్పి కిందపడి గాయాలపాలై మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొందా..? లేక వాహనం అదుపుతప్పి కిందపడి మృతి చెందాడా అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
బస్సు చక్రాలు ఎక్కడంతో అటెండర్కు గాయాలు
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో బస్సు అటెండర్ తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం వాల్మీకిపురం మండలంలో జరిగింది. అనంతపురం నుంచి మదనపల్లె, వాల్మీకిపురం, తిరుపతి మీదుగా చైన్నెకి వెళ్లే ఇంద్ర ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలో డ్రైవర్ బస్సును హైవే మీదకు మళ్లించాడు. అయితే వెంటనే రోడ్డు పూర్తి కాలేదన్న కారణంతో..బస్సును వెనక్కు తిప్పేందుకు రివర్స్ తీస్తూ బస్సు అటెండర్ హరిప్రసాద్(58)ను గమనించమని చెప్పాడు. అతను బస్సు వెనుక వైపు నిల్చుని డ్రైవర్కు సూచనలిస్తూ అదుపుతప్పి కిందపడ్డాడు. ఇది గమనించని డ్రైవర్ బస్సును వెనక్కు నడపడంతో హరిప్రసాద్ కాళ్లపై బస్సు వెళ్లింది. దీంతో ప్రమాదంలో రెండుకాళ్లు విరిగాయి. వెంటనే స్థానికుల సహాయంతో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. వాల్మీకిపురం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
కళాకారులు కారణ జన్ములు
రాజంపేట : కళాకారులు కారణ జన్ములని, ఆ కోవలోనే సుమధుర గానంతో అలరించిన మహామహులు కై వల్యాన్ని పొందారని నటుడు, గాయకుడు అరవ మోహన్ రావు, సినీ గేయ రచయిత గీతం పుండరీక పేర్కొన్నారు. బుధవారం ఆలాపన ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం 79వ జయంతి సమావేశం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజంపేట రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు జబ్బిరెడ్డి, ఎస్.కళాంజలి, ఆర్కెస్ట్రా నిర్వాహకులు సునీల్, పెంచలయ్య, శ్రీను, రంగస్థల నటుడు సంగీత సుబ్బరాయుడు, గేయ రచయిత బల్ల సుబ్రమణ్యం హరి, గీతం రేణు, వరకుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పాత కక్షలతో దుకాణం ధ్వంసంనందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ అరవపల్లెలోని లక్ష్మీ నరసింహ ఎలక్ట్రికల్ షాప్ను జాసర్ అనే వ్యక్తి పాత కక్షలతో ధ్వంసం చేసినట్లు షాపు యజమాని అక్కి వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ మంగళవారం వెంకటరమణ తన షాపును రాత్రి 9.30 గంటలకు మూసివేసి ఇంటికి వెళ్లాడన్నారు. సుమారు 11.30 గంటల సమయంలో జాసర్ తన షాపు షట్టర్ పగులకొట్టి అక్రమంగా షాపులోనికి ప్రవేశించి షాప్లోని మొత్తం వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు రూ.10 వేలను ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నీటి ట్యాంకు కూల్చివేతఓబులవారిపల్లె : మండలంలోని గొబ్బూరువారిపల్లి గ్రామంలో ఉపరితల జలాశయం నీటి ట్యాంకును తొలగించారు. 2018 సంవత్సరం నాబార్డ్ నిధులతో గ్రామంలో రూ.11 లక్షల వ్యయంతో నీటి ట్యాంకులు నిర్మించారు. అయితే చాలా రోజుల నుంచి నీటి ట్యాంకు నిరుపయోగంగా ఉండటంతో యంత్రాల సాయంతో తొలగించారు. ఈ విషయంపై ఎంపీడీఓ మల్రెడ్డి మాట్లాడుతూ నీటి ట్యాంకు తొలగించిన విషయం తన దృష్టికి రాలేదని నిరుపయోగంగా ఉన్న నీటి ట్యాంకు రామాలయ నిర్మాణానికి అడ్డుగా ఉన్నందున తొలగించారని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. గ్రామస్తులు ఎవరూ ఈ విషయంపై ఎలాంటి అభ్యంతరాలు కానీ, ఫిర్యాదు చేయలేదన్నారు. అనంతరం గొబ్బూరువారిపల్లి గ్రామంలో నీటి ట్యాంకును బుధవారం వారు పరిశీలించారు. యువతి ఆత్మహత్య గాలివీడు : మండల పరిధిలోని అరవీడు గ్రామం సింగవారిపల్లెకు చెందిన రెడ్డప్ప కుమార్తె రెడ్డమ్మ(16) ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు బుధవారం తమ గ్రామ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రేషన్ పంపిణీలో అవకతవకలు తగదు
రాయచోటి టౌన్ : దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ పంపిణీ చేయాలని రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్ రేషన్ షాపు డీలర్లకు సూచించారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన రేషన్.. పరేషాన్ అనే కథనంపై ఆయన స్పందించారు. బుధవారం రాయచోటి పట్టణంలోని పలు రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపుల వద్ద డీలర్లు పంపిణీ చేస్తున్న విధానంలో తేడాలు గమనించి వారిని హెచ్చరించారు. తూకాలలో మోసం చేయరాదని అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కార్డుదారుడి వివరాలు గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ వద్ద ఉన్న పెన్షన్ ఆధారంగా సరి చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ ఒప్పంద అధ్యాపకుల నిరసన
కలికిరి : సర్వీసు పునరుద్ధరణ విషయంలో యాజమాన్యం తీరుకు నిరసనగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం ప్రిన్సిపాల్ చాంబర్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పదమూడేళ్లుగా తాము విధులు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో నామినల్ బ్రేక్ పిరియడ్ అనంతరం తమను విధుల్లో చేర్చుకునే వారన్నారు. అయితే ఈ ఏడాది ప్రిన్సిపాల్ ఒక్కో డిపార్ట్మెంట్ వారితో రివ్యూ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించి తమను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సర్వీసు పునరుద్ధరణపై తమతో చర్చించేందుకు ప్రిన్సిపాల్ అనుమతించక పోవడం దారుణమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
పేకాట జోరు.. బతుకు తారుమారు
టాస్క్ఫోర్స్ : కూటమి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించకపోయినా పేకాట క్లబ్బులు మాత్రం అన్నమయ్య జిల్లాలోని మంత్రి ఇలాకాలో మూడు పువ్వులు 36 కాయలుగా కనిపిస్తున్నాయి. జాకీ, క్విన్, కింగ్, ఆన్ అంటూ పేకాట స్థావరాలు విరాజిల్లుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన ఖాకీ, ఖద్దరులే కాపలాగా మారి పేకాట స్థావరాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఒక్క చిన్నమండెం మండల పరిధిలోనే రోజుకు కోటి రూపాయలకు పైగానే పేకాట జరుగుతున్న మాట అక్షర సత్యం, రాయచోటి పట్టణ పరిధిలోని శివారు ప్రాంతాలలో నూతనంగా నిర్వహిస్తున్న గృహాలు, గ్రామీణ ప్రాంతాలలోని మామిడి తోటలు, ఫామ్ హౌస్లలో పేకాట జోరుగా నడుస్తోంది. ఆట నిర్వహణ ద్వారా రోజుకు లక్షల రూపాయలు ఆదాయాన్ని నిర్వాహకులు గడిస్తున్నారు. వచ్చిన ఆదాయంలో మంత్రి అనుయాయులకు సగం డబ్బులు ముడుతున్నట్లు ప్రచారం ఉంది. ఆటలలో పాల్గొని వారి నుంచి ఎంట్రీ ఫీజుగా రూ. 3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వీటి నిర్వహణలో పోలీస్ శాఖలోని ఓ నిఘా అధికారి ఇటీవలనే పేకాట కారణంగా సస్పెండ్కు గురైనా పోలీసు హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు పక్కనే ఉన్న చిన్నమండెం మండలంలో పేకాట జోరుగా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కూర్చున్న చోటనే సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో కొంతమంది జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆశకు వెళ్లి జీవితాలను చిన్నాభినం చేసుకుంటున్నారు. మంత్రి నియోజకవర్గమైన రాయచోటి, ఆయన సొంత మండలమైన చిన్నమండెం మండల పరిధిలోని పలు ప్రాంతాలలో జాద శాలలు నడుస్తున్నాయి. ఎవరైనా పోలీసులకు సమాచారం ఇచ్చినా మంత్రి ఇలాకాలోని గ్రామాలలోకి పోలీసులు అడుగులు వేయలేకపోతున్నారు. ఒకవేళ దాడులు నిర్వహించినా స్టేషన్కు వెళ్లకుండానే పట్టుబడిన పేకాట రాయుళ్లు దర్జాగా ఇళ్లకు వెళ్తున్నారు. స్థానిక పోలీసుల నుంచి చర్యలు లేకపోవడంతో జిల్లా ఎస్పీ నేరుగా కొంతమంది సిబ్బందిని నియమించుకొని కఠిన చర్యలు చేపడుతున్నా జూదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదన్న వాదనలు ఉన్నాయి. అనేక మంది వ్యాపారులు, ఉద్యోగులు, సాధారణ కుటుంబ సభ్యులు లక్షలు, కోట్ల రూపాయలు ఆస్తులు అమ్మి పేకాటలో పెట్టి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇల్లు.. మామిడి తోటలే అడ్డాలు.. ఎవరికీ అనుమానం రాకుండా పేకాటరాయుళ్లు ఇల్లు, మామిడి తోటలు, ఫామ్ హౌసులు, అటవీ ప్రాంతాలలో ప్రత్యేక స్థావరాలపై ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆట ఆడేవారికి మినహా మరెవ్వరికీ సమాచారం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా పేకాట స్థావరాల వద్దకు జనం చేరుకుంటున్నారు. చీకటి పడే వరకు ఈ ఆటలు కొనసాగుతున్నాయి. రోడ్ల వెంట సీసీ కెమెరాలు, ఇన్ఫార్మర్లను పెట్టుకొని జూద శాలలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇతర జిల్లాల నుంచి.. అన్నమయ్య జిల్లాలోని పేకాట స్థావరాలకు స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా జూదరులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కడప, చిత్తూరు, అనంతపురం, కర్ణాటక రాష్ట్ర ప్రాంతాల నుంచి జూదరులు వస్తున్నారు. గ్రామాల వారిగా పోలీసులకు బాధ్యతలు అప్పగించినా దాడులు చేసి వాటి నివారణ చర్యలు చేపట్టిన సంఘటనలు లేవనే చెప్పవచ్చు. పేకాట ఆడుతున్న సమయంలో ఎవరైనా పోలీసులు దాడులు చేస్తే చాలా మంది జూదరులు వారి కళ్లు గప్పి పారిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా.. మంత్రి ఇలాకాలో విచ్చలవిడిగా జరుగుతున్న పేకాట కారణంగా మంత్రి అనుయాయులకు రోజువారిగా సమకూరుతున్న ఆదాయాన్ని చూసి జిల్లాలోని మిగిలిన నేతలు కూడా పేకాట స్థావరాల నిర్వహణకు మెగ్గుచూపుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసు శాఖలో పనిచేస్తూ సస్పెండ్కు గురైన కానిస్టేబుల్, కడపలో పోలీసులకే డాన్గా వ్యవహరిస్తున్న అశోక్ రెడ్డి, మదనపల్లికి చెందిన హేమంత్ రెడ్డి, చిన్నమండెంలోని నర్సరీ రమణ, మల్లూరు శేఖర్ రెడ్డి, నిఘా అధికారికి అత్యంత సన్నిహితుడైన డాబా అంజిలతోపాటు రాయచోటిలో మంత్రి ముఖ్య అనుచరుడు వీటి నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. అడ్డుకట్ట పడేది ఎలా. ? విచ్చలవిడిగా జరుగుతున్న పేకాటను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టడం అవసరం. జూదం ఆడేవారికి కోర్టులో కఠిన శిక్షలు లేకపోవడంతో చాలా మంది పట్టుబడినా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదని తెలుస్తోంది. పట్టుబడిన జూదరులు బయటకు వచ్చి మరలా పేకాట ఆడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తే తప్పా జూదానికి అడ్డుకట్ట పడేలా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాకీ, క్వీన్, కింగ్, ఆన్ అంటూ జిల్లాలో పేకాట స్థావరాలు ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటున్న మంత్రి అనుయాయులు రోజుకు టర్నోవర్ కోటి రూపాయలు పైబడే రాయచోటి, చిన్నమండెం కేంద్రాలుగా యథేచ్ఛగా జూదం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్న పేకాట -
●వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటింటికీ సంక్షేమం
సాక్షి రాయచోటి : పేదల సంక్షేమం ఒకవైపు....అభివృద్ధి మరోవైపు పరుగులు తీసిన పరిస్థితి నాటిది...ఇంటింటికి ఫలాలు అందడం...సేవలకు కేరాఫ్ సచివాలయం అన్నది ఇంతకుముందున్న ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితి. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా అండగా వలంటీర్ ఉన్నాడన్న ధైర్యం....మహిళలకు ఎన్నో పథకాలు...అలాగే రైతులకు వ్యవసాయంలో ఒక భరోసా....పేద ప్రజలకు ఆరోగ్య పరంగా నేనున్నాన్న గుండె ధైర్యాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారు. పేద విద్యార్థులను ఇంజనీర్లు, డాక్టర్లను చేయాలన్న సంకల్పం దిశగా భవిష్యత్ ఆలోచనతో అడుగులు వేశారు. అయితే ప్రస్తుత సర్కార్ పేద ప్రజలకు సంక్షేమం బదులు కష్టాలు తెచ్చిపెట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సర్కార్ అఽధికారంలోకి రావడంతో పథకాలకు పేర్లు మార్చిందే తప్పా.. సంక్షేమం దిశగా అడుగులు పడటం లేదు. ఎక్కడ చూసినా కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, ఇసుక, మట్టి దోపిడీతో కూటమి సర్కార్ పాలన చేస్తోంది. ఎన్నికల ముందు సూపర్సిక్స్ అంటూ ఆర్భాటంగా పథకాలు ప్రకటించి...అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి సర్కార్ వంచన, దగ, మోసం, కుట్రలపై వెన్నుపోటు దినం పేరుతో బుధవారం పెద్దఎత్తున ప్రజా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఎన్నికల సభల్లోనూ ఎన్నెన్నో.. ఎన్నికలకు ముందు రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లెల్లో చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటించారు. ఎన్నెన్నో హామీలు గుప్పించారు. రైల్వేకోడూరులో మామిడికి సంబంధించి పండ్ల రసాల పరిశ్రమ తెరిపించడం, అంతేకాకుండా మామిడికి సంబంధించి పరిశ్రమలు పెడతామన్నా దిక్కులేదు. జిల్లాలో హార్టికల్చర్ హబ్గా మారుస్తామన్నా ఇంతవరకు అతీగతీ లేదు. రాయచోటికి సంబంధించి అనేక హామీలు గుప్పించినా కార్యరూపం దాల్చలేదు. మదనపల్లె, రాజంపేటలను జిల్లా చేస్తామని హామీ ఉన్నా ఆచరణ సాధ్యం కాలేదు. రాజంపేటలో మెడికల్ కాలేజీ తీసుకు వస్తామన్నా ఇప్పటికీ లేదు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నా వైఎస్సార్ సీపీ హయాంలో టెండర్ల వరకు వచ్చిన ప్రక్రియను కూడా నిలిపి వేశారు. మదనపల్లెలో రోడ్ల అభివృద్ధికి...ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు పడలేదు. బాబు మాటలు నీటిమీద రాతలు ప్రస్తుత సీఎం చంద్రబాబు మాటలు నీటిమీద రాతలు గా తేలిపోతున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కనిపించడం లేదు. పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది అవుతున్నా తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అన్నదాత సుఖీభవ ఇలా చెబుతూపోతే సూపర్సిక్స్ పథకాలకు ఇంకా మోక్షం లభించలేదు. బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ అని అర్థమవుతోంది. ఇంటింటికి ఉద్యోగం లేదు...నిరుద్యోగ భృతి లేదు....ఇదే కాదు...అనేక రకాలుగా చెప్పిన హామీలు ఏవీ కూడా అమలుకు నోచుకోలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా అదీ కూడా అరకొరగా అందిందే తప్ప పూర్తిస్థాయిలో సబ్సిడీ అందుకున్న పరిస్థితి లేదు. ఇసుక, మట్టి దోపిడీ జిల్లాలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఇసుకను పార్టీ కీలక నేతలే భాగస్వాములై సరిహద్దులు దాటిస్తున్నారు. చెయ్యేరు నదిని లూటీ చేస్తున్నా అడిగే వారే లేరు. అంతేకాకుండా రాత్రిళ్లు పెద్దపెద్ద టిప్పర్లతో ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో చాలాచోట్ల మట్టిని కూడా అలాగే అమ్మేస్తున్నారు. చెరువుల్లోనూ తవ్వకాలు చేపట్టి మట్టిని అమ్ముకుంటుండగా గుట్టలను కూడా చదును చేస్తున్నారు. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే కబ్జాలు పెరిగిపోయాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికార పార్టీ నాయకుల ఆగడాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నా అడిగే దిక్కు దివానం లేని పరిస్థితి నెలకొంది. మరోపక్క ఎక్కడికక్కడ అక్రమ కేసులు బనాయించడం, దౌర్జన్యాలు, బెదిరింపులు కూడా కొనసాగిస్తున్నారు. మదనపల్లెకు మెడికల్ కళాశాల మంజూరైనా వాటి సీట్లను కూడా ఇవ్వకుండా ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా అభివృద్ధిని కూటమి సర్కార్ విస్మరించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు అధికారం కోసం హామీల వల అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా నెరవేర్చని కూటమి సర్కార్ రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా అందరికీ వెన్నుపోటు జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక, మట్టి తవ్వకాలు దాడులు, వేధింపులతో సాగుతున్న పాలన వలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ వాహన ఆపరేటర్ల తొలగింపు నేడు జిల్లాలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుపై నిరసనలు భారీ ఎత్తున నిర్వహించేలా సన్నద్ధమైన పార్టీ శ్రేణులు అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటింటికి సంక్షేమం అందించారు. విద్యార్థులు ,రైతులు.. ఇలా ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని పంచారు. సచివాలయాల ద్వారా 540 సేవలు, వలంటీర్ల ద్వారా ఇంటింటికి ఫలాలు అందించి వైఎస్సా ర్ సీపీ సర్కార్చరిత్రలో నిలిచిపోయింది. ఇంకా అనేక రకాల పథకాలతో మహిళలను మహారాణులుగా మార్చారు. పరిశ్రమలకు పెద్దపీట వేసి స్థాని క యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎక్కడికక్కడ పారిశ్రామిక వాడల నిర్మాణాలు చేపట్టారు. జిల్లా కేంద్రమైన రాయచోటిని విస్తృతంగా అభివృద్ధి చేశారు. మదనపల్లెలో మెడికల్ కాలేజీని అద్భుతంగా నిర్మిస్తున్నారు. అన్నిచోట్ల వంద పడకల ఆస్పత్రులు, పల్లె ముంగిట సచివాలయాల నిర్మాణాలతో వైఎస్ జగన్ సర్కార్ హయాంలో కొత్త కళ సంతరించుకుంది. -
ఖరీఫ్కు కష్టకాలం !
● దుక్కులు దున్ని విత్తనకాయల కోసం ఎదురుచూపు ● వేరుశనగ రైతుపై కక్షగట్టిన కూటమి ప్రభుత్వం ● 55,066 క్వింటాళ్ల విత్తనకాయలు అడిగితే 36,034 క్వింటాళ్లకే మంజూరు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అడిగినంత ఇచ్చిన వ్యవసాయశాఖ ● వర్షాభావంతో తగ్గిపోతున్న పంటల సాగు విస్తీర్ణం ● దీంతో 2025 ఖరీఫ్ ప్రణాళికను కుదించిన వ్యవసాయశాఖ బి.కొత్తకోట : జిల్లాలో ఖరీఫ్ సాగుకు కష్ట కాలమొచ్చింది. ఏటా సాగు అంచనాలకు అనుగుణంగా రైతాంగానికి విత్తనకాయలను సరఫరా చేయాల్సిన కూటమి ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్లో కోత విధించింది. ఇచ్చిందే తీసుకోండి అంటూ వేరుశనగ విత్తనకాయలను కేటాయించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యవసాయ ప్రణాళిక ప్రతిపాదనలో ఎంత పరిమాణంలో విత్తనకాయలపై ప్రతిపాదిస్తే అంతే పరిమాణంలో కేటాయింపులు చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైంది. భారీగా కోత విధించిన ప్రభుత్వం రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. కాగా విత్తనకాయల పంపిణీ ప్రారంభం కాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. 19,032 క్వింటాళ్ల తగ్గింపు ప్రస్తుత ఖరీఫ్లో జిల్లాలో 62,890 హెక్టార్లతో అన్ని పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో వేరుశనగ సాగు చేసే రైతాంగానికి 55,066 క్వింటాళ్ల విత్తనకాయలు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. అయితే ప్రభుత్వం అందులో కోత విధించి 36,034 క్వింటాళ్ల విత్తనకాయలు మాత్రమే మంజూరు చేస్తూ కేటాయించింది. ఈ కేటాయింపు విత్తనకాయల సరఫరాలోనూ తీవ్ర జాప్యం చేస్తోంది. ఇప్పటికే విత్తనం సిద్ధం చేసుకోవాల్సిన రైతులు విత్తనం కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు పంటల సాగుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో వేరుశనగ రైతులకు అవసరమైన విత్తనకాయలను ప్రభుత్వం పంపిణీ చేసే పరిస్థితుల్లో లేకపోవడం రైతుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. దీనితో వ్యాపారుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన విత్తనకాయల ను ఇంకా పంపిణీ ప్రారంభించలేదు. ప్రస్తుతానికి సరఫరా అయిన ఐదువేల క్వింటాళ్ల విత్తనకాయలను మ దనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లోని మండలాలకు తరలించారు. ఇవి ఏ మూలకు సరిపోవు. గత ప్రభుత్వంలో అడిగినంత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక ప్రతిపాదన మేరకు ఒక్క కింట్వా కూడా తగ్గకుండా కేటాయింపు జరిగేవి. 2022లో 59, 410 క్వింటాళ్లు, 2023లో 51,707 క్వింటాళ్లు, 2024లో 55,066 కింట్వాళ్లు కావాలని ప్రతిపాదించగా ఇంతే పరిమాణంలో కేటాయించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనితో రైతులకు ఇబ్బందులు తప్పవు. ● కాగా జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయం తగ్గిపోతోంది. 2025లో 62,890 హెక్టార్లు సాగు లక్ష్యం కాగా 2,493 హెక్టార్లలో పంటల సాగు లక్ష్యం తగ్గించారు. 30 మండలాలు కలిగిన చిన్న జిల్లాలో ఈ స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగు కావడం లేదంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే. విత్తనం కోసం ఎదురుచూపు ఖరీఫ్ సాగు కోసం రైతులు పొలాలను దుక్కులు దున్ని సిద్ధం చేశారు. విత్తనకాయలను రాయితీపై ప్రభుత్వం పంపిణీ ప్రారంభిస్తే విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ విత్తనకాయలను పూర్తిస్థాయిలో మండల కేంద్రాలకు, ఇక్కడినుంచి గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలకు తరలించి రైతులకు అందించాల్సి ఉంది. జూన్ మొదటి వారంలోకి వచ్చినా ఇంకా విత్తనకాయల జాడలేదు. దీనితో రైతులు దుక్కులు దున్ని దిక్కులు చూస్తున్నారు. -
పీఎంఎస్ పథకంపై విస్తృత ప్రచారం చేయాలి
రాయచోటి : ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించాలని విద్యుత్ చీఫ్ జనరల్ మేనేజర్ జానకిరామ్ ఆదేశించారు. మంగళవారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా ఎస్ఈ కార్యాలయంలో పీఎంఎస్ పథకం అమలు విధివిధానాలపై ట్రాన్స్కో అధికారులతో ఆయన సమీక్షించారు. వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించే విషయంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్నమ య్య జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్. చంద్రశేఖర్రెడ్డి, రాయచోటి, పీలే రు, రాజంపేట, మదనపల్లి డివిజన్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి.యుగంధర్, వై.చంద్రశేఖర్రెడ్డి, ఎన్.రాజశేఖర్రెడ్డి, గంగాధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. 5న పర్యావరణ దినోత్సవ వేడుకలు – జిల్లా కలెక్టర్ శ్రీధర్ రాయచోటి : రాజంపేటలో ఈ నెల 5న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ వేడుకలు, 7న నిర్వహించబోయే యోగా కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మీడియాకు వివరించారు. మంగళవారం సాయంత్రం రాయ చోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. రాజంపేటలోని నగరవనంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో 5 లక్షల మొక్కలు నాటుతామన్నారు. నాటుసారాపై ఫిర్యాదు చేయండి రాయచోటి : అన్నమయ్య జిల్లాను నాటుసారా రహితంగా రూపొందించడమే లక్ష్యంగా సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎకై ్సజ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాటుసారా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 191 కేసులు నమోదు చేయగా, 169 మందిని అరెస్టు చేశారని, 11,224 లీటర్ల నాటుసారా సీజ్ చేశామన్నారు. ఈ సమావేశంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు, సూపరింటెండెంట్ జి మధుసూదన్, సహాయ సూపరింటెండెంట్ వై జోగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వెన్నుపోటు దినంలో కదం తొక్కాలి
రాజంపేట టౌన్ : గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేసి వెన్నుపోటు పొడిచినందున మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చేపట్టే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాఽథ్రెడ్డి పిలుపునిచ్చారు. రాజంపేట పట్టణం జీఎంసీ కళ్యాణ మండపంలో మంగళవారం వెన్నుపోటు దినం రాజంపేట కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే, మాట్లాడారు. జగన్ మళ్లీ సీఎం అయివుంటే వివిధ పథకాల ద్వారా ప్రతి ఇంటికి రెండు లక్షల రూపాయిలు వచ్చేదన్నారు. అయితే చంద్రబాబు సీఎం కావడంతో ప్రజలకు ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూరలేదన్నారు. పథకాలు అందక పోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని తెలిపారు. ఈకారణంగా వెన్నుపోటు దినంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. దేశంలో అధికారం చేపట్టిన ఏడాదిలోనే ప్రజాగ్రహానికి గురైన ఏకై క సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని చంద్రబాబు మహానాడు వేదికగా చెప్పారన్నారు. అయితే జిల్లాలోని తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని, టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు పాలనపై నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి వచ్చి తలపడాలని ఎమ్మెల్సీ రమేష్యాదవ్ సవాల్ విసిరారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని ఉప ఎన్నికల్లో ఉమ్మడి వైఎస్సార్జిల్లాలో ఉన్న పది సీట్లలో టీడీపీ ఒక్కసీటు గెలిచినా తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, అందుకు బాబు సిద్ధమా అని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు జెనుగు కృష్ణారావుయాదవ్, బీసీసెల్ నాయకుడు వడ్డే రమణ, మహిళా విభాగం ప్రతినిధులు రక్కాసి శ్రీవాణి, మిర్యాల సురేఖ, సుజాత, ఆరెళ్ళ రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఆకేపాటి పిలుపు -
చంద్రబాబుకు బుద్ధి చెప్పండి
కురబలకోట : సీఎం పదవి కోసం కాళ్లు కడిగి కన్యాదానం చేసిన సొంత మామ ఎన్టీఆర్ను నాడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.. ఆపై మామ పార్టీని నిర్దాక్షిణ్యంగా లాక్కున్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయక నేడు మరోసారి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.. రాష్ట్ర సీఎం వైఖరిని నిరసిస్తూ బుధవారం చేపట్టిన వెన్నుపోటు దినంలో వైఎస్సార్ సీపీ పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాలు, అభిమానులతోపాటు ప్రజలు భాగస్వామ్యులు కావాలని ఆ పార్టీ రాష్ట్ర కీలక నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కనసానివారిపల్లె గ్రామ సర్పంచ్ ఆర్కే కృష్ణారెడ్డి గృహం వద్ద నియోజక వర్గ నాయకులు వారికి మంగళవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ఇచ్చిన హామీలను అటకెక్కించి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసించాలన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం వెన్నుపోటుతో కూడుకున్నదన్నారు. చంద్రబాబు మోసాలకు, వెన్నుపోటుకు పేటెంట్ లాంటి వాడన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఏడాది కావస్తున్నా ఇంత వరకు ఒక్క కొత్త దివ్యాంగుల ఫించన్గాని, వృద్ధాప్య ఫించన్ గాని ఇచ్చిన పాపాన పోలేదన్నారు. భర్తను కోల్పోయిన ఎందరో వితంతువులు ఫించన్ కోసం ఎదురు చూస్తున్నా ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆపై సూపర్ సిక్స్ పథకాలకు దిక్కులేదన్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి మాయ మాటలతో కాలం వెల్లదీస్తున్న ఇంత అధ్వాన్న ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ..జరిగింది శూన్యమన్నారు. వెన్నుపోటు అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే వెన్నుపోటు గుర్తుకు వస్తాయన్నారు. ప్రజా స్వామ్య పద్ధతిలో ఈ నిరసన చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని దగా చేసిన కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వెన్నుపోటు దినంను విజయ వంతం చేసి కూటమి ప్రభుత్వ కళ్లు తెరిపించాలని కోరారు. సూపర్ సిక్స్కు దిక్కులేదు కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టండి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పిలుపు -
టీడీపీ వారి గొడవను వైఎస్సార్సీపీకి రుద్దడం తగదు
రాయచోటి టౌన్ : మట్టిని అక్రమంగా తరలించే క్రమంలో టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగితే దానిని కూడా వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ కౌనిల్సర్ ఆనందరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కంచాలమ్మ గండిలో అక్రమంగా మైనింగ్, మట్టి తరలించేందుకు టీడీపీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు. కంచాలమ్మ గండిలో జేసీబీతో మట్టిని తవ్వే విషయంలో సుబ్బారెడ్డి, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగిందన్నారు. దీంతో జేసీబీ డ్రైవర్, యజమాని అయిన పవన్ అక్కడి నుంచి నిష్క్రమించాడని చెప్పారు. అయినా ఇంటి వద్ద ఉన్న పవన్పై గంగిరెడ్డి కొడవలితో దాడికి దిగాడన్నారు. దీనిపై పోలీసులకు పవన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. మట్టి తరలింపు కోసం గొడవ పడిన వారు ఇద్దరు టీడీపీకి చెందిన వారే కాగా, పవన్ ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం తప్పన్నారు. అయితే ఈ కేసును వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అంటగట్టడం తగదన్నారు. చెస్ క్రీడాకారులకు అంతర్జాతీయ ఫిడే రేటింగ్కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ ఫిడే చెస్ రేటింగ్లను సాధించడం గర్వకారణమని జిల్లా చెస్ సంఘం కార్యదర్శి అనీస్ దర్బారి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ మైదుకూరుకు చెందిన రవి వసంత కుమార్ తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్ అలాగే ఢిల్లీలో నిర్వహించిన రెండు ఫిడే క్లాసికల్ రేటింగ్ టోర్నమెంట్లలో పాల్గొని తన అద్భుతమైన ప్రదర్శనతో 1452 క్లాసికల్ ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ను పొందారన్నారు. ప్రస్తుతం ఆయన కాశినాయన మండలం, ఇటుకలపాడు జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారన్నారు. అలాగే ప్రొద్దుటూరుకు చెందిన నదీమ్ సాహెబ్ గారి ముజమ్మిల్ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఫిడే రాపిడ్ చెస్ టోర్నమెంట్లో పాల్గొని 1491 రాపిడ్ ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ను పొందారన్నారు. ఈ ఇద్దరు క్రీడాకారుల ఫిడే రేటింగులను ఫిడే అంతర్జాతీయ చెస్ సమాఖ్య తమ అధికారిక వెబ్సైట్లో ఈ నెల 1వ తేదీన ప్రకటించిందన్నారు. -
కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
పీలేరు రూరల్ : కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని వేపులబైలు పంచాయతీ జంగంపల్లె వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సంబేపల్లె మండలం దుద్యాల పంచాయతీ పెద్ద జంగంపల్లెకు చెందిన పి. విజయలక్ష్మి(55) మంగళవారం సాయంత్రం వేపులబైలు పంచాయతీ జంగంపల్లెలో ఉన్న తమ కుమార్తె అంజనమ్మ ఇంటికి వెళ్లేందుకు పీలేరులో ఆటో ఎక్కింది. జంగంపల్లె వద్ద ఆటో దిగి రోడ్డు దాటుతుండగా మనదపల్లె వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. అదే కారులో ఆమెను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కలకడ : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై కలకడ సమీపంలో మంంగళవారం లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కలకడ ఎస్ఐ రామాంజనేయులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని గౌడసానివారిపల్లె గ్రామానికి చెందిన నారాయణప్ప (60) తన గ్రామ సమీపంలో పార్వతి పరమేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టాడు. చందాల కోసం సోమవారం రాత్రి కలకడకు చేరుకున్నాడు. మంగళవారం ఉదయం తిరిగి వెళుతుండగా రాయచోటి నుంచి పీలేరు వైపు వెళుతున్న లారీ ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన నారాయణప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ రామాంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని తమ్ముని కుమారుడు రెడ్డెప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అదుపు తప్పి ఆటో బోల్తాపుల్లంపేట : కడప–చైన్నె జాతీయ రహదారి అప్పారాజుపేట వద్ద మంగళవారం సాయంత్రం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. జమ్మలమడుగు పట్టణానికి చెందిన రామయ్య కుటుంబ సభ్యులు దైవదర్శనం కోసం శ్రీకాళహస్తికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అప్పారాజుపేట వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. అటువైపు వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, సీహెచ్ రమేష్, గల్లా శ్రీనివాసులు గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేషన్ షాపు సీజ్కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరంలోని అల్మాస్పేటలో ఉన్న 29వ రేషన్ షాపును సీజ్ చేసినట్లు ఆర్డీఓ జాన్ ఇర్విన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం ఆర్డీఓ జాన్ ఇర్విన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ దక్షిణామూర్తి ఎన్ఫోర్స్మెంట్ డీటీ మనోజ్లు రేషన్ షాపును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ దక్షిణామూర్తి మాట్లాడుతూ రేషన్ షాపులో 6,220 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా, కేవలం 1720 కిలోల బియ్యంతో పాటు చక్కెర ప్యాకెట్లు 417 ప్యాకెట్లు ఉండాల్సి ఉండగా, 430 ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనిపై సరైన సమాధానం చెప్పకపోవడంతో కేసు నమోదు చేసి రేషన్ షాపు సీజ్ చేశామన్నారు. రేషన్ షాపులో ఉన్న బియ్యంతోపాటు చక్కెరను వీఆర్ఓకు అప్పగించామన్నారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు వీఆర్ఓ ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని తెలిపారు. కూలిన ఇంటి పైకప్పు కొండాపురం : మండల పరిధిలోని కె.రామిరెడ్డిపల్లె గ్రామంలో చప్పిడి వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన ఇంటి పై కప్పు ఉన్నట్లుండి కూలిపోయింది. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి రైతు వివరాల మేరకు ఇటీవల కురిసిన వర్షానికి ఇంటిపై కప్పులో ఉన్న చౌడు బాగా నానడంతో బరువుకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కూలింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న లేగ దూడలపై మట్టి పడటంతో వెంటనే స్థానికుల సాయంతో బయటకు తీయడంతో వాటికి కూడా ప్రమాదం తప్పింది. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన స్నేహితులు ఫారూక్(20), చైతన్య(19) ద్విచక్ర వాహనంలో బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ కు వెళ్లేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. మార్గమధ్యంలోని ములకలచెరువు మండలం బురకాయలకోట వద్దకు రాగా, ద్విచక్ర వాహనం నడుపుతున్న ఫారూక్కు, ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. చైతన్య గాయపడగా ఫారుక్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానికులు బాధితులు ఇద్దరిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఫారుక్ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అదేవిధంగా ములకలచెరువు పట్టణంలోని షాపులో పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన లక్ష్మీనారాయణ (50) వ్యక్తిగత పనులపై కదిరి పట్టణానికి వెళ్లి తిరిగి ఆర్టీసీ బస్సులో ములకలచెరువుకు వస్తుండగా, మార్గమధ్యంలోని చీకటిమాను పల్లె వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా గాయపడగా, లక్ష్మినారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారు వేర్వేరు ఆసుపత్రులకు వెళ్లగా, లక్ష్మీనారాయణను స్థానికులు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతి రుయాకు పంపారు. మదనపల్లె మండలం మాలేపాడుకు చెందిన చలపతి(60), మంగళవారం ద్విచక్ర వాహనంలో చౌడేపల్లి మండలం బోయకొండ పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. తమ గ్రామానికి చెందిన సురేష్(30)తో కలిసి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోని కృష్ణాపురం వద్ద కర్ణాటకకు చెందిన కారు వెనుకనుంచి ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. -
