breaking news
Annamayya
-
కుప్పం వెళ్దామా వద్దా!
మదనపల్లె: హంద్రీ–నీవా కుప్పం డివిజన్ కార్యాలయం మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలోనే నిర్వహిస్తున్న విషయాన్ని ‘కదలరు.. వదలరు’ శీర్షికన సాక్షిలో ఇటీవల కథనం ప్రచురితం కావడం తెలిసిందే. ఈ కథనంతో ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోతున్న డివిజన్ వ్యవహారం వెలుగులోకి రావడం, కుప్పం ఈఈ మదనపల్లెలో ఉంటున్న విషయం మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి వెళ్లడంతో.. ఇప్పుడు ఈ సమస్యపై ఎలా ముందుకు వెళ్లాలన్న సందిగ్ధం అధికారుల్లో నెలకొంది. సాక్షి కథనం మంత్రి నిమ్మల, ఈఎన్సీ దృష్టికి వెళ్లినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇక డివిజన్ కుప్పానికి తరలించాల్సిన పరిస్థితి తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారులు కూడా ఇకపై కుప్పం నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుందని కింది స్థాయి ఉద్యోగులకు చెబుతున్నట్టు తెలిసింది. లేదా కుప్పం డివిజన్ కార్యాలయం ప్రారంభించి అక్కడ ఒక బోర్డు పెట్టి డివిజన్ను కుప్పానికి తరలించినట్టు చెప్పే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ ఒకరిద్దరు సిబ్బందిని ఉంచి.. మదనపల్లె నుంచే విధులు నిర్వహించుకోవచ్చన్న అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇలా ఉండగా కుప్పం డివిజన్ ఎట్ మదనపల్లె పేరుతో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలని ఉన్నతాధికారులకు కొందరు సూచన చేసినట్టు తెలిసింది. ఇలా ఉత్తర్వు తెచ్చుకుంటే మదనపల్లె నుంచి కుప్పానికి వెళ్లి విధులు నిర్వహించే పరిస్థితి ఉండదని ఎత్తుగడ వేసినట్టు కార్యాలయ వర్గాలు చర్చించుకొంటున్నాయి. ముఖ్యంగా సీఎం నియోజకవర్గానికి మంజూరైన డివిజన్ను మదనపల్లెలో ఉండేలా.. ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఏ మాత్రం ఉండదని మరికొందరు స్పష్టంగా చెబుతున్నారు. సాక్షి కథనంతో అధికారుల మల్లగుల్లాలు -
కోమటివాని చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : పట్టణంలోని కోమటివానిచెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. కురబలకోట మండలం తూగువారిపల్లెకు చెందిన వెంకటరెడ్డి కుమారుడు మద్దిరెడ్డి(70) సర్కారుతోపు వద్ద నివాసముంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు అతడి ఆచూకీకై వెతుకుతున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్న సమయంలో కోమటివానిచెరువు కట్టమీద మద్దిరెడ్డి నడిచి వెళుతూ ప్రమాదవశాత్తు జారి నీటిలో పడ్డాడు. వెంటనే స్థానిక యువకులు బయటకు తీసి హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే బాధితుడు మృతి చెందాడని నిర్ధారించారు. ఈ విషయం సామాజిక మాథ్యమాల ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మద్దిరెడ్డిగా నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
విజయం తథ్యం
ముమ్మరంగా ప్రచారం సాక్షి రాయచోటి: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట ఆధ్యాత్మిక కేంద్రంలో వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేసేందుకు ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఒకపక్క ప్రచారంతోపాటు మరోపక్క ఓటు బ్యాంకు ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఇప్పటికే దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ నేతలకు.. విజయ బావుటా ఎగురవేసేందుకు అవసరమైన వ్యూహాన్ని వివరించారు. ప్రస్తుత రోజులతోపాటు ఎన్నికల ముందు అనుసరించాల్సిన విధానాన్ని వివరించడంతోపాటు సమష్టిగా పని చేస్తూ.. ఒక పథకం ప్రకానం ముందుకు వెళితే విజయం తథ్యమని వివరిస్తూ వచ్చారు. కార్యకర్తలు, నాయకులు, నేతలు, శ్రేణులు ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బా రెడ్డిని గెలిపించి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయా లని సూచించారు. ఒంటిమిట్టలో జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి అతిథి గృహం వద్ద రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతలతో చర్చించడంతోపాటు సమీక్షించి విజయానికి వ్యూహం రచించారు. అన్ని వర్గాల ఓట్లపై దృష్టి వైఎస్సార్ సీపీ నేతలకు రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు ఇతర అనేక అంశాలపై చర్చించారు. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట, కడప మేయర్ కొత్తమద్ది సురేష్బాబు, కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పని చేస్తూ అన్ని వర్గాల ఓట్లు వైఎస్సార్సీపీకి లభించేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయంౖపైవెఎస్సార్సీపీ వ్యూహ రచన నేతలకు దిశానిర్దేశం చేసినఆ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒంటిమిట్టలో నాయకులతో విస్తృతంగా చర్చలు మరోవైపు జోరుగా ప్రచారం వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పద్మశాలీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జింకా విజయలక్ష్మి, జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు శివప్రసాద్రెడ్డి, వీరబల్లి ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, రాష్ట్ర మైనార్టీ నాయకులు షఫి ఇలియాజ్, మాజీ కార్పొరేటర్లు శ్రీరంజన్, జయచంద్రారెడ్డిలతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కొత్తమాధవరంలోని పెద్దరోడ్డు వీధి, స్టేట్ బ్యాంక్ వీధి, భద్రావతి, భావ నారాయణస్వామి ఆలయ పరిసర ఆలయం వీధితోపాటు అన్ని వీధులలో కలియ తిరిగారు. అలాగే గురువారం సాయంత్రం సాలాబాద్లో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, పెద్ద పేరూరు, తప్పెటవారిపల్లెల్లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధలు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలలో భాగంగా అన్ని స్థానాలలో వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగిస్తుందని, అలాగే ఒంటిమిట్ట, పులివెందులలో కూడా విజయం తథ్యమని పార్టీ కీలక నేతలు పేర్కొన్నారు. అందుకు సంబంధించి గురువారం ఒంటిమిట్ట మండలంలోని మాధవరం, ఇతర గ్రామాల్లో ప్రచారం సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీడీపీ, పోలీసులు ఎన్ని ఆరాచకాలకు తెరతీసినా చివరకు వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ధర్మ పోరాటంలో విజయం వైఎస్సార్సీపీ పక్షాన ఉంటుందని వివరించారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలువురు కోరారు. కుడుమలూరు గ్రామంలో జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి ప్రచారం నిర్వహించారు. -
ఎరువు నిల్వలపై ఆందోళన వద్దు
ఒంటిమిట్ట : జిల్లాలో ఎరువు నిల్వలు ఉన్నాయని.. రైతులు ఆందోళన పడవద్దని వ్యవసాయ శాఖ జేడీఏ చంద్రానాయక్ అన్నారు. మండలంలోని రాచపల్లి రైతు సేవా కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలోనేగాక ప్రైవేటు డీలర్ల వద ఎరువు అందుబాటులో ఉందన్నారు. కాంప్లెక్స్, యూరియా కలిపి వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. వరిపంటకు యూరియా 90 కేజీలు చొప్పున రెండు దపాలుగా వేస్తే సరిపోతుందని, అదనంగా యూరియా వాడటంతో నష్టం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో జయలక్ష్మి, అమరావతి, వంశీ, రైతులు పాల్గొన్నారు. చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి రాజుపాళెం : పట్ట పగలే రహదారి పక్కనే ఉన్న ఇంట్లో ఓ దొంగ చోరీకి యత్నించగా.. గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన రాజుపాళెం మండలం టంగుటూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు. కానగూడూరు ప్రధాన రహదారిలోని ఉంటున్న రైతు నంద్యాల వెంకట సుబ్బయ్య గ్రామానికి దూరంగా ఉన్న సచివాలయం వద్ద పని నిమిత్తం వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకోగా అప్పటికే ఇంటి తలుపులు మూసివేసి దుండగుడు ఇంట్లో ఉన్న ఇనుప బీరువా పగలగొట్టే పనిలో కనిపించారు. రైతు వెంకటసుబ్బయ్యను చూసి దుండగుడు ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. రైతు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చి దుండగుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాలైన వెంకట సుబ్బయ్యను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి, ఎస్ఐ వెంకటరమణ పరిశీలించారు. చోరీకి పాల్పడిన దుండగుడు దూవ్వూరు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి, షేక్ మహమ్మద్ రఫీగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తాళ్లపాకలో వరలక్ష్మీవ్రతం రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతంను ఘనంగా నిర్వహించనున్నట్లు తాళ్లపాక టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఈ వ్రతంలో పాల్గొనే మహిళలకు అమ్మవారి కుంకమ, గాజులు, పసుపుదారం, కంకణాలు ఉచితంగా అందజేస్తామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ వ్రతం నిర్వహిస్తామన్నారు. రాజంపేట పరిసర ప్రాంతాల మహిళలు విశేష సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బాల్ పురస్కార్కు దరఖాస్తుల ఆహ్వానం రాయచోటి టౌన్ : ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు (31 జూలై 2025) లోపు పిల్లలు ఈ దరఖాస్తులు చేసుకోవచ్చున్నారు. ఆదర్శవంతమైన పనులు, జాతీయ స్థాయిలో క్రీడలు ఆడటం, సంఘ సేవ, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, ఆర్ట్స్, లలిత కళలు, వినూత్నమైన సేవలు అందించిన వారు దీనికి అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 15వ తేది లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 10న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక రాజంపేట రూరల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ నెల 10వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్నాయుడు తెలియజేశారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో గురువారం బీజేపీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన రాయచోటిలో 10న మాధవ్ చేపట్టే కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు: ఎస్పీ
కడప అర్బన్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న జరగనున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో ‘పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్’హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో జరిగిన దాడులు, అల్లర్ల సంఘటనలపై సమగ్రంగా విచారిస్తున్నామన్నారు. సంఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతరులకు అనుమతి లేదన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు దాదాపు 600 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించామన్నారు. -
కరడుగట్టిన దొంగల అరెస్టు
కడప అర్బన్ : వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.60 లక్షల విలువ చేసే అర కిలో బంగారం, రూ.10 లక్షల విలువ చేసే పది కిలోల వెంటి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరులతో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ నిందితుల వివరాలను గురువారం వెల్లడించారు. కడప జిల్లా బద్వేల్ టౌన్ పరిధిలోని చెన్నంపట్టిమిట్ట వద్ద నివాసముంటున్న గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, గౌరీశంకర్నగర్కు చెందిన నూతి వెంకటసుబ్బయ్య గత రెండేళ్లుగా తాళం వేసిన ఇళ్లు పగలు గుర్తించడం, రాత్రి చోరీలకు పాల్పడడం అలవాటు చేసుకున్నారు. వీరు ఎరచ్రందనం అక్రమ రవాణా చేయడమేగాక, కడప, నెల్లూరు జిల్లాలో తాళం వేసిన ఇళ్ల తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అయితే ఇళ్ల చోరీలో తక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలు లభించడంతో సంతృప్తి చెందక, ఎక్కువ మొత్తంలో ఆభరణాలు దోచుకోవాలని ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కడప, అన్నమయ్య, సత్యసాయి, నెల్లూరు, కాకినాడ జిల్లాల్లోని బంగారు దుకాణాలకు తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గుంటూరులో బైక్ చోరీ చేశారు. ఈ ప్రయత్నంలోనే గతంలోనూ అరెస్టుయి జైలుకు వెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది. తీరికసమయాల్లో పేకాడడం, సహచరులతో లంకమల అడవికి వెళ్లి నాటు తుపాకీతో వన్యప్రాణులను వేటాడడం చేశారు. గుమ్మళ్ల వెంకటసుబ్బయ్యపై గతంలో 28 వరకూ ఎర్ర చందనం అక్రమ రవాణా, 38 చోరీ కేసులు నమోదయ్యాయి. ఇతడిపి పీడీ యాక్ట్ ఉండడమేగాక, జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. చోరీలు పెరగడంతో పోలీసుల నిఘా జిల్లాలోని పోరుమామిళ్ల, బి.కోడూర్, మైదుకూర్, బద్వేల్ టౌన్, కలసపాడు, ఖాజీపేట, కాశినాయన, దువ్వూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లపై పగలు రెక్కీచేసి, రాత్రి సమయాలలో బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీలు ఇటీవల పెరిగాయి. దాదాపు 12 ఇళ్లు, బంగారు దుకాణంలోనూ ఈ చోరీలు జరగడంతో ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ సీరియస్గా తీసుకున్నారు. మైదుకూర్ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేల్ రూరల్ సీఐ ఎం.నాగభూషణ్, మైదుకూరు యూసీపీఎస్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, బద్వేల్ రూరల్ ఎస్ఐ కె.శ్రీకాంత్, సిబ్బందిని ప్రత్యేక బృందంగా నియమించి నిఘా పెంచారు. గోపవరం మండలం పీపీకుంట సమీపంలోని చెలిమికుంట అటవీ ప్రాంతంలో ఎరచ్రందనం దుంగలు నరికి కర్ణాటకలోని కటికనహళ్లికి అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం తెలియడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, నూతి వెంకటసుబ్బయ్య ఎరచ్రందనం రవాణా చేసూం్త పట్టుబడ్డారు. వారి నుంచి బొలెరో వాహనం, నాలుగు ఎర్రచందనం దుంగలు, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని విచారించగా గత నేరచరిత్ర కలిగిన వ్యక్తులని గుర్తించారు. అనంతరం పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు తెలియడంతో అరెస్టు చేశారు. పోలీసులకు ఎస్పీ ప్రశంస మోస్ట్ వాంటెడ్గా ఉన్న గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, నూతి వెంకటసుబ్బయ్యలను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేసి, చోరీ సొత్తు, ఎర్రచందనం దుంగలు, నాటు తుపాకీ రికవరీ చేసిన మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బద్వేల్ రూరల్ సీఐ ఎం.నాగభూషణ్, రమణారెడ్డి, కె.శ్రీకాంత్, చిరంజీవి, శివప్రసాద్, సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. అర కిలో బంగారం, పది కిలోల వెండి ఆభరణాలు, బైక్ స్వాధీనం నాటు తుపాకీ, బొలెరో వాహనం, ఎర్రచందనం దుంగలు స్వాధీనం -
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి అమానుషం
రాయచోటి: ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడి అమానుషమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీపై దాడి చేయడం ఎంత వరకు న్యాయసమ్మతమని గురువారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లే ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చేతులు ఎత్తేయడం, ఓ డీఐజీ స్థాయి అధికారి సంఘటనను పత్తి వ్యాపారంగా అభివర్ణించడం ప్రజాస్వామ్య విలువలను దిగజార్చుతోందన్నారు. గ్రామంలో వాహనాన్ని అడ్డగించి ధ్వంసం చేయడం, బీసీ వర్గానికి చెందిన రమేష్ యాదవ్పై, అలాగే వేల్పుల రాము అనే వ్యక్తిపై దాడులు చేయడం అధికార పార్టీ దౌర్జన్యానికి అద్దం పడుతోందన్నారు. రమేష్ యాదవ్ను ఫోన్లో పరామర్శించినప్పుడు దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పడం తనను బాధించిందన్నారు. రమేష్ యాదవ్పై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడుల వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రక్షణ చట్టం ఏమైంది? బీసీలకు రక్షణ చట్టం తెస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీసీలు దాడులకు గురి కావడం విచారకరమన్నారు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఆలోచన చేయడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం బీసీ మహిళలకు అందించిన చేయూత, ఆసరా పథకాలను ఎత్తివేసి మోసగించారన్నారు. మగ్గం ఉన్న చేనేతలకు క్రమం తప్పకుండా ఏటా రూ.24 వేలను జగన్ ప్రభుత్వం అందించేదన్నారు. చేనేతలకు ఈ పదునాలుగు నెలలలో ఏ పథకం అందివ్వలేదన్నారు. గత ప్రభుత్వంలో చేనేతలకు మెటీరియల్ కొనుగోళ్లకు ఏడాదికి అందించిన రూ. 24 వేల స్థానంలో రూ.50 వేలు అందించే ఏర్పాట్లు చేయాలని, దానిపై ఆలోచనలు చేయకుండా బీసీలపైన దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
ప్రచారంలో టీడీపీ వర్గీయుల రగడ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అభ్యర్థిని ఎంపిక చేసిన తరువాత.. అందరూ కలిసికట్టుగా ఎంపిక చేసిన అభ్యర్థి అని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు ఒక పక్క ప్రకటించారు. కానీ అది కేవలం పార్టీ పరువు కాపాడుకునేందుకే అభ్యర్థిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అందరూ కలిసి అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సింది పోయి.. వర్గ విభేదాలను మనసులో ఉంచుకుని సందర్భంగా వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తున్నారు. గురువారం మండల పరిధిలోని దవంతరపల్లిలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన టీడీపీ సీనియర్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, మండల టీడీపీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి వాగ్వాదానికి దిగారు. పూర్తి విరాల్లోకి వెళితే.. వీరిలో వెంకటనరసయ్య మేడా విజయశేఖర్రెడ్డి వర్గం అయితే నరసింహారెడ్డి చమర్తి జగన్మోహన్రాజు వర్గం. వీరి మధ్య గత కొంత కాలంగా వర్గ విభేదాలు నడుస్తూ ఉండేవి. ఈ క్రమంలో ఒక రోజు కొమర వెంకట నరసయ్య సామాజిక మధ్యమంలో నరసింహారెడ్డిపై వార్డు మెంబర్గా గెలవలేని వ్యక్తిని మండల అధ్యక్షుడిగా చేశారంటూ ఘాటుగా విమర్శించారు. అంతే కాదు కొంత కాలం నరసింహారెడ్డి సుగవాసి వర్గంలో కూడా పని చేశారు. కానీ అప్పుడు వెంకట నరసయ్య జగన్మోహన్రాజు వర్గంలో ఉన్నారు. ఆ సమయంలో ఒంటిమిట్ట పంచాయతీలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో నరసింహారెడ్డిని, ఆయన అనుచరులను వెంకట నరసయ్యతోపాటు ఆయన అనుచరులు ఒంటిమిట్ట పంచాయతీకి సంబంఽధించిన రెవెన్యూ సదస్సులో పక్క ఊరి వారికి ఏం పని ఉందని అసభ్య పదజాలంలో దూషించారు. ఇది ఇలా ఉంటే ఏమైందో తెలియదు సుగవాసి టీడీపీపై అసంతృప్తితో పార్టీకి ఆయన రాజీనామాచేసి వైఎస్సార్సీపీలో చేరడంతో సుగవాసి వర్గంలో ఉన్న నరసింహారెడ్డి జగన్మోహన్రాజు వర్గంలో చేరారు. అది ఇష్టంలేని వెంకట నరసయ్య.. జగన్మోహన్రాజు వర్గాన్ని వీడి మేడా విజయశేఖర్రెడ్డి వర్గంలో చేరారు. ఇవ్వన్ని మనసులో పెట్టుకున్న నరసింహారెడ్డి సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు.. గురువారం మండల పరిధిలోని దవంతరపల్లిలో జరిగే ప్రచారానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ వస్తున్నాడని తెలిసి వెంకట నరసయ్య అక్కడికి వెళ్లాడు. అది చూసిన నరసింహారెడ్డి అతనికి జరిగిన అవమానాలన్నీ గుర్తుకు తెచ్చుకుని కోపోద్రిక్తుడై వెంకట నరసయ్యతో.. ‘నిన్ను ఎవ్వడు ఇక్కడికి రమ్మన్నాడు, ఏ ఊరి నీది’ అని అవమానంగా మాట్లాడాడు. దీంతో అవమానం భరించలేక వెంకట నరసయ్య నరసింహారెడ్డికి ఎదురు తిరిగాడు. ఇద్దరి మధ్య అసభ్య పదజాలంతో మాటల యుద్ధం జరిగింది. ఇది చూసిన ప్రజలు ఇదేం విడ్డూరం అంటూ నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉండి పోయారు. ఈ ఘటన ఎంత వరకు దారి తీస్తుందోనని మండల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒంటిమిట్టలో భగ్గుమన్న విభేదాలు జగన్మోహన్రాజు, మేడా విజయశేఖర్రెడ్డివర్గీయుల మాటల యుద్ధం -
ఇన్స్పైర్ నామినేషన్లు సమర్పించండి
రాయచోటి: ఇన్స్పైర్ మనాక్ అవార్డుల కోసం అధిక సంఖ్యలో నామినేషన్లు సమర్పించి అన్నమయ్య జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం సైన్స్ ఉపాధ్యాయులకు సూచించారు. రాయచోటి పట్టణంలోని డైట్ హాల్లో గురువారం జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజనల్ స్థాయి ఇన్స్పైర్ మనాక్ శిక్షణ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్థానిక సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రాజెక్టులను రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మండలి విభాగం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనాక్ అవార్డుల కోసం 6–12 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనేలా చూడాలన్నారు. నామినేషన్లను జాతీయ స్థాయిలో పరిశీలించి అత్యుత్తమ అన్వేషణాత్మక ఆలోచనలను ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక చేస్తారన్నారు. అవార్డుకు ఎంపికై న ఒక్కొక్క విద్యార్థికి రూ.10 వేలు అందిస్తారన్నారు. వీరికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రాజెక్టుకు మేధోసంపత్తి హక్కులు ఇస్తారన్నారు. రాయచోటి డివిజన్ పరిధిలోని 11 మండలాల నుంచి సైన్స్ ఉపాధ్యాయులు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డైట్ సీనియర్ లెక్చరర్ మడితాటి నరసింహారెడ్డి, రాజంపేట మండల విద్యాశాఖ అధికారి సుబ్బరాయుడు, సెక్టోరియల్ అధికారి జనార్ధన్, రీసోర్స్ సభ్యులు సెట్టెం ఆంజనేయులు, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం
రాయచోటి: పుట్టిన బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకు తల్లి పాలే శ్రేయస్కరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా గురువారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలో పని చేసే క్షేత్రస్థాయి సిబ్బంది.. ప్రతి గర్భిణి సీ్త్రకి, ప్రసవించిన ప్రతి తల్లికి, వారి ఇంటిలోని కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘తల్లి ముర్రుపాలు.. బిడ్డకు మొదటి టీకా’ పోస్టర్స్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జీఎస్డబ్ల్యూ లక్ష్మీపతి, ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ కోటేశ్వరీ, ఐసీడీఎస్ పీడీ హైమావతి, సీడీపీఓలు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందివ్వాలి ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు, సిబ్బంది సేవలందివ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్వర్ణాంధ్ర పి–4 కార్యక్రమం, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ మధుసూదన్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. -
మెరుగైన వైద్య సేవలు అందించండి
మదనపల్లె రూరల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ లక్ష్మీనరసయ్య ఆదేశించారు. గురువారం పట్టణ పరిధి నిమ్మనపల్లె రోడ్డులోని అర్బన్ హెల్త్ సెంటర్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షా కాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి స్క్రీనింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ కీర్తిప్రియ, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. హర్ఘర్ తిరంగాపై ర్యాలీ రాయచోటి: స్వాతంత్య్ర ఫలాలు, వాటి విలువలు, త్యాగాలను స్మరించుకునేందుకు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి నాగభూషణం పేర్కొన్నారు. గురువారం ఉదయం రాయచోటి పురపాలక సంఘం, పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ, జిల్లా పర్యాటక తదితర శాఖల ఆధ్వర్యంలో రాయచోటిలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ‘అక్షర ఆంధ్ర’పై శిక్షణ రాయచోటి టౌన్: అక్షర ఆంధ్ర అనే కార్యక్రమంపై రాయచోటి డైట్ కేంద్రంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వయోజన విద్య నోడల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ అక్షర ఆంధ్ర, ఉల్లాస్ (సమాజంలోని అందరికీ జీవిత కల అభ్యాసంపై అవగాహన) అంశాల ద్వారా వివిధ వృత్తులలో ఉన్న 15 ఏళ్లు పైబడిన వయోజనులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఎక్కువగా ఎస్హెచ్జీ లబ్ధిదారులు, ఆయాలు, వంట వండేవారు, వివిధ రకాల సహాయకులు, కాపలాదారులు వంటి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీడీఆర్డీఏ సత్యనారాయణ, ఏపీఎంలు, సీఎంఎంలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఉపాధి హామీ ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు. ‘సూర్యఘర్’పై అవగాహన కల్పించాలి రాజంపేట రూరల్: ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని విద్యుత్శాఖ సీజీ ఎం.జానకీరామ్ ఆదేశించారు. రాజంపేటలోని డివిజనల్ విద్యుత్శాఖ కార్యాలయంలో గురువారం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్సీ ఆర్ చంద్రశేఖరరెడ్డి, డీఈఈ ఎన్ రాజశేఖరరెడ్డి, డీఈలు సురేంద్రనాథ్, భాస్కరరావు, మురళీధర్రెడ్డి, ఏఈలు ఏంవీ చంద్రశేఖర్, కుమార్, ఈశ్వరరాజు, షఫీ, శ్రీనివాసులు, యోగనాందం, సుబ్రమణ్యం, కిరణ్కుమార్, చలపతీ, బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బిల్లు ఆదా రాయచోటి జగదాంబసెంటర్ : ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంతో వినియోగదారులకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ జానకిరామ్ పేర్కొన్నారు. రాయచోటి పట్టణం మాసాపేటలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ రాయచోటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.యుగంధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పలు శాఖల బ్యాంకు మేనేజర్లు, పీఎం సూర్యఘర్ వెండార్స్ తదితరులు పాల్గొన్నారు. -
యువతి అదృశ్యం
మదనపల్లె రూరల్ : యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్ఐ అన్సర్ బాషా తెలిపారు. పట్టణంలోని శెట్టివారివీధికి చెందిన ఓ యువతి(17) ఈ నెల 4వ తేదీన ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండాపోయింది. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం యువతి తండ్రి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. ఈ నెల 3న మండలంలోని వేంపల్లె హరిజనవాడకు చెందిన వెంకటస్వామి కుమారుడు శంకర వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. చీకల బైలు పంచాయతీ దారువారిపల్లె వద్ద ఐచర్ వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కేసు విచారణ చేస్తున్నామన్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం ఓబులవారిపల్లె : మండలంలోని చిన్నఓరంపాడు సమీపంలోని కల్వర్టు వద్ద గురువారం సాయంత్రం మినీ లారీ బోల్తా కొట్టింది. మినరల్ వాటర్ బాటిళ్ల లోడుతో తిరుపతి వైపు వెళ్తూ డ్రైవర్ లారీని అతివేగంగా నడిపాడు. మలుపు వద్ద బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదు. లారీలో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీయగా అతని భయంతో పారిపోయాడు. ఎస్ఐ మహేష్ నాయుడు, సిబ్బంది ట్రాఫిక్ను పునరుద్ధరించారు. టీటీడీ అధికారుల తీరుపై భక్తుల నిరసన ఒంటిమిట్ట : రాష్ట్ర దేవాలయంగా గుర్తించిన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థాంలో భక్తులు రామనామ స్మరణ చేస్తున్న సమయాన మైక్ కట్ చేసి అశ్రద్ధగా, అవమానకరంగా వ్యవహరించిన టీటీడీ అధికారుల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ విజయ శంకరస్వామి అన్నారు. ఈ చర్యకు నిరసనగా గురువారం ఉదయం 11 గంటలకు దేవస్థానం ఎదుట భక్తులు భారీగా గుమిగూడి రామనామ స్మరణ నిర్వహించారు. ఈ అవమానానికి భజన భక్తులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భక్తులను అవమానించే విధంగా ఆలయ అధికారుల తీరును నిరసిస్తూ.. భక్తులు రామనామమే రక్ష అంటూ ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. భక్తి భావాలకు టీటీడీ అధికారులు అవమానం కల్గించకూడదని వారు స్పష్టం చేశారు. గడువు పొడగింపు కడప ఎడ్యుకేషన్ : నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆగష్టు 13వతేదీ వరకూ గడువు పొడగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. 2025–26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
టీ తాగుతూ చర్చించుకుందాం
రాయచోటి జగదాంబసెంటర్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్.సూర్యనారాయణ టీ తాగుతూ చర్చించుకుందాం కార్యక్రమాన్ని ప్రారంభించారని ఏపీజీఏ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.లక్ష్మీప్రసాద్ తెలిపారు. రాయచోటి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిల విషయం ప్రభుత్వం పట్టించుకోలేదని, మూడేళ్ల సరెండర్ లీవ్స్ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడచినా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు రూ.25 వేల కోట్ల బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా తీరుస్తారో అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్బాబు, మోహన్బాబు, ఎంపీడీఓ రామచంద్ర, తహసీల్దార్ ఎంవీ.సుబ్రహ్మణ్యంరెడ్డి, రాజా, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మిద్దైపె నుంచి పడి కార్మికుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : మిద్దైపె నుంచి జారిపడి భవన నిర్మాణ కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. పట్టణంలోని గౌతమీ నగర్కు చెందిన ఎల్లప్ప కుమారుడు శ్రీనివాసులు(25) భవన నిర్మాణ పనుల్లో భాగంగా కమ్మీ పని చేస్తున్నాడు. గురువారం సీటీఎంలో ఓ ఇంటిపై పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నిటారుగా కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు లక్కిరెడ్డిపల్లి : మండలంలోని రాయచోటి–వేంపల్లి రహదారి మార్గంలోని మర్రిచెట్టు వద్ద గురువారం ఉదయం చైన్నెకు వెళ్తున్న కారు ఢీకొని చైతన్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన చైతన్య కొత్తపల్లిలో నివాసముంటున్నారు. గాయపడిన చైతన్యను స్థానికులు మెరుగైన చికిత్సకోసం కడప రిమ్స్కు తరలించినట్లు తెలిపారు. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చిన్నమండెం : మండలంలోని కలిబండ గ్రామం కొల్లవాండ్లపల్లెకు చెందిన రైతు ఈశ్వర్రెడ్డి(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈశ్వర్రెడ్డి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడని తెలిపారు. ఈ క్రమంలోనే నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. పిడుగు పడి ఇల్లు ధ్వంసం నిమ్మనపల్లె : పిడుగు పడి ఇల్లు ధ్వంసమైన సంఘటన నిమ్మనపల్లె మండలంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటాక మండలంలో కురిసిన వర్షానికి అగ్రహారం పంచాయతీ బండమీదపల్లె హరిజనవాడలో వెంకటరమణకు చెందిన ఇంటిపై పిడుగుపడింది. ఆ సమయంలో వెంకటరమణ భార్య సరోజతోపాటు బయట ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంటి గోడలు, పైకప్పు, ఇంట్లోని వస్తువులు పూర్తిగా ధ్వంసమై పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. బాధితుడు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేయగా ఎస్ఐ తిప్పేస్వామి, ఆర్ఐ రమేష్, వీఆర్వో ప్రవీణ్కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నష్టంపై అంచనా వివరాలతో నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దమండ్యం మండలం కలిచెర్ల పంచాయతీ గుర్రంవాండ్లపల్లెకు చెందిన పూజిత(18), తన అక్క కుమార్తె కోమలి(5)తో కలిసి ద్విచక్రవాహనంలో మదనపల్లెకు బయలుదేరింది. మార్గమధ్యంలో కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా ములకలచెరువుకు చెందిన పెయింటర్ వెంకటరమణ భార్య శాంతమ్మ(45) అనారోగ్యం కారణంగా చికిత్సకై కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వేపూరికోట వద్ద ఆమె చీర కొంగు బైక్ వెనుకచక్రంలో చిక్కుకుని కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. -
స్కూల్ వ్యాన్ కిందపడి బాలుడు దుర్మరణం
నిమ్మనపల్లె : ముద్దుముద్దుగా మాట్లాడుతూ బడికి వెళ్లిన పసివాడు.. ఇంటికి చేరకుండానే అనంత లోకాలకు చేరాడు. రోజూ తాను ప్రయాణించే స్కూల్ వ్యాన్ రూపంలో బాలుడిని మృత్యువు బలితీసుకుంది. నిమ్మనపల్లె మండలంలో గురువారం ఈ సంఘటన జరిగింది. మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ పాత కొండసానివారిపల్లెకు చెందిన మల్లికార్జున, శ్రావణి దంపతుల కుమారుడు దివాకర్(4) నిమ్మనపల్లె విజయవాణి స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. పాఠశాల ముగిసిన అనంతరం స్కూల్ వ్యాన్లో ఇంటికి బయలుదేరాడు. పాతకొండసానివారిపల్లె వద్ద విద్యార్థులను తల్లిదండ్రులు వ్యాన్ నుంచి కిందకు దించారు. బస్సు దిగిన దివాకర్ వెనుక నుంచి కాకుండా నిలిచి ఉన్న బస్సు ముందువైపు నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించని డ్రైవర్ వాహనాన్ని ముందుకు నడపడంతో దివాకర్ వ్యాన్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు నిమ్మనపల్లె పీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. స్కూల్ వ్యాన్లో అటెండర్ లేకుండా డ్రైవర్ ఒకడే విద్యార్థులను తీసుకురావడంతో ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బలమైన నమ్మకానికి ప్రతీక భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్
బి.కొత్తకోట : బలమైన నమ్మకం, పటిష్ట దృఢత్వం, వినియోగదారుల నమ్మకానికి భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ప్రతీకగా నిలుస్తుందని భారతీ సిమెంట్ టెక్నికల్ మేనేజర్ సి.చాయాపతి అన్నారు. స్థానిక బైపాస్రోడ్డులోని భగవాన్ సాయిరాం స్కూల్ ఎదురుగా భారతి సిమెంట్ డీలర్, ఎస్ఎల్వీ ఎంటర్ ప్రైజస్ అండ్ బోర్వెల్స్ నిర్వాహకులు సి.వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తాపీ మెసీ్త్రలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాయాపతి మాట్లాడుతూ భారతీ సిమెంట్ ప్రత్యేకతలు, నాణ్యతా ప్రమాణాలు, విశిష్ట అంశాలను వివరించారు. సిమెంట్ తయారీ విధానం, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేసీ్త్రలు పాటించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ సాంకేతిక నిపుణులు పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతీ ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. టెంపర్ ఫ్రూఫ్ బస్తాలతో మార్కెట్లోకి ఇస్తున్నందున తూకం తగ్గడం ఉండదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదన్నారు. సిమెంట్ రంగంలో భారతీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అనంతరం మెసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ఎం.సుబ్బరాయుడు, డీలర్ సి.వేణుగోపాల్రెడ్డి, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
అన్నమయ్య జిల్లా : రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట నందలూరు పోలీసులను ఆశ్రయించిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లిఖార్జునరెడ్డి వివరాల మేరకు.. మండలంలోని టంగుంటూరు గ్రామానికి చెందిన చలమాల నవీన్ కుమార్, పులివెందుల మండలం భాకరపురం గ్రామానికి చెందిన సయ్యద్ మనీషా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చి రాజంపేట సమీపంలోని పోలిచెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంనంతరం తమ బంధువుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ తమను ఆశ్రయించారని ఎస్ఐ తలెఇపారు. ఇరువురి కుటుంబీకులను పిలిపించి ఘర్షణలకు పాల్పడకుండా సామరస్యంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. -
మళ్లీ జన్మంటూ ఉంటే మీ కూతురిగానే పుడుతా..
మదనపల్లె రూరల్ : ‘మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు.. నేను బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నావు.. కానీ నేను చదువుకోలేకపోతున్నా డాడీ నన్ను క్షమించు’ అంటూ సుసైడ్ నోట్ రాసి తనువు చాలించింది బీటెక్ విద్యార్థిని రెడ్డి శ్రావణి(21). పట్టణంలోని రామారావు కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన వెంకటసుధాకర్, సుగుణ దంపతులకు అశ్వని, ప్రసన్న, శ్రావణి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అవ్వనికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రసన్న బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చేనేత కారి్మకుడైన వెంకట సుధాకర్ భార్య సుగుణ ఐదేళ్ల క్రితం మృతి చెందగా కుమార్తెలను కష్టపడి చదివించారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట శ్రావణి వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు పులివెందుల కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. అదే రోజున తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా తాను చదువుకోలేకపోతున్నానని సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయాన్నే వెంకటసుధాకర్ స్నానం చేసుకుని గుడికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి వెంకటసుధాకర్ ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి హతాశుడయ్యాడు. స్థానికుల సహాయంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకట సుధాకర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. -
చేనేతలను విస్మరించిన కూటమి ప్రభుత్వం
ప్రొద్దుటూరు : రాష్ట్రంలో చేనేతలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్సీపీ పద్మశాలీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి తెలిపారు. విలేకరులతో బుధవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. 2014లో చేనేతలకు చంద్రబాబు ఇచ్చిన 25 హామీలు బుట్టదాఖలు చేశారని విమర్శించారు. 2024 మేనిఫెస్టోలో చేనేతలకు ఉచిత విద్యుత్, జీఎస్టీ ఫ్రీ హామీలిచ్చినా వాటిని అమలు చేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాలను తాము ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఏడాదిన్నర గడచినా ఇవ్వలేదని విమర్శించారు. ఆప్కోను నిర్వీర్యం చేసి, చేనేత వ్యవస్థను అధఃపాతాళానికి తొక్కారని, వారంతా మళ్లీ ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో జగనన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లు రూ.1,20,000లు వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారన్నారు. నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.983 కోట్లు ఆర్థిక సాయం అందించారని, కరోనా కష్ట కాలంలోనూ ఈ మొత్తం అందించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆప్కో వస్త్రాలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థల ద్వారా పరిచయం చేసి చేనేతలను అగ్రగామిగా నిలిపారని తెలిపారు. వెంకటగిరి, మాధవరం, ధర్మవరం, మంగళగిరి, పెడన వంటి ప్రాంతాల్లో చేనేతలకు రెండు సెంట్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయకుండా.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పద్మశాలీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి -
సారీ డాడీ క్షమించు...
