breaking news
Reality
-
హైదరాబాద్కి కొత్తగా మరో 70 జీసీసీలు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: రాబోయే ఏడాది వ్యవధిలో హైదరాబాద్లో మరో 50–70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) రానున్నట్లు పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ, ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం ప్రస్తుతం సుమారు 515 జీసీసీలు ఉన్నాయి. వీటిలో 3 లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని మొత్తం జీసీసీల్లో 20 శాతం హైదరాబాద్లోనే ఉన్నాయి.నగరంలో ఆఫీస్ మార్కెట్ డిమాండ్కి జీసీసీలు కీలకమైన చోదకాలుగా మారాయని నివేదిక వివరించింది. విదేశీ సంస్థలు నెలకొల్పే జీసీసీలు 2021లో 19 లక్షల చ.అ.ల ఆఫీస్ స్పేస్ తీసుకోగా 2025లో ఇది 45 లక్షల చ.అ.లకు పెరిగింది. జీసీసీల దన్నుతో ఐటీ–ఐటీఈఎస్ని దాటి హైదరాబాద్ పరిధి పెరుగుతోందని ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ వి.వి. రామ రాజు తెలిపారు. -
అమ్మ ఆస్తి ఎవరికి? కూతురికా.. కొడుక్కా?
తల్లి ఆస్తిలో కూతురికి హక్కు ఉంటుందా? పెళ్లయిన కుమార్తెకు కూడా తల్లి ఆస్తిలో వాటా వస్తుందా? తల్లి చనిపోయిన తర్వాత ఆస్తి భర్తకు, కొడుకులకు మాత్రమే చెందుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా కుటుంబాల్లో తలెత్తుతుంటాయి. అయితే హిందూ వారసత్వ చట్టం ప్రకారం దీనికి ఒకే సమాధానం ఉండదు. ఆస్తి స్వయంగా సంపాదించిందా, పూర్వీకుల నుంచి వచ్చిందా, తల్లికి ఆస్తిపై పూర్తి హక్కు ఉందా, వీలునామా ఉందా వంటి అంశాలపై వారసత్వ హక్కులు ఆధారపడి ఉంటాయి.ఆటోమేటిక్ వాటా ఉండదుఒక మహిళ తన పేరుతో సంపాదించిన లేదా చట్టబద్ధంగా తనకు వచ్చిన ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కు కలిగి ఉంటే, ఆమె జీవించి ఉన్నంత కాలం కేవలం కుమారుడు లేదా కుమార్తె అనే సంబంధం ఆధారంగా పిల్లలు ఆ ఆస్తిలో వాటా కోరలేరు. చట్టపరమైన పరిమితులకు లోబడి ఆమె ఆస్తిని విక్రయించవచ్చు, బహుమతిగా ఇవ్వవచ్చు లేదా వీలునామా ద్వారా ఎవరికైనా ఇవ్వవచ్చు.వీలునామా లేకుండా తల్లి చనిపోతే?ఒక హిందూ మహిళ చెల్లుబాటు అయ్యే వీలునామా లేకుండా మరణిస్తే, ఆమె ఆస్తి వారసత్వాన్ని ప్రధానంగా హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15, 16 ప్రకారం నిర్ణయిస్తారు. సెక్షన్ 15(1)(a) ప్రకారం సాధారణంగా ఆమె కుమారులు, కుమార్తెలు, ముందే మరణించిన కుమారుడు లేదా కుమార్తె పిల్లలు, భర్త మొదటి ప్రాధాన్యత కలిగిన వారసులుగా ఉంటారు. ఒకే స్థాయిలో ఉన్న వారసులు కలిసి వారసత్వం పొందుతారు.ఉదాహరణకు, ఒక తల్లి భర్త, ఒక కుమారుడు, ఒక కుమార్తెను వదిలి వీలునామా లేకుండా మరణించిందనుకుందాం. ఇతర ప్రత్యేక పరిస్థితులు లేనప్పుడు, సాధారణంగా ఈ ముగ్గురూ వారసులుగా పరిగణించబడతారు. అంటే ఆస్తి మూడు సమాన వాటాలుగా పంచుకునే పరిస్థితి ఉంటుంది.పెళ్లయిన కూతురికి హక్కు ఉంటుందా?పెళ్లయిన కూతురికి కూడా తల్లి ఆస్తిలో హక్కు ఉంటుంది. తల్లి ఆస్తిలో చట్టబద్ధమైన వారసురాలిగా ఉన్న కుమార్తెకు ఆమె పెళ్లయిందా, అవివాహితురాలా, విడాకులు తీసుకుందా అనే విషయం సాధారణంగా ఆమె వారసత్వ హక్కును తొలగించదు. అంటే తల్లి వీలునామా లేకుండా మరణించినప్పుడు, అర్హత ఉన్న కుమార్తె తన చట్టబద్ధమైన వాటాను క్లెయిమ్ చేయవచ్చు. ఆమెకు అన్నదమ్ములతో సమానంగా వారసత్వ వాటా లభించే పరిస్థితి ఉంటుంది.2005 సవరణతో మరో కీలక హక్కుఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని తల్లి స్వయంగా సంపాదించిన ఆస్తితో కలపకూడదు. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 6కు 2005లో చేసిన సవరణ ద్వారా మితాక్షర పద్ధతిలోని సంయుక్త హిందూ కుటుంబ పూర్వీకుల సహపార్సనరీ ఆస్తిలో కుమార్తెకు కుమారుడితో సమాన హక్కు కల్పించారు.సుప్రీంకోర్టు వినీత శర్మ కేసులో కుమార్తెకు ఈ హక్కు పుట్టుకతోనే వస్తుందని, ఆమెను కుమారుడితో సమాన సహపార్సనర్గా పరిగణించాలని స్పష్టం చేసింది. అలాగే 2005 సవరణ అమల్లోకి వచ్చిన సమయంలో తండ్రి జీవించి ఉండటం తప్పనిసరి కాదని కూడా కోర్టు వివరించింది.అయితే దీనిని ‘తల్లి స్వయంగా సంపాదించిన ప్రతి ఆస్తిలో కుమార్తెకు పుట్టుకతో వాటా ఉంటుంది’ అని అర్థం చేసుకోవడం తప్పు. స్వయంగా సంపాదించిన ఆస్తి, పూర్వీకుల సహపార్సనరీ ఆస్తి రెండింటికీ చట్టపరమైన స్థితి ఒకేలా ఉండదు.సవతి తల్లి ఆస్తిలో సవతి పిల్లలకు?సవతి తల్లి ఆస్తిలో సవతి పిల్లలకు కేవలం ఆ సంబంధం కారణంగా సహజ వారసత్వ హక్కు సాధారణంగా ఏర్పడదు. అయితే చట్టబద్ధమైన దత్తత, చెల్లుబాటు అయ్యే వీలునామా లేదా ఇతర వర్తించే చట్టపరమైన పరిస్థితుల ఆధారంగా హక్కు ఏర్పడవచ్చు. కాబట్టి ప్రతి కేసులో కుటుంబ సంబంధాల కంటే చట్టపరమైన స్థితిని పరిశీలించాలి.పిల్లలు లేకపోతే..మహిళకు కుమారులు, కుమార్తెలు లేకుండా మరణించిన సందర్భాల్లో కూడా వారసత్వ క్రమం ఇదే విధంగా ఉండదు. ముఖ్యంగా సెక్షన్ 15(2) కొన్ని ప్రత్యేక రకాలుగా వచ్చిన ఆస్తులకు ప్రత్యేక వారసత్వ క్రమాన్ని నిర్దేశిస్తుంది. ఉదాహరణకు, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తికి, భర్త లేదా మామ నుంచి వచ్చిన ఆస్తికి వేర్వేరు నిబంధనలు వర్తించవచ్చు. -
నాలుగేళ్ల కనిష్ఠానికి హైదరాబాద్ హౌసింగ్ సేల్స్!
రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా ఉన్న భాగ్యనగరంలో గృహ విక్రయాల వేగం మందగించింది. క్రెడాయ్ హైదరాబాద్ - క్రె మ్యాట్రిక్స్ (CRE Matrix) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (హెచ్1 2026 ఆర్థిక సంవత్సరం) నగరంలో ఇళ్ల విక్రయాలు 13 శాతం క్షీణించి 26,068 యూనిట్లకు పడిపోయాయి. గత 4.5 ఏళ్ల కాలంలో (2022 తర్వాత) ఇదే అత్యల్ప అర్ధవార్షిక విక్రయాల సంఖ్య కావడం గమనార్హం.ప్రైమ్ మార్కెట్ రూ.52,913 కోట్లువిక్రయాల సంఖ్య తగ్గినప్పటికీ ధరల పెరుగుదల మాత్రం ఆగలేదు. సగటు ఇంటి విక్రయ ధర గత ఏడాది రూ.1.85 కోట్లుగా ఉండగా, ఈసారి 10 శాతం పెరిగి రూ.2.03 కోట్లకు చేరింది. సగటు ఇంటి పరిమాణం 2,300 చదరపు అడుగులుగా ఉంది. మొత్తంగా ఈ ఆరు నెలల కాలంలో రూ.52,913 కోట్ల విలువైన గృహ విక్రయాలు జరిగాయి. బెంగళూరు, ముంబైల తర్వాత దేశంలోనే అత్యధిక విక్రయ విలువ కలిగిన మూడో అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్గా హైదరాబాద్ నిలిచింది.కొనుగోళ్లు తగ్గడానికి కారణాలేంటి?ఐటీ రంగానికి చెందిన అమెరికాలోని ఎన్ఆర్ఐల నుంచి వస్తున్న పెట్టుబడులు తగ్గాయి. ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, వీసా నిబంధనలు కఠినతరం కావడం వల్ల ప్రీమియం గృహ విభాగానికి ఆదరణ తగ్గింది.రూ.2 కోట్లకు పైబడిన ఇళ్లను కొనడానికి వేతన జీవులు వెనుకాడడమే కాకుండా అద్దె ఇళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు.గల్ఫ్ యుద్ధ వాతావరణం, నిర్మాణ వ్యయాలు పెరగడం, సోషల్ మీడియాలో ధరల పెరుగుదలపై ప్రతికూల ప్రచారాలు సైతం కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపాయి.1.42 లక్షలకు చేరిన నిల్వ ఇళ్లుమరొకవైపు డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను భారీగా ప్రారంభించడంతో డిమాండ్, సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగింది. ఈ ప్రథమార్ధంలో రికార్డు స్థాయిలో 49,656 కొత్త ఇళ్లు లాంచ్ కాగా (37% పెరుగుదల), అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 21% పెరిగి 1,42,722 యూనిట్లకు చేరింది. వీటిని విక్రయించడానికి దాదాపు 29 నెలల సమయం పడుతుందని అంచనా. అయితే, ఈ అమ్ముడుపోని నిల్వలో కేవలం 20 శాతం (దాదాపు 30,000 ఇళ్లు) మాత్రమే తక్షణమే నివాసానికి సిద్ధంగా ఉన్నాయని, మిగిలినవి 2027-2029 లేదా ఆ తర్వాత పూర్తవుతాయని నివేదిక వెల్లడించింది. రాబోయే పండుగల సీజన్లో మార్కెట్ పుంజుకుంటుందని బిల్డర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పండగ పూట.. బంగారం ప్రియులకు గుడ్న్యూస్! -
భారత్ మార్కెట్లోకి అమెరికా రియల్ ఎస్టేట్ కంపెనీ
అమెరికాకు చెందిన అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ దిగ్గజం సెంచురీ 21 తాజాగా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు సంస్థ వెల్లడించింది.భారత రియల్టీలో అవకాశాలను అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల్లోని ప్రాపర్టీలను భారతీయ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశీయంగా తమ కార్యకలాపాలు తోడ్పడతాయని సెంచురీ 21 యూఏఈ, ఇండియా గ్రూప్ సీఈవో పీటర్ మాథ్యూస్ తెలిపారు.కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 15,000 కార్యాలయాలు, 4,00,000 పైగా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ నెట్వర్క్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని రవి శాస్త్రి తెలిపారు. -
హోటలే ఇల్లు.. సిటీలో నయా ట్రెండ్!
నగరంలో ఒకటి రెండు రోజులు ఉండాలంటే హోటల్ గదులు, నెలల తరబడి ఉండాలంటే ఇల్లు అద్దెకు తీసుకునే ధోరణికి భిన్నంగా.. రోజులు, నెలల తరబడి ఉండడానికి కూడా స్టార్ హోటల్కే ఓటేసే ధోరణి పెరిగింది. విభిన్న రంగాల వారు పనుల నిమిత్తం నగరంలో తాత్కాలిక బస కావాలని ఆశించడం అంతకంతకూ పెరుగుతుండడంతో స్టార్ హోటళ్లలో అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఊపందుకుంది. – సాక్షి, సిటీబ్యూరోహోటల్ గదులను విస్తరించడం కొత్త విషయం కాకపోవచ్చు కానీ గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ తాజాగా మరో 42 అపార్ట్మెంట్లను అందుబాటులోకి తీసుకురావడం ఇప్పుడు చెప్పుకోదగ్గ విశేషం. దీంతో కలిపి ఆ హోటల్లో మొత్తం 98 అపార్ట్మెంట్లకు చేరడం గమనార్హం. మొత్తం 228 సాధారణ గదులు ఉంటే దాదాపు అందులో సగం అపార్ట్మెంట్లు ఉండడం గమనార్హం. ప్రస్తుతం నగరంలో ఊపుమీదున్న హోటల్–అపార్ట్మెంట్ ట్రెండ్కి ఇదో చిన్న ఉదాహరణ. పన్నెండేళ్ల క్రితమే.. దాదాపు 12 ఏళ్ల క్రితం బంజారాహిల్స్లోని స్టార్ హోటల్ పార్క్ హయత్ సర్వీస్ అపార్ట్మెంట్లకు శ్రీకారం చుట్టింది. దాదాపు ఇంటిని తలపించే సింగిల్, డబుల్ బెడ్ గదులతో ఉండే ఈ అపార్ట్మెంట్లు అప్పట్లో కేవలం కార్పొరేట్ ఉద్యోగుల అవసరాలను మాత్రమే తీరుస్తూ ఉండేవి. రానురానూ విభిన్న రంగాల నుంచీ ఈ తరహా హోటల్ అవసరాలకు డిమాండ్ పెరిగింది. ఐటీతో పాటు డేటా సెంటర్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, సినిమా, టీవీ తదితర రంగాల నుంచి వీటికి ఆదరణ పెరిగింది. దీంతో ఐదారేళ్లుగా నగరంలో నెలకొల్పే ప్రతీ స్టార్ హోటల్లోనూ ఈ తరహా అపార్ట్మెంట్లు తప్పనిసరిగా మారాయి. ఏమిటీ సర్వీస్డ్ అపార్ట్మెంట్లు? ఇవి పేరుకు తగ్గట్టుగా ఉండే సాదా సీదా అపార్ట్మెంట్లు కాదు. వాషింగ్ మెషీన్, డిష్వాషర్, తాగునీరు, కిచెన్ తదితర రోజువారీ జీవనానికి అవసరమైన సౌకర్యాలతో పాటు అవసరాన్ని బట్టి చెఫ్స్, హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండటమే వీటి ప్రత్యేకత. హోటల్ సరీ్వస్తో పాటు ఇంటి సౌకర్యాలు కూడా కలగలిపి ఉంటాయన్నమాట. ఇటీవల ఓ స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన కొత్త అపార్ట్మెంట్లలో 35 చదరపు మీటర్ల స్టూడియో, 61 చదరపు మీటర్ల వన్ బెడ్రూమ్, 88 చదరపు మీటర్ల టు బెడ్రూమ్ ఉన్నాయి. అంతేకాకుండా గార్డెన్ వ్యూ, సిటీ వ్యూ, ఆర్ఆర్ఆర్ వ్యూస్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన పోషకులు వీరే.. నగరంలో ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు, కొత్తగా కంపెనీలో చేరే ఉద్యోగులు, విదేశీ కంపెనీల ప్రాజెక్టులపై నెలల తరబడి పనిచేసే నిపుణులు, జీసీసీ ఉద్యోగులు, సినిమా అనుబంధ రంగాలకు పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు, కొత్తగా హైదరాబాద్కు బదిలీపై శాశ్వత ఇల్లు చూసుకునే వరకు ఉన్నతోద్యోగులు.. వీటికి ప్రధాన పోషకులుగా మారారు.ఖరీదైనా.. కావాల్సిందే.. ఆయా హోటళ్లలో వన్ బెడ్రూం అపార్ట్మెంట్ 90 చదరపు మీటర్లు, టు బెడ్రూం టెర్రస్ అపార్ట్మెంట్ 145 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫాంలో తేదీ, గది రకాన్ని బట్టి స్టూడియోలకు రోజుకు సుమారు 10,000 నుంచి రూ.16,000, వన్ బెడ్రూం అపార్ట్మెంట్లకు రూ 12,000 నుంచి రూ.20,000 ధరల్లో ఉన్నాయి. పన్నులు, భోజనం, ప్రత్యేక ఆఫర్లు, సీజన్, ఎన్ని రోజులు/నెలలు బస చేస్తారు? అనే వాటి ఆధారంగా ప్యాకేజీల ధరలు మారుతాయి. ఏదేమైనా నగరంలో ‘హోటల్.. హోమ్’ అనే కొత్త సంస్కృతి పుట్టుకొస్తోందని చెప్పవచ్చు. -
కోకాపేట్లో ‘గోల్డెన్’ చాన్స్.. అ‘ధర’గొట్టిన భూములు
సాక్షి, సిటీబ్యూరో: కోకాపేట్ మరోసారి కేక పుట్టించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) బుధవారం కోకాపేట్ నియోపోలిస్, గోల్డెన్ మైల్ సైట్–1లోని స్థలాలకు ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్లో గోల్డెన్ మైల్ సైట్–1లోని 0.70 ఎకరాల స్థలానికి భారీ స్పందన లభించింది. ఎకరాకు రూ.70 కోట్లుగా కనీస ధరను నిర్ణయించగా, బిడ్డింగ్లో ఎకరాకు రూ.115 కోట్ల లెక్కన రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ స్థలం ట్రయాంగిల్లా ఉన్నప్పటికీ అంచనాలకు మించిన స్పందన లభించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నగరానికి పడమటి వైపున ఉన్న డిమాండ్ను ఇది మరోసారి చాటిచెప్పింది. గతంలో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో ఎకరానికి కనీస ధర రూ.100 కోట్లు గా ప్రతిపాదించిగా అనూహ్యంగా రూ.151.25 కోట్లకు అమ్ముడైంది. ఈ సారి రూ.70 కోట్ల కనీస ధరపైన బిడ్డింగ్లో రూ.115 కోట్లకు అమ్ముడు కావడం గమనార్హం.నియోపోలిస్ మరోసారి... నియోపోలిస్ లేఅవుట్లోని ప్లాట్ నంబర్ 17లో ఉన్న 4.59 ఎకరాలకు కూడా బుధవారం బిడ్డింగ్ నిర్వహించారు. దీనికి ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. ఈ బిడ్ ధర ఎకరాకు రూ.120 కోట్లుగా నమోదైంది. ఒకే బిడ్ రావడం వల్ల మరోసారి వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
రూ.269 కోట్ల ఆఫీస్ లీజు.. ఐటీ కంపెనీ భారీ డీల్
గ్లోబల్ టెక్నాలజీ, కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో భారీ ఆఫీస్ లీజింగ్ డీల్ కుదుర్చుకుంది. థానేలోని హీరానందాని ఎస్టేట్లో ఉన్న ‘సెంటారస్’ కమర్షియల్ టవర్లో సుమారు 2.72 లక్షల చదరపు అడుగుల గ్రేడ్-ఏ కార్యాలయ స్థలాన్ని 10 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందం మొత్తం విలువ దాదాపు రూ.269 కోట్లుగా ఉంది. నెలవారీ అద్దె సుమారు రూ.1.9 కోట్లుగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఈ కార్యాలయ స్థలం ‘హౌస్ ఆఫ్ హీరానందాని’ అభివృద్ధి చేసిన హీరానందాని ఎస్టేట్ టౌన్షిప్లోని సెంటారస్ టవర్లో ఉంది. ఈ భవనంలోని మూడు పక్కపక్కనే ఉన్న అంతస్తుల్లో యాక్సెంచర్ కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ లీజింగ్ ఒప్పందాన్ని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా కుదిర్చింది. ఈ ఏడాది థానేలో నమోదైన అతిపెద్ద కార్యాలయ లావాదేవీల్లో ఇది ఒకటిగా నిలిచింది.21 అంతస్తుల సెంటారస్ భవనంలో మొత్తం నిర్మిత విస్తీర్ణం సుమారు 19 లక్షల చదరపు అడుగులు. హీరానందాని ఎస్టేట్లోని 375 ఎకరాల టౌన్షిప్లో ఈ వాణిజ్య ప్రాజెక్టు ఉంది. ఇప్పటికే ఇక్కడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), బీఎన్పీ పరిబాస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బేయర్ క్రాప్సైన్స్, వీవర్క్ వంటి ప్రముఖ సంస్థలు కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి.పెద్ద కంపెనీలు ముంబై ప్రధాన ప్రాంతాలతో పాటు థానే, నవి ముంబై వంటి అభివృద్ధి చెందుతున్న వాణిజ్య ప్రాంతాల్లో భారీ కార్యాలయ స్థలాలను ఎంచుకుంటుండటానికి ఈ ఒప్పందం మరో ఉదాహరణ. ముఖ్యంగా ప్రతిభావంతులైన ఉద్యోగుల లభ్యత, మౌలిక సదుపాయాలు, ఖర్చుల పరంగా అనుకూలత వంటి అంశాలు ఈ ప్రాంతాలపై సంస్థల ఆసక్తిని పెంచుతున్నాయి.తాజా మార్కెట్ గణాంకాలు కూడా ముంబై ఆఫీస్ మార్కెట్లో డిమాండ్ కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి. జేఎల్ఎల్ డేటా ప్రకారం 2026 జనవరి–జూన్ మధ్య ముంబైలో మొత్తం ఆఫీస్ లీజింగ్ 5.88 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇది 2025 ఇదే కాలంలోని 4.99 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే 18 శాతం అధికం. -
నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్ లోనావాలాలో సుమారు 3.86 ఎకరాల భూమిని దాదాపు రూ.70 కోట్లకు కొనుగోలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ డేటాను విశ్లేషించిన జాప్కీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ లావాదేవీ మూడు కన్వేయన్స్ డీడ్ల ద్వారా సెప్టెంబర్ 4న నమోదైంది. మొత్తం విలువ రూ.69.99 కోట్లు. ఈ ఆస్తులను నందన్ ధనంజయ్ మెహతా, వివస్వత్ ధనంజయ్ మెహతాల నుంచి కొనుగోలు చేశారు.పుణె జిల్లా లోనావాలాలోని హెచ్ వార్డులో నాలుగు సిటీ సర్వే నంబర్లలో మొత్తం 1.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. ఇందులో దాదాపు 3.09 ఎకరాలను పూర్తి యాజమాన్య హక్కుతో కొనుగోలు చేయగా, ఈ భూమిపై సుమారు 2,100 చదరపు అడుగుల నిర్మాణం కూడా ఉంది. అదనంగా, మరో రెండు స్థలాల్లో 50% వాటాను కూడా తెందుల్కర్ దక్కించుకున్నారు.ఈ మూడు డీడ్ల విలువలు వరుసగా రూ.63.69 కోట్లు, రూ.4.56 కోట్లు, రూ.1.75 కోట్లుగా ఉన్నాయి. కొనుగోలుదారు స్టాంప్ డ్యూటీ కింద సుమారు రూ.4.20 కోట్లు చెల్లించారు. మొత్తం లావాదేవీ ఆధారంగా చదరపు అడుగుకు సగటున రూ.4,168 చొప్పున ధర లెక్కించబడింది. ముంబై, పుణె నగరాల సంపన్నుల సెకండ్ హోమ్ డెస్టినేషన్గా మారిన లోనావాలాలో ఇటీవలి కాలంలో ప్రముఖులు భారీగా ఆస్తి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలోని బాంద్రాలో అత్యంత ఖరీదైన బంగ్లా కలిగిన తెందుల్కర్, తాజా కొనుగోలుతో తన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను మరింత విస్తరించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
జీవించి ఉండగానే పిల్లలకు ఆస్తి రాస్తున్నారా?
జీవించి ఉండగానే పిల్లలకు ఆస్తులు, పెట్టుబడులు బదిలీ చేయాలనుకునే తల్లిదండ్రుల ముందు సాధారణంగా రెండు మార్గాలుంటాయి.. గిఫ్ట్ డీడ్ ద్వారా వెంటనే బదిలీ చేయడం లేదా విల్లు ద్వారా మరణానంతరం అప్పగించడం. ఈ రెండింటిలో ఏది మెరుగైనదో నిర్ణయించేటప్పుడు ఆస్తిపై నియంత్రణ, ట్యాక్స్-స్టాంప్ డ్యూటీ భారం, వివాదాల అవకాశం, పిల్లలు నివసించే ప్రాంతం వంటి అంశాలు కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.ఖైతాన్ అండ్ కో పార్టనర్ బిజల్ అజింక్యా అభిప్రాయం ప్రకారం గిఫ్ట్లు, విల్లు రెండూ వారసత్వ ప్రణాళికకు సమర్థవంతమైన సాధనాలేనని చెబుతున్నారు. అయితే వ్యక్తి ఉద్దేశం, విల్లు వివాదాస్పదమయ్యే అవకాశం వంటి అంశాల ఆధారంగా సరైన మార్గం ఎంచుకోవాలని పేర్కొన్నారు.పన్ను ఉండదు.. కానీ..భారత్లో నివసించే వ్యక్తులు దగ్గరి బంధువులకు ఇచ్చే గిఫ్ట్లపై సాధారణంగా ఆదాయపు పన్ను ఉండదు. కానీ స్టాంప్ డ్యూటీ వర్తించవచ్చు. విల్లు ద్వారా వచ్చే ఆస్తులపై పన్ను, స్టాంప్ డ్యూటీ రెండూ ఉండవు. అయితే బదిలీ తర్వాత ఆ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంపై పిల్లలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.తల్లిదండ్రులకు హక్కు ఉండదు..స్థిరాస్తి గిఫ్ట్ ఇవ్వాలంటే తప్పనిసరిగా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అవసరం అవుతుంది. మూవబుల్ ఆస్తులకు ఇది అవసరం లేదు. దగ్గరి బంధువులకు ఇచ్చే నివాస, వ్యవసాయ భూములపై కొన్ని రాష్ట్రాలు రాయితీ స్టాంప్ డ్యూటీ రేట్లు అందిస్తున్నాయి. గిఫ్ట్ ఇచ్చాక పిల్లలు చట్టబద్ధమైన యజమానులవుతారు కాబట్టి, తల్లిదండ్రులు ఆ ఆస్తిపై హక్కు కోల్పోతారు. కానీ విల్లు ద్వారా జీవితకాలం ఆస్తిపై నియంత్రణ కొనసాగించవచ్చు. షరతులతో కూడిన గిఫ్ట్ డీడ్ కూడా ఒక ప్రత్యామ్నాయం.పిల్లలు విదేశాల్లో ఉంటే..పిల్లలు విదేశాల్లో ఉంటే విదేశీ మారక నియంత్రణ నిబంధనలు, ఆ దేశ పన్ను చట్టాలు కూడా పరిగణించాలి. వివాదాలు, సుదీర్ఘ న్యాయ వ్యాజ్యాల భయంతో ఆస్తుల రక్షణ కోసం ప్రైవేట్ ట్రస్ట్లు ఎంపిక చేసుకునే కుటుంబాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అన్ని అంశాలను బేరీజు వేసుకొని, ఆస్తుల వ్యవహారంలో నిపుణుల సలహా మేరకే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరలు! -
కొత్త ఇంటికి.. కార్పొరేట్లు
ఫార్మా కంపెనీ ఎంఎస్ఎన్... హైదరాబాద్లో ప్రీమియం హౌసింగ్ను నిర్మిస్తోంది. కెమికల్స్ రంగంలోని జువారీ ఇండస్ట్రీస్ సైతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోకి అడుగు పెట్టింది. సిమెంట్ రంగంలోని జువారీ గ్రూప్ ఆటోమొబైల్స్ రంగంలోని హీరో, టీవీఎస్... ఢిల్లీ రెసిడెన్షియల్ హౌసింగ్ మార్కెట్లో వేగంగా అడుగులేస్తున్నాయి. జేఎస్డబ్ల్యూ గ్రూప్ అయితే తమ ‘జేఎస్డబ్ల్యూ ఒన్ హోమ్స్’తో పూర్తిగా టెక్ ఇళ్లను నిర్మిస్తామంటోంది. ఇక టెక్స్టైల్ రంగంలోని అర్వింద్తో పాటు రేమండ్, మ్యాక్స్, అదానీ, ఆదిత్య బిర్లా, మహీంద్రా, టాటా, గోద్రెజ్, ప్రెస్టీజ్, జువారీ వంటిగ్రూపులన్నీ రియల్ ఎస్టేట్లో తమ సత్తా చూపిస్తూనే ఉన్నాయి. అసలు రకరకాల ఇతర వ్యాపారాలు చేసే గ్రూపులన్నీ రియల్ ఎస్టేట్లోకి ఎందుకొస్తున్నాయి? నేరుగా నిర్మాణంలోకే కాకుండా హౌసింగ్తో ముడిపడ్డ పెయింట్స్, వైర్లు, కేబుళ్ల వంటి ఇతర రంగాలపైనా ఎందుకు దృష్టిపెట్టాయి? భారతీయ హౌసింగ్ మార్కెట్ ఏ రకంగా మారుతోంది? ఈ ‘హౌసింగ్ ఎకానమీ’లో లాభపడే కంపెనీలేంటి? భవిష్యత్ విజేతలను గుర్తించటం ఎలా? ఇన్వెస్టర్లు చూడాల్సిందేంటి? ఇదే ఈ వారం సాక్షి వెల్త్ ప్రత్యేక కథనం.. మీరు కోటి రూపాయల ఇంటిని బుక్ చేశారనుకోండి. ప్రధానంగా బయటకొచ్చేది ఆ రియల్టీ సంస్థ పేరే. కానీ మీరు ఆ ఇంట్లోకి వెళ్లకముందే... అదే ఇంటికోసం రకరకాల కంపెనీలు సిమెంట్, స్టీల్, పైపులు, వైరింగ్ స్విచ్లు, పెయింట్లు, టైల్స్, గమ్లు, శానిటరీవేర్, అద్దాలు, ఫ్యాన్లు, ఏసీలు, వంటింటి ఉపకరణాలు, ఫర్నిచర్, ఇన్సూరెన్స్ వంటివి విక్రయిస్తాయి. అంతేకాదు! ఇల్లంటే ఒకసారి కొనేస్తే అయిపోయేది కాదు. కొన్ని సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా నిర్వహణ కావాలి. ఇది... అత్యంత భారీ ఆర్థిక వ్యవస్థ. అందుకే.. గృహ యజమానుల ఖర్చుల్లో వాటా కోసం కార్పొరేట్ గ్రూప్ల పోటీ అంతకంతకూ పెరుగుతోంది. భారీ కార్పొరేట్ గ్రూప్లన్నీ ఈ హౌసింగ్ ఎకానమీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. మరి పునాది నుంచి హ్యాండోవర్ వరకూ ప్రతి దశలోనూ లాభపడే కంపెనీలేంటి? వచ్చే రెండు దశాబ్దాల్లో విజేతలుగా నిలిచేదెవరు? కార్పొరేట్ల ఎంట్రీ ఎందుకంటే... రియల్ ఎస్టేట్ మంచి సంబంధాలు అవసరమైన స్థానిక వ్యాపారం. కానీ ఇపుడు నగరాల్లో ఇళ్లు అప్గ్రేడ్ అవుతున్నాయి. కొనుగోలుదార్లు తాము ఇళ్లు కొన్నాక తమను వదిలేకుండా మెరుగైన సౌకర్యాలందించే బ్రాండెడ్ ప్రాజెక్టుల్ని చూస్తున్నారు. పెద్దపెద్ద కార్పొరేట్ గ్రూపులు ఇందులోకి వస్తున్నది కూడా ఈ కారణంతోనే. పైపెచ్చు చిన్న చిన్న బిల్డర్ల మాదిరి కాకుండా వీళ్లకు మూలధనం ఎక్కువ. దీర్ఘకాలం ప్రాజెక్టు పూర్తయ్యేదాకా వేచిచూడగల సామర్థ్యమూ ఎక్కువే. వీటన్నిటితోపాటు డెవలపర్లు నిర్మాణ సామగ్రి, హోమ్ ఫైనాన్స్, ఇంటీరియర్లు, మెయింటెనెన్స్ వంటి మొత్తం నిర్మాణ వ్యవస్థలో భాగమవుతున్నారు. ఇది వారికి మరిన్ని అవకాశాలనిస్తోంది. ఫార్మా నుంచి ప్రీమియం రియల్టీకి... ఫార్మాలో రాణిస్తున్న అరబిందో, ఎంఎస్ఎన్ సంస్థలు ఆరో రియల్టీ, ఎంఎస్ఎన్ రియల్టీ ద్వారా ప్రీమియం రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీ మార్కెట్లోకి ప్రవేశించాయి. ఆరో రియల్టీ ఇప్పటికే పలు ప్రాజెక్టుల్ని పూర్తిచేసి వివిధ ప్రాంతాల్లోకి భారీగా విస్తరించగా... ఎంఎస్ఎన్ సంస్థ నియోపోలిస్, తెల్లాపూర్, మంచిరేవుల, పటాన్చెరులో ప్రాజెక్టులు చేస్తోంది. ఫార్మాలో విజయవంతం కావటంతో ఈ సంస్థలకు మూలధనం కొరత లేదు. పైపెచ్చు స్థానిక విశ్వసనీయత తోడవుతుంది. అందుకే వీటికి రియల్టీ అనేది మరో గ్రోత్ ఇంజిన్గా మారుతోంది. కాకపోతే ఈ రియల్టీ విభాగాలు అన్లిస్టెడ్ కనక ఇన్వెస్టర్లు వీటి షేర్లు కొనటం కుదరదు. గోవాలో ప్రీమియం ప్రాజెక్టుతో రసాయనాల కంపెనీ జువారీ ఇండస్ట్రీస్ కూడా ఈ రంగంలోకి ఎంట్రీ ఇచి్చంది. హైదరాబాద్, కోల్కతాల్లో ప్రాజెక్టులు ఆరంభిస్తోంది. దీన్నిబట్టి చూసినపుడు రియల్టీలో భవిష్యత్ విజేతలకు భారీ ల్యాండ్ బ్యాంక్లు అక్కర్లేదు. అనుకున్న ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తిచేసే నైపుణ్యం ఉంటే చాలు. కొత్తకోణం... ఆదిత్య బిర్లా ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అ్రల్టాటెక్ తాజాగా వైర్లు, కేబుళ్ల రంగంలోకి ప్రవేశించింది. సిమెంట్ రంగంలో లీడర్గా ఉన్న అ్రల్టాటెక్తో పాటు పెయింట్ల కంపెనీ బిర్లా ఓపస్ కూడా ఈ గ్రూపుదే. ఇపుడు వైర్లు, కేబుళ్లలోకి ఎంట్రీ. అంటే... నిర్మాణంలో అవసరమైన సిమెంట్, చివర్లో అవసరమయ్యే పెయింట్లు, వాల్పుట్టీ, మధ్యలో అవసరమయ్యే వైర్లు కేబుళ్లు, కొనుగోలుకు అవసరమయ్యే ఫైనాన్స్. ఇవన్నీ ఇపుడు గ్రూపు వ్యాపారాల్లోకి చేరిపోయాయి. పైపె చ్చు సిమెంటు కోసం బలమైన డి్రస్టిబ్యూషన్ నెట్ వర్క్ ఉంది. అది మిగతా ఉత్పత్తులకూ పనికొస్తుంది. కాబట్టి పోటీ మామూలుగా ఉండదు. పాలీకేబ్... అదిరిపోయే కథ 2020లో పాలీకేబ్ లిస్టయినపుడు దీన్ని కూడా మరో కేబుల్స్ కంపెనీగానే చూశారు ఇన్వెస్టర్లు. ఓ ఏడాదిపాటు రూ.600–700 రేంజిలో తిరిగిన ఈ షేరు... ఇటీవలే రూ.10 వేలు దాటింది. ఇపుడు రూ.8వేల పైనే ఉంది. అంటే ఐదేళ్లలో పది రెట్లు!!. నిజానికి 2020 తరువాత హౌసింగ్ బూమ్ మొదలైంది. ఇన్ఫ్రా బాగా పెరిగింది. డీలర్ నెట్వర్క్ బలోపేతం చేసుకుంటూ పరిశ్రమలకు అవసరమైన కేబుళ్లు కూడా అందిస్తూ పాలికేబ్ బాగా ఎదిగింది. పైపెచ్చు ఫ్యాన్లు, స్విచ్లు, లైట్లు, ఎలక్ట్రిక్ ఉపకరణాల తయారీలోకీ అడుగుపెట్టింది. లాభార్జనకు దీర్ఘకాలం అవసరమయ్యే ఈ రంగంలో గతేడాదే లాభం కళ్ల చూసింది. అందుకే ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. దీంతో పాటు కీఇండస్ట్రీస్, ఆర్ఆర్ కాబెల్, హావెల్స్, ఫినోలెక్స్ కేబుల్స్ కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలిచ్చాయి. అందుకే బలమైన నెట్వర్క్ను ఆసరా చేసుకుని ఆదిత్యబిర్లా గ్రూపు సవాలుకు దిగింది. మరమ్మతులను మరిచిపోవద్దు ఇంటిని కొనుగోలుదారు స్వా«దీనం చేసుకోవటంతోనే హౌసింగ్ స్టోరీ ముగిసిపోదు. గృహప్రవేశం చేసిన తరువాత ఆయా కుటుంబాలు గోడలు రిపేరు చేయించుకుంటాయి. కొందరు టైల్స్ను మారుస్తారు. ఏసీలు బిగిస్తారు. మాడ్యులర్ కిచెన్ పెడతారు. ఫ్యాన్లు అప్గ్రేడ్ చేయటమే కాదు... బాత్రూమ్లలో శానిటరీ వేర్ మారుస్తారు. సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. అందుకే మరమ్మతుల సైకిల్ చాలా పెద్దది. కాబట్టి ఇందులో ముడిపడి ఉన్న కంపెలన్నీ దీర్ఘకాలిక లబి్ధదారులే.చూడాల్సిందేంటి? ఫార్మా గ్రూపులు, రసాయనాల కంపెనీలు, సిమెంటు కంపెనీల వంటివన్నీ హౌసింగ్ గొలుసులోకి ప్రవేశిస్తున్నాయంటే... మన హౌసింగ్ బూమ్ రియల్ ఎస్టేట్కే పరిమితం కావటం లేదని అర్థం. పాలికేబ్ లాంటి వెల్త్ క్రియేటర్లకు చాలా చోటుందని అర్థం. అందుకే ఇకపై ఒక కొత్త ప్రాజెక్టు వస్తోందంటే చూడాల్సింది దాన్నెవరు ఆరంభించారని మాత్రమే కాదు. ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారు? సిమెంట్ ఎవరిది? వైరింగ్ ఎవరిది? పెయింట్లు ఎవరివి? ఫర్నిíÙంగ్ ఎవరిది? ఇవన్నీ చూడాలి. ఎందుకంటే ఇవే ‘రియల్’ ఎకానమీ విజేతలు మరి. ఇదీ... హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ డెవలపర్లు ఇళ్లను విక్రయించేది వీరే కనక ఇది నేరుగా లబి్ధపొందే శ్రేణి. → డీఎల్ఎఫ్ → గోద్రెజ్ ప్రాపరీ్టస్ → ప్రెస్టీజ్ ఎస్టేట్స్ → ఒబెరాయ్ రియల్టీ → మాక్రోటెక్ డెవలపర్స్ → బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ → శోభా డెవలపర్స్ గమనించాల్సిన అంశాలు: ఈ కంపెనీల కొత్త ప్రాజెక్టుల లాంచ్లు. ప్రీ–సేల్స్, క్యాష్ కలెక్షన్స్, రుణాలు, భూ సమీకరణ, విక్రయం కాకుండా మిగిలిపోయిన ఇళ్ల సంఖ్య, డెలివరీ వివరాలు. సిమెంట్, నిర్మాణ సామగ్రి నిర్మాణం సిమెంటు, స్టీలు, కాంక్రీట్తో మొదలవుతుంది. కాబట్టి తొలి లబి్ధదారులు ఈ కంపెనీలేనని చెప్పొచ్చు. లీడర్ల విషయానికొస్తే... → అ్రల్టాటెక్ సిమెంట్ → అంబుజా సిమెంట్ → శ్రీ సిమెంట్ → దాల్మియా భారత్ → రామ్కో సిమెంట్స్ → జేఎస్డబ్ల్యూ సిమెంట్ → టాటా స్టీల్ → సెయిల్ → జిందాల్ స్టీల్ → జేఎస్డబ్ల్యూ స్టీల్ → జిందాల్ స్టెయిన్లెస్ గమనించాల్సిన అంశాలు: ప్రాంతీయ డిమాండ్, సిమెంటు ధరలు, రవాణా ఖర్చులు, సామర్థ్య విస్తరణ, ఇన్పుట్ వ్యయం పెరుగుదల.పెయింట్లు, టైల్స్, శానిటరీవేర్ ఇంటిని స్వా«దీనం చేసుకునే సమయంలో విజేతలయ్యే కంపెనీలివి. ఈ దశలోనే కాంక్రీటు నిర్మాణమనేది నివాసయోగ్యమైన ఇల్లుగా మారుతుంది. గమనించాల్సిన కంపెనీలు... → ఏసియన్ పెయింట్స్ → బెర్జర్ పెయింట్స్ → కాన్సాయ్ నెరోల్యాక్ → ఇండిగో పెయింట్స్ → కజారియా సిరామిక్స్ → సోమానీ సిరామిక్స్ → సెరా శానిటరీవేర్ → ఏజీఎల్ చిరకాలంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ రంగంలోకి బలమైన నెట్వర్క్ ఆసరాతో బిర్లా ఓపస్ ద్వారా ఆదిత్యబిర్లా గ్రూపు... జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ద్వారా జిందాల్ గ్రూపు ప్రవేశించటంతో పోటీ మరింత ఆసక్తికంగా మారింది. హౌసింగ్ ఫైనాన్స్ దీర్ఘకాల ప్లేయర్లు ఈ కంపెనీలు. ఎందుకంటే ఇల్లు ఒకసారి కొన్నా ఇంటి రుణం మాత్రం 15 నుంచి 25 ఏళ్లు కంటిన్యూ అవుతుంది. కాబట్టి అప్పటిదాకా ఈ కంపెనీలు లబ్ధి పొందుతూనే ఉంటాయి. డిసెంబరు 2024 నాటికి భారత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లోన్బుక్ ఏకంగా 38.3 లక్షల కోట్లు. → ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ → పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ → కెన్ ఫిన్ హోమ్స్ → హోమ్ ఫస్ట ఫైనాన్స్ → ఆవాస్ ఫైనాన్షియర్స్ → పిరమల్ ఫైనాన్స్ → ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ గమనించాల్సిన అంశాలు: ఈ కంపెనీలిచ్చే రుణం ఎంతమేరకు పెరుగుతోందనేది ప్రధానమైమే. కానీ అదొక్కటే సరిపోదు. ఇచి్చన రుణాల వసూళ్లెలా ఉన్నాయి? అంటే రుణ నాణ్యత ఎంత? దీనికవుతున్న ఖర్చెంత? అంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అన్నమాట. క్రెడిట్ లాస్ ఏ మేర ఉంది? ఇవన్నీ ప్రధానమే. వైర్లు, ఎలక్ట్రికల్స్, ఉపకరణాలు పూర్తయిన ఇంటికి వైర్లు, స్విచ్లు, లైటింగ్, ఫ్యాన్లు, ఉపకరణాలు కావాలి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ హౌసింగ్ ఎలక్ట్రికల్స్లో ప్రీమియం ఉత్పత్తులు పెరుగుతున్నాయి. డిమాండ్ఈ రంగంలో గమనించాల్సిన కంపెనీలను చూస్తే... → పాలికేబ్ → కీ ఇండస్ట్రీస్ → వీ–గార్డ్ → ఆర్ఆర్ కబెల్ → హావెల్స్ → ఫినోలెక్స్ కేబుల్స్ → క్రాంప్టన్ గ్రీవ్స్ కన్సూమర్ ఎలక్ట్రికల్స్ → వోల్టాస్ → బ్లూస్టార్పైపులు, గమ్లు, వాటర్ప్రూఫింగ్ కనిపించని లబ్ధిదారులు ఈ కంపెనీలు. ఎందుకంటే వీ టి ఉత్పత్తులకు అందమైన హెడ్లైన్లుండవు. కానీ ప్రతి ఇంటికీ ఇవి తప్పనిసరి. గమనించాల్సిన కంపెనీలు... → ఆస్ట్రల్ → సుప్రీం ఇండస్ట్రీస్ → ప్రిన్స్ పైప్స్ → పిడిలైట్ ఇండస్ట్రీస్ → ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ రమణమూర్తి మంథా -
వేల కోట్ల అప్పుల్లో ‘రిచ్ డాడ్’ రచయిత.. ఏం జరిగింది?
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత ఆర్థిక నిర్వహణపై భారీ ప్రభావం చూపిన రచయిత రాబర్ట్ కియోసాకి పేరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కారణం.. ఆయన వెల్లడించిన 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్లకు పైగా) అప్పు. అయితే ఈ మొత్తం కియోసాకి వ్యక్తిగతంగా చెల్లించాల్సిన రుణం కాదని, ఆయన భాగస్వాములతో కలిసి నిర్వహిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించినదని తాజా వివరాలు స్పష్టం చేస్తున్నాయి.కియోసాకి ఇటీవల ‘గెట్ రిచ్ ఎడ్యుకేషన్’ పోడ్కాస్ట్లో తాను సుమారు 1.2 బిలియన్ డాలర్ల అప్పులో ఉన్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆర్థిక విద్యపై పుస్తకాలు రాసిన వ్యక్తికే ఇంత భారీ అప్పు ఎలా సాధ్యమంటూ చర్చ మొదలైంది. అయితే ఆ మొత్తాన్ని ఆయన వ్యక్తిగత రుణంగా చూడటం తప్పుదారి పట్టించే విషయమని ఆయన మాజీ భార్య, దీర్ఘకాల వ్యాపార భాగస్వామి కిమ్ కియోసాకి వివరించారు.1,500 అపార్ట్మెంట్లకు సంబంధించిన రుణంవానిటీ ఫెయిర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిమ్ కియోసాకి తెలిపిన వివరాల ప్రకారం.. కియోసాకి, ఆయన భాగస్వాములు సుమారు 1,500 అపార్ట్మెంట్ యూనిట్లను కలిగి ఉన్నారు. ఈ ఆస్తులకు సంబంధించిన రుణాల మొత్తం దాదాపు 1.2 బిలియన్ డాలర్లు. అంటే మొత్తం అప్పు రియల్ ఎస్టేట్ ఆస్తులపై తీసుకున్న రుణం. అందులో కియోసాకి వ్యక్తిగత బాధ్యత చాలా తక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వానిటీ ఫెయిర్ అంచనా ప్రకారం ఆయన వ్యక్తిగత వాటా సుమారు 30 మిలియన్ నుంచి 60 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని తెలిపింది.కియోసాకి ఈ విధానాన్ని తన ‘గుడ్ డెట్’ సిద్ధాంతానికి ఉదాహరణగా చూపిస్తున్నారు. సాధారణంగా అప్పును ఆర్థిక భారంగా భావిస్తే, కియోసాకి మాత్రం ఆదాయం తీసుకొచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించే రుణాన్ని భిన్నంగా చూస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ విలువ పెరిగినప్పుడు ఆ ఆస్తులపై మరింత రుణం తీసుకుని, వచ్చిన నిధులను ఇతర పెట్టుబడుల్లోకి మళ్లించడం ఆయన వ్యూహంలో కీలక భాగం.ఆస్తి విలువ పెరిగితే.. మళ్లీ అప్పుఉదాహరణకు ఒక రియల్ ఎస్టేట్ ఆస్తి విలువ పెరిగిందనుకుందాం. దాన్ని విక్రయించి లాభం పొందడం బదులు, పెరిగిన ఈక్విటీని ఆధారంగా చేసుకుని రుణం తీసుకోవచ్చు. ఆ డబ్బుతో మరో ఆదాయాన్ని సృష్టించే ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ఇలా ఒక ఆస్తి నుంచి వచ్చే విలువను మరో పెట్టుబడికి ఉపయోగిస్తూ పోర్ట్ఫోలియోను విస్తరించడం కియోసాకి మోడల్లో కనిపిస్తుంది. పెట్టుబడులను వేర్వేరు లిమిటెడ్ లయబిలిటీ కంపెనీల (LLC) ద్వారా నిర్మించడం ద్వారా ఒక్క ఆస్తిలో సమస్య ఏర్పడితే అది మిగిలిన పెట్టుబడులపై ప్రభావం చూపకుండా రిస్క్ను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తారు.‘నా వ్యూహాన్ని అనుసరించొద్దు’అయితే ఇక్కడే అసలు రిస్క్ కూడా ఉంది. ఆస్తుల ధరలు పెరుగుతున్న సమయంలో అధిక పరపతి (leverage) భారీ సంపదను సృష్టించగలిగినా.. మార్కెట్ పడిపోతే నష్టాలను కూడా అదే స్థాయిలో పెంచుతుంది. ఆస్తి విలువ తగ్గితే రుణం-ఆస్తి నిష్పత్తి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వడ్డీ రేట్లు పెరిగితే రీఫైనాన్సింగ్ ఖర్చులు కూడా భారమవుతాయి.ఈ కారణంగానే కియోసాకి స్వయంగా తన వ్యూహాన్ని అందరూ అనుసరించవద్దని హెచ్చరిస్తున్నారు. రుణాన్ని ఉపయోగించడం గురించి తాను 1974 నుంచే అధ్యయనం చేస్తున్నానని, అప్పును పెట్టుబడి సాధనంగా ఉపయోగించాలంటే సరైన అవగాహన అవసరమని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: ‘బంగారు’ లాభం! ఒక్క లక్ష.. 3.28 లక్షలైంది -
భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే!
భారత్లో ఇళ్ల ధరలు గత ఐదేళ్లలో నిర్మాణ ఖర్చుల కంటే చాలా వేగంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో 2021 నుంచి 2025 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణ ఖర్చు 34 శాతం పెరిగితే.. ఇళ్ల ధరలు ఏకంగా 59 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.నిర్మాణ ఖర్చుఅనరాక్ నివేదిక ప్రకారం.. 2021లో ఒక సాధారణ ప్లస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను నిర్మించడానికి చదరపు అడుగుకు సగటున రూ.2,681 ఖర్చయ్యేది. 2025 నాటికి అది రూ.3,604కు చేరింది. అంటే ఐదేళ్లలో నిర్మాణ ఖర్చు సుమారు 34 శాతం పెరిగింది. ఏడాదికి 6.9 శాతం పెరుగుదల అన్నమాట.ఇళ్ల ధరలుఇదే సమయంలో ఇళ్ల సగటు ధరలు కూడా చాలా వేగంగా పెరిగాయి. 2021లో ప్రధాన నగరాల్లో చదరపు అడుగు సగటు రెసిడెన్షియల్ క్యాపిటల్ విలువ రూ.5,826గా ఉండగా, 2025 నాటికి అది రూ.9,260కు చేరింది. అంటే ఐదేళ్లలో ఇళ్ల ధరలు ఏకంగా 59 శాతం పెరిగాయి. వార్షిక వృద్ధి రేటు దాదాపు 12 శాతంగా ఉంది.మొత్తం మీద నిర్మాణ ఖర్చు 34 శాతం పెరిగితే.. ఇళ్ల ధర మాత్రం 59 శాతం పెరిగిందని నివేదిక చెబుతోంది. ఈ రెండింటి మధ్య దాదాపు 25 శాతం వ్యత్యాసం ఉంది.ఇళ్ల ధరలు పెరగడానికి కారణంఇళ్ల ధరలు కేవలం సిమెంట్, స్టీల్, కార్మిక ఖర్చుల వల్ల మాత్రమే పెరగడం లేదు. ఇందులో భూమి ధరలు, డెవలపర్ల మార్జిన్లు, డిమాండ్ అండ్ సప్లై పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా.. పెద్ద నగరాల్లో భూమి ధరలు భారీగా పెరిగాయి. కొత్త రోడ్లు, మెట్రో, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూమి విలువలు మరింత వేగంగా పెరుగుతున్నాయి.నిర్మాణ ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. స్టీల్, ఇంధనం, రవాణా, ఫినిషింగ్ మెటీరియల్స్ వంటి ఖర్చులు కూడా కారణమయ్యాయి. టైల్స్, గ్లాస్, హార్డ్వేర్ వంటి ఫినిషింగ్ మెటీరియల్స్ ధరలు సుమారు 8-12 శాతం పెరిగాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్కు సంబంధించిన ఖర్చులు కూడా 9-13 శాతం పెరిగాయి. కార్మిక వ్యయం పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.అనరాక్ ప్రకారం.. 2021 నుంచి 2026 మొదటి అర్ధభాగం వరకు ప్రధాన నగరాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి ధరలు 50 నుంచి 120 శాతం వరకు పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు ప్రాంతాల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది.ఇల్లు కొనేవారికి కష్టమేనా?ఇళ్ల ధరలు నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరగడం వల్ల ప్రధానంగా హోమ్బయ్యర్లపై భారం పెరుగుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు చెందినవారు ఇప్పటికే ఈఎంఐలు, డౌన్ పేమెంట్, ఇతర ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ఇళ్ల ధరలు మరింత పెరిగితే వారికి అందుబాటులో ఉన్న ఇళ్ల ఎంపికలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే.. ప్రీమియం, లగ్జరీ ఇళ్ల విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. అధిక ఆదాయం ఉన్న కొనుగోలుదారులు ధరల పెరుగుదలను కొంతవరకు భరించగలరు.ఇదీ చదవండి: SBI స్కీమ్.. డబ్బు దాచుకోవడానికి మంచి మార్గం! -
లగ్జరీ ఏరియాలో రూ. 63 లక్షల కొత్త ఇల్లు కొన్న ఖుషీ కపూర్
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, దివంగత నటి శ్రీదేవి-నిర్మాత బోనీ కపూర్ ల చిన్నకుమార్తె ఖుషీ కపూర్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోకు కొత్త ఆస్తిని జోడించింది. ముంబైలోని బాంద్రా వెస్ట్లో కొత్త అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది.CRE మ్యాట్రిక్స్కు లభించిన ఆస్తి రికార్డుల ప్రకారం బాలీవుడ్ ప్రముఖులు నివాసముండే పాపులర్ ఏరియా, బాంద్రా వెస్ట్లోని 25వ రోడ్డులో ఉన్న సమతాదీప్ బిల్డింగ్లో ఈ అపార్ట్మెంట్ ఉంది. దీని ధర సుమారు రూ. 63 లక్షలు. ఈ లావాదేవీ సెప్టెంబర్ 1 అధికారికంగా రిజిస్టర్ చేయబడింది. ఈ డీల్కు స్టాంప్ డ్యూటీ కింద రూ. 3.15 లక్షలు చెల్లించినట్టు సమాచారం.కార్పెట్ ఏరియా 180 చదరపు అడుగులు ఈ ఫ్లాట్ను ఫారూఖ్ ఛాగ్లా అనే వ్యక్తి నుంచి ఈ ప్రాపర్టీని ఆమె కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది.కాగా 2023లో జోయా అక్తర్ దర్శకత్వం వహించిన 'ది ఆర్చీస్' (The Archies) సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిందిఖుషీకపూర్. ఆ తర్వాత ఇబ్రహీం అలీ ఖాన్తో కలిసి 'నాదానియాన్', జునైద్ ఖాన్తో కలిసి 'లవ్యాపా' చిత్రాల్లో నటించారు. తన తల్లి శ్రీదేవి నటించిన హిట్ చిత్రం 'మామ్' (Mom - 2017) కి సీక్వెల్గా వస్తున్న 'మామ్ 2' (Mom 2) లో ఖుషీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో జిష్షూ సేన్గుప్తా, కరిష్మా తన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎమోషనల్ థ్రిల్లర్లో ఖుషీ అత్యంత బలమైన, ఆకట్టుకునే నటనను కనబరచనున్నట్లు సమాచారం.అటు ఖుషీ సోదరి జాన్వీ కపూర్కూడా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడుఇదీ చదవండి: రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ -
రియల్ ఎస్టేట్లో కీలక సంస్కరణలు
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల విధానం మరింత సులభతరం చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎంప్యానెల్డ్ థర్డ్ పార్టీలు ఇచ్చే సాంకేతిక పరిశీలన, తనిఖీ నివేదికల ఆధారంగా పట్టణ స్థానిక సంస్థలు నిర్ణయాలు తీసుకునే విధానానికి అవకాశం కల్పిస్తూ ఆగస్టు 1న జీఓ 229ను జారీ చేసింది. దీంతో ఆమోదిత లేఅవుట్లలో 500 చదరపు మీటర్ల వరకు ప్లాట్ విస్తీర్ణం, 10 మీటర్ల వరకు ఎత్తు ఉన్న వ్యక్తిగత నివాస భవనాలకు ఎంప్యానెల్డ్ థర్డ్ పార్టీ తనిఖీ నివేదిక ఆధారంగా అనుమతి లేదా తిరస్కరణ జారీ చేయవచ్చు. అలాగే 300 చ.మీటర్ల వరకు ప్లాట్, 10 మీటర్ల వరకు ఎత్తు ఉన్న భవనాలకు కంప్లీషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ విషయంలోనూ థర్డ్ పార్టీ తనిఖీ నివేదిక పరిగణనలోకి తీసుకోవచ్చు.200 చదరపు మీటర్ల వరకు ప్లాట్, ఏడు మీటర్ల వరకు ఎత్తు ఉన్న వ్యక్తిగత భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవడం ఐచ్ఛికమని జీఓ పేర్కొంది. కానీ భవన నిబంధనలు, జోనింగ్ రెగ్యులేషన్లు, మాస్టర్ప్లాన్, ఇతర చట్టబద్ధమైన ప్రమాణాలను సడలించే అధికారం మాత్రం థర్డ్ పారీ్టలకు లేదు. ఆ అధికారం సంబంధిత మున్సిపల్ కమిషనర్ వద్దే ఉంటుంది. కేసుల కేటాయింపు, తనిఖీలు, ఆడిట్, ఉల్లంఘనలపై చర్యలు వంటి పర్యవేక్షణ వ్యవస్థను కూడా జీఓ సూచించింది. ఇదే సంస్కరణలను మరింత పటిష్ఠమైన భద్రతా ప్రమాణాలతో హైరైజ్ భవనాలు, గ్రూప్ హౌసింగ్, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, మిక్స్డ్ యూజ్ ప్రాజెక్టులకు దశలవారీగా విస్తరించాలని స్థిరాస్తి వర్గాలు కోరుతున్నాయి. పెద్ద ప్రాజెక్టులకు ఇబ్బందులు..పెద్ద నిర్మాణ ప్రాజెక్ట్ల అనుమతికి అగ్నిమాపక, ట్రాఫిక్ పోలీసు, కాలుష్య నియంత్రణ మండలి, జలమండలి, విద్యుత్ సంస్థలు, అవసరమైన చోట ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పర్యావరణ విభాగాల అనుమతులు, ఎన్ఓసీలు అవసరమవుతాయి. నిర్మాణదారుడు ఒక్కో శాఖను సంప్రదించాల్సి వస్తోంది. ఒకే పత్రాలు, డ్రాయింగ్లు, సాంకేతిక వివరాలను పలుమార్లు సమర్పించాలి. ఒకవేళ అభ్యంతరాలు వస్తే డిజైన్ను పలుమార్లు మార్చాల్సి వస్తోంది. దీంతో కాలయాపన జరిగి ప్రాజెక్టు వ్యయం పెరుగుతోంది. ఈ భారం పరోక్షంగా గృహ కొనుగోలుదారుడిపై పడే అవకాశం ఉంటుంది. ఒకే దరఖాస్తు అన్ని శాఖల సమన్వయం హైరైజ్, గ్రూప్ హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నిజమైన సమగ్ర డిజిటల్ సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిర్మాణదారుడు ఒకేసారి దరఖాస్తు, భూమి పత్రాలు, మాస్టర్ప్లాన్ వివరాలు, ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్లు, స్ట్రక్చరల్ కాన్సెప్ట్, ఫైర్ సేఫ్టీ ప్లాన్, ట్రాఫిక్ అధ్యయనం, నీరు–డ్రైనేజీ వివరాలు, విద్యుత్, పర్యావరణ సమాచారాన్ని సమర్పించాలి. ఆన్లైన్లోనే అవసరమైన శాఖలు ఎన్ఓసీలను అందజేయాలి. తీవ్రమైన ప్రజా భద్రత లేదా చట్టపరమైన అంశం బయటపడితే తప్ప, ఇప్పటికే పరిశీలించిన అంశాలను పదేపదే తిరిగి తెరవకుండా స్పష్టమైన విధానం ఉండాలి. పారదర్శకతకు వీలు.. జీఓ 229 విధానాలను హైరైజ్, గ్రూప్ హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్టులకు విస్తరించాలి. దీంతో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూనే, పరిశీలనను వృత్తిపరంగా, పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసే వీలుంటుంది. ఈ మంచి సంస్కరణను సమగ్ర సింగిల్ విండో వ్యవస్థగా అభివృద్ధి చేస్తే, తెలంగాణ నిర్మాణ అనుమతుల్లో వేగం, పారదర్శకత, భద్రతకు దేశానికే ఆదర్శంగా నిలవగలదు. – మారం సతీశ్కుమార్, ప్రెసిడెంట్, గ్రేటర్ ఈస్ట్ జోన్ అసోసియేషన్ -
KPHBలో గజం భూమి ధర రూ.2.70 లక్షలు
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కేపీహెచ్బీకి క్రేజ్ ఎలా ఉందో మరోసారి రుజువైంది. కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలానికి భారీ స్పందన లభించింది. రికార్డు స్థాయి ధరలకు భూములు అమ్ముడయ్యాయి. ఇక్కడ చదరపు గజం భూమి గరిష్టంగా రూ.2.70 లక్షల పలికింది.కెపిహెచ్బీ 7వ ఫేజ్లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం హౌసింగ్ బోర్డు వేలం నిర్వహించింది. ఈ వేలంలో పాల్గొనేందుకు మొత్తం 19 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. అధికారుల అంచనాలను మించుతూ వేలంలో కొనుగోలుదారులు పోటీపడి పాట పాడారు.వేలంలో గజానికి కనీస మద్దతు ధర రూ.1.60 లక్షలుగా నిర్ణయించగా, గరిష్ఠంగా రూ.2.70 లక్షల వరకు ధర వెళ్లింది. మరో ప్లాట్ గజం రూ.2.36 లక్షలకు విక్రయమవ్వగా, రెండు ప్లాట్లు గజానికి రూ.2.06 లక్షల చొప్పున అమ్ముడయ్యాయి.వేలం ముగిసే సమయానికి గజం సగటు ధర రూ.1.79 లక్షలుగా నమోదైంది. ఈ 16 ప్లాట్ల విక్రయం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల మేర భారీ ఆదాయం సమకూరింది.వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు తెలిపింది. కేపీహెచ్బీ ప్రాంతంలోని ప్లాట్లకు కొనుగోలుదారుల నుంచి ఇప్పటికీ నిరంతర భారీ డిమాండ్ ఉందనడానికి ఈ వేలం ఫలితాలే నిదర్శనమని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం పేర్కొన్నారు.👉ఇదీ చదవండి : టెకీల దెబ్బ.. పడిపోయిన రియల్ ఎస్టేట్! -
రియల్ ‘ఈల్డ్’ జోరు.. రేసులోకి హైదరాబాద్!
