breaking news
Tirupati
-
‘చంద్రబాబు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది’
సాక్షి, తిరుపతి: మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలపై విచారణ జరిపించాలని.. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ఆమె మండిపడ్డారు. డీఎస్సీ స్కాం బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ ఎస్వీ యూనివర్సిటీ సెకండ్ గేట్ వద్ద వైఎస్సార్సీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. రూ. 7 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని మండిపడ్డారు. డీఎస్సీ పేపర్ లీకేజీ, రిక్రూట్ మెంట్లో అనర్హులకు పట్టం కట్టారు. 420 జీవో తీసుకొచ్చి.. 427 పోస్టులు అనర్హులకు ఇచ్చారు. డీఎస్సీ అక్రమాలు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది’’ అని ఆర్కే రోజా తేల్చి చెప్పారు.‘‘191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులకు మూడు వేలు భృతి ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. కోటిన్నరకు పైగా నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. జగనన్న ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబును అడుగు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మహిళలు జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. చంద్రబాబు.. నీ కొడుకు లోకేష్తో రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది..లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం సాగుతుంది. జగనన్న పాలనలో లక్ష 30 వేల పోస్టులు. ఆంధ్రజ్యోతి పేపర్కు, చంద్రబాబుకు మధ్య అవినాభావ సంబంధం బయట పడింది. చంద్రబాబు నాయుడు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది. ఆడ పిల్లలలపై అత్యాచారం జరిగితే కేసులు లేవు. భజన పత్రికలు కోసం చంద్రబాబు పనిచేస్తున్నారు’’ అని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
షేవింగ్ బ్లేడ్తో భర్తను చంపిన భార్య రేవతి..!
తిరుపతి: ప్రియుడు ప్రేరేపించడంతోనే భార్య తన భర్త గొంతు కోసినట్లు అంగీకరించిందని ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం స్థానిక పోలీసు స్టేషన్లో ముద్దాయిలను అరెస్టు చేసి, విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని నీర్పాకోటలోని పల్లం దళితవాడకు చెందిన భీమయ్య (42), రేవతి (29)కి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. భీమయ్య బెల్దూరి మేస్త్రీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. భార్య రేవతి గతంలో శ్రీసిటీలోని అపాచీ కంపెనీలో పనిచేసేది. ఆ సమయంలో తొట్టంబేడు మండలం, పొయ్యి గ్రామానికి చెందిన నాగరాజుతో ఆమెకు పరిచయమై, వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి భీమయ్య భార్యపై అనుమానం పెంచుకుని కంపెనీకి వెళ్లకుండా పని మాని్పంచాడు. ఆరు నెలలుగా రేవతి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 24వ తేదీ భీమయ్య మద్యం మత్తులో భార్యతో గొడవపడగా బంధువులు సర్దిచెప్పారు. ఆ సమయంలో ప్రియుడు నాగరాజుకు రేవతి ఫోన్ చేసి తన భర్తను చంపాలని నిర్ణయింది. అతని సలహా మేరకు రాత్రికి భీమయ్య గొంతు బ్లేడుతో కోసేయాలని రేవతిని ప్రేరేంపించాడు. భీమయ్య నిద్రపోతుండగా అర్ధరాత్రి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో భార్య రేవతి షేవింగ్ బ్లేడ్తో భర్త భీమయ్య గొంతు కోసింది. ఆ తర్వాత బంధువులకు ఫోన్ చేసి ఎవరో తన భర్త గొంతు కోశారని నమ్మబలికింది. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం తేలింది. భర్తను తానే బ్లేడుతో కోశానని అంగీకరించింది. ప్రస్తుతం భీమయ్య రేణిగుంట సమీపంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ మేరకు 307 సేక్షన్ కింద రేవతి, ఆమె ప్రియుడు నాగరాజుపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు. -
నేను వితంతువుని కాదు సర్!
నా పేరు వెంకటరామరాజు. మాది రైల్వే కోడూరు. రోడ్డు ప్రమాదంలో దివ్యాంగుడిగా మారాను. 69 శాతం వికలత్వం ఉండడంతో నాకు పింఛన్ మంజూరు చేయాలని కోరడంతో పింఛన్ మంజూరు చేశారు. అయితే దివ్యాంగుడుగా ఉన్నప్పటికీ వితంతువు పింఛన్ మంజూరు చేశారు. ఆ విషయం ముందు నాకు తెలియదు. ఆ తర్వాత తెలవడంతో వితంతువు పింఛన్ రూ.4 వేలు.. దివ్యాంగుడి పింఛన్గా మార్పు చేయాలని క్షేత్ర స్థాయి అధికారుల నుంచి మండల, డివిజన్ చివరికి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అర్జీలిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – తిరుపతి అర్బన్ -
సోలార్ పనులు వేగవంతం చేయండి
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం సంస్థ పరిధిలోని తొమ్మి ది జిల్లాల అధికారులు, కాంట్రాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని 2.07 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆయా జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆగస్టు నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలన్నారు. డయల్ యువర్ సీఎండీకి 58 ఫిర్యాదులు ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీకి విద్యుత్తు వినియోగదారుల నుంచి 58 ఫిర్యాదులు వచ్చినట్టు సీఎండీ శివశంకర్ తెలిపారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా జిల్లాల అధికారులకు పంపించి త్వరితగతిన సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశించారు. డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కే.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు కే. ఆదిశేషయ్య, జే.రమణాదేవి, ఆర్.పద్మ, ఎం.మురళికుమార్, ఎన్.శోభావాలెంటీనా, సీహెచ్ రామచంద్రరావు, కే.సంపత్కుమార్, ఎస్.రమణ, జనరల్ మేనేజర్లు శ్రీకాంత్, చక్రపాణి, జగదీష్, భాస్కర్రెడ్డి, లత, ఎస్ఈలు శేషాద్రి శేఖర్, మోజెస్, ప్రదీప్కుమార్, సుధాకర్, శ్రీనివాసులు, రాఘవేంద్ర, చంద్రశేఖరరావు, సోమశేఖర్రెడ్డి, అమర్బాబు పాల్గొన్నారు. -
ప్రియుడు ప్రేరేపిండంతోనే భర్త గొంతు కోసింది!
బుచ్చినాయుడుకండ్రిగ: ప్రియుడు ప్రేరేపించడంతోనే భార్య తన భర్త గొంతు కోసినట్లు అంగీకరించిందని ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం స్థానిక పోలీసు స్టేషన్లో ముద్దాయిలను అరెస్టు చేసి, విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని నీర్పాకోటలోని పల్లం దళితవాడకు చెందిన భీమయ్య (42), రేవతి (29)కి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. భీమయ్య బెల్దూరి మేసీ్త్రగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. భార్య రేవతి గతంలో శ్రీసిటీలోని అపాచీ కంపెనీలో పనిచేసేది. ఆ సమయంలో తొట్టంబేడు మండలం, పొయ్యి గ్రామానికి చెందిన నాగరాజుతో ఆమెకు పరిచయమై, వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి భీమయ్య భార్యపై అనుమానం పెంచుకుని కంపెనీకి వెళ్లకుండా పని మాన్పించాడు. ఆరు నెలలుగా రేవతి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 24వ తేదీ భీమయ్య మద్యం మత్తులో భార్యతో గొడవపడగా బంధువులు సర్దిచెప్పారు. ఆ సమయంలో ప్రియుడు నాగరాజుకు రేవతి ఫోన్ చేసి తన భర్తను చంపాలని నిర్ణయింది. అతని సలహా మేరకు రాత్రికి భీమయ్య గొంతు బ్లేడుతో కోసేయాలని రేవతిని ప్రేరేంపించాడు. భీమయ్య నిద్రపోతుండగా అర్ధరాత్రి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో భార్య రేవతి షేవింగ్ బ్లేడ్తో భర్త భీమయ్య గొంతు కోసింది. ఆ తర్వాత బంధువులకు ఫోన్ చేసి ఎవరో తన భర్త గొంతు కోశారని నమ్మబలికింది. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం తేలింది. భర్తను తానే బ్లేడుతో కోశానని అంగీకరించింది. ప్రస్తుతం భీమయ్య రేణిగుంట సమీపంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ మేరకు 307 సేక్షన్ కింద రేవతి, ఆమె ప్రియుడు నాగరాజుపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు. -
నిధులు అందకపోవడంతోనే..