మదనపల్లె రూరల్ : ‘మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు.. నేను బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నావు.. కానీ నేను చదువుకోలేకపోతున్నా డాడీ నన్ను క్షమించు’ అంటూ సుసైడ్ నోట్ రాసి తనువు చాలించింది బీటెక్ విద్యార్థిని రెడ్డి శ్రావణి(21). పట్టణంలోని రామారావు కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన వెంకటసుధాకర్, సుగుణ దంపతులకు అశ్వని, ప్రసన్న, శ్రావణి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అవ్వనికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రసన్న బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చేనేత కార్మికుడైన వెంకట సుధాకర్ భార్య సుగుణ ఐదేళ్ల క్రితం మృతి చెందగా కుమార్తెలను కష్టపడి చదివించారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట శ్రావణి వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు పులివెందుల కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. అదే రోజున తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా తాను చదువుకోలేకపోతున్నానని సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయాన్నే వెంకటసుధాకర్ స్నానం చేసుకుని గుడికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి వెంకటసుధాకర్ ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి హతాశుడయ్యాడు. స్థానికుల సహాయంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకట సుధాకర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కూతురిగానే పుడుతా.. సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య -
పొలం కంచె ధ్వంసం
రాజంపేట : మండలంలోని పెద్దకారంపల్లె పరిధిలోని మిట్టపల్లె ప్రాంతంలో ఈశ్వరరాజు అనే రైతుకు సంబంధించి పొలం కంచెను బుధవారం కొందరు ధ్వంసం చేశారు. లింగంపల్లె గ్రామానికి చెందిన హస్తి వెంకట్రాజు, లక్ష్మీకర్రాజు, భానుప్రకాశ్రాజు తన పొలం కంచెను ధ్వంసం చేశారని బాధిత రైతు మన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు సిద్దవటం : మండలంలోని కడప– చైన్నె జాతీయ రహదారిలోని మిట్టపల్లె సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. సిద్దవటం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాఘవేంద్ర మాధవరం–1 నుంచి ద్విచక్ర వాహనంలో స్టేషన్కు వెళ్తున్నారు. మిట్టపల్లె గ్రామానికి చెందిన సోమశేఖర్ ద్విచక్ర వాహనంలో మాధవరం–1కు వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇరువురి వాహనాలు ఢీకొన్నాయి. రాఘవేంద్రకు తీవ్రగాయాలవగా 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సోమ శేఖర్కు స్థానికంగా ప్రథమ చికిత్స చేయించి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళల అదృశ్యం నిమ్మనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యం కాగా, కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. మండలంలోని బండ్లపైకి చెందిన నరేష్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నెల 3న పనుల కోసం మదనపల్లెకు వెళ్లగా అతడి భార్య గాయత్రి(22) కట్టెలు తీసుకువస్తానని వెళ్లి కనిపించకుండా పోయింది. ఇంటికి వచ్చిన నరేష్ భార్యను వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిమ్మనపల్లె కందూరు రోడ్డుకు చెందిన సయ్యద్ఖాన్ భార్య సబీహా ఐదోతేదీ మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లి కుమారుడికి భోజనం క్యారియర్ ఇచ్చి వస్తానని వెళ్లి కనిపించకుండా పోయింది. ఆమె భర్త, కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఆమేరకు కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హార్సిలీహిల్స్కు పతంజలి, ఒబెరాయ్ వస్తున్నాయి !
బి.కొత్తకోట : పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్కు పతంజలి, ఒబెరాయ్ హోటల్స్ వస్తున్నాయని కలెక్టర్ శ్రీధర్ వె వెల్లడించారు. బుధవారం ఆయన మండలంలోని హర్సిలీహిల్స్పై టౌన్షిప్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్ర, సబ్కలెక్టర్ మేఘస్వరూప్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ హార్సిలీహిల్స్లో పతంజలి కార్యకలాపాల నిర్వహణపై టూరిజంతో అవగాహన ఒప్పందం చేసుకుంటుందని, భూ కేటాయింపు కావాలని కోరలేదని స్పష్టం చేశారు. టూరిజం నిర్వహణలోని భవనాల్లోనే పతంజలి కార్యకలాపాలు సాగిస్తుందని చెప్పారు. ఒబెరాయ్ సంస్థకు 20 ఎకరాలు కేటాయించామని, ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాక ఇక్కడ చర్యలు ప్రారంభిస్తారని అన్నారు. ఖరీఫ్ వ్యవసాయం 9.9శాతానికి పరిమితమైందని, భూగర్భజలాలు అడుగంటిపోయిన కారణంగా ప్రత్యామ్నయ చర్యలు చేపడతామని చెప్పారు. తంబళ్లపల్లె నుంచి రైలులో ఢిల్లీకి టమాట తరలించేలా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. హార్సిలీహిల్స్పైకి వచ్చే సాధారణ పర్యాటకుల సంఖ్య పెరిగిందని చెప్పారు. మందుబాబుల కట్టడి, పారిశుద్ధ్యంపై చర్యలు కుటుంబాలతో వచ్చే సాధారణ పర్యాటకులకు మందుబాబు కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా భధ్రతా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. ఐ లవ్ హార్సిలీహిల్స్ బోర్టులోని అక్షరాలను మందుబాబులు ధ్వంసం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని గాలిబండపై ఏర్పాటు చేసి రోజులు గడవకనే ధ్వంసం చేయడం సరి కాదన్నారు. దీనికోసం నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించి వారితో భద్రత కొనసాగిస్తామన్నారు. పారిశుధ్య పనులకు పది మంది కార్మికుల నియామకం, వాకింగ్ ట్రాక్ నిర్మాణం,వీధిదీపాల కోసం టెండర్లు పిలిచినట్టు చెప్పారు. వీఎస్ఆర్ భవనం అద్దె నెలకు రూ.50వేల నుంచి రూ.1.80 లక్షలకు పెంచామని, రెవెన్యూ అతిథిగృహం నెలకు రూ.1.05 లక్షలకు అప్పగించామని చెప్పారు. కొండపై కొత్తగా నిర్మించిన, ఏర్పాటు చేసిన వాటర్ఫాల్స్, వెల్కం హార్సిలీహిల్స్, ఐ లవ్ హార్సిలీహిల్స్ బోర్డులు, జిడ్డు సర్కిల్, వివేకానంద సర్కిళ్లకు జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. తహసీల్దార్ ఎ.బావాజాన్, కమీషనర్ జీవీ.పల్లవి, ఎంపీడీఓ కృష్ణవేణి, ఆర్ఎస్డీటీ బాలాజీ, ఆర్ఐ వీరాంజనేయులు, వీఆర్ఓ జయరామిరెడ్డి, టూరిజం మహేష్ బుజ్జి, ఉద్యోగులు పాల్గొన్నారు. అభివృద్ది పనులు తిలకించిన కలెక్టర్ శ్రీధర్ -
గండికోట డ్యాంలో గుర్తుతెలియని శవం లభ్యం
కొండాపురం : గండికోట ప్రాజెక్టు నీటిలో రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని ఓ యువకుడు శవం బుధవారం లభ్యమైనట్లు కొండాపురం ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మండలంలోని పాత కొండాపురం–ఏటూరు వైపు వెళ్లే పాతదారి వద్ద రైల్వే వంతెన సమీపంలో గండికోట జలాశయం వెనుక జలాల్లో 4.5 అడుగుల గుర్తుతెలియని మృత దేహం కనిపించడంతో గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకొని మృత దేహాన్ని బయటికి తీశారు. మృతుడు జీన్స్ ఫ్యాంట్ ధరించాడని, వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మద్య ఉంటుందని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిస్తే ఎస్ఐ 9121100612, సీఐ 9121100611 ఫోన్లకు సమచారం ఇవ్వాలని తెలిపారు. -
ఇన్స్ఫైర్ మనక్ ఓరియంటేషన్కు హాజరుకావాలి
రాయచోటి : డివిజనల్ స్థాయి ఇన్స్ఫైర్ మనక్ ఓరియంటేషన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం కోరారు. అన్నమయ్య జిల్లాలోని మూడు డివిజన్లలో ఇన్స్ఫైర్ మనక్ అవార్డు నామినేషన్లకు సంబంధించి అవగాహన తరగతులు గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయచోటిలోని డైట్, మదనపల్లి, రాజంపేట జెడ్పీ పాఠశాలల్లోనూ శిక్షణా తరగతులు ఉంటాయని, ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల నుంచి ఒక ఉపాధ్యాయుడు ఓరియంటేషన్కు హాజరు కావాలన్నారు. పీజీ కోటాను తగ్గించడం దారుణం ఓబులవారిపల్లె : 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్లకు పీజీ కోటాను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడం దారుణమని వైద్యాధికారులు గురు మహేష్, డాక్టర్ రాజశేఖర్ అన్నారు. విలేకరులతో వారు మాట్లాడుతూ ఎలాంటి సమాచారం లేకుండా మీడియా ద్వారా నిర్ణయాన్ని తెలియజేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న వైద్యులను ఇది తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మారుమూల గ్రామాలలో పనిచేస్తున్న వైద్యుల సంఖ్యపై ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను మోసగించిందని, వెంటనే తీసుకున్న నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని వారు కోరారు. ఊయలే.. ఉరితాడై – గొంతుకు బిగుసుకుపోయి బాలిక మృతి జమ్మలమడుగు : సరదాగా ఆడుకునే ఊయలే.. గొంతుకు బిగుసుకుపోయి అరీఫా(9) ప్రాణం తీసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప చనిపోవడంతో ఇంటిల్లిపాదీ కన్నీరు మున్నీరయ్యారు. ఎర్రగుంట్ల పట్టణం వినాయకనగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను విషాదంలో నింపింది. సీఐ నరేష్బాబు వివరాల మేరకు.. వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న అలీబాషా స్థానిక నాపరాయి గనిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన కుమార్తె ఆరీఫా పట్టణంలోని ప్రభు త్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సా యంత్రం స్కూల్నుంచి వచ్చిన ఆరీఫా ఇంట్లో ఎవ రూ లేకపోవడంతో ఊయలతో సరదాగా ఆడుకుంటోంది. ఈ సందర్భంగా చీర ఊయల మెడకు బిగించుకుపోవడంతో ఊపిరాడక మరణించింది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు పాపను చూసి సృహ కో ల్పోయిందని భావించి ఆసుపత్రికి తీసుకుపోయారు. వైద్యులు పరీక్షించి ఆరీఫా మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పాప మరణం స్థానికులను కలవరపెట్టింది. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కలకడ : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం కలకడలో జరిగింది. ఎస్ఐ రామాంజనేయులు కథనం మేరకు...కలికిరి మండలం మేడికుర్తి గ్రామానికి చెందిన ఆర్.దస్తగిరిసాబ్ కుమారుడు ఆర్.అబ్దుల్రహిమాన్(55) తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం కలకడలో పని ముగించుకుని వెళ్తుండగా వర్షం కురవడంతో ఆగిపోయారు. మరుసటిరోజు బుధవారం ఉదయం 4–30 గంటల సమయంలో కలికిరి వైపు నడచి వెళ్తుండగా కలకడ హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రగాయాలైన అబ్దుల్రహిమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రెహనా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తన స్థలం ఆక్రమిస్తున్నారని మహిళ వినతి కురబలకోట : తమ స్థలంలో దౌర్జన్యంగా మరొకరు పాగా వేసి అక్రమంగా కట్టడం నిర్మించారని కురబలకోటకు చెందిన బాధిత మహిళలు పర్విన్, రేష్మా బుధవారం కలెక్టర్కు విన్నవించారు. వారి కథనం మేరకు..మండలంలోని దొమ్మన్నబావి హైవే పక్కన వారికి రూ.4 కోట్లు విలువైన 28 సెంట్ల స్థలం ఉంది. ఇటీవల అదే ఊరికి చెందిన ఒకరు దౌర్జన్యంగా ఆక్రమించి కట్టడం నిర్మించారు. అభ్యంతరం చెబితే తమపై దౌర్జన్యానికి వచ్చారని బాధితులు తెలిపారు. ఆక్రమణదారుడికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని వాపోతున్నారు. సర్వే నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట నందలూరు : రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట నందలూరు పోలీసులను ఆశ్రయించిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లిఖార్జునరెడ్డి వివరాల మేరకు.. మండలంలోని టంగుంటూరు గ్రామానికి చెందిన చలమాల నవీన్ కుమార్, పులివెందుల మండలం భాకరపురం గ్రామానికి చెందిన సయ్యద్ మనీషా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చి రాజంపేట సమీపంలోని పోలిచెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంనంతరం తమ బంధువుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ తమను ఆశ్రయించారని ఎస్ఐ తలెఇపారు. ఇరువురి కుటుంబీకులను పిలిపించి ఘర్షణలకు పాల్పడకుండా సామరస్యంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న పది ఎర్రచందనం దుంగలను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీశాఖ అధికారి వై.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వివరాలలోకి వెళ్లితే.. రాయవరం సెక్షన్ సుండుపల్లె బీట్ పరిధిలోని సద్దికూళ్లవంక చెక్పోస్టు దగ్గర అటవీశాఖ అధికారులు నాకాబందీ నిర్వహించారు. ఒక హుండాయ్ కారు వేగంగా వచ్చి బారిగేట్ వేసిన విషయం పసిగట్టి సుండుపల్లె మార్గంలోకి వెళ్లగా అటవీ సిబ్బంది వెంబడించారు. సిబ్బందిని చూసి వాహనాన్ని నిలిపి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. వాహనం తనిఖీ చేయగా అందులో 326 కేజీలు గల పది ఎర్రచందనం దుంగలున్నాయి. ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకుని పారిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలో రాయవరం డీవైఆర్ఓ రమేష్బాబు, ఎఫ్బీఓ అంజన స్వామి, గౌషా, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
థర్మాకోల్ ప్లేట్లలో ఆహారం తింటే ప్రమాదం
చిన్నమండెం : థర్మాకోల్ పేట్లలో ఆహారం తీసుకుంటే ప్రమాదమని ఆహార భద్రతా అధికారి వెంకటరెడ్డి అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ చిన్నమండెం మండల కేంద్రంలో ఇటీవల పానీపూరీ విక్రయిస్తున్న దుకాణాల్లో థర్మాకోల్ ప్లేటు వాడుతున్న విషయం గమనించి వ్యాపారులను మందలించామని తెలిపారు. వినియోగదారుల నుంచి ఇటీవల ఫిర్యాదులు వసుత్న్నాయని తెలిపారు. జనాల బలహీనతలతో వ్యాపారం చేయకూడదని, మండల వ్యాప్తంగా పానీపూరీ దుకాణాలపై తనిఖీలు చేపట్టామన్నారు. వేడిగా ఉన్న కట్లెట్, పానీపూరీ తదితర ఫాస్ట్ఫుడ్ థర్మాకోల్ ప్లేట్లలో ఇవ్వడం గుర్తించామన్నారు. వాటిలో ఆహారం తీసుకుంటే ప్లాస్టిక్ కణాలు వేడికి ఆహార పదార్థాల్లో కలిసి కడుపులోకి వెళ్తాయని, కాలేయం దెబ్బతిని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. క్రమంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్టీలు పాత్రలే వాడాలని, పానీపూరి తయారీలో నాణ్యత విలువలు పాటించాలని సూచించారు. -
టీడీపీ నేత బీటెక్ రవి బరి తెగిస్తున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తన సతీమణిని అభ్యర్థిగా నిలబెట్టిన ఆయన గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పచ్చని పల్లెల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ విష సంస్కృతికి తెర తీస్తున్నారు. ఆది నుంచి హత్యా రాజకీయాల్నే నమ్ముకున్
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. గతంలో ఎంపీపీ పదవి కోసం హత్యా రాజకీయాలు చేసిన ఆయన తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కేంద్రంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. భౌతిక దాడులు.. హత్యాయత్నం ఘటనలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. తీవ్ర ఘర్షణలు..అల్లర్లు సృష్టించేందుకే నియోజకవర్గ వ్యాప్తంగా కొంతమందిని బ్యాచ్లుగా ఎంపిక చేసి.. ఎంచుకున్న వారిపై హత్యాయత్నానికి కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవికి హైటెక్ తెలివితేటలు అధికమని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు. అది నిజమని పలుమార్లు రుజువైంది. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహాద్రిపురం ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మా రామలింగారెడ్డి ఎన్నికయ్యారు. ఒకే ఒక ఎంపీటీసీ సభ్యుడి ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు. మెజార్టీ సభ్యుడిగా ఉన్న కొమ్మారామలింగారెడ్డి హత్యతో ఎంపీపీ ఖాళీ ఏర్పడితే ఆస్థానం గెలుపొంది చేజేక్కించుకోవచ్చునే ఎత్తుగడను బీటెక్ రవి ప్రయోగించారు. వెరసి ఎంపీపీ కొమ్మా రామలింగారెడ్డి హత్య తెరపైకి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఆపై ఏర్పడ్డ ఫ్యాక్షన్ నేపధ్యంలో ప్రతీకార హత్యలు లేకపోలేదు. ఇంటి వాస్తు కోసం రోడ్డుకు అడ్డంగా గోడ ఏర్పాటు కసనూరు గ్రామానికి చెందిన బీటెక్ రవి సింహాద్రిపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నూతనంగా నిర్మించుకున్న ఇంటికి పరమడ వైపు రోడ్డు ఉంది. రోడ్డు అడ్డంగా గోడ కట్టారు. కారణమేమంటే వాస్తుకు అనువుగా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు. అటువైపు ఇళ్లున్న వాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. బీటెక్ రవి అనుచరులు దాడులు చేస్తారనే భయం వారిని బాహాటంగా ప్రశ్నించకుండా చేసింది. ఫలితంగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించినా చూస్తుండిపోయిన దుస్థితి నెలకొంది. జెడ్పీటీసీ ఎంట్రీలోనూ అదే పరిస్థితి... సింహాద్రిపురానికి చెందిన బీటెక్ రవి తన సతీమణి లతాను పులివెందుల జెడ్పీటీసీగా పోటీ చేయించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందుల పట్టణం, రూరల్లో దందాలు, సెటిల్మెంట్లు మొత్తం వ్యవహారం గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. స్థానికంగా టీడీపీ నేతలు పోటీకి ఆసక్తిగా ఉన్నా, బీటెక్ రవి తన కుటుంబ సభ్యుల్ని పోటీలో దింపడం వెనుక ఈ ప్రాంతంపై పట్టు సాధించాలనే తపన అధికంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్రెడ్డి లోకల్. ఇక టీడీపీ అభ్యర్థి మారెడ్డి లత నాన్ లోకల్ అయినప్పటికీ పోటీకి ఆసక్తి చూపడం వెనుక బహుళ ప్రయోజనాలున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు. పులివెందుల ప్రశాంతతకు భంగం... ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడి ప్రజలు, రైతులు కక్షలకు దూరంగా ఉండి పూర్తిగా వ్యవసాయం బాటపట్టారు. అందుకు అనువైన పరిస్థితులు మహానేత కల్పించారు. మెట్ట ప్రాంతానికి సాగునీరు వచ్చి చేరింది. ఆదాయం కళ్లు చూడడం, క్రమేపి ప్రశాంత వాతావరణానికి జనాలు అలవాటు పడ్డారు. 2004 నుంచి 2024 వరకూ పులివెందులలో ప్రశాంత వాతావరణం కొనసాగేది. కూటమి అఽధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతతకు భంగం ఏర్పడింది. తాజాగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అది మరింత ఎక్కువైంది. మంగళవారం రాత్రి సైదాపురం సురేష్కుమార్రెడ్డి, అమరేష్రెడ్డి టార్గెట్గా హత్యాయత్నం చేశారు. బుధవారం మధ్యాహ్నం నల్లగొండుగారిపల్లెలో ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి టార్గెట్గా హత్యాయత్నం చేశారు. టీడీపీ మూకలు బరితెగించి గ్రామస్తుల సమక్షంలోనే వేల్పుల రామలింగారెడ్డి హత్యకు విశ్వయత్నం చేశారు. పెట్రోల్ పోసి నిలువునా అంటించడానికి ప్రయత్నించారు. వాహనాలు ధ్వంసం చేశారు. అద్దాలను సమ్మెటతో పగలగొట్టి వాహనంలోకి పెట్రోల్ చల్లారు. తీవ్ర భయాందోళనలు సృష్టించారు. నల్లగొండుగారిపల్లె గ్రామస్తులు అడ్డుగా నిలవడంతో వేల్పుల రామలింగారెడ్డి ప్రాణాలతో బతికిపోయారని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే అరాచకానికి నిలువెత్తు రూపంగా బీటెక్ రవి నిలుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. నాడు ఎంపీపీ పదవి కోసం హత్యా రాజకీయాలు! తాజాగా పులివెందులలో ఎంట్రీలోనూఇదే సంస్కృతికి బీజం పట్టణ ప్రశాంతత కలుషితం అవుతోందనిప్రజాస్వామ్యవాదుల ఆవేదన లోకల్ నాయకులకు అవకాశం ఇవ్వకుండా రంగప్రవేశం వెనుక అతి పెద్ద స్కెచ్ -
హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లు!
మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశ మదనపల్లె సర్కిల్–3 పరిధిలో జరిగిన అక్రమ ఉద్యోగ నియామకాలు, అక్రమ పదోన్నతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై జలవనరులశాఖ ఈఎన్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిపై నివేదిక పంపాలని మదనపల్లె ఎస్ఈకి రెండు మెమోలు జారీ చేశారు. ఏపీఈఎస్ఎస్ నిబంధనల షెడ్యూల్ ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి అవసరమైన అర్హత కోసం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నిర్వహించే ట్రేడ్ టెస్ట్ (డ్రాఫ్ట్స్ మ్యాన్) సివిల్ లేదా మెకానికల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. నియామకాలు, బదిలీలు, పదోన్నతులను పరిగణలోకి తీసుకునేటప్పుడు సర్వీసు నియామకాల జీవో, ప్రభుత్వ సూచన లను పాటించాలని స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఈ నిబంధనలు, జీవోలను తుంగలో తొక్కారు. ఇవేమి తమకు పట్టవని పక్కన పడేశారు. చేయాల్సింది చేసేశాక ఇప్పుడు మెమోలు జారీ అవుతున్నా వాటిని డొంట్ కేర్ అంటున్నారు. అక్రమ ప్రమోషన్ల వివరాల్లోకి వెళితే.. మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి డిప్లొమా (ఈసీఈ)తో టెక్నికల్ అసిస్టెంట్గా నియమితులయ్యారు. 2013 మార్చిన ఏడున ఆమెకు టెక్నికల్ అసిస్టెంట్ నుంచి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పదోన్నతి కల్పించారు. తర్వాత 2022 జూలై ఒకటిన జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ నుంచి టెక్నికల్ ఆఫీసర్గా మరోసారి పదోన్నతి పొందారు. పదోన్నతులు పొందిన తర్వాత దీనికి అవసరమైన అర్హత కలిగిన విద్యను దూర విద్య ద్వారా అభ్యసించేందుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు నివేదించడంతో అక్రమ పదోన్నతుల వ్యవహారం పసిగట్టారు. దీంతో గతంలోనే ఎస్ఈలకు సర్కులర్ మెమోలను ఈఎన్సీ అధికారులు జారీ చేశారు. అక్రమ నియామకాలపై గతంలో మెమోలు ఇచ్చినా ఎందుకు మౌనంగా ఉండి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నారని ఈ ఏడాది ఏప్రిల్ 24, జూలై 21న జారీ చేసిన మెమోల్లో ఎస్ఈని ఈఎన్సీ ప్రశ్నించారు. 14 ఏళ్ల తర్వాత ఎస్ఈ ఆ మహిళా ఉద్యోగి ఇప్పుడు డ్రాఫ్ట్స్మ్యాన్ ఐటీఐ విద్య అభ్యసించేందుకు అనుమతి ప్రతిపాదనలను..అక్రమ పదోన్నతులపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా పంపడంపై విస్మయం వ్యక్తం చేసిన ఈఎన్సీ జూలై 21న జారీ చేసిన మెమోలో మహిళ ఉద్యోగికి అక్రమ పదోన్నతులు కల్పించిన అధికారుల పేర్లతో వివరాలు పంపాలని ఆదేశించారు. మరో ముగ్గురికి పదోన్నతులు మహిళా ఉద్యోగికి కట్టబెట్టిన పదోన్నతులతో సరిపెట్టని ఉన్నతాధికారులు సర్కిల్ పరిధిలో పని చేస్తున్న మరో ముగ్గురు ఉద్యోగులకు ఇదే విధంగా అక్రమ పదోన్నతులు కల్పించారు. మదనపల్లె సర్కిల్ పరిధిలోని కుప్పం డివిజన్లో పని చేస్తున్న బ్లూ ప్రింటర్ ఆపరేటర్లు వై.చెన్నయ్య, కే.అబ్బిరెడ్డెయ్య, కదిరి డివిజన్లో పని చేస్తున్న పి.ఖాదర్బాషాల విద్యార్హత ప్రకారం పదోన్నతులు కల్పించాలి. అయితే అధికారులు ఇవేమి పట్టించుకోలేదు. వీరు పదోన్నతులు పొందాలంటే..నిబంధనల ప్రకారం ట్రేడ్ టెస్ట్ (డ్రాఫ్ట్స్మ్యాన్) సివిల్ లేదా మెకానికల్ కోర్సులో అర్హత సాధించి ఉండాలి. అయితే దీన్ని పట్టించుకోని అధికారులు ముగ్గురికి టెక్నికల్ అిసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులను పసిగట్టిన ఈఎన్సీ మదనపల్లె ఎస్ఈకి జూలై 8న మెమో జారీ చేశారు. ఈ ముగ్గురి పదోన్నతులపై ఇంతవరకు చర్యలులేవు. వీరికి పదోన్నతులు ఎలా ఇచ్చారు, దీనికి బాధ్యులైన అధికారులు ఎవరు, వారి వివరాలు, సమ్రగ నివేదిక పంపాలంటూ మెమోలో కోరారు. ఏం జరుగుతోంది? బాధ్యులైన వారిపై నివేదిక ఇవ్వాలనిమెమోలిచ్చినా పట్టించుకోని అధికారులు అర్హత లేకున్నా టెక్నికల్ అసిస్టెంట్లుగాఎలా ఇచ్చారని ఈఎన్సీ ఆగ్రహం హంద్రీ–నీవా ప్రాజెక్టు కార్యాలయ పరిధిలో అక్రమ పదోన్నతుల వ్యవహరం వెలుగులోకి రావడంతో అసలు కార్యాలయంలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. మదనపల్లె సర్కిల్–3 కార్యాలయం పరిధిలో సత్యసాయిజిల్లా ధర్మవరంలో డివిజన్–10, కదిరిలో డివిజన్–9, 10, కర్నూలుజిల్లా ఎమ్మిగనూరులో గురురాఘవేంద్ర ప్రాజెక్టు–2, కుప్పం డివిజన్–12లతోపాటు సర్కిల్ కార్యాలయం నడుస్తున్నాయి. దీనితో ఎక్కడెక్కడో ఉన్న కార్యాలయాల్లో ఇంకా ఇలాంటి అక్రమ ప్రమోషన్లు, బదిలీ జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చర్యలు చేపట్టాం ఈఎన్సీ ఇచ్చిన మెమోలపై అక్రమ పదోన్నతుల వ్యవహరంపై చర్యలు మొదలు పెట్టినట్టు ఎస్ఈ విఠల్ ప్రసాద్ సాక్షికి చెప్పారు. కోరిన మేరకు ఈఎన్సీకి నివేదించడంతో పాటు, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామని చెప్పారు. -
మున్సిపల్ కమిషనర్గా రవి
రాయచోటి: రాయచోటి మున్సిపల్ కమిషనర్గా జి రవి నియమితులయ్యారు. స్థానికంగా పనిచేస్తున్న కమిషనర్ వాసుబాబును నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో విజయవాడలో మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న జి రవిని బదిలీపై ఇక్కడ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల స్వీకరణ రాజంపేట: రాజంపేట సబ్కలెక్టర్గా హెచ్ఎస్ భావన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సబ్ కలెక్టరేట్కు ఆమె వచ్చిన సందర్భంగా అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఇక్కడ పనిచేసిన వైకోమానైదియాదేవిని బదిలీ చేశారు. ఈమె స్ధానంలో భావనను ప్రభుత్వం నియమించింది. ● బాధ్యతలు తీసుకున్న అనంతరం సబ్కలెక్టర్ భావన రాయచోటి లోని కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్నుమర్యాదపూర్వకంగా కలిశారు. ● బదిలీ అయిన సబ్కలెక్టర్ వైకోమానైదియాదేవిని కలెక్టరేట్ సిబ్బంది సన్మానించి, వీడ్కోలు పలికారు. అయితే ఈమెకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. పరిపాలనాధికారి శ్రీధర్, సబ్కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి విరాళం రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమానికి కన్నడ భక్తుడు రూ.1,00,000 విరాళం సమర్పించారు. కర్నాటక రాష్ట్రం ఆహార భద్రత శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప ఆయన భార్య నాగరత్నమ్మలు నెల రోజుల క్రితం లక్కిరెడ్డిపలె శ్రీ మాతంగి పీఠం నిర్మించేందుకు వచ్చినపుడు శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించే నిత్యాన్నదానం కోసం విరాళం అందిస్తానని చెప్పారు. ఆయన ప్రతినిధితో రూ.1లక్ష స్కాన్ ద్వారా స్వామి వారి ఖాలో జమ చేశారు. ఈ మొత్తం ద్వారా వచ్చిన వడ్డీతో ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం రోజున భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. -
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నికల కోలాహలం!
