breaking news
Reality
-
రూ.31 కోట్లతో ఆస్తి కొనుగోలు చేసిన హృతిక్ రోషన్
కొత్త సినిమా వార్2తో అలరిస్తున్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటనలోనే కాదు వ్యాపారంలోనూ దూసుకుపోతున్నారు. ఆస్తులు కూడబెట్టడంలో, వాటి విలువను పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల ముంబయిలోని ఓ ఆస్తిని కొనుగోలు చేయడంతో అందుకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.హృతిక్ రోషన్ తన తండ్రి రాకేష్ రోషన్ స్థాపించిన హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ కంపెనీ కోసం ముంబైలోని చండీవాలి ప్రాంతంలో మూడు కార్యాలయ యూనిట్లను రూ.31 కోట్లకు కొనుగోలు చేశారు. అంధేరీ ఈస్ట్లోని చండీవలి ప్రాంతంలోని బూమరాంగ్ పేరుతో ఉన్న భవనం మొదటి అంతస్తులోని ఈ మూడు కార్యాలయాలు 13,546 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దీనికి సంబంధించి 2025 జులై 9న కొనుగోలు జరిగిందని డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తుంది.ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఈ లావాదేవీలో స్టాంప్ డ్యూటీ రూ.1.86 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30 వేలుగా ఉంది. ఈ లావాదేవీలో అమ్మకందారులుగా మనీష్ కృష్ణం గోపాల్ బజారీ, షాలిని మనీష్ బజారీ, బాజ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ భవనంలో రోషన్ కుటుంబం పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2024లో హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ ఐదో అంతస్తులోని ఐదు కార్యాలయ యూనిట్లను రూ.37.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందులో 17,389 చదరపు అడుగుల స్థలం ఉంది.ఇదీ చదవండి: భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చఇంతకు ముందు రోషన్ కుటుంబం రూ.6.75 కోట్లకు అంధేరీలో మూడు అపార్ట్ మెంట్లను విక్రయించింది. అంధేరీ వెస్ట్లోని విజయ్ నివాస్ సీహెచ్ఎస్ లిమిటెడ్ భవనంలో 1,025 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రాకేష్ రోషన్ విక్రయించారు. ఈ ఆస్తితో పాటు రెండు పార్కింగ్ స్థలాలను సోనాలి అజ్మీరాకు రూ.3.75 కోట్లకు విక్రయించారు. మే 25న జరిగిన ఈ లావాదేవీలో రూ.18.75 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి. మరో లావాదేవీలో రాకేష్ రోషన్ అంధేరి వెస్ట్లోని రహేజా క్లాసిక్ భవనంలోని 625 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను జీవన్ భావనానీ, శిల్పా వాధ్వానీ, గౌరవ్ వాధ్వానీ అనే ముగ్గురు వ్యక్తులకు రూ.2.20 కోట్లకు విక్రయించారు. ఈ లావాదేవీ మే 17న నమోదు కాగా, స్టాంప్ డ్యూటీ రూ.13.20 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.30 వేలు చెల్లించారు. -
సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..
భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు సమగ్ర భూ సంస్కరణలను చేపట్టాలంటూ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కీలక సూచనలు చేసింది. సమన్వయంతో, ఏకాభిప్రాయంతో కూడిన సంస్కరణలు అమలు చేసేందుకు, దేశవ్యాప్తంగా 3–5 శాతం మధ్య ఒకే స్టాంప్ డ్యూటీని అమలు చేసేందుందుకు వీలుగా జీఎస్టీ మాదిరి కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని కోరింది.రక్షణాత్మక ధోరణి, వాణిజ్య యుద్ధాలు సవాలును విసురుతున్నాయంటూ.. భారత్లో స్థిరమైన విధానాలు, బలమైన పారిశ్రామిక సామర్థ్యాలు, దేశీయంగా అతిపెద్ద వినియోగ మార్కెట్, యువ శ్రామిక శక్తి, విశ్వసనీయ భాగస్వామిగా చాలా దేశాల్లో ఉన్న గుర్తింపు.. ఇవన్నీ భారత్ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చగలవని సీఐఐ తెలిపింది. ప్రతీ రాష్ట్రంలోనూ సమగ్ర భూ నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, భూ వినియోగ మార్పిడిని పూర్తిగా డిజిటలైజ్ చేయడంతోపాటు స్టాంప్ డ్యూటీని 3–5 శాతం మధ్య స్థిరీకరణ చేయాలని సూచించింది. స్పష్టమైన భూ యాజమాన్యం దిశగా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ చర్యల ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు చేరువ కావొచ్చని అభిప్రాయపడింది.సమ్మిళిత వృద్ధి..భారత్లో తయారీకి ఊతమివ్వడమే కాకుండా, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచే దిశగా బలమైన భూ సంస్కరణలు అమలు చేయాలని సీఐఐ కోరింది. గ్రామీణాభివృద్ధి సామర్థ్యాలను వెలికితీయడం ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించొచ్చంటూ కీలక సూచనలు చేసింది. భూ చట్టాల నిర్వహణ ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉంది. కనుక కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారానికి వీలుగా జీఎస్టీ కౌన్సిల్ మాదిరి ఏర్పాటు చేయాలి. సమన్వయం, ఏకాభిప్రాయం ఆధారంగా ఈ సంస్థ సంస్కరణలు చేపట్టాలి.ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ (ఐఐఎల్బీ) ఏర్పాటు ప్రశంసనీయమేనంటూ, ఇందులో ఉన్న సవాళ్లను ప్రస్తావించింది. ప్రస్తుతం ఇది కేవలం సమాచార సాధనంగానే పనిచేస్తోంది. రాష్ట్రాల మధ్య భూముల కేటాయింపు అధికారాలు సైతం ఉండాలి. దీనివల్ల పారదర్శకత పెరిగి, భూముల సమీకరణ సులభతరం అవుతుంది.ఇదీ చదవండి: టారిఫ్ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!రాష్ట్రాల స్థాయిల్లోనూ ఒకటికి మించిన అధికార యంత్రాంగాలు ఉండడాన్ని అవరోధంగా పేర్కొంది. దీన్ని అధిగమించేందుకు ఇంటెగ్రేటెడ్ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేయాలి. భూములు కేటాయింపు, మార్పిడి, వివాదాల పరిష్కార అధికారాలు దీనికి ఉండాలి.భూ మార్పిడి విధానం డిజిటైజేషన్ చేయాలి. డిజిటల్ సంతకం పెట్టిన సర్టిఫికెట్లు, క్యూఆర్ కోడ్ ఆధారిత మూడో పక్షం ధ్రువీకరణతో పారదర్శకత తీసుకురావచ్చు. అవినీతిని తొలగించొచ్చు.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీలు వేర్వేరుగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 3–5 శాతం మధ్యలో ఏకే విధమైన రేటును అమలు చేయాలి. -
ఇళ్ల విక్రయాలపై టారిఫ్ ప్రభావం!
భారత ఎగుమతులపై అమెరికా విధించిన అధిక టారిఫ్లు దేశీయ మార్కెట్లో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలను ప్రభావితం చేయొచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. అధిక టారిఫ్లు చిన్న వ్యాపారాలకు విఘాతం కలిగించొచ్చంటూ.. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులే రూ.45 లక్షల్లోపు ధరల ఇళ్ల కొనుగోలుదారుల్లో ఎక్కువగా ఉన్నట్టు గుర్తు చేసింది.‘యూఎస్కు వస్తు ఎగుమతుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) అధిక వాటా కలిగి ఉన్నాయి. అధిక టారిఫ్లతో వీటి ఉత్పత్తులకు ఉన్న పోటీ తగ్గిపోతుంది. దీంతో వాటికి ఆర్డర్లు తగ్గుతాయి. ఆయా సంస్థల ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’అని అనరాక్ వివరించింది. అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం అన్నవి కనిష్ట స్థాయికి పడిపోయినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 2025 మొదటి ఆరు నెలల్లో 1.9 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడవగా.. ఇందులో అందుబాటు ధరల విభాగంలో విక్రయాలు 34,565 యూనిట్లుగానే ఉన్నట్టు పేర్కొంది.కోలుకోవడానికి ఇబ్బందులు..‘రూ.45 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరల్లోని ఇళ్లు ఈ విభాగం కిందకు వస్తాయి. ఈ విభాగంపై కరోనా విపత్తు పెద్ద ప్రభావాన్నే చూపించింది. కోలుకునేందుకు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ విభాగం పట్ల ఉన్న కొద్దో గొప్ప ఆశలను ట్రంప్ అధిక టారిఫ్లు ఆవిరి చేస్తున్నాయి’ అని అనరాక్ రీసెర్చ్ ఈడీ ప్రశాంత్ ఠాకూర్ వివరించారు.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?భారత జీడీపీలో ఎంఎస్ఎంఈలు 30 శాతం వాటా కలిగి ఉన్నాయన్న ప్రభుత్వ గణాంకాలను అనరాక్ ప్రస్తావించింది. అలాగే ఎగుమతుల్లో 45 శాతం వాటా ఆక్రమిస్తున్నట్టు తెలిపింది. అమెరికా 50 శాతం టారిఫ్లతో ఎంఎస్ఎంఈలు, వాటి సిబ్బందిపై గణనీయమైన ప్రభావం పడుతుందని అంచనా వేసింది. ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈల్లో పనిచేసే సిబ్బంది అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో ప్రధాన వినియోగదారులుగా ఉన్నట్టు తెలిపింది. దీంతో ఈ విభాగంలో డిమాండ్పై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇది కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణపైనా ప్రభావం చూపిస్తుందని వివరించింది. -
‘రియల్’ డీలా!.. భారీగా తగ్గిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు
సాక్షి, రంగారెడ్డి: రియల్ భూం రంగారెడ్డి జిల్లాలో పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తోడు పెరిగిన భూముల ధరలు.. హైడ్రా కూల్చి వేతలతో ఆస్తుల క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఆస్తుల రిజి్రస్టే షన్ల సంఖ్య భారీగా తగ్గింది. 2023 జనవరి నుంచి జూలై వరకు జిల్లావ్యాప్తంగా 1,47,091 ఆస్తులకు రిజిస్ట్రేషన్లు కాగా వీటి ద్వారా రూ.2,157.60 కోట్ల ఆదాయం సమకూరింది. 2024 జనవరి నుంచి జూలై ఆఖరి వరకు 1,50,247 రిజిస్ట్రేషన్లు కాగా, వీటి ద్వారా రూ. 2,481.58 కోట్ల రాగా.. తాజాగా ఏడు నెలల్లో 1,47,236 డాక్యుమెంట్ల ద్వారా రూ.2,518. 98 కోట్లు వచ్చాయి. గత ఏడాది తొలి ఏడు నెలలతో పోలిస్తే ఈసారి ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ ఆదాయం పెరగడం కొసమెరుపు. కోవిడ్ సంక్షోభం తర్వాత కోవిడ్ సంక్షోభం తర్వాత రియల్ భూం ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. నగరానికి ఆనుకుని ఉన్న కోకాపేట, నార్సింగి, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, శంకర్పల్లి, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, సరూర్నగర్, ఎల్బీనగర్, పెద్ద అంబర్పేట్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మణికొండ, తుక్కుగూడ, ఆది బట్ల, కొత్తూరు, మహేశ్వరం (Maheswaram) తదితర ప్రాంతాల్లో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కోకాపేటలో ఎకరం ఏకంగా రూ.100 కోట్లకుపైగా పలికింది. ఓఆర్ఆర్కు అటు ఇటుగా కొత్తగా అనేక గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, హైరేంజ్ అపార్ట్మెంట్లు వెలిశాయి. వీటిలోని ప్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు కొనుగోలు చేసేందుకు నగర వాసులే కాకుండా దేశవిదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు, బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపాయి. ఫలితంగా రోజుకు సగటున 750 నుంచి 1000 ఆస్తుల రిజి్రస్టేషన్లు జరిగేవి. రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేది. రోడ్డున పడ్డ కమీషన్ ఏజెంట్లు అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తోడు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఆస్తుల అమ్మకాలు మందగించాయి. రిజి్రస్టేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గి ఆ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు. భవిష్యత్తుపై ఆశతో భూములపై భారీగా పెట్టుబడి పెట్టిన చిరు వ్యాపారులు తమ వెంచర్లలోని ఖాళీ స్థలాలు అమ్ముడుపోక ఆర్థికంగా చితికిపోతున్నారు. అప్పటి వరకు రియాల్టీపై ఆధారపడిన కమీషన్ ఏజెంట్లు ప్రస్తుతం విలవిల్లాడిపోతున్నారు. ఒకప్పుడు ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారు ప్రస్తుతం రోజువారీ ఖర్చుల కోసం తమ వద్ద ఉన్న ఆస్తులు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉపాధి లేకపోవడంతో కొంతమంది ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోగా, మరికొంత మంది జీవితాలు రోడ్డునపడ్డాయి. -
భారత్లో టెస్లా బిగ్ డీల్!.. నెలకు రూ.17.22 లక్షల రెంట్
ప్రపంచం కుబేరుడు 'ఎలాన్ మస్క్' యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం 'టెస్లా'.. ముంబైలో తన మొదటి షోరూమ్ ప్రారంభించింది. ఇప్పుడు తన రెండో షోరూంను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.తన రెండో షోరూమ్ కోసం టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీలోని ఏరోసిటీలో 8,200 చదరపు అడుగుల స్థలాన్ని తొమ్మిది సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దీని నెలవారీ అద్దె రూ. 17.22 లక్షలు. ఈ విషయాన్ని డాక్యుమెంట్స్ను అసెస్ చేసిన 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' వెల్లడించింది.టెస్లా ఈ స్థలాన్ని ఓక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చదరపు అడుగుకు రూ. 210 చొప్పున.. రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్తో లీజుకు తీసుకుంది. అంతే కాకుండా టెస్లా నెలకు రూ. 6,000 చొప్పున 10 పార్కింగ్ స్లాట్లను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..జూలై 15, 2025న ప్రారంభమయ్యే లీజు మొదటి సంవత్సరానికి రూ. 40.17 లక్షలు, రెండవ సంవత్సరంలో రూ. 42.07 లక్షలు, మూడవ సంవత్సరంలో రూ. 44.07 లక్షలు, నాల్గవ సంవత్సరంలో రూ. 46.17 లక్షలు, ఐదవ సంవత్సరంలో రూ. 48.36 లక్షలు, ఆరవ సంవత్సరంలో రూ. 50.66 లక్షలు, ఏడవ సంవత్సరంలో రూ. 53.06 లక్షలు, ఎనిమిదవ సంవత్సరంలో రూ. 55.58 లక్షలు, తొమ్మిదవ సంవత్సరంలో రూ. 58.22 లక్షలకు చేరుకుంటుంది. -
ఐటీ సిటీలో ఇళ్లు అమ్మేస్తున్న టెకీలు..
దేశ ఐటీ రాజధానిగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, అధ్వానంగా మారుతున్న ట్రాఫిక్, క్షీణిస్తున్న గాలి నాణ్యత కారణంగా ఐటీ ఉద్యోగులు, టెక్ నిపుణులు మైసూరుకు మకాం మారుస్తున్నారు. ఇక్కడ ఇళ్లు అమ్మేసి.. అక్కడ కొంటున్నారు. ఒకప్పుడు రిటైర్మెంట్ స్వర్గధామంగా పేరొందిన మైసూరు ఇప్పుడు నిశ్శబ్ద జీవనశైలిని కోరుకునే హైబ్రిడ్, రిమోట్ వర్కర్లకు ఇష్టమైన గమ్యస్థానంగా మారుతోంది.బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్ వే, ప్రతిపాదిత రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) ద్వారా మెరుగైన కనెక్టివిటీ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది. ఈ మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ లు బెంగళూరు టెక్ వ్యవస్థతో సంబంధాలను కొనసాగిస్తూనే మైసూరులో స్థిరపడటానికి ఐటీ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు బెంగళూరులోని తమ ప్రాపర్టీలను అమ్మేసి మైసూరులో కొంటున్నారు.ఈ ప్రాంతాలకు డిమాండ్మైసూరులోని సరస్వతీపురం, జయలక్ష్మీపురం, హెబ్బాళ్ వంటి ప్రాంతాల్లో నివాస డిమాండ్ పెరుగుతోంది. 2బీహెచ్కే ఫ్లాట్ల ప్రాపర్టీ ధరలు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతున్నాయి. నెలవారీ అద్దెలు రూ.15,000 నుంచి రూ.45,000 వరకు ఉన్నాయి. ఉత్తర మైసూరు ముఖ్యంగా హెబ్బాళ్ పారిశ్రామిక కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న ఐటీ, నివాస కేంద్రంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.రింగ్ రోడ్డు, పెరిఫెరల్ జోన్లలో రూ.50-70 లక్షల మధ్య ధర కలిగిన ముడా ఆమోదం పొందిన ప్లాట్లపై ఇన్వెస్టర్లు కన్నేశారు. కొన్ని ప్రాంతాలలో వార్షిక పెరుగుదల 15–20% గా నివేదికలు చెబుతున్నాయి. విజయనగర్ స్టేజ్ 2, 3లోని లేఅవుట్లు ప్లాట్ల ఇళ్లకు ఆసక్తిని ఆకర్షిస్తున్నాయి.ఈ ట్రెండ్కు అనుగుణంగా డెవలపర్లు స్పందిస్తున్నారు. మైసూరులో 10 ఎకరాలను అభివృద్ధి చేయడానికి బ్రిగేడ్ గ్రూప్ రూ .225 కోట్ల జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్పై సంతకం చేయగా, సెంచురీ రియల్ ఎస్టేట్ ఈ ఏడాది చివర్లో ప్రణాళికాబద్ధ అభివృద్ధిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. మైసూరు సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో సమతుల్యం చేస్తుండటంతో ఇది బెంగళూరు పట్టణ విస్తరణకు ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.👉 చదవండి: ఇల్లు అమ్ముతున్నారా? ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు -
ప్రపంచంలోనే ఖరీదైన పెద్ద ప్యాలెస్.. మహారాణి మాటల్లో..
ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత ఖరీదైన ప్యాలెస్ అంటే ఎక్కడో విదేశాల్లో ఉంటుందనుకుంటారు. కానీ మనదేశంలోనే అలాంటి ప్యాలెస్ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా గుర్తింపు పొందిన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ గుజరాత్లోని వడోదర నగరంలో 30.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విరాజిల్లుతోంది. ఇది లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ కంటే 36 రెట్లు పెద్దది. దీని విలువ రూ. 24,000 కోట్లని అంచనా.ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిజైన్, ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ పత్రిక తమ మిడిల్ ఈస్ట్ తాజా ఎడిషన్లో భారత్లోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ను పాఠకులకు పరిచయం చేసింది. ప్యాలెస్ లోపలి అద్భుత దృశ్యాలను చూపించింది. ‘ఇది మా ఇల్లు.. అయినా భారత ప్రజలదే’ అంటూ మహారాణి రాధికారాజే గైక్వాడ్ ప్యాలెస్ విశిష్టతను, విశేషాలను వివరించారు.1890లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ ప్యాలెస్, గైక్వాడ్ రాజవంశానికి వారసత్వ నివాస భవనంగా నిలిచింది. భారతీయ శిల్పకళను పాశ్చాత్య శైలితో కలిపిన ఈ నిర్మాణం, అప్పట్లోనే విద్యుత్, ఎలివేటర్లు, శీతలీకరణ వ్యవస్థలతో ఆధునికతకు నిదర్శనంగా నిలిచింది.ప్యాలెస్లోని అంతర్గత అలంకరణలు, ఇస్లామిక్ గోపురాలు, హిందూ శిల్పాలు, బెల్జియం చందమామలు, ఇటాలియన్ మోసాయిక్లు, ప్రపంచ సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తాయి. రాజా రవి వర్మ చిత్రకళలకు ఇది నిలయంగా ఉంది.రాజు ప్రజలకు దర్శనమిచ్చే ఇక్కడి దర్బార్ హాల్ను వెనిస్ ఫ్లోర్లు, స్టెయిన్డ్ గ్లాస్లతో తీర్చిదిద్దారు. అలంకరించబడింది. ఇది భారతీయ మరియు పాశ్చాత్య కళల కలయికకు నిదర్శనంగా నిలుస్తుంది.ప్రస్తుతం ఈ ప్యాలెస్లో మహారాజా సమర్జిత్సింగ్ గైక్వాడ్, మహారాణి రాధికారాజే గైక్వాడ్, వారి కుమార్తెలు పద్మజారాజే, నారాయణిరాజే, రాణి తల్లి శుభంగినిరాజే నివసిస్తున్నారు. “ఇది ఒక గృహం మాత్రమే కాదు, మా కుటుంబానికి ఆత్మీయతను కలిగించే నివాసం,” అని మహారాణి రాధికారాజే పేర్కొన్నారు. -
ప్రపంచంలో ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం 'బుర్జ్ ఖలీఫా' (Burj Khalifa) గురించి దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే అంతటి ప్రతిష్టాత్మక భవనాన్ని ఎవరు నిర్మించారు?, దాని ఓనర్ ఎవరు? అనే ఆసక్తికరమైన వివరాలు బహుశా కొంతమందికి తెలిసుండక పోవచ్చు. ఈ కథనం ఆ వివరాలు తెలుసుకుందాం.ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా.. అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ భవనాల్లో కూడా ఒకటి. ఇందులో సింగిల్ బెడ్ రూమ్ అద్దె ఏడాదికి 150000 దిర్హామ్స్ నుంచి 180000 దిర్హామ్లు (రూ. 42 లక్షల కంటే ఎక్కువ). దీనిని (బుర్జ్ ఖలీఫా) దుబాయ్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించింది. ఈ కంపెనీ ఫౌండర్ 'మహమ్మద్ అలబ్బర్' (Mohamed Alabbar). ఈయనే బుర్జ్ ఖలీఫా అసలైన యజమాని.ఎమ్మార్ ప్రాపర్టీస్ బుర్జ్ ఖలీఫాను మాత్రమే కాకుండా.. దుబాయ్ మాల్, దుబాయ్ క్రీక్ టవర్, దుబాయ్ ఫౌంటెన్ వంటి ఇతర ఐకానిక్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేసింది.బుర్జ్ ఖలీఫా వివరాలుబుర్జ్ ఖలీఫా ఎత్తు 829.8 మీటర్లు (2,722 అడుగులు). ఇందులో 163 అంతస్తులు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణం 2010కి పూర్తయింది. 95 కిలోమీటర్ల నుంచి కూడా కనిపించే ఈ భవనంలో 304 విలాసవంతమైన హోటల్ రూల్స్, 900 హై-ఎండ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బిల్డింగ్ బయటివైపు శుభ్రం చేయడానికే సుమారు మూడు నెలల సమయం పడుతుందని సమాచారం. -
ఆఫీస్ స్పేస్.. సిటీ టాప్ ప్లేస్..
దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆఫీస్ మార్కెట్లలో నగరం అగ్రగామిగా నిలిచిందని, ఈ ఏడాది తొలి అర్ధభాగం నగర ఆఫీస్ మార్కెట్ అనూహ్యమైన డిమాండ్ను చవిచూసిందని ‘ఎ బిలియన్ స్క్వేర్ ఫీట్ అండ్ కౌంటింగ్ – ఇండియా ఆఫీస్ సప్లై’ నివేదికలో నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ నివేదిక వెల్లడించిన ఇతర విశేషాల ప్రకారం.. –సాక్షి, సిటీబ్యూరోఈ ఏడాది మొదటి అర్ధభాగం పూర్తయ్యే నాటికి, నగరం మొత్తం ఆఫీస్ స్టాక్ 123 మిలియన్ చదరపు అడుగులు, ఇది భారతదేశపు మొత్తం ఆఫీస్ మార్కెట్లో 12% కాగా వార్షికంగా చూస్తే 9.2% అభివృద్ధితో టాప్ ఆరు మెట్రో నగరాల్లోనే అత్యధిక వృద్ధిని ప్రదర్శించింది. టెక్ రంగంలో బలమైన ప్రగతి, నిరంతరం కొనసాగుతున్న మౌలిక సదుపాయాల మెరుగుదల, వాణిజ్య కార్యకలాపాలకు అనువైన వాతావరణం నగర కార్యాలయ విస్తృతికి దోహదం చేస్తున్నాయి.టాప్ ప్లేస్లో ఈ ఏరియాలు..కొండాపూర్, మణికొండతో సహా సెకండరీ బిజినెస్ డిస్ట్రిక్ట్లు(ఎస్బీడీలు) నగర వాణిజ్య కార్యాలయ ల్యాండ్స్కేప్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవే మొత్తం కార్యాలయ సముదాయంలో 47% వాటా కలిగి ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో గచ్చిబౌలి, కోకాపేట, నానక్రామ్గూడ వంటివి 41% వాటాను దక్కించుకున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంప్రదాయ సెంటర్ బిజినెస్ డిస్ట్రిక్ట్లు ఇప్పుడు 11% వాటాను కలిగి ఉన్నాయి. మెట్రో కనెక్టివిటీ వంటి బలమైన మౌలిక సదుపాయాలు తక్కువ కార్యాచరణ ఖర్చులు వంటివి ఈ వృద్ధికి ఆజ్యం పోస్తున్నాయి.ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..నాణ్యతలో టాప్ 3..గ్రేడ్ ఏగా లెక్కించిన 68% కార్యాలయ సముదాయంతో నగరంలోని ఆఫీస్ స్పేస్ నాణ్యతపరంగా మొదటి మూడు భారతీయ నగరాల్లో ఒకటిగా ఉంది. నగరంలో గ్రేడ్ బీ 30% వాటాను కలిగి ఉండగా, గ్రేడ్ సీ కేవలం 1% మాత్రమే ఉండటం గమనార్హం. నగరం కొంత కాలంగా ఐటీ/ఐటీఇఎస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీలు), ఫార్మా లైఫ్ సైన్సెస్ సంస్థలకు ఆకర్షణీయంగా, అయస్కాంతంలా మారింది. ఇవే ప్రధానంగా లీజింగ్ కార్యకలాపాలకు ఊపునిస్తున్నాయి. ఈ ఏడాది అర్ధభాగంలో, నగరంలోని కీలక టెక్ కారిడార్లలో ఫ్లెక్స్–ఎనేబుల్డ్ వర్క్స్పేస్లను కోరుకునే బహుళజాతి సంస్థల నుంచి సిటీ బలమైన డిమాండ్ను చవి చూసింది. -
ప్లాట్ల వేలం.. రూ.100 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బహిరంగ వేలం ద్వారా చేపట్టిన ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. గత రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతంలోని 68 ప్లాట్లకు సంబంధించిన బహిరంగ వేలం ప్రక్రియ చేపట్టారు. వేలం నిర్వహించిన 50 ప్లాట్ల విక్రయానికి సంబంధించి దాదాపు రూ.100 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డుకు (Outer Ring Road) అతి సమీపంలోని ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 119 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.200– 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో, కార్నర్ ప్లాట్కు రూ 30 వేలు, ఇతర ప్లాట్లకు రూ.27 వేలు ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించారు. ఒక్కో ప్లాట్ కోసం దాదాపు 30 మంది వరకు పోటీ పడ్డారు. కార్నర్ ప్లాట్లకు మంచి డిమాండ్ రేటు పలికింది. రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన 50 ప్లాట్లకు సంబంధించిన వేలంలో గరిష్టంగా చదరపు గజానికి రూ. 46,500 ధర పలికింది.చదవండి: ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం -
1బీహెచ్కే రెంట్ రూ.42000: బ్రోకర్ నవ్వాడంటూ పోస్ట్
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. ముంబైలో 1బీహెచ్కే రెంట్ ఏకంగా రూ.42000 అని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.ముంబైలోని గోరేగావ్ వెస్ట్, దాని సమీప ప్రాంతాలలో 1బీహెచ్కే కోసం వెతుకుతున్నప్పుడు, అద్దెలు నన్ను ఆశ్చర్యపరిచాయని రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అవి కొత్త భవనాలు కాదు, మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయి. రెంట్ మాత్రం రూ. 42000 నుంచి ప్రారంభమవుతోంది. అద్దె ఇంటి కోసం నా బడ్జెట్ రూ. 35000 నుంచి రూ. 38000 అని చెప్పినప్పుడు బ్రోకర్ నవ్వాడు అని కూడా యూజర్ తన పోస్టులో పేర్కొన్నాడు.గతంలో నేను ముంబైలోనే నివసించాను. అప్పటికి, ఇప్పటికి అద్దెలు చాలా పెరిగిపోయాయని స్పష్టమవుతోంది. అద్దె పెరిగినా.. మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తక్కువ ధరలో అద్దె ఇల్లు కావాలంటే.. మలాడ్ వెస్ట్ సమీప ప్రాంతాల్లో చూడమని కొందరు సలహా ఇచ్చారు. బ్రోకర్లను నమ్మవద్దని ఇంకొందరు సూచించారు. -
హైదరాబాద్లో ఆఫీస్ వసతులు రూ.1.39 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో రూ.1.39 లక్షల కోట్ల విలువైన 123 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కార్యాలయ వసతులు (ఆఫీస్ స్పేస్) ఉన్నట్టు నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో జూన్ త్రైమాసికం చివరికి 993 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండగా, దీని విలువ 187 బిలియన్ డాలర్లు ఉన్నట్టు తెలిపింది. ఈ నగరాల్లో సెపె్టంబర్ త్రైమాసికం చివరికి కార్యాలయ వసతుల పరిమాణం బిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం యూఎస్లో 10.2 బిలియన్ ఎస్ఎఫ్టీ, చైనాలో 6.26 బిలియన్ ఎస్ఎఫ్టీ, జపాన్లో 1.77 బిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున ఆఫీస్ స్పేస్ ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘2005లో 200 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉన్న ఆఫీస్ స్పేస్ ఏటా 8.6 శాతం చొప్పున పెరుగుతూ వచి్చంది. ఈ ఏడాది చివరికి బిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుంది’’అని నైట్ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. నగరాల వారీగా.. → బెంగళూరులో ఆఫీస్ వసతుల పరిమాణం జూన్ చివరికి 229 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండగా, దీని వలువ 49 మిలియన్ డాలర్లు. → ఢిల్లీ ఎన్సీఆర్లో 44 బిలియన్ డాలర్ల విలువైన 199 మిలియన్ ఎస్ఎఫ్టీ కార్యాలయ వసతులు అందుబాటులో ఉన్నాయి. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో మొత్తం 169 మిలియన్ ఎస్ఎఫ్టీ (41 బిలియన్ డాలర్లు) అందుబాటులో ఉంది. → పుణెలో 106 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ ఉండగా, దీని విలువ 16 బిలియన్ డాలర్లు. → 13 బిలియన్ డాలర్ల విలువైన 92 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీసు వసతులకు చెన్నై నగరం వేదికగా ఉంది. → అహ్మదాబాద్లో 41 మిలియన్ ఎస్ఎఫ్టీ (4 బిలియన్ డాలర్లు), కోల్కతాలో 34 మిలియన్ ఎస్ఎఫ్టీ (4 బిలియన్ డాలర్లు) మేర కార్యాలయ వసతులు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. → టాప్–8 నగరాల్లోని మొత్తం ఆఫీస్ స్పేస్లో గ్రేడ్–ఏ వసతులు 53 శాతంగా ఉంటే, గ్రేడ్–బీ వాటా 43 శాతంగా, గ్రేడ్–సీ 4 శాతం చొప్పున ఉన్నాయి.జీసీసీలు ప్రధాన చోదకం ‘‘గత 35 ఏళ్లలో భారత్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఎంతో మార్పును చూసింది. ముఖ్యంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) ఆఫీస్ స్పేస్ డిమాండ్కు ప్రధాన చోదకంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆఫీస్ మార్కెట్గా భారత్ అవతరించింది. ఇప్పటికే 0.99 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండగా, బిలియన్ ఎస్ఎఫ్టీ మార్క్ను త్వరలో చేరుకోనుంది’’అని నైట్ఫ్రాంక్ ఇండియా రీసెర్చ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు. -
‘ఏదో అలా బ్రతికేస్తున్నాం.. అంతే..’
బెంగళూరులో క్రమంగా క్షీణిస్తున్న జీవన నాణ్యత, నగరంలో పెరుగుతున్న రోజువారీ ఖర్చుల నేపథ్యంలో చాలామంది నివాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు పట్టణం వేగంగా విస్తరిస్తోంది. దాంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. స్థానికంగా నివాసం ఉండేందుకు రెంట్లు, జీవనవ్యయం అధికం అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలుస్తున్నాయి. తొమ్మిదేళ్లు నగరంలో నివాసం ఉన్న ఓ వ్యక్తి ఆన్లైన్లో చేసిన పోస్ట్కాస్తా వైరల్గా మారింది.‘నేను తొమ్మిదేళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నాను. టెక్నాలజీ అభివృద్ధి, మెరుగైన పట్టణ వాతావరణం, జీవన నాణ్యత బాగుంటుందని ఇక్కడకు వచ్చాను. కానీ ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 12 కిలోమీటర్లు ప్రయాణించడానికి నిత్యం మూడు గంటలు ట్రాఫిక్తో ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఎలాంటి పార్కింగ్ సదుపాయంలేని 1 బీహెచ్కే ఫ్లాట్కు రూ.30 వేల కంటే అధిక రెంటు ఉంది. క్యాబ్ బుక్ చేయడానికి ఏడు వేర్వేరు యాప్లను ఉపయోగిస్తున్నా చాలాసార్లు బుక్ అవ్వదు. నగరంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఎదో అలా బ్రతుకుతున్నాం అంతే..’ అని ఓ వ్యక్తి లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు.ఇదీ చదవండి: సులువుగా యూఎస్ వీసా రావాలంటే..ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేను ఉద్యోగం కోసం ఇక్కడకు వచ్చాను. చాలా విషయాలతో ఇక్కడే చిక్కుకుపోయాను’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘ట్రాఫిక్ ఆత్మరక్షణలో ఉంది. కుటుంబంతో కంటే ప్రయాణాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను’ అని మరో వ్యక్తి తెలిపారు. -
రూ.10 లక్షలున్నా ప్రాపర్టీ కింగ్..!
ఓ ఇల్లు లేదా వాణిజ్య భవనానికి యజమాని అయితే ఆ దర్జాయే వేరు! స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా అండగా నిలిచే ప్రాపర్టీ ఉంటే చెప్పలేనంత నిశి్చంత. ప్రాపర్టీపై పెట్టుబడి ఎన్నో తరాలను ధనవంతులను చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, నేడు ఇళ్లు, వాణిజ్య స్థలాల ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థలాల లభ్యత పెరగదన్నది వాస్తవం. కనుక ప్రాపర్టీ ఇక ముందూ పెట్టుబడుల పరంగా మెరుగైన సాధనమే అవుతుంది. భారీ పెట్టుబడి పెట్టలేని వారు సైతం ప్రాపర్టీకి సహ యజమాని అయ్యే అవకాశం కల్పిస్తున్నవే ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్’లు. ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్’కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్తోనే ప్రాపర్టీపై పెట్టుబడికి లభిస్తున్న అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు ఎక్కువ మంది (గతంతో పోల్చితే) ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడికి వీలు కల్పించడం ఇందులో ఉన్న సౌలభ్యం. ఇదే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. అసలు ఈ సాధనం ఎలా పనిచేస్తుంది? ప్రయోజనాలు, పన్ను తదితర అంశాల గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి ఇదొక వినూత్న సాధనం. అధిక విలువ కలిగిన ప్రాపర్టీకి ఏ ఒక్కరో యజమానిగా కాకుండా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉమ్మడిగా వాటా కలిగి ఉండడం. దీనివల్ల ప్రయోజనం ఏంటి? అంటే.. తమ వాటా మేరకు రాబడి అందుకోవచ్చు. ఇల్లు కొనుగోలుకు రూ.50 లక్షలు, ఇంకా ఎక్కువే పెట్టుబడి అవసరం. ఇక్కడ మాత్రం రూ.10 లక్షలు ఉన్నా సరే ఆ మేరకు వాటా లభిస్తుంది. ముఖ్యంగా ధరలు భారీగా పెరిగిపోయిన ప్రాంతాల్లో పెట్టుబడికి ఎంతో అనుకూలం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ నిబంధనలు (సవరణ), 2014కు మార్పులు చేయడం ద్వారా సెబీ కొత్తగా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్) విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ను నియంత్రణల పరిధిలో మరింత మందికి చేరువ చేసేందుకు, పారదర్శకత, సౌలభ్యం కోసం తీసుకొచ్చింది. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (పాక్షిక యాజమాన్యం)ను ఆఫర్ చేసే ప్రతి ప్లాట్ఫామ్ కూడా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్)గా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కు బదిలీ చేస్తాయి. ఆఫీస్ వసతులు, గోదాములు, డేటా సెంటర్లు తదితర వాటిపై ఎస్పీవీ పెట్టుబడులు పెడతాయి. ప్రతి పెట్టుబడిదారుడికి వారి వాటా మేరకు డిజిటల్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. రాబడులను వారి వాటాకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. సెబీ నియంత్రణ ఎస్ఎం రీట్ సాధనాలు సెబీ పర్యవేక్షణ కింద పనిచేస్తుంటాయి కనుక రక్షణ ఉంటుంది. ‘‘ఈ ప్లాట్ఫామ్లు తమ నిర్వహణలోని ఆస్తుల విలువను రెండేళ్లకోసారి స్వతంత్రంగా మదింపు వేయించి, ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. పనితీరు, ఆస్తుల వివరాలు, రిస్్కలు, ప్రయోజన వైరుధ్యం తదితర సమాచారాన్ని వెల్లడించాలి’’ అని ట్రైలీగల్కు చెందిన కునాల్షా తెలిపారు. వీటిలో రకాలు.. నివాస భవనాలు: ఇందులో పెట్టుబడిపై అద్దె ఆదాయం మోస్తరుగా ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి విలువ సైతం వృద్ధి చెందుతుంది. వాణిజ్య ప్రాపర్టీలు: అధిక అద్దె ఆదాయం లభిస్తుంది. పెట్టుబడి విలువ వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రాపర్టీ కొంత కాలం పాటు ఖాళీగా ఉండడం వంటి కొన్ని రిస్్కలు ఇందులో ఉంటాయి. ఎమర్జింగ్ అస్సెట్ క్లాసెస్: గోదాములు, డేటా సెంటర్లు, కో–వర్కింగ్ స్పేస్లకు ఇవి వేదికగా ఉంటాయి. వీటిల్లో పెట్టుబడిపై అద్దె రాబడి స్థిరంగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువ. కనుక వసతులు ఖాళీగా ఉండకుండా అద్దె ఆదాయం స్థిరంగా లభిస్తుంది. పెట్టుబడులకు వైవిధ్యం రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పరంగా వైవిధ్యం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్తో సాధ్యపడుతుంది. భారీ పెట్టుబడి ఒకే ప్రాపర్టీకి పరిమితం కాకుండా చూసుకోవచ్చు. ఒకటికి మించిన ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆదాయంలో వైవిధ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే ప్రాంతం కాకుండా భిన్న ప్రాంతాల్లోని, భిన్న రకాల ప్రాపర్టీలపై (ఆఫీసులు, గోదాములు, ఇళ్లు) పెట్టుబడి పెట్టుకోవడం ఇందులో ఉన్న సౌలభ్యం. అయితే అన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు ఎస్ఎం రీట్లుగా నమోదై లేవు. పెట్టుబడి వృద్ధితోపాటు రాబడి స్థిరమైన ఆదాయానికితోడు పెట్టుబడి విలువ కూడా నిరీ్ణత కాలంలో ఎంతో కొంత వృద్ధి చెందుతుంది. ఆస్తులను నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ప్రాపర్టీల నిర్వహణ, కిరాయిదారుల నుంచి అద్దెలు వసూలు, చట్టపరమైన ప్రక్రియలను అనుసరించడం తదితర బాధ్యతలన్నింటినీ వారు చూసుకుంటారు. కనుక పెట్టుబడిదారులకు ఈ తలనొప్పులేవీ ఉండవు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం 500–600 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.5,160 కోట్లు) ఉంటుందని ఖైతాన్ అండ్ కో పార్ట్నర్ హర్ష్ పారిఖ్ తెలిపారు. వచ్చే 8–10 ఏళ్లలో 5 నుంచి 5.5 బిలియన్ డాలర్ల స్థాయికి (రూ.47,300 కోట్లు) చేరుకుంటుందని అంచనా వేశారు.పెట్టుబడికి ముందు చూడాల్సినవి.. → ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు సెబీ వద్ద నమోదయ్యాయా? లేవా అన్నది తప్పకుండా చూడాలి. అంతేకాదు ప్రాపర్టీ సైతం రెరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. లీజు డాక్యుమెంట్లు, యాజమాన్యం వివరాలను సరి చూసుకోవాలి. → కొన్ని ప్లాట్ఫామ్లపై పెట్టుబడికి లాకిన్ పీరియడ్ ఉంటోంది. దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. → సొంతంగా ప్రాపర్టీ కొనుగోలుకు భారీ పెట్టుబడి అవసరం. కావాలనుకున్నప్పుడు వేగంగా విక్రయించడ అన్ని వేళలా సాధ్యపడదు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అయినా లేదా ఎస్ఎం రీట్లు అయినా కొంచెం వేగంగా విక్రయించుకోవచ్చు. → కొన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు (సెబీ వద్ద నమోదు కాని) రూ.5 లక్షల నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నాయి. వీటి రిజిస్ట్రేషన్, వాస్తవికత తెలుసుకున్న తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్ లేదా రీట్ల్లో ఈ తరహా రిస్క్ ఉండదు. కానీ సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో లేవు. అదే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు చాలా ఉన్నాయి. → కనీస పెట్టుబడి అన్నది ప్లాట్ఫామ్ ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ ప్లాట్ఫామ్లోనూ రూ.10 లక్షలే ఉండాలని లేదు. → ఎంపిక చేసుకునే ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది? అక్కడ లీజుకు ఉన్న డిమాండ్ ఏ పాటిది? భవిష్యత్తులో బలమైన వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమేనా? తదితర అంశాలను పరిశీలించాలి.ఎవరికి అనుకూలం? స్థిరమైన ఆదాయం కోరుకునే విశ్రాంత జీవులు, ఇతరులు ఎవరికైనా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ లేదా ఎస్ఎం రీట్లు అనుకూలమే. సంప్రదాయ ఈక్విటీలు, డెట్ సాధనాలకు అదనంగా వైవిధ్యం కోసం అనుకూలిస్తాయి. ‘‘అద్దె రూపంలో 8–9 శాతం రాబడులు ఎంతో మెరుగైనవి. పైగా ఈ రాబడి ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది. ఏటా 5 శాతం మేర పెరుగుతూ ఉంటుంది’’ అని ‘ప్రాపర్టీ షేర్’ సహ వ్యవస్థాపకుడు కునాల్ మోక్తాన్ వివరించారు. ఏడాది మించిన పెట్టుబడి దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎం రీట్లు పంపిణీ చేసే డివిడెండ్లపై పన్ను లేదు. వడ్డీ ఆదాయం మాత్రం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి. ఎస్ఎం రీట్ – రీట్ → రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) అన్నది ఒక కంపెనీ. ఆదాయాన్నిచ్చే వాణిజ్య ఆస్తులను నిర్వహిస్తుంటుంది. షేర్ల మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అయిన రీట్లను ఒక్క యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. సిప్ మాదిరే ప్రతి నెలా కొద్ది మొత్తం పెట్టుబడులకు లిస్టెడ్ రీట్లకు అనుకూలమైన సాధనం. ఇవి పెద్ద స్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. నేరుగా కాకుండా పరోక్షంగా అన్ని ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు మధ్య, చిన్నస్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో ఇన్వెస్టర్ ఎంపిక మేరకు ఒక ప్రాపర్టీ లేదా ఒకటికి మించిన ప్రాపర్టీల్లో పెట్టుబడులకు వీలుంటుంది. ఒక విధంగా ఇది ప్రత్యక్ష పెట్టుబడి. ఒకటికి మించిన ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉండదు. ప్రతీ ప్రాపర్టీకి విడిగా సర్టిఫికెట్ జారీ చేయాల్సిందే. → ఎస్ఎం రీట్లు రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. రెగ్యులర్ రీట్లు రూ.500 కోట్లకు పైగా విలువైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. → ఎస్ఎం రీట్లలో తమకు ఇష్టమైన ప్రాపర్టీని ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ప్రాపర్టీ వారీగా విడివిడిగా ఉంటుంది. రీట్లో ఇందుకు అవకాశం లేదు. → ఎస్ఎం రీట్లలో కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. రెగ్యులర్ రీట్లలో కనీసం ఒక యూనిట్ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు కనీసం 5–6 ఏళ్లు, అదే రెగ్యులర్ రీట్లు అయితే మరింత దీర్ఘకాలం కోసం ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ఎందుకు? అసలు ప్రాపర్టీపై ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? రాబడి కోసమా, సంపద సృష్టి కోసమా అన్నది తేల్చుకోవాలి. ఎందుకంటే రాబడి, పెట్టుబడి విలువ వృద్ధి కోరుకునే వారికి ఈ తరహా డిజిటల్ రియల్ ఎస్టేట్ సాధనాలే అనుకూలం. ఒకవేళ సొంత వినియోగం కోసం అయితే నేరుగా ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఒక ప్రాపర్టీని సొంతంగా కొనుగోలు చేసుకోవడానికి పెద్ద మొత్తం పెట్టుబడి కావాలి. అంత స్తోమత లేని వారికి ఈ తరహా సాధనాలు అనుకూలం. పైగా పెట్టుబడులు అన్నీ ఒకే విభాగంలో ఉండరాదు. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం చక్కని సమతూకంతో, రిస్క్ పరంగా మెరుగైన ప్రణాళిక అవుతుంది. రియల్ ఎస్టేట్పై పెట్టుబడికి ఫ్రాక్షనల్ ఓనర్షిప్ లేదా రీట్లను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనికంటే ముందు రిస్క్లు, సానుకూలతలు, ప్రతికూలతలను సమగ్రంగా తెలుసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇల్లు కూడా హైటెక్గా ఉండాలిగా..
కరోనా తర్వాత నుంచి హోమ్ ఆటోమేషన్పై నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. ప్రతి ఒక్కరూ ఇల్లు ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు భాగమైపోయింది. రెండు దశాబ్దాలుగా స్మార్ట్ హోమ్స్ సేవలనేవి విలాసవంతమైన వసతుల నుంచి దైనందిన అవసరంగా మారిపోయాయి. భద్రత, ఆదా, సౌకర్యం.. హోమ్ ఆటోమేషన్ లాభాలివే. దీంతో నివసించే నగరమే కాదు ఇళ్లు కూడా హైటెక్గా ఉండాలని యువతరం కోరుకుంటోంది. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా స్మార్ట్ హోమ్స్ను నిర్మిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఇంటిలోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, ఫ్రిజ్, గీజర్, టీవీ వంటి ప్రతి ఎల్రక్టానిక్ ఉపకరణాన్ని సెల్ఫోన్తోనే నిర్వహణ చేసే వీలుండటమే స్మార్ట్ హోమ్స్ ప్రత్యేకత. ఇంటి ముందు గేటు నుంచి మొదలుపెడితే తలుపులు, కిటికీ కర్టెన్లు, లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఏసీ, గీజర్, ఫ్రిడ్జ్, గ్యాస్, హోమ్ థియేటర్, గార్డెన్ ఇలా ప్రతి ఒక్క దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతతో వినియోగించడమే హోమ్ ఆటోమేషన్. అలెక్సా, గూగుల్ హోమ్, సిరి ఈ మూడు వర్చువల్ అసిస్టెంట్ టెక్నాలజీతో మనం ఎంపిక చేసిన సమయం ప్రోగ్రామింగ్ ప్రకారం ఆయా వస్తువులు పని చేస్తుంటాయి.ఎలా పనిచేస్తాయంటే.. విప్రో, ఫిలిప్స్, హావెల్స్, ఎంఐ, క్రిస్టాన్, స్నైడర్, ల్యూట్రాన్, లెగ్గ్రాండ్, పెర్ట్ హోమ్, ఫైబరో వంటి కంపెనీలకు చెందిన వైర్లెస్, వైర్డ్ అనే రెండు రకాల హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వైఫై, బ్లూటూత్, జెడ్ వేవ్, జిగ్బీ నాలుగు రకాల వైర్లెస్ ప్రొటోకాల్స్తో ఆటోమేషన్ ఉత్పత్తులు అనుసంధానమై ఉంటాయి. ఆయా ఉత్పత్తులకు చెందిన మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని, ఇంట్లోని ఎన్ని ఫోన్లకైనా అనుసంధానిచవచ్చు. కస్టమర్లు ఇష్టాన్ని బట్టి కేవలం తన వాయిస్ను మాత్రమే గుర్తించేలా ఉపకరణాలను అనుసంధానివచ్చు. లేదా ఇంట్లోని ప్రతి ఒక్కరి వాయిస్నైనా గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు.లాభాలెన్నో.. హోమ్ ఆటోమేషన్తో విద్యుత్ వృథా ఉండదు. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్మార్ట్ హోమ్స్లో 20–30 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. సమయం, డబ్బు ఆదా అవడంతో పాటు భద్రత మెరుగవుతుంది. ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. 1,500 చ.అ. అపార్ట్మెంట్లో వీడియో డోర్ బెల్, ఒక లైట్, ఫ్యాన్, ఏసీ, గీజర్తో కూడిన బేసిక్ హోమ్ ఆటోమేషన్కు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఎలక్ట్రిషన్, ఇంజనీర్, నెట్వర్క్, సాంకేతిక నిపుణులు నలుగురు వ్యక్తులు 3–4 రోజుల్లో పూర్తిగా హోమ్ ఆటోమేషన్ పూర్తి చేస్తారు. -
రెట్టింపు కానున్న అఫర్డబుల్ హౌసింగ్ రుణాలు
ముంబై: అందుబాటు ధరల ఇళ్ల రుణాలు వచ్చే మూడేళ్లలో గణనీయంగా పెరగనున్నాయి. అఫర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఏహెచ్ఎఫ్సీ) నిర్వహణలోని ఆస్తులు ప్రస్తుతం రూ.1.4 లక్షల కోట్లుగా ఉంటే, మూడేళ్లలో రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీల మార్ట్గేజ్ రుణాలు (ఇల్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి) 2025 మార్చి నాటికి రూ.13 లక్షల కోట్లుగా ఉంటే, 2028 మార్చి నాటికి రూ.20 లక్షల కోట్లకు పెరుగుతాయని తెలిపింది. అన్సెక్యూర్డ్ రుణాల్లో సమస్యలు నెలకొనడంతో ప్రత్యామ్నాయ రుణాల మంజూరు పరంగా నియంత్రణలు నెలకొన్నట్టు పేర్కొంది. దీంతో రిటైల్ మోర్ట్గేజ్ రుణాలను బలమైన వృద్ధి నడిపించనున్నట్టు ఇక్రా ఫైనాన్షియల్ రంగ రేటింగ్స్ కో గ్రూప్ హెడ్ ఎం.కార్తీక్ తెలిపారు. సంప్రదాయంగా మార్ట్గేజ్ రుణ విభాగం బలమైన పనితీరు చూపిస్తోందంటూ.. నష్టాలు (రుణ ఎగవేతలు) తక్కువగా ఉండడంతోపాటు రాబడులు మెరుగ్గా ఉంటున్నట్టు వివరించింది. మొత్తం మార్ట్గేజ్ రుణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) మూడింట రెండొంతుల వాటా కలిగి ఉండడం గమనార్హం. ఇక మొత్తం మార్ట్గేజ్ రుణాల్లో అఫర్డ్బుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఏహెచ్ఎఫ్సీ) వాటా 11 శాతంగా ఉంది.చిన్న రుణాల్లో ఏహెచ్ఎఫ్సీలకు అధిక వాటా స్వయం ఉపాధిలోని రుణ గ్రహీతలు తీసుకునే గృహ రుణాల్లో హెచ్ఎఫ్సీలతో పోల్చి చూస్తే ఏహెచ్ఎఫ్సీలు అధిక వాటా కలిగి ఉన్నట్టు ఇక్రా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా తక్కువ మొత్తం రుణాల్లో ఏహెచ్ఎఫ్సీలకు అధిక వాటా ఉందని.. ఇటీవలి కాలంలో వీటి ఏయూఎం వేగంగా పెరిగినట్టు తెలిపింది. వ్యాపార నమూనా రీత్యా బకాయిలు పెరిగిపోతే వాటి వసూలుకు వీలుగా ఏహెచ్ఎఫ్సీలకు విస్తృతమైన శాఖల నెట్వర్క్తోపాటు సిబ్బంది అవసరమని పేర్కొంది. స్థిరమైన కార్యకలాపాలకు తోడు మెరుగైన రుణ విధానాలు అనుసరించాలని సూచించింది. వసూలు కాని మొండి రుణాలు (ఎన్పీఏలు) ఏహెచ్ఎఫ్సీల మొత్తం రుణాల్లో 1.1–1.3 శాతంగానే గత మూడేళ్ల కాలంలో ఉన్నట్టు తెలిపింది. సగటు లోన్ టు వ్యాల్యూ (ఇంటి విలువలో ఇచ్చే రుణం) 55 శాతంగా ఉండడం, రుణాల్లో 40 శాతం సొంత ఇల్లు నిర్మాణం కోసమే ఇస్తుండడంతో రుణ ఆస్తుల నాణ్యత నియంత్రణల్లోనే ఉంటుందని అంచనా వేసింది. రుణ వ్యయాలు తక్కువగా ఉండడంతో ఆస్తులపై రాబడి 3.5–.36 శాతం స్థాయిలో ఉండొచ్చని తెలిపింది. రానున్న రోజుల్లో ఈ రంగంలో బడా సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదురుకానున్న నేపథ్యంలో మార్జిన్ల క్షీణత రిస్క్ ఉంటుందని.. నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించింది. -
ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం!