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన మార్పులకు లోనవుతోంది. ఒక ప్రాపర్టీ విలువ ఆధారంగా ఏడాదికి వచ్చే అద్దె ఆదాయాన్ని కొలిచే రెంటల్ ఈల్డ్ గత ఏడేళ్లలో క్రమంగా పుంజుకోవడం ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతాలను ఇస్తోంది. ‘అనరాక్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ’ గణాంకాల ప్రకారం 2019 నుంచి 2026 రెండో త్రైమాసికం నాటికి దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో రెంటల్ ఈల్డ్స్ గణనీయంగా పెరిగాయి.నగరాల వారీగా రెంటల్ ఈల్డ్స్ పెరుగుదల (2019-2026 క్యూ2 వరకు)బెంగళూరు: 3.6% నుంచి 4.6% (దేశంలోనే అత్యధికం)గురుగ్రామ్: 3.5% నుంచి 4.3%ముంబై: 3.5% నుంచి 4.3%పుణె: 3.3% నుంచి 4.0%నోయిడా: 3.2% నుంచి 3.9%కోల్కతా: 3.3% నుంచి 3.9%హైదరాబాద్: 2.6% నుంచి 3.6% (అత్యధిక శాతం పెరుగుదల)చెన్నై: 2.7% నుంచి 3.3%ఢిల్లీ: 2.2% నుంచి 3.2%హైదరాబాద్ మార్కెట్ను ప్రత్యేకంగా గమనిస్తే ఇక్కడ రెంటల్ ఈల్డ్ 2019లో ఉన్న 2.6 శాతం నుంచి 2026 నాటికి 3.6 శాతానికి పెరిగింది. ఇది దేశంలోనే అత్యధిక శాతం పెరుగుదలలో ఒకటి కావడం విశేషం. ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావడం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విస్తరణ వల్ల ప్రధాన ఉద్యోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న నివాసాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని రియల్టీ నిపుణులు చెబుతున్నారు.ఈ డేటాను విశ్లేషించేటప్పుడు ఇన్వెస్టర్లు కేవలం అద్దె ఆదాయాన్నే కాకుండా ప్రాపర్టీ విలువ పెరిగే అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ వంటి నగరాలు స్థిరమైన నగదు ప్రవాహాన్ని కోరుకునే వారికి అనుకూలంగా ఉన్నాయి. హైదరాబాద్ వంటి నగరాలు వేగవంతమైన వృద్ధి, మెరుగైన క్యాపిటల్ అప్రిసియేషన్ రెండింటినీ అందిస్తున్నాయి.భవిష్యత్తులో పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉద్యోగ కేంద్రాలు, మెట్రో రవాణా వసతులు ఉన్న ప్రాంతాల్లో 2 బీహెచ్కే లేదా 3 బీహెచ్కే ఫ్లాట్లను ఎంచుకోవడం ద్వారా ప్రాపర్టీ ఖాళీగా ఉండే సమయాన్ని తగ్గించవచ్చు. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీల్లో 3 నుంచి 4.6 శాతం మధ్య ఉండే ఈల్డ్స్తో పోలిస్తే, కమర్షియల్ ప్రాపర్టీల ద్వారా 7 నుంచి 9 శాతం వరకు అద్దె రాబడి సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను తగిన విధంగా విస్తరించుకోవాలి.ఇదీ చదవండి: కుప్పకూలిన బంగారు కొండ! -
రూ.60 కోట్ల ‘శివశక్తి’.. అజయ్-కాజోల్ ఇంటి ప్రత్యేకతలు!
బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగన్, కాజోల్ నివసించే ముంబై జుహూలోని లగ్జరీ బంగ్లా ‘శివశక్తి’ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సుమారు రూ.60 కోట్ల విలువైన ఈ రాజప్రసాదం ఆధునిక శైలికి, సాంప్రదాయ డిజైన్లకు ప్రతీకగా నిలుస్తుంది. నటి కాజోల్ తన ఇంట్లోని మెట్లమార్గం వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ ఇంట్లోని ఇంటీరియర్ ప్రత్యేకతలపై మీడియాలో మళ్లీ ఆసక్తి నెలకొంది.ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్ అంశాలు..ఈ బంగ్లాలో ప్రధాన ఆకర్షణ చెక్కతో రూపొందించిన విశాలమైన మెట్లమార్గం. దీనికి అనుబంధంగా పైకప్పు నుంచి నీటి బిందువుల తరహాలో వేలాడే వెలుగుల శ్రేణి ఫోటోషూట్లకు సరైన బ్యాక్డ్రాప్గా మారింది.మొదటి అంతస్తులోని లాబీ మెరిసే తెల్లటి మార్బుల్ ఫ్లోరింగ్తో నిర్మించారు. సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకు ఉన్న పెద్ద గ్లాస్ విండోస్ సహజమైన వెలుతురును ఇంటికి అందిస్తాయి.లివింగ్ రూమ్లో ఐవరీ సోఫాలు, ఆరు సీట్ల డైనింగ్ టేబుల్ లగ్జరీ లుక్ను ఇస్తాయి.మినిమలిస్టిక్ థీమ్కు భిన్నంగా రెడ్ లెదర్ సోఫాలతో కూడిన లాంజ్ ఏరియా కుటుంబ సభ్యుల కలయికలకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది.ఆధ్యాత్మికతకు, వ్యక్తిగత అభిరుచులకు అద్దం పట్టేలా నిర్మించిన ఈ నివాసం సెలబ్రిటీ హోమ్ల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసింది. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol)ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. -
నార్త్ సెంట్రల్ హైదరాబాద్లో రియల్టీ జోరు
సాక్షి, సిటీబ్యూరో: గృహ కొనుగోలుదారులు ఎవరికైనా సరే వారి తొలి ప్రాధాన్యం.. తాము కొనబోయే ఇంటికి సమీపంలో స్కూల్, ఆసుపత్రి, రవాణా సదుపాయాలు ఉన్నాయా? లేవా? అనేవే! ఆ తర్వాత షాపింగ్ మాల్, ఇతరత్రా సౌకర్యాలను చూస్తారు. వీటన్నింటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా మారింది నార్త్ సెంట్రల్ హైదరాబాద్. పారిశ్రామిక కేంద్రం నుంచి గ్రీన్ నివాస ప్రాంతంగా బాలానగర్ – కూకట్పల్లి వై జంక్షన్ అభివృద్ధి చెందింది. ‘లైవ్, వర్క్, ప్లే’లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ నివాస గృహాల అవసరాలు మారుతున్నాయి. ఒకప్పుడు రక్షణ రంగానికి, భారీ పారిశ్రామిక ఉత్పత్తులకు నిలయంగా ఉన్న నార్త్ సెంట్రల్ హైదరాబాద్ ఇప్పుడు పచ్చని వాతావరణం, ఆధునిక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుత కనెక్టివిటీతో శరవేగంగా ఐటీ, ప్రీమియం నివాస హబ్గా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు బాలానగర్ అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ పరిశ్రమలకు ప్రసిద్ధి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఆజాద్ ఇంజనీరింగ్ వంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచాయి.అయితే నగరీకరణ పెరుగుతుండటంతో ప్రభుత్వం పారిశ్రామిక యూనిట్లను ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలించింది. దీంతో బాలానగర్లోని పారిశ్రామిక స్థలాలు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ల పునర్నిర్మాణానికి అనువుగా మారాయి. పచ్చని పార్కులు, పర్యావరణ అనుకూల వసతులతో ఈ ప్రాంతమిప్పుడు కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు చిరునామాగా మారింది.మెరుగైన రవాణా సదుపాయాలు.. నార్త్ సెంట్రల్ హైదరాబాద్లో నివసించే వారికి ఏ ప్రాంతానికైనా సులువుగా చేరుకునేలా కనెక్టివిటీ ఉండటం అతిపెద్ద వరం. నగరంలోని ప్రధాన ఐటీ హబ్ అయిన హైటెక్ సిటీ, లైఫ్ సైన్సెస్ రంగానికి కేరాఫ్ అడ్రస్ అయిన జీనోమ్ వ్యాలీకి కూకట్పల్లి–బాలానగర్ అత్యంత సమీపంలో ఉంది. కైత్లాపూర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో మాదాపూర్, హైటెక్ సిటీలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది.అలాగే బాలానగర్ మెట్రో స్టేషన్ ద్వారా ఇక్కడ్నుంచి హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, హెచ్ఐసీసీలకు వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. నగర కేంద్రంలో ఉండటం వల్ల కూకట్పల్లి వై జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లకు చేరుకోవడం సులభం. ఎన్హెచ్–44 , ఔటర్ రింగ్ రోడ్ ద్వారా శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన ప్రయాణం.విద్య, వైద్య, వినోద కేంద్రాలు కూడా.. ప్రపంచ స్థాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో బాలానగర్ ప్రాంతం అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తోంది. ఇంటికి చేరువలోనే అంతర్జాతీయ విద్యా సంస్థలు ఉండటంతో పిల్లలకు పాఠశాలకు వెళ్లే ప్రయాణ సమయం తగ్గి చదువుపై దృష్టి పెట్టడానికి, తల్లిదండ్రులకు భద్రతా భావం కలగడానికి తోడ్పడుతుంది. అలాగే అంతర్జాతీయ ఆసుపత్రులూ ఈ ప్రాంతంలో ఉండటంతో అధునాతన వైద్య పరిజ్ఞానం, వైద్య నిపుణులతో సమగ్ర చికిత్స ఇక్కడే అందుబాటులో ఉంది. ఇక, వీకెండ్ వస్తే కుటుంబ సమేతంగా సరదాగా గడపడం, వీకెండ్ వినోదం కోసం బాలానగర్ ప్రాంతంలో అనేక మాల్స్, థియేటర్లున్నాయి. -
ఆకాశమే హద్దుగా.. రియల్ ఎస్టేట్
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. హైదరాబాద్ నగరంలో భూమి బంగారం కంటే వేగంగా విలువను పెంచుకుంటోంది. నగర పశ్చిమ ప్రాంతంలోని ఐటీ కారిడార్లో భూములను దక్కించుకోవడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి డెవలపర్లు భారీగా పోటీ పడుతున్నారు.హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ)లకు కేరాఫ్ అడ్రస్గా మారడం, భవన నిర్మాణాల ఎత్తు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు లేకపోవడం, గ్రేడ్–ఏ ఆఫీస్ స్థలాలకు విపరీతమైన గిరాకీ ఉండటమే పశ్చిమ హైదరాబాద్లో భూముల డిమాండ్కు ప్రధాన కారణాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఐటీహబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మెట్రో రైల్ సదుపాయం, ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ ప్రాంతాలు అత్యంత సమీపంలో ఉండటంతో అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో జాతీయ, అంతర్జాతీయ బిల్డర్లు నగరంలో నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణాలపై దృష్టి సారించారు. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండటంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించిందనే అంచనాలను తలకిందులు చేస్తూ, దేశంలోనే అత్యంత డైనమిక్ నగరంగా హైదరాబాద్ మరోసారి తన పట్టును నిరూపించుకుంది. ఈ స్థాయిలో భూముల ధరలు పెరగడంతో భవిష్యత్తులో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు మరింత ప్రియమయ్యే అవకాశం ఉంది.ఈ నెల 21న రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో 5.38 ఎకరాల మల్టీ–యూజ్ (వాణిజ్య, నివాస) భూమిని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆన్లైన్ వేలం వేయగా. ఎకరానికి రూ.264 కోట్లు పలికింది. అలాగే శుక్రవారం (ఆగస్ట్ 28) కూడా ఇక్కడ ఎకరం ధర రికార్డు స్థాయిలో రూ.269 కోట్లు పలికింది. ఇది దేశంలోనే ప్రభుత్వ వేలంలో నమోదైన అత్యధిక రికార్డు ధరల్లో ఒకటిగా నిలిచింది. -
రాయదుర్గ్ భూములకు రికార్డు ధర.. ఎకరాకు రూ.269 కోట్లు!
హైదరాబాద్లోని రాయదుర్గ్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల వేలం రికార్డు స్థాయిలో జరిగింది. తాజాగా 5.38 ఎకరాల P2 ప్లాట్ ఎకరాకు రూ.269 కోట్ల ధర పలకడంతో ప్రభుత్వానికి మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు జరిగిన P1 ప్లాట్ వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల ధర లభించి, రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో రెండు వేలాల్లో కలిపి 10.63 ఎకరాల భూమికి రూ.2,833.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు సగటున రూ.266.53 కోట్ల ధర రావడం, రిజర్వ్ ధర కంటే 52.3 శాతం అధికంగా ఉండటం విశేషం.ఐటీ, వాణిజ్య రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో రాయదుర్గ్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతంలో భూములకు మంచి విలువ ఉంటుందని పెట్టుబడిదారులు ఇక్కడ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంగానే భూముల ధరలు గణనీయంగా పెరిగాయి.ఈ వేలం ఎంఎస్టీసీ ఈ-ఆక్షన్ వేదికగా పారదర్శకంగా నిర్వహించారు. టీజీఐఐసీకి లావాదేవీ సలహాదారుగా జేఎల్ఎల్ వ్యవహరించింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పారదర్శకమైన వేలం ప్రక్రియ వల్ల ప్రభుత్వ భూములకు గరిష్ఠ విలువ లభించిందని టీజీఐఐసీ పేర్కొంది. మొత్తం మీద.. రాయదుర్గ్ భూముల వేలం ప్రభుత్వ ఆస్తుల నగదీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవడమే కాకుండా, హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధిపై పెట్టుబడిదారులకు ఉన్న బలమైన విశ్వాసాన్ని కూడా ప్రతిబింబించింది. -
ఇన్ఫ్రా ఖర్చులకు రెక్కలు.. రూ.3.4 లక్షల కోట్ల భారం!
న్యూఢిల్లీ: మౌలిక(ఇన్ఫ్రా) సదుపాయాల ప్రాజెక్టుల వ్యయాలు భారీగా పెరిగిపోయినట్లు నెలవారీ ప్రభుత్వ నివేదిక పేర్కొంది. రూ. 150 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులపై ఉమ్మడిగా రూ. 3.4 లక్షల కోట్లమేర వ్యయాల భారం పడినట్లు 2026 జూలైకు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 17 కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల ద్వారా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మొత్తం 1,775 ప్రాజెక్టుల వ్యయాలు రూ. 33,70,138 కోట్ల నుంచి రూ. 37,10,642 కోట్లకు చేరినట్లు వివరించింది.అయితే.. ఎన్ని ప్రాజెక్టులలో అంచనాలకు మించి వ్యయాలు పెరిగిందీ వెల్లడించలేదు. వీటిపై మొత్తం రూ. 19.26 లక్షల కోట్లు వెచ్చించగా.. సవరించిన అంచనా వ్యయాలలో ఇవి 51.91 శాతానికి సమానమని గణాంకాలు, పథకాల అమలు శాఖ విడుదల చేసిన నివేదిక తెలియజేసింది. నిలకడగా ప్రాజెక్టుల అభివృద్ధి జరుగుతున్నట్లు పేర్కొంది. ప్రాజెక్టులలో అధిక భాగం చివరి దశకు చేరుకున్నట్లు తెలియజేసింది. 675(38 శాతం) ప్రాజెక్టు పనులు నిర్మాణపరం(ఫిజికల్)గా 80 శాతం పూర్తికాగా.. మరో 305(17 శాతం) ప్రాజెక్టులు ఫైనాన్షియల్గా 80 శాతానికి మించి పూర్తయినట్లు వెల్లడించింది.ప్రాజెక్టుల వివరాలివీరవాణా, లాజిస్టిక్స్ రంగంలో అత్యధికంగా 1,246 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా.. రూ. 19.81 లక్షల కోట్ల సవరించిన అంచనాలు కనెక్టివిటీ ఆధారిత మౌలికసదుపాయాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 1,775 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో రూ. 1,000 కోట్లకుపైబడిన మెగా ప్రాజెక్టులు 735 ఉన్నట్లు వెల్లడించింది.వీటి అసలు అంచనా వ్యయాలు రూ. 28.77 లక్షల కోట్లుకాగా.. 1,040 ప్రధాన(రూ. 1,000 కోట్ల నుంచి రూ. 150 కోట్లవరకూ) ప్రాజెక్టుల అంచనా వ్యయాలు రూ. 4.93 లక్షల కోట్లుగా తెలియజేసింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అధిక సంఖ్యలో 993(56 శాతం) ప్రాజెక్టులను కలిగి ఉంది. మొత్తం సవరించిన ప్రాజెక్టుల అంచనా వ్యయాలలో వీటి వాటా రూ. 9.62 లక్షల కోట్లు(26 శాతం)గా తెలియజేసింది. ఇది జాతీయస్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని పట్టిచూపుతున్నట్లు పేర్కొంది.ఇతర శాఖల ద్వారా.. గణాంకాల శాఖ నివేదిక ప్రకారం రైల్వే శాఖ 190 ప్రాజెక్టులను(11 శాతం) అభివృద్ధి చేస్తోంది. వీటి మొత్తం సవరించిన అంచనా వ్యయాలు రూ. 6.38 లక్షల కోట్లు(17 శాతం). బొగ్గు శాఖ ప్రాజెక్టులు 121(7 శాతం)కాగా.. వీటి సవరించిన ప్రాజెక్టు వ్యయాలు రూ. 2.22 లక్షల కోట్లు(6 శాతం). పెట్రోలియం, సహజవాయువు, విద్యుత్, గృహాలు, పట్టణ వ్యవహారాలు, నీటి వనరులు, నదుల అభివృద్ధి తదితర శాఖలు వరుసగా 103, 98, 50, 38 ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.వీటి సవరించిన అంచనా వ్యయాలు వరుసగా రూ. 4.23 లక్షల కోట్లు, రూ. 6.08 లక్షల కోట్లు, రూ. 3.78 లక్షల కోట్లు, రూ. 2.01 లక్షల కోట్లు. మిగిలిన 182 ప్రాజెక్టుల(10 శాతం) అంచనా వ్యయాలు రూ. 2.78 లక్షల కోట్లు(8 శాతం)కాగా.. ఇవి ఉన్నత విద్య, పౌర విమానయానం, స్టీల్, టెలికమ్యూనికేషన్స్, కారి్మకులు, ఉపాధి, పోర్టులు, షిప్పింగ్, జల రవాణా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, గనులు, డీపీఐఐటీ, క్రీడల శాఖల ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నట్లు నివేదిక పేర్కొంది. -
మొదటిసారి ఇల్లు కొంటున్నారా?
ప్రతి ఒక్కరి జీవితంలో సొంతిల్లు అనేది ఒక అపురూపమైన స్వప్నం. అయితే, ఆకర్షణీయమైన బ్రోచర్లు, రంగురంగుల అడ్వర్టైజ్మెంట్లు చూసి తొందరపడి బిల్డర్ చేతిలో అడ్వాన్స్ పెడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే బిల్డర్కు డబ్బు చెల్లించే ముందే కొన్ని ప్రశ్నలు నిలదీయక తప్పదు.రేరా నమోదు ఉందా?ప్రాజెక్టుకు ‘రేరా’(భారత రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచడానికి, బిల్డర్ల మోసాల నుంచి ఇళ్లు కొనుగోలు చేసే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది) అనుమతి ఉందో లేదో కచ్చితంగా నిర్ధారించుకోవాలి. కేవలం మాటల గారడీకి మోసపోకుండా ప్రాజెక్ట్ రేరా రిజిస్ట్రేషన్ నంబర్, పురపాలక/పట్టణాభివృద్ధి సంస్థల ఆమోదిత ప్లాన్ను ప్రత్యక్షంగా పరిశీలించాలి.కార్పెట్ ఏరియా ఎంత?ఆస్తి విస్తీర్ణం లెక్కల్లో బిల్డర్లు చూపే సూపర్ బిల్టప్ ఏరియా మాయాజాలంలో పడకూడదు. అసలైన ‘కార్పెట్ ఏరియా’ (నివసించే స్థలం) ఎంత వస్తుందో తేల్చుకోవాలి. లేకపోతే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అవుతుంది.దాగి ఉన్న రుసుములుకేవలం బేస్ ప్రైస్ మాత్రమే కాకుండా కార్ పార్కింగ్, క్లబ్హౌస్, ప్లాన్ అప్రూవల్, ప్రీయారిటీ ల్యాండ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు రుసుముల వివరాలను పైసాతో సహా ముందే లిఖితపూర్వకంగా తీసుకోకపోతే బడ్జెట్ తలకిందులవుతుంది.చెల్లింపుల ప్రణాళికఒక్కసారే పెద్దమొత్తంలో చెల్లించకుండా నిర్మాణ పురోగతికి అనుగుణంగా చెల్లించే కన్స్ట్రక్షన్ లింక్డ్ ప్లాన్ ఎంచుకోవడమే క్షేమదాయకం.స్వాధీన తేదీ.. పరిహారంప్రాజెక్టు పూర్తి చేసి ఇల్లు అప్పగించే తేదీ, ఒకవేళ నిర్మాణంలో ఆలస్యమైతే బిల్డర్ చెల్లించే పరిహారంపై బయ్యర్-బిల్డర్ అగ్రిమెంట్ (బీబీఏ)లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయో లేదో చూసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
టెకీల దెబ్బ.. పడిపోయిన రియల్ ఎస్టేట్!
దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు రెండో త్రైమాసికంలో కొంత మందగించాయి. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు, ఏఐ ఆధారిత ఉద్యోగ పునర్వ్యవస్థీకరణ, భౌగోళిక ఉద్రిక్తతలు, రుతుపవనాల ముందు ఉండే కాలానుగుణ ప్రభావాలు కొనుగోలుదారుల సెంటిమెంట్పై ప్రభావం చూపినట్లు ప్రాప్టైగర్ తాజా ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్’ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా టెక్ ఆధారిత బెంగళూరు, పుణె మార్కెట్లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 91,729 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 97,674 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 6.1 శాతం తగ్గాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చినా విక్రయాలు 4.4 శాతం క్షీణించాయి. అయితే కొత్త ఇళ్ల ప్రారంభాలు మాత్రం వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి 89,161 యూనిట్లకు చేరాయి. అంటే కొత్త సరఫరా కంటే విక్రయాలు 2,568 యూనిట్లు అధికంగా ఉండటంతో, మార్కెట్లో అమ్ముడుకాని ఇళ్ల నిల్వ గణనీయంగా పెరగలేదని నివేదిక పేర్కొంది.పుణెలో భారీ పతనంఎనిమిది ప్రధాన మార్కెట్లలో పుణెలో ఇళ్ల అమ్మకాలు అత్యధికంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 20.8 శాతం తగ్గి 12,642 యూనిట్లకు చేరాయి. అహ్మదాబాద్లో 20.2 శాతం తగ్గి 7,541 యూనిట్లకు, బెంగళూరులో 9.2 శాతం తగ్గి 14,186 యూనిట్లకు చేరాయి. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లలోనూ అమ్మకాలు సుమారు 7 శాతం చొప్పున తగ్గాయి.టెక్నాలజీ రంగంపై ఆధారపడిన నగరాల్లో ఉద్యోగ భద్రతపై నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా రూ.1 కోటి లోపు ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే వారిని మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేసిందని ప్రాప్టైగర్ అంచనా వేసింది. అయితే టెక్ రంగంలోని పరిణామాలే అమ్మకాలు తగ్గడానికి ఏకైక కారణం కాదని, అంతర్జాతీయ అనిశ్చితి, సీజనల్ ప్రభావాలు కూడా డిమాండ్పై ప్రభావం చూపాయని నివేదిక స్పష్టం చేస్తోంది.హైదరాబాద్, చెన్నైలో భిన్నమైన పరిస్థితిఇతర ప్రధాన నగరాలకు భిన్నంగా హైదరాబాద్, చెన్నై మార్కెట్లు మంచి వృద్ధిని నమోదు చేశాయి. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు 14.6 శాతం పెరిగి 13,196 యూనిట్లకు చేరాయి. చెన్నైలో ఏకంగా 36 శాతం పెరిగి 7,183 యూనిట్లకు చేరడం ఎనిమిది నగరాల్లో అత్యధిక వార్షిక వృద్ధిగా నిలిచింది. కోల్కతాలోనూ తొలి త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలు 22 శాతం పెరిగి బలమైన రికవరీని చూపించాయి. అయితే వార్షిక ప్రాతిపదికన అక్కడ విక్రయాలు 8.6 శాతం తగ్గాయి.అమ్మకాలు తగ్గినా.. ధరలు మాత్రం పైకేఇళ్ల విక్రయాల సంఖ్య తగ్గినప్పటికీ ధరల విషయంలో మాత్రం మార్కెట్ బలంగానే ఉంది. ఎనిమిది నగరాల్లో విక్రయాల ఆధారిత సగటు నివాస ధర త్రైమాసిక ప్రాతిపదికన 1 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.10,153కి చేరింది. వరుసగా రెండో త్రైమాసికంలోనూ ఈ ధర రూ.10,000 మార్క్ పైనే కొనసాగింది. ఇది తక్కువ సంఖ్యలో ఇళ్లు అమ్ముడవుతున్నప్పటికీ అధిక విలువ కలిగిన ఇళ్లకు డిమాండ్ కొనసాగుతున్నట్లు సూచిస్తోంది.బెంగళూరులో ధరలు వార్షికంగా 26 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.9,931కు చేరాయి. ముంబైలో చదరపు అడుగుకు సగటు ధర రూ.15,422గా ఉండగా, వార్షికంగా 20.4 శాతం పెరిగింది. పుణెలో ధర తొలిసారిగా రూ.8,000 మార్క్ను దాటి రూ.8,084కు చేరింది. అహ్మదాబాద్ మాత్రం ఎనిమిది ప్రధాన మార్కెట్లలో అత్యంత అందుబాటు ధరలున్న నగరంగా నిలిచింది. అక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.5,295గా ఉంది.పండుగ సీజన్పై ఆశలుముందు రోజుల్లో పండుగ సీజన్ గృహ డిమాండ్కు కీలక పరీక్షగా నిలవనుంది. పండుగల సందర్భంగా కొనుగోళ్లు ఊపందుకోవడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన గృహ రుణ పరిస్థితులు మార్కెట్కు మద్దతు ఇవ్వవచ్చని ప్రాప్టైగర్ అంచనా వేస్తోంది. బెంగళూరులో మెట్రో ఫేజ్-3, పుణెలో లైన్-3 విస్తరణ, చెన్నై మెట్రో ఫేజ్-2 వంటి ప్రాజెక్టులు కూడా ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్కు ఊతమివ్వగలవు.అయితే స్థోమత (affordability) ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉంది. నగరాలను బట్టి ధరలు 4.4 శాతం నుంచి 26 శాతం వరకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి కొనుగోలుదారులపై గృహ రుణ భారం పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ పూర్తిగా బలహీనపడలేదని, కానీ కొనుగోలుదారులు గతంతో పోలిస్తే మరింత ఎంపిక చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నారని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ఇంటితోనే ఇంకో ఇల్లు కొనచ్చు: కియోసాకి కిటుకు -
ఎవర్గ్రాండ్.. చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజానికి జీవిత ఖైదు
షాన్జై: చైనా ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ఎవర్గ్రాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా వెలిగిన ఎవర్గ్రాండ్ వ్యవస్థాపకుడు హుయ్ కా యాన్కు చైనా కోర్టు జీవిత ఖైదు విధించింది. భారీ ఆర్థిక మోసాలు, లంచాలు, నిధుల దుర్వినియోగం సహా ఎనిమిది నేరాలను అంగీకరించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది.1996లో స్థాపించిన ఎవర్గ్రాండ్ చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. అయితే 2016–2021 మధ్య కంపెనీ ఆస్తులను కృత్రిమంగా పెంచి చూపడం, అప్పులను దాచిపెట్టడం, పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడం వంటి అక్రమాలకు పాల్పడిందని దర్యాప్తులో తేలింది. దీంతో సంస్థపై వేల కోట్ల యువాన్ల ఆర్థిక మోసాల కేసులు నమోదయ్యాయి.జీవిత ఖైదుతో పాటు ఆస్తుల జప్తుషెన్జెన్ మధ్యంతర ప్రజా న్యాయస్థానం హుయ్ కా యాన్కు జీవిత ఖైదు విధించడమే కాకుండా ఆయన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని ఆదేశించింది. ఎవర్గ్రాండ్ గ్రూప్కు 8.82 బిలియన్ యువాన్, దాని అనుబంధ సంస్థ హెంగ్డాకు 7 బిలియన్ యువాన్ జరిమానా విధించారు. మరో 56 మంది మాజీ అధికారులు కూడా వివిధ కాలాల జైలు శిక్షలు పొందారు.చైనా ఆర్థిక సంక్షోభానికి ప్రతీక2021లో ఎవర్గ్రాండ్ సుమారు 300 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో డిఫాల్ట్ కావడంతో (రుణాలు చెల్లించలేక చేతులెత్తేయడంతో) చైనా రియల్ ఎస్టేట్ రంగం కోలుకోలేని సంక్షోభంలోకి కూరుకుపోయింది. వేలాది మంది గృహ కొనుగోలుదారులు, చిన్న పెట్టుబడిదారులు తాము దాచుకున్న సొమ్మును కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ పరిణామం దేశ ఆర్థిక వృద్ధిని తీవ్రంగా దెబ్బతీసింది. హాంకాంగ్ కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ కంపెనీ లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్నప్పటికీ బాధితులకు, రుణదాతలకు రావాల్సిన సొమ్ములో అతిస్వల్ప భాగం మాత్రమే ఇప్పటివరకు రికవరీ అయింది.బిలియనీర్ నుంచి ఖైదీ వరకు…2017లో హుయ్ కా యాన్ సంపద 45 బిలియన్ డాలర్లకు పైగా చేరి ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచాడు. కానీ ఐదేళ్లలోనే అదే వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలి, ఇప్పుడు జీవితాంతం జైలుకు చేరడం చైనా కార్పొరేట్ చరిత్రలో అత్యంత సంచలన పతనాల్లో ఒకటిగా నిలిచింది -
ముంబై 3.0: 124 గ్రామాలతో కొత్త నగరం!
భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక నగరాల్లో ముంబై ఒకటి. ఈ నగరం ఒకప్పుడు పెరిగినంతగా.. ఇప్పుడు పెరగడానికి కావలసినంత స్థలం లేకుండా పోయింది. భూమి పరిమితంగా ఉంది, ఆస్తుల ధరలు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా.. రోడ్లు, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ముంబై నగర భవిష్యత్ విస్తరణకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ముంబై 3.0'గా పిలుస్తున్న కర్నాల-సాయి-చిర్నేర్ (KSC) న్యూ టౌన్ను అభివృద్ధి చేయాలని చూస్తోంది.ఈ కొత్త నగరం రాయగఢ్ జిల్లాలోని ఉరాన్, పన్వెల్, పెన్ తాలూకాల్లోని 124 గ్రామాలను కలుపుకుని సుమారు 323.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి కానుంది. ఈ ప్రాంతానికి 'ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ' (MMRDA)ను న్యూ టౌన్ డెవలప్మెంట్ అథారిటీగా నియమించారు. అంటే.. ఇది సాధారణంగా ఏర్పడే కొత్త నివాస ప్రాంతం కాదు.. ముందస్తు ప్రణాళికతో నిర్మించే ఒక పెద్ద నగరమన్నమాట.ముంబై 3.0 ఎందుకు అవసరం?ముంబై ఇప్పటికే తన అసలు ప్రాంతాన్ని దాటి విస్తరించింది. ఆ తర్వాత నవి ముంబై ఒక ప్రధాన ప్రత్యామ్నాయ నగరంగా అభివృద్ధి చెందింది. కానీ.. నవి ముంబైలో కూడా భూమికి డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల భవిష్యత్తులో పెరిగే జనాభా, ఉద్యోగాలు, పరిశ్రమలు, గృహ అవసరాలను తీర్చడానికి మరో పెద్ద పట్టణ కేంద్రం అవసరమైంది.ముంబై 3.0 ప్రాజెక్టులో కేవలం కొత్త భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా.. ఉద్యోగాలు, నివాసాలు, పరిశ్రమలు, విద్య, వైద్యం, టెక్నాలజీ, లాజిస్టిక్స్ వంటి అన్ని రంగాలను ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసి, సమగ్ర నగరంగా రూపొందించాలని భావిస్తున్నారు.ప్రణాళిక ప్రకారం.. సుమారు 104 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో టౌన్షిప్లు, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో.. గ్రీన్ జోన్లు, అడవులు, గ్రామీణ ప్రాంతాలను కూడా రక్షించడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడే ప్రయత్నం జరుగుతోంది.ముంబై 3.0కి ప్రధాన బలంఈ కొత్త నగరానికి ఉన్న అతిపెద్ద ప్రయోజనం కనెక్టివిటీ. ముంబై-నవి ముంబై మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేసిన అటల్ బిహారీ వాజ్పేయీ సెవ్రీ-న్హావా శేవా అటల్ సేతు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకం. అదే విధంగా.. నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పన్వెల్-కర్జత్ రైల్వే కారిడార్, విరార్-అలీబాగ్ మల్టీమోడల్ కారిడార్, ముంబై-పుణే ఎక్స్ప్రెస్వే వంటి మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతాన్ని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించనున్నాయి.దీని వల్ల భవిష్యత్తులో.. ముంబై 3.0 ప్రాంతం ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ఆరోగ్య సేవలు, విద్య, లాజిస్టిక్స్ వంటి రంగాలకు ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.రియల్ ఎస్టేట్పై ప్రభావంముంబై 3.0 అభివృద్ధి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సాధారణంగా వాటి చుట్టుపక్కల కొత్త నివాస, వాణిజ్య ప్రాంతాల అభివృద్ధికి దారితీస్తాయి.అటల్ సేతు, కొత్త విమానాశ్రయం, రైల్వే, మల్టీమోడల్ కారిడార్లు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే.. ఈ ప్రాంతంలో కొత్త రియల్ ఎస్టేట్ మైక్రో-మార్కెట్లు ఏర్పడవచ్చు. ఉద్యోగాలు పెరిగితే.. వాటికి అనుగుణంగా ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సేవలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. అయితే.. దీని ప్రయోజనాలు వెంటనే కనిపించవు. ఇలాంటి భారీ నగర ప్రాజెక్టులు పూర్తిగా అభివృద్ధి చెందడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. కాబట్టి.. దీనిని తక్షణ రియల్ ఎస్టేట్ బూమ్గా కాకుండా దీర్ఘకాలిక నగర అభివృద్ధి ప్రణాళికగా చూడాలి.భారీ పెట్టుబడులుముంబై 3.0 ప్రాజెక్టుకు ప్రభుత్వ స్థాయిలో కూడా గణనీయమైన ప్రాధాన్యం లభిస్తోంది. 2026-27 సంవత్సరానికి MMRDA సుమారు రూ.4,000 కోట్లను కర్నాలా-సాయి-చిర్నేర్ న్యూ టౌన్ అభివృద్ధికి కేటాయించింది.ఇదే సమయంలో భూముల విషయంలో 124 గ్రామాల భూస్వాములతో వ్యవహరించడం కూడా కీలకమైన అంశం. భూస్వాములకు నగదు పరిహారం, డెవలప్మెంట్ రైట్స్, ల్యాండ్ పూలింగ్ వంటి వివిధ మార్గాలను ప్రతిపాదిస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు విజయవంతం కావాలంటే భూసేకరణ, స్థానిక ప్రజల ప్రయోజనాలు, పునరావాసం వంటి అంశాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది.ముంబై 3.0 భవిష్యత్తుముంబై 3.0 అనేది ఒక్కరోజులో ఏర్పడే నగరం కాదు. ప్రణాళిక, భూమి సంబంధిత ప్రక్రియలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, పెట్టుబడులు, పరిశ్రమల రాక వంటి అనేక దశల తర్వాతే ఇది పూర్తిస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుంది. ప్రాజెక్టు తొలి దశ ఈ దశాబ్దం చివరి భాగంలో రూపుదిద్దుకునే అవకాశం ఉన్నప్పటికీ.. మొత్తం నగర వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. -
కమర్షియల్ రియల్ ఎస్టేట్ కళకళ..
దేశీయంగా భారీ స్థాయిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటవుతున్నాయి. ఏడు రాష్ట్రాలు 2031 నాటికి 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన లక్ష్యంతో 1,380 జీసీసీల ఏర్పాటుకు దోహపడేలా ప్రత్యేక విధానాలను రూపొందించాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.ఈ రాష్ట్రాలు.. విశిష్ట జీసీసీ పాలసీలను రూపొందించడంలో భారతీయ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అత్యంత అసాధారణమైన వేగాన్ని ప్రదర్శించాయని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. భారతీయ సర్వీసుల వ్యవస్థకు జీసీసీలు ప్రధాన కేంద్రాలుగా మారుతుండటాన్ని ఇది తెలియజేస్తోందని వివరించారు. రాష్ట్రాలు నిర్దిష్ట ప్రోత్సాహకాలు, వేగవంతంగా అనుమతులు, దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాలను కల్పించే హామీలు మొదలైనవి కల్పించడం ద్వారా జీసీసీలను స్వాగతించేందుకు పోటీపడుతున్నాయని పేర్కొన్నారు.నివేదికలో మరిన్ని విశేషాలు.. కర్ణాటక 3.5 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే యోచనతో 500 జీసీసీలను టార్గెట్గా పెట్టుకుంది. మహారాష్ట్ర 4 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడేలా 200 జీసీసీలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. గుజరాత్ 50,000 ఉద్యోగావకాశాల కల్పనతో 250 జీసీసీలను, కేరళ 1.6 లక్షల కొలువు లక్ష్యంతో 80 జీసీసీలను టార్గెట్గా పెట్టుకుంది. అలాగే మధ్యప్రదేశ్ 37,000 ఉద్యోగాల కల్పన కోసం 50 జీసీసీలను సాధించాలని నిర్దేశించుకుంది. జీసీసీ ఉద్యోగుల కోసం తమిళనాడు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. తెలంగాణ, ఢిల్లీ కూడా జీసీసీ వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రోత్సహించే విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ పరిశ్రమ కోసం నిర్దిష్ట విధానాలను రూపొందించడంపై ఇతరత్రా పలు రాష్ట్రాలు దృష్టి పెడుతున్నాయి. కేరళ ముసాయిదా జీసీసీ పాలసీలను ప్రతిపాదించింది. 2022 నుంచి 2026 తొలి ఆరు నెలల వ్యవధి మధ్య భారత్లోని టాప్ 9 నగరాల్లో జీసీసీలు 12.3 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. -
‘ఎంపీ డెవలపర్స్’ బ్రాండ్ అంబాసిడర్గా సమంత
దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నటి సమంత కొత్త బాధ్యతలను స్వీకరించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ ‘ఎంపీ డెవలపర్స్’(MP Developers) తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా సమంతను నియమించినట్లు ప్రకటించింది.ఈ భాగస్వామ్యానికి ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ అనుబంధం ఉందని కంపెనీ చెప్పింది. ఎంపీ డెవలపర్స్ సంస్థ ప్రస్థానం, నటి సమంత కెరీర్.. రెండూ చెన్నైలోని పల్లవరం ప్రాంతం నుంచే ప్రారంభం కావడం విశేషం. చెన్నై మూలాల నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించే దిశగా సాగుతున్న తమ ప్రయాణానికి సమంత చేరిక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.14 ఏళ్ల విశ్వసనీయత.. 250కి పైగా ప్రాజెక్టులుకంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో స్థాపించిన ఎంపీ డెవలపర్స్ గత 14 ఏళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో విశేష పురోగతిని సాధించింది. ఇప్పటివరకు 250కి పైగా నివాస ప్రాజెక్టులను పూర్తి చేసింది. 3,000 కంటే ఎక్కువ కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంది. చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో ప్రస్తుతం 1.5 మిలియన్ చదరపు అడుగుల (15 లక్షల చ.అ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఎంపీ డెవలపర్స్ యాజమాన్యం స్పందిస్తూ.. ‘ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల భవనం మాత్రమే కాదు; అది ఒక కుటుంబం భవిష్యత్తు కలలకు పునాది. అత్యుత్తమ లొకేషన్, సమర్థవంతమైన డిజైన్, నిర్మాణ నాణ్యత, కస్టమర్ల సుదీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం’ అని తెలిపింది.గ్రోత్ గ్యారెంటీ హోమ్స్సొంతింటి కలను నెరవేర్చుకోవడంతోపాటు ఇల్లు కొనడాన్ని భవిష్యత్తుకు బలమైన పెట్టుబడిగా మార్చే దిశగా ఎంపీ డెవలపర్స్ ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ అనే వినూత్న భావనను అందుబాటులోకి తెచ్చింది.ఈ ప్రాజెక్టుల ప్రధాన ముఖ్యాంశాలుఅధిక అభివృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేయడి.మెరుగైన రవాణా / కనెక్టివిటీ సౌకర్యాలు కల్పించడం.ఆచరణాత్మకమైన, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించే గృహాలను రూపొందించడం.విస్తరణ దిశగా అడుగులుఈ సందర్భంగా ఎంపీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ మలినేని మాట్లాడుతూ.. ‘మా 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రోజు ఒక కీలకమైన కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 250కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేసి 3,000 కుటుంబాల విశ్వాసాన్ని పొందడం మా బాధ్యతను మరింత పెంచింది. సమంతతో ఈ కొత్త భాగస్వామ్యం మా బ్రాండ్ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. ఇది ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. తమిళనాడులోని ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు ఎన్ఆర్ఐ వినియోగదారులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అన్నారు. ‘Built for Living. Guaranteed for Growth’ అనే స్పష్టమైన విధానంతో నాణ్యమైన ఇళ్లను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబం భవిష్యత్తు పురోగతికి విలువ జోడించడమే లక్ష్యంగా ఎంపీ డెవలపర్స్ తన తదుపరి ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందన్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
ఒక్క పెంట్హౌస్ రూ.271 కోట్లు.. ఇది లగ్జరీ సామ్రాజ్యం!
గురుగ్రామ్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో డీఎల్ఎఫ్ (DLF) సంస్థ మరోసారి రికార్డు స్థాయి ధరలతో వార్తల్లో నిలిచింది. డీఎల్ఎఫ్కు చెందిన ‘ది డాలియాస్’లో వ్యాపారవేత్త మానవ్ సర్దానా రూ.271 కోట్లకు పెంట్హౌస్ కొనుగోలు చేయడం దేశంలోనే అత్యంత ఖరీదైన సింగిల్-యూనిట్ రెసిడెన్షియల్ డీల్స్లో ఒకటిగా నిలిచింది. 17,200 చదరపు అడుగుల సూపర్ ఏరియా, 10,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉన్న ఈ పెంట్హౌస్కు సూపర్ ఏరియా ప్రాతిపదికన చదరపు అడుగుకు సుమారు రూ.1.58 లక్షలు, కార్పెట్ ఏరియా ప్రకారం దాదాపు రూ.2.6 లక్షలు ధర పలికింది.అయితే ఈ రూ.271 కోట్ల డీల్ డీఎల్ఎఫ్ గురుగ్రామ్ లగ్జరీ హౌసింగ్ ప్రయాణంలో ఒక్కసారిగా వచ్చిన మైలురాయి కాదు. ‘ది మాగ్నోలియాస్’ నుంచి ‘ది కామెలియాస్’, అక్కడి నుంచి ‘ది డాలియాస్’ వరకు సంస్థ క్రమంగా అత్యంత సంపన్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న ప్రత్యేకమైన రెసిడెన్షియల్ సెగ్మెంట్ను నిర్మించింది. డీఎల్ఎఫ్ స్వయంగా గురుగ్రామ్లోని ఈ ప్రాజెక్టులను తన ‘సూపర్ లగ్జరీ రెసిడెన్సెస్’ పోర్ట్ఫోలియోలో భాగంగా పేర్కొంటోంది.మాగ్నోలియాస్.. రూ.45 కోట్ల నుంచి మొదలుఈ లగ్జరీ నిచ్చెనలోని పాత మెట్లలో ‘ది మాగ్నోలియాస్’ ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ వివరాల ప్రకారం.. ఇక్కడ 4-BHK ఇళ్ల పరిమాణం సుమారు 6,350–6,400 చదరపు అడుగులు ఉండగా, ధరలు దాదాపు రూ.45 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. లాన్ టెర్రస్లు, క్లబ్హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, స్కేటింగ్ రింక్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.కామెలియాస్.. లగ్జరీకి మరో నిర్వచనంమాగ్నోలియాస్ తర్వాత డీఎల్ఎఫ్ మరింత ఎత్తైన సెగ్మెంట్ను ‘ది కామెలియాస్’తో నిర్మించింది. డీఎల్ఎఫ్ ప్రకారం.. ఇది గోల్ఫ్ లింక్స్లోని తన సూపర్ లగ్జరీ రెసిడెన్షియల్ కమ్యూనిటీల్లో అత్యంత విలాసవంతమైన ఆఫర్లలో ఒకటి. గోల్ఫ్ కోర్స్, ల్యాండ్స్కేపింగ్, ఆర్కిటెక్చర్, వెల్నెస్, క్లబ్హౌస్, వ్యక్తిగతీకరించిన సేవలను ఒకే నివాస అనుభవంలో కలపడం దీని ప్రధాన లక్ష్యం. కామెలియాస్లోని నివాసాల పరిమాణం సుమారు 7,350 చదరపు అడుగుల నుంచి 16,290 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ప్రాజెక్టులో ప్రత్యేకమైన పెంట్హౌస్లు కూడా ఉన్నాయి. 2024 డిసెంబరులో ఇక్కడ 16,290 చదరపు అడుగుల పెంట్హౌస్ రూ.190 కోట్లకు విక్రయమైంది.ఇప్పుడు డాలియాస్.. రూ.271 కోట్ల రికార్డుడీఎల్ఎఫ్ లగ్జరీ ప్రయాణంలో తాజా అధ్యాయం ‘ది డాలియాస్’. గోల్ఫ్ కోర్స్ రోడ్లోని డీఎల్ఎఫ్5 గోల్ఫ్ లింక్స్లో వస్తున్న ఈ ప్రాజెక్టులో 420 నివాసాలు, 8 టవర్లు, 29 స్థాయిలు ఉన్నాయి. సుమారు 7.4–7.5 మిలియన్ చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో పాటు 15 ప్రత్యేక డ్యూప్లెక్స్ పెంట్హౌస్లు, భారీ క్లబ్హౌస్ వంటి సదుపాయాలను డీఎల్ఎఫ్ అభివృద్ధి చేస్తోంది.ఇక్కడ ఇప్పటికే భారీ లావాదేవీలు జరిగాయి. 2025లో ఢిల్లీ-ఎన్సీఆర్కు చెందిన ఓ పారిశ్రామికవేత్త నాలుగు అపార్ట్మెంట్లను కలిపి సుమారు 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.380 కోట్లకు కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. నాలుగు యూనిట్లను పరస్పరం అనుసంధానించి పెద్ద నివాసంగా మార్చేలా ఈ కొనుగోలు జరిగింది.ఇక తాజాగా మానవ్ సర్దానా రూ.271 కోట్లకు కొనుగోలు చేసిన పెంట్హౌస్ ఈ ప్రాజెక్టును మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చింది. ఈ డీల్ సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ స్థాయిలో కొత్త బెంచ్మార్క్ను సృష్టించిందని రియల్ ఎస్టేట్ రంగంలోని వర్గాలను ఉటంకిస్తూ పలు నివేదికలు పేర్కొన్నాయి.అసలు విలాసం.. ‘చిరునామా’లోనే..ఈ మూడు ప్రాజెక్టుల మధ్య కనిపించే సామ్యాన్ని కేవలం చదరపు అడుగుల ధరతో కొలవలేం. డీఎల్ఎఫ్5 గోల్ఫ్ లింక్స్లోని ప్రదేశం, గోల్ఫ్ కోర్స్ వ్యూస్, పచ్చదనం, క్లబ్ సదుపాయాలు, భద్రత, ప్రైవసీ, హాస్పిటాలిటీ సేవలు కలిసి ఈ ఇళ్లను ‘లగ్జరీ ప్రాపర్టీ’ నుంచి ‘ట్రోఫీ హోమ్’ స్థాయికి తీసుకెళ్తున్నాయి. డీఎల్ఎఫ్ ప్రకారం.. గోల్ఫ్ లింక్స్ ప్రాంతం రెండు గోల్ఫ్ కోర్సులు, 200 ఎకరాలకు పైగా లాన్, ర్యాపిడ్ మెట్రో, ప్రధాన వ్యాపార కేంద్రాలకు కనెక్టివిటీతో కూడిన ప్రత్యేకమైన నివాస పర్యావరణాన్ని అందిస్తోంది. -
‘టాటా’ సామ్రాజ్యానికి గుండెకాయ.. ‘బాంబే హౌస్’
ముంబై ఫోర్ట్ ప్రాంతంలోని ప్రశాంతమైన హోమి మోడీ వీధిలో కనిపించే నాలుగు అంతస్తుల చారిత్రక భవనం.. బయటకు చూస్తే సాధారణ కార్యాలయ భవనంలానే అనిపిస్తుంది. కానీ అదే ‘బాంబే హౌస్’. దాదాపు శతాబ్ద కాలంగా టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి ఇది ప్రధాన కార్యాలయం మాత్రమే కాదు.. కీలక నిర్ణయాలకు సాక్షిగా నిలిచిన కార్పొరేట్ చరిత్రకు చిరునామా. ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు (2027 ఫిబ్రవరిలో తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత) ప్రకటించడంతో మరోసారి బాంబే హౌస్పై ఆసక్తి పెరిగింది.1924లో మొదలైన ప్రయాణంబాంబే హౌస్ కథ 1920లో ప్రారంభమైంది. టాటా సన్స్ రెండో చైర్మన్ సర్ దొరాబ్జీ టాటా.. బాంబే మునిసిపాలిటీ నుంచి ఫోర్ట్ ప్రాంతంలో సుమారు 21,285 చదరపు అడుగుల విస్తీర్ణంలోని రెండు స్థలాలను కొనుగోలు చేశారు. అనంతరం భవనం నిర్మాణ బాధ్యతలను అసోసియేటెడ్ బిల్డింగ్ కంపెనీకి అప్పగించారు.స్కాటిష్ ఆర్కిటెక్ట్ జార్జ్ విట్టెట్ దీనికి రూపకల్పన చేశారు. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం (ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ) వంటి ప్రముఖ నిర్మాణాల రూపకల్పనతో విట్టెట్ అప్పటికే పేరు సంపాదించారు. బాంబే హౌస్ నిర్మాణం 1924లో పూర్తయి జూలై 1న తలుపులు తెరుచుకుంది.ఈ భవనానికి ‘టాటా హౌస్’ అని పేరు పెట్టకుండా ‘బాంబే హౌస్’ అని పిలవడం వెనుక కూడా ప్రత్యేక భావన ఉంది. టాటా గ్రూప్ ఎదుగుదలకు కేంద్రంగా నిలిచిన బొంబాయి నగరంతో సంస్థకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ పేరు పెట్టారు.ఎడ్వర్డియన్ అందం.. భారతీయ వారసత్వంబాంబే హౌస్ నిర్మాణం ఎడ్వర్డియన్ నియో-క్లాసికల్ శైలిని ప్రతిబింబిస్తుంది. మలాడ్ రాతితో నిర్మించిన ముఖభాగం, సమతుల్య ఆకృతి, పెద్ద జార్జియన్ తరహా కిటికీలు, అలంకార కార్నిస్లు ఈ భవనానికి ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. మొదట భవనం బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మూడు పై అంతస్తులతో నిర్మించారు. 1941-42లో నాలుగో అంతస్తును చేర్చారు. ప్రస్తుతం ఇదే అంతస్తులో చైర్మన్ కార్యాలయం, బోర్డు రూమ్ ఉన్నాయి.బయటి రూపాన్ని దాదాపు యథాతథంగా కాపాడుకుంటూనే లోపలి భాగాలను కాలానుగుణంగా మార్చుకుంటూ వచ్చారు. పాత కళాఖండాలు, ఫర్నిచర్, జ్ఞాపికలు, చారిత్రక బోర్డు రూమ్ వంటి అంశాలు భవనానికి పాతకాలపు ప్రత్యేకతను కొనసాగిస్తున్నాయి.టాటా సామ్రాజ్యంలోని కీలక నిర్ణయాలకు వేదికబాంబే హౌస్లో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు టాటా గ్రూప్ చరిత్రలో అనేక మలుపులకు దారి తీశాయి. ఒకప్పుడు టెక్స్టైల్స్, హోటళ్లు, ఉక్కు, విద్యుత్ వంటి నాలుగు ప్రధాన వ్యాపారాల కేంద్రంగా ఉన్న ఈ భవనం.. తర్వాత విస్తరిస్తూ వచ్చిన టాటా సామ్రాజ్యానికి నాడీ కేంద్రంగా మారింది.జేఆర్డీ టాటా కాలంలో విమానయాన రంగంలో టాటా గ్రూప్ అడుగులు వేయడానికి సంబంధించిన కీలక ఆలోచనలు కూడా ఈ సంస్థాగత వాతావరణంలోనే రూపుదిద్దుకున్నాయి. దశాబ్దాల తర్వాత 2007లో టాటా స్టీల్.. కోరస్ను సుమారు 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన భారీ అంతర్జాతీయ ఒప్పందం వంటి వ్యూహాత్మక నిర్ణయాలకు కూడా బాంబే హౌస్ కీలక కేంద్రంగా నిలిచింది.2017లో చంద్రశేఖరన్ తీసుకున్న కీలక నిర్ణయంబాంబే హౌస్ దాదాపు 94 ఏళ్ల చరిత్రలో 2017 వరకు పెద్ద స్థాయి సమగ్ర పునరుద్ధరణకు దూరంగానే ఉంది. టాటా సన్స్ చైర్మన్గా ఎన్. చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భవనాన్ని పూర్తిగా ఆధునీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు.ఆర్కిటెక్ట్, అర్బన్ కన్జర్వేషన్ నిపుణురాలు బృందా సోమయ్య నేతృత్వంలోని బృందం ఈ ప్రాజెక్టును చేపట్టింది. కేవలం తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేసి 2018 జూలై 29న జేఆర్డీ టాటా జయంతి సందర్భంగా బాంబే హౌస్ను తిరిగి ప్రారంభించారు. రతన్ టాటా ఈ పునరుద్ధరించిన భవనాన్ని ప్రారంభించారు.పునరుద్ధరణలో భవనం చారిత్రక రూపాన్ని కాపాడుతూ ఆధునిక కార్యాలయ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఓపెన్ వర్క్స్పేస్లు, సహకార ప్రాంతాలు, డిజిటల్ మీటింగ్ రూమ్లు, టాటా ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. పాత బోర్డు రూమ్కు కూడా ఆధునిక సాంకేతిక సదుపాయాలు జోడించారు.వీధి కుక్కలకు వెల్కమ్!బాంబే హౌస్ ప్రత్యేకతల్లో అత్యంత ఆసక్తికరమైనది అక్కడి వీధి కుక్కల సంప్రదాయం. దశాబ్దాలుగా భవనానికి వచ్చే కుక్కలను ఉద్యోగులు, సంస్థ ఆహ్వానితుల్లానే ఆదరిస్తున్నారు. 2018 పునరుద్ధరణలో వాటి కోసం ప్రత్యేక కెన్నెల్ను కూడా ఏర్పాటు చేశారు. నిద్రించే ప్రదేశం, సౌకర్యవంతమైన వాతావరణం, ఆహారం, వైద్య సంరక్షణ వంటి ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. టాటా గ్రూప్ స్వయంగా పేర్కొన్నట్టుగా, ఈ కుక్కలకు బాంబే హౌస్లోకి ప్రవేశించేందుకు ఉద్యోగుల మాదిరిగా యాక్సెస్ కార్డు అవసరం లేదు.నేటికీ అదే చిరునామా2024లో బాంబే హౌస్ తన శతాబ్దిని పూర్తి చేసుకుంది. టాటా గ్రూప్ అధికారిక చరిత్ర ప్రకారం, ఈ భవనం నేటికీ గ్రూప్నకు గ్లోబల్ హెడ్క్వార్టర్స్గా కొనసాగుతోంది. వందేళ్లలో టాటా గ్రూప్ నాలుగు ప్రధాన వ్యాపారాల నుంచి అనేక రంగాల్లో విస్తరించిన బహుళజాతి వ్యాపార సమూహంగా మారినా.. దాని సంస్థాగత హృదయం మాత్రం బాంబే హౌస్గానే ఉంది. అంతేకాదు, వారసత్వ భవనంగా ఉన్నప్పటికీ సుస్థిరత చర్యలకు గుర్తింపుగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం రేటింగ్ పొందిన తొలి భారతీయ హెరిటేజ్ భవనంగా ఇది నిలిచింది.ఇప్పుడు చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త చైర్మన్కు బాధ్యతలు అప్పగించేందుకు మార్గం సుగమం చేశారు. దీంతో టాటా గ్రూప్ తదుపరి నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే ఆ నాయకత్వ మార్పు ఎక్కడి నుంచి సాగుతుంది అంటే.. సమాధానం మాత్రం ఇప్పటికీ అదే.. ముంబైలోని ఈ చారిత్రక ‘బాంబే హౌస్’ నుంచే. -
127 శాతం లాభంతో ఫ్లాట్ అమ్మిన మాధురీ దీక్షిత్!
బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ నెనె దేశంలోనే అత్యంత ఖరీదైన ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి తమ పెట్టుబడి వ్యూహాన్ని చాటుకున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన జుహు ప్రాంతంలో ఉన్న తమ అపార్ట్మెంట్ను రూ.4.40 కోట్లకు విక్రయించారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డేటా విశ్లేషణ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ అందించిన అధికారిక సమాచారం ప్రకారం జులై 3న ఈ లావాదేవీ నమోదు పూర్తయింది.విక్రయ వివరాలుమిలిటరీ రోడ్లోని ‘ది డీప్ వర్షా కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ పరిధిలోని ఐరిస్ పార్క్ భవనంలో ఉన్న ఈ ఫ్లాట్ విస్తీర్ణం 774 చదరపు అడుగులు. ఈ ఆస్తిని సచిన్ శేఖర్ శెట్టి అనే కొనుగోలుదారుడు సొంతం చేసుకున్నారు. దీని కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కింద రూ.26.40 లక్షలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా రూ.30,000 చెల్లించారు. కాగా, ఈ ఫ్లాట్కు సంబంధించిన కార్ పార్కింగ్ స్థలాన్ని వీరు గతేడాది డిసెంబర్లోనే వేరే వ్యక్తికి వేరుగా విక్రయించడం గమనార్హం.14 ఏళ్లలో 127 శాతం లాభం2012 జూన్ 4న మాధురి దంపతులు ఈ ఫ్లాట్ను రూ.1.94 కోట్లకు కొనుగోలు చేశారు. దాదాపు 14 ఏళ్ల పాటు దీనిని తమ వద్దే ఉంచుకుని ఇప్పుడు రూ.4.40 కోట్లకు విక్రయించడం ద్వారా 127 శాతానికి పైగా క్యాపిటల్ అప్రిసియేషన్ (మూలధన లాభం) సాధించారు.గత ఎనిమిది నెలల్లో మూడో విక్రయంమాధురీ దీక్షిత్ గత ఎనిమిది నెలల కాలంలో ముంబైలో ఆస్తులను విక్రయించడం ఇది మూడోసారి. డిసెంబర్ 2025లో ఇదే జుహు భవనంలో ఉన్న మరొక 780 చ.అడుగుల ఫ్లాట్ను రూ.3.90 కోట్లకు విక్రయించారు (99.22% లాభం). జూన్ 2026లో అంధేరి వెస్ట్లోని 1,594 చ.అడుగుల కమర్షియల్ ఆఫీస్ స్పేస్ను రూ.4.85 కోట్లకు అమ్మేశారు. 18 ఏళ్ల క్రితం రూ.52.5 లక్షలకు కొన్న ఈ ఆఫీసుపై ఏకంగా 824% రాబడి రావడం విశేషం. -
హైదరాబాద్లో ట్రంప్ టవర్స్!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ఈ మార్కెట్లోకి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. ట్రైబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ కలిసి కోకాపేటలో 'ట్రంప్ టవర్స్ హైదరాబాద్' పేరుతో ఈ ప్రాజెక్ట్ను నిర్మించబోతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గోల్డెన్ మైల్ రోడ్డులో 4 ఎకరాల్లో ట్రంప్ టవర్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్ రానుంది. అక్టోబర్లో దీన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ఎరిక్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్ట్లో రెండు భారీ టవర్లు ఉండనున్నాయి. ఒక్కో టవర్ 65 అంతస్తుల ఎత్తులో, దాదాపు 800 అడుగుల ఎత్తు వరకు నిర్మించనున్నారు. ఈ రెండు టవర్లను 28వ అంతస్తులో ఒక స్కై బ్రిడ్జ్తో కలుపుతారు. ఆ బ్రిడ్జ్పైనే ప్రత్యేకంగా ట్రంప్ క్లబ్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 450కి పైగా ఇళ్లు ఉండబోతున్నాయి. 3.5 బీహెచ్కే, 4 బీహెచ్కే ఇళ్లతో పాటు పెంట్హౌస్లు కూడా ఉంటాయి.ధరలు ఇలా..ఇళ్ల ధరలు సుమారు రూ.5 కోట్ల నుంచి ప్రారంభమై, పెంట్హౌస్ ధర ఏకంగా రూ.18 కోట్ల వరకు ఉండనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.1,800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే.. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రూ.3,500 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ట్రైబెకా డెవలపర్స్ అంచనా వేస్తోంది.పెంట్హౌస్లకు ఇప్పటికే మంచి డిమాండ్ ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే.. మొత్తం ఎనిమిది పెంట్హౌస్లు ఉండగా, ఒక కుటుంబం ఏకంగా రెండు పూర్తి ఫ్లోర్లను కొనుగోలు చేయడంతో నాలుగు పెంట్హౌస్లు అందులోనే వెళ్లిపోయాయని కంపెనీ తెలిపింది. ఆ తర్వాత మరో నాలుగు పెంట్హౌస్లను కూడా ఏర్పాటు చేశామని, అవి కూడా అమ్ముడయ్యాయని ట్రైబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా పేర్కొన్నారు. -
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్హౌస్ కొనుగోలు
భారతీయ రియల్ ఎస్టేట్ రంగ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఉన్న డీఎల్ఎఫ్ లగ్జరీ ప్రాజెక్ట్ ‘ది దాలియాస్’లోని ఒక సూపర్ లగ్జరీ పెంట్హౌస్ ఏకంగా రూ.271 కోట్లకు అమ్ముడై దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థ ‘ఇంపీరియల్ ఆటో’ గ్రూప్నకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా ఈ డీల్ను దక్కించుకున్నారు.దేశంలోనే అత్యధిక ధరఈ ప్రాపర్టీ ధరల వివరాలు రియల్టీ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ పెంట్హౌస్ సూపర్ ఏరియా 17,200 చదరపు అడుగులు కాగా కార్పెట్ ఏరియా 10,500 చదరపు అడుగులు. సూపర్ ఏరియా ప్రాతిపదికన చదరపు అడుగుకు రూ.1.58 లక్షలు పడగా, కార్పెట్ ఏరియా లెక్కన చదరపు అడుగుకు ఏకంగా రూ.2.6 లక్షలు వ్యయమైంది. సాధారణంగా ముంబైలోని వర్లీ, మలబార్ హిల్స్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి భారీ ధరలు కనిపిస్తాయి. అయితే గురుగ్రామ్లో ఒక్క సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ రూ.271 కోట్లకు అమ్ముడవడం భారతదేశపు అత్యంత ఖరీదైన హౌసింగ్ డీల్స్లో ఒకటిగా నిలిచింది.ఎవరీ మానవ్ సర్దానా?1969లో ఫరీదాబాద్లో ఎస్.బి. సర్దానా, జగ్జీత్ సింగ్లు ప్రారంభించిన ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్ ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది. ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ ప్రొడక్ట్స్ (పైప్లైన్లు, హోస్ అసెంబ్లీలు) తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థకు భారత్లో 20కి పైగా, విదేశాల్లో 3 ఉత్పాదన కేంద్రాలు ఉన్నాయి. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం 'వార్బర్గ్ పింకస్' ఈ సంస్థను కొనుగోలు చేసుకున్నప్పటికీ సర్దానా కుటుంబం ఇంపీరియల్ ఆటో గ్రూప్లో క్రియాశీలకంగా కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా.. -
రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందా?