సాక్షి రాయచోటి: ఆధ్యాత్మిక క్షేత్రం..భక్తులతో అలరాలే ఏకశిలానగరంలో రాజకీయ కోలాహలం కనిపిస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి గెలుపు లక్ష్యంగా పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎక్కడికక్కడ చర్చలు...గెలుపునకు అవసరమైన వ్యూహాలు...ప్రత్యర్థి వర్గాల ద్వారా ఓట్లు రాబట్టేందుకు అవసరమైన ప్రణాళికలతో సాగుతున్నారు.నామినేషన్లతో పాటు పరిశీలన, ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులంతా ప్రచారంపై దృష్టి సారించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. పార్టీలోని పలువురు కీలక నేతలంతా వచ్చి ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థి సుబ్బారెడ్డికి మద్దతుగా కదం తొక్కుతున్నారు. ● వైఎస్సార్ కడపజిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా బుధవారం రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్కుమార్రెడ్డి, మాజీ డిప్యూటీసీఎం అంజద్బాషా, వైఎస్సార్ సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, కడప నగర మేయర్, అన్నమయ్య జిల్లా పార్లమెంట్ పరిశీలకులు సురేష్బాబు, కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతోపాటు కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, గిడ్డంగుల సంస్థ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం నరవకాటిపల్లెలో ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా ఎంపీ మేడా రఘునాథరెడ్డి, నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొల్లపల్లి, దర్జిపల్లి గ్రామాల్లో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితోపాటు బద్వేలు నియోజకవర్గ నాయకులు ప్రచారంలో పాల్గొని వైఎస్సార్ సీపీ అభ్యర్థిని దీవించాలని కోరారు. పార్టీ శ్రేణులతోపాటు నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ డప్పు వాయిద్యాల నడుమ ప్రచారం కొనసాగించారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో గెలుపు తథ్యం ఒంటిమిట్టతోపాటు పులివెందుల జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యమని, దీనిని ఎవరూ ఆపలేరని పార్టీ కీలక నేతలు ఉద్ఘాటించారు.బుధవారం ప్రచారంలో భాగంగా పాల్గొన్న అనంతరం వారు మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పులివెందులలో ఎన్ని అరాచకాలు సృష్టించినా ఏమి చేయలేరని...పోలీసులు కూడా పక్షపాత ధోరణి విడనాడాలని వారు హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలవుతున్నా ప్రజలకు ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందని, ప్రజలు ఎటువంటి పథకాలూ అందుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు ఈ ఉపఎన్నికలో తమ ఓటుతో ప్రభుత్వం పాలనపై గట్టి సమాధానం చెబుతారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. ● ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం పలువురు వైస్సార్ సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రచార పర్వంలో భాగంగా పార్టీ నేతలు తొలుత స్వామి వారిని దర్శించకున్నారు. పార్టీ నేతలకు అర్చకులు సాదర స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. పులివెందులలో దాడి హేయం: ఇరగంరెడ్డిఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని నల్లగొండువారిపల్లెలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడి హేయమైన చర్య అని ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఉప ఎన్నిక ప్రచారం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. దాని పర్యవసానమే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడులు జరగడానికి కారణమన్నారు. టీడీపీ గూండాలు దాడి చేసినా రక్తం చిందించి వైఎస్సార్సీపీని గెలిపించుకుంటామన్నారు. ఒంటిమిట్టలో వైఎస్సార్సీపీ కీలక నేతల ఇంటింటి ప్రచారం -
‘రండి.....టీ తాగుతూ మాట్లాడుకుందాం’
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం కడప ఇరిగేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగుల సమస్యలను ఒక వీడియో రూపంలో ఉద్యోగుల ముందుకు తీసుకు రావడం జరుగుతోంది. ఏపీజీఈఏ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఉద్యోగుల హక్కులపై అందరినీ చైతన్యపరిచి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేలా కృషి చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు కృష్ణప్రసాద్, సుదర్శన్రెడ్డి, బీవీ చంద్రశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నిత్యపూజ స్వామి తలనీలాల వేలం పాట
సిద్దవటం: శ్రీ నిత్యపూజ స్వామికి భక్తులు సమర్పించుకునే తలనీలాల వేలం పాటను వైఎస్సార్ జిల్లా కమలాపురానికి చెందిన నాగయ్య రూ. 5.10 లక్షలకు దక్కించుకున్నారని ఈఓ శ్రీధర్ తెలిపారు. సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన శ్రీ నిత్యపూజస్వామి ఆలయంలో తలనీలాల హక్కు కోసం మంగళవారం సిద్దవటంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, కడప, సిద్దవటం ప్రాంతాలకు చెందిన ఆరుగురు పాటదారులు పాల్గొన్నారని ఈఓ తెలిపారు. అలాగే ఆలయ ఆవరణలో తాత్కాలిక షాప్లకు నిర్వహించిన వేలం పాటను సిద్దవటం ఎగువపేటకు చెందిన కూనా విజయభాస్కర్ రూ.1,43,000 దక్కించుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజంపేట దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ జనార్దన్, ఆలయ సిబ్బంది చంద్ర తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న వర్షాలు కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కొండాపురంలో అత్యధికంగా 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సింహాద్రిపురంలో 10.6 మి.మీ, లింగాలలో 9.2, జమ్మలమడుగులో 4.2, మైలవరంలో 3.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
ప్రభుత్వ స్థలం.. పరాధీనం
● టీడీపీ నాయకుడి భూ బాగోతం ● క్రీడామైదానానికి కేటాయించిన భూమి ఆక్రమణ ● కలెక్టర్కు ఫిర్యాదు చేసినాఫలితం శూన్యం టాస్క్ఫోర్స్: అన్నమయ్యజిల్లా రాజంపేటలో అధికారం అండగా టీడీపీ శ్రేణులు భూ ఆక్రమణలకు తెరతీస్తున్నారు. తమను ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యం..అడిగేవారు లేరన్న ధీమాతో టీడీపీ నాయకులు అడ్డదారులకు రాచబాట వేసుకొని వెళుతున్నారు. ఇప్పటికే భూములు, స్థలాలు, మద్యం, ఇసుక, మట్టి వంటివాటిని దోచేస్తున్నారు. రాజంపేట పరిధిలో భూములు కోట్లాది రూపాయిలు విలువ చేస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు సులువుగా కోటీశ్వర్లు అయ్యేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఖాళీ జాగా వేసేయ్ పాగా అన్నచందంగా భూకబ్జాల పర్వం కొనసాగుతోది. పేద ప్రజలు ఏమాత్రం విలువ చేయని ప్రాంతంలో రెండు సెంట్ల ప్రభుత్వ స్థలంలో చిన్నపాటి గుడిసె వేసుకున్నా అధికారులు ఆగమేఘాల మీద చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే రాజంపేట మండలంలో కూటమి నాయకులు కోట్లాది రూపాయిల విలువ చేసే భూములు, స్థలాలు కబ్జాచేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుంటే.. రాజంపేట మండలంలోని మిట్టమీదపల్లె పొలం సర్వే నంబర్ 1066లో చుండువారిపల్లెలో ఉన్న ఎస్టీ ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన నాలుగు ఎకరాల క్రీడామైదానాన్ని మండలంలోని అదే గ్రామానికి చెందిన చుండు సుధీర్ దర్జాగా ఆక్రమించుకున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ విలువ ప్రకారం నాలుగు కోట్ల రూపాయిల వరకు ఉన్నట్లు ఆ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. ఆమేరకు నాలుగు ఎరకాల స్థలం దాదాపు 16 కోట్ల రూపాయిల విలువ చేస్తుంది. ఆక్రమించుకున్న భూమిలో సుధీర్ భవనం నిర్మించుకోవడంతో పాటు పలు రకాల పండ్ల చెట్లను కూడా దర్జాగా సాగు చేసుకుంటున్నాడు. ఎస్టీ విద్యార్థుల సౌకర్యార్థం కేటాయించిన స్థలం కావడం వల్లే తనను ఎవరు అడగరన్న ధీమాతో సుధీర్ భూ ఆక్రమణకు తెగబడినట్లు తెలుస్తోంది. క్రీడామైదానం కోసం కేటాయించిన స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకున్న విషయాన్ని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూసేందుకు సాహసం చేయడం లేదంటే అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చుండు సుధీర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్యనాయుడుకు ముఖ్య అనుచరుడిగా ఉంటుండటం వల్ల అధికారులకు కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదుమిట్టమీదపల్లె పొలం సర్వే నంబర్లోని 1066 సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల భూమిని చుండు సుధీర్ కబ్జా చేసినట్లు అదే పంచాయితీలోని కొమ్మివారిపల్లె అరుంధతివాడకు చెందిన గొంటు మణి తెలిపాడు. ఈ ఏడాది మార్చి నెలలో రెండుమార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సుధీర్ భూకబ్జాపై ఫిర్యాదు చేశానని, దాదాపు ఐదు నెలలు అయినా ఏ అధికారి కూడా ఈ భూమిని కనీసం చూడను కూడా లేదని మణి ఆరోపించాడు. -
ఉప పోరు.. ప్రచార జోరు
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రచారం జోరందుకుంది. ఆ పార్టీ నాయకులు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం మండల పరిధిలోని సాలాబాదు, గంగపేరూరు గ్రామాలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, కోడురు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డిలు అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తో కలిసి జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, ఇరగంరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సును ఏర్పాటు చేస్తామని చెప్పి, తీరా అధికారం చేజిక్కించుకున్న తరువాత అదిగో.. ఇదిగో..అంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఇరగంరెడ్డి గెలిపు ఒక గుణపాఠం కావాలన్నారు. ● రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ..అందరికి అనువుగా ఉండే రాజధాని అమరావతి అంటూ..కొద్ది పాటి వర్షాలకే నీట మునిగిపోయే ప్రాంతాన్ని రాజధానిగా చేసి, ప్రజలకు అందివ్వాల్సిన సంక్షేమ పథకాల నిధులన్నీ రాజధానికి దోచి పెడుతున్న సీఎం చంద్రబాబుకు ఈ ఎన్నిక చెంపపెట్టుకావాలన్నారు. – – బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా మాట్లాడుతూ..ఉన్నత చదువు చదివిన యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న మోసపూరిత ప్రభుత్వానికి సుబ్బారెడ్డి గెలుపు గుణపాఠం కావాలన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తానన్న సీఎం చంద్రబాబు హామీ నెరవేర్చకపోవడంతో బీసీల ఆశలు అవిరయ్యాయి. ఇలాంటి సాధ్యం కాని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదన్న నిజం ఈ ఉప ఎన్నికతో నిరుపించాలన్నారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ..చేనేత కార్మికులకు ఉచితంగా ఇస్తానన్న 200 యూనిట్ల కరెంటును కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వం చేతకాని పాలనకు నిదర్శనం, ఇలాంటి అసమర్ధత ప్రభుత్వానికి ఓటు అనే అయుధంతో బుద్ధి చెప్పాలన్నారు. ● కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రహ్మాణులకు ఇస్తానన్న రూ. 25 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ ఆశ కల్పిస్తున్నారన్నారు. అలాంటి ఆశలను చూపే వారికి మనం ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ● కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇస్తానన్న 34 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా కూటమి నేతలు మోసాలు చేస్తున్నారు. వారికి బీసీల విలువ తెలియాలంటే ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. ● ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ..మెగా డీఎస్సీ అని కేవలం 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి, మెగా డీఎస్సీ అని కోతలకు పోతున్న ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2 లక్షల 50 వేల ఉద్యోగాల ఇచ్చిన సంగతిని గుర్తు చేయాలంటే ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీకి ఓటు వేయాలన్నారు ● రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అది వైఎస్సార్సీపీకే సాధ్యమన్నారు. కానీ కూటమి నాయకులు హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదన్నారు. అలాంటి వారికి ప్రజల చిత్తశుద్ది అంటే ఏమిటో ఈ ఉప ఎన్నికల్లో రుచి చూపాలన్నారు. ● జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు హామీలు..మోసాలకు నిలయాలని, అలాంటి మోసాలు చేసిన కూటమి ప్రభుత్వానికి ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షురాలు అజంతమ్మ, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, ఒంటిమిట్ట మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి, సాలాబాదు సర్పంచ్ స్వర్ణలత, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, గంగపేరూరు సర్పంచ్ కూండ్ల బుజ్జమ్మ, వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట మండల పంచాయతీ రాజ్ అధ్యక్షులు మేరువ శివనారాయణ వైఎస్సార్సీపీ నాయకులు మేకపాటి నందకిశోర్రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ముమ్మడి వెంకటకృష్ణారెడ్డి, లంకారామిరెడ్డి, గంగిరెడ్డి పాల్గొన్నారు. సాక్షి రాయచోటి: ఎన్నికలు జరుగుతున్న రెండు మండలాల్లో ఎన్నో ఏళ్లుగా ఏకఛక్రాదిపత్యమే కొనసాగుతోంది. ఆది నుంచి కూడా వైఎస్ కుటుంబానికి కంచుకోటలుగా ఉండడమేగాక, ఆ కుటుంబం బలపరిచిన అభ్యర్థులే గెలుపుబావుటా ఎగురవేస్తూ వస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా కులమతాలు, వర్గాలు బేధం చూడకుండా ఓటర్లు గెలుపును ఏకపక్షం చేస్తూ వస్తున్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాం నుంచి ఇప్పటివరకు 25 ఏళ్ల చరిత్రను పరిశీలించినా పులివెందులతోపాటు ఒంటిమిట్టలోనూ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయఢంకామోగిస్తూ వస్తున్నారు. టీడీపీ కుట్రలు...కుయుక్తులు వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట మండలానికి సంబంధించి జెడ్పీ చైర్మన్గా ఆకేపాటి అమర్నాథరెడ్డి కొనసాగుతూ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట జెడ్పీటీసీతోపాటు జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఒంటిమిట్ట ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే పులివెందులకు సంబంధించి గతంలో జెడ్పీటీసీగా పనిచేస్తున్న మహేశ్వర్రెడ్డి మృతి చెందడంతో అక్కడ కూడా ఎన్నిక తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో రెండుచోట్ల బలంగా ఉన్న వైఎస్సార్ సీపీని ఢీ కొట్టలేక అధికారంలో ఉన్న కూటమి సర్కార్ కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతోపాటు దాడులకు తెగబడుతోంది. పోలీసుల ద్వారా బైండోవర్ పేరుతో వైఎస్సార్ సీపీ నేతలను భయపెట్టడం ఒక ఎత్తయితే, మరోవైపు వైఎస్సార్ సీపీ నాయకులపై ప్రత్యక్ష దాడులకు దిగుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా అలజడులు సృష్టించి క్యాడర్ను ఆందోళనలకు గురి చేయాలని చూస్తున్నారు. ఏదో ఒక రకంగా వైఎస్సార్ సీపీ శ్రేణులను భయబ్రాంతులకుగురి చేయాలన్న సంకల్పంతో టీడీపీ పులివెందులలో వికృత చేష్టలకు తెర తీయడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కీలక నేతల ప్రచారం జిల్లాలోని పులివెందుల మండలంలో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డికి మద్దతుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఫ్రచారం నిర్వహిస్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఒంటిమిట్ట మండలానికి సంబంధించి వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, కడప నగర మేయర్ సురేష్బాబు, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తుండడంతో మరోవైపు టీడీపీ కూడా ప్రచారం చేస్తోంది. వేడెక్కిన రాజకీయం జిల్లాలో రెండు జెడ్పీటీసీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయం వేడెక్కింది. ఈ ఎన్నికలను టీడీపీ అధిష్ఠానం సీరియస్గా తీసుకుని అధికార బలాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. ఇన్చార్జి మంత్రి సవిత పులివెందులలో కూర్చొని మంత్రాంగం నడిపిస్తుండగా, ఒంటిమిట్టలో మంత్రి రాంప్రసాద్రెడ్డి ఎక్కడికక్కడ పావులు కదుపుతున్నారు. జెడ్పీటీసీ లాంటి చిన్నపాటి ఎన్నికలను కూడా అధికారంలోకి కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరువు కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం మొదలుకొని ఏదో రకంగా మంత్రులు అక్కడే మకాం వేసి ప్రత్యేకంగా కృషి చేస్తున్న తీరును చూసి పలువురు విస్మయం చేస్తున్నారు. ఒంటిమిట్ట టీడీపీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా అడ్డలూరు ముద్దు కృష్ణారెడ్డి పేరును మంగళవారం అధిష్టానం ప్రకటించింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు కడప జెడ్పీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజుతో కలిసి ముద్దుకృష్ణారెడ్డి సీఈఓ ఓబులమ్మ చేతులు మీదుగా బీ–ఫారం అందుకున్నారు. కడప సెవెన్రోడ్స్: ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబందించిన నామినేషన్ల ఉపంసహరణ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పులివెందుల స్థానానికి 12 మంది, ఒంటిమిట్ట స్థానానికి 21 మంది తొలుత నామినేషన్లు సమర్పించారు. ఉపసంహరణల అనంతరం ఒంటిమిట్టలో 11 మంది, పులివెందులలో 11 మంది బరిలో ఉన్నారు. ఒంటిమిట్టలో.. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), పూల విజయభాస్కర్ (కాంగ్రెస్), ముద్దుకృష్ణారెడ్డి (తెలుగుదేశం పార్టీ), అరిగేల సౌమిత్రి చంద్రనాథ్, కోనేటి హరి వెంకట రమణ, గుండు మల్లికార్జునరెడ్డి, టక్కోలి శివారెడ్డి, నడివీధి సుధాకర్, వై.మధుమూర్తి, మామిళ్ల ఈశ్వరయ్య, వెంకటేశ్ నంద్యాల స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. పులివెందులలో.. పులివెందుల స్థానానికి తుమ్మల హేమంత్రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), మారెడ్డి లతారెడ్డి (తెలుగుదేశం పార్టీ) మొయిళ్ల శివ కల్యాణ్రెడ్డి (కాంగ్రెస్), అంకిరెడ్డి సురేష్కుమార్రెడ్డి, తుమ్మనూరు అనిల్కుమార్రెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, మారుజోళ్ల గజేంద్రనాథ్రెడ్డి, మారెడ్డి జయభారత్రెడ్డి, ముద్దిగారి వెంగళరెడ్డి, యాదటి సునీల్యాదవ్ స్వతంత్య్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. తిరుగులేని ఆధిక్యం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం ఆది నుంచి వైఎస్ కుటుంబం బలపరిచిన వారిదే గెలుపు పులివెందుల, ఒంటిమిట్టల్లోనూ 25 ఏళ్ల చరిత్రలో విజయం ఏకపక్షం అధికారం అండగా..కుట్రలకు తెర తీస్తున్న టీడీపీ నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ముగియడంతో వేడెక్కిన రాజకీయం వైఎస్సార్ కడపజిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ప్రతిసారి తిరుగులేని ఆధిక్యత వైఎస్సార్ కుటుంబం బలపరిచిన అభ్యర్థులదే కనిపిస్తోంది. దాదాపు 25 ఏళ్లలో పలు దఫా లుగా జరిగినా ప్రతి ఎన్నికలోనూ అటు కాంగ్రెస్ (వైఎస్సార్ హయాంలో), తర్వాత క్రమంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తూ వస్తున్నారు. ఎప్పుడు చూసినా ప్రజలు కూడా నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న వైఎస్సార్ కుటుంబం వైపే మొగ్గుచూపుతున్నారు. వర్గాలు, వైషమ్యాలు, రాజకీయాలను పక్కనపెట్టి ఓటర్లు కూడా వైఎస్సార్ కుటుంబం ఎవరికి మద్దతు ఇస్తే వారినే గెలిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఒంటమిట్ట బరిలో 11 మంది పులివెందులలో 11 మంది -
నేడు మినీ ఉద్యోగమేళా
రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 6వ తేదీన మినీ ఉద్యోగమేళాను నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీ అయిన కడపకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ వారు ట్రైనీ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ సూపర్వైజర్, హెచ్ఆర్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిర్వాహకులు తెలియజేశారు. ఉద్యోగంలో చేరిన వారు ఐదు సంవత్సరాల బాండ్ ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు సమ్మతించినవారు మాత్రమే హాజరు కావాలని చెప్పారు. ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలగా గుర్తింపు కురబలకోట: రాష్ట్రంలో ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలగా అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు గుర్తింపు లభించిందని యూనివర్సిటీ ప్రతినిధి యువరాజ్ మంగళవారం తెలిపారు. ఇండియన్ సొసైటీ ఫఽర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాల అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.అదే విధంగా ఈ కళాశాల విద్యార్థిని కాగిత భార్గవికి రాష్ట్ర ఉత్తమ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విద్యార్థినిగా, బీటెక్ విద్యార్థి కార్తీక్ కోవికి ఉత్తమ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిగా అవార్డులు దక్కినట్లు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు నందలూరు: దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్పిళ్లై, ఎంపీడీఓ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రజల చేతిలో ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సచివాలయంలో నిర్వహించిన పీ–4 గ్రామసభలో వారు మాట్లాడుతూ మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుందని అన్నారు. వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా 200 పథకాల గురించి అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి తెలియజేశారు. నాగిరెడ్డిపల్లె, నందలూరు సచివాలయాల్లో ఇప్పటి వరకు 100 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. నాగిరెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి బండ్ల సురేష్కుమార్, వెంకటరమణ, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. రుణ ప్రణాళికపై అవగాహన వీరబల్లి్: రుణ ప్రణాళికలపై స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బండి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా తమ జీవనోపాధుల ఏర్పాటుకు ఎంతో రుణం కావాలని, దానికి సంబంధించిన వివరాలు యాప్లో బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయనున్నట్లు చెప్పారు. వివరాలన్నీ బ్యాంకు మేనేజర్ లాగిన్కు వెళ్తాయన్నారు. సంఘం ద్వారా తీసుకున్న అన్ని లావాదేవీలు ఆన్లైన్ ద్వారా వెళ్తాయని తెలిపారు. పలు విషయాలపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు వెంకటరమణ, లీగల్ కో–ఆర్డినేటర్ ఆనందబాబు, స్థానిక ఏపీఎం ఖాదర్ వల్లి, సీసీఎల్ కృష్ణయ్య, సుధాకర్, గంగాధర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా పీ4 అమలు రాయచోటి: పీ–4 కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఈనెల 19 నుంచి పీ– 4 అమలుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలకు మెరుగైన తోడ్పాటు ఇచ్చేందుకు ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పేదరిక నిర్మూలన కోసం బంగారు కుటుంబాలుగా నమోదైన వారికి చేయూతను ఇవ్వడం కోసం ఆగస్టు 15లోగా మార్గదర్శకుల నమోదు పూర్తి చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలకు సంబంధించి పలు సూచనలు కలెక్టర్ జారీ చేశారు. -
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసిన షెడ్యూల్ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికిగానూ ప్రథమ సంవత్సరం డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆగష్టు 18వ తేదీ నుంచి కళాశాలలో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని తెలిపారు. జిల్లాలో, జిల్లా బయట ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆగష్టు 21 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక కేటగిరీ పత్రాల పరిశీలన, 21 నుంచి 24వ తేదీవరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు, 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుందన్నారు. కళాశాల బోధన, బోధనేతర సిబ్బందిచే విద్యార్థుల కోసం కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆగష్టు 27న సీట్లను కేటాయిస్తారని, 28వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తారని తెలిపారు. -
ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
కడప కార్పొరేషన్ : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల టీడీపీలో చేరిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డిని వైఎస్.భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి పీఏ రాఘవరెడ్డిలు పార్టీలోకి రావాలని సముదాయించేందుకు ప్రయత్నించారన్నారు. భాస్కర్రెడ్డి ఫోన్ చేస్తే విశ్వనాథరెడ్డి ఫోన్ ఎత్తలేదని.. ఈ మాత్రానికే బెదిరించినట్లు కేసుపెట్టడం దారుణమన్నారు. వైఎస్.భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని సీబీఐని కోరుతామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి మాట్లాడటాన్ని బట్టి చూస్తే వారి కుట్ర బయటపడుతోందన్నారు. ఆచ్చివెళ్లి ఎస్సీ కాలనీకి చెందిన వారిని బలవంతంగా టీడీపీలో చేర్చుకున్రాని దళితులు చెబితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. శాంతియుతంగా ఇంటింటి ప్రచారం చేస్తుంటే ఓటమి భయంతో టీడీపీ నేతలు అక్రమ కేసులకు తెరతీశారన్నారు. ఈకార్యక్రమంలో షేక్ షఫీ, బి.సుబ్బరాయుడు, ఎన్.వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
కడప కార్పొరేషన్ : జిల్లాలోని అన్ని పంచాయితీలలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా పంచాయితీ అధికారి జి.రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. విక్రయ ఒప్పందం లేదా హక్కు పత్రంతో ఉన్న అనధికార లే అవుట్కు 90 రోజుల్లో వ్యక్తిగతంగా రెగ్యులైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగష్టు 4వ తేదీ నుంచి ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్లో ఉంటుందన్నారు. ఓపెన్ స్పేస్ చార్జీలు 45 రోజుల్లో పూర్తిగా చెల్లిస్తే పది శాతం, 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం పెనాల్టీ తగ్గింపు ఉంటుందన్నారు. ఇప్పటికే ఐపీఎల్పీ ఆమోదింపబడిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని, కొత్తగా వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించడం జరుగుతుందన్నారు. వివరాలకు 9849966639 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన షకీలా(35) కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. భర్త లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక కుమార్తెకు వివాహం చేసింది. ఈ క్రమంలో రెండురోజుల కిందట ఇంటికి వచ్చిన కుమార్తెతో కుటుంబ సమస్యలపై మంగళవారం గొడవపడింది. అనంతరం మనస్తాపం చెంది ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పురిటి బిడ్డకు పునర్జన్మసుండుపల్లె : మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో 11 రోజుల పురిటి బిడ్డకు ప్రాణం పోశాడు డాక్టర్ దిలీప్ గుప్తా. వివరాలలోకి వెళ్లితే.. రాయవరం గ్రామంలో 11 రోజుల చిన్న బిడ్డకు స్నానం చేయిస్తున్న సమయంలో పొరపోయింది. వెంటనే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో ఊపిరాడక ప్రాణాపాయస్థితిలో బిడ్డ అల్లాడిపోయింది. తల్లిదండ్రులు వెంటనే పాపను సుండుపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ దిలీప్ గుప్తా, ఫర్హాఖానం వైద్యం అందిచారు. బిడ్డ ప్రాణాలను కాపాడి పునర్జన్మ ప్రసాదించారు.తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 8న అండర్–22 క్రీడల పోటీలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురష్కరించుకొని శాప్ అదేశాల మేరకు ఈ నెల 8న అండర్–22 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి తెలిపారు. డాక్టర్ వైఎస్ క్రీడా పాఠశాలలో అర్చరీ, హాకీ వెయిట్ లిప్టింగ్(అన్ని విభాగాలు) పోటీలు, డీఎస్ఏ స్టేడియంలో అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరుగుతాయన్నారు. ప్రతి విభాగంలో విజేతగా నిలిచి ఎంపికై న జట్టు తిరుపతిలో ఈ నెల 11వతేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న జోనల్స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బెల్డ్ షాపులపై పోలీసుల దాడులు లింగాల : మండలంలోని గుణకణపల్లెలో బెల్టు షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన లోమడ శ్రీనివాసులు ఇంట్లో సోదాలు నిర్వహించి 12 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసులును అరెస్టు చేశామని హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపారు. -
విషగుళికలు తిని వ్యాపారి ఆత్మహత్య
ప్రొద్దుటూరు : పట్టణంలోని బాక్రాపేట వీధికి చెందిన వేరుశనగకాయల వ్యాపారి ఉండేల పెద్ద ఓబుళరెడ్డి (55) విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ శివారులోని కంపోస్టు యార్డులో పెద్ద ఓబుళరెడ్డి వేరుశనగ మిల్లు నిర్వహిస్తున్నాడు. పలువురు వ్యాపారుల వద్ద వేరుశనగ కాయలు తెచ్చి వ్యాపారం సాగించాడు. అప్పుల భారంతో మంగళవారం ఉదయం తన మిల్లులోనే విష గుళికలు మింగాడు. పరిస్థితి విషమించడంతో అతనిని స్థానిక హోమస్ పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెద్ద ఓబుళరెడ్డి మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన తనపై జరిగిన దాడి సంఘటనను పెన్నుతో చేతిలో రాసుకున్నట్లు గుర్తించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహం చేశారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు భారతి విద్యార్థి ఎంపిక
కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలోని డీఏవీ భారతి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎంవీ.నరేష్ రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్కుమార్ తెలిపారు. విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లోని డీఏవీ భారతి పాఠశాల విద్యార్థులు ఈ నెల 3న ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్నారు. జావెలిన్త్రోలో నరేష్ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11వతేదీ వరకూ బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో నరేష్ పాల్గొంటారని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా పరిశ్రమ సీఎంఓ సాయిరమేష్, హెచ్ఆర్ హెడ్ గోపాల్రెడ్డి, ఐఆర్అండ్పీఆర్ హెచ్.భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి విద్యార్థితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు. -
ఫుట్బాల్ బాలికల విజేత వైఎస్సార్ జిల్లా
మదనపల్లె సిటీ: క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర అన్నారు. మండలంలోని పోతోబోలు వేదా పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పుట్బాల్ పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతుల ప్రదానం జరిగింది. రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలికల ఫుట్బాల్ పోటీల్లో ఫైనల్స్లో విన్నర్స్గా వైఎస్సార్ కడప జిల్లా నిలిచింది. రన్నర్స్గా అనంతపురం, తృతీయ స్థానంలో అన్నమయ్య జిల్లా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందించిన అనంతరం డీఎస్పీ మాటాల్డుతూ విద్యార్థి స్థాయి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, ఎంచుకున్న క్డ్రీడలో ప్రతిభ కనబరిస్తే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని రెండింటినీ సమానంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దిలీప్కుమార్, కార్యదర్శి మురళీధర్, కోచ్లు హరి, పవన్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సురేష్, ఉమాదేవి, కమలేష్, అంజనప్ప, బాలాజీ పాల్గొన్నారు. -
విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు
సిద్దవటం : మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన సు భాషిణి ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించలేదని బంధువు గుర్రమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. గుర్రమ్మ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్టీ కాలనీకి చెందిన సుభాషిణి టక్కోలు జెడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నెల 2వతేదీ పాఠశాల ముగిసిన తరువాత ఆమె ఇంటికి రాలేదని బంధువులు తెలిపారు. తమ బంధువు కు బాగాలేదంటూ నమ్మించి వరుసకు మేనమా మ అయిన వ్యక్తి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లాడ ని వారు తెలిపారు. బాలిక బంధువు గుర్రమ్మ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యాభర్తలపై దాడి మదనపల్లె రూరల్ : స్థల వివాదం, వ్యక్తిగత కక్షలతో భార్యాభర్తలపై దాడిచేసిన ఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. నందిరెడ్డిగారిపల్లెకు చెందిన భార్యాభర్తలు అబ్దుల్బాషా(27), అమ్మాజాన్(22)లపై అదే ప్రాంతానికి చెందిన మహబూబ్బాషా, చాంద్బాషా, నన్నీబీలు దాడికి పాల్పడ్డారు. దాడిలో భార్యాభర్తలు గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ ఉద్యోగిపై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్ మదనపల్లె రూరల్ : మున్సిపల్ ఫిట్టర్గా పనిచేస్తున్న సుధాకర్పై దాడి చేసిన సంఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్టౌన్ ఎస్ఐ వెంకట శివకుమార్ తెలిపారు. కుమారపురానికి చెందిన రాజా(46), నిమ్మనపల్లె మండలం బండ్లపై పంచాయతీ భూమలగడ్డకు చెందిన ప్రదీప్(30)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కేసులో మరో నిందితుడైన రవిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి–మదనపల్లె రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో పెనుప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ అధికారులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె రోడ్డు మార్గంలో ఏపీ39యువై 4126 నెంబర్ లారీ అతివేగంగా వచ్చి 11 కెవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి సమీపంలోని ఇంటి ముందు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో పోల్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. స్పందించిన విద్యుత్తు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చేశారు. సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. -
నా భర్తను బతికించండి..
రాయచోటి టౌన్ : తమను ఎవరైనా ఆదుకొంటారని...తన భర్తకు ప్రాణబిక్ష పెడతారనే కొండం ఆశతో ఎదురు చూస్తోంది...వెంకటసుబ్బమ్మ అనే మహిళ....? నా అనే వారు ఎవరూ లేక మంచానికే పరిమితమైన భర్త కోసం..పిల్లలను ఎలాగైనా చదివించాలనే తపన... వెరసి కొండంత భారాన్ని మోస్తోంది. ఆమెను కదిలిస్తే కన్నీళ్లు పర్యంతమవుతాయి. ఆమె మాటల్లోనే...నా భర్త పేరు సుబాష్చంద్ర బోస్...మే ము రాయచోటి పట్టణంలోని కొత్తపేటలోని నాలుగు కుళాయీల సమీపంలో కాపురం ఉంటున్నాము. నా భర్త సుబాష్ చంద్రబోస్ (గతంలో వివిధ పత్రికలలో రిపోర్టర్గా పనిచేశాడు) ఫర్టిలైజర్ మేనేజర్గా పనిచేస్తూ వచ్చే డబ్బుతో జీవనం సాగించేవాళ్లం. మాకు కుమార్తె మౌనిక, కుమారుడు ధరణీధర్ ఉన్నారు. మా సంసారం సాఫీగా సాగిపోతున్న సందర్భంలో మే 16వతేది జరిగిన రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా మా కాపురాన్ని రోడ్డున పడేసింది. చిన్నమండెం మండలం కేశాపురం వద్ద నా భర్త స్కూటర్పై వస్తుండంగా ఒక కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు హెల్మెట్ ధరించడంతో గాయాలు కాలేదు కానీ.. కాళ్లు, నడుము భాగం పూర్తిగా విరిగిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి డాక్టర్లను సంప్రదిస్తే తిరుపతికి రెపర్ చేశారు. అక్కడ పలు ఆస్పత్రులలో చికిత్స చేయించినా ఎలాంటి ప్రయోజనం లేదు. అనంతరం ఏలూరు ఆస్పత్రికి వెళ్లమన్నారు. అక్కడ 11 యూనిట్ల రక్తం ఎక్కించారు. పది రోజుల తరువాత ఆపరేషన్ చేసి కుడికాలు తొడభాగంలో కండ తీసి ఎడమ కాలుకు ఆపరేషన్ చేశారు. నడుము విరిగిపోవడంతో స్టీల్ రాడ్ బిగించారు. అప్పటికే రూ.15లక్షలు మంచినీళ్లప్రాయంగా అయిపోయాయి. దొరికినకాడికిల్లా... తీసుకొచ్చి ఖర్చుపెట్టినా ఎలాంటి ప్రయోజం కనిపించడంలేదు. మంచానికే పరిమితమై ద్రవపదార్థాలు మాత్రమే ఇస్తున్నాం. కనీసం ఒక వైపు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మా ఫిర్యాదు తీసుకోలేదు. కేసు నమోదు చేసి ఉంటే మాకు ఎంతో కొంత న్యాయం జరిగుండేది. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. పాప ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి ఎంసెట్ కౌన్సిలింగ్కు వెళ్లాలని ఉన్నా చదివించే స్థోమత లేక ఆపేశాం. బాబు పదో తరగతి పాసయ్యాడు. విజయవాడలో ఉన్నాడు. వాడిని మాన్పించాలనే ఆలోచనలో ఉన్నాం. మందులు కొనుక్కోవడానికి పది రూపాయలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇరుగు పొరుగువారు చేసే సాయంతో కాలం వెళ్లదీస్తున్నాం. దాతలు సహాయం చేసి తిరిగి నా భర్తను బ్రతికిస్తే చాలు...వారికి రుణపడి ఉంటాం. దాతల సహకారం.... సుభాష్చంద్రమోబోస్ కుటుంబానికి రాయచోటి జర్నలిస్టులు రూ.13 వేల ఆర్థిక సహాయం అందించగా, రాయచోటి జిన్నా సేవా సంస్థ యజమాని రూ.10 వేలు ఆర్థిక సహాయం చేసి అంబులెన్స్ సమకూర్చారు. భవిష్యత్తుల్లో మరింత సహాయసహాకాలు అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి ఆర్థికంగా సహకరించే వారు ఫోన్ నంబర్ 9618218655కు ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం అందిచాల్సిందిగా వారు కోరారు. ఆదుకోవాలంటూ భార్య కంటతడి ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమైన భర్త పిల్లల చదువు మాన్పించిన తల్లిదండ్రులు -
యోగాతోనే ఏకాగ్రత, మానసిక ప్రశాంతత సాధ్యం
కడప ఎడ్యుకేషన్ : మానసిక ఒత్తిడి నుంచి బయటపడి శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పొందేందుకు విద్యార్థులకు యోగా ఔషధం లాగా పనిచేస్తుందని విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు అన్నారు. వృత్యంతర శిక్షణలో భాగంగా కడప నగర శివారులోని గ్లోబర్ ఇంజినీరింగ్ కళాశాలలో కేజీబీవీల ఉపాధ్యాయులకు మంగళవారం యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయినులు యోగాపై అవగాహన పెంచుకుని కేజీబీవీ విద్యార్థినులకు నేర్పించాలన్నారు. సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నిత్యానందరాజు మాట్లాడుతూ యోగా నిర్వహించడంతో శారీరక, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం యోగా ట్రైనర్ శ్రీలక్ష్మి ఉపాధ్యాయినులకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వీరేంద్ర, అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ సంజీవరెడ్డి, అఖిల్, అనూష, వింధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ శిక్షణా కేంద్రం పరిశీలించిన ఎస్పీ
కడప అర్బన్ : కడప శివారులోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ మంగళవారం పరిశీలించారు. స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(స్సీటీపీసీ)కు శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలోడీటీసీ పరిసర ప్రాంతాలు, మౌలిక వసతులు, బ్యారక్లు, కిచెన్, జిమ్, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ను చూసి త్వరితగతిన శిక్షణకు పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్, ఇతర శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడే మైదానం, క్లాస్ రూమ్స్, రన్నింగ్ ట్రాక్, పరేడ్ గ్రౌండ్స్, డ్రిల్ ఏరియా, బాటిల్ అబ్స్టాకల్స్ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. శిక్షణ కేంద్రంలో వసతి సదుపాయాలు ఏర్పాటుచేసుకోవాలని, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. డీటీసీ డీఎస్పీ అబ్దుల్కరీం, డీటీసీ ఇన్స్పెక్టర్ ఎస్.వినయ్కుమార్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
దేవుడా.. ఎంత పని చేశావయ్యా!