సాక్షి, సిటీబ్యూరో: పండగలు వస్తున్నాయంటే చాలు.. రియల్టీ రంగానికి ఉత్సాహమే. ఎందుకంటే ప్రజలు ఇల్లు, ఫ్లాట్లు తీసుకోవడం శుభసూచకంగా భావిస్తారు. కరోనా తర్వాతి నుంచి ఖరీదైన గృహాలకు మళ్లీ ఆదరణ అధికమవుతోంది. వీటిని తీసుకోవడానికి కొనుగోలుదారులు ముందుకొస్తున్నారు. ఢిల్లీ, గుర్గావ్, నొయిడా, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోనూ కొనేవారి శాతం పెరుగుతోంది. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఉద్యోగావకాశాలు కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. నిర్మాణం పూర్తి కానున్న ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.నగరంలోనూ అదే పోకడ.. గతంలో ఊపు తగ్గిన లగ్జరీ విల్లాలకు ఇటీవల కాలంలో నగరంలో ఆదరణ పెరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్కు చేరువలో ఉండి సదుపాయాల విషయంలో రాజీపడని ప్రాజెక్టుల్లో విల్లాలను తీసుకోవడానికి ప్రవాసభారతీయులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఐటీ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. నార్సింగి, అప్పా జంక్షన్, తెల్లాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని విల్లాలకు గిరాకీ పెరిగింది.స్థానిక రాజకీయాంశాల వల్ల ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమే.. తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయి. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాని అనుసంధానమైన రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్, మెట్రో రైలు విస్తరణతో పాటు కొత్త నియామకాల్ని చేపడుతోన్న ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, మెరుగవుతోన్న వైద్య, విద్య, బయోటెక్ రంగాలు వెరసీ.. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆకట్టుకునే స్థాయికి హైదరాబాద్ చేరుకుంటుంది. -
ఇంటి డాక్యుమెంట్లు బ్యాంక్ పోగొడితే?
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంక్ రుణంతో ఇల్లు కొనడం తెలిసిందే.. ఇంటి దస్తావేజులు తనఖాగా పెట్టి రుణం తీసుకోవడం కామనే! ప్రతినెలా క్రమం తప్పకుండా ఈఎంఐ కట్టేసి.. చివరకు బ్యాంక్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాక.. తనఖా పెట్టిన ఇంటి దస్తావేజులు ఎక్కడో పోయాయని బ్యాంక్ చెబితే? బ్యాంక్ అధికారులతో గొడవ పెట్టుకుంటాం. లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫైడ్ సేల్ డీడ్ కాపీ కోసం దరఖాస్తు చేస్తాం.. అంతేకదా!?మహారాష్ట్రకు చెందిన ప్రదీప్ శెట్టి అలా చేయలేదు. 2004లో ప్రదీప్ మహారాష్ట్ర పరెల్లోని స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్లో రూ.9 లక్షల గృహ రుణం తీసుకున్నాడు. అన్ని ఈఎంఐలు కట్టేశాక, బ్యాంక్ నుంచి నో– డ్యూస్ సర్టిఫికెట్ కూడా పొందాడు. ఆ తర్వాత బ్యాంక్ అందించాల్సిన సేల్డీడ్ కాపీలను ఇవ్వకుండా అవెక్కడో మిసయ్యాయని వివరించింది. దీంతో ప్రదీప్ ‘తనఖా పెట్టిన దస్తావేజులను బ్యాంక్ ఎక్కడో పోగొట్టింది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సేల్డీడ్ కాపీలు లేకపోవడంతో ఇంటిని విక్రయించలేకపోతున్నానని, పైగా ఈ ఘటనతో మానసిక వేదనకు గురయ్యాయని, విలువైన సమయం వృథా చేసినందుకు బ్యాంక్ పరిహారాన్ని చెల్లించాల్సిందేనని’ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్కు ఫిర్యాదు చేశాడు.పరిహారం సరిపోలేదు.. ప్రదీప్కు రూ.60 వేలు నష్ట పరిహారాన్ని బ్యాంకు చెల్లించాలని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పునిచ్చింది. ఇందులో రూ.50 వేలు దస్తావేజులు పోగోట్టినందుకు, రూ.5 వేలు మానసిక వేదనకు గురి చేసినందుకు, మరో రూ.5 వేలు ఫిర్యాదు దాఖలు ఖర్చులకు అని వివరించింది. అయితే ఈ పరిహారంతో సంతృప్తి చెందని ప్రదీప్ షెట్టి.. మహారాష్ట్ర స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో స్టేట్ ఫోరం.. పరిహార మొత్తాన్ని రూ.60 వేల నుంచి రూ.1.15 లక్షలకు పెంచింది. 3 నెలల్లోపు కస్టమర్కు సర్టిఫైడ్ సేల్డీడ్ కాపీని అందించాలని, లేనిపక్షంలో ప్రతి నెలా రూ.50 వేల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.ఎవరైనా సరే ఇలా చేయండి కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఇచ్చిన తీర్పు కేవలం ప్రదీప్ శెట్టికే కాదు.. మనలో ఎవరి ప్రాపర్టీ దస్తావేజులైనా సరే బ్యాంక్లు పోగోడితే.. కస్టమర్ పరిహారంతో పాటూ తిరిగి సర్టిఫైడ్ సేల్డీడ్ కాపీని కూడా అందించాల్సిన బాధ్యత బ్యాంక్లదే! ఇందుకోసం స్థానిక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ను సంప్రదిస్తే చాలు! ఒకవేళ ఇంట్లో దాచిపెట్టుకున్న ప్రాపర్టీ దస్తావేజులు దొంగలు పడో లేక ఇతర కారణాలతో మిస్ అయితే? దస్తావేజులు పోయాయని కంగారు పడకండి. మళ్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి సర్టిఫైడ్ దస్తావేజులను పొందొచ్చు. కాకపోతే కొంత శ్రమించాల్సి ఉంటుంది. సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలని కోరుతూ.. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో సేల్ డీడ్ పోయిందని ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత దస్తావేజులు పోయినట్టుగా స్థానిక వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఎవరికైనా దొరికితే సమాచారం అందించాలని కోరుతూ నోటీసు ఇవ్వాలి. గతంలో ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించారో మళ్లీ అదే కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ సేల్డీడ్ దస్తావేజులు పోయినట్లు సంబంధిత అధికారికి వివరించి సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలని కోరుతూ స్వీయ దస్తూరితో లెటర్ రాసివ్వాలి.ఫామ్–22లో పేరు, చిరునామా వంటి వివరాలన్నీ నమోదు చేసి.. ప్రాపర్టీ జిరాక్స్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ప్రాపర్టీ పేరు మీద ఉన్న ఆధార్, పాన్, రేషన్ కార్డ్, కరెంట్ బిల్లు వంటివి జత చేయాలి. వీటన్నింటికీ పోలీసు ఫిర్యాదు కాపీ, పత్రిక ప్రకటన జత చేసి సబ్ రిజిస్ట్రార్కు అందించాలి. నిర్ణయించబడిన ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. -
ఆన్లైన్లో సెర్చింగ్: త్రీడీ రూపంలో సమాచారం
గతంలో ప్రాపర్టీ కొనాలంటే పెద్ద ప్రహసనమే. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలా సులువైపోయింది. ఉన్నత స్థాయి ఉద్యోగులు, యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రాపర్టీ కొనుగోళ్లకు పెద్దగా టైమ్ వేస్ట్ చేయడం లేదు. ఏ ప్రాంతంలో ఎంత ధర ఉంది? ఎక్కడ ఏ నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నాయి? వసతులు, సౌకర్యాలు తదితర వివరాలను ప్రాపర్టీ పోర్టళ్లు అందిస్తున్నాయి. త్రీడీ రూపంలోనూ సమాచారం అందిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారుల పని సులువైపోయింది. – సాక్షి, సిటీబ్యూరోఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకట్నిర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనేవి ప్రాధామ్యాలుగా మారాయని తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ తెలిపింది. త్రీ బీహెచ్కే, ఆపై పడక గదుల గృహాలలో 15 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది. ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. -
అక్కడ అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్: పెరిగిన రెంట్
విద్యా సంస్థలు, ఆస్పత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్లలో కిరాయిలు హాట్కేక్లా మారాయి. – సాక్షి, సిటీబ్యూరోఅమీర్పేట, ఎస్ఆర్నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు 6 నెలల్లో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారెడ్పల్లి, అల్వాల్లో 20-25 శాతం అద్దెలు పెరిగాయి.నడ్డివిరుస్తున్న అద్దెలు..హైదరాబాద్లో ఇంటి అద్దెలు కిరాయి దారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి, పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10-15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10-15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20-25 వేలకు పైగా ఖర్చు చేస్తే తప్ప దొరకని పరిస్థితి.అడ్వాన్స్లు, మెయింటెనెన్స్ల భారం..ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3-4 నెలలు అడ్వాన్స్లను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతోంది. 2 బీహెచ్కే అపార్ట్మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. -
జోరుగా గృహ వినియోగం
ముంబై: భారత్లో గృహ వినియోగం వచ్చే రెండు నుంచి మూడు త్రైమాసికాల్లో పుంజుకుంటుందని స్విస్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలపడుతుండడం మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇది కొనుగోలు శక్తిని పెంచుతుందని తెలిపింది. అలాగే మంచి వర్షపాతం అంచనాలు పంటల దిగుబడిపై ఆశలను పెంచుతున్నాయని, మహిళల సామాజిక భద్రతపై ప్రభుత్వాలు 20 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తుండడం.. ఇవన్నీ గ్రామీణ వినియోగాన్ని బలోపేతం చేస్తాయని తన నివేదికలో యూబీఎస్ సెక్యూరిటీస్ వివరించింది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, వ్యక్తిగత ఆదాయపన్నులో మార్పుల ద్వారా 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక ఉద్దీపనలు కల్పించడం, రుణాల లభ్యత పెరగడం.. ఇవన్నీ పట్టణ వినియోగాన్ని కుదురుకునేలా చేస్తాయని తెలిపింది. ‘‘గ్రామీణ వినియోగం పుంజుకున్నప్పటికీ.. మొత్తం వాటాలో గ్రామీణ వినియోగం సగానికంటే తక్కువగా ఉన్నందున, గృహ వినియోగం అన్ని రకాలుగా కోలుకుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. గ్రామీణ వినియోగం క్రమంగా బలపడుతున్న కొద్దీ ఎంతలేదన్నా వచ్చే 2–3 త్రైమాసికాల్లో గృహ వినియోగం పుంజుకోవడం మొదలవుతుంది’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ భారత ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్ తెలిపారు. మాస్ మార్కెట్లో స్తబ్దత గ్రామీణ మార్కెట్లలో చౌక ఉత్పత్తుల వినియోగంలో స్తబ్దత నెలకొనగా, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మాత్రం పెరుగుతున్నట్టు యూబీఎస్ సెక్యూరిటీస్ వెల్లడించింది. గ్రామీణ వేతనాల్లో వృద్ధి (ఆహార ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసిన) ఆరేళ్ల గరిష్ట స్థాయి అయిన 4.5 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహన అమ్మకాలు జూన్ త్రైమాసికంలో 9 శాతం, ట్రాక్టర్ల అమ్మకాలు 35 శాతం చొప్పున పెరిగినట్టు పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు, డ్యూరబుల్స్ గూడ్స్ ఉత్పత్తి మాత్రం జూన్ త్రైమాసికంలో తగ్గినట్టు తెలిపింది. ఎనిమిదో వేతన కమిషన్ సిఫారసులకు అనుగుణంగా 2026 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 55 బిలియన్ డాలర్ల చెల్లింపులు మొదలైతే అప్పుడు పట్టణ డిమాండ్ సైతం ఊపందుకుంటుందని అంచనా వేసింది. -
హైదరాబాద్లో ఫ్లాట్ల కొనుగోళ్లకు భారీ తాకిడి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఫ్లాట్ల కొనుగోలుకు నగరవాసుల నుంచి తాకిడి పెరిగింది. నాగోలు బండ్లగూడ ప్రాజెక్టులోని 159 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోడానికి మంగళవారం చివరి రోజు కావడంతో ఆసక్తి ఉన్నవారు డీడీలతో క్యూ కట్టారు. బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్ల కోసం సుమారు 1,900 మందికి పైగా దరఖాస్తు చేశారు. చివరి రోజు మంగళవారం 600కుపైగా దరఖాస్తులు రావడం విశేషం.సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారి నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గత తరహాలో కాకుండా లబ్ధిదారులు తమకు నచ్చిన ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ఫ్లాట్ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీలో తీసి వచ్చిన వారికి కేటాయిస్తారు. ఈ కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన లాటరీని బుధవారం బండ్లగూడ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించారు.బండ్లగూడలో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకుని లాటరీలో రానివారు, పోచారం ప్రాజెక్టులోని ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. బండ్లగూడలో ప్రాజెక్టులో ఈఎండీ చెల్లించినట్లు ఇచ్చిన రసీదును పోచారం ప్రాజెక్టులో సమర్పించి అక్కడి ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగే ఓపెన్ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలంలో.. బండ్లగూడలో పొందిన రసీదుతోనే పాల్గొనవచ్చని ఆయన వివరించారు. ఘట్కేసర్ పోచారం ప్రాంతంలోని 601 ఫ్లాట్ల కొనుగోలు దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31 కాగా.. లాటరీ ప్రక్రియ ఆగస్టు 1, 2వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గౌతం పేర్కొన్నారు. -
మళ్లీ భాగ్యనగరంలో భూముల వేలం
రాష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకంగా మారిన టీజీఐఐసీ మరోమారు అత్యంత విలువైన భూముల వేలానికి సిద్ధమైంది. రాయదుర్గ్, ఉస్మాన్నగర్ ప్రాంతాల్లోని 66 ఎకరాలను వేలం ద్వారా విక్రయించాలని భావిస్తోంది. వేలం విధివిధానాల్లో సహకరించేందుకు సలహాదారుల కోసం ఈ నెల 25న టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది.వచ్చే నెల 8 వరకు వేలం కోసం బిడ్లను స్వీకరించి 12న వేలం ప్రక్రియను పూర్తిచేసేలా టీజీఐఐసీ షెడ్యూల్ విడుదల చేసింది. 17 ప్లాట్ల వేలానికి సంబంధించిన అప్సెట్ ధర(మినిమం బేస్ ప్రైస్)ను టీజీఐఐసీ ప్లాట్లవారీగా నిర్ణయించింది. రాయదుర్గ్లోని 15ఏ/2, 14ఏ/1 ప్లాట్ల అప్సెట్ ధరను చదరపు గజానికి రూ.1,51,484గా ఖరారు చేసింది. ఈ లెక్కన ఎకరం ధర రూ.104 కోట్లుగా తేల్చింది. మిగతా ప్లాట్లలో అప్సెట్ ధరను కనిష్టంగా రూ.12.20 కోట్ల నుంచి రూ. 50.10 కోట్లుగా నిర్ణయించింది. ఇదీ చదవండి: ‘లేఆఫ్స్ నిర్ణయం ఎంతో భారం’.. అయినా తప్పట్లేదు!మొత్తం 66 ఎకరాలను టీజీఐఐసీ విక్రయించనుండగా వాటిలో 4 ప్లాట్లు రాయదుర్గంలో, మరో 13 ప్లాట్లు ఉస్మాన్నగర్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలుకొని 2014–23 మధ్య టీజీఐఐసీ భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 21 వేల కోట్ల ఆదాయం సమకూర్చినట్లు సమాచారం. -
రియల్టీ రంగానికి విరివిగా బ్యాంకు రుణాలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగానికి (రియల్టి) బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. ఈ రంగానికి బ్యాంకుల రుణ వితరణ నాలుగేళ్లలో రెట్టింపై 2025 మార్చి నాటికి మొత్తం రూ.35.4 లక్షల కోట్లకు చేరింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్ అయిన కొలియర్స్ ఇండియా ప్రకటించింది. ఈ రంగానికి చెందిన టాప్–50 లిస్టెడ్ కంపెనీల లాభం, మార్కెట్ పనితీరును విశ్లేషించినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. ‘‘కరోనా విపత్తు అనంతరం రియల్ ఎస్టేట్ రంగం ఆర్థిక పనితీరు ఎంతో మెరుగుపడింది. ఇతర రంగాల కంటే మెరుగైన పనితీరు చూపించింది. దీంతో ఈ రంగానికి రుణ వితరణలో మంచి పురోగతి నెలకొంది. బ్యాంకుల స్థూల రుణాలు 2021 మార్చి నాటికి రూ.109.5 లక్షల కోట్లు కాగా, 2025 మార్చి నాటికి రూ.182.4 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో రియల్ ఎస్టేట్ రంగానికి బ్యాంకుల రుణ వితణ రెట్టింపైంది. రూ.17.8 లక్షల కోట్ల నుంచి రూ.35.4 లక్షల కోట్లకు పెరిగింది’’అని ఆర్బీఐ డేటా ఆధారంగా కొలియర్స్ ఇండియా తెలిపింది. పెరిగిన విశ్వాసం బ్యాంకుల రుణ వితరణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం వాటా 20 శాతానికి చేరిందని.. ఈ రంగం పట్ల బ్యాంకుల్లో విశ్వాసం పెరుగుదలను ఇది సూచిస్తున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ‘‘ఎన్నో అస్థిరతలు నెలకొన్న తరుణంలోనూ భారత రియల్ ఎస్టేట్ రంగం బలంగా నిలబడడమే కాకుండా, ద్రవ్యపరమైన క్రమశిక్షణను చూపించింది’’అని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాజి్ఞక్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలతో పోల్చి చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో రియల్ఎస్టేట్ రంగంలోనే క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్లు (రేటింగ్ పెంపు) ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. నివాస భవనాలు, వాణిజ్యం, పారిశ్రామిక భవంతులు, గోదాములు, రిటైల్, ఆతిథ్యం వసతుల పరంగా డిమాండ్–సరఫరా మెరుగ్గా ఉండడం రియల్ ఎస్టేట్ రంగ రుణ నాణ్యత పటిష్టంగా ఉండేందుకు మద్దతునిస్తున్నట్టు వివరించింది. టాప్–50 కంపెనీలు లాభదాయకత, నగదు ప్రవాహం, బ్యాలన్స్ షీటు పరంగా గత ఐదేళ్లలో పనితీరు గణనీయంగా మెరుగైనట్టు పేర్కొంది. టాప్–50లో 62 శాతం కంపెనీల లాభాల మార్జిన్ 2024–25లో గరిష్టానికి చేరినట్టు వివరించింది. -
ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఇవి ఉండాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటివరకు ఫ్లాట్ను విక్రయించాలంటే క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్ వంటి ఆధునిక సదుపాయాలిస్తే చాలనుకునే వారు బిల్డర్లు. కానీ, ఇప్పుడలా కుదరదు. ఎందుకంటే కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆధునిక ఆస్పత్రి వంటివి కూడా ఉంటేనే ఫ్లాట్ కొంటామంటున్నారు. అవి కూడా ప్రాజెక్ట్ దగ్గర్లో కాదు ఏకంగా ప్రాజెక్ట్ ఆవరణలోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు బడిబాట పడుతున్నారు. ప్రాజెక్ట్ల్లో ఫ్లాట్లే కాదు పాఠశాల, ఆస్పత్రి వంటివి కూడా నిర్మిస్తున్నారు. నగరంలో ఈ తరహా నిర్మాణాలు క్రమంగా పెరుగుతున్నాయి.సొంతింటి ఎంపికలో విద్యాలయాలు, ఆస్పత్రులు కీలకంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్కు తమ పిల్లలు పంపించడం తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరీ ఎక్కువగా వర్షాకాలంలో బస్సుల కోసం వేచి చూడటం తల్లిదండ్రులకు చిరాకు కలిగిస్తోంది. పిల్లలు వర్షంలో తడవకుండా ఇంటి నుంచే నేరుగా పాఠశాలకు వెళ్లగలరా? హఠాత్తుగా అనారోగ్యం తలెత్తితే వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు వీలుగా ప్రాజెక్ట్లోనే ఆస్పత్రి ఉందా? వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. అందుకే ఫ్లాట్ను కొనేముందు క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ప్రాజెక్ట్ ఆవరణలోనే పాఠశాల, ఆస్పత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.శరవేగంగా అభివృద్ధి.. కొనుగోలుదారుల అభిరుచిలో వచ్చిన మార్పుతో ఆయా ప్రాజెక్ట్లు ఉండే ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఎలాగంటే కొనుగోలుదారుల కోసం, తమ వ్యాపారం కోసం తమ ప్రాజెక్ట్ ఆవరణలో పాఠశాలలు, ఆస్పత్రులు నెలకొల్పేందుకు బిల్డర్లు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని కంపెనీలైతే ప్లే స్కూళ్లు, రీసెర్చ్ సెంటర్లకూ ప్రాజెక్టుల్లోనే స్థానం కల్పిస్తాయి. దీంతో ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం విద్యాలయాలు, ఆస్పత్రులతో కళకళలాడతాయి. దీంతో దేశ, విదేశీ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ల వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆయా ప్రాంతాలు రియల్ బూమ్తో శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. -
అఫర్డబుల్ ఇళ్లు.. అబ్బే లాభం లేదండీ..
సామాన్యుడి సొంతింటి కల మరింత దూరమవుతోంది. అందుబాటు గృహాల నిర్మాణాలు తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పాటు డెవలపర్లు విలాసవంతమైన ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు కూడా సామాన్య, మధ్యతరగతి కోసం వేర్వేరు పథకాల ద్వారా సొంతింటి కలను నెరవేర్చేవి. కేంద్రం ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గృహరుణ ఆధారిత వడ్డీ సబ్సిడీతో కొనుగోలుదారులకు భారం తగ్గి ఈఎంఐ చెల్లింపుల్లో కొంత వెసులుబాటు లభించేది. ఎంఐజీ విభాగంలో 1,800 చ.అ. విస్తీర్ణం వరకు ఈ పథకం అమలు చేసినప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందారు. ఇప్పుడిది ఎల్ఐజీ వరకే పరిమితమైంది. దీంతో సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. - సాక్షి, సిటీబ్యూరోప్రైవేటీకరణ.. పట్టణాల్లో హౌసింగ్ బోర్డుల ఆధ్వర్వంలో గృహ నిర్మాణం చేపట్టినప్పుడు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని కాలనీలను నిర్మించేవారు. అధిక ఆదాయం, మధ్య, తక్కువ ఆదాయ వర్గాలుగా హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీగా విభజించి ఇళ్లు, స్థలాలను విక్రయించే పరిస్థితి ఉండేది. అయితే డిమాండ్కు అనుగుణంగా, కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టడంలో హౌసింగ్ బోర్డులు వెనకబడటంతో ప్రైవేట్ రంగం విజృంభించింది. మొదట్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న ఇళ్ల నిర్మాణం చేపట్టినా.. తర్వాత డిమాండ్ ఉన్న ప్రీమియం ఇళ్లవైపు వ్యవస్థీకృత రియల్ ఎస్టేట్ మొగ్గింది. భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో సరసమైన ధరల ప్రాజెక్టులు చేపట్టలేకపోతున్నామని.. విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం చేపడితే విక్రయాలు బాగుంటున్నాయని బిల్డర్లు అంటున్నారు.తగ్గిన కొనుగోలు శక్తి.. మధ్యతరగతి వర్గాల్లో అత్యధిక శాతం మంది గృహరుణం ద్వారానే ఇల్లు కొంటుంటారు. అధిక వడ్డీ రేట్లు, రుణ లభ్యత తగ్గిపోవడంతో సొంతింటి కల సవాల్గా మారింది. భూముల ధరలు పెరగడం.. ఆ మేరకు ఇంటి ధరలను పెంచాల్సి రావడంతో అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత తగ్గిపోయింది. బిల్డర్ ఎవరైనా ముందుకొచ్చి సరసమైన ధరల ఇళ్ల నిర్మాణం చేపడితే వాటిని విక్రయించడం పెద్ద సవాల్గా మారిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆయా వర్గాల్లో మేరకు కొనుగోలు శక్తి లేకపోవడమే దీనికి కారణం. అన్ని వనరులను సమీకరించుకుని కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. -
చేతులు మారుతున్న హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ
హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ ‘ప్రాప్టైగర్’ను కొనుగోలు చేస్తున్నట్టు ఆరమ్ ప్రాప్టెక్ లిమిటెడ్ ప్రకటించింది. రూ.86.45 కోట్ల విలువ మేర షేర్లను జారీ చేయడం ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన ఆర్ఈఏ గ్రూప్ నుంచి ప్రాప్టైగర్ను సొంతం చేసుకుంటున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఆర్ఈఏ ఇండియాకు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నట్టు స్టాక్ ఎక్స్చేంజ్లకు వెల్లడించింది.ప్రాప్టైగర్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 100 శాతం షేర్లను కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఒక్కోటీ రూ.5 ముఖ విలువ కలిగిన 42,42,537 షేర్లను ఆర్ఈఏ ఇండియాకు జారీ చేయనున్నట్టు వెల్లడించింది. షేర్ల జారీ అనంతరం ఆరమ్ ప్రాప్టెక్లో ఆర్ఈఏ ఇండియాకు 5.54 శాతం వాటా లభించనుంది.ప్రాప్టైగర్ నిర్వహణలో రియల్ ఎస్టేట్ ప్రకటనల పోర్టల్ అయిన హౌసింగ్ డాట్ కామ్ ఉండడం గమనార్హం. 2023–24లో హౌసింగ్ డాట్ కామ్ ఆదాయం రూ.101 కోట్లుగా ఉంది. ఆరమ్ ప్రాప్టెక్ రియల్ ఎస్టేట్ రంగానికి సాఫ్ట్వేర్, టెక్నాలజీ పరిష్కారాలను అందిస్తుంటుంది. -
500 ఫ్లాట్లు.. రూ .1,600 కోట్లు.. వారంలో ఫినిష్!
దేశ రాజధాని ప్రాంతంలో ప్రీమియం ఇళ్లకు ఎంత బలమైన డిమాండ్ ఉందో చెప్పేందుకు నిదర్శనం ఇది. రియాల్టీ సంస్థ కౌంటీ గ్రూప్ ఘజియాబాద్లోని ఒక ప్రాజెక్టులో 500 లగ్జరీ అపార్ట్మెంట్లను రూ .1,600 కోట్లకు విక్రయించింది. ఘజియాబాద్లోని ఎన్హెచ్ 24 వెంబడి ఉన్న ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 'జేడ్ కౌంటీ' మొదటి దశను గత వారమే కంపెనీ ప్రారంభించింది. మొత్తం 500 ఫ్లాట్లను రూ.1,600 కోట్లకు విక్రయించినట్లు కౌంటీ గ్రూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.ఫ్లాట్ల ధర రూ.2.5-6 కోట్లుగా నిర్ణయించారు. ప్రాజెక్టు మొదటి దశలో 1.5 మిలియన్ చదరపు అడుగుల అభివృద్ధి చేయదగిన ప్రాంతం ఉంది. 1,000 యూనిట్లతో కూడిన ఈ హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి రూ .1,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కౌంటీ గ్రూప్ ఈ ఏడాది జూన్లో తెలిపింది. మొత్తం ప్రాజెక్టు పరిమాణం 13.33 ఎకరాలు, అభివృద్ధి చేయదగిన విస్తీర్ణం 3 మిలియన్ చదరపు అడుగులు.వేవ్ గ్రూప్ కు చెందిన పెద్ద టౌన్ షిప్ 'వేవ్ సిటీ'లోని ఈ భూమిని రూ.400 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో లగ్జరీ గృహాలకు అధిక డిమాండ్, లొకేషన్ అడ్వాంటేజ్ కారణంగా తమ ప్రాజెక్టు మొదటి దశలో బలమైన అమ్మకాలు జరిగాయని కౌంటీ గ్రూప్ డైరెక్టర్ అమిత్ మోదీ తెలిపారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడంలో కంపెనీ ట్రాక్ రికార్డ్ కూడా అమ్మకాలకు దోహదపడిందని ఆయన అన్నారు.గ్రీన్ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని, 2030 నుంచి దశలవారీగా డెలివరీ చేస్తామని అమిత్ మోదీ చెప్పారు. కౌంటీ గ్రూప్ దాదాపు 18 మిలియన్ చదరపు అడుగుల నివాస స్థలాలను 10,000 కంటే ఎక్కువ కుటుంబాలకు అందించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో 20 మిలియన్ చదరపు అడుగులకు పైగా నివాస, వాణిజ్య స్థలాలను ఈ గ్రూప్ నిర్మిస్తోంది. -
రిటైల్ స్థలాల్లోనూ హైదరాబాద్ టాప్
హైదరాబాద్లో ఇళ్లు, కార్యాలయ స్థలాలకే కాదు రిటైల్ స్పేస్కు కూడా డిమాండ్ అధికంగానే ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)లో దేశంలోనే అత్యధిక రిటైల్ స్పేస్ లీజులు మన దగ్గరే ఎక్కువగా జరిగాయి. 2025 క్యూ2లో 8 లక్షల చ.అ. స్థల లావాదేవీలు పూర్తయ్యాయని, దీంతో కలిపి ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరం (హెచ్1)లో నగరంలో 15 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజులు జరిగాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. గతేడాది హెచ్1తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. 2027 నాటికి నగరంలోకి 28 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ సరఫరా అవుతుందని, ఇందులో వచ్చే రెండు త్రైమాసికాలంలో సుమారు 17 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ వినియోగంలోకి కూడా వస్తుందని అంచనా వేసింది. – సాక్షి, సిటీబ్యూరోఫుడ్ అండ్ బేవరేజెస్, ఫ్యాషన్..ఫుడ్ అండ్ బేవరేజెస్(ఎఫ్అండ్బీ) బ్రాండ్లు ఎక్కువగా రిటైల్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. ఈ విభాగం వాటా 34 శాతంగా ఉండగా.. ఫ్యాషన్ బ్రాండ్ల వాటా 14 శాతంగా ఉంది. ఈ క్యూ2లో కొత్తగా గ్రేడ్–ఏ మాల్స్ సరఫరా జరగకపోవడంతో మాల్స్లో వేకన్సీ రేట్ 1.85 శాతంగా ఉంది. ఇక, హై స్ట్రీట్ ప్రాంతాలలో రిటైల్ స్పేస్ అద్దెలకు ఆదరణ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూబ్లీహిల్స్ వంటి హై స్ట్రీట్లో అద్దెలు 13.6 శాతం మేర పెరిగాయి. అత్తాపూర్, మదీనాగూడ, చందానగర్ ప్రాంతాల్లోనూ రిటైల్ అద్దెలు ఆశాజనకంగానే వృద్ధి చెందుతున్నాయి.హాట్స్పాట్లుగా బాచుపల్లి, కొంపల్లిఈ ఏడాది రెండో త్రైమాసికం(క్యూ2)లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 22.4 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీలు పూర్తయ్యాయి. గతేడాది క్యూ2లో జరిగిన 23.9 లక్షల చ.అ. జరిగాయి. ఈ ఏడాది క్యూ1లో 23.7 లక్షల చ.అ.లు జరిగాయి. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హైస్ట్రీట్ ప్రాంతాలలో రిటైల్ స్పేస్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 89 శాతం లీజులు ఈ ప్రాంతాల్లోనే జరిగాయి. బాచుపల్లి, కొంపల్లి ప్రాంతాలు రిటైల్ స్పేస్కు హాట్ స్పాట్లుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్యూ2లో ఈ ప్రాంతాలలో 57 శాతం లీజులు జరిగాయి. అమీర్పేట, నిజాంపేట వంటి ప్రధాన ప్రాంతాలలో 43 శాతం రిటైల్ స్పేస్ లీజులు పూర్తయ్యాయి. -
హాట్కేకుల్లా అమ్ముడుపోయే ఫ్లాట్లు..
ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే.. పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు జరగాలంటే.. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో గృహ ప్రవేశం చేయాలంటే.. వీటిన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్టులు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్టులు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్టులకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్టులకు మరింత కలిసొచ్చే అంశం. – సాక్షి, సిటీబ్యూరోబడా ప్రాజెక్టులు నిర్మించాలంటే రూ.కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజెక్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్లు ప్రారంభించి అమ్మకాలు లేక బోర్డు తిప్పేసిన సంస్థలు అనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా.ఏడాదిలో గృహప్రవేశం.. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్ది పాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావడం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది.వసతులకు కొదవేంలేదు..గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాకింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్లతో పాటు స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లు ఉంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్లో ఉండే కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్వాసులందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
హైదరాబాద్లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..
హెచ్ఎండీఏ లే అవుట్ల్లో స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ సర్కార్ నుంచి అనుమతి లభించకపోవడంతో అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఆరు నెలల క్రితమే భూముల విక్రయం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆన్లైన్ బిడ్డింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అప్పట్లో రియల్ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొనడం వల్ల విరమించుకున్నారు. కొద్ది రోజులుగా ‘రియల్’ రంగంలో సానుకూల వాతావరణం నెలకొంది. ఇటీవల హౌసింగ్బోర్డు స్థలాల అమ్మకాలకు సముచితమైన స్పందన లభించింది. మరోవైపు నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణరంగం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ భూములకు సైతం డిమాండ్ బాగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొనుగోలుదారుల ఆసక్తి..ప్రైవేట్ వెంచర్ల కంటే హెచ్ఎండీఏ లే అవుట్లలో కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. రోడ్లు, పారిశుద్ధ్య, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించడం, ఎలాంటి వివాదాలు లేని స్థలాలు కావడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకుని సంపన్నులు, బిల్డర్లు, రియల్టర్లు తదితర అన్ని వర్గాలకు చెందిన వాళ్లు కూడా హెచ్ఎండీఏ భూములను, స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. గతంలో వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ విక్రయించిన స్థలాలకు భారీ ఎత్తున స్పందన లభించడమే ఇందుకు నిదర్శనం. కాలయాపన ఎందుకు.. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇన్ముల్నెర్వా, లేమూరు, కుర్మల్గూడ, తొర్రూరు, ప్రతాప్సింగారం తదితర ప్రాంతాల్లో స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని చోట్ల హెచ్ఎండీఏ సొంత స్థలాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేయగా, ప్రతాప్సింగారం, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేశారు. ఈ వెంచర్లలో రైతులకు 60 శాతం ప్లాట్లు కేటాయించగా చెందిన మిగతా 40 శాతం స్థలాల్లో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా స్థలాలను విక్రయించవచ్చు. ‘ప్రస్తుతం అన్ని విధాలుగా సానుకూలంగా ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటేనే కొనుగోలుదార్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తుంది’ అని హెచ్ఎండీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.బుద్వేల్, మోకిల వంటి చోట్ల గతంలో హెచ్ఎండీఏ స్థలాలకు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం అక్కడ ఇంకా కొన్ని స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కోకాపేట్లో ఎకరం రూ.వంద కోట్లకు అమ్ముడైంది. బుద్వేల్లోనూ భారీ ఆదాయం లభించింది. వివిధ ప్రాంతాల్లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశించే మధ్యతరగతి వర్గాలు సైతం హెచ్ఎండీఏ స్థలాలను కొనుగోలు చేశాయి.ఇదీ చదవండి: ‘జీఎస్టీ అమల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి’కాసులుంటేనే పరుగులు.. సికింద్రాబాద్ నుంచి డెయిరీఫాం, శామీర్పేట్ మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్లతో పాటు ఔటర్రింగ్రోడ్డు నుంచి రీజినల్ రింగ్రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. డెయిరీఫాం ఎలివేటెడ్కు, గ్రీన్ఫీల్డ్ రోడ్లకు టెండర్లు కూడా ఖరారయ్యాయి. దీంతో నిధుల కేటాయింపు హెచ్ఎండీఏకు ఒక సవాల్గా మారింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూములను, ప్లాట్లను విక్రయించడం వల్ల కనీసం రూ.5000 కోట్ల వరకు ఆర్జించే అవకాశం ఉంది. -
రియల్టీ కంపెనీలలో వాటా విక్రయం.. 2 కోట్ల షేర్లు అమ్మేసిన ఇన్వెస్కో
దేశీ రియల్టీ రంగ కంపెనీలు ఒబెరాయ్ రియల్టీ, లోధా డెవలపర్స్లో యూఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్కో తాజాగా 2 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఒబెరాయ్ రియల్టీలో 2.95 శాతం వాటాకు సమానమైన కోటికిపైగా షేర్లను అమ్మివేసింది.బీఎస్ఈ బల్క్డీల్ వివరాల ప్రకారం అనుబంధ సంస్థ ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ షేరుకి రూ. 1,754.26 ధరలో వీటిని విక్రయించింది. తద్వారా రూ. 1,883 కోట్లకు అందుకుంది. 2025 జూన్కల్లా ఇన్వెస్కో ఫండ్కు ఒబెరాయ్ రియల్టీలో 3.01 శాతం వాటా ఉంది. కాగా.. ఈ బాటలో లోధా డెవలపర్స్లోనూ 1 శాతం వాటాకు సమానమైన 95.25 లక్షల షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్డీల్ ప్రకారం షేరుకి రూ. 1384.93 ధరలో అమ్మివేయడం ద్వారా రూ. 1,319 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఎస్బీఐ ఫండ్ కొనుగోలు ఒబెరాయ్ రియల్టీలో 1.13% వాటాకు సమానమైన 40.94 లక్షల షేర్లను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సొంతం చేసుకుంది. షేరుకి రూ. 1,754.10 సగటు ధరలో రూ. 718.2 కోట్లకు కొనుగోలు చేసింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఇదేవిధంగా ఎన్ఎస్ ఈ గణాంకాల ప్రకారం లోధా డెవలపర్స్ షేర్ల కొనుగోలుదారుల వివరాలు సైతం వెల్లడికాలేదు. -
హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే తక్కువలో తక్కువ అరకోటి పెట్టాల్సిందే. ఇక ప్రైమ్ ఏరియాల్లో అయితే కోట్లాది రూపాయలు కుమ్మరించాల్సిందే. అయితే రూ.25 లక్షలకే 2 బీహెచ్కే అందుబాటులో ఉందంటే నమ్ముతారా.. అది కూడా వుడ్వర్క్తో! ఇదేతో ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కాదు. ప్రభుత్వమే స్వయంగా నిర్మించిన వెంచర్లోని ఫ్లాట్లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్.. పోచారం, బండ్లగూలో నిర్మించిన ఫ్లాట్లు మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయిస్తున్నామని తెలిపారు.విశాలమైన రోడ్లు, వెంటిలేషన్..ప్రభుత్వం నిర్మించిన సద్భావన టౌన్షిప్ నివాసానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వ కార్యదర్శి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం పోచారంలోని సద్భావన టౌన్షిప్ను ఆయన సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. టౌన్షిప్ను 30 ఎకరాల విస్తీర్ణంలో 60 శాతం ఖాళీ ప్రదేశాలు, విశాలమైన రోడ్లు, అన్ని వైపుల నుంచి వెంటిలేషన్, అవసరానికి మించిన సెట్బ్యాక్లతో అపార్ట్మెంట్లను నిర్మించామన్నారు.ఉడ్వర్క్తో రూ.13 లక్షలకే 1 బీహెచ్కే, రూ.25 లక్షలకే 2 బీహెచ్కే (2 BHK) అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం నిర్మించిన అపార్టుమెంట్లలోని ఫ్లాట్లలో కేవలం 10 శాతమే కామన్ ఏరియా ఉంటుందన్నారు.516 ఎస్ఎఫ్టీతో 1 బీహెచ్కే 255 ఫ్లాట్లు, 900 నుంచి 1000 ఎస్ఎఫ్టీ వరకు 2బీహెచ్కే ఫ్లాట్లు 350 అమ్మకానికి ఉన్నాయన్నారు. కొనుగోలుదారులకు బ్యాంకు రుణాలు మంజూరు చేస్తున్నాయన్నారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సి. భాస్కర్రెడ్డి, ఈఈ నరేందర్రెడ్డి, డీఈ వెంకట్రెడ్డి, ఏఈ అప్పలరాజు పాల్గొన్నారు. చదవండి: ఆ ఫ్లాట్ల కొనుగోలుకు హైదరాబాద్ వాసుల ఆసక్తి -
రూ.64 కోట్లతో లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు
మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ ఛైర్మన్ రంజన్ పాయ్ భార్య శ్రుతి పాయ్ బెంగళూరులోని జయమహల్ ఎక్స్టెన్షన్లో లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్మెంట్ను రూ.64 కోట్లకు కొనుగోలు చేశారు. ఈమేరకు జాప్కీకి అందిన డాక్యుమెంట్లు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ రియల్టీ డీల్ ఆ ప్రాంతంలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ లావాదేవీల్లో ఒకటిగా నిలిచింది. బెంగళూరు అల్ట్రా లగ్జరీ హౌసింగ్ మార్కెట్లో పెరుగుతున్న మార్పును ఇది హైలైట్ చేస్తుంది.ఒకప్పుడు స్టాండలోన్ బంగ్లాలు ఆధిపత్యం చెలాయించిన రూ.50 కోట్లకు పైగా ఉన్న ఈ విభాగంలో ఇప్పుడు ప్రీమియం అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరుగుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ బెంగళూరులో అత్యంత డిమాండ్ ఉన్న రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ల్లో ఒకటైన సవ్యసాచి సరయూలో శ్రుతి పాయ్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. 12,800 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా, 9,929 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో బాల్కనీలు, లిఫ్ట్ లాబీతో ఈ అపార్ట్మెంట్ విస్తరించి ఉంది. కార్పెట్ ఏరియాలో చదరపు అడుగుకు రూ.64,457, సూపర్ బిల్టప్ ఏరియాలో రూ.50,000 చొప్పున కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!2024లో బెంగళూరుకు చెందిన క్వెస్ కార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ ఐజాక్ బెంగళూరులోని బిలియనీర్ స్ట్రీట్ కోరమంగళ ప్రాంతంలో రూ.67.5 కోట్ల విలువైన 10,000 చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేశారు. మే నెలలో యూకేకు చెందిన మార్కెట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ సీఈఓ పరేష్ రాజా ఎంఐఏ ఎస్టేట్స్కు చెందిన 27 సమ్మిట్ ప్రాజెక్టులో లగ్జరీ పెంట్ హౌజ్ను రూ.54.38 కోట్లకు కొనుగోలు చేశారు. గత డిసెంబర్లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి బెంగళూరులోని కింగ్ ఫిషర్ టవర్స్లో రెండో లగ్జరీ అపార్ట్మెంట్ను రూ.50 కోట్లకు కొనుగోలు చేశారు. -
ముంబైలో అల్ట్రా లగ్జరీ ఇళ్ల జోరు
ముంబై నగరంలో లగ్జరీ ఇళ్లకు (రూ.10 కోట్లు, అంతకుమించిన బడ్జెట్లోనివి) డిమాండ్ బలంగా పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 20 శాతం పెరిగి రూ.14,751 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాల విలువ రూ.12,285 కోట్లుగా ఉండడం గమనార్హం.సంఖ్యా పరంగా చూస్తే అల్ట్రా లగ్జరీ ఇళ్ల విక్రయాలు 11 శాతం పెరిగి 692 యూనిట్లకు చేరాయి. ఈ వివరాలను ఇండియా సోథెబిస్ ఇంటర్నేషనల్ రియల్టీ (ఐఎస్ఐఆర్), సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్త నివేదిక వెల్లడించింది. కొత్తగా నిర్మించిన ఇళ్లు, మెరుగైన వసతులతో ఉన్న వాటికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రైమరీ మార్కెట్లో (మొదటిసారి విక్రయించే కొత్త ఇళ్లు) ఇళ్ల అమ్మకాలు 422 యూనిట్ల నుంచి 501 యూనిట్లకు పెరిగాయి. సెకండరీ మార్కెట్లో విక్రయాలు (రీసేల్) 200 యూనిట్ల నుంచి 191కు తగ్గాయి. ప్రైమరీ మార్కెట్లో అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాల విలువ రూ.8,752 కోట్ల నుంచి రూ.11,008 కోట్లకు పెరిగింది. సెకండరీ మార్కెట్లో అమ్మకాల విలువ రూ.3,533 కోట్ల నుంచి రూ.3,743 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: చందా కొచ్చర్పై ఆరోపణలు.. నిజం బట్టబయలు‘ముంబై లగ్జరీ ఇళ్ల మార్కెట్ కీలక తరుణంలో ఉంది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో రికార్డు స్థాయి అమ్మకాలు అల్ట్రా ప్రీమియం ఇళ్లకు ఉన్న డిమాండ్ను తెలియజేస్తోంది. ముఖ్యంగా వర్లి, ప్రభాదేవి, మలబార్ హిల్, బాంద్రా వెస్ట్ వంటి సూక్ష్మ మార్కెట్లలో డిమాండ్ ఎక్కువగా ఉంది’ అని ఐఎస్ఐఆర్ ఈడీ సుదర్శన్ శర్మ తెలిపారు. -
రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలా
దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో రూ.కోటిలోపు ధర కలిగిన అపార్ట్మెంట్ల (ఫ్లాట్లు) అమ్మకాలు 32 శాతం తగ్గిపోయాయి. ఇదే కాలంలో ప్రీమియం అపార్ట్మెంట్లలో అమ్మకాలు 5 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో 1,34,776 అపార్ట్మెంట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గాయి.రూ.కోటి ధరలోపు అపార్ట్మెంట్ల విక్రయాలు మాత్రం 32 శాతం తగ్గి 51,804 యూనిట్లుగా ఉన్నాయి. రూ.కోటికి పైన ధర శ్రేణిలోని అపార్ట్మెంట్ల అమ్మకాలు 6 శాతం పెరిగి 82,972 యూనిట్లుగా నమోదయ్యాయి. హైదరాబాద్తోపాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణె నగరాల్లో అమ్మకాలపై జేఎల్ఎల్ ఇండియా నివేదిక విడుదల చేసింది. అపార్ట్మెంట్ల గణాంకాలు మినహా విల్లాలు, రోహౌస్లు ఇతర ఇళ్ల విక్రయాలు ఇందులో లేవు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మొత్తం అపార్ట్మెంట్ల అమ్మకాల్లో రూ.కోటికి పైన ధరలోనివి (ప్రీమియం) 62 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి అమ్మకాలు మొత్తం విక్రయాల్లో 51 శాతంగా ఉన్నాయి. రూ.కోటిలోపు ఇళ్ల విక్రయాల వాటా 49 శాతం నుంచి 38 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: భద్రత తక్కువ.. ప్రచారం ఎక్కువపెరుగుతున్న కొనుగోలు సామర్థ్యం.. ‘లగ్జరీ ఇళ్ల అమ్మకాలు స్థిరంగా వృద్ధి చెందడం కొనుగోలు పెరుగుతున్న సామర్థ్యం, మెరుగైన జీవన ఆకాంక్షలకు నిదర్శనం. ప్రీమియం ప్రాపర్టీల పట్ల పెరుగుతున్న దృష్టి మాస్ హౌసింగ్ విభాగంలో కార్యకలాపాలకు ప్రాధాన్యం తగ్గుతోంది’ అని జేఎల్ఎల్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సమంతక్ దాస్ తెలిపారు. -
AP: 'రియల్' ఢమాల్!
రాజధాని నిర్మాణం పేరుతో 11 ఏళ్ల కిందట తీసుకున్న భూములకు సంబంధించిన రైతులకు ఇప్పటికీ ఇచ్చిన ప్లాట్లు కాగితాలపైనే ఉన్నాయి. ఎకరం పొలం తీసుకుని చేతిలో పెట్టిన 1,200 గజాలు కాగితాలకు కనీసం బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాడిపండు పడినట్లుగా మరో 45 వేల ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల రైతులకు ఇది మింగుడు పడటం లేదు. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడింది. కొత్తగా కొనేవారు లేక భూ లావాదేవీలు స్తంభించిపోయాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ, పెదకాకాని: రాజధాని ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు రూ. కోట్లకు పడగలెత్తుతాయని ఆశ, ఆరాటంతో ఓటు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో ఎకరం అమ్ముకొని సొమ్ము చేసుకొని వేరే ప్రాంతంలో భూమి కొనుగోలు చేద్దామని ఆశతో బేరం పెట్టారు. ఎకరం అమాంతంగా రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు అడుగుతుండటంతో అమ్మో అప్పుడే అమ్మితే ఎలా అని రోజుకో రకంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని చూస్తూ మురిసిపోతూ కాలం వెళ్లబుచ్చారు. ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. ఇక మరో రైతు ప్రభుదాసు తమవారు తరాలుగా కష్టపడి సంపాదించి ఇచ్చిన అర ఎకరం పొలం విక్రయిద్దామని బేరం పెట్టారు. రూ.3 కోట్లకు 1/3వ వంతు నగదు తీసుకొని 3 నెలల తరువాత రిజిస్ట్రేషన్ చేసుకుందామని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ డబ్బుతో మరో ప్రాంతానికి వెళ్లి ఎకరం రూ.35 లక్షల చొప్పున కొనుగోలు చేసి, అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇలా ఎందరో రైతులు రాజధాని ప్రాంతంలో తమ భూములను అమ్మకాలు, కొనుగోళ్ల సందడితో మురిసిపోయారు. కూటమి ప్రభుత్వం ఉన్నట్టుండి రెండు నెలల క్రితం అదనపు భూ సమీకరణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో రైతుల గుండెల్లో బాంబు పడినట్టైంది. ఒక్కసారిగా నిస్తేజం రెండో విడత భూ సమీకరణ పేరుతో అమరావతి, తుళ్ళూరు మండలాల్లో గ్రామ సభలు నిర్వహించిన ప్రభుత్వం తొలుత 45 వేల ఎకరాలను సమీకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. తదనంతరం సభలను విస్తరించి తాడికొండ మండలంలో కూడా చేపట్టడంతో రైతులు మండిపడ్డారు. ఉన్నట్టుండి విరుచుకుపడటంతో ప్రభుత్వం ఓ అడుగు వెనక్కేసింది. కానీ నిన్న మొన్నటి వరకు రూ. కోట్లలో పలికిన భూముల ధరలు మాత్రం ఆకాశం నుంచి కుప్పకూలిన చందంగా ఒక్కసారిగా పడిపోయాయి.అమ్ముకొని సొమ్ము చేసుకున్న రైతుల ఆనందం అంతా ఇంతా కానప్పటికీ అగ్రిమెంట్ల రూపంలో ఉన్న రైతులు, అప్పుల పాలై అమ్ముకుందామని ఎదురు చూస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడూ సందడిగా ఉండే రియల్ ఎస్టేట్ ఆఫీసులు వెలవెలబోతున్నాయి. అదే తరహాలో పెదకాకాని రిజి్రస్టార్ కార్యాలయంలో కూడా రిజి్రస్టేషన్ల సంఖ్య తగ్గిపోయింది. సొంత పార్టీ నేతల తిరుగుబాటు నిన్న మొన్నటి వరకు బ్రహ్మాండమైన రాజధాని నిర్మించి ప్రపంచంలోనే గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటూ ప్రగల్బాలు పలికిన సొంత పార్టీ నేతలే నేడు తిట్ల దండకం అందుకుంటున్నారు. బాబును నమ్మితే నట్టేట ముంచారని, నమ్ముకున్నవాడిని మోసం చేయడం అంటే ఇదేనని వాపోతున్నారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న భూముల్లో రాజధాని నిర్మిస్తే సరేసరి.. లేదంటే మరో ఉద్యమం తప్పదన్నారు. ఇప్పటికే భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు సైతం ఇవ్వలేదు, ఇచ్చిన వారికి ప్లాట్లు భౌతికంగా ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఇంకా రిజి్రస్టేషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. అభివృద్ధి చేసి 10 సంవత్సరాల్లో ప్లాట్లు తిరిగిస్తానన్న బాబు విదేశీ పర్యటనలు, అదనపు భూ సమీకరణ పేరుతో రైతులను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఏడాదిన్నర పూర్తయింది. రాజధానిలో ఏవేవో కడతానని చెప్పడం మినహా పునాదులను సైతం అడుగు కూడా పైకి లేపిన దాఖలాలే లేవు. అప్పు కూడా పుట్టక అవస్థలుఅదనపు భూ సమీకరణ ఊసు లేనప్పుడు రాజధాని ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రాంతాన్ని బట్టి గజం రూ.40 వేలు నుంచి రూ.80 వేలు పలికిన భూముల ధరలు ఇప్పుడు కొనేందుకు వ్యాపారులు, ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఆ భూమిని కనీసం బ్యాంకులో అయినా తనఖా పెట్టుకొని అప్పు తీసుకుందామా అంటే అధికారులు ఒప్పుకోవడం లేదు. దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో తుళ్ళూరు రాజధాని ఉంటే పెదకాకాని మండల శివారులో ఉన్న మంగళగిరి రూరల్ మండలం కాజ, తాడికొండ మండలంలోని కంతేరు గ్రామం వరకూ భూములు సేకరిస్తారని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కనీసం తమ అవసరానికి కూడా విక్రయించలేక పోతున్నామని, ఎక్కడా అప్పు కూడా పుట్టడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వ్యాపార ధోరణి విడనాడి స్పష్టమైన విధానం ప్రకటించాలని వారు కోరుతున్నారు.కొనేవారు రావడం లేదుభూములు కొనుగోలు చేసే వారు రావడం లేదు. ప్రభుత్వం మళ్లీ భూ సమీకరణ ప్రకటన చేసినప్పటి నుంచి వ్యాపారాలు సాగడం లేదు. పదేళ్లుగా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. గతంలో ప్లాట్లు, పొలాలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి చుట్టు పక్కల ప్రాంతాల్లో చూపించేవారం. అందుకు ప్రతిఫలంగా వారు కమీషన్ ఇచ్చేవారు. కొనేవారు ఇప్పుడు రాకపోవడంతో వ్యాపారాలు నిలిచిపోయాయి. – షేక్ మస్తాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెదకాకానిస్థిరాస్తి రంగం కుదేలుకూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో మళ్లీ భూములు సమీకరిస్తుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. అమ్మేవారు సిద్ధంగా ఉన్నప్పటికీ కొనేవారు లేకపోవడంతో వ్యాపారం ఆగిపోయింది. నెల రోజులకు ముందు చేసుకున్న అగ్రిమెంట్లు మాత్రమే రిజ్రస్టేషన్లు అవుతున్నాయి. ఈ నెలలో ఒక్క బేరం కూడా జరగలేదు. భూములు కావాలని వచ్చేవారు తగ్గిపోయారు. ప్రభుత్వం భూ సమీకరణపై స్పష్టత ఇవ్వాలి. – పాటిబండ్ల సంగీతరావు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెదకాకాని -
బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్!
బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) 2024 సెప్టెంబర్ వరకు జారీ చేసిన బీ-ఖాతా ఆస్తుల క్రమబద్ధీకరణకు కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చర్య వల్ల ఆయా ఆస్తులను తర్వాత ఏ-ఖాతాకు అప్గ్రేడ్ చేసుకునేందుకు వీలవుతుంది. ప్రభుత్వ చర్యలతో ఆస్తుల యజమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న చట్టపరమైన స్పష్టత రానుందని భావిస్తున్నారు.‘ఆస్తులకు బీ-ఖాతా ధ్రువపత్రాలు ఇచ్చేటప్పుడు కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తాం. ఆస్తి యజమానులు ప్రమాణాలను పాటిస్తే బీ-ఖాతా జారీ చేస్తారు. తర్వాత పక్కా డాక్యుమెంట్లతో ఏ-ఖాతాకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కొన్ని లోపాలున్న ఆస్తులకు పరిమిత మినహాయింపులతో బీ-ఖాతా సర్టిఫికెట్లు జారీ చేస్తాం’ అని న్యాయ మంత్రి హెచ్కే పాటిల్ కేబినెట్ సమావేశంలో తెలిపారు. క్రమబద్ధీకరించిన తర్వాత బీ-ఖాతా ఆస్తి యజమానులకు చట్టపరమైన హోదా దక్కుతుంది. గతంలో అనుమతించని అమ్మకాలు, బ్యాంకు రుణాలు, తనఖాలకు వీలు కల్పించేలా ఏ-ఖాతాకు అప్గ్రేడ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.బీ-ఖాతా అంటే ఏమిటి?బీ-ఖాతా అనేది చట్టపరమైన, ప్రణాళికా నిబంధనలను పూర్తిగా పాటించని ఆస్తుల కోసం బీబీఎంపీ నిర్వహించే ఒక రకమైన ఆస్తి రికార్డు. వీటిలో అనధికార లేఅవుట్లలోని భవనాలు, అనుమతి లేని నిర్మాణాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేనివి ఉన్నాయి. ఈ ఆస్తులు పూర్తిగా చట్టబద్ధం కానప్పటికీ యజమానులు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాల కోసం వారి వివరాలను నమోదు చేయాలి. ఇప్పటివరకు ఇలాంటి లోపాలున్న ఆస్తులు పూర్తిగా చట్టబద్ధమైనవిగా పరిగణించబడలేదు. అమ్మకం, భవన అనుమతులు పొందడం లేదా ట్రేడ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆంక్షలు ఎదురయ్యేవి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణంగా వాటిపై రుణాలు ఇవ్వవు. స్థానిక చట్టాలకు పూర్తిగా అనుగుణంగా ఉండే ఏ-ఖాతా ప్రాపర్టీలతో పోలిస్తే, బీ-ఖాతా ఆస్తులు సాధారణంగా తక్కువ మార్కెట్ విలువ, పరిమిత చట్టపరమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు.ఇదీ చదవండి: ‘డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు దుబాయ్ వెళ్లింది’అనధికారిక నిర్మాణాలు, ప్రణాళికారహిత అభివృద్ధి బీ-ఖాతాల సమస్యకు దారితీసింది. వీటిని నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్నోట్లో పేర్కొంది. కర్ణాటక టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చట్టం నియంత్రణ పరిధిలోకి బీ-ఖాతా ఆస్తులను తీసుకురావాలనే డిమాండ్ ఉంది. 2024 సెప్టెంబర్ 30 తర్వాత సృష్టించిన లేదా నిర్మించిన అనధికారిక ఆస్తులకు బీ-ఖాతా జారీ చేయడాన్ని గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ చట్టం నిషేధించింది. బీ-ఖాతా అనే భావనను 2009లో ప్రవేశపెట్టారని, అందువల్ల 2009కి ముందు జారీ చేసిన అన్ని ఖతాలు ఏ-ఖాతాలేనని తెలిపింది.గృహ కొనుగోలుదారులకు ప్రయోజనంక్రమబద్ధీకరించిన తర్వాత బీ-ఖాతా ఆస్తి యజమానులకు చట్టపరమైన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని న్యాయవాది ఆకాశ్ బంటియా తెలిపారు. ఈ చట్టపరమైన స్పష్టత వారి ఆస్తులను తాకట్టు పెట్టడానికి, బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుందని చెప్పారు. ఈ క్రమబద్ధీకరణ చర్య యాజమానికి అధికారిక రుజువుగా కూడా పనిచేస్తుందన్నారు. దీంతో వేలాది మంది నివాసితులకు దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుందని తెలిపారు. -
రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే..
సాక్షి, సిటీబ్యూరో: శ్రావణ మాసం వస్తుందంటే చాలు శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. వరుస పండగలతో సందడి నెలకొంటుంది. ఈ ఆనందాన్ని రంగులమయం చేస్తే ఇంటి అందం ద్విగుణీకృతమవుతుంది. అయితే ఇంటికి రంగులు వేయించడం అందరికీ కుదరక పోవచ్చు. మరెలా? రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే శుభ్రం చేయడం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. హడావుడి లేకుండానే ఓ పద్ధతి ప్రకారం ఇంటిని అలంకరించుకోవాలి.ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే.. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూస్ బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక ఫ్లోరింగ్ మెరిసిపోతుంది.కార్పెట్లు: ఇవి దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. తరచూ వ్యాక్యుమ్ క్లీనర్తో శుభ్రంచేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్ కళావిహీనంగా కన్పించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్ను కలిపి బ్రష్తో రుద్దితే కార్పెట్లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తేనె సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరకలు తొలగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యుమ్ క్లీనర్తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి.గోడలు: గోడలను తరచూ స్టాటిక్ డస్టర్తో తుడవాలి. ఎక్కడైనా బూజు, సాలెగూడు వంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జెంట్లతో శుభ్రం చేయాలి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయవద్దు.మైక్రోఓవెన్: కొందరు మైక్రోఓవెన్ను అధికంగా వాడుతుంటారు. దీంతో ఇది ఎక్కువగా మురికి పడుతుంటుంది. దీనిని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనీర్ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడిచేయాలి. గట్టిగా ఉండే ఆహార పదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి.వంటింట్లో: బాత్ఫిట్టింగ్ల దగ్గర నుంచి ఫర్నిచర్ల వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్కే పరిమితం కాకుండా పైన క్రోమ్పూతతో వస్తున్నాయిప్పుడు. స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కాహాల్తో తుడవాలి. నల్లాపై ఏర్పడే మరకల్ని టూత్పేస్టుతో తుడవడం వల్ల తొలగించవచ్చు. వంటింట్లో సింక్ పరిశుభ్రంగా కనిపించాలంటే నాలుగు భాగాల ఉప్పుకు ఒక భాగం వెనిగర్ను కలిపి ప్రయత్నించండి. -
అబ్బా.. ఇంటికి ఏముంది ఎలివేషన్!
గతంలో ఇల్లు అంటే నాలుగు గోడలుండే నిర్మాణం. కానీ, ఇప్పుడు ఇల్లంటే ఓ హోదా.. హుందా! ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు సొంతింటివాసులు. నిర్మాణ సంస్థలూ తక్కువేం కాదు.. సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో కనిపించే విభిన్న తరహా నిర్మాణాలను భాగ్యనగరంలో నిర్మించేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎలివేషన్స్ నుంచే సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టేస్తున్నారు. పడవ ఆకారంలో ఎలివేషన్, ఎలివేషన్లోనే వర్టికల్ గార్డెన్ ఏర్పాటు వంటివి ఈ జాబితాలోనివే మరి!! – సాక్షి, సిటీబ్యూరోపిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణాలుండాలి. మూస ధోరణిలో నిర్మించే ప్రాజెక్ట్లను ప్రజలు ఆదరించట్లేదు. విదేశీ తరహాలో నిర్మాణం.. అన్ని రకాల వసతులు.. అదీ అందుబాటు ధరల్లో ఉండే ప్రాజెక్టులు అంటే కస్టమర్లు జై కొడుతున్నారు. దీంతో విదేశాల్లో కనిపించే విభిన్న నిర్మాణాలు ఇప్పుడు భాగ్యనగరంలోనూ కనిపిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించడం కోసం విభిన్న ప్రాజెక్ట్ల నిర్మాణంలో సంస్థల మధ్య పోటీ పెరిగి భాగ్యనగరం హంగులు అద్దుకుంటోంది.ఎలివేషన్లలో వర్టికల్ గార్డెన్..రిసార్ట్, విల్లాల్లో విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. అందుకే చుట్టూ పచ్చదనంతో ల్యాండ్ స్కేపింగ్ చేస్తారు. కానీ, అపార్ట్మెంట్స్లో.. అది కూడా స్థలాల లభ్యత తక్కువగా ఉండే మహానగరాల్లో కాసింత కష్టమే. దీనికి పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది నిలువైన ఉద్యానవనాలు(వర్టికల్ గార్డెన్స్).భవనాల ఎలివేషన్లలో నిలువుగా మొక్కలు పెంచడం వర్టికల్ గార్డెన్స్ ప్రత్యేకత. అయితే ఇవి ఎలివేషన్, బయటి గోడల మీదనే సాధ్యమవుతాయి. ఎండ పడని ప్రాంతంలో అంటే ఇంట్లో, హాల్లో, బెడ్ రూమ్లో వర్టికల్ గార్డెన్స్ను పెంచడం కుదరదు. ఇక్కడ పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. సూర్యరశ్మి పడే ప్రాంతమైతే వర్టికల్ గార్డెన్స్లో కూరగాయలు, ఆకుకూరలు కూడా పెంచుకునే వీలు కూడా ఉంటుంది.ఖర్చు ఎక్కువే..సాధారణ భవనాలతో పోలిస్తే వరి్టకల్ గార్డెన్స్ భవనాల ధర చ.అ.కు రూ.100–200 అధికంగా ఖర్చవుతుంది. అయినా సరే బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. కస్టమర్లకు ఏదో నాలుగు గోడలుండే ఇంటిని అందించాలని కాకుండా వారి ఇంటిని అందంగా.. ఆరోగ్యకరంగా బృందావనంగా తీర్చిదిద్దుతున్నారు. వర్టికల్ గార్డెన్స్ భవనాలు పర్యావరణహితంగా ఉంటాయి. శబ్ధ, వాయు కాలుష్యం తక్కువగా ఉండటంతో పాటు ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. భవనం గోడలు, పిల్లర్లను ఆధారం చేసుకొని బయోలాజికల్ ఎరువులతో పెంచడం వల్ల భవనం చల్లగా ఉంటుంది.పిల్లలే లక్ష్యంగా..ఇంటి కొనుగోళ్లలో పిల్లల అభిరుచులకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే పిల్లల అభిరుచులకు అనుగుణంగా విదేశీ ఆర్కిటెక్చర్లతో ప్రాజెక్ట్లను డిజైన్ చేయిస్తున్నారు బిల్డర్లు. ఇందుకోసం ప్రాజెక్ట్ ఎలివేషన్ దగ్గర నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విశాలమైన ఆట స్థలాలు, వినూత్నమైన ఎలివేషన్లతోనే పిల్లల్ని ఆకట్టుకుంటే.. ప్రాజెక్ట్లోనే పాఠశాలలు, ఆస్పత్రుల వంటి ఏర్పాటుతో తల్లిదండ్రులనూ కట్టిపడేస్తున్నారు.అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్కు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్, స్విమ్మిగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాకుండా ఇందులోనే పాఠశాల, ఆస్పత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్ట్లో క్లబ్హౌజ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి వసతులు కల్పించాలంటే కొంత స్థలాన్ని కేటాయిస్తారు. అలా కాకుండా ఎలివేషన్కు కేటాయించే స్థలంలో ఈ వసతులను కల్పిస్తే.. స్థలం వినియోగంతో పాటు ఫ్లాట్ల విస్తీర్ణమూ పెరుగుతుంది. -
మాల్స్లో ఆఫీసులు.. తక్కువ అద్దెలు
మాల్స్, స్టార్ హోటల్స్.. తినడానికో లేదా షాపింగ్ కేంద్రాలుగానే కాదు ఆఫీసు కేంద్రాలుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్ స్పేస్ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు ఇప్పుడు షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్ వసతులూ ఉంటేనే కంపెనీలు స్వాగతిస్తుండటంతో కో–వర్కింగ్ సంస్థలు మాల్స్, హోటళ్ల వైపు దృష్టిసారించాయి. – సాక్షి, సిటీబ్యూరోదశాబ్దం కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో మార్పు వచ్చింది. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతి వంటి వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడిని తగ్గిస్తుందని, దీంతో మరింత క్రియేటివిటీ బయటకొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది. ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్ స్పేస్ భర్తీ చేస్తుండటంతో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలూ కో–వర్కింగ్ స్పేస్లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.గంట, రోజు, నెల వారీగా చార్జీలు..ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులు ఉండటాన్ని కో–వర్కింగ్ స్పేస్ అంటారు. ఇక్కడ వ్యాపారం ఎవరిది వారిదే, ఎవరి ప్రమాణాలు వారివే. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్ ఆఫీసు, ఫిక్స్డ్ డెస్క్లు, సమావేశ గది, క్యాబిన్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. వీటితో పాటూ ప్రత్యేకంగా బహుళ జాతి కంపెనీలకు ఉండే కొరియర్ సర్వీస్, ఫుడ్, లాంజ్, ఎల్సీడీ, పార్కింగ్, ప్రింటర్, ప్రొజెక్టర్, వైఫై వంటి అన్ని రకాల ఆధునిక వసతుంటాయి. కో–వర్కింగ్ కార్యాలయాల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి. నగరంలో నెలకు రూ.8 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్రాంగూడ, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో కో–వర్కింగ్ ఆఫీసులున్నాయి.అద్దెలు 25 శాతం వరకు తక్కువఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్లోనే స్పేస్ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతుంది. ఇదే కో–వర్కింగ్ డిమాండ్కు ప్రధాన కారణం. గ్రీడ్–ఏ ఆఫీస్ స్పేస్తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్లో అద్దెలు 25 శాతం వరకు తక్కువ ఉంటాయి. సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్లో ఒక్కో సీటుకు 5–15 శాతం స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది. -
వీకెండ్ ఫామ్హౌస్.. ఫుల్ డిమాండ్
ఆఫీసులో పని ఒత్తిడి ఒక ఎత్తయితే.. ట్రాఫిక్ సంద్రాన్ని ఈదుకుంటూ వెళ్లడం మరొక ఎత్తు. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ప్రతిరోజూ ఛేదించుకుంటూ వెళ్లే నగరవాసి కనీసం వారాంతంలోనైనా కుటుంబం, స్నేహితులతో స్వచ్ఛమైన ఆహ్లాదకర వాతావరణంలో గడపాలని కోరుకుంటున్నాడు. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే ఫామ్ హౌస్లు నిర్మితమవుతున్నాయి. గతంలో ఫామ్హౌస్ల కోసం కేవలం సంపన్న వర్గాలు మాత్రమే మొగ్గు చూపేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి సామాన్య, మధ్యతరగతి సైతం వ్యవసాయ క్షేత్రాలకు ఆసక్తి చూపిస్తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకొందరు 200 నుంచి వెయ్యి గజాల్లోపు భూమిని కొనుగోలు సాదాసీదాగా ఫామ్హౌస్లను నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లే అవుట్లలో స్థలాలను కొని బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.ఔటర్ వెలుపలే..నగరం ఓఆర్ఆర్ వరకు విస్తరించింది. చేవెళ్ల, వికారాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, శామీర్పేట, భువనగిరి, శంషాబాద్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లోని వీకెండ్ హోమ్స్కు ఆదరణ ఎక్కువగా ఉంది. భూముల ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ.. వాతావరణం బాగుంటుందని, భవిష్యత్తులో ఆస్తిని విక్రయిస్తే మంచి ధర పలుకుతుందనే విశ్వాసంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకుకూరలు, పండ్ల చెట్లను పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తిని పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు.బిల్డర్లు కూడా..రియల్ ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. వారాంతాల్లో విడిది చేసేలా సకల సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నారు. కొందరు తమ ఇళ్లను మిగతా సమయంలో కమ్యూనిటీ నిర్వహణ సంస్థలకే అద్దెకు ఇస్తున్నారు. కమ్యూనిటీల్లోని సభ్యులు చిన్న వేడుకలను ఇక్కడ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతర ఇళ్లను ఒకటి రెండు రోజులకు అద్దెకు తీసుకుంటున్నారు. ఈ రకంగా ఖాళీగా ఉండకుండా ఆదాయం వస్తుండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. -
కొత్తిల్లు కొందామా.. పాతిల్లు చూద్దామా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. అయితే గృహ కొనుగోలు నిర్ణయం అంత తేలికైందేమీ కాదు. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే బడ్జెట్, నిర్మాణ నాణ్యత, నిర్మాణ సంస్థ నేపథ్యం, కొనుగోలుదారుడి అవసరాల వరకూ ప్రతి ఒక్కటీ ప్రధానమైందే. సమాజంలో గుర్తింపు కోసం కొందరు ఇల్లు కొంటే.. మరికొందరేమో పెట్టుబడి కోసం, ట్యాక్స్ నుంచి మినహాయింపుల కోసం కొంటుంటారు. కారణాలేవైనా ఇల్లు కొనడమనేది ఓ నిరంతర ప్రక్రియ. మరి, ఎలాంటి ఇల్లు కొంటే సొంతింటి యోగం మరింత తేలికవుతుంది? అంటే కొత్త ఇల్లు కొనడమా? లేక సెకండ్ హ్యాండ్ ఇల్లు బెటరా? అని! – సాక్షి, సిటీబ్యూరోదేశంలో కొత్త గృహాలకు డిమాండ్ ఎంత ఉందో రీసేల్ లేక సెకండ్ హ్యాండ్ ఇళ్లకూ అంతే ఉంది. కొత్త ఇల్లు నేరుగా డెవలపర్ నుంచి కొనుగోలు చేస్తే.. రీసేల్ ప్రాపర్టీలను పాత యజమాని నుంచి కొనుగోలు చేస్తాం. కొత్త లేక పాత ప్రాపర్టీ ఏదైనా కానీ ఎంపికలో ప్రధానమైంది బడ్జెట్. దీంతో పాటూ మన జీవన శైలి, అవసరాలు, అభిరుచులు, ఇంటీరియర్, ఇంధన సామర్థ్యాలు వంటివి కూడా ప్రాపర్టీ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.ప్రధాన నగరంలో సెకండ్సే బెటర్..ఇల్లు కొనుగోలు చేసిన వారెవరైనా సరే ఎప్పటికీ ఒకే ఇంట్లో ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు గానీ ఉద్యోగ రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గానీ ఆర్థిక అవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకుంటారు. విద్యా, వైద్యం, వినోదం ఇతర అవసరాలకు రోజూ ప్రధాన నగరంతో అనుబంధం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొత్త గృహాలు దొరకడం కొంత కష్టం. ఒకవేళ దొరికినా ధర ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లో సెకండ్ హ్యాండ్ ఇల్లును కొనుగోలు చేయడం బెటర్. అవసరమైతే దాన్ని కూల్చేసి మన అవసరాలు, బడ్జెట్కు తగ్గట్టు మళ్లీ కొత్త గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఇది కొంత డబ్బు, సమయంతో ముడిపడి ఉన్న అంశం. అందుకే ప్రధాన నగరంలో, అభివృద్ధి చెందిన ప్రాంతంలో రీసెల్ ప్రాపర్టీలను ఎంచుకోవటమే ఉత్తమమనేది నిపుణుల సూచన.రీసేల్ కొనేముందు..రీసేల్ ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పాత యజమాని నేపథ్యం, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, టైటిల్, అనుమతి పత్రాలు, గృహ రుణానికి సంబంధించిన పత్రాలు వంటి వాటిని స్వయంగా పరిశీలించుకోవాలి. ఏమాత్రం అవగాహన లేకపోయినా లేక తప్పిందం జరిగినా సరే మొదటికే మోసం వస్తుంది. అదే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే ఈ ప్రక్రియంతా డెవలపరే పూర్తి చేసేస్తాడు.పాత ఇళ్లలో ఎలక్ట్రిక్ వైర్లు, ఉపకరణాలు, బాత్రూమ్ ఫిట్టింగ్స్ వంటి వాటిల్లో సమస్య వస్తుంటుంది. అదే కొత్త గృహాల్లో బ్రాండెండ్, నాణ్యమైన ఉత్పత్తుల వినియోగంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. పైగా పాత ఇళ్లలో వాస్తు మార్పులు, గదుల్లో చిన్న చిన్న మార్పులు చేయాలంటే ఇబ్బందులుంటాయి. అదే కొత్త గృహాల్లో నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే డెవలపర్కు మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణంలో మార్పులు చేసుకునే వీలుంటుంది.శివారు ప్రాంతాల్లో కొత్త ఇళ్ల ధరలు తక్కువకొత్త గృహాలతో పోలిస్తే రీసేల్ ప్రాపర్టీలు కొంత తక్కువ ధరకే లభ్యమవుతాయి. కానీ, రిజి్రస్టేషన్ ఫీజు, ప్రాపర్టీ బదిలీ రుసుము, వినియోగ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. పైగా సెకండ్ హ్యాండ్ హోమ్స్ నిర్వహణ భారం ఎక్కువగా ఉంటుంది. పైగా మన అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఇంటిని రిపేర్ చేయించాల్సి ఉంటుంది. ఆయా ఖర్చులన్నింటినీ కలిపి చూస్తే మాత్రం రీసేల్ ప్రాపర్టీ కంటే అభివృద్ధి చెందే ప్రాంతంలో, శివారు ప్రాంతంలోని కొత్త గృహాల ధరలే తక్కువగా ఉంటాయి.పర్యావరణం స్పృహ, ఇంధన నిర్వహణ సామర్థ్యాలు, కరెంట్ బిల్లుల మీద అవగాహన ఉంటే మాత్రం కొత్త ఇల్లు కొనడమే ఉత్తమం. ఎందుకంటే కొత్త గృహాలు ఎనర్జీ ఎఫీషియన్సీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇంట్లోనే ఉపకరణాలతో పాటూ గోడలు, పైకప్పులు, కిటికీలు, తలుపులు కూడా ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. దీంతో విద్యుత్ బిల్లు తక్కువగా రావటంతో పాటూ నిర్వహణ వ్యయం కూడా తక్కువ అవుతుంది. రీసేల్ ప్రాపర్టీలను కూడా ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చవచ్చు. కానీ, ఆయా పాత గృహాలు దశాబ్ధాల క్రితం నాటి ప్రమాణాలను అనుగుణంగా నిర్మితమైనవి. వాటిని ఇప్పటి ప్రమాణాలను అనుగుణంగా మార్చాలంటే ఖర్చు ఎక్కువవుతుంది. కొత్త ఇళ్లలో గాలి, వెలుతురు బాగా వస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. -
భారత రియల్టీ మార్కెట్పై కేకేఆర్ కన్ను
గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ అండ్ కో ఇంక్ భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించింది. అభివృద్ధి చెందుతున్న ఈ మార్కెట్లో భారత్ను వ్యూహాత్మక పెట్టుబడికి గమ్యస్థానంగా గుర్తించినట్లు కేకేఆర్ తెలిపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న స్థిరాస్తి రంగంలో పెరుగుతున్న ఆసక్తిని ఇది హైలైట్ చేస్తుంది.ప్రపంచ అస్థిరతల మధ్య కూడా దేశ ఆర్థిక అభివృద్ధి, విధానాలు, వినియోగదారుల ఆసక్తి మెరుగ్గాఉందని ఎత్తిచూపుతూ, ఎమర్జింగ్ మార్కెట్లలో భారత్ వ్యూహాత్మకంగా నిలుస్తుందని సంస్థ పేర్కొంది. రూపాయిలో స్వల్ప క్షీణతను కేకేఆర్ అంచనా వేసినప్పటికీ, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపింది. మార్చి 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కేకేఆర్ 664 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. రియల్టీ పరంగా చైనాలో కల్లోల పరిస్థితులున్నాయని, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో స్తబ్దత నెలకొందని కంపెనీ చెప్పింది. భారత్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపింది.ఇదీ చదవండి: భారత్లోకి యూఎస్ జన్యుమార్పిడి పంటలు ఎంట్రీ?భారతదేశం, జపాన్, ఆగ్నేయాసియాతో సహా ఆసియా రియల్ ఎస్టేట్ మార్కెట్లలో అభివృద్ధికి అవకాశాలను చూస్తున్నామని కేకేఆర్ తాజా సమీక్షలో పేర్కొంది. నిర్మాణాత్మక వృద్ధి, మార్కెట్ ఒడిదుడుకులు కలిసే ఆసియా రియల్ ఎస్టేట్ను అధిక రాబడికి అవకాశంగా చూస్తున్నట్లు తెలిపింది. ఈ-కామర్స్ వృద్ధి, డేటా సెంటర్ల విస్తరణ, సప్లై చెయిన్ ఆధునీకరణ వంటి విస్తృత అంశాలకు అనుగుణంగా లాజిస్టిక్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భారత్లో ఆకర్షణీయ విభాగాలుగా గుర్తించినట్లు కూడా పేర్కొంది. -
ప్లాట్లకు గిరాకీ...
న్యూఢిల్లీ: కరోనా అనంతరం ఇళ్ల స్థలాలకు గిరాకీ పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా రూ.2.44 లక్షల కోట్ల విలువైన ప్లాట్లను గత మూడేళ్లలో ఆవిష్కరించినట్టు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. 2022 జనవరి నుంచి 2025 మే మధ్యకాలంలో దేశంలోని అగ్రగామి టాప్–1, 2 నగరాల్లో 4.7 లక్షల ఇళ్ల ప్లాట్లతో కూడిన ప్రాజెక్టులను డెవలపర్లు ప్రారంభించినట్టు వెల్లడించింది. హైదరాబాద్, ఇందోర్, బెంగళూరు, చెన్నై, నాగ్పూర్, జైపూర్, కోయింబత్తూర్, మైసూరు, రాయిపూర్, సూరత్ నగరాల గణాంకాలతో ప్రాప్ ఈక్విటీ నివేదికను విడుదల చేసింది. అపార్ట్మెంట్లతో పోల్చినప్పుడు పెట్టుబడి విలువలో అధిక వృద్ధికి తోడు లిక్విడిటీ మెరుగ్గా ఉండడం (వేగంగా విక్రయించుకునే వెసులుబాటు)తో ఇళ్ల ప్లాట్లకు డిమాండ్ పెరిగినట్టు ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. తమకు నచి్చన విధంగా ఇంటిని నిర్మించుకోవాలన్న దృష్టితో కస్టమర్లు ప్లాట్లకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. తగ్గిన సరఫరా ఒకవైపు ప్లాట్లకు డిమాండ్ నెలకొనగా, మరోవైపు 2024లో వీటి సరఫరా తగ్గడం గమనార్హం. ఈ 10 నగరాల్లో సరఫరా 2024లో 1,26,556 ప్లాట్లుగా ఉంది. 2023లో సరఫరా 1,63,529 ప్లాట్లుగా ఉంది. ఇక ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో (జనవరి–మే) 45,591 ఇళ్ల ప్లాట్లను డెవలపర్లు ప్రారంభించినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. ‘‘డెవలపర్లకు ప్లాట్లు వేగంగా అమ్ముడుపోతాయి. వేగంగా నగదు చేతికి అందుతుంది. అపార్ట్మెంట్లతో పోల్చితే పెట్టుబడి అవసరం కూడా తక్కువే’’అని ఈ నివేదిక వివరించింది. పది నగరాల్లో చదరపు అడుగు ధర 2024లో రూ.3,679గా ఉంది. అంటే చదరపు గజం రూ.33,111గా ఉన్నట్టు. ఈ నివేదికపై స్టోన్క్రాఫ్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎండీ అయిన కీర్తి చిలుకూరి స్పందిస్తూ.. దేవవ్యాప్తంగా ప్లాట్ల అభివృద్ధి పుంజుకోవడం అన్నది సొంతంగా ఇళ్లు కలిగి ఉండాలన్న ఆకాంక్ష పెరిగినట్టు సూచిస్తోందన్నారు. -
ఇళ్ల అమ్మకాలకు ధరల సెగ!
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో పడిపోయాయి. ధరల పెరగుదల ప్రభావం విక్రయాలపై చూపించింది. 11,513 యూనిట్ల అమ్మకాలు హైదరాబాద్లో నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే మూడు నెలల్లో అమ్మకాలు 11,065 యూనిట్లుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లోనూ ఇళ్ల అమ్మకాలు జూన్తో ముగిసిన మూడు నెలల కాలంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 14 శాతం తగ్గి 97,674 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ నగరాల్లో అమ్మకాలు 1,13,768 యూనిట్లుగా ఉన్నాయి. ప్రాప్ టైగర్ సంస్థ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణెలో కలిపి అమ్మకాలు 30 శాతం పడిపోయాయి. → ఏప్రిల్–జూన్ కాలంలో ఎంఎంఆర్లో ఇళ్ల అమ్మకాలు 25,939 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 38,266 యూనిట్లతో పోల్చితే 32 శాతం తగ్గాయి. → పుణెలో ఇళ్ల అమ్మకాలు 27 శాతం తగ్గి 15,962 యూనిట్లకు పరిమితమయ్యాయి. → అహ్మదాబాద్లో కేవల ఒక శాతమే తగ్గాయి. 9,451 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 9 శాతం తగ్గి 10,051 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో మాత్రం ఇళ్ల అమ్మకాలు 16 శాతం పెరిగి 15,628 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 13,495 యూనిట్లుగా ఉన్నాయి. → చెన్నై మార్కెట్లోనూ 33 శాతం పెరిగి 5,283 యూనిట్లు అమ్ముడయ్యాయి. → కోల్కతా మార్కెట్లో 19 శాతం అధికంగా 3,847 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → ఎంఎంఆర్ పరిధిలో ముంబై, నవీ ముంబై, థానే మార్కెట్ల గణాంకాలు కలసి ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ అమ్మకాలు కలసి ఉన్నాయి. ధరల ఒత్తిళ్లు.. ‘‘ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడానికి డిమాండ్ బలహీనత కంటే మార్కెట్లో వచి్చన మార్పుల ఫలితం వల్లేనని తెలుస్తోంది. ముఖ్యంగా ధరల పరమైన ఒత్తిళ్లు నెలకొనడంతో బడ్జెట్, మధ్యాదాయ ఇళ్ల విభాగాల్లో కొనుగోళ్ల పరంగా అప్రమత్తత నెలకొంది’’అని ప్రాప్ టైగర్ సేల్స్ హెడ్ శ్రీధర్ శ్రీనివాసన్ తెలిపారు. -
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ క్రేజ్.. త్వరపడండి
సాక్షి, హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలకు సొంతింటి వసతిని కల్పించేందుకు లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకు అందుబాటులో తెచ్చిన ఫ్లాట్ల కొనుగోలుకు హైదరాబాద్ నగరవాసుల ఆసక్తి పెరుగుతోందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సి.భాస్కర్ రెడ్డి తెలిపారు. నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లోని ఫ్లాట్ల మార్కెట్ ధర కంటే దాదాపు 40 శాతం తక్కువకే అందుబాటులో ఉన్నాయన్నారు.నాగోల్ (Nagole) బండ్లగూడలోని 159 ఫ్లాట్లకు, పోచారంలోని 601 ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. నాగోల్ బండ్లగూడలోని ఫ్లాట్ల కోసం సుమారు 12 వందల మంది ఫోన్లు చేయగా, 700 మంది ప్రాజెక్టును సందర్శించినట్లు తెలిపారు. పోచారం (Pocharam) ఫ్లాట్లకు సంబంధించిన 800 మంది వరకు టెలిఫోన్లో సంప్రదించగా, సుమారు 300 మంది వరకు ప్రాజెక్టును సందర్శించారన్నారు.బండ్లగూడ (Bandlaguda) ప్రాజెక్టుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 29 వరకు స్వీకరిస్తామని, 30వ తేదీన లాటరీ ద్వారా కేటాయిస్తామని, పోచారం ప్రాజెక్టుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు స్వీకరిస్తామని, ఆగస్టు 1వ తేదీన లాటరీ ద్వారా కేటాయిస్తామని ఆయన వివరించారు. అతితక్కువ ధరల్లోనే సొంతింటి కలను నెరవేరేలా ప్రభుత్వం కలి్పంచిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.చదవండి: ఇల్లు కొంటున్నారా?.. ఇలాంటి లొసుగులతో జాగ్రత్త! -
రూ.3,859.81 కోట్లు మొత్తం రుణం చెల్లించిన రాంకీ ఇన్ఫ్రా
రుణదాతలతో పునర్నిర్మాణ నిష్క్రమణ ఒప్పందాన్ని (రీస్ట్రక్చరింగ్ ఎగ్జిట్ అగ్రిమెంట్) అమలు చేసిన అతి కొద్ది భారతీయ కంపెనీల్లో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒకటిగా నిలిచిందని సంస్థ తెలిపింది. దాంతో తమ కార్పొరేట్ ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నట్లు చెప్పింది. జూన్ 12, 2015న టర్మ్ లోన్లు, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు రెండూ కలిపి మొత్తంగా రూ.3,859.81 కోట్ల రుణాన్ని పునర్వ్యవస్థీకరణ ఒప్పందం (ఆర్ఏ) అమలులో భాగంగా పూర్తి చెల్లించాలని నిర్ణయించింది. దాంతో రీస్ట్రక్చర్ చేసిన టర్మ్ లోన్లను జూన్ 2019 నాటికి పూర్తిగా తిరిగి చెల్లించింది.అనంతరం జులై 11, 2025న రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని రుణదాతలకు అధికారికంగా ఆర్ఈఏను పూర్తిగా అమలు చేసినట్లు ప్రకటించింది. ఫలితంగా అన్ని వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాలను ఇప్పుడు రుణదాతలు రెగ్యులర్, స్టాండర్డ్గా వర్గీకరించారు. ఇది కంపెనీ స్థిరమైన, మెరుగైన ఆర్థిక నిర్వహణను ప్రతిబింబిస్తుందని సంస్థ పేర్కొంది. ఎటువంటి టర్మ్లోన్లు పెండింగ్ లేకపోవడం, పునర్నిర్మాణ చట్రం నుంచి విజయవంతంగా నిష్క్రమించడంతో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రెడిట్ రేటింగ్లు, అంతర్గత బ్యాంక్ అసెస్మెంట్లను మెరుగుపరచుకుందని తెలిపింది. తద్వారా దాని మొత్తం ఆర్థిక ప్రొఫైల్ను బలోపేతం చేసుకుంది.ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లురాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ వై.ఆర్. నాగరాజా మాట్లాడుతూ..‘ఆర్ఈఏను అమలు చేయడం కంపెనీ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది సంస్థ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వేగంగా విస్తరిస్తున్న పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల మార్కెట్లో వ్యూహాత్మక లక్ష్యాలను కొనసాగించేందుకు తోడ్పాటు అందిస్తుంది’ అన్నారు. -
ఇంట్లో పవర్ట్రాక్.. వేలు పెట్టినా నో షాక్!
సాక్షి, సిటీబ్యూరో: పొరపాటున సాకెట్లో వేలు పెడితే ఏమవుతుంది? దిమ్మతిరిగి.. మైండ్ బ్లాక్ అవుతుందా లేదా! అదేనండి.. షాక్ కొడుతుంది కదా! వంటగదిలోని పవర్ సాకెట్ అదీ.. రెండు, మూడు ప్లగుల్ని పెడితే చిటపట మెరుపులు.. షార్టుసర్క్యూట్లు. ఇలాంటి సమస్యలన్నింటికీ ఓ చక్కటి పరిష్కారం పవర్ ట్రాక్. ఎక్స్టెన్షన్ బాక్స్కు సరికొత్త రూపమే ఈ పవర్ ట్రాక్. దీని సాయంతో 5 నుంచి 13 విద్యుత్తు ఉపకరణాల్ని ఒకేచోట ఏర్పాటు చేయవచ్చు. ఏకకాలంలో ఇన్నింటిని వాడినా షార్టుసర్క్యూట్ అవుతుందనే భయమే అక్కర్లేదు.వంటింట్లో అయినా, ఆఫీసులో అయినా.. కరెంటు తీగల నుంచి కంప్యూటర్ వైర్ల వరకూ పవర్ట్రాక్లో బిగించొచ్చు. పవర్ట్రాక్ అంటే ఇదేదో కొత్త పరికరం అనుకునేరు. రెండు, మూడు ప్లగ్గులు పెట్టాల్సి వస్తే ఎక్స్టెన్షన్ బాక్సులు, పవర్ర్స్టిప్ల వాడకం తెలిసిందే కదా! సరిగ్గా ఇది కూడా అలాంటిదే అన్నమాట. అయితే వాటితో పోలిస్తే రెండు, మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో విద్యుత్తు ఉపకరణాలు ఏర్పాటు చేసుకునే వీలు ఇక్కడుంటుంది. ఇదే ఈ పరికరం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బహుముఖ అవసరాల్ని తీర్చే పవర్ట్రాక్ రెండు రకాలు. గృహావసరాలకు ఉపయోగపడే కాంపాక్ట్ ట్రాక్, ఆఫీసుల్లో ఉపయోగించే డాటా ట్రాక్, పవర్ట్రాక్ను గోడకు బిగించడం వల్ల చూడటానికి చక్కటి లుక్కు వస్తుంది. వైర్ల గజిబిజి ఉండదు. పైగా పూర్తి సురక్షితం. అందుకే వీటికి గిరాకీ అధికం. వంటగది, స్టడీరూమ్, లివింగ్రూమ్లతో పాటు ఆఫీసుల్లోనూ వీటిని విరివిగా వాడొచ్చు. సైజును బట్టి ఒక పవర్ట్రాక్ ద్వారా ఐదు నుంచి పదమూడు విద్యుత్తు ఉపకరణాల్ని ఏకకాలంలో వాడుకోవచ్చు. 500 మిల్లీమీటర్లు, 600 మిల్లీ మీటర్లు, 1,300 మిల్లీమీటర్ల పొడవుతో దొరుకుతాయి. పైన అల్యూమినియం, లోపల థర్మోప్లాస్టిక్ రబ్బర్ మెటీరియల ఉపయోగించే పవర్ట్రాక్ల ధర రూ.5 వేల నుంచి రూ.7వేల వరకు ఉంది.ఎన్నెన్నో లాభాలు..సాకెట్లు.. ఎక్స్టెన్షన్ బాక్సుల్లో ఒక్కోసారి ప్లగ్గులు సరిగా దూరవు. ఫలితంగా ప్లగ్ పిన్నును పెట్టగానే సాకెట్ నుంచి చిటచిట మెరుపులు వస్తుంటాయి. ప్లగ్ని పైకి ఎత్తిపట్టుకుంటే కానీ మిక్సర్ తిరక్కపోవచ్చు. ఇలాంటి సమస్యలు పవర్ట్రాక్లో కన్పించవు. ఒక్కోసారి చిన్నపిల్లలు తెలీక ప్లగ్గుల్లో చెంచాలు, ఇనుపముక్కలు, వేళ్లు పెట్టి షాక్కు గురవుతుంటారు. పవర్ట్రాక్తో అలాంటి భయమే అక్కర్లేదు. లోపల వేళ్లు పెట్టినా ఇబ్బందే ఉండదు. 100 శాతం షాక్ప్రూఫ్ ఇది. స్విచ్బోర్డు అయితే సాకెట్ అమర్చిన చోటే ప్లగ్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవైపు అందకపోవడం, ఉపకరణాల్ని అటూఇటూ జరపడం వంటి ఇబ్బందులుంటాయి. ఇందులో అలాకాదు. ట్రాక్లో ఈ చివర నుంచి ఆ చివర వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రకం ఏదైనా పవర్ట్రాక్తో మూడు సాకెట్లు ఉచితంగా వస్తాయి. అదనంగా కావాలంటే, వాటిని ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. డాటాట్రాక్ను గృహావసరాలకు కూడా వాడుకోవచ్చు. కాంపాక్ట్ట్రాక్ను మాత్రం ఆఫీసుల్లో వాడలేం. -
ఇంటికే అందం.. ఇలాంటి ఫ్లోరింగ్..
సాక్షి, సిటీబ్యూరో: శుభ్రం చేయడమెంతో తేలిక. దీర్ఘకాలపు మన్నిక.. ఎలాంటి మరకలైనా తుడవగానే మాయం. నిర్వహణలో కన్పించని సమస్యలు. పైగా ఇంటికే సరికొత్త అందం. ఇలాంటి అనేకానేక ప్రత్యేకతల కారణంగా వెదురు గచ్చు(బ్యాంబూ ఫ్లోరింగ్)కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూడ్డానికి చక్కగా కన్పించడం.. తదితర కారణాలతో వెదురు గచ్చుకి గిరాకీ పెరుగుతోంది. రెండు రకాలు.. వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తిరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్తో చేసేది ఎలైట్ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. మొత్తం మూడు వర్ణాల్లో ఈ కలప లభిస్తుంది. ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం గచ్చుకి ఆరు లేయర్ల పాలియురేథెన్ కోటింగ్ వేస్తారు. ధర ఎంత? ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీనితో ఇంటిని అలంకరించాలంటే.. చదరపు అడుగుకి రూ.200–350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ వంద చదరపు అడుగుల గదికి సుమారు రూ.20 వేలు అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్ కోసం చదరపు అడుగుకి రూ.300 దాకా అవుతుంది. వెదురు కలపను ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ.15 దాకా తీసుకుంటారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి గచ్చు ఉన్నా.. దానిపై బ్యాంబూ ఫ్లోరింగ్ను సులువుగా వేసుకోవచ్చు. పైగా ఒక్కరోజులో పని పూర్తవుతుంది. వెదురు గచ్చు ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. దీనిపై గీతలు కన్పించవు. కాలిపోవడమంటూ ఉండదు. కొన్నాళ్ల తర్వాత రంగు వెలిసిపోతుందన్న దిగులక్కర్లేదు. నిర్వహణలో శ్రమపడక్కర్లేదు.బుడతల గదికి ప్రత్యేకం.. సిరాను పీల్చుకునే గుణం వెదురు గచ్చుకి ఉండటం వల్ల.. చాలామంది తమ బుడతల గదుల్లో వాడుతున్నారు. చిన్నారులు కిందపడినా దెబ్బలు తగలవు. హోమ్ థియేటర్లు, పడక గదుల్లోనూ ఈ తరహా గచ్చును కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. సంపన్న గృహాల్లోని బయటి ప్రాంతాల్లోనూ ఈ రకం కలపతో అలంకరిస్తున్నారు. ఉద్యానవనాలు, బాల్కనీలు, స్విమ్మింగ్పూల్, పోర్టికోల వద్ద విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం చదరపు అడుగుకి రూ.400 వరకూ అవుతుంది. అన్నిరకాల వాతావరణానికి ఎదురొడ్డి నిలబడం వల్ల వెదురు గచ్చు మీద ప్రత్యేక మక్కువ పెరుగుతోంది. -
ఇల్లు కొంటున్నారా?.. ఇలాంటి లొసుగులతో జాగ్రత్త!
మనకు నచ్చే ఫ్లాట్ దొరికేంత వరకూ నగరం నలుమూలలా తిరుగుతాం. రుణమెంత వస్తుందో ముందే బ్యాంకర్లతో చర్చించి, ఆర్థిక పరిమితులు దాటకుండా జాగ్రత్తపడతాం. కోరుకున్న ఫ్లాట్ దొరికితే చాలు.. అడ్వాన్స్ అందజేసి బిల్డర్తో ఒప్పందం కుదుర్చుకుంటాం. మరి ఈ పత్రంలో ఏముందో.. ఏయే అంశాల్ని పేర్కొన్నారో తెలుసుకోవాలి. లేదంటే సొంతింటి ఆనందనానికి దూరమైనట్లే. – సాక్షి, సిటీబ్యూరోస్థిరాస్తుల కొనుగోలులో అతి కీలకమైన విషయం అమ్మకందారుడితో కుదుర్చుకునే ఒప్పందమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇళ్ల విషయంలో బిల్డర్తో జాగ్రత్తగా ఉండాలి. జీవిత కాలపు కష్టార్జితానికి తోడు, బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మరీ సొమ్ము చెల్లిస్తాం. తీరా కొనుగోలు చేశాక, న్యాయపరమైన చిక్కులున్నాయనో, ఇంటిపై అప్పు ఉందనో తేలితే.. ఎంత నష్టం? ఇలాంటి లొసుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాలుగా పక్కగా ఉందని తేలాకే కొనుగోలుపై ముందడుగు వేయాలి. హక్కుల చిక్కులు, ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి కొన్ని సూత్రాలివి..మొత్తం విలువెంత? ఇంటి విలువ ఎంతన్నది కేవలం భవనానికే పరిమితమైన అంశం కాదు. ఇందులో అనేక ఇతర ఖర్చులు కలుస్తాయి. విద్యుత్, తాగునీరు, పార్కింగ్, వివిధ రకాల పన్నులతో పాటు రిజిస్ట్రేషన్ వంటి ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ మొత్తం విలువలో కలిసి ఉండొచ్చు. లేదంటే విడిగా ఉండొచ్చు. కాబట్టి ఈ ఖర్చులన్నీ మొత్తం విలువలో ఉండేలా చూసుకోండి. ఏం చేయాలి? ఇతర రుసుములు ఏమైనా ఉన్నాయేమో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ విషయంలో రియల్టీ లావాదేవీల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. అభ్యంతరాలుంటే.. బిల్డర్ను సంప్రదించడం ద్వారా ఆ విషయాల్ని సరిదిద్దుకోవచ్చు. వాస్తవ ప్లాన్కు భిన్నంగా మార్పులు చేయాల్సి వస్తే.. అదనపు రుసుములు చెల్లించారా? సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతి అవసరమా.. వంటి విషయాల్ని బిల్డర్తో చర్చించి ఒక నిర్ణయానికి రావాలి.నిర్మాణం జాప్యమైతే? నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు..? ఇంటిని అప్పగించేదెప్పుడు అనే విషయాలు ముందే స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో మాంద్యం దెబ్బ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా ప్రాజెక్టుల్లో నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. ఇలా జరగడం వల్ల ఓవైపు ఈఎంఐలు కట్టలేక, మరోవైపు ఇంటి అద్దె చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి అవుతుంది, ఎప్పటిలోగా ఫ్లాటను అప్పగించే విషయంపై బిల్డర్తో పత్రంలో రాయించుకోండి.ఏం చేయాలి? పనులు మొదలయ్యాక నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆలస్యమవుతుంటే బిల్డర్ను కలిసి మాట్లాడండి. పనుల పురోగతికిది దోహదం చేయొచ్చు. అదే ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసినవారితో ఓ సొసైటీని ఏర్పాటు చేయండి. ఫలితంగా బిల్డర్ వైపు నుంచి ఆలస్యం జరిగితే, గట్టిగా అడగడానికి వీలవుతుంది. -
ఒక్క ఏడాదిలో భారీగా పెరిగిన లీజులు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం(హెచ్1)లో 2.68 కోట్ల చ.అ. స్థలం లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంలో జరిగిన 1.90 కోట్ల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఏడాది కాలంలో ఏకంగా 40 శాతం లీజులు పెరిగాయి.అలాగే 2025 హెచ్1లో టాప్–7 నగరాలలో కొత్తగా 2.45 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది హెచ్1లో సప్లయి అయిన 1.96 కోట్ల చ.అ.తో పోలిస్తే ఏడాది కాలంలో 25 శాతం సరఫరా పెరిగిందని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో ఐటీ హబ్గా పేరొందిన హైదరాబాద్లో 2025 హెచ్1లో 42 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది.గతేడాది హెచ్1లో 31.2 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే 35 శాతం లావాదేవీలు పెరిగాయి. ఇక, ఇదే సమయంలో గ్రేటర్లో కొత్తగా 47 లక్షల చ.అ. ఆఫీసు స్థలం సరఫరా అయింది. 2024 హెచ్1లో సప్లయి అయిన 56.8 లక్షల చ.అ. స్పేస్తో పోలిస్తే ఏడాది కాలంలో సరఫరా 17 శాతం మేర తగ్గింది. -
హైదరాబాద్లో సొంతింటి కోసం రాజీ పడాల్సిందేనా?