ఉజ్వల భవిష్యత్తుకు సోపానం
జవహర్ నవోదయలో విద్యాభ్యాసం..రాజంపేట టౌన్ : జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే చాలు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లే. అన్నమయ్య జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి రాజంపేట మండలం ఆకేపాడు పంచాయతీలోని నారమరాజుపల్లెలో, మరొకటి మదనపల్లె మండలం వలసపల్లెలో ఉంది. ఒక్కో విద్యాలయంలో ఆరవ తరగతిలో 80 సీట్లను భర్తీ చేసేందుకు ప్రతి ఏటా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన దాదాపు 10 వేల మందికి పైగా విద్యార్థులు ప్రతి ఏటా ప్రవేశ పరీక్షను రాస్తున్నారు. జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్య లభించి తద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రవేశ పరీక్షను రాయిస్తారు. అందువల్ల పోటీ తీవ్రంగా ఉంటుంది. పోటీకి తగ్గట్లు ప్రశ్నాపత్రం సరళి కూడా కొంత కఠినతరంగానే ఉంటుంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో చదివిన విద్యార్థులకు రాజంపేటలోని నవోదయ విద్యాలయంలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చదివిన విద్యార్థులకు మదనపల్లెలోని నవోదయ విద్యాలయంలో సీట్ల కేటాయింపు ఉంటుంది. కాగా ఓ ప్రణాళికాబద్ధంగా ఇష్టంతో కష్టపడి చదివితే సీటు సాధించడం పెద్దకష్టం కాదంటున్నారు విద్యావేత్తలు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం కొన్ని దశాబ్దాల క్రితమే దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 1984వ సంవత్సరం మదనపల్లెలో, 1987వ సంవత్సరం రాజంపేటలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయి. మదనపల్లెకు చెందిన నవోదయ విద్యాలయం తొలుత హార్సిలిహిల్స్లో ఏర్పాటయింది. అనంతరం మదనపల్లె మండలం వలసపల్లెలో ఏర్పాటు చేశారు. క్రమశిక్షణతో మెరుగైన విద్యను అందించడం జవహర్ నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. 2026–2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదౖలైందని ప్రిన్సిపల్ ఎం.గీత తె లిపారు. దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు వీరే ● ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. ● అలాగే ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదవ తరగతి తప్పని సరిగా చదివి ఉండాలి. ● ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా 2025–2026 విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే సీటు లభిస్తుంది. ● నోటిఫికేషన్లో పొందు పరిచిన విధంగా గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల వారికి సీట్లు కేటాయిస్తారు. ● గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 75 శాతం, పట్టణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం సీట్ల కేటాయింపు ఉంటుంది. ● గతంలో పరీక్ష రాసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. ఇవీ ప్రయోజనాలు.. ● నవోదయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి సీటు పొందిన విద్యార్థులకు 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్లో ఉచితంగా విద్య అందిస్తారు. ● మెరుగైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతి సౌకర్యం, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం అన్ని ఉచితంగా కల్పిస్తారు. ● విద్యార్థులకు వేర్వేరుగా వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. ● విద్యాబోధన మాత్రం కంబైన్డ్ విధానంలో ఉంటుంది. ● కంప్యూటర్ కోర్సుతో పాటు ఎన్సీసీ, స్కౌట్ అండ్ గైడ్స్, సంగీతం, నృత్యం, డ్రాయింగ్, క్రాఫ్ట్, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సీట్ల కేటాయింపు ఇలా.. ● ఆరవ తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ఈ సీట్ల భర్తీకే ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది. ● 80 సీట్లలో 60 సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో, 20 సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు. రిజర్వేషన్ సౌకర్యం ఇలా.. ● బాలికలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ● గ్రామీణ ప్రాంత విద్యార్థుల సీట్ల భర్తీలో 9 సీట్లను ఎస్సీలతో, ఐదు సీట్లు ఎస్టీలతో భర్తీ చేస్తారు. ● పట్టణ ప్రాంత విద్యార్థుల సీట్ల భర్తీలో మూడు సీట్లు దివ్యాంగులకు, మూడు సీట్లు ఎస్సీలకు, ఒక సీటు ఎస్టీలతో భర్తీ చేస్తారు. పరీక్షా విధానం ఇలా.. ● మొత్తం నూరు మార్కులకు పరీక్ష ఉంటుంది. ● మెంటల్ ఎబిలిటీ, గణితం, పేరాగ్రాప్స్ ఇలా మూడు విభాగాల్లో 80 ప్రశ్నలు ఉంటాయి. ● మెంటల్ ఎబిలిటీకి (మేధాశక్తి)కి సంబంధించి 50 మార్కులకు గాను 40 ప్రశ్నలు పది భాగాల్లో ఉంటాయి. ఒక్కో భాగంలో నాలుగు ప్రశ్నలు డయాగ్రమ్స్ రూపంలో ఉంటాయి. ● గణితంకు సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. ● పేరాగ్రాప్స్కు సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. ● ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 29–7–2025 ● ప్రవేశ పరీక్ష తేదీ – 13–12–2025 సీటు సాధిస్తే.. బంగారం లాంటి జీవితం ఆరవ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల ప్రణాళికాబద్ధంగా ఇష్టంతో చదివితే సీటు సొంతం జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాలుఆరునెలలు ఆటలను కట్టిపెట్టాలి విద్యార్థులు ఆరునెలల పాటు ఆటలు కట్టి పెట్టి సమయాన్ని వృథా చేసుకోకుండా కష్టపడి చదితే నవోదయ విద్యాలయంలో సీటు సాధించవచ్చు. నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. టెన్త్లో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతటి శ్రద్ధ తీసుకుంటారో అంతకన్నా ఎక్కువగా నవోదయ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చదివిస్తే తప్పక సీటు లభిస్తుంది. నవోదయ విద్యాలయంలో విద్యార్థులు సీటు సాధించాలంటే తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. – కొండూరు రఘునాథరాజు, ఎంఈఓ, రాజంపేట -
గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు
సిద్దవటం : రోడ్డు దాటుతున్న దంపతులను గుర్తు తెలియని వాహనం ఢీకొడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దవటం మండలం భాకరాపేట గ్రామానికి చెందిన నల్లగొండు చెన్నయ్య, ఆయన భార్య వెంకటమ్మ ఇరువురు సోమవారం రాత్రి భాకరాపేట గ్రామ శివారులోని శివాలయం వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొంది. దీంతో చెన్నయ్య తలకు గాయం కాగా, వెంకటమ్మకు ఎడమ కాలు విరిగింది. 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ఈ విషయమై ఎస్ఐ మహమ్మద్రఫీ మాట్లాడుతూ ఢీకొన్న వాహనం ఆచూకీ కోసం సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామన్నారు. హైవే రోడ్డు దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండి వాహనాల రాకపోకలను గమనించి రోడ్డు దాటాలని ఎస్ఐ సూచించారు. -
ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని యూనివర్సిటీ చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి పేర్కొన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీలో అచీవర్స్డే –2025ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం సాధించాలంటే నిరంతరం కృషి చేయాలన్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర గొప్పదన్నారు. ప్లేస్మెంట్ అధికారి సునీల్ అల్లువాడ మాట్లాడుతూ ఎన్నో కంపెనీల్లో విద్యార్థులు ఎంపిక కావడమే కాకుండా, ఇంటర్న్షిప్లో కూడా పాల్గొన్నారన్నారు. ప్రిన్సిపాల్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో నిబద్ధత, మానవతా విలువలు గర్వించదగ్గవన్నారు. వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ ఖ్యాతి విద్యార్థుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జునరావు, ఇండ్రస్టియల్ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ జేఎన్టీయూ(అనంతపురం) ప్రొఫెసర్ కిరణ్మయి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ హేమకేశవులు, వివిధ విభాగాల డీన్లు, శాఖాధ్యక్షులు, అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఏయూ అచీవర్స్డేలో చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి -
5న భారీ ప్లాంటేషన్ గ్రీన్ డ్రైవ్
రాజంపేట : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న భారీ ప్లాంటేషన్ గ్రీన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథసింగ్ తెలిపారు. సోమవారం తన చాంబరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 28 విభాగాలతో జిల్లా వ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తామన్నారు. జిల్లాలో 50 శాతం పచ్చదనం సాధించాలనే ప్రధాన లక్ష్యంతో అటవీశాఖ, వివిధ శాఖల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అంతటా 4.5 లక్షల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. రాజంపేట–రాయచోటి రహదారిలోని ఎస్ఆర్పాళెం నగరవనంలో జిల్లా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఎర్రచందనం, వేప, టేకు, నేరెడు, ఉసిరి, వెదురు, చింత, దానిమ్మ, ఎగసి, గంగరావి, మారేడు, సీతాఫలం, తాండ్ర, శ్రీగంధం, తెల్లమది, మునసంపెంగా, బహునీయతో పాటు మరికొన్ని మొక్కలను నాటుతామన్నారు. ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు స్వరాన్ని వినిపించాలని.. అన్నమయ్య హరిత విప్లవంలో భాగం కావాలని ఆయన కోరారు.జిల్లా అటవీ అధికారి జగన్నాథ సింగ్ -
నెల్లూరు, చిత్తూరు జట్ల ఘన విజయం
కడప వైఎస్సార్ సర్కిల్ : కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –23 వన్డే క్రికెట్ టోర్నీలో నెల్లూరు, చిత్తూరు జట్లు ఘన విజయం సాధించాయి. సోమవారం వైఎస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో నిర్వహించిన మ్యాచ్లో కర్నూలు జట్టుపై 225 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 49.4 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కె. నిఖిలేశ్వర్ రెడ్డి 83, జి. మన్విత్ రెడ్డి 67, సోహన్ వర్మ 62 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని పి. కనీష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసుకున్నాడు. పి. సాబ్జాన్బాషా 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 388 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 36.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి పాలయింది. ఆ జట్టులోని పి. కనిష్ 60, పి. సాబ్జాన్ బాషా 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని ఎన్. భార్గవ్ అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. ఎస్ అఖిల్ సాలుంకే 2, సయ్యద్ అతిక్ సల్మాన్ 2 వికెట్లు తీసుకున్నారు. కేఎస్ఆర్ఎం మైదానంలో.. కేఎస్ఆర్ఎమ్ క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో కడప జట్టుపై చిత్తూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 50.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఏ. శివకేశవ రాయల్ 63, సి. విజయ్ రామిరెడ్డి 35 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని మహమ్మద్ 4, పి. అచ్యుతానంద 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 262 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 49.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని లోహిత్ 84, నికిత్ గౌడ్ 54 పరుగులు చేశారు. కడప జట్టులోని ఏ. నాగ కుళ్లాయప్ప 3, షేక్ ఆదిల్ హుస్సేన్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇరువురు చైన్ స్నాచర్ల అరెస్టు ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడిన కేసులో త్రీ టౌన్ పోలీసులు ఇరువురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చింతకొమ్మదిన్నె మండలంలోని మర్రి జాషువ, మైదుకూరుకు చెందిన మర్రి జయప్రకాష్లు అన్నదమ్ములు. వీరు జులాయిగా తిరుగుతుంటారు. ఈ క్రమంలో త్రీ టౌన్ పరిధిలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలో, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్కౌంటీ వద్ద ఇటీవల మహిళల మెడలో నుంచి బంగారు చైన్లను లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్ స్టేషన్లలో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరూ సుందరాచార్యుల వీధి మలుపు వద్ద ఉండగా సీఐ గోవిందరెడ్డి, ఎస్ఐలు హనుమంతు, వెంకటరెడ్డి, సిబ్బంది దస్తగిరి, సుబ్రమణ్యం, కుమార్, హోంగార్డు జనార్దన్రెడ్డిలతో కలిసి వెళ్లి సోమవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. -
పోట్లదుర్తిలో ఉద్రిక్తత
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ నిర్మాణ పనులకు సంబంధించి సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఎర్రగుంట్ల సీఐ నరేష్బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోట్లదుర్తి గ్రామానికి చెందిన అనాకపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు తన కోటా కింద గ్రామంలోని పెద్దమ్మ ఆలయ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పనులు చేపట్టేందుకు ప్రస్తుతం పూనుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయానికి సంబంధించి 3.09 ఎకరాల భూమి ఉందని, అందులో కొంత భూమిని ఆక్రమణదారులు కబ్జా చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై గ్రామస్తులు దేవాదాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు గతంలో ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టును ఆశ్రయించారు. ఆలయానికి సంబంధించిన మొత్తం స్థలంలో ఆక్రమణలను తొలగించిన తర్వాతే అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరారు. ఆలయ పరిరక్షణ కోసమే ప్రస్తుతం ఉన్న స్థలంలో ప్రహరీ నిర్మాణ పనులు చేపడుతున్నామని ఎంపీ సోదరుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం రమేష్ నాయుడు సంఘటన స్థలానికి వచ్చి చెప్పారు. ప్రహరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహింపజేయడంతోపాటు వాచ్మెన్ను ఏర్పాటు చేసి ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామని తెలిపారు. ఎంపీ నిధులతో ఆలయ పరిరక్షణ కోసం ప్రహరీని నిర్మించాలని నిర్ణయించామన్నారు. గతంలో గ్రామస్తులు ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుని న్యాయస్థానంలో రెండు పిటీషన్లు వేశారని వాటిని న్యాయ స్థానం కొట్టివేసిందన్నారు. న్యాయస్థానం సూచన మేరకే పనులు చేపడుతున్నామని, ఇందులో తమకు ఎలాంటి స్వార్థం లేదని సురేష్నాయుడు తెలిపారు. ప్రహరీని నిర్మించి తీరుతామన్నారు. పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్తులు ఆలయ పరిరక్షణ కోసమే అంటున్న సురేష్ నాయుడు -
జోరుగా ఇసుక అక్రమ రవాణా
సాసాక్షి టాస్క్ఫోర్స్ : తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య టీడీపీ నేత కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ములకలచెరువుకు చెందిన ఈ కీలక నేత ఆదేశాలతోనే అధికారులు సైతం అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ జీ హుజూర్ అంటూ తలాడిస్తున్నారు. ఇసుక అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలవడంతో ప్రజలంతా అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా విస్తుపోతున్నారు. హంద్రీ నీవా కాలువ పనుల పేరుతో ఇసుకను అక్రమంగా దోచేస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటం గమనార్హం. ములకలచెరువు మండలంలోని రామానాయునికోట ఏటి వద్ద పెద్ద ఎత్తున హిటాచీ యంత్రాలతో ఇసుకను టిప్పర్లలో నింపి పగలే అక్రమంగా తరలిస్తున్నా పోలీసులు, రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు వాటిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కలెక్టర్ స్పందించి కాలువ పనుల పేరుతో ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ చేశారు. సోమవారం రాత్రి మూల విరాట్ స్వామి వారికి, అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి అందంగా అలంకరించి భక్తుల దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ మాఢవీధులలో, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. పల్లకీల సేవలో స్థానిక భక్తులతో పాటు కర్నాటకకు చెందిన భక్తులు విశేషంగా పాల్గొన్నారు. యోగా కోసం సిద్దవటం కోటలో స్థల పరిశీలనసిద్దవటం : యోగా నిర్వహణ కోసం సిద్దవటంలోని మట్లిరాజుల కోటలో స్థలాన్ని సోమవారం కడప ఆర్డీఓ జాన్ఇర్విన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగాంధ్ర 2025 జిల్లా స్థాయి కార్యక్రమాల్లో భాగంగా సిద్దవటం లోని గార్డన్ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయం ఏఓ శంకరయ్య, స్థానిక తహసీల్దార్ తిరుమలబాబు, ఎంపీడీఓ ఫణిరాజకుమారి, ఆర్ఐ ప్రసాద్, వీఆర్ఓ కేశవులు, పురావస్తు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీరు బాటిల్తో వ్యక్తిపై దాడి మదనపల్లె రూరల్ : పోలీసులకు తమ గురించి సమాచారం ఇచ్చాడనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిపై బీరుబాటిల్తో దాడిచేసిన ఘటన ఆదివారం రాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. మంజునాథ కాలనీలో టూ టౌన్ పోలీసులు ఆదివారం సాయంత్రం మద్యం, గంజాయి వినియోగం, విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం స్థానికుడైన మధు(42)తో మాట్లాడి వెళ్లారు. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఆనంద్, మల్లయ్య, చంద్ర తదితరులు పోలీసులకు సమాచారం అందించి ఉంటాడనే అనుమానంతో మధుతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా బీరు బాటిల్తో దాడిచేసి కొట్టారు. దాడిలో మధు తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
గాలిలో కలిసిన సూపర్ సిక్స్ హామీలు
రాయచోటి : కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. సోమవారం రాయచోటిలో విడుదల చేసిన ప్రకటనలో అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల పంటల సాగుకు భరోసా లేదు.. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.. విద్యార్థులకు తల్లికి వందనం, నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వలేదన్నారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు 143 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఏడాది కాలంలోనే రూ.1.50 లక్షల కోట్లను కూటమి ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ పెన్షన్ తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. పదవ తరగతి మూల్యాంకనంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 9.30 గంటలకు రాయచోటి పట్టణంలోని కడప రహదారి మార్గం రింగ్రోడ్డు అన్నమయ్య సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు, శ్రేణులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్కుమార్రెడ్డి తదితర నేతలు హాజరు కానున్నట్లు శ్రీకాంత్రెడ్డి తెలిపారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
చంద్రబాబుది అరాచక, దుర్మార్గ పాలన
రైల్వేకోడూరు అర్బన్ : హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు, కూటమి పాలనలో గత ఏడాది కాలంలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి దూరం చేసి వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఈనెల 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అయినా ఇంతవరకు సూపర్సిక్స్ హామీలు అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపి వేసి అన్ని వర్గాల ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆడుకొంటున్నారని ఆరోపించారు. ఏడాది పాలనలో విద్య, వైద్య, సంక్షేమాన్ని ధ్వంసం చేశారన్నారు. దాడులు, కేసులు తప్ప ఏమీ లేవని పేర్కొన్నారు. ప్రజల నడ్డి విరచడమే కాకుండా ఏడాదిలో రాష్ట్రంలో 760 హత్యా యత్నాలు, 365 హత్యలు, మహిళల అదృశ్యం కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. ప్రశ్నించే పవన్కళ్యాణ్ ఏమయ్యోరో తెలీలేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమయ్యారని తెలిపారు. ఈనె 4 న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, జిల్లా యువజనఽ అధ్యక్షుడు యలగచెర్ల శివప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, తల్లెం భరత్ కుమార్రెడ్డి, నందాబాల, సుబ్బరామరాజు, గునిశెట్టి రమేష్, సిద్దూ రాయల్, కరీముల్లా, శంకరయ్య, మధు, ప్రదీప్, డీవీ రమణ పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల -
పట్టా భూమి ఆక్రమణపై కలెక్టర్కు ఫిర్యాదు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లుకు చెందిన తలారీ ఆదెన్న కుమారుడు తలారీ ఉత్తన్న అనే రైతు గ్రానైట్ క్వారీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. బాధిత రైతు కథనం మేరకు వివరాలిలా... తన కుటుంబానికి వారసత్వంగా వచ్చిన పట్టా భూమిని క్వారీ లీజుదారులు ఆక్రమించుకున్నారని ఆరోపించాడు. అంతేగాక క్వారీ నుంచి వెలువడే పేలుళ్ల శబ్దాల కారణంగా నివాస గృహాలు బీటలు వారడమే గాక రైతుల బోరు బావుల్లోని మోటార్లు కదలి పైపులు పూడుకు పోతున్నా పట్టించుకునే వారు లేరని వాపోయాడు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా క్వారీ పనులను రద్దు చేసేందుకు చొరవ చూపాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపాడు. మద్యం షాపులో చోరీసిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామ శివారులో ఉన్న శ్రీ కృష్ణ మద్యం షాపులో ఆదివారం రాత్రి చోరీ జరిగిందని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. మద్యం షాపు యజమాని రామసుబ్బారెడ్డి తమ షాపులో రూ. 30 వేలు విలువచేసే మద్య బాటిళ్లు, క్యాష్ కౌంటర్లో ఉన్న రూ. 5వేలు నగదును అహపరించారని ఫిర్యాదు చేశారన్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను పరీశీలించామన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చిన్నారి నిజాయితీరాయచోటి టౌన్ : ఓ చిన్నారి బాలుడు తన నిజాయితీని చాటుకొని అందరినీ అబ్బురపరిచాడు. సోమవారం రాత్రి రాయచోటి పట్టణంలోని విశాల్ మార్ట్కు అబ్దుల్ అలీమ్ తన తండ్రి అబ్దుల్ సమద్తో కలసి షాపింగ్కు వెళ్లాడు. తనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆ ఫ్లోర్లో ఐదు గ్రాముల బంగారు ఆభరణం కనిపించింది. ఈ విషయం తన తండ్రికి చెప్పి వెంటనే మార్ట్ మేనేజర్కు అందజేశారు. ఆ ఆభరణాన్ని చూసిన మేనేజర్ ఆ బాలుడిని మెచ్చుకొని ఆలింగనం చేసుకున్నాడు. బాలుడి నిజాయితీని అక్కడున్న ప్రతి ఒక్కరూ అభినందించారు. -
అల్ల నేరేడుకు ఊజి దెబ్బ
రాయచోటి : అల్ల నేరేడు శక్తినందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడులో పుష్కలం. అలాంటి అల్ల నేరేడుకు తెగుళ్లు రూపంలో ఊజి పురుగులు వెంటాడుతున్నాయి. నిగనిగలాడే నేరేడు పండును సంతృప్తిగా తిందామన్న వారికి పురుగుల రూపంలో భయపెడుతోంది. నేరేడు పండ్లపై ఈ పురుగులు దాడి చేస్తుండటంతో కాయలు పక్వానికి చేరి మాగకుండానే కుళ్లిపోతున్నాయి. ఫలితంగా సాగు, సర్యరక్షణకు పెట్టిన ఖర్చులు కూడా వస్తాయో లేదో అన్న భయం పట్టుకుంది. కొద్దికొద్దిగా దిగుబడి వచ్చినా ప్రస్తుతం నేరేడు పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో పండ్లు రూ.250లు నుంచి రూ.300లు పైనే అమ్ముతుండటంతో నేరేడు తోటలను సాగు చేసిన రైతులు ఆనందపడుతున్న వేల ఊజీ పురుగుల దాడి వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. పండ్లతోటల సాగులో భాగంగా మామిడి, జామ, సపోటా తదితర పండ్ల మొక్కలతోపాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేరేడు పండ్లతోటల పెంపకానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చిత్తూరు జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలో కూడా అధికంగా సాగులో ఉన్న నేరేడు పండ్లను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఫలితమివ్వని మందుల పిచికారీ.. అల్లనేరేడుకు సోకుతున్న తెగుళ్లు, పురుగుల నివారణకు రకరకాల మందులు పిచికారి చేసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తులు గుత్తులుగా కాయలు కాసి మాగకుండానే మగ్గిపోతుండటాన్ని చూసి రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే మామిడి పంటకు ధరలు లేక కుంగిపోతున్న రైతులు అల్లనేరేడు పంటపై ఊజీ పురుగుల దాడి చూసి వాటి సాగుకు, సంరక్షణకు పెట్టిన డబ్బులు కూడా వచ్చే అవకాశాలు లేవని మథనపడుతున్నారు. కాయలు పక్వానికి రాకుండానే కుళ్లిపోతున్న వైనం రైతులను వెంటాడుతున్న గుబులు సస్యరక్షణ పెట్టుబడులు కూడా రావంటున్న రైతులు -
క్షయవ్యాధి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లాను క్షయ వ్యాధి రహితంగా రూపొందించడమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’’ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ క్షయ వ్యాధి పట్ల శ్రద్ధ వహించాలన్నారు. టీబీ రహిత భారత్కు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక దశలోనే టీబీ వ్యాధిని గుర్తించి చికిత్స చేయడం, క్షయ వ్యాధి వలన కలిగే మరణాలను తగ్గించడం, 2027 సంవత్సరం నాటికి భారతదేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉదారత చాటుకున్న కలెక్టర్, జేసీ.. జిల్లాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్లు ఒక్కొక్కరు ముగ్గురు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని వారి పోషకాహార కోసం తమ సొంత నిధులు రూ.10 వేలు అందించారు. డీఆర్ఓ మధుసూదనరావు, ఆర్డీఓ శ్రీనివాసులు ఒక్కొక్కరు ఇద్దరి చొప్పున దత్తత తీసుకుని రూ.5 వేలు అందించారు. జిల్లా అధికారులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతుగా తోచిన మేరకు ఆర్థిక సహాయం అందించి క్షయ రహిత జిల్లా కోసం కృషి చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన నిమిత్తం రూపొందించిన ప్రచార పోస్టర్లను జేసీ, డీఆర్ఓ, ఆర్డీఓ, వైద్యశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శైలజ, వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ చామకూరి శ్రీధర్ -
రేపు ఐటీఐలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
రాజంపేట టౌన్: జిల్లాలోని ఐటీఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం ఉదయం పది గంటల నుంచి రాజంపేట పట్టణం రెడ్డివారివీధిలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ జిల్లా కన్వీనర్ రామిరెడ్డి రాఘవరెడ్డి తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రాజంపేట, తంబళ్లపల్లె, పీలేరులోని మూడు ప్రభుత్వ ఐటీఐలతో పాటు పన్నెండు ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయన్నారు. వీటిల్లో ట్రేడ్ల ఖాళీలను బట్టి అభ్యర్థులు తమకు నచ్చిన ట్రేడ్ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. మెరిట్ నంబర్ 1 నుంచి 50 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెరిట్ నంబర్ 51 నుంచి 98 నంబర్ వరకు 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు టెన్త్ మార్కులలిస్టు, 2025లో ఉత్తీర్ణులైన వారు అయితే మార్కుల జాబితాపై తమ పాఠశాల హెడ్మాస్టర్తో అటెస్టెడ్ చేయించి తీసుకురావాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కుల ధృవీకరణ పత్రం, అగ్రవర్ణాలకు చెందిన పేదలు తహసీల్దార్ జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిపికెట్, దివ్యాంగులు సంబంధిత అధికారి జారీ చేసిన ధృవీకరణ పత్రం తీసుకురావాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో వివిధ ట్రేడ్లకు సంబంధించి 1716 సీట్లు ఉన్నాయన్నారు. -
సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరగాలి
తన కుమారుడు ఇంటర్ మీడియట్ పాసయ్యాడు. ఎంసెట్కు ధరఖాస్తు చేసుకుందామని గ్రామ సచివాలయం వద్దకు ఈబీసీ సర్టిఫికెట్ కోసం పలుమార్లు వెళ్లినా పనులు కాలేదు. ఉన్న డిజిటల్ అసిస్టెంటును జ్యోతి సచివాలయానికి డిప్టేషన్ వేశారు. జగనన్న పాలనలో సచివాలయం చుట్టూ తిరగకుండానే గ్రామ వలంటీర్ ఇంటికి వచ్చి ఆధార్, రేషన్ కార్డులు తీసుకెళ్లి వారే రెండు రోజుల్లో సర్టిఫికెట్లు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో సర్టిఫికెట్ పొందాలంటే కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తుంది. – బండి లక్ష్మిదేవి, వంతాటిపల్లె, సిద్దవటం మండలం -
అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
రాయచోటి: ప్రజలు సంతృప్తి చెందేలా పీజీఆర్ఎస్ అర్జీలను చట్ట పరిధిలో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించరు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు.పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వినతులు: రాయచోటి పట్టణానికి చెందిన ఫల్లా వనజ కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న తమకు ఇంటిస్థలం, ప్రభుత్వం తరపున ఇంటిని మంజూరు చేయాలని కలెక్టర్కు విన్నవించుకున్నారు. సుండుపల్లి మండలం, కొండల తూర్పు గ్రామానికి చెందిన పి లక్ష్మీదేవి ఒంటరి మహిళగా జీవనం సాగిస్తున్న తనకు బియ్యం కార్డు, రేషన్ మంజూరు చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రైల్వేకోడూరు మండలం ఎస్. కొత్తపల్లి గ్రామానికి చెందిన కె వెంకట నరసమ్మ పక్షవాతంతో బాధపడుతున్న తనకు సదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ , ఎస్డీసి రాఘవేంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రూ.4.29 లక్షల విలువైన జీవనోపాధి సాధనాలు పంపిణీ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న జీవనోపాధి సాధనాలను సద్వినియోగం చేసుకొని తమ జీవితాన్ని మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారంకలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరుగురు విభిన్న ప్రతిభావంతులకు రూ.4.29 లక్షల విలువైన జీవనోపాధి సహాయక ఉపకరణాలను లబ్దిదారులకు కలెక్టర్ పంపిణీ చేశారు. ముగ్గురు లబ్ధిదారులకు ఒక్కొక్కటి రూ.90 వేలు విలువ చేసే 3 ఎలక్ట్రికల్ రెట్రో ఫిట్టెడ్ మూడు చక్రాల స్కూటర్లు, ఇద్దరికి ఒక్కొక్కటి రూ.42 వేలు విలువ గల 2 బ్యాటరీ ఆధారిత ట్రై సైకిళ్లు, ఒకరికి రూ.75 వేలు విలువ చేసే హైటెక్ హైడ్రాలిక్ కృత్రిమ కాలు తదితర ఉపకరణాలను పంపిణీ చేశారు.జేసీ ఆదర్శరాజేంద్రన్ మాట్లాడుతూ ఈ వాహనాలు, కృత్రిమ కాలు వారి స్వయం ఉపాధికి తోడ్పాటును అందిస్తాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించాలి రాయచోటి: ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై ప్రజలలో అవగాహన కల్పించి సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ ఖర్చు, సబ్సిడీల గురించి ప్రజలకు వివరించి రిజిస్ట్రేషన్లు పెంచాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్ శాఖ ఎస్ఈ, ఈఈలు, నెడ్క్యాప్ సిబ్బంది జిల్లాలో సోలార్ ఇన్స్టాల్ చేసే వెండర్లు తదితరులతో జిల్లాలో సీఎం సూర్యఘర్ పథకం అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ప్రత్యేకంగా నూతన విధానాన్ని తీసుకురానున్నందున బీసీ, ఓసీల మీద దృష్టి సారించాలన్నారు. -
నిత్యపూజ స్వామి హుండీ ఆదాయం రూ. 1,08,353
సిద్దవటం: సిద్దవటం మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. రూ. 1,08,353 వచ్చినట్లు ఆలయం ఈఓ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 మార్చి 2025 నుంచి 2 జూన్ 2025 వరకు స్వామి వారి హుండీలో భక్తులు వేసిన కానుకల ద్వారా ఈ ఆదాయం వచ్చిందన్నారు.కార్యక్రమంలో దేవదాయ శాఖ కొండ గంగమ్మ దేవస్థానం నందిమండల కార్యనిర్వహణాధికారి మారుతిప్రసాద్, సిద్దవటం పోలీసులు శివప్రసాద్రెడ్డి, ఆలయ సిబ్బంది చంద్రా, అర్చకులు సుబ్రమణ్యం శర్మ, స్థానికులు వెంకటసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జైళ్ల శాఖ డీఐజీగా రవికిరణ్ కడప అర్బన్: కడప నగర శివార్లలో కేంద్ర కారాగారం పక్కనే వున్న జైళ్ల శాఖ రాయలసీమ డీఐజీగా ఎం.ఆర్ రవికిరణ్ను నియమించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో, రేపో అధికారికంగా రానున్నట్లు సమాచారం. ఈయన గతంలో కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా విధులను నిర్వహించారు. ప్రస్తుతం కోస్తాంధ్ర ప్రాంతంలో జైళ్లశాఖ డీఐజీగా పనిచేస్తున్నారు. ఖైదీలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీలకు మెరుగైన సదుపాయాలు అందించాలని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జైళ్ల శాఖ అధికారులతో కలిసి ఆయన కడప కేంద్రకారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందించే సదుపాయాలు వసతులపై ఆరా తీశారు. కేంద్రకారాగారం పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. రీమాండ్ ఖైదీ వివరాలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కడప కేంద్రకారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, జైలు అధికారులు పాల్గొన్నారు. పంటల సాగుపై రైతులకుఅవగాహన సిద్దవటం: రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రైతు రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు తెలిపారు.సిద్దవటంలోని ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో సోమవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పీఎం కిసాన్ పథకంపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. వరి, సజ్జ, చిరుధాన్యాల సాగు, మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటలు సాగు, విస్తీర్ణం పెంపు, ప్రకృతి వ్యవసాయ విధానాల వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త వీరయ్య మాట్లాడుతూ వరిలో పచ్చిరొట్ట ఎరువుల పంట పూత దశలో ఉన్నపుడు కలియదున్నాలని, 2 కిలోలు సూపర్ వేసి దున్నితే త్వరగా కుళ్లుతుందన్నారు. విత్తనశుద్ధిని తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ఉధ్యానాధికారి జయభరత్రెడ్డి మాట్లాడుతూ మామిడిలో జూన్, జూలైలో ముదురు కొమ్మలను కత్తిరించు కోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ శాస్త్రవేత్త ఖురేషి, శాస్త్రవేత్త మానస, జిల్లా వనరుల కేంద్రం ఏఓ పద్మజ, స్థానిక వ్యవసాయాధికారి రమేష్రెడ్డి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
పరిస్థితుల్లో వలంటీర్ల సేవలు
● కరోనా లాంటి విపత్కర వైఎస్సార్ సీపీ హయాంలో వలంటీర్లు ఇంటింటికి సేవలు అందించారు. అందులోనూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సందర్భంలోనూ....ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు సేవలు అందించారు. ప్రజలకు సంబంధించి ఏ పని కావాలన్నా నేరుగా వారే చేసి పెట్టేవారు. వీధిలో మంచినీరు వదిలే సమయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం, సర్టిఫికెట్లు నేరుగా ఇంటికే తెచ్చి ఇవ్వడం వంటి మహోన్నత కార్యక్రమాలు చేసి మంచి సేవకులుగా గుర్తింపు పొందిన వలంటీర్లు ప్రసుత్తం ఇంటికే పరిమితమయ్యారు. కూటమి సర్కార్ పుణ్యమా అని హామీ అమలు చేయకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నాడు వలంటీర్ల ద్వారా విశేష సేవలు పొందిన ప్రజలు, ప్రస్తుతం ఆ వ్యవస్థ లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్రీయ విద్యాలయానికి కదలిక!