ములకలచెరువు: అయ్యో దేవుడా మా మీద దయలేదా.. ఎంత పని చేశావయ్యా.. మూడు కుటుంబాల్లో ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు.. వారూ తనువు చాలించారు.. మాకెందుకయ్యా ఇంత వేదన ఇచ్చావంటూ మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ విలపించిన దృశ్యం చూపరుల హృదయాలను కలచి వేసింది.మండలంలోని పెద్దపాళ్యం ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో వేపూరికోట పంచాయతీ కుటాగోళ్లపల్లెకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన పాఠకులకు తెలిసిందే. కె.చంద్రప్ప కుమారుడు కె.వెంకటేష్ (26), కె.వేమనారాయణ కుమారుడు తరుణ్ (21), కె.ఓబులేసు కుమారుడు కె.మనోజ్ (20)లు ములకలచెరువుకు వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు. వీరి అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదన చూపరులకు కంట తడిపెట్టించింది. ఉద్యోగాలు చేసుకుంటూ బెంగళూరులో ఉంటున్న ముగ్గురు ఒక్కసారిగా మృతి చెందడంతో కుటాగోళ్లపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బరువెక్కిన గుండెలతో మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. అదేవిధంగా బురకాయలకోట పంచాయతీ ఎరమాసివారిపల్లెకు చెందిన శ్రీనివాసులు (45) గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. ములకలచెరువు పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
14లోపు రైతులు పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవాలి
సిద్దవటం : పసుపు, ఉల్లి పంటలకు సంబంధించి బీమా వర్తింపు కోస ఈనెల 14లోపు రైతులు పంట బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఉద్యాన శాఖ అఽధికారి జయభరత్రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలంలోని బొగ్గిడివారిపల్లె గ్రామంలో సోమవారం పసుపు పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట బీమా కోసం ఈ– పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన కింద పసుపు, ఉల్లి పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 14 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందన్నారు. పసుపు పంటకు ఎకరాకు రూ. 180, ఉల్లి పంటకు ఎకరాకు రూ.90 చెల్లించాలన్నారు. పుసుపు పంటకు బీమా మొత్తం హెక్టారుకు రూ. 2, 25000, ఉల్లికి బీమా మొత్తం హెక్టారుకు రూ. 1,12,500 వర్తిస్తుందని తెలిపారు. -
పోలీసుల అదుపులో నిందితుడు
నందలూరు : నందలూరు పోలీసు స్టేషన్లో క్రైమ్ నెంబర్ 15/2022 కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న తిరుపతి పట్టణం కరకంబేడు వీధికి చెందిన చంద్ర రమేష్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను స్టోర్ బియ్యం విక్రయం కేసులో నిందితుడిగా ఉండి, కోర్టు వాయిదాలకు హాజరుకానందున కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. నిందితుడిని సోమవారం నందలూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించిందన్నారు. ఆటో ఢీకొని వృద్ధురాలి మృతికలికిరి : ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం కలికిరి పట్టణ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... కేవీ పల్లి మండలం నూతనకాల్వ గ్రామం దిండువారిపల్లికి చెందిన చింతపర్తి మంగమ్మ(82) కలికిరిలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా కలికిరి పట్టణానికి చెందిన సుబహాన్ ఆటోతో ఢీకొన్నాడు. ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మంగమ్మ కుమార్తె రామ కుమారి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవరు సుబహాన్పై కేసు నమోదు చేసినట్లు హెచ్సీ మదన్మోహన్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఉద్యోగిపై దాడి మదనపల్లె రూరల్ : మున్సిపల్ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. రామారావుకాలనీకి చెందిన సుధాకర్ మున్సిపాలిటీలో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. సోమవారం మధుసూదన థియేటర్ సమీపంలోని ఎస్కే.ఆయిల్ స్టోర్స్ వెనుకవైపున ఉన్న ఇంటిలో ఉండగా, కుటుంబ వివాదంలో భాగంగా గాంధీపురానికి చెందిన రాజా, రవి, ప్రదీప్ అనుచరులతో వచ్చి సుధాకర్పై దాడికి పాల్పడ్డారు. దాడిలో సుధాకర్ తీవ్రంగా గాయపడగా గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వన్టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రాజంపేట రూరల్ : జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం సైన్స్ విభాగంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024–2025లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తులను జేఎన్వీవైఎస్ఆర్డీఐఎస్టీఆర్ఐసీటీ జీ మెయిల్.కాం చిరునామాకు మెయిల్ చేయాలని కోరారు. -
శిల్పారామం తరహాలో టెర్రకోటకు అంగళ్లులో క్రాఫ్ట్ విలేజ్
కురబలకోట : తిరుపతి శిల్పారామం తరహాలో టెర్రకోట హస్త కళాకారుల సంక్షేమం కోసం కురబలకోట మండలంలోని అంగళ్లు బైపాస్ పక్కన క్రాఫ్ట్ విలేజ్ను ఏర్పాటు చేయిస్తామని రాష్ట్ర హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన అంగళ్లులోని టెర్రకోట సీఎఫ్సీ సెంటర్ను సందర్శించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ హస్తకళలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థిక వనరులను తీసుకు రావడంతో పాటు టెక్నాలజీని తీసుకు వస్తామన్నారు. ఈ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వస్తామన్నారు. ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్చే వీటికి ప్రమోషన్ కూడా చేయించి డిమాండ్ సృష్టించి తగిన ఆదాయ వనరులు పెంపొందేలా చూస్తామన్నారు. పీ–4 పథకంలో హస్త కళలను చేర్చామన్నారు. టెర్రకోట కళాకారులకు బంకమట్టి, మిషనరీ సౌకర్యం కల్పిస్తామన్నారు. శాలివాహన చైర్మన్ ఈశ్వర్, నియోజక వర్గ టీడీపీ నాయకులు డి. జయచంద్రారెడ్డి, పి. సాయినాఽఽథ్, సీఈఓ కృష్ణమూర్తి, టెర్రకోట సంఘ నాయకులు దుర్గం మల్లికార్జున, కంటేవారిపల్లె బాలాజీ, శ్రీనివాసులు, సురేంద్ర, పద్మావతమ్మ, కళావతి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్ -
నల్ల తుమ్మచెట్ల అక్రమార్కులపై చర్యలకు జేసీ ఆదేశం
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం మండల పరిధిలోని మంచూరు గ్రామ పంచాయతీలో వున్న తిమ్మిరెడ్డికుంట, కొత్తకుంటలో ఎలాంటి అనుమతులు లేకుండా నల్ల తుమ్మ చెట్లను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.జ్యోతి భర్త పి.సురేష్ విక్రయించి సొమ్ము చేసుకోవడంపై సోమవారం సాక్షిలో ‘నల్ల తుమ్మ చెట్లు అక్రమ రవాణా’ కథనం ప్రచురితమైంది. అలాగే మంచూరు గ్రామస్తులు శంకర్రెడ్డి తదితరులు సాక్షిలో ప్రచురితమైన కథనంతో సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జేసీ ఆదర్శ రాజేంద్రన్ నల్లతుమ్మ చెట్లు అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరిపి అక్రమదారులపై కేసు నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు డీపీఒ ఆదేశాల మేరకు మదనపల్లి డీఎల్పీఓ నాగరాజ సోమవారం సాయంత్రం మంచూరు పంచాయతీ పరిధిలోని తిమ్మిరెడ్డికుంట, కొత్తకుంటలను పరిశీలించారు. రెండు కుంటలలో కలిపి సుమారు 60 చెట్లకు పైగా కోసినట్లు గుర్తించామన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి తుమ్మచెట్ల వేలానికి గానీ, తరలింపునకు గానీ, కటింగ్కు గానీ ఎలాంటి అనుమతులు లేవని, అటవీశాఖ నుంచి మాత్రం కటింగ్ ఆర్డర్ ఉన్నట్లు తమ విచారణలో తేలిందని డీఎల్పీఒ వివరించారు. అలాగే గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించామన్నారు. గ్రామస్తుల వివరాలు, పంచాయతీ కార్యదర్శి వివరణ అనంతరం, విచారణ నివేదికను డీపీఓకు పంపనున్నట్లు డీఎల్పీఒ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి సుమతి, మంచూరు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ డీఎల్పీఓ వెంట పాల్గొన్నారు. -
అది అన్నదాత దుఃఖీభవ పథకం
రాయచోటి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అందించింది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ పథకమని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు వై.ఆరంరెడ్డి, రాష్ట్ర బూత్ వింగ్ జనరల్ సెక్రటరీ రహిమాన్ ఖాన్లు దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ రాష్ట విభాగం పిలుపు మేరకు సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతు సంఘం నాయకులు, సభ్యులు, రైతులు కూటమి ప్రభుత్వ నిరంకుశత్వ పోకడలపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో అన్నదాత సుఖీభవ అని నమ్మించి రైతులను నట్టేట ముంచిందన్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ. 2 వేలు జమ చేశారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ విడుదల చేయలేదన్నారు. పీఎం కిసాన్ కూడా కొంతమంది రైతులకు మాత్రమే వేసి మిగిలిన రైతులకు మొండి చేయి చూపారన్నారు. రైతులంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్నచూపే అని ఆరోపించారు. గతంలో మహానేత వైఎస్సార్ ఉచిత విద్యుత్ ప్రకటిస్తే విద్యుత్ తీగలపై రైతులు బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు విలయతాండవం చేస్తుందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 57 లక్షల మంది రైతులకు రైతు భరోసా ద్వారా సంక్షేమం అందిస్తే కూటమి ప్రభుత్వంలో 12 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ అందకుండా చేశారంటూ మండిపడ్డారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. -
బాధితులకు సత్వర న్యాయం అందించండి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోపు సత్వరం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ముఖాముఖిగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై సత్వరం స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం వడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తల సుబ్బమ్మ (70) తన సమస్యను చెప్పుకునేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ ఆమె వద్దకే వెళ్లి సమస్య విన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరిధిలో వృద్ధురాలి సమస్యను పరిష్కరించాలని లక్కిరెడ్డిపల్లి ఎస్ఐను ఆదేశించారు.పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి
నందలూరు : మండలంలోని చింతకాయపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు రేషన్షాపు మార్పిడి విషయమై ఘర్షణ పడ్డారు. ప్రభుత్వం మాది మేము చెప్పినట్లే వినాలంటూ టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకుడు చింతకాయల ఎల్లయ్యపై దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన చింతకాయల నరసింహులుపై కత్తితో దాడి చేయగా తలకు తీవ్ర గాయమైంది. చింతకాయల శేషాద్రిపై రాడ్తో దాడి చేయడంతో భుజానికి తీవ్రంగా గాయమైంది. క్షతగాత్రుడిని హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి బంధువులు తరలించారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసిన చుక్కా నీలేష్, చుక్కా కొండయ్య, చుక్కా చంద్ర, చుక్కా శశిధర్, చుక్కా మణెమ్మ, చుక్కా వెంకటేష్, చుక్కా చంద్రలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
పీలేరురూరల్ : తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పీలేరు మాజీ సర్పంచ్ ఎ.ఎస్. హుమయూన్ (65), ఆయన సోదరుడు షాజహాన్ (55) మృతి చెందగా, ఆయన కుమారుడు, వార్డు మెంబరు హబీబ్బాషా పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం తిలక్ వీధికి చెందిన మాజీ సర్పంచ్ ఎ.ఎస్. హుమయూన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చైన్నెలో చికిత్స పొందడానికి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి నుంచి కారులో బయలుదేరారు. అయితే ఉదయం 6.30 గంటల సమయంలో తిరుత్తణి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హుమయూన్, ఆయన సోదరుడు షాజహాన్ అక్కడి కక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హబీబ్బాషాను స్థానికుల సాయంతో తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చైన్నె అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మృతి చెందిన హుమయూన్ రెండు పర్యాయాలు పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా హుమయూన్ సోదరులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృత్యువులోనూ వీడని బంధం.. మాజీ సర్పంచ్ హుమయూన్కు తోడు నీడగా ఉంటున్న సోదరుడు షాజహాన్ మృత్యువు లోనూ వీడని బంధంగా మృతి చెందడంతో పలువురిని కలచివేసింది. ఒకే కుటుంబంలో అన్నాదమ్ములు ఇద్దరు మృతి చెందడం, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పీలేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలేరు మాజీ సర్పంచ్ హుమయూన్, ఆయన సోదరుడు మృతి కుమారుడి పరిస్థితి విషమం పీలేరులో అలుముకున్న విషాద ఛాయలు -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కొరియర్ వాహనం బోల్తా
సిద్దవటం : మండలంలోని సిద్దవటం గ్రామ సమీపంలో అన్నపూర్ణ భిక్షేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం కొరియర్ పార్సిల్ వాహనం రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వాహనం వంకలో బోల్తా పడింది. కడప నుంచి బద్వేలుకు సోమవారం కొరియర్ పార్సిల్ను తీసుకు వెళుతున్న వాహనం నేకనాపురం రహదారి దాటుకొని శ్రీ అన్నపూర్ణ భిక్షేశ్వర స్వామి ఆలయం వద్దకు రాగానే విద్యుత్ స్తంభాన్ని వాహనం ఢీకొనడంతో స్తంభం విరిగి పోయింది, వాహనం వంకలో బోల్తాపడింది. దీంతో సిద్దవటంలో 4 గంటల పాటు విద్యుత్కు అంతరాయం కలిగింది. వాహనంలో ఉన్న కిషోర్, చాంద్బాషా అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలు కావడంతో 108 వాహనంలో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
రూపానంద రెడ్డి అండతో ప్రభుత్వ భూమి కబ్జా
పుల్లంపేట : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పుల్లంపేట మండలం అనంతసముద్రం, కొమ్మనవారిపల్లి గ్రామాలలో టీడీపీ ఇన్చార్జి రూపానందరెడ్డి అండతో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయని పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంత సముద్రం గ్రామానికి చెందిన ముద్దా సుబ్బారెడ్డి ఆయన కుమారుడు ముద్దా సుభాష్లు 40 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించారని తెలిపారు. అనంత సముద్రంలో సర్వే నెంబరు. 326, 330/3, 331, 339/1, 1194/2లో ఉండే ప్రభుత్వ భూములే కాకుండా గ్రామ కంఠం సర్వే నెంబర్లకు సంబంధించి 327/2, 328, 329, 321/1లో ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలు ఆక్రమించుకున్నారన్నారు. అలాగే కేతు సుబ్బరామిరెడ్డి, కేతు రజనీకాంత్ రెడ్డిలు 13 ఎకరాల భూమిని సర్వే నెంబరు. 1089/1, 128/1, 129/1లలో ఆక్రమించుకున్నారన్నారు. అనంతసముద్రం ఎంపీటీసీ కుమారుని భూమిని సైతం ఆక్రమించారని తెలిపారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. -
ప్రతిభకు పరీక్ష
మదనపల్లె సిటీ : విద్యార్థులు పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంధన్ (వీవీఎం) పేరుతో జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆద్వర్యంలో ఎన్సీఈఆర్టీ, విజ్ఞాన్ ప్రసాద్,విజ్ఞానభారతి సంయుక్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నా, ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షకు 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోండిలా... విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష రాసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.200 చెల్లించి వీవీఎం అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. పరీక్ష జరిగే రోజు విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న మొబైల్, ల్యాప్టాప్, డెస్క్టాప్, డిజిటల్ పరికరాలలో ఏదైనా ఒక దాని ద్వారా నిర్దేశించిన అప్లికేషన్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. పుస్తకాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు. 6 నుంచి 8 తరగతులకు జూనియర్, 9 నుంచి 11 తరగతులకు సీనియర్ గ్రూపుగా విభజిస్తారు. ఇందులో తెలుగు, హిందీ, ఆంగ్లం తదితర ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభ మొదటి 20 మందిని ఎంపిక చేస్తారు. 6 నుంచి 11 తరగతులకు మొత్తం 120 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఇందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. వంద మార్కులకు పరీక్ష నమూనా పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30 తేదీల వరకు నిర్వహిస్తారు. ప్రధాన పరీక్ష నవంబర్ 19న అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జూనియర్, సీనియర్ రెండు విభాగాల్లో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 100 మార్కులుంటాయి. సెక్షన్–ఎలో విజ్ఞానశాస్త రంగంలో భారతీయ మేధావుల కృషి 20, శాంతి స్వరూప్ భట్నాగర్ జీవిత చరిత్ర నుంచి 20 ప్రశ్నలు, సెక్షన్–బిలో జూనియర్ ,సీనియర్ విద్యార్థులకు గణితం, ఫిజిక్స్,కెమిస్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి 50, లాజికల్ థింకిం గ్,, రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలుంటాయి. నగదు ప్రోత్సాహకాలు: జాతీయస్థాయిలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్డీఓ, ఇస్త్రో, సీఎస్ఐఆర్, బీఏఆర్సీ వంటి ప్రఖ్యా త జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో ఒకటి నుంచి మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్షిప్కు ఎంపిక చేస్తారు. 6 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అవకాశం విద్యార్థి విజ్ఞాన్ మంథన్కు దరఖాస్తుల ఆహ్వానం ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు తుది గడువు సెప్టెంబర్ 30 -
పరిసరాల శుభ్రతతోనే దోమల నివారణ
రాయచోటి : పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నివారణకు మార్గమని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సోమవారం రాయచోటిలోని ఎస్ఎన్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎగువ అబ్బవరం సచివాలయం, రాయుడు కాలనీలో ఏసీఎం స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, అంగన్ వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ దోమల నివారణకు స్ప్రేయింగ్ అనేది ప్రతి ఇంటికి చేయించుకోవాలన్నారు. 2027 నాటికి మలేరియా రహిత జిల్లాగా మార్చాలని ఆయన వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆ దిశగా సిబ్బంది ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి నవీన్, మలేరియా సబ్ యూనిట్ అధికారి జయరామయ్య, సూపర్ వైజర్ నూర్జహాన్, హెల్త్ అసిస్టెంట్ రవిశంకర్, రామచంద్ర, ఏఎన్ఎం రేష్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి
వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు ఒంటిమిట్ట : 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని, ఈ నెల 12న జరగబోయే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, మీ సత్తా కూటమి ప్రభుత్వానికి చూపించాలని మండల ప్రజలతో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే సుధా, కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చింతరాజుపల్లి, కోనరాజుపల్లి పంచాయతీల్లోని గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాని ప్రజలను కోరారు. అనంతరం మేడా రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..తప్పుడు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికతో బుద్ధిచెప్పాలన్నారు. ● ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ..సూపర్ సిక్స్ అంటు అధికారంలోకి వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అహంకారాన్ని అణిచేవిధంగా ఎన్నిక ఫలితాలు తీసుకురావాలని అన్నారు. ● ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ..రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమన్న టీడీపీ నేతలకు ఈ ఉప ఎన్నికల పలితాలు చెంప పెట్టుకావాలన్నారు. ● కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉన్న వారికి నిరుద్యోగ భృతిని ఇస్తానని మోసం చేసిన ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నిక ఫలితాలతో సిగ్గు రావాలన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ..రైతులకు ప్రతి ఏటా కేంద్రం ఇస్తున్న రూ. 2 వేలతో కలిపి రూ. 20వేలు ఇస్తానని రైతన్నను నిలువులా ముంచేసిన ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ఓడించాలన్నారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ఫించన్లు పెంచినట్లే పెంచి వెనుకల గోతులు తీసినట్లు సుమారు 1లక్ష 50 వేల మంది పింఛన్దారులను అనర్హులగా చేసిన సీఎం చంద్రబాబుపై ఈ ఉప ఎన్నిక సహాయంతో మీ తిరుగుబాటును చూపించాలన్నారు. – మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూనే ఒక పక్క రెడ్ బుక్ పరిపాలన సాగిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ రెడ్ బుక్ పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపే వారందరిపై అక్రమ కేసులు, హత్యా రాజకీయం, మహిళలపై అత్యచారాలు, దాడులు చేస్తూ శాంతి భద్రతలు అనేటివి మంటగలుస్తున్నాయి. అలాంటి అధికార పార్టీ ని ఓడించి శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. ● ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి మాట్లాడుతూ..రాజంపేట నియోజకవర్గంలో అధికార పార్టీ రాజు లేని రాజ్యంగా తయారైందన్నారు. ఒంటిమిట్ట మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి మండల నాయకులు, కార్యకర్తల మధ్య సఖ్యత లేక వర్గ పోరుతో వారి ఉనికిని కాపాడుకునేందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అలాంటి వారిని మనం గెలిపించినా ఉపయోగం ఉండదన్నారు. ● రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ..ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపిస్తే మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, మండల అభివృద్ధి ముందుకు పోతుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి, రాజంపేట బీసీ సెల్ అధ్యక్షుడు రాజమోహన్నాయుడు, కోనరాజుపల్లి సర్పంచ్ శేఖర్రెడ్డి, ఒంటిమిట్ట మండల పంచాయతీ రాజ్ అధ్యక్షుడు మేరువ శివనారాయణ, వైఎస్సార్సీపీ మండల ప్రచార విభాగం అధ్యక్షుడు రాజశేఖర్రాయల్, జంగాల శివశంకర్ పాల్గొన్నారు. -
పటిష్ట బందోబస్తు ఏర్పాటు : ఎస్పీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీన ఒంటిమిట్ట మండలంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించామన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్ సుధాకర్, కడప టౌన్ డీఎస్పీ ఎ వెంకటేశ్వర్లు, స్పెషల్ ప్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆర్ పురుషోత్తం రాజు, ఒంటిమిటట సిఐ టి బాబు, సిద్దవటం ఎస్ఐ ఎం మహమ్మద్ రఫీ, సిబ్బంది పాల్గొన్నారు. -
సత్వరమే సమస్యల పరిష్కారం
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు బాధ్యతగా పనిచేసి వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి అధికారులు ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 12న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రాయచోటి జగదాంబసెంటర్ : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జాతీయ నులిపురుగల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు , పిల్లలు మరియు కిశోర బాలలకు (ఒక సంవత్సరం నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు) ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నుట్ల జిల్లా కలెక్టర్ శ్రీధర్చామకూరి తెలిపారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మీనరసయ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది శివప్రతాప్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ -
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మదనపల్లె సిటీ/ములకలచెరువు: ఆర్టీసీ బస్సు మోటార్బైక్ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన విషాద ఘటన ఇది. వీరు ముగ్గురు చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలు. అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం, వేపూరికోట పంచాయతీ, పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వేపూరికోట పంచాయతీ కూటగుళ్లోపల్లికి చెందిన వేమనారాయణ, శ్యామల కుమారుడు కె.తరుణ్ (24), చంద్రప్ప, నాగరత్నమ్మల కుమారుడు కె.వెంకటేష్ (20), ఓబులేసు, కవితమ్మల కుమారుడు కె.మనోజ్ (19) మోటార్బైక్పై ములకలచెరువుకు బయలుదేరారు. ఆ ఊరిలో ఉండే వెంకటేష్ మిత్రుడు స్నేహితుల దినోత్సవం కేక్ కట్ చేసుకుందామని పిలవడంతో ములకలచెరువు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో పెద్దపాలెం ఫ్లైవర్ వద్ద ములకలచెరువు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్ను ఢీకొంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తరుణ్ బెంగుళూరులో సిగ్విలో డెలివరీ బాయ్గా, వెంకటేష్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు.మనోజ్ కాలేజీలో చదువుకుంటున్నాడు. వీరు బెంగళూరులో రూము అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ముగ్గురు అవివాహితులు. స్వగ్రామానికి శనివారం వచ్చారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ములకలచెరువు ఎస్.ఐ నరసింహుడు, సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కూటగుల్లోపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. -
మద్యానికి బానిసలై ఇద్దరి మృతి
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో మద్యానికి బానిసైన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలోని బసినికొండకు చెందిన లక్ష్మన్న, పద్మ దంపతుల కుమారుడు పవన్ (40)కు 15 సంవత్సరాల క్రితం భారతితో వివాహం కాగా, పెళ్లయిన ఏడాదికే ఆమె అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అప్పటినుంచి పవన్ మద్యానికి బానిసై, పనులకు వెళ్లకుండా నిత్యం మద్యం తాగుతూ ఉండేవాడు. ఆదివారం బసినికొండ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద, అతిగా మద్యం తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. అదేవిధంగా పట్టణంలోని మార్పురి వీధికి చెందిన ఖాదర్ బాషా కుమారుడు షరీఫుద్దీన్ (38) మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి పనులకు వెళ్లకుండా నిత్యం మద్యం తాగేవాడు. అతని భార్య హమీదా స్థానికంగా కూలి పనులకు వెళ్తూ కుమారుడిని కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె పనులకు వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాగా, భర్త షరీఫుద్దీన్ అపస్మారక స్థితిలో పడి ఉండగా, గమనించి వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి స్థానికుల సాయంతో తరలించింది. పరీక్షించిన వైద్యులు బాధితుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఇంటికి తీసుకువెళ్లారు. -
లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా మారిన ఘటన ఆదివారం మదనపల్లి మండలంలో జరిగింది. వేంపల్లి దళితవాడకు చెందిన శంకర (52) బెంగళూరు రోడ్లో సప్లయర్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ద్విచక్ర వాహనంలో వ్యక్తిగత పనులపై చీకల బైలుకు వెళ్తుండగా, మార్గమధ్యంలోని బార్లపల్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని స్థానికులు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ట్రాక్టర్ అదుపు తప్పి వ్యక్తి మృతి
కలకడ : ట్రాక్టర్ అదుపు తప్పి ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. శనివారం రాత్రి కలకడ మండలంలోని రాతిగుంటపల్లె పంచాయతీ, బట్టావారిపల్లె సమీపంలోని టమాటా పంట సాగుకు వినియోగించే సీడ్స్ కర్రలను కలకడ మండలంలోని దేవులపల్లెకు తరలిస్తుండగా రాతిగుంటపల్లె పంచాయతీ లక్ష్మీపురం గ్రామం మలుపువద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దేవులపల్లెకు చెందిన వెంటరత్నం(38) అక్కడికక్కడే మృతి చెందగా, గుర్రంకొండ మండలం మర్రిమేకలవారిపల్లె దళితవాడకు చెందిన నరసింహులుకు కాలు విరిగి తీవ్ర రక్తగాయాలయ్యాయి. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కారును ఢీకొన్న ద్విచక్ర వాహనంరామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ దళితవాడ సమీపంలో ఆదివారం ఆగి ఉన్న కారును టీవీఎస్ ఎక్సెల్ ఢీకొన్న సంఘటనలో బోనంశెట్టి రవీంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు రామాపురం పోలీసులు తెలిపారు. కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న టీఎన్ 01ఏఈ 7263 నెంబర్ గల కారు గువ్వలచెరువు దళితవాడ సమీపంలో ఆగి ఉండగా వెనుకవైపు నుంచి సరస్వతిపల్లెకు చెందిన బోనంశెట్టి రవీంద్ర ఏపీ02బివి 8652 నెంబర్ గల టీవీఎస్ ఎక్సెల్లో వస్తూ ప్రమాదవశాత్తు కారును ఢీకొన్నాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్లట్లు రామాపురం పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి ములకలచెరువు:గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మండలంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథ మేరకు... బురకాయలకోట పంచాయితీకి చెందిన శ్రీనివాసులు(45), రిజ్వాన్(50) లు ద్విచక్ర వాహనంలో ములకలచెరువులో జరిగిన వివాహ వేడుకకు వెళ్లారు. తిరిగి బురకాల కోటకు వస్తుండగా వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు సంఘటన స్థలంలో మృతి చెందాడు. రిజ్వాన్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరికి తీవ్ర గాయాలు -
నల్లతుమ్మ చెట్ల అక్రమ రవాణా
కలికిరి(వాల్మీకిపురం) : ప్రభుత్వ, అటవీ భూముల్లో చెట్లను నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అటవీ చట్టం 1967, ఏపీ వాల్టా 2002 చట్టం మేరకు చెట్లను నరికివేయడం నిషేధం. ప్రభుత్వ ప్రయోజనాలకు అవసరమైతే సంబంధిత జిల్లా కలెక్టర్కుగానీ, జిల్లా అటవీశాఖ అధికారికి గానీ ఫారం–13 మేరకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా స్థాయి అధికారులు సదరు ప్రాంతాన్ని పరిశీలించి చెట్ల నరికివేతకు అనుమతులు ఇవ్వాలా లేదా అని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఆయా గ్రామస్తుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం మండలం మంచూరు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ జ్యోతి, భర్త సురేష్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ భూములలోని ఏళ్ల నాటి నల్లతుమ్మ చెట్లను విక్రయించి సొమ్ముచేసుకున్న ఘటన వెలుగు చూసింది. మంచూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 409లో గల తిమ్మిరెడ్డికుంటలో చెట్ల నరికివేతకు అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారుల నుంచి అనుమతులు పొందాడు. కేవలం చెట్లు కత్తిరించేందుకు మాత్రమే అటవీశాఖ అధికారులు అనుమతులు జారీ చేశారు. ఇదే అదనుగా భావించిన సురేష్ తన భార్య పదవిని అడ్డుపెట్టుకుని తిమ్మిరెడ్డికుంట సమీపంలోని కొత్తకుంటపై కన్నేసి ఆ కుంటలోని చెట్లను అక్రమంగా విక్రయించేశాడు. అయితే అటవీశాఖ అధికారులు కలప ట్రాన్స్పోర్ట్కు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు. నల్లతుమ్మ కొయ్య కలపకు మంచి డిమాండ్ ఉండటంతో వాల్మీకిపురానికి చెందిన కొయ్య వ్యాపారులు అక్రమంగా నల్లతుమ్మ కలపను తరలించినట్లు సమాచారం. ప్రభుత్వ భూముల్లో చెట్ల నరికివేతపై గ్రామస్తులు ప్రశ్నించినా పంచాయతీ కార్యదర్శిగానీ, సర్సంచ్గానీ సమాధానం చెప్పక పోవడంతో గ్రామస్తులు ఇప్పటికే మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దారుకు ఫిర్యాదు చేసి అక్రమాలపై వినతిపత్రాలు అందజేశారు. వారు స్పందించక పోవడంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల్లో చెట్ల నరికివేతలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని, అక్రమాలకు అధికారులు వత్తాసు పలికారని, క్షేత్ర స్థాయిలో ఉన్నతాధికారులు విచారిస్తే నిజానిజాలు వెలుగు చూస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటవీశాఖ అధికారుల చేతివాటం.. తరిగొంట అటవీ బీట్ పరిధిలోని మంచూరు గ్రామ పంచాయతీలోని తిమ్మిరెడ్డికుంటలో ఉన్న నల్లతుమ్మచెట్ల నరికివేతకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతులు మంజూరుకు, అనుమతులు లేని మరో కొత్తకుంటలో చెట్ల నరికివేతకు సంబంధిత అటవీ బీట్ అధికారి సుబ్బలక్ష్మీ, ఇన్చార్జి సెక్షన్ అధికారి సుధాకర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కొత్తకుంట, తిమ్మిరెడ్డికుంట నుంచి కలప అనుమతులు లేకుండా తరలుతున్నా కేవలం నామమాత్రంగా ఒక టన్నుకు మాత్రమే జరిమానా విధించి రశీదు ఇచ్చారు. విక్రయదారు, కలప వ్యాపారుల నుంచి అటవీశాఖ అధికారులకు మామూళ్లు ముట్టడంతోనే కలప ట్రాన్స్పోర్ట్కు అనుమతులు లేకున్నా చూసీ చూడనట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమాలపై విచారణ జరిపించాలి మంచూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తకుంట, తిమ్మిరెడ్డికుంటలలో సుమారు 50 ఏళ్ల కాలం నాటి నల్లతుమ్మచెట్లను నరికివేశారు. గ్రామస్తులు అభ్యంతరం తెలిపినా అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదు. చెట్లను విరివిగా నాటాలని, కాపాడాలని ప్రభుత్వాలు చెబుతున్నా ఇలా చెట్లను నరికివేయడం అన్యాయం. ప్రభుత్వ భూములలో చెట్లు అక్రమంగా నరికివేతపై సమగ్ర విచారణ చేపట్టాలి. – శంకర్రెడ్డి, మంచూరు గ్రామం అడ్డగోలుగా ప్రభుత్వ కుంటలలో చెట్ల విక్రయం అటవీశాఖ అధికారుల చేతివాటంతో యథేచ్ఛగా తరలిస్తున్న వైనం స్థానికుల అభ్యంతరాలను పట్టించుకోని అధికారులు -
ఆటో ఢీకొని..
మదనపల్లె రూరల్ : ఆటో ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. మదనపల్లె పట్టణం అగడ్తలవీధికి చెందిన ఉదల్సింగ్ కుమారుడు నవీన్సింగ్(24) బి.కొత్తకోట మండలం గట్టులో నూతన వస్త్ర దుకాణం ప్రారంభించాడు. రాత్రి మదనపల్లె నుంచి ద్విచక్రవాహనంలో గట్టుకు బయలుదేరి వెళుతుండగా, మార్గమధ్యంలోని విశ్వం కాలేజ్ సమీపంలోని పెట్రోల్బంకు వద్ద ఆటో మలుపు తిరుగుతుండగా వేగంగా వెళ్లి ఢీకొన్నాడు. ప్రమాదంలో నవీన్సింగ్ తీవ్రంగా గాయపడగా, ఆటోడ్రైవర్ సునీల్(25) స్వల్పంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. -
సెప్టెంబర్ 8 నుంచి కడపలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : సెప్టెంబర్ 8,9,10, తేదీలలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు కడప నగరంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం కడప నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పంపిణీ –సాగునీరు – పారిశ్రామిక అభివృద్ధి అనే అంశంపై రాష్ట్ర సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కౌన్సిల్ సమావేశాలకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 200 మంది జాతీయ నాయకులతో పాటు కేరళ, బెంగాల్, త్రిపుర, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎన్నికై న ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని పేదలకు భూ పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఉంటే ప్రభుత్వ భూముల్లో ఉంటాము– లేకుంటే జైల్లో ఉంటాము‘ అనే నినాదంతో వ్యవసాయ కార్మికులందరూ గ్రామ, గ్రామాన దండుగా ఐక్య భూ పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భూమిలేని గ్రామీణ నిరుపేదలకు భూ పంపిణీ చేస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి, ప్రతి వ్యవసాయ కార్మికునికి రోజువారీ కూలి 1000 రూపాయలు ఇస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ, అదానీలకు 20 లక్షల కోట్ల ఆదాయం పెంచారని, వ్యవసాయ కార్మికులకు రోజువారి ఆదాయం 200 కూడా పెంచలేదని విమర్శించారు. జిల్లాలో మొదటి విడతగా 7 మండలాల్లో 20 గ్రామాలలో భూ పోరాటాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఐ.ఎం.సుబ్బమ్మ, చేతి ఉత్పత్తిదారుల సంఘం జిల్లా నాయకులు వి.పి.బయన్న, వీ.శివ నారాయణ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.చిన్ని, వి.శివకుమార్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళా ప్రయాణికురాలిపై దురుసు ప్రవర్తన
వేంపల్లె : రాయచోటి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో కండక్టర్ మహిళా ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించాడు. ఆదివారం వేంపల్లె–రాయచోటి బస్సులో కండక్టర్ మహిళ మెడపై చెయ్యి వేసి నెట్టి ఆమెను దుర్భాషలాడాడు. ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్దాం పద అన్న తర్వాత కండక్టర్ తగ్గాడు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి డిపో బస్సులోనే ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రయాణికులు మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికి కారడం దారుణం.. వేంపల్లె – రాయచోటికి ప్రయాణించే ఆర్టీసీ బస్సు చాలా దారుణంగా ఉందని ప్రయాణికులు మండిపడ్డారు. ఆదివారం రాయచోటి డిపోకు చెందిన ఏపీ02జెడ్ 0254 నంబర్ గల ఏపీఎస్ ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ప్రయాణికులు మొత్తం వర్షపు నీటితో తడిచిపోయారు. వర్షం పడితే ఆ బస్సులో ప్రయాణికులు స్నానం చేసినట్లే అని వాపోతున్నారు. ఈ బస్సులో ప్రతి కిటికీకి అద్దం ఒకటే ఉంది. రాయచోటి ఆర్టీసీ డీఎం గమనించి ఇలాంటి పాతబడిన, కాలం చెల్లిన బస్సులను నడపొద్దని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్సీపీ జోరుగా ఇంటింటి ప్రచారం చేసింది. ఆదివారం మండల పరిధిలోని దర్జిపల్లి, గొల్లపల్లి, దవంతరపల్లి, నరసన్నగారిపల్లి, పెన్నపేరూరు, తప్పెటవారిపల్లి గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ జిల్లా ప్రజా పరిషత్కు సంబంధించిన నిధులు మండల అభివృద్ధికి వినియోగించాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీకి వేసే ప్రతి ఓటు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిన మోసానికి చెప్పపెట్టు అన్నారు. సోమశిల ముంపు వాసులకు నష్టపరిహారం అప్పటి ప్రభుత్వం తక్కువగా ఇస్తే ఇక్కడి రైతులతో కలిసి తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి మాట్లాడుతూ తనపై వైఎస్సార్సీపీ పెట్టుకున్న నమ్మకానికి మండల ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకొని, ఉప ఎన్నికలో తప్పక విజయం సాధించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి, ఒంటిమిట్ట మండల పంచాయతీ రాజ్ అధ్యక్షుడు మేరువ శివనారాయణ, గొల్లపల్లి సర్పంచ్ దున్నూతల లక్ష్మీనారాయణరెడ్డి, పెన్నపేరూరు ఎంపీటీసీ ముమ్మడి నారాయణరెడ్డి, కొత్తమాధవరం 1,2,3 వార్డుల సర్పంచ్ చేపూరి ఓబయ్య, మండల ప్రచారం విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం సహకరిస్తేపతకాలు సాధిస్తాం
శాప్ డైరెక్టర్ రమణరావు కడప రూరల్: ప్రభుత్వం సహకరిస్తే పతకాలు సాధిస్తామని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ డైరెక్టర్ (శాప్) ఆరికపూడి రమణరావు అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. శాప్ చైర్మన్ ఆదేశాల మేరకు కడప క్రీడా పాఠశాలను తనిఖీ చేశామన్నారు. ఈ సందర్భంగా క్రీడా మైదానాలు, క్రీడాకారుల మౌలిక సదుపాయాలను పరిశీలించామన్నారు. అలాగే క్రీడాకారులతో మాట్లాడామని తెలిపారు. క్రీడల్లో పతకాలు సాధించాలంటే నిధుల అవసరం ఎంతో ఉంటుందన్నారు. క్రీడలకు బడ్జెట్లో అధిక శాతం నిధులు కేటాయించినపుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించవచ్చన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తే పతకాలను సాధిస్తామని తెలిపారు. మరో డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు వేల మంది ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారని, మరో రెండు వేల మంది ఫిజికల్ డైరెక్టర్లు రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్లు తమ సమస్యలను విన్నవించి పరిష్కరించాలని కోరారు. జిల్లా స్కూలు గేమ్స్ సెక్రటరీ అరుణకుమారి, రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ ప్రవీణ్ కిరణ్, వ్యాయామ ఉపాద్యాయులు సాజిద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలి
కడప కార్పొరేషన్: పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరుగుతున్న జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అనుంబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార టీడీపీ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుందన్నారు. పోలీసులను ఉపయోగించి వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు కూడా బనాయిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ 14 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రూ.1.87లక్షల కోట్లు అప్పులు చేసి ఏ ఒక్క సంక్షేమ పథకమూ సక్రమంగా అమలు చేయలేద న్నారు. తల్లికివందనం, అన్నదాత సుఖీభవ పథకాల్లో లబ్ధిదారులను కోత కోశారన్నారు. ప్రశ్నించే వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. ఈ దుర్మార్గ పాలనను ప్రజలు గమని స్తున్నారని, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రచార కార్యక్రమంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొని ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, పాకా సురేష్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్.వెంకటేశ్వర్లు, టీపీ వెంకటసుబ్బమ్మ, జాషువా, ఆదిత్యతదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి పిలుపు -
మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 5.30 గంటలకు, 6.30 గంటలకు మదనపల్లె డిపో నుంచి బయలుదేరి మల్లయ్యకొండకు చేరుతుందన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసు నడుస్తుందన్నారు. భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదికరాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 4వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలోని మదనపల్లె మండలం వలసపల్లెలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.గీత ఒక ప్రకటనలో తెలిపారు. 2024 –2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. www.navodaya.gov.in అనే వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన అనంతరం ఆఫీస్ పనివేళల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ప్రిన్సిపాల్ తెలియజేశారు. వెలిగల్లు కుడికాలువకు నీరు విడుదల గాలివీడు: రైతుల సంక్షేమమే ధ్యేయమని రాష్ట్ర యువజన,రవాణా,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం తన సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులతో కలసి మండలంలోని వెలిగల్లు జలాశయం కుడికాలువ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతుల సౌకర్యార్థం కుడికాలువ ద్వారా నీటిని 0.5 టీఎంసీలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వెలిగల్లు జలాశయంలో ప్రస్తుతం 2.681 టీఎంసీల నీరు నిల్వ ఉందని, అందులో లైవ్ స్టోరేజ్ 1.47 టీఎంసీలు కాగా, తాగునీటి కోసం 0.40 టీఎంసీలు కేటాయించినట్లు తెలిపారు. చెస్లో క్రీడాకారుల ప్రతిభ కడప వైఎస్ఆర్ సర్కిల్: బెంగుళూరులో జరిగిన 3వ చెస్ ప్యూషన్ నేషనల్ లెవల్ చెస్ టోర్నమెంట్లో జిల్లాకు చెందిన చెస్ క్రీడాకారులు ప్రతిభ చాటారని చెస్ కోచ్ అనీష్ దర్బారీ పేర్కొన్నారు. బెంగుళూరులోని గోల్డోన్ బీ గ్లోబల్ స్కూల్లో జరిగిన 3వ చెస్ ప్యూషన్ నేషనల్ లెవల్ చెస్ టోర్నమెంట్లో అండర్–8లో బాలికల విభాగంలోజిల్లాకు చెందిన వినమత్ర 5 స్థానంలో నిలిచి ట్రోపీ గెలుచుకుందన్నారు. అండర్ –10లో బాలికల విభాగంలో ప్రొద్దుటూరు చెందిన ధనిత 8వ స్థానంలో నిలిచి మెడల్ అందుకుందన్నారు.మొత్తం 7 రౌండ్లలో జిల్లా చెస్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచినట్లు కోచ్ పేర్కొన్నారు. కాగా కాగా సీనియర్స్ విభాగంలో చెస్ కోచ్ అనీష్ దర్బారీ ప్రథమ స్థానంలో నిలిచి నగదు బహుమతి అందుకోవడం విశేషం. పోలీసుల గస్తీ సిద్దవటం: సిద్దవటం పెన్నానదిపై ఉన్న లోలెవల్ కాజ్వే పై పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ సుబ్బరామచంద్ర మాట్లాడుతూ సిద్దవటం వద్ద పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆదివారం పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారన్నారు. ఒంటిమిట్ట సీఐ బాబు, సిద్దవటం ఎస్ఐ సూచనల మేరకు కాజ్వేపైన పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా మందస్తు చర్యగా అక్కడికి పర్యాటకులను రానివ్వలేదన్నారు. ఉదయం చేపలు పట్టే వారు వస్తే వారిని కూడా పంపిచేశామన్నారు.కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి నదిలోకి దిగుతారనే ఉద్దేశంతో కాజ్వే వద్ద ఉన్నామని ఏఎస్ఐ తెలిపారు. -
ఏకశిలానగిరిలో జెడ్పీ ఎన్నికల సందడి!