తిరుపతి తుడా: తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో పూర్తి నిర్మాణానికి నోచుకోక అర్ధంతరంగా నిలచిపోయిన మల్టీ లెవల్ కార్ పార్కింగ్పై సాక్షి దినపత్రికలో సోమవారం ‘మా రాజ్యం మాదే భోజ్యం’ శీర్షికన ప్రచురించిన కథనానికి నగరపాలక సంస్థ వివరణ ఇచ్చింది. తమిళనాడు చెందిన బిల్డర్ భవాన్ని మూడు అంతస్తులు పూర్తి చేశారని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో అర్ధంతరంగా నిలిపి వేశారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 36వ సమావేశంలో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో పూర్తి చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించామని, కేవలం కన్యకా ఇన్ఫ్రా ప్రెవేట్ లిమిట్ సంస్థ ఒక్కటే బిడ్ సమర్పించిందని పేర్కొన్నారు. సదరు సంస్థ గతంలో పూర్తయిన పనుల కోసం రూ. 20.08కోట్లు చెల్లించేందుకు అంగీకరిస్తూ మిగిలిన పనులను పూర్తి చేయనున్నారని తెలిపారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేవని ఆ ప్రకటనలో తెలిపారు. పోలీస్ గ్రీవెన్స్కు 107 అర్జీలు తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 107 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏఐ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది డిసెంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్ (ఐసీఏఆర్–2026)’ పోస్టర్ను వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వీ.ఉమ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉష, కన్వీనర్ ప్రొఫెసర్ పీ.వెంకటకృష్ణతో కలసి సోమవారం ఆవిష్కరించారు. ‘కృత్రిమ మేధస్సులో డేటా, హార్డ్వేర్, ఫిన్టెక్ సమగ్రతతో నూతన సాంకేతిక సరిహద్దుల అభివృద్ధి’ అనే అంశంతో డీఎస్టీఎస్టీ–క్యూరీ–ఏఐ సెంటర్ ఆధ్వర్యంలో ఈ సదస్సు హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్టు వీసీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఏఐ హార్డ్ వేర్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, ఫిన్టెక్, అంతరశాఖ పరిశోధనలపై పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తున్నట్టు ఆమె తెలిపారు. పూర్తి పరిశోధనా పత్రాల సమర్పణకు ఆగస్టు 10 చివరి తేదీ కాగా, ఎంపికై న పత్రాలను సెప్టెంబర్ 10న ప్రకటిస్తామని, కెమెరా రెడీ పేపర్ల సమర్పణకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంటుందన్నారు. ఉత్తమ పత్రాలు, విద్యార్థుల పరిశోధనలు, మహిళా పరిశోధకుల ప్రజెంటేషన్లు, ఆవిష్కరణలకు ప్రత్యేక అవార్డులు అందజేస్తామన్నారు. దేశ, విదేశాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. చీఫ్ కన్వీనర్ ప్రొఫెసర్ జి.వి.ఆర్.శాస్త్రి ఆధ్వర్యంలో, కన్వీనర్ ప్రొఫెసర్ పి.వెంకటకృష్ణ సమన్వయంతో సదస్సు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. -
చెరువు కట్ట తొలగించినా చర్యలు శూన్యం
రేణిగుంట: మండలంలోని మర్రిగుంట చెరువు కట్ట తొలగించినా పట్టించుకునేవారు లేరు. చెరువు భూమితో పాటు చెరువు కట్టను సైతం జేసీబీతో తవ్వేశారు. ఉదయం నుంచి చెరువులో జేసీబీలు పనులు చేస్తున్నాయని స్థానికులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించినా అధికారులు పట్టించుకోలేదు. తీరిగ్గా సాయంత్రం 6 గంటల సమయంలో చెరువు వద్దకు చేరుకున్నారు. కట్టను తొలగించే పనులను నిలుపుదల చేసి అక్కడి నుంచి జేసీబీలను పంపించి వేశారు. చెరువు కట్టను అనుమతులు లేకుండా తొలగించిన జేసీబీలు, ప్రైవేట్ వ్యక్తుల పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రైవేట్ వ్యక్తులతో పాటు స్థానిక టీడీపీ నాయకుడు ఉండడం తోనే అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
7 నుంచి అంతర్రాష్ట్ర ఫుట్బాల్ టోర్నీ
రేణిగుంట: పట్టణంలోని ఓల్డ్ చెక్ పోస్ట్ సమీపంలోని రైల్వే క్రీడా మైదానంలో ఆగస్టు 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఫుట్ బాల్ అంతర్రాష్ట్ర టోర్నమెంట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి మొత్తం 21 జట్లు ఈ టోర్నమెంటులో తలపడునున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆతిథ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లందరికీ క్రీడా ప్రాంగణం వద్దే ఉచిత వసతి, రుచికరమైన భోజన సౌకర్యాలను అందించనున్నట్టు వెల్లడించారు. బరిలోకి దిగుతున్న జట్ల కోసం రూ.1.3 లక్షల భారీ నగదు బహుమతులను ఇదివరకే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ.80వేలు రన్నరప్ గా నిలిచే జట్టుకు రూ.50 వేలు నగదుతో పాటు ప్రతిభ చూపిన ఉత్తమ ప్లేయర్, ఉత్తమ గోల్కీపర్ లకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్, కె.మునిరత్నంబాబు, ఎం.దేవదానం తదితరులు పాల్గొన్నారు. -
30న జాబ్మేళా
తిరుపతి అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్, సీడాప్ సంయుక్తంగా నిర్వహించనున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో తిరుపతి, శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న జాబ్మేళా పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈనెల 30న శ్రీకాళహస్తిలోని ఎస్వీఏ ప్రభుత్వ కాలేజ్లో ఉదయం 8.30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే ఆగస్ట్ 3న తిరుపతిలోని ఎస్వీసీసీ డిగ్రీ కళాశాల, బాలాజీ కాలనీలో ఉదయం 8 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఆ మేరకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శారదాదేవి, పరిశ్రమలశాఖ జీఎం చంద్రశేఖర్, ఏపీఐఐసీ జేఎం విజయభరత్రెడ్డి, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర జేబు దొంగల ముఠా అరెస్ట్
తిరుపతి క్రైం : తిరుమలలో భక్తులను లక్ష్యంగా చేసుకుని జేబుదొంగతనాలు, నకిలీ టీటీడీ గుర్తింపు కార్డుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రాంభగీచ కార్ పార్కింగ్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నగదు, నకిలీ టీటీడీ ఐడీ కార్డు, సెల్ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కర్ణాటకకు చెందిన బాలాజీ అకాడే (33), మహారాష్ట్రకు చెందిన అప్పాషా మానే (65), నెల్లూరు జిల్లాకు చెందిన కల్తీ రెడ్డి కీర్తి (31) ఉన్నారు. పోలీసుల విచారణలో నిందితులు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని బాలాజీ బస్ స్టాండ్, ఉచిత బస్సులు తదితర ప్రాంతాల్లో జేబు దొంగతనాలు, పర్సుల చోరీలు, బ్యాగులు కత్తిరించి నగదు, విలువైన వస్తువులు అపహరిస్తున్నట్లు అంగీకరించారని వెల్లడించారు. అలాగే మహిళా నిందితురాలు నకిలీ టీటీడీ గుర్తింపు కార్డుతో తాను టీటీడీ ఉద్యోగినని నమ్మించి, వీఐపీ దర్శనం, ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదులు ఏర్పాటు చేస్తానని చెప్పి భక్తుల నుంచి ఫోన్న్పే ద్వారా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల వద్ద నుంచి పర్సు, రూ.5,100 నగదు, మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నకిలీ టీటీడీ గుర్తింపు కార్డు, మూడు సెల్ఫోన్లు, కట్టర్, చిన్న కత్తి, బ్లేడ్లు, గిల్ట్ నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. వారి నేర చరిత్రపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. -
జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ
తిరుపతి ఎడ్యుకేషన్ : జమ్ము అండ్ కశ్మీర్ రాష్ట్రం, జమ్ముతావిలో జాతీయ కౌన్సిల్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24నుంచి 26వ తేదీ వరకు జాతీయ స్థాయిలో వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రం నుంచి క్రీడాకారులు పాల్గొని జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారని రాష్ట్ర కౌన్సిల్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మురళి, మనోహర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో బ్యాడ్మింటన్ క్రీడలో డబుల్స్ సీనియర్ పురుషుల విభాగం నుంచి తేజేంద్ర, హరిప్రసాద్లు ప్రథమ స్థానం, మహిళల సింగిల్స్ విభాగంలో స్నేహితారెడ్డి ప్రథమ స్థానం, మిక్స్డ్ డబుల్స్లో హర్షవర్ధన్రెడ్డి, స్నేహితారెడ్డిలు ప్రథమ స్థానం, బ్యాడ్మింటర్ అండర్–14 బాలికల సింగిల్స్లో దివ్య ప్రథమ స్థానం, డబుల్స్లో సునీత, హారికలు ప్రథమ స్థానం, మిక్సిడ్ డబుల్స్లో ముక్త, సంజుశ్రీరామ్లు ప్రథమ స్థానం, కబడ్డీలో మొదటి స్థానం సాధించి బంగారు పతకం, ఫుట్బాల్ అండర్–14లో తృతీయ స్థానం సాధించి ప్రతిభ చాటారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర క్రీడాకారులను వారు అభినందించారు. -
డిజిటల్ సమ్మిళితే కీలకం
మహిళల సాధికారతకు డిజిటల్ సమ్మిళిత కీలకమని యూజీసీ కమిషన్ సంయుక్త కార్యదర్శి తెలిపారు. జాతీయ రహదారులుగా ప్రకటించండి తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకోట–సత్యవేడు–తడ రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత కీలకమైన రహదారి ప్రాజెక్టులను తక్షణమే చేపట్టాలని ఆయన సోమవారం లోక్సభ జీరో అవర్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మూడు రహదారులు తిరుపతి పార్లమెంటు పరిధిలోని పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య ప్రాంతాలను అనుసంధానించే కీలక మార్గాలని తెలిపారు. ముఖ్యంగా శ్రీ సిటీ, మేనకూరు సెజ్, కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానమైన ప్రాంతాల్లో రవాణా అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. ఆరు లేన్లుగా విస్తరించండి అలాగే నెల్లూరు–చైన్నె జాతీయ రహదారిపై పెరుగుతున్న ట్రాఫిక్ను ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణపట్నం పోర్టు నుంచి భారీ సరుకు రవాణా, శ్రీ సిటీ, మేనకూరు సెజ్లలో పారిశ్రామిక కార్యకలాపాల విస్తరణ కారణంగా ఈ మార్గంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగిందని వివరించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా విస్తరించాలని సూచించారు. నెల్లూరు–చైన్నె జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించడంతో పాటు శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకొట–సత్యవేడు–తడ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
నిర్లక్ష్యంతో..