రాజంపేట: పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం రాజంపేటలోని కేంద్రీయ విద్యాలయానికి(కేవీ) స్థల గ్రహణం వీడింది. ఈ విద్యాలయం మంజూరుకు లోక్సభ సభ్యుడు పీవీ మిథున్రెడ్డి కృషి చేశారు. ఫలితంగా 2016లో రాజంపేటలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైంది. దీంతో రాజంపేట పరిసర ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్తో విద్యను చదువుకొనే అవకాశం కలింగింది. తొమ్మిదేళ్లుగా... కేంద్రీయ విద్యాలయం తొమ్మిదేళ్లుగా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల క్యాంపస్ వెనుక వైపు ఉన్న భవనాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్థల ఎంపికలో జాప్యం.. శాశ్వత భవనాల నిర్మాణం కదలిక లేకపోవడానికి ప్రధాన కారణంగా స్థల ఎంపిక నిలుస్తోంది. ముందుగా చుండువారిపల్లె సమీపంలో స్థలాన్ని కేటాయించారు అప్పట్లో అక్కడ కేవీ నిర్మాణం చేపట్టే అవకాశం లేకపోయింది. దీంతో తాత్కాలికంగా సరస్వతీపురంలోని ఒకప్పటి హాస్టల్ భవనంలోనే కొనసాగే పరిస్థితి ఏర్పడింది. శాశ్వత నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతూవచ్చింది. ● రాజంపేట–నెల్లూరు రహదారిలోని పోలిగుట్టవద్దే ఎట్టకేలకు శాశ్వత నిర్మాణానికి స్థలం ఎంపిక చేశారు. పోలి పంచాయతీ పరిధిలోని 1815–5 నంబరు, 1615–6 నంబరులో 5 ఎకరాలు కేవీ సొంత భవన నిర్మాణాలకు కేటాయించారు. ఈ స్థలాన్నే ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని స్ధానిక తహసీల్దారు పీరుమున్నీ ధృవీకరించారు. నిర్మాణానికి రూ.20కోట్ల నిధుల రెడీ.. కేంద్రీయ విద్యాలయం సొంత భవనాల నిర్మాణానికి రూ.20కోట్ల నిధులు మంజూరయ్యాయి. స్థలం ఎంపిక సమస్యతో ఈ నిధులు వ్యయం కాకుండా ఉండిపోయాయి.ప్రసుతం పనులు చేపట్టడానికి మార్గం సుగమమైంది. వీడిన స్థలగ్రహణం ఎంపీ మిథున్రెడ్డి కృషితో మంజూరు పోలిగుట్ట వద్దనే స్థలం ఎంపిక -
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి: ప్రజా వేదిక ద్వారా అందుతున్న ప్రజా సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపించాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. రాయచోటి టౌన్కు చెందిన వికలాంగురాలు కాత్యాయని సమ్యను చెప్పుకునేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆమె వద్దకే వెళ్లి సమస్యను విన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చట్ట పరిధిలో ఆమె సమస్యను పరిష్కరించాలని రాయచోటి అర్బన్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. -
జేఈఈ అడ్వాన్స్లో మెరిశారు
సాయి అనిష్ ప్రతిభ సింహాద్రిపురం: జేఈఈ అడ్వా న్స్ పరీక్షా ఫలితాలలో పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురంకు డాక్టర్ శివన్నారాయణరెడ్డి, డాక్టర్ మాధవి రెడ్డిల కుమారుడు సాయి అనిష్రెడ్డి ప్రతిభ కనబరిచాడు. ఆల్ ఇండియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని సాయి అనిష్రెడ్డి తెలిపారు. ● సింహాద్రిపురానికి చెందిన నాగిరెడ్డి సుధాకర్రెడ్డి, నవీనాల కుమారుడు నాగిరెడ్డి లిఖిత్రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో 512వ ర్యాంక్ సాధించారు.లిఖిత్రెడ్డి ప్రతిభ చూపడంపట్ల గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రాణించిన మధుమన్మోహిత్ వల్లూరు(చెన్నూరు): జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో చెన్నూరు మండలంలోని కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన మధు మన్మోహిత్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 303 వ ర్యాంక్ సాధించాడు. మధు మన్మోహిత్ రెడ్డి తల్లి ప్రశాంతి పశు సంవర్థక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తుండగా, తండ్రి మధు వేణు గోపాల్ రెడ్డి కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఇంటర్ చదివిన మధు మన్మోహిత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కెమిస్ట్రీ సబ్టెక్టులో 80 మార్కులు, ఫిజిక్స్లో 87 మార్కులు, మ్యాథ్స్లో 82 మార్కులతో మొత్తం 249 మార్కులు సాధించాడు. దీంతో ఇతడు సీఆర్ఎల్ ర్యాంకు 303 సాఽధించాడు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యంగా తెలిపాడు. తమ కుమారుడు జేఈఈ అడ్వాన్స్డ్ లో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల అతని తల్లిదండ్రులు మధు వేణుగోపాల్ రెడ్డి, ప్రశాంతిలు ఆనందం వ్యక్తం చేశారు. కాగా అతడు ఇంటర్లో 991 మార్కులు సాధించాడు. కృష్ణహర్షిత్కు 139వ ర్యాంకు సిద్దవటం: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సిద్దవటానికి చెందిన మంచాల కృష్ణ హర్షిత్ జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియాలో 139వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి మంచాల ఈశ్వరయ్య కడపలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి రాధిక గృహిణి తమ కుమారుడు కృషి, పట్టుదలతో జేఈఈలో మంచి ర్యాంకు సాధించినందుకు తల్లిదండ్రులు కుమారుడికి అభినందించారు. సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత నైపుణ్యం పొంది, ఏ1లో ఉన్నతంగా రాణించాలన్నదే తన లక్ష్యమని ర్యాంకర్ మంచాల కృష్ణ హర్షిత్ తెలిపారు. ఇటివల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఇందులో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కష్టపడి చదివారు. ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రి పురానికి చెందిన సాయి అనిష్ రెడ్డి, నాగిరెడ్డి లిఖిత్రెడ్డి, సిద్ధవటానికి చెందిన కృష్ణహర్షిత్, చెన్నూరు మండలం కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన మధు మన్మోహిత్ రెడ్డిలు మంచి ర్యాంకులతో మెరిశారు. -
కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
కడప అర్బన్: కడప నగరం చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని అశోక్నగర్లో మసీద్ వీధిలో ఆదివారం సాయంత్రం సయ్యద్ చాంద్బాషా (36) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై అతని తల్లి సయ్యద్ జుబేదా, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామకృష్ణ నగర్లో నివాసం వుంటున్న సయ్యద్ జుబేదా చిన్నకుమారుడు సయ్యద్ చాంద్బాషాకు, అశోక్నగర్ మసీద్ వీధిలో నివాసం వుంటున్న షేక్ మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. చాంద్బాషా ఆటోడ్రైవర్గాను, ఎలక్ట్రికల్ పనులు, ఇంకా తనకు వచ్చిన పనులను చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య ఆయేషా కడప నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అతను అశోక్నగర్లోనే తన అత్తగారింటికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని వుండేవాడు. వీరి మధ్య మనస్పర్థలు తీవ్రం కావడంతో పోలీసుస్టేషన్, కేసుల దాకా వెళ్లారు. గత ఆరునెలల నుంచి ఆయేషా తన పుట్టింటిలోనే వుంటూ పిల్లలను తనదగ్గరే పెట్టుకుంది. ఈ క్రమంలో పరస్పరం ఘర్షణ పడుతూనే వున్నారు.20 రోజుల క్రితం ఆయేషా తండ్రి షేక్ మహబూబ్ బాషా కువైట్ నుంచి వచ్చాడు. ఒకసారి తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం చాంద్బాషా తల్లి జుబేదాకు దావత్ ఉందని చెప్పి వెళ్లాడు. తన అత్తారింటికి సమీపానికి వెళ్లాడు. ఆ సమయంలో మామ షేక్ మహబూబ్బాషా, వారి కుటుంబ సభ్యులు సయ్యద్ చాంద్ బాషాను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి, కత్తి, కొడవలితో దారుణంగా నరికి హత్య చేశారు. రక్తపుమడుగులో పడివుండగా ప్రధాన నిందితుడైన షేక్ మహబూబ్బాషా, ఇతర కుటుంబ సభ్యులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రవికుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.మామ, కుటుంబ సభ్యులే మా కుమారుడిని పొట్టన పెట్టుకున్నారు– హతుని తల్లి జుబేదా తన కుమారుడు సయ్యద్ చాంద్ బాషా అన్ని పనులను చేసుకుంటూ తన భార్య ఆయేషాను, ముగ్గురు పిల్లలను పోషించేవాడు. తన కోడలికి, కుమారునికి మనస్పర్థలుండటం, తన కుమారుడిని మామ షేక్ మహబూబ్బాషా ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి పొట్టన బెట్టుకున్నాడని ఆరోపించారు. మామతో పాటు, అతని భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులే కారణమని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.షేక్ మహబూబ్బాషానే తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాను దారుణంగా హత్య చేశాడని, ఇందులో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. కాగా పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు షేక్ మహబూబ్బాషాతో పాటు, ఇతర నిందితులు ఉన్నారని తెలిసింది. కాగా ఈ హత్యను ఆప్ కి ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ నగర కో కన్వీనర్ ఒక ప్రకటనలో ఖండించారు. -
తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి..
టెన్త్ ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్లో చేరగానే విద్యార్థులు ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తారు. ఇంటర్మీడియట్లో బాగా చదువుకుంటేనే ఉన్నత చదువుల్లో నచ్చిన రంగంవైపు పయనించవచ్చు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటర్లో చేరగానే వారికి స్వేచ్ఛనిస్తారు. అయితే అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇంటర్లో కూడా పిల్లల పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. అప్పుడే విద్యార్థులు సరైన మార్గంలో పయనించి చదువులో రాణించగలరు. – మునగాల కృష్ణకుమార్, రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ, రాజంపేట -
తండ్రీ కొడుకులపై కత్తితో దాడి
మదనపల్లె రూరల్ : ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ వ్యక్తి కత్తితో దాడిచేయడంతో తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడి, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన మదనపల్లె మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన మేరకు...కొత్తవారిపల్లె పంచాయతీ ఓబులరెడ్డిగారిపల్లెకు చెందిన కృష్ణమూర్తి(63) కుమారుడు పృథ్వీ(23) అదే గ్రామానికి చెందిన ఫైనాన్సియల్ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్న మదన్మోహన్రెడ్డి, అరవింద్కు మధ్య ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. అరవింద్ రూ.40లక్షలు మదన్మోహన్రెడ్డికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పృథ్వీపై నగదు ఇప్పించేలా మదన్మోహన్రెడ్డి ఒత్తిడి చేశాడు. పృథ్వీ సరిగ్గా స్పందించకపోవడంతో గతనెల 9న అతని ఇంటివద్ద ఉన్న రెండు వాహనాలకు మదన్మోహన్రెడ్డి నిప్పు అంటించి తగలబెట్టాడు. ఈ ఘటనపై తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆర్థిక లావాదేవీల కారణంగా వారి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మదన్మోహన్రెడ్డి మరోసారి నగదు వసూలు విషయమై పృథ్వీ, అతడి తండ్రి కృష్ణమూర్తిలతో గొడవపడ్డాడు. ఆవేశానికి లోనై కత్తితో వారి ఇద్దరిపై దాడిచేశాడు. దాడిలో వారికి తీవ్రగాయాలు కాగా స్థానికుల సాయంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ఘటనపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని అశోక్నగర్లో మసీద్ వీధిలో ఆదివారం సాయంత్రం సయ్యద్ చాంద్బాషా (36) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై అతని తల్లి సయ్యద్ జుబేదా, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామకృష్ణ నగర్లో నివాసం వుంటున్న సయ్యద్ జుబేదా చిన్నకుమారుడు సయ్యద్ చాంద్బాషాకు, అశోక్నగర్ మసీద్ వీధిలో నివాసం వుంటున్న షేక్ మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. చాంద్బాషా ఆటోడ్రైవర్గాను, ఎలక్ట్రికల్ పనులు, ఇంకా తనకు వచ్చిన పనులను చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య ఆయేషా కడప నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అతను అశోక్నగర్లోనే తన అత్తగారింటికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని వుండేవాడు. వీరి మధ్య మనస్పర్థలు తీవ్రం కావడంతో పోలీసుస్టేషన్, కేసుల దాకా వెళ్లారు. గత ఆరునెలల నుంచి ఆయేషా తన పుట్టింటిలోనే వుంటూ పిల్లలను తనదగ్గరే పెట్టుకుంది. ఈ క్రమంలో పరస్పరం ఘర్షణ పడుతూనే వున్నారు. 20 రోజుల క్రితం ఆయేషా తండ్రి షేక్ మహబూబ్ బాషా కువైట్ నుంచి వచ్చాడు. ఒకసారి తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం చాంద్బాషా తల్లి జుబేదాకు దావత్ ఉందని చెప్పి వెళ్లాడు. తన అత్తారింటికి సమీపానికి వెళ్లాడు. ఆ సమయంలో మామ షేక్ మహబూబ్బాషా, వారి కుటుంబ సభ్యులు సయ్యద్ చాంద్ బాషాను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి, కత్తి, కొడవలితో దారుణంగా నరికి హత్య చేశారు. రక్తపుమడుగులో పడివుండగా ప్రధాన నిందితుడైన షేక్ మహబూబ్బాషా, ఇతర కుటుంబ సభ్యులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రవికుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. మామ, కుటుంబ సభ్యులే మా కుమారుడిని పొట్టన పెట్టుకున్నారు– హతుని తల్లి జుబేదా తన కుమారుడు సయ్యద్ చాంద్ బాషా అన్ని పనులను చేసుకుంటూ తన భార్య ఆయేషాను, ముగ్గురు పిల్లలను పోషించేవాడు. తన కోడలికి, కుమారునికి మనస్పర్థలుండటం, తన కుమారుడిని మామ షేక్ మహబూబ్బాషా ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి పొట్టన బెట్టుకున్నాడని ఆరోపించారు. మామతో పాటు, అతని భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులే కారణమని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ● షేక్ మహబూబ్బాషానే తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాను దారుణంగా హత్య చేశాడని, ఇందులో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. కాగా పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు షేక్ మహబూబ్బాషాతో పాటు, ఇతర నిందితులు ఉన్నారని తెలిసింది. కాగా ఈ హత్యను ఆప్ కి ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ నగర కో కన్వీనర్ ఒక ప్రకటనలో ఖండించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలే కారణం మామనే ప్రధాన నిందితుడు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకుంటాం కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసు వెల్లడి -
అన్నా వదినలపై దాడి
మదనపల్లె రూరల్ : అన్నా వదినలపై తమ్ముడి కుటుంబం దాడి చేసిన సంఘటన ఆదివారం గుర్రంకొండ మండలంలో జరిగింది. కండ్రిగ గ్రామానికి చెందిన దంపతులు ముర్తుజా, అక్తరున్నీసాలకు గ్రామానికి సమీపంలో మామిడితోట ఉంది. అయితే వారికి తెలియకుండా ముర్తుజా తమ్ముడు షఫీవుల్లా ఇతరులకు మామిడితోటలో పంట ఒడుపుకునేందుకు విక్రయించాడు. ఈ విషయం తెలియని ముర్తుజా, అక్తరున్నీసా ఆదివారం తోటలోకి వెళ్లి పండ్లు కోశారు. దీంతో అన్నదమ్ముల మధ్య వివాదం జరిగింది. ఆవేశానికి లోనైన షఫీవుల్లా అన్న వదినలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికుల సాయంతో బాధితులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. గుర్రంకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ప్రొద్దుటూరు కల్చరల్ : విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం ది బీసీ ప్రజాచైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ విద్యార్థులకు 15వ ప్రజ్ఞా పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అంతరాలను తొలగించడానికి విద్య ఒక్కటే సాధనమన్నారు. విద్యార్థులకు మంచి ఆలోచనా దృక్పథం అవరసరమన్నారు. వెనుకబాటు తనాన్ని అధిగమించాలంటే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి తొగర్ల చిరంజీవులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలన్నారు. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలన్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ -
కొత్త ప్రపంచం.. బంగారు భవిష్యత్తుకు బీజం
రాజంపేట టౌన్ : ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులది కౌమార దశ. ఆ దశలో ఆలోచనలు, ఉత్సాహం ఇలా అన్నీ కూడా రాకెట్ కంటే వేగంగానే ఉంటాయి. అలాగే ఎన్నో కలలు, ఆశలు, ఆనందాలు, హర్ట్ అయ్యే సందర్భాలు, పాఠాలు, కాలేజికి డుమ్మా కొట్టడాలు ఇలా అన్నీ కొత్తగా అనిపించేవే. ఒక్కమాటలో చెప్పాలంటే టెన్త్ వరకు తల్లిదండ్రుల చాటున పెరిగిన పిల్లలకు ఇంటర్లోకి ప్రవేశించగానే స్వేచ్ఛ రెక్కలు తొడుగుతుంది. అందువల్ల ఇంటర్మీడియట్లో చేరిన ప్రతి విద్యార్థికి అదో తెలియని అనుభూతిలా వుంటుంది. అదే సమయంలో కొత్త పరిసరాలు, కొత్త పరిచయాలు, సరికొత్త ఆలోచనలు ఇలా అన్ని కూడా విద్యార్థులకు కొత్తగా, వింతగా అనిపిస్తాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు కౌమారదశలో ఉంటారు. కనుక ఈ దశలో వేసే అడుగులే భవిష్యత్తును నిర్దేశిస్తాయి. టీనేజీలో ఉన్న వారందరికి అన్నీ తెలిసినట్లే ఉంటాయి. కాని ఏమీ తెలియని తనం ఆవహిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకుంటే జీవితం విజయం వైపు పయనిస్తుంది.. కొత్త బంగారులోకం అవుతుంది. ఏమాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకున్నా జీవితం సరిదిద్దుకోలేనంతగా వెనక్కి వెళుతుంది... పరాజయం బాటలో నడుస్తుంది. తొలిసారి పబ్లిక్ పరీక్షల్లో విజయం సాఽధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలలో చేరామన్న ఉత్సాహం, కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కలిగించే ఆనందం వెరసి విద్యార్థులకు కళాశాల దశ కొత్త అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి. అనువైన గ్రూపు, ఇష్టమైన పాఠ్యాంశాలు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇంటర్మీడియట్ విద్య. జీవితంలో కీలక అడుగులన్నీ ఇంటర్మీడియట్లోనే పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినా, గాడితప్పి అంధఃపాతాళానికి పడిపోయినా ఇంటర్మీడియట్లోనే బీజాలు పడతాయి. హైస్కూల్ విద్యతో ప్రారంభమయ్యే కౌమార ప్రాయం ఇంటర్లో మరింత పురి విప్పుతుంది. అందుకే ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ ఎంతో ప్రధానమైనది. చదువుపైనే దృష్టి సారించాలి.. ఇంటర్మీడియట్ విద్యార్థులు టీనేజీలో ఉంటారు. కనుక వారి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్నింటి పట్ల వెంటనే ఆకర్షితులవుతారు. అయితే మనసును అదుపులో వుంచుకొని తొలి ప్రాధాన్యత చదువుకే ఇవ్వాలి. మనసును అదుపులో ఉంచుకోకుంటే జీవితం అల్లరి పాలయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. సినిమాల్లో చూపించేలా కాలేజీకి డుమ్మా కొట్టడం హీరోయిజం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులు ఇచ్చే నోట్స్ను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం, పోటీ పరీక్షలకు అనువుగా ప్రణాళికలను రూపొందించుకోవడం, స్నేహితులతో కలిసి చదువుకోవడం వంటివి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయి. స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యం.. ప్రధానంగా ఇంటర్మీడియట్లో స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యమైనది. ఇంటర్లో ఏర్పడే స్నేహాలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తాయి. టెన్త్ వరకు తల్లిదండ్రుల పెంపకం వల్ల చాలా మంది విద్యార్థులు సన్మార్గంలో పయనిస్తారు. ఇంటర్ దశలో స్నేహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల స్నేహాల గురించి తెలుసుకోవాలి. తమ పిల్లలు సరైన వారితో స్నేహం చేయకుంటే ఆ విషయాన్ని పిల్లలకు సున్నితంగా చెప్పి పిల్లలను తమ దారిలోకి తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు ఎవరితో అయినా స్నేహం చేయవద్దు అంటే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టకుండా చెడ్డవారి స్నేహానికి దూరంగా ఉండాలి. మంచివారితో స్నేహం మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది, చెడ్డవారితో స్నేహం ఉజ్వలంగా ఉండాల్సిన భవిష్యత్తును దెబ్బతీస్తుంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు గాడితప్పితే జీవితమే గందరగోళం క్రమశిక్షణను అలవరుచుకుంటే ఉజ్వల భవిష్యత్తు -
ఏసీఏ అండర్–23 వన్డే క్రికెట్ టోర్నీ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏసీఏ సౌత్ జోన్ అండర్–23 వన్డే క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో ప్రారంభం రోజు అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో నెల్లూరు జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతపురం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 49.0 ఓవర్లలో 230 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని కే. హెచ్. వీరారెడ్డి 47, పి. వికాస్ 42 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని ఎన్. భార్గవ్ 4, ఎస్ అఖిల్ సాలుంకే 3, ఎన్. మాధవ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 231 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 36.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని జి. మన్విత్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శించి సెంచరీ చేశారు. 77 బంతులను ఎదుర్కొని 109 పరుగులు చేశాడు. ఎస్. ఆతిక్ సల్మాన్ 33 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని జి. మల్లికార్జున 2, ఎం. దీపక్ 2, షేక్ కామిల్ 2 వికెట్లు తీసుకున్నారు. వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో.. కడప జట్టు విజయం వైయస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ –23 వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా ప్రారంభమైన మ్యాచ్లో కడప జట్టు 21 పరుగుల తేడాతో కర్నూలు జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 45.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఎం. వాసుదేవరాజు 99, సి విజయ్ రామ్రెడ్డి 61 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని పి. సాబ్జాన్ బాషా అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. సూర్య తేజ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం 237 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 45.0 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని టి.తౌఫిక్ హుస్సేన్ 41, మనోజ్ రాజు 66 పరుగులు చేశారు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ 4 వికెట్లు తీసుకున్నాడు.తొలి రోజు మ్యాచ్లో నెల్లూరు, కడప జట్ల విజయం -
కలలను సాకారం చేసుకోవాలి..
విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైనది. ప్రతి విద్యార్థి అనవసరమైన ఆలోచనలను దరిచేరనివ్వకుండా శ్రద్ధగా చదివితే సునాయాసంగా కలలను సాకారం చేసుకోగలరు. కాలేజీలో చేరామన్న మితిమీరిన స్వేచ్ఛ ఉండకూడదు. ఉన్నత చదువులు చదివితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మా కళాశాలలో చేరే ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. అలాగే ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలను కూడా సాధిస్తున్నాము. – ఎస్వీ రమణరాజు, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజంపేట -
ఏఐని దృష్టిలో ఉంచుకోవాలి..
ఇంతవరకు జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది ఒక ఎత్తు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో జరగబోయేది మరో పెద్ద ఎత్తు. అందువల్ల ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థులు ఏఐని దృష్టిలో ఉంచుకొని గ్రూపును ఎంపిక చేసుకోవాలి. ఏఐ వల్ల భవిష్యత్తులో ఎలాంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయో మేధావులు సైతం సరైన అంచనా వేయలేక పోతున్నారు. అందువల్ల ప్రతి విద్యార్థి తన మేధస్సును అనునిత్యం వేగవంతం చేసుకోగలిగితేనే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోగలరు. – కాశిగారి ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్, అన్నమాచార్య యూనివర్సిటీ, రాజంపేట -
బంగారు నగలకు మెరుగు పెడతామంటూ..