విషయం ఏదైనా సరే.. కోరుకున్నవన్నీ దొరక్కపోవచ్చు. ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు. ఇళ్ల కొనుగోలుకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. బడ్జెట్, చిక్కుల్లేని యాజమాన్య హక్కు, ప్రాంతం, వాస్తు, నీరు, విద్యుత్తు సరఫరా అంశాలు ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే వీటిలో కొన్ని అంశాలు మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే సొంతింటి స్వప్నం ఓ పెద్ద సవాలే అవుతుంది. అలాగనీ ముఖ్యమైన అంశాల్లోనూ రాజీపడాలని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఒకటి, రెండు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏయే విషయాల్లో రాజీ పడొచ్చు. ఎక్కడ పడకూడదో స్పష్టత ఏర్పర్చుకోవాలి. - సాక్షి, సిటీబ్యూరోప్రాంతమెక్కడ? ఇల్లు కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అది కూడా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అనుకుంటున్నారా? ఇక్కడ వీలవ్వకపోతే మియాపూర్, మదీనాగూడ, మణికొండ, ఓయూ కాలనీ తదితర ప్రాంతాల్లో.. కొంచెం తక్కువ ధరలో దొరికే ప్రాంతాలపై దృష్టి పెడతారు అవునా? ప్రస్తుత రియల్టీ మార్కెట్లో సంపన్నులకే కాదు మధ్యతరగతి, సామాన్యులు.. ఇలా వివిధ వర్గాల వారికి స్తోమతకు తగ్గ బడ్జెట్లో నగరం చుట్టూ గృహసముదాయాలు వస్తున్నాయి. మీరు కొంచెం కసరత్తు చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్ని అన్వేషిస్తే చాలు, మీకు అందుబాటు ధరలో ఇళ్లు ఎక్కడ దొరికేది ఇట్టే తెలిసిపోతుంది. సదుపాయాల సంగతేంటి? నిర్మాణాల విషయంలో డెవలపర్ల వ్యూహం మారింది. సకల సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇల్లు కొనాలన్న నిర్ణయానికొచ్చాక సదుపాయాల సంగతి కూడా ఆలోచించాలి. క్లబ్హౌజ్, జిమ్ అవసరమా? వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఈ సదుపాయాలు అక్కర్లేదా? అన్నది తేల్చుకోవాలి. జీవనశైలి, బడ్జెట్ తదితర అంశాలు మీ నిర్ణయంపై ప్రభావితం చేస్తాయి. కాబట్టి సదుపాయాల విషయంలో స్పష్టత ఉండాలి. బిల్డర్కు మంచి పేరుందా? స్థిరాస్తి కొనేటప్పుడు బిల్డర్ గురించి కూడా ఆరా తీయాలి. మార్కెట్లో పేరున్న బిల్డర్లు నిర్మించే ఇళ్లకే ప్రాధాన్యమివ్వాలి. గతంలో అతను నిర్మించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయా? నిర్మాణమెలా ఉంది? ఒప్పందం మేరకు కొనుగోలుదారులకు సదుపాయాలు కల్పించాడా? కార్పస్ ఫండ్ బదిలీలో ఇబ్బందులేమైనా సృష్టించాడా? అన్న విషయాల్ని తెలుసుకోవాలి. నిర్మాణాల్లో మంచి చరిత్ర లేని బిల్డర్లకు దూరంగా ఉండటమే మేలు. అలాగనీ మార్కెట్లో పేరున్న బిల్డర్ల ప్రాజెక్టులకే పరిమితం కానక్కర్లేదు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఒప్పందానికి కట్టుబడి ఉండేవారిని ఎంచుకోవచ్చు. పరిసరాలెలా ఉన్నాయి? ఇంటి ముందు పచ్చటి తోటతో ఆహ్లాదభరిత వాతావరణం ఉండాలని కొందరు కోరుకుంటారు. మరికొందరేమో హంగులు లేకున్నా సర్దుకుపోతారు. బాల్కనీని పచ్చగా, అందంగా అలంకరించుకుంటే గార్డెన్కు ధీటుగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఈ విషయంలో మీ దృక్పథం ఏమిటో నిర్ణయించుకోవాలి. -
వీధి పోటుతో ఆటుపోట్లు, అసలేంటీ వీధిపోటు!
సాక్షి, సిటీబ్యూరో: కేవలం ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటిపై వీధి పోటు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇంటికి ఎదురుగా నిలువుగా ఉండే వీధి ఇంటి వరకు వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుంచి ఏదో వైపునకు తిరిగినా దాన్ని వీధి పోటుగా గుర్తించాలి. ఈశాన్య భాగంలో వీధిపోటు వల్ల ఆ గృహంలో నివసించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏ రంగంలో కాలుపెట్టినా పైచేయి సాధిస్తారు. ఈశాన్య భాగంగా వీధి ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలకు మేలు. ఇంటి యజమానికి ధనాదాయం బాగుంటుంది. వాయువ్వ భాగంలో వీధి ఉండటం వల్ల ఆ ఇంట్లో స్త్రీలు తీవ్రమైన దు్రష్పభావానికి లోనవుతారు. అనేక సమస్యలు, చికాకులు కలుగుతాయి. వాయువ్వంలో వీధి ఉన్నప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులుగా రాణిస్తారు. నైరుతి భాగంలో వీధి పోటు వల్ల ఇంట్లోకి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!ఆగ్నేయ భాగంలో వీధి పోటు వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆగ్నేయంలో వీధి ఉండటం వల్ల ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించి ఖర్చు ఏదొక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వస్తుంది.నోట్ : వాస్తు శాస్త్రం వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మీ సందేహాల నివృత్తికోసం వాస్తు పండితులను సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్! -
హైదరాబాద్లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఢీలాపడ్డాయి. మొత్తం రూ.1,025 యూనిట్ల విక్రయాలు (రూ.5 కోట్లు అంతకు మించిన ధర) నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 1,140 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం విలాసవంతమైన గృహ విక్రయాలు (రూ.6 కోట్లు, అంతకుమించి) మూడింతలు పెరిగి 3,960 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఢిల్లీ ఎన్సీఆర్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1,280 యూనిట్లుగా ఉండడం గమనార్హం. సీబీఆర్ఈ, అసోచామ్ సంయుక్త నివేదిక ఈ వివరాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జనవరి–జూన్ మధ్య కాలంలో అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 85 శాతం పెరిగి 6,950 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 3,750 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 200 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 80 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ మూడు రెట్లు పెరిగి 220 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 65 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో అమ్మకాలు 120 యూనిట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 160 యూనిట్లుగా ఉన్నాయి. → కోల్కతాలో అమ్మకాలు రెట్టింపై 190 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 70 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. → ముంబైలో 1,240 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 950 యూనిట్లుగా ఉన్నాయి. → పుణె, చెన్నై, కోల్కతా నగరాల్లో రూ.4కోట్లు అంతకుమించిన విలువైన ఇళ్లను లగ్జరీ ఇళ్ల కింద పరిగణనలోకి తీసుకున్నారు. బెంగళూరులో రూ.5 కోట్లు అంతకుమించిన ధరల శ్రేణిని లగ్జరీ ఇళ్ల కింద ఈ నివేదిక పరిగణించింది. స్థిరమైన డిమాండ్.. ‘‘దేశ ఇళ్ల మార్కెట్ వ్యూహాత్మక స్థిరమైన దశలోకి ప్రవేశించింది. స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయి. లగ్జరీ, ప్రీమియం ఇళ్ల మా ర్కెట్లో స్థిరమైన వృద్ధి అన్నది వినియోగదారుల విశ్వాసం పెరుగుదలను జీవనశైలి ఆకాంక్షలను సూచిస్తోంది’’అని సీబీఆర్ఈ ఇండియా ఎండీ (భూమి) గౌరవ్ కుమార్ తెలపారు. డెవలపర్లు నాణ్యత, పారదర్శకత, ఈ రంగం తదుపరి దశకు ఇవి కీలకంగా పనిచేస్తాయన్నారు. హౌసింగ్ బూమ్కు అనుగుణంగా సులభతర అనుమతులు, పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించేలా విధానపరమైన సంస్కరణలు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్ ఈ నివేదిక విడుదల సందర్భంగా సూచించారు. -
రూ.కోట్ల లగ్జరీ ప్రాపర్టీ.. రిజిస్టర్ చేసుకున్న జొమాటో అధినేత
జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ గురుగ్రామ్లో రూ.కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.డీఎల్ఎఫ్కు చెందిన ది కామెలియాస్లో అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ను మూడేళ్ల క్రితం రూ.52.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు జాప్కీకి లభించిన డాక్యుమెంట్లు చెబుతున్నాయి.మార్చిలో కన్వెన్షన్ డీడ్ ను చేసుకున్నారని, స్టాంప్ డ్యూటీ కింద గోయల్ రూ.3.66 కోట్లు చెల్లించారని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. 10,813 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ లో ఐదు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ నుంచి 2022 ఆగస్టులో ఈ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారని, 2025 మార్చి 17న కన్వెన్షన్ డీడ్ రిజిస్టర్ అయిందని డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.గురుగ్రామ్లో డీఎల్ఎఫ్ ఫేజ్ -5 లో ఉన్న కామెలియాస్లో అన్నీ అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లే. దీపిందర్ గోయల్ మూడేళ్ల క్రితం కొన్న లాంటి అపార్ట్ మెంట్ ఇప్పుడు కొనాలంటే రూ.140 కోట్లకు పైగా ఖర్చవుతుందని రియల్టీ బ్రోకర్లు చెబుతన్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో దీపిందర్ గోయల్కు మరో ప్రాపర్టీ కూడా ఉంది. 2024 ఫిబ్రవరిలో గోయల్ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో రూ .50 కోట్లకు ఒక ప్లాట్ను కొనుగోలు చేశారు. -
సొంతంగా ఫ్లైఓవర్ కట్టుకుంటున్న రియల్ఎస్టేట్ కంపెనీ
సాధారణంగా ఎక్కడైనా ఫ్లైఓవర్లు ప్రభుత్వాలు నిర్మిస్తాయి. కానీ బెంగళూరులో మాత్రం ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ సొంతంగా ప్రైవేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకుంది. ఇందుకు ప్రభుత్వమూ అనుమతిచ్చింది. అయితే ఒక్కటే షరతు...బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ బెళ్లందూర్లో నిర్మాణంలో ఉన్న తమ టెక్ పార్క్ను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో అనుసంధానం చేయడానికి 1.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను నిర్మించనుంది. ఈ ఫ్లైఓవర్ పబ్లిక్ రోడ్డు పక్కగా, వర్షపునీటి కాలువ మీదుగా వెళ్తుంది.ఈ ప్రాజెక్టుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఆమోదం తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వ భూమిలో ఫ్లైఓవర్ నిర్మించుకుంటున్నందుకు గానూ దీనికి బదులుగా కరియమ్మన అగ్రహార రోడ్డు వెడెల్పునకు ప్రెస్టీజ్ గ్రూప్ ముందుకు వచ్చినట్లు తెలిసింది. అలాగే ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తామే సొంతంగా నిధులు సమకూర్చడానికి ఈ రియల్ ఎస్టేట్ సంస్థ కట్టుబడి ఉందని ‘హిందూస్థాన్ టైమ్స్’ వార్తా సంస్థ కథనం పేర్కొంది.ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రెస్టీజ్ గ్రూప్ మొదట 2022 ఆగస్టులో బెంగళూరు బెంగళూరు మహానగర పాలికెకు ప్రతిపాదనను సమర్పించింది. తరువాత 2023 నవంబర్ లో సవరించిన అభ్యర్థనను సమర్పించింది. తమ ప్రైవేట్ క్యాంపస్ కు ప్రత్యేక ఫ్లైఓవర్ అవసరాన్ని చెప్పేందుకు ఎమలూరు, కరియమ్మన అగ్రహార రోడ్డు మీదుగా ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని కంపెనీ కారణంగా పేర్కొంది.రాబోయే ప్రెస్టీజ్ బీటా టెక్ పార్క్ లో 5,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వీరి రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించినట్లు సమాచారం.👉హైదరాబాద్ వెస్ట్ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్ట్లు👈కొత్త ఫ్లైఓవర్పై కేవలం ప్రెస్టీజ్ ఉద్యోగులకే కాకుండా సాధారణ ప్రజల రాకపోకలకూ అవకాశం ఉండాలని బీబీఎంపీ అధికారులు షరతు విధించారు. అన్ని చట్టపరమైన ప్రమాణాలను చేరుకుంటే, రహదారి విస్తరణ కోసం అప్పగించిన భూమికి బదులుగా సంస్థ బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులకు (టీడీఆర్) కూడా అర్హత కలిగి ఉంటుంది. టెక్ పార్క్ బిల్డింగ్ ప్లాన్కు అనుమతులు వచ్చిన దాదాపు ఏడాది తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం లభించడం గమనార్హం. 70 ఎకరాలున్న ఈ స్థలానికి 2023 సెప్టెంబరులో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) నుంచి ప్రాథమిక అనుమతి లభించింది.బెంగళూరు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టు ఆమోదాన్ని ధృవీకరించారు. ఫ్లైఓవర్తో పాటు 40 అడుగుల వెడల్పుతో కనెక్టింగ్ రోడ్కు కూడా ప్రెస్టీజ్ సంస్థ నిధులు సమకూర్చనుంది. ఈ రోడ్డుతో సక్రా హాస్పిటల్ రోడ్డుకు ప్రయాణ దూరం 2.5 కిలోమీటర్లు తగ్గుతుంది. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం కోసం విస్తృత కృషిలో భాగంగానే ఈ ప్రాజెక్ట్ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. -
హైదరాబాద్లోనే విదేశీ మేలిమి గ్రానైట్..
ఇంటి అందం ద్విగుణీకృతం చేయడానికి.. కొందరు గృహ యజమానులు ఖర్చుకు వెనకాడట్లేదు. ఇంటి అలంకరణలో తమదైన ప్రత్యేక ముద్ర ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారికోసమే ప్రపంచంలో అరుదుగా దొరికే గ్రానైట్లు బోలెడు ఉన్నాయి. వీటిని ఎంచుకోవడానికి ఏ అమెరికాకో ఆఫ్రికాకో వెళ్లక్కర్లేదు. ఎంచక్కా మన నగరంలోనే ఇవి లభిస్తున్నాయి. చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రంలా దర్శనమిచ్చే గ్రానైట్ రకాలకు ప్రపంచ మార్కెట్లో ఎక్కడ్లేని గిరాకీ పెరుగుతోంది. వీటికోసం చదరపు అడుగుకి రూ.2,500 దాకా పెట్టాల్సి ఉంటుంది. వీటిని గోడలకు అమరిస్తే.. అచ్చం చిత్రకారుడు వేసిన బొమ్మల మాదిరిగానే కనిపిస్తాయి. – సాక్షి, సిటీబ్యూరోయూరప్, అమెరికా, సౌదీ అరేబియా, ఆఫ్రికా, అంగోలా, నమీబియా, మడగాస్కర్, నార్వే, ఫ్లిన్లాండ్, బ్రెజిల్, ఐస్ల్యాండ్ వంటి దేశాలకు చెందిన గ్రానైట్కు ప్రపంచ మార్కెట్లో ఎక్కడ్లేని గిరాకీ ఉంది. మరి ఇవి విదేశాల నుంచి ఇక్కడికి ఎలా చేరుకుంటాయనేది మీ సందేహమా? ఆయా దేశాల నుంచి ఇవన్నీ నౌకలో ముంబైకి దిగుమతి అవుతాయి. అక్కడి నుంచి రైలు మార్గంలో నగరానికి.. లారీల ద్వారా సిటీ చుట్టుపక్కల ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు చేరుకుంటాయి.ఒక్కో గ్రానైట్.. ఒక్కో గ్రానైట్ బ్లాకు 25 నుంచి 35 టన్నుల దాకా ఉంటుంది. మొదట్లో కాస్త ఎత్తుపల్లాలుగా ఉన్న గ్రానైట్ను.. బడా యంత్రాల సాయంతో డ్రెస్సింగ్ చేస్తారు. పాలిష్ చేసి ఎగుడుదిగుడు లేకుండా చేస్తారన్నమాట. ఆ తర్వాత స్టీల్ గ్రిట్ బ్లేడ్లతో కత్తిరించి డైమండ్ బ్రిక్సతో పాలిష్ చేస్తారు. బ్రెడ్డును ముక్కలుగా కోసినట్లే.. భారీ ఆకారం గల గ్రానైట్ బ్లాకును కోస్తారన్నమాట. ఈ ప్రక్రియ తర్వాత ఒక్కో ముక్కను వేడి చేసే ఓవెన్లో పెడతారు. ఫలితంగా గ్రానైట్లో ఉన్న నీరంతా ఆవిరవుతుంది. ఆ తర్వాత రెసిన్ పెడతారు. దీని వల్ల భవిష్యత్తులో గ్రానైట్ నీరు పీల్చుకోకుండా ఉంటుంది. తర్వాత ప్రక్రియ క్యూరింగే.. ఇదయ్యాక పాలిష్ అవ్వగానే గ్రానైట్ తళతళ మెరుస్తుంది. మొత్తం ఏడు రోజులు జరిగే ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. గ్రానైట్ ప్రపంచ దేశాలకు ఎగుమతికి సిద్ధమవుతుంది. ఇంటికే ప్రత్యేకం.. దాదాపు ఎనభై రంగులు గల గ్రానైట్.. వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు దిగుమతి అవుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ‘ట్రాపిక్ బ్రౌన్’ ధర చ.అ.కు 300 దాకా ఉంటుంది. అదే నార్వే ‘బ్లూ పెరల్’ రేటు రూ.500 వరకూ పలుకుతుంది. ఇక ఫిన్లాండ్ ‘బాల్టిక్ బ్రౌన్’ ధర కూడా ఇంచుమించు రూ.300లు ఉంటుంది. ఇవి కాకుండా ఖరీదైన రకాలు బోలెడున్నాయి. మేలిమి గ్రానైట్.. యూరప్ ఐస్లాండ్ల మధ్య.. అక్కడక్కడా విసిరేసినట్లు కనిపించే చిన్న చిన్న దీవుల్లో మేలిమి రకమైన గ్రానైట్ లభిస్తోంది. యూరప్ నుంచి అక్కడికి వెళ్లడానికే కనీసం మూడు రోజులైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘బ్లాక్ బ్యూటీ’ గ్రానైట్ కోసం చదరపు అడుగుకి రూ.2 వేల దాకా పెట్టాల్సి ఉంటుంది. బ్రెజిల్లో దొరికే ‘అమెజాన్’ రకం ధర.. చదరపు అడుగుకి రూ.1,600 ఉంటుంది. ఇదే రకాన్ని మీ ఇంట్లో వేయాలనుకుంటే మీకయ్యేది సుమారు వెయ్యి రూపాయలే. అదెలా అంటారా? మీకేం కావాలో గ్రానైట్ సంస్థలకు చెబితే వాటిని చిన్నచిన్న బ్లాకులుగా తీసుకొచ్చి అందజేస్తారు. కాకపోతే ఆర్డర్ ఇచ్చిన మూడు నెలల తర్వాతే ఇవి ఇంటికి చేరుతాయి. కాబట్టి, ఇంటి నిర్మాణం నాటి నుంచే గ్రానైట్కు సంబంధించి అవగాహనకు రావడం ఉత్తమం. -
స్టూడియో అపార్ట్మెంట్లకు తగ్గుతున్న గిరాకీ
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కంటే ముందు ఇల్లు అంటే నాలుగు గోడల భవనం. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేద తీరాలనుకునే గూడు. కానీ, కోవిడ్ తర్వాత నుంచి ఇల్లే ప్రపంచమైపోయింది. తినడం, పడుకోవడం మాత్రమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ.. ఇంటి నుంచే! ఫలితంగా కోవిడ్ కంటే ముందు హాట్ కేకుల్లాంటి స్టూడియో అపార్ట్మెంట్లకు.. క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంలో విస్తీర్ణమైన గృహాలకు గిరాకీ పెరిగింది.బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ ఏడాది తొలి అర్ధ వార్షికం(జనవరి–జూన్)లో 1,063 ప్రాజెక్ట్లు లాంచింగ్ కాగా.. ఇందులో కేవలం 9 శాతం(91 ప్రాజెక్ట్లు) మాత్రమే స్టూడియో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లు ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,207 ప్రాజెక్ట్లు లాంచింగ్ కాగా.. ఇందులో 145 ప్రాజెక్ట్లు స్టూడియో పార్ట్మెంట్లున్నాయి. 2020లో 884 ప్రాజెక్ట్లు ప్రారంభం కాగా.. ఇందులో 15 శాతం వాటాతో 130 ప్రాజెక్ట్లు ఈ తరహా అపార్ట్మెంట్లున్నాయి. అలాగే 2019లో 1,921 ప్రాజెక్ట్లు లాంచింగ్ అయ్యాయి. 368 ప్రాజెక్ట్లు(19 శాతం) ఈ స్టూడియో ఇళ్లే..లొకేషన్ ముఖ్యం.. స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచిలర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాలు చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనరాక్ గ్రూప్ సంస్థ తెలిపింది. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగినట్లు చెప్పింది. మన దగ్గర తక్కువే.. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణే నగరాలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ నడుస్తోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణేలదే.. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో కేవలం 34 స్టూడియో ప్రాజెక్ట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది హెచ్–1లో 7 నగరాలలో ప్రారంభమైన 91 స్టూడియో ప్రాజెక్ట్లలో.. 71 ప్రాజెక్ట్లు ముంబైలోనే ఉన్నాయి. ఆ తర్వాత పుణేలో 18, బెంగళూరులో రెండు ప్రాజెక్ట్లు లాంచింగ్ అయ్యాయి. -
సిటీ రియల్ ఎస్టేట్కి ‘ఐటీ’ బూస్ట్..
రియల్ ఎస్టేట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం కీలకమైంది. మన సిటీ స్థిరాస్తికి ఐటీ బూస్ట్లాగా మారింది. ఐటీ ఉద్యోగులపై ఆధారపడి గృహ విక్రయాలు ఎంత జరుగుతాయో.. అంతకు రెట్టింపు స్థాయిలో ఐటీ సంస్థల లావాదేవీలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమాది ప్రాంతాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఆఫీస్ స్పేస్.. గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీతో నగరం నలువైపులా విస్తరించింది. – సాక్షి, సిటీబ్యూరోఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఔటర్ వెంబడి ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉన్న 11 పారిశ్రామిక పార్క్లను ఐటీ పార్క్లుగా మార్చింది. దీంతో పాటు కొంపల్లిలో ఐటీ టవర్, కొల్లూరులో ఐటీ పార్క్లను నిర్మిస్తోంది. ఫలితంగా పశ్చిమం వైపున కాకుండా ఇతర ప్రాంతాలలో కొత్తగా 3.5–4 కోట్ల చ.అ. ఐటీ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుందని జేఎల్ఎల్ తెలిపింది. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో హైదరాబాద్ దూసుకెళుతోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 9.04 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉన్న మన సిటీ.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 కోట్ల చ.అ. మైలురాయిని దాటనుందని జేఎల్ఎల్ సర్వేలో తేలింది.ఆఫీస్ స్పేస్ మార్కెట్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ తర్వాత హైదరాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. కొంత కాలంగా కొంపల్లి, బాచుపల్లి, మేడ్చల్ వంటి ఉత్తరాది ప్రాంతాలు, ఎల్బీనగర్, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలలో నివాస క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాలలోని అందుబాటు గృహాలను ఐటీ ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు.81 శాతం వృద్ధి రేటు..కొన్నేళ్లుగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ నగరం మెరుగైన స్థానాన్ని నమోదు చేస్తుంది. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉన్న బెంగళూరు గత ఆరేళ్లలో 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ విభాగంలో హైదరాబాద్ నగర భాగస్వామ్యం ఇటీవలి వరకు 12.7 శాతంగా ఉండగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్పేస్తో 25 శాతానికి పెరిగింది. గ్రిడ్ పాలసీ అమలుతో.. గ్రిడ్ పాలసీతో నగరం నలువైపులా ఐటీ విస్తరించింది. డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అమలు చేస్తోంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 500 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు యాంకర్ యూనిట్ ప్రోత్సాహకాలను అందిస్తోంది.ఇందులో సంబంధిత భూమిని 50 శాతం ఐటీ, ఐటీఈఎస్ ప్రయోజనాల కోసం వినియోగించగా.. మిగిలిన సగంలో నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించవచ్చనే వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ అనేది కేవలం రెండు ప్రధాన కారిడార్లలోనే కేంద్రీకృతమై ఉంది. హైటెక్సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. 96 శాతం స్పేస్ ఈ ప్రాంతాల నుంచే ఉంటుంది. -
ధూళి రాకుండా ‘గాలి మేడ’
మనలో చాలామంది తమ ఊహలకు రూపం వచ్చేలా కల్పించుకొని చాలాసార్లు చేతులతో ‘గాల్లో మేడలు’ కడుతుంటారు. నిజంగా అలా గాల్లో మేడలు వెలిస్తే అదో అద్భుతం. అంతలా కాకపోయినా చైనా నేరుగా గాలితోనే మేడ కట్టింది. అవును.. చైనాలోని జినాన్ అనే ప్రాంతంలో ఓ నిర్మాణ స్థలంలో ధూళి, నిర్మాణ సమయంలో వెలువడే శబ్దాలను కట్టడి చేసేందుకు 50 మీటర్ల ఎత్తు, 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గాలితో బుడగలాంటి డోమ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈమేరకు ఓ వీడియో వైరల్గా మారింది.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ అధికారిక ఫేస్బుక్ పోస్ట్ ద్వారా దీనికి సంబంధించిన అంశాలు పంచుకున్నారు. అందులోని వివరాల ప్రకారం.. 50 మీటర్ల ఎత్తు, 20,000 చదరపు మీటర్ల గాలితో కూడిన డోమ్ నిర్మాణాన్ని చైనా ఆవిష్కరించింది. జినాన్లోని ఒక నిర్మాణ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ డోమ్ శబ్ద కాలుష్యం, ధూళి నుంచి చుట్టుపక్కల పర్యావరణాన్ని రక్షిస్తుంది. ప్రధాన కట్టడం పూర్తయ్యాక దాన్ని తొలగిస్తారు. సోషల్ మీడియాలో దీని వీడియో ఒకటి వైరల్గా మారడంతో నెటిజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది యూజర్లు దీన్నో ‘చైనీస్ టెక్నోలాజియా’ అని అన్నారు.🚨 China has built a 50m-tall inflatable dome over a construction site in Jinan to protect the surroundings from dust and noise. pic.twitter.com/CLSrZAWS2g— Indian Tech & Infra (@IndianTechGuide) July 3, 2025ఇదీ చదవండి: టాటా కొత్త ఈవీ తయారీ ప్రారంభం.. ధర ఎంతంటే..‘చైనా ఇలాంటి నిర్మాణాలతో ప్రతిసారీ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది’ అని ఒక యూజర్ రిప్లై ఇచ్చారు. అయితే కొందరు మాత్రం ఈ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందులో పనిచేసే వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణం కింద కార్మికుల దుస్థితిని ఊహించండంటూ తెలుపుతున్నారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో లోపల ఉన్న కార్మికులను ఊపిరాడకుండా చేస్తుందని మరొకరు రాశారు. ఇది భూకంపం లేదా సునామీ కంటే ప్రాణాంతకం కావచ్చని మరొకరు రిప్లై ఇచ్చారు. -
రోబో ఇసుక.. ఇప్పుడిదే ప్రత్యామ్నాయం
సాక్షి, సిటీబ్యూరో: నది ఇసుక కొరత, అధిక ధరల కారణంగా గ్రేటర్ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇసుక రవాణా దారులు రేట్లు పెంచడం నిర్మాణ రంగానికి మరింత భారంగా పరిణమించింది. మహానగరంలో ఇసుక దొరకడం గగనమవడంతో బిల్డర్లు ప్రత్యామ్నాయంగా రోబో ఇసుక వినియోగాన్ని పెంచారు.ధర తక్కువే.. ఇప్పటికే కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్లలో రోబో ఇసుక (క్రష్డ్ రాక్ సాండ్)ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక రేట్లతో పోలిస్తే దీని ధర ఎంతో తక్కువ. అయితే రోబో ఇసుక విరివిరిగా దొరక్కపోవడం.. ప్రత్యేకంగా కొన్ని క్రషర్లలోనే ఇలాంటి ఇసుకను ఉత్పత్తి చేస్తుండటంతో సాధారణ గృహ నిర్మాణాల్లో దీని వినియోగం తక్కువగా ఉంది. అలాగే రోబో ఇసులాగే మెటల్ క్రషింగ్ స్టోన్ డస్ట్ కూడా ఉండటం వీటిలో నాణ్యమైన ఇసుకను గుర్తించడం కష్టంగా మారుతోంది.రోబో తయారీ ఈజీ.. నగర శివార్లలో విరివిగా లభ్యమయ్యే గ్రనైట్ శిలలతో రోబోశాండ్ను ఉత్పత్తి చేయవచ్చు. మెటల్ క్రషర్స్లో మిగిలిన వ్యర్థ శిలలను 2ఎంఎం, 1ఎంఎం పరిమాణంలో క్రష్ చేసి జల్లెడ పడితే ఈ ఇసుక తయారవుతుంది. తక్కువ సమయంలో నాణ్యత కలిగిన ఇసుకను తయారు చేయవచ్చన్నది నిపుణుల మాట. ఈ ఇసుకను నగరంలో రెడీమిక్స్ యూనిట్ల ద్వారా భారీ నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. -
హైదరాబాద్ వెస్ట్ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్ట్లు
కోవిడ్ తర్వాత విల్లాలపై ఆసక్తి మరింత పెరిగింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతోంది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం కారణంగా ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. - సాక్షి, సిటీబ్యూరోపశ్చిమంలో హవా.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో పశ్చిమ ప్రాంతాల హవా కొనసాగుతోంది. మూడు త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి.వెస్ట్ హైదరాబాద్లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్లో అత్తాపూర్లు రియల్టీ హాట్స్పాట్స్గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్ లాంచింగ్లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. -
హైదరాబాద్లో అపార్ట్మెంట్ల ధరలు ఆకాశానికి..
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే మన నగరంలోనే అపార్ట్మెంట్ల ధరలు తక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. దేశంలో ముంబై తర్వాత ఖరీదైన సిటీగా మన నగరం అభివృద్ధి చెందింది. రెండో అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయింది.వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్లో ప్రాపర్టీల విలువ 6 శాతం వృద్ధి చెంది.. చ.అ. ధర సగటున రూ.5,800 నుంచి రూ.6 వేలకు పెరిగింది. ముంబైలో ఏడాదిలో 3 శాతం పెరిగి.. రూ.9,600 నుంచి రూ.9,800లకు చేరిందని ప్రాప్టైగర్.కామ్ నివేదిక వెల్లడించింది.దాదాపు పదేళ్ల కాలంలో అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉండటం, స్టాంప్ డ్యూటీలను తగ్గించడం, సర్కిల్ ధరలలో సవరణలతో పాటు గృహ కొనుగోళ్లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో అందుబాటు ధరలలోని ఇళ్ల విక్రయాలలో అత్యధిక వృద్ధి నమోదైంది.ఒకవైపు సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులకు రాయితీలను అందిస్తున్నాయి. లేదంటే ఆయా నగరాలలో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముంది. -
రియల్ ఎస్టేట్లో ఆ పెట్టుబడులు తగ్గాయ్..
భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్) నీరసించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 33 శాతం తగ్గిపోయి 1.69 బిలియన్ డాలర్లు (14,365 కోట్లు)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా వెల్లడించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు ఇందుకు దారితీసినట్టు తెలిపింది.క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇనిస్టిట్యూషన్స్ 2.53 బిలియన్ డాలర్లను (రూ.21,505 కోట్లు) రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే సగానికి తగ్గి 1,048 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం 643 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 486 మిలియన్ డాలర్ల పెట్టుబడుల కంటే 32 శాతం అధికమయ్యాయి. దేశీ పెట్టుబడుల అండ.. ‘దేశీ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ మార్కెట్కు కీలక చోదకంగా మారాయి. భారత రియల్ ఎస్టేట్లో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 2021లో 16 శాతంగా ఉంటే, అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ 2024 నాటికి 34 శాతానికి చేరింది’ అని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాజ్ఞిక్ తెలిపారు. ఇక 2025 మొదటి ఆరు నెలల కాలంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో దేశీ పెట్టుబడుల వాటా 48 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడం.. అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సాయపడ్డాయని, మొదటి ఆరు నెలల్లో మొత్తం పెట్టుబడులు 3 బిలియన్ డాలర్లకు దూసుకువెళ్లాయని తెలిపారు.ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 15 శాతం తగ్గి 2,998 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మొదటి ఆరు నెలల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 2,594 మిలియన్ డాలర్ల నుంచి 1,571 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 53 శాతం ఎగసి 1,427 మిలియన్ డాలర్లకు చేరాయి. ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూప్లు, విదేశీ బ్యాంక్లు, ప్రొప్రయిటరీ బుక్లు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, ఎన్బీఎఫ్సీలు, లిస్టెడ్ రీట్లు సంస్థాగత పెట్టుబడిదారుల కిందకు వస్తాయి. -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు ఓకే!
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3 శాతం పెరిగాయి. 19,048 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో చూస్తే భిన్నమైన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గినట్టు నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) లీజింగ్ మార్కెట్ మాత్రం బలమైన పనితీరు చూపించింది. → దేశవ్యాప్తంగా టాప్ 8 నగరాల్లో 2025 జనవరి–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 1,70,201 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోల్చి చూస్తే 2 శాతం తక్కువ. → ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు 2 శాతం నుంచి 14 శాతం మధ్య పెరిగాయి. → ఇళ్ల అమ్మకాల్లో 49 శాతం రూ.కోటి అంతకుమించి ధరల శ్రేణిలోనే ఉన్నాయి. మిగిలిన 51 శాతం ఇళ్ల ధరలు రూ.కోటిలోపు ఉన్నాయి. → ముంబై నగరంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎలాంటి మార్పు లేకుండా 47,035 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్ నగరంలో అమ్మకాలు కూడా పెద్ద మార్పు లేకుండా 9,370 యూనిట్లుగా ఉన్నాయి. → చెన్నై నగరంలో క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగి 26,795 యూనిట్లుగా నమోదయ్యాయి. → బెంగళూరులో అమ్మకాలు 3 శాతం తగ్గి 26,599 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో 8 శాతం తగ్గి 26,795 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో ఒక శాతం తగ్గాయి. 24,329 యూనిట్ల విక్రయాలు జరిగాయి. కోల్కతాలో అమ్మకాలు 11 శాతం తగ్గి 8,090 యూనిట్లకు పరిమితమయ్యాయి.జోరుమీదున్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ హైదరాబాద్ సహా టాప్–8 నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 41 శాతం పెరిగి 48.9 మిలియన్ (489 లక్షలు) చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. ఈ ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద లీజింగ్ 80–90 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుందని నైట్ఫ్రాంక్ అంచనా. → చెన్నైలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 68 శాతం వృద్దితో 5.1 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. → ముంబైలో మాత్రం క్రితం ఏడాది మొదటి ఆరు నెలల కాలం గణాంకాలతో పోల్చి చూస్తే 5 శాతం క్షీణించి 5.5 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపై 18.2 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో బలమైన వృద్ధి నమోదైంది. 27 శాతానికి పైగా పెరిగి 7.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → పుణెలో లీజింగ్ 17% వృద్ధితో 5.1 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. → కోల్కతాలో ఏకంగా 60 శాతం పెరిగి 1.1 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → అహ్మదాబాద్లో 51 శాతం తగ్గిపోయి 0.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్.. జీసీసీలు టాప్గేర్
న్యూఢిల్లీ: ఆఫీస్ స్పేస్ లీజింగ్ (కార్యాలయ వసతులు) వృద్ధిలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) బలమైన పాత్ర పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో జీసీసీలకు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 24 శాతం శాతం పెరిగింది. 31.8 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కార్యాలయ వసతులను జీసీసీలు గత ఆర్థిక సంవత్సరంలో లీజుకు తీసుకున్నాయి. 2023–24లో జీసీసీలు తీసుకున్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25.6 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 31.8 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్లో 13.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు తీసుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 కంపెనీల లీజింగ్ 10.9 మిలియన్ ఎస్ఎఫ్టీ కంటే 25 శాతం అధికం. ‘‘గత కొన్ని సంవత్సరాలుగా భారత ఆఫీస్ మార్కెట్కు జీసీసీలు ముఖ్య వృద్ధి చోదకంగా నిలుస్తున్నాయి. వ్యయ నియంత్రణ వ్యూహాలు, నైపుణ్య మానవవనరుల లభ్యత, శరవేగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సానుకూల ప్రభుత్వ విధానాలు, వ్యాపార సులభతర నిర్వహణ పరిస్థితులు, సానుకూల వ్యాపార వాతావరణం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి’’అని వెస్టియన్ నివేదిక వెల్లడించింది. 42 శాతం జీసీసీల నుంచే 2024–25 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో జీసీసీల వాటా 42 శాతంగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 41 శాతంగా ఉన్నట్టు వెస్టియన్ తెలిపింది. రానున్న రోజుల్లో జీసీసీల వాటా మరింత పెరుగుతుందని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు అంచనా వేశారు. ఐటీ–ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, తయారీ, కన్సల్టింగ్ సేవల రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు విస్తరణపై దృష్టి సారించినట్టు చెప్పారు. నిపుణుల లభ్యతకు తోడు బలమైన ఎకోసిస్టమ్ అండతో భారత్ ఆశావహంగా మారినట్టు పేర్కొన్నారు. బెంగళూరులో అధిక వృద్ధి.. అత్యధికంగా బెంగళూరులో గత ఆర్థిక సంవత్సరంలో 12.43 మిలియన్ ఎస్ఎఫ్టీని జీసీసీలు లీజింగ్కు తీసుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో బెంగళూరులో జీసీసీల లీజింగ్ పరిమాణం 8.34 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. ముంబైలో జీసీసీల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 3.68 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లీజింగ్ 1.36 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 170 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. డీఎల్ఎఫ్, ఎంబసీ గ్రూప్, సత్వ గ్రూప్, ప్రెస్టీజ్ గ్రూప్, ఆర్ఎంజెడ్ గ్రూప్, టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర సంస్థలు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ప్రముఖంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ కూడా కార్యాలయ వసతుల లీజింగ్ మార్కెట్లోనే పనిచేస్తున్నాయి. -
పట్టాలెక్కిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పట్టాలెక్కింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ తదితర అభివృద్ధి ప్రణాళికలతో నగర స్థిరాస్తి రంగం పుంజుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో నగరంలో 10,741 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే కేవలం 3 శాతం తగ్గుదల కనిపించింది. గృహ కొనుగోలుదారులు ప్రీమియం, హైఎండ్ లగ్జరీ గృహాలకే మొగ్గు చూపిస్తుండటంతో అందుబాటు, మధ్యస్థాయి గృహాల లాంచింగ్స్ స్వల్పంగా తగ్గాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోహాట్స్పాట్ ప్రాంతాలివే.. లాంచింగ్స్లో పశ్చిమ హైదరాబాద్ ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. మొత్తం లాంచింగ్స్లో ఈ జోన్ వాటా ఏకంగా 51 శాతంగా ఉంది. వెస్ట్ హైదరాబాద్లో నానక్రాంగూడ ప్రధాన హాట్స్పాట్గా నిలిచింది. లాంచింగ్స్లో ఉత్తర హైదరాబాద్ వాటా 18 శాతంగా ఉండగా.. ఈ జోన్లో బాచుపల్లి హాట్స్పాట్గా ఉంది. ఇక, దక్షిణ హైదరాబాద్ వాటా 17 శాతంగా ఉండగా.. రాజేంద్రనగర్ హాట్స్పాట్గా ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి పశ్చిమ హైదరాబాద్ చోదకశక్తిగా ఉన్నప్పటికీ.. రెండేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. ఇదే సమయంలో భూమి లభ్యత, అందుబాటు ధరల కారణంగా ఉత్తర, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. శివారు ప్రాంతాలలో గృహ నిర్మాణాలు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం.హైఎండ్ లగ్జరీదే ఆధిపత్యం.. 2025 క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో లాంచింగ్స్లో అత్యధికంగా 83 శాతం హైఎండ్ లగ్జరీ యూనిట్లు హైదరాబాద్లోనే లాంచింగ్ అయ్యాయి. నగరంలో 2024 క్యూ1లోని లాంచింగ్స్లో ప్రీమియం ఇళ్ల వాటా 34 శాతంగా ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 70 శాతానికి పెరిగింది. నానక్రాంగూడ, గండిపేట, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో ప్రీమియం ఇళ్లకు అత్యధిక డిమాండ్ ఉంది. లాంచింగ్స్లో మధ్యస్థాయి విభాగం గృహాల వాటా 17 శాతంగా ఉంది. అత్యధికంగా బాచుపల్లిలో ఈ తరహా ఇళ్లకు గిరాకీ ఉంది. తూర్పు హైదరాబాద్లో ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.పెరిగిన ఇళ్ల అద్దెలు.. నగరంలో గృహాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 7 శాతం పెరిగాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లోని అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, ఇతర ఉన్నతస్థాయి వర్గాలు ఆయా ప్రాంతాలలో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటమే అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణం.ఆఫీసు స్పేస్ అదరహో.. నగరంలో 2025 క్యూ1లో 18.2 లక్షల చ.అ. నికర ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. లక్ష చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన ఆఫీసు లీజులు అత్యధికంగా జరిగాయి. హెల్త్కేర్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలలో కంపెనీల విస్తరణల కారణంగా లావాదేవీలలో వృద్ధి నమోదైంది. 2025 క్యూ1లోని ఆఫీసు స్పేస్ లీజులలో అత్యధికంగా 32 శాతం హెల్త్కేర్ అండ్ ఫార్మా రంగాలది కాగా.. ఆ తర్వాత ఐటీ–బీపీఎం విభాగం 21 శాతం, బ్యాంకింగ్ అండ పైనాన్షియల్స్ విభాగం వాటా 11 శాతంగా ఉంది. మాదాపూర్ (81 శాతం), గచి్చ»ౌలి (16 శాతం) ప్రాంతాల్లోని ఆఫీసు స్పేస్కు ఎక్కువ డిమాండ్ ఉంది.సప్లయి 13.2 లక్షల చ.అ. ఇక నగరంలో 2025 క్యూ1లో కొత్తగా మార్కెట్లోకి 13.2 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సప్లయి అయింది. అయితే గతేడాది క్యూ1తో పోలిస్తే మాత్రం ఇది 55 శాతం తగ్గుదల. ఆఫీసు స్పేస్ ప్రాజెక్ట్ల అనుమతుల జారీలో జాప్యమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. నగరంలో కార్యాలయ స్థలాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 13 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా మాదాపూర్లో అద్దెలు పెరిగాయి. ఈ ప్రాంతంతో పోలిస్తే గచ్చిబౌలిలో కిరాయిలు 20–25 శాతం తక్కువగా ఉన్నాయి. మెట్రో ఫేజ్–2, హెచ్–సిటీ రోడ్ల విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఆఫీసు అద్దెలు మరింత వృద్ధి చెందుతాయి. -
నిర్మాణం.. మరింత భారం
సాక్షి, సిటీబ్యూరో: అధిక రుణాలు, నిధుల లేమితో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్ ధరలు ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్ రీసెర్చ్ తెలిపింది.టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్పుట్ కాస్ట్ పెరిగాయి.2024 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్ ధరలు 30 శాతం, సిమెంట్ 22 శాతం, కాపర్ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయి. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండ్రస్టియల్ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు.ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితి అని పేర్కొన్నారు. -
రియల్ఎస్టేట్లోకి ‘కొత్త’ కస్టమర్లు..
హైదరాబాద్ నగర స్థిరాస్తి మార్కెట్లోకి థర్డ్ జనరేషన్ కస్టమర్లు ఎంట్రీ ఇస్తున్నారు. ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు తిరిగి స్థానిక ప్రాంతాలలో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న కొత్తతరం కస్టమర్లకు విదేశాల్లో తరహా ఆధునిక వసతులు, విస్తీర్ణమైన అపార్ట్మెంట్లను కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగినట్టుగానే చాలామంది గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోప్రధాన నగరంలో కష్టమే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోని నివాసితుల రెండు, మూడోతరం వారసులు కూడా సిటీకి వస్తున్నారు. వీరికి ఆయా ప్రాంతాల్లో లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు దొరకడం కష్టం. దీంతో హైరైజ్, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి. అలాగే విదేశాల్లో స్థిరపడిపోయిన ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు తిరిగి స్థానిక ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కొందరు ఎన్నారైలు ఇప్పటికే స్థానికంగా ఉన్న స్థిరాస్తులను విక్రయించి, లగ్జరీ ప్రాపర్టీలకు అప్గ్రేడ్ అవుతున్నారు. అలాగే ఇన్నాళ్లు భార్య, భర్తలిద్దరి సంపాదనతో ఇళ్లు కొనుగోలు చేసిన కస్టమర్లు.. ఇప్పుడు వారి పిల్లలు సంపాదన కూడా తోడైంది. 3–4 ఏళ్లుగా ఈ మూడోతరం సంపాదనతో నగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా స్థలాలు కొనే వారి కంటే ఉన్న భూమిని విక్రయించి, వచ్చిన సొమ్ముతో నగరంలో ప్రాపర్టీ కొనేందుకే ఆసక్తి చూపిస్తారని, దీంతో ప్రాపర్టీలకు మరింత డిమాండ్ ఉంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
రియల్టీలో తగ్గనున్న సంస్థాగత పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత (ఇనిస్టిట్యూషన్స్) పెట్టుబడులు ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) 37 శాతం తక్కువగా 3.06 బిలియన్ డాలర్లు (రూ.26,300 కోట్లు)గా ఉండొచ్చని ఈ రంగానికి చెందిన కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ఇందులో హౌసింగ్ ప్రాజెక్టుల వాటా 38 శాతం ఉంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశి్చతులు, ఆర్థిక సవాళ్లు నెలకొనడాన్ని కారణంగా పేర్కొంది. దీంతో పెట్టుబడుల లావాదేవీల గడువు పొడిగింపునకు గురవుతున్నట్టు వివరించింది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్లో ఇనిస్టిట్యూషన్స్ 4.89 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో.. విదేశీ ఇన్వెస్టర్ల వాటా 68 శాతంగా ఉంటే, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మిగిలిన 32 శాతం వాటాను ఆక్రమించినట్టు పేర్కొంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (రీట్ లు), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ ప్లేస్మెంట్ (క్యూఐపీలు), లిస్టెడ్ సంస్థల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతున్నట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. పెట్టుబడులకు ఆకర్షణీయం.. ‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో సవాళ్లు నెలకొన్నప్పటికీ దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం కొనసాగింది’’అని జేఎల్ఎల్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ లతా పిళ్లై తెలిపారు. గత 5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లకు మించి నమోదవుతున్నట్టు గుర్తు చేశారు. ఈ ఏడాది దీనికి అనుగుణంగానే ఉండొచ్చన్నారు. -
మేడ్చల్ క్లస్టర్ హవా.. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నగరంలో 51 లక్షల చ.అ. వేర్హౌస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ షాపింగ్కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్మైల్ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని తెలిపింది. వేర్హౌస్ లావాదేవీలలో తయారీ రంగం హవా కొనసాగుతోంది. 2024లో జరిగిన గిడ్డంగుల లీజులలో మ్యానుఫాక్చరింగ్ విభాగం వాటా 39 శాతం కాగా.. 3 పీఎల్ 21 శాతం, ఈ–కామర్స్ 17 శాతం, రిటైల్ రంగం 14 శాతం, ఎఫ్ఎంసీజీ 5 శాతం, ఎఫ్ఎంసీడీ 1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.మేడ్చల్ క్లస్టర్ హవా.. నగరంలో మూడు క్లస్టర్లలో గిడ్డంగుల స్థలాలున్నాయి. మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్–గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, యెల్లంపేట్, శామీర్పేట్, పటాన్చెరు ఇండ్రస్టియల్ ఏరియా, రుద్రారం, పాశమైలారం, ఎదులనాగులపల్లి, సుల్తాన్పూర్, ఏరోట్రోపోలిస్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్నగర్.. ఆయా ప్రాంతాలలో గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19–21గా, గ్రేడ్–బీ అయితే రూ.16–19గా ఉంది. 👉 ఇదీ చదవండి: హైదరాబాద్లో భూముల ధరలు.. ఆకాశం వైపు..మేడ్చల్ క్లస్టర్లో వేర్హౌస్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 60 శాతం ఉండగా.. 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. శంషాబాద్ క్లస్టర్లో క్షీణత, పటాన్చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఏడాది సమయంలో శంషాబాద్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్చెరు క్లస్టర్ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. డిమాండ్ ఎందుకంటే.. హైదరాబాద్ అనేక రంగాలు ప్రొడక్షన్ లింక్డ్ న్సెంటివ్(పీఎల్ఐ) స్కీమ్ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ ఏర్పడిందని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదికలో తెలిపింది. -
హైదరాబాద్లో భూముల ధరలు.. ఆకాశం వైపు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ(కేపీహెచ్బీ)లో నిర్వహించిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నగరాలలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. కేపీహెచ్బీలో చదరపు గజం ధర రూ.2.98 లక్షలకు అమ్ముడుపోయింది.ఐటీ హబ్కు చేరువలో ఉండటం వల్లే ఈ భూములకు అత్యధిక డిమాండ్ ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఐటీ నిపుణులు, సంస్థలను ఆకర్షిస్తూనే ఉంది. గృహాలు, ఆఫీసు స్థలాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే ఇన్వెంటరీ, అందుబాటుకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైటెక్ సిటీ నుంచి 40 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉన్న ప్రాంతాలలో బ్రాండెడ్ డెవలపర్లు కానీ ప్రాజెక్ట్లలో కూడా అపార్ట్మెంట్ల ధరలు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉన్నాయంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. మెరుగైన మౌలిక వసతులు మౌలిక సదుపాయాల విస్తరణ, కనెక్టివిటీ, కొత్త మెట్రో లైన్లు, ఎక్స్ప్రెస్ వేస్, ఐటీ పార్క్లతో నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. దీంతో నగరంలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు బాగా పెరిగాయి. ప్రధాన వాణిజ్య కేంద్రాలకు చేరువలో ఉన్న ప్రాంతాలలో, మెరుగైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో భూముల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అలాగే ప్రణాళికాబద్ధమైన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నగరం శివారు ప్రాంతాల వైపు విస్తరిస్తుండటంతో కాలనీ, గేటెడ్ కమ్యూనిటీలు పెట్టుబడులను ఆకర్షించే కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.👉 ఇదీ చదవండి: మేడ్చల్ క్లస్టర్ హవా.. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్ -
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో జోరు
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పడు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 23 శాతం అధికంగా 32 లక్షల చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లీజింగ్ పరిమాణం 26 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లోనూ స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 11 శాతం పెరిగి 178 లక్షల ఎస్ఎఫ్టీగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా ఒక నివేదిక రూపంలో వెల్లడించింది.అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ కార్పొరేట్ల నుంచి లీజింగ్కు మంచి డిమాండ్ కనిపించినట్టు తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఏడు నగరాల్లో స్థూల ఆఫీసు లీజింగ్ 161 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది. హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, పుణెలో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరగ్గా.. ఒక్క ముంబైలో మా త్రం తగ్గింది. ఈ గణాంకాల్లో లీజు పునరుద్ధరణ లు, ముందస్తు హామీలు, ఆసక్తి వ్యక్తీకరణలకు సంబంధించి డేటా లేదని కొలియర్స్ స్పష్టం చేసింది. నగరాల వారీ లీజింగ్.. బెంగళూరులో 48 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 48 లక్షల ఎస్ఎఫ్టీగానే ఉండడం గమనించొచ్చు.చెన్నైలో క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 30 శాతం అధికంగా 26 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది.ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 16 శాతం వృద్ధితో 22 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది.కోల్కతాలో లీజింగ్ 3 లక్షల నుంచి 6 లక్షల చదరపు అడుగులకు దూసుకెళ్లింది.పుణె నగరంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 60 శాతం పెరిగి రూ.16 లక్షల చదరపు అడుగులకు చేరింది.ముంబైలో మాత్రం ఆఫీస్ స్పేస్ లీజింగ్ 28 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 35 లక్షల చదరపు అడుగులతో పోల్చి చూసినప్పుడు 20 శాతం తగ్గింది.ఈ ఏడు పట్టణాల్లో కలిపి 175 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్కు గాను 135 లక్షల ఎస్ఎఫ్టీని కార్పొరేట్లు తీసుకున్నారు. 43 లక్షల ఎస్ఎఫ్టీని కోవర్కింగ్ ఆపరేటర్లు తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రోత్సాహకరమే ‘‘భారత ఆఫీస్ మార్కెట్ 2025లోనూ వృద్ధి దశలో ఉంది. గత రెండు సంవత్సరాలుగా నమోదవుతున్న సానుకూల ధోరణికి అనుగుణంగానే ఉంది. స్థిరమైన సరఫరా, లీజుదారుల పరంగా వైవిధ్యం మద్దతుతో 2025 సంవత్సరం వాణిజ్య రియల్ ఎసేŠట్ట్ మార్కెట్కు ప్రోత్సాహకరంగా ఉండనుంది. మొత్తంమీద ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఈ ఏడాది చివరికి 65–70 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోవచ్చు’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ అర్పిత్ మల్హోత్రా తెలిపారు. -
‘సారీ సర్.. వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి’
చెన్నైలో అద్దెకు ఉండేందుకు ఫ్లాట్ల కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. మీలో చాలామందికి ఇలాంటి అనుభవమే ఎదురై ఉంటుంది. ఇదే అంశంపై ఆన్లైన్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ రోజుల్లో దాదాపు చాలామందికి ముక్కలేనిదే ముద్దదిగదనే ధోరణి వచ్చేసింది. అలాంటిది నాన్వెజ్ తింటే ఇల్లు అద్దెకు అవ్వబోమని ఓ యజమాని చెప్పడం చర్చకు దారితీసింది.సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ రంగస్వామి అనే వ్యక్తి చెన్నైలో ఇంటి అద్దె కోసం వెతుకుతున్నాడు. ఓ ఫ్లాట్ యజమానిని వాట్సప్ ద్వారా సంప్రదించాడు. ‘మీరు నాన్వెజ్ తింటే ఇల్లు అద్దెకు ఇవ్వబోం. సారీ సర్.. వెజిటేరియన్ ప్యామిలీ కోసం చూస్తున్నాం’ అంటూ యాజమాని చెప్పాడు. దాంతో ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిబంధనలు పెట్టడంపై ప్రశాంత్ ఆందోళన చెందుతూ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను స్క్రీన్షాట్ తీసి సామాజిక మాధ్యామాల్లో షేర్ చేశారు. ‘చెన్నైలో అద్దెకు ఫ్లాట్లు దొరకాలంటే నాన్ వెజ్ తినడం హానికరం’ అని ఆ పోస్ట్కు క్యాప్షన్ పెట్టారు.Eating non veg is injurious to finding flats for rent in Chennai . pic.twitter.com/MyWWYuJ0vB— Prashanth Rangaswamy (@itisprashanth) June 26, 2025ఇదీ చదవండి: సిబిల్ సరిగా లేదని ఎస్బీఐ ఉద్యోగం రద్దుమీలో లేదా మీకు తెలిసిన వారిలో చాలామంది ఈ సమస్యను ఏదుర్కొనే ఉంటారు. ఈ తంతు ఇంకెంత కాలం అంటూ కొందరు ఈ పోస్ట్కు రిప్లై ఇస్తుంటే.. సైలెంట్గా వేరే ఇల్లు చూసుకోండంటూ ఇంకొందరు చెప్పారు. ‘నేను శాకాహారినే. కానీ చుట్టూ మాంసం తినేవారున్న యూరప్లో నివసించాను. ఎప్పుడూ సమస్య లేదు. కానీ ఇక్కడ, ఈ ఆంక్షలు హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి’ అని ఒక యూజర్ అన్నారు. అయితే కొందరు మాత్రం తమ ఆస్తిని ఎవరికి అద్దెకు ఇవ్వాలో నిర్ణయించే హక్కు ఇంటి యజమానులకు ఉందని తెలిపారు. -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు డౌన్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు పెరిగిపోవడంతో అమ్మకాలు చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ (క్యూ1) మధ్య కాలంలో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 27 శాతం క్షీణించి 11,040 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇదే కాలంలో ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా టాప్–7 నగరాల్లో జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. ఈ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 20 శాతం తక్కువగా 96,285 యూనిట్లుగా ఉండొచ్చన్నది అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ ఏడు నగరాల్లో 1,20,335 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. హైదరాబాద్తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు, పుణె, కోల్కతా పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు పడిపోగా, ఒక్క చెన్నైలో మాత్రం పెరిగాయి. నగరాల వారీ డేటా.. → జూన్ త్రైమాసికంలో అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు 27 శాతం పెరిగాయి. ఇక్కడ ఇళ్ల విక్రయాలు 14 శాతం క్షీణించి 14,255 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 16,650 యూనిట్లుగా ఉండడం గమనార్హం. → ఎంఎంఆర్లో ఇళ్ల అమ్మకాలు 25 శాతం పడిపోయి 31,275 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 15,410 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలం విక్రయాలతో పోల్చితే 8 శాతం తక్కువ. ఇక్కడ ధరలు సగటున 12 శాతం పెరిగాయి. → పుణెలో అమ్మకాలు 27 శాతం తగ్గి రూ.15,410 యూనిట్లుగా ఉన్నాయి. → కోల్కతా నగరంలో 23 శాతం తక్కువగా 3,525 యూనిట్లు అమ్ముడయ్యాయి. → చెన్నైలో 11 శాతం పెరిగి 5,660 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 5,100 యూనిట్లుగా ఉన్నాయి. -
ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్
ఎక్కువ మంది భారతీయ దంపతులు తమ రిటైర్మెంట్ ప్రణాళికల్లో భాగంగా ఇండియాలో కాకుండా దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూఏఈలోని భారతీయులు విభిన్న ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టి అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని, తద్వారా రియల్ ఎస్టేట్ను స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్గా మారుస్తున్నారని బెంగళూరుకు చెందిన సీఏ, ఒబెయా స్టార్టప్ ఫౌండర్ అభిషేక్ జమువార్ తెలిపారు.జమువార్ తన లింక్డ్ఇన్లో ఇందుకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ‘ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించాలి. దుబాయ్లో ఇన్వెస్ట్ చేసిన భారతీయులు ఇండియాలో పెట్టుబడి పెట్టినవారితో పోలిస్తే సంతోషంగా ఉన్నారు. దుబాయ్లో 2-3 ప్రాపర్టీస్ కొన్న భారతీయ జంటలు చాలానే ఉన్నాయి. కేవలం రికార్డు కోసం నేను సంపన్న వర్గం గురించి మాట్లాడటం లేదు. కష్టపడి, డబ్బు ఆదా చేసి, వారి భవిష్యత్తును సులభతరం చేయడానికి తమ కెరియర్లో 10 నుంచి 15 సంవత్సరాలు శ్రమించిన సాధారణ జంటల గురించి మాట్లాడుతున్నాను. దుబాయ్లో చాలా మంది మధ్యతరగతి భారతీయ జంటలు కొన్నేళ్లుగా పొదుపు చేసి రెండు, మూడు ప్రాపర్టీలను కొనుగోలు చేయగలిగారు. 6–7% అద్దె రాబడులను అందించే ఈ ప్రాపర్టీలను కేవలం 5% వడ్డీ రేటుతో కొనుగోలు చేశారు. ఆదాయ వనరు, పదవీ విరమణ ప్రణాళికలు రెండింటికీ ఉపయోగపడే స్థిరాస్తులను సృష్టించుకుంటున్నారు’ అని చెప్పారు.భారత్లో వడ్డీరేట్లు అధికం‘అయితే ఇండియాలో వన్ హోమ్, ఎక్కువ ఈఎంఐలు, తక్కువ రిటర్న్స్.. ఇదీ పరిస్థితి. ఇక్కడి విధానాల ద్వారా చాలా మంది మధ్యతరగతి వారు సాధారణంగా ఒక ఇంటిని మాత్రమే కలిగి ఉంటారు. ఇక్కడి నిబంధనల ప్రకారం ఈఎంఐలపై 10% వరకు వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది. అదీ చాలక అప్పు తీసుకుంటారు. అద్దె రాబడిలో కేవలం 3% వరకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. వ్యక్తి మొత్తం ఆదాయం ఈఎంఐలకే వెళుతుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: బూమరాంగ్లా బంగారం ధరలు! తులం ఎంతంటే..ఆదాయ మార్గాలపై దృష్టిసామాన్య ప్రజలు తమ సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఆదాయ మార్గాలు పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈల్డ్ జనరేట్ చేసే పొదుపు మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అంతిమంగా సొంతిల్లు కలిగి ఉండడం మాత్రమే కాదు.. ఒత్తిడి లేకుండా జీవించడం, ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా రిటైర్ అవ్వడం ముఖ్యమని చెబుతున్నారు. అందుకు ముందునుంచే ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలంటున్నారు. -
ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..