యూజీ, పీజీ సెట్ల కౌన్సెలింగ్ ప్రక్రియపై ఊసేత్తని ఉన్నత విద్యామండలి తిరుపతి సిటీ : పీజీ, యూజీ సెట్ల ఫలితాలు విడుదలైనా ఇంతవరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించలేదు. రెండేళ్లుగా ఉన్నత విద్యావ్యవస్థను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థల్లో ముందస్తు పీజీ, యూజీ, ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తమ పిల్లల పరిస్థితి ఏంటనే ప్రశ్నిస్తున్నారు. బోసిపోతున్న కళాశాలలు తిరుపతి జిల్లాలో పలు పీజీ, యూజీ కోర్సుల్లో చేరేందుకు సుమారు 70వేల మంది విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏపీఐసెట్, ఏపీ లాసెట్, ఏపీపీజీఈసెట్, ఏపీపీజీసెట్, ఏపీఎడ్సెట్ వంటి ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలై మూడు నెలలు కావస్తున్నా అడ్మిషన్లు చేపట్టకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. దీనికితోడు ఇంటర్ ఫలితాలు విడుదలై దాదాపు మూడు నెలలు గడుస్తున్నా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియపై ఉన్నత విద్యామండలి ఊసేత్తడం లేదు. జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు టీటీడీ డిగ్రీ కళాశాలల్లోనూ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో విద్యార్థులు లేక బోసిపోతున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం పలు పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన పలు పీజీ సెట్ల ఫలితాలు విడుదలైనా ప్రవేశాల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపైనా క్లారిటీ ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలలో, ప్రభుత్వ కళాశాలలో పీజీ, యూజీ ప్రవేశాలు తగ్గడానికి ప్రధాన కారణం కౌన్సెలింగ్ ప్రక్రియేనని పేర్కొంటున్నారు. ఉన్నత విద్యామండలి కార్పొరేట్ విద్యా సంస్థలలో అడ్మిషన్లు పెంచాలనే కుట్రతో ఇలా కౌన్సెలింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తోందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. వర్సిటీల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోందని మేధావులు, విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.జిల్లాలో ప్రవేశాల కోసం ఎదరు చూస్తున్న విద్యార్థులు డిగ్రీ కోర్సుల కోసం 32 వేల మంది పీజీ కోర్సుల్లోకి 6,200 మంది ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాల కోసం 9,750 మంది లా కోర్సుల కోసం 7,500 మంది బీఈడీ ప్రవేశాల కోసం 8 వేల మందికిపైగా పీజీ, యూజీ–2026 సెట్ల వివరాలు ప్రవేశ పరీక్ష పరీక్ష జరిగిన తేదీ ఫలితాలు విడుదల కౌన్సెలింగ్ తేదీ ఏపీ ఐసెట్ మే 2 మే 16 ఊసేలేదు ఏపీ లాసెట్ మే 4 మే 18 ఇప్పటివరకు ప్రకటించలేదు ఏపీపీజీఈసెట్ ఏప్రిల్ 28–30 మే 14 ప్రకటించలేదు ఏపీపీజీసెట్ మే 8–11 మే 29 కౌన్సెలింగ్ ఊసేలేదు ఏపీఎడ్సెట్ మే 8 మే 26 ప్రస్తావనే లేదు సిలబస్ ఎలా పూర్తి చేయాలి పీజీ, యూజీ కళాశాలల్లో అధ్యాపకుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అడ్మిషన్లు సెప్టెంబర్, అక్టోబర్ వరకు కొనసాగుతాయని, ప్రవేశాలు పొందిన విద్యార్థులకు నాలుగు నెలల్లోనే రెండు సెమిస్టర్ల సిలబస్ ఎలా పూర్తి చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఉన్నత విద్యామండలి వ్యవహార శైలితో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించలేకపోతున్నామని వాపోతున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్కు రెండు నెలలు, రెండో సెమిస్టర్కు రెండు నెలల కాలవ్యవధి మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారని మండిపడుతున్నారు. -
31లోపు వాహన పన్ను చెల్లించకుంటే సీజ్
తిరుపతి మంగళం : తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని రవాణా వాహనాల యజమానులు ఈనెల 31వ తేదీ లోపు వాహన త్రైమాసిక పన్నులు చెల్లించకుంటే ఆ వాహనాలను సీజ్ చేస్తామని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. తిరుపతి రవాణాశా ఖ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ లోపు వాహన త్రైమాసిక పన్నులు సకాలంలో చెల్లిస్తే వారికి ఎటువంటి జరిమానాలు ఉండవన్నారు. వాహన యజమానులు తమ త్రైమాసిక వాహన పన్నును రవాణా శాఖ అధికారిక వెబ్సైట్ httpr://vahan.parivahan.gov.in/vahanrervice/ ద్వారా లేదా పరివాహన్ సేవ పోర్టల్లో ఆనన్లైన్లో సులభంగా చెల్లించవచ్చని, ఆన్న్లైన్ సేవలను వినియోగించి గడువులోపు పన్ను చెల్లించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు జరిమానాలు లేకుండా చేసుకోవచ్చన్నారు. అయితే 31వ తేదీ తర్వాత పన్ను చెల్లించకుండా వాహనం రహదారిపై తనిఖీల సమయంలో పట్టుబడితే, మోటారు వాహన చట్టం ప్రకారం జరిమానాతో పాటు పన్ను వసూలు చేయనున్నట్టు హెచ్చరించారు. ఆగస్టులో తనిఖీ సమయంలో పట్టుబడితే – వందశాతం జరిమానాతో పన్ను వసూలు చేస్తామని, సెప్టెంబర్లో పట్టుబడితే రెండ వందల శాతం జరిమానాతో పన్ను వసూలు చేస్తామని స్పష్టం చేశారు. -
ఆధ్యాత్మిక క్షేత్రంలో అలజడి!
సాక్షి, టాస్క్ఫోర్స్: ‘ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమం.. కేరళ రాష్ట్రంలో జన్మించిన మలయాళ యత్రీంద్రులు 1926లో ఏర్పేడు సమీపంలోని నంది కొండల దిగువ భాగాన శ్రీవ్యాసాశ్రమాన్ని నెలకొల్పారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆశ్రమం శైందవ సనాతన ధర్మ వ్యాప్తికి దేశ, విదేశాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు, కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా గతంలో ఇక్కడ పని చేసిన స్వామీజీలు, పూర్వ విద్యార్థులు, కొందరు భక్తులు కలసి శ్రీవ్యాసాశ్రమ పరిరక్షణ సమితి పేరుతో వ్యాసాశ్రమంలో పాలన గాడి తప్పిందని, సంస్కరణలు అవసరమని ఆశ్రమానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. వ్యాసాశ్ర పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి ఆశ్రమ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని, భక్తులకు ఆశ్రమంలో పలికి రానివ్వకుండా గేట్లు పెట్టి మోకాలడ్డుతున్నారని విమర్శిస్తున్నారు. గతంలో ఉన్న వేదవిద్య పాఠశాల, కంటి వైద్యశాలలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఆశ్రమానికి చెందిన కొన్ని భూములు విక్రయించి, ఆ డబ్బులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తం 21 డిమాండ్లతో ఇప్పటికే ఆశ్రమానికి వ్యతిరేకంగా బలగాన్ని కూడగట్టి పోరుబాట పట్టారు. దీనికి శ్రీనివాస మంగాపురంలోని వశిష్ట ఆశ్రమ పీఠాధిపతి స్వస్వరూపానంద స్వామి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వెంట గతంలో వ్యాసాశ్రమంలో మలయాళ స్వామి, రెండవ పీఠాధిపతి విద్యానందగిరి స్వామి శిష్యలుగా ఉన్న పలువురు స్వాములు జత కట్టారు. ఇప్పటికే వీటన్నింటిపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హైకోర్టులోనూ కేసు వేశారు. ఈనెల 25వ తేదీన జరిగిన వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు మలయాళస్వామి 64వ ఆరాధనోత్సవానికి వీరంతా ఆశ్రమానికి విచ్చేసి, ఆశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామితో చర్చలు జరిపారు. అయితే వీరి డిమాండ్లను విన్న పీఠాధిపతి.. ఆగస్ట్ 27వ తేదీ నుంచి వ్యాసాశ్రమం శతజయంతోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించేందుకు తాము ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నట్లు వివరించారు. ఆశ్రమ శతజయంతోత్సవాలు పూర్తయిన తర్వాత మరోసారి చర్చించి, అందరికి ఆమోదయోగ్యమైన సంస్కరణలను చేపట్టే చర్యలు తీసుకుంటామని ఆయన వారికి చెప్పారు. దీంతో చర్చలకు వెళ్లిన స్వాములు చర్చలు విఫలమైనట్లు ప్రకటించారు. అయితే ఈ వివాదాలకు తెర పడాలని భక్తకోటి కోరుకుంటోంది. ఏర్పేడు వ్యాసాశ్రమంలోని అధిష్టాన మందిరం -
డిజిటల్ సమ్మిళితతే కీలకం