సుండుపల్లె : బంగారు నగలకు మెరుగు పెడతామంటూ ఇద్దరు యువకులు మోసం చేసిన సంఘటన సుండుపల్లె మండలం కురవపల్లెలో జరిగింది. వివరాలు ఇలా.. గ్రామంలోని రమేష్ ఇంటి వద్దకు శనివారం బీహార్కు చెందిన ఇద్దరు యువకులు వచ్చి బంగారు నగలకు మెరుగు పెడతామంటూ నమ్మబలికారు. దీంతో వారు బొట్టుగొలుసును ఇవ్వగా ఒక ద్రావణంలో బంగారాన్ని కరిగించుకొని పరారయ్యారు. అనంతరం పెదినేనికాల్వ గ్రామ పంచాయతీ మన్యంవారిపల్లెకు చెందిన నరసింహారెడ్డి ఇంటికి వెళ్లి బంగారం మెరుగుపెడతాం అని వారిని కోరగా వాళ్లు నిరాకరించారు. అదే గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేస్తుండగా శబ్దం రావడంతో గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మూడు, నాలుగు రోజుల క్రితం కమ్మగుట్టపల్లె, సానిపాయిలోని కొన్ని ఇళ్లల్లో నగదు, బంగారు నగలు చోరీకి గురైనట్లు సమాచారం.బీహార్ యువకులకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు -
బిట్ కాయిన్స్ పేరుతో మోసం
బి.కొత్తకోట : బిట్ కాయిన్స్తో మంచి లాభాలు వస్తాయని, దీని లావాదేవిలు నిర్వహించాలని నమ్మించిన ఓ వివాహిత తనను మోసం చేసిందని బి.కొత్తకోట పీటీఎం రోడ్డుకు చెందిన కె.రామ్మూర్తి ఆదివారం వీడియో సందేశం విడుదల చేసి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..మదనపల్లెకు చెందిన యువతి వివాహం చేసుకుని తిరుపతిలో స్థిరపడింది. రామ్మూర్తి ఇంటి స్థలాల క్రయ విక్రయాలను చేస్తుంటాడు. దీనితో యువతి తల్లికి ఇంటి స్థలానికి సంబంధించి విక్రయించే విషయంలో పరిచయం కలిగింది. తర్వాత ఆ యువతి డబ్బును బిట్ కాయిన్స్లో పెట్టి లావాదేవీ లు నిర్వహిస్తే భారీ ఆదాయం వస్తుందని నమ్మించింది. దీనితో రామ్మూర్తి ఆ యువతి ఖాతాకు రూ.4.35 లక్షలు జమ చేశాడు. తర్వాత విడత వారీగా రూ.5 లక్షలు నగదు ఇచ్చాడు. ఖర్చులు, ఆస్తి తనఖా పెట్టి తెచ్చిన అప్పుపై వడ్డీ, కలుపుకుని మొత్తంగా రూ.15 లక్షలు నష్టపోయినట్టు చెబుతున్నాడు. ఈ లావాదేవీల కోసం బ్యాంకులో కరెంట్ ఖాతాను తెరవాలని చెప్పి బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ల్లో తిప్పింది. ఈ పరిస్థితులను గమనించిన రామ్మూర్తి తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా ఇస్తానని నమ్మిస్తూ ఇవ్వడం లేదని చెబుతూ బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను మోసపోయానంటూ వీడియో సందేశం విడుదల చేయగా అది వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. రూ.15 లక్షలు నష్టపోయానని ఆవేదన పోలీసులను అశ్రయించిన బాధితుడు -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 2వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని సూచించారు. నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాలు కలికిరి: పట్టణంలో వెలసిన పురాతన ఆలయం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉదయం తిరుమంజనం, రాత్రి బ్రహోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 3న ధ్వజారోహణం, పల్లకీ సేవ, 4న సింహ వాహన సేవ, 5న హనుమంత వాహనం, 6న శేష వాహనం, 7న మోహిని, గజ వాహనం, 8న కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ, 9న బ్రహ్మరథోత్సవం, 10న పార్వేట, దోపోత్సవం, 11న చక్రస్నానం, ధ్వజావరోహనం, 12న శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు మురళీధరాచార్యులు కోరారు. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాం రాయచోటి: అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదామని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన సెక్రటరీ కరిమిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల నాలుగో తేదీన తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కడప–గుంతకల్ మధ్య ప్యాసింజర్ రైలు కడప కోటిరెడ్డి సర్కిల్: కడప– గుంతకల్ మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైలును సోమవారం నుంచి నడుపుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ రైలు నంబర్ 07521గా నిర్ణయించారు. ఉదయం 7:45 గంటలకు కడపలో బయలుదేరి 8:13కు ఎర్రగుంట్ల, కొండాపురానికి 8:39, తాడిపత్రికి 9:13, గుత్తి 10:3, గుంతకల్కు 11:45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07522) గుంతకల్లులో మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరి, గుత్తికి 1:55, తాడిపత్రికి 2: 40, కొండాపురం 3:13, ఎర్రగుంట్ల 3:43, కడపకు సాయంత్రం 5:10 గంటలకు వస్తుంది. మొత్తం 22 బోగిలతో ఈ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. సుండుపల్లెలో తమ్ముళ్ల తిరుగుబాటు సుండుపల్లె: తాత్కాలిక ఇన్చార్జిగా కొనసాగుతున్న చమర్తి జగన్మోహన్రాజుపై సుండుపల్లెలో తమ్ముళ్లు తిరుగుబాటు ప్రకటించారు. ఆదివారం సుండుపల్లెలో పార్లమెంటు ఉపాధ్యక్షుడు భగవాన్ సహదేవరెడ్డి స్వగృహంలో అన్ని మండలాల టీడీపీ నాయకులు, బత్యాల వర్గీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ రాజంపేట టీడీపీ ఇన్చార్జి పోస్ట్ ఖాళీగా ఉందని, ఇంత వరకు తమ పార్టీ అధినేత చంద్రబాబు ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సుగవాసికి అధికారికంగా ఇన్చార్జి పదవి ఇవ్వలేదని, దీంతో ఆయన రాయచోటి వెళ్లిపోయారని, ఇప్పుడు ఇన్చార్జి ఎవరూ లేరని పలువురు వ్యాఖ్యానించారు. ఇప్పటికీ పార్టీ రికార్డుల్లో బత్యాలే ఇన్చార్జిగా ఉన్నారని గుర్తు చేశారు. మహానాడు వరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు జగన్మోహన్రాజు సమన్వయకర్తగా ఉంటారని స్పష్టంగా చెప్పారని, కానీ ఆయన ఇన్చార్జి అని వేసుకుంటున్నారని విమర్శించారు. ఇది సమంజసం కాదని నాయకులు అన్నారు. సుగవాసి సుబ్రమణ్యంకు ఇన్చార్జి ఇవ్వలేదని, కాబట్టి ఆయన స్థానంలో బత్యాల చెంగలరాయుడుకు రాజంపేట ఇన్చార్జి ఇవ్వాలని, ఆయనే అన్ని విధాలా అర్హుడని అన్నారు. ఈ సమావేశంలో అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు బత్యాల వర్గీయులు, టీడీపీ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలకు వేళాయె
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కీలకమైనస్థానాల కోసం ఉద్యోగుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొందరు ‘డిమాండ్’ ఉన్న ‘సీటు’ను పొందడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందు కోసం మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో బది‘లీలలు’ జరగకుండా చర్యలు చేపట్టాలి. కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలపై టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని కారణాల వల్ల ట్రాన్స్ఫర్స్ ప్రక్రియసై సందేహాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం జీఓ ఆర్టీ నంబరు 344, 399, ఈ–ఫైల్ నంబరు 2840767ను జారీ చేస్తూ, గైడ్లైన్స్ను విడుదల చేసింది. అనుకూలమైన స్ధానాల కోసం ఆరాటం కడపలోని వైద్య ఆరోగ్య శాఖ జోన్–4 కార్యాలయంతో పాటు ఈ శాఖ పరిధిలోకి వచ్చే రాయలసీమ జిల్లాల్లోని ఆరోగ్య శాఖల్లో పలు కీలకమైన స్ధానాలు ఉన్నాయి. అలాంటి చోటికి వెళ్లడానికి ఉద్యోగులు ఉబలాటపడుతున్నారు. ఉదాహరణకు కడపలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో బదిలీల కారణంగా అక్కడ పనిచేసే సీనియర్ అసిస్టెంట్స్ మరొక చోటికి వెళ్లాల్సివుంది. ఆ సీటులోకి రావడానికి ఇప్పటికే పలువురు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అదే కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న గోపాల్రెడ్డి మే 31వ తేదీన పరిపాలనా అధికారిగా పదోన్నతిపొంది, పదవీ విరమణ పొందారు. ఇప్పుడు ఈ స్థానంపై రాయలసీమ వ్యాప్తంగా పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల కన్ను పడింది. ఇది చాలా ప్రధానమైన సీటు కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఇందుకు కొందరి అండదండలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. పదోన్నతుల ద్వారా ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టును భర్తీ చేయాలి. అంతలోపే ట్రాన్స్ఫర్స్ రావడంతో వేరొక ప్రాంతంలో పనిచేస్తున్న ఆఫీస్ సూపరింటెండెంట్ బదిలీపై ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అసలు సంగతి ఏమిటంటే..‘పదోన్నతులు వస్తే ఎవరిని తేవాలి లేదా ఆ లోపు బదిలీలు గనుక జరిగితే ఎవరిని తీసుకురావాలి, లేదా మరే మార్గం ఏమైనా ఉందా..!’ అనే ఎత్తుగడల్లో ఉన్న ట్లు సమాచారం. ట్రాన్స్ఫర్స్ కారణంగా వైద్య ఆరోగ్య శాఖల్లో ఉత్కంఠ..సందడి వాతావరణం నెల కొననుంది. ● 20 రోజుల పాటు బదిలీల ప్రక్రియ గైడ్లైన్స్ను జారీ చేసిన పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ నెల 19 వరకు ప్రక్రియ 20 నుంచి బదిలీలపై నిషేధం కీలకమైన స్ధానాల కోసం గట్టి పోటీ మే 31వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వరకు 20 రోజుల పాటు బదిలీల ప్రక్రియ సాగుతుంది. 23వ తేదీన ఉద్యోగులు రిలీవ్ కావాలి. 20వ తేదీ నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం ఉంటుంది. ఒకే స్ధానంలో ఐదేళ్లకు పైగా విధులను చేపడుతున్న ఉద్యోగులంతా ట్రాన్స్ఫర్ అవుతారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తదితర ప్రధాన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మినిస్టీరియల్ స్టాఫ్ (జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సూపరిండెంట్ తదితరులు) ఒకే స్థానంలో మూడేళ్ల సర్వీసు నిండిన వారు బదిలీ అవుతారు. ఒకే చోట రెండేళ్లకు పైగా పనిచేస్తున్న వారు అభ్యర్థన బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లు, ఉద్యోగులైన భార్యాభర్తలు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం బదిలీలను చేపడుతారు. -
రేషన్ పంపిణీ పారదర్శకంగా జరగాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రాయచోటి: జిల్లాలోని 1123 చౌక ధరల దుకాణాలు ద్వారా పారదర్శకంగా రేషన్ పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం రాయచోటిలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం చెన్నముక్కపల్లి, రెడ్డివారిపల్లిలో రేషన్ పంపిణీని పునఃప్రారంభించారు. అనంతరం 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటివద్దనే రేషన్ అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రేషన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1123 చౌక ధరల దుకాణాలలో 4,97,969 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. రేషన్ కార్డుల ద్వారా 14,82,094 మంది సభ్యులు రేషన్ ద్వారా లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. ఇందులో 65 సంవత్సరాల పైబడిన కార్డుల సంఖ్య 53,707గా ఉందన్నారు. ఈ కార్డుల ద్వారా 69336 మంది సభ్యులు లబ్ధి పొందుతారని తెలిపారు. ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ఏక లేదా ద్విసభ్య కార్డుల్లోని 65 సంవత్సరాలపైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటివద్దనే రేషన్ పంపిణీ ఒకటో తేది నుంచి 05వ తేది వరకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో పంపిణీ చేస్తారన్నారు.. కార్యక్రంమలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు. -
బాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి రాజంపేట టౌన్: విద్యార్థులు మహిళలు, రైతులను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీ చేపట్టనున్న వెనునపోటు దినం కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని ఆకేపాటి పిలుపునిచ్చారు. రాజంపేట పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వెన్నుపోటుదినం పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించారని ఆరోపించారు. . వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయించడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయని ఆకేపాటి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 2019 ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను ఏడాదిలోపే 99 శాతం అమలు చేశారని, అయితే చంద్రబాబునాయుడు అందుకు భిన్నంగా అరాచక పాలన సాగిస్తున్నారన్నారు.ఇలాగే పాలన సాగిస్తే ప్రజలే బుద్ధిచెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. చంద్రబాబునాయుడు రాజకీయాల్లో వెన్నుపోటుకు ఆద్యుడన్నారు. వెన్నుపోటుదినంతో ఆయన కళ్లు తెరిపిస్తామన్నారు. బాబుకు సంపద సృష్టిచడం తెలియదని...సంపద ఎలా సృష్టించాలో ప్రజలే సలహాలు ఇవ్వాలనే స్థాయికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు.కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి, వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, జెనుగు కృష్ణారావుయాదవ్, వడ్డే రమణ, మిర్యాల సురేఖ, పాపినేని విశ్వనాధ్రెడ్డి, సనిశెట్టి నవీన్, గీతాల నరసింహారెడ్డి, ఖాజా మొహిద్దీన్, రెడ్డిమాసి రమేష్నాయుడు, జీవీ.సుబ్బరాజు, జాహీద్అలీ తదితరులు పాల్గొన్నారు. -
క్యారమ్ టోర్నమెంట్కు విశేష స్పందన
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా స్థాయి క్యారమ్ టోర్నమెంట్కు విశేష స్పందన లభించింది. కడపలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ కేటగిరీల్లో 50 మంది క్యారమ్స్ ఆటగాళ్లు పాల్గొన్నారు. అండర్ 9 ఇయర్స్ బాలురలో గోకుల్, మహేశ్వర్ జాయింట్ విన్నర్స్గా, రిషి రన్నర్గా నిలిచారు. అండర్ 11 బాయ్స్లో చరణ్సాయి విన్నర్గా, అడనాన్ రన్నర్గా, అండర్ 14 బాయ్స్లో కేఎల్ రంగనాథ్, చరణ్సాయి, బాలికల విభాగంలో షణ్ముఖప్రియ విన్నర్గా, ధరణి రన్నర్గా గెలుపొందారు. సీనియర్స్ మెన్ విభాగంలో నాగేంద్ర విన్నర్గా, మస్తాన్వల్లి రన్నర్గా నిలిచారు. ఎంపికై న వారు రాబోయే రోజుల్లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారు. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా సీనియర్ క్యారమ్స్ క్రీడాకారుడు, ఏపీఎస్పీడీసీఎల్ రిటైర్డ్ ఏఈ నాగభూషణం క్రీడాకారులకు సర్టిఫికెట్, మెమెంటోలు అందజేశారు. ప్రతి ఆదివారం ఇండోర్, డీఎస్ఏలో క్యారమ్ ఆటపై ఉచిత కోచింగ్ ఇస్తామని టోర్నమెంట్ ఆర్గనైజయింగ్ సెక్రటరీ పోలంకి గణేష్బాబు తెలిపారు. -
● వైఎస్సార్సీపీ హయాంలో నేరుగా ఇంటికి సరుకులు
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పదవీ బాధ్య తలు చేపట్టిన తర్వాత రేషన్ కష్టాలకు తెర పడింది. నేరుగా ఎండీయూ వాహనాలు..ఆపరేటర్లు, సూపర్వైజర్ల ద్వారా నేరుగా కార్డుదారుల ఇంటికే సరుకులు అందించారు. ఎక్కడికక్కడ వాహనాలు ఒక ప్రత్యేక సైరన్ మోగగానే...రేషన్ బండి వచ్చిందని నేరుగా ఇంటివద్దనే సరుకులు తీసుకునేవారు. జిల్లాలో 350కి పైగా ఉన్న ఎండీయూ వాహనాలు ప్రస్తుతం మూలకు చేరాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆపరేటర్లు, సూపర్వైజర్ల ఉపాధిపై దెబ్బపడగా, ప్రజలకు రేషన్ ఇబ్బందులు తప్పడం లేదు. ఏది ఏమైనా వైఎస్సార్సీపీ హయాంలో ఎలాంటి కష్టాలు లేకుండా సరుకులు అందేవని, ప్రస్తుతం డీలర్ల వద్దకు వెళ్లి క్యూలైన్లలో నిలబడి తీసుకోవడం పెద్ద సమస్యగా మారిందని పలువురు వాపోతున్నారు. ఇంటి వద్దకే రేషన్ బాగుండేది వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన ఇంటి వద్దకే రేషన్ విధానం మాలాంటి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ఎవరూ ఇబ్బంది పడా ్డల్సిన పరిస్థితి ఉండేది కాదు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయడంవల్ల సమస్యలు ఎదురవుతాయి. కార్డుదారులు ఎక్కువ మంది వచ్చినప్పుడు గంటల కొద్ది వేచి ఉండాలి. వృద్ధులు, మహిళలు సరుకులు మోసుకెళ్లాలంటే అవస్థలు పడాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎఫ్పీ షాపులను పునరుద్ధరిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల మాలాంటి కార్డుదారులకు మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. –ప్రమీలదేవి, సి.ఎం కొత్తపల్లె, సంబేపల్లె మండలం -
అదుపు తప్పి వాహనం బోల్తా
● ఒకరి మృతి ● ముగ్గురికి తీవ్ర గాయాలు సిద్దవటం : సిద్దవటం గ్రామ శివారులోని ఉషా గార్డెన్ వద్ద శనివారం బొలేరో పికప్ లగేజీ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో జింకా చంద్ర(44) అనే వ్యక్తి కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. డప ఉక్కాయపల్లె వైఎస్ఆర్ కాలనీకి చెందిన జింకా చంద్ర కూలి పనిచేసుకొని జీవించేవాడు. ఇతనికి బద్వేలులోని శ్రీకృష్ణ దేవరాయ నగర్లో 5 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారని, స్థలం చుట్టూ ప్రహరీ ఏర్పాటుకు శనివారం కడప నుంచి సిమెంటు ప్లేట్లు, స్తంభాలు తీసుకొని కూలీలతో బొలెరో పికప్ లగేజి వాహనంలో బద్వేల్లుకు బయలుదేరాడు. వాహనం సిద్దవటం గ్రామ శివారులోని ఉషా గార్డెన్ వద్దకు రాగానే ఎదురుగా ఎద్దు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జింకా చంద్రకు, ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు అబ్దుల్బార్, ఆర్బాజ్, అఫ్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అయితే జింకా చంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పచ్చిరొట్టతోనే భూసారం
గుర్రంకొండ : ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో వివిధ రకాల పంటల సాగు చేసే రైతుల కోసం ముందుగా పచ్చిరొట్ట సాగు చేసుకొంటే పొలాలు ఎంతో సారవంతమవుతాయి. తద్వారా భూమిలో భూసారం పెరిగి అధిక పంట దిగుబడులు సాధించవచ్చు. పచ్చిరొట్ట విత్తనాలు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. రైతులు వరి, టమాటా, ఇతర కూరగాయల పంటల సాగులో సేంద్రియ ఎరువులను తగు పాళ్లలో భూమికి అందించడంలో పచ్చిరొట్ట ఎంతో ఉపయోగపడుతుంది. మరో 15 రోజుల్లో ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువు వల్ల లాభమేంటంటే.. ఈ రకం ఎరువు వినియోగం వలన భూమి గుళ్లబారుతుంది. అలాగే భూసారం కుడా బాగా పెరుగుతుంది. పొలానికి నీటిని, పోషక పదార్థాలను నిల్వ ఉంచుకొనే శక్తి పెరగడంతో మొక్కల వేర్లకు గాలి, నీరు, పోషకాలు పుష్కలంగా అందుతాయి. జనుము, జీలుగలు, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలను ఎరువుగా తక్కువ ఖర్చుతోనే పెంచుకోవచ్చు. వీటి ద్వారా భూములు మరింత సారవంతమవుతాయి. భూమిలో ఆమ్ల, క్షార గుణాలను పెంపొందిచడం, మొక్కలకు పోషక పదార్థాల లోపాలు రాకుండా చూసుకోవడంతో పాటు పంట నాణ్యత, దిగుబడులు మెరుగుపడేందుకు ఈ రకం విత్తనాలు ఎరువులుగా వేయడం వలన చీడపీడల బెడద తగ్గుతుంది. పంటలో కలుపు మొక్కలను కూడా నివారించవచ్చు. వర్షపు నీటిని వృథాగా పోనీయకుండా భూమిలో ఇంకేలా చేస్తుంది. పంటలకు మేలుచేసే రకాల సూక్ష్మ క్రిములు భూమిలో వృద్ధి పొందేందుకు ఉపయోగపడుతుంది. పప్పుజాతి పచ్చిరొట్ట పైరు వల్ల భూమిలో నత్రజనిని స్థిరీకరించి భూసారం పెంపొందించవచ్చు. పచ్చిరొట్ట విత్తన ఎరువుల్లో ఎంపిక.. పచ్చిరొట్ట పైరు బాగా పెరిగి, ఆకులు ఎక్కువగా కాండం వచ్చి మొత్తగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వీలైనంత వరకు లెగ్గింగ్ జాతి మొక్కలను పెంచడం వలన పైర్లపైన నత్రజని బుడిపెల ద్వారా గాలిలో నత్రజని స్థిరీకరిస్తాయి. ఇవి త్వరగా కుళ్లిపోయే ప్రభావం కలిగి ఉంటాయి. ఇవి అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉండడంతో పాటు నీటి ఎద్దడి తట్టుకొని పెరుగుతుంది. పచ్చిరొట్ట పైర్ల వేర్లు భుమిలోకి త్వరగా చొచ్చుకొని పోయే గుణం కలిగి ఉంటాయి. సేంద్రియ కర్బనం లోపం సవరించుకొంటేనే.. సేంద్రియ కర్బనం లేకపోవడం వరి పంటకు శాపంగా మారుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో వస్తున్న మార్పులు పంట అవశేషాల్ని తొలగించడం లేదా కాల్చేయడం, భూమికోతకు గురికావడం సరైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడం ఇవన్నీ సేంద్రియ కర్బన లోపానికి కారణాలే. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడానికి పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు సాగుచేసుకోవడమే ఉత్తమమైన మార్గం. సేంద్రియ కర్బనం పెంచుకోవడానికి.. జీలుగల సాగు : పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసుకొంటే భూమికి అవసరమైన సేంద్రియ పదార్థాలను అందిస్తాయి. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల్లో భాగమైన జీలుగలు ఎకరానికి 12 నుంచి 15 కిలోలు వేసుకోవాలి. పూతదశలో కోసినప్పుడు ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. ఒకటన్ను జీలుగ సాగులో 5 కిలోల నత్రజని,1.5 కిలోల భాస్వరం, 4 కిలోల పొటాష్ వస్తుంది. ఇది చౌడు భూములకు బాగా పనికొస్తుంది. జనుములు : ఎకరానికి 20 నుంచి 25 కిలోల విత్తనాలు కావాలి. పూత దశకంటే పంట వేసిన ఎనిమిది వారాల తరువాత కోసినప్పుడు 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్టను ఇస్తుంది. ఒక టన్ను జనుములో 4కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, 3 కిలోల పొటాష్ ఉంటుంది. పిల్లిపెసెర సాగుతో.. ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనం వేసుకోవాలి. పూతదశలో 4 నుంచి 5 టన్నుల పచ్చిరొట్టను ఇస్తుంది. దీన్ని పశుగ్రాసంగా కూడా వాడవచ్చు. ఒకటన్ను పిల్లిపెసెరలో 4కిలోల నత్రజని, కిలో భాస్వరం, 3కిలోల పొటాష్ ఇస్తుంది. ఈ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు చల్లుకోవడం వలన భూముల్లో సేంద్రియ కర్బనం పెంపొంది వాటికి సహజసిద్ధమైన భూసారం వస్తుంది. సేంద్రియ ఎరువుతో భూమికి పోషకాలుభూసారం పెరుగుతుంది.. పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకోవడం వలన పంట పొలాల్లో భూసారం పెరుగుతుంది. సేంద్రియ ఎరువుల గుణం భూమిలో ఎక్కువగా ఉంటుంది. తద్వారా స్వచ్ఛమైన, ఆరోగ్యానికి మేలు చేసే పంట దిగుబడులు సాధించవచ్చు. – వాణిశ్రీ, ఏడీఏ, వాల్మీకిపురం -
యోగాతో ఆరోగ్యానికి రక్ష
నందలూరు : నిత్యం యోగా సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. యోగాంధ్ర 2025 జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన సౌమ్యనాథస్వామి ఆలయం ఆవరణలో శనివారం కలెక్టర్ ఆధ్వర్యంలో వేయి మందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరి ఆరోగ్య ఆంధ్ర సాధ్యమవుతుందన్నారు. రాజంపేట హైదర్నగర్కు చెందిన న్యాయశాస్త్రం రెండో సంవత్సరం విద్యార్థిని ఆర్ఏఈ మహిద్య వేసిన యోగాసనాలు అందరినీ అబ్బురపరిచాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఎంపీడీఓ రాధాకృష్ణంరాజు, డీఎఫ్ఓ జగన్నాఽథ్సింగ్, సబ్ డీఎఫ్ఓ సుబ్బరాజు, జిల్లా పర్యాటక అధికారి నాగభూషణం, డ్వామా పీడీ వెంకటరత్నం, జిల్లా ఎకై ్సజ్ అధికారి మధుసూదన్, విద్యుత్ శాఖ ఎస్ఈలు దయాకర్రెడ్డి, సహదేవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, డీఎంహెచ్ఓ ఉషశ్రీ, డీఎస్డీఓ గౌస్బాషా, పశుసంవర్థక శాఖ అధికారి, మండల స్పెషల్ అధికారి గుణశేఖర్పిళ్లై, తహసీల్దార్ పుల్లారెడ్డి, ఈఓపీఆర్డీ సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ తనిఖీ రాజంపేట : రాజంపేట మండలం తాళ్లపాకలో పింఛన్ల పంపిణీ తీరుతెన్నులను జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ శనివారం తనిఖీ చేశారు. లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. నేరుగా ఇంటి వద్దకే వెళ్లి ఫించన్ అందజేస్తున్నారా అని లబ్ధిదారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పంపిణీ సందర్భంగా ఎవరైనా డబ్బు అడుగుతున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పీరుమున్నీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 7న అన్నమయ్య ఉద్యాన వనంలో యోగా ఈనెల 7న అన్నమయ్య ఉద్యానవనం(అన్నమయ్య 108 అడుగుల విగ్రహం)లో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అన్నమయ్య సంకీర్తనలు పాడే వారిని కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పీర్మున్నీ, ఎంపీడీఓ వరప్రసాద్ ఉన్నారు. -
చెత్తకుప్పలో ప్రభుత్వ వైద్యశాల మందులు
నందలూరు : నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం సమీపంలోని చెత్తకుప్పలో ప్రభు త్వ వైద్యశాలకు సంబంధించిన మాత్రలు శనివారం దర్శనమిచ్చాయి. ఇందులో కాలం చెల్లిన మాత్రలతో పాటు 2026 సంవత్సరం వరకు సమయం ఉన్న మాత్రలు కూడా ఉన్నాయి. రోగులకు అందాల్సిన మా త్రలు చెత్తకుప్పల పాలు కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ శరత్కమల్ని వివరణ కోరగా పీహెచ్సీలో గత మూడేళ్ల నుంచి ఉన్న స్టాక్ను పరిశీలించామని, అవి తమ పీహెచ్సీకి సంబంధించినవి కాదన్నారు. నందలూరు, నాగిరెడ్డిపల్లెకు సంబంధించిన సిబ్బందిని విచారించగా ఆ మందులు తమవి కాదని స్పష్టం చేశారన్నారు. -
3 కేజీల గంజాయి స్వాధీనం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగరంలో గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కడప పాత బస్టాండులోని రవీంద్రనగర్ బ్రిడ్జి వద్ద గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారంతో తమ సిబ్బందితో కలిసి పదాడి నిర్వహించామన్నారు. పఠాన్ బిలాల్ అహ్మద్, సయ్యద్ మహబూబ్ బాషా, షేక్ అర్షద్, సయ్యద్ మహమ్మద్ ఉమర్, షేక్ మహ్మద్ రఫీ అనే ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి మూడు కేజీల గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. ఈ ఐదుగురిలో ఒక్కొక్కరిపై ఒడిస్సా రాష్ట్రం, కడప వన్టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే పలు గంజాయి కేసులు ఉన్నాయన్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న పఠాన్ బిలాల్ అహ్మద్ భవన నిర్మాణ కూలీగా, సయ్యద్ మహబూబ్ బాషా, షేక్ అర్షద్ టీ హోటల్లో మాస్టర్గా, సయ్యద్ మహ్మద్ ఉమర్ ఏసీ మెకానిక్గా, షేక్ మహ్మద్ రఫీ వస్త్ర దుకాణంలో పని చేస్తూ గంజాయి విక్రయాలు సాగిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్ఐలు టి. మహేంద్ర, నరసింహారావు, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యాశాస్త్రంపై అవగాహనతోనే విజయాలు కడప కల్చరల్ : విద్యా శాస్త్రంపై అవగాహనతోనే మానవాళికి విజయాలు దక్కగలవని నోబెల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు రవీంద్ర అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 15 రోజులుగా జరుగుతున్న వేసవి వినోదం శిక్షణా శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలల భవిష్యత్తు సమాజ అవసరాలతో ముడిపడి ఉందన్నారు. సాంకేతిక, సాంస్కృతిక అవసరాల రీత్యా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిచారు. జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల బయన్న మాట్లాడుతూ వేసవి శిక్షణా శిబిరాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, పరిశీలనాత్మక శక్తులను పెంచడంలో తోడ్పడగలవన్నారు. విజ్ఞానాన్ని సరదాగా ఎలా నేర్చుకోవచ్చో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజాద్ అలీ తెలిపారు. శిబిరంలో విద్యార్థులకు పలు శాసీ్త్రయ ప్రయోగాలు, చిత్రలేఖనం, పాటలు, మ్యాజిక్, ఓరిగామి తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేవీవీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వర్లు, ఐద్వా జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బమ్మ , రిసోర్స్ పర్సన్స్ ప్రసాద్ రెడ్డి, శిరీష, రంగనాయకులు, కామేశ్వరమ్మ, గఫూర్, సమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్య – అదనపు కట్నం వేధింపులే కారణం ధర్మవరం అర్బన్ : అదనపు కట్నం కోసం అత్తింటివారు పెడుతున్న వేధింపులు భరించలేక వివాహిత తన పుట్టింటిలో ఆత్మహత్య చేసుకుంది. ధర్మవరం టూటౌన్ సీఐ రెడ్డప్ప వివరాల మేరకు... వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ చిన్న నరసింహులుకు ధర్మవరంలోని శాంతినగర్కు చెందిన భాగ్యలక్ష్మి(31)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెళ్లయిన కొంతకాలం తర్వాత నుంచి అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు సుబ్బమ్మ, పెద్ద నరసింహులు వేధించడం మొదలు పెట్టారు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా చేశారు. అయినా మెట్టినింటి వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో భాగ్యలక్ష్మి 20 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. మనోవేదనకు గురైన భాగ్యలక్ష్మి శనివారం ఇంట్లోనే ఉరివేసుకుంది. మృతురాలి తల్లి కొండమ్మ ఫిర్యాదు మేరకు మెట్టినింటి వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. -
మీ సేవలు చిరస్మరణీయం
రాయచోటి: విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ సమాజానికి మీరు చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అన్నారు. రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులు, ఒక సీనియర్ అసిస్టెంట్ను ఘనంగా సన్మానించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు స్థానిక పోలీసు సమావేశ మందిరంలో వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో జిల్లా అదనపు ఎస్పీ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఎ. సుబ్రమణ్యం, జిల్లా స్పెషల్ బ్రాంచ్, ఏఎస్ఐలు నారాయణరాజు, ఎస్.ఉమర్ అలీ, జిల్లా పోలీసు కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఎండీ హేమలతలు పదవీ విరమణ పొందిన వారిలో ఉన్నారు. ఉద్యోగంలో చేరి సుదీర్ఘకాలం సమాజానికి సేవ చేసి ఉద్యోగంలో మంచిపేరు ప్రతిష్టలు తెచ్చారని ఏఎస్పీ కొనియాడారు. తమకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికి సత్కరించడం తమ జీవితంలో ఎన్నటికీ మరువలేమని జిల్లా అదనపు ఎస్పీకి పదవీ విరమణ పొందిన వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఎం.శ్రీనివాసులు, ఏఏఓ జె.త్రినాథ్ సత్యం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి.రాజా రమేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వీజే రామకృష్ణ, ఎం.పెద్దయ్య, ఎస్ఐలు ఆర్ఎస్ఐలు, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు. -
రైతులపై కూటమి సర్కార్ కపట ప్రేమ
రైతులపట్ల కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది.ఎన్నికలకు ముందు అన్నదాతకు అండగా ఉంటామని చెప్పింది.అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. విత్తనకాయలు కొనుగోలు చేయాలి.దుక్కులు చేసుకోవాలి.ఇందుకోసం అప్పు చేయాల్సి వస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామిని నిలబెట్టుకుని ప్రతి ఏడాది రైతుకు రూ.13,500లు అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతులపట్ల నిర్లక్ష్యం చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం వెంటనే అమలు చేయాలి. –సుబ్బరాయుడు, రైతు, సంబేపల్లె మండలం -
కోవిడ్పై ప్రజలు ఆందోళన చెందవద్దు: ఉషశ్రీ
రాయచోటి: కోవిడ్–19పై జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, దానిని ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఉషశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మదనపల్లెకు చెందిన నాగేంద్ర (27)కు కోవిడ్ పాజిటివ్గా తేలిందని చెబుతూ వాట్సప్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్పై స్పందించిన ఉషశ్రీ నాగేంద్రకు ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ తరువాతే కోవిడ్ నిర్ధారణ చేయగలుగుతామన్నారు.దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని తెలిపారు. వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్గా ఆచార్య శ్రీనివాస్ కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ టి. శ్రీనివాస్ నియమితులయ్యారు. విశ్వవిద్యాలయ వైస్–ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పత్రాలను ఆచార్య శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ.. శ్రీనివాస్కు అందజేశారు. ప్రిన్సిపల్ పోస్టుతోపాటూ కడపలోని వై.వి.యు. హాస్టళ్ల చీఫ్ వార్డెన్గా బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు ప్రిన్సిపల్ , వసతిగృహాల చీఫ్ వార్డెన్గా పనిచేసిన ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో ఆ బాధ్యతల నుంచి ఆయన రిలీవ్ అయ్యారు. మార్కెట్లకు వరదలా టమాట బి.కొత్తకోట: ఉమ్మడి చిత్తూరుజిల్లాలోని వ్యవసాయ మార్కెట్యార్డులకు టమాట వరదలా వచ్చి పడుతున్నాయి. ధరల్లో పెరుగుదల లేనప్పటికి పంట దిగుబడులు భారీగా వస్తున్నాయి. దీంతో శనివారం ఒకరోజే 5,480 టన్నులు విక్రయానికి వచ్చాయి. మదనపల్లె మార్కెట్కు 1,750 టన్నులు, వి.కోట మార్కెట్కు 132, పలమనేరు మార్కెట్కు 460, పుంగనూరు మార్కెట్కు 1,568, ములకలచెరువు మార్కెట్కు 1,580, బి.కొత్తకోట మార్కెట్కు 25 , అంగళ్లు మార్కెట్కు 40 టన్నులు వచ్చాయి. కాగా ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో కిలో టమాట రూ.6.20 పైసలు, వి.కోటలో కిలో రూ.7, పలమనేరులో కిలో రూ.7.50 పైసలు, పుంగనూరులో కిలో రూ.6.70పైసలు, ములకలచెరువులో కిలో రూ.8.50 పైసలు పలికింది. 2న డీఈఈ సెట్ పరీక్ష కడప ఎడ్యుకేషన్: వైఎస్సార్ కడప జిల్లాలో డీఈఈ సెట్–2025 (కంప్యూటర్ బేస్డ్ టెస్టు) పరీక్ష జూన్ 2వ తేదీ 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నామని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సంబంధిత పరీక్ష మూడు సెంటర్లలో నిర్వహించనున్నామని తెలిపారు. డీఈఈ సెట్–25 అభ్యర్థులు హాల్ టికెట్లను https://apdeecet.apcfss.in/ వెబ్ సైట్లో డౌన్లోన్ చేసుకోవచ్చని తెలిపారు. నామినల్ రోల్స్ లో పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి ఏవైనా సవరణలు ఉంటే పరీక్షా కేంద్రంలో సరిదిద్దుకోవచ్చ న్నారు. హాల్ టికెట్తో పాటు అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు(ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు) తమ వెంట పరీక్ష హాల్కు తీసుకొని రావాలని తెలిపారు. అభ్యర్థులు వారికి సంబంధిత పరీక్ష తేదీ, సెంటర్ను సరిచూసుకుని నిర్ణీత సమయంకంటే అరగంట ముందే పరీక్ష సెంటర్కు హాజరుకావాలని డీఈఓ తెలిపారు. బాలల కార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా చర్యలు చేపట్టాలి రాయచోటి: బాలలు, కౌమార కార్మీక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జూన్ 1 నుంచి 30వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా టాస్క్ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ, పునరావాస ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. శనివారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి చేపట్టనున్న బాలల, కమార దశ పిల్లల సంరక్షణ, పునరావాస ప్రచార కార్యక్రమంపై కార్మిక, పోలీసు, విద్య, వైద్య తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్మీకశాఖ జిల్లా అధికారి రంగరాజు జిల్లాలో జరగబోయే బాలల సంరక్షణ, పునరావాస ప్రచార కార్యక్రమాలు గురించి పలు విషయాలను కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాలల సంరక్షణ, వారి పునరావాసమే ధ్యేయంగా జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ పనిచేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ కార్మీక శాఖ ఆధ్వర్యంలో బాల, కౌమార కార్మీక వ్యవస్థ చట్టం 1986, సవరణ చట్టం 2016పై రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పోలీసు శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎన్డీఓల ప్రతినిధులు పాల్గొన్నారు. -
● అన్నదాత సుఖీభవకు ఎదురుచూపులు
సాక్షి రాయచోటి: ఎన్నెన్నో హామీలు...మరెన్నో ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అమలులో అలక్ష్యం చేస్తోంది. గత ఖరీఫ్, రబీలో పంటలు వర్షాభావంతో ఎండిపోయి కరువు పరిస్థితుల్లో చిక్కి విలవిల్లాడిపోతున్న అన్నదాతను ఆదుకోవడంలో ఇప్పటికీ కూటమి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. అన్నదాత సుఖీభవ అందిచడంలో శ్రద్ద కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పినా ఇప్పటికీ చిల్లిగవ్వ ఇవ్వలేదు. ప్రభుత్వ పగ్గాలు చంద్రబాబు చేపట్టి దాదాపు ఏడాది కావస్తున్నా పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతన్న ఖరీఫ్ ఆశలపై నీలి నీడలు అలుముకున్నాయి. గతంతో వైఎస్సార్ సీపీ సర్కార్ వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించింది. ఉచిత పంటల బీమా పథకంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో వెంటనే ఇన్ఫుట్ సబ్సిడీ అందించడం, ప్రతి ఏడాది కరువు బారిన పడిన రైతులను ఆదుకోవడం, ఖరీఫ్కుముందే వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తూ రైతులను వ్యవసాయ పరంగా ఆదుకుంది. కూటమి సర్కార్ రైతన్నకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో అన్నదాతలు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అమలు చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. గతంలో మే నెలలో రైతు భరోసా సొమ్ములు తీసుకుని పంట సాగుకు వినియోగించుకునేవారు. అయితే ఇప్పటి కూటమి సర్కార్ ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో రైతన్నలు పంటల సాగుపై ఆలోచనలో పడ్డారు. అయితే ఇప్పటికీ కూడా ఒకే విడతలో అన్నదాత సుఖీభవకు సంబంధించి చెప్పిన ప్రకారం రూ. 20 వేలు వేస్తారా? లేక ఎన్ని విడతల్లో వేస్తారో అన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు...కుటుంబంలో ఒకరికే ఇస్తారన్న ప్రచారంతో రైతన్నలు కృంగిపోతున్నారు. మరోవైపు జూన్ నుంచి ఖరీఫ్ సాగు మొదలు కానున్న తరుణంలో ప్రభుత్వం అన్నదాత సుఖీభవపై స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ● వైఎస్సార్సీపీ హయాంలో రూ.1360 కోట్ల పెట్టుబడి సాయం ఏడాది అవుతున్నానయా పైసా విదల్చని సర్కార్ వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతి ఏడాది మే నెలలో పెట్టుబడి సాయం ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడికిరైతన్నల ఎదురుచూపు -
ఏదాడి అవుతున్నా..