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇలాంటి సమయంలో జెన్ జీ (Gen Z) తరం ఇళ్లు కొనడం మానేస్తే?, ఏమవుతుందనే ప్రశ్న తలెత్తింది. దీనికి చాలామంది మార్కెట్ కుప్పకూలుతుంది, రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెబుతారు. కానీ నిపుణులు ఇది నిజం కాదని అంటున్నారు.జెన్ జీ ఇళ్లు కొనడం తగ్గిస్తే.. రియల్ ఎస్టేట్ మార్కెట్ వెంటనే కుప్పకూలిపోతుందని అనుకోవడం సరైనది కాదు. ఎందుకంటే.. వీరు నివసించడానికి కూడా ఇల్లు అవసరమే. అయితే.. ఆ ఇల్లు సొంతంగా కొనవచ్చు, అద్దెకు తీసుకోవచ్చు లేదా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా రావచ్చు.జెన్ జీ ఇల్లు కొనడాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదు, కానీ.. తొందరగా ఇల్లు కొనాల్సిన అవసరం లేదని భావిస్తోంది. గతంలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఇల్లు కొనాలని అనుకునేవారు. కానీ నేడు ముందుగా డబ్బు సంపాదించి.. సేవింగ్స్ పెంచుకుని, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టి, ఆ తరువాత ఇల్లు కొనాలనుకుంటున్నారు.ఈ మార్పు కొంత రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపవచ్చు. ఒక ఇల్లు అమ్ముడైతే బిల్డర్ మాత్రమే కాదు.. సిమెంట్, స్టీల్, పెయింట్, ఫర్నిచర్, నిర్మాణ కార్మికులు, బ్యాంక్స్, ప్రభుత్వాలు కూడా లాభపడతాయి. కాబట్టి యువత ఇల్లు కొనడాన్ని ఐదు లేదా పది సంవత్సరాలు ఆలస్యం చేస్తే కొత్త ప్రాజెక్ట్స్, హోమ్ లోన్స్, కన్స్ట్రక్షన్ జాబ్స్, స్టాంప్ డ్యూటీ ఆదాయం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జెన్ జీ ఇల్లు కొనకుండా ఆ డబ్బును స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడితే.. ఆ డబ్బు ఆర్థిక వ్యవస్థ నుంచి మాయమవ్వదు. అంటే.. డబ్బు ఒక రంగం నుంచి మరో రంగానికి మారుతుంది. ఇప్పటివరకు భారతీయ కుటుంబాల సంపదలో పెద్ద భాగం ప్రాపర్టీలలో ఉంది. యువత మాత్రం తమ డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. మొత్తం మీద జెన్ జీ ఇళ్లు కొనడం మానేయదు, కొంత ఆలస్యం చేస్తుందని తెలుస్తోంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇళ్లకు డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్స్! -
24 అపార్ట్మెంట్లు కొంటున్న SBI.. ఎందుకు?
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ముంబైలో పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లు కొనే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (MHADA) ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ (FCFS) పథకం కింద అందుబాటులో ఉన్న 24 అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఎస్బీఐ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ నుంచి లేఖ అందినట్లు ఎంహెచ్ఏడీఏ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై తదుపరి దశలో బ్యాంకుతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు.2026లో ఎంహెచ్ఏడీఏ ముంబై బోర్డు ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ విధానంలో మొదట 118 ఇళ్లను విక్రయానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో నిర్వహించిన లాటరీల్లో విక్రయంకాని లేదా వివిధ కారణాలతో మిగిలిపోయిన ఇళ్లను ఈ విధానంలో విక్రయానికి పెట్టింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ విక్రయ ప్రక్రియలో మార్చి నాటికి 64 ఇళ్లు విక్రయమైనట్లు నివేదికలు వెల్లడించాయి. మిగిలిన వాటిలో అధిక ధర కలిగిన ఫ్లాట్లు కూడా ఉన్నాయి.ఎస్బీఐ ఎందుకు కొనాలనుకుంటోంది?ఎస్బీఐ 24 ఫ్లాట్లను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదన వెనుక ఉద్దేశం, వాటి వినియోగం, ఎంపిక చేసిన ఫ్లాట్ల ధరలు వంటి వివరాలను ఎంహెచ్ఏడీఏ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి, ఎస్బీఐ ఆసక్తి వ్యక్తీకరణ దశలోనే ఈ ప్రక్రియ ఉంది. కొనుగోలు ఇంకా ఖరారు కాలేదు.మరోవైపు, ఎంహెచ్ఏడీఏ 2026లో ముంబైలో గృహ విక్రయ కార్యక్రమాలను విస్తరించింది. ఏప్రిల్లో ముంబై బోర్డు 2,640 ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించింది. అలాగే వేర్వేరు ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన ఇళ్లను ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ విధానంలో విక్రయించే కార్యక్రమాలను కూడా చేపడుతోంది. -
ఇల్లు కొంటున్నారా? ఈ పత్రాలు చెక్ చేయకపోతే నష్టమే!
ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు చాలామంది ముందుగా ప్రాంతం, బడ్జెట్, ఫ్లాట్ పరిమాణం, సౌకర్యాలు వంటి అంశాలనే పరిశీలిస్తారు. నచ్చిన ప్రాపర్టీ దొరికిన తర్వాత ధరపై బేరసారాలు, బ్యాంకు రుణం, అడ్వాన్స్ చెల్లింపులపై దృష్టి పెడతారు. అయితే ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఆస్తి పత్రాల పరిశీలన మాత్రం చాలాసార్లు వెనుకబడిపోతుంది. అదే భవిష్యత్తులో పెద్ద సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది.ప్రాపర్టీ బయటకు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా.. దానికి సంబంధించిన యాజమాన్య హక్కులు, రిజిస్ట్రేషన్, అనుమతులు, బకాయిలు, నిర్మాణ అనుమతులు వంటి అంశాలు స్పష్టంగా లేకపోతే కొనుగోలుదారు ఇబ్బందుల్లో పడవచ్చు. అందుకే బుకింగ్ మొత్తం చెల్లించే ముందు, లేదా సేల్ అగ్రిమెంట్పై సంతకం చేసే ముందు కొన్ని ముఖ్యమైన పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలి.విక్రేతకు నిజంగా అమ్మే హక్కు ఉందా?సెకండ్హ్యాండ్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నప్పుడు మొదటగా పరిశీలించాల్సింది టైటిల్ డీడ్. ఆస్తిపై విక్రేతకు చట్టబద్ధమైన యాజమాన్య హక్కు ఉందా? గతంలో ఆస్తి ఎవరి పేరులో ఉంది? వారసత్వం, భాగస్వామ్యం, పవర్ ఆఫ్ అటార్నీ వంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను పరిశీలించాలి.అవసరమైతే గత యాజమాన్య పత్రాలనూ పరిశీలించి టైటిల్ చైన్ స్పష్టంగా ఉందో లేదో న్యాయ నిపుణుడి ద్వారా ధ్రువీకరించుకోవడం మంచిది. కేవలం విక్రేత చూపించిన ప్రస్తుత డీడ్ను చూసి నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరం.రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చెక్ చేయాలికొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ లేదా ఇతర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అయితే సంబంధిత రాష్ట్ర రెరా రిజిస్ట్రేషన్ను పరిశీలించాలి. రెరా (RERA) చట్టం ప్రకారం, మినహాయింపులకు లోబడని ప్రాజెక్టులను సంబంధిత రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద నమోదు చేయకుండా ప్రచారం చేయడం, బుకింగ్ తీసుకోవడం లేదా విక్రయించడం అనుమతించబడదు.రెరా పోర్టల్లో ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ నంబర్, ప్రమోటర్ వివరాలు, ప్రాజెక్టు స్థితి, అనుమతులు, పూర్తి చేయాల్సిన గడువు, వెల్లడించిన ఇతర వివరాలను పరిశీలించవచ్చు. రెరాలో ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ ఉందని మాత్రమే చూసి ఆగిపోకుండా, పోర్టల్లో ఉన్న వివరాలు విక్రేత లేదా బిల్డర్ చెబుతున్న సమాచారంతో సరిపోతున్నాయా అనే విషయాన్ని కూడా చూడాలి.అవసరమైన అనుమతులు ఉన్నాయా?ప్రాజెక్టుకు సంబంధించి స్థానిక ప్రణాళిక, నిర్మాణ, మున్సిపల్ లేదా ఇతర సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందారా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్, లేఅవుట్, ఇతర వర్తించే అనుమతులు వంటి పత్రాలను పరిశీలించడం మంచిది.బ్యాంకు హోమ్లోన్ మంజూరు చేసే ముందు తనిఖీలు చేసినప్పటికీ, బ్యాంకు ఆస్తిని ఆమోదించిందని మాత్రమే ఆధారంగా చేసుకుని కొనుగోలు నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. రుణదాత పరిశీలనకు అదనంగా కొనుగోలుదారు స్వయంగా లేదా స్వతంత్ర న్యాయ నిపుణుడి సహాయంతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి.ఆస్తిపై బకాయిలు లేదా వివాదాలు ఉన్నాయా?ఆస్తిపై ఇప్పటికే రుణం, మార్ట్గేజ్, అటాచ్మెంట్ లేదా ఇతర నమోదైన హక్కులు/బాధ్యతలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (Encumbrance Certificate - EC)ను పరిశీలించడం ఉపయోగపడుతుంది.ఈసీ ద్వారా సంబంధిత రిజిస్ట్రేషన్ రికార్డుల్లో నమోదైన లావాదేవీలు లేదా కొన్ని రకాల బకాయిలకు సంబంధించిన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈసీ ఒక్కటే అన్ని రకాల న్యాయ వివాదాలకు పూర్తి రక్షణ కాదని గుర్తుంచుకోవాలి. కోర్టు కేసులు, వారసత్వ వివాదాలు లేదా నమోదుకాని హక్కులు వంటి అంశాల కోసం ప్రత్యేక న్యాయ పరిశీలన అవసరం.సేల్ అగ్రిమెంట్ను పూర్తిగా చదివిన తర్వాతే సంతకంఇంటి కొనుగోలులో మరో కీలక దశ అగ్రిమెంట్ ఫర్ సేల్. చాలామంది ఆస్తిని ఎంపిక చేసేందుకు వారాలు, నెలలు కేటాయించినా.. ఒప్పందాన్ని మాత్రం తొందరగా చదివి సంతకం చేస్తారు. కానీ ఒప్పందంలో మొత్తం ధర, చెల్లింపుల షెడ్యూల్, స్వాధీనం తేదీ, ఆలస్యమైతే చెల్లించాల్సిన పరిహారం, రద్దు నిబంధనలు, పార్కింగ్, ఇతర చార్జీలు, డిఫాల్ట్ పరిస్థితుల్లో ఇరు పార్టీల బాధ్యతలు వంటి కీలక అంశాలు ఉండవచ్చు. అర్థం కాని క్లాజ్ ఏదైనా ఉంటే సంతకం చేయడానికి ముందే వివరణ తీసుకోవాలి.స్వాధీనం తీసుకునే ముందు ఓసీ, సీసీ చూడాలినిర్మాణం పూర్తయిన ప్రాపర్టీని కొనుగోలు చేస్తున్నప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC), కంప్లీషన్ సర్టిఫికేట్ (CC) వర్తించే చోట పరిశీలించాలి. భవనం ఆమోదించిన ప్రణాళికలకు అనుగుణంగా పూర్తయిందా, స్థానిక నిబంధనలకు అనుగుణంగా వినియోగానికి సిద్ధంగా ఉందా అనే విషయాలను నిర్ధారించుకోవడంలో ఇవి కీలకం. తాళాలు అందుకునే సమయంలో ఈ పత్రాల గురించి పట్టించుకోకపోతే, తర్వాత బ్యాంకు, మున్సిపల్ సంస్థ లేదా ఇతర అధికారిక ప్రక్రియల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.కొనుగోలు ముందు ఈ చెక్లిస్ట్ తప్పనిసరి🔹 టైటిల్ డీడ్, గత యాజమాన్య పత్రాలు🔹 విక్రేతకు ఉన్న చట్టబద్ధమైన అమ్మకపు హక్కు🔹 ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (EC)🔹 రెరా రిజిస్ట్రేషన్, ప్రాజెక్టు వివరాలు🔹 ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్, అవసరమైన అనుమతులు🔹 సేల్ అగ్రిమెంట్లోని అన్ని నిబంధనలు🔹 వర్తించే చోట ఆక్యుపెన్సీ, కంప్లీషన్ సర్టిఫికేట్లు🔹 పెండింగ్ రుణాలు, పన్నులు, మెయింటెనెన్స్ లేదా ఇతర బకాయిలు🔹 నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అయితే రెరాలో చూపిన టైమ్లైన్, వెల్లడించిన ప్రాజెక్టు వివరాలుచివరగా ఇల్లు కొనడం అంటే నచ్చిన ఫ్లాట్ను ఎంచుకుని అడ్వాన్స్ చెల్లించడం మాత్రమే కాదు. ఆస్తి చట్టబద్ధంగా, ఆర్థికంగా, నిర్మాణపరంగా సమస్యలేమీ లేకుండా ఉందని నిర్ధారించుకోవడం కూడా కొనుగోలులో అంతే ముఖ్యమైన భాగం. పత్రాల పరిశీలనకు ముందే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించకుండా, అవసరమైతే స్వతంత్ర ప్రాపర్టీ లాయర్ లేదా న్యాయ నిపుణుడితో డ్యూ డిలిజెన్స్ చేయించుకోవడం భవిష్యత్తు సమస్యల నుంచి కొనుగోలుదారును కాపాడుతుంది. -
వివేక్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీ దూకుడు
యూఏఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బీఎన్డబ్ల్యూ డెవలప్మెంట్స్ (BNW Developments) భారత మార్కెట్పై మరింత దృష్టి సారిస్తోంది. దుబాయ్, రాస్ అల్ ఖైమా (RAK)లో చేపడుతున్న ప్రాజెక్టులకు భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా తన ఛానల్ పార్టనర్ నెట్వర్క్ను విస్తరిస్తోంది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు, బ్రోకర్లతో భాగస్వామ్యాలను పెంచుకుంటోంది. వచ్చే నాలుగేళ్లలో యూఏఈలో సుమారు 10,000 ఇళ్లను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.బీఎన్డబ్ల్యూ డెవలప్మెంట్స్ను అంకుర్ అగర్వాల్ స్థాపించగా, నటుడు-పారిశ్రామికవేత్త వివేక్ ఆనంద్ ఒబెరాయ్ మేనేజింగ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు. సంస్థ వివరాల ప్రకారం, బీఎన్డబ్ల్యూ ప్రస్తుతం దుబాయ్, రాస్ అల్ ఖైమాలో బ్రాండెడ్ రెసిడెన్సులు, హాస్పిటాలిటీ ఆధారిత ప్రాజెక్టులు, మిక్స్డ్-యూజ్ డెవలప్మెంట్లు, మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీలపై పనిచేస్తోంది. సంస్థ మొత్తం గ్రాస్ డెవలప్మెంట్ విలువ (GDV) సుమారు 32 బిలియన్ దిర్హమ్లుగా (రూ.72 వేల కోట్లే) పేర్కొంది.భారతీయ కొనుగోలుదారులే టార్గెట్అధిక అద్దె ఆదాయం, దీర్ఘకాలిక ఆస్తి విలువ పెరుగుదల, అంతర్జాతీయ కనెక్టివిటీ వంటి అంశాల కారణంగా సంపన్న భారతీయులు యూఏఈ ప్రాపర్టీ మార్కెట్పై ఆసక్తి చూపుతున్నారని బీఎన్డబ్ల్యూ చెబుతోంది. సంస్థ తాజా ప్రకటన ప్రకారం, 2026 తొలి అర్ధభాగంలో భారతీయ కొనుగోలుదారులు తమ మొత్తం వ్యాపారంలో 14.38 శాతం వాటాను కలిగి ఉన్నారు.దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్లో భారతీయుల ప్రాధాన్యం ఇతర తాజా డేటాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. జూలై 2026లో వెలువడిన ఫామ్ ప్రాపర్టీస్ డేటా ప్రకారం, అంతర్జాతీయ ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చ్లలో భారత్ వాటా 20.59 శాతంగా ఉంది. అలాగే డీఎక్స్బీ ఇంటరాక్ట్ డేటాను ఉటంకిస్తూ, 2026 తొలి భాగంలో దుబాయ్లో విదేశీ కొనుగోలుదారుల్లో భారతీయులు అతిపెద్ద వర్గంగా కొనసాగుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి.మార్కెట్ మందగించినా.. పెట్టుబడులపై ఆసక్తిమధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కార్యకలాపాలు కొంత మందగించాయి. కావెండిష్ మ్యాక్స్వెల్ గణాంకాల ప్రకారం, 2026 జనవరి–మే మధ్య దుబాయ్లో 66,900 రెసిడెన్షియల్ లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో సుమారు 74 శాతం ఆఫ్-ప్లాన్ కొనుగోళ్లే. అయితే మే నెలలో లావాదేవీలు 9,500కు తగ్గాయి. గత ఏడాది మేలో నమోదైన 17,600తో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల. తొలి ఐదు నెలల్లో మొత్తం లావాదేవీల విలువ 196.2 బిలియన్ దిర్హమ్లకు పైగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో అది 217.8 బిలియన్ దిర్హమ్లుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారతీయ పెట్టుబడిదారులపై బీఎన్డబ్ల్యూ నమ్మకం ఉంచుతోంది. దుబాయ్లో మార్కెట్ వేగం కొంత తగ్గినప్పటికీ, భారతీయ కొనుగోలుదారుల నుంచి దీర్ఘకాలిక పెట్టుబడి డిమాండ్ కొనసాగుతోందని సంస్థ భావిస్తోంది.2,000 మందికి పైగా భాగస్వాములతో సమావేశంభారత మార్కెట్లో తన పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు బీఎన్డబ్ల్యూ ఇటీవల ఢిల్లీ-NCRలో గ్లోబల్ పార్ట్నర్స్ మీట్ నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 2,000 మందికి పైగా ఛానల్ భాగస్వాములు, రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సంస్థ తెలిపింది. బీఎన్డబ్ల్యూ వ్యవస్థాపకుడు, చైర్మన్ అంకుర్ అగర్వాల్ మాట్లాడుతూ, భారత్ తమకు కేవలం కీలకమైన మూల మార్కెట్ మాత్రమే కాదని, సంస్థ భవిష్యత్ వృద్ధిలో వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. -
చట్టం, న్యాయస్థానాల తీర్పులు.. వాస్తవాలు
దేశంలో స్థిరాస్తుల హక్కులు, సరిహద్దుల తగాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు బాధితులు తరచూ పోలీసులను ఆశ్రయించడం లేదా కొన్ని సందర్భాల్లో పోలీసులు నేరుగా జోక్యం చేసుకుని నోటీసులు జారీ చేయడం, ఒక పక్షాన నిలవడం వంటి పరిణామాలు చూస్తుంటాం. అయితే, కేవలం సివిల్ స్వభావం కలిగిన ఆస్తి వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవచ్చా? ఈ అంశంపై భారత రాజ్యాంగం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టుల స్పష్టమైన తీర్పులు ఏమి చెబుతున్నాయో చూద్దాం.కోర్టులకే పూర్తి అధికారంఆస్తి యాజమాన్య హక్కులు (Title Dispute), స్వాధీనం (Possession), హద్దులు లేదా వారసత్వ వివాదాలు పూర్తిగా సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయి. భారత రాజ్యాంగం ప్రకారం పౌరుల మధ్య ఉండే పౌర హక్కుల వివాదాలను విచారించి పరిష్కరించే అధికారం కేవలం న్యాయవ్యవస్థకు మాత్రమే ఉంది. సివిల్ కోర్టుల్లో విచారణలో ఉన్న అంశాలపై పోలీసులు స్వయంగా పంచాయితీలు చేయడం, ఒక పక్షాన్ని ఖాళీ చేయించడం లేదా భూమి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం చట్టవిరుద్ధం.పోలీసులు ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చు? (మినహాయింపు)సివిల్ వివాదాల్లో పోలీసుల పాత్ర అత్యంత పరిమితం. కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులు చట్టబద్ధంగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది.ఆస్తి వివాదం నెపంతో అక్రమ ప్రవేశం, బెదిరింపులు, దాడి లేదా ఆస్తి ధ్వంసం వంటి క్రిమినల్ నేరాలు జరిగినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు.వివాదం తీవ్రరూపం దాల్చి భౌతిక దాడులు లేదా శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు శాంతి పరిరక్షణ కోసం నిరోధక చర్యలు తీసుకోవచ్చు.సివిల్ కోర్టు లేదా హైకోర్టు నిర్దిష్టంగా పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తూ ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఆదేశాలను అమలు చేయడానికి పోలీసు బలగాలు సహకరించాలి.న్యాయస్థానాల హెచ్చరికలుఇటీవల అల్లాహాబాద్ హైకోర్టుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు తమ తీర్పుల్లో ‘సివిల్ వివాదాల్లో పోలీసులు జడ్జిలుగా వ్యవహరించకూడదు’ అని స్పష్టం చేశాయి. చట్టపరిధి దాటి సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలతో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకుంటామని కోర్టులు హెచ్చరించాయి.బాధితులు ఏమి చేయాలి?ఆస్తి వివాదం ఎదురైనప్పుడు పోలీసులపైనే ఆధారపడకుండా తగిన ఆధారాలతో సివిల్ కోర్టును ఆశ్రయించి ‘ఇంజెక్షన్ ఆర్డర్’ లేదా 'స్టే' పొందడమే చట్టబద్ధమైన పరిష్కారం. ఒకవేళ పోలీసులు అక్రమంగా జోక్యం చేసుకుని వేధిస్తుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందవచ్చు.ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే.. -
వెండితెరపైనే కాదు బిజినెస్లోనూ హీరోనే..
సినిమా వెండితెరపైనే కాదు.. రియల్ ఎస్టేట్ బిజినెస్లోనూ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన సత్తా చాటుతున్నారు. తాజాగా ముంబైలోని అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతంలో తన ఆఫీస్ స్పేస్ను భారీ అద్దెకు లీజుకు ఇచ్చి వ్యాపార వర్గాల దృష్టిని ఆకర్షించారు.డీల్ వివరాలు ఇవే..రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ ప్రకారం.. ముంబై అంధేరి వెస్ట్లోని న్యూ లింక్ రోడ్డులో ఉన్న లోటస్ నీలకమల్ బిజినెస్ పార్క్లోని తన వాణిజ్య ఆస్తిని ‘క్లియర్ సింత్ ల్యాబ్స్ లిమిటెడ్’కు హృతిక్ లీజుకు ఇచ్చారు. దీని విస్తీర్ణం దాదాపు 6,000 చదరపు అడుగులు (7 ప్రత్యేక పార్కింగ్ స్లాట్లతో కలిపి). ఏప్రిల్ 1, 2026-మార్చి 31, 2029 వరకు మొదటి మూడేళ్లకు నెలకు రూ.17 లక్షలు అద్దెగా నిర్ణయించారు. నాలుగో ఏడాది (ఏప్రిల్ 1, 2029) నుంచి 15 శాతం పెరుగుదలతో నెలకు రూ. 19.55 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లీజు గడువు మార్చి 31, 2031తో ముగుస్తుంది. ఈ ఐదేళ్ల డీల్ కోసం అద్దెదారు రూ.68 లక్షల డిపాజిట్ చెల్లించినట్లు సమాచారం.కోట్లాది రూపాయల రాబడిఈ ఐదేళ్ల లీజు ఒప్పందం ద్వారా హృతిక్ రోషన్కు రూ.10 కోట్లకు పైగానే నికర అద్దె ఆదాయం సమకూరనుంది. కేవలం క్యాపిటల్ వాల్యూ పెరగడమే కాకుండా నెలవారీగా స్థిరమైన ఆదాయాన్ని అందించే వాణిజ్య ఆస్తుల వైపు సెలబ్రిటీలు ఆకర్షితులవుతున్నారనడానికి ఈ డీల్ నిదర్శనం.సినిమాల విషయానికి వస్తే..గత ఏడాది వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' (2025)లో అలరించిన హృతిక్ ఇటీవలే విడుదలైన ‘ఆల్ఫా’ (జులై 2026) చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్రలో మెరిశారు. ఒకవైపు స్టార్డమ్ను కాపాడుకుంటూనే మరోవైపు వ్యూహాత్మక పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ బాలీవుడ్ స్మార్ట్ ఇన్వెస్టర్గా నిలుస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక శ్రీమంతులున్న టాప్-10 ఇంటిపేర్లు -
ఇంటితోనే ఇంకో ఇల్లు కొనచ్చు: కియోసాకి కిటుకు
ఇల్లు అంటే చాలా మందికి జీవితంలో అతిపెద్ద ఆస్తి. అయితే, అదే ఇంటిని తెలివిగా ఉపయోగించుకుంటే అదనపు ఆదాయాన్ని సమకూర్చే సాధనంగా మార్చుకోవచ్చని ప్రముఖ ఇన్వెస్టింగ్ గురూ, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ పోస్ట్లో ఇంటిని విక్రయించకుండానే దానిలో ఉన్న ఈక్విటీని ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకునే విధానాన్ని వివరించారు.కియోసాకి వివరించిన విధానం ‘క్యాష్-అవుట్ రీఫైనాన్స్’. ఉదాహరణకు పదేళ్ల క్రితం ఓ వ్యక్తి 3 లక్షల డాలర్లకు ఇల్లు కొనుగోలు చేశాడని, అందులో 60 వేల డాలర్లు డౌన్పేమెంట్గా చెల్లించి, 2.4 లక్షల డాలర్ల రుణం తీసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటి విలువ 5 లక్షల డాలర్లకు చేరి, ఇంటి రుణం 1.8 లక్షల డాలర్లకు తగ్గితే.. యజమానికి 3.2 లక్షల డాలర్ల ఈక్విటీ ఉన్నట్లవుతుందని వివరించారు.ఈక్విటీలో కొంత భాగాన్ని నగదుగా మార్చుకునేందుకు రీఫైనాన్స్ చేసుకోవచ్చని కియోసాకి తెలిపారు. కొత్తగా 3 లక్షల డాలర్ల రుణం తీసుకుంటే పాత 1.8 లక్షల డాలర్ల రుణం చెల్లించిన తర్వాత 1.2 లక్షల డాలర్లు నగదుగా చేతికి వస్తాయని చెప్పారు. ఈ మొత్తాన్ని ఆదాయం అందించే ఆస్తిలో పెట్టుబడిగా పెట్టవచ్చని సూచించారు.ఉదాహరణగా 4 లక్షల డాలర్లకు డ్యూప్లెక్స్ కొనుగోలు చేసి, 1.2 లక్షల డాలర్లను డౌన్పేమెంట్గా చెల్లిస్తే మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండు యూనిట్ల నుంచి నెలకు మొత్తం 3,600 డాలర్ల అద్దె వస్తే, రుణం, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు పోగా సుమారు 1,000 డాలర్ల నికర నగదు ప్రవాహం ఉండొచ్చని వివరించారు. అదే సమయంలో ఇంటి రీఫైనాన్స్ వల్ల నెలవారీ చెల్లింపు 800 డాలర్లు పెరిగినా.. అద్దె ఆస్తి నుంచి వచ్చే ఆదాయం దాన్ని అధిగమించవచ్చని తెలిపారు.అద్దెదారులు చెల్లించే అద్దె ద్వారా రుణం కొంతవరకు తీరడం, రెండు ఆస్తుల్లో ఈక్విటీ పెరగడం, ఆస్తుల విలువ కాలక్రమంలో పెరిగే అవకాశం ఉండటం వంటి ప్రయోజనాలు ఉంటాయని కియోసాకి చెప్పారు. అలాగే, అమెరికాలోని పన్ను నిబంధనల ప్రకారం రుణంగా తీసుకున్న నగదుకు సాధారణంగా అమ్మకపు ఆదాయం తరహాలో పన్ను ఉండదని, అయితే పన్ను ప్రయోజనాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.అయితే, ఈ వ్యూహంలో రిస్క్లు కూడా ఉన్నాయని కియోసాకి హెచ్చరించారు. అద్దెలు తగ్గడం, అద్దెదారులు చెల్లింపులు చేయకపోవడం, ఖాళీగా ఉండే కాలం పెరగడం, అనుకోని మరమ్మతు ఖర్చులు రావడం వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన నగదు నిల్వలు ఉండాలని సూచించారు. రెండు రుణాల చెల్లింపులను కనీసం ఆరు నెలలపాటు భరించే సామర్థ్యం ఉందా అనే విషయాన్ని ముందుగానే పరిశీలించుకోవాలని చెప్పారు.ఇదీ చదవండి: బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్.. జెన్జీ ఆనందం!ఇంట్లోని ఈక్విటీని అలాగే ఉంచడం కంటే ఆదాయం సృష్టించే ఆస్తుల్లోకి మళ్లించడం ద్వారా సంపదను పెంచుకోవచ్చన్నదే తన సూచన సారాంశమని కియోసాకి తెలిపారు. అయితే, తాను ఇచ్చిన లెక్కలు కేవలం విద్యాపరమైన సరళీకృత ఉదాహరణలు మాత్రమేనని, వాస్తవ రుణ వడ్డీరేట్లు, అద్దె ఆదాయం, నిర్వహణ ఖర్చులు, ఆస్తుల విలువ పెరుగుదల, పన్ను ప్రభావాలు ప్రాంతం, మార్కెట్ పరిస్థితులు, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను బట్టి మారుతాయని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడి నిర్ణయాల ముందు ఆర్థిక సలహాదారు, పన్ను నిపుణులు, రియల్ ఎస్టేట్ నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. -
బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్.. జెన్జీ ఆనందం!
సొంతిల్లు ఎవరికైనా జీవిత కల. అదే ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటే బెంగళూరు లాంటి నగరంలో అయితే.. పాతికేళ్లు కూడా నిండకుండానే సాకారమైతే అంతకుమించిన విజయం ఇంకేముంది అంటే అతిశయోక్తి కాదు. 24 ఏళ్ల వయసులోనే రూ.1.8 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను సొంతం చేసుకున్న లీగల్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఆకాశ్ నారాయణ్.. తన విజయాన్ని కేవలం వ్యక్తిగత ఘనతగా చూడటం లేదు. ఆర్థిక అనిశ్చితి, కుటుంబ సమస్యల నుంచి మొదలైన తన ప్రయాణంలో తల్లి, మెంటార్లు, స్నేహితులు, తొలి టీమ్ సభ్యుల సహకారమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెబుతున్నారు.ఆకాశ్ నారాయణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కాసాగ్రాండ్ వివాసిటీలో ఈ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగా.. 2027 ఏప్రిల్ నాటికి ఫ్లాట్ స్వాధీనం లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆకాశ్ నారాయణ్ ప్రస్తుతం లీగలిట్ అనే లీగల్-టెక్ సంస్థను నడుపుతున్నారు. ఆ సంస్థ వార్షిక స్థూల ఆదాయం సుమారు రూ.13 కోట్లని సమాచారం.‘ఇది నా విజయం మాత్రమే కాదు’తన తొలి ఇంటిని కొనుగోలు చేసిన సందర్భంగా సోషల్ మీడియాలో ఆకాశ్ నారాయణ్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. 24 ఏళ్లకే మొదటి అపార్ట్మెంట్ కొనుగోలు చేశానని చెబుతూ.. ఈ మైలురాయి తనది మాత్రమే కాదని పేర్కొన్నారు. కుటుంబం, మెంటార్లు, టీమ్, స్నేహితులు తన ప్రయాణంలోని ప్రతి దశలో అండగా నిలిచారని తెలిపారు.ఒకప్పుడు సొంత ఇల్లు అనేది తనకు సాధ్యం కాని కలలా అనిపించేదని ఆకాశ్ చెప్పారు. ఇప్పుడు ఆ కల నిజమైనప్పటికీ, దాని వెనుక ఎంతో మంది సహకారం ఉందన్నారు. తన తల్లి ప్రోత్సాహంతోపాటు తనతో కలిసి పనిచేసిన టీమ్ సహకాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘ఇది ప్రారంభం మాత్రమే’తొలి ఇంటి కొనుగోలును ఆకాశ్ నారాయణ్ తన జీవితంలో ముగింపు గమ్యంగా కాకుండా మరో దశకు ఆరంభంగా చూస్తున్నారు. ‘‘ఇది ప్రారంభం మాత్రమే’’ అంటూ తన సోషల్ మీడియా పోస్ట్ను ముగించారు. వ్యక్తిగతంగా సాధించిన విజయాన్ని కుటుంబం, టీమ్, మెంటార్లు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా.. విజయానికి వెనుక ఉండే సహకారం కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Akash Narayan (@kshnryn) -
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెరాలో నమోదైన అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పూర్తి గడువును నాలుగు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఫిబ్రవరి 28, 2026 నాటికి లేదా ఆ తర్వాత పూర్తికావాల్సిన అన్ని రెరా నమోదిత ప్రాజెక్టులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని వెల్లడించింది.పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల అమల్లో జాప్యం ఏర్పడే అవకాశాలను టీజీ రెరా పరిగణనలోకి తీసుకుంది. నిర్మాణ సామగ్రి సరఫరా, రవాణాపై యుద్ధ పరిస్థితుల ప్రభావం ఉండటంతో ప్రాజెక్టుల గడువును నాలుగు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగింపు దశలో ఉన్న రెరా నమోదిత ప్రాజెక్టుల ప్రమోటర్లకు ఊరట లభించనుంది. -
‘ఇండియా రియల్ ఎస్టేట్ ఇంత ఘోరమా?’
హాట్మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా (Hotmail Co-Founder Sabeer Bhatia) భారత రియల్ ఎస్టేట్ రంగంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. 2012లో తాను భారతదేశంలో ఒక "అల్ట్రా లగ్జరీ" అపార్ట్మెంట్ను బుక్ చేసుకున్నప్పటికీ, 2032 నాటికి దాన్ని స్వాధీనం (పొజెషన్) చేస్తామని తాజాగా తెలియజేశారని ఆయన ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. అంటే, ఒక ఇంటి కోసం ఏకంగా 20 సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా గృహ కొనుగోలుదారుల సమస్యలపై మరోసారి చర్చకు తెరతీశాయి.భాటియా తన తదుపరి పోస్టులో, "యువకుడిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఒక ప్రతిష్ఠాత్మక స్థావరం ఉండాలనే ఆశతో ఈ అపార్ట్మెంట్ను బుక్ చేసుకున్నాను. కానీ దాన్ని స్వాధీనం చేసుకునే సమయానికి నేను వృద్ధుడిని అవుతాను" అని వ్యాఖ్యానించారు. అయితే తన విమర్శలు ఏ ఒక్క ప్రభుత్వం లేదా వ్యక్తిపై కాదని, సమస్య మొత్తం వ్యవస్థలోనే ఉందని స్పష్టం చేశారు. "మంత్రులను మార్చడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. వ్యవస్థనే సరిదిద్దాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.మరో పోస్టులో "లోపభూయిష్టమైన వ్యవస్థను ప్రశంసించడం కంటే నిజం చెప్పడమే మంచిది" అని పేర్కొన్న భాటియా, ఈ అనుభవం భారత అభివృద్ధిపై తనకు అనేక సందేహాలను కలిగించిందని అన్నారు. అయితే అనంతరం మరో సందేశంలో భారత్పై తనకు ఇప్పటికీ విశ్వాసమే ఉందని, ప్రపంచంలోనే అత్యంత పెద్ద వినియోగ సామర్థ్యం ఉన్న దేశంగా భారత్కు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నిజాయితీతో కూడిన వ్యవస్థ, సరైన దృక్పథం ఏర్పడితే ప్రపంచంలో నివసించడానికి అత్యుత్తమ 10 దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.భాటియా పోస్టులకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలామంది గృహ కొనుగోలుదారులు నిర్మాణం పూర్తికాని ఇళ్లకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె భారం కూడా మోస్తున్నారని, భారత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాజెక్టుల ఆలస్యం ఇప్పటికీ పెద్ద సమస్యగానే ఉందని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం హాస్యంగా స్పందిస్తూ, "తాజ్మహల్ నిర్మించడానికి 22 సంవత్సరాలు పట్టింది... భారతీయ బిల్డర్లను తక్కువ అంచనా వేయొద్దు" అంటూ చమత్కరించారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రాజసం
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కీలకంగా మారింది. సాంకేతిక రంగాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగానికి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. నగరం పరిధి దాటి విస్తరిస్తున్నా, మరోవైపు రీ-డెవలప్మెంట్ రూపంలో నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు సైతం సరికొత్త లగ్జరీలతో కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి.నలుదిక్కులా రియల్టీ జోరు: ఏ దిశలో ఏముంది?విశ్వనగర ఐటీ కారిడార్నగరానికి పశ్చిమంలో కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, నార్సింగి వంటి ప్రాంతాలున్నాయి. ఐటీ/ఐటీఈఎస్ దిగ్గజ కంపెనీల విస్తరణ, అల్ట్రా-లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు ఇక్కడి వృద్దికి ప్రధానం. అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, గ్లోబల్ లైఫ్స్టైల్ అత్యంత ఎక్కువ మూలధన వృద్ధిని, స్థిరమైన అద్దె ఆదాయాన్ని అందిస్తున్నాయి.ఉత్తర హైదరాబాద్.. పరిశ్రమలు, గ్రీన్ లివింగ్కొంపల్లి, బాచుపల్లి, దూలపల్లి, మేడ్చల్.. ఇక్కడ ప్రధాన ప్రాంతాలుగా ఉన్నాయి. జాతీయ రహదారి (ఎన్హెచ్-44), జీనోమ్ వ్యాలీ ఐటీ-ఫార్మా కారిడార్ ఉండడం ఇక్కడి వృద్ధికి కారణం. తక్కువ ధరల్లో లగ్జరీ విల్లాలు, కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉండడంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కొనుగోలుదారులు ఇటువైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.తూర్పు హైదరాబాద్ఉప్పల్, ఎల్బీ నగర్, పోచారం, నాగోల్.. వంటి ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం చేపట్టిన గ్రిడ్ విధానంతో ఈస్ట్ జోన్లో నూతన ఐటీ పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో రైలు సదుపాయం విస్తృతంగా ఉండటంతో రీసేల్ మార్కెట్, మిడ్-సెగ్మెంట్ హౌసింగ్ గణనీయంగా పుంజుకుంది.దక్షిణ నగరం.. ఏరోస్పేస్, లాజిస్టిక్స్ బూమ్శంషాబాద్, ఆదిబట్ల, తుక్కుగూడ, మహేశ్వరం.. వంటివి ఈ ప్రాంత రియల్టీ వృద్ధికి కీలకం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆదిబట్ల ఏరోస్పేస్/డిఫెన్స్ పార్క్, లాజిస్టిక్స్ హబ్లు ఇందులో భాగమయ్యాయి. విశాలమైన ఓపెన్ ప్లాట్లు, విల్లా ప్రాజెక్టులు, ఫార్మా రంగానికి అనువైన వాతావరణం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మారాయి.నగర నడిఒడ్డున ‘ఆర్టీసీ క్రాస్ రోడ్స్’హైదరాబాద్ నలువైపులా విస్తరిస్తున్నప్పటికీ కొద్దికాలంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు, సొంత ఇంటి కల ఉన్న కుటుంబాలు నగర నడిఒడ్డున ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, హిమాయత్నగర్ బెల్ట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు, లగ్జరీ హైరైజ్ ప్రాజెక్టులతో సరికొత్త వెలుగులు సంతరించుకుంటోంది. దీనికి గల కారణాలు కింద చూద్దాం.మెరుగైన కనెక్టివిటీఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు, నాంపల్లికి, అసెంబ్లీకి లేదా ఐటీ కారిడార్లకు చేరుకోవడం చాలా సులభం. గ్రీన్ లైన్ మెట్రో స్టేషన్ అందుబాటులో ఉండటం వల్ల నగరంలోని ఏ మూలకైనా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రతి 2-3 నిమిషాలకు నగరంలోని అన్ని దిక్కులకూ ఆర్టీసీ బస్సు సర్వీసులు లభిస్తాయి.ఎడ్యుకేషనల్ హబ్తల్లిదండ్రులు తమ పిల్లల విద్యార్హతల కోణంలో ఇక్కడ ఇల్లు కొనడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరంలోనే దాదాపు అన్ని ప్రముఖ విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. దాంతోపాటు ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం అతి సమీపంలో ఉంది. సివిల్స్, గ్రూప్స్, నీట్/జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రధాన కేంద్రాలన్నీ (అశోక్ నగర్, చిక్కడపల్లి) ఆర్టీసీ క్రాస్ రోడ్స్కు అనుకొని ఉండటంతో విద్యార్థులకు, కుటుంబాలకు ఇది సరైన నివాస ప్రాంతంగా తోస్తుంది.ఉపాధికి, బిజినెస్కు సెంటర్ పాయింట్ఐటీ నిపుణులకు మెట్రో ద్వారా మైండ్ స్పేస్, హైటెక్ సిటీలకు సులభమైన ప్రయాణ మార్గం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, వ్యాపార సంస్థలు, చుట్టుపక్కలే ఉండటంతో నిత్యం ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటోంది.సాంస్కృతిక, వినోద, వైద్య మౌలిక సదుపాయాలుఐకానిక్ సినిమా థియేటర్ల కాంప్లెక్స్లకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిలయం. కిమ్స్, యశోధ, సన్షైన్, నిమ్స్.. వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 10-15 నిమిషాల ప్రయాణ పరిధిలోనే అందుబాటులో ఉన్నాయి. హిమాయత్నగర్ లగ్జరీ బ్రాండ్ రిటైల్ అవుట్లెట్లు, రెస్టారెంట్లు, కేఫ్లకు సమీపంలో ఉంది.లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలుగతంలో ఇక్కడ ఇండిపెండెంట్ ఇళ్లు లేదా చిన్న అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉండేవి. కానీ, పెరుగుతున్న డిమాండ్ను బట్టి దిగ్గజ బిల్డర్లు ఇక్కడి స్థలాలను సేకరించి అల్ట్రా-లగ్జరీ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. క్లబ్హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్, విశాలమైన పార్కులు, 100 శాతం వాస్తు అనుకూలతలు, ట్రిపుల్ లెవల్ పార్కింగ్ సదుపాయాలతో కూడిన భవనాలు ఏర్పాటు చేస్తుండడంతో ఇక్కడ ఆస్తుల విలువ నిలకడగా భారీగా పెరుగుతోంది.అవుటర్ ప్రాంతాల్లో మౌలికసదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి నగర నడిబొడ్డు ప్రాంతాలు ఇప్పటికే పూర్తిస్థాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సిద్ధంగా ఉన్నాయి. రోజువారీ ప్రయాణ సమయాన్ని తగ్గించుకుంటూ విద్య, వైద్యం, ఉపాధి, వినోదాలను ఇంటికి సమీపంలోనే కావాలనుకునేవారికి, నిలకడైన అద్దె ఆదాయం ఆశించే పెట్టుబడిదారులకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒక సేఫ్ ఆప్షన్గా అవతరించింది.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ! -
కియోసాకి వ్యూహం.. రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ!
సాధారణంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఉండాలని చాలామంది భావిస్తారు. అయితే తాను క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.లక్షలు, కోట్లు లేకుండా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టడం సాధ్యం కాదని అనుకుంటారు. కానీ కియోసాకి వంటి పెట్టుబడిదారులు మాత్రం.. డబ్బు కంటే సరైన ఆలోచన, వ్యూహం ఉంటే అవకాశాలను సృష్టించుకోవచ్చని చెబుతున్నారు.కియోసాకి తన మొదటి రెంటల్ ప్రాపర్టీని కేవలం 1800 డాలర్లు, క్రెడిట్ కార్డు సహాయంతో కొనుగోలు చేసిన విషయాన్ని వెల్లడించాడు. ఒక మంచి అవకాశం వచ్చిన వెంటనే.. బ్యాంక్ లోన్ కోసం ఎదురుచూడకుండా.. డీల్ పూర్తి చేశానని పేర్కొన్నారు. దీనికోసం తాను సంవత్సరాల తరబడి పొదుపు చేయలేదని కూడా చెప్పారు.ఆ మొదటి పెట్టుబడి తనకి ఒక పాఠాన్ని నేర్పిందని చెప్పారు. రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్లడానికి అసలు సమస్య డబ్బు లేకపోవడం కాదు, సరైన సమాచారం లేకపోవడమే అని అతని అభిప్రాయం. మంచి అవకాశాలను గుర్తించడం, సరైన వ్యూహంతో వాటిని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని వివరించాడు.రిచ్ డాడ్, పూర్ డాడ్ ఉదాహరణతో.. సంపదను నిర్మించే విధానంలో ఉన్న తేడాను వివరించాడు. సాధారణంగా ఉద్యోగం చేసే వ్యక్తి తన జీవితాంతం జీతం కోసం పనిచేస్తాడు. కానీ పెట్టుబడిదారుడు తనకు నిరంతరం ఆదాయం తెచ్చే ఆస్తులను నిర్మించడానికి ప్రయత్నిస్తాడు అని అన్నారు.తన మొదటి చిన్న పెట్టుబడినే ఆధారంగా చేసుకుని.. అదే వ్యూహాన్ని కొనసాగిస్తూ చివరకు వేలాది అద్దె యూనిట్ల వరకు తన వ్యాపారాన్ని విస్తరించానని కియోసాకి పేర్కొన్నాడు. ప్రారంభంలో ఉపయోగించిన ఆలోచన మారలేదని, కేవలం దాన్ని మరింత పెద్ద స్థాయిలో అమలు చేశానని తెలిపాడు.అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. రియల్ ఎస్టేట్లో ప్రతి పెట్టుబడికి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆస్తి విలువ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడిదారులు ఈ విషయాన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. -
దేశంలో ఇక్కడ రూ.కోటి జీతమొచ్చినా.. ఇల్లు రాదు!
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటైన గురుగ్రామ్లో సొంతింటి కల ఇప్పుడు అధిక ఆదాయం ఉన్న కుటుంబాలకు కూడా భారంగా మారుతోంది. వార్షికంగా రూ.80 లక్షలు నుంచి రూ.1 కోటి వరకు ఆదాయం ఉన్నవారికీ ఇల్లు కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ తన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, కుటుంబ ఆదాయాల కంటే వేగంగా దూసుకెళ్తుండటంతో గృహ కొనుగోలు సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నట్లు నివేదిక పేర్కొంది.EMI భారం రెట్టింపుసీబీఆర్ఈ విశ్లేషణ ప్రకారం, గురుగ్రామ్లో సగటు EMI-ఆదాయ నిష్పత్తి 2021లో సుమారు 20 శాతం ఉండగా, 2025 నాటికి అది దాదాపు 40 శాతానికి చేరింది. అంటే కుటుంబ ఆదాయంలో దాదాపు సగం భాగం గృహ రుణ EMIకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2026 నుంచి 2028 మధ్య ఈ నిష్పత్తి 38–40 శాతం వద్ద స్థిరపడే అవకాశమున్నప్పటికీ, అది ఇప్పటికీ అధిక భారం గానే ఉంటుందని నివేదిక సూచిస్తోంది.రూ.కోటి సంపాదించినా భారీ బడ్జెట్ అవసరంఏటా రూ.80 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు సాధారణంగా 2,250–3,700 చదరపు అడుగుల 3-BHK ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుంటే, రూ.1 కోటి వార్షిక ఆదాయం ఉన్నవారు 3,000–4,300 చదరపు అడుగుల 4-BHK గృహాలను కొనుగోలు చేసే స్థాయిలో ఉంటారని సీబీఆర్ఈ అంచనా వేసింది. అయితే చదరపు అడుగుకు ధరలు భారీగా పెరగడంతో ఈ వర్గాలకూ గృహ కొనుగోలు సామర్థ్యం తగ్గిపోయింది.రుణాలు పెరిగినా ధరలే నిర్ణయాత్మకందేశంలో గృహ రుణాల లభ్యత గణనీయంగా పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.11.59 ట్రిలియన్లు ఉన్న రెసిడెన్షియల్ హోమ్ లోన్లు, 2026 నాటికి రూ.32.78 ట్రిలియన్లకు చేరాయి. తక్కువ వడ్డీ రేట్లు, బ్యాంకుల నుంచి రుణాల లభ్యత, పెరిగిన కుటుంబ ఆదాయాలు డిమాండ్కు బలం ఇచ్చినా, ప్రాపర్టీ ధరల వేగవంతమైన పెరుగుదల కొనుగోలుదారులపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తోంది.గురుగ్రామ్లో రియల్ ఎస్టేట్ బూమ్2000 సంవత్సరం నుంచి గురుగ్రామ్లో 3.2 లక్షలకు పైగా నివాస యూనిట్లు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 2021–2025 మధ్య గృహ విక్రయాలు కొత్త ప్రాజెక్టుల కంటే ఎక్కువగా నమోదవడం వల్ల మార్కెట్లో డిమాండ్ బలంగా కొనసాగింది. 2026 తొలి త్రైమాసికం నాటికి నగరంలో సుమారు 2.07 లక్షల పూర్తయిన గృహాలు, మరో 1.21 లక్షల యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది.ద్వారకా ఎక్స్ప్రెస్వేతో కొత్త హాట్స్పాట్లుగోల్ఫ్ కోర్స్ రోడ్, సోహ్నా రోడ్లతో ప్రారంభమైన అభివృద్ధి ఇప్పుడు నార్తర్న్ పెరిఫెరల్ రోడ్ (ద్వారకా ఎక్స్ప్రెస్వే), గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్, సదరన్ పెరిఫెరల్ రోడ్ ప్రాంతాలకు విస్తరించింది. 2024లో ద్వారకా ఎక్స్ప్రెస్వే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతాల్లో ప్రీమియం గృహాలకు డిమాండ్ మరింత పెరిగింది.లగ్జరీ, బ్రాండెడ్ హౌసింగ్కు ఊపుగురుగ్రామ్లో ఇప్పుడు సాధారణ అపార్ట్మెంట్లకంటే బ్రాండెడ్ లగ్జరీ రెసిడెన్సులు వేగంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ హాస్పిటాలిటీ, లైఫ్స్టైల్ బ్రాండ్లతో కలిసి డెవలపర్లు హైఎండ్ ప్రాజెక్టులను తీసుకొస్తున్నారు. అదే సమయంలో వృద్ధాప్య జనాభా పెరుగుతుండటంతో సీనియర్ లివింగ్ కమ్యూనిటీలు కూడా కొత్త పెట్టుబడి అవకాశాలుగా మారుతున్నాయి. -
‘హౌసింగ్’లో ఇంత భారీగా పెట్టుబడులు ఎందుకు తగ్గాయ్?
న్యూఢిల్లీ: దేశీయ గృహ నిర్మాణ (హౌసింగ్) రంగంలోకి సంస్థాగత పెట్టుబడులు ఈ ఏడాది (2026) తొలి ఆరు నెలల్లో భారీగా తగ్గాయి. జనవరి–జూన్ మధ్య కాలంలో హౌసింగ్ విభాగంలోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు 85 శాతం క్షీణించి 153.62 మిలియన్ డాలర్లకు (15.36 కోట్ల డాలర్లు) పరిమితమైనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్’ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ సెగ్మెంట్లో 1,019.88 మిలియన్ డాలర్ల (101.98 కోట్ల డాలర్లు) పెట్టుబడులు వచ్చాయి.అయితే, మొత్తం రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 2026 తొలి అర్ధభాగంలో మొత్తం పెట్టుబడులు 6 శాతం పెరిగి 3.46 బిలియన్ డాలర్లకు చేరగా, గత ఏడాది(2025) ఇదే కాలంలో ఇవి 3.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా స్వదేశీ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులే ఈ వృద్ధికి కారణమని సంస్థ పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగంలోని ఇతర విభాగాలతో పోలిస్తే కార్యాలయాలు (ఆఫీసులు), డేటా సెంటర్ ప్రాజెక్టులకే ఎక్కువ నిధులు వచ్చాయి. మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026 తొలి ఆరు నెలల్లో స్వదేశీ సంస్థాగత పెట్టుబడులు 2.2 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, విదేశీ సంస్థాగత పెట్టుబడులు 1.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.వివిధ రంగాలవారీగా పెట్టుబడులుఆఫీస్ రియల్ ఎస్టేట్ విభాగం అత్యధిక నిధులను ఆకర్షించింది. గతేడాది జనవరి–జూన్లో ఈ విభాగంలోకి 729.48 మిలియన్ డాలర్ల నిధులు కాగా, ఈ ఏడాది అది ఏకంగా రెండు రెట్లకు పైగా పెరిగి 1,970.74 మిలియన్ డాలర్లకు చేరింది.డిజిటల్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండటంతో డేటా సెంటర్ ప్రాజెక్టుల్లోకి 838.97 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గతేడాది ఈ విభాగంలో ఎలాంటి పెట్టుబడులు రాకపోవడం గమనార్హం. రిటైల్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు 542.38 మిలియన్ డాలర్ల నుంచి 161.53 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.స్వదేశీ ఇన్వెస్టర్లే కీలకం ‘‘స్థిరమైన ఆదాయ సామర్థ్యం, అధిక లిక్విడిటీ కారణంగా ఆఫీస్ విభాగంపై పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతోంది. దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తుండటంతో డేటా సెంటర్లలోనూ ఇన్వెస్ట్మెంట్స్ పెరగుతున్నాయి. ఈ ధోరణి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను మరింత వైవిధ్యభరితంగా, స్థిరంగా మారుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ స్వదేశీ పెట్టుబడిదారుల మద్దతుతో పెట్టుబడుల ప్రవాహం స్థిరంగా కొనసాగే అవకాశముంది’’ అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ సోమీ థామస్ తెలిపారు. -
భారీ భవనాలకు ఎనర్జీ పొదుపు నిబంధనలు
దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, పట్టణీకరణ ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ వైపు కీలక అడుగు వేసింది. కొత్తగా నిర్మించే పెద్ద వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయ భవనాలకు ఇంధన సామర్థ్య, సుస్థిరతా ప్రమాణాలను నిర్బంధం చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సంప్రదింపులతో రూపొందించిన ఈ ముసాయిదా నిబంధనలు భారత ఇంధన భద్రతలో మార్పులు తీసుకురానున్నాయి.20,000 చదరపు మీటర్ల విస్తీర్ణమే ప్రామాణికంకేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. 20,000 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ బిల్ట్-అప్ ఏరియా కలిగిన ప్రతి నూతన భవన సముదాయానికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. అధికారిక గెజిట్లో ప్రచురించిన తేదీ తర్వాత ప్రారంభమయ్యే ప్రాజెక్టులకు మాత్రమే ఇవి అమలులోకి వస్తాయి. ప్రస్తుతం దేశంలో భవనాల విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయడానికి సరైన జాతీయ సమగ్ర వ్యవస్థ లేదు. దీనివల్ల వివిధ రాష్ట్రాల్లో, వేర్వేరు రకాల భవన నిర్మాణాల్లో ఎనర్జీ పొదుపు ప్రమాణాలు ఏకరూపంగా అమలు కావడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.రేటింగ్ సంస్థల నమోదునూతన ప్రతిపాదనల ప్రకారం దేశంలో సేవలు అందిస్తున్న ప్రధాన భవన రేటింగ్ ఏజెన్సీలు.. గ్రిహా, ఐజీబీసీ, లీడ్, జెమ్.. వంటివన్నీ తప్పనిసరిగా బీఈఈ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బీఈఈ నిర్దేశించిన ఇంధన సామర్థ్య ప్రమాణాల ఆధారంగానే ఈ ఏజెన్సీలు భవనాలకు రేటింగ్ ఇస్తాయి. దీనివల్ల వినియోగదారులకు, డెవలపర్లకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన విశ్వసనీయ ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయి.భారతదేశంలో మొత్తం విద్యుత్ వినియోగంలో దాదాపు మూడో వంతు ఒక్క భవనాల రంగానికే ఖర్చవుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిన ఎయిర్ కండిషనింగ్, లైటింగ్, హీటింగ్ అవసరాల వల్ల రాబోయే 10-15 ఏళ్లలో ఈ విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో ఈ నూతన సంస్కరణలు దేశ ఇంధన భద్రతను పటిష్టం చేయడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించి, సుస్థిరాభివృద్ధి సాధనలో భారత్ చేపడుతున్న అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాలకు బలమైన ఊతాన్ని ఇస్తాయని కేంద్రం వ్యాఖ్యానించింది.ఇదీ చదవండి: పసిడి తగ్గినా.. ‘గోల్డ్ బాండ్ల’ జోరు తగ్గేదేలే.. -
హైదరాబాద్లో ఇల్లు.. ఇకపై ఇలాగే కట్టుకోవాలి!
సాక్షి, సిటీబ్యూరో: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ నగరంలో నిర్మాణాలకు ‘క్యూర్’ కొత్త చట్టంలో కట్టుదిట్టమైన ప్రమాణాలను ప్రతిపాదించారు. గ్రీన్ బిల్డింగ్స్కు ప్రాధాన్యమిస్తూ తగిన ప్రోత్సాహకాలతో పాటు, పెద్ద భవనాల్లో వాతావరణ మార్పులను తట్టుకునే డిజైన్లు, వర్షపునీటి సంరక్షణ, నిర్మాణ సమయంలో దుమ్ము, శబ్ద కాలుష్య నియంత్రణ చర్యలు, అవసరాకనుగుణంగా ప్రభుత్వం సూచించే ఇతర పర్యావరణ చర్యలు అమలు చేయాల్సి ఉంటుంది.భారీ భవనాలు లేదా ప్రత్యేక కేటగిరీల ప్రాజెక్టులకు ట్రాఫిక్ ఇంపాక్ట్ స్టడీతోపాటు పర్యావరణ ప్రభావం అధ్యయనం చేయాలి. స్టామ్వాటర్ మేనేజ్మెంట్ప్లాన్ ఉండాలి. అంతేకాదు, గాలి ప్రభావం, భూకంప భద్రత వంటి సాంకేతిక నివేదికలను సైతం కోరే అధికారం ఉంటుంది. నెట్– జీరో, గ్రీన్ బిల్డింగ్స్ లేదా తక్కువ కర్బన ఉద్గారాల భవనాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి చట్టం అవకాశం కల్పించింది.లోకల్ ఏరియా ప్లాన్ నగరంలో ఆయా ప్రాంతాలకు తగ్గట్లుగా లోకల్ ఏరియా ప్లాన్ను రూపొందించే అధికారం సంబంధిత కార్పొరేషన్ కమిషనర్కు ఉంటుంది. నోటీసు జారీ చేసి ఒక ప్రాంతం లేదా వీధికి ప్రత్యేక లోకల్ ఏరియా ప్లాన్ రూపొందించవచ్చు. ఇందుకోసం నెలరోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి కార్పొరేషన్, అనంతరం ప్రభుత్వానికి సిఫారసులతో పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత గెజిట్లో ప్రచురించి అమలు చర్యలు చేపడతారు. తద్వారా ఒక ప్రాంతానికి తగిన నిర్మాణ శైలిని నిర్దేశించవచ్చు. ప్లాట్ కనీస పరిమాణాన్ని నిర్ణయించవచ్చు. నిర్దిష్ట విస్తీర్ణంలో నిర్మించే భవనాలు లేదా నివాస యూనిట్ల సంఖ్యను పరిమితం చేయవచ్చు. దుకాణాలు, గోదాములు, పరిశ్రమలు వంటి వినియోగాలపై నియంత్రణలు విధించవచ్చు.వికలాంగులకు అనుకూల సౌకర్యాలు తప్పనిసరి దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం వారికి యాక్సెసిబిలిటీ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. భవన రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ మొత్తం అందుకు అనుగుణంగా ఉండాలి.నిర్మాణ నాణ్యతపై కఠిన ప్రమాణాలు నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక నిబంధనలను కూడా ప్రభుత్వం సంబంధిత ముసాయిదా బిల్లులో పొందుపరిచింది. ప్రతి భవనం స్థల పరిస్థితులు, లేఅవుట్, రహదారి అనుసంధానం, నిర్మాణ భద్రత, ఎత్తు, విస్తీర్ణం, వెంటిలేషన్, పారిశుద్ధ్యం, నిర్మాణ సామగ్రి వంటి అంశాల్లో ప్రభుత్వం లేదా బై–లాస్ నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అవసరమైతే కొన్ని ప్రత్యేక రకాల భవనాలకు అదనపు నిబంధనలు కూడా విధించే అధికారం కమిషనర్కు ఉంటుంది. మొత్తంగా.. కొత్త చట్టం ద్వారా గ్రేటర్ నగరంలో నియంత్రిత, పర్యావరణ హిత, భద్రతతో కూడిన, అందరికీ అందుబాటులో ఉండే మౌలిక వసతులతో కూడిన భవన నిర్మాణాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసినట్లు సమాచారం. -
1,284 ఇళ్లు అమ్మేసిన డీడీఏ..
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) గృహ నిర్మాణ పథకాలకు ఈ ఏడాది భారీ స్పందన లభించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో డీడీఏ మొత్తం 1,284 ఫ్లాట్లను విక్రయించి రూ.1,020 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.462 కోట్లతో పోలిస్తే ఇది 120 శాతానికి పైగా వృద్ధి కావడం విశేషం.డీడీఏ విడుదల చేసిన వివరాల ప్రకారం.. అన్ని వర్గాల గృహాలపై కొనుగోలుదారుల నుంచి వచ్చిన బలమైన డిమాండ్ ఈ ఫలితాలకు ప్రధాన కారణమైంది. ముఖ్యంగా నరేలా ప్రాంతం అత్యధిక విక్రయాలతో ముందంజలో నిలిచింది. ఈ ప్రాంతంలోనే 1,153 ఫ్లాట్లు అమ్ముడవగా, మొత్తం విక్రయాల్లో దాదాపు 90 శాతం వాటా నమోదైంది. నరేలాను అభివృద్ధి చెందిన ఉపనగరంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలు, మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రజల్లో విశ్వాసం పెరగడం ఇందుకు దోహదపడిందని డీడీఏ పేర్కొంది.నరేలా ప్రాంతానికి అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్–II (UER-II), నిర్మాణంలో ఉన్న రిథాలా–నరేలా–కుండ్లీ మెట్రో కారిడార్ వంటి కీలక ప్రాజెక్టులు మెరుగైన కనెక్టివిటీని అందించనున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో గృహాలపై ఆసక్తి మరింత పెరుగుతోందని అధికారులు తెలిపారు.ప్రస్తుతం డీడీఏ కర్మయోగి ఆవాస్ యోజన, నాగరిక్ ఆవాస్ యోజన, అలాగే తూర్పు ఢిల్లీలోని టవరింగ్ హైట్స్ వంటి పథకాల కింద వివిధ ఆదాయ వర్గాలకు చెందిన ఫ్లాట్లను అందిస్తోంది. ఈ పథకాలను జూలై 31, 2026 వరకు 'ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్' విధానంలో పొడిగించారు. మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే ఉండటంతో, కొనుగోలుదారులు ఇంటి నుంచే ఫ్లాట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న ఇళ్లు ఫ్రీహోల్డ్, రెడీ-టు-మూవ్ కేటగిరీలో ఉండటం కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న అంశంగా డీడీఏ పేర్కొంది.వర్గాల వారీగా చూస్తే, తొలి త్రైమాసికంలో 336 ఈడబ్ల్యూఎస్, 322 ఎల్ఐజీ, 435 ఎంఐజీ, 191 హెచ్ఐజీ ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. వీటిలో ఎంఐజీ విభాగం 34 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా, నరేలాలోని ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లు దాదాపు పూర్తిగా అమ్ముడవడం సరసమైన ధరల్లో గృహాలపై ఉన్న డిమాండ్కు నిదర్శనంగా అధికారులు పేర్కొన్నారు. -
ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా.. ఇవి చెక్ చేశారా?