తిరుపతి రూరల్: మహిళల సాధికారతను, సుస్థిర ఆర్థికాభివృద్ధికి డిజిటల్ సమ్మిళితత కీలకమని, దానిని జీవితాంత విద్యతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని యూజీసీ కమిషన్ (యూజీసీ) సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఆషిమా మంగ్లా పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మహిళా అధ్యయన కేంద్రం, న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్, తిరుపతి సర్వోదయ మహిళా సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ‘సుస్థిర అభివృద్ధి కోసం మహిళల డిజిటల్ సమ్మిళితతకు జీవితాంత విద్య – సమస్యలు, వ్యూహాలు’ అన్న అంశంపై సోమవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు డిజిటల్ పరిజ్ఞానం, నైపుణ్యాలు, అవకాశాలు కల్పించగలిగితే కుటుంబం నుంచి దేశాభివృద్ధి వరకు సానుకూల మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎల్.రాజా మాట్లాడుతూ డిజిటల్ సాంకేతికత మహిళల దైనందిన జీవితంలో విడదీయరాని భాగమైందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ పి. విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారతకు డిజిటల్ సమ్మిళితత ప్రధాన చోదకశక్తిగా మారిందన్నారు. సదస్సులో డైరెక్టర్ డాక్టర్ డి.ఉమాదేవి, సమన్వయకర్త ప్రొఫెసర్ పి.ఆదినారాయణరెడ్డితో పాటు దేశవ్యాప్తంగా ఢిల్లీ, కాలికట్, తిరువనంతపురం, కోల్కతా, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యాపకులు, పరిశోధకులు, మహిళా అధ్యయన కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు రోజులు పాటు జరిగే సదస్సులో మొత్తం 56 పరిశోధనా పత్రాల ప్రదర్శనతో మహిళల డిజిటల్ సాధికారత, జీవితాంత విద్య, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. -
యోగాసన పోటీల్లో ఐసర్ విద్యార్థుల ప్రతిభ
ఏర్పేడు: తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన క్రీడా పోటీలు–2026లో తిరుపతి ఐసర్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచారు. ఐసర్ విద్యార్థులు స్వర్ణ పతకం – ఆర్టిస్టిక్ పెయిర్ (సీనియర్ 18–28 పురుషులు): దేబాశిష్ పుహాన్, శుభం కబడే, రజత పతకం – ట్రెడిషనల్ (సీనియర్–ఏ, 28–35 మహిళలు): గౌరి వి.భట్ (భౌతిక శాస్త్ర విభాగం), కాంస్య పతకం – ట్రెడిషనల్ (సీనియర్–ఏ, 28–35 పురుషులు): ఆదిత్య విలాస్ భాస్కర్వారా (జీవశాస్త్ర విభాగం), కాంస్య పతకం – ట్రెడిషనల్ (సీనియర్ 18–28 పురుషులు): దేబాశిష్ పుహాన్ (జీవశాస్త్ర విభాగం) పతకాలను సాధించినట్లు ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య, రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీ తెలిపారు. విజేతలందరూ రానున్న రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో తిరుపతి జిల్లాకు ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించారని వివరించారు. విద్యార్థుల విజయానికి యోగా శిక్షకుడు కుమార్రాజు విశేషంగా కృషి చేశారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ వీరంతా ప్రతిభ చూపాలని వారు కోరారు. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు రేణిగుంట: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తి నేరం అంగీకరించడంతో కోర్టు అతనికి 21 రోజుల సాధారణ కారాగార శిక్ష విధించినట్లు రేణిగుంట పోలీసులు తెలిపారు. రేణిగుంట పట్టణంలో పది రోజులు క్రితం అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. తిమ్మినాయుడుపాళెంకు చెందిన ఎం.లోకేష్ (27) మద్యం తాగి వాహనం నడపడంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును నమోదు చేశారు. సోమవారం తిరుపతిలోని స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో న్యాయమూర్తి 21 రోజుల సాధారణ కారాగార శిక్ష విధించారు. -
రూ.కోటి 8 లక్షలకు ఐపీ
తిరుపతి లీగల్: రేణిగుంట మండలం, తూకివాకం, ఎస్ఎన్ పురానికి చెందిన ఏ.కృష్ణమూర్తి తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒక కోటి 8 లక్షలకు ఐపీ దాఖలు చేసినట్టు ఆయన తరఫు న్యాయవాది ఆరేపల్లి ఈశ్వరయ్య తెలిపారు. పిటిషన్లోని వివరాల మేరకు.. పిటిషనర్ కృష్ణమూర్తి 2020 నుంచి సీజనల్ వ్యాపారం నిర్వహించేవాడు. వ్యాపారం కోసం అతను అధిక వడ్డీలకు పలువురు నుంచి డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఖాళీ ప్రోనోట్లు, ఖాళీ చెక్కుల్లో అతను సంతకాలు చేసి రుణదాతలకు ఇచ్చాడు. దేశంలో కరోనా రావడంతో వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతోపాటు అతను అనారోగ్యానికి గురయ్యాడు. రుణదాతలు ఎక్కువ మొత్తంలో సొమ్ము చెల్లించాలని వేధించసాగారు. దీంతో సొమ్ము చెల్లించలేని స్థితిలో ఐపీ దాఖలు చేసినట్టు ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. 12 మంది రుణదాతలను ఆయన పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నాడు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,012 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,345 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.5 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. శ్రీవారి సేవలో ఉడిపి ఆద్మార్ మఠాధిపతి తిరుమల : ఉడిపిలోని ఆద్మార్ మఠాధిపతి, పరమపూజ్య విశ్వప్రియ తీర్థ స్వామీజీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామీజీకి బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ పేష్కర రామకృష్ణ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామీజీకి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించి సత్కరించారు. పౌరసంబంధాల అధికారిగా సరస్వతిబాయి తిరుపతి అర్బన్: జిల్లా పౌరసంబంధాల అధికారిగా పూజారి సరస్వతిబాయి సోమవారం కలెక్టరేట్లోని తమ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాద పూర్వకంగా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిశారు. కడప నుంచి బదిలీపై ఆమె తిరుపతి జిల్లాకు విచ్చేశారు. రెండేళ్లు క్రితం జిల్లా పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన విజయసింహారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు తాజాగా భర్తీ చేశారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలుతిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, మంగళాపురానికి చెందిన పీ.సురేష్కు ఐదేళ్లు జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ...ఎర్రచందనం అక్రమ నిరోధక దళం 2018లో తిరుపతి డివిజన్, తిమ్మినాయుడుపాళెం సెక్షన్, అలిపిరి ఫారెస్ట్ బీట్, శేషాచలం అటవీ ప్రాంతం, ఎన్సీసీ ఫైరింగ్ రేంజ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. నిందితుడు సురేష్ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలించడానికి ప్రయత్నించాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడు సురేష్కు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
నూతన ఆవిష్కరణలపై దృష్టి
● ఐఐటీ యువంతర్ –2026 కార్యక్రమంలో విద్యార్థులకు సూచించిన డైరెక్టర్ ఏర్పేడు: విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించి విభిన్న ఆలోచనలతో విద్యనభ్యసించాలని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్.సత్యనారాయణ పిలుపునిచ్చారు. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఐఐటీలో బీటెక్ కోర్సుల్లో కొత్తగా చేరిన 251 మంది విద్యార్థులకు యువంతర్– 2026 పేరిట అకడమిక్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఓరి యంటేషన్, ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ ఐఐటీలో అమలవుతున్న విద్యా సంబంధిత కార్యక్రమాలు, వసతులు, అకాడమిక్ ఓరియంటేషన్, స్టూడెంట్ సపోర్ట్ సెషన్లు, క్యాంపస్, డిపార్ట్మెంట్ సందర్శనలు, వెల్నెస్ యాక్టివిటీస్, ఫ్యాకల్టీతో ఇంటరా క్షన్లు, పూర్వ విద్యార్థుల అనుభవాలు, పరిశోధన అంశాలపై చర్చించారు. అలా గే లైబ్రరీ, సీఐఎఫ్ బిల్డింగ్, ఐడియా స్క్వార్ సందర్శనలు, ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ సెషన్స్ జరిగాయి. స్పిక్ మెకాయ్ ప్రోగ్రాం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొన్నారు. -
6.5 కిలోల గంజాయి స్వాధీనం
– ముగ్గురి అరెస్ట్ రైల్వేకోడూరు అర్బన్ : అక్రమంగా తరలిస్తున్న 6.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు రూరల్ సీఐ డీ.శ్రీనివాసులు తెలిపారు. నియోజకవర్గంలోని పెనగలూరు మండలం, బెస్తపల్లి గ్రామ సమీపంలో సోమవారం దాడులు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ దాడుల్లో గంజాయితోపాటు ముగ్గుర్ని అదుపులోకి తీసుకోగా.. ఒకరు పరారయ్యారని తెలిపారు. అరెస్టయిన వారిలో కంచర్ల సుబ్బారెడ్డి, తోడేటి శేఖర్, అజయ్ ఉన్నట్టు తెలిపారు. మరో నిందితుడు సుబ్బరాయుడు పరారీలో ఉన్నాడని, అతనికోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. అండర్ బ్రిడ్జి వద్ద వ్యక్తి మృతి రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు బుడుగుంటపల్లికి వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం నందలూరు మండలం, ఈదరపల్లి దళితవాడకి చెందిన రెడ్యం బాలయ్య (35) మృతి చెందాడు. కోడూరు అయ్యవారిపల్లిలో ఉన్న భార్య శివలక్ష్మితో గోడవ ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న రైల్వేకోడూరు ఎస్ఐ శివప్రసాద్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పింఛన్ ఇప్పించండి సారూ..!