గతంలో ఏటా 13,500 చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి. ఈ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడాది అవుతున్నా ఇస్తామన్న రూ. 20 వేలలో నయాపైసా వేయలేదు. ఖరీఫ్ సాగుకు విత్తనాలు, ఎరువులు, దుక్కుల కోసం డబ్బులు లేక అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖరీఫ్లో వేరుశనగ సాగు చేసి నష్టపోయినా పంట నష్టం కూడా ఇప్పటికీ అందలేదు.తక్షణమే పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలి. –మట్లి రెడ్డయ్య, వడ్డిపల్లి, కుర్నూతల గ్రామం, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నదాత సుఖీభవ ఏదీ? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని హామి ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా పథకం అమలు చేయలేదు. ఈ ఏడాదైనా పెట్టుబడి సహాయం కింద సుఖీభవ పథకం అమలు చేస్తే రైతులకు ఎంతో మేలు చేసిన వారవుతారు. పంటల సాగుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. పంటలు ఎలా సాగు చేయాలో దిక్కుతోచడం లేదు. – చిన్న వెంకట రమణారెడ్డి, రైతు, గోపనపల్లె గ్రామం, గాలివీడు మండలం రైతులకు సాగు కష్టాలు రైతులకు మళ్లీ సాగు కష్టాలు దాపురించాయి. ఏడాది అవుతున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేల పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. స్పష్టంగా ఇంత వరకు ఈ పథకానికి సంబంధించి తేదీని ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద యధావిధిగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది. –సానుగారి విశ్వనాథ రెడ్డి, ఓబులవారిపల్లి -
వెన్నుపోటు పొడిచారు
పథకాలకు పేరు మార్చి ప్రజలకు రాయచోటి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ పరిశీలకులు, కడప మేయర్ సురేష్బాబు విమర్శించారు. శనివారం రాయచోటిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినోత్సవం పోస్టర్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మదనపల్లె ఇన్చార్జి నిస్సార్అహ్మద్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడప మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై మండిపడ్డారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్న విషయం 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా అని నిలదీశారు. సంపద సృష్టిస్తాను.. సూపర్ సిక్స్ అమలు చేస్తానని ప్రజలను మోసం చేశారన్నారు. కేవలం పెన్షన్ మాత్రం రూ.4 వేలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 65 లక్షల పెన్షన్లు ఇస్తే నేడు కూటమి ప్రభుత్వంలో 57 లక్షల మందికి అందుతున్నాయన్నారు. ఇందులో 7 లక్షల పింఛన్లు తగ్గించడం వాస్తవం కాదా అని అన్నారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి పీ పోలవరాన్ని దోచుకోవడంగా పాలన సాగుతోందన్నారు. సంవత్సరం పాలనలో వైఎస్సార్సీపీని టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో 99 శాతం ఉన్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను బెదిరించడమే పాలనగా కొనసాగిస్తోందన్నారు. నేడు గత ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని గద్దెనెక్కి కడపలో మహానాడు నిర్వహించి వైఎస్సార్సీపీ టార్గెట్గా ప్రసంగాలు చేశారన్నారు. హంద్రీనీవాను పూర్తి చేయకుండా బనకచర్లతో సస్యశ్యామలం చేస్తామని కొత్త రాగం అందుకున్నట్లు ఆరోపించారు. బాబుకు వెన్నుపోట్లు కొత్త కాదు: ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి చంద్రబాబుకు అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం కొత్త కాదని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి విమర్శించారు. నాడు ఎన్టీఆర్, నేడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. గండికోట నుంచి నాలుగు టీఎంసీల నీరు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నియోజకవర్గాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్తే దాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ఫ్లోరైడ్ వాటర్తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే రూ.2450 కోట్లతో పైప్లైన్ మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. వైఎస్ జగన్ 5 సార్లు కరెంటు చార్జీలు పెంచారు అన్నారు.. ఆయన ఐదు సార్లు పెంచితే చంద్రబాబు ఒకేసారి ఐదు సార్లకు మించి పెంచారన్నారు. కూటమి పాలన చేసింది శూన్యం: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని మదనపల్లి పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ నిస్సార్అహమ్మద్ ఆరోపించారు. నారా లోకేష్ మదనపల్లె పర్యటనలో టమాటా రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని, కమిషన్లు తగ్గిస్తామని చెప్పిన మాటలు నేటికీ అమలు కాలేదన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గాలివీటి వీరనాగిరెడ్డి కూడా పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారు: ఎమ్మెల్యే ఆకేపాటి సూపర్ సిక్స్ పేరిట 140 హామీలు ఇచ్చి అందరికీ మంచి చేస్తామని అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసగించారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శలు గుప్పించారు. వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తాం స్వీటు బాక్సులు తీసుకురండి అని వారిని కనిపించకుండా చేశారన్నారు. విద్యార్థులకు నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 అని ఇవ్వకుండానే మోసం చేశారన్నారు. జూన్ 4 వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి జల్లా పరిశీలకులు, కడప మేయర్ సురేష్బాబు -
ఆరోగ్యానికి పొగబెడుతుంది
రాజంపేట టౌన్ : పొగాకును ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం చేకూర్చుతుంది. ఊపిరితిత్తుల సమస్యతో పాటు గుండె జబ్బులు, పలు రకాల కేన్సర్లు, పక్షవాతం వంటి సమస్యలు పొగతాగే వారిలో ఎక్కువగా వస్తాయి. ఈ విషయాలను పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది మే 31వ తేదీ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని తీర్మానించింది. అందులో భాగంగా 1988వ సంవత్సరం నుంచి పొగాకు వల్ల కలిగే అనర్దాలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పొగాకును ఏ రూపంలో సేవించినా ప్రమాదమే.. పొగ పగ సాధిస్తుంది. సరదా..సరదా సిగరెట్టు అనారోగ్యానికి తొలిమెట్టులా మారిపోతుంది. ఎంత ఒత్తిడి నుంచైనా సిగిరెట్, బీడీ ఉపశమనం కలిగిస్తాయని, అవిలేనిదే జీవితం లేదని గొప్పలు చెప్పే పొగరాయుళ్ళు వైద్యులు చెప్పే విషయాలు వింటే గుండె జారడం మాత్రం ఖాయం. ధూమపానం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు బాగా దెబ్బతినిపోతాయి. ఆ విషయం తెలుసుకునేలోపే సిగరెట్, బీడి పొగలాగే మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని వైద్యులు చెబుతున్నారు. సిగరెట్, గుట్కా, ఖైని, పానమసాల పేరు ఏదైనా పొగాకును ఏ రూపంలో సేవించినా ప్రమాదమే అంటున్నారు వైద్యులు. ఒక సిగరెట్లో నాలుగు వందలకు పైగా హానికర విషరసాయనాలు ఉంటాయి. అందులో 48 కంటే ఎక్కువ క్యాన్సర్ కారకాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. పొగాకు వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తులు, గొంతు, దవడ, పెదాలు వంటి భాగాలకు క్యాన్సర్ సులువుగా సంక్రమిస్తుంది. ధూమపానం చేసే వ్యక్తి తనకు మాత్రమే కాకుండా తనచుట్టూ ఉండేవారి ఊపిరితిత్తుల్లో 25 శాతం విషవాయువును పంపుతూ వారి అనారోగ్యానికి కారణమవుతున్నాడు. పొగను పీల్చడం వల్ల కూడా దేశంలో ప్రతి ఏటా అనేక మంది మృత్యువాత పడుతున్నట్లు అంచనా. రోజు రోజుకు మహమ్మారిగా మారుతున్న ఈ విషవాయువు అలవాటుకు ప్రజలు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనావుంది. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అందువల్ల ధృడ సంకల్పంతో ఈ అలవాటును దూరం చేసుకోవడం పెద్ద విషయం కాదంటున్నారు వైద్యులు. ధూమపానంతో కలిగే రుగ్మతలివే ● పొగతాగడం వల్ల గొంతు, ఊపిరితిత్తులు, కడుపు, మూత్రపిండాల కేన్సర్ సోకే ప్రమాదముంది ● గుండె రక్తనాళాలు బిరుసుగా మారి గుండెపోటుకు దారితీస్తుంది ● నాడి సంబంధ వ్యాధులు, పక్షవాతానికి దారితీస్తుంది ● మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలకు కారణమవుతుంది ● దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులపై ప్రభావం చూపుతుంది ● శారీరక సామర్ద్యం, ఎముకల పటుత్వం తగ్గుతుంది ఇలా చేస్తే ధూమపానానికి దూరం కావచ్చు ● ధూమపానం అలవాటు ఉన్న వారు వారి వద్ద సిగిరెట్, బీడి, గుట్కా వంటి వాటిని ఉంచుకోకూడదు ● పొగాకు అలవాటు ఉన్న వ్యక్తులకు కొంతకాలం దూరంగా ఉండాలి ● పొగాకు సేవించడం సంపూర్ణంగా వదిలిన నాడే సంపూర్ణ ఆరోగ్యం పొందగలమన్న నిజాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలి ● ధూమపానం లేక గుట్కా వంటివి వేసుకోవాలనిపించినప్పుడల్లా లవంగాలు యాలకులు వంటి వాటిని తీసుకున్నట్టయితే తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చు ● ఆరంభంలో నాలుగు వారాలు, ఆ తరువాత ఆరువారాల పాటు ఇలాంటి ప్రయత్నం చేసి నెమ్మదిగా పొగాకు అలవాటు నుంచి శాశ్విత విముక్తి పొందవచ్చు ● ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా కూడా ధూమపానానికి, గుట్కా వంటి అలవాట్లకు దూరం కావచ్చు ధూమపానంతో ఆరోగ్యం ‘ఉఫ్’ బీడి, సిగిరెట్, గుట్కాలతో అనేక అనర్దాలు పలు రకాల వ్యాధులకు కారణం అవుతున్న పొగాకు వినియోగం జీర్ణకోశ, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు కేన్సర్ గుండె, మెదడుకు కూడా చేటు పొగాకుకు బానిసలవుతున్న యువత నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే పొగాకును ఏరూపంలో తీసుకున్నా జబ్బులను కొనితెచ్చుకున్నట్లే. చాలా మంది యువకులు సరదా కోసం సిగరెట్ తాగడం అలవాటు చేసుకొని ఆ తర్వాత సిగరెట్ తాగడాన్ని మానుకోలేక చిన్న వయస్సులోనే అనారోగ్యాల భారీన పడుతున్నారు. అందువల్ల ఎవరు కూడా సిగరెట్, బీడి, గుట్కా వంటివి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అలవాటు చేసుకోకూడదు. అలవాటు చేసుకున్న వారు ఎలాగైనా ఆ అలవాట్లను మానుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. – డాక్టర్ పాలనేని వెంకట నాగేశ్వరరాజు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట -
అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు యూనవర్సిటీ ప్రొచాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి తెలిపారు. స్ధానిక ఏయూలోని తన చాంబరులో ఏయూఈటీ –2025 మొదటి దశ ప్రవేశ ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూఈటీ ప్రవేశపరీక్ష ఈనెల 15న నిర్వహించామన్నారు. పరీక్షను మొత్తం 1908 మంది విద్యార్ధులు రాశారన్నారు. అందులో 1239 మంది విద్యార్ధులు అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన విద్యార్ధుల కోసం జూన్ 5, 6, 9, 10 తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అన్నమచార్య యూనివర్సిటీ జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబా, రిజిస్టార్ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ నారాయణ, డా.జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం కడప అర్బన్ : కడప నగర శివార్లలోని సర్వజన ఆసుపత్రికి తీవ్ర ఆనారోగ్యంతో బత్తల చిన్నా (35) అనే పేరుతో ఈనెల 28న ఓ వ్యక్తిని వైద్యం కోసం చేర్పించారు. అతడు శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అతని ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలనీ రిమ్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. -
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
రాయచోటి: అన్నమయ్య జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫిరెన్సు హాల్లో నేషనల్ నారోటిక్స్ కో–ఆర్డినేషన్ జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముందుగా జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి అజెండా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ప్రధానంగా మాదకద్రవ్యాల నియంత్రణకు జిల్లాలో తీసుకోవాల్సిన అంశాలను కమిటీలో వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అలవాటుకు ఎవరూ బానిసలు కారాదని, ముఖ్యంగా యువత మేలుకొని డ్రగ్స్ను వదులుకోవాలని, తమ భవిష్యత్తును మంచిగా మలుచుకోవాలని కలెక్టర్ సూచించారు. వైద్య, ఆరోగ్యం, రెవెన్యూ, విద్య, అటవీ , డ్రగ్ తదితర శాఖల అధికారులందరూ పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. డిగ్రీ, ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్, ఎంఈఓలతో అవగాహన కార్యక్రమాలు చేయాలన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పేలా ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. 300 కిలోల గంజాయి స్వాధీనం జిల్లాలోని రాయచోటి, రాజంపేట, మదనపల్లి డివిజన్లలో 2024, 2025లో ఇప్పటి వరకు మొత్తం 26 డ్రగ్స్ కేసులను రిజిస్టర్ చేసి సుమారు 300 కిలోల గంజాయి పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి తెలిపారు. అలాగే 40 మంది నిందితులను గుర్తించామన్నారు. 11 మంది రిటైలర్లు, 20 మంది సెల్లర్స్, 99 మంది వినియోగదారులను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లు 1972, 1933 లేదా 7382296118కు ఎవరైనా ఫోన్ చేసి సమాచారం తెలపవచ్చన్నారు. అనంతరం అధికారులతో కలిసి డ్రగ్స్, గంజాయి నివారణ టోల్ ఫ్రీ నెంబర్లపైప్రచార కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా ఎకై ్సజ్ అధికారి మధుసూదన్, అటవీ, వైద్య, విద్య, డ్రగ్స్ కంట్రోల్, వివిధ శాఖల అధికారులు, ఐటిఐ, పాఠశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్ రిజిస్ట్రేషన్స్ పెంచాలి జిల్లాలో పీఎం సూర్యఘర్ రిజిస్ట్రేషన్స్ పెంచాలని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి యోగాంధ్ర–2025 క్యాంపెయిన్, పీఎం సూర్యఘర్ సానుకూల ప్రజా అవగాహన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జేసీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫిరెన్సు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్స్ ఎక్కువ సంఖ్యలో నమోదు అయ్యేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 51 వేల మంది రిజిస్టర్ కాగా ఎక్కువశాతం ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని పేర్కొన్నారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. నిత్యం యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, ప్రజలు నిత్య జీవితంలో యోగా కూడా ఒక భాగం అయ్యేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
స్నేహితుడి కోసం వెళ్లి అనంత లోకాలకు..
కురబలకోట : కురబలకోట మండలం జంగావారిపల్లె సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో రాయచోటికి చెందిన యువకుడు షేక్ మహమ్మద్ నవాజ్ (23) మృతి చెందాడు. ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ కథనం మేరకు..రాయచోటికి చెందిన సుహేల్ (24) కువైట్లో పని చేస్తూ స్వగ్రామం రాయచోటికి రావడానికి శుక్రవారం బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగారు. ఇతన్ని తీసుకు రావడానికి రాయచోటికి చెందిన ఇతని స్నేహితులు మహమ్మద్ అలీ ఖాన్ (23), డ్రైవర్ ముజిమిల్ (24), ఖాదర్ బాషా (24), షేక్ మహమ్మద్ నవాజ్ (24) వెళ్లారు. వీరి స్నేహితుడు సుహేల్తో పాటు కారులో రాయచోటికి వస్తుండగా మార్గమధ్యంలో మండలంలోని జంగావారిపల్లె వద్ద రోడ్డు డివైడర్ను డీకొంది. దీంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనలో షేక్ మహమ్మద్ నవాజ్ (24) మృతి చెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. వీరిని 108 వాహనం హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మృత దేహాన్ని రాష్ట్ర మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. రాయచోటిలో తీవ్ర విషాదం నెలకొంది. డివైడర్ను ఢీకొని కార్తు బోల్తా ఒక్కరు మృతి, నలుగురికి గాయాలు రాయచోటిలో విషాదం -
బైక్పై నుంచి పడి మహిళకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : బైక్పై నుంచి పడి మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. పీటీయంకు చెందిన ఇమ్రాన్బాషా భార్య హసీనా(48) కుమారుడు ముజాహిద్ధీన్తో కలిసి మదనపల్లెకు ద్విచక్రవాహనంలో వస్తుండగా, మార్గమధ్యంలోని కురబలకోట మండలం దొమ్మన్నబావి వద్ద ఆమె కట్టుకున్న చీర బైక్ వెనుకచక్రంలో చిక్కుకుపోవడంతో అదుపుతప్పి వాహనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికుల సహాయంతో కుమారుడు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదనపు కట్నం వేధింపులపై కేసు మదనపల్లె రూరల్ : అదనపు కట్నం, కానుకల కోసం వేధిస్తున్న ముగ్గురిపై కేసు నమోదుచేసినట్లు వన్టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. మదనపల్లె పట్టణం తాళ్లసుబ్బన్న వీధికి చెందిన నజీరుల్లా, జుబేదా దంపతుల కుమార్తె ముస్కాన్(22)ను కర్ణార్నాటక ఆర్కే.పురంకు చెందిన జలీల్అహ్మద్, షహీనా దంపతుల కుమారుడు షేక్ సల్మాన్కు ఇచ్చి 2022లో వివాహం జరిపించారు. ఏడాది నుంచి భర్త సల్మాన్, అత్త షహీనా, మేనత్త ఘాజియాలు అదనపు కట్నంతో పాటు బైక్ కొనివ్వాలని వేధించడం మొదలుపెట్టారు. దీంతో భరించలేక నెలరోజుల క్రితం ముస్కాన్ పుట్టింటికి వచ్చేసింది. విషయం తల్లిదండ్రులకు తెలిపి వారి సహాయంతో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితులు ముగ్గురిపై కేసు నమోదుచేసి హెడ్కానిస్టేబుల్ చంద్రరాజు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎనిమిది హోటళ్లకు జరిమానా రాయచోటి టౌన్ : పట్టణంలో నాసిరకం ఆహారం విక్రయిస్తున్న ఎమినిది హోటళ్ల యజమానులకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ రూ.19,000 జరిమానా విధించారు. హోటళ్లలో నాసిరకం ఆహారం విక్రయించడం, మళ్లీ మళ్లీ వాడిన నూనెలనే వాడుతున్న హోటళ్లు, బేకరిలలో, నిత్యావసర వస్తువులు అమ్ముతున్న వారిని, మినరల్ వాటర్ ఫ్లాంట్లు, వడ్డించే ప్రదేశం ఆపరిశుభ్రంగా ఉండటం వంటి వాటిని పరిశీలించి వాటిపై జిల్లా ఆహార భద్రత అధికారి డాక్టర్ కె.షమీమ్ బాష తనిఖీ చేశారు. వీటిపై జాయింట్ కలెక్టర్కు నివేదక ఇవ్వడంతో ఆయన జరిమానా విధించారు. సెల్ టవర్పై నుంచి కిందపడి యువకుడి మృతి జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని దొండపాడు రస్తాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ముద్ద శివసాయి(27) అనే యువకుడు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం శివసాయి సెల్ టవర్ ఎక్కి పనులు చేస్తుండటగా ప్రమాదవశాత్తు తాడు విరిగిపోవడంతో కింద పడి మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడు శివసాయి వేంపల్లి మండలం అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఎర్రగుంట్ల పోలీసులు మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
రైతులను ఖరీఫ్ సాగుకు సమాయత్తం చేయాలి
లక్కిరెడ్డిపల్లి : ఖరీఫ్ సాగుకు రైతులను సమాయత్తం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని లక్కిరెడ్డిపల్లి, అనంతంపల్లి రైతు సేవా కేంద్రాల్లో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కడపకు చెందిన కేవీకే శాస్త్రవేత్తలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ మాట్లాడుతూ వేరుశనగ సాగు చేసుకునే రైతులు ఈ ఏడాది కదిరి, లేపాక్షి, విశిష్ట రకం వంటి విత్తనాలు సాగు చేసుకుంటే అనువుగా ఉండటంతోపాటు మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతులు ప్రతి ఏడాది వరి, వేరుశనగే కాకుండా పప్పు ధాన్యాలు పంటలైన కంది, ఉలవ, అలసంద, పెసలు, మినుముల సాగుపై మక్కువ చూపాలన్నారు. కేంద్ర నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త బసవరాజ్ మాట్లాడుతూ ఆముదంలో ఐసీహెచ్–5,6 అనే రకాలు తొంభై రోజులకే కాపునకు వస్తాయన్నారు. ఉద్యానశాఖ అధికారిణి నాగమణి మాట్లాడుతూ పండ్లతోటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులు రైతుసేవా కేంద్రాలలోని సిబ్బందిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం వెంకటమోహన్, ఏడీఏ జయరాణి, కెవికె శాస్త్రవేత్త శిల్పకళ, ఏఈఓలు కెరోలిన్, అంజనమ్మ, విహెచ్ఏలు సాయి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
వీడియో అనలిస్ట్గా వాల్మీకిపురం క్రీడాకారుడు
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం పట్టణం తోటవీధిలో నివాసం ఉంటున్న శేషాద్రి ఆదినారాయణ, విజయలక్ష్మీ దంపతులు స్థానిక ఓ జనరల్ దుఖానం నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు శేషాద్రి సంపత్ చిన్ననాటి నుంచి క్రికెట్పై మక్కువతో ఉండేవాడు. స్థానికంగా జీవీసీసీలో జరిగే క్రికెట్ పోటీలలో పాల్గొని సత్తాచాటుతూ వచ్చారు. అయితే క్రికెట్తో పాటు ఎదుటి వారి ఆటను అంచనా వేయడంపై దృష్టి సారించి, ఎంచుకున్న విభిన్న పంతాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి 2023 సంవత్సరంలో అమెరికా జాతీయ క్రికెట్ జట్టులో ఫర్మార్మెన్స్, వీడియో అనలిస్ట్గా చేరడం అతని జీవితాన్ని మలుపు తిప్పినట్లైంది. యూఎస్ఏ క్రికెట్ జట్టు ఐసీసీ వరల్డ్కప్ లీగ్–2లో అగ్రస్థానంలో నిలిచి, 2027 వరల్డ్ కప్ అర్హత సాధించడానికి ముందుకెళ్ళడంలో సంపత్ విశ్లేషణా సామర్థ్యం కీలకంగా మారింది. యూఎస్ఏ తో పాటు బర్ముడా, ఇటలీ వంటి జాతీయ జట్లుతో ఫ్రాంచైజీ లీగ్లలో కూడా సంపత్ వీడియో అనలిస్ట్గా సేవలందిచాడు. క్రికెట్ దిగ్గజాలైన రాబిన్ సింగ్, ఓవైస్ షా, కెవిన్ ఓ బ్రియన్, జూలియన్వుడ్ వంటి వారితో కలిసి పనిచేసినట్లు సంపత్ తెలిపారు. పట్టణానికి చెందిన శేషాద్రి సంపత్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటంతో తల్లిదండ్రులతో పాటు పట్టణ వాసులు హర్షం వ్యక్తపరుస్తున్నారు. ఎంచుకున్న వృత్తిలో అంకిత భావంతో పని చేసి ముందుకెళ్ళడమే చిన్ననాటి నుంచి సంపత్కు అలవాటని తల్లిదండ్రులు అంటున్నారు. క్రీడారంగంలో రాణించడానికి స్థానికులకు సంపత్ స్ఫూర్తిదాయకమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సంపత్ క్రీడా ప్రస్తానం -
పొలంలో దౌర్జన్యంగా దారి ఏర్పాటు
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని చియ్యవరం పంచాయతీ వడ్డిపల్లికి చెందిన చంద్రగిరి వెంకటేష్, లక్ష్మిదేవమ్మల కుటుంబానికి 639–4లో 3.81 సెంట్లు మామిడి తోట ఉంది. వారి పొలం పక్కన ఉన్న రఘురామయ్య, రామచంద్రయ్యలు గత కొంత కాలంగా తమ పొలానికి వేరే దారి ఉన్నా రోడ్డుపై నుండి తమ పొలానికి దారి ఉందని శుక్రవారం రెండు జేసీబీలతో దౌర్జన్యంగా , కూటమి నాయకులు, అధికారులు, పోలీసుల అండతో 70 శాతం దారి ఏర్పాటు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. తాము అడ్డుకొనే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల అండతో దారి ఏర్పాటు చేస్తున్నారని వాపోయారు. కోర్టు ఆర్డరు ప్రకారం రైతులను ఇబ్బంది పెట్టకుండా వారు ఇచ్చిన చోట పరిహారం చెల్లించాలి అని ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపినా ఫలితం లేదన్నారు. తహసీల్దార్ తమ మాట వినకుండా వెళ్లిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుక్రితం సబ్ కలెక్టర్కు విన్నపించామని అయినప్పటికీ పోలీసులు, రెవెన్యూ అధికారుల అండతో పనులు చేసుకొంటున్నారని పేర్కొన్నారు. ఉన్న 3.80 సెంట్లలో వారికి దారి ఇస్తే తమ పరిస్థితి ఏంటని వారు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. -
సదరన్ సర్టిఫికెట్ల పరిశీలన
రాయచోటి టౌన్ : దివ్యాంగులకు అందిస్తున్న పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సదరన్ సర్టిఫికెట్లను పరిశీలిన నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాయచోటిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉదయం 10 గంటల నుంచి దివ్యాంగుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అంతకు ముందుగా వారి వద్ద ఉన్న సదరన్ సర్టిఫికెట్ల జీరాక్స్ను కూడా పొందుపరిచి భౌతికంగా డాక్టర్ మాధవరెడ్డి పరిశీలించారు. నకిలీ సర్టిఫికెట్లు పొంది పింఛన్ పొందుతున్నారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తనిఖీల నిర్వహణ చేపట్టారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన వారిని భౌతికంగా పరిశీలించి వారికి ఇచ్చిన పర్సెంటేజ్ను సవరిస్తున్నారు. కార్యక్రమాన్ని డాక్టర్ బండారు కిరణ్కుమార్ పర్యవేక్షించారు. రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ బి ప్లస్ గ్రేడ్ రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) నుంచి బీ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.సుధాకర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. న్యాక్ బృందం కళాశాల విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నైపుణ్యం, పరిశోధన, విద్యార్థుల పురోగతి వంటి అంశాలను సమీక్షించి ఈ గ్రేడ్ను మంజూరు చేసిందని ప్రిన్సిపల్ తెలిపార. భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలను సాదించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ విజయంతో కళాశాల విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి సంబేపల్లె : అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం శెట్టిపల్లె పంచాయతీ డీసీ వడ్డిపల్లెకు చెందిన కుంచపు శివయ్య, వెంకట్రమణమ్మలపై అదే గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకులు దాడి చేశారు. స్థానికుల కథనం మేరకు గతంలో జరిగిన ఎన్నికల్లో శివయ్య, వెంకటరమణమ్మలు వైఎస్సార్పీకి మద్దతుగా నిలిచారన్న కసితో అధికారపార్టీ నాయకుల అండతో అదే గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలు భాస్కర్తో పాటు మరో నలుగురు శివయ్య, వెంకటరమణమ్మలపై గురువారం దాడి చేశారు. శివయ్య కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. దాడిపై శివయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.భాస్కర్, మరో వ్యక్తి కలిసి శుక్రవారం శివవయ్యపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై శుక్రవారం పోలీసులను వివరణకోరగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మార్షల్ ఆర్ట్స్లో బంగారు పతకం కడప ఎడ్యుకేషన్ : ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్–2025లో మార్షల్ ఆర్ట్స్(పెన్– కాక్ సిలాట్)లో కడప బాలాజీ ఎంబీఏ కళాశాల విద్యార్థి జాన్ బెన్ని బంగారు పతకం సాధించినట్లు కరస్పాండెంట్ లేవాకు నితీష్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ తరపున బాలాజీ ఎంబీఏ కళాశాల విద్యార్థి బంగారు పతకం సాధించడం తమకెంతో గర్వకారణమన్నారు. ఇందుకు విద్యార్థికి రూ. 10 వేలు నగదుతో సత్కరించామని తెలిపారు. -
కడపకు తిరుమల సెలవు!