నగరాలు, పట్టణాల్లో సరైన ఇల్లు అద్దెకు దొరకడం ఎంత కష్టమో, అద్దె ఒప్పందం (రెంట్ అగ్రిమెంట్)ను పూర్తిగా చదవకుండా సంతకం చేయడం అంతకంటే పెద్ద ప్రమాదమని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెలవారీ అద్దెపై మాత్రమే దృష్టి పెట్టి, ఒప్పందంలోని కీలక నిబంధనలను పట్టించుకోకపోతే తర్వాత సెక్యూరిటీ డిపాజిట్, నిర్వహణ ఛార్జీలు, లాక్-ఇన్ పీరియడ్, ముందస్తు ఖాళీ చేయడంపై జరిమానాలు వంటి అంశాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.సెక్యూరిటీ డిపాజిట్పై స్పష్టత తప్పనిసరిఅద్దెదారులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో సెక్యూరిటీ డిపాజిట్ ఒకటి. డిపాజిట్ ఎంత తీసుకుంటున్నారు, ఇంటిని ఖాళీ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో తిరిగి చెల్లిస్తారు, ఏ పరిస్థితుల్లో ఎంత మొత్తం కోత విధించవచ్చు వంటి అంశాలు ఒప్పందంలో స్పష్టంగా ఉండాలి. ఇంటి పరిస్థితిని ఫోటోలు లేదా వీడియోల రూపంలో నమోదు చేసుకోవడం కూడా భవిష్యత్ వివాదాలను నివారించడంలో ఉపయోగపడుతుంది.లాక్-ఇన్ పీరియడ్, నోటీస్ క్లాజ్ను జాగ్రత్తగా చదవండిఉద్యోగ మార్పు, బదిలీ లేదా ఇతర కారణాలతో ముందుగానే ఇల్లు ఖాళీ చేయాల్సి రావచ్చు. అందుకే లాక్-ఇన్ పీరియడ్ ఎంత ఉంది, ఆ కాలానికి ముందే ఖాళీ చేస్తే ఎలాంటి జరిమానా ఉంటుంది, ఎంత ముందుగా నోటీస్ ఇవ్వాలి వంటి వివరాలను ముందే తెలుసుకోవాలి. కొన్ని ఒప్పందాల్లో మిగిలిన లాక్-ఇన్ కాలానికి సంబంధించిన అద్దెను కూడా చెల్లించాల్సిన నిబంధనలు ఉంటాయి.నిర్వహణ ఛార్జీలు ఎవరి బాధ్యత?గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ ప్రాజెక్టుల్లో మెయింటెనెన్స్ ఛార్జీలు నెలకు వేల రూపాయలు ఉండొచ్చు. ఈ ఖర్చును యజమాని భరిస్తారా? లేక అద్దెదారే చెల్లించాలా? అనే విషయాన్ని ఒప్పందంలో స్పష్టంగా నమోదు చేయాలి. పార్కింగ్, క్లబ్ హౌస్, లిఫ్ట్, భద్రత వంటి సౌకర్యాల నిర్వహణ ఖర్చులపై ముందుగానే అవగాహన ఉండటం మంచిది.ఒప్పందంలో ఉన్నదే చెల్లుతుందిఇంటి యజమాని మౌఖికంగా ఇచ్చిన హామీలకు కంటే రాతపూర్వక ఒప్పందానికే చట్టపరంగా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పెయింటింగ్, మరమ్మతులు, ఫర్నిచర్, పార్కింగ్, పెంపుడు జంతువులు, లీజు పొడిగింపు వంటి అంశాలపై ఏదైనా హామీ ఇచ్చినా, అది తప్పనిసరిగా అద్దె ఒప్పందంలో నమోదు కావాలి.వాణిజ్య స్థలాలకు అదనపు జాగ్రత్తఆఫీస్లు, షాపులు లేదా ఇతర కమర్షియల్ ప్రాపర్టీలను అద్దెకు తీసుకునే వ్యాపార సంస్థలు కామన్ ఏరియా మెయింటెనెన్స్ (CAM) ఛార్జీలు, అద్దె పెంపు విధానం (Escalation Clause), ఇంటీరియర్ మార్పులు, ఒప్పంద రద్దు నిబంధనలను ప్రత్యేకంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.తాజా నిబంధనలు ఏమంటున్నాయి?భారతదేశంలో అద్దె లావాదేవీలకు సంబంధించిన చట్టాలు రాష్ట్రాలవారీగా మారుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘మోడల్ టెనెన్సీ యాక్ట్, 2021’ను కొన్ని రాష్ట్రాలు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ స్థానిక అద్దె చట్టాలే అమల్లో ఉన్నాయి. కాబట్టి ఒప్పందంపై సంతకం చేసే ముందు స్థానిక నిబంధనలను కూడా తెలుసుకోవడం అవసరం. రూ.100 కంటే ఎక్కువ వార్షిక అద్దె విలువ కలిగిన లీజ్ ఒప్పందాలు సాధారణంగా ‘రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908’ ప్రకారం నమోదు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని బట్టి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ నిబంధనలు మారవచ్చు. -
సొంతింటి కల నిజం కావాలా?
సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద ఆర్థిక నిర్ణయం. అయితే, నేటి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇల్లు కొనడం కేవలం బడ్జెట్కు సరిపోయే ప్రాపర్టీని ఎంచుకోవడంతో ముగిసిపోయే ప్రక్రియ కాదు. కొనుగోలు సమయంలో మనం తీసుకునే కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు, భవిష్యత్తులో దశాబ్దాల పాటు మన జేబుకు చిల్లు పడకుండా కాపాడతాయి. గృహ కొనుగోలుదారులు దీర్ఘకాలికంగా డబ్బు ఆదా చేసుకునేందుకు దోహదపడే ఐదు కీలకమైన నిర్ణయాలపై విశ్లేషణ.డౌన్ పేమెంట్ వాటా పెంపుచాలామంది బ్యాంకులు ఇచ్చే గరిష్ట రుణం (లోన్-టు-వాల్యూ)పై ఆధారపడుతుంటారు. కానీ, కొనుగోలు సమయంలో కేవలం కనీస డౌన్ పేమెంట్ కాకుండా, మీ పొదుపు మొత్తాన్ని వీలైనంత ఎక్కువగా (కనీసం 20-30% లేదా అంతకంటే ఎక్కువ) ముందస్తుగా చెల్లించడం ఉత్తమం. దీనివల్ల అసలు రుణభారం తగ్గడమే కాకుండా నెలవారీ ఈఎంఐ భారం, మొత్తం రుణ కాలపరిమితిపై చెల్లించాల్సిన వడ్డీ రేటు లక్షల్లో తగ్గుతుంది.వడ్డీ రేట్ల సరళిగృహ రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేట్ల ఎంపిక అత్యంత కీలకం. ప్రస్తుత ఆర్థిక మార్కెట్ ఒడిదుడుకులు, ఆర్బీఐ రెపో రేట్ల ధోరణిని బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా సుదీర్ఘ కాలపరిమితి (15-20 ఏళ్లు) కలిగిన రుణాలకు ఫ్లోటింగ్ రేట్ ఎంచుకోవడం వల్ల మార్కెట్ తగ్గుముఖం పట్టినప్పుడు వడ్డీ ఆదా అవుతుంది. అయితే, స్థిరమైన బడ్జెట్ ప్రణాళికను ఇష్టపడేవారు ‘ఫిక్స్డ్ రేట్’ వైపు మొగ్గు చూపవచ్చు.సరైన ప్రాపర్టీ పరిమాణం, లేఅవుట్ ఎంపిక‘పెద్ద ఇల్లు... ఎక్కువ హోదా’ అనే భ్రమల నుంచి బయటకు రావాలి. కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఇంటిని ఎంచుకోవడం ద్వారా కొనుగోలు ధరతోపాటు భవిష్యత్తులో అయ్యే ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, అంతర్గత నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. అనవసరమైన కార్పెట్ ఏరియా కోసం పెట్టే పెట్టుబడిని వేరే ఆర్థిక వనరుల్లో మళ్లించడం ద్వారా అదనపు రాబడిని పొందవచ్చు.లొకేషన్ ఎంపికనగరం నడిబొడ్డున ఉన్న స్థలాలు లేదా ఐటీ కారిడార్లకు సమీపంలోని పూర్తయిన ప్రాజెక్టుల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. వీటికి బదులుగా రాబోయే 3-5 ఏళ్లలో మౌలిక సదుపాయాలు (మెట్రో, హైవేలు) మెరుగుపడనున్న అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలను ఎంచుకోవడం స్మార్ట్ నిర్ణయం. దీనివల్ల కొనుగోలు ఖర్చు తగ్గడమే కాక భవిష్యత్తులో ఆస్తి విలువ వేగంగా పెరిగి లాభాలను అందిస్తుంది.బీమా, ఇతరత్రా ఖర్చుల పట్ల అప్రమత్తతఇల్లు కొనేటప్పుడు కేవలం బేస్ ప్రైస్ మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, క్లబ్ హౌస్ మెంబర్షిప్ వంటి అదనపు ఖర్చులను ముందే అంచనా వేయాలి. అలాగే, హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ లేదా హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఊహించని విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడంతోపాటు బ్యాంకులు మీ ఆస్తిని జప్తు చేయకుండా కాపాడుతుంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
25 ఏకరాల భూమి కొన్న స్టార్ హీరో, ధర ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పూణేలోని ముల్షీ తాలూకాలో రూ. 16.42 కోట్లతో 25.7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 1,04,000 చదరపు మీటర్లు ( సుమారు 25.7 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్నిరణ్బీర్ నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ఏడాది మే నెలలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అయోధ్యలోనూ భారీ పెట్టుబడుల తరువాత తాజాగా డీల్ విశేషంగా నిలుస్తోంది.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సిఆర్ఈ మాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లావాదేవీ 2026 ఏప్రిల్ 30న నమోదైంది. ముల్షీలోని పింప్రి గ్రామంలో ఒకదానికొకటి ఆనుకుని ఉన్న నాలుగు భూభాగాలను రణబీర్ కొనుగోలు చేశారు. వీటి మొత్తం వైశాల్యం 1,04,000 చదరపు మీటర్లు (సుమారు 25.7 ఎకరాలు). అరుణ్ శ్రీరామ్ లూత్రా, నవీన్ శ్రీరామ్ లూత్రా ,మాలా ఉమేష్ మెహతా అనే వ్యక్తుల నుంచి ఈ స్థలాన్ని కొన్నారు. ఈ భారీ ల్యాండ్ డీల్ కోసం రణ్బీర్ ఏకంగా రూ. 82.13 లక్షలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.రణబీర్ కపూర్ ఇటీవల అయోధ్యలోని విలాసవంతమైన లేఅవుట్ 'ది సరయూ'లో రూ. 3.31 కోట్లతో 2,134 చదరపు అడుగుల ప్లాట్ను 2026 మే నెలలో కొనుగోలు చేశారు. ఆ పెట్టుబడి పెట్టిన కొద్ది నెలలకే ఈ కొత్త భారీ భూమి కొనుగోలు జరగడం విశేషం.ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?రణబీర్, అలియా నెట్వర్త్ పలు కథనాల ప్రకారం కపూర్ కుటుంబానికి చెందిన ఈ స్టార్ హీరో రణబీర్ కపూర్ నికర ఆస్తి విలువ రూ. 400 కోట్లు. జీక్యూ ఇండియా (GQ India) 2024 నివేదిక ప్రకారం, రణబీర్ కపూర్తో పోలిస్తే ఆలియా భట్ నికర ఆస్తి విలువ ఎక్కువ. ఆమె ఆస్తి రూ. 550 కోట్లు. ఇవి కాకుండా రణబీర్ సావన్ (Saavn), బెకో (Beco) వంటి పలు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టారు. డ్రోన్ఆచార్య అనే ఏరియల్ ఇన్నోవేషన్స్ కంపెనీకి కూడా ఆయన మద్దతుగా నిలిచారు. అలాగే 'ఆర్క్స్' (Arks) వంటి వెంచర్లలో భాగస్వామ్యంతో పాటు, ముంబై సిటీ ఎఫ్సి (Mumbai City FC) ఫుట్బాల్ క్లబ్కు సహ-యజమానిగా ఉన్నారు.ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్పాలి హిల్లోని 'కృష్ణ రాజ్ బంగ్లా' రణబీర్ రియల్ ఎస్టేట్ ఆస్తులలో ముఖ్యమైనది, దీని విలువ దాదాపు రూ. 250 కోట్లుగా చెబుతారు. పూణేలోని ట్రంప్ టవర్స్లో కూడా ఆయనకు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆయన లగ్జరీ కార్ల కలెక్షన్లో బెంట్లీ కాంటినెంటల్ GT V8, రేంజ్ రోవర్, మెర్సిడెస్-AMG SL 55, G63 వంటి కార్లు ఉన్నాయి.ఇక వృత్తిపరమైన విషయానికొస్తే, రానున్న నెలల్లో రణబీర్ నటించిన రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. నవంబర్లో, నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణం పార్ట్ 1' (Ramayana Part 1)లో కనిపించనున్నారు. ఇందులో సాయి పల్లవి, యష్ , సన్నీ డియోల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2027 ప్రారంభంలో, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్, విక్కీ కౌశల్ నటించిన 'లవ్ & వార్' (Love & War) అనే పీరియడ్-రొమాన్స్ చిత్రం విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ చిన 'యానిమల్' (2023) చిత్రంలో రణబీర్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. -
ఇంటి నిర్మాణానికి ఇదో కొత్త ఐడియా!
సాక్షి స్పెషల్ డెస్క్: వ్యవసాయ వ్యర్థాలతో ఇళ్లను పటిష్టంగా నిర్మించవచ్చని భారతీయ శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. పొలాల్లో మిగిలి పోయే వరి పొట్టు, చెరకు పిప్పిని కాల్చి తీసిన బూడిదతో సిమెంట్ వాడకాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుతూ దృఢమైన ఇళ్లను నిర్మించవచ్చని తాజా పరిశోధనలో తేల్చారు.పొట్టులో సిలికా పవర్... సిమెంట్కు ప్రత్యామ్నాయం!వరి పొట్టు, చెరకు వ్యర్థాలను ఒక ప్రత్యేక థర్మో–కెమికల్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు. ఇలా చేసినప్పుడు వచ్చే బూడిదలో సిలికా అనే కెమికల్ పుష్కలంగా ఉంటుంది. ఈ సిలికాకు సిమెంట్లా గట్టిపడే లక్షణం ఉంది. దీన్ని కాంక్రీట్లో కలపడం వల్ల సిమెంట్ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా అటు నిర్మాణ ఖర్చు, ఇటు పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టడం వల్ల వచ్చే వాయు కాలుష్యం రెండూ ఉండవు.సిమెంట్లో ‘బూడిద’ మిక్సింగ్ కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు 100 శాతం సిమెంట్ను వాడాల్సిన అవసరం లేదు. అందులో 10 నుంచి 20 శాతం వరకు సిమెంట్ను తగ్గించి ఆ స్థానంలో వ్యవసాయ బూడిదను కలుపుతారు. దీనివల్ల సిమెంట్ తగ్గినా కాంక్రీట్ బలానికి ఎలాంటి ఢోకా ఉండదు. పైగా ఇది భవనాలను మరింత మన్నికైనవిగా, గట్టిగా మారుస్తుంది.గ్లోబల్ వార్మింగ్కు చెక్సాధారణంగా ఒక టన్ను సిమెంట్ తయారీకి దాదాపు ఒక టన్ను కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణమవుతోంది. కానీ సరికొత్త ‘గ్రీన్ కాంక్రీట్’ టెక్నాలజీ వల్ల సిమెంట్ ఉత్పత్తి అవసరం తగ్గుతుంది. ఫలితంగా వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. -
రూ.6 కోట్ల ఇల్లు.. ఇది నిజంగా మధ్యతరగతి ఇల్లేనా?
భారతదేశంలోని మెట్రో నగరాల్లో రూ.5–6 కోట్లతో లగ్జరీ అపార్ట్మెంట్ మాత్రమే దొరికే పరిస్థితి ఉండగా, అమెరికాలో అదే మొత్తానికి ఎకరానికి పైగా స్థలంతో కూడిన ఇండిపెండెంట్ ఇల్లు కొనుగోలు చేయవచ్చనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ మహిళ తన ఇంటి వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ అంశంపై విస్తృత చర్చ మొదలైంది.అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో నివసిస్తున్న సోనాల్ చౌదరి అనే భారతీయ మహిళ ఇన్స్టాగ్రామ్లో "అమెరికాలో మధ్యతరగతి కుటుంబం ఇల్లు ఎలా ఉంటుంది?" అనే శీర్షికతో వీడియోను పోస్టు చేశారు. తమ కుటుంబం 2023లో ఈ ఇంటిని 4.4 లక్షల డాలర్ల (సుమారు రూ.3.7–3.8 కోట్లు, అప్పటి మారకం విలువ ప్రకారం)కు కొనుగోలు చేసిందని, ప్రస్తుతం దాని మార్కెట్ విలువ సుమారు 6.5–7 లక్షల డాలర్లకు (సుమారు రూ.5.5–6 కోట్లు) చేరిందని ఆమె వివరించారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు గత కొన్నేళ్లుగా పెరగడంతో ఈ ఇంటి విలువ కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.వీడియోలో ఇంటి ముందు విశాలమైన యార్డ్, గ్యారేజ్, ఒక ఎకరానికి పైగా విస్తరించిన స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెరడు, డెక్, సన్రూమ్, హోమ్ జిమ్, ఫైర్ప్లేస్ వంటి సౌకర్యాలను చూపించారు. ముఖ్యంగా పొరుగింటి మధ్య ఉండే విస్తృత ఖాళీ స్థలం, ప్రశాంతమైన వాతావరణం భారతీయ నెటిజన్లను ఆకట్టుకుంది.ఇళ్ల నిర్మాణంపై కూడా సోనాల్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అమెరికాలోని చాలా సబర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు ప్రధానంగా కలప (వుడ్ ఫ్రేమ్)తో నిర్మిస్తారని, భూకంప నిరోధకత, నిర్మాణ వ్యయం, శీతల వాతావరణానికి అనుకూలత వంటి కారణాల వల్ల అక్కడ ఈ విధానం విస్తృతంగా అమల్లో ఉందని చెప్పారు.ఈ వీడియోకు వేలాది మంది స్పందిస్తూ భారతదేశంలోని రియల్ ఎస్టేట్ ధరలతో పోలికలు గీశారు. "ముంబైలో రూ.6 కోట్లకు 2BHK మాత్రమే వస్తుంది", "హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి", "భారత్లో భూమి కొరత, జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో ధరలు భారీగా పెరిగాయి" అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు "అమెరికాలో ఇది నిజంగానే మధ్యతరగతి ఇల్లేనా?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.👉ఇది చదివారా? బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులుఅయితే నిపుణులు ఒక విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అమెరికాలో ఇంటి కొనుగోలు ధరతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్, హోమ్ ఇన్సూరెన్స్, నిర్వహణ ఖర్చులు, హీటింగ్-కూలింగ్ వ్యయాలు కూడా గణనీయంగా ఉంటాయి. అందువల్ల కేవలం ఇంటి ధర ఆధారంగా రెండు దేశాల జీవన వ్యయాలను నేరుగా పోల్చడం సరైన విధానం కాదని వారు సూచిస్తున్నారు. అయినప్పటికీ, అదే బడ్జెట్తో అమెరికాలో లభించే స్థలం, భారత నగరాల్లో దొరికే నివాస విస్తీర్ణం మధ్య ఉన్న తేడా సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by The Ultimate Trolls | Memes • Media • India • News (@the_ultimate_trolls_) -
లోగో డిజైన్ చేయండి.. లక్ష గెలుచుకోండి
సాక్షి, హైదరాబాద్: క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఎల్ఐజీ గృహనిర్మాణ పథకానికి లోగో కోసం హౌసింగ్ బోర్డు సోషల్ మీడియా వేదికగా బుధవారం పోటీని ప్రకటించింది. లోగో రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయాలన్న ఆలోచనతో అధికారిక చిహ్నం (అఫిషియల్ లోగోను) గురించి పోటీని నిర్వహిస్తున్నట్లు, ఉత్తమమైన లోగోకు రూ.లక్షబహుమతి అందచేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.పోటీలో పాల్గొనదలచిన వారు తమ డిజైన్లను తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రాగామ్ అకౌంట్ tghd.officialలో https://www.instagram.com/p/Dahnht3zFwE/ ద్వారా ఈ నెల 12వ తేదీకల్లా సమర్పించాలి. -
‘అపార్ట్మెంట్ కొన్నాను.. చింతిస్తున్నాను’
సొంత ఇల్లు అనేది సగటు మధ్యతరగతి భారతీయుడి జీవితకాల కల. కానీ, సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా మారుతున్న ఆదాయ వనరులను అంచనా వేయడంలో పొరపాటుపడితే ఆ కల కాస్తా జీవితాంతం వెంటాడే పీడకలగా ఎలా మారుతుందో వివరించే ఒక తాజా ఉదాహరణ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ రెడ్డిట్లోని ‘ఆర్/పర్సనల్ ఫైనాన్స్ ఇండియా’ హ్యాండిల్ ద్వారా ఒక వ్యక్తి పంచుకున్న తన అనుభవం నేటి యువతరం ఆలోచింపజేసేదిలా ఉంది. ‘ఒక అపార్ట్మెంట్ కొన్నాను.. ఇప్పుడు చింతిస్తున్నాను’ అనే శీర్షికతో అతను పెట్టిన పోస్ట్ రియల్ ఎస్టేట్ మోజులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వేలాది మంది ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల స్థితికి అద్దం పడుతోంది.రూ.25 లక్షల జీతం.. రూ.1.5 కోట్ల ఫ్లాట్!ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఏడాది క్రితం అతను రూ.1.5 కోట్ల విలువైన ఒక అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడు. 2024లో అతని వార్షిక ఆదాయం దాదాపు రూ.25 లక్షలు. ఆ ధీమాతోనే అతను అంత పెద్ద మొత్తానికి హోమ్లోన్ తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే 2025లో అతని ఆదాయం రూ.32 లక్షలకు పెరిగింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.ఆ వ్యక్తి వేతన నిర్మాణం స్థిరంగా లేదు. అది పూర్తిగా కమీషన్లపై ఆధారపడి ఉంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల అతని వ్యాపారం ఒక్కసారిగా దెబ్బతింది. ఫలితంగా అతని నెలవారీ ఆదాయం గణనీయంగా పడిపోయింది.ప్రస్తుత పరిస్థితి‘ఇప్పుడు నా చేతికి వచ్చే జీతం కేవలం హోమ్ లోన్ ఈఎంఐ (ఈఎంఐ), ప్రాథమిక ఖర్చులకు మాత్రమే సరిపోతోంది. నిలదొక్కుకోవడానికి పార్ట్ టైమ్ జాబ్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసి ఉంటే బాగుండేది’ అని ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.ఊహించని ఖర్చులురుణ భారం ఒకవైపు వేధిస్తుంటే ఆస్తి కొనుగోలు తర్వాత వచ్చే అదనపు ఖర్చులు అతనిని కోలుకోలేని దెబ్బ తీశాయి. అపార్ట్మెంట్ సొసైటీ మెయింటెనెన్స్, ఇతర రిపేర్ల కోసం ఏకంగా రూ.2.5 లక్షలు ఖర్చయింది. ఇంట్లో తలెత్తిన ప్లంబింగ్ లోపాల వల్ల మరో రూ.50,000 అదనపు భారం పడింది. ఇవన్నీ భరిస్తూ రావడం వల్ల అతని వద్ద ఉన్న లిక్విడ్ ఎమర్జెన్సీ ఫండ్ రూ.5 లక్షలకు పడిపోయింది.మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ రూపంలో మరో రూ.10 లక్షల పెట్టుబడులు ఉన్నప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితి వస్తే తప్ప వాటిని విక్రయించడానికి అతను ఇష్టపడటం లేదు. ఫ్లాట్ కొన్న వెంటనే దాన్ని రీసేల్ చేయడం కష్టమని, ఈ ఊబి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదంటూ తోటి నెటిజన్లను సలహా కోరాడు.నెటిజన్ల రియాక్షన్‘జరిగిందేదో జరిగింది. ఒకవేళ మీ వ్యాపారం బాగా నడిచి ఉంటే మీరు ఇలా ఆలోచించేవారు కాదు. ఇది కూడా గడిచిపోతుంది. ధైర్యంగా ఉండండి’ అని ఒకరు భరోసా ఇచ్చారు. ‘నష్టాన్ని తగ్గించుకోవాలంటే వెంటనే ఆస్తిని విక్రయించండి. రీసేల్ మార్కెట్లో అపార్ట్మెంట్ అమ్మడం కష్టమే. బ్రేక్-ఈవెన్ (పెట్టిన పెట్టుబడి వస్తే చాలు) స్థాయికి వచ్చినా సరే నష్టాన్ని భరించి ఆస్తిని వదిలించుకుని అప్పు తీర్చండి’ అని మెజారిటీ నెటిజన్లు సలహా ఇచ్చారు.గుర్తుంచుకోవాల్సిన అంశాలు..మీ నెలవారీ నికర ఆదాయంలో హోమ్ లోన్ ఈఎంఐ ఎప్పుడూ 15% నుంచి 20% మించకూడదు. (ఇక్కడ బాధితుడు తన గరిష్ట ఆదాయాన్ని బట్టి లోన్ తీసుకుని ఇరుక్కుపోయాడు.వేరియబుల్ లేదా కమీషన్ ఆధారిత ఆదాయం ఉన్నవారు స్థిరమైన ఉద్యోగుల కంటే తక్కువ అప్పు తీసుకోవడం శ్రేయస్కరం.ఇల్లు కొనడమంటే కేవలం రిజిస్ట్రేషన్ ఖర్చే కాదు.. మెయింటెనెన్స్, ఇంటీరియర్, రిపేర్లు వంటి అదనపు ఖర్చుల కోసం కనీసం 5% నిధిని ముందే దాచుకోవాలి.సొంతింటి కల సాకారం చేసుకోవడం తప్పు కాదు కానీ అది మీ ప్రస్తుత ఆర్థిక స్వేచ్ఛను, మనశ్శాంతిని హరించేలా ఉండకూడదు. -
విధానాల మార్పుతోనే గృహ సంక్షోభానికి విరుగుడు!
భారతదేశంలో సొంతిల్లు అనేది సగటు పౌరుడి జీవితకాల స్వప్నం. కానీ, ప్రస్తుత పట్టణ భారతదేశంలో (అర్బన్ ఇండియా) ఇళ్ల ధరలు సామాన్యుడికి, మధ్యతరగతికి అందనంత ఎత్తుకు చేరాయన్నది కాదనలేని చేదు నిజం. ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనాలు కాకుండా మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. అసలు సమస్య ఎక్కడుందంటే..మన ప్రస్తుత పట్టణ గృహ నిర్మాణ, భూవిధానాల్లోనే లోపాలు ఉన్నాయి. ఈ విధానాలను సమూలంగా మార్చితే తప్ప ఇళ్ల ధరలు అదుపులోకి రావు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి సరికొత్త ఆలోచనలతో కూడిన కొన్ని సూత్రాలను మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.మెట్రో నగరాల విస్తరణకు బ్రేక్..ప్రస్తుతం ఉన్న ప్రధాన మెట్రో నగరాలు ఇప్పటికే తమ సామర్థ్యానికి మించి విస్తరించాయి. సహేతుకమైన ఖర్చుతో వీటిని మరింత విస్తరించడం ఇక సాధ్యం కాదు. దీనికి పరిష్కారం..మనం సరికొత్త నగరాలను నిర్మించాలి లేదా ప్రస్తుతం ఉన్న చిన్న నగరాలను వ్యవస్థీకృతంగా విస్తరించాలి. అయితే ప్రభుత్వాలు ఒంటరిగా ఈ పని చేయలేవు. పేరున్న ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యేలా పబ్లిక్ పాలసీ ఉండాలి. ఈ విస్తరణ కేవలం ఇళ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా ఉద్యోగ, ఉపాధి, రవాణా రంగాల మేళవింపుతో సమగ్రంగా సాగాలి. అప్పుడే ప్రజలు దశలవారీగా ఆయా కొత్త ప్రాంతాలకు తరలివస్తారు. దీనివల్ల కొత్త పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా తగ్గి ఆకర్షణీయంగా మారుతాయి.మితిమీరిన ఆంక్షల తొలగింపుప్రస్తుతం ఉన్న పెద్ద నగరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై ఉన్న మితిమీరిన ఆంక్షలను దశలవారీగా ఎత్తివేయాలి. మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’ పెంచడానికి అనుమతించాలి. అంతేకాకుండా, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) వంటి నియంత్రణ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలి. దీనివల్ల మార్కెట్లోకి ఇళ్ల సరఫరా పెరుగుతుంది.ల్యాండ్ ప్రైస్ డైనమిక్స్పైన పేర్కొన్న విధంగా పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టినప్పుడు స్వల్పకాలంలో భూమి ధరలు పెరగొచ్చు. కానీ దీర్ఘకాలిక ఫలితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పట్టణ భారతదేశంలో ఇళ్ల సంఖ్య భారీగా పెరిగిన తర్వాత ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన ఇళ్ల ధరలు క్రమంగా తగ్గుతాయి. ఇళ్ల మార్కెట్ ధర తగ్గినప్పుడు దానికి అనుగుణంగా పట్టణ భూముల ధరలు కూడా దిగివస్తాయి.ఇన్వెస్టర్ల డిమాండ్ను నియంత్రించడం..ప్రభుత్వ విధానాల వల్ల ఇళ్ల ధరలు తగ్గడం ప్రారంభమైతే రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు తగ్గుతుంది. ఫలితంగా నిజమైన అవసరమున్న సగటు కొనుగోలుదారులకు ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికి కారణం..బ్యాంకు డిపాజిట్లపై వచ్చే ద్రవ్యోల్బణ, పన్నుల అనంతర ఆదాయం చాలా తక్కువగా ఉండటమే. ప్రభుత్వ రంగ బ్యాంకుల విధానాలు, పన్ను చట్టాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పన్ను చట్టాల్లో మార్పులు చేయడం ద్వారా ఈ రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను రియల్ ఎస్టేట్ నుంచి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక మార్గాల వైపు మళ్లించవచ్చు.బ్లాక్మనీకి అడ్డుకట్టరియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ల డిమాండ్కు మరో ప్రధాన కారణం..నల్లధనాన్ని ఇక్కడ దాచవచ్చనే నమ్మకం. ఈ నల్లధనాన్ని ఇక్కడ అనుమతించకపోతే అది బంగారం రూపంలోనో లేదా హవాలా మార్గంలో విదేశాలకో వెళ్లిపోతుందని, తద్వారా దేశ మూలధనం బయటకు పోతుందని కొందరు వాదిస్తారు. కానీ సమస్య నల్లధనాన్ని ఎక్కడో ఒకచోట సర్దడం కాదు. అసలు నల్లధనం పుట్టకుండా చేయడమే ముఖ్యం. బ్లాక్మనీ వ్యవస్థలోకి రాకుండా అడ్డుకుంటే రియల్ ఎస్టేట్ ధరలు ఆటోమేటిక్గా దిగివస్తాయి.క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ సడలింపు..రియల్ ఎస్టేట్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్థిక ఆస్తుల్లో పెట్టుబడి పెడితే దానికి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ను కొన్ని సంవత్సరాల పాటు తగ్గించాలి. దీనివల్ల ఇన్వెస్టర్లు తాము కొని ఖాళీగా ఉంచిన ప్రాపర్టీలను విక్రయించడానికి ముందుకొస్తారు. తద్వారా మార్కెట్లోకి ఇళ్ల సరఫరా పెరుగుతుంది. అయితే, ఈ పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆర్థిక లోటు పెరిగే ప్రమాదం ఉంది. దీనిని భర్తీ చేయడానికి ప్రభుత్వాల వద్ద అదనంగా ఉన్న మిగులు భూములను విక్రయించవచ్చు. ఇది ప్రభుత్వానికి నిధులు సమకూర్చడమే కాకుండా మార్కెట్లో భూమి లభ్యతను పెంచుతుంది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్కు రూ.38.63 లక్షల జరిమానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) రియల్ ఎస్టేట్ సంస్థ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.38.63 లక్షల జరిమానా విధించింది. రెరాలో నమోదు చేయని పలు ప్రాజెక్టులను ప్రకటనలు, ప్రచారం చేయడంతో పాటు, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా నమోదు కాకుండానే ఒక ప్రాజెక్టు విక్రయాలను నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకుంది.ఖమ్మం జిల్లాకు చెందిన రాము ఫిర్యాదు మేరకు టీజీ రెరా సుమోటో విచారణ ప్రారంభించింది. సంస్థ వెబ్సైట్, బ్రోచర్లను పరిశీలించిన అనంతరం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కొన్ని ప్రాజెక్టులకు రెరా నమోదు ఉందని, మరికొన్ని తమవి కావని, సంస్థ వివరణ ఇచ్చింది. రెరా సభ్యులు జన్ను లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం, ప్రాజెక్టు నమోదు లేకుండా విక్రయాలు చేపట్టడం నిషేధమని స్పష్టం చేసింది. చదవండి: జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ‘ఫిరాన్’ తయారీ కేంద్రం -
హైదరాబాద్..ఖరీదైన జీసీసీ మార్కెట్!!
దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) సంబంధించి అద్దెల విషయంలో హైదరాబాద్ అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్గా నిలుస్తోంది. ఐఐఎం బెంగళూరు, సీఆర్ఈ మ్యాట్రిక్స్ విడుదల చేసిన 2026 తొలి త్రైమాసిక నివేదిక ప్రకారం జీసీసీ–సీపీఆర్ఈ సూచీలో 212.1 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఇతర సంస్థలతో పోలిస్తే జీసీసీ కంపెనీలు 15 శాతం అధికంగా అద్దెలు చెల్లిస్తున్నాయి. ఈ విషయంలో పుణె, బెంగళూరు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిల్చాయి. 210.7 స్కోరు దక్కించుకున్న పుణెలో జీసీసీ కంపెనీలు, ఇతర సంస్థలతో పోలిస్తే సుమారు 21 శాతం అధికంగా చెల్లిస్తున్నాయి. ఇక దేశంలోనే అతి పెద్ద జీసీసీ ఆఫీస్ మార్కెట్గా తన స్థానాన్ని నిలుపుకొన్న బెంగళూరు స్కోరు 190గా ఉంది. జాతీయ స్కోరు 165 వద్ద స్థిరంగా కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. భారీ డీల్స్, సుదీర్ఘ కాలానికి లీజులు..భారతీయ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో జీసీసీల అద్దె పోకడలను అంచనా వేయడానికి ఇది ఉపయోగకరంగా ఉండగలదని సీఆర్ఈ మ్యాట్రిక్స్, ఇండెక్స్ట్యాప్ సీఈవో అభిషేక్ కిరణ్ గుప్తా తెలిపారు. గత కొన్నేళ్లుగా మిగతా కిరాయిదార్లతో పోలిస్తే జీసీసీల ధోరణి కాస్త భిన్నంగా ఉంటోందని వివరించారు. భారీ డీల్స్, సుదీర్ఘ కాలానికి లీజులతో మొత్తం మ్యాక్రో మార్కెట్లను శాసించేలా వాటి నిర్ణయాలు ఉంటున్నాయని తెలిపారు. రవాణా సౌకర్యాలుల బాగుండి, గ్రేడ్–ఏ ఆఫీస్ క్లస్టర్లు ఉన్న ప్రాంతాలకి ప్రాధాన్యత పెరుగుతోందని పేర్కొన్నారు.పశ్చిమ భారతదేశంలోని మైక్రోమార్కెట్లలో కూడా అద్దెలు గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదిక వివరించింది. నవీ ముంబైలో రెంటల్ వృద్ధి వార్షిక ప్రాతిపదికన గత మూడేళ్లలో 13.4 శాతంగా నమోదైంది. మెరుగైన రవాణా, గ్రేడ్–ఏ కార్యాలయాలు ఉన్న ముంబై సెంట్రల్ శివార్లలో, చెన్నై నగర ఉత్తర ప్రాంత శివార్లలో ఇది ఏకంగా 22 శాతంగా రికార్డయింది. దేశవ్యాప్తంగా 100 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్, 19,000 లీజు లావాదేవీల విశ్లేషణ ఆధారంగా ఈ సూచీని రూపొందించారు.ఇదీ చదవండి: లాకర్.. సేఫేనా? -
TG REAT సభ్యులుగా వేముల శ్రీకర్
తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (TG-REAT) సాంకేతిక, పరిపాలనా సభ్యుడిగా IRS మాజీ అధికారి వేముల శ్రీకర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం-2016 నిబంధనల మేరకు చేపట్టిన ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శనివారం జారీ చేసింది.1995 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన శ్రీకర్ సుమారు 26 ఏళ్లపాటు ఆదాయపు పన్ను శాఖలో వివిధ కీలక హోదాల్లో సేవలందించారు. ఇంజినీరింగ్ డిగ్రీ తర్వాత ఎంబీఏ, ఎంఏతో పాటు న్యాయశాస్త్రంలో (ఎల్ఎల్బీ) ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. ట్రిబ్యునల్ కార్యకలాపాల్లో చట్టపరమైన అంశాలకు అధిక ప్రాధాన్యం ఉండటంతో ఆయన న్యాయ విద్య, అప్పిలేట్ వ్యవహారాల్లోని అనుభవం ఉపయోగపడనుంది.పన్ను ఎగవేత కేసుల దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన శ్రీకర్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆదాయ సమీకరణ, దర్యాప్తు రంగాల్లో విశిష్ట సేవలకు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నుంచి రెండు ప్రత్యేక పురస్కారాలు అందుకున్నారు. ఆయన పర్యవేక్షించిన కీలక దర్యాప్తు కేసులు ఆదాయపు పన్ను శాఖ ప్రచురించిన ‘లెట్ అస్ షేర్’ ఉత్తమ విధానాల సంకలనంలో చోటు దక్కించుకున్నాయి.హైదరాబాద్లోని ఇన్కమ్ట్యాక్స్ టవర్స్ నిర్మాణం, బంజారాహిల్స్లో ఆదాయపు పన్ను శాఖ నివాస సముదాయాల అభివృద్ధి, తిరుపతిలో అతిథి గృహం ఏర్పాటు, నాగ్పూర్లో సిబ్బంది నివాస గృహాల నిర్మాణం వంటి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. శాఖ ఆధునీకరణ, డిజిటల్ వ్యవస్థల అమలు, కంప్యూటరీకరణ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.ముంబయిలో ఆదాయపు పన్ను కమిషనర్గా పనిచేసిన ఆయన 2021లో పదవీ విరమణ పొందారు. అనంతరం సామాజిక సేవ, సాహిత్య రంగాల్లో చురుగ్గా కొనసాగుతున్నారు. తెలంగాణ భాష, సంస్కృతి పరిరక్షణకు దశాబ్దాలుగా కృషి చేసిన ప్రముఖ సాహితీవేత్త వేముల పెరుమాళ్ల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆయన రచించిన ప్రసిద్ధ గ్రంథం ‘తెలంగాణ జాతీయాలు’ ప్రచురణలో శ్రీకర్ విశేష సహకారం అందించారు. -
బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులు
టెక్నాలజీ హబ్గా పేరొందిన బెంగళూరులో ఓ ఐటీ దంపతులు నిర్మించుకున్న ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విశేష ఆకర్షణగా మారింది. అత్యాధునిక జీవనశైలికి అలవాటు పడిన ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దంపతులు, తమ పూర్వీకుల జ్ఞాపకాలను ఆధునిక అవసరాలతో మేళవిస్తూ నిర్మించిన ఈ నివాసం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంటికి సంబంధించిన వీడియోను డిజైన్ సంస్థ ఆర్చ్ప్రో (ArchPro) ఇటీవల ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.అందులోని వివరాల ప్రకారం.. వేగవంతమైన కార్పొరేట్ జీవితానికి పూర్తి భిన్నంగా ప్రశాంతమైన, సంప్రదాయ విలువలతో కూడిన వాతావరణంలో జీవించాలని ఈ దంపతులు కోరుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే ఎక్కువసేపు పనిచేస్తున్న (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ప్రశాంతతను కలిగించేలా, పాతకాలపు దక్షిణ భారత గృహ నిర్మాణ శైలిని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే ఈ ఇంటి రూపకల్పనకు ప్రధాన ఆలోచనగా నిలిచిందని డిజైనర్లు తెలిపారు.సుమారు 4,382 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు 2025లో పూర్తైంది. ఇంటి ప్రధాన ఆకర్షణ మధ్యలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ ప్రాంగణం (కోర్ట్యార్డ్). అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మాత్రం 130 ఏళ్ల నాటి చెక్క స్తంభాలు. ఈ స్తంభాలను దంపతుల పూర్వీకుల ఇంటి నుంచి జాగ్రత్తగా భద్రపరచి కొత్త ఇంటిలో వినియోగించారు. కొత్త మంగళూరు టైల్స్ పైకప్పునకు సరిపోయేలా ఈ పురాతన స్తంభాలను అమర్చడం డిజైన్ బృందానికి సవాలుగా మారినప్పటికీ, వాటి అసలు రూపానికి ఎలాంటి నష్టం కలగకుండా పనులు పూర్తి చేశారు.ఇంటి నిర్మాణంలో సహజమైన వస్తువుల వాడకానికి పెద్దపీట వేశారు. ఇటుకలు బయటకు కనిపించేలా గోడలు, మట్టి రంగు ఫ్లోరింగ్, చెక్కతో చేసిన తలుపులు, పెద్ద కిటికీలు, ఎత్తైన పైకప్పులు, సంప్రదాయ ఉయ్యాల వంటి అంశాలు ఇంటికి ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. మధ్యలోని ప్రాంగణం ద్వారా సహజ కాంతి, గాలి సమృద్ధిగా ప్రవేశించేలా రూపకల్పన చేయడంతో ఇల్లంతా ప్రశాంత వాతావరణం పరచుకుంటుంది. బయట ప్రకృతి, లోపలి జీవనశైలి మధ్య సహజ అనుసంధానం కల్పించేలా వరండా, ప్రవేశ ద్వారాన్ని రూపొందించారు.బెంగళూరు వంటి నగరాల్లో ఇటీవలి కాలంలో సంప్రదాయ శైలిని ఆధునిక నిర్మాణంతో కలిపే "హెరిటేజ్-ఇన్స్పైర్డ్ హోమ్స్"పై ఆసక్తి పెరుగుతోంది. పాతకాలపు నిర్మాణ సామగ్రిని తిరిగి వినియోగించడం, సహజ కాంతి, గాలి, పర్యావరణహిత పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి ధోరణులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ఇంటి రూపకల్పన కూడా అలాంటి మారుతున్న నిర్మాణ ధోరణులకు ప్రతీకగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by ArchPro (@archpro.live) -
హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ జోరు..
దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ మరోసారి తన బలాన్ని చాటుకుంది. 2026 రెండో త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో నగరంలో గృహ విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు రెండూ గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కొత్త ఇళ్ల సరఫరాలో హైదరాబాద్ దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా నిలవడం విశేషం. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ఈక్విటీ (PropEquity) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో మొత్తం గృహ విక్రయాలు ఏడాది క్రితంతో పోలిస్తే 19 శాతం పెరిగి 1,12,458 యూనిట్లకు చేరగా, కొత్త గృహాల ప్రారంభాలు 43 శాతం పెరిగి 1,17,609 యూనిట్లకు చేరాయి. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత గృహ మార్కెట్పై వాటి ప్రభావం పెద్దగా కనిపించలేదని నివేదిక పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన కూడా విక్రయాలు 14 శాతం, కొత్త సరఫరా 27 శాతం పెరిగాయి.హైదరాబాద్లో ఈ త్రైమాసికంలో 14,410 ఇళ్లు విక్రయం కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 22 శాతం అధికం. మరోవైపు 18,407 కొత్త గృహ యూనిట్లు మార్కెట్లోకి రావడం ద్వారా సరఫరా 75 శాతం పెరిగింది. ఈ పెరుగుదలతో పుణె, థానే, ఢిల్లీ-ఎన్సీఆర్లను వెనక్కి నెట్టి, బెంగళూరు తర్వాత దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్ సప్లై మార్కెట్గా హైదరాబాద్ అవతరించింది.దక్షిణ భారత నగరాలే ఈసారి మార్కెట్కు ప్రధాన చోదకశక్తిగా నిలిచాయి. బెంగళూరులో విక్రయాలు 47 శాతం పెరిగి 21,516 యూనిట్లకు చేరి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. చెన్నైలో కూడా 18 శాతం వృద్ధి నమోదైంది. పశ్చిమ భారత నగరాల్లో నవీ ముంబై, ముంబై బలమైన వృద్ధిని నమోదు చేయగా, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కతాల్లో మాత్రం విక్రయాలు తగ్గాయి.రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైదరాబాద్లో ఐటీ, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (GCCs) విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, కోకాపేట్–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్–నర్సింగి వంటి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ప్రారంభం గృహ డిమాండ్ను బలోపేతం చేస్తున్నాయి. ఇదే సమయంలో నాణ్యమైన ప్రాజెక్టులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు డెవలపర్లు కూడా వేగం పెంచుతున్నారు. -
ఒక్క ఫ్లాట్ రూ .121 కోట్లు.. రికార్డ్ ‘రియల్’ డీల్!
భారత లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో కళ్లు చెదిరే ఖరీదైన డీల్ నమోదైంది. ప్రముఖ ఇన్వెస్టర్ మధుసూదన్ మురళీధర్ కేలా.. డీఎల్ఎఫ్ అత్యంత విలాసవంతమైన నివాస ప్రాజెక్ట్ ‘ది దహ్లియాస్’లో ఒక అపార్ట్మెంట్ను రూ.120.71 కోట్లకు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డేటా సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ పరిశీలించిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ ఒప్పందం ఏప్రిల్ 15, 2026న నమోదైంది. అపార్ట్మెంట్ విస్తీర్ణం 6,233 చదరపు అడుగులు కాగా, ఐదు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.హర్యానాలోని గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్లో ఉన్న సెక్టార్–54 ప్రాంతం దేశంలోనే అత్యంత ప్రీమియం నివాస కేంద్రాల్లో ఒకటిగా ఎదుగుతోంది. డీఎల్ఎఫ్ సిటీ ఫేజ్–5లో అభివృద్ధి చేస్తున్న ‘ది దహ్లియాస్’ ప్రాజెక్ట్ ఇప్పటికే దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, అధిక సంపన్నుల దృష్టిని ఆకర్షిస్తోంది. చదరపు అడుగుకు దాదాపు రూ.1.9 లక్షలకుపైగా విలువతో జరిగిన ఈ డీల్ గురుగ్రామ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త రికార్డుగా నిలిచింది.స్టాక్ మార్కెట్లో కింగ్.. కేలాస్టాక్ మార్కెట్లో ప్రముఖ ఇన్వెస్టర్గా పేరుగాంచిన కేలా (Madhusudan Kela) , ప్రస్తుతం పలు లిస్టెడ్ కంపెనీల్లో గణనీయమైన వాటాలు కలిగి ఉన్నారు. తాజా షేర్హోల్డింగ్ వివరాల ప్రకారం, ఆయన పెట్టుబడుల మార్కెట్ విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ఆయన లగ్జరీ రియల్ ఎస్టేట్లో చేసిన భారీ పెట్టుబడి, సంపన్న వర్గాలు నివాస ఆస్తులను కేవలం విలాసానికి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనంగా కూడా చూస్తున్నాయనే ధోరణిని మరోసారి స్పష్టం చేసింది.డీఎల్ఎఫ్ 2024 అక్టోబర్లో ప్రారంభించిన 17 ఎకరాల ‘ది దహ్లియాస్’ ప్రాజెక్ట్లో మొత్తం 420 అపార్ట్మెంట్లు, పెంట్హౌస్లు ఉన్నాయి. కంపెనీ తాజా వివరాల ప్రకారం, ఇప్పటివరకు ప్రాజెక్ట్లో దాదాపు 60 శాతం యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.18,500 కోట్లకుపైగా అమ్మకాలు నమోదయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్ ఆదాయ సామర్థ్యం రూ.40,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.విస్తరిస్తున్న అల్ట్రా-లగ్జరీ హౌసింగ్భారత్లో అల్ట్రా-లగ్జరీ హౌసింగ్ విభాగం గత రెండేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రూ.10 కోట్లకు పైబడిన గృహాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. పరిమిత సరఫరా, ప్రీమియం లొకేషన్లు, అధిక సంపన్నుల పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇటువంటి ప్రాజెక్ట్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మధుసూదన్ కేలా తాజా కొనుగోలు కూడా అదే ధోరణికి నిదర్శనంగా నిలిచింది. -
జెనరేటివ్ ఏఐతో రియల్ ఎస్టేట్కి మహర్దశ
న్యూఢిల్లీ: జెనరేటివ్ ఏఐతో భారత రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ సాంకేతికత రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని, తద్వారా రాబోయే ఏడేళ్లలో 14 నుంచి 17 బిలియన్ డాలర్ల వరకు (రూ. 1.33–1.61 లక్షల కోట్ల) అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఈవై పార్థెనాన్, క్రెడాయ్ సంయుక్త నివేదిక అంచనా వేసింది. జెనరేటివ్ ఏఐతో నిర్మాణ రంగం పనితీరు మెరుగుపడటమే కాకుండా, అమ్మకాల వేగం 30 – 50 శాతం వరకు పెరుగుతుందని స్పష్టం చేసింది.నివేదికలోని ముఖ్యాంశాలు..జెనరేటివ్ ఏఐ వినియోగంతో ఇళ్ల అమ్మకాల వేగం పెరగడమే కాకుండా, కొత్త ప్రాజెక్టులను మార్కెట్లోకి ప్రవేశపెట్టే సమయం 30 శాతం వరకు తగ్గుతుంది.వచ్చే ఏడేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం నమోదు చేసే మొత్తం స్థూల విలువ జోడింపులో జెనరేటివ్ ఏఐ రూపంలో 3–4 శాతంగా ఉంటుంది. భూమి కొనుగోలు నుంచి ప్రాజెక్ట్ ప్రారంభించే మధ్య కాలవ్యవధి 20–30 శాతం వరకు తగ్గుతుంది. అలాగే నిర్మాణ వ్యయం, కాలపరిమితిలోనూ 5 నుంచి 20 శాతం వరకు ఆదా అవుతుంది.ప్రస్తుత డేటా ఆధారంగా కొత్త ఐడియాలు, డిజైన్ల సృష్టిలో సాయపడుతుంది. రంగం ముఖచిత్రానే మార్చేస్తుంది..రియల్ ఎస్టేట్ రంగంలో తదుపరి వృద్ధి కేవలం వ్యాపార విస్తరణ పైనే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సరైన నిర్ణయాలను వేగంగా తీసుకోవడం పైనే ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక విడుదల సందర్భంగా క్రెడాయ్ అధ్యక్షుడు శేఖర్ జి పటేల్ చెప్పారు. ‘‘నిర్వహణ సామర్థ్యంతోపాటు ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, విక్రయాలు, కస్టమర్లతో సంబంధాలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్పందించంలోనూ జెనరేటివ్ ఏఐ కీలక పాత్ర పోషించనుంది’’అని వివరించారు. -
రూ .1,260 కోట్లకు బంగ్లాను అమ్మేసిన మీడియా అధినేత
మీడియా రంగ దిగ్గజం, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఢిల్లీలోని ప్రతిష్టాత్మక లుటియన్స్ బంగ్లా జోన్ (LBZ)లో ఉన్న తన విలాసవంతమైన బంగ్లాను రూ.1,260 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ లావాదేవీ ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అత్యంత విలువైన నివాస ఆస్తి ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది.భగవాన్ దాస్ రోడ్లో కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ సమీపంలో ఉన్న దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆస్తిని ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ వ్యాపార కుటుంబం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కొనుగోలుదారుడి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. డీల్కు సంబంధించిన తుది ప్రక్రియలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుభాష్ చంద్ర ఈ బంగ్లాను 2015లో సుమారు రూ.304 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు రూ.1,260 కోట్లకు విక్రయించడం ద్వారా దాదాపు పదేళ్లలో ఆస్తి విలువ నాలుగు రెట్లకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.లుటియన్స్ ఢిల్లీ దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నివాస ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ రూపకల్పన చేసిన ఈ ప్రాంతంలో సుమారు 3,000 బంగ్లాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, విదేశీ దౌత్యవేత్తలు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు నివసించే ఈ ప్రాంతంలో భూమి లభ్యత చాలా పరిమితంగా ఉండటంతో ఆస్తుల ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.కోవిడ్ అనంతరం ఢిల్లీ లుటియన్స్ జోన్లో, గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్ పరిసరాల్లో భారీ విలువ కలిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందాలు పెరిగాయి. ఇటీవలే భగవాన్ దాస్ రోడ్లోని మరో 3.2 ఎకరాల రాజభవనం సుమారు రూ.1,000 కోట్లకు విక్రయమయ్యే దశకు చేరడం, అలాగే లుటియన్స్ ప్రాంతంలోని ఇతర చారిత్రక బంగ్లాలు కూడా వెయ్యి కోట్లకు పైగా ధరలు పలకడం ఈ మార్కెట్లో డిమాండ్ ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. -
TRAI కొత్త డిజిటల్ కనెక్టివిటీ సిస్టం.. ఇక భవనాలకూ రేటింగ్!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI-ట్రాయ్).. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం, ప్రభుత్వం, టెలికాం పరిశ్రమ నుంచి కీలక భాగస్వాములను ఒకచోట చేర్చి, విజయవాడలో ''డిజిటల్ కనెక్టివిటీ కోసం భవనాల రేటింగ్''పై ఒక వర్క్షాప్ను నిర్వహించింది.నివాస, వాణిజ్య, ప్రజా ప్రదేశాలలో భవనాలలో డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఒక ప్రధాన చొరవ అయిన ట్రాయ్ యొక్క ''డిజిటల్ కనెక్టివిటీ కోసం ఆస్తుల రేటింగ్ నిబంధనలు, 2024'' గురించి అవగాహన కల్పించడం ఈ వర్క్షాప్ లక్ష్యం.ఈ కార్యక్రమాన్ని ట్రాయ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ ఐటీఎస్ బి. ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఆయన పటిష్టమైన డిజిటల్ మౌలిక సదుపాయాల యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ట్రాయ్ క్యూఓఎస్ సలహాదారు ఐటీఎస్ తేజ్పాల్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఈ&సీ శాఖ జాయింట్ డైరెక్టర్ ధవుర్యాన్ నాయక్ సభను ఉద్దేశించి ప్రసంగించి, భాగస్వాముల మధ్య సహకార ప్రయత్నాల ఆవశ్యకతను నొక్కి చెప్పారు.ట్రాయ్ ఆర్ఓ హైదరాబాద్ సలహాదారు బి. ప్రవీణ్ కుమార్, డిజిటల్ కనెక్టివిటీ ఒక ప్రాథమిక అవసరంగా మారిందని నొక్కిచెప్పారు. అలాగే, డేటా వినియోగంలో గణనీయమైన భాగం భవనాల లోపలే జరుగుతుందని, అందువల్ల పటిష్టమైన ఇన్-బిల్డింగ్ పరిష్కారాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.భవనాల డిజిటల్ కనెక్టివిటీ సంసిద్ధత ఆధారంగా వాటికి స్టార్ రేటింగ్ వ్యవస్థను (1–5 స్టార్లు) ప్రవేశపెడుతున్న ట్రాయ్ కొత్త ఫ్రేమ్వర్క్ను ఈ వర్క్షాప్ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ చొరవ, వినియోగదారుల అనుభవాన్ని, మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడానికి ప్రాపర్టీ డెవలపర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, మౌలిక సదుపాయాల ప్రొవైడర్ల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహిస్తుంది.డిజిటల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన నియంత్రణ నిబంధనలు, అమలు వ్యూహాలు, ప్రణాళికా అంశాలపై సాంకేతిక సమావేశాలు జరిగాయి. వీటితో పాటు ట్రాయ్, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ నిపుణుల ప్రతినిధులతో ఒక ప్యానెల్ చర్చ కూడా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. డిజిటల్ కనెక్టివిటీ ఇప్పుడు ఒక కీలకమైన వినియోగ సేవ అని, భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో.. డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ వంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో ఈ కొత్త రేటింగ్ ఫ్రేమ్వర్క్ కీలక పాత్ర పోషిస్తుందని ట్రాయ్ పునరుద్ఘాటించింది. -
చేతులు కలిపిన హెచ్డీఎఫ్సీ క్యాపిటల్, జపాన్ బ్యాంకు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మధ్యాదాయ, అందుబాటు ధరల గృహ సముదాయ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసేందుకు తాజాగా హెచ్డీఎఫ్సీ క్యాపిటల్తో డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ జపాన్(డీబీజే) చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా రియల్టీ ఫండ్ను ఏర్పాటు చేయనున్నాయి. మొత్తం బిలియన్ డాలర్ల(సుమారు రూ. 9,500 కోట్లు) మూలధన లక్ష్యంతో ఫండ్కు తెరతీయనున్నాయి.దీంతో డీబీజే తొలిసారి దేశీయంగా రియల్టీ రంగంలో పెట్టుబడులు చేపట్టనున్నట్లు హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ పేర్కొంది. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ డెవలప్మెంట్ రియల్టీ చౌక, మధ్యాదాయ(హెచ్–డీఆర్ఈఏఎం(డ్రీమ్) ఫండ్ పేరుతో ఏర్పాటు చేయనున్న నిధిని హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వయిజర్స్ నిర్వహించనున్నట్లు తెలియజేసింది.50 కోట్ల డాలర్ల కార్పస్ లక్ష్యానికి మరో 50 కోట్ల డాలర్లు గ్రీన్షూ ఆప్షన్తో ఫండ్ను నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. 35 కోట్ల డాలర్లమేర పెట్టుబడులకు ప్రస్తుత ఇన్వెస్టర్లు కట్టుబాటు చూపనున్నట్లు వివరించింది. హెచ్డ్రీమ్ ఫండ్ హెచ్డీఎఫ్సీ క్యాపిటల్లో యాంకర్ ఇన్వెస్టర్గా ఐఎఫ్సీ 15 కోట్ల డాలర్ల పెట్టుబడులకు గతేడాది ఆగస్ట్లో కట్టుబాటును ప్రదర్శించినట్లు ప్రస్తావించింది. -
ఎల్ఐసీ ఇక రియల్టీపై ఫోకస్
న్యూఢిల్లీ: రియల్టీ ఆస్తుల నుంచి మెరుగైన రిటర్నులను సాధించాలని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ చూస్తోంది. ఇందుకుగాను విడిగా అనుబంధ సంస్థ ఏర్పాటు అవకాశాలను అన్వేషిస్తోంది. భారీగా ఉన్న ఆస్తులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా తాజా ప్రణాళికలకు తెరతీయనుంది. కంపెనీ ఆస్తుల కనీస విలువ రూ. 60,000 కోట్లుగా అంచనా వేసింది.కార్యకలాపాల నిర్వహణలో భాగంగా గత 7 దశాబ్దాలుగా రియల్టీ ఆస్తులను సమకూర్చుకుంటున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి పేర్కొన్నారు. వెల్లడించారు. సొంత వినియోగంతోపాటు రిటర్నులకు వీలున్న పెట్టుబడి వ్యూహాలతోనూ ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల కంపెనీ మొత్తం రియల్టీ పోర్ట్ఫోలియోపై పూర్తిస్థాయిలో సమీక్ష చేపట్టినట్లు తెలియజేశారు.తద్వారా కంపెనీకి లభిస్తున్న రిటర్నులు, ఆర్జన(ఈల్డ్స్)ను సమీక్షించడంతోపాటు.. మరింత మెరుగైన రిటర్నులకున్న అవకాశాలను అన్వేషించనున్నట్లు వివరించారు. అటు పాలసీదారుల రిటర్నులను పెంచడంతోపాటు.. ఇటు సంస్థ లాభదాయకతను మెరుగుపరిచే లక్ష్యం పూర్తిస్థాయిలో విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఈఎస్సీఐతో నరెడ్కో తెలంగాణ ఒప్పందం
హైదరాబాద్: రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు కలిగిన నిపుణులను తయారుచేసేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ కీలక అడుగు వేసింది. దేశంలోనే ప్రముఖ శిక్షణ సంస్థ అయిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI)తో నరెడ్కో తెలంగాణ బుధవారం ఒక అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి అర్బన్ హబ్గా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణ రంగంలో నిపుణులైన శ్రామిక శక్తిని (టాలెంట్ పూల్) అభివృద్ధి చేయడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందంపై నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కొప్పుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ రాబోయే దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో సరికొత్త వృద్ధిని సాధించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎస్సీఐ భాగస్వామ్యంతో సాంకేతికంగానే కాకుండా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో అంతర్జాతీయ ప్రమాణాలు తెలిసిన తరం నిర్మిస్తామన్నారు. ఈ చొరవ నగర నిర్మాణ రంగంలో స్థిరమైన నాణ్యతను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంలో తమకున్న అనుభవంతో, రియల్ ఎస్టేట్ రంగానికి సరిపోయే ప్రత్యేక కోర్సులను డిజైన్ చేసి అందిస్తామని ఈఎస్సీఐ ప్రతినిధి డాక్టర్ జి. రామేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా నిర్మాణ రంగంలోని వివిధ స్థాయిల నిపుణుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సర్టిఫికేషన్ కోర్సులు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతలు, పర్యావరణ అనుకూల పద్ధతులు, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలపై ఈ శిక్షణ కేంద్రీకృతమవుతుంది. -
అమ్మో లక్ష! బెంగళూరు ఇంటి అద్దె వైరల్
బెంగళూరు ఐటీ కారిడార్లో ఇండ్ల అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి ఉద్యోగుల మాట దేవుడెరుగు... నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే టెక్కీలు సైతం ఇక్కడి అద్దెలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నగరంలో ఓ 3బీహెచ్కే (3BHK) ఫ్లాట్కు సంబంధించిన అద్దె వివరాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో, నగరంలో నివాస వ్యయంపై మరోసారి తీవ్ర చర్చ నడుస్తోంది.రూ. 1.1 లక్షల అద్దె.. 4 లక్షల డిపాజిట్!నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ ‘ఎంబసీ గోల్ఫ్ లింక్స్ బిజినెస్ పార్క్’కు అత్యంత సమీపంలో, డోమ్లూర్ - ఇందిరానగర్ పరిసరాల్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ అద్దెకు ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. సుమారు 1,800 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ సెమీ-ఫర్నిష్డ్ కార్నర్ ఫ్లాట్ నెలవారీ అద్దె అక్షరాలా రూ. 1.1 లక్షలు. ఇది చాలదన్నట్టు దీనికి రూ. 4 లక్షల సెక్యూరిటీ డిపాజిట్తో పాటు, ప్రతి నెలా అదనంగా రూ. 6,000 మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ టెర్రస్, పూజా గది, మాడ్యులర్ కిచెన్, ఉచిత స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్టు వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఈ ఫ్లాట్లో ఉన్నాయట.వామ్మో అంటున్న నెటిజన్లుఈ అద్దె వివరాల స్క్రీన్షాట్లు నెట్టింట వైరల్ కావడంతో ఐటీ ఉద్యోగులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "బెంగళూరులో ఒక 3 BHK ఫ్లాట్ అద్దె రూ. 1.1 లక్షలా? నిజానికి ఇది ఒక సగటు ఉద్యోగి నెలవారీ జీతం" అంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసులకు దగ్గరగా ఉండాలంటే జీతాన్నంతా అద్దెలకే తగలేయాలి, లేదా ట్రాఫిక్లో గంటల తరబడి నరకం చూడాలి.. ఐటీ నిపుణుల పరిస్థితి ‘ముందు నయ్యం.. వెనుక గొయ్యి’లా తయారైందని పలువురు వాపోతున్నారు.ఇటువంటి పిచ్చి అద్దెలను డిమాండ్ చేసినా చెల్లించేందుకు కొందరు సిద్ధపడటం వల్లే యజమానులు మరింతగా రెచ్చిపోతున్నారని, ఒకే ఫ్లాట్ను నలుగురైదుగురు కలిసి పంచుకోవడం వల్లే ఈ ధరలు అదుపు తప్పాయనే విమర్శలు వస్తున్నాయి.అయితే, ఈ స్థాయి అద్దె ధరలు మార్కెట్ పరంగా సమర్థనీయమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. దక్షిణ ముంబై లాంటి అత్యంత సంపన్న ప్రాంతాలతో పోల్చదగ్గ ఇందిరానగర్ వంటి లొకేషన్లలో ఈ మాత్రం రేట్లు ఉండటం సహజమేనని వాదిస్తున్నారు. ఇక్కడ నివసించే వారి వార్షిక ఆదాయాలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల పైమాటేనని గుర్తు చేస్తున్నారు.మరోవైపు రియల్ ఎస్టేట్ సమీకరణాలను తెరపైకి తెస్తూ.. "ప్రస్తుతం ఈ ఫ్లాట్ మార్కెట్ విలువ రూ. 3 కోట్లకు పైనే ఉంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే అద్దె, కనీసం బ్యాంక్ వడ్డీ రేటులో సగం కూడా ఉండదు. అలాంటప్పుడు యజమానులు అద్దెలు పెంచడంలో తప్పు లేదు" అని ఇన్వెస్టర్ల కోణాన్ని కొందరు విశ్లేషించారు.మొత్తానికి బెంగళూరుతో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో గృహాల కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఐటీ కారిడార్లలో అద్దెలు సామాన్యుల నియంత్రణ తప్పుతున్నాయనడానికి ఈ తాజా ఘటనే నిదర్శనం.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త పద్ధతి! -
ఆలియా ఉన్న హోటల్.. ఒక్కరోజుకు రూ.8.6 లక్షలా?!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సినిమా కార్యక్రమాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఫ్రాన్స్లోని అందమైన సముద్రతీర నగరం కేన్స్లో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు, దర్శకులు, ఫ్యాషన్ ప్రముఖులు రెడ్ కార్పెట్పై మెరిసిపోతారు. ఈ ఏడాది భారతీయ నటి అలియా భట్ ధరించిన సాఫ్ట్ బ్లష్ గౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.ఈ ఫెస్టివల్కు హాజరయ్యే ప్రముఖులు ఎక్కువగా దిగే హోటళ్లలో 'హోటల్ మార్టినెజ్' ఒకటి. ఇది కేవలం ఒక విలాసవంతమైన హోటల్ మాత్రమే కాదు, సినీ ప్రముఖుల అభిమాన కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. గతంలో దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్ బచ్చన్, బెల్లా హడిడ్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ హోటల్లో బస చేశారు.1929లో ప్రారంభమైన ఈ హోటల్.. అద్భుతమైన ఆర్ట్ డెకో శైలిలో ఉంది. దీని నిర్మాణం కేవలం 14 నెలల్లో పూర్తయింది. ఈ హోటల్లోని బాల్కనీల నుంచి సముద్రం కనిపిస్తుంది. ఈ కారణంగానే చాలామంది సినీ ప్రముఖులు ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు.2013లో ఈ హోటల్ను హయత్ కొనుగోలు చేసింది. ఆ తరువాత దీనిని 'ది అన్బౌండ్ కలెక్షన్ బై హయత్'లో విలీనం చేసింది. ఈ హోటల్ ఆతిథ్యానికి, సౌకర్యానికి, విలాసానికి ప్రతీకగా నిలిచింది.బౌలేవార్డ్ డి లా క్రోయిసెట్ అనే వీధిలో ఈ హోటల్ ఉంది. ఇక్కడ నుంచి పలైస్ డెస్ ఫెస్టివల్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన వేదికకు కొన్ని నిమిషాల దూరమే ఉంటుంది. అందువల్ల ఫెస్టివల్ సమయంలో ఇక్కడ భారీ రద్దీ కనిపిస్తుంది. హోటల్లోని గదులు సాధారణ డీలక్స్ రూమ్స్ నుంచి సముద్ర వీక్షణం కలిగిన విలాసవంతమైన సూట్స్ వరకు ఉంటాయి. ఫెస్టివల్ సమయంలో ధరలు మరింత పెరుగుతాయి. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి గరిష్టంగా రూ.8.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. కార్పొరేట్ సమావేశాలు, పెళ్లిళ్లు, కుటుంబ విహార యాత్రల కోసం కూడా ఈ హోటల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు శతాబ్దకాల చరిత్ర కలిగిన హోటల్ మార్టినెజ్.. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా విలాసానికి, ఫ్యాషన్కు, సినీ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.ఇదీ చదవండి: పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే! -
కోకాపేటలో కళ్లు చెదిరే భవనం.. సౌత్ఇండియాకే ‘టాప్’
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ కోకాపేట ఐటీ కారిడార్లో ‘ది స్కైవెన్’ (The Skyven) పేరిట సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘ఈ-ఇన్ఫ్రా’ మరియు ‘పింగ్లే వెంచర్స్ & రియాల్టీ’ (PVR) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్కైస్క్రాపర్ 63 అంతస్తులు, 755 అడుగులు అంటే దాదాపు పావు కిలోమీటరు (233 మీటర్లు) ఎత్తుతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా రికార్డు సృష్టించనుంది. కేవలం ఎత్తులోనే కాకుండా, నిర్మాణంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను పొందుపరిచిన దక్షిణ భారత దేశపు మొట్టమొదటి ‘AI-రెడీ’ స్మార్ట్ బిల్డింగ్ కూడా ఇదే కావడం విశేషం.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పెంట్హౌస్లు, ఆకాశంలో విల్లా అనుభూతినిచ్చే ‘స్కై విల్లాస్’, లగ్జరీ 4BHK నివాసాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక్కడ సాధారణ ప్రాజెక్టుల లాగా కాకుండా, నివాసాల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల ప్రతి నివాసికి లభించే లగ్జరీ సదుపాయాల వాటా (Amenity-to-Resident Ratio) చాలా ఎక్కువగా ఉంటుంది. భవన నిర్వహణ, విద్యుత్ ఆప్టిమైజేషన్, అత్యాధునిక 24x7 భద్రతా వ్యవస్థలను ఇక్కడి AI నెట్వర్క్ స్వయంచాలకంగా నియంత్రిస్తుంది.భవనం పైభాగంలో ఏర్పాటు చేస్తున్న ‘ది ఎవరెస్ట్’ రూఫ్టాప్ క్లబ్ ఈ ప్రాజెక్ట్కే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో నగర స్కైలైన్తో కలిసిపోయే ‘ఇన్ఫినిటీ పూల్’తో పాటు, హైదరాబాద్ నివాస మార్కెట్లోనే తొలిసారిగా నక్షత్రాలను వీక్షించేందుకు ‘స్టార్ అబ్జర్వేటరీ’, లగ్జరీ క్లబ్హౌస్, స్పా, మరియు హెలిప్యాడ్ వంటి ఐదు నక్షత్రాల వసతులను కల్పిస్తున్నారు. స్థిరమైన మార్కెట్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ గ్లోబల్ ప్రొఫెషనల్స్ను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గగన విహారి రూపుదిద్దుకుంటోంది. -
ఇల్లు కొనలేమేమో!! కొనుగోలుదారుల్లో భయాలు
ఆర్థిక వ్యవస్థలో నెలకుంటున్న అనిశ్చితి, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, నానాటికీ పెరుగుతున్న జీవన వ్యయాలు.. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు ఎవరైనా సరే ఆచితూచి ఖర్చు చేస్తారు. కానీ, భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో మాత్రం ఇందుకు భిన్నమైన వైరుధ్యం కనిపిస్తోంది.ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇళ్ల ధరలు మరింత ఆకాశాన్ని తాకుతాయనే భయంతో, కొనుగోలుదారులు ఇప్పుడే బడ్జెట్ను పెంచుకుని మరీ లగ్జరీ గృహాల వైపు చూస్తున్నారు.ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఆర్థిక జాగ్రత్త కంటే, భవిష్యత్తులో ఇల్లు కొనలేమేమోననే భయం, మెరుగైన జీవనశైలి అనే అంశాలే రియల్టీ రంగాన్ని నడిపిస్తున్నాయి.ఖర్చుల భారంప్రస్తుతం ఎగుమతి, దిగుమతుల రంగంలో ఉన్న అంతరాయాలు నిర్మాణ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, షిప్పింగ్ రీరూటింగ్, గల్ఫ్ లింక్డ్ కార్గోలపై విధిస్తున్న యుద్ధ-ప్రమాద బీమా భారం లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనారాక్ (ANAROCK) తాజా నివేదిక ప్రకారం నిర్మాణ రంగంలో పెరిగిన ఖర్చులు ఇలా ఉన్నాయి..కంటైనర్ రవాణా ఖర్చులు: సరుకు రవాణా ఛార్జీలు, రీరూటింగ్ కారణంగా కంటైనర్కు అదనంగా రూ.2 లక్షల నుండి రూ.3.5 లక్షల వరకు భారం పెరిగింది.ఉక్కు ధరలు: గడిచిన కాలంలో స్టీల్ ధరలు టన్నుకు ఏకంగా 20% పెరిగి దాదాపు రూ.72,000కు చేరుకున్నాయి.దిగుమతులపై ప్రభావం: ముంబై, గురుగ్రామ్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని లగ్జరీ టవర్లలో వాడే ప్రీమియం ఫిట్టింగ్స్, విదేశీ మార్బుల్స్, ప్రత్యేక నిర్మాణ సామాగ్రి ధరలు రవాణా అంతరాయాల వల్ల భారీగా పెరిగాయి."ఇప్పుడు కొనకపోతే భవిష్యత్తులో ఈ ధరలు మన బడ్జెట్కు అందనంత ఎత్తుకు వెళ్లిపోతాయి" అనే ఆలోచనే వినియోగదారులను ముందడుగు వేసేలా చేస్తోంది.మారిన కొనుగోలుదారుల ఆలోచనఒకప్పుడు కేవలం పెట్టుబడి కోసమే ఇళ్లను కొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ద్వంద్వ ఆదాయం (భార్యాభర్తలిద్దరూ సంపాదించే) కలిగిన పట్టణ కుటుంబాలు, ఎగువ మధ్యతరగతి వర్గాలు గృహాన్ని తమ సామాజిక హోదాకు, ఆర్థిక భద్రతకు నిదర్శనంగా భావిస్తున్నారు.ముంబై, బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్ నగరాల్లో కొనుగోలుదారులు కేవలం నాలుగు గోడల ఇల్లు కాకుండా విస్తారమైన పెద్ద గృహాలు, వెల్నెస్-ఫోకస్డ్, గ్రీన్ ప్రాజెక్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆధునిక జీవనశైలి వసతులు ఉన్న వాటికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.బ్రాండెడ్ బిల్డర్లకే జై!గతంలో ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోవడం, డెలివరీ ఆలస్యం కావడం వంటి చేదు అనుభవాల దృష్ట్యా కొనుగోలుదారులు ఇప్పుడు చాలా అప్రమత్తమయ్యారు. ధర కొంచెం ఎక్కువైనా సరే, నమ్మకమైన కార్పొరేట్ బ్రాండ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీనినే మార్కెట్ వర్గాలు 'ట్రస్ట్ ప్రీమియం' అని పిలుస్తున్నాయి.వినియోగదారులు, ల్యాండ్ ఓనర్లు ఇప్పుడు డెవలపర్ల ఆర్థిక క్రమశిక్షణ, బ్యాలెన్స్ షీట్ బలం, గత ట్రాక్ రికార్డ్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. డీఎల్ఎఫ్, ఎంబసీ డెవలప్మెంట్స్, సిగ్నేచర్ గ్లోబల్ వంటి దిగ్గజ సంస్థల విక్రయాలు పుంజుకోవడానికి ఈ బ్రాండ్ ఇమేజ్, విశ్వసనీయతే ప్రధాన కారణం.ప్రీమియం వర్సెస్ అఫోర్డబుల్భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. ఒకవైపు లగ్జరీ ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంటే, మరోవైపు అందుబాటు గృహాల (Affordable Housing) అమ్మకాలు మందగించాయి. డీఎల్ఎఫ్ (డహ్లియాస్ ప్రాజెక్ట్) కేవలం ఒకే ఒక్క త్రైమాసికంలో 32 లగ్జరీ అపార్ట్మెంట్లను విక్రయించింది. ఎంబసీ డెవలప్మెంట్స్ దక్షిణ ముంబై లగ్జరీ ప్రాజెక్ట్ ప్రారంభించిన 45 రోజుల్లోనే రూ.800 కోట్ల ప్రీ-సేల్స్ సాధించింది. మార్కెట్ ట్రెండ్ ప్రీమియం వైపు మళ్లడంతో మహీంద్రా లైఫ్స్పేసెస్ వంటి పెద్ద కంపెనీలు తమ సరసమైన హౌసింగ్ ప్రాజెక్టుల విస్తరణను తగ్గించుకోవడం గమనార్హం. -
పెంట్హౌస్ కోసం రూ.45 కోట్లు: ఎవరు కొన్నారంటే?