సొంతంగా ఇల్లు కలిగి ఉండడం అనేది సామాన్యుడి కల. దేశంలోని కొన్ని నగరాల్లో ఇకపై అది కలగానే ఉంటుందని కొన్ని నివేదికల వివరాల ద్వారా తెలుస్తుంది. భారత వాణిజ్య నగరం ముంబయి వంటి నగరాల్లో అయితే సామాన్యుడు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు పోగుచేసి ఇల్లు కొనడం దాదాపు అసాధ్యం అనే వాదనలున్నాయి. అందుకు పెరుగుతున్న ఆస్తుల విలువే ప్రధాన కారణమని రిపోర్ట్లు తెలుపుతున్నాయి.ఒక విశ్లేషణ ప్రకారం నెలకు రూ.90 వేలు వేతనం అంటే ఏటా రూ.10.8 లక్షలు ఆదాయం పొందే ఓ వ్యక్తి ఉన్నారనుకుందాం. వార్షికంగా 30.2% రేటుతో రూ.3.2 లక్షలు పొదుపు చేస్తున్నాడనుకుందాం. తాను ఒకవేళ ముంబయిలో స్థిరాస్తి కొనుగోలు చేయాలని భావిస్తుంటే అక్కడి సగటు ఆస్తి వ్యయం మార్చి 2025 లెక్కల నాటికి చదరపు అడుగుకు రూ.29,911గా ఉంది. సాధారణ ఇంటి పరిమాణం 1,184 చదరపు అడుగులు లెక్కిస్తే ఇంటికి మొత్తం వ్యయం రూ.3.54 కోట్లు అవుతుంది. దీని ప్రకారం ఏటా తాను పొదుపు చేస్తున్న డబ్బు ఆధారంగా 109 ఏళ్లకు రూ.3.54 కోట్లు సమకూరుస్తాడు. అంటే ఇప్పుడు ప్లాన్ చేస్తే 109 ఏళ్లు తర్వాత ఇల్లు కొంటాడు. అదికూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతేనే!ఇదీ చదవండి: ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!దాదాపు అదే ధర కలిగిన ఆస్తిని దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కొనుగోలు చేయాలంటే కొంత తక్కువ సమయం పడుతుంది. గుర్గావ్లో ఇది 64 ఏళ్లుగా ఉంది. బెంగళూరులో 36 ఏళ్లుఢిల్లీ-35 ఏళ్లుచండీగఢ్లో 15 ఏళ్లు పడుతుంది.సంక్షోభానికి కారణమేమిటి?తీవ్రమైన భూ కొరత ఉండడం.అధిక జనసాంద్రత, పట్టణ వలసలు పెరుగుతుండడం.డిమాండ్ తగ్గినప్పటికీ డెవలపర్లు సిండికేట్గామారి ఇష్టారీతిన ధరలు పెంచడం.విధానపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చౌక గృహాల నిర్మాణంపై డెపలపర్లు మొగ్గు చూపకపోవడం.ఫలితంగా సంపన్నులు సైతం ఒకింత ఆలోచించి కొనుగోలు నిర్ణయం తీసుకునేలా రేట్లు పెరగడం. -
1,487 గజాలు.. రూ. 33 కోట్లు
కూకట్పల్లి: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు చెందిన 11 స్థలాలు సోమవారం బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధరలకు అమ్ముడయ్యాయి. మొత్తంగా బోర్డుకు రూ. 65.02 కోట్ల ఆదాయాన్ని అందించాయి. ముఖ్యంగా గచ్చిబౌలిలోని 1,487 గజాల ఒక వాణిజ్య స్థలం ఏకంగా రూ. 33 కోట్లు పలికింది. చదరపు గజానికి రూ. 1.20 లక్షలను ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించగా వేలంపాటలో అది ఏకంగా రూ. 2.22 లక్షలు పలికింది. అలాగే అదే ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన 1,206 గజాల స్థలం వేలంలో రూ. 13.51 కోట్లు పలికింది. అక్కడ చదరపు గజానికి రూ. 80 వేలను ఆఫ్ సెట్ ధరగా ఖరారు చేయగా వేలంలో గజం రూ. 1.12 లక్షలకు అమ్ముడుపోయింది.చింతల్లో నాలుగు స్థలాలు, నిజాంపేటలో నాలుగు ఫ్లాట్లు సైతం ఈ వేలంపాటలో అమ్ముడయ్యాయి. ఒక్క గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతానికి సంబంధించిన భూముల వేలం ద్వారానే రూ. 55.56 కోట్ల మేర ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరింది. చింతల్లోని ప్లాట్ నెం.113, 114, 115 ద్వారా సుమారు రూ. 8.11 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కేపీహెచ్బీ (KPHB) కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ వేలంలో 55 మంది పాల్గొన్నారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి.గౌతం ఓ ప్రకటన విడుదల చేశారు.రెరా ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ ఎ.సంతోష్రెడ్డి బాధ్యతలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (రెరా) అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనుగు సంతోష్రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం సభ్యులతో కలసి ట్రిబ్యునల్ కార్యకలాపాలు నిర్వహించారు. జస్టిస్ సంతోష్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.చదవండి: ల్యాండ్యూజ్ సర్టిఫికెట్ల జారీ.. ఇక ఈజీ -
ఇంటి గోడలు మెరుస్తాయ్..
సాక్షి, సిటీబ్యూరో: ఇంటికి వచ్చిన అతిథులను త్రీడీ వాల్ పేపర్లతో కట్టిపడేస్తున్నారు ఇంటీరియర్ ప్రియులు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాల్ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంతరించుకుంటున్నాయి. నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు త్రీడీ వాల్ పేపర్ల మన్నిక బాగానే ఉంటుంది. కొత్తదైనా, పాత ఇళ్లయినా వాల్ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు.మార్కెట్లో వాల్ పేపర్లు రోల్స్ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10*10 ఉంటే కనీసం రెండు రోల్స్ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకు ఉంటుంది.త్రీడీలో వాల్.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్ పేపర్లు సుమారు 1*1 సైజ్ నుంచి 20*20 సైజ్ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి వరకుంటుంది. త్రీడీ వాల్ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది. -
ఇరుకు ఇళ్లకు అవసరం.. ఇలాంటి ఫర్నీచర్
సాక్షి, సిటీబ్యూరో: కొన్ని ఇళ్లు చూడ్డానికి చిన్నవిగానే ఉంటాయి. కానీ, పొదరిల్లులా అందంగా కనిపిస్తాయి. ఉన్న చిన్నపాటి స్థలంలో పొందికగా ఫర్నీచర్ను సర్దుకుంటేనే అది సాధ్యమవుతుందంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. అదెలాగో ఓసారి చూద్దాం. ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నీచర్ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్ సేవింగ్ ఫర్నీచర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్ ఉడ్తో తయారు చేసే స్పేస్ సేవింగ్ ఫర్నీచర్కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వాటర్ ప్రూఫ్, స్క్రాచ్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్.. అలాగే ఈ ఫర్నీచర్ను విడి భాగాలుగా విడదీసి తిరిగి బిగించుకునే వీలుంటుంది. ఇలా రెండు మూడు సార్లు విప్పదీసి బిగించుకున్నా చెక్కుచెదరదు. ఈ ఫర్నీచర్కు కంపెనీలు వారంటీని సైతం అందిస్తున్నాయి. వాల్ క్యాబినెట్స్.. వంటగది లేదా లివింగ్ రూమ్లో సెరామిక్ లేదా గ్లాస్వేర్ను అలంకరించటానికి వాల్ క్యాబినెట్స్ ఎంతో ఉపయోకరంగా ఉంటాయి. గోడకు ఆనించే వీలున్న ఈ స్పేస్ సేవింగ్ వాల్ క్యాబినెట్స్లో క్రాకరీ డిస్ప్లేకు వీలుగా గ్లాస్ షెల్ప్, ఇతర వస్తువుల కోసం సొరుగులుంటాయి. ఈ వాల్ క్యాబినెట్ టేబుల్ కూడా ఉపయోగపడుతుంది. లివింగ్ రూమ్లోనైతే దీని మీద ఫొటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులు ఉంచుకోవచ్చు.మినీమలిస్టిక్ డ్రెసింగ్ మిర్రర్.. ఇంట్లోని మొత్తం ఫర్నీచర్లో డ్రెసింగ్ మిర్రర్ది ప్రత్కేక స్థానం. కాబట్టి ఇల్లు ఎంత చిన్నదైనా డ్రెసింగ్ మిర్రర్ కొనకుండా ఉండలేం. అయితే దాని వల్ల ఇల్లు ఇరుగ్గా మారకుండా ఉండేలా చూసుకుంటే అవసరంతో పాటు ముచ్చటా తీరుతుంది. ఇందుకోసం స్థలం కలిసొచ్చేలా గోడకు ఫిక్స్ చేసేలా వీలుండే డ్రెస్సింగ్ మిర్రర్ను ఎంచుకోవాలి. ఇలాంటి మినీ మలిస్టిక్ డ్రెస్సింగ్ మిర్రర్ను ఎంచుకుంటే అద్దాన్ని విడిగా గోడకు బిగించి దానికింద సొరుగులున్న టేబుల్ను ఉంచి వాడుకోవచ్చు.కోజీ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కోసం ఇంట్లో డైనింగ్ ఏరియా తప్పనిసరేం కాదు. ఇల్లు ఇరుకవుతుందనే భయం లేకుండా తక్కువ స్థలంలో ఇమిడిపోయే కోజీ డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 నుంచి నాలుగడుల వైశాల్యాన్ని మాత్రమే ఆక్రమించే నాలుగు కుర్చీల డైనింగ్ టేబుల్ను ఎంచుకుంటే ఇల్లు ఇరుగ్గా మారదు.సైడ్ టేబుల్స్ గోడవారగా వేసుకునే సైడ్ టేబుల్స్ వేర్వేరు అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. డ్రాలు, షెల్ఫ్లు కలిసి ఉండే ఈ సైడ్ టేబుల్ను పుస్తకాలు, అరుదుగా ఉపయోగించే ఇతర వస్తువుల కోసం వినియోగించుకోవచ్చు. ఈ టేబుల్ బోసిగా కనిపించకుండా దీని మీద కాస్త పెద్దవిగా ఉండే డెకరేటివ్ ఐటమ్స్ను అమర్చుకోవచ్చు. -
ఇల్లే కాదు.. ఇంటి నిర్మాణ సామగ్రికీ గుర్తింపు
సాక్షి, సిటీబ్యూరో: కాలం ఏదైనా సరే ఇంట్లో నీరు, విద్యుత్ వినియోగం తప్పనిసరి. వేసవికాలంలో అయితే వీటి బిల్లులతో కస్టమర్ల జేబుకు చిల్లులు పడటం ఖాయం. అందుకే హరిత నిర్మాణ సామగ్రితో నిర్మించే ఇళ్లకు ఆదరణ పెరుగుతోంది. హరిత భవనాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు విద్యుత్ వినియోగం 30–40 శాతం, నీటి వినియోగం 20–30 శాతం తగ్గుతుంది కూడా.విద్యుత్, నీటి బిల్లుల ఆదా, నిర్వహణ వ్యయం తగ్గింపు, ఆరోగ్యకరమైన వాతావరణ వంటి కారణాలతో హరిత భవనాలకు డిమాండ్ పెరిగింది. గతంలో పర్యావరణహితమైన ఇల్లు కొనాలంటే కాలుష్యం, జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలకు లేక శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ, నేడు నగరంలో, హాట్సిటీలో ఉంటూ కూడా హరిత భవనాలు కావాలంటున్నారు కొనుగోలుదారులు. దీంతో నిర్మాణ సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన గృహాలనే కాదు.. ఐజీబీసీ గుర్తింపు పొందిన నిర్మాణ సామాగ్రిని, ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. మార్కెట్లో 350 రకాల ఉత్పత్తులు.. నివాసాలకు, వాణిజ్య, కార్యాలయాల సముదాయాలకూ హరిత భవనాల గుర్తింపునివ్వటం మనకు తెలిసిందే. కానీ, దేశంలో తొలిసారిగా నిర్మాణ సామగ్రి ఉత్పత్తులకూ గుర్తింపు ప్రారంభించింది సీఐఐ. దీంతో కొనుగోలుదారులకు గృహాల్లోనే కాకుండా నిర్మాణ సామగ్రిలోనూ గ్రీన్ ప్రొ సర్టిఫికెట్ పొందిన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే వీలుందన్నమాట. ఇప్పటి వరకు 350 ఉత్పత్తులు గ్రీన్ సర్టిఫికెట్ పొందాయి. ఏసీసీ సిమెంట్, నిప్పన్ పెయింట్స్, సెయింట్ గోబియన్ గ్లాస్, అసాహి ఇండియన్ గ్లాస్, గోద్రెజ్ ఫర్నీచర్, విశాఖ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. దేశంలో గ్రీన్ బిల్డింగ్స్ ఉత్పత్తుల మార్కెట్ రూ.18 లక్షల కోట్లుగా ఉందని అంచనా. -
హైదరాబాద్లో కమర్షియల్ స్థలం.. కొంటున్నారా?
వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటు అయితే.. ఇళ్లపై రాబడి 2 నుంచి 4 శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అధిక సరఫరా, ప్రతికూల మార్కెట్, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తదితర కారణాలతో ప్రధాన నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. వాణిజ్య సముదాయల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటు అవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మించే వాణిజ్య నిర్మాణాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి. –సాక్షి, సిటీబ్యూరోఇవే కీలకం..వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా? అనే విషయాన్ని బేరీజు వేయాలి.భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కాముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది. -
ఇప్పుడు ఇల్లు.. ఇలా కొనడమే ఇష్టం
గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. గతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు ఆసక్తి చూపిన కస్టమర్లు.. ప్రస్తుతం లాంచింగ్ ప్రాజెక్ట్లలో కొనేందుకు ఇష్టపడుతున్నారు. 2023లో రెడీ టూ మూవ్, లాంచింగ్ ప్రాజెక్ట్లలో కొనుగోళ్ల నిష్పత్తి 46:18 శాతంగా ఉండగా.. 2024 నాటికి 23:24 శాతానికి చేరింది. అలాగే రూ.కోటిన్నర ధర ఉన్న లగ్జరీ గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023లో 20 శాతం మంది లగ్జరీ ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 2024 నాటికి 35 శాతానికి పెరిగిందని ఫిక్కీ, అనరాక్ సర్వేలో వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోబాల్కనీ మస్ట్.. 1, 2, 3 బీహెచ్కే.. ఇళ్లు ఏదైనా సరే బాల్కనీ ఉండాల్సిందే. గృహ కొనుగోలుదారులు నిర్మాణం నాణ్యత, ప్రాంతం, ధర, వసతులతో పాటు బాల్కనీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటిలోని ప్రతి అంగుళం స్థలాన్ని వినియోగించాలని భావించిన కస్టమర్లు.. ప్రస్తుతం ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. 75 శాతం మంది బాల్కనీ ఉండే ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించగా, 74 శాతం మంది కస్టమర్లు నాణ్యమైన నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. అనరాక్ రీసెర్చ్ దేశంలోని పలు నగరాలలో 5,510 మందిపై ఆన్లైన్లో సర్వే నిర్వహించింది. గృహాల ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారుల విశాలమైన ఇళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 50 శాతం మంది కస్టమర్లు 3 బీహెచ్కే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే.. 38 శాతం మంది 2 బీహెచ్కే గృహాలకు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్కే యూనిట్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ధరల కారణంగా ముంబైలో 44 శాతం మంది కస్టమర్లు 2 బీహెచ్కేలకు, 17 శాతం 1 బీహెచ్కేలకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణేలో 10 శాతం కొనుగోలుదారులు 1 బీహెచ్కే జై కొడుతున్నారు.పెట్టుబడులకు రియలే బెటర్.. ఏటా దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఫ్లాట్ల విస్తీర్ణాలు 11 శాతం మేర పెరుగుతున్నాయి. 2022లో 1,175 చ.అ.లుగా ఉన్న సగటు ఫ్లాట్ల సైజు.. 2023 నాటికి 1,300 చ.అ.లకు పెరిగాయి. 58 శాతం మిలీనియల్స్, 39 శాతం జెన్స్–ఎక్స్ కస్టమర్లు ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 57 శాతం మంది రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. ఇందులోనూ 36 శాతం మంది నివాస విభాగంలో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రుణ వడ్డీ రేట్లు 8.5 శాతం కంటే తక్కువగా ఉన్నంత కాలం ఇంటి కొనుగోలు నిర్ణయంపై ప్రభావం ఉండదని చెప్పారు. -
ఓపెన్ ప్లాట్లకూ రుణాలు!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు వంటి నిర్మాణ సంబంధమైన ప్రాపర్టీలకు బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ)లు గృహ రుణాలు ఇస్తుంటాయి. ఓపెన్ ప్లాట్లు, స్థలాల కొనుగోళ్లకు రుణాల మంజూరు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. పలు థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఓపెన్ ప్లాట్లకు సైతం రుణాలను మంజూరు చేపిస్తున్నాయి. ఓపెన్ ప్లాట్ల మార్కెట్ బాగుండి, మంచి అనుభవం ఉన్న డెవలపర్లకు ఫండింగ్ చేస్తుంటారు. ప్లాటింగ్ వెంచర్లో నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుంది. స్థలం కొన్న తర్వాత రోడ్లు, లైటింగ్, ఎలక్ట్రిసిటీ వంటి ఖర్చులకు మినహా పెద్దగా వ్యయం కాదు. అందుకే స్థలం కొనేందుకు కూడా లోన్లను ఇస్తుంటారు.నాలుగు గోడలకు కాలం చెల్లింది.. బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల నిధుల కొరతతో రియల్టీ ప్రాజెక్ట్లకు రుణాలు అంత ఈజీగా దొరకడం లేదు. కొత్త ప్రాజెక్ట్లకు లోన్స్ సంగతి దేవుడెరుగు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లకూ ఫండింగ్ దొరకటం కష్టంగా మారింది. నాలుగు గోడల ఇంటికి కాలం చెల్లింది. కాంక్రీట్ భవనాలకు కొనుగోలుదారులు స్వస్తి పలికేశారు. సాంకేతికతను వినియోగించే టెకీ భవనాలు, ఆధునిక వసతులుండే విలాస గృహాలకు జై కొడుతున్నారు.👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్! సౌర విద్యుత్, హోమ్ ఆటోమేషన్, ఎస్టీపీ, రెయిన్ హార్వెస్టింగ్ వంటి ఏర్పాట్లు ఉన్న గృహాల కొనుగోళ్లకే మద్దతు పలుకున్నారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఇద్దరూ ఈ తరహా ప్రాజెక్ట్ల పెట్టుబడులకే మొగ్గుచూపుతున్నారు. అందుకే డెవలపర్లు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ల నిర్మాణాలనే చేపట్టాలి. దీంతో బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల నుంచి రుణాలు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు వస్తాయి. -
‘19 ఏళ్ల కిందట భూమి అమ్మారు.. నాకేం తెలియదు’
బెంగళూరులో దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన భూమి అమ్మకం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. 2006లో భూమిని విక్రయించిన ఓ వ్యక్తి కుమార్తె తన అనుమతి లేకుండా ఆస్తిని అమ్మారని పేర్కొంటూ ప్రస్తుత యజమానులకు లీగల్ నోటీసులు పంపింది. బృహత్ బెంగళూరు మహానగర పాలకే(బీబీఎంపీ) పరిధిలో ఉన్న ఈ ఆస్తిని మహిళ తండ్రి 19 ఏళ్ల కిందట విక్రయించాడని, ఇప్పుడు కొనుగోలుదారు తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.రెడ్డిట్లో భూమి కొన్న వ్యక్తి తరఫువారు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ‘19 ఏళ్ల కిందట కొంత భూమిని బెంగళూరులో ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాం. ఆ సమయంలో తన కూతురు పెళ్లి కోసం తాను ఈ ఆస్తిని అమ్ముతున్నట్లు చెప్పాడు. పవర్ ఆఫ్ అటార్నీ (పీఓఏ) ప్రమేయం లేదు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నాం. కొనుగోలు చేసిన వ్యక్తి పేరుమీద సర్టిఫికేట్ కూడా ఉంది. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు తనను సంప్రదించలేదని ఆస్తి అమ్మిన వ్యక్తి కూతురు ఆరోపిస్తుంది. అమ్మకానికి ముందు తనను అడగలేదని, తనకు సమాచారం తెలియజేయలేదని పేర్కొంటుంది. ఆ సమయంలో తానేం మైనర్ కాదు. పైగా ఆ భూమి అమ్ముతుంది ఆమె పెళ్లి కోసమే. అయినప్పటికీ ప్రస్తుతం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇది కుటుంబ వ్యవహారమని, సామరస్యంగా పరిష్కరిస్తామని అమ్మిన వ్యక్తి కుమారుడు తొలుత చెప్పారు. అయితే కొన్ని నెలల తర్వాత మాట మార్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నాడు. కోర్టు వెలుపల సెటిల్మెంట్ కోసం ఒత్తిడి తెస్తున్నాడు. న్యాయమూర్తి ఆమెకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఏమిటి పరిస్థితి?’ అని పోస్ట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు, అమ్మే సమయంలో అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి లావాదేవీలు జరపాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా పొరపాటు జరిగితే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు. -
అడ్వాన్స్గా ఆరు నెలల రెంట్.. ఆపై ఎన్నో ఛార్జీలు
బెంగళూరులో కఠినమైన అద్దె విధానాలపై రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో అద్దెదారులను ఇబ్బంది పెట్టేలా ఉన్న నిబంధనల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అద్దెకు ఉండడం కంటే డబ్బు ఖర్చయినా సొంతంగా ఇళ్లు కొనడం బెటర్ అనే ధోరణికి వస్తున్నట్లు చెప్పారు.కొంతకాలంపాటు బెంగళూరు నగరం బయట అద్దెకు ఉన్న ఒక యూజర్ ఇటీవల నగరం లోపలకు మకాం మార్చినట్లు చెప్పారు. తమ కొత్త ఇంటి యజమాని అసంబద్ధమైన డిమాండ్లు పెడుతున్నాడని రాశారు. బెంగళూరులో ఆరు నెలల సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనను తప్పుబడుతూ ‘మొదట వారు ఆరు నెలల డిపాజిట్, అడ్వాన్స్ రెంట్ తీసుకుంటారు. మీరు ఖాళీ చేయాలనుకున్నప్పుడు ఇంటిని తిరిగి శుభ్రం చేయించేందుకు, కొత్తవారి కోసం మీరు వాడిన వస్తువులను మార్చేందుకు డబ్బు అవసరం అవుతుందని చెప్పి అధిక మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. డిపాజిట్ తిరిగి ఇచ్చే ఉద్దేశం కూడా వారికి లేదు’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: నర్సరీ ఫీజు కంటే ఇంటి అద్దె చీప్!బెంగళూరు రియల్టీ మార్కెట్లో సాధారణంగా అద్దెదారుల నుంచి ఆరు నెలల సెక్యూరిటీ డిపాజిట్ను తీసుకుంటున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. అందుకే నగరంలో స్వల్పకాలిక నివాసం ఉన్నవారు కూడా సొంతంగా ఫ్లాట్ కొనుగోలు చేసి ఈ దోపిడీ నుంచి బయటపడాలనుకుంటున్నారని రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘వారు ఆ డిపాజిట్ను ఉపయోగించి ఇంటిని పునరుద్ధరిస్తారు. అది మా డబ్బు. ప్యూర్ టార్చర్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘నా మునుపటి ఇంటి యజమాని తన ఇంటి గోడలపై 1-2 చోట్ల పెయింటింగ్ పోయినందుకు మొత్తం పెయింటింగ్ అయ్యే ఖర్చును వసూలు చేశాడు’ అని మరో యూజర్ రిప్లై ఇచ్చాడు. -
నర్సరీ ఫీజు కంటే ఇంటి అద్దె చీప్!
ప్రతి దేశంలో ఆరోగ్య సంరక్షణ, రవాణా, అద్దె, ఆహారం, యుటిలిటీల ఖర్చును పరిశీలించి చౌకైన దేశమా? ఖరీదైన దేశమా? అని నిర్ణయిస్తారు. విలియం రస్సెల్ అనే రిసెర్చ్ అనలిస్ట్ 2025లో మూడు చౌకైన ప్రాంతాల వివరాలు వెల్లడించారు. అందులో వియత్నాం ముందు వరుసలో నిలిచింది.వియత్నాం ప్రవాసులు జీవించడానికి అత్యంత చౌకైన దేశంగా ఉందని విలియం రస్సెల్ తెలిపారు. మంచి ఆహారం, స్నేహపూర్వక స్థానికులు, ఆధునిక సౌకర్యాలు, పురాతన సంప్రదాయాలు అన్నీ వియత్నాంలో ఉన్నాయని చెప్పారు. నెలకు సగటున సింగల్బెడ్రూమ్ అపార్ట్మెంట్కు 265 పౌండ్ స్టెర్లింగ్(రూ.30 వేలు), మూడు పడక గదుల అపార్ట్మెంట్కు 589 పౌండ్ స్టెర్లింగ్(రూ.68 వేలు) ఖర్చవుతుందని అన్నారు. వియత్నాంలో మొత్తం జీవన వ్యయం యూకే కంటే 59 శాతం చౌకగా ఉందని తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్లో ఏటా నర్సరీ ఫీజు రూ.1లక్షపైనే ఉందని కొందరు చెబుతున్న నేపథ్యంలో వియత్నాంలోని ఇంటి అద్దెలు వాటి కంటే చీప్గా ఉన్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: సన్టీవీ ఛైర్మన్కు ఆయన సోదరుడు నోటీసులుబొలీవియా ప్రవాసులకు రెండో అత్యంత చౌకైన దేశంగా ఉందని చెప్పారు. రాజధాని లా పాజ్లో ఒక పడకగది అపార్ట్మెంట్ ధర నెలకు 386 డాలర్లు(రూ.33 వేలు), మూడు పడక గదుల అపార్ట్మెంట్ ధర 707 డాలర్లు(రూ.45 వేలు) అని అన్నారు. జార్జియా మూడో చౌకైన గమ్యస్థానంగా ఉందని విలియం చెప్పారు. -
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
దేశంలో హై-ఎండ్ ఇళ్లకు ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ధర ఎన్ని రూ.కోట్లయినా తగ్గేదే లేదంటున్నారు కొనుగోలుదారులు. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ లిమిటెడ్ తన సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ వెంచర్ ప్రివానా నార్త్లోని ఫ్లాట్లన్నీ కేవలం ఏడు రోజుల్లోనే పూర్తిగా అమ్మేసింది. గురుగ్రామ్లో 116 ఎకరాల సువిశాల టౌన్షిప్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ రూ .11,000 కోట్లకు పైగా అమ్మకాలను సాధించింది. ఇది దేశంలోని పెద్ద నగరాల్లో ప్రీమియం గృహాలకు ఉన్న బలమైన మార్కెట్ డిమాండ్ను తెలియజేస్తోంది.గురుగ్రామ్లోని 76, 77 సెక్టార్లలో 17.7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రివానా నార్త్ లో ఆరు ఎత్తైన 50 అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు డీఎల్ఎఫ్ అభివృద్ధి చేసిన అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్లు ఇవే. 1,152 నాలుగు పడక గదుల అపార్ట్మెంట్లు, డజను లగ్జరీ పెంట్ హౌస్లు ఉన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్ ధర రూ.9.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంది.👉ఇది చదివారా? హైదరాబాద్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ లోడింగ్డీఎల్ఎఫ్ గత లగ్జరీ లాంచ్లలో కనిపించిన విజయాన్ని ప్రతిబింబిస్తూ దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు ఈ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. డీఎల్ఎఫ్ గతంలో లాంచ్ చేసిన ప్రివానా సౌత్, ప్రివానా వెస్ట్ ప్రాజెక్ట్లలో సైతం ఇలాగే వేగంగా అమ్మకాలు నమోదయ్యాయి. హై-ఎండ్ నివాసాలకు ఉన్న డిమాండ్, డీఎల్ఎఫ్ నివాస ప్రాజెక్టులపై కొనుగోలుదారులకు ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రతిస్పందనకు కారణమని కంపెనీ నాయకత్వం పేర్కొంది.ప్రివానా నార్త్ వేగవంతమైన అమ్మకాలు హై-ఎండ్ గృహాల పట్ల విస్తృత ధోరణిని హైలైట్ చేస్తాయి. 2025 తొలి త్రైమాసికంలో రూ.4 కోట్లకు పైబడిన ఇళ్ల అమ్మకాలు 28 శాతం పెరిగాయని, ఇందులో ఢిల్లీ-ఎన్సీఆర్ వాటా సింహభాగం ఉందని సీబీఆర్ఈ తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో డీఎల్ఎఫ్ రికార్డు స్థాయిలో రూ.21,223 కోట్ల ప్రీ సేల్స్ సాధించింది. భవిష్యత్తులో గురుగ్రామ్, ముంబై, గోవాలలో లాంచ్ చేసే ప్రాజెక్టులకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని కంపెనీ ఆశిస్తోంది. -
హైదరాబాద్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ లోడింగ్
నివాస విభాగాన్ని కరోనా కంటే ముందు, ఆ తర్వాత అని విభజించే పరిస్థితులు వచ్చాయి. కోవిడ్ కంటే ముందు వరకూ అపార్ట్మెంట్ విస్తీర్ణంలో కార్పెట్ ఏరియాకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అంటే ఫ్లాట్ ఏరియాలో వాస్తవంగా గృహ యజమాని వినియోగించే స్థలం ఎంత ఉందని చూసుకునేవారు. కానీ, కోవిడ్ తర్వాత నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. ఫ్లాట్లో నివాసితుడు వినియోగించే స్థలం కంటే క్లబ్హౌస్, పార్క్, గార్డెన్, లాబీ వంటి వసతులకు ఎంత స్థలం కేటాయిస్తున్నారనే దానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ లైఫ్ స్టయిల్ను కోరుకునే యువ జనరేషన్ పెరుగుతుండటంతో అపార్ట్మెంట్లో కార్పెట్ ఏరియా క్రమంగా తగ్గుతోందని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఅపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫ్లాట్ల స్థలంతో పాటు లిఫ్ట్, మెట్లు, క్లబ్హౌస్, పార్క్ ఇతరత్రా వసతుల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా కలిపితే దాన్ని సూపర్ బిల్టప్ ఏరియాగా పేర్కొంటారు. ఇక, ఫ్లాట్లో వాస్తవంగా గృహ యజమాని వినియోగించే స్థలం(గోడ నుంచి గోడ వరకూ ఉండే స్పేస్)ను కార్పెట్ ఏరియాగా పేర్కొంటారు. కరోనా మహమ్మారి కంటే ముందు వరకూ గృహ కొనుగోలుదారులు కార్పెట్ ఏరియాకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా.. కోవిడ్ తర్వాత నుంచి కార్పెట్ కంటే అపార్ట్మెంట్లోని వసతులకు(లోడింగ్) ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1) నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్ లోడింగ్ 40 శాతానికి చేరుకుంది. 2019లో ఇది 31 శాతంగా ఉంది. నివాస సముదాయాలలో అధునిక వసతులు, సౌకర్యాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్ల లోడింగ్(వసతులు)పెరుగుతోంది. విలాసవంతమైన జీవనశైలి కారణంగా గృహ కొనుగోలుదారులు అధిక వసతులు, సౌకర్యాలను కోరుతున్నారు.వసతులకు ప్రాధాన్యం దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్లలోని మొత్తం స్థలంలో 60 శాతం నివాసయోగ్యమైన స్థలం కాగా మిగిలిన 40 శాతం సాధారణ ప్రాంతం. లిఫ్ట్, లాబీ, మెట్లు, క్లబ్ హౌస్, వసతులు, ట్రెరస్ వంటి కామన్ ఏరియాలు. కరోనా కంటే ముందు వరకూ 30 శాతం కంటే తక్కువ లోడింగ్ సాధారణంగా భావించేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి విలాసవంతమైన జీవనశైలి అలవాటైపోయింది. ప్రాజెక్ట్ చిన్నదైనా, పెద్దదైనా ఆధునిక వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో అపార్ట్మెంట్లలో నివాసయోగ్యమైన స్థలం కార్పెట్ ఏరియా తగ్గుతుంది. గృహ కొనుగోలుదారులు ప్రాథమిక జీవనశైలి సౌకర్యాలతో సంతృప్తి చెందడం లేదు. ఫిట్నెస్ కేంద్రాలు, క్లబ్ హౌస్, పార్క్, గార్డెన్, గ్రాండ్ లాబీలు ఉండాలని కోరుకుంటున్నారు.రీసేల్ విలువ పెరుగుదల.. లోడింగ్ పెరిగితే కమ్యూనిటీ నివాస యోగ్యత, రీసేల్ విలువలను కూడా పెరుగుతుంది. అయితే గృహ కొనుగోలుదారులు తమ అపార్ట్మెంట్లలో వాస్తవంగా ఉపయోగించే స్థలాన్ని కోల్పోతారు. ప్రతి ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్లోని మొత్తం స్థలంలో గృహ కొనుగోలుదారులు వాస్తవంగా ఉపయోగించే స్థలం, సౌకర్యాల కోసం కస్టమర్లు ఎంత చెల్లిస్తున్నారో స్పష్టంగా పేర్కొనేలా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) నిబంధనలు రూపొందించాలి. దీంతో కస్టమర్లు చెల్లించే సొమ్ములో దేనికెంత వ్యయం అవుతుందో స్పష్టత ఉంటుంది.లోడింగ్ శాతాన్ని ఎలా లెక్కిస్తారంటే.. సూపర్ బిల్టప్ ఏరియా నుంచి కార్పెట్ ఏరియాను తీసి వేసి, కార్పెట్ ఏరియాతో భాగించాలి. వచ్చిన ఫలితాన్ని వందతో గుణిస్తే వచ్చేదే లోడింగ్ శాతం. ఉదాహరణకు.. హైదరాబాద్లో మీరు 1,500 చ.అ. అపార్ట్మెంట్ కొంటున్నారని అనుకుందాం. ఇందులో ఫ్లాట్లో కస్టమర్ వినియోగించే స్థలం 750 చ.అ.లే ఉంటుంది. మిగిలిన స్థలం లిఫ్టు, లాబీ, మెట్లు, క్లబ్ హౌస్ వంటి కామన్ ఏరియాలు ఉంటాయి. అంటే ఫ్లాట్ ఖరీదులో కస్టమర్ వాస్తవంగా వినియోగించే కార్పెట్ ఏరియాతో పాటు కామన్ ఏరియా కూడా కలిపే ఉంటుందన్నమాట. నగరంలో లోడింగ్ 38 శాతం..హైదరాబాద్లో లోడింగ్(వసతులు) శాతం 2019లో 30 శాతంగా ఉండగా.. 2022 నాటికి 33కు, ఈ ఏడాది క్యూ1 నాటికి ఏకంగా 38 శాతానికి పెరిగింది. 2025 క్యూ1 నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో అత్యధికంగా 43 శాతం లోడింగ్తో ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. 2019లోనూ ఈ ఆర్థిక నగరంలో అత్యధిక లోడింగ్ 33 శాతంతో టాప్లో నిలిచింది. అత్యల్పంగా 36 శాతం లోడింగ్తో చెన్నై చివరి స్థానంలో నిలిచింది. 2019లో ఇక్కడ లోడింగ్ 30 శాతంగా ఉంది. ఏటేటా బెంగళూరులో అపార్ట్మెంట్ లోడింగ్ క్రమంగా పెరుగుతోంది. 2019లో ఇక్కడ 30 శాతం లోడింగ్ ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 41 శాతానికి పెరిగింది. 2022లో ఇది 35 శాతంగా ఉంది. గత ఏడేళ్లలో బెంగళూరులో సగటు లోడింగ్ అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేస్తూ ఉంది. ఎన్సీఆర్ లో 2019లో లోడింగ్ శాతం 31 శాతం నుంచి 2025 క్యూ1 నాటికి 41 శాతానికి చేరింది. పుణేలో 32 శాతం నుంచి 40కు, కోల్కతాలో 30 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది. -
ఇలా చేస్తే.. ఇంటి పైకప్పు అదుర్స్!
సాక్షి, సిటీబ్యూరో: ఫాల్స్ సీలింగ్తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. దీంతో పాటు సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసే ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది.మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి.తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడక గది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది.గోడల రంగుకు, సీలింగ్కు ఒకే రకమైంది కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని వేసుకోవచ్చు. దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కని్పంచే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు.జాగ్రత్తలివే..ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి.ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 10–12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి.ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.ఉడెన్ ఫాల్స్ సీలింగ్లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
ఆఫీస్ స్థలాలకు డిమాండ్.. అమెరికన్ కంపెనీల హవా..
దేశీయంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో అమెరికన్ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్ చ.అ. స్పేస్ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్స్పేస్ లీజింగ్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2022–24 క్యాలెండర్ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్ సంస్థలు ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్ నగరాల్లో ఆఫీస్ డిమాండ్కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి.ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్ఎల్ హెడ్ (ఆఫీస్ లీజింగ్, రిటైల్ సర్వీసెస్), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (కర్ణాటక, కేరళ) రాహుల్ ఆరోరా చెప్పారు. అమెరికన్ సంస్థలు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు. -
తక్కువ ధర.. నాణ్యమైన ఇల్లే కావాలి..
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం. అందుబాటు ధర.. నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు.. నగరంలో ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్లను నిర్మించాలని సూచించింది.మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వే చెబుతోంది. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి.ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.40 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడు మంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ సిటీ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టి సారిస్తున్నారు. -
ఇల్లు కొనడానికి ఇదే సరైన కాలం..
వర్షంలో బయటకు వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో కారణాలెన్నో! కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షణ్ణంగా తెలుస్తుంది కాబట్టి.. సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. వర్షం నీరు వెళ్లే సౌకర్యం లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతానికి సంబందించి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్ స్టాండ్ లేక రైల్వే స్టేషన్కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.నాణ్యత తెలుస్తుంది.. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలంలోనే.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్లో కొనుగోలు చేసే కొనుగోలుదారుల మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశం అయ్యాక కామన్గా ఏర్పాటు చేసిన వసతుల్లో లీకేజ్లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా కాలంలో ప్రాజెక్ట్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్రూమ్, సీలింగ్, పంబ్లింగ్, డ్రైనేజీ లీకేజ్ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్ను కోరే వీలుంటుంది.👉 ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..రీసేల్ ప్రాపర్టీలనూ.. రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధ్రుడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా? అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్ మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది.వర్షంలో రాయితీలు.. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్–అక్టోబర్ పండగ సీజన్ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు. -
ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..
కొనేటప్పుడు తక్కువ ధరకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ రేటు రావాలనుకునేది ఒక్క స్థిరాస్తిలో మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో బూమ్ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే చాలు ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి అమ్మేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించలేవు. మార్కెట్ సెంటిమెంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గిరాకీ, సరఫరా కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని విక్రయించాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి.వసతులే కీలకం.. ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాల్స్ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆస్పత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే.. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరం ఉండదు కాబట్టి ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకం.సౌకర్యాలే ముఖ్యం కాదు.. ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజారవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు ఇలాంటివే కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే.. భవిష్యత్తులో ఇల్లు విక్రయించే సమయంలో కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి విలువ లెక్కగడతారని గుర్తుంచుకోవాలి.చిక్కులుండొద్దు.. స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నా ఓ విషయంలో మాత్రం చిన్నపాటి తేడా ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేము. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఉండాలన్నమాట. ఇంటికి లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటు మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.👉 ఇది చదవలేదా? రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..నిర్వహణతోనే రెట్టింపు విలువ.. గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది. ఇంటి విలువ కేవలం ఫ్లాట్కో.. ప్లాట్కో పరిమితం కాదు.. సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోంది. ఫుల్లీ ఫర్నీచర్, సెమీ ఫర్నీచర్ ఫ్లాట్లకు ఎక్కువే రేటు వస్తుంది. -
వేగంగా హాస్టళ్ల మూసివేత
బెంగళూరులో పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల మూసివేత వేగంగా జరుగుతోంది. నగరంలోని టెక్ కారిడార్లలో వీటిని మరింత ఎక్కువగా క్లోజ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కఠినమైన కొత్త పౌర నిబంధనలు, టెక్ కంపెనీలు తమ సిబ్బందికి లేఆఫ్స్ ప్రకటిస్తుండడం ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.బెంగళూరులోని మహదేవపుర, మారతహళ్లి వంటి ప్రాంతాల్లో పీజీలు 25 శాతం వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ప్రతిరోజూ రెండు పీజీలు మూతపడుతున్నాయని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ వ్యవహారాన్ని గమనించిన ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ హార్దిక్ జోషి ఈ అంశంపై తన లింక్డ్ఇన్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఇది వేలాది మందిని ప్రభావితం చేసే నిశ్శబ్ద సంక్షోభం’ రాసుకొచ్చారు.బీబీఎంపీ చట్టంలో నిబంధనలుగత ఏడాది బీబీఎంపీ చట్టం 2020లోని సెక్షన్ 305 కింద బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ప్రవేశపెట్టిన పలు నిబంధనలతోనే ఇలా పీజీలు మూతపడుతున్నట్లు కొందరు చెబుతున్నారు. ఈ చట్టంలో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. పీజీ ఆపరేటర్లు ట్రేడ్ లైసెన్సులు పొందాలి. పరిశుభ్రత, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను పాటించాలి. పీజీలో ఉంటున్న ప్రతి వారికి కనీసం 70 చదరపు అడుగుల నివాస స్థలాన్ని కేటాయించాలి. 40 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉన్న రోడ్లపై ఉన్న పీజీలను ఇకపై ఆపరేట్ చేయడానికి అనుమతి లేదు.టౌన్ ప్లానింగ్, లైసెన్సింగ్ ఉల్లంఘనలకు సంబంధించి ఒక్క మహదేవపుర జోన్లోనే ఏప్రిల్లో 100కు పైగా పీజీ కిచెన్లను సీజ్ చేశారు. విస్తృత ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఆపరేటర్లు అన్ని సాధారణ ప్రాంతాలను కవర్ చేస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి నివాసికి రోజుకు కనీసం 135 లీటర్ల నీటి సరఫరా జరిగేలా చూడాలని, భోజనం వడ్డిస్తే ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు పొందాలని సూచించారు.12,000 పీజీల్లో 2,500కే రిజిస్ట్రేషన్బెంగళూరు పీజీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సుఖీ సియో మాట్లాడుతూ నగరంలో 12,000 పీజీలకు గాను 2,500 మాత్రమే అధికారికంగా రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. ఇప్పటికీ 10 వేలకు పైగా అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నాయని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై బీబీఎంపీ ఎప్పుడైనా దాడులు నిర్వహించవచ్చని స్పష్టం చేశారు. చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దాంతో స్థానికంగా పీజీల్లో ఉంటున్నవారు ఖాళీ చేస్తున్నారు. ఇది కూడా ఒకింత పీజీలు తగ్గేందుకు కారణంగా నిలుస్తుంది. -
హైదరాబాద్లో పెరిగిన ఆఫీస్ అద్దెలు.. అయినా తక్కువే..
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో ఆఫీసు స్పేస్ అద్దెలు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా తర్వాత ఆఫీసు స్పేస్ విభాగం శరవేగంగా కోలుకుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్ నగరాలలో కార్యాలయ స్థలాలు హాట్స్పాట్గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు, అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయమైన పెరుగుదల నమోదు చేస్తోందని అనరాక్ సంస్థ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోదాదాపు అన్ని బహుళ జాతి, దేశీయ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ విధానానికి స్వస్తి చెప్పాయి. పూర్తి స్థాయిలో కార్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఆఫీసు స్పేస్కు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో కార్యాలయాల అద్దె విలువలు వృద్ధి చెందుతున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ మోడల్ పని విధానాలు మరింత సంప్రదాయక, నిర్మాణాత్మక కార్యాలయ కార్యకలాపాలకు దారి తీసింది. కంపెనీలు ప్రధాన నగరాలలో తమ ఉనికిని రెట్టింపు చేశాయి. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), టెక్ దిగ్గజాలు, బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు గ్రేడ్–ఏ కార్యాలయ స్థలాల లీజులు, కొనుగోళ్లకు మొగ్గు చూపించాయి. మన దేశంలో ఆఫీసు స్పేస్ విభాగంలో జీసీసీలు చోదకశక్తిగా మారాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే జీసీసీలు ఏకంగా 83.5 లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకున్నాయంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు.అమెరికాలో అనిశ్చితితో.. యూఎస్ కంపెనీలు మన దేశంలోని గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ లీజులపై ఆసక్తి చూపిస్తుంటాయి. ప్రస్తుతం దేశీయ ఆఫీసు స్పేస్ విభాగంలో అమెరికాకు చెందిన సంస్థల వాటా 45 శాతం ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో వ్యాపార విధానంలో అనిశ్చితి ఏర్పడటంతో ఇండియా లోని ఆఫీసు స్పేస్కు మరింత డిమాండ్ ఏర్పడింది. ముంబైలోని ఆఫీసు స్పేస్ లీజులలో అమెరికాకు చెందిన బ్యాంక్లు, ఆర్థిక సంస్థల వాటా ఏకంగా 48 శాతంగా ఉంటుంది.అత్యధికంగా ముంబైలో.. నాలుగేళ్లలో అత్యధికంగా ముంబైలో అద్దెలు 28 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత హైదరాబాద్లో 24.1 శాతం వృద్ధి చెందాయి. ఇక ఢిల్లీ–ఎన్సీఆర్లో 20 శాతం, బెంగళూరులో 15.8 శాతం, పుణెలో 11.1 శాతం, చెన్నైలో 9.1 శాతం మేర పెరిగాయి. 2022లో ముంబైలో చ.అ. అద్దె నెలకు రూ.131గా ఉండగా.. 2025 నాటికి రూ.168కి చేరింది. హైదరాబాద్లో నాలుగేళ్ల క్రితం రూ.58గా ఉండగా.. ఇప్పుడది రూ.72కు చేరింది.మన దగ్గరే తక్కువ.. హైదరాబాద్లో ఆఫీసు స్పేస్ అద్దెలు గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్లలో 24.1 శాతం మేర వృద్ధి చెందాయి. నాలుగేళ్లలో ప్రధాన నగరాలలో ఆఫీసు స్పేస్ అద్దెల వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అయినా కూడా ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇప్పటికీ మన దగ్గరే అద్దెలు తక్కువగా ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం, అందుబాటు ధరలు, చురుకైన ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ వంటివి నగరంలో ఆఫీసు స్పేస్ అద్దెల వృద్ధికి ప్రధాన కారణాలు. -
రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..