రాజంపేట: తిరుమల ఎక్స్ప్రెస్(17487/ 88) రైలు ఇక కడపకు సెలవు చెప్పింది. వచ్చేనెల 2వ తేదీ నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ రైలు కడప నుంచి గుంతకల్ ఎక్స్ప్రెస్(స్పెషల్)రైలుగా మారనుంది. అయితే పార్మిసిన్లో ఉన్న ఏసీ బోగీలను మూసివేస్తారు. ఈరైలు అన్రిజర్వ్డ్గా నడవటం వల్ల కేవలం రిజర్వేషన్, జనరల్ బోగీలు మాత్రం ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 07521/07522 నంబర్లతో తిరుమలను గుంతకల్రైలుగా నడిపిస్తున్నారు.ఉభయ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుంతకల్ వెళ్లేందుకు ఉభయ వైఎస్సార్ కడప జిల్లా వాసులకు ఉపయోగకరమవుతుంది. తిరుమలకు వెంటాడుతున్న లాంగ్ట్రైన్ కష్టాలు సర్కారు ఏరియాకు ఉన్న ఏకై క ఎక్స్ప్రెస్ రైలును డివిజన్ కేంద్రానికి తరలించేశారు. ఇప్పటికే కడప రైల్వేలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందన్న విమర్శలు రైల్వేశాఖను తాకుతున్నాయి. విశాఖ –తిరుపతి మధ్య నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ రైలును కడప వరకు పొడిగింపు జిల్లా ప్రయాణికులకు ఊరటే . ఇప్పుడు ఆరైలును డివిజన్ కేంద్రమైన గుంతకల్ వరకు పొడిగించాలనే అధికారులు చేసిన ప్రతిపాదనలు అమలయ్యాయి. తిరుమలకు లాంగ్ట్రైన్ కష్టాలు వెంటాడునన్నాయి. తిరుమల రైలు పొడిగింపును సాక్షి ముందుగానే వెలువరించిన సంగతి విధితమే. ● తిరుమల ఎక్స్ప్రెస్ ఇప్పటి వరకు 872 కిలోమీటర్ వరకు పొడిగింపుతో నడిచేది. గుంతకల్ పొడిగింపుతో అది కాస్తా 184 కి.మీ దూరం పెరిగింది. దీంతో 1056 కి.మీ దూరం నడుస్తోంది. తిరుమల ఫార్మసిన్కు గుంతకల్లో క్లీనింగ్, వాటరింగ్ నిర్వహించనున్నారు.అప్, డౌన్ 2, 112 కిలోమీటర్ల దూరం తిరుమల రైలు రన్నింగ్ కొనసాగనుంది. హాల్టింగ్స్ ఇలా..: గుంతకల్ ఎక్స్ప్రెస్ రైలు కడప నుంచి ప్రారంభమవుతుంది. ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్ లో హాల్టింగ్స్ ఇచ్చారు. ఈ రైలు కడపలో ఉద యం 7.45 గంటలకు బయలుదేరి, ఎర్రగుంట్లకు 8.13 గంటలకు, కొండాపురానికి 08.39కి చేరుకుంటుంది. తాడిపత్రికి 9.15, గుత్తి 10.03, గుంతకల్కు 11.15 గంటలకు చేరు కుంటుంది. తిరిగి గుంతకల్లో 1.30గంటలకు బయలుదేరుతుంది. గుత్తికి 01.55 గంటలకు చేరుకుంటుంది. తాడిపత్రికి 02.40గంటలకు, కొండాపురానికి 03.13గంటలకు చేరుకుంటుంది. 3.43 గంటలకు ఎర్రగుంట్ల , కడప 5.15 గంటలకు చేరుకుంది. అక్కడి నుంచి తిరుమల రైలుగా విశాఖకు బయలుదేరుతుంది. ● డివిజన్ కేంద్రమైన గుంతకల్కు వెళ్లేందుకు రైల్వే ఉద్యోగులకు, కార్మికులకు గుంతకల్ ఎక్స్ప్రెస్ రైలు అనుకూలమని అంటున్నారు. అలాగే తాడిపత్రి, గుంతకల్ వెళ్లే ప్రయాణికులకు ఇంటర్సిటీ కాకుండా ఈ రైలులో వెళ్లే పరిస్థితులే అధికంగా ఉంటాయి. కడప నుంచి గుంతకల్ రైలుగా.. జిల్లా కేంద్రం నుంచి ఏకై క ఎక్స్ప్రెస్ రైలు తిరుమల ఎక్స్ప్రెస్. ఇప్పుడు అది గుంతకల్ వరకు వెళుతోంది. గుంతకల్ నుంచి సర్కారు ప్రాంతా నికి అనేక రైళ్లు ఉన్నాయి. సర్కారు ప్రాంతానికి ఇప్పుడు కడప నుంచి నడిచే ఏకై క ఎక్స్ప్రెస్ రైలును కూడా గుంతకల్కు తీసుకెళ్లడంపై ఉభయజిల్లా వాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గుంతకల్కు పొడిగింపు 2న పట్టాలెక్కనున్న గుంతకల్ రైలు -
వైభవంగా సీతారాముల కల్యాణం
కలికిరి(వాల్మీకిపురం): స్థానిక పట్టాభిరామాలయంలో శుక్రవారం శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. స్వామి వారికి అర్చన, అభిషేకం, తోమాలసేవ జరిపారు. అనంతరం విశేష అలంకరణలో ముస్తాబైన ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని ఆస్థాన మండపంలో సాంప్రదాయ బద్ధంగా తీసుకెళ్లి ఆశీనులను చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. చివరగా హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారి కృష్ణమూర్తి, నాగరాజ, భక్తులు పాల్గొన్నారు. -
● జిల్లాలో ఆడబిడ్డ నిధి వివరాలు
సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏదీ పడితే అది హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగా లేవంటూ బాబు నోట అదే మాట పదేపదే వినిపిస్తోంది..ప్రజలు అర్థం చేసుకోవాలంటూ చెబుతూనే మరోవైపు ప్రధాన హామీలను పక్కన పెడుతున్నారు. జగన్ చెప్పాడంటే....చేస్తాడంతే..అదే బాబు చెప్పాడంతే...చేయడంతే...అని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రమాణ స్వీకార అనంతరం పాలన ప్రారంభించి జూన్ 12కు సరిగ్గా ఏడాదవుతుంది. అయినా ఇచ్చిన హామీలపై కూటమి సర్కార్ ఇంకా అడుగులు ముందుకు వేయకపోవడంపై ప్రజల్లో చర్చకు దారి తీస్తోంది. అంతకుముందు 2014లోనూ అధికారంలోకి వచ్చిన బాబు రుణమాఫీతోపాటు అనేక హామీల విషయంలోనూ మాయ చేశారు. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద ప్రతినెల రూ. 1500 అందజేస్తామని చెప్పినా ఊసే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమన్నా ఇప్పటికీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. తల్లికి వందనానికి సంబంధించి ఇప్పటివరకు సొమ్ము అందించలేదు. అదే వైఎస్ జగన్ సర్కార్ హయాంలో మహిళలే మహారాణులుగా...ఒక్క సమయం పెట్టుకుంటే గడువులోపు ఎన్ని కష్టాలున్నా అందించిన పరిస్థితి. పైగా వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదు రైనా వెనుకంజ వేయకుండా ప్రజలను ఆదుకున్న పరిస్థితులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఆడబిడ్డకు భరోసా ఏదీ? ఎన్నికలకు ముందు ప్రతి ఇంటిలోని ఆడబిడ్డలను ఆదుకుంటాం..నెలనెల రూ. 1500 చొప్పున అందిస్తామని ఊదరగొట్టిన అధినేత బాబు ప్రస్తుతం ఆడబిడ్డ గురించే మరిచిపోయారు. పాలనా పగ్గాలు చేపట్టి ఏడాదవుతున్నా కనీసం చూస్తాం, చేస్తాం అన్నమాట కూడా రాలేదు. ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి నెలకు రూ. 1500 చొప్పున వేసుకున్నా ఏడాదికి రూ. 18 వేలు అవుతుంది. ఈ సొమ్ములు మాకెప్పుడు ఇస్తారంటూ ఆడపడుచులు అడుగుతున్నా సమాధానం చెప్పేవారు లేరు. అన్నమయ్య జిల్లాలో సుమారు 3,65,650 మందికి పైగా ఆడబిడ్డలు ఉన్నారని అంచనా. సరాసరిని ఏడాదికి రూ. 658 కోట్లకు పైగా వారికి అందించాల్సిన పరిస్థితి ఉన్నా ప్రభుత్వం ఊసెత్తడం లేదు. ఒక్కొక్కరికి నెలకు అందాల్సిన సొమ్ము రూ.1500 మహిళలే మహారాణులు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి విస్మరించిన కూటమి సర్కార్ సూపర్సిక్స్వైపు అడుగులు పడకపోవడంతో అతివల్లో ఆందోళన వైఎస్ జగన్ సర్కార్ హయాంలో అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట అమ్మ ఒడి, సున్నావడ్డీ, చేయూతతో ఆర్థిక భరోసా అర్హతగల మహిళలు (అంచనా): 3,65,650 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం...వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మహిళలకు పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మొదలుకొని ప్రతి విభాగంలోనూ మహిళలను మహారాణులుగా చూడాలని భావించారు. అందుకు అనుగుణంగా అమ్మ ఒడి, కాపు నేస్తం, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ ఇలా ప్రతీది మహిళలను భాగస్వాములను చేయడంతోపాటు ఆర్థికంగా భరోసా కల్పించారు. అమ్మ ఒడి కింద జిల్లాలోని 1,57,292 మంది విద్యార్థులకు సంబంధించిన తల్లులకు ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున ప్రతి ఏడాది రూ. 235–250 కోట్లు ఖర్చుచేసింది. అంతేకాకుండా జిల్లాలో 60,821 స్వయం సహాయక గ్రూపులు ఉండగా వారికి రూ. 166.04 కోట్లు చొప్పున సున్నా వడ్డీ అందించడం జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా 79,157 మందికి రూ. 402.82 కోట్లు చొప్పున అందించారు. కాపు నేస్తం కింద 38,821 మంది మహిళలకు రూ. 58.23 కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద 22289మందికి రూ. 395.65 కోట్లు చొప్పున అందించి మహిళల మనసుల్లో వైఎస్ జగన్ సర్కార్ చెరగని ముద్ర వేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ఎప్పుడో? కూటమి సర్కార్ ఉచిత బస్సు ప్రయాణంపై వాయిదా పర్వం సాగిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో అదిగో ఇదిగో అంటూ అప్పటికప్పుడు ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడుతున్నట్లు హంగామా చేసినా తర్వాత ముందుకు అడుగు పడలేదు. ప్రతి మహిళకు ఉచిత ప్రయాణమని ఊదరగొట్టినా ఏడాదవుతున్నా..ఉచిత బస్సెక్కే అవకాశం మహిళలకు కల్పించలేదు. జిల్లాలో సుమారు 4,60,000 మంది ఉన్నారు. రోజువారిగా 482 బస్సుల్లో 1.30 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తారు. అయితే అందులో 30 శాతం వేసుకున్నా 30 వేల మంది వరకు మహిళలు ప్రతిరోజు బస్సుల్లో రాకపోకలు సాగిస్తారని అంచనా. రోజుకు ఒక్కొక్క మహిళ సరాసరి రూ. 100 ఛార్జి వేసుకున్నా రూ. 30 లక్షల మేర ఖర్చు వస్తోందని ప్రభుత్వం అమలు చేయకుండా దాట వేస్తోంది. -
భక్తులకు అసౌకర్యం లేకుండా యోగా కార్యక్రమం
నందలూరు : శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీన నిర్వహించే యోగా కార్యక్రమం వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులకు సూచించారు. యోగ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం అయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి కలెక్టర్ చామకూరి శ్రీధర్ హాజరవుతారన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని, అందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సౌమ్యనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం అధికారి నాగభూషణం, ఎంపీడీఓ రాధాకృష్ణంరాజు, ఈఓఆర్డీ సునీల్కుమార్, డాక్టర్ కార్తీక్విశ్వనాథ్, ఎంఈఓలు అనంతకృష్ణ, నాగయ్య, ఏఓ మల్లికార్జున, ఏపీఓ మురళి, ఏపీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల ఘన నివాళి
వేంపల్లె : వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వైఎస్సార్ సమాధి వద్ద పీసీసీ చీఫ్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. గురువారం పులివెందుల పర్యటనకు విచ్చేసిన ఆమె వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి విచ్చేశారు. వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కాంగ్రెస్ నాయకులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం పని చేయాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి, ప్రొద్దుటూరు కాంగ్రెస్ సమన్వయ కర్త ఇర్ఫాన్ బాషా, పులివెందుల సమన్వయ కర్త ధృవకుమార్ రెడ్డి, వేంపల్లె మండల అధ్యక్షుడు రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, బాలం సుబ్బరాయుడులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.పైనాపిల్ కాసింది..!పుల్లంపేట : పుల్లంపేట మండలం, అనంతంపల్లి గ్రామానికి చెందిన శేషారెడ్డి తన ఇంటిలో పైనాపిల్ మొక్క తెచ్చి నాటాడు. దీంతో పైనాఫిల్ విరగకాయడంతో గ్రామంలోని ప్రజలు వింతగా చూస్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో పైనాపిల్ పండదని, అలాంటిది శేషారెడ్డి ఇంటిలో విరగకాయడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.నిమ్మతోట దగ్ధంపెనగలూరు : పెనగలూరు మండలం, కాకర్లవారిపల్లి పంచాయతీ వెంకటనారాయణ పల్లి వద్ద నిమ్మతోట దగ్ధమైనట్లు ఫైర్ అధికారి శివయ్య తెలిపారు. గురువారం వేపాటి వారిపల్లికి చెందిన పి.పెంచలయ్య నిమ్మతోట అగ్నికి ఆహుతవుతుండగా ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వెంటనే వారు అక్కడికి చేరుకుని ఆర్పివేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో చుట్టూ ఉన్న కంచె పూర్తిగా దగ్ధమైంది. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో నిమ్మతోట పూర్తిగా దగ్ధం కాలేదు. దాదాపు రూ.80 వేలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారి తెలిపారు. -
కడప – బెంగళూరు రైల్వే ప్రస్త్తావన లేదు
రాయచోటి: రాయచోటి, కడప–బెంగుళూరు రైల్వేలైను విషయంపై కడపలో జరిగిన మహానాడులో ప్రస్తావించకపోవడం బాధాకరమని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కనీసం కడప–బెంగళూరు రైల్వేలైను రావడం ద్వారా కొద్దివరకు ప్రయోజనం ఉంటుందన్నారు. జిల్లా అభివృద్ధికి దోహదపడే రైల్వేలైను ఏర్పాటుకు ఈ ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జక్కుల వెంకటేష్, ఎంఆర్ ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు
రాయచోటి టౌన్ : నూనె గింజల పంటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని భారత నూనె గింజల పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగేష్ దుబే అన్నారు. గురువారం రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామంలో నూనె గింజల సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 700 జిల్లాలో రెండు వేలకు పైగా శాసీ్త్రయ బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు మాట్లాడుతూ నూతన వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలన్నారు. పండ్ల తోటల సాగులో కూడా కొత్తరకాల పండ్ల తోటలను ఎంచకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా మంచి దిగుబడులతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని చెప్పారు. ఏరువాక (ఖరీఫ్) సేద్యానికి రైతులు సిద్ధం కావాలని రాయచోటి వ్యవసాయ శాఖ అధికారి దివాకర్ రైతులకు కోరారు. వేరుశనగ, కంది, నువ్వులు వంటి వ్యవసాయ పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులను కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరి సూచించారు. డాక్టర్ ఐ.సురేష్ కుమార్రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ నాగేశ్వరరావు, రైతులు రామకృష్ణం రాజు, ఉద్యానశాఖ అధికారిణి నాగమణి, ఆత్మ ఏటీఎంలు, రైతులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంట్
ఒంటిమిట్ట : అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు భారతి సిమెంట్ పటిష్టమైందని భారతి సిమెంట్ డీజీఎం ఓబుల్ రెడ్డి, జిల్లా ప్రధాన మార్కెటింగ్ అధికారి ప్రతాప్ రెడ్డి, జిల్లా టెక్నికల్ ఇంజినీర్ శ్రీకాంత్ రెడ్డి, సేల్స్ ఆఫీసర్ రమణా రెడ్డి తెలిపారు. ఒంటిమిట్టలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ సమీపంలోని మేసీ్త్రలకు సిమెంట్ వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా భారతి సిమెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటెక్ టెక్నాలజీతో తయారవుతుందని, అల్ట్రాఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందన్నారు. రొబోటిక్స్ ప్రయోగశాల, జర్మన్ టెక్నాలజీ తక్కువ సమయంలో ఎక్కువ కట్టడాలు చేయగల సామర్థ్యం కలవన్నారు. ఇతర కంపెనీల సిమెంట్ ఐదు గంటల్లో సెట్ అయితే భారతి అల్ట్రాఫాస్ట్ రెండు గంటల్లో సెట్ అవుతోందని, దృఢత్వం కల్గి ఉంటుందని, కట్టడాలు త్వరగా పూర్తవుతాయని తెలిపారు. అనంతరం మేసీ్త్రలకు లక్ష ఉచిత బీమా బాండ్, బీమా పత్రాలను యాభై మంది మేసీ్త్రలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ పాండురంగారెడ్డి, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
బైరెటీస్ మిల్లులను ఆదుకోవాలి
ఓబులవారిపల్లె : మంగంపేట ఏపీఎండీసీ గనుల బైరెటీస్ ఖనిజం ఆధారితంగా నిర్మించిన పల్వరైజింగ్ మిల్లులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీఎండీసీ గనుల విస్తరణలో ఇల్లు, భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల వారు అప్పులు చేసి స్థానికంగా చిన్న పరిశ్రమలైన మిల్లులను ఏర్పాటు చేసి అందులో యాభై మందికి జీవనోపాధి కల్పిస్తున్నారన్నారు. దాదాపు 175 మిల్లులు ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎగుమతిదారులకు సీ అండ్ డీ గ్రేడ్ ఖనిజం ధర తగ్గించి ఇవ్వడం మిల్లులకు మరో ధర ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మిల్లులకు రాయితీలతో ఖనిజాన్ని సరఫరా చేసే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం మిల్లులకు రాయితీపై ఖనిజం సరఫరా లేక దాదాపు మిల్లులన్నీ మూతపడి కార్మికులు జీవనోపాధి కోల్పోయారన్నారు. వెంటనే మిల్లులకు రాయితీపై ఖనిజాన్ని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ కార్యదర్శి జాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా మహిళల తరలింపు సరికాదు
మదనపల్లె రూరల్ : డ్వాక్రా మహిళలను రాజకీయ పార్టీల సమావేశాలకు బలవంతంగా తరలించడం సరైనది కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్.నరసింహులు అన్నారు. మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధి కోసం స్వయంప్రతిపత్తితో డ్వాక్రా సంఘాల ఏర్పాటు జరిగిందన్నారు. వీటిపైన రాజకీయ జోక్యం ఏమాత్రం తగదన్నారు. గ్రామీణ, పట్టణ డ్వాక్రా మహిళలను రాజకీయ పార్టీల సమావేశాలకు బలవంతంగా తీసుకెళ్లడం, మీటింగ్లకు రాకపోతే మీకు లోన్లు ఇవ్వమని, డ్వాక్రా గ్రూపుల గ్రేడింగ్ను తగ్గిస్తామని బెదిరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి మురళి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రా కాలనీలో చోరీ
మదనపల్లె రూరల్ : పట్టణంలోని చంద్రాకాలనీలో చోరీ జరిగిన విషయం గురువారం వెలుగుచూసింది. స్థానికంగా ఉండే కుమార్ కుటుంబంతో కలిసి ఈనెల 21న బంధువుల ఇంటికి కడపకు వెళ్లాడు. బుధవారం రాత్రి తిరిగి ఇంటికి రాగా తలుపులు, తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనలో రూ.60వేల విలువచేసే బంగారు నగలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామచంద్ర తెలిపారు.భూ తగాదా కేసులో ఆరుగురి అరెస్టుచాపాడు : మండల పరిధిలోని రాజుపాళెం గ్రామంలో జరిగిన భూ తగాదా కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. పల్లెం శ్రీనివాసులు, మహేష్ బాబు, వెంకట రమణ, వెంకటసుబ్బయ్య, సురేష్, సతీష్ కుమార్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.నలుగురిపై తేనెటీగల దాడిసిద్దవటం : మండల కేంద్రమైన సిద్దవటంలోని గురుకుల కళాశాల సమీపంలో గురువారం నలుగురు వ్యక్తులపై తేనెటీగలు దాడిచేశాయి. సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గురుకుల కళాశాల వద్ద ఉన్న తేనె తుట్టైపె ఆకతాయిలు రాళ్లు వేశారు. దీంతో అవి ఒక్కసారిగా బయటకు వచ్చాయి. రహదారి వెంబడి వెళుతున్న వారిపై దాడిచేసి గాయపరిచాయి. ఈ దాడిలో జంగాలపల్లె, మూలపల్లె, సిద్దవటం, భాకరాపేట గ్రామాలకు చెందిన వెంకటబాలాజీ, మల్లికార్జున, అమీర్ బాషా, మరొకరు గాయపడ్డారు. వీరికి సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో చికిత్స చేశారు. వైద్యాధికారి డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ తేనెటీగలు నలుగురిని బలంగా కుట్టడం వల్ల భాకరాపేట గ్రామానికి చెందిన అమీర్బాషా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు.గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంకాశినాయన : మండలంలోని జ్యోతిక్షేత్రం సమీపంలోని గరుడాద్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాశినాయన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అప్పటికే గుర్తు పట్టలేని విధంగా ఉంది. పోరుమామిళ్ళ వైద్యాధికారి కరీమ్ ఘటన స్థలానికి వచ్చి పోస్టుమార్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అహల్య బాయి త్రిశతాబ్ది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
రాయచోటి టౌన్ : అహల్య బాయి హోల్కర్ త్రి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామని కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ఎల్.మురుగున్ పేర్కొన్నారు. గురువారం రాయచోటి సాయి సుధ కల్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఆధ్వర్యంలో ఈ నెల 31వతేదీన జరిగే త్రి శతాబ్ది జయంతి వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె కాశీ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాల పునర్నిర్మాణానికి చేసిన కృషి అమోఘమైనదన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జకియా ఖానం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సునీత నారాయణ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా మాతంగి మహా పీఠంరాయచోటి టౌన్ : లక్కిరెడ్డిపల్లె మండలంలోని మాతంగి మహా పీఠం అధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి మురుగన్ అన్నారు. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య శ్రీ శారద లక్ష్మి నరసింహా పీఠాధిపతులు స్వయంప్రకాశ సచ్చిదానంద స్వామి సరస్వతి సంకల్పం మేరకు లక్కిరెడ్డిపల్లెలోని దొర్రిచెరువు సమీపంలో శ్రీమాతంగి మహాపీఠ శిల శాస్త్ర ప్రతిష్టకు ఆయన హాజరయ్యారు. ముందుగా రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్లో అల్పాహారం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మహా పీఠం ప్రపంచానికి ఆధ్యాత్మికను నేర్పి ఆది గురువుగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటక రాష్ట్ర ఆహార, ప్రజా సరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ నిర్వహణకు సిద్ధం కావాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రాయచోటి: జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ నిర్వహణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు, జిల్లాలో వన మహోత్సవ నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్ సింగ్లు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అటవీశాతాన్ని పెంచడానికి అధికారులందరూ కృషిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో తడి నేలలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తడినేలల కమిటీలోని సభ్యులు సంబంధిత నివేదికలను వెంటనే అందించాలని కోరారు. జిల్లాలో అటవీశాతంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో చర్చించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల కస్సుబస్సు
గువ్వలచెరువు ఘాట్రోడ్డులో స్తంభించిన రాకపోకలు రాయచోటి: కడప నగరంలో తలపెట్టిన మహానాడు కార్యక్రమం సందర్భంగా కడప–రాయచోటి మార్గంలోని గువ్వలచెరువు ఘాట్రోడ్డులో రాకపోకలు స్తంభించిపోయాయి. గురువారం మధ్యాహ్నం అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల నుంచి వాహనాల రాకతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం రవాణా విషయంలో జాతీయ రహదారి, ఘాట్ రోడ్డు దృష్ట్యా ప్రత్యేక నిర్వాహక చర్యలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్ తీవ్రరూపం దాల్చిందని పలువురు విమర్శించారు. నాలుగు గంటల పాటు రవాణా అటూ ఇటూ సాగకపోవడంతో మహానాడుకు వచ్చిన వాహనాలు ప్రాంగణానికి వెళ్లకుండానే వెనుతిరిగాయి. ఇదే సమయంలో అనేకమందికి తినడానికి ఆహారం, మంచినీరు లభించక ఆకలి దప్పులతో అలమటించారు. ● మహానాడు సభకు 1847 బస్సుల వినియోగం ● ప్రజలకు తప్పని ప్రయాణ కష్టాలుసాక్షి కడప: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు జనాలను తరలించేందుకు తమ్ముళ్లు నానా తంటాలు పడ్డారు. మరోవైపు ఆర్టీసీ బస్సులన్నీ మహానాడు వైపే వేయడంతో ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి హోదాలో అక్కడే ఉండడం..మంత్రులు, నేతలంతా అక్కడే మకాం వేయడంతో అధికార యంత్రాంగం వారి మెప్పుకోసం వెంపర్లాడిందే తప్ప ప్రజల కష్టాలను గాలికి వదిలేసింది. వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని బస్టాండ్లలో ఎక్కడ చూసినా జనాలు బస్సుల కోసం నిరీక్షిస్తూ కనిపించారు. ● చివరి రోజు తక్కువ జనాలు కనిపిస్తే మహానాడు విఫలమైందన్న భావన కలుగుతుందని ఎక్కడికక్కడ డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలను తరలించారు. మహానాడా...మజాకా అన్నట్లు అటు డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలు రావాలంటూ అల్టిమేటం జారీ చేసి తీసుకెళ్లారు. ఎక్కడ చూసినా సభ వద్ద, బయటి ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలు దర్శనమిచ్చారు. యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంత మందిని తరలించాలని...బస్సులో తీసుకొచ్చిన వారి ఫొటోలతో పాటు సంతకాలను తీసుకున్నట్లు తెలియవచ్చింది. ● కడపలో జరుగుతున్న మహానాడుకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1847 బస్సులను వినియోగించారు. సుదూర ప్రాంతాలతోపాటు రాయలసీమ ప్రాంతంలోని అన్ని డిపోల నుంచి పెద్ద ఎత్తున బస్సులను వినియోగించడంతో ఆర్టీసీ బస్టాండులో బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా నుంచి 170, సత్యసాయి 167, చిత్తూరు 130, తిరుపతి 245, నంద్యాల 196, కర్నూలు 110, వైఎస్సార్ కడప 274, అన్నమయ్య 240, ప్రకాశం 85, నెల్లూరు 230 బస్సులను వినియోగించారు. ఆర్టీసీ బస్సులు మహానాడు దారి పట్టడంతో బస్టాండులు ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రయివేటు స్కూళ్ల బస్సులను వదల్లేదు మదనపల్లె: మదనపల్లె, పరిసర ప్రాంతాల్లోని ప్రయివేటు స్కూలు బస్సులను వదల్లేదు. ఆయా స్కూళ్లలోని బస్సులు మహానాడుకు ఇవ్వాల్సిందిగా రవాణశాఖ అధికారుల ఒత్తిడితో పంపించారు. -
అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
రాయచోటి: మీడియా అక్రిడిటేషన్ కార్డుల వ్యాలిడిటీని మరో మూడు నెలలపాటు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ గురువారం పత్రికలకు అందజేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ నుంచి నేడు జిల్లాకు సమాచారం అందిందన్నారు. అక్రిడిటేషన్ కార్డుల వ్యాలిడిటీని జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు లేదా కొత్త కార్డులు జారీ చేయడం గానీ, ఏది ముందు జరిగితే అప్పటి వరకు కార్డులు పొడిగించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలో హిజ్రాల కోసం స్వయం ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి ఆర్వి కృష్ణకిశోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్, బ్యూటీషియన్, కారు డ్రైవింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తి గల హిజ్రాలు తమ వివరాలతో వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొత్త కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ఆఫీసులో జూన్ 10లోపు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి హిజ్రాల గుర్తింపు ధృవపత్రం, ఆధార్, రేషన్కార్డు, రెండు ఫొటోలు కావాలని ఆయన సూచించారు. ప్రశాంతంగా ఏపీఆర్జేసీ కౌన్సెలింగ్ కేవీపల్లె: మండలంలోని గ్యారంపల్లె ఏపీ గురుకుల కళాశాలలో ఏపీఆర్జేసీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు రాయలసీమ రీజియన్ కన్వీనర్, గ్యారంపల్లె ఏపీఆర్జేసీ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నకేశవులు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ రీజియన్ పరిధిలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరైనట్లు తెలిపారు. గ్యారంపల్లె బాలుర, కర్నూలు ఉర్దూ మైనారిటీ బాలుర, కొడిగేనహళ్లి బాలుర గురుకుల పాఠశాలకు సంబంధించి సీట్ల భర్తీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు చెపారు. ఎంపీసీ గ్రూపునకు 123, బైసీపీ 119 మంది, ఎంఈసీ గ్రూపునకు 86 మంది సీట్లు పొందినట్లు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ జయం శ్రీనివాస గుప్తా, అసిస్టెంట్ కన్వీనర్ బ్రహ్మాజి, కోడిగిన హళ్లి ప్రిన్సిపాల్ జలజ, కర్నూల్ మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ ముభసీరబేగం, అధ్యాపకులు రామకృష్ణ, రమాదేవి, శేఖర్, సురేష్, పురుషోత్తం, తనూజ, కొండయ్య, షకీల్ అహ్మద్, సయ్యద్బాషా, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
మందుబాబులకు పండుగ
సాక్షి ప్రతినిధి, కడప: మహానాడు నేపథ్యంలో కడప గడపలో మద్యం ఏరులై పారింది. కడప లో నెలరోజులు పాటు ఖర్చు అయ్యే మద్యం మూడు రోజుల్లోనే ఖర్చైంది. గురువారం బహిరంగసభ కారణంగా గ్రామాల గల్లీల నుంచి ప్రధాన రహదారుల వరకూ మద్యం ప్రియులు ఆనందడోలికల్లో మునిగిపోయారు. జనసమీకరణ కోసం పచ్చనోట్లు పంచడంతో అందుకున్న వారు ఎక్కడిక్కడ మద్యం తాగుతూ కనిపించారు. మందు బాబులకు ఉల్లాసం.... మహానాడు కార్యక్రమం మద్యం ప్రియులకు ఉల్లాసంగా ఉండిపోయింది. పెగ్గు, ఫుడ్ ఉండడంతో మూడు రోజులు పాటు తెలుగుతమ్ముళ్లుతో కలిసి జల్సా చేశారు. చివర రోజు బహిరంగసభకు జనసమీకరణ నేపధ్యంలో ఆ దూకుడు మరింతగా సాగింది. కడప గడపలో 22 మద్యంషాపులుంటే దాదాపు అన్నీంట్లో రద్దీ విపరీతంగా ఉండిపోయింది. మంగళ, బుధవారాలల్లో నగరంలోని మద్యంషాపులల్లో వ్యాపారం రూ.65లక్షలు చొప్పున చోటుచేసుకోగా గురువారం 5 రెట్లు అధికంగా దాదాపు రూ.3కోట్లు పైబడి వ్యాపారం లభించినట్లు సమాచారం. చిత్తూరు–కర్నూల్ జాతీయ రహదారి వెంబడి మందుబాబులు తిష్టవేసి మద్యం సాగారు. ఇటు కడప–రేణిగుంట రహదారిలో కూడా అలాంటి పరిస్థితి కన్పించింది. కడప రింగు రోడ్డు 22కిలోమీటర్లు పొడవునా అడుగడుగునా మందు ప్రియులు మద్యం తాగుతూ కన్పించింది. -
ఇసుక దిబ్బల కోసం తెలుగు తమ్ముళ్ల తగువులాట.!