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్జీ చిన్న కుమారుడు తారిఖ్ ప్రేమ్జీ, సెంట్రల్ బెంగళూరులో ఒక పెంట్హౌస్ కొనుగోలు చేశారు. దీని విలువ రూ.45.71 కోట్లు.తారిఖ్ ప్రేమ్జీ పెంట్హౌస్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు, రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ జాప్కీ ద్వారా లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ద్వారా తెలిసింది. కార్పెట్ ఏరియా 7,065 చదరపు అడుగులు, సూపర్ బిల్ట్-అప్ ఏరియా 10,602 చదరపు అడుగులుగా ఉంది. చదరపు అడుగుకు సుమారుగా రూ. 43,123 చెల్లించినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది బెంగళూరులో జరిగిన అతిపెద్ద లగ్జరీ రియల్ ఎస్టేట్ డీల్స్లో ఒకటిగా నిలుస్తుందని జాప్కీ సహ వ్యవస్థాపకుడు సందీప్ రెడ్డి అన్నారు. నగరంలో రిచ్మండ్ టౌన్, ఇంద్రానగర్, కోరమంగళ వంటి ప్రాంతాలతో పాటు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉన్న హై-ఎండ్ అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరుగుతోంది.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!అజీమ్ ప్రేమ్జీ భారతదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తలలో ఒకరు మాత్రమే కాకుండా.. ప్రముఖ దాతృత్వవేత్త కూడా. ఈయన స్థాపించిన అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా విద్య, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు అందిస్తున్నారు. వీరి కుటుంబం నిర్వహించే ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. తారిఖ్ కూడా కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఉంటూ, వివిధ బోర్డు స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
తక్కువ బడ్జెట్లో సొంతిల్లు.. ఖర్చు తగ్గించే బెస్ట్ మార్గాలు!
సొంత ఇల్లు నిర్మించుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ప్రస్తుతం.. సిమెంట్, ఇనుము, ఇసుక, కార్మిక చార్జీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడంతో ఇల్లు కట్టుకోవడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. అయినప్పటికీ.. సరైన ప్రణాళిక, ఖర్చుపై నియంత్రణ, తెలివైన నిర్ణయాలతో తక్కువ బడ్జెట్లో కూడా మంచి ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పుడు తక్కువ డబ్బుతో ఇల్లు ఎలా కట్టుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం.సరైన బడ్జెట్ ప్లాన్ఇల్లు నిర్మాణంలో మొదటి అడుగు బడ్జెట్ నిర్ణయించడం. మీ ఆదాయం, సేవింగ్స్, బ్యాంక్ లోన్ సామర్థ్యాన్ని బట్టి ఎంత వరకు ఖర్చు చేయగలమో ముందే నిర్ణయించుకోవాలి. చాలా మంది ప్లాన్ లేకుండా పనులు ప్రారంభించి మధ్యలో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ముందుగానే.. నిర్మాణానికి సంబంధించిన పూర్తి అంచనా తయారు చేసుకోవాలి.చిన్న ప్లాన్తో ప్రారంభించడం మంచిదితక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టాలంటే.. మొదట చిన్న ఇంటి డిజైన్ ఎంచుకోవడం ఉత్తమం. అవసరానికి మించి పెద్ద హాల్లు, ఎక్కువ బెడ్రూమ్లు, ఖరీదైన ఎలివేషన్లు పెట్టుకుంటే ఖర్చు భారీగా పెరుగుతుంది. భవిష్యత్తులో అవసరం పెరిగితే పై అంతస్తు లేదా అదనపు గదులు నిర్మించుకోవచ్చు.సింపుల్ డిజైన్ఇంటి డిజైన్ ఎంత క్లిష్టంగా ఉంటే.. నిర్మాణ వ్యయం అంత పెరుగుతుంది. కాబట్టి సాదాసీదా డిజైన్, సింపుల్ ఎలివేషన్, తక్కువ మలుపులు ఉన్న నిర్మాణం ఎంచుకోవడం మంచిది. దీని వల్ల సిమెంట్, ఇనుము, కార్మిక ఖర్చులు తగ్గుతాయి.నిర్మాణ సామగ్రి కొనుగోలులో జాగ్రత్తసిమెంట్, ఇనుము, ఇటుకలు వంటి మెటీరియల్స్ను ఒక్కోసారి కొనే బదులు, హోల్సేల్గా కొనుగోలు చేస్తే తక్కువ ధరలో లభిస్తాయి. అలాగే.. స్థానికంగా లభించే నాణ్యమైన మెటీరియల్స్ వాడితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ చవక కోసం నాసిరకం వస్తువులు కొనడం మాత్రం మంచిది కాదు.కార్మిక ఖర్చులను నియంత్రించడంనిర్మాణంలో లేబర్ ఖర్చు కూడా పెద్ద భాగం. కాంట్రాక్టర్కు పూర్తిగా అప్పగించకుండా, మెటీరియల్స్ మీరు కొనుగోలు చేసి కూలీలకు రోజువారీ చెల్లింపులతో పని చేయిస్తే కొంత వరకు ఖర్చు తగ్గుతుంది. అయితే పనిపై పర్యవేక్షణ తప్పనిసరి.అవసరమైన చోట మాత్రమే లగ్జరీఇంటి నిర్మాణంలో.. మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, ఖరీదైన వుడ్వర్క్, డిజైనర్ టైల్స్ వంటి వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రారంభ దశలో అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. తరువాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఇంటిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు.ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలిప్రభుత్వం అందించే గృహ పథకాలు, సబ్సిడీ హోమ్ లోన్స్, PMAY వంటి పథకాల గురించి తెలుసుకోవాలి. అర్హత ఉంటే వీటి ద్వారా వడ్డీ భారం కొంత తగ్గుతుంది.ఎలక్ట్రిక్, వాటర్ ప్లానింగ్ఇల్లు నిర్మాణ సమయంలోనే విద్యుత్ వైరింగ్, నీటి పైపులు, డ్రైనేజ్ వ్యవస్థలను సరిగ్గా ప్లాన్ చేస్తే భవిష్యత్తులో మరమ్మతుల ఖర్చు తగ్గుతుంది.మొత్తం మీద.. తక్కువ డబ్బుతో ఇల్లు కట్టుకోవడం అసాధ్యమైన పని కాదు. అయితే సరైన ప్రణాళిక, ఖర్చుపై నియంత్రణ, అవసరాలకు తగ్గ డిజైన్, నాణ్యమైన మెటీరియల్స్ వినియోగం ద్వారా తక్కువ బడ్జెట్లో కూడా అందమైన, బలమైన ఇల్లు నిర్మించుకోవచ్చు. తొందరపడకుండా ప్రతి దశను ఆలోచించి ముందుకు వెళితే సొంతింటి కల సాకారం అవుతుంది. -
ఇల్లు కొనేందుకు ఇది మంచి ఛాన్స్!
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్ పడ్డప్పుడు కొంటేనే తక్కువ ధరకు వస్తుంది.. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు వర్తించే ఈ సూత్రం రియల్టీకి వర్కవుట్ అవుతుంది. మార్కెట్ బాగలేనప్పుడు గృహ కొనుగోలుదారులకు మంచి సమయం. బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. వారు అందించే ఆఫర్లు అందుకునే అవకాశం ఉంటుంది.హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో రెండు రకాల కస్టమర్లు ఉన్నారు. ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), పెట్టుబడిదారులైన మొదటి రకంలో వీళ్లంతా పెద్దస్థాయిలో భూములు, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోళ్లు చేస్తుంటారు. ఇక, రెండో రకం రిటైల్ కస్టమర్లు. వీళ్లు సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేస్తుంటారు.మొదటి రకం కొనుగోలుదారులేమో మార్కెట్ బాగాలేనప్పుడు కొనుగోలు చేసి, బాగున్నప్పుడు ఎక్కువ ధరకు విక్రయించేసుకుంటారు. రెండో రకమేమో ధరలు మరింత తగ్గుతాయేమోనని వేచి చూస్తారు. ధరలు పెరిగిన తర్వాత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి స్థిరాస్తి మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే మొదటి రకాన్ని ఫాలో అవడమే కరెక్ట్. అందుకే ప్రస్తుత సందిగ్ధ వాతావరణంలో గృహాలను కొనుగోలు చేయడమే మంచి నిర్ణయం. ఇలాంటి ప్రతికూల మార్కెట్లోనే ధర, వసతుల విషయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశాలుంటాయి.ప్రభుత్వం ప్రోత్సహించాలిఏ పట్టణ ప్రాంతం అభివృద్ధికైనా కావాల్సింది విద్యా, వైద్యం, వినోదం, ఉద్యోగ అవకాశాలు. నగరవాసుల నాణ్యమైన జీవనాన్ని నిర్ణయించేవి ఈ నాలుగే. వీటిల్లో భాగ్యనగరం కేంద్ర బిందువనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెడికల్ టూరిజం, ఎడ్యుకేషనల్ హబ్, ఎంటర్టైన్మెంట్ జోన్లకు పెట్టింది పేరైన హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి.ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరానికి ఉన్న మరో అద్భుతమైన అవకాశం మెరుగైన మౌలిక వసతులున్న అపారమైన భూముల లభ్యత, ఔటర్, మెట్రోలతో కనెక్టివిటీ. దీంతో నగర రియల్టీ మార్కెట్కు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి.పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.కొత్త ప్రాజెక్ట్లపై పునరాలోచనప్రతీ ఆరేడేళ్లకు రియల్టీకి విరామ దశ సాధారణమే. తెలంగాణ ఉద్యమం, సత్యం స్కామ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లెమాన్ బ్రదర్స్ కుప్పకూలడం వంటి వాటితో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో 2007లో మొదలైన హైదరాబాద్ స్థిరాస్తి రంగం పతనం.. 2014 వరకూ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం వరకూ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది.కొత్త రాష్ట్రం, ప్రభుత్వ విధానాలు, కార్యచరణలపై అస్పష్టత వంటి కారణాలు అనేకం. ఆ తర్వాత 2015 ప్రారంభంలో మొదలైన రియల్ బూమ్ 2022 వరకూ కొనసాగింది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. 2023లో ఎన్నికలతో స్థిరాస్తి రంగంలో మొదలైన సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్లు, అపరిమిత సరఫరా, ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేకపోవడం, అధిక ధరలు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ ప్రతికూల విధానాల వంటి కారణంగా వచ్చే మూడేళ్ల వరకూ విరామ దశలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రియల్టీ రంగంలో ఈ విరామం మంచిదే అంటున్నారు. బిల్డర్లతో రాయితీలు, ఆఫర్లు వంటి బేరసారాలకు అవకాశం ఉంటుందంటున్నారు.మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీవిక్రయాలు అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో కొత్త ప్రాజెక్ట్లు చేపట్టేందుకు బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొని పెట్టుకోవడం, నిర్మాణ అనుమతులు తీసుకోవడం చేస్తున్నారే తప్ప ప్రాజెక్ట్ లాంచింగ్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఊహాజనిత మార్కెట్లో భూముల ధరలు పెరుగుతాయే తప్ప అపార్ట్మెంట్ల చదరపు అడుగు రేట్లు పెరగవు.ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీ ఉంది. నిర్మాణంలో ఉన్న, రెడీగా ఉన్న ఇన్వెంటరీ పోతేగానీ కొత్త యూనిట్లకు అవకాశం ఉండదు. అలాగే ప్రీలాంచ్ ప్రాజెక్ట్లు, డెవలపర్లు కూడా భూముల రేట్లు పెరగడానికి కారణమే. ఎప్పుడైనా సరే స్థిరాస్తి ధరలు స్థిరంగా పెరగాలే తప్ప అమాంతం పెరగకూడదు. రాత్రికి రాత్రే పెరిగే ధరలు గాలిబుడగ వంటివే. ఎప్పటికైనా పడిపోవాల్సిందే.. లేకపోతే తుది కొనుగోలుదారుల మీద అదనపు భారం తప్పదు. -
ఇంటికి, వ్యాపారానికి బీమా ధీమా
ప్రమాదాలనేవి ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అవి ముందస్తు సమాచారం లేకుండానే విరుచుకుపడతాయి. సుదీర్ఘంగా కురిసే వర్షాలు ఇళ్లను ముంచెత్తవచ్చు. ఒక చిన్న అగ్ని ప్రమాదం ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టిన పెట్టుబడిని రాత్రికి రాత్రే బూడిద చేయవచ్చు. అంతంత మాత్రం ఆదాయాలతో నడిచే కుటుంబాలకు, చిన్న వ్యాపారాలకు ఇవి అప్పుడప్పుడు ఎదురయ్యే అరుదైన సంఘటనలు కావు.నిత్యం ఎదురయ్యే చేదు నిజాలు. ఇలాంటి పరిస్థితుల్లో బీమా అనేది ఆర్థికంగా ఆసరాగా నిలిచేది అయినప్పటికీ దేశీయంగా దీని వినియోగం ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉంటోంది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం 2023–24లో జీడీపీలో బీమా వాటా కేవలం 3.7 శాతమే. అంతక్రితం ఏడాదిలో నమోదైన 4% కన్నా ఇది తక్కువ కావడంతో పాటు ప్రపంచ సగటు 7% కన్నా చాలా తక్కువ కావడం గమనార్హం. ఇక ఇందులో జనరల్ బీమా వాటా కేవలం 1% మాత్రమే. అసెట్స్ వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రాపర్టీ, వ్యాపారాల రిస్కులకు కవరేజీ అత్యంత తక్కువగా ఉండటాన్ని ఇది సూచిస్తోంది. దేశ జీడీపీలో సుమారు 30%, ఎగుమతుల్లో 45% వాటా ఉండే ఎంఎస్ఎంఈ రంగంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రిటైలర్లు, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, లాజిస్టిక్స్, రిపేర్ వర్క్షాప్ల లాంటి వ్యాపారాల్లో ప్రమాదం జరిగితే నెలల తరబడి పనులు ఆగిపోతాయి. ఇది వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. వాటిని అధిగమించేందుకే ‘బిజినెస్ ఇంటరప్షన్ ఇన్సూరెన్స్’ రూపొందింది. ఇక గృహాల విషయానికొస్తే వాతావరణ సంబంధ రిస్క్ లు ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంటోంది. వరదలు, తుఫాన్లు, వడగాల్పుల ప్రభావం భారత్లో ఎక్కువగా ఉంటుందని, తగిన భద్రత వ్యవస్థలు లేకపోతే వాతావరణ షాక్ల వల్ల కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోయే ముప్పు ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఆదాయాలు, గృహాల కొనుగోళ్లు పెరుగుతున్నప్పటికీ స్టాండెలోన్ హోమ్ ఇన్సూరెన్స్ వినియోగం ప్రధాన మెట్రో నగరాల వెలుపల ఇప్పటికీ తక్కువే. అయితే, క్రమంగా ఈ ధోరణి మారుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు అంతక్రితం ఏడాది కన్నా రెండంకెల స్థాయి వృద్ధితో రూ. 2.9 లక్షల కోట్ల స్థూల ప్రీమియం వసూళ్లను నమోదు చేయడం ఇందుకు నిదర్శనం. సరళతరంగా ఇన్సూరెన్స్.. రుణదాతలు, రిస్క్ కవరేజీని తప్పనిసరి చేస్తుండటంతో ప్రాపర్టీ, కమర్షియల్ ఇన్సూరెన్స్ విభాగం క్రమంగా పుంజుకుంటోంది. పరిశ్రమ కూడా పరిస్థితులకు అనుగుణంగా మారుతోంది. పాలసీ పరిభాష సరళతరంగా మారింది. డిజిటల్గా జారీ వల్ల టర్నెరౌండ్ సమయం తగ్గింది. క్లెయిమ్స్ని రియల్ టైమ్లో ట్రాక్ చేయడం వీలవుతోంది. క్లెయిమ్ సెటిల్మెంట్ పనితీరు కూడా చాలా మెరుగుపడింది. ఇవన్నీ కూడా బీమా విస్తృతి పెరిగేందుకు దోహదపడుతున్నాయి. తక్కువ ప్రీమియంతో లభించే మైక్రో–ఇన్సూరెన్స్ పద్ధతులు చిన్న వ్యాపారాలకు మరియు సామాన్యులకు బీమాను చేరువ చేస్తున్నాయి. ఇది ముఖ్యంగా విపత్తులు సంభవించే ప్రాంతాల్లో అప్పుల పాలు కాకుండా ప్రజలను కాపాడుతుంది. బీమా ఉన్న వ్యాపారాలు త్వరగా కోలుకోవడం వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినదు, ఉపాధికి విఘాతం కలగదు. ఈ రకంగా బీమా అనేది ఆర్థిక వ్యవస్థకు ఒక ’షాక్ అబ్జార్బర్’ లాగా పనిచేస్తుంది. మౌలిక సదుపాయాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు పెరుగుతున్న కొద్దీ ప్రమాదాల తీవ్రత పెరగవచ్చు. ఈ నేపథ్యంలో జనరల్ ఇన్సూరెన్స్ అనేది అదనపు ఖర్చు కాదు, రక్షణ కవచం. భారత ఆర్థిక వృద్ధిలో రిస్క్ ప్రొటెక్షన్ను భాగం చేయ డం అనేది ముందుజాగ్రత్త మాత్రమే కాదు, ఆర్థిక అవసరం కూడా.రమిత్ గోయల్చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్, జనరలి సెంట్రల్ ఇన్సూరెన్స్ -
ప్రాపర్టీ కొంటున్నారా.. ‘సర్కిల్ రేటు’ తెలుసా?
ఇంటి స్థలం, ఫ్లాట్ లేదా ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ కొంటున్నారా? అయితే రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో సరైన అవగాహన లేకపోతే, కొనుగోలుదారులు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా “సర్కిల్ రేటు” (Circle Rate) అనే కీలక అంశం గురించి తెలియక చాలామంది అదనపు పన్నులు, స్టాంప్ డ్యూటీలు చెల్లిస్తూ మోసపోతున్నారు. అందుకే ఆస్తి కొనుగోలు చేసే ముందు సర్కిల్ రేటు, మార్కెట్ రేటు మధ్య తేడా ఏమిటి? ప్రభుత్వం దీనిని ఎందుకు నిర్ణయిస్తుంది? అనే విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం.సర్కిల్ రేటు అంటే ఏమిటి?సర్కిల్ రేటును కొన్ని రాష్ట్రాల్లో “గైడ్లైన్ వాల్యూ”, “రెడీ రెకనర్ రేట్”, “గవర్నమెంట్ వాల్యూ” అని కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రాంతంలో భూమి లేదా భవనం కనీస ప్రభుత్వ విలువను సూచిస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లేదా రిజిస్ట్రేషన్ శాఖలు ప్రాంతాల వారీగా ఈ రేట్లను నిర్ణయిస్తాయి.ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వంటి చార్జీలను ప్రధానంగా ఈ సర్కిల్ రేటు ఆధారంగానే లెక్కిస్తారు.ప్రభుత్వ ఆదాయాన్ని రక్షించడం, తక్కువ ధర చూపించి పన్ను ఎగవేతను నివారించడం దీని ప్రధాన ఉద్దేశం.తక్కువ ధరకు కొనుగోలు చేసినా.. పన్ను మాత్రం ఎక్కువే!ఉదాహరణకు, ఒక ప్రాంతంలో ప్రభుత్వం నిర్ణయించిన సర్కిల్ రేటు ప్రకారం స్థలం విలువ రూ.50 లక్షలు ఉందనుకుందాం. కానీ విక్రేతతో ఒప్పందం కుదుర్చుకుని మీరు రూ.42 లక్షలకు ఆస్తిని కొనుగోలు చేసినా, రిజిస్ట్రేషన్ శాఖ మాత్రం రూ.50 లక్షల విలువ ఆధారంగానే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తుంది.అంటే, “కొనుగోలు ధర” కంటే “ప్రభుత్వ సర్కిల్ రేటు” ఎక్కువగా ఉంటే, ప్రభుత్వ విలువకే ప్రాధాన్యం ఉంటుంది. ఈ విషయం తెలియక చాలామంది తర్వాత అదనపు ఖర్చులతో నష్టపోతున్నారు.మార్కెట్ రేటుకు, సర్కిల్ రేటుకు తేడా ఏమిటి?రియల్ ఎస్టేట్ మార్కెట్లో అసలు విక్రయ ధరను “మార్కెట్ రేటు” అంటారు. ఇది పూర్తిగా డిమాండ్, లొకేషన్, మౌలిక వసతులు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.ప్రధాన నగరాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మార్కెట్ రేటు సాధారణంగా సర్కిల్ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొనుగోలుదారు-విక్రేత పరస్పర చర్చల ద్వారా తుది ధర నిర్ణయమవుతుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మార్కెట్ రేటు సర్కిల్ రేటుకు దగ్గరగా ఉండొచ్చు.సర్కిల్ రేట్లు ఎందుకు మారుతాయి?రాష్ట్ర ప్రభుత్వాలు కాలానుగుణంగా సర్కిల్ రేట్లను సవరిస్తుంటాయి. మెట్రో నగరాల విస్తరణ, కొత్త రోడ్లు, మెట్రో రైలు, ఐటీ పార్కులు, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలు భూముల విలువను ప్రభావితం చేస్తాయి. దీంతో ప్రభుత్వాలు ప్రాంతాల వారీగా కొత్త గైడ్లైన్ విలువలను ప్రకటిస్తాయి. అందువల్ల, కొన్ని నెలల క్రితం ఉన్న రేట్లు ప్రస్తుతం మారిపోయి ఉండే అవకాశం ఉంది. పాత సమాచారంపై ఆధారపడి ఒప్పందాలు చేసుకోవడం ప్రమాదకరం.కొనుగోలుదారులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలుఆస్తి కొనుగోలు ముందు సంబంధిత ప్రాంతానికి వర్తించే తాజా సర్కిల్ రేటును అధికారిక రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తెలుసుకోవాలి.స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మున్సిపల్ చార్జీలు, లీగల్ వెరిఫికేషన్ వంటి మొత్తం ఖర్చులను ముందుగానే లెక్కించాలి.మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు ఆస్తి అమ్ముతున్నారంటే అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి డీల్స్లో లీగల్ సమస్యలు లేదా పన్ను ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది.బ్యాంక్ లోన్ తీసుకునే ముందు ఆస్తి ప్రభుత్వ విలువ, మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించడం మంచిది.రిజిస్ట్రేషన్కు ముందు న్యాయ నిపుణులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ సలహా తీసుకోవడం భవిష్యత్ వివాదాలను నివారిస్తుంది.అవగాహన ఉంటేనే సురక్షిత పెట్టుబడిరియల్ ఎస్టేట్లో చిన్న నిర్లక్ష్యమే పెద్ద ఆర్థిక భారంగా మారొచ్చు. ముఖ్యంగా సర్కిల్ రేటు గురించి అవగాహన లేకుండా ఆస్తి కొనుగోలు చేస్తే అదనపు పన్నులు, లీగల్ చిక్కులు, రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే “చౌకగా దొరికింది” అని ఆకర్షణకు లోనుకాకుండా, ప్రభుత్వ విలువలు, మార్కెట్ పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆస్తి కొనుగోలు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. -
ఇళ్ల అమ్మకాలు.. కుదేలు!
పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో జనవరి–మార్చి త్రైమాసికంలో తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు వార్షికంగా 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పడిపోయాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. ఇటీవలి కాలంలో 18 త్రైమాసికాల తర్వాత అమ్మకాలు లక్ష యూనిట్ల మార్కు కంటే దిగువకు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ తేల్చింది. దేశంలో అలాంటి అమ్మకాల తగ్గుదల చూసిన తొమ్మిది ప్రధాన నగరాలైన ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, నవీ ముంబై, థానే, బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, కోల్కతా ఉన్నట్లు తెలిపింది.నగరాల వ్యాప్తంగా పరిస్థితి ఇదీ.. ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. చెన్నైలో గృహాల అమ్మకాలు 4 శాతం తగ్గాయి. హైదరాబాద్లో 16 శాతం పడిపోయాయి. ముంబైలో 20, నవీ ముంబైలో 14 శాతం, థానెలో 24 శాతం, పుణెలో 25 శాతం పడిపోయాయి. చివరగా కోల్కతాలో గృహాల విక్రయాలు 8 శాతం తగ్గాయి. బెంగళూరులో 3 శాతం కొనుగోళ్లు పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో గృహ విక్రయాలు 13 శాతం పెరిగాయి. మొత్తంగా చూస్తే.. గత ఏడాది జనవరి–మార్చి కాలంలోని 1,13,602 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది నివాస గృహాల అమ్మకాలు 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పడిపోయాయి. తొమ్మిది నగరాల్లో మొత్తం అమ్మకాలు గత త్రైమాసికంలోని(అక్టోబర్–డిసెంబర్ 2025) 1,05,527 యూనిట్లతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. అయితే ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు నగరాలు దీనికి మినహాయింపుగా నిలిచాయి.డిమాండ్కు తగ్గ సరఫరా లేక.. గత ఏడాది జనవరి–మార్చి కాలంతో పోలిస్తే 2026 మొదటి త్రైమాసికంలో దాదాపు 22 వేల యూనిట్లు తక్కువగా సరఫరా అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 1,14,718 యూనిట్లతో పోలిస్తే, కొత్త గృహాల సరఫరా 19 శాతం తగ్గి 92,411 యూనిట్లకు పడిపోయింది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం తగ్గడానికి పశ్చిమ ఆసియా యుద్ధంతో ఏర్పడిన అనిశ్చితి కొనుగోలు సెంటిమెంట్ను ప్రభావితం చేసిందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. -
రియల్ఎస్టేట్లోకి వెల్లువెత్తిన పెట్టుబడులు
దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి గత రెండేళ్లుగా భారీ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2024 నుండి 2026 తొలి త్రైమాసికం వరకు 30.7 బిలియన్ డాలర్లు వచ్చాయి. డిమాండ్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఇదే తీరు కొనసాగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. రియల్టీ సేవల సంస్థ సీబీఆర్ఈ, పరిశ్రమల సమాఖ్య సీఐఐ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం రాబోయే రోజుల్లో భారత రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) మార్కెట్ మరింత విస్తరించనుంది. పెద్ద ఎత్తున రీట్స్ లిస్టింగ్కి రానుండటంతో డెవలపర్స్కి నిధుల లభ్యత పెరగనుంది. పరిశ్రమ రుణ రూపంలో సమకూర్చుకున్న నిధుల పరిమాణం 2024–2026 తొలి త్రైమాసికం మధ్య కాలంలో 146 బిలియన్ డాలర్ల స్థాయిని దాటింది. ట్రస్టీ షిప్స్, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతరత్రా సంస్థలు ఈ నిధులను సమకూర్చాయి.రిపోర్ట్లో మరిన్ని విశేషాలు..మొత్తం రుణాల్లో మూడు ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు వాటా 60 శాతం పైగా ఉంది. ప్రథమ శ్రేణిలోకి రాని నిర్దిష్ట నగరాల వాటా 8 శాతంగా ఉంది. మెట్రోల పరిధి దాటి ఇతర ప్రాంతాలపైనా ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. కమర్షియల్ రియల్ ఎస్టేట్కి బ్యాంకు రుణాలు 2025 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరిగాయి. ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన రుణాలు 2025 సెప్టెంబర్ నాటికి అయిదేళ్ల గరిష్ట స్థాయి అయిన రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటాయి. రియల్ ఎస్టేట్ వ్యవస్తకు రీట్స్ కీలకంగా మారుతున్నాయి. దేశీయంగా పెట్టుబడులు స్థిరంగా వస్తుండటం, భౌగోళికరాజకీయ అనిశి్చతుల నడుమ గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా కొంత మేర ఇన్వెస్ట్ చేస్తుండటంలాంటి అంశాలు పెట్టుబడుల రాకకు దోహదపడనున్నాయి. ఆఫీస్, లాజిస్టిక్స్, డేటా సెంటర్స్ మొదలైన వాటిల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడుల వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా అనిశి్చతిలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమ నిర్మాణాత్మకంగా పరివర్తన చెందుతుండటం, పారదర్శకత మెరుగుపడుతుండటం, వివిధ వనరుల ద్వారా నిధులు లభిస్తుండటంలాంటి అంశాల వల్ల పెట్టుబడులకు రియల్టీ రంగం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా కొనసాగనుంది. -
ఇండియన్స్ నిజంగా గ్రేట్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా వంటి ఐకానిక్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అద్భుతమైన వాస్తుశిల్పం(ఆర్కిటెక్చర్)తోపాటు భారతీయుల అంకితభావం ఉందని ఎమార్ గ్రూప్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బార్ స్పష్టం చేశారు. అబుదాబిలో జరిగిన ప్రతిష్టాత్మక ‘మేక్ ఇట్ ఇన్ ది ఎమిరేట్స్’ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.అర్ధరాత్రి ఒంటి గంటకు స్పందననియామకాల విషయంలో తాను ఎందుకు భారతీయులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానో అలబ్బార్ తనదైన శైలిలో వివరించారు. ‘మీరు ప్రపంచాన్ని జయించాలంటే భారతీయ ప్రతిభ అవసరం. ప్రపంచమంతా పని గంటలకు సంబంధించి గడియారంవైపు చూస్తుంటే భారతీయ నిపుణులు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంటకైనా ఫోన్ తీసి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ అసాధారణమైన పనితీరు వారిని ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టింది’ అని ఆయన కొనియాడారు.అలబ్బార్ ఎత్తిచూపిన లక్షణాలు2008 ఆర్థిక మాంద్యం, కొవిడ్-19 వంటి గడ్డుకాలంలో ఎమార్ గ్రూప్ ఎలా నిలదొక్కుకుందో వివరిస్తూ, భారతీయ శ్రామిక శక్తిలో తాను గమనించిన ప్రధాన లక్షణాలను ప్రస్తావించారు.క్లిష్టమైన ప్రాజెక్టుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు.రోజూ పనులను తనిఖీ చేస్తూ ముందస్తుగా ప్రమాదాలను అంచనా వేసి తగిన చర్యలు చేపడుతారు.మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త విషయాలను నేర్చుకోగల సామర్థ్యం భారతీయుల సొంతం.తన ప్రస్థానం గురించి చెప్పుకుంటూ ‘నా ఐక్యూ సగటు మాత్రమే కావచ్చు, కానీ నా కృషి ప్రపంచంలోనే అత్యుత్తమమైనది’ అని అలబ్బార్ వినమ్రంగా వ్యాఖ్యానించారు. ‘మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో అంత అదృష్టవంతులు అవుతారు’ అన్నది తన విజయ రహస్యమని పేర్కొన్నారు.భారతదేశంతో అనుసంధానంభారతీయ ప్రతిభను ప్రోత్సహించడానికి ఎమార్ గ్రూప్ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. రాజస్థాన్లోని రాఫెల్స్ యూనివర్సిటీతో కలిసి అలబ్బార్ ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఏటా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి దుబాయ్, యూరప్, ఆసియాలోని తమ కార్యాలయాల్లో నేరుగా ఉపాధి కల్పిస్తున్నారు.అలబ్బార్ భరోసాభారతదేశం పట్ల ఎందుకు ఇంత సానుకూలంగా ఉన్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం కంటే మెరుగైన, విస్తృతమైన, స్థిరమైన, నిరంతరం వృద్ధి చెందుతున్న మరో దేశం ఏదీ లేదు’ అని ఆయన నమ్మకంగా చెప్పారు. దాంతో ప్రపంచ నిర్మాణ రంగంలో భారతీయ నిపుణుల సత్తా మరోసారి అంతర్జాతీయ వేదికపై మారుమోగింది.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ? -
ఇల్లు కొంటే.. ఇన్ని ఖర్చులా?
సొంతిల్లు.. సగటు భారతీయుడి జీవితకాల స్వప్నం. తొలి ఇంటి కొనుగోలు మధ్యతరగతి కుటుంబానికి ఓ మైలురాయి. అయితే, మొదటిసారి ఇల్లు కొనేవారు కేవలం ఆస్తి విలువ (Market Value), నెలవారీ ఈఎంఐ (EMI) లెక్కలతోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ నుంచి మెయింటెనెన్స్ వరకు ఎదురయ్యే 'అదనపు బాదుడు' గురించి అవగాహన లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రారంభంలోనే భారీ భారంఆస్తి కొనుగోలులో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, లీగల్ ఛార్జీలు, బ్రోకరేజ్, గృహ రుణ ప్రాసెసింగ్ ఫీజులు వంటి లావాదేవీ ఖర్చులు ముఖ్యమైన భాగం. ఇవి సాధారణంగా ముందస్తుగా చెల్లించాల్సి ఉండటంతో, కొనుగోలుదారుడి నగదు ప్రవాహంపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఖర్చులను రుణంగా పొందడం కష్టం కాబట్టి డౌన్ పేమెంట్కు తోడు అదనపు నిధులు సమకూర్చుకోవాల్సి వస్తుంది.ఫర్నిషింగ్, ఫిట్-అవుట్ ఖర్చులుఇల్లు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు ఫర్నిచర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్స్ వంటి ఖర్చులు తప్పనిసరి అవుతాయి. ముఖ్యంగా అన్ఫినిష్డ్ లేదా కొత్తగా నిర్మించిన ఇళ్ల విషయంలో ఫిట్-అవుట్ ఖర్చులు మరింత పెరుగుతాయి. ఇవి చిన్నచిన్న ఖర్చులుగానే కనిపించినా, అన్నీ కలిపి పెద్ద మొత్తానికి చేరుతాయి.పునరావృత ఖర్చులుఇల్లు కొనుగోలు తర్వాత నిర్వహణ చార్జీలు, ఆస్తి పన్ను, గృహ బీమా, మరమ్మతులు, అపార్ట్మెంట్ సొసైటీ ఫీజులు వంటి ఖర్చులు నిరంతరం ఉంటాయి. అద్దెదారులతో పోలిస్తే యజమానులు ఈ ఖర్చులను నేరుగా భరించాల్సి రావడం వల్ల నెలవారీ బడ్జెట్పై అదనపు భారంగా మారుతుంది.ఈఎంఐలే కాదు.. వడ్డీ చూసుకోవాలిచాలా మంది కొనుగోలుదారులు ‘తక్కువ ఈఎంఐ’ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ గృహ రుణం మొత్తం కాలపరిమితిలో చెల్లించాల్సిన వడ్డీని పరిగణనలోకి తీసుకోరు. 20–30 సంవత్సరాల దీర్ఘకాల రుణాలలో, మొత్తం చెల్లింపు ఆస్తి అసలు ధర కంటే గణనీయంగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే, ఈఎంఐ తక్కువగా కనిపించినా, దీర్ఘకాలంలో భారీ వడ్డీ భారం ఉంటుంది.అవకాశ వ్యయండౌన్ పేమెంట్ కోసం వినియోగించే పెద్ద మొత్తాన్ని ఇతర పెట్టుబడుల్లో పెట్టి ఉంటే వచ్చే లాభాన్ని కోల్పోవడం ‘అవకాశ వ్యయం’గా పరిగణించాలి. అలాగే, అధిక ఈఎంఐల వల్ల భవిష్యత్ పొదుపులు, పెట్టుబడులపై పరిమితులు ఏర్పడతాయి. ఇది ఆర్థిక స్వేచ్ఛను ప్రభావితం చేసే అంశంగా నిపుణులు చెబుతున్నారు.సమగ్ర ప్రణాళిక అవసరంఇల్లు కొనుగోలు జీవితంలో ఒక కీలక మైలురాయి అయినప్పటికీ, అది ఆర్థికంగా భారంగా మారకుండా ముందస్తు ప్రణాళిక అత్యంత అవసరం. కేవలం ఆస్తి ధర లేదా ఈఎంఐల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం వల్ల స్థోమత తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. అన్ని అనుబంధ ఖర్చులను ముందుగానే అంచనా వేసి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావాలను విశ్లేషించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే అపార్ట్మెంట్లు! -
అపార్ట్మెంట్ ధరలకు రెక్కలు
దేశంలోని ప్రముఖ నగరాల్లో అపార్ట్మెంట్ల ధరలు 8–20 శాతం మధ్య మార్చి త్రైమాసికంలో పెరిగాయి. నిర్మాణంలోకి వినియోగించే మెటీరియల్స్ ధరలు పెరిగిపోవడం ఇందుకు దారితీసినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. అంతర్గతంగా డిమాండ్ కూడా బలంగా ఉండడం, భూముల ధరలు, నిర్మాణవ్యయాలు పెరుగుదల, ప్రీమియం ఇళ్ల వైపు మొగ్గు చూపించడం కూడా ధరల పెరుగుదలకు కారణాలుగా పేర్కొంది.ఈ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. మార్చి త్రైమాసికంలో హైదరాబాద్ సహా టాప్–7 నగరాల్లో 70,631 యూనిట్ల అపార్ట్మెంట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 65,222 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త సరఫరా (నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడం) 13 శాతం పెరిగింది. 90,023 యూనిట్ల కొత్త అపార్ట్మెంట్లు (ఫ్లాట్లు) అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్కతా నగరాల డేటా ఆధారంగా ఈ వివరాలను జేఎల్ఎల్ ఇండియా విడుదల చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లు, వ్యయాల ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ఇళ్ల ధరలు ఇక ముందూ పెరగొచ్చని, కాకపోతే ఈ పెరుగుదల కాస్త నిదానించొచ్చని అంచనా వేసింది. ప్రీమియం ఫ్లాట్లకు పటిష్ట డిమాండ్అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ పడిపోగా, ప్రీమియం ఇళ్లకు మాత్రం పటిష్టంగా కొనసాగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.50 లక్షల్లోపు అపార్ట్మెంట్ల విక్రయాలు మార్చి త్రైమాసికంలో 24 శాతం తగ్గి 20,269 యూనిట్లకు పరిమితమయ్యాయి. రూ.కోటికి పైగా ధరల శ్రేణిలోని అపార్ట్మెంట్ల అమ్మకాలు మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 30 శాతం పెరిగి 50,362 యూనిట్లకు చేరాయి. ‘‘కొనుగోలుదారుల సెంటిమెంట్ ఆధారంగా కొత్త సరఫరా వస్తోంది. కొత్త ప్రాజెక్టుల ఆరంభం 13 శాతం పెరగడం, విక్రయాల్లో 8 శాతం వృద్ధి అన్నవి ఆర్థిక అనిశ్చితుల్లో కస్టమర్లు అప్రమ్తత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది’’ అని జేఎల్ఎల్ సీనియర్ ఎండీ శివ కృష్ణన్ తెలిపారు.ఇదీ చదవండి: 2032 వరకు అన్ని హక్కులు మావే -
భద్రతే ప్రధానం.. ఆర్డబ్ల్యూఏలు, హౌసింగ్ సొసైటీలకు దిశా నిర్దేశం!
నరెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో.. 'ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ' అండ్ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన వర్క్షాప్ తెలంగాణలో భద్రమైన సమాజ నిర్మాణానికి ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ కార్యక్రమం కే.ఎల్.ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నాయకులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs), ఫెసిలిటీ మేనేజర్లు, న్యాయ, భద్రత నిపుణులు పాల్గొన్నారు.ఈ వర్క్షాప్ ఉద్దేశ్యం గృహ సముదాయాలు, వాణిజ్య ప్రాజెక్టులకు సంబంధించిన చట్టపరమైన నియమాలు, భద్రత ప్రమాణాలు, నిర్వహణ బాధ్యతలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడం. ముఖ్యంగా స్టాట్యుటరీ రిన్యూవల్స్, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్, లిఫ్ట్ మెయింటెనెన్స్, పర్యావరణ నియమాలు, భవనాల స్థిరత్వ పరీక్షలు వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.తెలంగాణలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో ఈ కార్యక్రమం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హై-రైజ్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భద్రతా నియమాలు పాటించకపోతే జరిమానాలు, కార్యకలాపాల నిలిపివేత, ప్రాణాపాయాలు వంటి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. -
చైనాలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్
చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం (China Real Estate Crash) ముదురుతోంది. ఒకప్పుడు దేశ జీడీపీలో పావు వంతు (25%) వాటా కలిగిన ఈ రంగం, ప్రస్తుతం కుప్పకూలుతోంది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా ఆస్తి విలువలు పడిపోవడంతో అటు ఇన్వెస్టర్లు, ఇటు సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇదే తరహా ‘రియల్’ ప్రకంపనలు భారతదేశంలోనూ వచ్చే అవకాశం ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) డేటా ప్రకారం, చైనాలో రియల్ ఎస్టేట్ పతనం "స్లో మోషన్ క్రాష్"ను తలపిస్తోంది. 2021లో 113 పాయింట్లుగా ఉన్న గృహ ధరల సూచిక, 2025 చివరి నాటికి 86.79కి పడిపోయింది. అంటే నాలుగేళ్లలో దాదాపు 25% సంపద ఆవిరైపోయింది. చైనాలో ప్రస్తుతం 391 మిలియన్ చదరపు మీటర్ల మేర ఇళ్లు అమ్ముడుపోకుండా ఖాళీగా ఉన్నాయి. ఇది 2021తో పోలిస్తే 72% ఎక్కువ. 2025 మొదటి పది నెలల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 14.7% క్షీణించాయి.దిగ్గజ సంస్థల పతనంచైనాలో రియల్ ఎస్టేట్ దిగ్గజాలుగా పేరుగాంచిన సంస్థలు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఎవర్గ్రాండే (Evergrande) 300 బిలియన డాటర్లకు పైగా అప్పులతో కుప్పకూలి, ఆగస్టు 2025లో స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి వైదొలిగింది. అత్యంత స్థిరమైన సంస్థగా పేరున్న వాంకే (Vanke), 2024లో రికార్డు స్థాయిలో 6.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. కంట్రీ గార్డెన్ సంస్థ కూడా తన బకాయిలను చెల్లించలేక డిఫాల్టర్గా నిలిచింది.భారత్లో ఆందోళన అవసరమా?చైనా మార్కెట్ పతనాన్ని చూసి భారతీయ కొనుగోలుదారులు కూడా అయోమయానికి గురవుతున్నారు. రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, AI కారణంగా ఉద్యోగ అనిశ్చితి వంటి కారణాలతో భారత్లోనూ ధరలు తగ్గుతాయేమోనని కొందరు భావిస్తున్నారు. అయితే, ఆర్థిక విశ్లేషకులు మాత్రం చైనాకు, భారత్కు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెబుతున్నారు.భారత మార్కెట్ బలంగా ఉండటానికి కారణాలుచైనాలో ఇళ్లు మిగిలిపోతుంటే (Over supply), భారత్లో ఇంకా గృహాల కొరత ఉంది. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల డిమాండ్ నిలకడగా ఉంది.భారత్లో పెట్టుబడిదారుల కంటే, సొంత ఇల్లు కొనుక్కునే వారి సంఖ్య (End users) ఎక్కువ. ఇది మార్కెట్కు స్థిరత్వాన్ని ఇస్తుంది.చైనాలోలాగా కేవలం ఊహాజనిత పెట్టుబడులతో కాకుండా, భారత్లో జనాభా అవసరాలకు అనుగుణంగా మార్కెట్ విస్తరిస్తోంది. -
రియల్టీ మార్కెట్లో తగ్గిన జోరు
రియల్ ఎస్టేట్ మార్కెట్లో జోరు తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 763 మిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు (రూ.7,096 కోట్లు) జరిగాయి. అంతక్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే 63 శాతం తగ్గినట్టు కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ ప్రకటించింది. ‘‘2026 క్యూ1లో (జనవరి–మార్చి) రియల్ ఎస్టేట్లో 32 లావాదేవీలు జరిగాయి. రెండో అత్యధిక త్రైమాసిక లావాదేవీల రికార్డు ఇది. అయితే మొత్తం లావాదేవీల విలువ 63 శాతం తగ్గి 763 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. పెద్ద సైజు లావాదేవీలు లేకపోవడం, చిన్న, మధ్యస్థ లావాదేవీల వైపు మొగ్గు చూపడం ఇందుకు దారితీసింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. 2023 సంవత్సరం చివరి త్రైమాసికం తర్వాత లావాదేవీల విలువ అతి తక్కువ నమోదు కావడం మళ్లీ ఇదే.పీఈ లావాదేవీలే ఎక్కువ.. ప్రైవేటు ఈక్విటీ (పీఈ) లావాదేవీల విలువ అంతక్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే 71 శాతం తగ్గి 458 మిలియన్ డాలర్లుగా ఉంది. విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) లావాదేవీల విలువ 38 శాతం తగ్గి 305 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ)లలో ఒక్క ఇష్యూ నమోదు కాలేదు. వాణిజ్య ఆస్తులు, ముఖ్యంగా ఆఫీస్, రిటైల్ ప్లాట్ఫామ్ల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి కనిపించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు, స్థూల ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆస్తుల వారీ పనితీరును, నిర్వహణను చూస్తున్నట్టు గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ షబాలా షిండే పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
ONE by MSN: నియోపోలిస్ విలాసవంతమైన పరిణామంలో మైలురాయి
వన్ బై ఎంఎస్ఎన్ రియల్టీ ప్రాజెక్ట్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంలో, ఇది కేవలం ఒక ఆలోచనగా కాకుండా.. క్షేత్రస్థాయిలో, అలాగే లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేవారి మనసుల్లో వేగంగా వాస్తవ రూపం దాల్చుతోంది. కోకాపేట నియోపోలిస్లో ఒక ప్రతిష్టాత్మక ప్రకటనగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, నేడు హైదరాబాద్లోని అత్యంత చర్చనీయమైన ప్రీమియం నివాస ప్రాంతాలలో ఒకటిగా ఎదుగుతోంది.ఏప్రిల్ 2025లో ప్రారంభించిన వన్ బై ఎంఎస్ఎన్, 7.7 ఎకరాల విస్తీర్ణంలో ఐదు హై-రైజ్ టవర్లు, ప్రత్యేకంగా రూపొందించిన 4 BHK నివాసాలతో కూడిన నెక్స్ట్ జనరేషన్ లగ్జరీ కమ్యూనిటీగా భావించబడింది. 5,250 చదరపు అడుగుల నుండి 7,460 చదరపు అడుగుల వరకు విస్తరించి ఉన్న విశాలమైన ఇళ్లతో, ఈ ప్రాజెక్ట్ దాని వైశాల్యం, స్థలం, స్పష్టమైన దార్శనికతతో ప్రత్యేకంగా నిలుస్తుంది. సాధారణంగా రద్దీగా ఉండే పట్టణ వాతావరణంలో అరుదైన నివాస అనుభూతిని ఇది అందిస్తుంది.నిర్మాణ రంగంలో అత్యంత పేరున్న షాపుర్జీ పల్లోంజీ గ్రూప్ సహకారంతో, వన్ బై ఎంఎస్ఎన్ సైట్లో పనులు వేగంగా, సమర్థవంతంగా జరుగుతున్నాయి. వారి నైపుణ్యం, అమలు సామర్థ్యంతో, ప్రాజెక్ట్ ఇప్పటికే ఐదు బేస్మెంట్ల తవ్వకం పనులను 100% పూర్తి చేసి, సూపర్ స్ట్రక్చర్కు బలమైన పునాది వేసింది. ప్రస్తుతం పలు టవర్లు ఇప్పటికే 2వ అంతస్తుకు చేరుకోగా, 3వ అంతస్తు పనులు జరుగుతున్నాయి.ఈ అభివృద్ధి వేగానికి తగ్గట్టుగానే మార్కెట్ నుండి కూడా బలమైన స్పందన లభిస్తోంది. వన్ బై ఎంఎస్ఎన్ దాని ప్రాముఖ్యత, వైశాల్యం, జీవనశైలి కారణంగా హెచ్ఎన్ఐలు, ఎన్ఆర్ఐలు వంటి వివేకవంతమైన కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించింది. ఐటీ హబ్, విద్యాసంస్థలు, అగ్రశ్రేణి ఆసుపత్రులు, ఔటర్ రింగ్ రోడ్కు సులభమైన యాక్సెస్ కలిగిన హైదరాబాద్లోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రీమియం కారిడార్ అయిన నియోపోలిస్లో ఇది ఉండటం, నివాస,పెట్టుబడి గమ్యస్థానంగా దీని ప్రాధాన్యతను మరింత పెంచుతుంది.వన్ బై ఎంఎస్ఎన్ని నిజంగా ప్రత్యేకంగా నిలిపేది దాని జీవనశైలి రూపకల్పన. ఆలోచనాత్మకంగా రూపొందించిన స్థలాల నుండి విశాలమైన లేఅవుట్లు, ప్రీమియం ఫినిషింగ్ల వరకు, ప్రతి అంశం ఒక అసలైన, ప్రపంచ స్థాయి జీవన అనుభవాన్ని అందించడానికి రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ అరుదుగా కనిపించే విధంగా వైశాల్యం, ప్రైవసీ, ఆధునిక సౌకర్యాలను ఒకచోట చేర్చి, ఉన్నతమైన రోజువారీ జీవనం కోసం ఒక కమ్యూనిటీని సృష్టించింది.గత ఏడాది కాలంలో, ఎంఎస్ఎన్ రియల్టీ హైదరాబాద్లోని అత్యంత ప్రముఖ , ఆదరణ కలిగిన రియల్ ఎస్టేట్ బ్రాండ్లలో ఒకటిగా వేగంగా ఎదిగింది. నాణ్యత, స్థాయి, అమలుపై స్పష్టమైన దృష్టితో, కంపెనీ వ్యూహాత్మక భూసేకరణల ద్వారా తన ఉనికిని బలోపేతం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఇటీవల రాయదుర్గంలో ఎకరాకు రూ.177 కోట్లతో చేసిన అధిక-స్థాయి కొనుగోలు కూడా ఉంది. బలమైన ప్రాజెక్ట్ల పైప్లైన్తో, రాబోయే సంవత్సరాల్లో విస్తృత శ్రేణి గృహ కొనుగోలుదారుల అవసరాలను తీర్చడానికి ఎంఎస్ఎన్ రియల్టీ సిద్ధంగా ఉంది.నిర్మాణం వేగంగా, ఖచ్చితత్వంతో ముందుకు సాగుతున్న కొద్దీ, వన్ బై ఎంఎస్ఎన్ ఇకపై కేవలం ఒక ఆశాజనకమైన ప్రారంభం మాత్రమే కాదు, హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ రంగంలో ఒక నిర్వచనాత్మక మైలురాయిగా వేగంగా అవతరిస్తోంది.వన్ బై ఎంఎస్ఎన్. వేగవంతమైన పురోగతి. బలమైన పునాది. -
రియల్ఎస్టేట్ ప్రాజెక్టుల ల్యాండ్ డీల్స్ తగ్గాయ్..