రాజంపేట: ఒంటిమిట్ట కోదండరామస్వామి క్షేత్ర మైన ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లో జెడ్పీ ఎన్నికల సందడి మొదలైంది. శుక్రవారంతో జిల్లా పరి షత్ ప్రాదేశిక నియోజకవర్గ (జెడ్పీటీసీ) స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 5వ తేదీవరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను నిర్వహించనున్నారు. 12న పోలింగ్, 14న కౌంటింగ్ ప్రకియ జరగనుంది. రాష్ట్ర అధికారిక రామాలయం కలిగిన ప్రాంతం కావడంతో ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ● 1994–1995లో జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజకవరక్గ సభ్యుల ఎన్నిక ప్రారంభమైంది. తొలి జెడ్పీటీసీగా 1995లో తోకా నరసింహులు ఎన్నికయ్యారు. అనంతరామయ్య, ఇరంగరెడ్డి రాజ్యలక్ష్మీ, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఆకేపాటి అమరనాఽథరెడ్డిలు జెడ్పీటీసీలుగా ఒంటిమిట్టకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే,వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి ఒంటిమిట్ట నుంచి జిల్లా పరిషత్ చైర్మన్కు ఎంపికయ్యారు. అలాగే ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కూడా జిల్లాపరిషత్ వైస్చైర్మన్గా ఎంపికయ్యారు. ● జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలంలో 30 పోలింగ్ బూత్లు, 17 పోలింగ్ కేంద్రాలు ఉన్నా యి. పకడ్బందీగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లలిలా.. మండలంలో 24,606 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,556 మహిళలు, పురుషులు 12,050 మంది ఉన్నారు. ఎన్నికల అధికారుల ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చారు. తేలని కూటమి అభ్యర్ధి ఎంపిక కూటమి పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయం ఇంకా తేలలేదు. వర్గాల వారీగా నామినేషన్లు దాఖాలు చేసుకున్నారు. పార్టీ బీ–ఫాం ఎవరికి ఇస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది. ముద్దుకృష్టరెడ్డి అడ్డలూరు,కడప బాబుసాహెబ్, బొడ్డె వెంకటరమణ(2సెట్లు), దున్నతల రఘరాంరెడ్డి,వెంకటేశ్ నంద్యాల,వెంకటసుబ్బయ్య ఆలూరు, కుమారి శివరామకృష్ణారెడ్డి, నల్లగొండు వెంకటసుబ్బారెడ్డిలు నామినేషన్లు వేశారు అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే టీడీపీ బీ–పాం ఇస్తుందనే భావనలు కూటమి వర్గాల్లో కొనసాగుతున్నాయి. ● కాంగ్రెస్ పార్టీ నుంచి రాజంపేటకు చెందిన బలిజ సామాజికవర్గానికి చెందిన పూలభాస్కర్ నామినేషన్ దాఖాలు చేశారు. వైఎస్సార్సీపీ నుంచి.. వైఎస్సార్సీపీ నుంచి ఇరగంరెడ్డిసుబ్బారెడ్డి, ఇరగంరెడ్డి శ్రీకర్రెడ్డిలు నామినేషన్లు దాఖాలు చేశారు. ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబులు సుబ్బారెడ్డి గెలుపు కోసం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒంటిమిట్ట నుంచే జెడ్పీ పీఠంపై ఆకేపాటి ఒంటిమిట్ట జెడ్పీటీసీగా ఉన్న సమయంలో ఆకేపాటి అమరనాఽథరెడ్డి జిల్లాపరిషత్ చైర్మన్గా నియమితులైయ్యారు. తనదైన రీతిలో జిల్లాపరిషత్ పరంగా ప్రజలకు సేవలందించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జెడ్పీటీసీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అన్నమయ్య వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ప్రచారంలో ముందంజలో వైఎస్సార్సీపీ కూటమిలో అభ్యర్థుల ఎంపిక గందరగోళం -
గల్ఫ్ సమస్యల పరిష్కారానికి కృషి
రాజంపేట: గల్ఫ్వాసుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డిఅన్నారు. ఆదివారం మేడా భవన్లో వైఎస్సార్సీపీ గల్ఫ్ నేతలు ఆయనను కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. గల్ఫ్ దేశాల నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయంలో రాకపోకలను కొనసాగించేలా తన వంతు కృషి చేస్తానన్నారు. గల్ఫ్ దేశాల్లో వైఎస్సార్సీపీ నేతల సేవలు ప్రశంసనీయమన్నారు.కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, అడ్వైజర్ మహేశ్వర్రెడ్డి, కో కన్వీనర్ మన్నూర్ చంద్రశేఖర్రెడ్డి, గల్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు వి.పి రామచంద్రారెడ్డి, పులపత్తూరు సురేష్రెడ్డి, ఎన్ఆర్ఐలు రాజాసాబ్, గోపాలరెడ్డి పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎలక్షన్ ఆఫీసర్ నిత్యపూజయ్య ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరణ చేపట్టగా అన్ని పోస్టులకు ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలు అయ్యాయి. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇందులో ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా సురేష్, కార్యదర్శిగా వెంకటసుబ్బయ్య, వైస్ ప్రెసిడెంట్గా ఖాదర్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీగా మల్లికార్జునరాజు, ట్రెజరర్గా రాధాకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివప్రసాద్, ఉమెన్ సెక్రటరీగా ఇందుమతి, ఈసీ మెంబర్లుగా బాలనరసయ్య, శివప్రసాద్, చరణ్లు ఎన్నికయ్యారు. ● రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి -
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ చిన్నమండెం: ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. చిన్నమండెం మండల కేంద్రంలోని 2వ సచివాలయం వద్ద అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రతి రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా రూ.6 వేలు కలిపి సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగిస్తూ ఇది తక్కువ ఖర్చుతో కూడిన స్థిరమైన వ్యవసాయ విధానమని, ఇది భూమి ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలుగా ఉంటుందని వివరించారు. మండిపల్లి లక్ష్మీప్రసాద్రెడ్డి, జేడీఏ శివనారాయణ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) వెంకటమోహన్, డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్నారాయణ, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
హార్సిలీహిల్స్లో ముమ్మరంగా తనిఖీలు
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ను శనివారం సాయంత్రం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొండపై ఇప్పటిదాకా పోలీసుల తనిఖీలు లేకపోవడటంతో బైక్లపై విన్యాసాలు, బహిరంగంగా మద్యం తాగడం, వచ్చే పర్యాటకులకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉండటం లేదు. దీనిపై స్పందించిన మదనపల్లె డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో స్థానిక సీఐ జీవన్ గంగనాధ్బాబు, మదనపల్లె తాలూకా సీఐ సత్యనారాయణ, ముదివేడు, ములకలచెరువు, మదనపల్లె రూరల్, పెద్దతిప్పసముద్రం ఎస్ఐలు దిలీప్కుమార్, రామచంద్ర, చంద్రమోహన్, హరిహర ప్రసాద్లు, 50 మంది కానిస్టేబుళ్లతో తనిఖీలు నిర్వహించారు. ఘాట్రోడ్డుపై వస్తున్న బైక్లను తనిఖీ చేసి లైసెన్సులు ఉన్నాయా లేదా, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు బైక్లు నడపడం లాంటి వాటిపై చర్యలు తీసుకున్నారు. ఘాట్రోడ్డు ప్రయాణంలో సాహస విన్యాసాలకు పాల్బడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని బైకర్లను హెచ్చరించారు. కొండపై ఉన్న అతిథి గృహాల నిర్వాహకులతో మాట్లాడారు. అతిథి గృహాల్లో విడిదిచేసే పర్యాటకులు ఎక్కడినుంచి వచ్చారో వారి వివరాలు, చిరుమానాలు సేకరించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగినా తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ మహేంద్ర, సీఐ జీవన్ గంగానాథ్బాబు నిర్వాహకులను, టూరిజం సిబ్బందిని కోరారు. అనంతరం గాలిబండ అంచులోకి వెళ్తున్న పర్యాటకులను ఆపి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
5న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు
రాయచోటి టౌన్: రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 5వ తేదీ ఎలక్ట్రికల్ (ఈఈఈ), ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ) కోర్సుల కోసం స్పాట్ అడ్మిషన్ల నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శివశంకర్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు నేరుగా సంబంధిత సర్టిఫికెట్లతో రావాలని కోరారు.అభ్యర్థులు 10వ తరగతి మార్కుల మెమో, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సరిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్లతో పాటు ఓసీ/ బీసీలు అయితే రూ.5800, ఎస్సీ, ఎస్టీలు అయితే 5500లు ఫీజు చెల్లించా లని సూచించారు. విద్యార్థులకు హాస్టల్ సౌక ర్యం కూడా ఉందన్నారు. మరిన్ని వివరాలకు 9505504213/9000389029/ 98665 05119 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. రెడ్డెమ్మతల్లికి కాసులహారం బహూకరణ గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి భక్తులు బంగారు కాసుల హారాన్ని బహూకరించారు. శనివారం రాజంపేటకు చెందిన రెడ్డివరప్రసాద్, ఆయన కుమారుడు మనోజ్కుమార్లు రూ. 2లక్షలు విలువ చేసే బంగారు కాసుల హారాన్ని అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఈసందర్బంగా దాతలకు అర్చకులు, సిబ్బంది ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేయించారు. అమ్మవారి శేషవస్త్రంతో వారిని సత్కరించారు. అనంతరం దాతలు బంగారు కాసుల హారాన్ని ఆలయ ఈవో మంజులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు. ఏఐతో పల్లెల్లో ప్రగతి బాటలు కురబలకోట: గ్రామీణ ప్రాంతాల సాధికారిత కల్పనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని తిరుపతి శ్రీ సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసిస్టెఽంట్ ప్రొఫెసర్ బుల్లా రాజేష్ అన్నారు. అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో గ్రామీణ సమాజాల సాధికారత కల్పనలో ఏఐ పరివర్తన పాత్రపై మూడు రోజుల పాటు జాతీయ సెమినార్ నిర్వహించారు. శనివారం ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌళిక సదుపాయాల అభివృద్ధి వరకు ఏఐ ఉపయోగాలు ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు. స్మార్ట్ అగ్రికల్చర్తో పాటు గ్లోబల్ మార్కెటింగ్ రానుందన్నారు. పలమనేరు మధర్ ధెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ అంతరాన్ని ఏఐ తగ్గిస్తోందన్నారు. స్కిల్డెవలప్మెంట్తో ఉపాధి అవకాశాలు రాజంపేట: నేటి పోటీ ప్రపంచంలో స్కిల్ డెవలప్మెంట్తో ఉపాధి అవకాశాలు అధికంగా వస్తాయని ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి అన్నారు. అన్నమాచార్య పీజీ కాలేజీ ఆఫ్ కంప్యూటర్ స్టడీస్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు సీజిర్ జ్ఞానామృతధార స్కీం ద్వారా అడ్వాన్స్ ఏఐ ప్రోగ్రామింగ్ టూల్స్ అనే అంశానికి సంబంధించి సర్టిఫికెట్ కోర్సుపై ఉచితశిక్షణ ఇచ్చి, సరిఫికెట్స్ను అందచేసే కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు ఆధునిక పరిజ్ఞానం,మెలకవల గురించి తెలుసుకోవాల్సిన ఆవశకత్య ఉందన్నారు. కార్యక్రమంలో అన్నమాచార్య యూనివర్సిటీ వీసీ సాయిబాబారెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ .డీజె సమతానాయుడు. ఎంబీఏ విభాగాధిపతి నవనీత,ఎంసీఏ .సీ.మదన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా కోర్సులో రాజంపేట ప్రభుత్వ డిగ్రీ విద్యార్థి షేక్ అస్మాత్ ప్రథమ బహుమతి, వైష్ణవీ డిగ్రీ కళాశాల విద్యార్థి షేక్.ఆశ్రీయ, ద్వితీయ బహుమతి, వెంకటసుధీర్ తృతీయ బహుమతి అందుకున్నారు. -
గండి క్షేత్రం.. పోటెత్తిన భక్తజనం
చక్రాయపేట: గండి వీరాంజనేయస్వామి క్షేత్రం శనివారం భక్తజనంతో పోటెత్తింది. శ్రావణమాసం రెండో శనివారోత్సవం వెభవంగా జరిగింది. గత వారం కంటే ఈసారి భక్తులు సంఖ్య పెరిగిందని ఆలయ వర్గాల అంచనా. ఉదయం నుంచి క్యూలైన్లు మధ్యాహ్నం 3 గంటల వరకు కిక్కిరిశాయి. పలువురు భక్తులు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించి తమ మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు, అర్చకులు రఘు, సాయిలు ఉదయాన్నే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. గండికి వచ్చిన కొందరు భక్తులు తలనీలాలు ఇచ్చి స్నాన ఘట్టాల వద్ద స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకున్నారు. రెండవ శనివారం సుమారు 40 వేల మంది వరకు భక్తులు స్వామిని దర్శించుకొని ఉంటారని ఆలయ వర్గాల అంచనా. కొందరు భక్తులు కాలినడకన వచ్చి స్వామిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ అధికం కావడంతో పోలీసులు వాహనాలను కొద్దిసేపు గండిలోకి అనుమతించ లేదు. ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రగారావు తమ సిబ్బందిచే బందోబస్తు నిర్వహించారు. -
వాల్టా.. ఉల్టా
● నేలకొరుగుతున్న భారీ వృక్షాలు ● అక్రమంగా తమిళనాడుకు తరలిపోతున్న వృక్షసంపద ● పట్టించుకోని అధికారులు ● వాల్టాచట్టం అమలు ఏది? జిల్లాలో ఎక్కడా వాల్టా చట్టం అమలు కావడం లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ చట్టం ప్రకారం చెట్లను నరికి వేయడానికి ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఏ ప్రాంతానికై నా తరలించాలంటే అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుతం చెట్లను కోసేయడానికి ఎటువంటి అఽనుమతులు తీసుకోక పోవడం గమనార్హం. ప్రతిరోజు ఏక్కువ సంఖ్యలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా వృక్షసంపద కొయ్యమిల్లులతో పాటు తమిళనాడు రాష్ట్రాలకు తరలి వెళుతోంది. ప్రతి ఒక్కరూ మొక్కలునాటి కాపాడాలని ప్రభుత్వం ప్రచారం చేస్తూన్నా ఇక్కడ ఆమాటలు ఆచరణలో పెట్టకపోవడం గమనార్హం. చర్యలు తీసుకొవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వాల్టా చట్టం అవులు ప్రశ్నార్థకంగా మారింది.ప్రకృతి సహజసిద్దమైన వనాలు, చెట్లను సంరక్షించాల్సిన అధికారులు వాటిని అక్రమంగా నరికి వేసి తరలించుకు పోతున్నా చోద్యం చూస్తూ కాలం వెల్లదీస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. గుర్రంకొండ: జిల్లాలో వాల్టాచట్టం అమలు జాడ ఎక్కడా కనిపించడం లేదు. కొంతమంది భారీ వృక్షాలను నేల కూల్చేస్తున్నారు. యథేచ్చగా తమిళనాడు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. వాల్టా చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వృక్ష సంపద రోజురోజుకు కనుమరుగైపోతోంది. ఓవైపు ప్రభుత్వం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రచారం చేస్తున్నా మరోవైపు అక్రమార్కులు వృక్షాలను యథేచ్చగా నరికివేస్తూ వాటి ఉనికే లేకుండా చేస్తుండడం గమనార్హాం. యథేచ్చగా వృక్షాలు నరికివేత ఎక్కడపడితే అక్కడ వృక్షాలు నరికివేస్తున్నారు.ఉన్న చెట్లను సంరక్షించడంలో అటవీశాఖ, రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గ్రావూల్లో అన్ని రకాల చెట్లు, వనాలు ఎంతో పురాతనమైనవి ఉన్నాయి. శతాబ్దాల క్రితం నాటిన వృక్షాలపై. వ్యాపారులు దృష్టి సారిస్తున్నారు. పట్టాలున్న పొలాల్లో కాకుండా పోరంబోకు స్థలాల్లో ఉన్న చెట్లను కుడా అక్రమంగా నరికివేస్తున్నారు. ఇవి ఇంటి వస్తువులు తయారుచేసే కలపతో పాటు ఇటుకల బట్టీలు కాల్చడంలో వినియోగించుకొంటున్నారు. చివరకు దేవుడి మాన్యం, వంకపోరంబోకు, చెరువుపోరంబోకు స్థలాల్లోని పురాతన చెట్లను అక్రమార్కులు వదలడం లేదు. లక్షలాది రుపాయలు విలువచేసే చెట్లను నరికివేసి సొమ్ము చేసుకొంటున్నారు. ● జిల్లాలోని వ్యాపారులే కాకుండా తమిళనాడు రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడ కొచ్చి చింతచెట్లతో పాటు సంద్ర, ఇతర వృక్షసంపదను అక్రమంగా తరలించుకుపోతున్నారు. బయట రాష్ట్రాల నుంచి కూలీలు జిల్లాకు తరలివచ్చి గ్రామాల్లో మకాం వేసి రాత్రి పగలు తేడాలేకుండా చెట్లను నరికేసి రాత్రిళ్లు లారీల్లో బయట రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. వందలసంవత్సరాల వయస్సున్న చింతచెట్లు, వేపచెట్లు సైతం కోతకు గురై కుమరుగవుతున్నాయి. ఒక్కో చెట్టు సుమారు రూ:20వేల నుంచి రూ: 40వేల వరకు ధర పలుకుతోంది. ఇంటివస్తువుల తయారీకి ఉపయోగ పడే చెట్లు లక్షలాది రుపాయలు ధరలు పలుకుతున్నాయి. దీంతో స్థానిక వ్యాపారులు, తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన వ్యాపారులు కుమ్ముకై ్క ఇష్టానుసారం వృక్ష సంపదను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకొంటాం చెట్లను అక్రమంగా నరికివేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా ఎవరైనా వ్యాపారులు చెట్లను నరికివేసి తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. చెట్లు నరికివేతపై ప్రజలు సమాచారం అందించి సహకరించాలి. వాల్టాచట్టం ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేస్తాం. – సదాశివప్పనాయుడు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, గుర్రంకొండఅనుమతి తీసుకోవాలి రెవెన్యూ అధికారులు చెట్లను నరికి వేయడానికి అనుమతి ఇచ్చినా వాటిని అటవీశాఖ అనుమతి లేనిదే బయట ప్రాంతాలకు తరలించకూడదు. ప్రతి వాహనం ఎక్కడి వెళుతుంది. వృక్షసంపద ఎక్కడికి, ఎందుకు తీసుకు వెళుతున్నారనే సమాచారం తమకు అందించి అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. లేని పక్షంలో కేసులు నమోదు చేస్తాం. – రామ్మోహన్, ఫారెస్ట్బీట్ ఆఫీసర్, గుర్రంకొండ -
వైద్య రంగం పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. దీంతో ఇప్పటికే మంజూరైన కాలేజీలు కనుమరుగయ్యాయి. కేటాయించిన సీట్లు వెనక్కు వెళ్లాయి. ఇప్పుడు ప్రభుత్వ హోమియోపతి వైద్య రంగం కూడా అచేతనంగా మారింది. తాజాగా కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి పీజీ సీట్లను ఒక్కట
కడప రూరల్: ప్రభుత్వ హోమియోపతి కాలేజీలు కడపతోపాటు గుడివాడ, రాజమండ్రిలో మాత్రమే ఉన్నాయి. పాలకుల నుంచి ఆలన..పాలన లేకపోవడంతో ఈ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రధానంగా ఈ వైద్య రంగంలో విద్యను అభ్యసించే వారికి కష్టతరంగా మారింది. ‘యూజీ‘లకు తీవ్ర నష్టం డాక్టర్గా సేవలు అందించాలనేది బైపీసీ విద్యార్థుల కల. నీట్ పరీక్షలు రాశాక, ర్యాంకులు, ఇతర నిబంధనల మేరకు ప్రాధాన్యత ప్రకారం వరస క్రమంలో మొదటగా ఎంబీబీఎస్ తరువాత బీడీఎస్ (డెంటల్), ఆయుర్వేదం, హోమియెపతి, యూనానిలో సీట్లను కేటాయిస్తారు. కాగా హోమియోపతికి సంబంధించి ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చిన వారు నాలుగున్నరేళ్ల పాటు యూజీ (అండర్ గ్రాడ్యుయేట్), ఒక ఏడాది హౌస్ సర్జన్గా చేయాలి. అనంతరం కీలకమైన పీజీ (పోస్టు గ్రాడ్యుయేట్) పూర్తి చేయాలి. ఇది మూడేళ్ల కోర్స్. ఈ కోర్స్ను పూర్తి చేసిన వారు మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా లేదా డిస్పెన్సరీల్లో మెడికల్ ఆఫీసర్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. పీజీకి అర్హత సాధించాలంటే ఇంకా కష్టపడి చదవాలి. కాగా కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీలో ఏటా 38 మంది విద్యార్థులు యూజీ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి వారు కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి ఒక్క పీజీ సీటును కూడా కేటాయించకపోవడం దారుణం. గుడివాడ కాలేజీకి మాత్రమే సీట్లను కేటాయించడం గమనార్హం. ఇప్పుడు కడప కాలేజీకి పీజీ సీట్లను కేటాయించకపోవడం వల్ల.. ఇకపై పీజీ సీట్లను కేటాయించరనే వాదన వినిపిస్తోంది. అదే గనుక జరిగేతే యూజీ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రయాదం ఉందని.. ఈ రంగానికి చెందిన ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వ హోమియోపతి కాలేజీలకు పీజీ సీట్ల కేటాయింపుల వివరాలు సంవత్సరం 2024 2025 యూజీ పీజీ యూజీ పీజీ పాలకుల నిర్లక్ష్య వైఖరే కారణం కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీపై శీతకన్ను పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కేటాయించని కౌన్సిల్ పట్టించుకోని పాలకులు కడప 38 08 38 – గుడివాడ 50 24 50 12 రాజమండ్రి 60 24 50 – కేటాయింపుల కోసం ప్రయత్నాలు కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి పీజీ సీట్ల కేటాయింపుల అంశానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయుష్ కమిషనర్ దినేష్కుమార్ చర్యలు చేపడుతున్నారు. – డాక్టర్ శోభారాణి, ఇన్చార్జి ప్రిన్సిపల్, ప్రభుత్వ హోమియోపతి కాలేజీ, కడపకూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగం కకావికలమైంది. ఆ రంగానికి చెందిన అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పులివెందుల వంటి మెడికల్ కాలేజీ కనుమరుగైంది. కేటాయించిన సీట్లు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అదే ఒరవడిలో హోయోపతి వైద్య రంగం కూడా సమస్యలతో సతమతం అవుతోంది. పాలకపక్షం నుంచి కేంద్రంను ‘మాకు మెడికల్ కాలేజీలు.. మెడికల్ సీట్లు కావాలి’ అని అడిగే వారే కరువయ్యారు. దీంతో వైద్య రంగం పతనావస్థకు చేరిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇది ‘కోతల సుఖీభవ’
రాయచోటి: కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తోంది అన్నదాత సుఖీభవ కాదని, కోతల సుఖీభవ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారంరాయచోటిలో పత్రికలకు అందజేసిన ప్రకటనలో అన్నదాత సుభీభవ నిధుల విడుదలపై స్పందించారు. రెక్కాడితే డొక్కాడని రైతులను మోసం చేయడం అన్యామన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో క్రమం తప్పకుండా అన్నదాతసుఖీభవ (రైతు భరోసా) కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ. 20 వేలను ఒకేసారి అందజేస్తామని చెప్పారన్నారు. గత ఏడాది 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అయిపోతున్న తరుణంలో తూతూ మంత్రంగా నేడు రూ. 5 వేలను రైతుల ఖాతాలలో వేస్తూ ఆర్భాటం చేస్తున్నారన్నారు. అది కూడా గత జగన్ ప్రభుత్వంలో ఇస్తున్న లబ్ధిదారుల కంటే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది రైతులకు తక్కువగా ఇస్తున్నారన్నారు. రైతులపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం, విలువ ఉన్నా వారు చెప్పిన మేరకు ఇప్పుడు ఇస్తున్న రూ. 5 వేలతోపాటు బాకీపడ్డ రూ. 35 వేలను వెంటనే వడ్డీతో సహా రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ● ఎన్నికల ముందు వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యవసాయానికి దన్నుగా ఉండేందుకు తన మేనిఫెస్టోలో పెట్టుబడి నిధి కింద 4 సంవత్సరాలకు ఏటా ప్రతి రైతుకు రూ. 12500లు చొప్పున రూ.50 వేలు అందిస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత రైతు సంక్షేమం దృష్ట్యా రూ.12500ను, రూ.13500లు చేసి ఐదేళ్లపాటు అందించేందుకు నిర్ణయించి ఏటా రూ. 13500లు చొప్పున ఐదేళ్లకు రూ. 67500ను అందించి రైతులపై తన చిత్తశుద్ధిని వైఎస్ జగన్ చాటుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 20వేలు ఇ స్తామని చెప్పి ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి ఇప్పుడు రూ.5 వేలు ఇచ్చి రైతును మోసం చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. మామిడి రైతుల దగ్గర ఇ న్సూరెన్స్ కట్టించుకున్నారే కానీ ప్రభుత్వం నుంచి ఒ క్కరూపాయి కూడా రైతుకు పరిహారం ఇచ్చింది లేదన్నారు. ● విద్యార్థులను, ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో అందివ్వకుండా పేదలను, ఉద్యోగాలు, నిరుదోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను, ఆడబిడ్డ నిధి ద్వారా మహిళలకు నెలకు రూ. 1500లు అందిస్తామని చెప్పి ఇవ్వకుండా... అన్ని వర్గాలను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా రైతుల ఉసురు తగిలితే బాగుపడే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రామసముద్రం : కర్నాటక రాష్ట్రం పెగలపల్లెకు చెందిన మునస్వామిశెట్టి(45) మండలంలోని గౌతిమ్మరాయస్వామి ఆలయ దర్శనానికి వచ్చి తిరుగుప్రయాణంలో గాంధీనగర్ వద్ద గుంతను తప్పించబోయి ద్విచక్రవాహనం బోల్తా పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి బాధితుడిని పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ, ఆటో ఢీ : ఒకరి మృతి రాజంపేట : కడప–రేణిగుంట జాతీయరహదారిలోని బోయనపల్లె వద్ద శనివారం లారీ–ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మున్సిపాలిటి పరిధిలోని రామ్నగర్కు చెందిన నాగారం లక్ష్మీదేవి(46) అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలిలా..శేషమాంబంపురం ఆటోడ్రైవర్ కొరముట్ల సాంబయ్య ఆటో(ఏపీ49డబ్ల్యుఈ7482)లో మృతురాలితోపాటు నాగారం దివ్య, ఓబులవారిపల్లెకు చెందిన తోట గగన్, తోట మౌనిక, తోట వెంకటరమణ నందలూరులోని సౌమ్యనాథస్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి రాజంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి కడప వైపు వస్తున్న లారీ అదుపుతప్పి ఢీ కొంది. దీంతో హైవేలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్హెగ్డే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108లో రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న ఓబిలి గ్రామస్తులు పెనగలూరు : మండలంలోని చెయ్యేరు నది ఆనుకొని ఉన్న ఓబిలి గ్రామం నుండి ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా గ్రామస్తులు, సీపీఐ నాయకులు శనివారం అడ్డుకున్నారు. నందలూరు మండలంలోని టంగుటూరు రీచ్ వద్ద ఇసుకను భారీ టిప్పర్లు లోడ్ చేసుకొని ఓబిలి గ్రామం ద్వారా వెళ్లడంతో గ్రామంలోని సిమెంటు రోడ్లు పాడవడంతో పాటు దుమ్ము విపరీతంగా వస్తుండటంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న సీపీఐ నాయకులు గ్రామస్తులకు అండగా నిలవడంతో ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. టిప్పర్లు విపరీతంగా వెళ్లడంతో పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. -
హమాలీ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయం
మదనపల్లె రూరల్ : టమాటా మార్కెట్లో హమాలీగా పనిచేస్తూ, ప్రమాదవశాత్తు లారీ కిందపడి మృతి చెందిన ఉత్తరప్రదేశ్కు చెందిన హమాలీ కుటుంబానికి మదనపల్లె టమాటా మార్కెట్యార్డ్ హమాలీ వర్క ర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ గౌరవాధ్యక్షుడు ఎస్.ఏ.మస్తాన్, రూ.2లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ కాశీగంజ్జిల్లా నంగులాతానాకు చెందిన మోర్సింగ్(48) ఐదేళ్లుగా నీరుగట్టువారిపల్లెలో నివాసం ఉంటూ స్థానికంగా టమాటా మార్కెట్లో హమాలీగా పని చేసేవాడన్నారు. జూలై 24వ తేదీ రాత్రి జరిగిన ప్రమాదంలో లారీ చక్రాల కిందపడి మోర్ సింగ్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడన్నారు. యూనియన్ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా తీర్మానించుకుని మృతుని కుటుంబ సభ్యులకు రూ.2లక్షల ఆర్థికసహాయం అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రామయ్య, ఉపాధ్యక్షుడు రసూల్, కార్యదర్శి మహబూబ్బాషా, మురాషా, చలపతి, షామీర్, సుధాకర్, బావాజాన్, సుబ్బు, రోషన్, శివ, జాఫర్, కుర్షిద్, అరవింద్, కార్మికులు పాల్గొన్నారు. -
ఇక ‘ఆపరేషన్ ట్రేస్’ !
రాయచోటి : జిల్లాలో తప్పిపోయిన బాల బాలికలను గుర్తించి వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ జిల్లాలో ప్రారంభమైందని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. శనివారం రాయచోటిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం నిర్వహణపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీవింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ రూపంలో అమలు చేయాలని సూచించారు. బాలికల అపహరణలు, తప్పిపోవడాలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేది నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 నుంచి 37 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులలో ఐదు మంది చిన్నారులు కూడా కనిపించకుండా పోయినట్లు సమాచారం ఉందన్నారు. జిల్లాలోని పోలీసు యంత్రాంగం పూర్తి సమన్వయంతో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో పాల్గొంటుందన్నారు. కుటుంబాల నుండి దూరమైన బాలికలను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించి తిరిగి వారి కుటుంబాల వద్దకు చేర్చడమే ఆపరేషన్ ట్రేస్ లక్ష్యమని ఎస్పీ అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ ట్రేస్.. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమానికి సంబంధించి ఆగస్టు నెల 1, 2వ తేదిలలో డేటా కలెక్షన్ కోసం సబ్ డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు నెలలో 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎన్జీఓలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న షెల్టర్స్ తనిఖీ చేస్తారన్నారు. సంబంధిత ఎఫ్ఐఆర్లను రీ వెరిఫికేషన్ చేయడం, అందులో భాగంగా టెక్నాలజీని ఉపయోగించడం మొదటి ప్రాధాన్యతగా చేపడతామన్నారు. ఫేస్ రికగ్నైజేషన్, డీఎన్ఏ టెస్టు, ఆధార్ ద్వారా వయస్సుకు సంబంధించిన సమాచారం సేకరిస్తామన్నారు. రెండో విచారణలో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థనా స్థలాలు, రెడ్ లైట్ ఏరియాలలో ప్రత్యేక తనిఖీల ద్వారా తప్పిపోయిన బాలికలను గుర్తించే చర్యలు ఉంటాయన్నారు. శక్తి యాప్లో రిపోర్టు మిస్సింగ్ చిల్డ్రన్ అనే ఫీచర్ ద్వారా తప్పిపోయిన పిల్లల కోసం ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆపద సమయంలో సహాయం కోసం ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు తక్షణమే స్పందించి సహాయం చేస్తారని తెలిపారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని 112 నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా లైదా చైల్డ్ హెల్ప్లైన్ నెంబరు. 1098కు, ఉమెన్ హెల్ప్లైన్ నెంబర. 181కు, శక్తి వాట్సప్ నెంబర్ 7993485111కు సమాచారం ఇవ్వడం ద్వారా సహాయం పొందగలరన్నారు. డివిజన్ పరిధిలో.... జిల్లాలో ప్రతి సబ్ డివిజన్ పరిధిలో మహిళల రక్షణ కోసం శక్తి టీమ్లు పనిచేస్తున్నాయన్నారు. ఈ టీమ్లు బహిరంగ ప్రదేశాలలో ఈవ్ టీజింగ్ చేసే ఆకతాయిల భరతం పడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒన్ స్టాప్ సెంటర్లు బాధిత మహిళలకు, బాలికలకు అన్ని విధాలుగా సహాయం చేస్తాయని తెలిపారు. జిల్లాలోని ప్రతి స్కూల్లో క్లాస్ రూమ్ నుండి ఐదుగురు బాలికలను శక్తి వారియర్స్ గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి శక్తి టీమ్ ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్లు గురించి క్రిందిస్థాయి అధికారులు వివరించారన్నారు. అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి బాలికలకు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమాలలో తప్పిపోయిన బాలికలకోసం పోలీసులతోపాటు, ఎన్జీఓలు, ప్రజా సంఘాలు పాల్గొని సహకారం అందించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతగా ఆపరేషన్ ట్రేస్ను పోలీసు స్టేషన్ల ద్వారా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బాలికలను అక్రమ రవాణా చేసే ముఠాల నుంచి రక్షించి వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. తప్పిపోయిన మహిళలు, బాలికల ఆచూకీ కోసం పోలీసు శాఖ ప్రత్యేక కార్యక్రమం జిల్లాలో 37కు పైగా మిస్సింగ్ కేసులు వారంలోగా ఛేదించాలన్న జిల్లా ఎస్పీ నాన్ బెయిలబుల్ నిందితులు అరెస్టు.. జిల్లాలో నాన్ బెయిలబుల్ వారెంట్లు కలిగి తప్పించుకు తిరుగుతున్న నిందితులపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులను అప్రమత్తం చేసి ప్రత్యేక డ్రైవ్ ద్వారా 150కిపైగా నాన్ బెయిలబుల్ వారెంటుదారులను అరెస్టు చేసి కోర్టులో లొంగిపోయే విధంగా చేశామన్నారు. ఇందులో పాలుపంచుకున్న పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి ప్రోత్సహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి పాల్గొన్నారు. -
భర్త మద్యం మానలేదని ఆత్మహత్య
బి.కొత్తకోట : మద్యానికి బానిసైన భర్త..భార్య, బిడ్డలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం, ఎన్నిసార్లు వేడుకున్నా మద్యం మానకపోవడంతో ఆవేదనకు గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బి.కొత్తకోట మండలం పులుసుమానిపెంటలో జరిగింది. గతనెల 31న గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మొటుకుపల్లె పంచాయతీ బద్దిపల్లెకు చెందిన ఎం.లక్ష్మిదేవి (35)కి, ఇదే పంచాయతీ పులుసుమానిపెంటకు చెందిన శివశంకర (35)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జగదీష్ (13), రజిత (11) సంతానం. శివశంకర్ మేసీ్త్ర పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పొషించుకునే వాడు. అయితే మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్య లక్ష్మిదేవి, ఆమె తండ్రి వీరమల్లు పలుమార్లు మద్యం మానుకొని కుటుంబాన్ని చూసుకోవాలని శివశంకర్ను ప్రాధేయపడ్డారు. అయినప్పటికి శివశంకర్ పెడచెవినపెట్టాడు. భార్య ఈ విషయమై కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందని, పిల్లల భవిష్యత్తు చూడాలని ప్రాధేయపడేది. ఎవరి మాట వినని భర్తను ఇక భరించలేనన్న నిర్ణయానికి వచ్చిన లక్ష్మిదేవి గురువారం రాత్రి ఇంటిలో విష ద్రావణం తాగింది. గమనించిన స్థానికులు భర్త, తండ్రికి విషయం తెలపడంతో వారు చికిత్స కోసం కర్ణాటకలోని రాయల్పాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తర లించాలని సూచించగా మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీ సుకొచ్చారు. అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. దీనిపై మృతురాలి తండ్రి వీరమల్లు ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ రామాంజులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోని తండ్రి కారణంగా ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తు లు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్ట వైఎస్సార్ కాలనీకి చెందిన నరసింహులు కుమారుడు మురళీ(50) శనివారం వ్యక్తిగత పనులపై స్వగ్రామమైన కలకడ మండలం గుడిబండకు వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వస్తుండగా, కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని అడవిలోపల్లె క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన బొలేరో ఢీకొంది. ప్రమాదంలో మురళీ తీవ్రంగా గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యు లు చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని రెఫర్ చేశారు. అయితే బాధితుడి వెంట వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు రెఫర్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సరైన చికిత్స అందించకుండానే వచ్చిన ప్రతి కేసు రెఫర్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థికి తీవ్ర గాయాలు.. ద్విచక్రవాహనం ఢీకొని విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పుంగనూరు మండలంలో జరిగింది. భీమగానిపల్లెకు చెందిన విద్యార్థి రాంచరణ్ (16) స్కూల్ వదిలిన వెంటనే మధ్యాహ్న భోజనం కోసం మోదుగులపల్లె కట్ట వద్ద వెళుతుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం విద్యార్థిని ఢీకొంది. ప్రమాదంలో రాంచరణ్ తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ఆయా ప్రమాద ఘటనలపై సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
రాయచోటిలో చెలరేగుతున్న గ్యాంగులు