సాక్షి టాస్క్ఫోర్స్ : అధికారం వచ్చిందే తడవు అన్నట్లుగా టీడీపీ వర్గీయులు పేట్రేగిపోతున్నారు. మనకెవరూ అడ్డూ, అదుపు లేరనేలా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆక్రమణల్లో తలమునకలైన టీడీపీ వర్గీయుల్లోని ఇరువర్గాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడుతున్నారు. చాపాడు మండలం వి.రాజుపాళెం గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు మంగళవారం పట్టపగలే కత్తులు, రాడ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. రాజుపాలెం గ్రామ సమీంపలోని పెన్నానది పరివాహకంలో సర్వే నెంబరు 490లో ప్రభుత్వ ఇసుక దిబ్బలు ఉన్నాయి. దీనికి ఇరువైపులా భూములు సాగు చేసుకుంటున్న రాజుపాలెంకు చెందిన టీడీపీలో ఒక వర్గానికి చెందిన పల్లెం శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య, మరో వర్గానికి చెందిన నలసింగ్ పెద్ద కుల్లాయప్ప, చిన్న కుల్లాయప్ప కుటుంబాలకు చెందిన వారు ఇసుక దిబ్బల కోసం మంగళవారం ఘర్షణ పడ్డారు. కొన్ని రోజుల క్రితం ఇదే విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. మంగళవారం కూడా కుల్లాయప్ప కుటుంబీకులు ఇసుక దిబ్బల నుంచి ఇసుకను తరలిస్తుండగా పల్లెం శ్రీనివాసులు కుటుంబీకులు అడ్డుకునేందుకు వెళ్లి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో కత్తులు, ఇసుప రాడ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన పవన్కుమార్ను కర్నూలుకు, తలకు గాయమైన మధును కడప రిమ్స్కు తరలించగా, మహేష్ అనే వ్యక్తి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘర్షణపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలకు చెందిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుండగా జన సమీకరణ కోసం ఆయా నియోజకవర్గాల నుంచి జనాలను తరలించే పనుల్లో అధికార పార్టీ నేతలు బిజీగా ఉండగా రాజుపాళెం గ్రామంలో టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగడం గమనార్హం.పెన్నానదిలో వందల ఎకరాల్లో ఆక్రమణలు..మండలంలోని రాజుపాళెం, తిప్పిరెడ్డిపల్లె గ్రామాల మధ్య గల పెన్నానది పరివాహకంతో పాటు నదిలో ఇసుక దిబ్బల్లో వందల ఎకరాల్లో భూములు ఆక్రమణకు గురయ్యాయి. సర్వే నెంబర్లు 487, 488లలో 7.25 ఎకరాల ఆయకట్టు ఉండగా, 489–2లో 22 ఎకరాలు, 490లో 20 ఎకరాలకు పైగా ఇసుక దిబ్బలు ఉండగా, 538లో వంద ఎకరాలకు పైగా ఏటి పొరంబోకు ఉంది. ఈ స్థలం అంతా ఆక్రమణకు గురై వ్యవసాయ భూములుగా మారాయి. ఈ క్రమంలో ఆక్రమణకు గురైన పొలాల మధ్య ఉన్న ఇసుక దిబ్బలలో ఉన్న ఇసుకను పొలాలకు తోలుకునేందుకు, ఇసుక తొలగించి వ్యవసాయ భూమిగా మార్చుకునేందుకు టీడీపీ వర్గీయుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.సమస్యాత్మక దిబ్బలను పరిశీలించినరెవెన్యూ అధికారులు..మండలంలోని రాజుపాలెం గ్రామ సమీపంలో టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు కారణమైన పెన్నానది పరివాహకంలో ఇసుక ఇబ్బలను తహసీల్దారు రమాకుమారి తమ సిబ్బందితో కలసి పరిశీలించారు. ఈ ఇసుక దిబ్బలు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనివని, వీటిపై ఎవరికీ హక్కు లేదని, హక్కు ఉన్నట్లు పత్రాలు తీసుకువస్తే విచారించి పరిశీలిస్తామని ఇరువర్గాలకు తెలిపారు. -
మహానాడులో మదనపల్లె జిల్లా ప్రకటించాలి
మదనపల్లె రూరల్ : కడపలో జరుగుతున్న మహానాడులో మదనపల్లె జిల్లాను ప్రకటించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీయం.శివప్రసాద్ డిమాండ్ చేశారు. మహానాడులో మదనపల్లె జిల్లా ప్రకటనకు డిమాండ్ చేస్తూ స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం మదనపల్లె జిల్లా సాధన సమితి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లక్రితం మహానాడు సందర్భంగా మదనపల్లెలో నిర్వహించిన మినీ మహానాడులో, టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల సందర్భంగా గత ఏడాది మదనపల్లె బెంగళూరు బస్టాండ్లో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో మదనపల్లె జిల్లా ఏర్పాటు తన బాధ్యతగా పేర్కొన్నారన్నారు. అలాగే యువగళం పాదయాత్ర సందర్బంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ రొంపిచెర్ల, మదనపల్లె సభల్లో మాట్లాడుతూ..తాము అధికారం చేపట్టిన మొదటి ఆరు నెలల్లో మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలను కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటుచేస్తామని ప్రకటించారన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా...ఇప్పటికీ మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించలేదని విమర్శించారు. సమావేశంలో మదనపల్లె జిల్లా సాధన సమితి నాయకులు ముత్యాల మోహన్, టి.ఏ.పీర్బాషా, కోనేటి దివాకర్రావు, బురుజురెడ్డి ప్రసాద్, గంగాధర్, రవిశంకర్, బి.నరసింహులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
కడప అర్బన్ : ‘తెలుగు ప్రజల కోసం పాలనాపరంగా పలు సామాజిక సంస్కరణలు అమలు చేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకే దక్కుతుందని ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సేవలందించడంతో పాటు చలనచిత్రాల్లో, నిజజీవితంలోనూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచ వేదికపై చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పాముకాటుతో ఇద్దరికి అస్వస్థత
మదనపల్లె రూరల్ : పాముకాటుతో ఇద్దరు అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన చంద్రమ్మ(50) పొలం పనులు చేసుకుంటుండగా, పాముకాటుకు గురైంది. తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా పీటీఎం మండలం బురుజుపల్లెకు చెందిన రామకృష్ణ, జ్యోతి దంపతుల కుమారుడు పి.అరుణ్తేజ్(8) ఇంట్లో నిద్రిస్తుండగా, బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని విషపురుగు కాటేసింది. తీవ్ర అస్వస్థతకు లోనుకాగా, కుటుంబ సభ్యులు కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. -
చిట్టీ డబ్బులు అడిగితే కుటుంబంపై దాడి
మదనపల్లె రూరల్ : ఆపద సమయంలో ఆదుకుంటుందని, కష్టార్జితాన్ని కపిలేశ్వర్ చిట్ఫండ్స్ సంస్థలో చిట్టీల రూపంలో జమచేస్తే...కంతులు పూర్తయినా డబ్బులు ఇవ్వకపోగా, అడిగినందుకు అనుచరులు, సిబ్బందితో బాధిత కుటుంబంపై యాజమాన్యం దాడికి పాల్పడిన ఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. ప్రొద్దుటూరు నుంచి మూడు వాహనాల్లో మదనపల్లెకు వచ్చిన కపిలేశ్వర్ చిట్స్ ఎండీ సీకే నాయుడు అనుచరులు, చిట్టీ డబ్బులు చెల్లించిన కస్టమర్ రామ్మోహన్రెడ్డి, అతని భార్య రత్నకుమారి, కుమార్తె రమ్యశ్రీపై దాడికి పాల్పడి విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా మెట్లపై నుంచి కిందకు తోసేశారు. దీంతో బాధితుడు, ప్రజాసంఘాల మద్దతుతో కపిలేశ్వర్ చిట్స్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడిపై బాధితుల నుంచి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను విచారించి, వారు వచ్చిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎస్టేట్ శివాజీనగర్, పద్మావతి కల్యాణమండపం సమీపంలో నివాసం ఉంటున్న బి.రామ్మోహన్రెడ్డి ఆర్టీసీ–2డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రత్నకుమారి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం సీటీఎంరోడ్డులోని కపిలేశ్వర్ చిట్స్లో రామ్మోహన్రెడ్డి పేరుపై రూ.5 లక్షలు, భార్య రత్నకుమారి పేరుపై రూ.5లక్షలు చిట్టీలు వేశారు. 50 కంతులు పూర్తిగా చెల్లించాడు. ఆగస్టు–2024కు చిట్టీ కంతులు పూర్తికాగా, యాజమాన్యం చిట్టీ నగదు చెల్లించాల్సి ఉంది. అయితే గడువు పూర్తయి పదినెలలు కావస్తున్నా.. కేవలం రూ.1లక్ష 20వేలు మాత్రమే బాధితులకు చెల్లించారు. మిగిలిన నగదు చెల్లించకుండా వారిని వేధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో పలుమార్లు కార్యాలయం చుట్టూ బాధితులు తిరిగినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నగదు చెల్లించాలని బాధితుడు గట్టిగా నిలదీయడంతో ఏప్రిల్ 18కి పూర్తిగా చెల్లిస్తామని యాజమాన్యం చెప్పింది. అయినా అప్పటికీ చెల్లించకపోవడంతో విసిగిపోయిన బాధితులు బుధవారం చిట్ కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని నిలదీశారు. కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. యాజమాన్య వైఖరిపై టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, నగదు లావాదేవీలు కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు చెప్పి పంపేశారు. ఇంటికి చేరుకున్న రామ్మోహన్రెడ్డికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో కపిలేశ్వర్ చిట్స్ మేనేజర్ నరసింహులు ఫోన్చేసి, ఎండీ సీకే నాయుడు వచ్చారని, మీ నగదు చెల్లిస్తారు. కార్యాలయానికి రావాలంటూ కోరాడు. దీంతో రామ్మోహన్రెడ్డి, భార్య రత్నకుమారి, కుమార్తె రమ్యశ్రీతో కలిసి చిట్స్ కార్యాలయానికి 3.30 గంటలకు చేరుకున్నాడు. అప్పటికే ప్రొద్దుటూరు నుంచి మూడు వాహనాల్లో వచ్చిన ఎండీ సీకే నాయుడు, అనుచరులతో కలిసి కార్యాలయంలో ఉన్నారు. బాధితులు కార్యాలయానికి వచ్చిన వెంటనే అనుచరులు, కార్యాలయ సిబ్బంది ఎండీ సీకే నాయుడు సమక్షంలో ఒక్కసారిగా మూకుమ్మడిగా రామ్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులపై దాడిచేసి విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో రామ్మోహన్రెడ్డి పళ్లు విరగడంతో పాటు రక్తగాయాలై తీవ్రంగా గాయపడ్డాడు. మహిళలు అని చూడకుండా రత్నకుమారి, రమ్యశ్రీలను అసభ్యపదజాలంతో దూషిస్తూ కొట్టడంతో పాటు దిక్కున్నచోటు చెప్పుకోమంటూ మెట్లపై నుంచి కిందకు తోసేశారు. దీంతో బాధితుడు నడిరోడ్డుపై తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ బంధుమిత్రులతో కలిసి నిరసన తెలిపాడు. బాధితుడికి అండగా బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు మద్దతు తెలిపి చిట్స్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. దాడి ఘటనపై ఫిర్యాదు తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు, వచ్చిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని, స్టేషన్కు తరలించారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కంతులు పూర్తయి ఏడాది కావస్తున్నా డబ్బులు చెల్లించని కపిలేశ్వర్ చిట్స్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. అనుచరులు, సిబ్బందితో కలిసి హత్యాయత్నం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. మూడు వాహనాలు స్వాధీనం -
మాజీ సీఎం ఎన్టీఆర్కు నివాళి
రాయచోటి: మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రటానికి రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం.పెద్దయ్య, ఎస్ఐలు, ఆర్ఎస్లు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో.. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రజా భవనంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్ఓ మధుసూదనరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్రెడ్డిలు మాట్లాడారు. రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ క్రాంతికుమార్, కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రెడ్డప్పరెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారతి సిమెంట్స్ను వినియోగించండిగాలివీడు : గ్రామీణ ప్రాంతాలలో గృహాలు, కట్టడాలకు భారతి సిమెంటు వాడుతూ నాణ్యత పెంచుకోవాలని భారతి సిమెంట్స్ ప్రతినిధులు సూచించారు. బుధవారం వారు స్థానిక డీలర్ ఆధ్వర్యంలో గృహ నిర్మాణదారులు, బేల్దార్లు, బిల్డర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓబీసీ 53 గ్రేడ్తో నాణ్యమైన సిమెంటును సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భారతి సిమెంటును వాడి నాణ్యత మేరకు తమ కట్టడాలను శాశ్వతం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్స్ యాజమాన్యం, పలువురు బేల్దార్లు, గృహాల యజమానులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
సిద్దవటం : మండలంలోని సాబ్బావి రహదారి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా.. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడాల వెంకట శ్యాంప్రసాద్ తన సొంత కారులో రాష్ట్ర నాయకుడు పట్టెడ రమణను ఎక్కించుకొని కడప ప్రెస్క్లబ్లో సమావేశానికి బయలుదేరారు. మండలంలోని సాబ్బావి రహదారి సమీపంలోకి రాగానే కల్వర్ట్ను ఢీకొని కారు మూడు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని దార వెంట ప్రయాణికులు 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారురైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లి పంచాయతీ శాంతినగర్లోని కడప–తిరుపతి ప్రధాన రహదారిపై బుధవారం విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్కు చెందిన వారు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభం కుప్పకూలడంతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా ఉన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మదనపల్లె: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సిద్దిస్తుందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో యోగా కార్య క్రమం నిర్వహించారు. జిల్లా అధికారులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి హజరైన మండల, గ్రామస్థాయి అధికారులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, పలుశాఖల ఉద్యోగులతో యోగాసనాలను వేశారు. కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే షాజహాన్బాషా, జెసీ ఆదర్శ్ రాజేంద్ర, సబ్కలెక్టర్ వై.మేఘస్వరూప్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా హజరైన వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో యోగాకు ప్రాముఖ్యత ఉందన్నారు. మానసిక, శారీరక, అధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగం కలుగుతుందన్నారు. ఆనందకరమైన జీవితానికి యోగాఅవసరమని అన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు యోగాను అచరించవచ్చన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసోత్సవాలను జరుపుతున్నట్టు చెప్పారు. యోగా గురువు పాల్ బ్రహ్మకుమార్ 15 మంది ఉప గురువులతో కలిసి 45 నిమిషాల పాటు హజరైన వారితో యోగాసనాలు వేయించారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తర్వాత మైదానం నుంచి చిప్పిలి వరకు హజరైన వారితో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ సుబ్బరాజు, డీఎఫ్ఓ జగన్నాధ్సింగ్, మదనపల్లె కమీషనర్ ప్రమీల, హార్టికల్చర్, హౌసింగ్ జిల్లా అధికారులు రవిచంద్రారెడ్డి, సాంబశివయ్య పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
●చిత్తశుద్ధి లేకపోవడంతోనే పేలవంగా మహానాడు
కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు రెండో రోజు పూర్తిగా ఆదరణ కరవయ్యింది. మొదటి రోజు అంతంత మాత్రంగా హాజరైన తెలుగు తమ్ముళ్లు, రెండు రోజు పూర్తిగా ముఖం చాటేశారు. మహానాడు ప్రాంగణం వైపే చూడని వారు కొందరైతే, వచ్చిన వారు కూడా ప్రసంగాలు ప్రారంభం కాగానే తిరుగుబాట పట్టారు. వెరసి మహానాడు ప్రాంగణం, చుట్టుపక్కల రహదారులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎంతో ఆర్భాటంగా మహానాడును కడపలో నిర్వహించుకుంటున్నాం అని చెప్పుకున్న టీడీపీ బోర్లా పడింది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆదరణ కరవైంది. దీనికి ప్రధాన కారణం నేతలల్లో చిత్తశుద్ధి లేకపోవడమేనని పలువురు చెప్పుకొస్తున్నారు. మహానాడులో రెండో రోజు ఉదయాన్నే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇక ఆ టెంట్ల కింద ఉన్న జనాలు తప్ప కనుచూపు మేర ఎక్కడా జనం కనిపించలేదు. సొంత పార్టీ కార్యకర్తలే మహానాడుకు డుమ్మా కొట్టడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదని విఽశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం
రైల్వేకోడూరు అర్బన్: కడపలో టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. కేవలం గతప్రభుత్వాన్ని విమర్శించడం, లోకేష్ను పొగుడుకోవడంతోనే రెండురోజులు సరిపెట్టారన్నారు.జనం లేక మహానాడు వెలవెలబోయిందని అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అమలు చేయలేని హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని, పథకాలు ఎగ్గొట్టి పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు చేసిన మోసాలకు చివరకు వరుణుడు కూడా ఆగ్రహించారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అన్నిరంగాల్లో గత ప్రభుత్వం యువతకు అందించిన ఉద్యోగాలు పీకేసి, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటూ ఏ ముఖం పెట్టుకొని మహానాడు నిర్వహిస్తున్నారని విమర్శించారు. జనాలు రాకపోవడంతో డ్వాక్రాసంఘాలు, గ్రామాల్లోని ప్రజలను మహానాడుకు రాకుంటే పథకాలు రావంటూ కొందరు అధికారులు బలవంతంగా మూడోరోజుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మహిళలు, యువతులు మాయమవుతున్నా పవణ్కళ్యాణ్ పట్టించుకోలేదని, ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందించారని గుర్తు చేశారు. క రోనా కష్టకాలం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు, ఇప్పుడు చంద్రబాబు కే టాయించిన నిధుల గురించి ప్రజలు గమనించా లన్నారు. రెడ్బుక్తోనే పరిపాలన చేయాలని తండ్రీకొడుకులు, పవన్కళ్యాణ్ చూస్తున్నారని తెలిపారు. జగనన్న పరిపాలన విలువ ఇప్పుడు ప్రజలకు తెలుస్తోందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
మహానాడుకు సుగవాసి కుటుంబం దూరం
రాయచోటి: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో అడుగులు వేసిన సుగవాసి కుటుంబం, ఆయన అనుచరులు నేడు కడప గడ్డపై జరుగుతున్న మహానాడు వేదికకు దూరమయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ అధిష్టానమే సుగవాసి కుటుంబాన్ని దూరం చేసుకుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బుధవారం దివంగత నేత ఎన్టీ రామారావు జయంతిని రాయచోటిలోని సుగవాసి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మహానాడులో సుగవాసి కుటుంబాన్ని పట్టించుకోలేదన్న ఆవేశం, ఆక్రోశం ఆయన వర్గీయుల్లో కట్టలు తెంచుకుంటుంది. సుగవాసి పాలకొండ్రాయుడు తనయులకు ప్రాధాన్యం లేకపోవడంతో బాల సుబ్రమణ్యం, ప్రసాద్ బాబులు మహానాడుకు దూరమయ్యారని తెలిసింది. వారి అనుయాయులు కూడా మహానాడు కార్యక్రమానికి వెళ్లలేదని సమాచారం. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి, టీడీపీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు తన అనుయాయులతో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుగవాసి అనుచరులు పెద్దఎత్తున హాజరై సంఘీభావం తెలిపారు. తండ్రి ఆశయ సాధనకోసం.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో అందరి అభిప్రాయం మేరకు రాజకీయాలలో అడుగులు వేస్తామన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా పార్టీని, కుటుంబాన్ని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. సుగవాసి భవన్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు -
పేదలను మోసగిస్తున్న కూటమి ప్రభుత్వం
రైల్వేకోడూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి పేద ప్రజలకు ఎలాంటి పథకాలు అమలు చేయకుండా వారిమీదే భారం వేస్తూ పరిపాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు పేరుతో సంబరాలు చేసుకోవడం ప్రజలను అవమానించడమే అన్నారు. మండలానికి నాలుగు మద్యం షాపులు, నలభై బెల్టుషాపులు పథకం అమలు చేశారని ఎద్దేవా చేశారు. అలాగే విద్యుత్ చార్జీల పేరుతో రూ. 15,480 కోట్లు ప్రజలపై భారం మోపారన్నారు. కూటమి పాలనలో పాఠశాలల్లో కూడా డ్రగ్స్, గంజాయి ప్రవేశించడం అవమానకరమన్నారు. రాష్ట్రంలో రైతులకు ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా మహానాడులో భోజనాలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఏడాదిలో ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతుకు కూడా పంట నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. మహిళలపై అత్యాచారాలు, ఇసుక, మద్యం, మైనింగ్లలో విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
పశ్చిమబెంగాల్ సైబర్ నేరస్తుడు మదనపల్లెలో అరెస్టు
మదనపల్లె రూరల్ : ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడంతో పాటు సైబర్ నేరాలకు పాల్పడి మదనపల్లెలో తలదాచుకున్న పశ్చిమబెంగాల్కు చెందిన సైబర్ నేరస్తుడిని ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కలకత్తాకు చెందిన జిజాన్స్(40) స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ పలువురికి ఉద్యోగాలిప్పిస్తానని నగదు వసూలు చేసుకున్నాడు. అంతేకాకుండా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై ఆరు నెలల క్రితం కలకత్తా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న జిజాన్స్ మదనపల్లెకు వచ్చి స్థానికంగా మార్పూరి వీధిలోని టీ హోటల్లో పనిచేస్తూ తలదాచుకున్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా కలకత్తా పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు మదనపల్లెలో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ముగ్గురు పశ్చిమబెంగాల్ పోలీసులు మదనపల్లెకు చేరుకుని, టూటౌన్ పోలీసుల సాయంతో జిజా న్స్ను అరెస్ట్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం నిందితుడిని కలకత్తాకు తరలించారు. -
ఆగిన వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు
రాయచోటి టౌన్ : రాయచోటికే తలమానికంగా నిలిచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి కోసం రూ. కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది ఇప్పుడు ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. ప్రధానంగా వీరభద్రస్వామి ఆలయానికి చెందిన పనుల్లో స్వామి వారి ఆలయానికి పడమర దిక్కున ప్రహరీకి ఆనుకొని ఉన్న ఆక్రమణల తొలగింపు అంశాన్ని అప్పటి ఎమ్మెల్యే, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి ఎంతో చాకచక్యంగా పరిష్కరించారు. అంతేకాకుండా వారికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటి స్థలాలు కూడా కేటాయించి ఇళ్ల నిర్మాణాలకు సహకరించారు. ఆ వెంటనే పశ్చిమ రాజగోపురం రూ.158 కోట్లతో నిర్మించారు. అలాగే గర్భాలయంపై పిడుగు పడటంతో 2020లోనే మళ్లీ రూ.33 లక్షలతో పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. అనంతరం రూ.38 లక్షలతో మాఢవీధులు నిర్మించారు. చివరగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఐదు అంతస్తుల భవనాలు నిర్మించేందుకు రూ.1.58 కోట్లతో 2023 జనవరి 26న పనులు ప్రారంభించారు. మూడు అంతస్తుల వరకు గోడలు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పనులు ఆగిపోయిన విషయమై ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డిని వివరణ కోరగా నూతన కమిటీ ఏర్పడ్డాక మిగిలిన పనులు పూర్తి చేయిస్తామన్నారు. యువకులపై పోలీసుల దాడి దారుణం పోరుమామిళ్ల : తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానుషమని, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగరీత్యా నేరమని మానవహక్కుల సంఘం జిల్లా చీఫ్ గంగన్న, ప్రతినిధులు ఫణిరావు, శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో దండించడం పక్కనపెట్టి బహిరంగంగా నడిరోడ్డుపై ముగ్గురు యువకులను కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో మోదడం చూస్తున్నవారిని భయకంపితులను చేసిందన్నారు. అమానుషంగా ప్రవర్తించిన ఇద్దరు సీఐలపై చర్య తీసుకోవాలని కోరారు. రౌడీలను దారిలో పెట్టే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. -
గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ
గుర్రంకొండ : గొర్రెల మందపై లారీ దూసుకెళ్లడంతో ఏడు పొట్టేళ్లు మృతి చెందగా తొమ్మిది గొర్రెలు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ ఎరుకలవానిమిట్ట వద్ద జరిగింది. కలకడ మండలం నడిమిచెర్ల గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే గొర్రెలకాపరి గొర్రెల మందను కాచుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలాలపై మందను నిలిపేందుకు మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ ఎరుకలవానిమిట్ట వద్ద ఉన్న పొలాల్లోకి తన గొర్రెల మందను తోలుకొచ్చాడు. మంగళవారం మందను సమీప గుట్టల్లో మేపుకొని తిరిగి పొలాలవైపు వస్తుండగా రాయచోటి నుంచి మదనపల్లె వైపు వెళుతున్న లారీ గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఏడు పొట్టేళ్లు ఆక్కడికక్కడే మృతి చెందగా తొమ్మిది గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన గొర్రెల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు బాధిత గొర్రెల కాపరి తెలిపాడు. ఈ ప్రమాదంలో రూ.2లక్షల నష్టం వాటిల్లిందన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘురామ్ తెలిపారు.ఏడు పొట్టేళ్లు మృతి -
యోగాంధ్రకు సర్వం సిద్ధం
మదనపల్లె రూరల్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలో బుధవారం నిర్వహించనున్న జిల్లా స్థాయి మెగా యోగాకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జేసీ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్.. పట్టణంలోని బెంగళూరు రోడ్డు బీటీ కాలేజీ గ్రౌండ్స్లో యోగా కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. మైదానంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 5,00 మంది యోగా చేసేందుకు అనువుగా మైదానంలో మ్యాట్ ఏర్పాటు చేయాలని, వచ్చిన వారందరికీ తాగునీటి ఏర్పాట్లు ఉంచాలన్నారు. యోగా ట్రైనర్, ఆసనాలకు సంబంధించి చెప్పే మాటలు అందరికీ వినపడేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. యోగాలో పాల్గొనే అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ అధికారులు, ఆశా కార్యకర్తలు క్రమశిక్షణతో సంఘటితంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్కు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల, తహసీల్దార్ కె.ధనంజయులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ రమేష్బాబు, ఎంపీడీఓ తాజ్మస్రూర్ తదితరులు పాల్గొన్నారు. -
నిధుల స్వాహా కథ.. కంచికేనా?
మదనపల్లె : కథలన్నీ కంచికి చేరుతాయన్న సామెతలాగా.. మదనపల్లె మున్సిపాలిటీలో లక్షల నిధుల స్వాహా కథ కూడా కంచికి చేరేలా కనిపిస్తోంది. మదనపల్లె స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో 2022–23 గుత్తలకు సంబంధించి రూ.29.50 లక్షల నిధులు స్వాహా విషయాన్ని ఈ నెల 14న ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్ ఒకటి నుంచి 2023 మార్చి 31 వరకు వారపుసంత, జంతువధశాల, దినసరి మార్కెట్ను వేలం ద్వారా రూ.94.55 లక్షలకు గుత్తకు అప్పగించారు. ఈ గుత్త పొందిన లీజుదారుడు చెల్లించిన నిధులు, స్వాహా అంశాన్ని అధికారులు ఇంకా కొలిక్కి తీసుకురాలేదని తెలుస్తోంది. రెండు రోజులు విచారణ పైసా సొమ్ము చెల్లించినా ఆన్లైన్ ద్వారా జమ చేసి చెల్లింపుదారునికి ఆన్లైన్ రశీదులు ఇస్తారు. అయితే ఈ గుత్తకు సంబంధించి రూ.29.50 లక్షల చెల్లింపు జరిగినట్టు, అందుకు చేతిరాత రశీదులు ఇచ్చిన ఉద్యోగి.. ఆపై సొమ్మును మున్సిపాలిటీకి జమ చేయలేదని గుర్తించారు. ఈ విషయం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో అధికారులు రెండురోజుల పాటు విచారణ చేసి ముగించారు. విచారణలో సొమ్ము చెల్లింపుపై స్వాహా చేసిందెవరు, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది అనే వివరాలను ఆరా తీయలేదని తెలుస్తోంది. మొత్తం ఆరోపణలకు కేంద్రమైన రశీదులు ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ చేస్తే.. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండేది. అనుమానాలు ఎన్నో.. నిధుల స్వాహా రెండేళ్లుగా నలుగుతుండటంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుత్తల సొమ్ము చెల్లించాల్సిన లీజుదారు నిర్ణయించిన గడువులోగా సొమ్ము జమ చేయకుంటే మూడు నెలల ముందే.. లీజును రద్దు చేసే అవకాశం ఉన్నా, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. సొమ్ము జమ అయినట్టు చేతిరాత రశీదులు చూపించి లీజుదారు రద్దు నుంచి తప్పించుకున్నారా?.. ఇదే జరిగివుంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై అప్పుడే అధికారులు చర్యలు తీసుకోవాల్సింది. అలా కాకుండా లీజు పూర్తయ్యాక సొమ్ము చెల్లింపు కోసం న్యాయపరమైన చర్యలు చేపట్టడం మున్సిపల్ నిబంధనల మేరకే జరిగిందా? రశీదులు ఇచ్చారంటే సంబంధిత ఉద్యోగి లీజుదారు నుంచి సొమ్ము తీసుకున్నట్టు ఎవరైనా భావిస్తారు. ప్రధానంగా డబ్బు తీసుకున్నట్టు రశీదులు ఇవ్వడం ఈ వ్యవహారంలో కీలకమైంది. కాబట్టి అధికారులు తగిన రీతిలో లీజుదారు, సంబంధిత ఉద్యోగిని విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇంత పెద్ద మొత్తానికి చేతిరాత రశీదులపై తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదని మున్సిపల్ సిబ్బంది చర్చించుకొంటున్నారు. ముగింపు ఎలా..! గుత్తల సొమ్ము స్వాహా వ్యవహారానికి ఎలా ముగింపు పలకాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. న్యాయపరమైన చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నా.. స్వాహా విషయాన్ని ‘సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో అధికారుల్లో కదలిక వచ్చి, రెండు రోజులు ఉద్యోగులతో రహస్య విచారణ జరిపారు. ఆ విచారణలో ఏమి తేల్చారో బయటకు పొక్కలేదు కానీ.. ఈ స్వాహా కథకు ముగింపు పలకడం కోసం దారులు వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ‘సాక్షి’ కథనంతో రహస్య విచారణ రూ.29.50 లక్షలకు చేతి రశీదులపై జరగని విచారణ లీజుదారు డబ్బు చెల్లించకున్నా కొనసాగించిన వైనం ఈ వ్యవహారంపై ముగింపు పలకలేక మల్లగుల్లాలు? -
రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్
బి.కొత్తకోట : జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పని చేసిన సీసీ రోడ్లు, కూలీలకు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం తెలిపారు. స్థానిక ఉపాధి కార్యాలయంలో ఆయన మంగళవారం ఫాం పాండ్స్ పనులపై క్షేత్ర, సాంకేతిక సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా ఉపాధి ఎఫ్ఏ, టీఏలు, ఏపీఓలకు వేతనాలు అందలేదన్నారు. వీరికి త్వరలోనే వేతనాలు జమ అవుతాయని చెప్పారు. జిల్లాలో 11 వేల ఫాం పాండ్స్ నిర్మాణం కోసం పనులు చేపట్టగా.. ఇప్పటి దాకా 5,109ను రూ.25 కోట్ల వ్యయంతో పూర్తి చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 71 వేల మంది ఉపాధి పనులు చేస్తుండగా.. అందులో 26 వేల మంది ఫాం పాండ్స్ పనులు చేస్తున్నారని తెలిపారు. నెల రోజులుగా ఉపాధి పనులు చేసే కూలీల సంఖ్య పెరిగిందన్నారు. మండల ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తూ.. మండలానికి 225 కంపోస్టు యార్డులు మంజూరైనట్టు చెప్పారు. ఈ నెలఖారులోగా 263 ఫాం పాండ్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 200 ఎకరాల్లో ఉద్యానవనాల పెంపకం లక్ష్యంగా నిర్ణయించామని, దీనిపై రైతులను గుర్తించి మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కూలీల సంఖ్యను 1,370కు పెంచాలని సూచించారు. యోగాంధ్ర యాప్లో ఉపాధి కూలీలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. సమావేశంలో ఏపీడీ నందకుమార్, ఏపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయకుంటే చర్యలు పెద్దతిప్పసముద్రం : ఉపాధి హామీ పథకంలో భాగంగా సిబ్బందికి నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాలను నెలాఖరులోగా పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకటరత్నం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మండలంలోని క్షేత్ర, సాంకేతిక సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయన వెంట ములకలచెరువు క్లస్టర్ ఏపీడీ నందకుమార్రెడ్డి ఉన్నారు. ఫాం పాండ్స్ పనులకు రూ.25 కోట్ల వ్యయం పీడీ వెంకటరత్నం -
చెక్బౌన్స్ కేసులో రూ.15 లక్షలు జరిమానా
తంబళ్లపల్లె : చెక్ బౌన్స్ కేసులో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి రూ.15లక్షలు జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఉమర్ఫారూఖ్ తీర్పు ఇచ్చారు. బెంగళూరుకు చెందిన లోకనాథరెడ్డి 2018లో తంబళ్లపల్లె వాసి రామమూర్తికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. బాఽధితుడు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు. బాధితుడి తరపున న్యాయవాది గఫార్ కేసు వాదనలు వినిపించారు. విచారణ పూర్తయి నేరం రుజువుకావడంతో లోకనాథరెడ్డికి రూ.15 లక్షలు జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రభుత్వ భూమి కబ్జా.! పుల్లంపేట : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ భూములను కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. మండల వ్యాప్తంగా 400 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. యథేచ్ఛగా భూముల్లో చెట్లు నాటుకొని పంటలు సాగు చేస్తున్నారు. పూర్వకాలం నుంచి గ్రామంలో చనిపోయిన వారి భార్యలు గాజు, పూస తీసే భూమిని చిన్న ఓరంపాడు వీఆర్ఓ రాంబాబు, వీఆర్ఏ రామచంద్రలు ఆక్రమించుకుంటున్నారని మంగళవారం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎల్లయ్య దీనిపై మాట్లాడుతూ తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. మొక్కుబడిగా ఆర్ఐ విచారణ చేపట్టి వీఆర్ఓ, వీఆర్ఏకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తమ ఆక్రమణను అడ్డుకుంటే మీ అంతు చూస్తామని కూటమి నాయకులు బెదిరిస్తున్నారని సర్పంచ్ తెలిపారు. ఈ విషయంపై పుల్లంపేట తహసీల్దార్ అరవింద కిషోర్ను వివరణగా కోరగా ఆక్రమణదారులపై తక్షణం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫ్లెక్సీ పడి టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడికి తీవ్ర గాయాలు కడప అర్బన్ : మహానాడు ప్రాంగణం సమీపంలో జరిగిన ప్రమాదంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు గాయపడ్డాడు. మోటారు సైకిల్పై వెళ్తున్న పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లెకు చెందిన చెండ్రాయుడు (52)పై మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఫ్లెక్సీ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. డీఈఓ వెబ్సైట్లో సీనియారిటీ జాబితాకడప ఎడ్యుకేషన్ : మున్సిపల్ మేనేజ్మెంట్ ప్రొద్దుటూరులో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 01:03 నిష్పత్తిలో ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఉపాధ్యాయులు సంబంధిత ధ్రువపత్రాలతో కడప గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ఈనెల 28వ తేదీ హాజరు కావాలని కోరారు. -
లాంజ్ బాత్రూమ్లో యువకుడి మృతి
నెల్లూరు(క్రైమ్) : నెల్లూరు ఆర్టీసీ ప్రాంగణంలోని ఎంఎస్ఆర్ డీలక్స్ లాంజ్ బాత్ రూమ్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం కారనిమిట్టకు చెందిన ఎస్.విజయకుమార్ (26) మదనపల్లెలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో అనస్థీషియా టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు నెలల క్రితం సమీప బంధువైన ఉషతో వివాహమైంది. సోమవారం విజయకుమార్ మదనపల్లెలోని వైద్యశాలకు వెళ్లాడు. డాక్టర్ సూచనల మేరకు మందులు తీసుకెళ్లేందుకు నెల్లూరుకు వచ్చాడు. ఆర్టీసీ బస్టాండ్లోని రిజర్వేషన్ కౌంటర్ పక్కనే ఉన్న ఎంఎస్ఆర్ డీలక్స్ లాంజ్లో బాత్రూమ్కు వెళ్లాడు. అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన లాంజ్ నిర్వాహకులు చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మంగళవారం నెల్లూరుకు చేరుకున్న బాధిత కుటుంబం విజయకుమార్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. మృతుని తమ్ముడు చందు ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఎస్ఐ వీసీ సుబ్రమణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు.వీరపునాయునిపల్లెలో దారుణ హత్యవీరపునాయునిపల్లె : మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో మంగళవారం దారుణ హత్య జరిగింది. వీరపునాయునిపల్లెకు చెందిన అనిమెల ఆంజనేయులు అలియాస్ సుమో ఆంజనేయులు (45) మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బైకుపై ఇంటికి వెళుతుండగా కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించి గొంతు కోసి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. తమ ఇంటి వద్ద నివాసముంటున్న బెలుకూరి నరేష్, నవీన్లతో తమకు చాలా కాలంగా సమస్యలున్నాయని వారే ఈ హత్య చేసి ఉండవచ్చని మృతుడు ఆంజనేయులు భార్య కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ చల్లని దొర ఆదేశాల మేరకు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతితొండూరు : తొండూరు మండలం ఊడవగండ్ల గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి దాసరి దేవా సాయి యల్లారెడ్డి(17) మంగళవారం ఈతకోసం వెళ్లి బావిలో మునిగి మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దాసరి దేవా సాయి యల్లారెడ్డి బంధువులతో కలిసి గ్రామంలోని బావి వద్దకు ఈతకు వెళ్లాడు. అందరూ సరదాగా ఈత కొడుతున్న క్రమంలో దేవసాయి ప్రమాదవశాత్తు బావిలోని మెటికల కింద ఉండిపోవడంతో శ్వాస ఆడక మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు.ఆత్మహత్యకు యత్నించిన యువకుడి మృతికడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో భగత్ సింగ్ నగర్లో నివాసముంటున్న వారం రామాంజులు (21) అనే యువకుడు ఈనెల 21వ తేదీన విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామాంజులు చింతకొమ్మదిన్నెకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులు ఆ యువతి వరుస కాదని వివాహం చేసేందుకు అంగీకరించలేదు. దీంతో ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈనెల 26వ తేదీన మృతి చెందాడు. -
● అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పలేని దుస్థితి..
● ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నీ ‘వైఎస్’ హయాంలోనే.. సాక్షి ప్రతినిధి, కడప: మహానాడులో చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్ల పరువు తీసి రోడ్డున పడేశారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డా కడపలో మహానాడు పెడుతున్నాం. ఇక అన్నీ మారిపోయాయి.. రాయలసీమ రూపురేఖలు రేపటి నుంచి మారిపోతాయి’ అంటూ తెలుగుదేశం నేతలు బీరాలు పలికారు. మహానాడు సందర్భంగా.. ఏ వేదిక దొరికినా, ఇదే అంశాన్ని ఊదరగొట్టారు. తీరా మహానాడులో చంద్రబాబు రాయలసీమ అభివృద్ధి అంశాన్నే పక్కన పెట్టడంతో.. టీడీపీ నేతలు తల పట్టుకుంటున్నారు. వైఎస్సార్, జగన్ చేసిన అభివృద్ధిని.. ఖాతాలో వేసుకునే యత్నం.. ‘కడప ఇక ఎవరి అడ్డా కాదు.. టీడీపీ వారి అడ్డా’ అంటూ బీరాలు పలికిన టీడీపీ నేతలు మరో అడుగు ముందుకు వేసి.. ఈ మహానాడు రాయలసీమ రూపురేఖలనే మార్చబోతోందంటూ ప్రగల్భాలు పలికారు. ఈ మహానాడులో రాయలీసీమ అభివృద్ధికి తమ అధినేత చంద్రబాబు ఎన్నెన్నో ప్రకటనలు చేయబోతున్నారంటూ.. మీడియా ముందు ఊదరగొట్టేశారు. మరో అడుగు ముందుకు వేసి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కడప జిల్లాలో చేసిన అసామాన్యమైన అభివృద్ధిని కూడా తమ ఖాతాలోనే వేసుకున్నారు. సీమ, కడపను అభివృద్ధి చేయాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యం అంటూ గొప్పగా డప్పాలు కొట్టుకున్నారు. తీరా మహానాడు ప్రారంభమైంది. తమ అధినేత చంద్రబాబు యథావిధిగా తనదైన శైలిలో పాత చింతకాయపచ్చడి ప్రసంగాన్ని బయటకు తీశారు. గత పదిహేనేళ్లుగా చెబుతున్న.. ‘రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తా, ఇండస్ట్రియల్ కారిడార్గా మారుస్తాను’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ముగించేశారు. వెరసి తెలుగు తమ్ముళ్లకు నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది. తమ అధినేత రాయలసీమ అభివృద్ధికి ఎన్నెన్నో చేస్తారని, కనీసం మాటలైనా చెప్తారని ఆశపడ్డ సీమ నేతలకు చంద్రబాబు ప్రసంగం మింగుడుపడటం లేదు. పైడిపాలెం ప్రాజెక్టును కూడా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. జిల్లాలో చెప్పుకొనేందుకు కూడా ఆయన చేపట్టిన ప్రధాన అభివృద్ధి అంటూ లేదు. పైగా మంజూరైన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు తరలించారు. ఆ స్థానంలో హజ్హౌస్ మంజూరు చేశారు. చెప్పుకునేందుకు నిర్ధిష్టమైన అభివృద్ధి అంటూ ఏదీ లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పైడిపాలెం ప్రాజెక్టును ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభించినప్పటికీ.. ఆ పనులను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 95 శాతం పూర్తి చేశారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అంతకు మించి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి గురించి చెప్పుకొనేందుకు అస్కారమే లేదని పలువురు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడులో ఆత్మస్తుతి, పరనిందకు పరిమితమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. పథకం పేరు పూర్తి చేసిన వారు ప్రారంభించిన వారు రాయలసీమ అభివృద్ధి కాదు కదా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వాటిని కొనసాగిస్తానన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరో వైపు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గతంలో చంద్రబాబు రాయలసీమకు ఇచ్చిన హామీలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. విభజన హామీల్లో భాగంగా కడప ఉక్కు సంగతేంటని వారు ప్రశ్నిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ఆ విషయాన్నే మాట్లాడలేదు. దీనికి తోడు ఇప్పటికే పులివెందులకు వచ్చిన 50 మెడికల్ సీట్లను వెనక్కు పంపడం, కొప్పర్తి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతి తరలించుకుపోవడం, రాయలసీమ గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని రాజధానికి తరలించుకుపోవడం వంటి అంశాలపై రాయలసీమ ప్రజలు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్, ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంచుతానని మైదుకూరు సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ మహానాడులో వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం మారడంతో ఆగిపోయిన అమృత్ స్కీంలో భాగంగా రూ.500 కోట్లతో మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మంచినీటి ప్రాజెక్టు, కడపలో నిర్మిస్తున్న ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిధులు వంటి ఎన్నో అంశాలను చంద్రబాబు ప్రస్తావించనే లేదు. ఇదంతా ఒక ఎత్తయితే ఏదో అత్యుత్సాహంలో రాయలసీమ రూపురేఖలే మారిపోతాయని మంత్రులు, ఎమ్మెల్యేలు బీరాలు పలికితే.. వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు పోశారు. ఇప్పుడు రాయలసీమ వాసులకు ఏం సమాధానం చెప్పాలో అంటూ తెలుగు తమ్ముళ్లు లోలోన మథన పడిపోతున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కడప అభివృద్ధి కోసం పసుపు పండుగని చెప్పుకొచ్చిన టీడీపీ సీఎం చంద్రబాబు ప్రసంగంలో నోచుకోని ప్రణాళికలు ఊకదంపుడు ఉపన్యాసంతో సరిపెట్టిన వైనం ఆత్మస్తుతి, పరనిందకే ప్రాధాన్యత యోగిమేమన యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలు, ట్రిపుల్ఐటీ, రిమ్స్ మెడికల్, డెంటల్ కళాశాలలు మంజూరు చేసి పూర్తి చేశారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ సెష్పాలిటీ వైద్యశాల, 100 పడకల మానసిక వైద్యశాల, పుష్పగిరి ఐ హాస్పిటల్, డాక్టర్ ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, ఆర్కిటెక్చర్ పైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, పులివెందులలో మెడికల్ కళాశాల, వైద్యశాల ఏర్పాటు చేశారు. చెప్పుకొనేందుకు సీఎం చంద్రబాబుకు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థ జిల్లాలో లేకపోవడం గమనార్హం. గండికోట ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ వామికొండ ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ సర్వారాయసాగర్ ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ వెలుగల్లు ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ బ్రహ్మంసాగర్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సోనియాగాంధీ పైడిపాలెం ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చంద్రబాబునాయుడు -
ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర టీడీపీకి లేదు: సురేష్ బాబు
రాష్ట్ర చరిత్రలో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదని మేయర్ సురేష్ బాబు అన్నారు. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. కడపలో మహానాడు నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. మహానేత వైఎస్సార్, వైఎస్ జగన్ల వల్లే ఈ జిల్లా అభివృద్ధి చెందిందని, దుష్టబుద్ధితో వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చారని మండిపడ్డారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేయాలని మహానాడులో తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అధికార, పోలీసు యంత్రాంగం అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారని, వారం రోజులుగా వారు ప్రజా సమస్యలను గాలికొదిలేసి మహానాడు కార్యక్రమం ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. ప్రజలకు క్షమాపణ చెప్పండి: అంజద్బాషా ఎన్నికల హామీలు నెరవేర్చనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు వేదికగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఎద్దేవా చేశారు. మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు స్వాతంత్య్ర సమరయోధులు, మహానాయకుల విగ్రహాలకు పార్టీ జెండాలు కట్టడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఏం సాధించారని, ఏం ఘన కార్యాలు చేశారని మహానాడు నిర్వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి వాటిని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్ అడ్డాలో మహానాడు నిర్వహించామని టీడీపీ నేతలు సంబరపడుతున్నారని, ఇది ఎప్పటికీ జగన్ అడ్డానేనని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. -
అక్కడ కిక్కు.. ఇక్కడేమో ట్రాఫిక్కు!
సాక్షి కడప: మహానాడుతో ప్రజలు తిప్పలు పడ్డారు. కడప శివారు చుట్టూ ఎటుపోయినా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కిచిక్కి విలవిల్లాడారు. వాహనాలు కదలక...అడుగు ముందుకు పడక....ఎటువైపు పోలేక సతమతమయ్యారు. కడప నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతూ అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. పరిస్థితిని తెలుసుకుని డీఐజీ కోయ ప్రవీణ్, ఇతర పోలీసు అధికారులు వచ్చి ట్రాఫిక్ను కొంతమేర క్రమబద్ధీకరించినా తర్వాత మళ్లీ యథాస్థితి నెలకొంది. ట్రాఫిక్ సమస్య టీడీపీ పెద్దలతోపాటు కేంద్ర మంత్రులకూ తగిలింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు , పెమ్మసాని చంద్రశేఖర్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం గమనార్హం. టీడీపీ నేతలు ఇష్టానుసారం వాహనాలు నిలబెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించా రు. పలుచోట్ల టీడీపీ నేతలు ట్రాఫిక్ను సరిదిద్దుతు న్న పోలీసులపైనే రుసరుసలాడడం కనిపించింది. మందుబాబులం.. మేము మందుబాబులం... మహానాడు సందర్భంగా మందుబాబులు ఫుల్ జోష్లో కనిపించారు. వైన్షాపుల వద్ద ఎక్కువ సంఖ్యలో పచ్చ చొక్కాల వారే కనిపించడం గమనార్హం. ఓ వైపు జనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోగా.. మరోవైపు తమ్ముళ్లు కిక్కులో గడిపారు. రింగ్ రోడ్డు వెంబడి నిలిచిపోయిన వాహనాలు అటు, ఇటుపోలేక ప్రజలకు తిప్పలు -
ఎమ్మెల్సీ సీఆర్సీ, సుగవాసి డుమ్మా!
సాక్షి ప్రతినిధి, కడప: బలిజ సామాజికవర్గనేతల్ని టీడీపీ విస్మరిస్తోందా...ఎన్నికల్లో వాడుకొని ఆపై ప్రాధాన్యత లేకుండా దూరం పెట్టిందా...అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య, సుగవాసి బాలసుబ్రమణ్యం మహానాడుకు దూరంగా ఉండడమే దీనికి నిదర్శనమని ఉదహరిస్తున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఎన్నో పదవులు అలంకరించిన నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం విశేషంగా పనిచేశారు. ఏడాది తిరక్కముందే ఆ పార్టీలో కనుమరుగయ్యారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉండడమే అని తెలుస్తోంది. భవిష్యత్లో తమకు అడ్డుగా నిలుస్తారనే అభద్రతాభావంతో స్థానిక నేతలు ఎన్నికల వరకు వాడుకొని వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో రామచంద్రయ్యకు ప్రాధాన్యత లభించలేదు. దీంత ఉనికి కోసమే పార్టీలో ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పసువు పండుగగా చెప్పుకుంటున్న మహానాడుకు గైర్హాజరయ్యారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. రాయలసీమ బలిజ నేతలకుపొగబెడుతున్న టీడీపీ మహానాడుకు దూరంగా ఉండిపోయిన నేతలు -
నైరుతి ఆగమనం.. రైతుల్లో కలవరం
రాయచోటి: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది త్వరగా అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించాయి. ఈ నెల 26న రాయలసీమలోకి రావడంతో.. జిల్లాలోనూ పలకరించాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. నైరుతి రుతుపవనాల రాక పట్ల ఓ వైపు సంతోషం వ్యక్తం అవుతోంది. మరో వైపు ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా.. అవసరమైన విత్తనాల సేకరణ ఆలస్యమవుతోందన్న భయం రైతులను వెంటాడుతోంది. గతేడాది పంటల్లో నష్టం రావడంతో.. చేతిలో చిల్లిగవ్వలేదు. దుక్కులు, విత్తనాలు, ఎరువుల కోసం ఎక్కడి నుంచి డబ్బులు తేవాలో దిక్కుతెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రైతు భరోసాను ఇంత వరకు ఇవ్వలేదు. దీంతో వర్షాలు కురుస్తున్నాయన్న సంతోషం కంటే సాగుకు అవసరమైన డబ్బులు ఎలా సంపాదించాలో అర్థంకాని పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. సాధారణంగా ఏటా జూన్ 8 నుంచి 12వ తేదీల మధ్య రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ పట్ల రైతుల్లో ఆశలు చిగురించాయి. రుతు పవనాల ప్రభావం రుతుపవనాల ప్రభావంతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జల్లులు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం మే 26 నుంచి 29 వరకు జిల్లాలో మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేయడంతో అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. వాతావరణ పరిస్థితులు రుతుపవనాల ముందస్తు ప్రవేశం కారణంగా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గాలివానలు సంభవిస్తున్నాయి. ఈ వర్షాలు పంటల సాగుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సాగుకు అనుకూలంగా లోతు దుక్కులు దున్నుకోవాలని సూచిస్తున్నారు. రైతులకు సూచనలు రుతు పవనాల ముందస్తు ప్రవేశం ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు చెబుతున్నారు. రైతులు వర్షపాతం మోతాదును బట్టి సాగు ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిదంటున్నారు. అవసరం కొండంత.. కేటాయింపులు గోరంతఖరీఫ్ సాగుకు అవసరమైన వేరుశనగ విత్తన కాయల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అవసరమైన విధంగా జిల్లాకు 45 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలు సబ్సిడీపై అందించింది. ఈ ఏడాది కేటాయింపులోనే ఆలస్యమవుతూ వస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా.. అందుకు అనుగుణంగా విత్తన కాయల కేటాయింపు చేపట్టలేదు. రెండు రోజుల కిందట అన్నమయ్య జిల్లాకు 26 వేల క్వింటాళ్ల విత్తన కాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 65 వేల హెక్టార్లలో సాధారణ సాగు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా జిల్లాలోని రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి ప్రాంతాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తారు. సాగుకు అనువుగా విత్తనపు కాయలను రైతులు సిద్ధం చేసుకుని సీజన్ ప్రారంభంలో విత్తుకునేలా చూడాలని కోరుతున్నా.. ఆ దిశగా అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదలైన తొలకరి వర్షాలు విత్తన సేకరణలో ఇక్కట్లు ప్రభుత్వ ఆర్థిక సాయం కరువు చేతిలో డబ్బు లేక అవస్థలు -
అశోక్ నన్ను వదిలేయ్.. నా బతుకు నేను బతుకుతా..!
మదనపల్లె రూరల్(అన్నమయ్య జిల్లా) : భర్త వేధింపులు భరించలేక, క్షణికావేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వివాహిత ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కర్నాటక రాష్ట్రం చింతామణికి చెందిన రాణి(30) భర్తతో విడాకులు తీసుకుని కుమార్తె లేఖన, కుమారుడు సుమిత్తో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట సత్యసాయిజిల్లా పాలసముద్రం మండలం బోయలపల్లెకు చెందిన డ్రైవర్ అశోక్తో రాణికి పరిచయం ఏర్పడి సహజీవనం చేసేంతవరకు వెళ్లింది. అయితే అశోక్కు అంతకు మునుపే తంబళ్లపల్లెకు చెందిన మౌనిషాతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉంది. కొద్దిరోజుల క్రితం అశోక్కు ప్రమాదంలో కాలు విరగడంతో రాణి దగ్గరుండి చికిత్స చేయించి, కోలుకున్నాక స్వగ్రామంలో విడిచిపెట్టింది. తల్లిదండ్రుల సూచన మేరకు అశోక్తో సహజీవనం వద్దనుకుని బెంగళూరుకు వెళ్లి కూలిపనులు చేసుకుంటోంది. ఈనెల 22న గురువారం అశోక్ రాణికి ఫోన్చేసి నీతో మాట్లాడాలని కోరడంతో కుమార్తె లేఖనను వెంటతీసుకుని 23 వ తేదీ శుక్రవారం మదనపల్లెకు వచ్చింది. ఇద్దరూ కలుసుకున్నాక, తమ బంధం కొనసాగింపు విషయమై గొడవపడ్డారు. నీ వేధింపులు నేను భరించలేనంటూ మనస్తాపంతో రాణి కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.దీంతో ఆమె కోసం పట్టణమంతా వెతికి కనిపించకపోవడంతో రాత్రి ఊరికి వెళ్లేందుకు అశోక్ ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. బస్టాండ్లో రాణి కనిపించడంతో మరోసారి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆవేశంతో రాణి బస్టాండ్ వెనుక వైపు ఉన్న కోమటివానిచెరువు కట్ట వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన. ప్రమాదంలో ఆమె శరీరం 70 శాతానికి పైగా కాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, టూటౌన్ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. -
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లే లక్ష్యం
ప్రొద్దుటూరు కల్చరల్ : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తన లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రొద్దుటూరులో సోమవారం బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. బీసీలు అంతా ఏకమై బలమైన బీసీ ఉద్యమాలను నిర్మిస్తే బీసీల డిమాండ్లన్నీ సాధించుకోగలమన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, బీసీ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సోమా లక్ష్మీనరసయ్య, సహ అధ్యక్షుడు సందు శివనారాయణ, రాష్ట్ర సెక్రటరీ జనరల్ బీవీ రాజు, జిల్లా అధ్యక్షుడు జింకా జయప్రకాష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, జిల్లా యువజన అధ్యక్షుడు శివనారాయణ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గురుమూర్తి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణయాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సుభాన్బీ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డెయ్య, విజయకుమార్, గురప్ప, గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
నిర్ణీత సమయంలోగా ఫిర్యాదులను పరిష్కరించాలి
రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి అదనపు ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను ముఖాముఖి మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.అదనపు ఎస్పీ వెంకటాద్రి -
మట్టి తరలింపు కొండంత!
అనుమతులు కొంత..ఒంటిమిట్ట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచింది. అప్పటి నుంచి రెడ్బుక్ పరిపాలన మీద పెట్టిన ధ్యాస ప్రజా పరిపాలనపై పెట్టకుండా అక్రమార్జనకు కూటమి నేతలు నేనంటే నేను అంటూ వరుస పెడుతున్నారు. ప్రజలనే కాకుండా జల వనరులను కూడా దోచుకునే విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఉన్నారు. ఇసుక, మట్టి, అడవిని కూడా దోచుకునేందుకు వెనుకాడటం లేదు. దోచుకుని దాచుకోవడంలో కూటమినేతల తరువాతనే మరెవరైనా అనే విధంగా మండలంలో నేతలు వ్యవహరిస్తున్నారు. ఇదే తంతు ఒంటిమిట్ట మండల కేంద్రంలో జరుగుతోంది. మండల కేంద్రమైన ఒటిమిట్ట చెరువులో రైతులకు ఉచితంగా మట్టి తరలింపు అనే ముసుగులో మూడురోజుల నుంచి కూటమి నేతలు ఇరిగేషన్ అనుమతులకు విరుద్ధంగా మట్టిని దోచేస్తున్నారు. రైతులకు ఉచితం అంటూ ఆదేశాలు ఉన్నా ఇక్కడి కూటమి నేతలు మాత్రం ఒక్కో ట్రిప్పు ట్రాక్టర్ మట్టికి రూ. 600 లెక్కన రైతుల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. భారీ యంత్రాలతో ట్రాక్టర్లకే కాకుండా పెద్దపెద్ద టిప్పర్లకు మట్టిని పోసి తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతులు ఉన్న పొలాలకు మాత్రమే మట్టి తరలించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు రెండు గ్రామాలలోని ముగ్గురు రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వగా దానికి విరుద్ధంగా అనుమతులు లేని గ్రామాలకు కూడా మట్టిని తరలించి కూటమి నేతలు రోజుకు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతుల ముసుగులో ప్రతి రోజు దాదాపు 500 ట్రిప్పులపైబడి అక్రమ మట్టి రవాణా చేస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా మట్టి మాఫియా జరుగుతుందన్న సమాచారం సంబంధిత అధికారులకు తెలిపినా వారి వద్ద నుంచి ఎలాంటి చలనం లేకపోవంతో సంబంధిత అధికారులకు భారీ ముడుపులు ముట్టాయని మండలంలో చర్చ జరుగుతోంది. ముగ్గురు రైతులకు మాత్రమే అనుమతి.. మట్టి తరలింపుపై మండలంలోని సాలాబాదు, ఒంటిమిట్ట గ్రామ రైతులుగా ఉన్న ముగ్గురికి మాత్రమే మూడు రోజుల క్రితం ఒంటిమిట్ట చెరువులో వారి పొలాలకు మట్టి తరలించుకునేందుకు అనుమతి ఇచ్చామని ఒంటిమిట్ట రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. జేసీబీ సహకారంతో చెరువులో మట్టిని తరలించొచ్చు.. రైతులకు ఉచితంగా మట్టిని తరలించే విషయంలో జేసీబీని వాడుకోవచ్చు. ట్రాక్టర్లే కాకుండా టిప్పర్లను కూడా రవాణాకు ఉపయోగించవచ్చు. రైతులకు పూర్తి ఉచితంగా మట్టిని తరలించాలి. ఒక క్యూబిక్ మీటర్కు కేవలం ఒక రూపాయి మాత్రమే రైతు ప్రభుత్వానికి చెల్లించాలి. వారు చెల్లించిన రూపాయి కూడా మళ్లీ తిరిగి వారి ఖాతాలోకి జమ చేస్తాము. మూడు రోజులపాటు 500 క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకోమని అనుమతి ఇచ్చాం. అలా కాకుండా అనుమతులకు విరుద్ధంగా మట్టి రవాణా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కిషోర్, ఇరిగేషన్ శాఖ ఏఈ -
విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం
మదనపల్లె సిటీ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదని ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరావు అన్నారు. సోమవారం మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ విద్యా, వైజ్ఞానిక సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాల్సిన ప్రభుత్వం వాటికి రెడ్ కార్పెట్ పరుస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో విద్యలో కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. పాఠ్యాంశాలలో వాస్తవ చరిత్రను కాలరాస్తున్నారని చెప్పారు. రాష్ట్ర నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక.. ఎస్ఎఫ్ఐ సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడిగా పి.రామమోహన్, కార్యదర్శిగా కె.ప్రసన్నకుమార్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు పావని, పరమేష్, వెంకటేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, రమణ పాల్గొన్నారు. -
కొడుకు కాజేసిన ఆస్తిని ఇప్పించండి
మదనపల్లె రూరల్ : తనకు తెలియకుండా కొడుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని తిరిగి తనకు ఇప్పించడంతో పాటు కుమారుడి నుంచి జీవనభృతి వచ్చే లా చూడాలని ఓ వృద్ధుడు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ను వేడుకున్నాడు. సోమవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ కోర్టు నిర్వహించారు. అందులో భాగంగా నిమ్మనపల్లె మండలం సామకోటవారిపల్లె పంచాయతీ ఎర్రంవారిపల్లెకు చెందిన ఎన్.మల్రెడ్డి (87) సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన భార్య కమల మ్మ చాలాకాలం క్రితమే చనిపోయిందని, తనకు ముగ్గురు కుమార్తెలు రాణి, లక్ష్మీదేవి, చంద్రకళతో పాటు కుమారుడు ఆనందరెడ్డి ఉన్నాడన్నారు. కుమార్తెలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయని, కుమారుడు ఆనందరెడ్డి తిరుపతిలో స్థిరపడ్డాడన్నారు. నిమ్మనపల్లె మండలం అగ్రహారం రెవెన్యూ గ్రామ పరిధిలో ఖాతా నంబర్.149, సర్వేనంబర్. 1094/3 లో 1.36, సర్వే నంబర్. 1094/5బి లోని 0.76 సెంట్లు మినహా.. తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కుమారుడు ఆనందరెడ్డికి రాసి ఇచ్చానన్నారు. తన వద్ద ఉన్న నగదును కుమారుడికే ఇచ్చివేశానన్నారు. ఏడాది క్రితం ఖాతా నంబర్.149లో ఉన్న 2.12 సెంట్ల భూమిని కుమారుడు ఆనందరెడ్డి తనకు తెలియకుండానే తన పేరుపై మార్చుకున్నాడన్నారు. అప్పటి నుంచి తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇంటి నుంచి తరిమేశాడన్నారు. దీంతో ఒంటరి జీవితం అనుభవించలేక, ప్రస్తుతం మదనపల్లెలోని చిన్నకుమార్తె చంద్రకళ వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఆస్తిపాస్తులు లాగేసుకుని, తనను ఏమాత్రం పట్టించుకోని కుమారుడు ఆనందరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాను రాసి ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ రద్దుచేసి తిరిగి తనకు అప్పగించడమే కాకుండా తన జీవనం కోసం కుమారుడి నుంచి జీవనభృతి ఇప్పించి ఆదుకోవాలన్నారు.సీనియర్ సిటిజన్స్ కోర్టులో సబ్ కలెక్టర్కు వినతి -
విద్యుత్ షాక్తో తాపీ మేసీ్త్ర మృతి
పీలేరు రూరల్ : విద్యుత్ షాక్తో తాపీమేసీ్త్ర మృతి చెందిన సంఘటన పీలేరు పట్టణం మదనపల్లె మార్గం ఏపీఐఐసీ 3వ లేఅవుట్లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం తిలక్వీధిలో కాపురం ఉంటున్న అఫ్సర్పాషా (40) రోజువారి పనుల్లో భాగంలో ఏపీఐఐసీ 3వ లేఅవుట్లో ఇంటి నిర్మాణ పనికి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కిందపడ్డాడు. గమనించి సహచర కూలీలు చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతునికి భార్య ఫాతిమా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. -
ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మృతి
మదనపల్లె రూరల్ : భర్త వేధింపులు భరించలేక, క్షణికావేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వివాహిత ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కర్నాటక రాష్ట్రం చింతామణికి చెందిన రాణి(30) భర్తతో విడాకులు తీసుకుని కుమార్తె లేఖన, కుమారుడు సుమిత్తో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట సత్యసాయిజిల్లా పాలసముద్రం మండలం బోయలపల్లెకు చెందిన డ్రైవర్ అశోక్తో రాణికి పరిచయం ఏర్పడి సహజీవనం చేసేంతవరకు వెళ్లింది. అయితే అశోక్కు అంతకు మునుపే తంబళ్లపల్లెకు చెందిన మౌనిషాతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉంది. కొద్దిరోజుల క్రితం అశోక్కు ప్రమాదంలో కాలు విరగడంతో రాణి దగ్గరుండి చికిత్స చేయించి, కోలుకున్నాక స్వగ్రామంలో విడిచిపెట్టింది. తల్లిదండ్రుల సూచన మేరకు అశోక్తో సహజీవనం వద్దనుకుని బెంగళూరుకు వెళ్లి కూలిపనులు చేసుకుంటోంది. ఈనెల 22న గురువారం అశోక్ రాణికి ఫోన్చేసి నీతో మాట్లాడాలని కోరడంతో కుమార్తె లేఖనను వెంటతీసుకుని 23 వ తేదీ శుక్రవారం మదనపల్లెకు వచ్చింది. ఇద్దరూ కలుసుకున్నాక, తమ బంధం కొనసాగింపు విషయమై గొడవపడ్డారు. నీ వేధింపులు నేను భరించలేనంటూ మనస్తాపంతో రాణి కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం పట్టణమంతా వెతికి కనిపించకపోవడంతో రాత్రి ఊరికి వెళ్లేందుకు అశోక్ ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. బస్టాండ్లో రాణి కనిపించడంతో మరోసారి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆవేశంతో రాణి బస్టాండ్ వెనుక వైపు ఉన్న కోమటివానిచెరువు కట్ట వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ప్రమాదంలో ఆమె శరీరం 70 శాతానికి పైగా కాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, టూటౌన్ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. -
వైస్ విగ్రహాలకు కట్టిన పసుపు జెండాలు తొలగించకుంటే ఆందోళన
వల్లూరు : మహానాడు సందర్భంగా విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పసుపు జెండాలు, తోరణాలను కట్టడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. కడపలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా జెండాలు గానీ, లేక మరేవైనా కట్టినప్పుడు మరుసటి రోజే తొలగించే కార్పొరేషన్ అధికారులు అధికార టీడీపీ పట్ల అతి ప్రేమ చూపుతూ పసుపు జెండాలు, తోరణాలను అలాగే ఉంచడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా అధికారులు విజ్ఞతతో స్పందించి వైఎస్ విగ్రహాల వద్ద ఉన్న పసుపు పచ్చ జెండాలను, తోరణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు తొలగించక పోతే మంగళవారం ఉదయం 11 గంటలకు కడప – మైదుకూరు రోడ్డులో ఉన్న ఇర్కాన్ సర్కిల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. అధికారులను సొంత పార్టీ పనులకు ఉపయోగించడం సిగ్గుచేటు మహానాడు పూర్తిగా టీడీపీకి చెందిన సొంత కార్యక్రమం, అలాంటి సొంత పనులకు ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడం అఽధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి ఇతర జిల్లా స్థాయి అఽధికారులు సైతం ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్లు మహానాడు కార్యక్రమానికి టీడీపీ నాయకుల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడం ిసిగ్గుచేటని విమర్శించారు. మహానాడు వద్ద కేటాయించిన విధులకు హాజరయ్యేందుకు వస్తూ కటౌట్ విరిగి ఇద్దరు వీఆర్ఓలు తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. మహానాడు కాదది విద్రోహ నాడు సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలను మోసగించి అఽధికారంలోకి వచ్చిన టీడీపీ సంవత్సర పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. సంవత్సరం పూర్తి కావచ్చినా ఇప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ఆ పార్టీ పట్ల ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. దాని నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఇది మహానాడు కాదని, విద్రోహనాడని ఆయన ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
నష్టాల సేద్యం.. యువరైతు బలవన్మరణం
పెద్దతిప్పసముద్రం : ఆరుగాలం కష్టపడి సేద్యం చేసే రైతన్నలు సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక జీవితంపై విరక్తి చెంది అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ బురదవాండ్లపల్లికి చెందిన గంగిరెడ్డి కుమారుడు రాహుల్ రెడ్డి 25) బీటెక్ పూర్తి చేశాడు. ప్రైవేటు ఉద్యోగం కన్నా స్వగ్రామంలోనే వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సొంత పొలంతో పాటు చుట్టు పక్కల ఉన్న పొలాలను కౌలుకు తీసుకున్నాడు. సుమారు 25 ఎకరాల్లో టమాటా, దోస, పుచ్చకాయ లాంటి పంటలను సాగు చేసేందుకు రూ.20 లక్షల దాకా ఽపెట్టుబడి పెట్టాడు. ఈ తరుణంలో కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు కాపునకు వచ్చాయి. దిగుబడి బాగానే ఉన్నా సాగు చేసిన పంటలకు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. అష్ట కష్టాలు పడి రూ.లక్షలు వెచ్చించి సాగు చేసిన పంటల ధరలు గణనీయంగా పడిపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న యువ రైతు రాహుల్రెడ్డి వ్యవసాయ బోరుకు వద్దకు వెళ్లి గడ్డి మందును తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన గ్రామస్తులు హుటాహుటిన బి.కొత్తకోట, మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయిచారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం తనువు చాలించాడు. మృతుడి పెద్దనాన్న వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు పీటీఎం పోలీసులు కేసు నమోదు చేశారు. -
దయనీయంగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ల పరిస్థితి
– అప్నా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.ఏవీ సుబ్బారెడ్డి మదనపల్లె రూరల్ : విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించి, దేశానికి తిరిగివచ్చిన వైద్య విద్యార్థుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దయనీయంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్హోమ్స్ అసోసియేషన్(అప్నా) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించి స్వదేశానికి తిరిగొచ్చిన విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక ఏడాది ఇంటర్న్షిప్(హౌస్సర్జన్) పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఏపీ మెడికల్ కౌన్సిల్లో అనిశ్చితి కారణంగా ఏడాది హౌస్సర్జన్ పూర్తిచేసినప్పటికీ, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ లభించకపోవడంతో అనేక వ్యయప్రయాసలకు ఓర్చి వైద్యవిద్యను అభ్యసించిన వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఎనిమిది నెలలుగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్న ఆందోళనపై ఆంఽధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ లోతైన అధ్యనయం చేశాక, వారికి అన్యాయం జరుగుతోందని తెలుసుకుని అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ చాలా స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్కు మెడికల్ కౌన్సిల్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తుండటంతో వారు మెడికల్ పీజీ ఎంట్రన్స్ రాసేందుకు అర్హులవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. పీజీ ఎంట్రెన్స్కు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు పదిరోజుల గడువు ఉన్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో వేలమంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు విద్యాసంవత్సరాన్ని నష్టపోతారన్నారు. ఈ విషయమై మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్.శ్రీహరిరావును కలిసి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ల సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి సమాచారంతో వినతిపత్రాన్ని సమర్పించామన్నారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఖనిజ నిక్షేపాలపై కేంద్రం అన్వేషణ ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి కొత్తపల్లె గ్రామ పరిసరాల్లో సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారులు ఖనిజ నిక్షేపాల కోసం తవ్వకాలు ప్రారంభించారు. ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని 20 అడుగుల లోతు వరకు బోర్లు వేసి ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇందుకోసం అనేక వాహనాలను ఏర్పాటు చేశారు. ముందుగా సంబంధిత రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకుని పనులను ప్రారంభించారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ పనులు చేపడుతున్నారు. గతంలో హెలికాప్టర్ ద్వారా పర్యటించి ఖనిజాలు నిక్షేపాలు ఉండొచ్చని చూపించిన జియోట్యాగ్ ఆధారంగా ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. -
మామిడి పంటకు ధర కల్పించాలి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలంలో మామిడి పంటలకు ధర కల్పించాలని సోమవారం మామిడి రైతులు, వ్యాపారులు స్థానిక ప్రైవేటు మార్కెట్ యార్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు మాజీ అధ్యక్షుడు కె మణి మాట్లాడుతూ జూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి కాయల కోత తర్వాత కుట్రపూరితంగా ధరలు తగ్గిస్తూ రైతులు, వ్యాపారులు నష్టపోయే విధంగా కు ట్రలు చేస్తోందన్నారు. మామిడి కాయలను తోలుకొని ధరల్లో వ్యత్యాసాలు చూపడం తగదన్నారు. అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు తక్షణమే పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం కడప సెవెన్రోడ్స్ : వైఎస్సార్ జిల్లాలో జరగనున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబునాయుడు సాయంత్రం 7:35 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కడప విమానాశ్రయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్లు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం మహానాడు ప్రాంగణానికి సాయంత్రం 7.40 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. దరఖాస్తుల ఆహ్వానం కడప అగ్రికల్చర్ : బిందు, తుంపర సేంద్య పరికరాలు కావాల్సిన రైతులు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా పొందాలని వైఎస్సార్ జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిందు, తుంపర సేద్య పరికరాల కోసం రైతులు రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రైతులు కోరిన కంపెనీ ఎంపిక చేసుకుని పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఎంఐపి ద్వారా నిర్ణయించబడిన సబ్సిడీ ప్రకారం పట్టాదారు పాసుపుస్తకంలో 5 ఎకరాల వరకు పొలం కలిగిన చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ, ఇతరులకు 90 శాతం సబ్సిడీ, అలాగే మధ్య రకం రైతులు 5 నుంచి 10 ఎకరాల పొలం గల రైతులకు 90 శాతం, పెద్ద రైతులు అంటే 12.5 ఎకరాలు గల రైతులకు 50 శాతం సబ్సిడి ద్వారా డ్రిప్పు పరికరాలు అందజేస్తామన్నారు. పేరు నమోదు చేసుకున్న రైతుల పొలాల్లో ప్రాథమిక తనిఖీ జరిగిన తరువాత రైతు చెల్లించాల్సిన రైతు వాటా రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా సంక్షిప్త సమాచారం వస్తుందని వివరించారు. -
సమస్యలకు సత్వర పరిష్కారం
కలెక్టర్ ఛామకూరి శ్రీధర్రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను సత్వరం బాధ్యతగా పరిష్కరించాలని జల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డీసీ రాఘవేంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగా నేర్చుకో..ఆయుస్సు పెంచుకో దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతతోపాటు మనిషి ఆయుస్సు కూడా పెరిగేందుకు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. యోగాపై ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 28వ తేదీ జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ హెల్పర్లు, టీచర్లు, ఆశా, హెల్త్ వర్కర్లు తదితరులు ఐదువేల మందితతో మదనపల్లె బీటీ కాలేజీ గ్రౌండ్లో ఒకేచోట యోగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరగుతుందన్నారు.