గృహాలకు డిమాండ్ పెరుగుతుండటంతో గృహ రుణ మార్కెట్ కూడా బలపడుతోంది. అర్బన్ మనీ గణాంకాల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాలలో 2025 ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల పంపిణీ పరిమాణం 10 శాతం, విలువలు 15 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా రూ.కోటి కంటే ఎక్కువ టికెట్ సైజు ఉన్న రుణాలు ఏడాది కాలంలో గృహ రుణ పంపిణీలో 21 శాతం మేర వృద్ధి చెందాయి. తుది గృహ కొనుగోలుదారుల డిమాండ్, పట్టణీకరణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలతో గృహ రుణాలు సులభతరంగా పంపిణీ అవుతున్నాయి. గృహ రుణ పరిమాణం, విలువలు రెండు అంకెల వృద్ధిని నమోదు స్తోందని అర్బన్ మనీ రీసెర్చ్ వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని ప్రధాన నగరాలలో మహిళా గృహ రుణ గ్రహీతలు పెరుగుతున్నారు. ప్రతి ఐదు గృహ రుణాలలో ఒక మహిళా రుణ గ్రహీత ఉంది. గృహరుణ పంపిణీలో పురుషుల వాటా 10 శాతం కాగా.. మహిళ రుణ గ్రహీతల వాటా 9 శాతంగా ఉంది. అదే లోన్ అమౌంట్లో చూస్తే మగవారి వాటా 14 శాతంగా ఉండగా.. మహిళల వాటా 23 శాతంగా ఉంది. అర్బన్ మనీ నివేదిక ప్రకారం ప్రధాన నగరాలలో సగటు రుణం రూ.74 లక్షలుగా ఉంది. ఇది ఏటేటా 5 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. సగటు రుణం రూ.70 లక్షలు సగటున పురుషులు రూ.76 లక్షల రుణం తీసుకుంటుంటే.. మహిళా రుణ గ్రహీతలు రూ.70 లక్షల రుణం తీసుకుంటున్నారు. పురుషులు తీసుకునే లోన్ అమౌంట్ ఏటా 3 శాతం వృద్ధి చెందుతుండగా.. మహిళల రుణం ఏకంగా 13 శాతం పెరుగుతోంది. లోన్ అమౌంట్ వారీగా చూస్తే.. రూ.కోటి కంటే ఎక్కువ రుణం వాటా 21 శాతం కాగా.. రూ.45 లక్షల నుంచి రూ.కోటి మధ్య లోన్ వాటా 32 శాతం, రూ.45 లక్షల కంటే తక్కువ లోన్ వాటా 47 శాతంగా ఉంది. -
రియల్ఎస్టేట్ మోసాలకు ‘రెరా’ రెడ్ లైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల కొనుగోలుదారుల ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రమోటర్లు, డెవలపర్లు, రియల్టర్లు కొనుగోలుదారులను మోసగించే చర్యలను సహించేది లేదని రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ సంస్థలకు రూ.42 కోట్ల జరిమానాలు విధించినట్లు చెప్పారు. కొనుగోలుదారుల ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్న కొన్ని వాణిజ్య ప్రకటనల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.2023 జూన్లో రెరాకు పూర్తిస్థాయిలో చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించిన తర్వాత ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సత్యనారాయణ వివరించారు. 500 చదరపు అడుగులకు పైబడిన లేదా కనీసం తొమ్మిది.. అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు, ప్లాట్లు నిర్మించే ప్రతి ప్రాజెక్టు ‘రెరా’కింద రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలని తెలిపారు. అనుమతుల సమయంలో హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాలు, సంస్థలు కూడా విధిగా ‘రెరా’రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రమోటర్లు, డెవలపర్లకు సూచిస్తున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. రెరాలో ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి? ఈ ఏడాది మే చివరి నాటికి ‘రెరా’లో 9,641 ప్రాజెక్టులు నమోదయ్యాయి. 4,237 వ్యక్తులు/సంస్థలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నమోదు చేసుకున్నారు.రెరా ప్రధాన బాధ్యతలేంటి? ప్రమోటర్లు, డెవలపర్లు కొనుగోలుదారులకు జవాబుదారీగా ఉండేలా చేయడం, న్యాయబద్ధంగా వ్యవహరించేలా చూడడం, పారదర్శకత నెలకొల్పి మోసాలను నివారించడం, ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులకు సకాలంలో ప్రాపర్టీలను పూర్తిచేసి అందించేలా చూడడం, ఒప్పందాలు సరిగా అమలయ్యేందుకు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం రెరా ప్రధాన బాధ్యతలు. ప్రజల నుంచి రెరాకు ప్రధానంగా ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం లేదని, ఒప్పందం మేరకు నిర్ణీత గడువులోగా ఫ్లాట్లను అప్పగించటంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సకాలంలో ప్రాజెక్టులు మొదలుపెట్టకపోవటం, లేఅవుట్ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో అభివృద్ధి చేయకపోవడం, అ సంపూర్తిగా ఉన్న ఫ్లాట్లను రిజిస్టర్ చేయడం, నిధు లను మళ్లించడం, కొనుగోలుదారుల నుంచి వసూ లు చేసిన డబ్బును దుర్వినియోగం చేయడం, అగ్రిమెంట్లలో పేర్కొన్న మేరకు వసతులు కల్పించకపోవడం, ఒకే ప్లాట్/ఫ్లాట్ను ఇద్దరు ముగ్గురికి విక్రయించడం, వినియోగదారుల నుంచి డబ్బు వసూ లు చేసి కనిపించకుండా పోవటం, రెరాలో రిజిస్టర్ చేసుకోని ఏజెంట్లు ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడంపై ప్రధానంగా ఫిర్యాదులు వస్తున్నాయి.రెరా అనుమతి లేకుండానే ప్రకటనలు వస్తున్నాయి. వాటికి చెక్పెట్టే విధానం ఉందా? రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులపై సుమోటోగా కేసులు నమోదుచేస్తున్నాం. ప్రమోటర్ల అధికారిక వెబ్సైట్లను పరిశీలించి రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులను గుర్తించి షోకాజ్ నోటీసులు ఇస్తున్నాం. రెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిస్తే.. 040–29394972కు ఫోన్ చేసిగానీ, 9000006301 నంబర్కు వాట్సాప్ ద్వారా గానీ, rera&maud@telangana.gov.in, secy&rera&maud@telangana.gov.in వెబ్సైట్లలోగానీ ఫిర్యాదు చేయవచ్చు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ప్రీ లాంచింగ్ కార్యక్రమాలు చేపట్టడం రెరా చట్టరీత్యా నేరం. రిజిస్టర్ చేసుకోని సంస్థల ప్రకటనలను నియంత్రించేందుకు రెరా త్వరలోనే అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోబోతోంది. ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి? అందులో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? చర్యల తరువాత సంస్థల తీరు మారిందా? మీ నిర్ణయాలపై అప్పిలేట్కు వెళ్లిన కేసులెన్ని? 2,198 ఫిర్యాదులు అందాయి. వాటిలో 1,278 ఫి ర్యాదులను పరిష్కరించాం. 862 ప్రాజెక్టులపై జరిమానాలు విధించాం. 42 కేసుల్లో అప్పీల్కు వెళ్లారు.ఇప్పటివరకు ఎంత జరిమానా విధించారు? అందులో సంస్థలు ఎంత చెల్లించాయి? నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు రూ.41,04,09,425 జరిమానా విధించాం. అందులో రూ.15,76,82,170 వసూలు అయ్యింది. వసూలు కాని జరిమానాను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తారా? 92 కేసుల్లో రెవెన్యూ రికవరీ చట్టం కింద జరినామాలు వసూలు చేయాలని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను కోరాం. అందులో 3 కేసుల్లో ఆర్ఆర్ యాక్ట్ కింద జరిమానాలు వసూలు చేశారు. మిగతావి కూడా త్వరలో వసూలు చేస్తాం.రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నరెడ్కో, క్రెడాయ్, తెలంగాణ బిల్డర్స్ ఫోరం, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్, వినియోగదారుల సంఘాల సహకారంతో రియల్ మోసాలను అరికట్టే చర్యలు చేపట్టాం. రెరా అమలులో ఇతర రాష్ట్రాలు ఏవిధంగా ముందుకెళ్తున్నాయి? మన రాష్ట్రంలో రెరా పర్మనెంట్ అథారిటీని ప్రారంభించి రెండేళ్లు అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో అంతకంటే ముందునుంచే ఉన్నా యి. అయినా వాటితో సమానంగా మన దగ్గర రిజిస్ట్రేషన్లు జరిగాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో రెరాను 2017లోనే ప్రారంభించారు. మన రాష్ట్రంలో రెరా చైర్మన్గా నన్ను, సభ్యులుగా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణను 2023 జూలైలో నియమిస్తే.. సిబ్బందిని 2024 నవంబర్లో కేటాయించారు. సభ్యులు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణలతో కలిసి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. -
ఏటా రూ.20 లక్షలు సంపాదన.. ఇల్లు కొనలేని స్థితి
ఏడాదికి రూ.20 లక్షలు సంపాదించే ఓ వ్యక్తి ఇప్పటికీ అపార్ట్మెంట్ కొనలేని స్థితిలో ఉన్నాడని చేసిన పోస్ట్ దేశంలోని వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలపై చర్చకు దారితీసింది. నెలకు అన్ని ఖర్చులు పోను రూ.1.2 లక్షలు మిగులుతున్నా తన మిత్రుడు తాను ఉంటున్న నగరంలో ఒక ఇంటిని కొనులేని పరిస్థితిలో ఉన్నాడని ఒక వక్తి చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఎక్స్(గతంలో ట్విటర్) వేదికగా అఖిలేశ్ అనే వ్యక్తి పోస్ట్ చేస్తూ..‘గుర్గావ్లోని నా స్నేహితుడు ఏటా రూ.20 లక్షల సీటీసీ వేతనంతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పన్నులు, ఈపీఎఫ్, మినహాయింపులు తర్వాత నెలకు రూ.1.2 లక్షలు మిగులు ఉంటుంది. తాను వస్తువుల కొనుగోళ్లలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు. కారు లేదు. పిల్లలు లేరు. తాను, తన భార్య మాత్రమే ఉంటున్నారు. ఇళ్లు కొందామని ప్రయత్నిస్తున్నాడు. కానీ తాను వెళ్తున్న ప్రతి ప్రాజెక్టులో అపార్ట్మెంట్ విలువ రూ.2.5 కోట్లతో ప్రారంభమవుతుంది. ఇన్ఫినిటీ పూల్స్, జెన్ గార్డెన్స్, ఇటాలియన్ మార్బుల్, బయోమెట్రిక్ లిఫ్టుల గురించి బ్రోచర్లలో ఊదరగొడుతున్నారు. దీన్ని కొనుగోలు చేస్తే కేవలం జీతం కోసం బతకాల్సి ఉంటుంది. బఫర్ మనీ ఉండదు. సెలవులు ఉండవు. ఎమర్జెన్సీ ఉండదు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒకటో తేదీ వచ్చిందంటే వణుకు‘నా స్నేహితుడు దేశంలో చాలామంది ఉద్యోగులు సంపాదించే దానికంటే కొంత మెరుగ్గానే సంపాదిస్తున్నాడు. కానీ ఇప్పటికీ తాను నివసిస్తున్న నగరంలో ఇల్లు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. రియల్డీ మార్కెట్ వేరే వారికోసం సరిగ్గా డిజైన్ చేసిన విధంగానే పనిచేస్తోంది’ అని తెలిపారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘రియల్టీ వ్యాపారం పెరుగుతోందా..? జీతాలు తగ్గుతున్నాయో అర్థం కావడం లేదు’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. గుర్గావ్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉందని మరొకరు వ్యాఖ్యానించారు.was having a discussion with a friend in gurgaon. his ctc is 20 lakh. his in-hand is around 1.2 lakh per month after taxes, epf, and deductions. he doesn't splurge. no car. no kids. just a waifu.every project he visits starts at 2.5 crore. the brochures talk about infinity…— akhilesh (@akhileshutup) June 5, 2025 -
రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదల
దేశవ్యాప్తంగా ప్రాపర్టీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. ఈ ప్రతిపాదిత చట్టం సమకాలీన డిమాండ్లకు సరిపోని నాటి 1908 రిజిస్ట్రేషన్ చట్టాన్ని భర్తీ చేయడానికి ఏర్పాటు చేశారు. కొత్త బిల్లు ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. తద్వారా బ్యూరోక్రసీ, మధ్యవర్తుల అవసరం తగ్గనుంది.ప్రాపర్టీ డాక్యుమెంటేషన్పై ఆధారపడిన ఆర్థిక లావాదేవీలు, చట్టపరమైన నిర్ణయాలు, పరిపాలనా సేవలను క్రమబద్ధీకరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. భూ దందాల్లోనే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాల్లో కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ మార్పులు ప్రాధాన్యత చోటుచేసుకుంటున్నాయి.1908 రిజిస్ట్రేషన్ చట్టం ఆన్లైన్ డాక్యుమెంట్ నిర్వహణ, డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వంటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడలేదు. ఈ వెసులుబాట్లు టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో అత్యవసరంగా మారాయి. ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇప్పుడు కేవలం భూ దందాలకు మాత్రమే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాలకు కీలకంగా మారుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆన్లైన్ అప్లోడ్లు, ఆధార్ ఆధారిత ధ్రువీకరణను అమలు చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా దేశం అంతటా స్థిరమైన, విశ్వసనీయమైన వ్యవస్థను స్థాపించడానికి కొత్త చట్టం అవసరమని భావిస్తున్నారు. ఈ ఏకరూపత పౌరులందరికీ సమర్థవంతమైన, సురక్షితమైన ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపుప్రతిపాదిత అంశాలు..గృహ కొనుగోలుదారులకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా నిర్వహించడం కొత్త బిల్లులోని ప్రధానాంశాల్లో ఒకటి. ప్రతిపాదిత విధానంలో పౌరులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పదేపదే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆస్తి పత్రాలను డిజిటల్గా నమోదు చేసుకోవచ్చు.ఆన్లైన్ ద్వారా పేపర్ వర్క్ తగ్గుతుందని, ప్రక్రియలను వేగవంతం చేస్తుందని, మధ్యవర్తులపై ఆధారపడటాన్ని పరిమితం చేస్తుందని భావిస్తున్నారు.ఆస్తుల లావాదేవీలకు డిజిటల్ రికార్డులను తప్పనిసరి చేయడం ద్వారా చట్టపరమైన రక్షణ పెరుగుతుంది. ఈ చర్యతో అమ్మకం ఒప్పందాలు, తనఖా పత్రాలు, సేల్ సర్టిఫికేట్లు వంటి కీలక డాక్యుమెంట్ల చట్టబద్ధత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.డిజిటల్-ఫస్ట్ విధానాన్ని అవలంబించడం ద్వారా, ఆస్తి లావాదేవీలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా చేయడమే ఈ బిల్లు లక్ష్యం. -
రియల్టీలో రూ.700 కోట్లతో కొత్త ఏఐఎఫ్ ప్రారంభం
రియల్టీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న మీనాక్షి ఆల్టర్నేటివ్స్ (ఎం-ఆల్ట్స్) రూ.700 కోట్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్) ‘మీనాక్షి రియల్ అసెట్స్ ఫండ్స్’ను ప్రారంభించినట్లు తెలిపింది. రియల్ ఎస్టేట్, క్లీన్ ఎనర్జీలో బలమైన పట్టున్న మీనాక్షి గ్రూప్నకు కొత్తగా ప్రారంభించిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్సిడరీగా ఈ ఫండ్ పెట్టుబడి వ్యూహాలు అందిస్తోందని, వినూత్న ఫైనాన్సింగ్ మోడళ్లను తీసుకువస్తుందని భావిస్తున్నారు.ఏఐఎఫ్ ద్వారా తాజాగా మీనాక్షి గ్రూప్ రూ.700 కోట్ల పెట్టుబడులు పెడుతుండడం దేశీయ వాణిజ్య, నివాస స్థిరాస్తి మార్కెట్పై పెరుగుతున్న నమ్మకాన్ని హైలైట్ చేస్తుంది. గత పదేళ్ల నుంచి ఏఐఎఫ్లు పట్టు సాధిస్తున్నాయి. ఇవి సంస్థాగత, అధిక నికర విలువ కలిగిన పెట్టుబడిదారులను సాంప్రదాయ పెట్టుబడి మార్గాలకు మించి వారి పోర్ట్ఫోలియోలను వైవిధ్యపరుస్తున్నాయి. మీనాక్షి రియల్ అసెట్స్ ఫండ్ దేశంలో అభివృద్ధి చెందుతున్న పట్టణ మౌలిక సదుపాయాలు, ఆర్థిక విస్తరణకు అనుగుణంగా నిర్మాణాత్మక పెట్టుబడి అవకాశాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. అందుకు స్థిరాస్తి రంగాన్ని ఎంచుకోవడం వృద్ధికి బాసటగా నిలుస్తుందని నమ్ముతుంది.ఈ ఫండ్ సెబీ ఆమోదించిన కేటగిరీ-2 ఏఐఎఫ్ డెట్, ఈక్విటీ పెట్టుబడులను సమతుల్యం చేస్తూ హైబ్రిడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అనుసరిస్తుంది. మొత్తం రూ.700 కోట్ల కార్పస్తో ఆరేళ్ల ఇన్వెస్ట్మెంట్ విభాగంలో రియల్ ఎస్టేట్ డీల్స్ ద్వారా రాబడులను ఆప్టిమైజ్ చేయడానికి ఈ ఫండ్ రూపొందించారు. రియల్టీ డెవలపర్లు, మార్కెట్ లీడర్లు, దేశంలోని మైక్రో మార్కెట్లలో కీలక సంస్థలకు మూలధనాన్ని కేటాయించడం ఈ ఫండ్ లక్ష్యం.ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. ఎంతంటే..మీనాక్షి ఆల్టర్నేట్స్ సీఈఓ మహేష్ కాట్రగడ్డ మాట్లాడుతూ ఏఐఎఫ్ లైసెన్స్ పొందడం తమ వృద్ధికి కీలకంగా మారిందని చెప్పారు. తమ బృందం భవిష్యత్తు అవకాశాలను పక్కాగా అంచనా వేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ వద్ద మూడు సంభావ్య ఒప్పందాలున్నాయన్నారు. కొన్నేళ్లుగా మీనాక్షి గ్రూప్ స్థిరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తోంది. దీనిపనితీరు క్లీన్ ఎనర్జీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంగా మీనాక్షి ఆల్టర్నేటివ్స్ను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా నిలబెట్టినట్లు సంస్థ అధికారులు తెలిపారు. -
మియావాకి ఫారెస్ట్ను విస్తరిస్తున్న రియల్టీ కంపెనీ
ప్రముఖ ఎకో రియల్టీ సంస్థ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి ఫారెస్ట్ను మరింత విస్తరిస్తూ ‘వుడ్స్ శంషాబాద్’ రెండో దశను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.300 కోట్ల ఆదాయం సమకూరుతుందని కంపెనీ అంచనా వేసింది. భారత్లో సుస్థిర నివాస స్థలాలకు పెరుగుతున్న డిమాండ్ను ఇది బలపరుస్తుందని తెలియజేసింది.వుడ్స్ శంషాబాద్ స్థానిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించేలా జపనీస్ పర్యావరణ పునరుద్ధరణ పద్ధతి మియావాకి అటవీకరణ పద్ధతిని అమలు చేస్తుంది. దీని ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో అడవిని తలపించేలా పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ పర్యావరణాన్ని పెంపొందిస్తారు. గత మూడేళ్లుగా అభివృద్ధి చేసిన మొదటి దశలో భాగంగా ఇప్పటికే 4,50,000 చెట్లు, మొక్కలతో స్వయం సమృద్ధి సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఫేజ్ 2తో స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ 100 ఎకరాల్లో దీన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 150 కొత్త స్థానిక వృక్ష జాతులను సాగు చేయడం, 141 పక్షి జాతులు, 126 పండ్లు, పుష్పించే చెట్లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: భారత్లో టెస్లా తయారీ లేనట్లే!స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఫౌండర్, సీఈఓ కీర్తి చిలుకూరి ఈ విస్తరణపై మాట్లాడుతూ..‘ఫేజ్ 1లో భాగంగా కంపెనీ అన్ని అంచనాలను అధిగమించింది. సుస్థిర జీవన నమూనాకు పెరుగుతున్న డిమాండ్ను ఇది ధ్రువీకరించింది. ఫేజ్ 2 వ్యక్తులు, కుటుంబాలకు ప్రత్యేకమైన రోజువారీ మెరుగైన జీవన వాతావరణాన్ని అనుభవించేందుకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది’ అన్నారు. -
ఇంట్లో ఇలాంటి మొక్కలే పెంచుతున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలను పెంచుకుంటున్నారు. దాంతో అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత ఏంటంటే.. వీటికయ్యే వ్యయం చాలా తక్కువ. నిర్వహణ కూడా తేలికే. పైగా అందంగా, అద్భుతమైన డిజైన్లతో అలంకారప్రాయంగా ఉంటాయి.ఇండోర్ గార్డెనింగ్పై ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్కే. నిర్వహణ అత్యంత సులువు. తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఉంచినప్పటికీ.. స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తుంది. నిలువుగా పెరుగుతుంది. మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచూ శుభ్రం చేస్తుండాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి. లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది.గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు. ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి.కాలుష్య కారకాలను తొలగించడం, కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియా ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్లను పీల్చుకోవటంలో, ఇండోర్లోని గాలిని శుభ్రం చేయడంలో పీస్ లిల్లీలు అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది పుష్పించే మొక్క కాదు. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వస్తుంది. ఇది పెరగాలంటే నేల, తేమ అవసరం. దీనికి తరుచూ నీళ్లు పోస్తుండాలి. ఆకులు పడిపోతున్నాయంటే నీటి అవసరం ఉందన్న విషయం మీరు గ్రహించాలి.ఈ మొక్కలు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు అనేక రకాలుగా వస్తాయి. చైనీస్ ఎవర్గ్రీన్ లేదా ఆగ్లోనెమాస్ బహుముఖ ప్రయోజనాలు ఉండే మొక్కలు. వీటి నిర్వహణ సులువు. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంటీరియర్ డిజైనింగ్లో వినియోగించుకోవచ్చు. అధిక స్థాయిలో ఆక్సిజన్ను విడుదల చేయడంతో పాటు హానికారక రసాయనాలను పీల్చుకుంటాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో.. ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కలు పెరుగుతాయి. -
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు అడ్డాగా హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లోని వాణిజ్య స్థిరాస్తి రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) జోరు కొనసాగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలు గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీపీ)లకు అడ్డాగా మారాయి. దేశంలోని 7 ప్రధాన నగరాలలో 2025 తొలి త్రైమాసికం(క్యూ1)లో 1.94 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగగా.. ఇందులో 43 శాతం వాటా జీసీసీలదేనని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.సౌత్ జోరు.. 2025 క్యూ1లో జీసీసీలు 83.5 లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అదే 2024 క్యూ1లో జరిగిన 48.7 లక్షల చ.అ. జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. అత్యధికంగా దక్షిణాది నగరాలలో 64 శాతం వాటా 53.4 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో 19.5 లక్షల చ.అ. లీజులు జరిగాయి. జీసీసీ లావాదేవీల్లో అత్యధికంగా ఐటీ, ఐటీఈఎస్ రంగం వాటా 35 శాతం కాగా.. బీఎఫ్ఎస్ఐ రంగం 22 శాతం, తయారీ, పారిశ్రామిక రంగం వాటా 13 శాతంగా ఉంది. 100–110 బిలియన్ డాలర్లకు.. 2024 ముగింపు నాటికి ఏడు నగరాలలో మొత్తం 1,700 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ సుమారు 52 బిలియన్ డాలర్లు. ఆయా జీసీసీలలో 17–18 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2030 నాటికి 2,200–2,300 జీసీసీ సెంటర్లకు చేరుతుందని అంచనా. వాటి మార్కెట్ విలువ 100–110 బిలియన్ డాలర్లకు చేరుతుంది. అలాగే ఆయా జీసీసీలలో ఉద్యోగుల సంఖ్య 24–28 లక్షలకు చేరుతుంది.జీసీసీ అంటే? జీసీసీలకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందకొస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు. -
హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాలలో వీకెండ్ అంటే సంథింగ్ స్పెషల్.. నిద్ర లేచే సమయం నుంచి తినే తిండి, తిరిగే ప్రాంతం వరకూ.. ప్రతీది డిఫరెంట్గా ఉండాలనుకుంటారు. కరోనా తర్వాత నుంచి ఈ అభిరుచికి పర్యావరణం కూడా తోడైంది. దీంతో వారంలో కనీసం రెండు రోజులైనా పచ్చని ప్రకృతిలో సేదతీరాలని భావిస్తున్నారు. చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, రణగొణ ధ్వనులు, కాలుష్యం లేని ప్రాంతం.. ఇంటికి తిరిగొస్తూ వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు వెంట తెచ్చుకునే వీలూ ఉండాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే వీకెండ్ హోమ్స్ ఆదరణ పెరిగింది.ఈ ప్రాంతాల్లో డిమాండ్ కడ్తాల్, తలకొండపల్లి, షాద్నగర్, శంకర్పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు. కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే.. అందమైన వీకెండ్ హోమ్స్ను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది.ఎక్కడ చూసినా గ్రీనరీనే.. వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్లలో సాధ్యమైనంత స్థలాన్ని గ్రీనరీకే కేటాయిస్తారు. ఒకవేళ వీకెండ్ హోమ్స్ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని డెస్టినేషన్ వెండింగ్స్ కోసం వినియోగించి.. వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. ఒకవేళ కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకునేందుకు వీలుగా తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తారు. -
హైదరాబాద్లో ఇంటి సెంటిమెంట్..
ఓ వైపు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.. నలువైపులా విస్తరిస్తోంది.. అందుకు తగ్గట్టే నివాస భవనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ.. నగరవాసుల్లో సొంతింటి పట్ల ఆసక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నా ఇల్లు అనే భావోద్వేగ బంధానికి, సెంటిమెంట్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన ‘బియాండ్ బ్రిక్స్: ది పల్స్ ఆఫ్ హోం బయింగ్’ అనే అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరోరియల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా సొంతింటి కల సాకారం చేసుకోవాలనే తపన మాత్రం నగరవాసుల్లో తగ్గడం లేదని తేల్చిన ఈ అధ్యయనం దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నగరాల్లో ప్రజలు సొంత ఇంటి గురించిన ఆలోచనా విధానాన్ని పరిశీలించారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలివి..ఇల్లు కొనాల్సిందే..సొంతింటిని కోరుకుంటున్న నగరాల వ్యాప్తంగా చూస్తే, అత్యధిక శాతం మందికి అది సెంటిమెంట్గా మారిన నగరంగా చెన్నై తొలిస్థానంలో నిలిచింది. ఆ నగరంలో 86శాతం మంది సొంత ఇంటికి జైకొడుతున్నారు. ఆ తర్వాత స్థానాన్ని 85శాతంతో ముంబై దక్కించుకుంది. ఇక అహ్మదాబాద్వాసుల్లో 83శాతం మంది నా ఇల్లే నా స్వర్గం అంటుంటే.. ఆ తర్వాత స్థానంలో నిలిచిన మన హైదరాబాద్లో 81శాతం మంది ఇల్లు కొనాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. మన నగరం తర్వాత 80శాతంతో కోల్కతా, 74శాతంతో ఢిల్లీ, 73శాతంతో బెంగళూర్లు సొంతింటి కలలో తేలిపోతున్నాయి. సొంతిల్లు ఎందుకంటే.. సుదీర్ఘకాలం సురక్షితంగా భద్రంగా జీవించాలి అంటే సొంత ఇల్లు ఉండాల్సిందేనని నగరవాసులు భావిస్తున్నారు. సొంతిల్లు వైపు నడిపిస్తున్న తర్వాతి కారణాల్లో ఆర్థిక స్థిరత్వం.. అంటే ఇల్లు కొనడమేననే ఆలోచన బలంగా ఉండటం, 3వ కారణంగా సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న సొంత ఇల్లు అనే భావన.. వంటివి ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. రూ.50 లక్షలు పైబడిన ఆదాయం ఉన్న అధికాదాయ వర్గాల వారిలో 91శాతం మంది సొంతిల్లు కావాలంటుంటే, అత్యల్ప ఆదాయం ఉన్న వారిలోనూ 71శాతం మంది అదే కోరిక వ్యక్తం చేస్తున్నారు.ఇల్లు కావాలి.. అవి కూడా కావాలి..ఇల్లు కొనేటప్పుడు ప్రధానంగా ఏం చూస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా వైద్య సౌకర్యాలకే అత్యధికులు ప్రాధాన్యత ఇచ్చారు. ఆస్పత్రులకు సమీపంలో నివసించడానికే 58శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. షాపింగ్కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. తమ ఇల్లు మార్కెట్స్కు సమీపంలో ఉండాలని 53శాతం మంది ఆశిస్తుంటే, రవాణా సౌకర్యాలు బాగుండే చోటైతేనే రైటు అంటున్నవారు 40శాతం మంది. అంతేనా ఇరుగు పొరుగుతో కాలక్షేపం ఉండాల్సిందే అంటున్న 23శాతం మంది కమ్యూనిటీ క్లబ్లకు సమీపంలోని ఇంటిని ఇష్టపడుతున్నారు. సొంత ఇంటితో పాటే ఆరోగ్యమూ మా తోటే అంటున్న నగరవాసుల్లో 16శాతం మంది జిమ్ తదితర వ్యాయామ సౌకర్యాలు దగ్గరలో ఉన్న ఇంటిని కోరుకుంటున్నారు. నగరంలో అత్యధికులు సొంత ఇంటిని ఇప్పటికీ సెంటిమెంట్గా భావిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుతం కనిపిస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలోని ఒడిదుడుకులు తాత్కాలికమేనని స్పష్టం అవుతోంది. సొంత ఇంటి కల నిజం చేసుకునేవారి కల సాకారం చేసే విధంగా అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు అందజేయగలిగితే.. సిటీ రియల్ రంగానికి భవిష్యత్తుకి దోకా ఉండదు. -
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులు
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిలలో రికార్డు స్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు ఐదేళ్లలో హైదరాబాద్లో రికార్డు స్థాయిలో పెరిగాయని ఓ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చ.అ.కు రూ.7,450గా ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు చూస్తే.. 2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో రూ.12,400గా ఉండగా.. 2024 నాటికి రూ.15,350కి పెరిగాయి.👉ఇది చదివారా? హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..అందుబాటు గృహాలలో 15 శాతం ఏడు ప్రధాన నగరాలలో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో అత్యధికంగా ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది.మధ్యతరగతిలో 18 శాతం ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాలలో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువలలో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్లోనే నమోదైంది. మన నగరంలో మిడ్సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది. -
ఇళ్ల కొనుగోళ్లపై ఆసక్తి ఎక్కడ ఎక్కువంటే..
దేశవ్యాప్తంగా ఆస్తుల కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇటీవల సంస్థ నిర్వహించిన ‘బియాండ్ బ్రిక్స్-ది పల్స్ ఆఫ్ హోమ్ బైయింగ్’ సర్వేలో భాగంగా దేశంలో ఇళ్ల కొనుగోలుపై విభిన్న వర్గాల ప్రజల ఆసక్తులు ఎలా ఉన్నాయో తెలియజేసింది. చెన్నై (86 శాతం), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (85 శాతం), అహ్మదాబాద్ (83 శాతం) ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సర్వేలో పేర్కొంది.సర్వేలోని వివరాల ప్రకారం ఢిల్లీ-ఎన్సీఆర్లోని గృహ కొనుగోలుదారులు నిర్మాణంలో ఉన్న ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. బెంగళూరులో ఆ ఆస్తుల పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. ఇళ్ల కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అంశాల్లో ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాల అందుబాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ అంశంలో హైదరాబాద్ (81 శాతం), కోల్కతా (80 శాతం) దీర్ఘకాలిక భద్రతా కారణాల దృష్ట్యా బలమైన కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామందేశంలోని టాప్ 8 టైర్-1 నగరాల్లోని 1,629 మంది పట్టణ గృహ కొనుగోలుదారుల నుంచి వివరాలు సేకరించి ఈమేరకు నివేదిక రూపొందించారు. ఈ సర్వేలో మిలీనియల్స్, అధిక ఆదాయ వ్యక్తులు అత్యంత చురుకైన కొనుగోలుదారులుగా ఉన్నారని తేలింది. నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. కొవిడ్19 అనంతర కాలంలో నివాస డిమాండ్ గణనీయంగా పెరిగిందని అన్నారు. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు, స్టాంప్ డ్యూటీ రిబేట్లు వంటివి కొనుగోలుదారులకు కలిసి వస్తున్నాయని తెలిపారు. మారుతున్న జీవనశైలి, యువ కొనుగోలుదారుల్లో పెరిగిన ఆర్థిక సామర్థ్యం భారత రెసిడెన్షియల్ మార్కెట్ను పెంచుతోందని చెప్పారు. -
హైదరాబాద్లో ఆఫీస్ అద్దెలు జంప్
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో అద్దె ఆదాయం గత మూడేళ్లలో 24 శాతం పెరిగినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. చదరపు అడుగు నెలవారీ అద్దె ధర 2022లో రూ.58గా ఉంటే.. అది 2025 నాటికి రూ.72కు పెరిగింది. అత్యధికంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో (ఎంఎంఆర్) చదరపు అడుగుకు అద్దె రూ.131 నుంచి రూ.168కి చేరింది. 2022 నుంచి 2025 మధ్య కాలంలో (కరోనా అనంతరం) ప్రీమియం ఆఫీసు వసతులకు డిమాండ్ స్థిరంగా వృద్ధి చెందినట్టు.. ముఖ్యంగా ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్ కీలక కేంద్రాలుగా ఉన్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది. అన్ని మెట్రోల్లోనూ అద్దె ధరల్లో మంచి వృద్ది నమోదైనట్టు పేర్కొంది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఆఫీస్ వసతుల అద్దె చదరపు అడుగునకు రూ.92 నుంచి రూ.110కి పెరిగింది. 20 శాతం వృద్ధి నమోదైంది. బెంగళూరులో నెలవారీ అద్దె చదరపు అడుగునకు రూ.16% పెరిగి రూ.82 నుంచి రూ.95కి చేరింది.పుణెలో 11 శాతం పెరుగుదలతో రూ.80కి, చెన్నైలో 9.1 శాతం పెరిగి రూ.72కు చదరపు అడుగు అద్దె చేరుకుంది. ఇదీ చదవండి: పీసీలకు పెరిగిన గిరాకీయూఎస్ కంపెనీల నుంచి అధిక డిమాండ్ గ్రేడ్ ఏ ఆఫీస్ లీజింగ్లో 45 శాతం యూఎస్ కంపెనీల నుంచే ఉన్నట్టు అనరాక్ గ్రూప్ కమర్షియల్ లీజింగ్ ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. ముంబైలో బీఎఫ్ఎస్ఐ ఆఫీస్ లీజింగ్లో 48 శాతం యూఎస్కు చెందిన బ్యాంక్లు లీజింగ్కు తీసుకున్నట్టు చెప్పారు. భారత్లో గ్రేడ్ ఏ ఆఫీస్ వసతులకు అమెరికన్ కంపెనీల నుంచి బలమైన డిమాండ్ ఉన్నట్టు తెలిపారు. -
ఇంటికి ఫైర్ ప్రూఫ్ ఉండాల్సిందే..
నివాసం, వాణిజ్యం, కార్యాలయం.. నిర్మాణం ఏదైనా సరే అగ్ని ప్రమాద నివారణ ఉపకరణాలు తప్పనిసరి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జరిగే ప్రమాదం వెలకట్టలేనిది. ఆస్తి, ప్రాణ నష్టాన్ని భర్తీ చేయలేనిది. అందుకే ప్రతీ భవనంలోనూ ఫైర్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వాటిని నిర్వహణ చేయాలి లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు అవి పనిచేయవు. ఈమధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, సిలిండర్ పేలుళ్లు.. ఇలా కారణాలనేకం.🔸 హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యా, వైద్య సదుపాయాలు, కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక వసతులు ఇలా రకరకాల కారణాలతో నగరంలో జనాభా, వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నివాస, వాణిజ్య భవనాలలో అగ్ని ప్రమాద భద్రతా నిబంధనలు, ఉత్పత్తులు మనశ్శాంతి ఇవ్వడమే కాకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. చిన్న మంట ఒక గదిని దహించేందుకు సగటున మూడు నిమిషాల సమయం పడుతుంది. అందుకే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేగవంతమైన ప్రతిస్పందన అత్యవసరం. ప్రతిస్పందనలో సెకన్ల సమయం ఆలస్యమైనా.. విపత్తు తీవ్రత పెరుగుతుంది. – సాక్షి, సిటీబ్యూరోఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి..? అపార్ట్మెంట్లు: 🔸 ప్రతీ ఫ్లాట్ లోపల స్మోక్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలి. 🔸 మంటలను ఆర్పే పరికరం, యంత్రం ఉండాలి. ముఖ్యంగా వంట గదిలో తప్పనిసరి. 🔸 మంటలను నియంత్రించే తలుపులు, కిటికీలు ఉండాలి. కనీసం 30–60 నిమిషాల పాటుతట్టుకునే శక్తి ఉండాలి.లిఫ్ట్: 🔸 లిఫ్ట్ డోర్లకు అగ్నిని తట్టుకునే శక్తి ఉండాలి. 🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలలో ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బందిని నియమించుకోవాలి. 🔸 లిఫ్ట్ ముందు భాగంలో ‘అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్ను వినియోగించరాదు’, ‘మెట్ల మార్గం’.. తదితరాలను సూచించే సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి.బేస్మెంట్, పార్కింగ్ ఏరియా 🔸 ఆటోమెటిక్ స్ప్రింక్లర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 🔸 పొగను గుర్తించే పరికరాలు, అలారం ఉండాలి. 🔸 పార్కింగ్, ప్రధాన భవనం మధ్య భాగంలో మంటలను నియంత్రించే తలుపులను ఏర్పాటు చేయాలి. 🔸 ఇంధనం, రంగులు, వార్నిష్ వంటి మండే గుణం ఉన్న వస్తువులను భద్ర పర్చకూడదు. 🔸 అగ్ని ప్రమాదం జరిగే తప్పించుకునే సైన్ బోర్డులు, లైటింగ్లను ఏర్పాటు చేయాలి. కారిడార్లు, కామన్ ఏరియాలు: 🔸 ప్రతీ 30 మీటర్ల దూరంలో ఒక మాన్యువల్ కాల్ పాయింట్ల (ఎంసీపీ) ను ఏర్పాటు చేయాలి. 🔸 కారిడార్లలో 2 గంటల పాటు మంటలను తట్టుకునే గుణం ఉన్న గోడలు, తలుపులను ఏర్పాటు చేయాలి. 🔸 ఫైర్ అలారం స్పీకర్లు, అత్యవసర లైట్లు, మెరిసే ఎగ్జిట్ గుర్తులను పెట్టాలి. అసెంబ్లీ ఏరియా 🔸 ఓపెన్ స్పేస్, గ్రౌండ్ ఫ్లోర్లో సురక్షితమైన అసెంబ్లీ జోన్లను గుర్తించాలి. 🔸 లిఫ్ట్, మెట్ల దగ్గర అగ్నిమాపక సంకేతాలు, గుర్తులను ఏర్పాటు చేయాలి. 🔸 బేస్మెంట్, లిఫ్ట్ లాబీలలో పొగ తొలగింపు వ్యవస్థను పెట్టాలి. 🔸 సహజ, యాంత్రిక వెంటలేషన్ తప్పనిసరి. అగ్నిమాపక మౌలిక సదుపాయాలు 🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనంలో ప్రతీ అంతస్తులోనూ నీటిని సరఫరాను అందించే పైప్లు, హోస్ రీల్ ఉండాల్సిందే. 🔸 ఫైర్ హైడ్రంట్ సిస్టమ్ ఉండాలి. 🔸 అండర్గ్రౌండ్, ఓవర్హెడ్ ఫైర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లను ఏర్పాటు చేయాలి. 🔸 డీజిల్ లేదా ఎలక్ట్రిక్తో నడిచే ఫైర్ పంప్ రూమ్ తప్పనిసరి.రూఫ్, టెర్రర్.. 🔸 అగ్నిమాపక సిబ్బంది వెళ్లేందుకు వీలుగా ఉండాలి. 🔸 మంటలను ఆర్పేందుకు ప్రత్యేకంగా వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తప్పనిసరి. 🔸 హైరైజ్ భవనాలతో ప్రతీ 24 మీటర్ల దూరంలో అత్యవసర సమయంలో ఆశ్రయం పొందేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. మెట్లు..🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు రెండు మెట్ల మార్గాలు తప్పనిసరి. 🔸 అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు ప్రత్యేకంగా మెట్ల మార్గం ఉండాలి. 🔸 మెట్ల మార్గంలోని తలుపులు కనిష్టంగా 1–2 గంటల పాటు మంటలను నియంత్రించే గుణం ఉన్న వాటినే ఏర్పాటు చేయాలి. 🔸 పొగ ప్రవేశించకుండా నిరోధించే మెట్లను నిర్మించుకోవాలి. చేయాల్సినవి.. 🔸 తప్పించుకునే మార్గాలు, మెట్ల మార్గాలు, అగ్ని ప్రమాద హెచ్చరికలు, సూచికలను గుర్తించుకోవాలి. 🔸 ఇంట్లో లేనప్పుడు విద్యుత్ మెయిన్స్ను ఆపివేయాలి. 🔸 ఇంట్లో అగ్ని మాపక యంత్రం ఉంచుకోవాలి. 🔸 ఇసుకతో నిండిన అగ్నిమాపక బకెట్ను ఏర్పాటు చేసుకోవాలి.చేయకూడనివి🔸 అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫర్నీచర్ వెనుక లేదా టాయిలెట్లతో దాక్కోకూడదు. 🔸 ఐఎస్ఐ ప్రమాణాలు ఉన్న ఉత్పత్తులను మాత్రమే వాడాలి. 🔸 అనధికారి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దు. మీటర్ను ఓవర్లోడ్ చేయకూడదు. 🔸 ప్రమాదకర పదార్థాలు, ఉత్పత్తులను నిల్వ చేయకూడదు. 🔸 ఫైర్ ఎగ్జిట్ పాయింట్లకు అడ్డంగా ఏమీ పెట్టరాదు. 🔸 విద్యుత్ వ్యవస్థల మరమ్మతులు, నిర్వహణ తప్పనిసరి. -
హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..
‘కొనేటప్పుడు తక్కువకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువకు పోవాలి’ అని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే రాబడి ఎక్కువగా ఉన్న చోట కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్సే ఎక్కువ రాబడి వస్తుందని ఓ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి ఏటా స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తుందని పేర్కొంది. - సాక్షి, సిటీబ్యూరోస్థలాల కొరతే కారణం.. పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని ఓ సంస్థ సీఈఓ తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం,అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని ఓ సంస్థ రీసెర్చ్ హెడ్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసిక కాలంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ. 2018–21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్ చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్బల్లాపూర్, హోస్కేట్, కొంబల్గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 🔸2018–21 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్ప్రెస్వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
రియల్ ఎస్టేట్.. యుద్ధం ఎఫెక్ట్..