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం స్థలాల కొనుగోళ్లు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొంత నీరసించాయి. 2,994 ఎకరాలను రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇందులో సగం మేర లిస్టెడ్ రియల్టీ కంపెనీలు కొనుగోలు చేసినవే కావడం గమనార్హం.రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2025–26లో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధికి కోసం గాను, 2,994 ఎకరాలకు సంబంధించి 111 భూముల కొనుగోలు లావాదేవీలు నమోదయ్యాయి. 2024–25లో 3,071 ఎకరాలకు సంబంధించి 143 లావాదేవీలు జరగడం గమనార్హం. ప్రతి రెండు లావాదేవీల్లో ఒకటి లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ రూపంలోనే ఉన్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.1,433 ఎకరాలకు సంబంధించి 54 కొనుగోలు లావాదేవీలు లిస్టెడ్ కంపెనీల రూపంలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వడోదర, అమృత్సర్, నాగ్పూర్, పానిపట్, మైసూర్, రాయిపూర్, కోయింబత్తూర్ తదితర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో భూములను సమీకరించాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్, లోధా డెవలపర్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ చురుగ్గా వ్యవహరించాయి.‘‘లిస్టెడ్ సంస్థలు క్రమంగా మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. కస్టమర్లు బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్టుల్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుండడం వీటికి డిమాండ్ను పెంచుతోంది. భూముల కొనగోలు అన్నది భారీ పెట్టుబడి నియంత్రణలతో ముడిపడిన అంశం. అందుకే అసంఘటిత రంగంలోని సంస్థలు, చిన్న డెవలపర్ల కంటే లిస్టెడ్ రియల్టీ కంపెనీలకు సానుకూలత ఎక్కువగా ఉంటోంది’’అని అనుజ్ పురి వివరించారు. -
ఆఫీసులకు భలే డిమాండ్.. మూడు నెలల్లో కొత్త రికార్డులు
అంతర్జాతీయంగా అనిశ్చితులున్నప్పటికీ భారత ఆఫీస్ మార్కెట్ డిమాండ్కు కొత్త రికార్డులకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో 21.5 మిలియన్ చదరపు అడుగుల స్థూల(ఎస్ఎఫ్టీ) ఆఫీస్ వసతుల (ఆఫీస్ లీజ్/కార్యాలయ స్థలాలు) లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్ 19.5 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగింది.ఇక నికర ఆఫీస్ లీజింగ్ (రెన్యువల్స్ కాకుండా) 7 శాతం పెరిగి 13.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, ముంబై, చెన్నై, కోల్కతా నగరాల డేటా ఆధారంగా ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా విడుదల చేసింది. ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు విదేశీ సంస్థల నుంచి బలమైన డిమాండ్ ఉన్నట్టు తెలిపింది.‘‘భారత్ ఆఫీస్ మార్కెట్ మొదటి త్రైమాసికంలో ఇప్పటి వరకు లేనంతటి బలమైన పనితీరును పనిచేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య ఇది చెప్పుకోతగ్గ పనితీరే. అంతర్జాతీయ సంస్థలు భారతదేశాన్ని వినియోగించుకునే విధానంలో వచి్చన మౌలిక మార్పు ఈ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోంది’’అని జేఎల్ఎల్ ఇండియా ఆఫీస్ లీజింగ్ హెడ్ రాహుల్ అరోరా తెలిపారు. జీసీసీల జోరు.. విదేశీ సంస్థలు ఏర్పాటు చేసిన జీసీసీల లీజింగ్ 43 శాతం పెరిగి 9.8 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది. మొత్తం లీజింగ్లో 45.5 శాతంగా ఉంది. ‘‘ఇవేవీ వ్యూహాత్మక బ్యాక్ ఆఫీస్లు కానేకావు. ఏఐ అభివృద్ధి, డిజిటల్ ఇంజనీరింగ్, ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ఆవిష్కరణల కేంద్రాలు’’అని జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. టాప్–7 నగరాల్లో బెంగళూరు ఆఫీస్ మార్కెట్ మెరుగైన పనితీరు చూపించింది.మార్చి త్రైమాసికంలో స్థూల లీజింగ్ 25 శాతం పెరిగి 5.3 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. మార్చి త్రైమాసికంలో స్థూల లీజింగ్లో 9.2 మిలియన్ ఎస్ఎఫ్టీ దేశీ సంస్థలు తీసుకున్నవే. క్రితం ఏడాది మార్చి క్వార్టర్తో పోల్చితే 5 శాతం పెరిగింది. దేశీ సంస్థలు తీసుకున్న లీజింగ్లోనూ 57.8 శాతం ఫ్లెక్స్ ఆపరేటర్ల రూపంలోనే ఉన్నట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. -
హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే అపార్ట్మెంట్లు!
హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ పరంగా దూసుకుపోతోంది. ఐటీ కారిడార్లోని పశ్చిమ హైదరాబాద్లో గజం ధర ఆకాశాన్ని తాకుతున్న వేళ, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు తక్కువ ధరలో అనువైన ఇళ్లు లభించే ఇతర ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం.. హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కాస్తంత తక్కువలో దొరికే ఓ ఐదు ప్రాంతాలను ఈ కథనంలో పరిశీలిద్దాం..పటాన్చెరుపటాన్చెరు ప్రస్తుతం హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఔటర్ రింగ్ రోడ్ (ORR), ముంబై హైవేకు సమీపంలో ఉండటం దీనికి పెద్ద ప్లస్.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,800 – రూ.7,200రూ.55 - రూ.75 లక్షల మధ్య ఇక్కడ మంచి 2BHK ఫ్లాట్ కొనుక్కోవచ్చు.అనుకూలతలు: ఐటీ కారిడార్కు (గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) కేవలం 20-30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి.ఉప్పల్ - పోచారంతూర్పు హైదరాబాద్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఉప్పల్ ఐటీ పార్క్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ ధరలు చాలా తక్కువ.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,500 – రూ.6,500ఇక్కడ రూ.45 - రూ.60 లక్షల మధ్య 2BHK ఫ్లాట్ లభిస్తుంది.అనుకూలతలు: మెట్రో రైల్ కనెక్టివిటీ, ఇన్ఫోసిస్ వంటి పెద్ద ఐటీ కంపెనీల క్యాంపస్లు ఉండటం వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు ఇది సరైన ఎంపిక.కొంపల్లినార్త్ హైదరాబాద్లో కొంపల్లి ప్రశాంతమైన, కాస్త తక్కువ ధరలో ఇళ్లకు నిలయంగా మారింది. ఇది రిటైల్ హబ్గా కూడా ఎదుగుతోంది.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.5,000 – రూ.6,500రూ.40 - రూ.55 లక్షల లోపే ఇక్కడ అన్ని సౌకర్యాలతో 2BHK ఫ్లాట్ వస్తుంది.అనుకూలతలు: తక్కువ ట్రాఫిక్, విశాలమైన రోడ్లు, నాణ్యమైన విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇది ఫ్యామిలీస్ ఉండటానికి చాలా అనుకూలంగా ఉంటుంది.నిజాంపేట్ - బాచుపల్లిఐటీ నిపుణులకు సమీపంలో, తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకునే వారికి నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాలు హాట్ ఫేవరెట్.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,200 – రూ.5,800రూ.50 - రూ.70 లక్షల మధ్య ఇక్కడ మంచి 2BHK ఫ్లాట్ కొనుక్కోవచ్చు.అనుకూలతలు: మియాపూర్ మెట్రో స్టేషన్కు దగ్గరగా ఉండటం, మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.ఆదిభట్లవిమానాశ్రయం, టీసీఎస్ (TCS), ఏరోస్పేస్ పార్క్లకు సమీపంలో ఉండటం ఆదిభట్ల ప్రత్యేకత. పెట్టుబడి కోణంలో చూస్తే ఇది అద్భుతమైన ప్రాంతం.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.3,800 – రూ.4,800ఈ ప్రాంతంలో రూ.55 - రూ.75 లక్షలు పెడితే 2BHK ఫ్లాట్ కొనవచ్చు.అనుకూలతలు: ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వల్ల నగరం నలుమూలలకూ సులభంగా చేరుకోవచ్చు. భవిష్యత్తులో ఇక్కడ ప్రాపర్టీ విలువలు బాగా పెరిగే అవకాశం ఉంది.పైన పేర్కొన్న ధరలు కొనుగోలుదారుల అవగాహన కోసం మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా ఇచ్చిన సగటు అంచనా ధరలు మాత్రమే. బిల్డర్, ఫ్లోర్, ఎంచుకునే సౌకర్యాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. -
ఆస్తి అమ్మేసిన HDFC బ్యాంక్ మాజీ చీఫ్ ఫ్యామిలీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ ఎండీ ఆదిత్య పూరి కుటుంబ సభ్యులు ముంబైలోని తమ లగ్జరీ అపార్ట్మెంట్ను భారీ ధరకు విక్రయించారు. ఆదిత్య పూరి భార్య అనితా పూరి, కుమార్తె అమృతా పూరి కలిసి వర్లీ ప్రాంతంలోని తమ నివాసాన్ని రూ. 27 కోట్లకు అమ్మేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది. ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ బ్యాంకర్ ఆదిత్య పూరి కుటుంబం చేసిన భారీ ఆస్తి విక్రయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.లాభదాయకమైన విక్రయంఈ అపార్ట్మెంట్ను అనితా పూరి కుటుంబం మార్చి 2017లో రూ. 19.81 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా జరిగిన విక్రయం ద్వారా వారికి దాదాపు రూ. 7 కోట్లకు పైగా లాభం చేకూరింది. ముంబైలోని అత్యంత విలాసవంతమైన 'ఓంకార్ 1973' భవనంలోని ఎత్తైన అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. దీనిని సురేమ్య నెవాటియా, అక్షడా నెవాటియాలు కొనుగోలు చేశారు.మార్చి 24, 2026న ఈ లావాదేవీ అధికారికంగా నమోదైంది. ఈ డీల్ కోసం కొనుగోలుదారులు రూ. 1.62 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించారు. ఈ అపార్ట్మెంట్తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు కూడా కొనుగోలుదారులు పొందారు.అయితే, ఈ విక్రయంపై పూరి కుటుంబం గానీ, కొనుగోలుదారులు గానీ ఇంతవరకు స్పందించలేదు.ఓంకార్ 1973 ప్రత్యేకతముంబైలోని వర్లీలో ఉన్న 'ఓంకార్ 1973' ఒక ఐకానిక్ ఆకాశహర్మ్యం. ఓంకార్ రియల్టర్స్ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్, అరేబియా సముద్రం వ్యూ, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అల్ట్రా-ప్రీమియం జీవనశైలిని అందిస్తుంది. నగరంలోని అత్యంత ఖరీదైన చిరునామాలలో ఇది ఒకటి.అనితా పూరి, అమృతా పూరి గతంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టారు. నవంబర్ 2020లో వారు ముంబైలోని మలబార్ హిల్స్లో రూ. 50 కోట్ల విలువైన మరో లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. లోధా సీమాంట్ ప్రాజెక్టులోని 19వ అంతస్తులో ఉన్న ఆ ఫ్లాట్కు ఏడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అప్పట్లో ఆ లావాదేవీకి రూ. 1 కోటి స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు వార్తాలు వచ్చాయి.ఇదీ చదవండి: బెంగళూరులో ఇంటి ఓనర్స్ అయిపోయాం.. -
బెంగళూరులో ఇంటి ఓనర్స్ అయిపోయాం..
సొంత ఇల్లు.. సగటు మధ్యతరగతి మనిషి జీవితకాల కల. అదీ ముంబై తర్వాత అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్గా (Real Estate Market) చెప్పే బెంగళూరు నగరంలో. ఆ సొంతింటి కలని నిజం చేసుకోవడం వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో, ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉంటాయో వివరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ జంట పంచుకున్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.అడుగు ముందుకు వేయడమే అతిపెద్ద సాహసం!సుమారు 18 నెలల క్రితం జెనిత్ రాయ్ చక్రవర్తి, ఆమె భర్త బెంగళూరులోని ఒక ప్రైమ్ లొకేషన్లో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితికి అది కొంత భారము అయినా, ఆ రిస్క్ తీసుకోవడానికే వారు సిద్ధపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంపై కనీస అవగాహన గానీ, సరైన మార్గదర్శకులు గానీ లేకపోయినా.. ధైర్యమే పెట్టుబడిగా ముందుకెళ్లారు.నిద్రలేని రాత్రులు.. ఎన్నో సందేహాలుఈ ప్రయాణం పూల బాట ఏమీ కాదని జెనిత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. వారు ఎదుర్కొన్న సవాళ్లు ఇవే.. ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉంది, ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. గృహ రుణాలు (Home Loans), ప్రాపర్టీ మార్కెట్ నిబంధనలు అర్థం చేసుకోవడానికి సొంతంగా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ‘మేము సరైన నిర్ణయమే తీసుకున్నామా?’ అనే భయం, నిద్రలేని రాత్రులు వారిని వెన్నెంటే ఉన్నాయి.‘మేము దాదాపు శూన్యం నుంచి మొదలుపెట్టాం. ప్రతి అడుగులోనూ భయం ఉన్నా, ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మా కుటుంబ సభ్యుల మద్దతు మమ్మల్ని ముందుకు నడిపించింది’ అని జెనిత్ భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Zenith Roy Chakraborty (@zenithroyofficial)నిర్మాణంతో పాటే.. ఆత్మవిశ్వాసం కూడా!వందల సార్లు సైట్ విజిట్లు చేయడం, డాక్యుమెంట్లు సరిచూసుకోవడం, బ్యాంకుల చుట్టూ తిరగడం.. ఇలా ప్రతి దశలోనూ వారు కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇల్లు రూపుదిద్దుకుంటున్న కొద్దీ, వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. చివరకు ఆ ఇల్లు పూర్తి కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు..‘ఇది ఇతరులకు కేవలం ఒక ఆస్తిలా కనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇది మా కష్టానికి, పట్టుదలకు నిదర్శనం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జంట వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఎవరైనా కష్టపడితే, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే తమ కలను ఎలా నిజం చేసుకోవచ్చో చెప్పడానికి ఈ జంట ప్రయాణమే ఒక నిదర్శనం.ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా? -
అపార్ట్మెంట్ల ధరలు పెరిగే అవకాశం!
పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో (Impact of West Asia War) నిర్మాణ రంగం కష్టాల్లో కూరుకుపోయింది. అసలే మార్కెట్ లేక అయోమయంలో ఉన్న బిల్డర్లకు యుద్ధం రూపంలో మరో బాంబ్ పేలింది. దాంతో సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కల చెదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్మాణ రంగంలో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడంతో రానున్న రోజుల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వంటి ముడి చమురు, సహజ వాయువు కొరత, సరుకు రవాణాకు అంతరాయం, తగ్గిన ముడి పదార్థాల దిగుమతులు నిర్మాణ రంగాన్ని షేక్ చేస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోఇంధన వనరులపై ఆధారపడిన నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో సిమెంట్, స్టీల్, (Cement and Steel rates) అల్యూమినియం, శానిటరీ, రంగులు, ప్లంబింగ్ పైపులు, యూపీవీసీ వంటి గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో ఆయా ఉత్పత్తుల ధరలు 20–50 శాతం మేర పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయి గృహ నిర్మాణదారులు, డెవలపర్లు హడలెత్తిపోతుండగా, వారు ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్పత్తుల తయారీలో చమురు కీలకం..నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు. కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. కాగా టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ అత్యంత కీలకం∙ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది.దీంతో పీవీసీ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్లు, శానిటరీ వేర్ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. మొత్తం మీద నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు చివరిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయడం తప్పనిసరి. ఫలితంగా అపార్ట్మెంట్ల ధరలు (Apartment Prices) చదరపు అడుగు (చ.అ.)కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.ఎన్నికల ప్రభావంనిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయంతో పాటు నిర్మాణ రంగంపై ఎన్నికల ప్రభావం కూడా పడింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలు నెమ్మదించాయి. నిర్మాణ వ్యయం, వినియోగ ఖర్చులు, వడ్డీల భారం డెవలపర్లపై పడుతోంది. దీంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెవలపర్లకు అధిక పెట్టుబడులు అవసరం అవుతాయి. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరో ఆరు నెలల పాటు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు కుదేలవడంతో పాటు వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా? -
చెన్నైలో త్రిష కలల సౌధం ధర ఎంతంటే..
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో రెండు దశాబ్దాలకుపైగా తనదైన ముద్ర వేసి సౌత్ క్వీన్గా పేరు తెచ్చుకున్నారు నటి త్రిష కృష్ణన్. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ నిత్యం వెలుగు జిలుగుల మధ్య గడిపే సెలబ్రిటీల ఇళ్లు అంటే సాధారణంగా ఆడంబరాలకు నిలయంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ, చెన్నైలోని త్రిష నివాసం ఇందుకు భిన్నం. ఆడంబరం కంటే అభిరుచికి, ప్రదర్శన కంటే ప్రశాంతతకు పెద్దపీట వేస్తూ ఆమె తీర్చిదిద్దుకున్న ఈ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చెన్నైలోని అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన తైనాంపేటలోని సెనోటాఫ్ రోడ్లో త్రిష నివాసం ఉంది. నగరంలోని వీవీఐపీలు, ఉన్నతాధికారులు నివసించే ఈ ప్రాంతం భద్రతకు, గోప్యతకు మారుపేరు. దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఈ ఇంటిని తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా మలుచుకున్నారు. త్రిష నివాసంలో ప్రతి మూలా ఆమె అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఇంటి లోపల వాడిన రంగులు, అలంకరణ సామాగ్రి కళ్లకు ఇంపుగా ఉంటాయి. దక్షిణ భారత సంప్రదాయ కట్టడాల శైలిని విస్మరించకుండానే ఆధునిక ఆర్కిటెక్చర్ను ఇందులో జోడించారు. పెద్ద కిటికీలు సహజ సిద్ధమైన వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చేస్తూ ఒక హైబ్రిడ్ లుక్ ఇస్తున్నాయి. భారీ అలంకరణల కంటే, కంఫర్ట్కే ప్రాధాన్యం ఇస్తూ గదులను డిజైన్ చేశారు.గతంలో ఈ ఇల్లు కొన్ని అవాంఛనీయ ఘటనల వల్ల కూడా వార్తల్లో నిలిచింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వల్ల పోలీసులు ఇక్కడ సోదాలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే, ఇలాంటి ఆటంకాలు ఎదురైనా తన వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా త్రిష జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!
ముంబైలోని జుహు తారా రోడ్డులో.. సముద్రానికి ఎదురుగా ఉన్న లీలా బంగ్లా రూ. 221 కోట్లకు అమ్ముడైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బంగ్లా ఆర్ట్ డెకో నిర్మాణం, గ్రేడ్ IIB వారసత్వ హోదాను కలిగి ఉంది. దీనిని అమ్మకానికి పెట్టిన తరువాత చాలామంది డెవలపర్లు, వ్యాపారవేత్తలను ఆకట్టుకుంది.నానావతి మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన గౌతమ్ నానావతికి చెందిన లీలా బంగ్లాను నోటండాస్ జ్యువెలర్స్ గ్రూప్లో భాగమైన నోటండాస్ రియల్టీ రూ.221 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత బుధవారం ఈ లావాదేవీ అధికారికంగా ఖరారైందని సమాచారం.నోటండాస్ రియల్టీ సంస్థకు చెందిన మహేష్ జగ్వాని, హర్ష్ జగ్వాని అనే తండ్రి-కొడుకు ఈ డీల్ను పూర్తి చేశారు. వీరు నోటండాస్ జ్యువెలర్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనిని 1983లో కిషిన్ జగ్వానీ స్థాపించారు. ఇది బాంద్రాలోని వాటర్ఫీల్డ్ రోడ్ నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.చదరపు అడుగుకు రూ. 2,60,5921,355 చదరపు మీటర్ల స్థలంలో ఉన్న లీలా బంగ్లా నిర్మాణ విస్తీర్ణం సుమారు 8,480 చదరపు అడుగులు. అదనంగా 2,500 చదరపు అడుగుల టెర్రస్.. 5,000 చదరపు అడుగుల తోట కూడా ఉన్నాయి. చదరపు అడుగుకు రూ. 2,60,592 ధర చెల్లించినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ బంగ్లాలో 1950ల కాలానికి చెందిన బర్మా టేకు చెక్కతో తయారైన తలుపుల ఫ్రేములు, మెట్ల నిర్మాణం, అలంకరణలు ఉన్నాయి. ఈ భవనం ఆర్ట్ డెకో శైలిని ప్రతిబింబిస్తూ పురాతన సౌందర్యాన్ని కాపాడుకుంటోంది. సముద్రం వైపు ఉండే ఇలాంటి పెద్ద స్థలాలు జూహు ప్రాంతంలో చాలా అరుదుగా లభిస్తాయి. అందుకే ఈ ఆస్తికి వ్యాపారవేత్తలు, డెవలపర్లు ఎంతో ఆసక్తి చూపారు.కేవలం మరమ్మతులు మాత్రమే..అయితే.. గ్రేడ్ IIB హెరిటేజ్ హోదా ఉండటం వల్ల ఈ భవనాన్ని పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మించలేరు. కేవలం మరమ్మతులు, విస్తరణలు మాత్రమే చేయవచ్చు. అవి కూడా అసలు నిర్మాణ శైలిని కాపాడే విధంగా ఉండాలి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఈ ఆస్తి ప్రాముఖ్యత తగ్గలేదు.ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ఈ లావాదేవీని నిర్వహించిందని నివేదిక పేర్కొంది, అయితే ఈ విషయంపై సంప్రదించినప్పుడు ఆ సంస్థ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఈ బంగ్లాను మొదట 2022లో రూ. 210-220 కోట్ల అంచనా ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ధరను రూ. 250 కోట్లకు పెంచారు. చివరికి రూ.221 కోట్లకు అమ్ముడైంది.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు! -
దుబాయ్ రియల్టీలో భారత పెట్టుబడులకు బ్రేక్!
పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి గమ్యస్థానమైన దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారులు కొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించవచ్చని, దీనివల్ల దుబాయ్ రియల్టీలోకి వచ్చే భారతీయ మూలధనం తగ్గే అవకాశం ఉందని అనారాక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయుష్ పురి విశ్లేషించారు. అయితే, ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని, భారత్-దుబాయ్ మధ్య ఉన్న సుదీర్ఘ పెట్టుబడి బంధం చెక్కుచెదరదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఆర్థిక అంశాలే కీలకంపశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి భారత్పై రెండు రకాలుగా ప్రభావం చూపుతుందని ఆయుష్ పేర్కొన్నారు. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం హార్మూజ్ జలసంధిపై గణనీయంగా ఆధారపడుతుంది. అక్కడ అంతరాయం కలిగితే చమురు ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో ఒత్తిడి పెరిగినప్పుడల్లా రూపాయి విలువ ఒడిదుడుకులకు లోనవుతుంది. దీనివల్ల విదేశీ కేటాయింపులు చేసే పెట్టుబడిదారులు తమ నిర్ణయాలను పునసమీక్షించుకోవాల్సి వస్తోంది.‘సంఘర్షణ స్వల్పకాలికమైతే అది కేవలం భయాందోళనలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అది సుదీర్ఘకాలం కొనసాగితే వినియోగదారుల ప్రవర్తన మారుతుంది. పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, రూపాయిపై ఒత్తిడి వల్ల పెట్టుబడిదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు’ అని ఆయూష్ వివరించారు.స్వదేశీ మార్కెట్కు కలిసొచ్చే అవకాశందుబాయ్లో పెట్టుబడులు తగ్గడం భారతీయ ప్రీమియం హౌసింగ్ మార్కెట్కు వరంగా మారే అవకాశం ఉంది. విదేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన స్వదేశీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
హైదరాబాద్లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ
న్యూఢిల్లీ: ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతుండడంతో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రముఖ నగరాల్లో జనవరి–మార్చి త్రైమాసికంలో కార్యాలయ అద్దెలు 2–15 శాతం మధ్య పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు) రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లోని ప్రముఖ ప్రాంతాల్లో మొదటిసారి చదరపు అడుగుకు (ఎస్ఎఫ్టీ) నెలవారీ అద్దె రూ.100 మార్క్ను అధిగమించింది. ముంబైలో ఇప్పటికే నెలవారీ ఆఫీస్ అద్దెలు రూ.100కు పైనే ఉండడం గమనార్హం.నగరాల వారీ డేటా.. హైదరాబాద్లో కార్యాలయ స్థలాల నెలవారీ అద్దె చదరపు అడుగుకు 8 శాతం ఎగిసింది. రూ.77.5కు చేరింది. చెన్నైలోనూ 8 శాతం పెరుగుదలతో రూ.74.50గా నమోదైంది. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతాలో కార్యాలయ స్థలాల (ఆఫీస్) అద్దెలు మార్చి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో నెలవారీ ఆఫీస్ అద్దెలు 15 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.105కి చేరాయి. ముంబైలో నెలవారీ ఆఫీస్ అద్దెలు 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.125 మార్క్నకు చేరాయి. బెంగళూరులో చదరపు అడుగు నెలవారీ అద్దె రూ.100.6కు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 7 శాతం పెరిగింది. పుణెలో 5 శాతం పెరిగి ఎస్ఎఫ్టీ అద్దె రూ.80.9కు చేరింది. కోల్కతాలో ఆఫీస్ అద్దెలు 15 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.48.30కి చేరాయి. అహ్మదాబాద్లో నెలవాసీ సగటు ఆఫీస్ స్పేస్ అద్దె ధర 2 శాతం పెరిగి ఎస్ఎఫ్టీకి రూ.45గా ఉంది. డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ 2026 మొదటి త్రైమాసికంలో ఎనిమిది నగరాల్లో రికార్డు స్థాయిలో 2.99 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాల లీజు లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 6 శాతం పెరుగుదల కనిపిస్తోంది. కానీ, ఇదే కాలంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్థలాలు 1.4 కోట్ల చదరపు అడుగులు మాత్రమే. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే సరఫరా సైతం 154 శాతం పెరిగింది. కానీ, డిమాండ్కు తగ్గ సరఫరా రానట్టు నైట్ఫ్రాంక్ నివేదిక తెలిపింది.కీలక మార్కెట్లలో సరఫరా తగ్గడంతో అద్దెలు స్థిరంగా పెరిగేందుకు దారితీసినట్టు వెల్లడించింది. డెవలపర్లు ఆఫీస్ ప్రాజెక్టుల కంటే నివాస గృహాలవైపు మొగ్గు చూపడం డిమాండ్కు తగ్గ సరఫరా రాకపోవడానికి కారణమని వివరించింది. ‘‘2021 నుంచి ఆపీస్ స్థలాలకు డిమాండ్, సరఫరా మధ్య అంతరం కొనసాగుతోంది. దీంతో సరఫరా పరిస్థితులు కఠినంగా మారాయి. 2021లో 17.2 శాతం మేర కార్యాలయ స్థలాలు ఖాళీగా ఉంటే, ఇప్పుడు 13.9 శాతానికి తగ్గిపోయింది. కార్యాలయ స్థలాల అభివృద్ధికి భారీ పెట్టుబడులు అవసరం కావడంతో, కేవలం కొన్ని సంస్థలు మాత్రమే ఈ రంగం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి’’ నైట్ఫ్రాంక్ నివేదిక వివరించింది. -
డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా!
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో కార్యాలయ నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2026 గడిచిన మూడు నెలల్లో కొత్త కార్యాలయ భవనాల నిర్మాణంలో గణనీయమైన క్షీణత నమోదైంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డెవలపర్లు ఆచితూచి అడుగులు వేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.నిర్మాణాల్లో 36 శాతం కోతప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘వెస్టియన్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2026 జనవరి-మార్చి మధ్య కాలంలో కొత్త కార్యాలయ విస్తీర్ణం కేవలం 9.7 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. ఇది గత నాలుగు త్రైమాసికాల్లోనే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. గత త్రైమాసికంతో పోలిస్తే కొత్త నిర్మాణాల పూర్తి 36 శాతం మేర పడిపోయింది.ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ఐటీ హబ్ల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముంబైలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ గత త్రైమాసికంలో 6.0 మిలియన్ చ.అడుగులుగా ఉన్న సరఫరా, ఈసారి ఏకంగా 95 శాతం తగ్గి కేవలం 0.3 మిలియన్ చ.అడుగులకు చేరుకుంది.సరఫరాలోనే సంకటంనిర్మాణాల్లో మందగమనం ఉన్నప్పటికీ ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ మాత్రం తగ్గలేదు. మొదటి త్రైమాసికంలో కార్యాలయ డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగి 21.53 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంతర్జాతీయ సంస్థలు భారత్ను వ్యూహాత్మక కేంద్రంగా భావించి తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను విస్తరిస్తుండటమే ఈ డిమాండ్కు కారణం. ‘సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు ప్రాజెక్టుల పూర్తి కావడాన్ని ఆలస్యం చేస్తున్నాయి. అయినప్పటికీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల నుంచి వస్తున్న నిరంతర లీజింగ్.. ప్రపంచ స్థాయిలో భారత్ ప్రాముఖ్యతను చాటుతోంది’ అని వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ రావు అన్నారు.ఇదీ చదవండి: సరిగా కొంటేనే.. బంగారం! -
ఇల్లు.. ఎలాంటి డబ్బుతో కడుతున్నారు?
సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే అది వారి కష్టార్జితం లేదా బ్యాంకు రుణాల ద్వారా పొందిన సొమ్ము అయి ఉండాలి. కానీ, కొందరు నేరస్థులు డ్రగ్స్ రవాణా, అవినీతి లేదా ఇతర అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన నల్లధనాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెడుతుంటారు.రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుడికి చెందిన కోటి రూపాయల విలువైన ఇంటిని అధికారులు సీజ్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, అక్రమ సంపాదనతో ఇళ్లు నిర్మిస్తే ఎదురయ్యే పరిణామాలు, చట్టపరమైన నిబంధనలపై ప్రత్యేక కథనం.ఆ ఇల్లు ఏ డబ్బుతో కట్టారు?నాగౌర్ కేసులో నిందితుడు గోవింద్ రామ్ అలియాస్ గోవింద్ జాట్, అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో తన నివాసాన్ని నిర్మించాడు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) యాక్ట్ ప్రకారం, ఇలాంటి మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా అక్రమమైనది. పోలీసులు జరిపిన విచారణలో, సదరు నిందితుడు తన నేరపూరిత ఆదాయాన్ని దాచడానికి ఆ ఆస్తిని భార్య పేరిట రిజిస్టర్ చేసినట్లు తేలింది.ఇంటి నిర్మాణ నిధులపై నిబంధనలు ఏమిటి?భారతదేశంలో ఆస్తుల కొనుగోలు లేదా నిర్మాణం విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. భారీ వ్యయంతో కూడిన నిర్మాణాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయో యజమాని నిరూపించాల్సి ఉంటుంది. ఒకరు డబ్బు చెల్లించి, మరొకరి పేరు మీద (భార్య, పిల్లలు లేదా ఇతరులు) ఆస్తిని కొనుగోలు చేస్తే, ఆ నిధులకు సరైన లెక్క లేని పక్షంలో దానిని 'బినామీ' ఆస్తిగా పరిగణిస్తారు. ఎన్డీపీఎస్ సెక్షన్ 68 (E) ప్రకారం.. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు తమ నేరాల ద్వారా ఆర్జించిన డబ్బుతో కొన్న ఆస్తులను గుర్తించి, వాటిని స్తంభింపజేసే అధికారం పోలీసులకు, కేంద్ర సంస్థలకు ఉంటుంది.భవిష్యత్తులో స్వాధీనం చేసుకుంటారా?అవును, అక్రమ సొమ్ముతో నిర్మించిన ఆస్తులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అలాంటి ఇళ్లను ప్రభుత్వాలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ప్రాథమిక ఆధారాలు లభించిన వెంటనే ఆ ఆస్తిని ఎవరికీ విక్రయించకుండా లేదా బదిలీ చేయకుండా పోలీసులు స్తంభింపజేస్తారు. కోర్టులో నేరం నిరూపితమైతే, సదరు ఆస్తిని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. నాగౌర్ కేసులో కూడా ఎస్పీ రోషన్ మీనా తెలిపిన వివరాల ప్రకారం, సదరు నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.కొన్ని రాష్ట్రాల్లో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నేరస్థులు నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కట్టుకోవడం గౌరవం. కానీ, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిర్మించిన 'సౌధాలు' ఎంతో కాలం నిలవవు.ఇదీ చదవండి: హైదరాబాద్లో రియల్ బూమ్.. ఇప్పుడు ఇక్కడే.. -
హైదరాబాద్లో రియల్ బూమ్.. ఇప్పుడు ఇక్కడే..
15 కి.మీ. దూరంలో సెక్రటేరియట్, లక్డీకాపూల్ వంటి హాట్ స్పాట్స్..20 కి.మీ. దూరంలో ఐటీ హబ్, శంషాబాద్ విమానాశ్రయం..చుట్టూ ఆర్మీ కాపలా.. హిమాయత్నగర్, గండిపేట జలాశయాలతో కళకళ..కూతవేటు దూరంలో అంతర్జాతీయ స్థాయి విద్యా, వైద్య, వినోద కేంద్రాలు.. ..ఇలాంటి వసతులు ఉన్న ఏ ప్రాంతంలోనైనా స్థిరాస్తి ధరలు ఆకాశంలో ఉంటాయి. కానీ, అందుబాటు ధరల్లోనే సామాన్యుల సొంతింటి కలను నెరవేరుస్తోంది బుద్వేల్. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో అప్పా జంక్షన్, బండ్లగూడ, హైదర్షాకోట్, కిస్మత్పూర్, బుద్వేల్, అత్తాపూర్, పీరంచెరువు, మంచిరేవుల ప్రాంతాలు ప్రధానమైనవి. -సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో రియల్ బూమ్ బంజారాహిల్స్తో మొదలై.. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్కు, అక్కడి నుంచి గచ్చిబౌలి, కొండాపూర్కు విస్తరించింది. ప్రస్తుతం ఈ బూమ్ బుద్వేల్కు విస్తరించిందని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెట్రో రైలుతో సిటీలో ప్రయాణం సులువైంది. ఔటర్ రింగ్ రోడ్డుతో ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, హార్డ్వేర్ పార్క్లతో పాటు ఏరో స్పేస్ కంపెనీలకు సులువుగా చేరుకునే అవకాశం కలిగింది. అలాగే ఓఆర్ఆర్ మీదుగా 40 కి.మీ. దూరంలో షాద్నగర్, కొత్తూరులోని లాజిస్టిక్ పార్కులకూ చేరుకోవచ్చు. అందుకే ఇప్పటి వరకు ధనవంతులు తమ మొదటి ఆస్తిని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎంచుకుంటే.. రెండో ఆస్తిని రాజేంద్రనగర్లో ఎంచుకుంటున్నారు. ఇది చాలు రాజేంద్రనగర్ ఉన్నత శ్రేణి వర్గాలు ఉండే ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి.. ఐటీ, ఎన్నారైల దృష్టి ఇక్కడే.. రూ.35వేల నుంచి రూ.40 వేల మధ్య వేతనాలు ఉండే ప్రతి ఉద్యోకి ఇది అనుకూలమైన ప్రాంతం. ఐటీ ఉద్యోగులందరికీ భారీ వేతనాలు ఉండవు. దీంతో గచి్చబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఉండలేకపోతున్నారు. అందుబాటు ధరల్లో.. తక్కువ దూరంలో ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. రేతిబౌలి ఫ్లైఓవర్ మీదుగా రాయదుర్గం జంక్షన్ నుంచి ఐటీ హబ్కు త్వరగా చేరుకోవచ్చు.అందుకే గతంలో మాదిరిగా ట్రాఫిక్లో చిక్కుకుంటూ జూబ్లీహిల్స్ మీదుగా సైబర్ టవర్స్కు వెళ్లే బదులు లంగర్హౌజ్ మీదుగా రాయదుర్గం జంక్షన్కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఐటీ హబ్కు కూతవేటు దూరమే. 20 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకునే వీలుండటంతో ఎన్నారైలు, విదేశీయులు ఈ ప్రాంతంపై మక్కువ చూపుతున్నారు.వంద ఫీట్ల రోడ్డు.. బుద్వేల్ నుంచి సన్సిటీ మీదుగా బండ్లగూడ జాగీర్ వరకూ వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతం ఒక ప్రధాన వృద్ధి కారిడార్గా ఉండటంతో 3–4 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని అంచనా. ఈ ప్రాంతం మధ్యస్థాయి, ఉన్నత స్థాయి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఎన్ఐఆర్డీ, ఎన్జీరంగా వర్సిటీలతో పాటు అప్పా జంక్షన్లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ప్రముఖ ఆస్పత్రులు ఉన్నాయి. అప్పా జంక్షన్ చుట్టూ మిలటరీ ఏరియా ఉండటంతో శాంతి భద్రతల సమస్య లేదు. ఈ ప్రాంతం హిమాయత్సాగర్, గండిపేట జలాశయాలు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదు.రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్.. గతేడాది రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 13,423 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4,140 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయి. రూ.కోట్లలో ఆదాయం సమకూరింది. ప్రతి సంవత్సరం రిజి్రస్టేషన్లు 10–15 శాతం వృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా బుద్వేల్, కిస్మత్పూర్, మంచిరేవుల, హైదర్షాకోట్ ప్రాంతాల్లో రిజి్రస్టేషన్లు జోరుగా సాగుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు విదేశీ సంస్థల ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాపర్టీల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్ మెంట్లలో ధర చ.అ.కు రూ.10 వేల వరకు, విల్లాలు అయితే రూ.12 వేల వరకు చెబుతున్నారు.బుద్వేల్ ఎకో ఫ్రెండ్లీ జోన్బుద్వేల్ పర్యావరణ అనుకూల ప్రాంతం. జంట జలాశయాలు, గ్రీనరీ, ప్రతిపాదిత కొత్వాల్ ఎకో పార్క్లకు సమీపంలో ఉండటంతో ఎకో ఫ్రెండ్లీ జోన్ అయిన ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, వైద్యులు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.– బూరుగు రాంబాబు, డైరెక్టర్, ప్రణవ గ్రూప్ఇది చదివారా? రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్! -
ఇల్లు ఈజీగా కొనండి.. ధనవంతులు అవ్వండి!!
రాబర్ట్ కియోసాకి రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించే ఒక మార్గదర్శి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి సంపదను ఎలా సృష్టించాలో ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తుంది. అసలు తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి? సొంత ఇంటి కల ఎలా నెరవేర్చుకోవాలి? ఆ వివరాలు మీకోసం..ఆస్తి అంటే..కియోసాకి చెప్పే ప్రాథమిక సూత్రం ఒకటే: మీ జేబులోకి డబ్బును తీసుకొచ్చేది 'ఆస్తి' (Asset), మీ జేబులో నుండి డబ్బును బయటకు పంపేది 'అప్పు' (Liability). చాలా మంది తాము నివసించే ఇంటిని అతిపెద్ద ఆస్తిగా భావిస్తారు. కానీ, కియోసాకి దృష్టిలో అది ఒక లయబిలిటీ. ఎందుకంటే దాని వల్ల ప్రతి నెలా మెయింటెనెన్స్, ట్యాక్సుల రూపంలో డబ్బు బయటకు వెళ్తుంది. అదే మీరు ఒక ఇంటిని కొని అద్దెకు ఇస్తే, అది మీకు ప్రతి నెలా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుడు మాత్రమే అది నిజమైన 'ఆస్తి' అవుతుంది.తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ శ్రీకారంరియల్ ఎస్టేట్ అంటే కోట్ల రూపాయలు ఉండాలని భయపడక్కర్లేదు. తక్కువ మొత్తంతో ప్రారంభించడానికి ఈ మార్గాలు చూడండి..ఓపెన్ ప్లాట్లు: నగరం శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చిన్న ప్లాట్లను కొనుగోలు చేయడం ఉత్తమం. వీటి ధర తక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి.రీట్స్: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs)తో స్టాక్ మార్కెట్ లాగే, మీరు రియల్ ఎస్టేట్లో నేరుగా ఆస్తి కొనకుండానే తక్కువ మొత్తంతో (కొన్ని వేల రూపాయలతో) షేర్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు.క్రౌడ్ ఫండింగ్: గ్రూపుగా ఏర్పడి నమ్మకమైన స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఉమ్మడిగా ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా రిస్క్, పెట్టుబడి భారం తగ్గుతాయి.సొంతిల్లు సాకారమయ్యే టిప్స్సొంత ఇంటి కల నెరవేరాలంటే కియోసాకి స్టైల్లో ఈ వ్యూహాలు అనుసరించండి..ముందుగా ఆదాయ వనరుల సృష్టి: నేరుగా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే, మొదట చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం (Passive Income) మీ ఇంటి EMI చెల్లించేలా ప్లాన్ చేయండి.లోకేషన్ ముఖ్యం: అభివృద్ధి చెందుతున్న హైవేలు, ఐటీ కారిడార్లు లేదా మెట్రో ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాలను గుర్తించి ముందే పెట్టుబడి పెట్టండి.పన్ను ప్రయోజనాలు: రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లభించే పన్ను మినహాయింపుల గురించి అవగాహన పెంచుకోండి. ఇది మీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.కియోసాకి గోల్డెన్ రూల్: 'డబ్బు కోసం పని చేయకండి'ధనవంతులు డబ్బు కోసం పని చేయరు, వారి డబ్బు వారి కోసం పని చేసేలా చూసుకుంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన మార్గం."పెద్ద ఇల్లు కొనడం తప్పు కాదు, కానీ ఆ ఇంటి ఖర్చులను మీ జేబులో నుండి కాకుండా, మీరు పెట్టిన ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలతో చెల్లించడమే అసలైన ఆర్థిక తెలివితేటలు." -
రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ తాజాగా తన పుట్టినరోజును జరుపుకొన్నారు. బాలీవుడ్ అగ్ర తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటంతో సోషల్ మీడియా సందడి నెలకొంది. ఈ ప్రత్యేక సందర్భంలో, రాధికా మర్చంట్తో వివాహానికి ముందు తండ్రి ముఖేష్ అంబానీ కానుకగా ఇచ్చిన దుబాయ్లోని అద్భుతమైన విల్లా విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.పామ్ జుమేరాలో బిలియనీర్ ప్యాలెస్దుబాయ్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పామ్ జుమేరా ద్వీపంలో ఉన్న ఈ విల్లా విలువ దాదాపు రూ. 640 కోట్లు. సముద్రపు అంచున, ప్రకృతి ఒడిలో నిర్మితమైన ఈ నివాసం విలాసానికి మారుపేరులా నిలుస్తుంది.విల్లాలోని అద్భుతమైన ఫీచర్లుదాదాపు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి విస్తరించి ఉంది.ఇందులో మొత్తం 10 రాజభవనాల్లాంటి బెడ్రూమ్లు ఉన్నాయి.ఈ విల్లాకు అనుబంధంగా 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ ఉండటం విశేషం.ఇటాలియన్ మార్బుల్స్తో మెరిసిపోయే ఫ్లోరింగ్, గోడలపై అరుదైన కళాఖండాలు ఈ ఇంటికి రాయల్ లుక్ను ఇస్తాయి.తెల్లటి రంగు ఇంటీరియర్స్ ఎడారి వేడిలోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి.విల్లాలో అధునాతన స్పా, టెర్రస్ గార్డెన్, ఇండోర్-అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.ప్రముఖుల నిలయం.. పామ్ జుమేరాదుబాయ్లోని ఈ ప్రాంతం కేవలం అంబానీలకే కాదు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (జన్నత్ విల్లా), అమితాబ్ బచ్చన్ వంటి సెలబ్రిటీల నివాసాలకు కూడా నిలయం. సముద్రపు అలల మధ్య, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ 'డెజర్ట్ మాన్షన్' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటిగా నిలుస్తోంది. -
జీసీసీ లీజింగ్.. రికార్డ్
విదేశీ సంస్థలు భారత్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు పోటీ పడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 9.1 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కార్యాలయ స్థలాలను (ఆఫీస్ స్పేస్) జీసీసీల ఏర్పాటుకు విదేశీ సంస్థలు టాప్–9 నగరాల్లో తీసుకున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తెలిపింది.ఒక త్రైమాసికంలో జీసీసీలకు సంబంధించి ఇదే గరిష్టమని పేర్కొంది. మార్చి త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ నగరాల్లో 5 శాతం పెరిగి 20.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. 2025 మొదటి మూడు నెలల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 19.7 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, అహ్మదాబాద్, కోచి నగరాల డేటాను ఈ నివేదికలో సీబీఆర్ఈ ప్రస్తావించింది.జీసీసీ లీజింగ్ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదు కావడం అన్నది సంక్లిష్టమైన సామర్థ్య కార్యకలాపాలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా అవతరిస్తుండడానికి సంకేతమని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ తెలిపారు. ఏదో ఒక రంగానికే ఈ డిమాండ్ పరిమితం కాలేదని, ఈ–కామర్స్, టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ ఇలా ఎన్నో రంగాల్లో నెలకొన్నట్టు చెప్పారు. అమెరికా సంస్థలే ముందు.. టాప్–9 నగరాల్లో జీసీసీలకు సంబంధించి తీసుకున్న లీజింగ్లో 73 శాతం అమెరికా సంస్థల నుంచే ఉన్నట్టు సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. పర్యావరణ అనుకూలమైన సర్టిఫికేషన్, మెరుదైన సదుపాయాలు ఉన్న వాటికి కిరాయిదారులు ప్రాధాన్యమిస్తున్నట్టు సీబీఆర్ఈ ఎండీ (లీజింగ్ సర్వీసెస్) రామ్ చందానీ తెలిపారు.జీసీసీలు బహుళ కార్యకలాపాలకు సంబంధించి ఆవిష్కరణల కేంద్రాలుగా మారుతున్నాయని, ఏఐ అనుకూల కార్యాలయ వ్యూహాలను సంస్థలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. టాప్–9 నగరాల్లో బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 29 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ 22 శాతం, ముంబైలో 16 శాతం వాటా కలిగి ఉన్నాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో టాప్–9 నగరాల్లోని కార్యాలయ స్థలాల మొత్తం లీజింగ్లో ఈ మూడు నగరాల వాటాయే 67 శాతం ఉండడం గమనార్హం. -
ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ మెరుగు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి–మార్చి త్రైమాసికంలో ఢీలాపడ్డాయి. హైదరాబాద్లో సానుకూల ధోరణి కనిపించింది. అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. మొత్తం మీద హైదరాబాద్ సహా టాప్–8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 84,827 యూనిట్లుగా ఉన్నాయి. 2025 మొదటి మూడు నెలల్లో అమ్మకాలు 88,361 యూనిట్లతో పోల్చితే 4 శాతం తగ్గాయి.అధిక ధరలకు తోడు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితులు అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు బలమైన వృద్ధి అనంతరం మార్కెట్లో స్థిరీకరణ సహజమేనని నైట్ఫ్రాంక్ చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. ధరలు పెరుగుతూ ఉండడం, విక్రయాలు తగ్గడం అన్నది ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిళ్లను తెలియజేస్తున్నట్టు చెప్పారు. మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం సైతం ఉన్నట్టు తెలిపారు.నగరాల వారీ డేటా..హైదరాబాద్లో 9,541 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలతో పోల్చి చూస్తే 1 శాతం పెరిగాయి.బెంగళూరులోనూ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఇళ్ల అమ్మకాలు 5 శాతం పెరిగి 13,092 యూనిట్లుగా ఉన్నాయి.చెన్నైలో 9 శాతం అధికంగా 4,763 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.అహ్మదాబాద్లో 2 శాతం అధికంగా 4,758 యూనిట్ల విక్రయాలు జరిగాయి.కోల్కతాలో 4,043 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 5 శాతం వృద్ధి నమోదైంది.ముంబైలో ఇళ్ల విక్రయాలు 7 శాతం పడిపోయి 23,185 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో ఇళ్ల అమ్మకాలు 12,711 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తగ్గాయి. పుణెలోనూ 11 శాతం తక్కువగా 12,711 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గి 94,855 యూనిట్లకు పరిమితమైంది. -
రియల్టీకి ‘సీజ్ఫైర్’ ఊతం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణగడం అంతర్జాతీయ స్థిరాస్తి మార్కెట్పై సానుకూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం కారణంగా గత కొన్ని వారాలుగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని వెనక్కి నెట్టింది. అయితే, ప్రస్తుతం ఇరాన్, అమెరికా ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణతో తిరిగి ఈ రంగం గాడిలో పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం అనిశ్చితి భయాలతో నిలిపివేసిన లావాదేవీలు ఇప్పుడు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు.యుద్ధంతో వెనక్కి తగ్గిన పెట్టుబడిదారులుఇరాన్-ఇజ్రాయెల్ వివాదం గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో పెట్టుబడిదారులు తమ మూలధనాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు మొగ్గు చూపారు. దీని ప్రభావం దుబాయ్ రియల్టీ మార్కెట్పై స్పష్టంగా కనిపించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల కొనుగోలుదారులు తమ నిర్ణయాలను వాయిదా వేయడంతో మార్చి నెలలో నివాస గృహాల అమ్మకాలు 30 శాతానికి పైగా పడిపోయాయి. ప్రధానంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల లావాదేవీల విలువ, పరిమాణం గణనీయంగా క్షీణించాయి. దుబాయ్ రియల్టీలో దాదాపు 20 శాతం వాటా కలిగిన భారతీయ పెట్టుబడిదారులు కూడా తాత్కాలికంగా తమ కొనుగోలు ప్రయత్నాలను విరమించుకున్నారు.డిమాండ్ బౌన్స్బ్యాక్కాల్పుల విరమణ ప్రకటన వెలువడగానే మార్కెట్లో ఒక్కసారిగా చలనం మొదలైందని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో కొనుగోళ్లపరంగా వెనక్కి తగ్గిన క్లయింట్లు ఇప్పుడు తిరిగి బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. ‘గతంలో ఒప్పందం కుదుర్చుకుని హోల్డ్లో పెట్టిన వారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి వస్తున్నారు’ అని ప్రోయాక్ట్ లగ్జరీ రియల్ ఎస్టేట్ సీఈఓ రీతూ కాంత్ ఓజా తెలిపారు. వాయిదా పడిన లావాదేవీలన్నీ ఒక్కసారిగా కార్యరూపం దాల్చనుండటంతో ఏప్రిల్ నెలలో దుబాయ్ రియల్టీ రంగం భారీగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, రాబోయే 6 నుంచి 8 వారాలు మార్కెట్ స్థిరత్వానికి అత్యంత కీలకమని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..పెట్టుబడిదారులకు నిపుణుల సూచనలుఅనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రాజెక్టుల కంటే వెంటనే అందుబాటులో ఉన్న ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.దుబాయ్ మెరీనా, డౌన్టౌన్ దుబాయ్, జుమేరా విలేజ్ సర్కిల్ (జేవీసీ) వంటి ప్రాంతాల్లో అద్దె ఆదాయం స్థిరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.యుద్ధ మేఘాలు తొలగిపోతుండటంతో దుబాయ్ మరోసారి గ్లోబల్ ఇన్వెస్టర్లకు ‘సేఫ్ హెవెన్’గా మారుతోంది. పెండింగ్లో ఉన్న డిమాండ్ అంతా ఒక్కసారిగా మార్కెట్లోకి రానుండటంతో ఈ వేసవిలో దుబాయ్ రియల్టీ సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. -
'హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు'
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఈ తరుణంలో నైట్ ఫ్రాంక్ ఇండియా 2026 త్రైమాసిక రియల్ ఎస్టేట్ నివేదిక విడుదల చేసింది. ఇందులో నగరంలో ఆఫీస్, రెసిడెన్షియల్ మార్కెట్లకు డిమాండ్ అద్భుతంగా ఉన్నట్లు వెల్లడించింది.ఆఫీస్ మార్కెట్ విషయానికి వస్తే.. 2026 తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో ఆఫీస్ స్థలాల లీజింగ్ 5.86 మిలియన్ చదరపు అడుగులకు చేరుకొని, ఒకే త్రైమాసికంలో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. గత సంవత్సరం పోలిస్తే.. ఇది 48% వృద్ధిని సూచిస్తోంది. ఈ వృద్ధితో హైదరాబాద్ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రెండవ అతిపెద్ద ఆఫీస్ మార్కెట్గా నిలిచింది.ఈ వృద్ధికి ప్రధాన కారణంగా.. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) అని తెలుస్తోంది. మొత్తం లీజింగ్లో 43 శాతం వాటాను వీటిదే కావడం గమనార్హం. జీసీసీలు 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఆక్రమించినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే థర్డ్-పార్టీ సర్వీసెస్ రంగం కూడా 1.7 మిలియన్ చదరపు అడుగులతో 29 శాతం వాటా సాధించింది. మరో ముఖ్యమైన అంశం ఫ్లెక్స్ వర్క్స్పేస్లు. ఇవి 457 శాతం వృద్ధితో 1.42 మిలియన్ చదరపు అడుగులకు చేరాయి. ముఖ్యంగా పెద్ద కంపెనీలు, ముఖ్యంగా GCCలు ఈ ఫ్లెక్స్ స్పేస్లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి.నివాస రంగం విషయానికి వస్తే.. హైదరాబాద్లో గృహ విక్రయాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 2026 Q1లో 9,541 గృహాలు అమ్ముడయ్యాయి. ఇది అంతకు ముందు ఏడాదితో పోలీసైతే 1 శాతం వృద్ధిని చూపిస్తుంది. గృహాల సగటు ధర చదరపు అడుగుకు రూ.8,211గా ఉండి 9 శాతం పెరిగింది. ప్రజలు చాలామంది విలాసవంతమైన గృహాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక ద్వారా తెలిసింది. -
అద్దె భారం.. సౌకర్యాలు శూన్యం!: బెంగళూరులో ఇలా..
బెంగళూరు నగరంలో రోజురోజుకి ఇళ్ల అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. కానీ కావలసిన కనీస అవసరాలు కూడా లభించడం లేదు. అధిక మొత్తంలో డబ్బు చెల్లించినప్పటికీ, తగిన ఇళ్లు దొరకడం లేదని చాలా మంది అద్దెదారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.బెంగళూరు నివాసి ఒకరు ఇటీవల కడుబీసనహళ్లికి 6 కిలోమీటర్ల పరిధిలో 1BHK ఫ్లాట్ కోసం వెతుకుతున్నప్పుడు ఎదురైన తమ అనుభవాన్ని రెడ్డిట్లో పంచుకున్నారు. ఈ అన్వేషణలో.. బెల్లందూర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, మారతహళ్లి, ఏఈసీఎస్ లేఅవుట్, సమీపంలోని సర్జాపూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.ఎక్కడ ఇల్లు కోసం సెర్చ్ చేసినా.. కనీస సౌకర్యాలు లేదని వెల్లడించాడు. అయితే అద్దె మాత్రం చాలా ఎక్కువగా ఉందని వాపోయాడు. దాదాపు రూ. 30,000 చెల్లిస్తున్నప్పటికీ, సరైన బాల్కనీ, పార్కింగ్ సౌకర్యాలు ఉన్న ఫ్లాట్ను వెతుక్కోవడం కష్టంగా ఉందని కూడా ఆయన అన్నారు.ఫ్లాట్లు రూ.28 వేల నుంచి రూ.32 వేలు లేదా అంతకంటే ఎక్కువ ధరకే లభిస్తున్నాయి, అయినా కూడా వాటిలో సరైన బాల్కనీ లేదా ప్రత్యేక కార్ పార్కింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. నన్ను మరింత ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటంటే, ఇళ్లను చూపించే విధానం. చాలా చోట్ల బాల్కనీ ఉందని చెబుతారు, కానీ మీరు నిజంగా వెళ్ళినప్పుడు, అది వాషింగ్ మెషీన్ పక్కన ఉండే ఒక చిన్న పని ప్రదేశంలా ఉంది. ఇది తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా అనిపిస్తుందని అతడు వెల్లడించాడు.ఇదీ చదవండి: రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!నేను మరీ అంత ఆడంబరమైన ఇళ్ల కోసం ఏమీ వెతకడం లేదు. గేటెడ్ సొసైటీలో.. కనీసం నిలబడటానికి లేదా కూర్చోవడానికి వీలుగా ఒక చిన్న ప్రైవేట్ బాల్కనీ, సరైన కార్ పార్కింగ్ ఉన్న ఒక సాధారణ 1BHK చాలు. అయినా అలాంటివి అస్సలు దొరకడం లేదు. దీన్నిబట్టి చూస్తే నగరంలో సరైన సౌకర్యాలున్న ఇళ్లను వెతుక్కోవడం పెద్ద సహజంగా అనిపిస్తుంది. -
ఊర్లో చిన్న ఇల్లు.. ఇక ఈజీగా కొనేయొచ్చు!!
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది. ఆస్తి లావాదేవీల్లో పాన్ (PAN) కార్డ్ నిబంధనలను సడలిస్తూ వెలువడిన ఈ మార్పులపై సమగ్ర కథనం మీ కోసం..ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అడుగడుగునా ఎదురయ్యే డాక్యుమెంటేషన్ చిక్కులను తొలగిస్తూ, పాన్ కార్డ్ బహిర్గత పరిమితిని పెంచుతూ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోయనున్నాయి.మారిన నిబంధనఇప్పటి వరకు రూ. 10 లక్షలకు మించిన ఏ ఆస్తి లావాదేవీకైనా కొనుగోలుదారు, అమ్మకందారు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. అయితే, ప్రస్తుత మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచింది. అంటే రూ. 20 లక్షల లోపు విలువ చేసే ప్లాట్లు, ఇళ్లు లేదా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై పాన్ కార్డు అవసరం లేదు.ఎవరికి లాభం?ఈ నిర్ణయం ప్రధానంగా కింది వర్గాలకు వరంగా మారనుంది.గ్రామీణ, సెమీ అర్బన్ కొనుగోలుదారులు: చిన్న పట్టణాల్లో డాక్యుమెంటేషన్ లోపాలు ఎక్కువగా ఉంటాయి. పాన్ కార్డు లేని వారు లేదా అప్లై చేసినా రాని వారు ఇకపై రూ. 20 లక్షల లోపు ఒప్పందాలను వేగంగా ముగించుకోవచ్చు.మొదటిసారి ఇల్లు కొనేవారు: అధికారిక ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉండే సామాన్యులకు, సమ్మతి (Compliance) సంబంధిత ఇబ్బందులు తగ్గి, ఆస్తి యాజమాన్యం సులభతరమవుతుంది.రియల్ ఎస్టేట్ డెవలపర్లు: చిన్న ప్లాట్ల అమ్మకాలు జరిపే డెవలపర్లకు డాక్యుమెంటేషన్ ఆలస్యం కారణంగా ఆగిపోయే డీల్స్ ఇకపై చకచకా పూర్తవుతాయి.లావాదేవీల్లో వేగం.. తగ్గిన అడ్డంకులుగతంలో రూ. 15 లక్షల విలువైన ప్లాట్ కొనుగోలు చేయాలంటే, రిజిస్ట్రేషన్ సమయానికి పాన్ కార్డు లేకపోతే ఆ ప్రక్రియ వారాల తరబడి నిలిచిపోయేది. తాజా సడలింపుతో అదనపు ఫార్మాలిటీలు లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుంది. ఇది అటు కొనుగోలుదారులకు, ఇటు అమ్మకందారులకు సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది.పన్ను నిబంధనల్లో మార్పు లేదు!ప్రక్రియను సులభతరం చేయడం కోసమే ఈ నిబంధనను సడలించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) విషయంలో ఎలాంటి మార్పులు లేవు. లావాదేవీ విలువ పెరిగినా, తగ్గినా వర్తించే పన్ను నిబంధనలు యథావిధిగా ఉంటాయి. ఇది కేవలం రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు చేసిన సంస్కరణ మాత్రమే.ఇదీ చదవండి: ఇల్లు ఇక్కడ కడితే తక్కువ ఖర్చు! -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు ఇలా..
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జనవరి–మార్చి త్రైమాసికంలో జోరుగా సాగాయి. మొత్తం 1,01,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో అమ్మకాలు 93,280 యూనిట్లతో పోల్చితే 9 శాతం అధిక అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల విలువ రూ.1.51 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాల విలువ రూ.1.42 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 6 శాతం వృద్ధి చెందింది.కానీ, 2025 డిసెంబర్ త్రైమాసికంతో పోల్చి చూస్తే అమ్మకాల పరిమాణం (యూనిట్లు) 7 శాతం, అమ్మకాల విలువ 6 శాతం చొప్పున తగ్గినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తన నివేదికలో తెలిపింది. 2025 డిసెంబర్ క్వార్టర్లో రూ.1.60 లక్షల కోట్ల విలువైన 1,08,970 యూనిట్లు అమ్ముడైనట్టు వెల్లడించింది. ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, చెన్నై, కోల్కతా నగరాల వివరాలు ఇందులో ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో ప్రతికూలతలు దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ హౌసింగ్ మార్కెట్లో మాత్రం ఇళ్ల అమ్మకాల జోరు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే మెరుగుపడగా, త్రైమాసికం వారీగా జోరు తగ్గింది. జనవరి–మార్చి క్వార్టర్లో 15,985 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2025 జనవరి–మార్చి త్రైమాసికం అమ్మకాలు 11,120 యూనిట్లతో పోల్చితే 44 శాతం పెరగ్గా.. డిసెంబర్ క్వార్టర్లో విక్రయాలు 19,250 యూనిట్లతో పోల్చితే 17 శాతం తగ్గినట్టు అనరాక్ నివేదిక తెలిపింది.భారత నివాస మార్కెట్ మూలాలు దీర్ఘకాలానికి బలంగా ఉన్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా స్వల్పకాల ప్రతికూలతలు మార్చి త్రైమాసికంపై చూపించినట్టు చెప్పారు. భారత గృహ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మధ్యప్రాచ్య ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గి ఉండొచ్చన్నారు. -
ఐటీ సిటీలో రియల్ ఎస్టేట్ ఎటు పోతోంది?