రాయచోటి : రాయచోటిలో అల్లరి మూకల గ్యాంగుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా దాడులు, ప్రతి దాడులు, బైకుల ర్యాలీలు, స్టంట్లతో పట్టణ ప్రజలను, వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. విచ్చలవిడిగా గ్యాంగుల దాడులతో ఎక్కడ ఏమి జరుగుతుందోన్న భయం పట్టణ ప్రజల్లో నెలకొంది. విచ్చలవిడిగా రెచ్చిపోతున్న గ్యాంగులను అదుపుచేయడంలో రాయచోటీ పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజూ రెండు, మూడు ప్రాంతాల్లో గ్యాంగుల దాడులతో గాయాలపాలైన మూగ రోదనలతో ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. దాడులలో గాయపడిన వారు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కినా గ్యాంగులకు రాజకీయ నాయకుల అండదండలు లభిస్తుండటంతో వారిపై కేసులు నమోదు చేసే సాహసాన్ని పోలీసులు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీ ఇంద్ర బస్సుపై దాడి. రాయచోటి పట్టణంలోని నేతాజీ సర్కిల్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంద్ర ఆర్టీసీ బస్సుపై పట్టణంలోని ఒక గ్యాంగ్ రాళ్లతో దాడికి తెగబడింది. నేతాజీ సర్కిల్ నడిరోడ్డుపై బైకులు ఆపి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై గ్యాంగ్ నాయకులు వీరంగం సృష్టించారు. ఇదే సమయంలో కడప నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇంద్ర ఏపీ04జెడ్0397 నెంబరుగల ఆర్టీసీ బస్సు 12 గంటల అనంతరం రాయచోటిలోని నేతాజీ సర్కిల్కు చేరుకుంది. రోడ్డుపై అడ్డంగా ఉన్న బైకులను తొలగించాలని డ్రైవర్ కోరినా పీకలతోతు మద్యం తాగిన గ్యాంగ్ సభ్యులు ఆర్టీసీ డ్రైవర్పై తిరగబడ్డారు. ఈ బస్సు వెనుకవైపు వచ్చిన బద్వేల్ ఆర్టీసీ బస్సును కూడా యువకులు అడ్డగించి అసభ్య పదజాలంతో డ్రైవర్ను దూషించారు. వారితో వాదనలను పెట్టుకోకుండా ఇరంద బస్సు డ్రైవర్ బస్సును చాకచక్యంగా ముందుకు నడిపి వెళ్తున్న సమయంలో గ్యాంగ్ సభ్యులు ఆ బస్సును వెంటపడి చిత్తూరు–మదనపల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని శివాలయం వద్దకు చేరుకోగానే బండరాళ్లతో బస్సుపై దాడి చేశారు. రాళ్లదాడిలో ఇంద్ర బస్సు వెనుక అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ బస్సులో వెనుక భాగాన ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జరిగిన సంఘటనపై డ్రైవర్ జేసీ సుబ్బారావు రాయచోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షక పాత్రలో పోలీసులు అర్ధరాత్రి వేళ ఆర్టీసీ ఇంద్ర బస్సుపై దాడి.. పగిలిన అద్దాలు -
భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు
వీరబల్లి : మండలంలోని సంఘంవాండ్లపల్లెకు చెందిన జుట్టు చెండ్రాయుడు అనే వ్యక్తి కనబడలేదంటూ అతని భార్య స్థానిక పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం గొర్రెల వ్యాపారం నిమిత్తం వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త శుక్రవారం తనకు ఫోన్ చేసి రాజంపేటకు వెళ్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు తెలిపారు. మూడు రోజులు గడుస్తున్నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డులో హమాలీపై దాడి మదనపల్లె రూరల్ : పట్టణంలోని నీరుగట్టువారిపల్లె టమాటా మార్కెట్ యార్డులో హమాలీపై మందు బాబులు దాడి చేసిన ఘటన శనివారం జరిగింది. నీరుగట్టువారిపల్లె మార్కెట్ యార్డు ఏబీ టమాటా మండీలో బావాజాన్(48) హమాలీగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు పూటుగా మద్యం సేవించి దారి విషయమై బావాజాన్తో గొడవపడి రాళ్లతో దాడిచేసి కొట్టారు. దాడిలో గాయపడిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అత్తింటి వేధింపులపై కేసు నమోదు మదనపల్లె రూరల్ : అత్తింటి వేధింపులపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. కర్నాటక ముళబాగల్ ముత్యాలపేటకు చెందిన నాగరాజ, సుగుణ కుమార్తె జ్ఞానగిరి శిరీషాను మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ పందివారిపల్లెకు చెందిన దామోదర్కు ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నిరోజులుగా అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తుండగా, వారి వేధింపులు భరించలేక రెండునెలల క్రితం శిరీషా పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తింటిలో వేధింపులపై శనివారం తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు భర్త దామోదర్, అత్త చంద్రమ్మ, మామ వెంకటరమణలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్పై టీడీపీ నేత లైంగిక వేధింపులు పీలేరు రూరల్ : ఫీల్డ్ అసిస్టెంట్పై లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నాయకుడిపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముడుపులవేముల పంచాయతీ దళితవాడకు చెందిన పల్లెపాగు రెడ్డికాంత భర్త 2024 జూలై 24న అనుమానాస్పద స్థితిలోమృతి చెందాడు. ఆమె గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే పంచాయతీ ఠాణావడ్డిపల్లెకు చెందిన యల్లమంద శ్రీనివాసులు ఏడాది కాలంగా రెడ్డికాంతను మానసికంగా, లైంగికంగా వేధింపు లకు గురి చేస్తున్నాడు. అతని వేధింపులు తాళలేక శనివారం సీఐ యుగంధర్కు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి
రాయచోటి : ప్రభుత్వ బడులలో పనిచేసే ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి మినహాయించి బోధనకే పరిమితం చేయాలని, బోధనను హరించే యాప్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో నాయకుడు ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి పెండింగ్ డీఏలను చెల్లించాలన్నారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జాబిర్ మాట్లాడుతూ పి–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదన్నారు. ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ గఫార్ ఖాన్ మాట్లాడుతూ నూతనంగా అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు ఎం,రెడ్డన్న, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడారు. కార్యక్రమంలో ఫ్యాఫ్టో జిల్లా కో–చైర్మన్లు శివారెడ్డి, ఇలియాస్, హరి ప్రసాద్, జిల్లా కోశాధికారి జఫరుద్దీన్, బీలు నాయక్, ఫ్యాప్టో రాష్ట్ర బాధ్యులు రవీంద్రారెడ్డి, రామచంద్ర, డీసీఐబీ సెక్రటరీ నాగముని రెడ్డి, ఫ్యాప్టో నాయకులు సుధాకర్ నాయుడు, ఎస్.శివారెడ్డి, బి.చంద్రశేఖర్, రెడ్డప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఏఓ నాగభూషణంకు వినతిపత్రం అందజేశారు. -
కోర్టు కాంప్లెక్స్ను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
రాజంపేట : స్థానిక కోర్టు క్లాంపెక్స్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని శనివారం పరిశీలించారు. కోర్టు క్లాంపెక్స్ ఒప్పందంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం అప్పగించలేదని రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు అభ్యర్ధన మేరకు జిల్లా ప్రధానన్యాయమూర్తి రాజంపేట కోర్టుకు విచ్చేశారు. కోర్టు భవనాలు, తహసీల్దార్ కార్యాలయ భవనాలను ఆమె పరిశీలించారు. బార్ అసోసియేషన్ న్యాయవాదుల సమావేశంలో పాల్గొన్నారు. న్యాయవాదుల నుంచి కోర్టు పరమైన సమస్యలపై వినతులను అందుకున్నారు. కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి ప్రవీణ్కుమార్, జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాశ్, హైకోర్టు న్యాయవాది కొండూరు శరత్కుమార్రాజు, రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు, తహసీల్దార్ పీరుమున్నీ, ఏజీపీ మౌనిక, సీనియర్ న్యాయవాదులు రవీంద్ర, రామచంద్ర, బి.నాగరాజగుప్తా, పి.సురేష్కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. -
తండ్రీ కొడుకుల గొడవలో చేనేత కార్మికుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో తండ్రీ కొడుకులు దారిలో గొడవపడుతూ ఇనుప వస్తువులు ఒకరిపై ఒకరు విసురుకుంటుండగా, అటుగా వెళుతున్న ఓ చేనేత కార్మికుడిపై పడటంతో తీవ్రంగా గాయపడి కాలు విరిగిన ఘటన శనివారం సాయంత్రం మదనపల్లె పట్టణంలో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ఇంతియాజ్ అహ్మద్(55) పదిరోజుల క్రితం బతుకుదెరువులో భాగంగా మదనపల్లెకు వచ్చాడు. నీరుగట్టువారిపల్లెలో మగ్గం కార్మికుడిగా పనిచేసుకుంటున్నాడు. శనివారం సాయంత్రం పనులు చేస్తూ విరామం కోసం మగ్గం గుంతలో నుంచి లేచి బజారులోకి వచ్చాడు. అదే సమయానికి పక్కింటికి చెందిన రామచంద్ర అతడి కుమారుడు లోకేష్ కుటుంబ సమస్యలతో గొడవపడుతూ ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లు, ఇనుపవస్తువులు విసురుకుంటున్నారు. రామచంద్ర విసిరిన ఇనుప వస్తువు వేగంగా వచ్చి ఇంతియాజ్ అహ్మద్ కాలుకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. -
హంద్రీ–నీవా ఈఈ పోస్టుకు పోటాపోటీ
మదనపల్లె: హంద్రీ–నీవా రెండో దశశ ప్రాజెక్టులో భాగమైన పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)లో కాంక్రీట్ లైనింగ్ పనులు జరుగుతుండటంతో ఈ పనులు చూసే ఎగ్జిక్యూటిన్ ఇంజనీర్ బాధ్యతల కోసం ముగ్గురు డీఈఈ (ప్రస్తుతానికి)లు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. సత్యసాయి జిల్లా కదిరి డివిజన్–11 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నీలకంఠారెడ్డి ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రసుతం ఆయన పీబీసీ లైనింగ్ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన ఉద్యోగ విరమణ అయ్యాక ఆ స్థానంలో పని చేసేందుకు డీఈఈ హోదా కలిగిన ముగ్గురు ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇద్దరికి డీఈఈ నుంచి ఈఈ పదోన్నతి లభించే అవకాశం ఉండటంతో పదోన్నతి తర్వాత ఒకరికి అవకాశం దక్కవచ్చు. మరొక డీఈఈ సత్యసాయి జిల్లా కదిరిలో సుదీర్ఘ కాలం పని చేయడంతోపాటు అక్కడి టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్న కారణంగా గట్టిగా పోటీ ఇస్తున్నట్టు తెలిసింది. అయితే ఈఈ అర్హత ఉన్న వాళ్లకి మాత్రమే పీబీసీలో విధులు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా ప్రస్తుతం పీబీసీలో జేఈ స్థాయి ఉద్యోగికి డీఈగా అదనపు బాధ్యతలను అప్పగించి అత్యధిక భాగం పర్యవేక్షణ బాధ్యతలను కేటాయించినట్టుగా ఈఈ విషయంలోనూ వ్యవహరిస్తే ఏ స్థాయి ఉద్యోగికై నా అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఈ విషయంలో జోక్యం చేసుకునేలా కనిపిస్తోంది. హంద్రీ–నీవాలో ఇప్పటికి మంజూరు కాని పనులను..ఈ పనులకు సంబంధం లేని ప్రాజెక్టు డివిజన్కు తిరుపతి సీఈ కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది ఓ టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల జరిగిందని తెలుస్తోంది. ఇలా ఇష్టారీతిన సాగుతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈఈ బాధ్యతల అప్పగింతలో విచిత్రాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇలా ఉండగా ఇప్పటికే ఈఈగా బాధ్యతలు చూస్తున్న ఓ అధికారి..నీలకంఠారెడ్డి ఉద్యోగ విరమణ చేశాక ఆయన బాధ్యతల పరిధిని కూడా తనకే అప్పగించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో రూ.366 కోట్ల వ్యయంతో జరుగుతున్న పీబీసీ లైనింగ్ పనుల్లో ఈఈ బాధ్యతల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి. ప్రభుత్వ స్థాయిలో ముగ్గురు డీఈల తీవ్ర ప్రయత్నాలు -
3న పుట్బాల్ జట్టు ఎంపిక
మదనపల్లె సిటీ: మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల3వతేదీ జిల్లా పురుషుల పుట్బాల్ జట్టు ఎంపిక జరగనుంది. ఈ విషయాన్ని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్కుమార్, మురళీధర్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9502074146, 88850 22258 నంబర్లలో సంప్రదించాలన్నారు. 3న వెలిగల్లు నుంచి నీటి విడుదల గాలివీడు: వెలిగల్లు కుడికాలువ గేట్లు ఈనెల 3వ తేదిన ఉదయం 9 గంటలకు ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈఈ బి.భాస్కర్బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రైతుల విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. నియామకం కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.తంబళ్లపల్లెకు చెందిన ఆర్సీ ఈశ్వర్రెడ్డిని స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా, రాయచోటికి చెందిన వి.వెంకట రమణను స్టేట్ పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా, రాజంపేటకు చెందిన మారుతిరావును స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమించారు. 8న అరుణాచలానికి ప్రత్యేక బస్సులు కడప కోటిరెడ్డిసర్కిల్: అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే వారి కోసం ఆగస్టు 8న ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వైఎస్సార్ జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. ఈనెల 8న సాయంత్రం 4.30 గంటలకు కడప డిపో రాయచోటి, పీలేరు మీదుగా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో టిక్కెట్ ధర రూ. 1044గా ఉందన్నారు. బద్వేలు డిపో నుంచి ఉదయం 9.00 గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో రూ. 1282 ఛార్జిగా నిర్ణయించారన్నారు. మైదుకూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సూపర్లగ్జరీ బస్సు బయలుదేరుతుందని, ఇందులో చార్జి రూ. 1352 అని తెలిపారు. ప్రొద్దుటూరు డిపో నుంచి సాయంత్రం గంటలకు సూపర్లగ్జరీ బస్సు వెళుతుందని, ఇందులో టిక్కెట్ ధర రూ.1273. పులివెందుల డిపో నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు రాయచోటి, పీలేరు మీదుగా నడుస్తుందన్నారు. ఇందులో చార్జి రూ. 1233గా ఉందన్నారు. నిషేధ సమయంలో చేపల వేట సాగిస్తే చర్యలు గాలివీడు: జులై, ఆగస్టు మాసాల్లో నిషేధ సమయంలో చేపల వేట కొనసాగిస్తే చర్యలు తప్పవని ఎఫ్డీఓ సుబ్బ నరసయ్య మత్స్యకారులను హెచ్చరించారు. ’సాక్షి’లో వెలువడిన కథనంతో జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో హుటాహుటిన మత్స్యశాఖ అధికారులు శుక్రవారం వెలిగల్లు జలాశయాన్ని పరిశీలించారు. మత్స్యకారులు, విక్రయదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ చేపలు గుడ్లు పెట్టి పిల్లలుపునరుత్పత్తి చేసే సమయంలో ఎవ్వరూ చేపల వేట సాగించరాదన్నారు. విలేజ్ ఫిషనరీష్ అసిస్టెంట్ రామాంజి నాయక్ పాల్గొన్నారు. -
దయనీయ స్థితిలో హాస్టల్ విద్యార్థులు
రాయచోటి : ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ.. దయనీయ స్థితిలో ఉన్నారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో నెలకొన్న పారిశుద్ధ్య, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం వారు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపు మేరకు నాలుగు రోజులుగా సంక్షేమ హాస్టళ్లబాట పేరుతో జిల్లా వ్యాప్తంగా అనేక వసతి గృహాలను వారు పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయన నివేదికను జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్కు అందజేశారు. అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జంగంరెడ్డి కిషోర్ దాస్ మాట్లాడుతూ జిల్లాలోని చాలా హాస్టళ్లలో పారిశుద్ధ్య పరిస్థితులు అత్యంత దిగజారిన స్థితిలో ఉన్నాయన్నారు. తాగునీటి సమస్యలు, నేలపై నిద్రించాల్సిన పరిస్థితులు, దోమల దాడులతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా హాస్టళ్లలో దుప్పట్లు, దోమతెరలు పంపిణీ కాలేదన్నారు. మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. తలుపులు లేని మరుగుదొడ్లతో విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ విద్యార్థుల విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. వీటితోపాటు నిధుల కొరత కారణంగా మెనూ అమలు కావడం లేదన్నారు. పురుగులున్న బియ్యంతో వండిన అన్నం, కుళ్లిన కూరగాయలతో తయారు చేసిన కూరలు విద్యార్థుల ఆరోగ్యానికి హాని చేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా ఆహారం తిన్న విద్యార్థులు తరచూ విషజ్వరాలు, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. అంతేకాక కాస్మోటిక్స్ చార్జీలు అందకపోవడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రత కూడా ప్రశ్నార్థకమవుతోందని మథనపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి విద్యార్థుల ఆరోగ్యం బలవుతున్న నేపథ్యంలో విద్యార్థి విభాగం ఈ ప్రధాన డిమాండ్లపై కలెక్టర్కు వినతిపత్రంగా సమర్పించింది. ప్రధాన డిమాండ్లు.. మెస్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు తక్షణమే విడుదల చేయాలి, శిథిలావస్థకు చేరిన హాస్టళ్లల్లో మరమ్మతులకు నిధులు కేటాయించాలని, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, హాస్టల్ వార్డన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, జిల్లావిద్యాశాఖాధికారులు వారానికి ఒకరోజు హాస్టళ్లలో బస చేయాలని, పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని, ప్రతి నెల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు వసంతం మణికంఠరెడ్డి, రాజంపేట నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు అబ్దుల్ ఖాన్, పీలేరు అధ్యక్షులు లోకనాథం, జిల్లా ప్రధాన కార్యదర్సి నరేష్, రాష్ట్ర కార్యదర్శి హేమంత్, బీసీ విభాగం నాయకులు శివకుమార్, బాబు గౌడ్, రాయచోటి పట్టణ అధ్యక్షులు ఫయాజ్, జిల్లా కార్యదర్శులు అంజాద్ బాష, శివకుమార్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వసతి గృహాలను పరిశీలించిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
‘స్వాతంత్య్ర’ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
రాయచోటి : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా పోలీసు పరెడ్ గ్రౌండ్లో కనుల పండువగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. కేటాయించిన విధులు పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాల కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అలాగే ఆయా శాఖల ఎగ్జిబిషన్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటాద్రి, డీఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అత్యధిక మెజారిటీతో ఇరగంరెడ్డిని గెలిపించండి
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు ప్రజలను కోరారు. శుక్రవారం మండల పరిధిలోని రాచగుడిపల్లి, సీతాపురం, గొల్లపల్లి, రాచపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి ఆకేపాటి అమరనాథరెడ్డి, సురేష్ బాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ..సుబ్బారెడ్డిని గెలిపించుకుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచి, ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, ఆర్థిక స్థితి గతులను మారుస్తారన్నారు. కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అవిర్భావం అయినప్పటి నుంచి ఒంటిమిట్ట జెడ్పీటీసీని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వారే దక్కించుకుంటున్నారన్నారు. ఈ సారి కూడా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ని గెలిపించి, ఒంటిమిట్ట చరిత్రను తిరగ రాయాలని ప్రజలను కోరారు. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ..తాను ఒంటిమిట్ట మండల ప్రజలకు సుపరిచితున్ని అన్నారు. నన్ను గెలిపిస్తే మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని, వాటిని పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్రెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ దున్నూతల లక్ష్మీనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మేకపాటి నందకిశోర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వె వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసుల రెడ్డి, గురుమోహన్రాజు, రవిరాజు, నాగార్జున్ రాజు, రవిరెడ్డి, కత్తి శివయ్య పాల్గోన్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి, కడప మేయర్ సురేష్ బాబు -
బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
రైల్వేకోడూరు అర్బన్: జిల్లాలోని బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సభా భవనంలో రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. బొప్పాయికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులు రైతులను మోసం చేస్తున్నట్లు, తూకాల్లో తేడాలు ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్త పరిచారని, దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దళారులు సిండికేట్ అయి ధరలు తగ్గిస్తున్నట్లు గుర్తించామన్నారు. మామిడి మాదిరి బొప్పాయి రైతులకు మోసం జరిగితే దళారులపై చర్యలు తీసుకొంటామని అన్నారు. తూకాల్లో మోసాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్చ టీడీపీ ఇన్చార్జి ముక్కారూపానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
ఒకరి నగలు మరొకరికి అప్పగింత
రాజంపేట : ఒకరినగలు మరొకరికి ఇచ్చేసిన సంఘటన రాజంపేట మెయిన్రోడ్డులోని కెనరా బ్యాంక్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపేట పట్టణంలోని మన్నూరుకు చెందిన షేక్ నసీం జీవనోపాధి కోసం కువైట్లో ఉంటోంది. యేడాది క్రితం 50 గ్రాముల బంగారు నగలు కెనరాబ్యాంక్లో పెట్టి రుణం తీసుకున్నారు. కువైట్కు తనతోపాటు పాసుబుక్, రుణం రసీదు తీసుకెళ్లింది. మూడు రోజుల క్రితం స్వదేశం వచ్చింది. గోల్డ్లోన్ రెన్యూవల్ చేసుకుందామని బ్యాంక్కు వెళ్లింది. ఆమెకు కెనరా బ్యాంక్ సిబ్బంది షాక్ ఇచ్చారు. నగలు లేవని సమాచారం ఆమెను ఆందోళనకు గురి చేసింది. తాను నగలు తనఖా పెట్టి వెళితే తనకు తెలియకుండా ఎవరు తీసుకెళ్లారని బ్యాంక్ మేనేజర్ను నిలదీసింది. బాధితురాలి తల్లి, కూతురు నగలను విడిపించుకెళ్లినట్లు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంపై కెనరాబ్యాంక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని పట్టణ పోలీసులు బాధితురాలికి సలహా ఇచ్చారు. బురఖా వేసుకొని మోసం చేశారు.. బ్యాంకులో షేక్ నసీం గోల్డ్లోన్కు సంబంధించి ఒకరి నగలు మరొకరికి ఇచ్చిన వ్యవహారంపై మేనేజర్ మౌనిస్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బురఖా వేసుకొని నసీం తల్లి, కూతురు నగలను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. గోల్డ్ రిలీజ్ ప్రాసెస్ నసీం చేసినట్లుగా జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పోలీసులు కూడా సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తిరుపతికి చెందిన కెనరాబ్యాంకు ఉన్నతాధికారిణి ఒకరు జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కెనరా బ్యాంక్లో ఘటన -
దొంగకు దేహశుద్ధి
సింహాద్రిపురం : ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సింహాద్రిపురం మండలంలోని సుంకేసుల గ్రామంలో కాకర్ల భాస్కర్రెడ్డి భార్య తన ఇంటి వద్ద శుక్రవారం కల్లాపు చల్లుతూ ఉండగా.. బైకుపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. బైకుపైనే ఒకరు ఉండి మరొకరు ఆమె వద్దకు వచ్చి వివరాలు అడిగేటట్టు అడిగి.. మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లి బైకుపై వెళ్లిపోయారని బాధితురాలు పూర్ణ విలపించింది. అలాగే అంకాలమ్మ గూడూరులో గ్రామానికి చెందిన చిన్నిరెడ్డి తన తోట వద్ద ట్రాక్టర్ ఆపి పనులు చేసుకుంటూ నిమగ్నమై ఉండగా, దొంగ ట్రాక్టర్కు ఉన్న బీగం గమనించి స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. రైతు ట్రాక్టర్ శబ్దాన్ని గమనించి బయటికి వచ్చి చూసేసరికి ట్రాక్టర్ చాలా దూరం వెళ్లిపోయింది. దీనితో బాధిత రైతు వెంటనే గ్రామస్తులకు ఫోన్ చేయడంతో వారు ఆ ట్రాక్టర్ను వెంబడించి దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి ట్రాక్టర్కు తాడుతో కట్టారు. గ్రామస్తులు దొంగను పట్టుకొని దబాయించగా పొంతన లేని సమాధానాలు చెబుతుంటే.. పోలీసులకు సమాచారమిచ్చి పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగ నా పేరు సురేష్, నాది అనంతపురం జిల్లా బత్తలపల్లి సమీపంలోని డి.చెర్లోపల్లె గ్రామం అని చెప్పారు. -
ల్యాండ్రీ షాపులో అగ్ని ప్రమాదం
పీలేరు రూరల్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ల్యాండ్రీ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. స్థానిక జెండామాను వద్ద శ్రీనివాసులు ల్యాండ్రీ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో షాపులో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే బట్టలు దగ్ధమయ్యాయి. జూనియర్ లైన్మ్యాన్ అదృశ్యం గాలివీడు : తూముకుంట గ్రామం ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన మూడే బద్దె నాయక్ కుమారుడు, జూనియర్ లైన్మ్యాన్ రవి నాయక్(25) కనిపించకపోవడంపై కేసు నమోదు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన రవి నాయక్ ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. ఈయన కడప సీకే దిన్నె మండలంలో జూనియర్ లైన్మ్యాన్గా విధులు నిర్వహిస్తున్నాడన్నారు. మీటరు దారుల వద్ద కరెంటు బిల్లుల రూపంలో దాదాపు రూ.3 లక్షల వరకూ అప్పులు చేసి అవి చెల్లించలేక వెళ్లిపోయినట్లుగా తెలిపారు. బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు నిమ్మనపల్లె : బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం నిమ్మనపల్లెలో జరిగింది. నిమ్మనపల్లె దిగువ వీధికి చెందిన స్వర్ణ సింగ్ (40) వ్యక్తిగత పనులపై ముష్టూరు పంచాయతీ దిగువపల్లెకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. నిమ్మనపల్లెలోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్యపై కరెంట్ వైర్లతో దాడి కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో సప్తగిరి అనే వ్యక్తి తన భార్యపై కరెంట్ వైర్లతో దాడి చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాష్ నగర్ కు చెందిన సప్తగిరికి 5 సంవత్సరాల క్రితం వైష్ణవితో వివాహమైంది. భార్యను తరచు వేధించేవాడు. అయితే కరెంటు వైర్లతో గురువారం ఇష్టానుసారంగా చితక బాదడంతో తీవ్ర గాయాల పాలైంది. వైష్ణవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారి ఆత్మహత్య పులివెందుల రూరల్ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె సమీపంలో ఉన్న ఎర్రబల్లె తండాలో నివాసముంటున్న ఆంజనేయ నాయక్(42) అనే అరటి కాయల వ్యాపారస్తుడు గడ్డి నివారణ మందు సేవించి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయ నాయక్ అరటి కాయల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పులివెందుల ప్రాంతంలోని అరటికాయలను ఢిల్లీ వ్యాపారస్తులకు ఎగుమతి చేసేవాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వ్యాపారస్తులు సుమారు లక్షలాది రూపాయల డబ్బులు పంపించకపోవడంతో ఆంజనేయ నాయక్ పులివెందుల ప్రాంతంలోని రైతులకు చెప్పుకోలేక గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. -
మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు
చిన్నమండెం : పలు ప్రాంతాలలో పలు మోటారు సైకిళ్లను దొంగతనానికి పాల్పడ్డ దొంగను అరెస్టు చేసినట్లు రాయచోటి ఎస్డీపీఓ క్రిష్ణమోహన్, రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు. శుక్రవారం చిన్నమండెం పోలీస్స్టేషన్లో నిందితుడితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. చిన్నమండెం ఎస్ఐ సుధాకర్, సిబ్బందితో కలిసి మోటారు సైకిళ్ల చోరీలపై నిఘా ఉంచామన్నారు. చిన్నమండెం, కలకడ, రాయచోటిలలో చోరీకి అయిన కొన్ని మోటారుసైకిళ్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. నిందితుడు రాయచోటిలోని ఏజీ గార్డెన్కు చెందిన సద్దాం కాగా రాయచోటిలోని రాజులకాలనీలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడన్నారు. జూలై 31న చిన్నమండెం మండలం తూర్పుపల్లె క్రాస్ రోడ్డు వద్ద తమ సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తుండగా.. అతన్ని పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద ఐదు మోటారు సైకిళ్లను రికవరీ చేయగా, వాటి విలువ రూ.8.85 లక్షలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నమండెం ఎస్ఐ సుధాకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చెరువుకుంట కబ్జాకు యత్నం
సుండుపల్లె : మండల పరిధిలోని మడితాడు గ్రామ పంచాయతీ జికె రాచపల్లి గ్రామ పొలంలో సర్వే నెంబర్ 992లో 3.60 సెంట్లు భూమి చెరువుకుంట ఉంది. ఇది రాయచోటి ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో మండలానికి చెందిన టీడీపీ పార్టీకి చెందిన నాయకుడి ఓ కన్ను పడింది. దీనిని ఆక్రమించడానికి జేసీబీతో చదును చేశాడు. అంతేకాకుండా సర్వే నెంబర్ 991/ఏలో 0.7 సెంట్ల భూమి పట్టా ఉందని, పక్క భూమి సర్వే నెంబర్ వేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, కుంట సర్వే నెంబర్లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు చదును చేశాడని శేఖర్రెడ్డి అనే వ్యక్తి గురువారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అదేకాకుండా సర్వే నెంబర్ 994/ఏలో 0.4 సెంట్లు ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారని, ఇంకా మరికొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించినట్లు కలెక్టర్కు ఫిర్యాదులో తెలిపారు. కబ్జాదారుల నుంచిప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నేడు గండిలో రెండో శ్రావణ శనివారోత్సవం
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో నేడు రెండో శ్రావణ మాస శనివారోత్సవం జరుగనుంది. గత వారం కంటే ఈవారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని భావించిన ఆలయ వర్గాలు అందుకు సరిపడ ఏర్పాట్లు చేశారు. గత వారంలో తలెత్తిన చిన్నచిన్న లోపాలను సరిదిద్ది ఉత్సవాలకు తగు ఏర్పాట్లు చేశామని ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజ తెలిపారు. భక్తుల అంచనాల మేరకు లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఉదయం 3గంటలకు సుప్రభాతసేవ, ఉత్సవమూర్తులకు అభిషేకం (ఏకాంతంగా), అలంకరణ, ఆరాధన, 5 గంటలకు మహామంగళ హారతి, అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం ఉంటుందని ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు తెలిపారు. అలాగే రాత్రి బస చేయు భక్తుల కాలక్షేప నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు, అధికారులు సహకరించాలని చైర్మన్ కోరారు. పరిస్థితిని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు శ్రావణ మాస ఉత్సవాల రెండవ శనివారం భక్తుల రద్దీని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రంగారావులు తెలిపారు. పరిస్థితిని బట్టి లారీలు, టిప్పర్లు తదితర వాటిని వేంపల్లె వైపు నుంచి వచ్చే వాటిని ఇడుపులపాయ క్రాస్ వద్ద, రాయచోటి వైపు నుంచి వచ్చే వాటిని అద్దాలమర్రి క్రాస్ వద్ద ఆపేస్తామన్నారు. బస్సులు, కార్లు తదితరాలను భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఉత్సవాల సందర్భంగా పులివెందుల డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతోపాటు సుమారు 130 మంది వరకు సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు రక్త దానం చేసి అపాయంలో ఉన్న ఇతరుల ప్రాణాలను కాపాడాలని ట్రిపుల్ ఐటీకి చెందిన ప్రసాద్ తెలిపారు. గండిలో రక్తదాన శిబిరం కడప రిమ్స్ వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. -
వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మదినం కావడంతో టీటీడీ వారి ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయంలో స్వామివారి కల్యాణమండపం వద్ద చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గోన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించుకొన్నారు. -
● స్టీల్ ప్లాంట్ కోసం..
జమ్మలమడుగు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ పాతపాటే పాడారు.. ఎప్పట్లాగే అబద్ధాలే వల్లె వేశారు. ‘రాయలసీమను హార్టికల్చర్ హాబ్గా మారుస్తా... జిల్లాను పర్యాటక హబ్గా చేస్తా..’ అంటూ అవే డాంబికాలు పోయారు. 2014లో మొదలుపెట్టిన రాగాన్నే మళ్లీ సవరించారు. ఇప్పటివరకు రెండుసార్లు సీఎం హోదాలో పని చేసినా ఇంతవరకు రూపాయి విదిల్చింది లేదు. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందిన దాఖలా అస్సలు లేదు. ప్రపంచ పర్యాటకకేంద్రంగా ఉన్న గండికోటలో హరిత హోటల్ నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయంలోనే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన మౌళిక సదుపాయాలు సైతం కల్పించలేకపోయారు. గండికోట ప్రాజెక్టుకు రెండు సార్లు శిలాఫలకం వేసి ఏం చేశారు.. గండికోటప్రాజెక్టు నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు సార్లు శిలాఫలకం వేశారు. ఏనాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం మొగ్గుచూపలేదు. 2004లో మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం అయిన తర్వాత గండికోట ప్రాజెక్టు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. 22 గ్రామాల ప్రజలకు పరిహారం ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 90 శాతం పనులు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. కేవలం పదిశాతం పనులు మాత్రమే చంద్రబాబు పూర్తి చేసి తామే ప్రాజెక్టు పూర్తి చేశామని చెబుతుండటంతో జిల్లావాసులు,నియోజకవర్గంలోని ప్రజలు నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం రాయలసీమకు సాగు, తాగునీరు అందించేందుకు హంద్రీనీవా– గాలేరు–నగరి ప్రాజెక్టులు శ్రీకారం చుట్టామని చంద్రబాబు చెబుతున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి ఏకంగా గాలేరు–నగరి కాలువల్లో 20 వేల క్యూసె క్కులు వరద నీరు ప్రవహించేవిధంగా కాలువలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అవుకు, లింగాపురం వద్ద కొండలకు టన్నెల్ వేసి నీటిని గండికోట ప్రాజెక్టుకు తరలించేవిధంగా చర్యలుచేపట్టిన ఘనత వైఎస్దే అని జిల్లా వాసులకు తెలియందికాదు. అలాంటి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని సమావేశంలో చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని నియోజకవర్గవాసులు ఎద్దేవా చేస్తున్నారు. ఇక మైల వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కనీసం టీడీపీనే ఆవిర్భవించలేదని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాసుబ్రహ్మానందరెడ్డి 1974లో 100కోట్ల రూపాయలతో మైలవరం జలాశయం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దానిని 1983 నాటికిపూర్తి చేస్తే అప్పటి ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు ప్రారంభోత్సవం చేశారే తప్ప టీడీపీ చేసిందేమీ లేదు. కాలువల్లో నీరు ప్రవహించపోవడం, చివరి ఆయకట్టురైతుకు మైలవరం జలాశయం నుంచి నీరు అందకపోవడంతో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైలవరం ఉత్తర,దక్షిణ కాలువలకు 150 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఉత్తర కాలువ రత్న కంపెనీ, దక్షిణ కాలువ పనులను సీఎం రమేష్ నాయుడుకు చెందిన రిత్విక్ కంపెనీ చేసింది. ఈ విష యం కూడా చంద్రబాబు తెలియకుండా మైలవరం ప్రాజెక్టు సైతం తామే పూర్తిచేశామని చెప్పుకోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో టీడీపీ ప్రభుత్వం గాని చంద్రబాబు గాని నిర్మించిన దాఖలాలులేవు. వచ్చిన ప్రతిసారి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పా జిల్లాకు చేసిందేమీలేదని ప్రజలు వాపోతున్నారు. కాగా చంద్రబాబు ప్రసంగిస్తున్నంత సేపు జనాలు విసుగెత్తిపోయి చూస్తూ ఉండిపోతున్నారే తప్ప ఎటువంటి మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం. ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చెప్పిన మాటలన్ని సుద్ద అబద్ధాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిస్సిగ్గుగా అసత్యాలు వల్లెవేసిన సీఎం చంద్రబాబు గండికోటకు రెండు సార్లు శిలాఫలకం వేసి పైసాకూడ నిధులు కేటాయించలేదు వైఎస్సార్ హాయంలోనే రాయలసీమలోసాగునీటి ప్రాజెక్టులకు మోక్షం 2019 జనవరి 24న మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన చంద్రబాబు ప్లాంట్ నిర్మాణం కోసం ఒక సెంటు భూమి కూడా కేటా యించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సున్నపురాళ్లపల్లె వద్ద 3000 ఎకరాలు వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూమిని కేటాయించడంతోపాటు 70 కోట్ల రూపాయలతో పనులను కూడా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన బాధితులకు పట్టాగలిగిన రైతులకు పరిహారం అందించారు. జిందాల్ కంపెనీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ముందుకు తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ ప్రాంతంలోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టింది. -
అంగళ్లులో హై టెన్షన్.!