దేశీయ స్థిరాస్తి రంగంపై దాయాదుల పోరు దెబ్బ పడింది. సాయుధ పోరాటాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధాలతో ఆస్తి, ప్రాణ నష్టం కలగడమే కాకుండా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతుంది. యుద్ధాలు నిర్మాణ రంగాన్ని కూడా నిలిపివేస్తాయి. తుది వినియోగదారులు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గించడంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో స్థిరాస్తి లావాదేవీలపై ప్రభావాన్ని చూపిస్తుంది. గృహ కొనుగోలుదారులు తమ నిర్ణయాలను నిలిపివేస్తారు. బహుళ జాతి సంస్థలు కొత్త ఆఫీసుల ఏర్పాటు, విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తారు. రిటైలర్లు తమ విస్తరణ ప్రణాళికలకు బ్రేక్లు వేస్తారు. అయితే ఈ అవరోధం తాత్కాలిక కాలమే.. – సాక్షి, సిటీబ్యూరో స్థిరాస్తి రంగంపై యుద్ధం ప్రభావం ఇలా..🔸నివాసం: ఢిల్లీ–ఎన్సీఆర్, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇళ్ల కొనుగోళ్లు 5–10 శాతం మేర తగ్గవచ్చు. అయితే ఇది కొద్దికాలమే.. సాధారణంగా అనిశ్చితి సమయంలో లగ్జరీ గృహ కొనుగోలుదారులు కొనుగోలులో ఆలస్యం చేస్తారు. సాధారణ స్థితి పునరుద్ధరణ అయ్యాక ముందుగా మధ్య ఆదాయ వర్గాల గృహాలకు డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే సిమెంటు, ఉక్కు ధరలు పెరుగుతూనే ఉంటాయి.🔸వాణిజ్యం: తాజా యుద్ధం ఇంకా కొనసాగితే కనుక బహుళ జాతి సంస్థలు మన దేశంలోకి ప్రవేశ, విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేస్తాయి. దీంతో ఆఫీసు స్పేస్ లీజులపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలిక డిమాండ్ కారణంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), బీఎఫ్ఎస్ఐ, ఐటీ రంగాలలో ఆఫీసు స్పేస్ లీజులు, కొనుగోలు లావాదేవీలు 12 లేదా అంతకంటే తక్కువ సమయంలోనే తిరిగి పుంజుకుంటాయి.🔸రిటైల్: దీర్ఘకాలిక లీజులు, అద్దె మినహాయింపు నిబంధనల కారణంగా బ్రాండెడ్ మాల్స్పై పెద్దగా ప్రభావం పడదు. కానీ, మాల్స్లో జనసంచారం, రద్దీ తగ్గడంతో పాటు కొత్త స్టోర్ ప్రారంభాలు వాయిదా పడతాయి.🔸ఆతిథ్యం: యుద్ధంతో సహజంగానే ఢిల్లీ, కశీ్మర్ వంటి ఇతర ప్రభావిత ప్రాంతాలలో పర్యాటక ప్రాంతాల రద్దీ తగ్గుతుంది. ఆయా ప్రాంతాలలో హోటల్ ఆక్యుపెన్సీ 10–15 శాతం క్షీణిస్తుంది. ఇండో–పాక్ యుద్ధంతో.. 1971లో ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య 13 రోజుల పాటు జరిగిన యుద్ధ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిలో భారీ తగ్గుదల నమోదైంది. 1970 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా ఉన్న జీడీపీ.. 1972 నాటికి 1 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం 11 శాతానికి పైగా దాటింది. నిర్మాణ పనులు సైనిక ప్రదేశాలకే పరిమితమయ్యాయి.🔸నివాసం: ఆర్థిక రాజధాని ముంబైలో(అప్పట్లో బొంబాయి) స్థానిక రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్, ఉక్కుపై కఠిన నియంత్రణ విధించింది. నిర్మాణ సామగ్రి కొరత కారణంగా గృహ ప్రాజెక్ట్ల అనుమతులు 12 శాతం మేర తగ్గాయి. అద్దె నియంత్రణ చట్టం కారణంగా రెంట్లు స్థిరంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పినప్పటికీ.. గృహాల అద్దెలు పెరగలేదు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు దాదాపు 10 శాతం మేర తగ్గాయి.🔸వాణిజ్యం: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) చెప్పుకోదగిన స్థాయిలో రాలేదు. ప్రైవేట్ కార్యాలయ స్థలాల అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. దేశంలో ఖరీదైన, డిమాండ్ కలిగిన ప్రాంతాలైన ముంబైలోని పోర్ట్, ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లలో భారీగా ఆఫీసు వేకెన్సీలు కనిపించాయి. అయితే పరిమిత సరఫరా, కఠినమైన నిబంధనల కారణంగా కార్యాలయాల అద్దెలు మాత్రం తగ్గలేదు.🔸రిటైల్: ఇప్పటి లాగా 1971లో దేశంలో హైస్ట్రీట్ రిటైల్ రంగం వ్యవస్థీకృతంగా లేదు. ఎక్కువగా అసంఘటిత రంగంగానే ఉండేది. కానీ పాత ఢిల్లీ, కోల్కతాలోని స్థానిక దుకాణాలకు జన సంచారం గణనీయంగా తగ్గింది. 1971 నుంచి అందుబాటులో ఉన్న కోర్టు రికార్డ్ల ప్రకారం అద్దెదారులలో పెరిగిన ఒత్తిడి కారణంగా ముంబైలో దుకాణాల అద్దె వివాదాలు 18 శాతం మేర పెరిగాయి.🔸ఆతిథ్యం: దేశీయ పర్యాటక రంగం యుద్ధంతో ప్రభావితమైంది. 1970లో 20.2 లక్షలుగా ఉన్న విదేశీ పర్యాటకుల రాకపోకలు.. 1971 నాటికి 19.6 లక్షలకు తగ్గింది. ఢిల్లీలో హోటళ్ల ఆక్యుపెన్సీ 45 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఆ రోజుల్లో హాస్పిటాలిటీ రంగంలో ప్రధాన సంస్థ అయిన ఇండియన్ హోటల్స్ కంపెనీ కూడా రెండంకెలలో ఆదాయం పడిపోయింది. ప్రత్యక్షంగా శ్రీనగర్ పర్యాటక ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది.నాలుగు అంశాలపై ప్రతికూలత.. బంగ్లాదేశ్ విమోచనం ప్రధాన అంశంగా 1971లో ఇండియా–పాకిస్తాన్ మధ్య, అలాగే తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి మన దేశంలోకి చొచ్చుకురావడంతో 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ రెండు సందర్భాల్లోనూ దాయాదుల పోరుతో స్థిరాస్తి రంగంలో నాలుగు కీలక విభాగాలైన నివాస, వాణిజ్య, రిటైల్, ఆతిథ్య రంగాలపై యుద్ధం ప్రభావం చూపించింది.🔸 వినియోగదారులు, పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గుతుంది. గృహ కొనుగోలుదారులు కొనుగోళ్లను ఆలస్యం చేస్తారు. సంస్థలు తమ కార్యాలయాల విస్తరణ లీజు లావాదేవీలను వాయిదా వేస్తారు. పెట్టుబడిదారులు బంగారం, స్టాక్ మార్కెట్లు, క్రిప్టో కరెన్సీ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు ఆసక్తి చూపుతారు.🔸ఉక్కు, సిమెంటు, కాపర్, టైల్స్, శానిటరీ వేర్, రంగులు వంటి నిర్మాణ సామగ్రి ముడి పదార్థాల కొరత ఏర్పడుతుంది. దీంతో ఇన్పుట్ ధరలు పెరుగుతాయి.🔸ప్రభుత్వం సైన్యం కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ రంగంపై ఖర్చును పెంచుతాయి. మౌలిక సదుపాయాలు, వినియోగదారుల రియల్ ఎస్టేట్పై ఖర్చును తగ్గిస్తాయి.🔸సాయుధ పోరాటాలు అద్దెలను పెద్దగా ప్రభావితం చేయకపోయినా.. డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల గృహ మూలధన విలువలు దెబ్బతింటాయి.కార్గిల్ వార్తో.. 🔸 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం స్వల్పకాలమైనా.. ఎక్కువ ప్రభావితమైంది. యుద్ధం కారణంగా మూడు నెలల పాటు మార్కెట్లు భయాందోళనకు దారితీసినా త్వరగానే కోలుకుంది.🔸 నివాసం: దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్పటికే ఆసియా ఆర్థిక సంక్షోభం ప్రభావంతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో గృహ అద్దె విలువలు ప్రత్యక్షంగా దెబ్బతిన్నాయి. ఢిల్లీ, ముంబైలోని ప్రధాన నివాస ప్రాంతాల్లోని అద్దె విలువలు మూడు నెలల్లో 3–8 శాతం మేర పడిపోయాయి. 1999 చివరి నాటికి అట్టడుగు స్థాయికి క్షీణించాయి. ఆసక్తికరంగా కార్గిల్ యుద్ధ సమయంలో ముంబైలోని చారిత్రాత్మక, ప్రధాన వ్యాపార ప్రాంతమైన కఫ్ పరేడ్లో లగ్జరీ అపార్ట్మెంట్ ధర చ.అ.కు రూ.20,000–23,200 మధ్య అమ్ముడవడం కొసమెరుపు.🔸 వాణిజ్యం: 1999లో ప్రధాన నగరాల్లో సుమారు 48 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. కన్నాట్ ప్లేస్ వంటి సెంట్రల్ బిజినెస్ డి్రస్టిక్ట్ ప్రాంతాలలో ఖాళీలు 11–15 శాతం మధ్య పెరిగాయి. అద్దెలు స్వల్పంగా తగ్గాయి. పెద్ద అంతర్జాతీయ కంపెనీలు లీజు లావాదేవీలు రద్దు చేయలేదు. కానీ.. కొంతకాలం పాటు వాయిదా వేశాయి. అప్పట్లో బెంగళూరు సిలికాన్ వ్యాలీ కాదు కానీ కోరమంగళం వంటి ప్రాంతాల్లో పూర్తిస్థాయి ఐటీ పార్క్లు ఉన్నాయి. వీటిల్లో అద్దె నెలకు చ.అ.కు రూ.35–65 మధ్య లీజుకు పోయాయి.🔸 రిటైల్: దేశంలో ప్రధాన మాల్స్ అయిన ముంబైలోని క్రాస్రోడ్స్, ఢిల్లీలోని అన్సల్ ప్లాజాల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. 1999లో ప్రీమియం రిటైల్ రియల్ ఎస్టేట్ వాణిజ్య రియల్టీ కంటే ఎక్కువ అద్దెలను చవిచూసింది. కానీ, యుద్ధ వాతావరణంతో చాలా మంది రిటైలర్లు తమ స్టోర్ ఓపెనింగ్లను కొంతకాలం పాటు నిలిపివేశారు.🔸 ఆతిథ్యం: కార్గిల్ యుద్ధం సమయంలో ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే ప్రాంతాలు మినహా పర్యాటక పరిశ్రమ గణనీయంగా బలంగా ఉంది. 1999లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు 5.3 శాతం మేర పెరిగాయి. దీనికి ప్రధాన కారణం అప్పటి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇచి్చన ప్రోత్సాహం, రూపాయి విలువ తగ్గడమే. ఈ 3 నెలల్లో ఉత్తర భారతదేశంలో హోటళ్ల రద్దు 20–30 శాతం పెరిగాయి. ఎక్కువగా ఢిల్లీ, కశీ్మర్ లోని హోటళ్లు ప్రభావితమయ్యాయి. 2003 నాటికి పర్యాటకుల సంఖ్య ఏటా 44 వేలకు చేరింది.యుద్ధం తర్వాత ఏమైందంటే.. దాయాదుల మధ్య జరిగిన రెండు యుద్ధాల తర్వాత దేశీయ రియల్ ఎస్టేట్ రంగం మూడు ప్రధాన అంశాల నుంచి వేగంగా కోలుకుంది. గృహాలు, కార్యాలయాల అవసరం ఎప్పటిలాగే డిమాండ్ కొనసాగింది. యుద్ధంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులలో నెలకొన్న భయాందోళలు తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కఠిన రుణ నిబంధనలను సరళతరం చేసింది. అలాగే స్టాక్ మార్కెట్లు త్వరగా కోలుకున్నాయి. ఈ రెండు యుద్ధాలతో వివిధ పాయింట్లతో నిఫ్టీ సుమారు 5 శాతం పడిపోయినప్పటికీ.. సానుకూల రాబడిని అందించడానికి 5–6 నెలల్లోనే తిరిగి క్షీణించాయి. -
ఇలా చేస్తే ఇంటి విలువ తగ్గుతుంది
హైదరాబాద్లో ఓ హైరైజ్ అపార్ట్మెంటది. దాదాపు పదేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసి.. నివాసిత సంఘానికి అప్పగించేసింది నిర్మాణ సంస్థ. రెండు మూడేళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఒకరిద్దరు ప్రతికూల సభ్యులతో నివాసిత సంఘం సర్వనాశనమైంది. పదేళ్ల క్రితం డెవలపర్ వసూలు చేసిన రూ.3.2 కోట్ల కార్పస్ ఫండ్.. ప్రస్తుతం వడ్డీతో సహా కలిపి రూ.4–5 కోట్ల వరకుంది. ఏం లాభం ప్రాజెక్ట్ నిర్వహణ చేసుకునే స్థితిలో అసోసియేషన్ లేదు. మధ్యలో ఓసారి కమ్యూనిటీ బాధ్యతలు చేపట్టేందుకు మహిళా సభ్యులు ధైర్యంగా ముందుకొస్తే.. వాళ్ల మీద లేనిపోని పోలీసు కేసులు పెట్టడంతో మనకొచ్చిన గొడవెందుకులే అని వాళ్లూ వెనుదిరిగారు. ఫలితంగా ఆ అపార్ట్మెంట్ రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి బోసిపోయింది. దీంతో ప్రస్తుతం అక్కడ అపార్ట్మెంట్ ధర చ.అ.కు రూ.5 వేలు ఉంటే.. ఈ ప్రాజెక్ట్లో మాత్రం రూ.3,500లకు మించి పలకట్లేదు. – సాక్షి, సిటీబ్యూరోరెసిడెన్షియల్ అసోసియేషన్లలో ఒకరిద్దరు సభ్యులతో కలిగే నష్టాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. నగరంలోని కమ్యూనిటీ అసోసియేషన్ల లో 50 శాతం వరకు ఇలాంటివే ఉంటాయంటే ఆశ్చర్యం లేదు. వార్షిక నిర్వహణ బాధ్యత నివాసిత సంఘాలదే అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తే.. తగ్గేది మనం ఉండే ఇంటి విలువే.ప్రతీది బిల్డరే చేయాలంటే ఎలా?ప్రతి ఒక్కరూ కష్టపడినే సొమ్ముతోనే ఇల్లు కొనుక్కుంటారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోమా? నాలుగైదేండ్లకు ఒకసారి రంగులు వేసుకోవటం, పగుళ్లు వచ్చినా, డ్రైనేజీ, బోర్, లిఫ్ట్ వంటి వాటిల్లో సమస్యలొస్తే రిపేరు చేసుకోమా? అలాగే అపార్ట్మెంట్లలో ఉండే వాళ్లూ అంతే అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి చేసుకోవాలే తప్ప.. ప్రాజెక్ట్లో ఏ నిర్వహణ పనులైనా బిల్డరే చేయించాలని పట్టుబడుతూ కూర్చుంటే పాడైపోయేది మీరు ఉండే ఇళ్లేనని గుర్తుంచుకోండి. నిర్వహణ వ్యయాన్ని కార్పస్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టుకోవాలే గానీ అన్నింటికీ బిల్డరే చేయాలని కూర్చుంటే మూర్ఖత్వమే అవుతుంది. ఎవరి ప్రాపరీ్టని వాళ్లే కాపాడుకోవాలి.పైన పటారం.. లోన లొటారం..‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా.. భవనం బయట నుంచి చూస్తే రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి వికారంగా కనిపిస్తుంటుంది గానీ అదే అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అందమైన ఇంటీరియర్తో లగ్జరీగా బాగుంటుంది. అయినా ఏం లాభం బయటి నిర్మాణం అంద విహీనంగా కనిపిస్తుంటే ఇంటి విలువ తగ్గుతుంది. పాజిటివ్ మైండ్సెట్ ఉన్న సభ్యులనే ఎన్నుకొని ప్రాజెక్ట్ను అభివృద్ధి పరుచుకోవాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.నివాసిత సంఘానికి సప్త సూత్రాలు!➤పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్లనే అధ్యక్షులుగా ఎన్నుకోవాలి. నిర్వహణ కోసం వారిని ప్రోత్సహించాలి. వాళ్ల పనులకు అడ్డుపడుతూ, లోపాలను ఎంచకూడదు.➤ఇదేమీ వేతనం వచ్చే పదవి కాదు. సామాజిక సేవ లాంటిదే. అలాంటప్పుడు వాళ్ల పనులు వదిలేసి మన ప్రాజెక్ట్ బాగుండాలని, అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ముందుకొస్తే లేనిపో ని మాటలతో, అభాండాలను వేయకూడదు.➤ప్రతి అసోసియేషన్లో 2 శాతం నెగిటివ్ మైండ్సెట్ ఉన్న సభ్యులుంటారు. వాళ్లను వదిలేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయాలను తీసుకోవాలి. ఒకరిద్దరు సభ్యుల చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు.➤కమ్యూనిటీ అంతా ఒక కుటుంబంలా ఉంటే.. ఆనందం, ఆరోగ్యంతో పాటు బయటి వాళ్లలో కమ్యూనిటీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. దీంతో ప్రాజెక్ట్ విలువ పెరుగుతుంది.➤పిల్లలు ఉంటే వీకెండ్స్, సెలవు రోజుల్లో ఆటలు, సాంసృతిక పోటీల వంటివి నిర్వహించాలి. పెద్దల కోసం తీర్థయాత్రలు, వన భోజనాల వంటివి ఏర్పాటు చేయాలి.➤రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలను క్రమం తప్పకుండా చెక్ చేపించాలి. పార్క్, గ్రీనరీ, లిఫ్ట్, జనరేటర్ వంటి వసతులను నిర్వహణ చేసుకోవాలి. ఇందుకోసం అయ్యే వ్యయాలను సభ్యులు అందరూ కలిసి పంచుకోవాలి. -
గృహ కొనుగోళ్లలో మారుతున్న ఆలోచనలు.. ఇవన్నీ ఉండాల్సిందే!
గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. ధర, సౌకర్యాలే కాదు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? ఆఫీసులు, వినోద కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగణలోకి తీసుకొని గృహాలను ఎంపిక చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఆరోగ్యానికి ప్రాధాన్యం: ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను గమనిస్తున్నారు. అత్యవసర సమయంలో ఎంతసేపట్లో ఆసుపత్రికి చేరుకోవచ్చు, ఎంత సమీపంలో వైద్య సదుపాయాలు ఉన్నాయనే విషయాలను పరిశీలిస్తున్నారు. పెద్దల ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఈ విధంగా ఆలోచిస్తున్నారు.ఆట స్థలాలు: ఇల్లు విశాలంగా ఉండటమే కాదు పిల్లలు ఆదుకోవడానికి కావలసిన ఆట స్థలాలు కూడా ఉన్నాయా? లేదా అనే విషయాలను చూస్తారు. పిల్లల కోసం ఆట స్థలాలు, పెద్దల కోసం జిమ్, స్విమ్మింగ్ పూల్ మొదలైవి ఉండేలా చూసుకుంటారు. ఎక్కువ ఖాళీ స్థలం కంటే.. ఎక్కువ పచ్చదనాన్ని కోరుకుంటున్నారు.డే కేర్ సెంటర్: చిన్న కుటుంబాల కారణంగా.. చిన్న పిల్లల ఆలనా పాలన కోసం డే కేర్ సెంటర్లు దగ్గరలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.భార్య భర్తలు ఇద్దరూ ఆఫీసుకు వెళ్తే.. చిన్న పిల్లలను చూసుకోవడం కష్టమవుతుంది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు డే కేర్ సెంటర్లు దగ్గరలో ఉండేలా చూసుకుంటారు.ఆఫీసుకు దగ్గర్లో: ఇల్లు కొనేటప్పుడు.. ఆ ఇల్లు ఆఫీసుకు ఎంత దూరంలో ఉండనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకుంటారు. ఇల్లు దూరమయితే.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. దీని నుంచి తప్పించుకోవడానే.. ఇల్లు ఆఫీసులకు దగ్గరలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.వీకెండ్ ఎంజాయ్..వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. పచ్చని ప్రకృతిని ఆస్వాధించాలని కోరుకునే నివాసితులు శివారు ప్రాంతాలలో ఫామ్ హౌస్లు, విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. -
ఇంట్లో గోడలు.. ఇటూ అటూ..
ఇంట్లోని గదులలో ఎక్కువగా సమయం గడిపేది లివింగ్ రూమ్లోనే.. అందుకే చాలా మంది ఈ గదికి ఎక్కువ విస్తీర్ణాన్ని కేటాయిస్తుంటారు. అయితే కరోనా తర్వాతి నుంచి ఇంటి స్వరూపం మారిపోయింది. కొనుగోలుదారుల అభిరుచులలో మార్పులు వచ్చాయి. దీంతో లివింగ్ రూమ్ విస్తీర్ణానికి కోత పెట్టి మాస్టర్ బెడ్ రూమ్, పిల్లల గదులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే బంధువులెవరైనా వచ్చినప్పుడు లివింగ్ రూమ్ చిన్నగా అనిపిస్తుందనే భావన నివాసితులకు కలుగుతుంది. అసలు లివింగ్ రూమ్లోని గోడలను అవసరం ఉన్నప్పుడు అటుఇటుగా కదిలించుకునే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుంది కదూ. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ తరహా సాంకేతికత ఇప్పుడిప్పుడే మన దేశంలోకి ప్రవేశిస్తుంది. హోటళ్లు, కన్వెన్షన్ హాళ్లలో కనిపించే ఈ కదిలే గోడలు క్రమంగా గృహాల్లోకి వచ్చేశాయి. – సాక్షి, సిటీబ్యూరోరోజురోజుకు ఇళ్ల ధరలు పెరిగిపోతుండటంతో రూ.80 లక్షలకు పైగా వెచ్చిస్తే తప్ప 3 బీహెచ్కే ఫ్లాట్ దొరకని పరిస్థితి. ఇంటిలో ఉన్న విస్తీర్ణాన్ని అవసరానికి తగ్గుట్టుగా సద్వినియోగం చేసుకునేలా నిర్మాణదారులు సరికొత్త సాంకేతిక ఆలోచనలు చేస్తున్నారు. గోడలు అనగానే ఇటుకలు, సిమెంట్ బ్లాక్స్తో కట్టేవే గుర్తుకొస్తాయి. ఇంటి లోపల ఇవే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంటాయి. వీటి స్థానంలో బిల్డర్లు ప్యానల్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. ఇవి తక్కువ మందం ఉండటంతో పాటు పటిష్టంగా, ఎక్కువకాలం మన్నికతో ఉంటాయి. 💠 ఇంటి లోపల అంతర్గత గోడల కోసం ఈ ప్యానెల్స్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే గతంలో వీటిని కదలించడానికి వీలు లేకుండా స్క్రూలతో బిగించేవారు. ఎలాగూ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు స్థిరంగా ఉండే బదులు కదిలేలా ఉంటే ఇంట్లో స్థలాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్లోనూ ఈ కదిలే గోడలను వినియోగిస్తున్నారు. 💠 చిన్న పిల్లల గదిని పగటి పూట తగ్గించుకొని హాల్ను పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవి ఇంటీరియర్స్లో కలిసిపోయి ఉంటాయి కాబట్టి నివాసితులు చెబితే తప్ప ఎవరూ ఇవి కదిలే గోడలని గుర్తించలేరు. స్టూడియో అపార్ట్మెంట్స్లలో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కదిలే గోడలనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఉదయం సమయంలో బెడ్ను కాస్త గోడకు నిలబెట్టేస్తే అదొక డిజైన్ మాదిరి కనిపిస్తుంటుంది. అయితే సంప్రదాయ గోడల కంటే వీటి నిర్మాణానికి వ్యయం ఎక్కువ అవుతుంది. చదరపు అడుగు వాల్ ప్యానెల్స్ రూ.75–80 నుంచి ప్రారంభమవుతాయి. బహిరంగ మార్కెట్తో పాటు ఆన్లైన్లోనూ వివిధ రకాల డిజైన్లు లభ్యమవుతాయి. -
ట్రంప్ బ్రాండ్ ఇళ్లు.. లాంచ్ రోజునే అన్నీ సేల్!
గురుగ్రామ్లోని ట్రంప్ బ్రాండ్ నివాసాలు రికార్డ్ సృష్టించాయి. స్మార్ట్వరల్డ్ డెవలపర్స్, ట్రిబెకా డెవలపర్స్ అభివృద్ధి చేసిన ట్రంప్ రెసిడెన్స్ లాంచ్ రోజునే మొత్తం అమ్ముడుపోయాయి. రూ.3,250 కోట్ల కేటాయింపులు నమోదయ్యాయి. ఇందులో రూ.125 కోట్ల విలువైన నాలుగు అల్ట్రా ప్రీమియం పెంట్ హౌస్లను కూడా పూర్తిగా కేటాయించినట్లు స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్ తెలిపింది.గురుగ్రామ్లో ఇది రెండవ ట్రంప్-బ్రాండెడ్ రెండో రెసిడెన్సియల్ ప్రాజెక్ట్. భారత్లో ఆరవది. న్యూయార్క్ వెలుపల రెండు ట్రంప్ టవర్లకు ఆతిథ్యం ఇచ్చిన ఏకైక నగరంగా గురుగ్రామ్ నిలిచింది. సెక్టార్ 69లో ఉన్న ట్రంప్ రెసిడెన్స్ లో 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 298 లగ్జరీ నివాసాలతో కూడిన రెండు 51 అంతస్తుల టవర్లు ఉన్నాయి.గురుగ్రామ్కు చెందినస్మార్ట్ వల్డ్ డెవలపర్స్తో కలిసి ట్రంప్ ఆర్గనైజేషన్ ఇండియా పార్ట్నర్ ట్రిబెకా డెవలపర్స్ గురుగ్రామ్లో రెండో అల్ట్రా లగ్జరీ ట్రంప్ బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు గత నెలలో ప్రకటించింది. ఇందులో ఒక్కో నివాసం రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ధర పలికాయి. భారత్ లో బ్రాండెడ్, అల్ట్రా లగ్జరీ లైఫ్ కు ఉన్న డిమాండ్ ను ప్రదర్శిస్తూ ప్రారంభించిన రోజే మొత్తం 298 ఇళ్లూ అమ్ముడుపోయాయి.👉ఇది చదివారా? వీకెండ్ ఇల్లు.. రూ.10 కోట్లయినా పర్లేదు..ఉత్తర భారతదేశంలో ట్రంప్ బ్రాండెడ్ రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ లో ఇది రెండోది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని గురుగ్రామ్లో 2018లో ప్రారంభించిన మొదటి ట్రంప్ టవర్స్ కూడా పూర్తిగా అమ్ముడైందని, ఈ నెలాఖరులో డెలివరీకి సిద్ధంగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
HMDA: ‘అనుమతులు’ ఎప్పుడిస్తరు?
సాక్షి, సిటీబ్యూరో: ట్రిపుల్ఆర్ వరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిని విస్తరించినప్పటికీ ఇంకా లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులు జారీ చేయడం ప్రారంభం కాలేదు. దీంతో నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. హెచ్ఎండీఏ విస్తరణకు ముందు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ప్లానింగ్ అండ్ కంట్రీప్లానింగ్ (డీటీసీపీ) నుంచి అనుమతులు లభించేవి. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలోని ప్రాంతాలన్నీ హెచ్ఎండీఏకు బదిలీ అయ్యాయి. రెండు నెలల క్రితమే ఈ బదిలీ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభించవలసి ఉంది. కానీ రెండు నెలలుగా దీనిపైన ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నిర్మాణ సంస్థల్లో గందరగోళం నెలకొంది. రూ.కోట్లల్లో అప్పులు తెచ్చి భూములు కొనుగోలు చేసిన సంస్థలు వాటిని లే అవుట్లుగా అభివృద్ధి చేసేందుకు ఇటు డీటీసీపీ నుంచి అటు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభించకపోవడంతో సందిగ్ధంలో పడ్డాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సైతం ఇది ఆటంకంగా మారినట్లు నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రీజనల్ రింగురోడ్డు వరకు మారిన సీన్... హైదరాబాద్ మహానగర పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. నగరం చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్రింగ్రోడ్డు వరకు అన్ని రకాల అనుమతులు, ప్రొసీడింగ్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, తదితర నిర్మాణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు కొత్త ప్రాంతాలను హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలోని 6 జోన్లలో చేర్చారు. హెచ్ఎండీఏ పరిధిని విస్తరించినప్పటి నుంచి ఆ పరిధిలో డీటీసీపీ అనుమతులను నిలిపివేసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు హెచ్ఎండీఏ నుంచి కొత్తగా ఎలాంటి అనుమతులు లభించలేదు. హెచ్ఎండీఏ వెలుపల ఉన్న ప్రాంతాల్లో మాత్రం డీటీసీపీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. టీజీబీపాస్ స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన బిల్డ్నౌ పోర్టల్ సేవలను డీటీసీపీ ప్రాంతాలకు కూడా విస్తరించారు. కానీ గతంలో ఉన్న 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే హెచ్ఎండీఏ అనుమతులు లభిస్తుండగా, కొత్తగా చేరిన 3,215 చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్న గ్రామాలు, మండలాలు, మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనుమతులు మొదలు కాకపోవడం గమనార్హం.మ్యాపింగ్లో జాప్యమేల... హెచ్ఎండీఏ కొత్తగా విస్తరించిన ప్రాంతాల మ్యాపింగ్లో జాప్యం వల్లనే అనుమతుల ప్రక్రియను ఇంకా ఆరంభించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మ్యాపింగ్ తుదిదశకు చేరిందని, త్వరలోనే పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ట్రిపుల్ఆర్ వరకు రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెగా మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు సైతం హెచ్ఎండీఏ కసరత్తును చేపట్టింది. దీంతో నిర్మాణరంగంపైన స్పష్టత కొరవడినట్లు రియల్వర్గాలు పేర్కొంటున్నాయి. ‘షాద్నగర్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండు నెలల నెంచి ఎదురుచూస్తున్నాం. కానీ ఈ మ్యాపింగ్ పూర్తయిన తరువాత అనుమతినిస్తారా లేక, కొత్త మాస్టర్ప్లాన్ వచ్చేవరకు నిలిపివేస్తారా తెలియడం లేదు.’ అని ఒక రియల్టర్ విస్మయం వ్యక్తం చేశారు. ఒకవేళ మెగామాస్టర్ప్లాన్ అమల్లోకి వచ్చే వరకు అనుమతులు లభించకపోతే తాము తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని పేర్కొన్నారు. భారీ లే అవుట్లే కాకుండా అపార్ట్మెంట్లు, భవన నిర్మాణాలకు సైతం ఇబ్బందులు తలెత్తనున్నాయి.హెచ్ఎంఏ డెవలప్మెంట్ ప్లాన్..హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో ప్రస్తుతం 11 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్ధిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల్లోని 104 మండలాలు, 1355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) ఏర్పడింది. ఈ హెచ్ఎంఏ (HMDA) పరిధిలో ఎకనమిక్ డెవలప్మెంట్ ప్లాన్, కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్, బ్లూగ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలతో మాస్టర్ప్లాన్ రూపకల్పనకు సన్నాహాలు చేపట్టారు. ఈ ప్రణాళికలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ముసాయిదా విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం నుంచి సరికొత్త మాస్టర్ప్లాన్ రానుంది. చదవండి: స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ఇక చకచకా!ఈ క్రమంలో నిర్మాణరంగానికి సంబంధించిన కార్యకలాపాలకు అనుమతులను ఎప్పటి నుంచి ఇస్తారనేది సందిగ్ధంగా మారింది. బ్లూన్గ్రీన్ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) వరకు చెరువులు, కుంటలు, తదితర నీటివనరులను గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలను చేపట్టవలసి ఉంది.దీంతో అప్పటి వరకు వేచి ఉండవలసిందేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. -
అమ్మో.. అపార్ట్మెంట్!!
పదేళ్ల క్రితం కాప్రాలో అపార్ట్మెంట్ కొన్న.. చ.అ.కు రూ.3 వేల చొప్పున 1,100 చ.అ.లకు రూ.33 లక్షలు అయ్యింది. ఆ సమయంలో కార్పస్ ఫండ్, వసతుల నిర్వహణ కోసమని రూ.5 లక్షలు వసూలు చేశారు. ప్రతి నెలా అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చు కోసం నెలకు రూ.2 వేలు చెల్లిస్తున్నా. అయితే ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం ఆ ఫ్లాట్ను అమ్మేద్దామని నిర్ణయించుకున్నా. కొనడానికి ఎవరొచ్చినా సరే అపార్ట్మెంట్ ధరనే లెక్కిస్తున్నారే తప్ప.. నేను చెల్లించిన కార్పస్ ఫండ్ పరిగణలోకి తీసుకోవటం లేదు. – ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఇదీ..నగరంలోని ఓ ఐటీ కంపెనీలో హెడ్గా పనిచేశాను. స్విమ్మింగ్ పూల్, జిమ్, పిల్లలకు ప్లే ఏరియా వంటివి ఉన్నాయని కూకట్పల్లిలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో రూ.80 లక్షలకు ఫ్లాట్ కొన్నా. వీటి కోసం డెవలపర్కు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాను. అందులో ఉన్నంత వరకూ బాగానే ఉంది. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగళూరుకు బదిలీ అయ్యింది. ఎప్పుడైతే సొసైటీకి అపార్ట్మెంట్ అప్పగించారో రెండేళ్ల తర్వాత సరైన నిర్వహణ లేక స్విమ్మింగ్ పూల్ పాడైపోయింది. జిమ్లోని వస్తువులు మూలనపడ్డాయి. – ఓ ఐటీ ఉద్యోగి వ్యథ ఇదీ.....వీళ్లిద్దరే కాదు గృహ కొనుగోలుదారుల అందరిపైనా వసతుల భారం పడుతుంది. సామాన్యుడి సొంతింటి కలకు నిర్మాణ వ్యయం, స్థలాల ధరలు ఎంత భారం అవుతున్నాయో.. అదే స్థాయిలో వసతుల చార్జీలు భారంగా మారిపోయాయి. క్లబ్హౌస్, పార్కింగ్, సెలబ్రిటీ జిమ్, స్విమ్మింగ్ పూల్, స్క్వాష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ పిచ్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ పార్క్, జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్, యోగా, మెడిటేషన్ హాల్, గెస్ట్ రూమ్స్, 7 స్టార్ రెస్టారెంట్.. ఇలా బోలెడన్నీ వసతులను ప్రకటిస్తున్నారు. అన్నింటికీ రూ.లక్షల్లోనే చార్జీలను వసూలు చేస్తున్నారు. రెరా నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్ ధరలోనే వసతుల చార్జీలు కలిపి ఉండాలి. కానీ, నిర్మాణ సంస్థలు వేర్వేరుగా వసూలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్స్, గ్రీనరీ, పైప్డ్ గ్యాస్, విద్యుత్, తాగునీరు ఇలా కనీస మౌలిక వసతులకు రూ.లక్షలలో వసూలు చేస్తున్నారు. రెండేళ్ల పాటు క్లబ్హౌస్ నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రకటిస్తూనే.. మరోవైపు సభ్వత్య రుసుము రూ.2–3 లక్షల వరకూ బాదుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఓసీ రాకముందే వసూళ్లు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) రాకముందు వసతుల ఏర్పాటు, నిర్వహణకు చార్జీలు వసూలు చేయకూడదనేది నిబంధన. కానీ, నిర్మాణ సంస్థలు పట్టించుకోవటం లేదు. పోనీ, ఆయా ప్రభుత్వ విభాగాలైనే నియంత్రిస్తున్నాయా అంటే పట్టించుకునే నాథుడే లేడు. మౌలిక వసతులను కల్పించిన తర్వాతే మున్సిపల్ విభాగం ఓసీని విడుదల చేయాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్.. అంటూ కొనుగోలుదారుడికి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వసతులను కల్పించాడా లేదా అని పర్యవేక్షించే వారే కరువయ్యారు. కానీ, భౌతికంగా ఆయా వసతులను డెవలపర్ కల్పించాడా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారే లేరు. ఒక్కసారి ఓసీ రిలీజ్ అయ్యాక ఇక ఆ అపార్ట్మెంట్కు డెవలపర్కు సంబంధం ఉండదు.👉ఇది చదివారా? వీకెండ్ ఇల్లు.. రూ.10 కోట్లయినా పర్లేదు..!వెంచర్లలో రిసార్ట్ అని వసూళ్లు.. ఓపెన్ ప్లాట్లు చేసే బిల్డర్లు కూడా మీము ఏం తక్కువ తిన్నామా అన్నట్లు అపార్ట్మెంట్లలో కల్పించే వసతులను వెంచర్లలో కూడా కల్పిస్తామని మాయమాటలు చెబుతున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం వెంచర్లలో రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ వంటివి కల్పించాల్సిన బాధ్యత డెవలపర్లదే.. కానీ, బిల్డర్లు వీటికి కూడా వసతుల ఏర్పాటు పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు. వీకెండ్ రిసార్ట్, ఫార్మింగ్, గోల్ఫ్ కోర్స్, క్లబ్హౌస్ సభ్యత్వం అని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. శామీర్పేట, షాద్నగర్, తుక్కుగూడ, యాదాద్రి, చేవెళ్ల, శ్రీశైలం జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లోని వెంచర్లలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని తెగ ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.🔶ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఓ నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది. ఇందులో ధర చదరపు అడుగు(చ.అ.) రూ.9 వేలకు విక్రయిస్తుంది. 2,050 చ.అ.అపార్ట్మెంట్కు రూ.1,84,50,000 అవుతుంది. ఇక, ఈ అపార్ట్మెంట్లో వసతుల చార్జీలు కింది పట్టికలో చూద్దాం!అపార్ట్మెంట్కు రూ.1,84,50,000 అయితే, వసతులకు చెల్లించాల్సింది రూ.2,92,22,468. వసతులు, అపార్ట్మెంట్ ధర రెండూ కలిపితే రూ.2,13,72,468 అయ్యిందన్నమాట.ఇలా చేస్తే బెటర్.. 🔹 వసతుల కల్పనకు అయ్యే వ్యయాన్ని కొనుగోలుదారుల నుంచి వసూలు చేయడం సరైంది కాదు. నిర్మాణ సంస్థలు కల్పించే వసతులతో సగానికి పైగా అమినిటీస్ నివాసితులు వినియోగించరు. పైగా ప్రతినెలా నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో గేటెడ్ కమ్యూనిటీల్లోని నివాసితులకు అపార్ట్మెంట్ కొనుగోలు భారంగా మారుతుంది. నిర్మాణం పూర్తయ్యాక ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా రెండేళ్ల పాటు వసతుల నిర్వహణ నిర్మాణ సంస్థే చేయాలి. 🔹 ప్రాజెక్ట్లో విక్రయాలు పూర్తయ్యాక డెవలపర్ కమ్యూనిటీని హౌసింగ్ సొసైటీకి అప్పగిస్తారు. అక్కడి నుంచి అందులోని వసతులను నివాసితులే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మొదట్లో బాగానే ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ ఆయా వసతుల నిర్వహణ పట్టించుకునే వారే ఉండరు. స్విమ్మింగ్ పూల్ ఎండిపోతుంది. నిర్వహణ లేక జిమ్, ఇతర వసతులు మూలనపడిపోతాయి. 🔹 అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చులు చ.అ.ల చొప్పున కాకుండా నివాసితుందరికీ ఒకటే విధంగా ఉండాలి. పెద్ద సైజు గృహాలకు ఎక్కువ రహదారి, డ్రైనేజీ ఎక్కువ నీళ్లు, ఎక్కువ కాంతి వాడుకోలేరు కదా. అందుకే ఎన్ని ఫ్లాట్ల సంఖ్యను బట్టి చార్జీలను విభజించాలి. 🔹 హౌసింగ్ సొసైటీల్లోని క్లబ్హౌస్లను థర్డ్ పార్టీకి అప్పగించాలి. రెస్టారెంట్, సూపర్మార్కెట్, మెడికల్ వంటి ఇతరత్రా వాటికి అప్పగించాలి. ఆ అద్దెతో కమ్యూనిటీలో ఇతరత్రా ఖర్చులను వినియోగించుకోవచ్చు. 🔹 ఒకటే ఏరియాలో ఉండే 3–4 ప్రాజెక్ట్లకు ఒకటే క్లబ్హౌస్ కట్టుకోవటం ఉత్తమం. దీంతో నిర్మాణ సంస్థకు ఖర్చు ఆదా అవటంతో పాటు నివాసితులకు నిర్వహణ భారం కాదు. -
వీకెండ్ ఇల్లు.. రూ.10 కోట్లయినా పర్లేదు..!
సాక్షి, సిటీబ్యూరో: వీకెండ్ వస్తే చాలు పబ్కో.. సినిమాలు, షికార్లకో వెళ్లే నగరవాసులు.. క్రమంగా ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఈ ఇళ్లు కాస్త ప్రత్యేకమైనవండోయ్! కాలుష్యం, రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉంటే వీకెండ్ లేదా హాలిడే హోమ్స్కు పరుగులు పెడుతున్నారు. ఎంచక్కా కుటుంబంతో కలిసి వారాంతాన్ని అక్కడే గడిపేస్తున్నారు. కరోనాతో వీకెండ్ హోమ్స్కు ఆదరణ పెరిగింది.పెట్టుబడులు పెరిగాయి.. 29 శాతం మంది హెచ్ఎన్ఐలు హాలిడే హోమ్స్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ హాలిడే హోమ్కు రూ.5–10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని 71 శాతం మంది భావిస్తున్నారని లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ఇండియా సోథెబీ ఇంటర్నేషనల్ రియల్టీ ఒక నివేదిక విడుదల చేసింది. 29 శాతం మంది రూ.10 కోట్ల పైన ధర ఉన్నా పర్వాలేదని చెప్పారు. లగ్జరీ అపార్ట్మెంట్ లేదా విల్లా అయితే రూ.10–25 కోట్ల వరకు పెట్టుబడికి సుముఖంగా ఉన్నట్లు 69 శాతం మంది చెప్పారు. 21 శాతం మంది రూ.5–10 కోట్ల బడ్జెట్లో, మిగిలిన 10 శాతం మంది రూ.25 కోట్లకు పైగా బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు.వచ్చే రెండేళ్లలో రెట్టింపు.. 200 హెచ్ఎన్ఐల అభిప్రాయాల ఆధారంగా దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో(హైదరాబాద్ సహా) రియల్ ఎస్టేట్ ధోరణులపై ఈ సంస్థ నివేదిక రూపొందించింది. సంపన్నుల్లో రియల్ ఎస్టేట్ పట్ల ధోరణి మారిందనడానికి ఈ ఫలితాలే నిదర్శమని పేర్కొంది. వచ్చే రెండేళ్లలో కొనుగోళ్లకు సముఖంగా ఉన్నామని చెప్పిన 75 శాతం మంది ప్రాధాన్యతలు గమనిస్తే.. 89 శాతం మంది ఖరీదైన ఇళ్లు(సిటీ అపార్ట్మెంట్లు, బంగళాలు, హాలిడే హోమ్స్)పట్ల ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది ఖరీదైన వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు.ముఖ్యంగా గడిచిన 18 నెలల్లో ఇల్లు కొనుగోలు చేసినట్లు 26% మంది చెప్పారు. వారి జీవనశైలిని మెరుగుపరుచుకోవడం, మంచి పెట్టుబడులను సొంతం చేసుకునే ఆలోచనతోనే వారు కొన్నారు. రెండు మూడేళ్లలో హెచ్ఎన్ఐలు, అల్ట్రా హెచ్ఎన్ఐలు ఖరీదైన ఇళ్లను సొంత వినియోగానికే కొనుగోలు చేశారు. మంచి పెట్టుబడి అవకాశం కోసం కొనుగోలు చేయడం అంటే అది బుల్లిష్ ధోరణికి సంకేతమని ఓ సంస్థ తెలిపింది. -
అడుగేస్తే ఆఫీస్..! ఇలాంటి ఇళ్లకే డిమాండ్
కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. కోవిడ్తో వర్క్ ఫ్రం హోమ్ అలవాటైన ఉద్యోగస్తులు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. గంటల కొద్దీ ప్రయాణం చేస్తూ.. కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులతో ఆఫీసుకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్లకు డెవలపర్లు శ్రీకారం చుట్టారు. ఆఫీసులకు చేరువలోనే గృహాలతో పాటు స్కూల్, ఆస్పత్రి, షాపింగ్ మాల్, పార్కు వంటి అన్ని రకాల వాణిజ్య ఏర్పాట్లు ఉండటం వీటి ప్రత్యేకత. దీంతో ఈ తరహా ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. - సాక్షి, సిటీబ్యూరోపనిచేసే కార్యాలయానికి చేరుకోవడానికి అత్యధిక శాతం మంది తక్కువలో తక్కువ గంటసేపు బస్సుల్లోనో లేదా ఇతరత్రా వ్యక్తిగత వాహనాల్లోనో గడిపేస్తున్నారు. దీంతో విలువైన సమయం వృథా అవుతోంది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్లో ఇల్లు, ఆఫీసు, మాల్, పార్కులు, స్కూల్, ఆస్పత్రి.. ఇలా సమస్త అవసరాలూ ఒకే చోట ఉంటాయి.ఈ ప్రాజెక్ట్లతో వేగంగా అభివృద్ధి నడిచి వెళ్లేందుకు అనువైన దూరంలో కార్యాలయం, షాపింగ్ మాల్స్ ఉండాలని కోరుకునే వారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ‘ఈ మధ్యకాలంలో మా వద్దకు వచ్చే ఐటీ నిపుణులు చాలా మంది ఇలాంటి ఫ్లాట్లే కావాలని అడుగుతున్నారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్ల్లో కేవలం అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉంటే సరిపోదు. ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి చిరునామాగా నిలవాలి. అందుకే ఐటీ, బీపీఓ వంటి వాటితో గచి్చ»ౌలి, మాదాపూర్లు ఎలా అయితే వృద్ధి చెందాయో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుంది.నగరం నలువైపులా.. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాక్ టు వర్క్ ప్రాజెక్టులు ఇప్పుడు నగరం చుట్టూ విస్తరిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్తో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్లకు మరింత ఊపొచి్చంది. ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు చుట్టూ 4 కి.మీ. పరిధిలో వాక్ టు వర్క్ ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు.నగరంలోని మొత్తం రెండు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగుల్లో అత్యధికులు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి సిటీ నలువైపుల నుంచి వచ్చే వారు కొందరైతే, ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి వచి్చపోయేవారు మరికొందరు. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్లతో ఇప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది. ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు గృహ నిర్మాణాలు.. ఇంకేం ఎంచక్కా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఉదయం నడకకు బద్ధకించేవారికి ఇదొక వాకింగ్ గానూ ఉపయోగపడుతోంది. ఆరోగ్యం దృష్ట్యా సైకిల్పైనా ఆఫీసులకు కూడా వెళ్లొచ్చు. -
‘ఆఫీసు’ల్లో హైదరాబాద్ దూకుడు!