తిరుపతి అర్బన్: అయ్యా.. పింఛన్ ఇప్పిచి ఆదుకోండి. రెండేళ్లుగా తిరుగుతున్నా అనుమతి రాలేదంటూ వాయిదా వేస్తున్నారు.. ఇంకెప్పుడు మేం చచ్చిపోయిన తర్వాత అనుమతి వస్తుందా...?’ అంటూ పలువురు అభాగ్యులు అధికారులను నిలదీశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 324 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, భరత్నాయక్, రోజ్మాండ్, నాగార్జునతో కలసి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సమస్యలపై 177 అర్జీలు వచ్చాయి.పింఛన్లకు అనుమతులెప్పుడొస్తాయి సర్ నాకు రెండు కాళ్లు సక్రమంగా పనిచేయవు. పింఛన్ కోసం ఆరు నెలలుగా తిరుగుతూనే ఉన్నాను. నాకు 90 శాతం వికలత్వం ఉంది. దరఖాస్తులకు అనుమతులొస్తే చెబుతామన్నారు. వాటికి ఏమైనా అనుమతులు వచ్చాయా సార్.. పేద కుటుంబానికి చెందిన వాళ్లం. మాకు సాయం చేయండి సార్. –ఎడ్ల నాగరాజు, దివ్యాంగుడు, కుంట్రపాకం ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేస్తున్నారు వెంకటగిరిలో ప్రభుత్వ స్థలాలు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుకవైపు ఉన్న సమితి స్థలాన్ని ఆక్రమించారు. అలాగే వెంకటగిరి అడ్డరోడ్డులో ఆర్టీసీ డిపోకు సమీపంలోని స్థలాన్ని ఆక్రమించారు. విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడాలి. – వెంకటరమణారెడ్డి, వెంకటగిరి రెండేళ్లుగా అనుమతులు రాలేదంటూ వాయిదాలేనా? -
రామచంద్రాపురం రాయలచెరువులో విషాదం
తిరుపతి: జిల్లాలోని రామచంద్రాపురం మండలం రాయలచెరువులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి దగ్గర తగాదాతో సుబ్రహ్మణ్యంపై హరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి వచ్చిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డటమే ఆందోళన రేకెత్తిస్తోంది. స్టేషన్లో సుబ్రహ్మణ్యంపై పోలీసులే దాడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల వైఖరి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జనసేన నేత అనుమానాస్పద మృతి
సాక్షి,తిరుపతి: జనసేన పార్టీ రాజంపేట సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శివకుమార్ (48) తిరుపతిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనడీ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.శివకుమార్ ఈనెల 26న తన ఇంటి నుండి బయలుదేరి తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించారు. అనంతరం తిరుపతి కెనడీ నగర్లో ఉంటున్న తన బంధువు చింతల రమణమూర్తి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇంటి బాత్రూంలో శివకుమార్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతుడి భార్య కళ్యాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఈస్ట్ ఎస్ఐ రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.మృతిపై ముసురుతున్న అనుమానాలు శివకుమార్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు పర్యటనలో ఉన్న సమయంలో పెరియపాలెంలో ద్విచక్ర వాహనాన్ని వదిలేశారని, అక్కడే ఇద్దరు వ్యక్తులు తమ సిమ్ కార్డులను పారేసినట్లు శివకుమార్ బంధువు పవన్ తెలిపారు. నిన్న తిరుపతిలోని రమణమూర్తి ఇంటికి శివకుమార్, పవన్ కలిసి వచ్చారు. ఈరోజు ఉదయం వైఫై కనెక్ట్ అవ్వడంతో, వాట్సాప్ కాల్ ద్వారా పవన్తో శివకుమార్ భార్య కళ్యాణి మాట్లాడారు. ఆ మాట్లాడిన కొద్దిసేపటికే శివకుమార్ బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. -
తిరుపతిలో కరోనా కలకలం
ఆంధ్రప్రదేశ్: రోజురోజుకి కరోనా మహమ్మారి మరింతగా తిరిగి రూపు దాల్చుతుంది. తాజాగా తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తిరుపతి అర్బన్ పరిధిలో 65 ఏళ్ల వృద్దురాలు తీవ్ర అస్వస్థకు గురికాగా, కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోగల జిల్లా అస్పత్రిలో అడ్మిట్ చేశారు.గత కొన్నిరోజులుగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న వృద్దరాలిని జూలై 23న వైద్యులు కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్గా తేలింది. దీంతో ఆమె కుటుంబంలోని సభ్యులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. వారికేమి కరోనా లక్షణాలు లేవని వైద్యశాఖ పేర్కొంది.అయితే, శనివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో 10 మందికి పైగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం కరోనా కేసులు 49 చేరగా, పలు ఆస్పత్రులల్లో 24 మందిదాకా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, కృష్ణా, తిరుపతి, విశాఖ, అల్లూరి జిల్లాలో ఒక్కో కరోనా కేసు నమోదైంది. దీంతో జిల్లాలలోని వైద్యశాఖల వివరాలతో.. ఆంధ్రప్రదేశ్లో కరోనా బారినపడి ఇప్పటికి నలుగురు ప్రాణాలను కోల్పోయినట్లుగా తెలుస్తోంది. -
‘అపోలో’లో వెరికోస్ వెయిన్స్కు చికిత్స
తిరుపతి తుడా : రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే తీవ్రమైన వెరికోస్ వెయిన్స్ సమస్యలను నివారించవచ్చని చైన్నె అపోలో ఆస్పత్రి డాక్టర్ బాలాజీ తెలిపారు. ఆదివారం స్థానిక తుడా రోడ్డులోని అపోలో స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయన మాట్లాడారు. వాస్కులర్ వ్యాధుల లక్షణాలు, ఆధునిక చికిత్సను వివరించారు. కాళ్లలోని సిరలు ఉబ్బి, మెలికలు తిరిగి కనిపించడాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారని, ఎక్కువసేపు నిలబడి పనిచేసే పోలీసులు, బస్సు కండక్టర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, మహిళల్లో ఇది సాధారణంగా ఉంటుందన్నారు.పెద్ద ఆపరేషన్ అవసరం లేకుండా లేజర్ పద్ధతితో చికిత్స చేయవచ్చని వెల్లడించారు. మందులు, ఇంజెక్షన్లు, అవసరమైతే ఐవీసీ ఫిల్టర్ ద్వారా చికిత్స అందుబాటులో ఉందని వివరించారు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్తోపాటు ధూమపానం చేసేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాళ్ల నొప్పి, వాపు, నరాలు ఉబ్బడం, నడిచినప్పుడు నొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు. అపోలో ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అధునిక చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
చేయి చేయి కలుపుదాం
నిరుద్యోగ యువతను బాబు సర్కార్ మోసం చేసింది. డీఎస్సీని అవినీతి అడ్డాగా మార్చుకుని రూ.కోట్లు దండుకుంది. తక్షణం డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా పేద విద్యార్థులను వేధిస్తున్నారు. నిరుద్యోగులను భృతి పేరుతో మోసం చేశారు. ఈ క్రమంలోనే చేపట్టిన ర్యాలీకి జిల్లాలోని యువత పెద్దసంఖ్యలో తరలిరావాలి. చేయి చేయి కలుపుకుని చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుదాం. – చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ రాజీనామా చేయాలి రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం యువతను, విద్యార్థులను సర్వనాశనం చేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువత కడుపుకొట్టింది. ఫీజురీయింబర్స్మెంట్ అందకపోవడంతో కళాశాలల్లో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. మెగా డీఎస్సీలో అవకతవకలకు కారణమైన మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి. ఈ మేరకు తిరుపతిలో చేపట్టే ర్యాలీని విజయవంతం చేయాలి. – ఉదయ్ వంశీ, వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల యువజన విభాగం అధ్యక్షుడు -
కదలిరండి..
జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రైవేటు కళాశాలలు 108 విద్యార్థులు 47,360 ఒక్కో విద్యార్థికి ఏడాదికి సరాసరి అందాల్సిన మొత్తం రూ.18వేలు రెండేళ్లుగా బకాయి 9 విడతలు పెండింగ్ ఫీజు రూ.445.35కోట్లు ఒక్కో కళాశాలకు అందాల్సిన బకాయిలు రూ. 4.25కోట్లు సూచనలిస్తున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి -
నిధులు లేవని నిలిచిన మల్టీలెవల్ పార్కింగ్ భవన నిర్మాణం ఇదే అదునుగా అనుయాయులకు అప్పనంగా కట్టబెట్టిన ప్రభుత్వం
● పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ సంస్థకు రూ.60 కోట్ల స్థలం ● అద్దె లేకుండానే 31 ఏళ్లపాటు వ్యాపారం చేసుకునే అవకాశం ● తిరుపతి కార్పొరేషన్ ఆదాయానికి తీవ్రమైన నష్టంసాక్షి టాస్క్ఫోర్స్ : ప్రభుత్వం పీపీపీ విధానం అమలు చేస్తూ రాష్ట్ర సంపదను అయినవారికి కట్టబెడుతోంది. అందులో భాగంగానే తిరుపతి నగరంలోని రూ.కోట్ల విలువ చేసే మున్సిపల్ స్థలాలు, భవనాలను అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్కు ఆనుకుని ఉన్న పాత మున్సిపల్ గెస్ట్ హౌస్ స్థలాన్ని గతంలో విక్రయించేందుకు ప్రభుత్వం చేసిన కుట్రను వైఎస్సార్సీపీ అడ్డుకుంది. అయితే పీపీపీ విధానం పేరుతో తిరుపతి రైల్వే స్టేషన్ పార్సిల్ విభాగానికి ఎదురుగా ఉన్న 0.85 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ను సర్కరు పెద్దలు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేశారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. రైల్వే స్టేషన్, బస్స్టాండ్ నడుమ నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రాంతంలో వాహనదారులకు పార్కింగ్ కష్టాలు తీర్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ సిటీ నిధులు రూ.60 కోట్లతో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. రెండేళ్ల క్రితమే రూ.17 కోట్ల పనులను పూర్తిచేసింది. సెల్లార్తోపాటు నాలుగు అంతస్తుల భవనానికి కాంక్రీట్ పనుల పూర్తి చేయించింది. అద్దె లేకుండానే.. రూ.60 కోట్లకు పైగా విలువ చేసే ఈ స్థలానికి ఒక్క రూపాయి అద్దె కూడా లేకుండానే 31 ఏళ్ల పాటు వ్యాపారం చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు రూ.17 కోట్లు నిధులను ఖర్చు చేశారు. ఈ నిధులను మున్సిపల్ కార్పొరేషన్కి తిరిగి చెల్లించేలా ఒప్పందం కుదిరింది. రూ.కోట్ల విలువ చేసే స్థలానికి నెలవారీ అద్దెను నిర్ణయించకపోవడంలో ప్రభుత్వ కుట్ర తేటతెల్లమవుతోంది. 31 ఏళ్ల పాటు సదరు కాంట్రాక్టరు ఆ భవనాన్ని తన వ్యాపారానికి అనుగుణంగా మార్చుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా వ్యాపార మొత్తంలో కార్పొరేషన్కు కేవలం 5.5 శాతం మాత్రమే చెల్లించేలా ఆదేశించడం అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడనుంది. రూ.లక్ష వ్యాపారం జరిగితే అందులో కార్పొరేషన్న్కు కేవలం రూ.5,500 వేలు మాత్రమే వస్తుంది. ఏది ఏమైనా నగరంలో అత్యంత రద్దీ ప్రాంతంలోని రూ.60 కోట్ల స్థలానికి ప్రభుత్వ పెద్దలు ఎసరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
రేపటి నుంచి అమరావతి చాంపియన్షిప్
తిరుపతి ఎడ్యుకేషన్ : అమరావతి చాంపియన్షిప్–2026 నియోజకవర్గ స్థాయి క్రీడాపోటీలను మంగళవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారి ఎన్.శశిధర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వివిధ క్రీడాపోటీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా 28న ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, చెస్, యోగా, 29న హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ పోటీలు ఉంటాయని వివరించారు. తిరుపతికి సంబంధించి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీయూస్టేడియం, చంద్రగిరిలోని ఎన్ఆర్ఎన్ కేవీకే స్టేడియం, చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, గూడూరు ఏఏఎస్ఆర్ స్టేడియం, వెంకటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం, శ్రీకాళహస్తి జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎన్టీఆర్ కేవీకే స్టేడియం, సత్యవేడులోని ఎన్టీఆర్ కేవీకే స్టేడియం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయి విజేతలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 84,488 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,061 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. 30న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి పుష్పయాగం – 29న శాస్త్రోక్తంగా అంకురార్పణ తిరుపతి అన్నమయ్య సర్కిల్ : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రహ్మోత్సవాల అనంతరం ఆలయ పవిత్రత, లోకక్షేమం కోసం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు మేధిని పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. 30వ తేదీ ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీటితో విశేష అభిషేకం చేపడతారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువ తదితర సుగంధ పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’ తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన అన్ని విభాగాల అధికారులు గ్రీవెన్స్కు హాజరుకానున్నట్లు వివరించారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రారంభం.. పవిత్రోత్సవం తిరుపతి కల్చరల్ : శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. కలశ పూజ, హోమం, పవిత్ర ప్రతిష్టను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ క్రమంలోనే సోమవారం పవిత్ర సమర్పణ, 28న మహాపూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలను పరిపూర్ణం చేయనున్నారు. ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు. -
ముగిసిన వైదిక మహా యజ్ఞం
చంద్రగిరి: లోక కల్యాణార్థం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన వైదిక మహాయజ్ఞం వైభవంగా ముగిసింది. శ్రీరాముడి కోసం పుత్రకామేష్టి యాగం నిర్వహించిన శ్రీశృంగి మహర్షి వంశీకుడు, స్వరవేద మహా మందిర ధామం నిర్వాహుకుడు సద్గురు ఆచార్య స్వంత్రం దేవ్ జీ మహారాజ్ హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా మంత్రరాజ పీఠం ట్రస్ట్ వ్యవస్థాపకుడు సింహయాజీ స్వామీజీ, శాప్ చైర్మన్ రవి నాయుడు పాల్గొన్నారు. అతిథులకు నిర్వాహకులు కుమార్ నాయుడు దంపతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వతంత్ర మహదేవ్ జీ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ క్రమంలోనే శివశ్రీ స్కందప్రసాద్ అయ్యంగార్, గజల్ శ్రీనివాస్ భక్తి పాటలతో అలరించారు. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఎన్ఎస్యూ వీసీ కృష్ణమూర్తి, స్విమ్స్ డైరెక్టర్ రామ్ పాల్గొన్నారు. పొదల్లోకి దూసుకెళ్లిన కారు చంద్రగిరి : అతివేగం కారణంగా చెట్ల పొదల్లోకి కారు దూసుకెళ్లిన ఘటన ఆదివారం కల్యాణి డ్యామ్ సమీపంలో జరిగింది. వివరాలు.. తిరుపతి నుంచి మదనపల్లెకు వెళుతున్న కారు డ్యామ్ సమీపంలోని పెద్ద మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకుపోయింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా, ఇద్దరు గాయపడ్డారు. వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్సపొందుతూ మహిళ మృతి సూళ్లూరుపేట : మండలంలోని కోటపోలూరు గ్రామానికి చెందిన మెల్లకంటి సుజాత (44) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. వివరాలు.. ఈ నెల 3వ తేదీ వేకువజామున మృతురాలి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ నుంచి పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సుజాత కేకలు వేస్తూ మంటలను ఆర్పేందుకు యత్నిస్తుండగా పెట్రోల్ ట్యాంక్ కిందపడి మంటలు ఆమెను చుట్టుముట్టాయి. తీవ్రంగా గాయపడిన సుజాతను చైన్నెలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సుమారు 23 రోజులుగా చికిత్స పొందుతూ సుజాత మరణించింది. అదివారం ఈ మేరకు సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని, చైన్నెలోనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్ఐ అజయ్కుమార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీసిటీలో బిజినెస్ ఫ్యామిలీ ప్రతినిధి బృందం పరిశీలన
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీని పదిమందితో కూడిన బిజినెస్ ఫ్యామిలీ ప్రతినిధి బృందం ఆదివారం సందర్శించింది. ఫ్యామిలీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ ఐక్యా కనెక్ట్ ఆధ్వర్యంలో ఈ పర్యటన సాగింది. ప్రస్తుతం ఐక్యా కనెక్ట్కు ఆరు దేశాలు, 16 నగరాల నుంచి 85 సింగిల్ ఫ్యామిలీ ఆఫీసులు అనుబంధంగా ఉండగా, ఇవి కలిపి 30 బిలియన్ డాలర్లకు పైగా కుటుంబ పెట్టుబడులను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రతినిధి బృందానికి అట్లాస్ ఫ్యామిలీ ఆఫీస్ చైర్మన్ మెహతాస్, హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సమీర్ మెహతా నాయకత్వం వహించారు. ఈ బృందం శ్రీసిటీలోని మౌలిక వసతులను పరిశీలించింది. ఇప్పటికే ఉన్న పలు కంపెనీల కార్యకలాపాలను తిలకించింది. ఈ సందర్భంగా డాక్టర్ సమీర్ మెహతా మాట్లాడుతూ, తమ పర్యటనకు సహకరించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యా కనెక్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్, దినేష్ హిందూజా ఫ్యామిలీ ఆఫీస్ హెడ్ జై రూపానీ మాట్లాడుతూ శ్రీసిటీలో మౌలిక వసతులు బాగున్నాయన్నారు. -
భూ ఆక్రమణలపై ఆగ్రహం
రేణిగుంట : తెలంగాణకు చెందిన విద్యా సంస్థల అధినేత తమ గ్రామంలోని ప్రైవేటు కాలేజీని కొనుగోలు చేశారని, అప్పటి నుంచి పక్కనున్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని డి.మల్లవరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రేణిగుంట మండలం, కృష్ణాపురం పంచాయతీ దిగువ మల్లవరంలో గ్రామస్తుడు రవి మాట్లాడుతూ శ్మశానానికి వెళ్లేందుకు 12 అడుగుల వెడల్పుతో దారి ఉందన్నారు. కాలేజీ వాళ్లు ఆ దారిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే గ్రామం నుంచి వెలుపలకు వెళ్లే దారిని సైతం వారు ఆక్రమించేందుకు చర్యలు చేపట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగా రెండు రోజుల నుంచి జేసీబీతో ఆయా ప్రాంతాలను చదును చేయిస్తున్నారని వెల్లడించారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ తిరుపతి రూరల్ : భారత సాయుధ దళాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకుంటూ వెరిటాస్ సైనిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం నుంచి ఎన్జీవో కాలనీలోని అమర్ జవాన్ పార్క్ వరకు భారీ మార్చ్పాస్ట్ చేపట్టారు. ఇందులో వెరిటాస్ సైనిక్ స్కూల్కు చెందిన 200 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్రెడ్డి, కార్గిల్ యుద్ధ వీరుడు, పాఠశాల చైర్మన్ బి.శేషారెడ్డి, పాఠశాల డీన్, రిటైర్డ్ ఎయిర్ కమెండోర్ సి.జి.హెచ్.ఖాన్ హాజరయ్యారు. ఇటీవల చైన్నె కమాండెంట్ ఎం.ఇ.జి సెంటర్ (మద్రాస్ సప్పర్స్) నుంచి వెటరన్ అచీవర్స్ అవార్డు పొందిన బీవీ శేషారెడ్డిని ఘనంగా సత్కరించారు. టీటీడీ కళాశాలలకు ఇంటర్ పుస్తకాలు తిరుపతి సిటీ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్, నోట్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆయా కళాశాలలకు టెక్ట్స్ పుస్తకాలు చేరాయి. ఈ వారంలోనే పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయన్నట్లు తెలుస్తోంది. విద్యార్థి సంఘాల ఆందోళనతో ఎట్టకేలకు స్పందించిన టీటీడీ అధికారులు ఎస్వీ, పద్మావతి, డెఫ్ అండ్ డమ్ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీకి సన్నాహాలు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు ఏర్పేడు : ఏర్పేడు–వెంకటగిరి మార్గంలోని పల్లం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలుకు చెందిన శంకర్రెడ్డి(65), బాలయ్య(52) పల్లంపేట నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా, వెంకటగిరి వైపు నుంచి వస్తున్న ఓ కారు ఢీకొంది. దీంతో శంకర్రెడ్డి, బాలయ్య తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శంకర్రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా శ్రీకాళహస్తి వైపు వెళుతుండగా సమాచారం అందుకున్న ముచ్చువోలువాసులు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి కారును ఆపి డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. మలుపు వద్ద ప్రభుత్వ స్థలం కబ్జా ఏర్పేడు: మండలంలోని పల్లం గ్రామం వద్దమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఏర్పేడు–వెంకటగిరి, శ్రీకాళహస్తికి ఈ మార్గం గుండా నిత్యం వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. అయితే మలుపు వద్ద రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలం 40 సెంట్లను స్థానిక టీడీపీ నేత దర్జాగా కబ్జా చేసి షెడ్డును నిర్మించారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే కబ్జా చేసిన వారికి నోటీసులిచ్చారు. అదే మార్గంలో తాగునీటి పైపులైనును ఆక్రమణదారుడు పూడ్చివేశాడు. దీంతో 15 రోజులుగా గ్రామానికి తాగునీరు అందడం లేదు. -
అధికారానికి దాసోహం!