కురబలకోట : అన్నమయ్య జిల్లాలోనే అత్యంత వివాదాస్పద భూమిగా పేరు గాంచిన అంగళ్లులోని 220 సర్వే నెంబరు భూమిని గురువారం సర్వేయర్లు కొలతలు నిర్వహించారు. హై టెన్షన్.. ఆపై కట్టుదిట్టమైన భారీ పోలీస్ భద్రత మధ్య మూడు బృందాలతో ఈ సర్వే నిర్వహించారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ పహారాలో తహసీల్దార్ ధనుంజయులు పర్యవేక్షణలో ఉదయం నుంచి మద్యాహ్నం వరకు మండల సర్వేయర్ భువనేశ్వరి నేతృత్వంలో పకడ్బందీగా సర్వే నిర్వహించారు. రెవెన్యూ, పోలీసు వర్గాలు, భూ బాధితుల కథనం మేరకు..అంగళ్లులోని మిట్స్ యూనివర్సిటీ (కదిరి రోడ్డు) మార్గంలో హైవే పక్కన 220 సర్వే నెంబరు ఉంది. ఇందులో నాలుగు లెటర్లలో 69.42 ఎకరాల భూమి ఉంది. ఇందులో 220/4లోని ఐదున్నర ఎకరం అత్యంత వివాదాస్పద భూమిగా మారింది. దీనిపై రాయలసీమ జిల్లాల్లోని పులివెందుల, అనంతపురం, తిరుపతి, హిందూపురం తదితర ప్రాంతాల భూ కబ్జాదారుల కన్నుపడింది. మదనపల్లెకు చెందిన రియల్టర్ స్టోర్ రాజు, అంగళ్లు సుబహాన్ స్వాధీనంలో ఈ భూమి ఉంది. 2017 నుండి ఇక్కడ ప్లాట్లు వేసి 72 మందికి విక్రయించారు. అయితే ఈ భూమి తమదేనని మరికొందరు గత పదేళ్లగా ఈ భూమిపైకి రావడం దౌర్జన్యంగా ఆక్రమించడం జరుగుతూ వస్తోంది. ఫెన్సింగ్ వేయడం ఆ తర్వాత దీనిని అదే స్థాయిలో స్వాధీనంలో ఉన్న భూ ఆసాములు తొలగించడం జరుగుతూ వస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండడంతో పోలీసులకు, రెవెన్యూ అధికారులతో పాటు స్థానికులకు కూడా తలనొప్పిగా పరిణమించింది. రాష్ట్రంలో అధికారం మారినప్పుడల్లా అధికార పార్టీ అండతో ఈ భూమిపై పెత్తనం సాగించడం పరిపాటిగా వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఈ భూమిలో తమకు మూడు ఎకరాల 15 సెంట్లు భూమి ఉందని దీన్ని సర్వే చేసి హద్దులు చూపాలని తిరుపతికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు ఇటీవల స్థానిక తహసీల్దారుకు అర్జీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆ సర్వే నెంబరులోని 35 మంది రైతులకు గురువారం సర్వే నిర్వహిస్తున్నట్లు ముందుగా నోటీసులు కూడా పంపారు. దీంతో ఒక్కసారిగా అంగళ్లు పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. గురువారం రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సబ్ డివిజన్లోని ఎస్ఐలు, పోలీసులు 50 మంది దాకా బందోబస్తు నిర్వహించారు. మండలంలోని సర్వేయర్లు వీఆర్ఓల సహకారం వీఆర్ఏల సాయంతో మూడు బృందాలుగా మొత్తం సర్వే నెంబరులోని భూమిని భౌగోళిక సర్వే నిర్వహించారు. తొలుత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసులు అప్పటికప్పుడే వాటిని సద్దుమణిగించారు. మొత్తానికి హైటెన్షన్ మధ్య సర్వే ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం తర్వాత ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా భారీ పోలీసు బందోబస్తుతో అంగళ్లుతో పాటు పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు పెంచింది. సర్వే సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం హైవేపై గుమికూడారు. సర్వే నివేదిక సిద్ధమైన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు ఉంటాయని తహసీల్దారు ధనుంజయులు తెలిపారు. ఇప్పట్లో తేలేలా లేదు.. ఈ భూమిపై హైకోర్టులో ఓ కేసు నడుస్తుండగా మదనపల్లె సివిల్ కోర్టులో మరో ఏడు కేసులు కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి ఇప్పట్లో 220 భూ వివాదం కొలిక్కి వచ్చేలా లేదు. ప్రస్తుతం సర్వే నిర్వహించినా ఏ మాత్రం ప్రభావం చూపుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో ఈ భూ వివాదానికి కామా తప్ప ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ప్రశ్నార్థకమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అంగళ్లు పరిసర ప్రాంతాల్లో భూములు రేట్లు భగ్గుమంటున్నాయి. దీంతో పలువురు పాత భూ రికార్డులు, లింకు డాక్యుమెంట్లు తిరగేస్తున్నారు. డబ్బు ఆశే భూ వివాదాలకు ప్రధాన కారణంగా మారుతోంది. ఈ భూమి మాదే..కాదు మాది పదేళ్లుగా కొనసాగుతున్న 220 భూ వివాదం భారీ పోలీస్ బందోబస్తు మధ్య సమగ్ర భూ సర్వే -
ఆటో ఢీకొని యువకుడి మృతి
కడప అర్బన్ : కడప నగరం రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి వేగంగా వచ్చి ఆటో ఢీకొనడంతో మణికంఠ(19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కడప వన్ టౌన్ ఎస్ఐ అమరనాథ్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు కమలాపురం మండలానికి చెందిన మణికంఠ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యువకుని తల్లిదండ్రులు శైలజ, గంగాధర్లు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఊరి నుంచి సొంత పని నిమిత్తం కడపకు చేరుకున్నాడు. కడప రైల్వేస్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని ఆటో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు. -
డ్రాగా ముగిసిన అండర్–16 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. మూడో రోజు గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప–అనంతపురం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 242 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 84.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 325 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని ఆదినారాయణరెడ్డి బ్యాటింగ్లో చక్కగా రాణించి 156 పరుగులు చేశాడు. దేవాన్ష్ 47 పరుగులు చేశాడు. కడప జట్టులోని హితేష్ సాయి 3 వికెట్లు, గైబు 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 67.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోకేష్ 85 పరుగులు, ఫైజాన్ 45 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని కిరణ్కుమార్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ అనంతపురం జట్టు ఆధిక్యం సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో చిత్తూరు–కర్నూలు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. గురువారం మూడో రోజు 300 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 111.5 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని వివేక్ 35 పరుగులు చేశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 71.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని విజె నోయెల్ 60 పరుగులు, హర్ష 36 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని వివేక్ 3 వికెట్లు, సాయి విఘ్నేష్ 3 వికెట్లు తీశారు. తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 12 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. దీంతో చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించింది. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ అరెస్టు
మదనపల్లె రూరల్ : వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కలిసి ఎంపీ మిథున్రెడ్డిని లేని లిక్కర్ స్కామ్లో అక్రమంగా అరెస్ట్ చేయించారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్అహ్మద్ అన్నారు. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని, అక్రమంగా అరెస్ట్ అయి జైలులో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని కోరుతూ బుధవారం పట్టణంలోని ప్రసన్న వెంకటరమణస్వామి, బైపాస్రోడ్డు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిసార్అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరాయనేందుకు ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్ట్ ఓ ఉదాహరణ అన్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదంలో ఫైల్స్ దగ్ధమైతే పెద్దిరెడ్డి చేయించారని తప్పుడు కేసులు పెట్టారన్నారు. అటవీ భూములు కబ్జాచేశారని, బుగ్గమఠం భూములు ఆక్రమించారని, అక్రమ మైనింగ్ చేశారని కేసుల మీద కేసులు బనాయించారన్నారు. ప్రతి కేసులోనూ న్యాయపోరాటం చేస్తూ తాము ఏ తప్పు చేయలేదని పెద్దిరెడ్డి కుటుంబం నిజాయితీని నిరూపించుకుంటూనే ఉందన్నారు. అయినా పెద్దిరెడ్డి కుటుంబంపై వ్యక్తిగతంగా చంద్రబాబుకు ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు లేని లిక్కర్ స్కాంను తెరపైకి తీసుకువచ్చి మిథున్రెడ్డిని ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయించారన్నారు. అయితే, ఆయన కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటకు వస్తాడన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్నాయక్, వైఎస్సార్సీపీ నాయకులు డి.మహేష్, ఆవుల మల్లికార్జున, శారదారెడ్డి, అపర్ణ, వినుతాభాయి, మల్లికార్జునరెడ్డి, మధు, నర్సింహులు, యూనస్, ఖిజర్ఖాన్, జబీవుల్లా, యాసిన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా రామయ్య పట్టాభిషేకం
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం పట్టణంలోని శ్రీ పట్టాభిరామాయంలో టీటీడీ ఆధ్వర్యంలో గురువారం శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చన, అభిషేకం, తోమాల సేవ అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితులు స్వామి వారి పట్టాభిషేక మహోత్సవ ఘట్టాన్ని భక్తుల నడుమ ఘనంగా చేపట్టారు. సాయంత్రం ఆలయంలో ఊంజలసేవ మండపంలో ఊంజల సేవ జరిగింది. రాత్రి శ్రీ సీతారామలక్ష్మణులు గరుడ వాహనంపై తిరుమాఢ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమాలలో ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు క్రిష్ణబట్టార్, భాషికాచార్యులు తదితరులు పాల్గొన్నారు. పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన శ్రీసీతారాములను దర్శించుకున్నారు. చింతల ఆనందరెడ్డి, బిడ్డల కేశవరెడ్డి తదితరులు మాజీ ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు. -
ఆర్థిక సౌలభ్యాలను రద్దు చేయడం తగదు
రాయచోటి జగదాంబసెంటర్ : రిటైర్డ్ ఉద్యోగులు సాధించుకున్న ఆర్థిక సౌలభ్యాలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సులభంగా తక్కువ కాల వ్యవధిలో రద్దు ఉత్తర్వులు ఇస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ గురురాజరావు పేర్కొన్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని డైట్ సభా భవనంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాయచోటి డివిజన్ యూనిట్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన గురురాజరావు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములై ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేశారన్నారు. అలాంటి పెన్షనర్లను ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అన్నమయ్య జిల్లా శాఖ అధ్యక్షుడు రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం.రెడ్డన్న, గౌరవాధ్యక్షుడిగా సీఆర్వీ సుబ్రమణ్యం, అసోసియేట్ అధ్యక్షులుగా మల్లికార్జున, రామతులసమ్మ, శ్రీనివాసులు, శివనారాయణరెడ్డి, రామతులశమ్మ, ప్రసాద్, జనరల్ సెక్రటరీగా రఘునాథరెడ్డి, కార్యదర్శులుగా శంకరయ్య, రమేష్బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టీఎంఆర్ చంద్ర, కోశాధికారి ఎన్.లక్ష్మీనారాయణలను ఎన్నుకున్నారు. తిరుపతి జిల్లా శాఖ అసోసియేట్ అధ్యక్షుడు గోపాల్, సంఘం నాయకులు సురేంద్రారెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు. -
చందనకు అభినందన
ఒంటిమిట్ట : ఇస్రో ఎన్ఐఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి బుధవారం పంపిన విషయం తెలిసిందే. ఈ మిషన్లో ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన అవ్వారు చందన తన వంతు పాత్ర పోషించారు. ఈమె రెండు నెలల క్రితం ఓ పెద్ద ప్రమాదంలో గాయపడి తిరిగి కోలుకుని తన ఉద్యోగ బాధ్యతలను కొనసాగించారు. ఈమె బెంగళూరులోని ఇస్రోలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ప్రమాదం నుంచి కోలుకున్న కొన్ని రోజులకే ఆమె మరలా దేశం గర్వించే ప్రయోగంలో పాలుపంచుకోవడాన్ని చూసిన గ్రామస్తులు చందనను పడిలేచిన కెరటంలా అభివర్ణిస్తూ అభినందిస్తున్నారు.ద్విచక్రవాహనాల చోరీకలకడ : ద్విచక్రవాహనాల చోరీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కలకడ ప్రభుత్వ ఆసుపత్రి దారిలో నివాసం ఉన్న బాబుహుస్సేన్కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్, మండలంలోని బాలయ్యగారిపల్లె పంచాయతీ యర్రయ్యగారిపల్లెకు చెందిన సయ్యద్ అహమ్మద్కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనాలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ద్విచక్రవాహనదారులు గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.యోగా పోటీల్లో వైఎస్సార్ కడపకు ఓవరాల్ చాంపియన్ షిప్ టైటిల్యడ్లపాడు : చిలకలూరిపేట మండలం మద్దిరాలలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ పాఠశాలలో జవహర్ నవోదయ విద్యాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ప్రాంతీయస్థాయి యోగాక్రీడా ప్రదర్శన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ టైటిల్ను వైఎస్సార్ కడప క్లస్టర్లోని జేఎన్వీ సాధించుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలోని 8 క్లస్టర్ల నుంచి క్లస్టర్ లెవర్ వరకు జరిగిన యోగా పోటీల్లో గెలుపొందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కృష్ణా, వైఎస్సార్ కడప, బీదర్, షిమోగా, తుమ్మకూర్, పట్నంతిట్టా, వైనాడ్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన 278 మంది క్రీడాకారులు పాల్గొని ఆసనాలు, ఆర్టీస్టిక్, రిథమిక్ విభాగాల్లో యోగా విన్యాసాలు ప్రదర్శించి తమ కళాత్మక నైపుణ్యాలను చాటారు. ఆయా పోటీల్లో రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ కడప క్లస్టర్ జేఎన్వీ ఓవరాల్ ఛాంపియన్ షిప్ను కై వసం చేసుకోగా, కృష్ణా క్లస్టర్ ద్వితీయస్థానంలో నిలిచింది. అన్ని విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచి ఛాంపియన్షిప్గా నిలిచిన వైఎస్సార్ కడప క్లస్టర్ విద్యార్థులను, ద్వితీయస్థానంలో నిలిచిన కృష్ణా క్లస్టర్ విద్యార్థులను పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి షీల్డ్లు, సర్టిఫికెట్లతో సత్కరించారు.యూనిఫాం వెనక్కు ఇవ్వలేదని.. విద్యార్థినిపై చేయిచేసుకున్న టీచర్ప్రొద్దుటూరు కల్చరల్ : యూనిఫాం వెనక్కి ఇవ్వలేదని విద్యార్థినిపై టీచర్ చేయిచేసుకున్న సంఘటన ప్రొద్దుటూరు నడింపల్లె మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం జరిగింది. దస్తగిరిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ముల్లా జుబేరియా ఐదో తరగతి చదువుతోంది. ఈ పాఠశాలలో యూనిఫాం ఇచ్చిన తర్వాత ఆ విద్యార్థిని నడింపల్లె మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చేరింది. తమ పాఠశాలలో తీసుకున్న యూనిఫాం తిరిగి ఇవ్వాలని దస్తగిరిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు షేక్ సబీహా మరొక విద్యార్థితో చెప్పి పంపింది. యూనిఫాం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు గురువారం విద్యార్థిని చదువుతున్న పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో విద్యార్థిని చెంపపై కొట్టి వెళ్లిపోయింది. దీంతో విద్యార్థిని ఏడవడంతో అది విన్న తరగతి గదిలోని ఉపాధ్యాయురాలు సంపూర్ణ వచ్చి పరిశీలించగా విద్యార్థిని చెంపపై వాతలు కనిపించాయి. దీంతో ప్రధానోపాధ్యాయుడు శంకర్ దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీంతో ఆయన ఉపాధ్యాయురాలు సబీహాపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ శోభారాణికి ఫిర్యాదు చేశారు. ఎంఈఓ స్పందిస్తూ శుక్రవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయురాలు షేక్ సబీహాకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
ఆటో డ్రైవర్ నిజాయితీ
కేవీపల్లె : తనకు దొరికిన సెల్ఫోన్ను పోలీసులకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. మండలంలోని గుండ్రేవారిపల్లె క్రాస్కు చెందిన నూరుల్లా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా గురువారం ప్యాసింజర్స్తో కేవీపల్లె నుంచి గుండ్రేవారిపల్లె క్రాస్కు బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలోని గరిమిట్ట సమీపంలో రోడ్డుపై సెల్ఫోన్ పడి ఉండటాన్ని గుర్తించాడు. సుమారు రూ. 30 వేలు విలువైన ఫోన్ను నిజాయితీతో సీపీఐ నాయకులు శ్రీనివాసులతో కలసి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ వెంకటస్వామికి అందజేశారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ మండలంలోని దేవాండ్లపల్లెకు చెందిన వెంకటేష్దిగా గుర్తించి ఆయనకు అప్పగించారు. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ నూరుల్లాను అభినందించారు.భార్యపై కత్తితో దాడిమదనపల్లె రూరల్ : భార్యపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండలో నివాసమున్న కుళ్లాయి నాయక్(40) తన భార్య సుజాతబాయి (36)పై అనుమానంతో మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. అదే విధంగా భర్త మద్యం సేవించడంపై భార్య సుజాతబాయి సైతం గొడవకు దిగేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కుళ్లాయి నాయక్ భార్యపై అనుమానం వ్యక్తం చేసి గొడవకు దిగడంతో వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆవేశానికి లోనైన భర్త తన భార్యపై కత్తితో దాడి చేసి శరీరంపై రెండు చోట్ల పొడిచాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే సుజాతబాయి బంధువులు, కుటుంబ సభ్యులు కుళ్లాయి నాయక్పై దాడి చేసి కొట్టారు. దీంతో అతను గురువారం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.ఆటో–ట్రాక్టర్ ఢీ.. ముగ్గురికి గాయాలుపీలేరురూరల్ : ఆటో – ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని మొరవవడ్డిపల్లె వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వేపులబైలుకు చెందిన ఎ. సురేష్ (45) తన ఆటోలో క్యాటరింగ్ చేసేందుకు తలపులకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పీలేరుకు వస్తూ మార్గమధ్యంలో జాండ్లకు చెందిన షేక్ షకీలా (35), రొంపిచెర్ల మండలం చిచ్చిలివారపల్లె పంచాయతీ గొల్లపల్లెకు చెందిన ప్రభావతి (40) పీలేరుకు వెళ్లడానికి ఆటో ఎక్కారు. అయితే మొరవవడ్డిపల్లె వద్ద పీలేరు నుంచి తలపులకు వెళుతున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద ఆటో పడి నుజ్జునుజ్జయింది. ఆటోలో ఉన్న సురేష్, షకీలా, ప్రభావతికి తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో చికిత్స నిమి త్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్ర మాదం తీవ్ర స్థాయిలో జరిగినా ఆటోలో ముగ్గు రు ప్రాణాలతో బయటపడడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా రమేష్ రెడ్డి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన టి.రమేష్ రెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.విజయవాడలో హజ్ ఎంబార్కేషన్ కేంద్రంమదనపల్లె సిటీ: హజ్యాత్రికుల సౌకర్యార్థం విజయవాడలో కొత్తగా హజ్ ఎంబార్కేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్ఖాన్ తెలిపారు. ఈ నిర్ణయంతో యాత్రికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. యాత్రికులు విజయవాడ కేంద్రంగా ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవాలన్నారు.గురుకులంలో నేరుగా ప్రవేశాలుకడప రూరల్: వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని 24 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి ఖాళీలను భర్తీ చేయడంలో భాగంగా నేరుగా ప్రవేశాలు పొందవచ్చని జిల్లా సమన్వయకర్త ఉదయశ్రీ తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా తరగతుల్లో చేరడానికి, విద్యార్థులు నేరుగా స్థానిక గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్ను సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని అన్నారు.దరఖాస్తు చేసుకోవాలిలక్కిరెడ్డిపల్లి: మండలంలోని దివ్యాంగులు వినికిడి యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల సంఘం జిల్లాఅధ్యక్షుడు చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి అవసరాలను బట్టి భారత ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ దివ్యాంగులకు పరీక్ష నిర్వహించి వినికిడి యంత్రాలను అందజేస్తుందని తెలిపారు. చేతి కర్రలు, వాకర్లు, మూడు కాళ్ల వాహనాలు, నాలుగు చేతి కర్రలు, వీల్ చైర్లు, తోపుడుబండ్లు, బ్యాటరీ సైకిళ్లు, మూడు చక్రాల సైకిళ్లు అందించనున్నట్లు చెప్పారు. ఆగస్టు 6న లక్కిరెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఢిల్లీ బృందం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.వారంలోపు వినికిడి యంత్రాలు అందజేస్తారన్నారు.అది అసత్య ప్రచారంరాయచోటి టౌన్: రాయలసీమ ప్రాంతానికి చెందిన కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు గృహ హింస చట్టం–2005 అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అసత్యపు ప్రచారమని జిల్లా సీ్త్ర, శిశుసంక్షేమ, సాధికారత అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గృహహింస చట్టం–2005ను ఆంద్రప్రదేశ్ ప్రభు త్వం ద్వారా జిల్లా స్థాయిలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాఽధికారత అధికారి ఆధ్వర్యంలో మాత్రమే అమలు జరుగుతోందన్నారు. గృహ హింసలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు గృహహింస నుంచి రక్షణ పొందేందుకు జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీలోని శిశుసంక్షేమ, సాధికారత కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని సూచించారు.2న అన్నదాత సుఖీభవ కార్యక్రమంరాయచోటి: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కార్యక్రమం నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్, పేదరికం లేని సమాజం – పీ4 కార్యక్రమం, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ శ్రీధర్, సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. అ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో నగదు బదిలీ కార్యక్రమం జరుగుతుందని అధికారులకు సూచించారు. -
వేతనాలు అందక వెతలు
ఎదురుచూపులు కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పది రకాల పాఠశాలల్లో 5 రకాల పాఠశాలల ఉపాధ్యాయులు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అప్గ్రేడ్ అయిన ప్రాథమికోన్నత, కొత్తగా ఏర్పాటైన మోడల్ ప్రైమరీ పాఠశా లలు, కొత్తగా పదోన్నతులు పొందిన స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్ఎంలకు జీతాలు రాలేదు. వీరందరికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ పాఠ శాలలకు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలను కేటాయించారు. వాస్తవానికి ఆ పాఠశాలల్లో గతంలో కేడర్ స్ట్రెంత్కు అనుగుణంగా ఉన్న పోస్టులకు జీతాలు చేసే వీలుంటుంది. కొత్తగా వచ్చిన పోస్టులకు పొజిషల్ ఐడీలు కేటాయించిన తరువాతే జీతాలకు అవకాశం ఉంటుంది. అప్గ్రేడ్ అయిన యూపీ స్కూళ్ల టీచర్లకుఇదే ప్రధాన సమస్యగా మారింది. ● పొజిషన్ ఐడీలు కేటాయింపుల్లో నిర్లక్ష్యం ● జీతాలు రాక అవస్థలు పడుతున్న టీచర్లు ● విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపాటు మదనపల్లె సిటీ: బదిలీలు ఉపాధ్యాయులకు శాపంగా మారాయి. ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా స్థాన చలనం కలిగిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యాశాఖ పొజిషన్ ఐడీలు ఇవ్వకపోవడంతో జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. బదిలీల సాకుతో వారికి జీతాలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడుతున్నాయి. ● కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయ బదిలీ చట్టం ద్వారా ఇటీవల పలువరు టీచర్లకు పదోన్నతులు,బదిలీలు జరిగాయి. వీరిలో వేలాది మందికి పొజిషన్ ఐడీలు రాక జూన్ నెల నుంచి ఇప్పటి వరకు జీతం అందలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4,737 ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 18,540 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 వేల మందిని బదిలీ చేశారు. అదే విధంగా హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు 800 వరకు ఉన్నారు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో 4217 మంది వివిధ క్యాడర్లలో బదిలీ అయ్యారు. వీరిలో 202 మంది గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, 1815 మంది స్కూల్ అసిస్టెంట్లు, 2047 మంది సెకండ్ గ్రేడ్ టీచర్లు, 114 మంది లాంగ్వేజ్ పండిట్లు, 11 మంది ఏఆర్టీ క్రాఫ్ట్,మ్యూజిక్ ఒకేషన్ టీచర్లు, 28 మంది పీడీలు ఉన్నారు. బదిలీలు సాధారణంగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓలకు సమాచారం అందిస్తారు. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నా వీరి స్థానం మారడంతో బదిలీ అయిన స్థానానికి పొజిషన్ ఐడీ కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సీఎఫ్ఎంఎస్లో వారి వివరాలు కనిపిస్తాయి. అప్పుడు జీతాలు చెల్లించడానికి వీలుంటుందని ఉద్యోగ,ఉపాధ్యాయులు చెబుతున్నారు. అన్యాయం పొజిషన్ ఐడీలు ఇవ్వకుండాఆ ఆలస్యం చేయడం అన్యాయం. నెలల తరబడి ఐడీల పేరుతో జీతాలు ఇవ్వకపోవడం సరికాదు.ఈ సమస్య రాష్ట్రం మొత్తం ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా అలసత్వం వహించడం సరికాదు. –రెడ్డప్పరెడ్డి, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడుపొజిషన్ ఐడీలు మంజూరు చేయాలి పొజిషనల్ ఐడీలు మంజూరు చేయాలి. టీచర్ల పట్ల ఇంత చులకన భావన ఎందుకో..రెండు నెలల జీతాలు రాకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.. కేడర్స్ట్రెంత్ నివేదికలు సిద్ధం చేసి పొజిషన్ ఐడీలు ఇవ్వడం పట్ల అలసత్వం వహించడం దారుణం. –ఆర్.వి.రమణ, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి -
ధరలు పెరిగినా లాభం రాలేదు
గత సంవత్సరం రెండెకరాల్లో బొప్పాయి పండించా. అయితే గాలికి, తెగుళ్లకు పూర్తిగా దెబ్బతింది. పంట కొద్దిగా వచ్చినా ధర పెరిగిందనుకున్నా.అంతలోనే తగ్గించారు. రెండు సంవత్సరాలు నష్టాలు వస్తే ఒక్క సంవత్సరం కూడా లాభాలు రావడంలేదు. – ఎంసుబ్బరాయుడు, రైతు, సిద్దారెడ్డిపల్లి, చిట్వేలి మండలం. దళారుల మోసాలతో నష్టాలు బొప్పాయి పంట నాణ్యంగా పండించినా చివరకు దళారుల దెబ్బకు అప్పులే మిగులుతున్నా యి. పంటలకు గిట్టు బాటు ధరలు కల్పించి ఆదుకోవాలి. అలాగే బొప్పాయి వ్యాపా రాన్ని చట్ట బద్దత చేసి ప్రభుత్వం ధరలను పర్యవేక్షించాలి. –భూమాశివశంకర్రెడ్డి, రైతు,బుడుగుంటపల్లి, రైల్వేకోడూరు -
కల్లబొల్లి మాటలు మాని రైతులను ఆదుకోండి
రైల్వేకోడూరు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక కూటమి నాయకులు కల్లబొల్లి మాటలు మాని వెంటనే బొప్పాయి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.గురువారం స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయ రంగం అతలాకుతలమైందని తెలిపారు. రైతులు ప్రతి సారీ రోడ్డెక్కే పరిస్థితి రావడం దురదుష్టకరమని పేర్కొన్నారు. కోసిన పంట అమ్ముడుపోక ఉన్న ధరకు అమ్ముకోలేక తోటలలోనే వదిలేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం, కూటమి నాయకులు మాయమాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఏనాడు రైతులు కష్టాల పాలవ్వలేదన్నారు. అన్నదాతలను అన్నిర కాలుగా ఆదుకున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, నాయకులు సీహెచ్ రమేష్, నందబాల, మండారు మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
‘ఇరగంరెడ్డి’ నామినేషన్ దాఖలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట, పులివెందుల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు గురువారం ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరుపున ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, టక్కోలు శివారెడ్డి, చేశారు. జనసేన పార్టీ తరుపున కోనేటి హరి వెంకట రమణ, స్వతంత్య్ర అభ్యర్థిగా వై.మధుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. జెడ్పీసీఈఓ ఓబులమ్మకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి,, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ అధ్యక్షుడె టక్కోలు శివారెడ్డి, రాజంపేట నియోజకవర్గం యూత్ వింగ్ అధ్యక్షుడు కుండ్ల ఓబుల్ రెడ్డి, పార్టీ నాయకులు మేకపాటి నందకిషోర్ రెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ దున్నుతల లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ● ఒంటిమిట్టలో ఏలేశ్వరం మధుమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కడప సిఈఓ కార్యాలయంలో ఓబులమ్మకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ● పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరుపున తుమ్మల హేమంత్రెడ్డి రెండు, తుమ్మల ఉమాదేవి రెండు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఓబులమ్మకు సమర్పించారు. దీంతో రెండోరోజు నాటికి 13 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఆగస్టు 31లోపు నాటుసారా రహితంగా జిల్లా
మదనపల్లె రూరల్: జిల్లాను ఆగస్టు 31లోపు నాటుసారా రహితంగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ ఎకై ్సజ్ సూపరిండెంట్ వై.జోగీంద్ర తెలిపారు. బుధవారం స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో సీఐ భీమలింగతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 71 సారా తయారీ గ్రామాలను గుర్తించామని, వాటిలో ఇప్పటివరకు 55 గ్రామాలను సారారహితంగా తీర్చిదిద్దామన్నారు. వి నవోదయం 2.0 కార్యక్రమం కింద జిల్లాలో 325 మందికి ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలను చూపి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కలెక్టర్ నిర్ణయం తర్వాత వారందరికీ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ప్రతి మద్యం షాపు వద్ద ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశామని, నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తిస్తే ప్రజలు సెల్ఫోన్లో స్కాన్ చేసి, ఫిర్యాదుచేయవచ్చన్నారు. మద్యంషాపుల్లో ఎంఆర్పీ ధరలకు మించి ఎక్కువగా అమ్ముతున్నా, గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నా... ఎకై ్సజ్శాఖ టోల్ ఫ్రీనెంబర్ 14405కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలన్నారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి మండలంలో అడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కనిపిస్తోంది. గురువారం మండల పరిధి కొండమాచుపల్లి గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటం, ఆయన ప్రవేశపెట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే గోడపత్రాలు కనిపిస్తున్నాయి. ఈ పంచాయతీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి సంఘటనలు బయటపడడం ఇది రెండోసారి, అలాగే కొత్త మాధవరం గ్రాంమలోని పెద్దరోడ్డు వీధిలో టీడీపీ జెండా ఎగురుతూ కనిపించింది. సంబంధిత ఎన్నికల అధికారి కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారని ప్రజలు అంటున్నారు. -
నేడు వైఎస్ఆర్ జిల్లాకు సీఎం చంద్రబాబు రాక
కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం ఆగస్టు 1న జమ్మలమడుగు మండలంలో పర్యటిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా గూడెం చెరువు గ్రామంలో లబ్ధిదారు గృహానికి వెళ్లి పింఛన్ల పంపిణీ, ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే నానుబాల యల్లప్ప ఫంక్షన్ హాలులో స్థానిక నేతలతో భేటీ , అనంతరం గండికోటలో పలు అభివృద్ధి ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు. సీఎం షెడ్యూల్ ఉదయం 11.45 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టరులో బయల్దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు జమ్మలమడుగులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోనీ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 12.25కు గూడెంచెరువుకు చేరుకుంటారు. 12.45 వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. 12.50 గంటలకు గూడెంచెరువులోని ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. 2 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. 2.35 నుంచి 3.35 వరకు నానుబాల యల్లప్ప ఫంక్షన్ హాల్లో స్థానిక కేడర్ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం 3.45కు హెలిక్యాప్టరులో బయల్దేరి 3.55 గంటలకు గండికోట హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 4.05 గంటలకి గండికోటలో ఓబెరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4:35 గంటల నుండి 5:25 గంటల వరకు జెకె రిసార్ట్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన స్టేక్ హోల్డర్స్, ప్రాజెక్టు డెవలపర్లతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.50కి కడప విమానాశ్రయం చేరుకుంటారు. 6.00 గంటలకు కడప నుంచి బయలుదేరుతారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలి జమ్మలమడుగు రూరల్: సీఎం నారా చంద్రబాబు నాయుడి జమ్మలమడుగు పర్యటనను కలసికట్టుగా విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత అన్నారు. శుక్ర వారం జమ్మలమడుగు మండలపరిధిలోని గూడెంచెరువు గ్రామంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆమె ముఖ్యమంత్రి పర్యటన సలహాదారు పెందుర్తి వెంకటేశ్ జిల్లా నేతలతో కలిసి పర్యవేక్షించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారా యణరెడ్డి, జమ్మలమడుగు ఇంఛార్జీ భూపేష్రెడ్డి , ఆర్డీఓలు జాన్ ఎర్విన్, చంద్రమోహన్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
రాజంపేట : రైల్వేకోడూరులో బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధరల కల్పించే విషయంలో సిండికేట్లు వెనక్కి తగ్గడం లేదంటూ బుధవారం రాజంపేట సబ్కలెక్టర్ వైఖోమానైదియాదేవికి రైతు సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టరేట్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్, రైతు సంఘం జిల్లానేత పందికాళ్ల మణి మాట్లాడుతూ రైల్వేకోడూరు బొప్పాయి వ్యాపారులు,సేట్లు సిండికేట్ కావడంతో బొప్పాయి రైతులకు ధర తగ్గిస్తున్నారన్నారు. కోట్లలో వ్యాపారం చేస్తున్న వారికి ఎలాంటి ౖలైసెన్స్లు లేవన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. టన్నుపై రైతు లక్షన్నర నష్టపోతున్నాడన్నారు. మరో వైపు 1000 కేజిలకు 100 కేజిలు సూటు పేరుతో రైతును దగా చేస్తున్నారన్నారు. కిలో రూ.25 ధర కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. రెండు రోజుల్లో బొప్పాయి రైతుల ధరల సమస్య పరిష్కరిస్తామని సబ్కలెక్టర్ వైఖోమా నైదియాదేవి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు నేతలు ఆదినారాయణ, తుంగ శివకృష్ణ, మన్నూరు విశ్వనాథరెడ్డి, తిరుమల చరణ్, ఈర్ల ఈశ్వరయ్య, ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల ఘర్షణ
సుండుపల్లె : మండల పరిధిలోని జి.రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీలో భూ ఆక్రమణపై టీడీపీలోని ఇరువర్గాల నాయకుల మధ్య వివాదం చెలరేగింది. బుధవారం ఆక్రమిత స్థలం వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. అసభ్య పదజాలాలతో దూషించుకుంటూ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఇదంతా చూస్తున్న రెవెన్యూ అధికారులు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. వివరాలు ఇలా.. మండల పరిధిలోని జి.రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కోనంకివాండ్లపల్లె సమీపంలో సర్వే నెంబర్ 731–4లో 0.73 సెంట్లు ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన మేడా వర్గీయుడు అరుణ్కుమార్ ఆక్రమించాడని జగన్మోహన్రాజు వర్గీయులు ఆంజనేయులు నాయుడు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై బుధవారం రెవెన్యూ అధికారులు ఆక్రమిత స్థలం వద్దకు పరిశీలనకు వచ్చారు. అయితే అక్కడికి ఫిర్యాదు చేసిన వారు కూడా రావడంతో ఇరువర్గాలు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ గొడవపడ్డారు. జగన్మోహన్రాజు వర్గానికి చెందిన కనికలపాటి ఆంజనేయులు తనను జొన్నల అరుణ్కుమార్, వెంకటరమణ, ఉగ్గారపు శివకుమార్ అసభ్యకరంగా దూషించి కొట్టారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏఎస్ఐ అయూబ్ఖాన్ కేసు నమోదు చేశారు. -
‘మిట్స్’ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు
కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలోని బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు మూడేళ్ల పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ (ఎన్బీఎ) గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపాల్ యువరాజ్ బుధవారం తెలిపారు. ఇది విద్యా నైపుణ్యం, నాణ్యమైన విద్య, ఫలితాల ఆధారిత అభ్యాసానికి గుర్తింపు అన్నారు. ఎన్బీఏ అక్రిడేషన్ వల్ల విద్యార్థులకు ఉద్యోగావకాశాల్లో కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తాయన్నారు. ఇక్కడి డిగ్రీలకు విదేశాల్లోను గుర్తింపు ఉంటుందన్నారు. విదేశీ ఉన్నత చదువులకు కూడా అవకాశం పెరుగుతుందన్నారు.వందశాతం పింఛన్ల పంపిణీ చేపట్టాలి: కలెక్టర్రాయచోటి: జిల్లాలో ఆగస్టు ఒకటో తారీఖున వందశాతం పింఛన్ల పంపిణీని చేపట్టాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లో డీఆర్డీఏ పీడీ, మున్సిపల్ కమిషనర్లు, డీపిఓ, ఎంపీడీవోలు, తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆగస్టు 1న జరగబోయే పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై సమీక్షించారు. పింఛను పంపిణీ చేసేవారు లబ్ధిదారులతో గౌరవంగా మెలగాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులకు ముందస్తు సమాచారాన్ని టామ్ టామ్, ఇతర మాధ్యమాల ద్వారా అందించాలని, వారు ఇంటి వద్దనే ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ, ఎల్డీఎం ఆంజనేయులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.దరఖాస్తుల ఆహ్వానంరాజంపేట: రాజంపేట ఆర్టీసీ డిపోలో ఆన్కాల్ డ్రైవర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజరు గుండాల రమణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవుట్సోర్సింగ్ విధానంలో ఎంపికై న డ్రైవర్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు 18 నెలల అనుభవం కలిగి ఉండాలన్నారు. ప్రతి డ్రైవర్కు లైసెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు.మెడికల్ ఫిట్తో డ్రైవర్లను శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పూర్తయ్యాక విధుల్లోకి తీసుకుంటామన్నారు. ఆసక్తి కలిగిన డ్రైవర్లు అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్), రాజంపేట డిపోలో సంప్రందించాలన్నారు.వివరాలకు 6281612051, 7382868441 నంబర్లలో సంప్రందించాలన్నారు.మదనపల్లె సిటీ: ఆన్కాల్ పద్ధతిపై డ్రైవర్ పోస్టులకు అర్హులైన వారిని ఎంపిక చేయనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆర్టీఓ క్లియరెన్స్ అర్హత సర్టిఫికెట్లతో వన్ డిపో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.పీలేరురూరల్: పీలేరు ఆర్టీసీ డిపోలో ఆన్కాల్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎం బి. నిర్మల తెలిపారు.ఆర్టీఓ క్లియరెన్స్ సర్టి ఫికెట్ తీసుకుని డిపో మేనేజర్ కార్యాలయంలో ఆఫీస్ వేళల్లో సంప్రదించాలని ఆమె కోరారు.ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా ఎదగాలికడప సెవెన్రోడ్స్ : ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ది చెందాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ అధికారి ఎస్.సురేష్ అన్నారు. బుధ వారం కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎన్ఈ మంత్రిత్వశాఖ, జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ సంయుక్తాధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యకమం నిర్వహించారు. ఈ సందర్భంగా హబ్ అధికారి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ యూనిట్లను రీఎంబర్స్మెంట్ పథకాలలో నమోదు చేసుకుని లబ్ది పొందాలని సూచించారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పారిశ్రామిక సంస్థలు ముందుకు రావాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్షన్ నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. లీడ్ బ్యాంకు మేనేజర్ జనార్దన్, పరిశ్రమలశాఖ జీఎం చాంద్బాష, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, జా తీయ ఎస్సీ ఎస్టీ హబ్ సభ్యులు వసంత్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు పాల్గొన్నారు. -
నిధుల కోసం నిరీక్షణ
కాశినాయన : పంచాయతీలకు మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులను కూటమి ప్రభుత్వం దారి మళ్లించింది. కేంద్రం మంజూరు చేసిన ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలకు జమ చేయడం లేదు. రెండు విడతలుగా కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు వినియోగించుకుంటూ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. దీంతో గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం పనులకు ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం వానా కాలం కావడంతో గ్రామాల్లో కాలువల్లో పూడికతీత, బ్లీచింగ్ చల్లించడంతోపాటు దోమల నివారణకు ఫాగింగ్ చేయడం వంటి పనులకు సైతం నిధులు లేని పరిస్థితి నెలకొందని గ్రామ పంచాయతీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాల్లో 802 గ్రామ పంచాయతీలు ఉమ్మడి కడప జిల్లాలో 802 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు ఏటా రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. సంవత్సరానికి మూడు సార్లు ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే రెండు విడతల్లో 802 గ్రామ పంచాయతీలకు రూ.98 కోట్లకుపైగా జిల్లాకు నిధులు మంజూరవుతాయి. ఈ నిధులను జనాభా ప్రాతిపదికను గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.910 కోట్లపైగా నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు నేటికీ గ్రామ పంచాయతీలకు అందలేదు. కేంద్రం మంజూరు చేసిన నిధులను ప్రభుత్వం దారి మళ్లించి కాలయాపన చేస్తోందని సర్పంచ్లు వాపోతున్నారు. పారిశుధ్యం అధ్వానం.. వర్షాకాలం అయినందు వల్ల గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. తాగునీటి బోర్లు రిపేరు చేసేందుకు నిధులు లేక సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తే గ్రామాల్లో తాగునీటి సమస్యతోపాటు కాలువల్లో పూడికతీత పనులు, తాగునీటి పైపులైన్లు, బోర్ల రిపేరులకు వాడుకుంటారని సర్పంచ్లు అంటున్నారు. ఫిబ్రవరిలో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం 2026 ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా సర్పంచ్లు సొంత డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఇంత వరకు బిల్లులు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురు చూపులు 15వ ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడు పంచాయతీ ఖాతాల్లో జమ అవుతాయా అని గ్రామ సర్పంచ్లు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా రూ.98 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. ఇప్పటికే పారిశుధ్యం, తాగునీటి అవసరాల కోసం సర్పంచ్లు తమ జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజా అవసరాలను తీర్చుతున్నారు. పనులు చేయకపోతే జిల్లా స్థాయి అధికారులు టార్గెట్ చేస్తున్నారని, గత్యంతరం లేక కొందరు సర్పంచ్లు, కార్యదర్శులు వడ్డీలకు అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. ఎప్పుడు నిధులు మంజూరవుతాయో తెలయడం లేదని, వడ్డీలు మాత్రం కట్టాల్సి వస్తోందని కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని సర్పంచ్లు కోరుతున్నారు. అందని 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులను కూటమి ప్రభుత్వం దారి మళ్లింపు 7 నెలలుగా పంచాయతీ ఖాతాల్లో జమ కాని నిధులు ఫిబ్రవరితో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న సర్పంచులు -
కాలం చెల్లిన రూపాయి అద్దె
రాజంపేట: దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే పురపాలక స్థలానికి అద్దె రూపాయి చెల్లించేవారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..ఇది నిజం..ఇది ఎక్కడో కాదు.. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని పాతబస్టాండు నడిబొడ్డున తిరుపతి వైపు ఉన్న వంకదారి సత్యనారాయణ పెట్రోలు బంకు కథ.. రాజంపేటలో ఇంటి బాడుగలు ఆకాశంలో ఉంటాయి.అలాంటిది ఏకంగా 19 సెంట్ల స్థలం ఆరుదశాబ్దాలకు పైగా రూపాయి అద్దెతో కొనసాగేది. ఎట్టకేలకు ఈ స్థలం పురపాలికపరమైంది. పెట్రోలు బంకు స్వాధీనానికి పురపాలక సంఘం చర్యలు తీసుకుంది. ఈ స్థలాన్ని పురపాలికపరం చేయడంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి కృషి ప్రశంసనీయమని పట్టణవాసులు చెబుతున్నారు.ఆయన చైర్మన్ అయిన తర్వాత కౌన్సిల్ సహకారంతో రూ.అద్దె వ్యవహారానికి స్వస్తి పలికించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పరోక్షంగా పెట్రోలు బంక్ ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అవకాశాలు ఆవిష్కృతం కానున్నాయి. ● 19 సెంట్ల స్థలాన్ని 69 ఏళ్లుగా రూపాయి అద్దెతో కొనసాగిస్తున్నారు. ఈమేరకు బుధవారం చైర్మన్ పోలా శ్రీనువాసులరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో పెట్రోలు బంకు పురపాలికపరమైనట్లుగా ప్రకటించారు. ఈ ప్రతిపాదనను కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. సంబంధిత పెట్రోలు బంక్ యాజమాన్యం కూడా మున్సిపాలిటీకి ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు కౌన్సిల్వర్గాలు తెలిపాయి. ఫలితంగా మున్సిపాలిటీకి అదనంగా ఆదాయం వచ్చేందుకు మార్గం సుగమమైంది. నోటీసులిచ్చినా.. సుమారు 40 సంవత్సరాలుగా రూపాయి కూడా అద్దె చెల్లించకుండా ఉచితంగా పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు.ఈ విషయంలో చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి రంగప్రవేశం చేశారు. మున్సిపాలిటీ వారు నోటీసులు అందచేశారు. వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇందుకు నిర్వహకులు రెండు మాసాలు గడువు కోరారు. రెండునెలలు పూర్తయినా పెట్రోలు బంకు నిర్వాహకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. దీంతో పురపాలక సంఘం కౌన్సిల్ సీరియస్గా తీసుకుంది. ఎట్టకేలకు పెట్రోలుబంకు స్థలాన్ని కై వసం చేసుకుంది. లీజు వ్యవహారం ఇలా.. 69ఏళ్లుగా కొనసాగుతున్న తంతుకు మంగళం రూ. కోట్లు విలువ చేసే స్థలం పురపాలిక పరం పురపాలిక స్థలం స్వాధీనం స్థలం విషయంపై కౌన్సి ల్ ఏకగ్రీవం తీర్మానం చేసింది. 2015 నుంచి జనవరి 24వ తేదీ వరకు స్థలం నిర్వహకులకు అనేక మార్లు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం దీనిని స్వాధీనం చేసుకున్నారు. దీని వల్ల పరోక్షంగా పురపాలక సంఘానికి ఆదాయ వనరులు సమకూరుతాయి. అంతేకాకుండా పెట్రో లు బంక్ నిర్వహణ మున్సిపాలిటీనే చూసుకునేలా కౌన్సిల్లో ప్రతిపాదనలు పెట్టాం. –పోలా శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ చైర్మన్1954లో సర్వే నంబరు 961/ఏలో రాజంపేట పురపాలకసంఘానికి(అప్పట్లో మేజర్ పంచాయతీ) సంబంధించిన 19 సెంట్ల స్థలాన్ని వంకదారి సత్యనారాయణ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అప్పట్లో కేవలం రూపాయి అద్దెతో ఆ స్థలాన్ని నేటి వరకు వినియోగించకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో పెట్రోలు బంక్ను ఏర్పాటుచేశారు. భారత్పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లీజుకు తీసుకుంది. స్థలానికి సంబంధించి అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు. అగ్రిమెంట్ కాలం ముగిసి కొన్ని సంవత్సరాలు అవుతోంది. -
కమనీయం.. పట్టాభిరాముడి కల్యాణం
కలికిరి(వాల్మీకిపురం): వాల్మీకిపురం పట్టణంలోని శ్రీపట్టాభిరామాలయంలో బుధవారం పట్టాభిషేక మహోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, మూలవర్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామలక్ష్మణులకు వేద పండితులు స్నపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం ఆలయ ఆవరణలోని మండపంలో సీతారాముల శాంతి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం ఊంజల్ సేవ చేశారు. రాత్రి హనుమంత వాహనంపై సీతారామలక్ష్మణులను మాడ వీధులలో ఊరేగించారు.భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు క్రిష్ణబట్టార్, భాష్యకాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ● పట్టాభిషేకం మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, శ్రీరామ పట్టాభిషేకం, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రికి గురుడ వాహనంపై శ్రీసీతారాముల విహారం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. -
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల అరెస్టు
గుర్రంకొండ : అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 కిలోల గంజాయిని, ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. వాల్మీకిపురం సీఐ ప్రసాద్ , గుర్రంకొండ ఇన్చార్జి ఎస్ఐ చంద్రశేఖర్లు గత రాత్రి గుర్రంకొండలో నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది అనుమానిత వ్యక్తులు ప్లాస్టిక్ సంచుల్ని కలిగి ఉండడం గమనించి వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. దుర్గంధం వెదజల్లుతున్న నాలుగు కిలోల గంజాయిని ఒక సెల్ఫోన్ను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నిందితుల్లో ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు పీలేరు టౌన్లోని పీలేరు– కలకడ మార్గంలోని దినకర్ హోటల్ వెనుక మాటు వేసి గంజాయి విక్రయిస్తున్న వారిపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 16 కిలోల గంజాయిని, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ముఠాలుగా ఏర్పడి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుశాంత మహానంద వద్దనుంచి గంజాయిని కొనుగోలు చేసి జిల్లాలో విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో బుధవారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుశాంత మహనంద(27), జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన షేక్ నౌషాద్ అహ్మద్(26) షేక్ ఇర్షాద్ అహ్మద్ (27, గుర్రంకొండకు చెందిన కలకడ ఆదిల్(21), టి.గణేష్(19) చిత్తురు జిల్లా ఐరాల మండలానికి ఎస్ సిద్దయ్య(55), చిన్నమండెం మండలానికి చెందిన షేక్ ఫహాద్ అలీ(21), రాయచోటికి చెందిన గుండ్లపెంట ఆసీఫ్(23), బగినేని ప్రతాప్(24), షేక్ మహమ్మద్ అలీ(30)లను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద ఉన్న 20 కిలోల గంజాయి, ఎనిమిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసులో గుర్రంకొండకు చెందిన కమాల్ పరారీలో ఉన్నాడు. గంజాయి ముఠాసభ్యుల్ని రిమాండ్ నిమిత్తం వాల్మీకిపురం కోర్టుక తరలించారు. గంజాయి ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేశారు. మరికొంతమంది పోలీస్ ఉన్నతాధికారులకు రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం సీఐ ప్రసాద్, గుర్రంకొండ ఇన్చార్జి ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐలు గజేంద్ర, బొజ్జానాయక్, హెడ్కానిస్టేబుళ్లు నాగరాజ నాయక్, అబ్దుల్లా, రిజ్వాన్ పాల్గొన్నారు. -
అంతా మదనపల్లె నుంచే..