దేశ ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరులో నివసించే సగటు ఉద్యోగికి ఇప్పుడు 'సొంత ఇల్లు' అనేది ఒక తీరని కలగా మారుతోంది. నగరంలో ఇళ్ల ధరలు, అద్దెలు ఆకాశాన్ని తాకుతుండటంతో నివాసితులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి 'రెడ్డిట్' (Reddit) వేదికగా పంచుకున్న తన చేదు అనుభవాలు నగరంలోని భయానక రియల్ ఎస్టేట్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.పీడకలగా మారిన ఇంటి వేటబెంగళూరు నగరంలో ఒక రెండు పడక గదుల (2BHK) ఇంటి కోసం తాను చేస్తున్న అన్వేషణ ఒక "పీడకల"గా మారిందని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. "బెంగళూరు రియల్ ఎస్టేట్ ఎటు వెళ్తోంది?" అనే శీర్షికతో ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.మూడేళ్ల క్రితం రూ. 1.4 కోట్లుగా ఉన్న ఒక ఫ్లాట్ ధర, ప్రస్తుతం ఏకంగా రూ. 2 కోట్లకు చేరింది. సదరు అపార్ట్మెంట్ ఒక పెద్ద మురికి కాలువ సమీపంలో ఉండటమే కాకుండా, అనేక లోపాలు, అసౌకర్యాలు ఉన్నాయి. అయినా కేవలం ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉందనే సాకుతో ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.అద్దెలు కూడా భారమే..కేవలం కొనుగోలు ధరలే కాకుండా, అద్దెలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. గతంలో తక్కువ ధరకే లభించిన ఫ్లాట్లకు ఇప్పుడు నెలకు రూ. 70,000 పైగా అద్దె చెల్లించాల్సి వస్తోందని, ఇది నమ్మశక్యంగా లేదని నివాసితులు వాపోతున్నారు. మూడు, నాలుగేళ్లలో డబ్బు ఆదా చేసి ఇల్లు కొందామనుకునే లోపే, ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి.పరిస్థితి తీవ్రతకొన్ని ప్రాంతాల్లో 2BHK ఫ్లాట్లు ఏకంగా రూ. 2.5 కోట్లకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఇంత ధర పెట్టినా డిమాండ్ తగ్గకపోవడం, సామాన్య, మధ్యతరగతి ప్రజలను గృహ కొనుగోలుకు దూరం చేస్తోంది. పెరుగుతున్న ధరలు, క్షేత్రస్థాయిలోని సమస్యల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం బెంగళూరు వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. -
నయా రియల్ఎస్టేట్ బూమ్.. ఇక నార్త్ హైదరాబాద్లో..
‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్లో కాస్త మొదలైంది. కండ్లకోయలో ఐటీ పార్క్కు స్థలం కేటాయింపుతో మొదలైన ఈ ప్రాంతం అభివృద్ధి.. సమీప భవిష్యత్తులోనే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదిరిగా అభివృద్ధి చెందుతుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఎన్హెచ్–44, ఓఆర్ఆర్, రైల్వే, ఎంఎంటీఎస్ కనెక్టివిటీలతో పాటు పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే ఉత్తరాదిలో స్థలాల ధరలు చౌకగా ఉండటం ఈ ప్రాంతానికి అదనపు బలాలు. ఐటీ, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన మాదాపూర్ ప్రాంతం క్రమంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు విస్తరించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం ఖరీదైన పెట్టుబడి మార్కెట్గా మారడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు క్రమంగా ఉత్తర హైదరాబాద్ వైపు వెళ్తున్నారు.గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే ఉత్తరాదిలో(కొంపల్లి, మేడ్చల్ వైపు) స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉంటాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఈ ప్రాంతంలో భూములు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లలో చ.అ. ధర రూ.4,500–రూ.5 వేలు, గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూ.5,500 నుంచి రూ.6 వేలు ఉంది. ఓపెన్ ప్లాట్ల ధరలు గజం రూ.60 వేల నుంచి రూ.80 వేలు చెబుతున్నారు. కనెక్టివిటీ బాగుంది.. హైదరాబాద్–నాగ్పూర్ జాతీయ రహదారి–44 ఉత్తర హైదరాబాద్ మీదుగా వెళుతుంది. ముంబై, నాందెడ్, షిర్డీ వైపు వెళ్లే రైలు మార్గం ఈ ప్రాంతం మీదుగానే వెళ్తోంది. బొల్లారం, మేడ్చల్కు ఎంఎంటీఎస్ సదుపాయం కూడా ఉంది. సుచిత్ర నుంచి డెయిర్ ఫాం జంక్షన్, సినీ ప్లానెట్ నుంచి జీడిమెట్ల జంక్షన్, కొంపల్లి నుంచి దూలపల్లి కూడలి వరకు మొత్తం 10 కి.మీ. మూడు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. జీనోమ్వ్యాలీ, నల్సార్తో సహా ఇతర అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. నగరంలోని ఇతర జాతీయ రహదారులతో పోలిస్తే మేడ్చల్ హైవేలో రద్దీ తక్కువగా ఉంటుంది. 30 నిమిషాల్లో ప్రధాన నగరానికి చేరుకోవచ్చు.కండ్లకోయలో సైబర్ టవర్స్ను మించి.. పశ్చిమ ప్రాంతానికే పరిమితమైన ఐటీని నగరం నలువైపులా విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర హైదరాబాద్లో ఐటీ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కండ్లకోయలో 6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఐటీ పార్క్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది సైబర్ టవర్స్కంటే విస్తీర్ణమైన స్థలం. భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్లో 50 వేల ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అంచనా. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా స్థిరాస్తి జోరందుకుంది. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, వ్యక్తిగత భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలు హాట్స్పాట్స్.. ప్రధానంగా జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్పేట, మేడ్చల్ వంటి ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి వంటి జిల్లావాసులు ఉత్తర హైదరాబాద్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు మేడ్చల్ జాతీయ రహదారిలో భారీ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్లను చేపడుతున్నాయి. అలాగే పశ్చిమాదిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న పలు బడా నిర్మాణ సంస్థలు మేడ్చల్ హైవేలో పెద్ద ఎత్తున స్థల సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది. -
ఆఫీస్ అమ్మేసిన సల్మాన్ ఖాన్ తమ్ముడు
సినీతారలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే కొందరు అవకాశం వచ్చినప్పుడు స్థలాలు, భూములు, ఇల్లు కొనుగోలు చేసి.. తమకు అవసరం వచ్చినప్పుడు విక్రయిస్తుంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని అంధేరి వెస్ట్లో ఉన్న ఒక కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని విక్రయించారు.రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. సోహైల్ ఖాన్ రూ. 5.90 కోట్లకు ఆఫీస్ స్పేస్ విక్రయించారు. ఇది లింక్ రోడ్లోని ఆర్క్ వన్ భవనంలో 1559 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మూడు కార్ పార్కింగ్ స్థలాలతో పాటు కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని బిల్కిష్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించారు.ఈ లావాదేవీ మార్చి 27, 2026న నమోదయ్యాయి. దీనికి గాను రూ.35.40 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. 2025 అక్టోబర్లో, సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను రూ. 22 కోట్లకు విక్రయించారు. సద్గురు డెవలపర్స్ అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ కార్పెట్ భవనంలో ఉన్న ఈ ఆస్తి, సుమారు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్మెంట్లో తొమ్మిది పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. దీనిని శివాయ సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించారు. -
హైదరాబాద్లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పరిమితమయ్యాయి. లక్ష యూనిట్లలోపు విక్రయాలు పడిపోవడం 18 త్రైమాసికాల తర్వాత ఇదే ప్రథమం.2025 జనవరి–మార్చి కాలంలో టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 1,13,602 యూనిట్లు కాగా, 2025 చివరి త్రైమాసికంలో 1,05,527 యూనిట్లుగా ఉన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కొనుగోలు సెంటిమెంట్పై ప్రభావం చూపించినట్టు, తాజా సరఫరా తగ్గడం కూడా కారణమని ప్రాప్ఈక్విటీ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా టాప్–9లో ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు మినహా మిగిలిన అన్ని నగరాల్లో ఇళ్ల విక్రయాలు పడిపోయాయి. హైదరాబాద్లో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 11,546 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 2025 జనవరి–మార్చి కాలంలో విక్రయాలు 13,725 యూనిట్లతో పోల్చితే 16 శాతం తగ్గాయి. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 17,991 యూనిట్లుగా ఉన్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో అమ్మకాలు 17,508 యూనిట్లతో పోల్చితే 3 శాతం పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో 12,141 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2025 మొదటి త్రైమాసికంలో విక్రయాలు 10,723 యూనిట్లతో పోల్చితే 13 శాతం పెరిగాయి. చెన్నైలో 4 శాతం తక్కువగా 4,765 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ముంబైలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 20 శాతం పడిపోయి 9,186 యూనిట్లకు పరిమితమయ్యాయి. నవీ ముంబైలో ఇళ్ల విక్రయాలు 7,157 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 14 శాతం తగ్గాయి. థానేలోనూ 24 శాతం తక్కువగా 15,959 యూనిట్ల విక్రయాలు జరిగాయి. పుణెలో 16,144 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయాలు 21,640 యూనిట్ల కంటే 25 శాతం తగ్గాయి. కోల్కతాలో 8 శాతం తక్కువగా 3,872 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. కొత్త ప్రాజెక్టుల సరఫరా జనవరి మార్చి మధ్య 92,411 యూనిట్లుగా ఉంది. 2025 మొదటి క్వార్టర్లో సరఫరా 1,14,718 యూనిట్ల కంటే 19 శాతం తగ్గింది. -
హైదరాబాద్లో ఐస్ప్రౌట్ భారీ విస్తరణ
హైదరాబాద్: ప్రముఖ మేనేజ్డ్ వర్క్స్పేస్ ప్రొవైడర్ 'ఐస్ప్రౌట్' (iSprout), హైదరాబాద్లోని మీనాస్ టవర్స్లో 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఎంటర్ప్రైజ్ గ్రేడ్ కార్యాలయాన్ని ప్రారంభించింది. 20 అంతస్తుల ఈ భారీ కాంప్లెక్స్లో ఇప్పటికే 10 అంతస్తులు ప్రముఖ కంపెనీలకు లీజుకు ఇవ్వడం విశేషం. ఈ సరికొత్త విస్తరణతో భాగ్యనగరంలో ఐస్ప్రౌట్ మొత్తం పోర్ట్ఫోలియో 17 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), పెద్ద సంస్థలను లక్ష్యంగా చేసుకుని 100 నుంచి 3,000 సీట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.ఈ కొత్త కేంద్రం కేవలం కార్యాలయ సముదాయం మాత్రమే కాకుండా, ప్రతి క్లయింట్ అవసరాలకు అనుగుణంగా 'కస్టమ్ డిజైన్' చేసిన వర్క్స్పేస్లను అందిస్తోంది. హై-స్పీడ్ ఐటీ మౌలిక సదుపాయాలు, మీటింగ్ రూమ్లు, కొలాబరేషన్ సూట్లతో పాటు హై-ఎండ్ రెస్టారెంట్లు, కాఫీ షాపులు వంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం 60 రోజుల్లోనే కంపెనీల బ్రాండ్ నిబంధనల ప్రకారం కార్యాలయాన్ని సిద్ధం చేసి అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్లకు సమీపంలో ఉండటం, మెట్రో కనెక్టివిటీ ఉండటం ఈ కేంద్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఐస్ప్రౌట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 నగరాల్లో 26 కేంద్రాలను నిర్వహిస్తూ, 350కి పైగా కంపెనీలకు సేవలు అందిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 14,000 సీట్లుగా ఉన్న కంపెనీ సామర్థ్యం, 2026 నాటికి 43,000 సీట్లకు చేరుకోవడం సంస్థ వేగవంతమైన వృద్ధికి నిదర్శనం. హైదరాబాద్ తమకు అత్యంత వ్యూహాత్మక మార్కెట్ అని, గ్లోబల్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇక్కడ మౌలిక వసతుల నిర్వహణ బాధ్యతలను తాము తీసుకుంటామని ఐస్ప్రౌట్ సీఈఓ, కో-ఫౌండర్ సుందరి పాటిబండ్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
నరెడ్కో తెలంగాణ కొత్త కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO) తెలంగాణ విభాగానికి సంబంధించి 2026-2028 కాలానికి నూతన కార్యవర్గ సభ్యులు, కీలక అధికారుల నియామకం పూర్తయింది. మంగళవారం హైదరాబాద్లోని 'ఏపీఆర్ ఐల్' వేదికగా జరిగిన అసోసియేషన్ 30వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కొత్త బృందాన్ని అధికారికంగా ప్రకటించారు.నరెడ్కో తెలంగాణ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి కొప్పుల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా కాళీ ప్రసాద్ దామెర, గోపాలకృష్ణ కొరిపల్లి, సెక్రటరీ జనరల్గా వెంకటేశ్వరరావు రావుల, కోశాధికారిగా సుధాకర్ రెడ్డి కొండల నియమితులయ్యారు.ఎంపికైన నూతన నాయకత్వ బృందం 2026 నుండి 2028 వరకు రెండేళ్ల పాటు అసోసియేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించనుంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సుస్థిర వృద్ధిని పెంపొందించడం, వృత్తిపరమైన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బృందం పనిచేయనుంది. -
రియల్ ఎస్టేట్కు గట్టి పోటీ ఇస్తున్న ‘ఫ్లెక్స్ ఆఫీస్’
దేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ (ఫ్లెక్స్ ఆఫీస్) పరిశ్రమ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలో ఈ రంగం ఇప్పటికే 100 మిలియన్ చదరపు అడుగుల మార్కును దాటడమే కాకుండా, లాభాల బాటలో పయనిస్తూ సరికొత్త వృద్ధి దశలోకి ప్రవేశించింది. అనరాక్ గ్రూప్నకు చెందిన ప్రముఖ ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ మార్కెట్ప్లేస్ ‘మైహెచ్క్యూ’(myHQ) విడుదల చేసిన క్యూ3 (Q3 FY26) ఫ్లెక్స్ ఆఫీస్ నివేదిక ప్రకారం.. 2028 నాటికి ఈ రంగం విలువ ఏకంగా 9 నుండి 10 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.ఒకప్పుడు కేవలం స్టార్టప్లకే పరిమితమైన ఈ రంగం.. ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs), బడా కార్పొరేట్ సంస్థల రాకతో సరికొత్త రూపును సంతరించుకుంది. కొత్తగా బుక్ అవుతున్న సీట్లలో దాదాపు 40% వాటాను ఇవే కైవసం చేసుకుంటున్నాయి. గత రెండేళ్లలో సగటు డీల్ సైజు 25 సీట్ల నుండి ఏకంగా 53 సీట్లకు పెరగడం విశేషం. దీన్నిబట్టి ప్రధాన స్రవంతి రియల్ ఎస్టేట్ వ్యూహాల్లో ఫ్లెక్స్ ఆఫీస్ల ప్రాధాన్యత ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.లాభాల బాటలో దిగ్గజాలుఈ రంగంలో 2026 ఆర్థికేడాదిలోని మూడో త్రైమాసికం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మార్కెట్లోని పలు అగ్రగామి లిస్టెడ్ ఆపరేటర్లు ఒకేసారి లాభాల్లోకి రావడం విశేషం. 'వీవర్క్ ఇండియా' (WeWork India), 'స్మార్ట్వర్క్స్' (Smartworks) రెండు సంస్థలూ లాభాలు ఆర్జించాయి. ఇందులో 'స్మార్ట్వర్క్స్' అత్యధికంగా 490 బేసిస్ పాయింట్ల మార్జిన్ వృద్ధిని నమోదు చేసి రికార్డు సృష్టించింది.వృద్ధికి ప్రధాన కారణాలు ఇవే..కార్పొరేట్ సంస్థల మొగ్గు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) సంస్థలు ఈ ఆఫీస్లను ఎక్కువగా ఎంచుకుంటుండటంతో పరిశ్రమకు దీర్ఘకాలిక స్థిరత్వం లభిస్తోంది.ఆదాయ వనరుల వైవిధ్యం: కేవలం ఆఫీస్ స్పేస్పైనే కాకుండా.. MICE (సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్లు, ఎగ్జిబిషన్లు), డే పాస్లు, ప్రైవేట్ క్యాబిన్లు, ఇతర విలువ ఆధారిత సేవల ద్వారా ఆపరేటర్లు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొత్తం ఆదాయంలో వీటి వాటా 12-16% గా ఉంది.ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరణ: బెంగళూరులోని సర్జాపూర్, హెబ్బాల్, హైదరాబాద్లోని కోకాపేట, పూణేలోని హింజేవాడి, చెన్నైలోని ఓఎంఆర్వంటి మెట్రో ప్రాంతాలతో పాటు.. అహ్మదాబాద్, కొచ్చి, ఇండోర్ వంటి టైర్-2 నగరాలు కూడా ఇప్పుడు ప్రధాన హబ్లుగా మారుతున్నాయి.భారీ పెట్టుబడులు: గ్లోబల్ ఫండ్స్ రాక, ఐపీఓ (IPO)ల ద్వారా నిధుల సమీకరణ ఈ రంగం మరింత వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తున్నాయి.సంప్రదాయ రియల్ ఎస్టేట్కు గట్టి పోటీఈ పరిణామాలపై మైహెచ్క్యూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉత్కర్ష్ కవాత్రా మాట్లాడుతూ.. ‘ఫ్లెక్స్ ఆపరేటర్లు ఇప్పుడు కేవలం తమలో తాము మాత్రమే పోటీ పడటం లేదు. సంప్రదాయ కమర్షియల్ రియల్ ఎస్టేట్తో తలపడుతూ.. ఫ్లెక్సిబులిటీ, వేగం, మూలధన సామర్థ్యంతో విజయం సాధిస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
ఇల్లు ఇక్కడ కడితే తక్కువ ఖర్చు!
సొంతిల్లు అనేది ప్రతిఒక్కరికీ జీవిత కల. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆ కలను సాకారం చేసుకోవడంలో సవాలుగా మారుతున్నాయి. 2026 తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా నిర్మాణ ఖర్చులు, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక విశ్లేషణ ఈ కథనంలో..దేశంలో నిర్మాణ ఖర్చులు ఎక్కడ తక్కువ?భారతదేశంలో నిర్మాణ ఖర్చులు భౌగోళిక ప్రాంతం, రవాణా సౌకర్యాలు, కూలీల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అత్యంత సరసమైన ధరల్లో నిర్మాణాలు జరుగుతున్న నగరాలు ఇవే..అహ్మదాబాద్ (గుజరాత్): దేశంలోనే అత్యంత చౌకగా ఇల్లు నిర్మించుకోగలిగే నగరం ఇది. ఇక్కడ చదరపు అడుగుకి సగటున రూ.1,200 – రూ.1,600 ఖర్చు అవుతోంది.జైపూర్ (రాజస్థాన్): ఇక్కడ చదరపు అడుగుకి రూ.1,500 – రూ.2,200 మధ్య ధరలు ఉన్నాయి.విజయవాడ (ఆంధ్రప్రదేశ్): పెరుగుతున్న నగరమైనప్పటికీ, మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ నిర్మాణ ఖర్చులు కొంత తక్కువగా (చదరపు అడుగుకి రూ.1,400 – రూ.2,200) నమోదవుతున్నాయి.కోల్కతా: మెట్రో నగరాల్లో తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకోగలిగే చోటుగా కోల్కతా నిలుస్తోంది (సుమారు రూ.1,500 – రూ.2,500).మరోవైపు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ ఖర్చు చదరపు అడుగుకి రూ.2,500 నుంచి రూ.5,000 పైమాటే.తెలుగు రాష్ట్రాల పరిస్థితితెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లలో నిర్మాణ ఖర్చులు 10-15% పెరిగాయి. ముఖ్యంగా కూలీల కొరత, రవాణా ఛార్జీలు పెరగడం దీనికి ప్రధాన కారణం. హైదరాబాద్లో ఇంటి నిర్మాణానికి బేసిక్ క్వాలిటీలో ఒక చదరపు అడుగుకు రూ.1,700 – రూ.2,000, స్టాండర్డ్ క్వాలిటీ అయితే రూ.2,100 – రూ.2,500 ఖర్చవుతోంది. అదే ప్రీమియం/లగ్జరీ అయితే ఒక ఎస్ఎఫ్టీకి రూ.2,600 – రూ.3,800 ఖర్చు పెట్టాల్సి వస్తోంది.హైదరాబాద్ శివార్లలో (ఉదా: షాద్నగర్, ఆదిబట్ల) నిర్మాణ ఖర్చులు కొంత తక్కువగా ఉండగా, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో కూలీల రేట్లు అధికంగా ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ, గుంటూరు వంటి నగరాలలో సగటున చదరపు అడుగుకి రూ.1,400 – రూ.2,300 ఖర్చు అవుతోంది. విశాఖపట్నం వంటి నగరాల్లో స్టీల్, సిమెంట్ రవాణా సౌకర్యం వల్ల మెటీరియల్ ధరలు ఇతర ప్రాంతాల కంటే స్వల్పంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది.సగటు నిర్మాణ సామగ్రి ధరలు 2026 అంచనా ధరల ప్రకారం.. నిర్మాణ వ్యయంలో దాదాపు 60-70% ఖర్చు మెటీరియల్కే అవుతుంది. ప్రస్తుత మార్కెట్ రేట్లు ఇలా ఉన్నాయి..సామగ్రిసగటు ధరసిమెంట్ (50kg బ్యాగ్)₹350 – ₹450స్టీల్ (TMT Bars - టన్ను)₹60,000 – ₹75,000ఇసుక (రివర్ సాండ్ - టన్ను)₹1,200 – ₹2,500 (లభ్యతను బట్టి)ఎం-సాండ్ (M-Sand - టన్ను)₹900 – ₹1,500ఇటుకలు (ఒక్కోటి)₹7 – ₹12సిమెంట్ ఇటుకలు/బ్లాక్స్₹30 – ₹502026 బడ్జెట్లో సిమెంట్ పై జీఎస్టీని (GST) 28% నుంచి 18 శాతానికి, స్టీల్ పై 18% నుంచి 12శాతానికి తగ్గించడం వల్ల సామాన్యులకు కొంత ఊరట లభించింది.ఖర్చును ఎలా తగ్గించుకోవాలి?స్థానిక మెటీరియల్: రవాణా ఖర్చు తగ్గించుకోవడానికి స్థానికంగా లభించే ఇటుకలు, కంకర వాడటం ఉత్తమం.ప్లానింగ్:నిర్మాణ సమయంలో ప్లాన్ మార్పులు చేయకుండా ముందుగానే పక్కాగా సిద్ధమవ్వాలి.టెక్నాలజీ: ప్రస్తుత కాలంలో ఏఏసీ బ్లాక్స్ వాడకం వల్ల ప్లాస్టరింగ్ ఖర్చు, సిమెంట్ వినియోగం తగ్గుతుంది.ఇదీ చదవండి: సిటీ రియల్ ఎస్టేట్కు గేమ్ ఛేంజర్! -
సిటీ రియల్ ఎస్టేట్కు గేమ్ ఛేంజర్!
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అస్థిరత, స్థిరమైన వడ్డీ రేట్ల కొనసాగింపు, ప్రతికూల విధానాలు.. తదితర కారణాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేసింది. దీంతో భూయజమానులు, డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు, పట్టణ స్థానిక సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రణాళికాబద్ధమైన, స్థిరమైన పట్టణాభివృద్ధికి వీలవుతుంది. మొత్తంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి టీడీఆర్ గేమ్ చేంజర్గా మారనుంది.టీడీఆర్ అంటే? రోడ్లు, డ్రైనేజీలు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక వసతుల నిర్మాణ సమయంలో ప్రభుత్వానికి భూసేకరణ తప్పనిసరి. భూములు కోల్పోయే పట్టాదారులకు ప్రభుత్వం నగదు రూపంలో పరిహారం అందిస్తుంది. అయితే ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగా కొత్తగా టీడీఆర్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో నగదు బదులుగా మార్కెట్ రేటుకు సమానంగా టీడీఆర్ బాండ్లను అందజేస్తారు. వీటితో యజమానికి ఇతర ప్రాంతంలో స్థలం ఉంటే అక్కడ అనుమతించే అంతస్తుల కంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించుకోవచ్చు. ఒకవేళ స్థలం లేకపోతే టీడీఆర్ను ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్టీఎల్), గరిష్ట వరద మట్టం(ఎంఎఫ్ఎల్), నీటి వనరులు, నాలాలకు బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే పట్టా భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేసినప్పుడు టీడీఆర్లను జారీ చేస్తుంది. టీడీఆర్ హక్కులను స్థిరాస్తి వ్యాపారులు, వ్యక్తులు కొనుగోలు చేసి అదనపు అంతస్తులు, సెట్బ్యాక్లో ఆ విస్తీర్ణం మేరకు మినహాయింపులు పొందవచ్చు. ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) దాకా విస్తరించిన జీహెచ్ఎంసీ వరకూ.., తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధి వరకూ ఇది వర్తిస్తుంది.చిన్న, మధ్య తరహా బిల్డర్లకు ప్రయోజనం తాజా టీడీఆర్ సవరణతో చిన్న, మధ్యతరహా బిల్డర్లకు ఈ నిర్ణయం గొప్ప ఊతం ఇస్తుంది. 40 అడుగుల రహదారిలో ఇది వరకు జీ+8 అంతస్తులతో పాటు టీడీఆర్తో అదనంగా రెండు అంతస్తులకు అనుమతి ఇచ్చేవారు. తాజాగా 11 అంతస్తుల వరకు వేసుకోవచ్చు. అదనపు అంతస్తుల వెసులుబాటుతో ధరలను నియంత్రించడానికి, స్థిరీకరించడానికి సహాయపడతాయి.కూకట్పల్లి, మూసాపేట, ఎస్ఆర్నగర్, ముషీరాబాద్, నారాయణగూడ, తార్నాక, సికింద్రాబాద్, కాచిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్నగర్, ప్రగతీనగర్, బాచుపల్లి వంటి ప్రాంతాలలో భవన నిర్మాణాలు చేపట్టే చిన్న, మధ్యతరహా డెవలపర్లకు ఇది వరంగా మారుతుంది. గతంలో సరైన డిమాండ్ లేక మార్కెట్ విలువలో టీడీఆర్ 25 శాతానికే అమ్ముడుపోయేవి. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని బట్టి 50–70 శాతానికి పెరుగుతుంది. టీడీఆర్ విలువ పెరగడంతో భూ యజమానులు తమ భూమిని రహదారుల విస్తరణకు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తారు. రహదారుల విస్తరణలో వేగం పెరుగుతుంది.ఆరు అంతస్తులు దాటితేనే హైరైజ్ భవన నిర్మాణ నిబంధనల మేరకు రోడ్డు వెడల్పు, ప్లాటు విస్తీర్ణం ఆధారంగా అనుమతించిన ఎత్తు వరకు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్లాటు విస్తీర్ణం 1,000 చ.మీ. దాటితేనే గరిష్టంగా 18 మీటర్ల ఎత్తు వరకు (జీ+5 అంతస్తులు) భవన నిర్మాణానికి అనుమతి ఉండేది. టీడీఆర్ను కొనుగోలు చేసినా అదనపు అంతస్తులు కట్టుకునేందుకు వెసులుబాటు లేదు. తాజా సవరణల్లో టీడీఆర్ వినియోగిస్తూ నిర్మాణం 21 మీటర్ల ఎత్తు వరకు(జీ+6 అంతస్తులు) నిర్మించుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంటే ఇక నుంచి 21 మీటర్ల ఎత్తు దాటిన భవనాలను మాత్రమే ఆకాశహర్మ్యాలుగా పరిగణిస్తారు. అలాగే ఈ నిర్మాణానికి ప్లాటు కనీస విస్తీర్ణాన్ని 750 చ.మీ.కు తగ్గించింది. కొత్త నిబంధనల ప్రకారం.. టీడీఆర్ వినియోగిస్తూ 750–2,000 చ.మీ. వరకు ప్లాటు విస్తీర్ణంలో భవన నిర్మాణాన్ని 21 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించుకోవచ్చు. అయితే పార్కింగ్, ఇతర నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే.40 అడుగుల రోడ్లలోనూ భారీ భవనాలు ప్లాటు విస్తీర్ణం 2 వేల చ.మీ.లకు మించి ఉంటే ఆ స్థలంలో టీడీఆర్ ద్వారా అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. రోడ్డు కనీస వెడల్పు 40 అడుగులకు మించి ఉంటే.. ఆ ప్లాటులో జీ+5 అంతస్తులకు మించి అదనంగా మరో 3 అంతస్తులు నిర్మించుకోవచ్చు. రోడ్డు వెడల్పు 60 అడుగులు ఉంటే అదనంగా 4 అంతస్తులు, 80 అడుగులకు మించి ఉంటే అదనంగా 5 అంతస్తులు కట్టుకోవచ్చు. అయితే అగ్నిమాపక, ఎయిర్పోర్టు, ఇతర నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.50:50 విధానంలో.. క్యూర్ పరిధిలో 10 అంతస్తులకు మించిన హైరైజ్లలో పదో అంతస్తు తర్వాత చేపట్టే అదనపు అంతస్తుల నిర్మిత స్థలంలో 10 శాతానికి టీడీఆర్ను వినియోగించాలని గతేడాది ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ప్రభుత్వం టీడీఆర్ వినియోగాన్ని తగ్గించింది. 10 అంతస్తుల నుంచి 20 అంతస్తుల వరకు నిర్మిత స్థలంలో 3 శాతం నిర్మిత స్థలానికి సమాంతరమైన, అలాగే 20 అంతస్తులకు మించితే ఆ మొత్తం నిర్మిత స్థలంలో 5 శాతం నిర్మిత స్థలానికి సమానమైన టీడీఆర్ను వినియోగించాలని తెలిపింది. భవన నిర్మాణ దరఖాస్తు సమయంలో 50 శాతం టీడీఆర్ వినియోగిస్తున్నట్లు పత్రాలు సమర్పించాలి. మిగతా 50 శాతం టీడీఆర్ పత్రాలను నివాస యోగ్యత పత్రం(ఎన్ఓసీ) జారీ సమయంలో అందజేయాల్సి ఉంటుంది. దీంతో డెవలపర్లకు ప్రారంభ మూలధన ఒత్తిడి తగ్గుతుంది.నియంత్రణ అవసరం ప్రస్తుతం మార్కెట్లో సుమారు రూ.10 వేల కోట్లకు పైగా విలువైన టీడీఆర్ సర్టిఫికెట్లు ఉన్నాయని పరిశ్రమ నిపుణుల అంచనా. అయితే కొంతమంది మధ్యవర్తులు టీడీఆర్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో నిజమైన నిర్మాణదారులు, డెవలపర్లు టీడీఆర్ను కొనుగోలు చేయడానికి ముందుకురావడం లేదు.సరఫరా, డిమాండ్ను సమతుల్య పరచాలంటే టీడీఆర్లపై ప్రభుత్వ నియంత్రణ అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే టీడీఆర్లను కొనుగోలు చేయడానికి, వినియోగించుకోవడానికి అగ్ని మాపక శాఖ నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తప్పనిసరి అనేది ప్రధాన అడ్డంకిగా మారిందని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రూ.2.26 లక్షల కోట్ల నిధులు మళ్లింపు.. మరణశిక్ష
ఆసియా బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నేరానికి పాల్పడి, మరణశిక్ష పడిన వియత్నాం రియల్ ఎస్టేట్ దిగ్గజం ట్రూంగ్ మై లాన్(69) ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సాయిగాన్ కమర్షియల్ బ్యాంక్ (ఎస్సీబీ) నుంచి ఆమె కొల్లగొట్టిన సుమారు 27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.26 లక్షల కోట్లు) నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ భారీ వేలం ప్రక్రియను చేపడుతున్నారు.వేలం జాబితాలో ఏమేమున్నాయి?వియత్నాం సివిల్ జడ్జిమెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ విడుదల చేసిన వివరాల ప్రకారం, విలాసవంతమైన భవనాల నుంచి చిన్నపాటి వస్తువుల వరకు వేలంలో ఉంచనున్నారు. హో చి మిన్ సిటీలోని ఖరీదైన ఆఫీస్ స్పేస్లు, టే నిన్ ప్రావిన్స్లోని భారీ ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధ హెర్మేస్ బిర్కిన్ హ్యాండ్బ్యాగులు, 8,500 కంటే ఎక్కువ డిజైనర్ దుస్తులు, ఫ్యాషన్ యాక్సెసరీస్ వేలం వేయనున్నారు. ఒక లగ్జరీ కారు, రెండు ట్రక్కులు, భారీ యంత్రాలతో పాటు లాన్కు చెందిన అత్యంత విలాసవంతమైన ‘రెవరీ సాయిగాన్’ యాచ్ (విహార నౌక) ఉంది. లగ్జరీ ఫర్నీచర్ కంపెనీకి చెందిన సుమారు 3,70,000 ఇన్వెంటరీ వస్తువులను కూడా ఈ వేలంలో విక్రయించనున్నారు.కేసు నేపథ్యం ఏమిటి?వియత్నాం రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఉన్న ట్రూంగ్ మై లాన్ సాయిగాన్ కమర్షియల్ బ్యాంక్లోని నిధులను దశాబ్ద కాలం పాటు అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 2024లో బ్యాంక్ నుంచి 12.3 బిలియన్ డాలర్లను మళ్లించినందుకుగాను కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. మనీ లాండరింగ్, ఇతర ఆర్థిక నేరాల కింద రెండో దఫా విచారణలోనూ ఆమెను దోషిగా నిర్ధారించారు. ఆమె చేసిన కుంభకోణం వల్ల కలిగిన మొత్తం నష్టం 27 బిలియన్ డాలర్లుగా తేల్చారు. దీన్ని రికవరీ చేసేందుకు ఆమె వ్యక్తిగత ఆస్తులతో పాటు కంపెనీ ఆస్తులను జప్తు చేశారు.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
క్రెడిట్ కార్డుతో ఆస్తులు కొంటున్నారా? చిక్కులు తప్పవు
విదేశాల్లో, అందులోనూ దుబాయ్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్న భారతీయులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను (ఐసీసీ) ఉపయోగించి దుబాయ్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టిన పలువురికి నోటీసులు జారీ అవుతున్నాయి. అజాగ్రత్తగా చేసిన ఈ లావాదేవీలు ఇప్పుడు ‘ఫెమా’ ఉల్లంఘనల కింద ఇన్వెస్టర్లను ఇరకాటంలో పడేసింది.అసలు ఏం జరిగింది?దుబాయ్లోని రియల్ ఎస్టేట్ డెవలపర్లు పంపిన పేమెంట్ లింక్ల ద్వారా లేదా నేరుగా అక్కడికి వెళ్లినప్పుడు క్రెడిట్ కార్డుల ద్వారా భారతీయులు భారీగా చెల్లింపులు చేశారు. ప్రాథమిక డిపాజిట్లు చెల్లించడానికి చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే, భారతీయ విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టాల ప్రకారం ఇది తీవ్రమైన నేరం.చట్టం ఏం చెబుతోంది?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఒక భారతీయుడు ఏడాదికి గరిష్టంగా 2,50,000 డాలర్ల వరకు మాత్రమే విదేశాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది అధికారిక బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారానే జరగాలి. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను కేవలం కరెంట్ అకౌంట్ లావాదేవీలకే (హోటల్ బిల్లులు, షాపింగ్, సర్వీసులు) వాడాలి. క్రెడిట్ కార్డ్ లావాదేవీ అనేది ఒక రకమైన స్వల్పకాలిక రుణం. విదేశాల్లో ఆస్తులు కొనడానికి క్రెడిట్ కార్డులో అప్పు తీసుకోవడాన్ని ఆర్బీఐ నిషేధిస్తుంది.ఇన్వెస్టర్ల పరిస్థితినోటీసులు అందుకున్న వారు ఇప్పుడు అటు ఆస్తిని వదులుకోలేక, ఇటు చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన చెల్లింపును వెనక్కి తీసుకోవాలని బిల్డర్ను కోరవచ్చు. అయితే, కొత్తగా నిధులు పంపాలంటే ప్రస్తుత డాలర్ రేటు ప్రకారం భారీగా ఖర్చవుతుంది. నిబంధనల ఉల్లంఘనకు గానూ జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. ప్రస్తుతం దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత మందగించడంతో ఆస్తిని తక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది.పరిష్కారం ఉందా?నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇన్వెస్టర్లు ‘కాంపౌండింగ్’ ప్రక్రియ ద్వారా ఈ సమస్యను సరిదిద్దుకోవచ్చు. తాము తెలియక చేసిన పొరపాటును అంగీకరిస్తూ ఆర్బీఐ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ నిధుల మూలాలు సక్రమంగా ఉండి హవాలా వంటి అక్రమ మార్గాలు లేవని తేలితే ఈడీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. నిబంధనల ప్రకారం కొంత జరిమానా చెల్లించి లావాదేవీని రెగ్యులరైజ్ చేయవచ్చు. ఒకవేళ పొరపాటు చిన్నదైతే ఆర్బీఐ రూ.2 లక్షల వరకు పెనాల్టీతో సరిపెట్టే అవకాశం ఉంది.విదేశాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం సౌలభ్యం కోసం క్రెడిట్ కార్డులను వాడటం ముప్పును కొనితెచ్చుకోవడమే. ఇన్వెస్టర్లు నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలి.ఇదీ చదవండి: భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్ -
ఇల్లు కొనేవాళ్లకు ఇదే మంచి ఛాన్స్!
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సరుకు రవాణాలో అడ్డంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యుడి సొంతింటి కలపై కూడా నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, సరఫరా గొలుసులో జాప్యం కలవరపెడుతున్నాయి.ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఇల్లు కొనడం లేదా నిర్మాణం చేపట్టడం సరైనదేనా అనే అంశంపై ప్రత్యేక విశ్లేషణ ఈ కథనంలో చూద్దాం..ఆకాశాన్ని తాకుతున్న నిర్మాణ ఖర్చులుఅంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల, ఎర్ర సముద్రం మీదుగా రవాణా నిలిచిపోవడం వంటి కారణాలు నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తున్నాయి.స్టీల్, సిమెంట్ ధరల మోత: అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడంతో స్టీల్ తయారీ ఖర్చు 20% వరకు పెరిగింది. ప్రస్తుతం టన్ను స్టీల్ ధర సుమారు రూ.72,000కు చేరింది. సిమెంట్ ధరలు కూడా బస్తాకు రూ.20 - రూ.40 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.రవాణా ఛార్జీల భారం: అంతర్జాతీయ కంటైనర్ రవాణా ధరలు పెరగడంతో ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లంబింగ్ సామగ్రి, విదేశీ టైల్స్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో కంటైనర్పై సుమారు రూ.1.5 లక్షల నుండి రూ.3.5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది.అల్యూమినియం, పీవీసీ: యుద్ధ ప్రభావంతో అల్యూమినియం ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోగా, పీవీసీ పైపుల ధరలు 20-33% వరకు పెరిగాయి.హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి.. ఇల్లు కొనాలా? వద్దా?ప్రస్తుత సంక్షోభం ఉన్నప్పటికీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర నగరాల కంటే స్థిరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడే కొనడం ఎందుకు మంచిదంటే.. పెరగనున్న ధరలు: నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల బిల్డర్లు కొత్త ప్రాజెక్టుల ధరలను పెంచక తప్పదు. వచ్చే 3-6 నెలల్లో అపార్ట్మెంట్ల ధరలు 10-15% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, పాత ధరలకు అందుబాటులో ఉన్న రెడీ-టు-మూవ్ ఇళ్లను తీసుకోవడం లాభదాయకం.తక్కువ వడ్డీ రేట్లు: ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు 5.5% నుండి 6.0% మధ్య ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.డిమాండ్&సరఫరా: హైదరాబాద్లో ఐటీ, ఫార్మా రంగాల విస్తరణ వల్ల ఇళ్లకు డిమాండ్ తగ్గడం లేదు. కొకాపేట, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ధరలు నిలకడగా పెరుగుతున్నాయి.మీరు సొంత అవసరానికి ఇల్లు కొనాలనుకుంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలే మేలనిపిస్తుంది. అయితే, పెట్టుబడి దృష్ట్యా ఆలోచించే వారు మాత్రం భౌగోళిక రాజకీయ పరిస్థితులు కుదుటపడే వరకు కొంత సమయం వేచి చూడటం లేదా 'ఓపెన్ ప్లాట్ల'పై దృష్టి పెట్టడం సురక్షితం.నిర్మాణం చేపట్టే వారు జాగ్రత్త!మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావిస్తే, బడ్జెట్లో 15-20% అదనపు నిధులు కేటాయించుకోవడం అవసరం. ధరల పెరుగుదల వల్ల అనుకున్న బడ్జెట్ దాటిపోయే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు స్థానిక సామగ్రిని వాడటం ద్వారా ఖర్చును నియంత్రించవచ్చు. -
నెలకు అద్దె @ రూ.1.2 లక్షలు!
కలల నగరం ముంబైలో అద్దె కోసం ఇల్లు దొరకడం ఒక ఎత్తయితే, దాని అద్దె చెల్లించడం మరో ఎత్తు. సామాన్యుడి నెల జీతం కంటే కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ అద్దెలే ఎక్కువగా ఉంటాయన్నది జీర్ణించుకోలేని వాస్తవం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ముంబై జీవన ప్రమాణాలు, అద్దె భారం గురించి చర్చకు తెరలేపింది.ప్రముఖ వ్లాగర్ ఆర్య కొఠారి తన ఇన్స్టాగ్రామ్ సిరీస్ ‘రెంట్ ఇన్ ముంబై - ఈపీ 4’ లో భాగంగా అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఒక యువతిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రాంతంలో ఒక 3బీహెచ్కే (మూడు పడకగదుల) ఫ్లాట్ కోసం ఆమె నెలకు ఏకంగా రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ విశాలమైన గది, ఆధునిక వంటగది చూస్తుంటే ముంబై వంటి నగరంలో అది ఎంత లగ్జరీనో అర్థమవుతుంది.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ‘ముంబైలో అద్దె కట్టడమే ఒక పూర్తిస్థాయి ఉద్యోగంలా మారిపోయింది’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘ఒకరికి రూ. 1.2 లక్షల అద్దె సౌకర్యం కావచ్చు, మరొకరికి రూ.80 వేల జీతంతో బతకడమే పెద్ద పోరాటం కావచ్చు’ అని మరికొరు అన్నారు. View this post on Instagram A post shared by Arya Kothari (@arya_kothari) -
దుబాయ్ రియల్టీ.. ఒకప్పుడు స్వర్గధామం.. కానీ ఇప్పుడు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం దూసుకుపోయింది. 2025 నాటి గణాంకాలను పరిశీలిస్తే విదేశీ పెట్టుబడిదారులు దుబాయ్లో ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎంతటి ఆసక్తిని చూపుతున్నారో స్పష్టమవుతోంది. కొన్ని సర్వేల ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తున్న దేశాల జాబితాలో భారతదేశం 22% వాటాతో అగ్రస్థానంలో ఉంది.భారత్ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ కింగ్డమ్ (17%), చైనా (14%), సౌదీ అరేబియా (11%), రష్యా (9%) నిలిచాయి. ఇది దుబాయ్ మార్కెట్ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉందని నిరూపిస్తోంది.దుబాయ్ రియల్టీ ఎందుకు పుంజుకుంది?దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందడానికి కొన్ని కీలక అంశాలు దోహదపడ్డాయి. ప్రపంచ రాజకీయాల్లో అస్థిరత ఉన్నప్పటికీ దుబాయ్ ఒక సురక్షితమైన సేఫ్ హెవెన్గా పెట్టుబడిదారులకు కనిపిస్తోంది. ఆస్తుల కొనుగోలుపై, అద్దెలపై ఆదాయపు పన్ను లేకపోవడం అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. బుర్జ్ ఖలీఫా వంటి అద్భుత కట్టడాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పర్యాటక, నివాస రంగాలను బలోపేతం చేస్తున్నాయి. ప్రాపర్టీ లావాదేవీల్లో పారదర్శకత కోసం బ్లాక్చెయిన్, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించడం వల్ల పెట్టుబడిదారులకు నమ్మకం పెరుగుతోంది.ఇప్పుడు సమస్య ఏంటి?ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అమెరికా ప్రమేయం వంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై మిశ్రమ ప్రభావాన్ని చూపుతున్నాయి. పొరుగు దేశాల్లో యుద్ధం లేదా అస్థిరత నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు తమ సంపదను సురక్షితంగా ఉంచుకోవడానికి దుబాయ్ను ఎంచుకునేవారు. కానీ ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో నేరుగా ఇరాన్ వ్యతిరేకంగా ఉన్న అమెరికాపై దాడి చేయలేక పక్కన ఉన్న యూఏఈలోని యూఎస్ స్థావరాలపై దాడికి పాల్పడుతోంది. దాంతో ఎంతో సురక్షితంగా భావించిన దుబాయ్ కూడా అనిశ్చితిలోకి వెళ్లినట్లయింది. ఈ పరిస్థితులు దుబాయ్ రియల్టీ మార్కెట్ను భారీగా కుంగదీశాయి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ప్లాట్ కొనేముందు ఇలా చేయండి: హైడ్రా హెచ్చరిక
రాజధానిలో ప్లాట్, ఇంటి స్థలం కొనేముందు పూర్తిగా విచారించి, అన్నీ సరిగా ఉంటేనే ముందుకెళ్లాలని హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఏమైనా ఉందా? అనుమతి పొందిన లే అవుట్ అయినా.. ఇంటి నంబరు, బై నంబర్లతో అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొంది.ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు చేసింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 48 ఫిర్యాదులు వచ్చాయి.అమీన్పూర్ చెరువులో తమ లేఔట్ మునిగిపోయిందని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు.కాప్రా జీఆర్ రెడ్డి నగర్ హెచ్ఎండీఏ లే ఔట్లో మొత్తం నాలుగు పార్కులు ఉన్నాయి. ఒక పార్కులో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రార్థన స్థలాలు వస్తున్నాయని నివాసితులు ఫిర్యాదు చేశారు. బాలానగర్ శోభనా కాలనీలోని అక్షయ ఎన్క్లేవ్ పేరిట 7.12 ఎకరాల్లో 69 ప్లాట్లతో 1983లో లేఔట్ వేశారు. ఇందులో రెండు స్థలాలను పార్కుల కోసం కేటాయించారు. 1700 గజాల పార్కును కబ్జా చేసేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200 గజాలు ఆక్రమించి షెడ్డు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే హైడ్రా స్పందించి చర్యలు తీసుకోవాలని, పార్కును కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. -
ఆహ్లాదకర వాతావరణం.. ల్యాండ్ స్కేపింగ్ అనివార్యం!
వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు.పురుగు మందులు, రసాయనాలతో గాలి, నేల కలుషితమవుతుంది. దీంతో సేంద్రీయ, సస్టయినబుల్ గార్డెనింగ్కు ఆదరణ పెరుగుతోంది. సువాసన, ఆకర్షణీయమైన పూలమొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్వేలు, డెక్లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్లను చేపడుతున్నారు. విశ్రాంతి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్తో బార్బిక్యూ వంటి ఔట్డోర్ ఈవెంట్లు, పార్టీలు చేసుకునేందుకు అనువైన వేదికగా ఉంటుంది.క్లబ్హౌస్లో కో-వర్కింగ్ ప్లేస్కరోనాతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ అక్కడక్కడా ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇప్పటికీ ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్ ఆఫీస్ కోసం వినియోగిస్తే గృహ కొనుగోలుదారులు ఒప్పుకోవడం లేదు.ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇష్టపడటం లేదు. దీంతో నిర్మాణ సంస్థలు క్లబ్హౌస్లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్, హై నెట్వర్క్ స్పీడ్తో వైఫై సేవలను అందిస్తున్నాయి. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో అంతా కలిసి ఒకే చోట ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసుకుంటున్నారు. పైగా అవసరమైనప్పుడు వెంటనే ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. -
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!
సాధారణంగా పెద్దలు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని ఆలోచిస్తారు. ఇందులో భాగంగానే కొందరు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుండటారు. ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి లెక్కేలేనన్ని మార్గాలు ఉన్నప్పటికీ.. చాలామంది భూములను కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.స్వాప్నిల్ కొమ్మావర్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా.. ఒక విషయం వెల్లడించారు. 1990లో నా మామ ఏకంగా 15000 రూపాయల చొప్పున, నాలుగు ఎకరాలను రూ. 60వేలుతో కొన్నారు. క్రమంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు అది ఒక జిల్లా స్థాయికి చేరింది. రిటైల్ దిగ్గజం డీమార్ట్ రెండు ఎకరాలు భూమిని రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. దీన్నిబట్టి చూస్తే.. భూమిపై పెట్టే పెట్టుబడి ఎంత లాభదాయకంగా ఉంటుందో తెలుస్తుందని పేర్కొన్నారుభూమిని అమ్మగా వచ్చిన డబ్బును నా మామ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారు. ఇప్పుడు ప్రతి నెలలో రూ. 14.5 లక్షల వడ్డీ ఆదాయం వస్తోంది. ఇంకా, ఆయన దగ్గర రెండు ఎకరాల భూమి కూడా ఉంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రూ. 60,000 నుంచి రూ. 25 కోట్లకు ఎంత అద్భుతమైన ప్రయాణం! అని ఒకరు కామెంట్ చేయగా, అన్ని భూములకు ఒకే విలువ ఉంటుందని దీని అర్థం కాదు; ఇది ప్రాంతం మరియు అదృష్టంపై ఆధారపడి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు.A true story from my hometown!In 1990, my uncle bought 4 acres of land for 15,000 per acre.Total investment: 60,000.The town developed over the years. and now even a district.Now, DMart bought 2 acres of that land from him for 25 crores.He has now put the 25 crores in a…— Swapnil Kommawar (@KommawarSwapnil) March 12, 2026 -
నగరంలో విల్లా లైఫ్: ఇప్పుడంతా ‘అప్’ర్ట్మెంట్ ట్రెండ్!
దేశ రియల్ ఎస్టేట్ రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిన్న అపార్ట్మెంట్ల నుంచి ఆకాశహర్మ్యాలను నిర్మించే స్థాయికి ఎదిగింది. అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మన నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోంది.సాధారణంగా అపార్ట్మెంట్లకు అప్డేట్ వెర్షన్గా అపార్ట్మెంట్ల పోకడను బిల్డర్లు ప్రమోట్ చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో నగరాల్లోని యువ ఐటీ ప్రొఫెషనల్స్, చిన్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వీటిని నిర్మిస్తున్నారు. ‘యూ’ అంటే అప్గ్రేటెడ్ అని అర్థం వచ్చేలా ఈ కొత్త కాన్సెప్ట్నకు శ్రీకారం చుట్టారు. సాధారణ ఫ్లాట్లలో ఉండే రొటీన్ సౌకర్యాల కంటే కాస్త భిన్నంగా హోటల్ తరహాలో లగ్జరీ, స్మార్ట్ ఫీచర్లను కలిపి అందించడమే ఈ కొత్త కాన్సెప్ట్ ‘అప్’ర్ట్మెంట్ ప్రాజెక్ట్ల ప్రధాన లక్ష్యం.‘అప్’ర్ట్మెంట్ అంటే?విల్లాలో నివాస అనుభూతిని అపార్ట్మెంట్లలో కల్పించడమే ఈ ‘అప్’ర్ట్మెంట్ల ప్రత్యేకత. గ్రీనరీతో పాటు వెల్నెస్ ఆధారిత వసతులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నేటి ఆహారపు, జీవనశైలి నేపథ్యంలో నివాసితులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం వీటి ఉద్దేశం. ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలు..ఈ తరహా ప్రాజెక్ట్లలో ప్లగ్ అండే ప్లే తరహాలో సదుపాయాలుంటాయి.కేవలం దుస్తులు, ఇతర అవసరమైన వస్తువుల్ని తీసుకెళ్తే చాలు.. ఫ్లాట్లోనే అన్ని సౌకర్యాలు ఉంటాయి. పూర్తిస్థాయిలో ఫర్నిచర్, మాడ్యులర్ కిచెన్, అత్యాధునిక ఎల్రక్టానిక్ గాడ్జెట్ల్తో ఈ గృహాలు మీకు స్వాగతం పలుకుతాయి. అంతేకాకుండా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషనర్, వాయిస్ కమాండ్తో పనిచేసే లైటింగ్ సిస్టమ్, ఫ్యాన్లు వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీని అమరుస్తారు. వీటితో పాటు చాలా చోట్ల కామన్ వర్క్ ప్లేస్, మినీ జిమ్, లాండ్రీ సర్వీస్లను కూడా బిల్డర్లు ఈ నిర్మాణాల్లో ఏర్పాటు చేస్తారు.అధిక కార్పెట్ ఏరియా..ప్రస్తుతం ఈ కొత్త ట్రెండ్ బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా స్టార్టప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు, మోడ్రన్ యువ బిల్డర్లు వీటికి శ్రీకారం చుడుతున్నారు. ఈ అపార్ట్మెంట్ల నిర్మాణంలో లే–అవుట్, ఫ్లాట్ల డిజైనింగ్ ప్రతి అంశంలోనూ లోతైన అధ్యయనం ఉంటుంది. ఇంటి లోపల కార్పెట్ ఏరియా సామర్థ్యం పెరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. సంప్రదాయ అపార్ట్మెంట్లతో పోలిస్తే ఈ తరహా యూనిట్లలో కార్పెట్ ఏరియా 4 శాతం అధికంగా ఉంటుంది.ధర ఎక్కువే అయినా..లేఅవుట్ విస్తీర్ణంలో పెద్దగానే ఉన్నప్పటికీ అపార్ట్మెంట్లను పరిమిత సంఖ్యలో నిర్మిస్తారు. నివాసితులకు ప్రైవసీతో పాటు అధిక వసతులను అనుభవించేందుకు వీలు కల్పిస్తారు. అపార్ట్మెంట్ బ్లాక్లు ఒకదానికొకటి దూరంగా ఉండటంతో ఫ్లాట్లకు విస్తారమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తుంది. అలాగే కిటికీలో నుంచి చూస్తే కనుచూపు మేర పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంటుంది. దీంతో నివాసితులకు మానసిక, శారీరక సంతృప్తి చేకూరుతుంది.సాధారణ అపార్ట్మెంట్లు, ఆకాశహర్మ్యలతో పోలిస్తే ఈ తరహా అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలు కొంత ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ వీటికి అద్దె డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఉండి ఆధునిక సదుపాయాలు అనుభవించాలని కోరుకునే వారికి ఈ ఫ్లాట్లు అమితంగా నచ్చుతాయి. ఇందులో నిర్వహణ బాధ్యతలను చాలా వరకు బిల్డర్లే చూసుకుంటారు. -
ఇల్లు కొనాలంటే.. ఈ వసతులు ఉండాల్సిందే!
గతంలో గృహ కొనుగోలులో ధరకు ప్రాధాన్యం ఉండేది. కానీ, ఇప్పుడు వసతులు చూశాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ధర ఎంతైనా వసతుల విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. గృహ కొనుగోలుదారుల అభిరుచుల మేరకు డెవలపర్లు కూడా సరికొత్త సౌకర్యాలను అందిస్తున్నారు. గతంలో కమ్యూనిటీలలో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి నాలుగైదు వసతులు ఉంటే సరిపోయేది కానీ, ఇప్పుడు భవిష్యత్తు అవసరాలు, కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టు ఉండాల్సిందే. ఇంటి నుంచి పని కోసం కో-వర్కింగ్ స్పేస్, ఆన్లైన్ క్లాస్ల కోసం డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి మొదలుపెడితే.. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాట్లు, ఔట్డోర్ జిమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, పెట్ పార్క్, గోల్ఫ్కోర్స్ వరకూ అన్ని ఆధునిక వసతులు కావాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు.పెట్ పార్క్..జంతు ప్రేమికుల కోసం కూడా డెవలపర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస సముదాయాల్లో వసతుల జాబితాలో పెట్ పార్కులు కూడా చేరిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీలలో కొనుగోలుదారులు పెంచుకునే పెంపుడు జంతువుల కోసం పెట్ పార్క్, క్లబ్హౌస్లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్లలో అందుబాటులో ఉంటాయి. అలాగే పెట్రోల్, డీజిల్ వంటి వాహనాలతో పర్యావరణం కలుషితం అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాహన కొనుగోళ్లపై రాయితీలు అందిస్తుండటంతో పాటు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.హోమ్ గార్డెనింగ్..సొంతిల్లు కొనుగోలు చేసే క్రమంలో గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియాలు ఎంత వరకు ఉన్నాయో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గతంలో కామన్ ఎలివేటర్, కామన్ కారిడార్, గ్యారేజ్, స్టేర్కేస్ ఉండేవి ఇప్పుడు వాటిని ప్రైవేట్గా కావాలని అడుగుతున్నారు. ఇంట్లో సొంత అవసరాల కోసం కమ్యూనిటీ గార్డెన్ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపాటి స్థలంలో ఆకుకూరలు, కాయగూరలు పండించుకునేలా వర్టికల్ గార్డెనింగ్, బాల్కనీలలో ఉండేలా చూసుకుంటున్నారు. వారాంతాలలో కమ్యూనిటీ వాసులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఔట్డోర్ కిచెన్, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. టెర్రస్, క్లబ్ హౌస్పై సౌర విద్యుత్ ఉండాలని కోరుతున్నారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం ఈ విద్యుత్నే వినియోగిస్తున్నారు. దీంతో నివాసిత సంఘానికి కరెంట్ బిల్లు భారం తగ్గుతుంది. -
అద్దె గృహాలకు ఫుల్ డిమాండ్.. ఎక్కడంటే?
కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. విక్రయించే సమయంలో ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లో అద్దె గృహాల మార్కెట్ క్రమంగా పెరుగుతోంది.ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది. ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లై తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ పెరిగింది.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లై వాటా 39 శాతంగా ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువ ఉంది.కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేల నుంచి రూ.35 వేల నెలవారీ అద్దెలకు కోసం అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువ ఉంది. -
ఇల్లు కొంటే ఖరీదైన బైక్.. తులం బంగారం
షాపుల్లో మెగా సేల్స్.. బంపర్ ఆఫర్లు చూస్తుంటాం.. ఈ కామర్స్ సంస్థల ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్లు చూస్తుంటాం.. మైక్ పట్టుకొని ‘రండి బాబూ రండి.. ఇలాంటి సువర్ణావకాశం మళ్లీ రాదు..’ అంటోంది స్థిరాస్తి రంగం. అందుబాటు ధరలు ఉండే హైదరాబాద్లో ఒకప్పుడు ప్రాపర్టీలు హాట్ కేక్లు. నిర్మాణం పూర్తి కాకముందే బ్రోచర్ల మీదే ఫ్లాట్ల అమ్మకాలు పూర్తయ్యేవి. ధరలు, నాణ్యత, బిల్డర్ల ట్రాక్ రికార్డ్లు, మార్కెట్ సెంటిమెంట్ అలా ఉండేది. 360 డిగ్రీల కోణంలో గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా, ఆకర్షించేలా ఉండేది. కానీ, కొన్నేళ్లుగా మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. – సాక్షి, సిటీబ్యూరోమారిన పరిస్థితులతో పాటు కొన్ని ప్రతికూలతలతో స్థిరాస్తి రంగంలో సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతింది. దీంతో విక్రయాలు లేక నిర్మాణ రంగం క్షీణించే దశకు చేరుకుంది. ఈ రంగంపైనే ఆధారపడిన నిర్మాణ సంస్థలు, బిల్డర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్ల వల వేయక తప్పడం లేదు. ఇళ్ల అమ్మకాలను పెంచుకునేందుకు విలువైన బైక్, ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ), తులం బంగారం, ఉచిత ఇంటీరియర్.. ఇలా రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నారు.నిర్మాణ సంస్థలెన్నో.. స్థిరాస్తి రంగంలో ఆఫర్ల వల కొత్తేమీ కాదు. గతంలో ఉచిత ఇంటీరియర్, క్లబ్హౌస్ సభ్యత్వం, మాడ్యులర్ కిచెన్ వంటి పరిమిత స్థాయిలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్లో గృహ విక్రయాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో నగరంలోని చిన్నా, పెద్దా డెవలపర్లు, నిర్మాణ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీమియం మోటార్ సైకిళ్లు, 24 క్యారెట్ల బంగారం నాణేలు, ఈవీ వాహనాలు, ఉచిత ఇంటీరియర్ వంటి ఖరీదైన బహుమతులను అందజేస్తున్నాయి. ఉదాహరణకు నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కోకాపేట, కూకట్పల్లి, ఉప్పల్, పటాన్చెరు, రాజేంద్రనగర్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో అపార్ట్మెంట్ బుకింగ్తో ప్రతి కొనుగోలుదారుడికి రూ.3 లక్షల విలువైన హార్లీ డేవిడ్సన్ బైక్ను ఉచితంగా అందజేస్తామని ప్రచారం చేస్తోంది. మరో డెవలపర్ ఉప్పల్, రామాంతాపూర్లలో రాబోయే ప్రాజెక్ట్లో ప్రతి కస్టమర్కు రూ.8 లక్షల విలువైన ఈ–వాహనాన్ని అందిస్తామని ప్రచారం చేస్తున్నారు.ఆఫర్లతో విక్రయాలు స్పల్పకాలమే.. వేగంగా విక్రయాలు జరుపుకునేందుకు ఇలాంటి ఆఫర్లతో ప్రయత్నాలు చేస్తుంటారని డెవలపర్ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రతికూల మార్కెట్లో అమ్ముడుపోని ఇన్వెంటరీని విక్రయించేందుకు ఇలాంటి ప్రత్యేక డీల్స్ను ప్రవేశపెడుతుంటారు. అయితే ఈ ఉచితాల ధర ప్రాజెక్ట్ ధరలో భాగం అవుతుందని, ఈ తరహా మార్కెట్ స్వల్పకాలంలో అమ్మకాలను పెంచినా.. స్థిరమైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఉచితాలు కాకుండా ధర, నిర్మాణ నాణ్యత, ప్రాంతాన్ని చూసి ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.బంగారంతో ఆకర్షణ.. పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆఫర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఫ్లాట్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు రిటర్న్ గిఫ్ట్ అందజేసే సంప్రదాయంగా పెరుగుతోంది. మియాపూర్కు చెందిన ఓ డెవలపర్ రూ.75–85 లక్షల మధ్య ధర కలిగిన రెండు, మూడు పడక గదుల ఇంటి కొనుగోలుపై కస్టమర్కు రూ.3 లక్షల విలువైన బంగారం ఇస్తామని ప్రకటించారు. అంటే దగ్గరిదగ్గర 10–14 గ్రాముల బంగారం ఇస్తున్నారు. అలాగే పిల్లల బెడ్ రూమ్కు ఇంటీరియర్, మాడ్యులర్ కిచెన్తో పాటు అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు.రెరా పరిధిలోకి రావు.. ఆఫర్లు, ప్రోత్సాహకాలు కస్టమర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు పన్నే వాణిజ్య వ్యూహాలు. అయితే ఈ ఉచిత ఆఫర్ల ప్రకటనలు తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) నియంత్రణ పరిధిలోకి రావు. ఇవి గృహ కొనుగోలుదారులకు రక్షణ కల్పించలేవు. అయితే సేల్డీడ్లో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయడంలో డెవలపర్ విఫలమైతే ఈ ఉచితాలు, బహుమతులతో సహా కొనుగోలుదారులు టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ఆయా డెవలపర్లపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారు. -
దుబాయ్లో హౌస్ షేరింగ్.. కొత్త రూల్స్
దుబాయ్లో భాగస్వామ్య వసతి (హౌస్ షేరింగ్/బెడ్ స్పేస్ రెంటల్స్)పై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మార్చి 11న ఈ మేరకు లా నెం. (4) ఆఫ్ 2026 జారీ చేశారు. భాగస్వామ్య వసతిని నియంత్రించి, నివాసుల హక్కులను కాపాడటం, సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను నిర్ధారించడం, అధిక జనసాంద్రతను నివారించడం, అక్రమ భవన మార్పులను అరికట్టడం ఈ చట్టం లక్ష్యాలు.కీలక నిబంధనలు ఇవే.. ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, యూనిట్ను భాగస్వామ్య వసతిగా కేటాయించాలంటే దుబాయ్ మున్సిపాలిటీ నుండి ముందస్తు అనుమతి (పర్మిట్) తీసుకోవాలి. అనుమతి లేకుంటే ఇది చట్టవిరుద్ధం. అనుమతులు ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతాయి. యజమాని అభ్యర్థన మేరకు రెండేళ్ల పర్మిట్ కూడా ఇవ్వవచ్చు. పునరుద్ధరణ కోసం గడువు ముగియడానికి కనీసం 30 రోజుల ముందు దరఖాస్తు చేయాలి. భాగస్వామ్య యూనిట్లలో గరిష్ట ఆక్యుపెన్సీ లిమిట్, ప్రతి వ్యక్తికి కనీస స్థలం, అవసరమైన షేర్డ్ ఫెసిలిటీలు (వెంటిలేషన్, షేర్డ్ ఏరియాలు) నిర్ధారించాలి. అద్దెదారులు లేదా ఇతరులు యూనిట్లో ఏ భాగాన్నైనా సబ్-లీజ్కు ఇవ్వకూడదు లేదా పార్టిషన్లు (తాత్కాలిక గోడలు) ఏర్పాటు చేయకూడదు – ఇది నిషేధం. భాగస్వామ్య వసతి మార్కెట్పై ప్రత్యేక అద్దె సూచిక (రెంటల్ ఇండెక్స్) ఏర్పాటు చేస్తారు. ఇది సాధారణ అద్దె మార్కెట్ సూచిక నుండి వేరుగా ఉంటుంది.భారీ జరిమానాలుఉల్లంఘనలకు 500 నుండి 500,000 దిర్హమ్ల వరకు జరిమానా విధిస్తారు. ఒక క్యాలెండర్ ఇయర్లో పదేపదే ఉల్లంఘనలు జరిగితే గరిష్టంగా 1 మిలియన్ దిర్హమ్లు (సుమారు రూ.2.25 కోట్లు) వరకు జరిమానా పడవచ్చు.ఎందుకీ కొత్త చట్టం?గతంలో దుబాయ్లో అక్రమ విభజనలు (పార్టిషన్లు), బెడ్ స్పేస్ రెంటల్స్ వల్ల అగ్నిప్రమాదాలు, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు, గత జూలైలో దుబాయ్ మెరీనాలో అక్రమంగా పార్టీషన్ చేసిన ఒక భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో 3,800 మందికి పైగా జనం నివసిస్తున్నారు. ఇలాంటి పార్టీషన్ల కోసం ఉపయోగించే తాత్కాలిక గోడలతో (చెక్క లేదా జిప్సమ్ బోర్డులు) అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటిలేషన్ కూడా సక్రమంగా ఉండదు. అత్యవసర నిష్క్రమణ మార్గాలకు ఆస్కారం ఉండదు. -
ఇరుకు ఇళ్లకు ఇకమతు! ఇలాంటి గోడలు
వినియోగదారుడికి నచ్చిన విధంగా ఇంట్లో ఉన్న విస్తీర్ణాన్ని అవసరానికి తగిన విధంగా సద్వినియోగం చేసుకునేలా నిర్మాణదారులు సరికొత్త సాంకేతిక ఆలోచనలు చేస్తున్నారు. ఇటుకలు, సిమెంట్ బ్లాక్స్ ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుండటంతో వాటి స్థానంలో ప్యానల్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. ఇవి తక్కువ మందంతో పాటు పటిష్టంగా ఉండి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. స్క్రూలతో బిగింపు.. ఇంటి లోపల అంతర్గత గోడల కోసం ఈ ప్యానెల్స్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే గతంలో వీటిని కదలించడానికి వీలు లేకుండా స్క్రూలతో బిగించేవారు. ప్రస్తుతం కదిలేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో స్థలాన్ని వినియోగించుకునే అవకాశం ఏర్పడుతోంది. చిన్న పిల్లల గదిని పగటి పూట తగ్గించుకొని హాల్ పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవి ఇంటీరియర్స్లో కలిసిపోయి అందంగా ఉంటాయి కాబట్టి ఎవరూ ఇవి గోడలని గుర్తించలేరు.నిర్మాణ వ్యయం ఎక్కువ స్టూడియో అపార్ట్మెంట్స్లలో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తరహా గోడలనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఉదయంలో బెడ్ను కాస్త గోడకు నిలబెట్టేస్తే అదొక డిజైన్ మాదిరి కనిపిస్తుంటుంది. అయితే సంప్రదాయ గోడల కంటే వీటి నిర్మాణానికి వ్యయం ఎక్కువ అవుతుంది. చదరపు అడుగు వాల్ ప్యానెల్స్ రూ.75–రూ.80 నుంచి ప్రారంభమవుతాయి. బహిరంగ మార్కెట్తో పాటు ఆన్లైన్లోనూ వివిధ రకాల డిజైన్లు లభ్యమవుతాయి. -
స్మార్ట్ఫోన్ ఉంటే.. అయిపోతుంది ఇల్లు స్మార్ట్గా!