రియల్ ఎస్టేట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం కీలకమైంది. హైదరాబాద్ స్థిరాస్తికి ఐటీ బూస్ట్లా మారింది. ఐటీ ఉద్యోగులపై ఆధారపడి గృహ విక్రయాలు ఎంత జరుగుతాయో.. అంతకు రెట్టింపు స్థాయిలో ఐటీ సంస్థల లావాదేవీలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమాది ప్రాంతాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఆఫీస్ స్పేస్.. గ్రోత్ ఇన్ డిస్పర్షన్(గ్రిడ్) పాలసీతో నగరం నలువైపులా విస్తరించింది. ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఔటర్ వెంబడి ఉత్త్తర, తూర్పు ప్రాంతాల్లో ఉన్న 11 పారిశ్రామిక పార్క్లను ఐటీ పార్క్లుగా మార్చింది. దీంతో పాటు కొంపల్లిలో ఐటీ టవర్, కొల్లూరులో ఐటీ పార్క్లను నిర్మిస్తోంది. ఫలితంగా పశ్చిమం వైపు కాకుండా ఇతర ప్రాంతాలలో కొత్తగా 3.5–4 కోట్ల చ.అ. ఐటీ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుందని ఓ సంస్థ తెలిపింది. – సాక్షి, సిటీబ్యూరోగ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో హైదరాబాద్ దూసుకువెళ్తోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 9.04 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉన్న హైదరాబాద్.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 కోట్ల చ.అ. మైలురాయిని దాటనుందని ఓ సంస్థ సర్వేలో తేలింది. ఆఫీస్ స్పేస్ మార్కెట్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ తర్వాత హైదరాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. కొంతకాలంగా కొంపల్లి, బాచుపల్లి, మేడ్చల్ వంటి ఉత్తరాది ప్రాంతాలు, ఎల్బీనగర్, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలలో నివాస క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాలలోని అందుబాటు గృహాలను ఐటీ ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు.81 శాతం వృద్ధి రేటు.. కొన్నేళ్లుగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో మన నగరం మెరుగైన స్థానాన్ని నమోదు చేస్తోంది. 2016 నుంచి 2021 వరకు పరిశీలిస్తే.. ఏకంగా 81 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం విశేషం. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇదెంతో మెరుగైన స్థానం. మన నగరం తర్వాత రెండో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ ఆరేళ్లలో 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ విభాగంలో మన నగర భాగస్వామ్యం ఇటీవలి వరకు 12.7 శాతంగా ఉండగా.. కొత్తగా అందుబాటులోకి వచి్చన స్పేస్తో 25 శాతానికి పెరిగింది. గ్రిడ్ పాలసీ అమలుతో.. గ్రిడ్ పాలసీతో నగరం నలువైపులా ఐటీ విస్తరించింది. డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అమలు చేస్తోంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 500 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు యాంకర్ యూనిట్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో సంబంధిత భూమిని 50 శాతం ఐటీ, ఐటీఈఎస్ ప్రయోజనాల కోసం వినియోగించగా.. మిగిలిన సగంలో నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించవచ్చనే వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ అనేది కేవలం రెండు ప్రధాన కారిడార్లలోనే కేంద్రీకృతమై ఉంది. హైటెక్సిటీ, గచి్చ»ౌలి ప్రాంతాలు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. 96 శాతం స్పేస్ ఈ ప్రాంతాల నుంచే ఉంది. -
హైదరాబాద్ ఇప్పుడు కాస్ట్లీ సిటీ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కాస్ట్లీ సిటీగా అభివృద్ధి చెందింది. ఇప్పటి వరకు దేశంలోని ఏ ఇతర మెట్రో నగరాలతో పోల్చినా భాగ్యనగరంలో గృహాల ధరలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయింది. వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్లో ప్రాపర్టీల విలువ 6 శాతం వృద్ధి చెంది.. చ.అ. ధర సగటున రూ.5,800 నుంచి రూ.6,000 వేలకు పెరిగింది. ముంబైలో ఏడాదిలో 3 శాతం పెరిగి.. రూ.9,600 నుంచి రూ.9,800లకు చేరిందని ఓ సంస్థ నివేదిక వెల్లడించింది.👉ఇది చదివారా? సెకండ్ హ్యాండ్ ఇళ్లు.. హైదరాబాద్లో ఇక్కడ భలే డిమాండ్దాదాపు పదేళ్ల కాలంలో అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉండటం, స్టాంప్ డ్యూటీలను తగ్గించడం, సర్కిల్ ధరలలో సవరణలతో పాటు గృహ కొనుగోళ్లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో అందుబాటు ధరలలోని ఇళ్ల విక్రయాలలో అత్యధిక వృద్ధి నమోదైంది. ఒకవైపు సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులకు రాయితీలను అందిస్తున్నారు. లేదంటే ఆయా నగరాలలో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముంది.సరఫరా, డిమాండ్లలో వృద్ధి రేటు.. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో గృహాల విక్రయాలలో హైదరాబాద్లో అత్యధిక వృద్ధి నమోదైంది. బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్ ప్రాంతాలలో గృహ విక్రయాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఆయా ప్రాంతాలలో ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ.. డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. లాంచింగ్ అయిన ప్రాజెక్ట్లలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల వాటా 36 శాతంగా ఉంది. దుండిగల్, తెల్లాపూర్, గోపనపల్లి, బాచుపల్లి, బండ్లగూడ జాగీర్ ప్రాంతాలలో ఇళ్ల సరఫరా ఎక్కువగా ఉంది. -
రియల్టీకి డేటా సెంటర్స్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథకు డిమాండ్తో డేటా సెంటర్లు గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో 2030 నాటికి అదనంగా 45–50 మిలియన్ చ.అ. రియల్ ఎస్టేట్ అవసరం ఏర్పడనుంది. అలాగే 40–45 టెరావాట్–అవర్స్ (టీడబ్ల్యూహెచ్) విద్యుత్ కూడా కావాల్సి రానుంది. ‘భారత ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల్లోకి పెట్టుబడుల ఆకర్షణ’ పేరిట డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వ్యయాలపరమైన ప్రయోజనాలు, పునరుత్పాదక విద్యుత్పై ప్రధానంగా దృష్టి పెట్టడం, వ్యూహాత్మక స్థానంలో ఉండటం తదితర అంశాలు భారత్కి సానుకూలాంశాలని వివరించింది. అయితే, అంతర్జాతీయంగా ఏఐ హబ్గా ఎదగాలంటే కీలకమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం, నిపుణుల లభ్యత, విధానాల్లో అంతరాలను తొలగించడం మొదలైనవి ప్రధానంగా ఉంటాయని పేర్కొంది. ప్రపంచ స్థాయి ఏఐ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే రియల్ ఎస్టేట్, విద్యుత్, కనెక్టివిటీ, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, నిపుణులు, విధానాలు అనే ఆరు అంశాలు మూల స్తంభాలుగా ఉంటాయని నివేదిక తెలిపింది. నేషనల్ బిల్డింగ్ కోడ్లో డేటా సెంటర్ల కోసం ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని సూచించింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతుల ప్రక్రియను సరళతరం, వేగవంతం చేయాల్సి ఉంటుంది. → విధానాలపరంగా మద్దతు కలి్పంచాలి. డేటా లోకలైజేషన్ నిబంధనలను క్రమబద్ధీకరించాలి. ప్రత్యేక డేటా సెంటర్ జోన్లను ఏర్పాటు చేయాలి. ఇవి భారతదేశ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు తోడ్పడతాయి. → డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణ వల్ల పవర్ గ్రిడ్పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేసుకునేందుకు అత్యవసరంగా భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమవుతాయి. → దేశీయంగా నెట్వర్క్, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్పరంగా పరిమితులు, గట్టిగా ఆధారపడలేని హై–స్పీడ్ ఇంటర్నెట్ మొదలైన వాటి పరిమితుల వల్ల డేటా సెంటర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉండొచ్చు. -
ప్రాపర్టీ షేర్ మళ్లీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ మరోసారి పబ్లిక్ ఇష్యూకి రానుంది. ప్రాప్షేర్ టైటానియా కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 472 కోట్లు సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. దేశీయంగా తొలి చిన్న, మధ్యతరహా(ఎస్ఎం) రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా లిస్టయిన ప్రాపర్టీ షేర్ రెండో ఎస్ఎం రీట్ ఐపీవో చేపట్టనుంది. ఇష్యూలో భాగంగా ప్రాప్õÙర్ టైటానియా రూ. 472 కోట్ల విలువైన యూనిట్లను తాజాగా జారీ చేయనుంది. టైటానియా ముంబైలోని జీ కార్ప్ టెక్ పార్క్లో 4,37,973 చదరపు అడుగుల గ్రేడ్–ఏ ఆఫీస్ సౌకర్యాలను కలిగి ఉంది. డిసెంబర్లో ప్రాప్õÙర్ ప్లాటినా ఐపీవో ద్వారా ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రూ. 353 కోట్లు సమీకరించింది. ఇది తొలి ఎస్ఎం రీట్ పథకంకాగా.. రూ. 50–500 కోట్ల మధ్య విలువైన ఆస్తులుగల సంస్థలకు సెబీ ఈ విభాగాన్ని ప్రవేశపెట్టింది. కాగా.. యూనిట్స్ బీఎస్ఈలో లిస్ట్కానున్నాయి. -
'ది కాస్కేడ్స్ నియోపోలిస్'కు రెరా గ్రీన్ సిగ్నల్: జీహెచ్ఆర్ ఇన్ఫ్రా
జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్బ్లాక్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ (GHR Lakshmi Urbanblocks Infra LLP) తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'ది కాస్కేడ్స్ నియోపోలిస్'కు (The Cascades Neopolis) రెరా అనుమతి పొందింది. ఈ విషయాన్ని సంస్థ గర్వంగా ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో 7.34 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు 63 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా ఉంది. దీని రెరా నంబర్ P02400009538. ఈ అనుమతి ద్వారా సంస్థ పారదర్శకత, చట్టపరమైన నిబంధనలు, వినియోగదారుల నమ్మకానికి కట్టుబడి ఉంటుందని తెలిపింది.ఈ ప్రాజెక్టులో 1,189 అద్భుతమైన, పర్యావరణ అనుకూల గృహాలు, 10 ట్రిప్లెక్స్ పెంట్హౌస్లు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు యూహెచ్ఏ లండన్, కూపర్స్ హిల్ (సింగపూర్), స్టూడియో హెచ్బీఏ (సింగపూర్) దీనిని రూపొందించారు. అత్యాధునిక సాంకేతికతతో, ప్రపంచ స్థాయి డిజైన్తో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇది వెల్ ప్రీ-సర్టిఫైడ్, ఐజీబీసీ ప్రీ-సర్టిఫైడ్ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, అంతర్జాతీయ కాన్సియర్జ్ సేవలు వంటి ప్రత్యేకతలున్నాయి. ఆరోగ్యం, స్థిరత్వం, స్మార్ట్ లివింగ్ అనే మూడు అంశాల చుట్టూ ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. కొనుగోలుదారులు ప్రాజెక్టును సందర్శించడానికి వీలుగా కోకాపేటలో సేల్స్ లాంజ్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్బ్లాక్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ భాగస్వామి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ రెరా అనుమతి మేము నాణ్యతకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. హైదరాబాద్లో పట్టణ స్థలాన్ని పునర్నిర్వచించడానికి మేము చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక ముఖ్యమైన విజయం" అన్నారు.లక్ష్మీ ఇన్ఫ్రా భాగస్వామి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, "ది కాస్కేడ్స్ నియోపోలిస్కు రెరా అనుమతి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. పారదర్శకత, సృజనాత్మకత, వినియోగదారుల ప్రాధాన్యతలతో కూడిన గృహాలను అందించాలనే మా కలను ఇది నిజం చేస్తుంది" అని అన్నారు.అర్బన్ బ్లాక్స్ రియాల్టీ భాగస్వామి శరత్ మాట్లాడుతూ, "రెరా అనుమతి మా కృషికి గుర్తింపు. నిబంధనలు, స్థిరత్వం, సృజనాత్మకతతో కూడిన ప్రాజెక్టును సృష్టించడం ద్వారా గృహ నిర్మాణ రంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని తెలిపారు.ఈ ప్రాజెక్టు ప్రధాన వ్యాపార కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సౌకర్యాలకు చేరువలో ఉంది. విలాసవంతమైన సౌకర్యాలు, నగర కేంద్రంలో ఉండటం వల్ల, ఇది గృహ కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు మొదటి ఎంపికగా నిలుస్తుందని భావిస్తున్నారు. -
విజనరీ మిలియన్ మైండ్స్ టెక్ సిటీని ఆవిష్కరించిన గణేష్ హౌసింగ్
గుజరాత్ ఐటీ /ఐటీఈఎస్ పాలసీ 2022-27 కోసం గుజరాత్ ప్రభుత్వం.. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ భాగస్వామ్యంతో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ మూడవ రోడ్షోను హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించింది. అసోచామ్ సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. భారతదేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రముఖ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ రోడ్ షోలో గణేష్ హౌసింగ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, మిలియన్ మైండ్స్ టెక్ సిటీని హైదరాబాద్ టెక్ నెట్వర్క్కు పరిచయం చేయటంతో పాటుగా గుజరాత్ యొక్క పరివర్తనాత్మక కార్యక్రమాలు, విధానాలను ప్రదర్శించారు.గుజరాత్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని.. గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మిలియన్ మైండ్స్ టెక్ సిటీ ఆవిష్కరణ ఈ రోడ్షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం గురించి గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ అన్మోల్ పటేల్ తన సంతోషం వ్యక్తం చేస్తూ .. భారతదేశంలో ప్రధాన ఐటీ హబ్గా వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది, అనేక ప్రముఖ టెక్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ వాటాదారులను కలుసుకోవటం, మా మిలియన్ మైండ్స్ టెక్ సిటీ విలువ ప్రతిపాదనను ప్రదర్శించడం ఒక వ్యూహాత్మక నిర్ణయం. హైదరాబాద్ రోడ్షోకు లభించిన అఖండ స్పందన మాకు నిజంగా సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో గుజరాత్ ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ మోనా ఖాంధర్, ఐఏఎస్ మాట్లాడుతూ.. గుజరాత్ ఐటి/ఐటీఈఎస్ పాలసీ 2022-27 అత్యున్నత శ్రేణి తయారీ, ఆర్&డి, డిజిటల్ పరివర్తనను సజావుగా అనుసంధానించే శక్తివంతమైన.. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే మా లక్ష్యం ప్రతిబింబిస్తుంది. ధోలేరాలోని సెమీకండక్టర్ హబ్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు , నైపుణ్యం, పరిశోధనలపై అధికంగా దృష్టి సారించటం వంటి మార్గదర్శక కార్యక్రమాలతో , పోటీతత్వ ప్రపంచ దృశ్యంలో అభివృద్ధి చెందడానికి మేము పరిశ్రమలు మరియు స్టార్టప్లను శక్తివంతం చేస్తున్నామని అన్నారు. -
హైదరాబాద్లో 5% పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి త్రైమాసింకంలో 5 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర 2024 డిసెంబర్ త్రైమాసికం చివరికి రూ.7,053గా ఉంటే, 2025 మార్చి చివరికి రూ.7,412కు చేరుకుంది. ఎంఎంఆర్, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణె, చెన్నై నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగగా.. హైదరాబాద్తోపాటు బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతాలో ధరలు 4–5 శాతం మధ్య పెరిగినట్టు ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. ఇళ్ల ధరలు గత కొన్నేళ్ల నుంచి ఏటా పెరుగుతూ వచ్చాయని.. ఆ పెరుగుదల వేగం ఇటీవలి త్రైమాసికాల్లో నిదానించినట్టు తెలిపింది. 2022–24 మధ్య ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగిన అనంతరం.. మోస్తరు స్థాయికి చేరడంతో వినియోగ డిమాండ్కు ఊతమిస్తుందని పేర్కొంది. టాప్–8 నగరాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 19 శాతం తక్కువగా 98,095 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్ టైగర్ గత నెలలో విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం గమనార్హం. గత కొన్ని త్రైమాసికాలుగా ఇళ్ల ధరల పెరుగుదల మోస్తరుగా ఉండడం మార్కెట్ స్థిరపడినట్టు సంకేతమిస్తోందని హౌసింగ్ డాట్ కామ్, ప్రాప్ టైగర్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. ధరలు తగ్గడం నిజమైన కొనుగోలుదారులకు ప్రేరణనిస్తుందని బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేడి అభిప్రాయపడ్డారు. నగరాల వారీగా ధరలు.. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.12,600గా ఉంది. → ఢిల్లీ–ఎన్సీఆర్లోనూ ఎలాంటి మార్పు లేకుండా రూ.8,106, చెన్నైలో 7,173, పుణెలో రూ.7,109 చొప్పున చదరపు అడుగు ధర మార్చి త్రైమాసికంలో ఉంది. → అహ్మదాబాద్లో చదరపు అడుగు ధర డిసెంబర్ చివరికి రూ.4,402గా ఉంటే, మార్చి చివరికి రూ.4,568కి చేరింది. → బెంగళూరులో ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.7,536 నుంచి రూ.7,881కి చేరింది. → కోల్కతాలో రూ.5,633 నుంచి రూ.5,839కి పెరిగింది. -
చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.కోటక్ ఫ్యామిలీ ఇప్పటికే ఈ భవనంలోని 24 ఫ్లాట్లలో 13 ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకుంది. తాజాగా మరో 8 ఫ్లాట్లను రూ. 131.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ 444 నుంచి 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటి ధర రూ. 12 కోట్ల నుంచి రూ. 27.59 కోట్లు. మిగిలిన 3 ఫ్లాట్లకు ఎంత చెల్లించారో వెల్లడించకపోయినా, మొత్తం భవనం విలువ రూ. 400 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. ఈ భవనంలోని 173 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ. 4.7 కోట్లు కావడం గమనార్హం. అయితే ఇందులోనే 1396 చ.అ ఫ్లాట్ ధర రూ. 38.24 కోట్లు. ఇది ముంబైలోని నాగరిక వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం.. ముంబై తీరప్రాంత రహదారికి అభిముఖంగా ఉంటుంది.కోటక్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ మొత్తం ప్లాట్లను ఒకటిగా చేసి మళ్ళీ రీడెవల్పెమెంట్ ఏమైనా చేస్తుందా?, లేక ఉన్నది ఉన్నట్లుగానే ఉంచుతుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డీల్కు సంబంధించిన విషయాలను కోటక్ కుటుంబం అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్ -
వంట గది ఆహ్లాదం.. చిమ్నీ పాత్ర కీలకం
సాక్షి, సిటీబ్యూరో: ఇంటిలో వంట గది ప్రత్యేకతే వేరు. కుటుంబ సభ్యుల ఆనందం, ఆరోగ్యంలో కిచెన్ కీలకమైంది. వంట ఏదైనా సరే ఘాటు వాసన, పొగ ఇళ్లంతా వ్యాపించి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అందుకే వంట గదిలో చిమ్నీల ఏర్పాటు అనివార్యమైపోయింది. దీంతో ఇంటిలో ఘాటు వాసనలు వ్యాపించకపోవడమే కాకుండా చమురు, జిడ్డు మరకలు గోడలు మసకబారకుండా శుభ్రంగా ఉంటాయి.చిమ్నీ రకాలు బోలెడువాల్ మౌంటెడ్: స్టౌ గోడకు ఆనుకొని ఉంటే వాల్మౌంటెడ్ చిమ్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని గోడలకు అమర్చడం వల్ల నేరుగా పొగ, ఘాటు వాసనలను సంగ్రహించుకోవడంలో బాగా పనిచేస్తాయి.ఇన్బిల్ట్: కిచెన్ క్యాబినెట్ లేదా గోడలో ఇన్ బిల్ట్ చిమ్నీ కలిసిపోతుంది. ఘాటైన వాసనలు పీల్చే శక్తివంతమైన వ్యవస్థగా పనిచేస్తుంది. టెలిస్కోపిక్: ఈ రకం పైకప్పులలో ఇమిడిపోతాయి. వంట చేసేటప్పుడు చిమ్నీని పొడిగించుకోవచ్చు కూడా. చిన్న వంటగదిలో ఉపయోగపడతాయి. కార్నర్: స్థలం తక్కువగా ఉండే వంట గదిలో ఓ మూలన వినియోగిస్తారు. డక్ట్లెస్: గొట్టాలను అమర్చడానికి వీలులేని వంట గదిల్లో వినియోగిస్తారు. ఇవి గాలిని వెలుపలికి వదలకుండా వాటిలో ఉండే ఫిల్టర్స్ పొగ, ఆవిరి, చమురును పీల్చుకొని శుద్ధి చేస్తాయి. కన్వర్టబుల్: డక్టెడ్, డక్ట్లెస్ చిమ్నీలుగా మార్చుకునే అవకాశం ఉండేవే కన్వర్టబుల్. దీన్ని వంట గదికి అనుగుణంగా మార్చుకునే వీలుంటుంది. స్టాంటెండ్: కుక్టాప్ వద్ద వాలుగా ఉండే ఈ చిమ్నీ విలాసవంతంగా కనిపిస్తుంది. టెక్నీషియన్స్ ద్వారా శుభ్రం చేయించుకోవాల్సి ఉంటుంది. బయటకు కనిపించకుండా సీలింగ్ మౌంటెడ్లో అమరుస్తారు. ఐలాండ్: స్టౌ వేదిక ద్వీపంలా, కిటికీల చెంత స్టౌలు ఉంటే ఐలాండ్ లేదా సీలింగ్ మౌంటెడ్ చిమ్నీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇవి గోడల నుంచి దూరంగా ఉండటం వల్ల మరింతగా వాసనలు, పొగను సంగ్రహిస్తాయి. -
సుందరం.. పూజా మందిరం
సాక్షి, సిటీబ్యూరో: కట్టిన ఇల్లు కొంటున్నా.. దగ్గరుండి కట్టించుకుంటున్నా.. ఇంట్లో ప్రత్యేకంగా పూజ గది ఉండాలని కోరుకుంటున్నారు. ఇంటి విస్తీర్ణం మేరకు ప్రత్యేకంగా పూజ గది ఏర్పాటు చేసుకుంటున్న వారు కొందరైతే మరికొందరు మాత్రం మార్కెట్లో కోరుకున్న డిజైన్లు, విభిన్న ఆకృతుల్లో లభించే పూజా మందిరాలను కొనుగోలు చేసుకొని ఏర్పాటు చేసుకుంటున్నారు.పూజా గది ఏర్పాటు చేసుకునే సౌలభ్యం లేని వారు పూజా మందిరాలపై ఆధారపడుతున్నారు. ఒకప్పుడు చెక్కతో గోడకు ఒకచోట దేవుడి ఫొటోలు పెట్టుకునేలా ఏర్పాట్లు చేసుకునేవారు. కానీ సొంతిల్లు కొనుగోలు చేసిన వారు మాత్రం ప్రస్తుతం.. చిన్నదైనా సరే పూజా మందిరం ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటివారి కోసం దాదాపు నగరంలోని అన్ని ఫర్నీచర్ షోరూంలలో పూజా మందిరాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఒకటి, రెండు డిజైన్లు మాత్రమే ఉండగా.. వాటినే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కానీ, ప్రస్తుతం కావాల్సిన డిజైన్లో నచ్చిన ఆకారంతో పూజా మందిరాలు రెడీగా ఉన్నాయి. నచ్చిన విధంగా కావాలంటే ఆర్డర్పై తయారు చేసే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..ధరల్లో వ్యత్యాసం..పూజా మందిరాల్లో సైజు, డిజైన్, ఆకృతిని బట్టి ధరలు ఉంటాయి. సహజంగా వెడల్పు, ఎత్తును బట్టి పూజా మందిరాలు తయారు చేస్తున్నారు. స్థలానికి అనుగుణంగా ఆర్డర్పై తయారు చేయించుకోవచ్చు. అయితే వీటి తయారీలో ఉపయోగించే చెక్కను బట్టి ధరలు ఆధారపడి ఉంటాయి. టేక్వుడ్, సీసం వుడ్ ఇలా కావాల్సిన అభిరుచికి అనుగుణంగా తయారు చేయించుకునే అవకాశం ఉంది. సాధారణ చెక్కతో చిన్న సైజువి ఒక మోస్తారు సైజు వరకు రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు లభ్యమవుతున్నాయి. సహజంగా మందిరాలను ఓం, స్వస్తిక్ బొమ్మలతో తయారు చేయించుకుంటున్నారు. -
ఇదిగో ఇల్లు.. హైదరాబాదే టాప్
గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసి, గృహ కొనుగోలుదారులకు అందజేయడంలో దక్షిణాది నగరాలలో హైదరాబాద్ ముందంజలో నిలిచింది. గ్రేటర్లో 2024–25లో ఆర్థిక సంవత్సరంలో 57,304 యూనిట్లు డెలివరీ అయ్యాయి. 2023–24లో డెలివరీ అయిన 35,641 ఇళ్లతో పోలిస్తే ఏడాది కాలంలో 61 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో బెంగళూరులో 46,103, చెన్నైలో 19,650 యూనిట్లు డెలివరీ అయ్యాయి. – సాక్షి, సిటీబ్యూరోమార్చితో ముగిసిన 2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని తొమ్మిది నగరాలలో 4,06,889 యూనిట్లు డెలివరీ అయ్యాయని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)లో డెలివరీ అయిన 3,06,600 యూనిట్లతో పోలిస్తే ఏడాది కాలంలో డెలివరీలో 33 శాతం వృద్ధి నమోదైంది. గడువులోగా గృహాల అందజేతలో అత్యధికంగా పశ్చిమాది నగరాల వాటా 55 శాతంగా ఉంది. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, గడువులోగా కస్టమర్లకు అందజేశారు. ఒక్క ఢిల్లీలోనే క్షీణత.. గడువులోగా ప్రాజెక్ట్లను పూర్తి చేయడంలో ఢిల్లీ–ఎన్సీఆర్ వెనకబడి ఉంది. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 2024–25లో ఈ నగరంలో యూనిట్ల డెలివరీలో 8 శాతం క్షీణత నమోదైంది. అత్యధికంగా కోల్కతాలో, అత్యల్పంగా ముంబైలో గృహాలు డెలివరీ అయ్యాయి. ఏడాది కాలంలో కోల్కతాలో 88 శాతం, ముంబైలో 22 శాతం వృద్ధి నమోదైంది. డెలివరీలో వేగవంతం.. 2018–19 మధ్య కాలంలో లాంచింగ్ అయిన ప్రాజెక్ట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో డెలివరీ దశకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో లాక్డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు, కార్మికుల వలసలు తదితర కారణాలతో భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగాయి. రెండేళ్లుగా సానుకూల మార్కెట్ సెంటిమెంట్లు, నగదు ప్రవాహం పెరగడంతో పాటు నిలిచిపోయిన ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు స్పెషల్ విండో ఫర్ అఫర్డబుల్ అండ్ మిడ్ ఇన్కం హౌసింగ్(ఎస్డబ్ల్యూఏఎంఐహెచ్) ఫండ్ లభ్యత తదితర కారణాలతో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. దీంతో పాటు రెరాలో నమోదైన ప్రాజెక్ట్లు గడువులోగా పూర్తి చేయాలనే పలు కఠిన నిబంధనలతో డెవలపర్లు ప్రాజెక్ట్ డెలివరీపై దృష్టిసారించారు. దీంతో 2025 ఆర్థిక సంవత్సరంలో కస్టమర్లకు గృహాల డెలివరీ పెరిగాయి. -
రియల్ ఎస్టేట్లోకి పెట్టుబడుల వెల్లువ
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడులు(ఏఐఎఫ్) వెల్లువెత్తుతున్నాయి. 2024 డిసెంబర్ చివరి నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. గతేడాది డిసెంబర్ నాటికి అన్ని రంగాల్లో ఏఐఎఫ్లు కలిపి రూ.5,06,196 కోట్లు రాగా.. ఇందులో 15 శాతం వాటా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాయని అనరాక్ నివేదిక వెల్లడించింది.నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్ట్లకు ఏఐఎఫ్ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయని, డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధికంగా ఐటీ, ఐటీఈఎస్ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి.ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.26,807 కోట్లు, ఎన్బీఎఫ్సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్ రూ.11,550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్ పెట్టుబడులు ఆకర్షించగా.. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల పెట్టుబడులు వెళ్లాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్ రూపంలో పరిష్కారం లభించినట్టయింది.ఏమిటీ ఏఐఎఫ్ పెట్టుబడులు?దేశంలో సంపన్నులైన పెట్టుబడిదారులు ముఖ్యంగా కనీసం రూ.కోటి పెట్టుబడి పెట్టగల హై నెట్వర్త్ ఇండివిడ్యూవల్స్ (HNI), సంస్థల కోసం ఉద్దేశించిన ప్రైవేట్ పెట్టుబడి సమీకరణ సాధనాలే ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్). 2012 ఏఐఎఫ్ నిబంధనల ప్రకారం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వీటిని నియంత్రిస్తుంది.స్టాక్స్, బాండ్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి సంప్రదాయ పెట్టుబడులకు భిన్నంగా ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, కమోడిటీస్, డెరివేటివ్స్ వంటి సంప్రదాయేతర ఆస్తుల తరగతులలో ఏఐఎఫ్ పెట్టుబడులు పెడతారు. -
సెకండ్ హ్యాండ్ ఇళ్లకు గిరాకీ
స్థిరాస్తి రంగానికి ప్రత్యేకించి గృహ విభాగానికి కరోనా మహమ్మారి బూస్ట్లా బలానిచ్చింది. హోం ఐసోలేషన్, వర్క్ ఫ్రం హోమ్ వంటి కారణంగా సొంతింటి అవసరం తెలిసి రావడంతో నివాస విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో కోవిడ్ తర్వాత కొత్త ఇళ్లకే కాదు రీసేల్ ప్రాపర్టీలకూ గిరాకీ పెరిగింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీలలో సెకండ్ హ్యాండ్ హోమ్స్ వాటా 38 శాతంగా ఉండగా.. 2024–25 నాటికి 43 శాతానికి పెరిగిందని ఇంటిగ్రేటెడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్ స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోడెవలపర్ నుంచి నేరుగా కొనుగోలుదారులు కొనుగోలు చేసే ప్రాపర్టీలను ప్రైమరీగా, ఇంటి యజమాని మరొక కస్టమర్కు రీసేల్ చేస్తే దాన్ని సెకండరీ ప్రాపర్టీగా పరిగణిస్తారు. దేశంలోని 7 ప్రధాన నగరాలలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3.07 లక్షల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఇందులో 1.22 లక్షల రీసేల్ ప్రాపర్టీలు ఉండగా 2024–25 నాటికి మొత్తం 5.44 లక్షల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. సెకండ్హ్యాండ్ ప్రాపర్టీలు ఏకంగా 2.33 లక్షలకు పెరిగాయి. ప్రైమరీ యూనిట్లు 2018–19లో 1.84 లక్షలుగా ఉండగా.. 2024–25 నాటికి 3.11 లక్షలకు చేరాయి. అంటే రీసేల్ ప్రాపర్టీలలో 38 శాతం నుంచి 43 శాతానికి పెరిగితే.. ప్రైమరీ యూనిట్లు 62 శాతం నుంచి 57 శాతానికి తగ్గాయి.లగ్జరీ పెరగడమే రీసేల్కు బూస్ట్.. కరోనా కంటే ముందు వరకూ బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉండేవి. డెవలపర్లు కూడా అఫర్డబుల్ హౌసింగ్ నిర్మాణాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఏటేటా భూముల ధరలు పెరుగుతుండటంతో చౌక ఇళ్ల నిర్మాణ వ్యయప్రయాసంగా మారింది. దీంతో లగ్జరీ, విశాలమైన గృహ నిర్మాణాల వైపు ఆసక్తి పెరిగింది. కొత్త ప్రాజెక్ట్ల లాంచింగ్స్ పరిమిత స్థాయిలో ఉండటం, అందు బాటు గృహాల స్థానంలో ఖరీదైన గృహాల సరఫరా పెరగడంతో సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీల వైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలు మొగ్గుచూపుతున్నారు.గ్రేటర్లో ఇదీ పరిస్థితి.. హైదరాబాద్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 71 వేల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఇందులో 35 వేలు ప్రైమరీ, 36 వేలు సెకండరీ యూనిట్లు ఉన్నాయి. అదే 2018–19లో మొత్తం 63 వేల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఇందులో ప్రైమరీ 29 వేలు, సెకండరీ యూనిట్లు 34 వేలు ఉన్నాయి. 2018–19లో ప్రైమరీ యూనిట్ల వాటా 46 శాతం కాగా.. సెకండరీ యూనిట్ల వాటా 54 శాతంగా ఉంది. అదే 2024–25లో ప్రైమరీ యూనిట్ల వాటా 49 శాతం కాగా.. సెకండరీ యూనిట్ల వాటా 51 శాతంగా ఉంది.ఐటీ హబ్కు చేరువలో..రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ వంటి మెరుగైన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాలలో రీసేల్ ప్రాపర్టీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, హబ్సిగూడ, ఉప్పల్, పోచారం వంటి ఐటీ కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని సెకండ్ హ్యాండ్ హోమ్స్ డిమాండ్ ఎక్కువగా ఉంది. మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని నాణ్యమైన ఇళ్లకు ధర కాస్త ఎక్కువైనా కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రయోజనాలివీ» కొత్త నిర్మాణాల కంటే రీసేల్ ప్రాపర్టీల ధరలు అందుబాటులో ఉంటాయి. » రోడ్లు, విద్యా, వైద్య సంస్థలు, మార్కెట్లు, రవాణా సదుపాయాలతో స్థిరమైన మౌలిక వసతులు ఉంటాయి. » నిర్మాణం పూర్తయ్యే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా గృహ ప్రవేశం చేసేయవచ్చు. » రీసేల్ ప్రాపర్టీలకు జీఎస్టీ వర్తించదు కాబట్టి కొనుగోలుదారులకు డబ్బు ఆదా అవుతుంది. » కొత్త ప్రాజెక్ట్లు పెద్దగా లేని ప్రాంతాలలో సెకండ్హ్యాండ్ హోమ్స్ యజమానితో బేరసారాలకు అవకాశం ఉంటుంది. » రీసేల్ ప్రాపర్టీలకు సైతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్లు తక్కువ వడ్డీలోనే గృహ రుణాలను అందిస్తున్నాయి. » కొత్త ఇంటి కొనుగోలు సమయంలో డెవలపర్కు ముందుగా చెల్లించే 10–15 శాతం డౌన్ పేమెంట్ను చెల్లించి, బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే రీసేల్ ప్రాపర్టీలో అయితే ఇదేమీ అక్కర్లేదు.జాగ్రత్తలివీ..» సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీలు కొనేముందు ఇంటి వాస్తవ విలువ, మార్కెట్ ధరలను పూర్తిగా అధ్యయనం చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావడం ఉత్తమం. » సాధారణంగా రీసేల్ ప్రాపర్టీలు వ్యవస్థీకృత రంగంలో విక్రయాలు జరగవు కాబట్టి మధ్యవర్తుల మాటలు నమ్మకూడదు. ఒకటికి రెండుసార్లు పునఃసమీక్ష చేసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. » లీకేజీలు, నిర్వహణ సమస్యలను గృహ యజమాని దాచిపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి థర్డ్పార్టీతో సమగ్రంగా అధ్యయనం చేయించిన తర్వాత కొనుగోలు చేయడం బెటర్. » 10–15 ఏళ్లకు పైబడి పాత ఇంటిని కొనకపోవడమే ఉత్తమం. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో అయితే పాత ఇంటిని కొన్నా.. దాని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మించుకుంటేనే కలిసొస్తుంది. » లింక్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్, ఆస్తి పన్ను పత్రాలు ఇతరత్రా డాక్యుమెంట్లను న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. -
వేర్హౌస్ లావాదేవీల్లో.. అప్ అండ్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పారిశ్రామిక గిడ్డంగుల(వేర్హౌస్) విపణిలో భిన్న వాతావరణం ఏర్పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో నగరంలో 3 లక్షలు చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 2 లక్షల లావాదేవీలతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. ఇక, 2025 క్యూ1లో నగరంలో కొత్తగా 2 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం సరఫరా అయ్యింది. గతేడాది ఇదే కాలంలో సరఫరా అయిన 6 లక్షల చ.అ.లతో పోలిస్తే ఇది 67 శాతం తక్కువ.ఈ ఏడాది క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగుల స్థల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 78 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఎక్కువగా ఇంజినీరింగ్ కంపెనీలు 25 శాతం, ఈ–కామర్స్ సంస్థలు 21 శాతం స్పేస్ను లీజుకు తీసుకున్నాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. అలాగే ఈ క్యూ1లో కొత్తగా 94 లక్షల చ.అ. స్పేస్ సరఫరా అయింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. -
ఇళ్ల కొనుగోలు నిర్ణయం.. యువతే కీలకం
సాక్షి, సిటీబ్యూరో: కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసిరావటమే. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. ఇళ్ల కొనుగోలు నిర్ణయంలో వీరు కీలకంగా మారారు. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్భణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు.సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యం మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు.ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(యూహెచ్ఎన్ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
ఫారిన్ ఫ్లో: స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడుల వెల్లువ..
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంటే.. మన దేశం మాత్రం వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి సాధిస్తోంది. దేశీయ స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశాభివృద్ధిపై దేశీయ పెట్టుబడిదారులకు విశ్వాసం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరిగింది. దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, సులభతర పెట్టుబడి విధానం వంటి రకరకాల కారణాలతో విదేశీ పెట్టుబడిదారుల వాటా గతేడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 2 శాతం నుంచి ఈ ఏడాది క్యూ1 నాటికి ఏకంగా 43 శాతానికి పెరిగిందని వెస్టియన్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోవిదేశీ పెట్టుబడుల వెల్లువ..దేశంలోకి 2024 క్యూ1లో 552.1 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. ఇందులో విదేశీ పెట్టుబడులు కేవలం 4 శాతమే. అంటే 11 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అదే 2025 క్యూ1 నాటికి మొత్తం 813.3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఇందులో విదేశీ పెట్టుబడుల వాటా ఏకంగా 43 శాతం. 346.9 మిలియన్ డాలర్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. నివాసంలోకే అత్యధికం.. నివాస విభాగంలో పెట్టుబడులకే విదేశీయులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రంగంలోకి 506 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో రెసిడెన్షియల్ సెక్టార్ వాటా 62 శాతం. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 41 శాతం అధికం. విలువల పరంగా చూస్తే.. పెట్టుబడులు వార్షికంగా 125 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఆ తర్వాత వాణిజ్య విభాగంలోకి 307.2 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి.ఇదీ చదవండి: పెరిగిన అద్దెలు.. హైదరాబాద్లో అక్కడే ఫుల్ డిమాండ్!ఈ త్రైమాసికంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఈ విభాగం వాటా 38 శాతం. అయితే ఈ క్యూ1లో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకి ఎలాంటి పెట్టుబడులు రాలేదు. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ రంగం, లాజిస్టిక్ ఖర్చుల తగ్గింపు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ విభాగంలోకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు అపారంగా ఉన్నాయి. -
పెరిగిన అద్దెలు.. హైదరాబాద్లో అక్కడే ఫుల్ డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండంతో సప్లయ్ తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ -
గ్రీన్ ఆఫీసులకు ఆదరణ
కరోనా తర్వాత స్థిరాస్తి కొనుగోలుదారులలో మార్పులు వచ్చాయి. తినే తిండితో పాటు ఉండే ఇల్లు కూడా హైజీన్గా ఉండాలని భావిస్తున్నారు. దీంతో పర్యావరణహితమైన భవన నిర్మాణాలకు ఆదరణ పెరిగింది. ఈ గ్రీనరీ కేవలం ఇళ్లకే కాదు పనిచేసే ఆఫీసులూ హరితంగానే ఉండాలని భావిస్తున్నారు. దీంతో ఉద్యోగస్తుల అభిరుచులకు తగ్గట్టుగానే యాజమాన్యాలు కూడా గ్రీన్ స్పేస్ ఆఫీసులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని క్రెడాయ్– కొలియర్స్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోకరోనా తర్వాతి నుంచి బహుళ జాతి సంస్థలు ఇంధన సామర్థ్యం, కార్బన్ ఉద్గారాల తగ్గుదలతో పాటు ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో హరిత కార్యాలయాలకు ఆదరణ పెరుగుతుంది. 2010లో దేశంలోని ఆఫీసు స్పేస్ స్టాక్లో గ్రీన్ ఆఫీసు స్పేస్ వాటా 52 శాతంగా ఉండగా.. గత ఐదేళ్లలో ఏకంగా 80 శాతానికి పైగా చేరడమే ఇందుకు ఉదాహరణ. హరిత భవనాల అత్యధికంగా ఐటీ, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్ అండ్ ఫార్మా, ఇంజినీరింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి.హరిత భవనాలు 1,300 కోట్ల చ.అ.. డెవలపర్లు, పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు గ్రీన్ సర్టిఫికెట్, ఇంధన సమర్థవంతమైన నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. స్థిరమైన భవన పద్ధతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సరళమైన నిబంధనలు గ్రీన్ బిల్డింగ్ల నిర్మాణానికి ప్రధాన కారణం. దీంతో గృహాలు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, గిడ్డంగులు, డేటా సెంటర్లు కూడా కార్బన్ ఉద్గారాల తగ్గించే భవన నిర్మాణానికే బిల్డర్లు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో హరిత భవనాలు 1,300 కోట్ల చ.అ.కు చేరాయని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) తెలిపింది. గతేడాది ముగింపు నాటికి దేశంలో 21 లక్షలకు పైగా గృహాలు, 6,500 వాణిజ్య సముదాయాలు, 750 పారిశ్రామిక ప్రాజెక్ట్లు గ్రీన్ సర్టిఫికెట్ను పొందాయి.అద్దెలు ప్రీమియమే.. గ్రీన్ సర్టిఫికెట్ పొందిన ఆఫీసు భవనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటిల్లో ఆక్యుపెన్సీ లెవల్ 80–90 శాతం వరకు ఉంది. సాధారణ భవనాలలో పోలిస్తే గ్రీన్ ఆఫీసుల అద్దె 25 శాతం అధికంగా ఉంటుంది. దేశంలోని గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీసు స్పేస్ స్టాక్లో 31 శాతం వాటాతో బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. ఢిల్లీ–ఎన్సీఆర్ 19 శాతం, హైదరాబాద్ 17 శాతంతో ఆ తర్వాతి స్థానాలలో నిలిచాయి. 2024 చివరి నాటికి 50.3 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ స్టాక్ ఉంది. వచ్చే 2–3 ఏళ్లలో 70 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.పాత భవనాలు గ్రీనరీగా.. దేశంలో పదేళ్లకు పైగా మించిన 35.5 నుంచి 38.5 కోట్ల చ.అ.లలో పాత భవనాలు ఉన్నాయి. వీటిని గ్రీన్ ఆఫీసులుగా పునరుద్ధరించడానికి 425 బిలియన్లకు పైగా పెట్టుబడులు అవసరం. అలాగే పదేళ్లలోపు 8 నుంచి 11 కోట్ల చ.అ. పాత భవనాలు ఉన్నాయి. వీటి పునరుద్ధరణకు 22–32 బిలియన్లు అవసరం.మార్కెట్లోకి ఆఫీసు స్పేస్ సరఫరా.. వచ్చే మూడేళ్లలో ఆరు ప్రధాన నగరాల్లో 17–20 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ అందుబాటులోకి వస్తుందని అంచనా. అత్యధికంగా ఐటీ హబ్లైన బెంగళూరు, హైదరాబాద్లో సరఫరా రానుంది.ప్రయోజనాలివీ..» ఏటా 6,430 యూనిట్ల విద్యుత్ ఆదా » సంవత్సరానికి 19,800 కోట్ల లీటర్ల నీరు ఆదా » వార్షికంగా 5.14 కోట్ల టన్నుల సీఓ–2 ఉద్గారాల తగ్గుదల » ఏటా 25 లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం » ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు » తక్కువ యూటిలిటీ బిల్లులు -
కాస్త పెరిగిన ఇంటి అద్దెలు..
కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల విపణి క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లయి తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది. -
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడుల పట్ల సంస్థాగత ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రంగం 2022–24 మధ్యకాలంలో (మూడేళ్లలో) 26.7 బిలియన్ డాలర్ల (రూ.2.29 లక్షల కోట్లు) ఈక్విటీ పెట్టుబడులను అందుకున్నట్టు సీఐఐ–సీబీఆర్ఈ సంయుక్త నివేదిక తెలిపింది. ఇందులో పావు శాతం అంటే 6.7 బిలియన్ డాలర్లను (రూ.57,600 కోట్లు సుమారు) ముంబై నగరం ఆకర్షించడం గమనార్హం.ముంబైతోపాటు ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు ఈ మూడు నగరాల నుంచి మార్కెట్లోకి వచ్చిన పెట్టుబడులు 16.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలోకి 2022–24 మధ్య వచ్చిన పెట్టుబడుల్లో 62 శాతాన్ని ఈ మూడు నగరాలు దక్కించుకున్నాయి. పెట్టుబడి శ్రేణికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రధానంగా ఈ నగరాల్లో కేంద్రీకృతమై ఉండడం, బలమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరుల లభ్యత, రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా సంఘటితంగా మారుతుండడం ఈ మూడు నగరాలకు అనుకూలిస్తున్నట్టు ఈ నివేదిక వివరించింది. అభివృద్ధిపైనే అధికంగా..ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు 2022–24 మధ్య 44 శాతం మేర ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించినట్టు, ఆ తర్వాత ఆఫీస్ నిర్మాణ ఆస్తుల్లోకి 32 శాతం వచ్చినట్లు సీఐఐ–సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. ఇక గత మూడేళ్లలో 10 శాతం మేర ఈక్విటీ పెట్టుబడులు (3 బిలియన్ డాలర్లు) టైర్–2 పట్టణ రియల్ ఎస్టేట్లోకి వచ్చినట్టు తెలిపింది. ‘భారత రియల్ ఎస్టేట్ రంగం కొత్త వృద్ధి పథంలోకి అడుగు పెట్టింంది. బలమైన మూలధన పెట్టుబడులు, అభివృద్ధికి భూముల లభ్యత ఇందుకు మద్దతునిస్తున్నాయి’ అని సీబీఆర్ఈ భారత ఛైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?ఆఫీస్ అసెట్స్, నివాస గృహ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు బలమైన సెంటిమెంట్ ఉండడం అన్నది స్థిరమైన వినియోగ డిమాండ్కు నిదర్శనంగా అన్షుమన్ పేర్కొన్నారు. దేశ రియల్ ఏస్టేట్ రంగం మరింత సంస్థాగతంగా మారుతున్నట్టు సీఐఐ పశ్చిమ ప్రాంత ఛైర్మన్ రిషి కుమార్ బగ్లా తెలిపారు. దీంతో ఈ రంగం మరింత పారదర్శకతతో, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటున్నట్టు చెప్పారు. ఈ రంగం మరింత సంస్థాగతంగా, నియంత్రితంగా మారితే అప్పుడు అంతర్జాతీయ ఫండ్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వస్తాయన్నారు. -
రియల్ ఎస్టేట్లోకి ఏఐఎఫ్ పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్లు) పెట్టుబడులు 2024 డిసెంబర్ నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్ సంస్థ ‘అనరాక్’ ఏఐఎఫ్లకు సంబంధించి డేటాను విశ్లేషించి ఒక నివేదిక విడుదల చేసింది. గత డిసెంబర్ నాటికి ఏఐఎఫ్లు అన్ని రంగాల్లోనూ కలిపి రూ.5,06,196 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపింది. ఇందులో 15 శాతం మేర (రూ.73,903 కోట్లు) రియల్ ఎస్టేట్లోకి వచ్చాయని.. రంగాల వారీగా అత్యధిక పెట్టుబడులు రియల్టీకే దక్కినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘ఏఐఎఫ్లతో దేశ రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ (రుణ సదుపాయం) గణీయమైన మార్పునకు గురైంది. నిధుల్లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్టులకు ఏఐఎఫ్ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయి. డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి’’అని అనరాక్ తెలిపింది. ఏ రంగంలోకి ఎంత మేర.. రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధికంగా ఐటీ/ఐటీఈఎస్ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.26,807 కోట్లు, ఎన్బీఎఫ్సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్ రూ.11550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్ పెట్టుబడులను 2024 డిసెంబర్ నాటికి ఆకర్షించినట్టు అనరాక్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్ రూపంలో పరిష్కారం లభించినట్టు అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు. సంప్రదాయ నిధుల సమీకరణ మార్గాల్లో ఇబ్బందులకు ఈ రూపంలో పరిష్కారం లభించినట్టు చెప్పారు. ఏఐఎఫ్లు ప్రైవేటు ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి ఇన్వెస్టర్లకు అధిక రిస్క్తో కూడిన రాబడులను ఆఫర్ చేస్తుంటాయి. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించి, తమ ప్రణాళికలకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన దశాబ్ద కాలంలో సెబీ వద్ద నమోదైన ఏఐఎఫ్లు 36 రెట్లు పెరిగాయి. 2013 మార్చి నాటికి 42గా ఉన్నవి 2025 మార్చి 5 నాటికి 1,524కు పెరిగినట్టు డేటా తెలియజేస్తోంది. -
ఇలాంటి ఇల్లు కొంటే తలనొప్పే..
భవన నిర్మాణం సమయంలో తడిగా ఉండే ప్రదేశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆయా ప్రాంతాల వద్ద అత్యంత నాణ్యత ఉండేలా చూసుకుంటే.. మన కలల సౌధం పది కాలాల పాటు దృఢంగా ఉంటుంది. మరుగుదొడ్లు, స్నానాల గదులు, కిచెన్ సింక్, వాషింగ్ మిషన్ ఉండే చోట నిర్మాణం సమయంలోనే నాణ్యత పాటించేలా చూసుకోవడం కూడా అవసరం. - సాక్షి, సిటీబ్యూరోముఖ్యంగా మరుగుదొడ్లు, స్నానాల గదుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు తలనొప్పిగా మారుతుంటాయి. ఇంటి కొనుగోలు సమయంలోనే ఈ విషయాలు గమనించాలి. పైకి ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా ఎంత క్వాలిటీ వస్తువులు వాడారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి.వెంటనే అప్రమత్తం.. వాటర్ ప్రూఫింగ్ సక్రమంగా లేకుంటే టైల్స్పై నిలిచిన నీటి నుంచి సన్నగా లీకేజీ ప్రారంభమవుతుంది. ఇందుకు వ్యక్తిగత గృహాలు, విల్లాలు ఏవీ మినహాయింపు కాదు. లీకేజీకి ఎక్కడైనా అవకాశం ఉంటుంది. నిర్మాణం పూర్తయిన సంవత్సరం.. ఆ తర్వాత ఈ సమస్య బయట పడుతుంది. గోడలకు చెమ్మ రావడం, వాసన వస్తుండటం వంటి సంకేతాలు కనిపిస్తుంటాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే సమస్య క్రమంగా భవనమంతా వ్యాపిస్తుంది.అదే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ బహుళ అంతస్తుల భవనాల్లో మన ఫ్లాట్ కింద ఉన్న వారికి సమస్యలు మొదలవుతాయి. గోడలకు చెమ్మ రావడం, రంగు మారిపోవడం, పెచ్చులుగా రంగు ఊడిపోతుండడం, దుర్వాసన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సమస్య తమ ఫ్లాట్లోనే ఉందని తొలుత అంతా భావిస్తారు. భవన నిర్మాణదారుడు సరైన వాటర్ ప్రూఫింగ్ విధానం పాటించకపోవడంతో పైఫ్లాట్ నుంచి లీకేజీ అవుతున్నట్లు ఆలస్యంగా గ్రహిస్తారు. వీటిని ప్లంబర్లు, నిర్మాణ మేస్త్రీలు మాత్రమే కచ్చితంగా గుర్తిస్తారు.అక్కడి నుంచే మొదలు.. సాధారణంగా అత్యధిక లీకేజీలు టాయిలెట్ రూమ్ నుంచే మొదలవుతాయి. ఆ ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు టైల్స్ ఎగుడుదిగుడుగా లేకుండా చూసుకోవాలి. దీనికంటే ముందు నిర్మాణ దశలోనే కాంక్రీట్ లేదంటే బ్రిక్స్తో రసాయనాలు వినియోగించి వాటర్ ప్రూఫ్ బెడ్ ఏర్పాటు చేయాలి. ఇక నీటి పైప్లైన్ల కారణంగానూ లీకేజీలు ఏర్పడతాయి. వంట గదిలో సింక్ దగ్గర, వాషింగ్ మిషన్ ప్రదేశాలలో పైపుల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలి. -
విశాలమైన ఆఫీస్.. ఫుల్ డిమాండ్
స్థిరాస్తి రంగాన్ని కరోనా ముందు, తర్వాత అని విభజించక తప్పదేమో.. మహమ్మారి కాలంలో ఇంటిలో ప్రత్యేక గది, ఇంటి అవసరం ఎలాగైతే తెలిసొచ్చిందో.. ఆఫీసు విభాగంలోనూ సేమ్ ఇదే పరిస్థితి. కోవిడ్ అనంతరం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలంటే ఆఫీసు స్థలం విశాలంగా ఉండక తప్పని పరిస్థితి. దీంతో విస్తీర్ణమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 25 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 80 శాతం స్థలం పెద్ద, మధ్య స్థాయి కార్యాలయాల వాటానే ఉన్నాయి. ఈ విభాగంలో 20 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. అత్యధికంగా 35 శాతం ఐటీ సంస్థలు, 17 శాతం ఫార్మా అండ్ హెల్త్ కేర్ సంస్థలు లీజుకు తీసుకున్నాయని గ్లోబల్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సావిల్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో కార్యాలయ స్థల లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఆరు ప్రధాన నగరాలలో క్యూ1లో 1.89 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2020 తర్వాత ఈ స్థాయిలో ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ లావాదేవీలు 7.10 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.సరఫరాలో 28 శాతం వృద్ధి.. 2025 క్యూ1లో ఆరు మెట్రో నగరాల్లో కొత్తగా మార్కెట్లోకి 86 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 8.15 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. లీజులలో వృద్ధి, సరఫరా కారణంగా ఈ త్రైమాసికం ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ వేకన్సీ రేటు 15 శాతంగా ఉంది.జీసీసీల జోరు.. ఇప్పటి వరకు దేశంలోని ఆరు మెట్రోలలో 80.62 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 87.91 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. స్థూల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ధరలు, నైపుణ్య కార్మికుల అందుబాటు తదితర కారణాలతో ఐటీ, బ్యాంకింగ్, తయారీ రంగాలలో ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ లావాదేవీలు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో ఆఫీసు స్పేస్ విభాగం మరింత వృద్ధి సాధిస్తుంది. -
హోమ్ లోన్ ముందుగా చెల్లించడం మంచిదేనా..?
సగటు మనిషి తన జీవితంలో తీసుకునే అతిపెద్ద రుణం ఇంటి కోసమే.. ఇది కనీసం 15–30 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తం అన్ని సంవత్సరాలు చెల్లించడం వల్ల చాలా ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. మనకు తెలియకుండానే తీసుకున్న రుణం కంటే దాదాపు రెట్టింపుపైనే చెల్లిస్తాం. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్నప్పుడు ఇంటి రుణం ముందుగా చెల్లించడం మంచిదేనా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మీకు అందుబాటులో డబ్బు ఉన్నప్పుడు ఇంటి రుణం తీర్చుకోవడం తెలివైన పని అని సూచిస్తున్నారు. అయితే ఇంటి రుణం ముందుగా చెల్లించాలా? లేదా అనే నిర్ణయం మీరు ఎంచుకున్న పన్ను విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. - సాక్షి, సిటీబ్యూరోవీరికి ప్రయోజనకరంఇంటి రుణం ముందస్తు చెల్లింపు.. ముఖ్యంగా ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఆదాయం తగ్గకముందే బాధ్యతలను క్లియర్ చేయడంలో ఇది సహాయపడుతుంది. మొత్తం వడ్డీ భారాన్ని తగ్గించడంతో పాటు ముందస్తు చెల్లింపు రుణ కాలపరిమితిని తగ్గిస్తుంది. అలాగే క్రెడిట్ స్కోర్ను మెరుగుపరుస్తుంది. పైగా ముందస్తు చెల్లింపు ఈఎంఐలను తగ్గించడంలో సహాయపడుతుంది. రుణ గ్రహీత గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించినప్పుడు, అతిపెద్ద ప్రయోజనం మొత్తం వడ్డీ అవుట్గో తగ్గడం, వడ్డీని బాకీ ఉన్న అసలుపై లెక్కించినందున, ఒకేసారి చెల్లింపులు చేయడం వల్ల వడ్డీ వచ్చే బకాయి మొత్తం తగ్గుతుంది.ఈఎంఐల భారం తగ్గుతుంది..ఉదాహరణకు 20 సంవత్సరాల కాల వ్యవధికి 9 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల గృహ రుణాన్ని తీసుకుంటే.. రుణ గ్రహీత ఐదు సంవత్సరాల తర్వాత రూ.5 లక్షలను ముందస్తుగా చెల్లిస్తే.. మిగిలిన రుణ బ్యాలెన్స్ సుమారు రూ.39.35 లక్షలకు తగ్గుతుంది. ఫలితంగా భవిష్యత్తు ఈఎంఐల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంక్ పాలసీని బట్టి రుణ గ్రహీత ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు లేదా రుణ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. రుణ గ్రహీత ఈఎంఐని మార్చకుండా ఉంచాలని ఎంచుకుంటే రుణ కాలపరిమితి 20 ఏళ్ల నుంచి దాదాపు 15 ఏళ్లకు తగ్గుతుంది. తద్వారా వడ్డీ చెల్లింపులతో సుమారు రూ.16.30 లక్షలు ఆదా అవుతుంది. -
కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..!
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు నగరవాసులు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జేబుకు భారం కాకుండా బడ్జెట్ ఇళ్లను కొని, తర్వాత బాధపడే బదులు.. భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి అధిక విస్తీర్ణం కలిగిన ఖరీదైన గృహాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రేటర్లో రూ.50 లక్షలలోపు ధర ఉండే అందుబాటు ఇళ్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ.. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం యూనిట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ నగరంలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా 55 శాతంగా ఉంది. కానీ, గతేడాది ఇదే నెలలోని 60 శాతంతో పోలిస్తే మాత్రం ఈ విభాగం వాటా 14 శాతం మేర తగ్గింది. అదే రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్ల వాటా ఏడాది కాలంలో 17 శాతం మేర పెరిగింది. మార్చిలో రిజిస్ట్రేషన్స్ అయిన మొత్తం ప్రాపర్టీలలో ఖరీదైన ఇళ్ల వాటా 19 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ విభాగం వాటా 15 శాతమే. దీని అర్థం.. గృహ కొనుగోలుదారులు అందుబాటు గృహాల నుంచి క్రమంగా ఖరీదైన ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారని నైట్ఫ్రాంక్ ఇండియా నెలవారీ నివేదిక వెల్లడించింది.👉ఇదీ చదవండి: హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..రూ.4,471 కోట్ల విలువైన ప్రాపర్టీలు.. గ్రేటర్లో గత నెలలో 6,327 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. వీటి విలువ రూ.4,471 కోట్లు.. అయితే అంతకు క్రితం నెలతో పోలిస్తే ప్రాపర్టీల విలువ రూ.14 శాతం మేర, రిజిస్ట్రేషన్లు 6 శాతం వృద్ధి చెందాయి. ఫిబ్రవరిలో రూ.3,925 కోట్ల విలువైన 5,988 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం రిజిస్ట్రేషన్లు 8 శాతం తగ్గగా.. విలువ 4 శాతం మేర పెరిగింది. 2024 మార్చిలో రూ.4,275 కోట్ల విలువైన 6,870 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి.. గత నెలలో రూ.2,480 కోట్ల విలువైన 3,509 అఫర్డబుల్ యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది ఇదే నెలతో పోలిస్తే మాత్రం ఇది 14 శాతం తక్కువ. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న 1,605 యూనిట్లు మార్చిలో రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.1,134 కోట్లు. 2024 మార్చితో పోలిస్తే ఈ విభాగంలోనూ రిజిస్ట్రేషన్లు 7 శాతం మేర తగ్గాయి. ఇక, రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్లు గత నెలలో 1,213 రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.857 కోట్లు. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం ప్రీమియం ఇళ్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 17 శాతం, విలువలు 33 శాతం మేర వృద్ధి చెందాయి. గతేడాది మార్చిలో 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 13 శాతంగా ఉండగా.. గత నెలకొచ్చే సరికి 16 శాతానికి పెరిగింది. 1,000 నుంచి 2,000 చ.అ. యూనిట్ల వాటా 71 శాతం నుంచి 68 శాతానికి తగ్గింది. -
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎంఎస్ఎన్ రియాల్టీ అద్భుతమైన ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోపోలిస్ ప్రాంతంలో అల్ట్రా లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్ను ‘వన్’ను నిర్మించనుంది. 7.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,750 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనుంది.40 లక్షల చ.అ.లలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్లో 5 టవర్లు, ఒక్కోటి 55 అంతస్తుల్లో ఉంటుంది. 5,250 చ.అ. నుంచి 7,460 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 655 యూనిట్లు ఉంటాయి. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను సంస్థ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్నీ 4 బీహెచ్కే యూనిట్లే ఉండే ఈ ప్రాజెక్ట్లో చ.అ. ధర రూ.11 వేలుగా ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్కు రెండు బాల్కనీలు, లార్జ్ డెక్ ఉంటుంది. గండిపేట చెరువు వ్యూ ఉండే ఈ ప్రాజెక్ట్లో 1.8 లక్షల చ.అ. విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ఉంటుంది.ఇందులో 30కి పైగా ఆధునిక వసతులు ఉంటాయి. మూడు స్విమ్మింగ్ పూల్స్, యోగా డెక్, స్కై సినిమా, ఆక్వా జిమ్, వెల్నెస్, లైఫ్స్టైల్ జోన్లతో పాటు బ్యాడ్మింటన్, స్క్వాష్, పికిల్బాల్, ప్యాడిల్ బాల్ కోర్టులు, బౌలింగ్ అల్లే, క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్ కోసం ప్రత్యేక సిమ్యులేటర్లు ఉంటాయని ఆయన వివరించారు. నగరంలో వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల చ.అ.లలో ప్రాజెక్ట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. -
హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గతేడాది కొత్త ప్రాజెక్టుల ధరలు సగటున 9 శాతం మేర పెరిగినట్లు డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2024–25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చ.అ.కు రూ.13,197కు చేరినట్లు పేర్కొంది. ఏడాది కాలంలో కోల్కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 5 శాతం, హైదరాబాద్లో 5 శాతం, చెన్నైలో 4 శాతంగా ఉన్నాయి.ముంబై, నవీ ముంబైలో ఇళ్ల ధరలు 3 శాతం తగ్గాయి. కాగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అత్యధికంగా బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదయ్యింది. కోల్కత్తాలో 29 శాతం, చెన్నైలో 25 శాతం, థానేలో 23 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 20 శాతం, పుణేలో 18 శాతం, నవీ ముంబైలో 13 శాతం, ముంబైలో 11 శాతం, హైదరాబాద్లో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చిలో గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గి, 1,05,791 యూనిట్లకు చేరుకోగా.. సరఫరా 34 శాతం తగ్గి 80,774లకు చేరుకుంది.ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్లలో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చ.అ. సగటున ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కు పెరిగింది. కోల్కత్తాలో చ.అ. ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చ.అ.కు రూ.7,645 నుంచి రూ.7,989కు పెరిగాయి. హైదరాబాద్లో చ.అ.కు రూ.7,890 నుంచి రూ.8,306కు పెరిగాయి. పుణెలో చ.అ.కు రూ.9,877 నుంచి రూ.10,832కు పెరిగాయి. థానేలో సగటు చ.అ. ధర రూ.11,030 నుంచి రూ.12,880కు పెరిగాయి. ఢిల్లీలో చ.అ.కు రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగాయి. -
రియల్ఎస్టేట్లో తగ్గిన ‘పీఈ’ పెట్టుబడులు
సాక్షి, సిటీబ్యూరో: దేశీయ స్థిరాస్తి రంగంలోకి వచ్చిన ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు కాస్త తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం మేర తగ్గినట్లు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ క్యాపిటల్ వెల్లడించింది.2024–25లో ఈ పెట్టుబడులు 3.7 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది ఇవి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు భవనాలకు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడమే ఈ క్షీణతకు కారణం. 2020–21లో అత్యధికంగా 6.4 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు రాగా.. 2021–22లో ఇవి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి.అయితే 2022–23 కల్లా 4.4 బిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఐదేళ్లుగా దేశీ రియల్టీలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతూ వచ్చాయి. 6.4 బిలియన్ డాలర్ల నుంచి 3.7 బిలియన్ డాలర్లకు అంటే 43 శాతం మేర క్షీణించాయి.