తదుపరి చర్యలు ఏమిటి.. ● మంత్రి సమీక్షలో బట్టబయలైన అధికారుల తీరు ● 2018లో కుప్పంకు హంద్రీ–నీవా డివిజన్–12 కేటాయింపు ● కుప్పంలో ఏర్పాటు చేయకుండామదనపల్లె ఎస్ఈ కార్యాలయంలోనేడివిజన్ నిర్వహణ ● సీఎం చంద్రబాబుకే మస్కా ● రూ.169 కోట్ల పనులున్నా మదనపల్లె నుంచే పర్యవేక్షణ ● అధికారులు హెడ్క్వార్టర్ కుప్పంలోనివాసం లేరని మంత్రే నిర్దారణ మదనపల్లె: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పని చేయాల్సిన హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులు కుప్పానికి వెళ్లకుండా మదనపల్లెను వదలకుండా ఉండిపోతున్నారు. కుప్పంలో రూ. కోట్ల పనులు జరుగుతున్నా మేం ఇక్కడే ఉంటాం.. ఇక్కడినుంచే పర్యవేక్షిస్తామన్నట్లుగా అధికారుల ధోరణి వ్యక్త మవుతోంది. సాధారణంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించే సాహసం ఏ అధికారి చేయడు. అయితే హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులకు మాత్రం ధైర్యం, సాహసం ఉందని చెప్పాలి. 2018లో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకు హంద్రీ–నీవా డివిజన్–12 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా కుప్పానికి తరలి అక్కడినుంచే పాలన సాగించాలి. అయితే ఈ ఉత్తర్వు కేవలం కాగితానికే పరిమితమైపోయింది. ఈ ఉత్తర్వు సమయంలో కుప్పం ఉపకాలువ పనులు సాగుతున్నాయి. వీటి పర్యవేక్షణ సులువుగా, అధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం ఒకటి తలిస్తే ప్రాజెక్టు అధికారులు మరోకటి తలిచారు. సీఎం నియోజకవర్గమైతే మాకేంటి అనుకున్నారేమో కుప్పంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయకుండా, మదనపల్లె నుంచే విధులు నిర్వహించే సాహసం హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులది. 2015లో రూ.430 కోట్లతో టీడీపీ ప్రభుత్వం కుప్పం ఉపకాలువ పనులను చేపట్టింది. దీనితో అప్పటినుంచి మదనపల్లె ఎస్ఈ కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్న అధికారులు మదనపల్లె నుంచి కాకుండా కుప్పంలో ఉంటూ విధులు నిర్వహించేలా 2018లో కుప్పానికి డివిజన్ మంజూరు చేశారు. ఉన్నతాధికారులు కుప్పంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేసి.ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇద్దరు డీఈఈలు, ఆరుగురు జేఈలు, ఆరుగురు క్లరికల్ సిబ్బంది, నలుగురు సాంకేతిక సిబ్బంది, మరో ఆరుగురు సాబార్డినేట్ సిబ్బంది ఇక్కడి నుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఇందులో చిత్తూరుజిల్లా వీ.కోటలో ఒక డీఈ, పలమనేరులో ఒక డీఈ వారికింద కొందరు జేఈలు విధుల్లో ఉండాలి. అయితే ఇప్పటివరకు డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి సాహసానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈఈకి మూడు చార్జ్ మెమోలు కుప్పం లైనింగ్ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లుకు ఏకంగా మూడు చార్జ్ మెమోలను జారీ చేయాలని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించడం హంద్రీ–నీవా ప్రాజెక్టు వర్గాల్లో కలకలం రేగాలి. అయితే దీనిపై అధికారులు టేకి ట్ఈజీ అన్న ధోరణిలో కనిపిస్తున్నారు. సాక్షాత్తు మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీస స్పందనం లేదు. మంగళవారం మంత్రి ప్రాజెక్టు ఉపకాలువల పనులపై జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. కుప్పం కాలువ పనులకు సంబంధించి ఈఈ వెంకటేశ్వర్లు మీటింగ్కు హజరుకాలేదు. దీనికితోడు హెడ్క్వార్టర్ కుప్పం లేరని నిర్దారించి చర్యలకు ఉపక్రమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒకటి..హెడ్ క్వార్టర్లో ఈఈ నివాసం ఉండకపోవడం, రెండు..లైనింగ్ పనుల పూర్తిలో చురుగ్గా వ్యవహరించకపోవడం, మూడు..సమావేశాలకు హజరుకాకపోవడంపై చార్జ్ మెమోలను ఇవ్వాలని ఆదేశించారు. ఈ చార్జ్మెమోలను తిరుపతి చీఫ్ ఇంజనీర్ జారీ చేస్తారని ఎస్ఈ విఠల్ప్రసాద్ బుధవారం సాక్షికి చెప్పారు. ఈఈకి మూడు చార్జ్మెమోలను ఇవ్వాలని ఆదేశించిన మంత్రి మదనపల్లెలో జరుగుతున్న కుప్పం డివిజన్ కార్యకలాపాలపై దృష్టి పెడతారా లేదా అన్నది తేలాలి. ఈఈ హెడ్క్వార్టర్లో నివాసం లేరని తేల్చగా ఇప్పుడు అక్కడ డివిజన్ కార్యాలయమే ఏర్పాటు చేయని అంశంపై ఎలా స్పందించాలి, ఎవరిపై చర్యలు తీసుకోవాలి. ఏడేళ్లకుపైగా కార్యాలయం ఏర్పాటు చేయకుండా అధికారులు ఏలా విధులు నిర్వహించారో తేల్చాలి. ఈఈపై చర్యలకు ఉపక్రమించిన మంత్రి ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ధిక్కరించి మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలో డివిజన్ కార్యాలయం నిర్వహణపై ఎవరిని బాధ్యులను చేస్తారు, ఎవరిపై చర్యలు తీసుకుంటారో తేలాలి. తక్షణమే డివిజన్ కార్యాలయాన్ని కుప్పంకు తరలిస్తారా లేదా అన్నది మంత్రి నిర్ణయం, చర్యలపై ఆధారపడి ఉంది. మదనపల్లెలో ప్రాజెక్టు సర్కిల్–3 కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి కుప్పంకు 120 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం రూ.169 కోట్లతో రెండు రీచ్లతో కాంక్రీట్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కుప్పం కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేసుంటే ఇక్కడినుంచి పర్యవేక్షణ పక్కగా జరిగేది. ప్రస్తుతం మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న కుప్పం డివిజన్ కార్యాలయం నుంచి అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తుండటంతో రోజూ కుప్పం కాలువ పనుల పర్యవేక్షణ సాగించాల్సి వస్తోంది. బుధవారం ఈఈ వెంకటేశ్వర్లు కార్యాలయం ఉండి ఇక్కడినుంచే విధులు నిర్వహించారు. ఇంతవరకు కుప్పంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడం, కనీసం అక్కడి నుంచైనా విధులు నిర్వహించకపోవడంతో కుప్పం లైనింగ్ పనుల పర్యవేక్షణ గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ జీవోను సైతం ధిక్కరించి మదనపల్లె నుంచి విధులు నిర్వహిస్తున్న అధికారుల వ్యవహరం సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పాలి. -
జాతీయ స్థాయిలో కలికిరి సైనిక పాఠశాల విద్యార్థినుల ప్రతిభ
కలికిరి : తమిళనాడు రాష్ట్రం అమరావతినగర్ సైనిక పాఠశాలలో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు జరిగిన ఆల్ ఇండియా సైనిక పాఠశాలల ఆటల పోటీలలో కలికిరి సైనిక పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. అండర్ 17 విభాగం హాకీ జట్టు ఫైనల్కు చేరుకుని రన్నరప్గా నిలిచినట్లు కలికిరి పాఠశాల ప్రిన్సిపాల్ సీఎస్ పరదేశి తెలిపారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోటీలలో కలికిరి టీం స్వల్ప తేడాతో ఓటమి చవిచూసినప్పటికీ గెలుపుకోసం అసాధారణంగా పోరాడిందన్నారు. ఈ సందర్భంగా హాకీ టీం బాలికలకు ఆయన అభినందనలు తెలిపారు. -
బ్యాంకు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
రాయచోటి : బ్యాంకులలో దొంగల నుంచి వినియోగదారులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లాలోని బ్యాంక్ అధికారులను జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. బ్యాంకుల భద్రతా ప్రమాణాలపై జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకులలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు, బ్యాంకులలో సీసీ కెమెరాల వినియోగంపై ఆరా తీశారు. సీసీ కెమెరాలు రికార్డు అయ్యే దృశ్యం స్పష్టంగా కనపడేలా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు, క్యాష్ కౌంటర్లు, ఏటీఎంలు, లాబీలు అన్నింటినీ కవర్ చేసే విధంగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. నగదు రవాణా సమయంలో శిక్షణ పొందిన లైసెన్సు కల్గిన ఆయుధం ఉన్న గార్డులను నియమించాలన్నారు. బ్యాంకు అనుసంధానంగా పనిచేసే గార్డు నుండి సిబ్బంది వరకు వారి వివరాలు తెలిసి ఉండాలని సూచించారు. ప్రతి బ్యాంకులో కూడా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులో ఏదైనా జరిగేతే అలారం పోలీసు స్టేషన్లో మోగేలా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బ్యాంకులోని ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బందిపై పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరిగా జరిపించాలన్నారు. బ్యాంకు పరిసరాలలో ముఖ్యంగా రాత్రిపూట సరైన వెలుతురు ఉండేలా చూడాలన్నారు. అత్యవసర కాల్ నెంబర్లు, హెల్ప్లైన్ నెంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ప్రతి ఖాతాదారుడి లావాదేవీలను అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటీపీల గురించి ఖాతాదారులను హెచ్చరించాలన్నారు. బ్యాంకులలో అపరిచిత వ్యక్తులను గమనించినప్పుడు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. సీసీ కెమెరాల రికార్డు దృశ్యాన్ని కనీసం ఆరు నెలలు నిల్వ ఉండేలా భద్రంగా చూసుకోవాలన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను పోలీసు వారు అడిగినప్పుడు వెంటనే అందించేలా పోలీసులకు సహకరించాలన్నారు. బ్యాంకులోకి వచ్చిన ఖాతాదారులను హెచ్చరిస్తూ మోసాల గురించి తెలియజేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని ప్రదేశాలలో దొంగతనాలు జరిగిన సీసీ టీవీ దృశ్యాలను బ్యాంకర్లకు ఐటీకోర్ టీమ్ సిబ్బంది స్క్రీన్ మీద చూపించారు. జిల్లాలోని పోలీసు అధికారులు బ్యాంకులను సందర్శించి సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బ్యాంకు అధికారులతో మాట్లాడాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని బ్యాంకుల దగ్గరకు పెట్రోలింగ్ సిబ్బంది వెళ్లి పాయింట్ బుక్ను తనిఖీ చేసేలా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎం.వెంకటాద్రి, జిల్లా బ్యాంకర్ల ఎల్డీఎం ఆంజనేయులు, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ మల్లేశ్వరరావు, జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, క్రైమ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజా రమేష్, సైబర్ సెల్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ జోసెఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థిక మోసాలను నివారించేలా చర్యలు భద్రతా ప్రమాణాలపై బ్యాంకర్లతో జిల్లా ఎస్పీ సమీక్ష -
పార్టీకీ అండగా నిలబడతాం
మాజీ సీఎంతో యూఏఈ కో–కన్వీనర్ సయ్యద్ అక్రమ్ రాయచోటి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని యూఏఈ కో–కన్వీనర్ సయ్యద్ అక్రమ్ అన్నారు. బుధవారం తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్తో కలిసి అక్రమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గల్ఫ్ దేశాలలో పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నట్లు మాజీ సీఎంకు తెలిపారు. కుటుంబ పోషణ నిమిత్తం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చిన వారి పరిస్థితులపై జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలలో వైఎస్సార్సీపీ బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వారు వివరించారు. -
పెద్దచెప్పలి ఘటన దురదృష్టకరం
కమలాపురం: వైఎస్ఆర్ జిల్లా పెద్దచెప్పలి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఓబుళరెడ్డి మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఘటన దురదృష్టకరం అని డీఈఓ షంషుద్ధీన్ అన్నారు. ఈ ఘటనపై స్పందించిన వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ హెచ్ఎంను సస్పెండ్ చేయడంతో పాటు డీఈఓను విచారణ అధికారిగా నియమించారు. ఈ మేరకు బుధవారం డీఈఓ పెద్దచెప్పలి జెడ్పీ హైస్కూల్కు చేరుకుని విచారణ చేపట్టారు. హెచ్ఎం ప్రవర్తన గురించి పాఠశాలలోని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తాగిన విషయం వాస్తవమేనని, కొన్ని రోజులుగా తాగి పాఠశాలకు వస్తున్నారని డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం డీఈఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాజంలో విద్యార్థులు ప్రజలు, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగువారితో ఎలా మెలగాలో, ఎలా ప్రవర్తించాలో విద్యా బుద్ధులు నేర్పే వారే ఇలా మద్యం తాగి పాఠశాల రావడం తప్పు అన్నారు. చేసిన తప్పు హెచ్ఎం ఒప్పుకున్నారన్నారు. ఉపాధ్యాయులు సైతం పలుమార్లు హెచ్ఎంను ఇలా చేయడం సరికాదని చెప్పినప్పటికి ఆయన పద్ధతి మార్చుకోక పోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికే ఆయనను కలెక్టర్ సస్పెండ్ చేశారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దౌర్జన్యంగా ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం
మదనపల్లె రూరల్ : ఇంటిలో తమకు హక్కు ఉందని పేర్కొంటూ, జేసీబీతో గోడను కూల్చివేసి దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన ఘటన బుధవారం అంకిశెట్టిపల్లె పంచాయతీ పప్పిరెడ్డిగారిపల్లె టీ చర్స్ కాలనీలో జరిగింది. పప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన కె.వెంకటరమణ, శంకరలు అన్నదమ్ములు. వీరికి వారసత్వంగా తండ్రి నుంచి సంక్రమించిన ఇంటి విషయ మై చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తు తం ఇంటిలో వెంకటరమణతో పాటు అతడి ఇద్దరు కుమారులు నరేంద్ర, శ్యాంసుందర్, కోడళ్లు శోభ, మంజుల, మనమరాళ్లు భవ్య, పూర్విక, తన్వి నివాసం ఉంటున్నారు. ఈ ఇంటిలో తమకు భాగం ఇవ్వాల్సిందిగా శంకర కోరుతూ వస్తున్నాడు. పెద్దమనుషుల వద్ద పంచాయతీ జరుగుతోంది. ఈ క్రమంలో శంకర జేసీబీని తీసుకువచ్చి ఇంటి గోడను కూల్చివేసేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో నిద్రపోతున్న కోడళ్లు శోభ, మంజుల, మనమరాళ్లపై దాడికి దిగి, ఇంట్లోని సామానులు బయటపడేసి వెళ్లిపోవాల్సిందిగా దౌర్జన్యానికి దిగారు. దీన్ని చూసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన వెంకటరమణ కూతురి కుమారుడు మనోజ్ను, వరుసకు చినతాత అయిన శంకర వీపుపై కొరికి గాయపరిచాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మంత్రి రాంప్రసాద్రెడ్డి రాయచోటి జగదాంబసెంటర్: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లో మంత్రి మండిపల్లి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జిల్లాలో వివిధ ఎస్హెచ్జీ గ్రూపుల నుంచి ఎంపిక చేసిన 10 గుడ్ల అమ్మకపు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వల్లే మహిళా సాధికారత సాధ్యమైందన్నారు. మహిళా సంఘాలకు అందజేసిన గుడ్ల అమ్మకపు బండ్లు పౌష్టికాహారంతో పాటు గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కలిగిస్తాయన్నారు. ఒక్కో బండికయ్యే ఖర్చు రూ.50 వేలని, దీనిని ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు పౌష్టికాహారాన్ని అందివ్వడం, గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కలిగించడం కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం, జాతీయ గుడ్డు సమన్వయ కమిటీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు ఈ గుడ్ల అమ్మకపు బండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 2025–26లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మొత్తం వెయ్యి ఎస్హెచ్జీ గ్రూపుల్లోని ఒక్కో సభ్యురాలికి ఒక గుడ్డు అమ్మకపు బండి చొప్పున సరఫరా చేయనున్నారన్నారు. మొదటి దశలో జిల్లాకు 10 గుడ్డు అమ్మకపు బండ్లు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ, లబ్ధిదా రులు పాల్గొన్నారు. -
వచ్చే నెల 2 నుంచి జమ్మలమడుగులో స్టాపింగ్
జమ్మలమడుగు: గుంటూరు–తిరుపతికి వెళ్లే రైలు ఆగస్టు 2 నుంచి జమ్మలమడుగులో స్టాపింగ్ ఉంటుందని రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల రైల్వే శాఖ ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట, దాల్మియా పరిశ్రమల గురించి వివరించామని.., ఈ ప్రాంతం నుంచి గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చదువుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉందని జమ్మలమడుగులో ఈ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలని కోరామన్నారు. దీంతో అధికారులు ఈనెల 2వతేది నుంచి రైలు నిలుపుతున్నట్లు ఉత్తర్వులను విడుదల చేశారన్నారు. అదేవిధంగా ధర్మవరం–మచిలిపట్నం రైలును కొండాపురం స్టాపింగ్ ఉంటుందని వివరించారు. నేడు వైఎస్ఆర్ జిల్లాకు మంత్రి సవిత రాక కడప సెవెన్రోడ్స్: జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత గురువారం కడపకు రానున్నారు. జిల్లాలో గురు, శుక్రవారాల్లో రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు పులివెందులలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జమ్మలమడుగుకు చేరుకుంటారు. ఆగస్టు 1న జమ్మలమడుగులో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన నిమిత్తం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం జమ్మలమడుగులోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి కడపలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ చేరుకుని బస చేస్తారు. మరుసటి రోజు శనివారం జమ్మలమడుగులో జరగబోయే సీఎం చంద్రబాబునాయుడు కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొననున్నారు. -
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు
సిద్దవటం : ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటంలోని అటవీ శాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ ఎర్రచందనం, వన్యప్రాణులకు సంబంధించి గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది తరచూ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రేంజర్ కళావతి, డిప్యూటీ రేంజర్ ఓబులేసు, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సురేష్బాబు, ఎఫ్బీఓలు, ఏబీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ -
నామినేషన్లకు ముందే బెదిరింపులు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున నామినేషన్ వేసిన వారిని తుదముట్టిస్తామంటూ మంగళవారం స్థానిక హరితా హోటల్లో విలేకరుల సమావేశంలో రాజంపేట టీడీపీ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఇంకా నామినేషన్లు వేయక ముందే అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడంపై మండల ప్రజలు మండిపడుతున్నారు. తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసేందుకు గానీ, పోటీ చేసేందుకు గానీ భయపడే విధంగా టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతుండటం రౌడీ రాజకీయాన్ని తలపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. దమ్ముంటే పోటీ చేయండి అంటూ మీసాలు మెలివేయడం, తుదముట్టిస్తామని బెదిరించడం లాంటి టీడీపీ నేతల వైఖరి చూస్తుంటే ఒంటిమిట్ట ఉప ఎన్నిక సజావుగా జరిగేనా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. మండల పరిధిలోని కొండమాచుపల్లి గ్రామంలో ఎన్నికల కోడ్కు విరుద్ధంగా తెలుగుదేశం జెండా ఎగురుతోంది. ఇది చూసిన కొంత మంది ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలు అధికార పార్టీ జెండా అని అధికారులు పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని సంబంధిత ఎన్నికల అధికారిని ప్రజలు కోరుతున్నారు. -
సోమశిలలో.. అక్రమ వేట!
రాజంపేట : సోమశిల జలాశయం (నెల్లూరు జిల్లా సోమశిల)కు సంబంధించి బ్యాక్వాటర్ ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిధిలోని అట్లూరు, గోపవరం, నందలూరు, ఒంటిమిట్ట మండలాల్లో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాక్ వాటర్లో గుడ్డు దశలో ఉన్న చేపల సంపదపై అక్రమవేట కొనసాగుతోంది. చేపల వృద్ధి అడ్డుగా అక్రమవేట కొనసాగుతోంది. పరోక్షంగా చేపల సంపదకు గండి కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంతానోత్పత్తికి విఘాతం కలిగిస్తున్నారు. ఇలా అక్రమ రవాణా.. ప్రధానంగా సోమశిల బ్యాక్ వాటర్లో చేప పిల్లలకు ప్రాణ సంకటంగా పరిణమించే అలివి వలను అక్రమార్కులు వినియోగిస్తున్నారు. ఒంటిమిట్ట మండలంలో పల్లాగట్ట నుంచి చేపలను అక్రమంగా వేటాడి నందలూరు మండలంలోని కోనాపురానికి చేర్చి, అక్కడి నుంచి చేపల మార్కెట్కు చేరుస్తున్నారు. పాత మాధవరం, బోయనపల్లె, చిన్నపురెడ్డిపల్లె, కొండమాచుపల్లె, గుండ్లమాడ, దొంగలసాని గ్రామాలతో పాటు నందలూరు, గోపవరం మండలాల్లో దర్జాగా చేపల అక్రమ వేట జరుగుతోంది. ఆగస్టు 31 వరకు వేటపై నిషేధం జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు సోమశిల బ్యాక్ వాటర్లో చేపల వేట నిషేధమని ప్రభుత్వం ప్రకటించిన సంగ తి తెలిసిందే. అయినా నాటు పడవల ద్వారా బ్యాక్వాటర్లోకి అక్రమంగా ప్రవేశించి చేప పిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం మత్స్యశాఖకు తెలియకుండా ఉండదని ముంపుబాధితులు పేర్కొంటున్నారు. బ్యాక్ వాటర్లో వేట నిషేధం అమలు కావడం లేదని వారంటున్నారు. యథేచ్ఛగా చేపల అక్రమ వేట.. సోమశిల బ్యాక్వాటర్ సమీప ముంపు గ్రామమైన నందలూరు మండలంలోని కోనాపురం ప్రాంతంలో చేపల అక్రమ వేట కొనసాగుతోంది. నిషేధం ఆంక్షలను సైతం పట్టించుకోకుండా చేపలు పట్టేవారు బ్యాక్ వాటర్లోకి నాటుపడవలు వేసుకొని వెళుతున్నారు. దాదాపు 200 నుంచి 300 మంది వరకు మత్స్యకారులు వేటను కొనసాగించే క్రమంలో బ్యాక్వాటర్ వెంబడి తాత్కాలిక నివాసాలు వేసుకొని జీవిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, వైజాగ్, నెల్లూరు, ప్రకాశంతోపాటు మరికొన్ని జిల్లాల నుంచి మత్స్యకారులను రప్పించి, వారిచేత వేట చేయిస్తున్నారు. ప్రతి రోజు 10 నుంచి 15 టన్నుల చేపలు పట్టి తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, చైన్నె, కోలకత్తా చేపల మార్కెట్కు తరలిస్తున్నారు. మత్స్యశాఖ అధికారులకు తెలియకుండానే.. చెన్నూరు, మాధవరం, కొడమలూరు తదితర ప్రాంతాలకు చెందిన కొందరు చేపల వ్యాపారంలో ఆరి తేరి వున్నారు. వీరి కనుసన్నల్లో చేపల అక్రమవేట కొనసాగుతోంది. ఈ విషయం మత్స్యశాఖ అధికారులు, సిబ్బందికి తెలిసిన బహిరంగ రహస్యమే. వారికి మామూళ్లు అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సోమశిల బ్యాక్వాటర్లో జరిగే చేపల అక్రమ వేటను చూసీ చూడనట్లు, తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ముంపు వర్గాల వారు బహిరంగంగానే పేర్కొంటున్నారు. బాక్స్ రూ.7వేల నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. వివిధ రకాల చేపలను పట్టుకొని బ్యాక్వాటర్ ఒడ్డుకు తీసుకొచ్చి కేజి రూ.120 నుంచి రూ.140 వరకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం మత్స్యశాఖ అధికారులు, సిబ్బందికి తెలియకుండానే జరుగుతుందనేది వాస్తవం కాదు. మత్స్యశాఖ అధికారి ఏమంటున్నారంటే.. సోమశిల బ్యాక్వాటర్లో చేపల అక్రమ వేటపై రాజంపేట మత్స్యశాఖ అఽధికారి మురళీని వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానన్నారు. బ్యాక్వాటర్లో చేపల వేట నిషేధం కొనసాగుతోంది. అయినా అక్రమంగా చేపలవేట కొనసాగుతుందన్న విషయం తనకు తెలియదన్నారు. ఈ విషయంపై తాను విచారణ చేసి, చర్యలు తీసుకుంటానని తెలిపారు. కాగా, ఒంటిమిట్ట మండలం (వైఎస్సార్ జిల్లా) పరిధిలోని బ్యాక్వాటర్ విస్తరించిన ప్రాంతంలో స్థానికంగా ఉన్న వారిని ఖాళీచేసి వెళ్లిపోవాలని, చేపల వేట నిషేధం ఉందని హెచ్చరించామని మత్స్యశాఖ ఎఫ్డీఓ కిరణ్కుమార్ తెలిపారు. కోనాపురం వైపు చేపల వేట జరుగుతోందన్న సమాచారం రాజంపేటకు చెందిన అధికారి మురళికి తెలియజేశామని వెల్లడించారు. బ్యాక్వాటర్ పెరగుతోందని.. రెండు, మూడు రోజుల్లో బ్యాక్వాటర్ పెరుగుతోందన్న సమాచారంతో బ్యాక్వాటర్లో చేపల అక్రమ వేటను వేగవంతం చేసుకుంటున్నారు. ముంపు గ్రామాల్లో చేపల రవాణా సందడి నెలకొంది. వాహనాలలో ఐస్ బాక్స్లో చేపలను రవాణా చేస్తున్నారు. బ్యాక్వాటర్లో దొరికినకాడికి చేపలను వలవేసి పట్టుకొని దొడ్డిదారిలో చేపల మార్కెట్కు తరలిస్తున్నారు. బ్యాక్ వాటర్ పెరిగితే అక్రమ వేటకు అడ్డుగా మారుతుందనే భావనలో వేట నిర్వాహకులు ఉన్నారు. వెలిగల్లులోనూ..గాలివీడు : వెలిగల్లు జలాశయంలో రెండు మాసాలపాటు చేపల వేటపై నిషేధం ఉన్నా విచ్చల విడిగా చేపల వేట కొనసాగుతోంది. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మత్స్యకారులను ప్రలోభపెట్టి చేపలు పట్టిస్తున్నారు. అడ్డుకోవాల్సిన నిఘా యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకుని చోద్యం చూస్తోంది. రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా వలలు వేసి తెల్లవారుజామున సరుకు మొత్తం గాలివీడు, రాయచోటి, మదనపల్లె, కడప ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనధికారికంగా వేట సాగిస్తుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గాలివీడు విలేజ్ ఫిషర్స్ అసిస్టెంట్ రామాంజి నాయక్ తెలిపారు. ఆగస్టు 31 వరకు చేపల వేటపై నిషేధం ముంపు గ్రామాల నుంచి అక్రమ రవాణా నిద్రావస్థలో మత్స్యశాఖ అధికార గణం -
రైలు నుంచి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు
కురబలకోట : నడుస్తున్న రైలు నుంచి కింద పడి విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం సాయంత్రం కురబలకోట రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాషా కథనం మేరకు..సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన సఫాన్ (18) తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్ద రెండు రోజుల పాటు వుండి మంగళవారం తిరిగి తిరుపతి కళాశాలకు కదిరి నుంచి రైలులో బయలు దేరాడు. మార్గమధ్యంలోని కురబలకోట రైల్వే స్టేషన్ పరిధిలోని సింగన్నగారిపల్లె సమీపంలో డోర్ పక్కనుంచి ప్రమాదవశాత్తు పట్టు జారి కిందపడి గాయపడ్డాడు. 108 వాహనం ద్వారా మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. -
అత్యాచార యత్నం కేసులో మూడు నెలల జైలు
రాయచోటి టౌన్ : లక్కిరెడ్డిపల్లె మండలంలో ఒక మహిళపై అత్యాచారానికి యత్నించిన కేసులో పత్తి సుధాకర్ అనే వ్యక్తికి రాయచోటి ఏజేఏస్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఇ.ప్రసూన మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేలు జరిమానా విధించినట్లు లక్కిరెడ్డిపల్లె పోలీసులు తెలిపారు. 2011 సంవత్సరం నవంబర్ 12న 12.11.2011వ సంవత్సరంలో లక్కిరెడ్డిపల్లె మండలంలో ఒక మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఈమేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్ష విధిస్తారనేందుకు ఈ కేసు ఒక నిదర్శనమన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలు
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో యామవరం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని శివప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. యామవరం గ్రామానికి చెందిన శివప్రసాద్ రహదారి పక్కన నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతను రహదారి పక్కనే వున్న లోతట్టు ప్రాంతంలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో క్షతగాత్రుని కాలు విరిగినట్లు, మరో కాలికి తీవ్ర గాయమైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు. 13 మంది జూదరుల అరెస్టు చిన్నమండెం : మండల పరిధిలోని చిన్నర్సుపల్లె ఎగువచెరువు వద్ద జూదమాడుతున్న 13 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. వద్ద నుండి రూ.2,59,500 నగదు, 16 సెల్ఫోన్లు, 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. భూ వివాదంలో పరస్పర దాడులుమదనపల్లె రూరల్ : మండలంలోని కొత్తవారిపల్లె గ్రామానికి చెందిన మహేష్, నాగరాజు భూవివాదంలో ఘర్షణ పడి మంగళవారం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీనిపై మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నంములకలచెరువు : కుటుంబ కలహాలతో ఒక యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పర్తికోటకు చెందిన శ్రీనివాసులు భార్య రేఖ(31) కుటుంబ కలహాలతో విషం తాగి ఇంటిలో అపస్మారక స్థితిలో పడివుంది. కుటుంబ సభ్యులు గమనించి 108 సహాయంతో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్ఓ గదిలో చోరీ యత్నం రాయచోటి టౌన్ : రాయచోటి మండల పరిధిలోని గ్రామ రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ కార్యాలయ గదిలో సోమవారం రాత్రి దొంగలు చోరీ యత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. బీరువా తాళాలతో పాటు టేబుల్ ర్యాక్ కూడా పగుల గొట్టారు. అందులో ఏమీ లేకపోవడంతో వెళ్లిపోయారు. అయితే రికార్డులు మాత్రం చిందరవందరగా పడేశారు. -
వైభవంగా ఈశ్వరీదేవి జయంత్యుత్సవం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం మండలంలోని ఈశ్వరీదేవి మఠంలో ఈశ్వరీదేవి జయంత్యుత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. ఈశ్వరీ మాత సేవా సమితి ట్రస్ట్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన, హోమాలు నిర్వహించారు. ఇందులో మఠాధిపతి వీరశివకుమారస్వామి, రాజరాజేశ్వరిదేవి దంపతులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఊరేగింపు అష్టోత్తర(108) కలశాలతో భక్తజనం ఊరేగింపు ఆకట్టుకుంది. తర్వాత గుడి ఉత్సవం కమనీయంగా జరిగింది. మధ్యాహ్నం నైవేద్యం, మంత్ర పుష్పం, నీరాజనం, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి గ్రామోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. మఠాధిపతి వీరశివకుమారస్వామి ఆధ్వర్యంలో ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి పర్యవేక్షణలో దేవదాయశాఖ అధికారులు, అమ్మవారి శిష్య బృందం ఏర్పాట్లు చేశారు. -
టెండర్లు లేకుండానే భూకేటాయింపులా.?
మదనపల్లె రూరల్ : అత్యంత విలువైన భూములను టెండర్లు లేకుండా, నిబంధనలు పాటించకుండా పప్పుబెల్లాలు మాదిరిగా కూటమి ప్రభుత్వం కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు సంతర్పణ చేయడమేంటని వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొన్నాళ్లుగా కూటమిప్ర భుత్వం అడ్డగోలుగా చేస్తున్న భూ పందేరాలపై, ఆయా సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వ పెద్దలు చేసుకున్న లోపాయికారి ఒప్పందాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలు, సూపర్ మార్కెట్ సంస్థకు విలువైన ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. వైజాగ్, విజయవాడలో దుబాయ్ సంస్థ లులూ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న భారీ మాల్కు తక్కువ ధరలకు భూములు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కక్షసాధింపులు, మరోవైపు ప్రభుత్వ భూములు బినామీలకు కారుచౌకగా అప్పగించి తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విజయవాడలో పాతబస్టాండుగా పిలుచుకునే గవర్నర్పేట ఆర్టీసీ డిపోకు చెందిన రూ.600 కోట్ల విలువైన 4.15 ఎకరాల భూమిని, రూ.156 కోట్ల పెట్టుబడి కోసం 99 సంవత్సరాల కాలపరిమితికి లీజు విధానంలో అప్పగించడం హాస్యాస్పదమన్నారు. కేరళ, హైదరాబాద్లో మాల్స్ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వ భూములు కేటాయించలేదన్నారు. అలాంటి లులుకు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా అప్పగించడం వెనుక ఏ ప్రయోజనాలున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.అడ్డగోలు భూకేటాయింపులపై నిసార్అహ్మద్ ఆగ్రహం -
మత్తుతో జీవితం చిన్నాభిన్నం
రాయచోటి టౌన్ : మత్తుకు అలవాటు పడితే జీవితం చిన్నాభిన్నం అవుతుందని అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకట్రాది పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి శ్రీ సాయి శుభ కల్యాణ మండపంలో మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలపై టీనేజ్ యువకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలను ముందు సరదా కోసం ఉపయోగిస్తారని తరువాత వాటికి బానిసగా మారిపోయి జీవితాలనే నాశనం చేసుకుంటారని తెలిపారు. అలాంటి అలవాట్ల జోలికి వెళ్లకుండా మీ బంగారు భవిష్యత్తును మీరే తీర్చి దిద్దుకోవాలని సూచించారు. అలాగే పిల్లల అలవాట్లపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్ఐలు లోకేష్, వెంకటేష్, గాయత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యం.ప్రకాష్, ప్రతిభ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ అరమాటి శివగంగిరెడ్డి, రాజు విద్యాసంస్థల ప్రధానోపాద్యాయుడు వై. గంగన్న తదితరులు పాల్గొన్నారు.అడిషన్ ఎస్పీ ఎం.వెంకటాద్రి -
ఎంపీ మిథున్ రెడ్డి విడుదల కావాలని ప్రార్థనలు
ఓబులవారిపల్లె/గుర్రంకొండ : అక్రమంగా అరెస్టయి జైలులో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదల కావాలని కోరుతూ మంగళవారం ఓబులవారిపల్లి మండలం, మంగంపేట నీరుంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిథున్ రెడ్డి ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన నిర్వహించామన్నారు. మంగంపేట గ్రామస్తులు వెంకటరెడ్డి, రవి శంకర్రెడ్డి, గల్లా శ్రీనివాసులు, మైనార్టీ నాయకులు ఆజాం, ఇర్ఫాన్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ మహిళలు.. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మండలంలోని మర్రిపాడు గ్రామానికి చెందిన ముస్లీమ్ మైనార్టీ మహిళలు మంగళవారం స్థానిక హాసార్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షెహనాజ్బేగం, బషీరున్నిసా, మహబూబ్జాన్, జెహదున్నిసా, తదితరులు పాల్గొన్నారు.