మనం ఇంట్లో లేని సమయంలో అతిథులు ఇంటికి వస్తున్నారు.. గుమ్మలోకి రాగానే ఇంటి తలుపులు తెరుచుకుంటాయి.. హాల్లోకి అడుగు పెట్టగానే లైట్లు వెలుగుతాయి.. సోఫాలో కూర్చోగానే ఏసీ ఆన్ అవుతుంది. బాల్కనీ వైపు ఉన్న కర్టెన్లు తెరుచుకుంటాయి. ఇవన్నీ చేసేందుకు మెయిడ్(పనిమనిషి) అవసరం లేకుండా స్మార్ట్ఫోన్ నుంచే ఇవన్నీ సాధ్యం.. ప్రస్తుతం ఇంట్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత భద్రతా ఉపకరణాల వినియోగం పెరిగింది.రియల్ టైమ్లో ట్రాక్ చేసే స్మార్ట్ కెమెరాలు, డిజిటల్ లాక్స్, స్మార్ట్ వీడియో డోర్ బెల్స్, లైట్లు, కర్టెన్లు ప్రతిదీ స్మార్ట్గా మారిపోయాయి. వేలిముద్ర, ఐరిష్ చూపిస్తే చాలు ఆటోమెటిక్గా ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. చాలా మంది బిల్డర్లు ఇంటి నిర్మాణ సమయంలోనే ఈ స్మార్ట్ ఉపకరణాలను జోడిస్తున్నారు.కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమ హైదరాబాద్లోని హైఎండ్ ప్రాజెక్ట్లలో ఈ తరహా ఐఓటీ ఉపకరణాల ప్రాజెక్ట్లు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే వారు వ్యక్తిగత గృహాలలో సైతం వీటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది. -
ఇలా చేస్తే తప్ప.. హైదరాబాద్లో ఇల్లు కొనలేమా?
నగరంలో రూ.45 లక్షలలోపు ధర ఉన్న ‘అఫర్డబుల్ హౌసింగ్’కు ఏటా గిరాకీ పెరుగుతూనే ఉంది. సులువైన గృహ రుణాలు, వడ్డీ రాయితీ కారణంగా కస్టమర్ల నుంచి అందుబాటు గృహాలపై ఆసక్తి పెరుగుతోంది. కానీ, భూముల ధరలు, నిర్మాణ వ్యయ భారం, కార్మికుల కొరత తదితర కారణాలతో వీటి నిర్మాణానికి డెవలపర్లు ఆసక్తి చూపించడం లేదు. దాంతో వాటి కొరత ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరోగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్ హౌసింగ్ తగ్గుముఖం పట్టింది. మరోవైపు పెరిగిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి.కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు రావడం లేదు. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ పెరగడంతో ఓనర్లు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఉద్యోగులు తమ సంపాదనలో దాదాపు 40 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. రీ–డెవలప్మెంట్ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపుతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు. -
ఇల్లు కొంటే.. గేటెడ్ కమ్యూనిటీలోనే కొనాలి!
పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చిన ఉద్యోగికి ప్రశాంతమైన వాతావరణం.. నడిచి వెళ్లి వచ్చేంత దూరంలోనే అందుబాటులో ఉండే నిత్యావసరాలు.. పిల్లలు హాయిగా ఆకుడునేలా భద్రత.. వృద్ధుల కాలక్షేపం కోసం లైబ్రరీ.. కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా గడిపేలా పచ్చటి పార్కులు.. ఎలాంటి పొల్యూషన్ లేని ప్రాంతం.. ప్రస్తుతం నగరవాసులు కోరుకుంటున్నవి ఇవే.. ముఖ్యంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు, అభిరుచులను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లే విధంగా వాతావరణం ఉంటుంది. అలాంటి అవసరాలు తీరుస్తున్నాయి కాబట్టే ‘గేటెడ్ కమ్యూనిటీ’లకు ఆదరణ పెరుగుతూనే ఉంది. కట్టుదిట్టమైన భద్రత, ఆధునిక వసతులు మాత్రమేæకాదు.. మెరుగైన జీవనశైలి, ఆరోగ్యకర వాతావరణం, మనశ్శాంతిని అందించే కేంద్రాలే గేటెడ్ కమ్యూనిటీలు.. – సాక్షి, సిటీబ్యూరోభార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడం, ఇద్దరికీ మంచి ప్యాకేజీ ఉండటం, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్టాండలోన్ అపార్ట్మెంట్ల నుంచి గేటెడ్ కమ్యూనిటీలకు షిఫ్ట్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటి ధర అధికంగా ఉన్నా ఏమాత్రం ఆలోచించడం లేదు. 24/7 భద్రత, నిఘా, ఆధునిక వసతులు, మెరుగైన మౌలిక వసతులు ఉండటంతో ఈ తరహా ప్రాజెక్ట్ల లో అపార్ట్మెంట్లను కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు.తొలి ప్రాధాన్యత భద్రతకే.. ఎవరైనా సరే ఇంటిని ఎంపిక చేసే ముందు ప్రాధాన్యత ఇచ్చేది భద్రతకే. కమ్యూనిటీ లోపలికి ఎవరొస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే కచి్చతమైన సమాచారం ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ గేట్ల వద్ద 24/7 భద్రతా సిబ్బంది, సీసీటీవీ కెమెరాలతో గట్టి నిఘా ఉంటుంది. నివాసితులు అనుమతిస్తే తప్ప బయటివారు లోపలికి వచ్చేందుకు వీలుండదు. దీంతో భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా పిల్లలు, పెద్దలను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లేందుకు ఎలాంటి భయం అక్కర్లేదు. అలాగే గేటెడ్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, ఫిట్నెస్ సెంటర్, పార్క్, యాంఫీ థియేటర్, ల్యాండ్స్కేప్ గార్డెనింగ్, స్పోర్ట్స్ కోర్ట్ క్లబ్హౌస్ వంటి సౌకర్యాలు ఉంటాయి. రిటైల్ దుకాణం, ఫార్మసీ, వెల్నెస్ సెంటర్ కూడా ఉంటాయి.సామాజిక బంధాలు.. సాధారణంగా నగరాలలో పక్కింటి వాళ్లెవరో కూడా తెలియదు అనే భావన ఉంటుంది. కానీ, గేటెడ్ కమ్యూనిటీలలో అలా కాదు. నివాసితులందర్నీ ఒక చోట చేరుస్తుంది. వాకింగ్, వ్యాయామం వంటి వేళల్లో ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. పిల్లలు వారి వయస్సు స్నేహితులతో ఆడుకుంటారు. పండుగల సందర్భాలలో కమ్యూనిటీ మొత్తం సందడి వాతావరణం నెలకొంటుంది. కమ్యూనిటీ లోపల ధ్వని, వాయు కాలుష్యం ఉండదు. దీంతో నివాసితులు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో నివాసం ఉండే వీలు కలుగుతుంది.మౌలిక సదుపాయాలు.. గేటెడ్ కమ్యూనిటీలలో ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలు ఉండటం వీటి అదనపు ఆకర్షణ. వెడల్పాటి రోడ్లు, రహదారికి ఇరువైపులా చెట్లు, వృద్ధులు, పిల్లలు సేదతీరేందుకు అక్కడక్కడ బెంచ్లు, కుర్చీలు ఉంటాయి. పరిశుభ్రమైన నీటి వ్యవస్థ, భూగర్భ విద్యుత్ లైన్లు, మురుగు నీటి వ్యవస్థ ఉంటాయి. ప్రజారవాణా, మెరుగైన మౌలిక వసతులకు చేరువలో ఉంటాయి. నేటి అవసరాలకు తగినట్లు సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.అవసరాలు తీరేలా.. గేటెడ్ కమ్యూనిటీ లే–అవుట్లు కూడా ప్రతి ఇంటికీ మెరుగైన సూర్యరశి్మ, స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేస్తారు. అందుకే గేటెడ్లో ఎక్కువ స్థలం గ్రీనరీకి కేటాయిస్తారు. కమ్యూనిటీలోని వసతుల నిర్వహణకు క్రమశిక్షణ కలిగిన సిబ్బంది ఉంటారు. నేటి అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీల్లోనే కో–వర్కింగ్ స్పేస్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు, సౌర విద్యుత్ వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి యువతరం అభిరుచులు, అవసరాలకు తగ్గట్లు గేటెడ్ కమ్యూనిటీలను పలువురు బిల్డర్లు ఐటీ పార్క్లు, అంతర్జాతీయ స్కూళ్లు, ఆస్పత్రులకు సమీప దూరంలో గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీలలో అపార్ట్మెంట్ల విస్తీర్ణం 1,300 చ.అ. నుంచి ప్రారంభమవుతాయి. ఆ పరిమాణంలో ఉంటే కనీస వసతులు, జీవనశైలి కల్పించే వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.నగరం నలువైపులా.. కూకట్పల్లి, మదీనాగూడ, తెల్లాపూర్, నల్లగండ్ల, మియాపూర్, బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, ఉప్పల్, వనస్థలిపురం, కొంపల్లి, శామీర్పేటతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. విశాలమైన స్థలం, వసతులు, నిర్వహణ చార్జీల నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ల ధర 20–25 శాతం ఎక్కువగా ఉంటుంది. స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్లతో పోలిస్తే గేటెడ్ కమ్యూనిటీలలో ప్రాపర్టీల విలువ 30–35 శాతం అధికంగా ఉంటుంది. డిమాండ్ కారణంగా వీటిల్లో అద్దెలు బాగానే గిట్టుబాటవుతాయి. -
రికార్డుల రియల్ ఎస్టేట్.. ఇప్పుడంతా టెన్షన్!
స్థిరాస్తి రంగం లావాదేవీలలో అత్యంత ప్రధానమైంది సెంటిమెంట్. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే.. వారి భావోద్వేగాలపై ప్రభావం పడిందంటే చాలు తుది నిర్ణయానికి పునరాలోచనలో పడతారు. ఏ దేశ స్థిరాస్తి రంగంలోనైనా ఇదే పరిస్థితి. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలలో యుద్ధం నేపథ్యంలో ప్రధానంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం అనిశ్చితిలో పడింది. గతేడాది దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో 2.70 లక్షలకు పైగా స్థిరాస్తి లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 917 బిలియన్ ఏఈడీ. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.2,30,872 కోట్లు. దుబాయ్ రియల్టీ చరిత్రలో ఇదే అత్యధిక లావాదేవీలు కావడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పై మొదలు పెట్టిన యుద్ధం క్రమంగా యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్(యూఏఈ) దేశాలకు విస్తరించింది. దీంతో స్థిరాస్తి పెట్టుబడిదారులు ప్రపంచంలోని అత్యంత డైనమిక్ ప్రాపర్టీ మార్కెట్లలో ఒకటైన దుబాయ్లో ప్రాంతీయ అస్థిరత దెబ్బతింటుందా అనే సందిగ్ధంలో పడిపోయారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ను తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.2008 ఆర్థిక సంకోభం, కరోనా మహమ్మారి కాలంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ షాక్కు గురైంది. కాకపోతే విధానపరమైన సంస్కరణలతో ఆయా విపత్కర పరిస్థితుల నుంచి వేగవంతంగా కోలుకుంది. అయితే ఈసారి దుబాయ్ కూడా ఎదురుదాడికి దిగడంతో పశ్చిమాసియా దేశాల్లో సురక్షిత ఆర్థిక కేంద్రమైన ఎమిరేట్స్లో భౌతిక నష్టం పరిమితమే అయినప్పటికీ.. ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రభావం తప్పక ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.భారతీయుల పెట్టుబడులు ఎందుకంటే? 150 దేశాల పెట్టుబడిదారులు యూఏఈ ప్రాపర్టీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యూఏఈ జనాభాలో దాదాపు 88–89 శాతం మంది ప్రవాసులు ఉంటారు. దీంతో సహజంగానే ఇక్కడ ప్రాపర్టీ మార్కెట్లో వీరిదే హవా.. భౌగోళిక సామీప్యత, డాలర్ కంటే దిర్హమ్ స్థిరత్వం, ఎక్కువ విలువ, అద్దె రాబడులు అధికంగా ఉండటం వంటి కారణంగా భారతీయులు దుబాయ్లో పెట్టుబడులకు మొగ్గు చూపిస్తుంటారు. భారత సంతతికి చెందిన డెవలపర్ల వాటా నిర్మాణ దశలోని ప్రాజెక్ట్లలో 8–10 శాతం వరకు ఉంటుంది.మన ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.2,30,872 కోట్లు.. ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యధిక అద్దె రాబడి వచ్చేది దుబాయ్లోనే.. ఇక్కడ అద్దె వార్షిక ఆదాయం 6–9 శాతం మధ్య ఉంటుంది. భారత్ అతిపెద్ద విదేశీ పెట్టుబడుల దేశం దుబాయ్. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇండియన్స్ ఆస్తి కొనుగోళ్ల వాటా 20–22 శాతంగా ఉందని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి దుబాయ్లో గృహాల ధరలు సుమారు 60–75 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దుబాయ్లో దాదాపు 2 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వీటి విలువ 538 బిలియన్ ఏఈడీ(ఇండియన్ కరెన్సీలో రూ.1,34,945 కోట్లు).ఆర్థిక సంకోభం, కోవిడ్ సమయంలో.. దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్ గతంలోనూ చేదు అనుభవాలను చవిచూసింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దుబాయ్లో ప్రాపర్టీల ధరలు 50–60 శాతం మేర క్షీణించాయి. దీని నుంచి కోలుకునేందుకు 6–7 ఏళ్ల కాలం పట్టింది. చమురు ధరల పతనం, అధిక సరఫరా కారణంగా 2014, 2019లలో ఇక్కడ ధరలు దాదాపు 25–30 శాతం మేర తగ్గాయి. ఇక, ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి కాలంలో ప్రాపర్టీ మార్కెట్లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. అద్దెలపై ప్రభావం.. సాధారణంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రవాసులపై అధికంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాపర్టీ ఇన్వెస్టర్లు తాత్కాలికంగా వేచి చూసే ధోరణి అవలంబిస్తారు. ఇలాంటి సెంటిమెంట్ ప్రభావం తొలుత నిర్మాణ ప్రారంభ దశలో కొనుగోళ్ల, ఊహాజనిత పెట్టుబడులపై చూపిస్తాయి. ఎందుకంటే ఈ విభాగాలు మార్కెట్ సెంటిమెంట్, విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటాయి. అలాగే యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల పర్యాటక పరిశ్రమ దెబ్బతింటుంది. దీంతో పర్యాటక ప్రాంతాల్లోని అద్దెలు, ఆతిథ్య ప్రాపర్టీలు, రిటైల్ ఆస్తులపై తాత్కాలిక ప్రభావం ఉంటుంది. -
రిటైల్ ఫేమ్.. రియల్ ఎస్టేట్ బూమ్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ దాని సాంప్రదాయ కేంద్రాలకు మించి విస్తరిస్తోంది. కార్యాలయ స్థలాలు, నివాస, డేటా సెంటర్లు, పారిశ్రామిక లైఫ్ సైన్సెస్తో సహా వివిధ రంగాలు వృద్ధి కేంద్రాలుగా ఉద్భవిస్తున్నాయి. ఓ వైపు పశ్చిమ, మధ్య హైదరాబాద్లో బిజినెస్ హాట్స్పాట్లు నానాటికీ పెరుగుతున్నాయి. మరోవైపు రాబోయే 3–5 సంవత్సరాలలో తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందనున్నాయని, ఇవి గ్రేడ్–ఏ ఆఫీస్ స్టాక్లో 12–15 శాతం, వార్షిక ఆఫీస్ స్పేస్ డిమాండ్లో 5–10 శాతం వాటా అందుకుంటాయని కొలియర్స్ నివేదిక పేర్కొంది. స్టార్టప్స్లోనూ టాప్.. హైదరాబాద్ వర్ధమాన వ్యవస్థాపకులకు కూడా కీలకమైన నగరంగా మారింది. 2014లో కేవలం 200 స్టార్టప్లు మాత్రమే నగరంలో ఉండగా, ఆ సంఖ్య 7,500కు పెరిగింది. ఈ పెరుగుదల నగరంలో వ్యాపార స్థలాలకు డిమాండ్ను అనూహ్యంగా పెంచేస్తోంది. అమెరికాకు చెందిన స్టార్టప్ పరిశోధన సంస్థ స్టార్టప్ జీనోమ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆసియాలోనే స్టార్టప్లకు ఉత్తమ నగరాల్లో హైదరాబాద్ 19వ స్థానంలో నిలవడం గమనార్హం. లీజింగ్.. కింగ్.. రిటైల్, ఫ్యాషన్ వృద్ధికి దేశంలోని అగ్ర నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారుతోంది. కుష్మాన్– వేక్ఫీల్డ్ తాజా రిటైల్ మార్కెట్ బీట్ రిపోర్ట్ ప్రకారం, 2025 మొదటి త్రైమాసికంలో 0.8 మిలియన్ చదరపు అడుగుల స్థలం రిటైల్ లీజింగ్ను సిటీ నమోదు చేసింది. 2024తో పోలిస్తే ఇది 106 శాతం పెరుగుదల కావడం విశేషం. మొత్తం జాతీయ రిటైల్ లీజింగ్లో 34 శాతంతో నగరాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. దీనిలో ఎక్కువ భాగం జీవనశైలి ఉత్పత్తుల షాపింగ్కు సంబంధించినవి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, కొత్తపేట, కొంపల్లి వంటి కీలకమైన ప్రాంతాలలో కొలువుదీరుతున్నాయి. -
మేడ్చల్లో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్.. కాసాగ్రాండ్ క్రెస్ట్వుడ్ లాంచ్!
భారతదేశంలోని ప్రముఖ రియల్ఎ స్టేట్ డెవలపర్లలో ఒకటైన కాసాగ్రాండ్, హైదరాబాద్లోని మెడ్చల్ ప్రాంతంలో 'కాసాగ్రాండ్ క్రెస్ట్వుడ్' పేరుతో ఒక అతి ప్రీమియం గేటెడ్ విల్లా కమ్యూనిటీని అధికారికంగా ప్రారంభించింది. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రత్యేక ప్రాజెక్ట్లో మొత్తం 130 అత్యున్నత స్థాయి 5 బీహెచ్కే విల్లాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విల్లాల ప్రారంభ ధర రూ. 2.99 కోట్ల నుండి ప్రారంభమవుతుంది.అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ విల్లాలు విశాలమైన నివాస విస్తీర్ణంతో పాటు ప్రైవేట్ హోమ్ థియేటర్ ఏర్పాటు చేసే సదుపాయం, ప్రత్యేక లిఫ్ట్ ప్రొవిజన్, విస్తృత ల్యాండ్స్కేప్ గార్డెన్, 1,200 చదరపు అడుగుల వరకు వ్యక్తిగత తోట స్థలం & సుమారు 375 చదరపు అడుగుల బ్యాక్యార్డ్ ప్రదేశాన్ని కలిగి ఉంటాయి. ప్రతి విల్లా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో రూపొందించారు.ఈ ప్రాజెక్ట్లో 55కి పైగా ఇండోర్ & అవుట్డోర్ లైఫ్స్టైల్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న G+3 క్లబ్హౌస్, రూఫ్టాప్ స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, యోగా స్టూడియో, పిల్లల ఆట స్థలాలు, మల్టీ పర్పస్ కోర్టులు, వాకింగ్ ట్రాక్లు, సీనియర్ సిటిజన్ జోన్, రిఫ్లెక్సాలజీ వాక్వే వంటి అనేక సౌకర్యాలు నివాసితులకు ఆరోగ్యకరమైన & సమతుల్య జీవన శైలిని అందించడానికి రూపుదిద్దుకున్నాయి.మొత్తం ప్రాజెక్ట్ విస్తీర్ణంలో సుమారు 67% భాగాన్ని ఓపెన్ స్పేస్ & ల్యాండ్ స్కేపింగ్ కోసం కేటాయించడం ద్వారా ప్రకృతి మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించారు. ఫెంగ్ షుయ్ ప్రేరణతో రూపొందించిన ఉద్యానవనాలు, ప్రత్యేక థీమ్ గార్డెన్లు & విస్తృత హరిత ప్రదేశాలు నివాసితులకు ప్రశాంతత, గోప్యతను కల్పిస్తాయి.ఇంటీరియర్ రూపకల్పనలో 9’10” ఎత్తైన సీలింగ్స్, విస్తృత గాజు స్లైడింగ్ డోర్స్, సమృద్ధిగా సహజ కాంతి & గాలి ప్రసరణకు అనుకూలమైన ప్రణాళిక, వాక్-ఇన్ వార్డ్రోబ్లతో కూడిన సూట్-సైజ్ బెడ్రూమ్స్ మరియు విశాలమైన మాడ్యులర్ వంటగదులు అందుబాటులో ఉన్నాయి. ప్రతివిల్లాకు 100% పవర్బ్యాకప్ సదుపాయం కల్పించారు.మెడ్చల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్రోడ్ సమీపంలో ఉండటం వలన హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఐటీకారిడార్లు, పరిశ్రమల కేంద్రాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సేవా సంస్థలు & వినోద ప్రదేశాలకు సులభంగా చేరుకునే అవకాశం కల్పిస్తుంది. మేడ్చల్ ఇండస్ట్రియల్ కారిడార్, జీనోమ్ వ్యాలీ, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉండటం దీని విలువను మరింత పెంచుతుంది.అదనంగా, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు & రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సౌకర్యవంతమైన కనెక్టివిటీ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను మరింత బలపరుస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా కూడా ఇది అత్యుత్తమ అవకాశంగా భావిస్తున్నారు. -
స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా మారడంతో అనేక ఆస్తి కొనుగోలు ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.భారతీయ పెట్టుబడిదారుల ‘బ్రేక్’దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొంతకాలం వాయిదా వేస్తున్నారు. కొన్ని విలాసవంతమైన బీచ్ఫ్రంట్ ప్రాపర్టీల కొనుగోలు ఒప్పందాలు కూడా నిలిపివేసినట్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు.భద్రమైన పెట్టుబడి కేంద్రం… ఇప్పుడు సందేహాలుఇప్పటివరకు దుబాయ్ పెట్టుబడిదారులకు ‘సేఫ్ హేవన్’ అనే భావన ఉండేది. కానీ తాజా సైనిక ఉద్రిక్తతలు, మిస్సైల్ దాడుల భయం, ఎయిర్స్పేస్ పరిమితులు వంటి అంశాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. విదేశీ మూలధనంపై ఆధారపడిన ఈ మార్కెట్లో కొనుగోళ్ల వేగం తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు.దుబాయ్ గతంలో కూడా 1990 గల్ఫ్ వార్, 9/11, అరబ్ స్ప్రింగ్, కోవిడ్ సందర్భాల్లో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొని తిరిగి బలంగా లేచింది. ఇప్పుడు కూడా మార్కెట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని, ఇది కేవలం సెంటిమెంట్ ఆధారిత 'బ్లిప్' మాత్రమేనని డనుబే గ్రూప్ వంటి డెవలపర్లు అంటున్నారు.దుబాయ్కి ప్రత్యామ్నాయం ఏది? ఈ నేపథ్యంలో ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ వైరల్ అయింది. దుబాయ్ బదులు ముంబై, బెంగళూరు, గిఫ్ట్ సిటీ వంటి భారతీయ నగరాలను ప్రత్యామ్నాయాలుగా సూచించారు. దీనిపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరు భారత్లోని ఏ నగరమూ దుబాయ్ స్థాయికి చేరదని, ట్యాక్స్ లాభాలు, లగ్జరీ ఇన్ఫ్రా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ దుబాయ్కే ఉన్నాయని వాదిస్తున్నారు. మరికొందరు గిఫ్ట్ సిటీ (అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య)ను భవిష్యత్ పోటీదారుగా చూస్తున్నారు.డీల్స్ ఆగినా… పూర్తిగా కుదేలుకాదుదుబాయ్లో ప్రస్తుతం కొన్ని ప్రాపర్టీ ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచినా పరిస్థితులు సద్దుమణిగితే మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే త్రైమాసికంలో నిలిచిపోయిన డీల్స్లో 60%–80% వరకు పూర్తి అయ్యే అవకాశం ఉందని అంచనా.క్లిక్ చేయండి 👉 దుబాయ్ దాటని బంగారం.. ధరలపై ప్రభావం?కొనుగోళ్లు మందగిస్తే వచ్చే కొన్ని నెలల్లో ధరలపై ఒత్తిడి కనిపించే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో భారీగా కొత్త గృహ ప్రాజెక్టులు మార్కెట్లోకి రావడం కూడా ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. -
ఎక్కువ ఈఎంఐతో ఇల్లు కొంటున్నారా? ఎంత రిస్కో చూడండి..
సొంతిల్లు ప్రతి ఒక్కరికీ జీవిత కల. చాలా మంది హోమ్ లోన్ తీసుకుని తమ సొంతింటి ప్రయాణాన్ని మొదలు పెడుతుంటారు. అయితే సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఎంత పడితే అంత ఈఎంఐ (నెలసరి వాయిదా) పెట్టుకుని ఇల్లు కొనుక్కోవడం ఎంత రిస్కో ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సోషల్ మీడియా ముందుకు తీసుకొచ్చారు.బెంగళూరులో ఒక వ్యక్తి కేవలం మూడు హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లించకపోవడంతో తన రూ.1.2 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కోల్పోయిన సంఘటన చర్చనీయాంశమైంది. గృహ రుణాల్లో దాగి ఉన్న ఆర్థిక ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.గోయెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె పొరుగువారు స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన ఆదాయం కలిగి ఉండి ప్రముఖ ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే అక్టోబర్లో ఉద్యోగం కోల్పోవడంతో ఆర్థిక ఒత్తిడి మొదలైంది. జనవరి నాటికి వరుసగా మూడు ఈఎంఐలు చెల్లించలేకపోయారు. దీంతో బ్యాంకు సర్ఫాసి యాక్ట్ (SARFAESI Act) కింద రికవరీ చర్యలు ప్రారంభించింది.సర్ఫాసి చట్టం ప్రకారం బ్యాంకులు.. కోర్టు జోక్యం లేకుండానే బకాయిలను వసూలు చేసుకునే అధికారం కలిగి ఉంటాయి. నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపే ఆస్తిని రూ.95 లక్షలకు వేలం వేశారు. ఆ మొత్తంలో రూ.80 లక్షలు బకాయిలకు సర్దుబాటు కాగా, ఎనిమిదేళ్ల పాటు ఈఎంఐలు చెల్లించిన రుణగ్రహీత చేతికి కేవలం రూ.15 లక్షలు మాత్రమే మిగిలాయి.తుది ఈఎంఐ పూర్తయ్యే వరకు తనఖా పెట్టిన ఆస్తిపై పూర్తి హక్కులు రుణగ్రహీతకు ఉండవని గోయెల్ హెచ్చరించారు. ఆకస్మికంగా ఆదాయం ఆగిపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ముందుగానే బ్యాంకును సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బలమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి రుణ పునర్వ్యవస్థీకరణ, కాలపరిమితి పొడిగింపు వంటి అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ నష్టం లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.ఫైనాన్షియల్ ప్లానర్లు సాధారణంగా నెలవారీ ఈఎంఐలు ఆదాయంలో 40 శాతం మించకూడదని సూచిస్తున్నారు. అదనంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రావిడెంట్ ఫండ్ నిధులను వినియోగించుకోవడం వంటి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించవచ్చు. -
మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్ డీల్ హాట్ టాపిక్
ముంబైలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గోరేగావ్ ఒకటి. ఆధునిక హై-రైజ్అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండటంతో ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి సుష్మితా సేన్ (Sushmita Sen), ఆమె తల్లి సుబ్రా సేన్ ముంబైలో తమ అపార్ట్మెంట్ను అద్దెకు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. దీని నెలవారీ అద్దె రూ. 1.95 లక్షలతో 36 నెలల (3 ఏళ్లు) లీజ్ కిచ్చారు. అంటే ఈ ప్రాపర్టీ ద్వారా మొత్తం మూడేళ్లకు గాను సుమారు 74 లక్షలు (73.76 లక్షలు) ఆదాయం సమకూరనుందిఈ లగ్జరీ ఫ్లాట్ గోరేగావ్లోని ప్రముఖ 'ఓబెరాయ్ ఎక్స్క్విజిట్' (Oberoi Exquisite) ప్రాజెక్ట్లో ఉంది. లీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్సైట్లో స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం. ఈ ఒప్పందం అధికారికంగా ఫిబ్రవరి 2026లో నమోదు చేయబడింది. దీని ప్రకాం సెక్యూరిటీ డిపాజిట్ కింద 6 లక్షలు కాగా, స్టాంప్ డ్యూటీ కింద రూ.18,900, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 1,000 చెల్లించారు. ప్రతి ఏటా 5శాతం మేర అద్దె పెరుగుతుంది.ఈ ప్రాపర్టీ ప్రత్యేకతలు విషయానికి వస్తే కార్పెట్ ఏరియా 996 చదరపు అడుగులతో కలిపి మొత్తం ఏరియా 1,241 చదరపు అడుగులు. ఇందులో రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియోసుస్మితా సేన్ గుర్తించి సంక్షిప్తంగా1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా సుస్మితా సేన్ చరిత్ర సృష్టించారు. 'బీవీ నంబర్ 1', 'మై హూ నా' వంటి సినిమాలతో మెప్పించిన సుస్మితా సేన్ ఇటీవల 'ఆర్య', 'తాళి' వంటి వెబ్ సిరీస్లతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్) -
దుబాయ్పై దాడులు.. బుర్జ్ ఖలీఫాకు ఇన్సూరెన్స్ ఉందా?
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరాయి. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో (#IranWar) దుబాయ్ (Dubai) సహా యూఏఈలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ప్రధానంగా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నప్పటికీ, పౌర ప్రాంతాలపైనా ప్రభావం పడుతోంది.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) వద్ద అత్యవసర చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా టవర్ను ఖాళీ చేయించారు. ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు బుర్జ్ ఖలీఫా సమీపంగా వచ్చినప్పటికీ భవనం నేరుగా దెబ్బతినలేదని తెలుస్తోంది.బుర్జ్ ఖలీఫాకు బీమా ఉందా?ప్రస్తుతం జనంలో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించే ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం వెనుక బలమైన బీమా వ్యవస్థ ఉందని తెలుస్తోంది.బుర్జ్ ఖలీఫా డెవలపర్ అయిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కోసం సమగ్ర ‘ఆల్ రిస్క్’ ప్రాపర్టీ పాలసీని రూపొందించారు. ఈ కోర్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ను ఓమన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేయగా, ప్రధాన రీఇన్సూరెర్గా మ్యూనిచ్ రీ వ్యవహరించినట్లు సమాచారం.ఈ పాలసీ ద్వారా సుమారు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు (సుమారు రూ. 13,722 కోట్లు) నిర్మాణ వ్యయాన్ని కవర్ చేసినట్లు తెలుస్తోంది. భవనం యాజమాన్యానికి ఇది వర్తించగా, టవర్లోని అపార్ట్మెంట్లు, హోటల్ ఇంటీరియర్స్, కార్యాలయాలు వంటి వాటికి ఆయా యజమానులు వేర్వేరుగా బీమా తీసుకుంటారు.యుద్ధ ప్రమాదాలకు వర్తిస్తుందా? దుబాయ్లోని ఎమ్మార్ యాజమాన్యంలోని ప్రధాన ఆస్తులు సాధారణంగా రాజకీయ హింస, ఉగ్రవాదం, అల్లర్లు, పౌర గందరగోళం, దండయాత్ర, శత్రుత్వం (యుద్ధం ప్రకటించినా, లేకపోయినా), అంతర్యుద్ధం వంటి ప్రమాదాలకు బీమా రక్షణ కలిగి ఉంటాయని బీమా వర్గాల సమాచారం.అయితే పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు చాలాసార్లు పాలసీల్లో మినహాయింపులుగా ఉండే అవకాశముంది. క్షిపణి దాడి వంటి ఘటనలు ‘ఉగ్రవాదం’ లేదా ‘రాజకీయ హింస’ కింద పరిగణిస్తారా? లేక ‘యుద్ధ ప్రమాదం’ కింద వస్తాయా? అనేది పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.బుర్జ్ ఖలీఫా నిర్మాణ వ్యయం సుమారు 1.4 నుంచి 1.5 బిలియన్ డాలర్లుగా అంచనా. ప్రస్తుత కాలంలో ఆ ఖర్చు 3.5 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ.32 వేల కోట్లు) ఉండవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, ఈ టవర్ ఆధారంగా అభివృద్ధి చెందిన డౌన్టౌన్ దుబాయ్ ప్రాజెక్ట్ మొత్తం విలువ 20 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: ఆ యుద్ధం అందుకే.. కియోసాకి సంచలన ట్వీట్ -
బడ్జెట్లో మెరిసే ఇంటీరియర్..
మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఒక భావోద్వేగం. అయితే, మారుతున్న కాలంతో పాటు నిర్మాణ ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం ఇల్లు కట్టడమే కాకుండా, నివసించడానికి యోగ్యంగా మార్చే ఇంటీరియర్ డెకరేషన్ కోసం అదనంగా లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సరైన ప్రణాళిక, మెటీరియల్ ఎంపికలో మెలకువలు పాటిస్తే.. తక్కువ బడ్జెట్లోనే మీ ఇంటిని ఒక ప్యాలెస్లా మార్చుకోవచ్చని ఇంటీరియర్ డిజైనింగ్ నిపుణులు సూచిస్తున్నారు.ఇంటీరియర్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..హాల్ (లివింగ్ రూమ్)ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేది హాల్. ఇక్కడ ఖర్చు తగ్గించి లుక్ పెంచడానికి మల్టీ ఫంక్షనల్ ఫర్నిచర్ ఉత్తమ మార్గం. గోడలకు ఖరీదైన టెక్స్చర్ పెయింట్లకు బదులుగా ఒక గోడకు మాత్రమే యాక్సెంట్ కలర్ లేదా తక్కువ ధరలో దొరికే పీవీసీ ఫ్లూటెడ్ ప్యానెల్స్ వాడవచ్చు. లైటింగ్కు సంబంధించి ఫాల్స్ సీలింగ్ కోసం భారీగా ఖర్చు చేసే బదులు కోవ్ లైటింగ్ లేదా స్టైలిష్ ఎల్ఈడీ స్ట్రిప్స్తో మంచి లుక్ తీసుకురావచ్చు.వంటగదివంటగదిలో మాడ్యులర్ కిచెన్ పేరుతో భారీగా ఖర్చు అవుతుంది. ఖరీదైన ప్లైవుడ్కు బదులుగా డబ్ల్యూపీసీ (Wood Polymer Composite) బోర్డులను వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా చెదలు పట్టకుండా ఉంటుంది. స్టోరేజ్ కోసం పైన ఉండే క్యాబినెట్లకు తలుపులు పెట్టకుండా ఓపెన్ షెల్వింగ్ పద్ధతిని పాటిస్తే మెటీరియల్ ఖర్చు తగ్గుతుంది. ఇది వంటగది విశాలంగా కనిపించేలా చేస్తుంది.బెడ్రూమ్అల్యూమినియం సెక్షన్లతో కూడిన వార్డ్రోబ్స్ లేదా స్లైడింగ్ డోర్ కబోర్డులు స్థలాన్ని ఆదా చేస్తాయి. లామినేట్ షీట్ల ఎంపికలో లేటెస్ట్ మ్యాట్ ఫినిష్ ఎంచుకుంటే తక్కువ ధరలో లగ్జరీ లుక్ వస్తుంది. స్టోరేజ్ సౌకర్యం ఉన్న బెడ్స్ ఎంచుకోవడం వల్ల అదనపు అల్మారాల అవసరం ఉండదు.వాష్రూమ్, క్యారిడార్బాత్రూమ్ గోడల మొత్తానికి టైల్స్ వేయకుండా కేవలం 7 అడుగుల ఎత్తు వరకు వేసి పైన పెయింట్ వేయడం ద్వారా 20 శాతం వరకు ఖర్చు తగ్గించవచ్చు. బ్రాండెడ్ ఫిట్టింగ్స్లో ఎంట్రీ లెవల్ సిరీస్లను ఎంచుకోండి. ఇవి క్వాలిటీతో పాటు వారంటీని ఇస్తాయి. క్యారిడార్లో రేయిలింగ్ కోసం అద్దాలను అమర్చడం వల్ల ఇరుకైన క్యారిడార్లు కూడా విశాలంగా కనిపిస్తాయి.బడ్జెట్ పెరగకుండా ఉండాలంటే..ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందే ఇంటీరియర్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. వైరింగ్, ప్లంబింగ్ పాయింట్లు ముందుగానే నిర్ణయించుకుంటే తర్వాత చేసే మార్పుల వల్ల అయ్యే వృధా ఖర్చును నివారించవచ్చు.ఇదీ చదవండి: సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే.. -
హరిత భవనాలకు డిమాండ్.. హైదరాబాద్లో 720కి పైగా రిజిస్టర్!
నగరంలో పెరిగిన కాలుష్యం కారణంగా సొంతిల్లు కొనుగోలు చేసే వారు హరిత భవనాలపై ఆసక్తి చూపుతున్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యకరంగా ఉంచే ఈ భవనాలకు ప్రస్తుతం ఆదరణ పెరిగింది. కాస్త ఖరీదైనా వీటివైపే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరోస్వచ్ఛమైన గాలి, వెలుతురుతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌర శక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ)కి అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత. గ్రీన్ బిల్డింగ్స్లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు.నిత్యావసరాలకు వినియోగించే నీటిని బయటకు పంపకుండా వాటిని రీసైకిల్ చేసి మొక్కలు, బాత్రూమ్ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది.అదనపు వ్యయం రెండేళ్లలో వాపస్..ఈ భవనాల్లో నిత్యం నీరు, విద్యుత్ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్ మెటీ రియల్స్ను ఉపయోగించడం గ్రీన్ బిల్డింగ్స్ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్ వరకు గ్రీన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. హైదరాబాద్లో 720కి పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు. -
పెరిగిన డాలర్ విలువ.. అపార్ట్మెంట్స్ కొంటున్న ఎన్ఆర్ఐలు!
ఏడాది క్రితం ఒక డాలర్కు రూ.85 వచ్చేవి.. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.92 వచ్చే పరిస్థితి.. అంటే ఏడాదిలో 4.29 శాతం పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రవాసులు ఇక్కడ పెట్టుబడి కోసం అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నారు. కాకపోతే అనుకున్న వెంటనే పెట్టుబడి పెట్టగలిగేది, దీర్ఘకాలంలో లాభాలిచ్చేది స్థిరాస్తి రంగమే కావటంతో ఇటువైపు చూస్తున్నారు. ప్రధానంగా ముంబై, ఎన్సీఆర్(ఢిల్లీ), బెంగళూరు, హైదరాబాద్ రియల్టీ మార్కెట్లలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రవాసులకు టైమొచ్చింది.. పెట్టుబడి అనగానే ఎన్ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఇండియన్)లకు ముందుగా గుర్తొచ్చేది మ్యూచ్వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లే.. ఆ తర్వాతే స్థిరాస్తి, బంగారం వంటివి. అయితే ఇందులో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఎప్పుడూ లాభాలనే తీసుకొస్తాయన్నది కాదనలేని వాస్తవం. దీంతో రియల్టీ రంగంలో ప్రవాసుల పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. డాలర్ విలువ పెరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత, భౌగోళిక పరిస్థితులు, ఇండియాలో సరళీకృత పన్ను విధానాలు, రెరా, జీఎస్టీలతో స్థిరాస్తి రంగంలో పెరిగిన పారదర్శకత, డిజిటల్ లావాదేవీల సౌలభ్యం, సులువైన ఆస్తి నిర్వహణ, పెరుగుతున్న ప్రాపర్టీ విలువలు, అధిక లాభాలు, పన్ను మినహాయింపులు, సరళీకృత పన్ను విధానాలు అందుబాటు ధరలు.. వంటి రకరకాల కారణంగా ఎన్ఆర్ఐలు భారత స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు.రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..భారత స్థిరాస్తి రంగం బూమ్లో ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ) వ్యక్తులు భాగస్వాములే.. అమెరికా, యూకే, యూరప్, సింగపూర్, కెనడా, ఆ్రస్టేలియా, పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఎక్కువగా ప్రవాసుల పెట్టుబడులు పెడుతున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో ఎన్ఆర్ఐల వాటా 2015లో 7–10 శాతంగా ఉండగా.. 2025 నాటికి 18–20 శాతానికి పెరిగింది. 2024–25లో దేశీయ గృహ విభాగంలోకి ప్రవాసులు 85,000 నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు.ఎన్ఆర్ఐలు కొనాలంటే..ఎన్ఆర్ఐల ప్రాపర్టీ లావాదేవీలు, నిబంధనలు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఎఫ్ఈఎంఏ) కిందికి వస్తాయి. ప్రవాస భారతీయుడు గానీ భారత సంతతి(పీఐఓ) దేశంలోని నివాస, వాణిజ్య స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. అలాగే కొనుగోళ్లలో పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే వ్యవసాయ భూమి గానీ ఫాంహౌజ్, ప్లాంటేషన్ ప్రాపర్టీలను మాత్రం కొనుగోలు చేసే వీలు లేదు. వీటి కొనుగోళ్లకు ఆర్బీఐ అనుమతి ఉండాలి. బహుమతి లేదా వారసత్వంగా పొందిన ప్రాపర్టీలకు మాత్రమే యాజమాన్య హక్కులు ఉంటాయి. ప్రాపర్టీల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాల ద్వారా కొనుగోళ్లు భారత రూపాయిలలో జరుగుతాయి. ప్రవాసులు కొనుగోలు చేసే ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాలకు పన్ను మినహాయింపు(టీడీఎస్) 12.5 శాతం, స్వల్పకాలిక మూధన లాభాలు 30 శాతం మినహాయింపు ఉంటుంది.విక్రయించాలనుకుంటే..ఫెమా నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐ సొంత ఆస్తి, వారసత్వంగా పొందిన నివాస, వాణిజ్య స్థిరాస్తిని దేనినైనా విక్రయించే వీలుంది. ఒకవేళ ఎన్ఆర్ఐకి వారసత్వంగా పొందిన వ్యవసాయ భూమి, ప్లాంటేషన్, ఫాంహౌజ్ గానీ ఉంటే దాన్ని విక్రయించాలనుకుంటే మాత్రం కేవలం స్థానికులకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇతర ఎన్ఆర్ఐ లేదా భారత సంతతికి గానీ గిఫ్ట్గా అందించవచ్చు. అలాగే ప్రవాసులకు అద్దె ఆదాయంలోనూ మినహాయింపులు ఉన్నాయి.హైదరాబాద్లో ప్రవాసుల పెట్టుబడులు..అమెరికా, ఆ్రస్టేలియా దేశాల్లో నివాసం ఉంటున్న సిటీకి చెందిన ఎన్ఆర్ఐలు రూ.3 కోట్లు, ఆపై విలువ ఉన్న ప్రాపర్టీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024–25లో నగరంలో ప్రవాసులు రూ.6,800 కోట్లు–రూ.10,000 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇళ్ల ధరలు తక్కువగా ఉండటం ప్రవాసులకు కలిసొస్తుంది. కొంత కాలంగా స్థిరాస్తి మార్కెట్లో ఆశించిన జోరు లేకపోవడంతో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ఎన్ఆర్ఐలు భావిస్తున్నారు. దీంతో విదేశాల్లో ఇంటి రుణాలు తీసుకొని మరీ నగరంలో ఉంటున్న వారి తల్లిదండ్రులకు పంపించి ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. విల్లాల కంటే ఫ్లాట్ల కొనుగోళ్లకే ప్రవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఫ్లాట్ల ధరలు తక్కువగా ఉండటం, అద్దె కూడా వస్తుండటం దీనికి ప్రధాన కారణాలు. పైగా నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. కోట్లు వెచ్చించి విల్లా కొనుగోలు చేసినా.. త్వరగా అద్దెకు పోదు. అందుకే అపార్ట్మెంట్ల కొనుగోళ్లకే ఎన్ఆర్ఐలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు.కొనేముందే పరిశీలించాలియాజమాన్య హక్కులు, పత్రాలు, టైటిల్స్ సరిగా ఉన్నాయో లేదో నిపుణులు, న్యాయవాదులతో తనిఖీ చేయించాలి. యాజమాన్య హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? వారసత్వంగా వచ్చిందా? సంయుక్త భాగస్వామ్యంగా ఉందా? బ్యాంకులో తనఖా కింద ఉందా? వంటి కోణాల్లో ఆరా తీయాలి.స్థిరాస్తిని కొనుగోలు చేసేముందు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్ఓసీ) తీసుకోవాలి. నీరు, విద్యుత్ వంటి బిల్లులు చెల్లించారో లేదో పూర్తిగా పరిశీలించాలి.కొత్త నిర్మాణాల్లో అయితే ల్యాండ్ టైటిల్స్ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. స్థానిక సంస్థల నుంచి అన్ని రకాల నిర్మాణ అనుమతులు, ఎన్ఓసీలను తీసుకున్నారా లేదా గమనించాలి.నిర్మాణంలో ఉంటే.. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేస్తుంటే.. పవర్ ఆఫ్ అటార్నీ(పీఓఏ)ను ఇవ్వాల్సిందిగా డెవలపర్ను కోరాలి. దీన్ని డాక్యుమెంటేషన్ చేసుకోవడం మంచిది. సులభతరం కూడా.. పీఓపీ పొందిన వ్యక్తి ద్వారా మీ ప్రాపర్టీ కాంట్రాక్ట్కు గానీ మార్ట్గేజ్కు గానీ లేదా అమ్మకానికి గానీ చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా సంబంధిత ప్రాపర్టీని డిస్పోజల్ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, స్వాదీనం, అగ్రిమెంట్ వంటి విషయంలో పీఓపీ ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి. -
లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: లగ్జరీ గృహాలకు ఇండియన్ మార్కెట్లో ఏనాడూ డిమాండ్ తగ్గలేదు. ఏటా లగ్జరీ హౌసింగ్ గణనీయంగా విస్తరిస్తోంది. డెవలపర్లు పెద్ద లేఅవుట్లు, ప్రీమియం వసతులు, ఇంటిగ్రేటెడ్ లైఫ్స్టైల్ సౌకర్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో వీటి సరఫరా పెరుగుతోంది. ప్రస్తుతం మొత్తం ఇళ్ల సప్లయిలో లగ్జరీ యూనిట్ల వాటా 27 శాతంగా ఉంది. 2021లో ఈ విభాగం వాటా 16 శాతంగా ఉండేది. అద్భుతమైన డిజైన్, సౌలభ్యం, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు కాస్త ఊపందుకున్నాయి.విస్తరిస్తున్న మార్కెట్భారత లగ్జరీ మార్కెట్ గతేడాది 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి మరింత పెరుగుతుందని మ్యాజిక్ బ్రిక్స్ అంచనా వేసింది. ప్రీమియం వ్యయాలకు కస్టమర్లు ఏమాత్రం వెనుకడుగు వేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భారత లగ్జరీ హౌసింగ్ మార్కెట్ పరిపక్వ దశకు చేరుకుందని, సంప్రదాయ మెట్రో కేంద్రాల నుంచి కొత్త భౌగోళిక ప్రాంతాలు, శివార్లకు లగ్జరీ గృహ మార్కెట్ విస్తరిస్తోందని పేర్కొంది. టౌన్షిప్ల అభివృద్ధితో.. ప్రధాన నగరాల్లో లగ్జరీ ప్రైజ్ ఇండెక్స్ (ఎల్పీఐ) 2021లో 2.32గా ఉండగా.. 2025 నాటికి 2.27కి తగ్గింది. ఇదే కాలంలో కొత్త ప్రాంతాలు, శివార్లలో ఎల్పీఐ 1.00 నుంచి 1.44కి పెరగడమే దీనికి సూచన అని వివరించింది. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, పెద్ద ఎత్తున టౌన్íÙప్ల అభివృద్ధితో శివార్లలో లగ్జరీ గృహాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. మధ్యస్థ లగ్జరీ గృహాల ధరలు ముంబైలో అత్యధికంగా రూ.9.66 కోట్లుగా ఉండగా.. గూర్గావ్లో రూ.5.46 కోట్లు, బెంగళూరులో రూ.2.91 కోట్లు, హైదరాబాద్లో రూ.2.20 కోట్లు, చెన్నైలో రూ.2 కోట్లు, పుణెలో రూ.1.97 కోట్లు, కోల్కతాలో రూ.1.50 కోట్లుగా ఉన్నాయి. -
పాన్ కార్డు లేకుండానే ప్రాపర్టీ డీల్స్!
దేశంలో ఆస్తి లావాదేవీలకు సంబంధించిన కీలక నిబంధనల్లో మార్పులు చేయాలని ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాన్ కార్డు నిబంధనలకు సడలింపు కల్పిస్తూ రూ.20 లక్షల లోపు ఉన్న ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం లేకపోవచ్చని ముసాయిదా ఆదాయపు పన్ను నియమాల్లో సూచించింది. ఈ ప్రతిపాదన కొత్త ఆదాయపు పన్ను పాలనలో భాగంగా తీసుకువచ్చిన మార్పులలో ఒకటి. ప్రస్తుతం ఇది ప్రజా సంప్రదింపుల దశలో ఉంది.ప్రస్తుతం ఎలా ఉందంటే.. ప్రస్తుత నియమాల ప్రకారం.. రూ.10 లక్షలకు మించిన విలువ కలిగిన స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయాల సమయంలో పాన్ నంబర్ను తప్పనిసరిగా కోట్ చేయాలి.కొత్త ప్రతిపాదన ఏమిటి?ముసాయిదా ప్రకారం.. రూ.20 లక్షల లోపు విలువైన ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం లేదు. రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ఈ మార్పు చిన్న స్థాయి ఆస్తి కొనుగోలుదారులకు, ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి ఉపశమనం కలిగించనుంది.గిఫ్ట్ డీడ్స్, జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలకూ వర్తింపుసవరించిన ముసాయిదా ప్రకారం, పాన్ నిబంధన కేవలం కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాదు. స్థిరాస్తి బహుమతిగా బదిలీ, ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలకూ వర్తిస్తుంది. ఇలాంటి లావాదేవీలకూ ఇదే రూ.20 లక్షల పరిమితి వర్తిస్తుంది. అంటే ఆస్తి విలువ రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అయితే మాత్రమే పాన్ తప్పనిసరి అవుతుంది.మార్పు వెనుక కారణంగత కొన్ని సంవత్సరాల్లో ఆస్తి ధరలు గణనీయంగా పెరిగాయి. అనేక నగరాల్లో సాధారణ ఇళ్ల ధర కూడా రూ.10 లక్షలను దాటిపోయింది. ఈ నేపథ్యంలో పాత పరిమితి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు సరిపోవడం లేదని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రతిపాదన వల్ల చిన్న కొనుగోలుదారులపై పేపర్వర్క్ భారం తగ్గుతుంది. అఫర్డబుల్ హౌసింగ్ మార్కెట్లో లావాదేవీలు సులభతరం అవుతాయి. ప్రస్తుత రియల్ ఎస్టేట్ విలువలకు అనుగుణంగా నిబంధనలు మారుతాయి. ప్రత్యేకంగా టైర్-2, టైర్-3 నగరాల్లో గృహ కొనుగోలుదారులకు ఇది ప్రయోజనకరంగా మారుతుంది.అమలు ఎప్పుడు?ప్రస్తుతం ఇవి ముసాయిదా దశలోనే ఉన్నాయి. ప్రజల నుంచి, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడనుంది. అమల్లోకి వస్తే, చిన్న స్థాయి ఆస్తి కొనుగోలుదారులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. అదే సమయంలో, భారీ లావాదేవీలపై పారదర్శకతను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
హైదరాబాద్లో రూ.350 కోట్లతో లగ్జరీ హోటల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ హైదరాబాద్లో దాదాపు రూ. 350 కోట్లతో లగ్జరీ హోటల్ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. దీన్ని చాలెట్ హోటల్స్కి ప్రీ–లీజుకి ఇచ్చినట్లు తెలిపింది. 5.3 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాజెక్టులో 330 గదులు ఉంటాయి. 2027–28 నాలుగో త్రైమాసికంలో ఇది పూర్తయ్యే అవకాశం ఉందని మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ తెలిపింది.ఇరు సంస్థల మధ్య ఒప్పందం ప్రకారం మైండ్స్పేస్ రీట్కి చెందిన స్పెషల్ పర్పస్ వెహికల్ సంస్థ సదరు ప్రాపరీ్టని స్థూలంగా నిర్మించి ఇస్తుంది. ఇంటీరియర్స్, హోటల్ నిర్వహణ మొదలైన పనులను చాలెట్ చేపడుతుంది. ప్రస్తుతం చాలెట్కి మొత్తం మీద 3,300 గదుల పోర్ట్ఫోలియో ఉంది. మైండ్స్పేస్ రీట్కి హైదరాబాద్తో పాటు ముంబై, పుణె చెన్నైలలో ఆఫీస్ అసెట్స్, బిజినెస్ పార్క్లు ఉన్నాయి. -
జీసీసీలకు డిమాండ్ భళా
గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు/జీసీసీలు) ఏర్పాటుకు అమెరికా కంపెనీలు భారత్ను ఎంతో కీలకంగా చూస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో 2020 నుంచి 2025 మధ్య హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో.. 101 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కార్యాలయ వసతులను జీసీసీల ఏర్పాటుకు విదేశీ సంస్థలు లీజుకు తీసుకోవడం గమనార్హం. ఈ కాలంలో మొత్తం ఆఫీస్ లీజింగ్ 280.2 మిలియన్ ఎప్ఎఫ్టీగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్రంగ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది.బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, ముంబై, పుణె నగరాల డేటా ఆధారంగా ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నగరాల్లో మొత్తం ఉపాధి డిమాండ్లో 36 శాతం జీసీసీల నుంచే వస్తున్నట్టు తెలిపింది. గత ఐదేళ్లలో 101 మిలియన్ ఎస్ఎఫ్టీల జీసీసీల లీజింగ్లో 71 మిలియన్ ఎస్ఎఫ్టీని అమెరికా కంపెనీలు తీసుకున్నాయి.‘భారత ఆఫీస్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాల్లో పెద్ద ఎత్తున విస్తరించింది. కరోనా అనంతరం డిమాండ్ ఎప్పటికప్పుడు గరిష్టాలకు చేరుతోంది. ముఖ్యంగా జీసీసీలు ఈ విస్తరణకు చోదకంగా ఉన్నాయి. వ్యయాలు ఆదా చేసుకునే కేంద్రాలుగా కాకుండా.. ఆవిష్కరణల ఆధారిత అంతర్జాతీయ అనుసంధాన విజ్ఞాన, పరిశోధన కేంద్రాలుగా అవతరించాయి’ అని కొలియర్స్ ఇండియా తెలిపింది.ఏటా 35–40 మిలియన్ ఎస్ఎఫ్టీ2025లో విదేశీ సంస్థలు భారత్లో 29.2 మిలియన్ ఎస్ఎఫ్టీలను తీసుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. ఈ ఏడు నగరాల్లో స్థూల ఆఫీస్ లీజింగ్ 71.5 మిలియన్ ఎస్ఎఫ్టీలో ఈ మొత్తం 41 శాతంగా ఉంది. విదేశీ సంస్థలు భారత్లో జీసీసీల ఏర్పాటుకు ఏటా 35–40 మిలియన్ ఎస్ఎఫ్టీని లీజుకు తీసుకుంటాయని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ ఎండీ అరి్పత్ మెహరోత్రా అంచనా వేశారు. ‘‘యూఎస్ సంస్థల నుంచి టెక్నాలజీ ఆధారిత జీసీసీల ఏర్పాటు డిమాండ్ స్థిరపడొచ్చు. ఐరోపా సమాఖ్య, బ్రిటన్కు చెందిన సంస్థల నుంచి ఇంజనీరింగ్, తయారీ, బీఎఫ్ఎస్ఐ, కన్సల్టింగ్కు సంబంధించి జీసీసీల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతుంది’’అని చెప్పారు.ఈ నివేదికపై భివ్ వర్క్స్పేస్ వ్యవస్థాపకుడు, సీఈవో సురేష్రావు పప్లికర్ స్పందిస్తూ.. భారత నైపుణ్యాలు, బిజినెస్ ఎకోసిస్టమ్ పట్ల అంతర్జాతీయ కంపెనీల్లో విశ్వాసానికి నిదర్శనమన్నారు. కోవర్కింగ్ సెంటర్లలో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ను జీసీసీల కోసం తీసుకోవడం పెరిగినట్టు చెప్పారు. భారత్పై దీర్ఘకాల దృష్టితో యూఎస్, యూరప్, బ్రిటన్ కంపెనీలు జీసీసీల ఏర్పాటుకు ఆఫీస్ వసతులను లీజుకు తీసుకోవడం పెరిగినట్టు ‘స్పేస్వన్’ ప్రాపర్టీ యాక్విజిషన్ విభాగం డైరెక్టర్ సిజోజోస్ తెలిపారు.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్ -
రియల్ ఎస్టేట్ సంస్థలకు రెరా వార్నింగ్.. నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఇళ్లు/ఫ్లాట్/యూనిట్ విక్రయాల కోసం తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయొద్దని ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లతో పాటు ప్రచార మాధ్యమాలను తెలంగాణ రెరా అథారిటీ హెచ్చరించింది. రెరా చట్టం ప్రకారం నిర్మిత స్థలం 500 చదరపు మీటర్లకు మించినా, యూనిట్ల సంఖ్య 8 కంటే ఎక్కువగా ఉన్నా సంబంధిత ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయించాలని సూచించింది.రెరా అథారిటీ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి, రిజిస్ట్రేషన్ నంబర్ జారీ చేస్తుందని తెలియజేసింది. రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన తర్వాతే విక్రయాలను ప్రోత్సహించడానికి ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుందని ప్రమోటర్లు/డెవలపర్లు, ఏజెంట్లు, ప్రచార మాధ్యమాలను కోరింది. రిజిస్ట్రేషన్ నంబర్ పొందకుండానే చట్టవిరుద్ధమైన ప్రకటనలు జారీ చేసిన పలు సంస్థలకు షోకాజ్ నోటీసులను జారీ చేసినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.నోటీసులు అందుకున్న సంస్థల్లో గోద్రెజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్టు, వర్టెక్స్ విరాట్ ప్రాజెక్టు, స్వర్గసీమ అమేయ ప్రాజెక్టు, తిరుమల హిల్స్ తదితర సంస్థలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు రెరా రిజిస్ట్రేషన్ నంబర్ పొందుపరిచినప్పటికీ.. ప్రకటనల్లోని సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది. స్వర్గసీమ కన్స్ట్రక్షన్ చేపట్టిన అమేయ ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల పరిమాణం, ప్రాజెక్టు పూర్తి పేరు విషయంలో వైరుధ్యాలతో పాటు ప్రాజెక్టును లేఅవుట్గా రిజిస్టర్ చేసినట్టు గుర్తించింది. ప్రకటనలో మాత్రం నివాస ప్రాజెక్టుగా పేర్కొంటూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించినందుకు నోటీసులు జారీ చేసింది.ఇదీ చదవండి: సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..