సాక్షి టాస్క్ఫోర్స్: దళితుడి పట్ల వివక్ష.. టీడీపీ నాయకుల పట్ల అధికారులు వల్లమాలిన ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం, ఇనగలూరు పరిధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలే ఇందుకు నిదర్శనం. వివరాలు.. ఇనగలూరు రెవెన్యూ పరిధిలోని జగ్గరాజుపల్లిలో సర్వే నం.107/12, 280/4, 20లోని ఎకరానికిపైగా ప్రభుత్వ, రోడ్డు పోరంబోకు భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకుని ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ ఆక్రమణపై సాక్షి దిన పత్రికలో ఈనెల 18న ‘కబ్జా చేసి.. దర్జాగా ప్రహరీ నిర్మించి’ శీర్షికన వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏర్పేడు– వెంకటగిరి మార్గంలో ఉన్న ఈ విలువైన ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్డును కూడా టీడీపీ నేతలు పీకేశారు. ఈ విషయాన్ని స్థానికలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. దళితుడిపై కన్నెర్ర ఇనగలూరు రెవెన్యూ పరిధిలోని జగ్గరాజుపల్లి దళితవాడకు చెందిన జడపల్లి పాపయ్య అనుభవంలో ఉన్న 2 ఎకరాల పట్టా భూమిని అవసరాల కోసం టీడీపీ నేతకు విక్రయించాడు. ఆ భూమితో పాటు పాపయ్య అనుభవంలోని 19 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమిని వారే స్వాధీనం చేసుకున్నారు. అయితే పాపయ్య తాను రెండెకరాలే విక్రయించింది.. 19 సెంట్లు విక్రయించలేదు కదా అని ప్రశ్నించగా.. ఆ టీడీపీ నేత 19 సెంట్లను తిరిగిచ్చేశాడు. పాపయ్య కుటుంబం అందులో చెట్లు నాడుకుంది. ఈ పరిణామాన్ని జీర్ణియించుకోలేని సదరు టీడీపీ నేత రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి 19 సెంట్లలోని చెట్లను, కంచెను తొలగించారు. అంతటితో ఆగని ఆ నేత పాపయ్యపై రెవెన్యూ అధికారుల చేత పోలీసులకు ఫిర్యాదు చేయించి అక్రమ కేసు నమోదు చేయించారు. ఒకే పంచాయతీ పరిధిలో ఇద్దరి భూ వివాదల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు వివక్ష ప్రదర్శించారు. టీడీపీ నేత ఆక్రమించుకున్న విషయం అధికారయంత్రాగానికి తెలిసినా పట్టించుకోలేదు. అదే ఒక దళితుడి అనుభవంలో ఉన్న 19 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ కేసు నమోదు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దళితుడిపై దౌర్జన్యం.. టీడీపీ నేతపై ప్రేమ -
అగ్నిపునీతం
ఆలయం వద్ద అశేష భక్తజనంశ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన ధర్మరాజులస్వామి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా అగ్నిగుండ మహోత్సవం చేపట్టారు. సుమారు 4వేలమంది భక్తులు కంకణధారులై అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా తొలుత సింహవాహనం అధిష్టించిన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అగ్నిగుండం ఎదుట కొలువుదీర్చారు. అనువంశిక పూజారి అగ్నిగుండంలోని నిప్పులను అమ్మవారి ఒడిలో పోసి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం పోతురాజును ధరించిన అనువంశిక పూజారులు మల్లెచెండును నిప్పుల్లో దొర్లించారు. ఈ క్రమంలోనే భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. పవిత్ర ఘట్టం వీక్షించేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే, బొజ్జల సుధీర్రెడ్డి, ముక్కంటి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు పాల్గొన్నారు. బందోబస్తు ఏర్పాట్లను డీఎస్పీ నరసింహామూర్తి పర్యవేక్షించారు. – శ్రీకాళహస్తి అగ్నిగుండంలోకి ప్రవేశిస్తున్న భక్తులు -
● మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. ● వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన
భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థ తిరుపతి మంగళం:రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ భ్రష్టుపట్టించారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరణాకరరెడ్డి ఆరోపించారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన అవినీతి అక్రమాలపై మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను తీసుకవచ్చారన్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారని కొనియాడారు. 17 మెడికల్ కళాశాలలను నిర్మించిన ఘనత జగనన్నదేనని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఒక్కో ఉద్యోగాన్ని రూ.30లక్షల చొప్పున అమ్మేశారని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాలో 20 ఉద్యోగాలు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. నిజమైన క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. డీఎస్సీలో అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించడంతో పాటు లోకేష్ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్న పత్రం లీక్ ఘటనపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖామంత్రి రాజీనామా చేశారని, అదే బాటలో లోకేష్ నడవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. -
కళా వికాసంతో సమాజ శ్రేయస్సు
తిరుపతి కల్చరల్ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మార్గదర్శకమైన కళల వికాసంతో సమాజ శ్రేయస్సు సాధ్యమని, ఆ దిశగా కళలను పరిరక్షించి భావితరాలకు అందించాలని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. ఈనెల 18 నుంచి తొమ్మిది రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి శాసీ్త్రయ, జానపద నృత్యాలు, పౌరాణిక, పద్యనాటక పోటీలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా హనుమా అవార్డులు, బహుమతి ప్రధానోత్సవానికి టీటీడీ ఈఓ రవిచంద్ర, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, టీటీడీ విశ్రాంత డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ, డాక్టర్ లింగుట్ల రమేష్నాథ్, డాక్టర్ మేడసాని మోహన్ విచ్చేశా రు. గత 26 ఏళ్లుగా క్రమం తప్పకుండా కళాకారును ప్రోత్సహిస్తున్న అభినయ ఆర్ట్స్ బీఎన్ రెడ్డి అభినందనీయులని కొనియాడారు. పౌరాణిక పద్యనాటకంలో విజయవాడకు చెందిన రామ ఫౌండేషన్ వారు ప్రదర్శించిన ‘ఉషాపరిణయం’ పద్యనాటకం ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్కు చెందిన శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘సీ్త్ర సూక్తం’, ఈజీవీ కళాక్షేత్రం కర్పూలు వారు ప్రదర్శించిన ‘సైరా నరసింహారెడ్డి’ పద్యనాటకాలు ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. అలాగే సాంఘిక నాటిక విభాగంలో గుంటూరు అభినయ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘ ఇది అతని సంతకం’, వెలగలేరు థియేటర్ట్స్ వారు ప్రదర్శించిన ‘నెట్’, విశాఖపట్నం తెలుగు కళా సమితి వారు ప్రదర్శించిన ‘ చిటికిన వేలు’ సాంఘిక నాటికలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందాయి . అభినయ ఆర్ట్స్ ప్రతినిధులు ఎన్.విశ్వనాథ్రెడ్డి, మబ్బు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. బీఎన్ రెడ్డికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుశాసీ్త్రయ నృత్య, పౌరాణిక నాటకాల ద్వారా యువతలో సాంస్కృతిక విలువలు పెంపొందించేందుకు 26 ఏళ్లుగా విశిష్ట సేవలందిస్తున్న అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్ రెడ్డికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఈ మేరకు మహతి కళాక్షేత్రంలో ఆయనకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్ టి. రామకృష్ణారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ శ్రీరామ్బాబు ఆదివారం రికార్డు నమోదు పత్రాలను అందజేశారు. అభినయ ఆర్ట్స్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఎన్. విశ్వనాథ్రెడ్డి, అధ్యక్షుడు మబ్బు సూర్యనారాయణరెడ్డి అభినందించారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తిరుపతి క్రైమ్ : తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును కేవలం 12 రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు రూ.12 లక్షల విలువైన 90 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.47 వేల నగదుతోపాటు నిందితుడు ఉపయోగించిన స్కూటీ, హత్యాయుధం స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సుబ్బరాయుడు వివరాలను వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. ఈ నెల 14వ తేదీన సాయినగర్ పంచాయతీ విజయనగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న ఎం. జ్యోతి (69) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. ఇంట్లోని సుమారు 90 గ్రాముల బంగారం, రూ.47 వేల నగదును నిందితుడు అపహరించి పరారయ్యాడు. దర్యాప్తులో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి పాశం రూపేష్ కుమా ర్ (36)ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. రైల్వే శాఖలో లోకో పైలట్గా కృష్ణపట్నం రైల్వే స్టేషన్న్లో రూపేష్కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. బాధిత కుటుంబంతో కొన్నేళ్లుగా ఉన్న పరిచయాన్ని అవకాశంగా మలుచుకుని, కుటుంబ పరిస్థితులపై అవగాహనతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. అప్పుల భారంతోనే నేరం ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి కారణంగా బంగారు ఆభరణాలను దోచుకుని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలని భావించిన నిందితుడు వృద్ధురాలిని లక్ష్యంగా ఎంచుకుని ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మారువేషంతో మోసం చేయాలనుకున్నా.. పోలీసుల దృష్టికి చిక్కకుండా ఉండేందుకు నిందితుడు పకడ్బందీగా ప్రణాళిక రచించాడు. తనతో పనిచేసే మరో లోకో పైలట్కు చెందిన స్కూటీని అపహరించి, దానికి నకిలీ నంబర్ ప్లేట్ అమర్చాడు. మహిళలు ధరించే నల్లని బురఖా, ముఖానికి స్కార్ఫ్, తలకు హెల్మెట్ ధరించి తిరుపతికి చేరుకున్నాడు. నేరం అనంతరం పలుమార్లు మార్గాలు మార్చుతూ సీసీ కెమెరాల నిఘా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. సాంకేతిక విధానంలో దర్యాప్తు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, డిజిటల్ ఆధారాలు, ఇతర శాసీ్త్రయ సాకా్ష్య్లను సమగ్రంగా విశ్లేషించారు. నిందితుడి ప్రతి కదలికను ప్రత్యేక బృందాలతో అనుసంధానం చేస్తూ దర్యాప్తు చేపట్టి, చివరకు కృష్ణపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో రూపేష్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు, నేరానికి ఉపయోగించిన కత్తి, దొంగిలించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాల కృషి అడిషనల్ ఎస్పీలు ఆర్ల శ్రీనివాసులు, కె. రవిమనోహరాచారి ఆధ్వర్యంలో చంద్రగిరి ఎస్డీపీఓ ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేశాయి. తిరుపతి రూరల్ ఇన్న్స్పెక్టర్ కె.మద్దయ్యాచారి, సీసీఎస్ ఇన్న్స్పెక్టర్లు శివకుమార్ రెడ్డి, టి.అబ్బన్న, ఎస్ఐలు పి.శ్రీరాములు, జ్యోతి, నాగార్జున రెడ్డి, చిరంజీవి, ఐడీ పార్టీ సిబ్బంది లక్ష్మీ ప్రసాద్, గౌస్ అరీఫ్, సూర్య ప్రసాద్, ప్రభాకర్, ప్రసాద్, శ్రీనివాసులు, రమే ష్, నాగరాజు శెట్టి, మురళి సమన్వయంతో పనిచేసి కేసును విజయవంతంగా ఛేదించారు. చట్టం నుంచి తప్పించుకోలేరు : ఎస్పీ ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ నేరం చేసి చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి అభినందనలు తెలిపారు. -
మా రాజ్యం..
రైల్వే స్టేషన్కు ఎదుట అసంపూర్తిగా మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిధులు నిలిపి.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంప్లెక్స్ నిర్మాణానికి తన వాటా నిధులు విడుదల చేయకుండా నిలిపివేసింది. అభివృద్ధి పనులను అడ్డుకుంది. తిరుపతి నగర నడిబొడ్డున స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని అడ్డగోలుగా ప్రభుత్వం తన వాళ్లకు కట్టబెట్టేయడం ఇప్పుడు దుమారం చెలరేగింది. ఈ భూమి విలువ రూ.60 కోట్లకు పైగానే ఉంటుంది. చినబాబు సన్నిహితుడుగా చెప్పుకునే కన్యకా ఇన్ఫ్రా సంస్థకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం మొత్తం వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఉత్సాహంగా సీబీఎస్ఈ బ్యాడ్మింటన్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ శ్రీప్రకాష్ పాఠశాలలో రెండురోజులుగా కొనసాగుతున్న సీబీఎస్ఈ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఆదివారం ఉదయం మ్యాచ్లను పాఠశాల డైరెక్టర్ విజయ్ప్రకాష్ ప్రారంభించారు. అండర్–14, 17, 19 బాలుర విభాగాల్లో మొత్తం 54 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. క్యార్టర్ ఫైనల్స్ విభాగంలో ప్రతిభ చూపిన ప్రతి విభాగంలోని 4 జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. అండర్–14 విభాగంలో గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం (విశాఖ), డాక్టర్ కేఎల్ ప్రసాద్ స్కూల్ (గుంటూరు), గాడియం స్కూల్ (హైదరాబాద్), సర్ సీఆర్ రెడ్డి స్కూల్ (ఏలూరు) సెమీస్కు చేరుకున్నాయి. అండర్–17 విభాగలో గాడియం స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్, మౌంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (కర్నూలు), భారతీయ విద్యాభవన్ స్కూళ్లు సెమీస్లో స్థానం పొందాయి. అండర్–19 విభాగంలో శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ (పెద్దాపురం), ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ (కాకినాడ), పల్లవి మోడల్ స్కూల్ (అల్వాల్), బీవీవీ వెంకటేశ్వర స్కూల్(తిరుపతి) సెమీస్కు చేరారు. ఈ పోటలను టెక్నికల్ అడ్వైజర్ బృందం పర్యవేక్షించగా, రిఫరీలు శ్రీనివాస్, సాయిబాబు, పరమేశ్వరరావు, డి.శ్రీనివాస్ పోటీల నిర్వహణలో సహకారం అందించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్టు విద్యా సంస్థల ప్రతినిధి పి.రామకృష్ణ తెలిపారు. -
నీట్ తరహాలో ఏపీ డీఎస్సీలో అక్రమాలు
సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యువత తిరగబడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థి పోరాటాలు నిరూపించాయని భూమన గుర్తుచేశారు. దేశంలో నీట్ పరీక్షల తరహాలోనే ఏపీలో డీఎస్సీ పరీక్షల్లోనూ అడ్డగోలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తూ.. డీఎస్సీలో ఒక్కో పోస్టును రూ.30 లక్షలకు అమ్ముకున్నారని, చివరికి స్పోర్ట్స్ కోటా పోస్టులను కూడా వదలకుండా విక్రయించారని ధ్వజమెత్తారు.కోట్లాది రూపాయలు దండుకుంటూ లోకేష్ రాష్ట్ర విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. తప్పు చేయడం కంటే అవినీతికి పాల్పడటం అత్యంత ప్రమాదకరమని, అందుకే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి లోకేష్ తప్పుకోవాలని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. -
దుండగుల బీభత్సం
తిరుపతి క్రైం: తిరుపతి టౌన్క్లబ్ కాంపౌండ్లో ఉన్న ఆర్కే.మీట్ హోటల్లో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. హోటల్ వెనుక గోడను పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు టేబుళ్లు, కుర్చీలు, ఫర్నిచర్తో పాటు ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఘటనపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్లో ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడి జరిగినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దీని వెనుక టౌన్ క్లబ్ ప్రస్తుత యాజమాన్యం ప్రమేయం ఉండొచ్చని ఆరోపిస్తూ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీఆర్ బాండ్లతో వివాదం ఈ ఘటనపై స్పందించిన టౌన్ క్లబ్ సభ్యుడు, టీడీపీ నాయకు డు బుల్లెట్ రమణ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనుల కోసం టౌన్ క్లబ్కు ఇటీవల రూ.1.08 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు మంజూరైన తర్వాత వివాదం చెలరేగిందన్నారు. గత 25–30 ఏళ్లుగా క్లబ్ క్యాంటీన్ నిర్వహిస్తున్న ఆర్.కె.రామకృష్ణారెడ్డిని ఖాళీ చేయించాలని కొందరు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ అంశాన్ని జనరల్ బాడీలో చర్చించగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా సభ్యుల ఏకాభిప్రాయం లేకుండా ఖాళీ చేయించవద్దని మెజారిటీ నిర్ణయించినప్పటికీ, ఎలాంటి స్పష్టత లేకుండానే క్లబ్ భవనాన్ని కూల్చివేశారని విమర్శించారు. బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్న ఈ చారిత్రాత్మక క్లబ్పై కక్షపూరిత చర్యలు జరిగాయని ఆరోపిస్తూ, ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. పట్టించుకోలేదు ఆర్.కే. మీట్ హోటల్ నిర్వాహకుడు సురేందర్రెడ్డి మాట్లాడుతూ.. తమ కుమారుడు కృష్ణతేజ నిర్వహిస్తున్న క్యాంటీన్ను బలవంతంగా ఖాళీ చేయించాలని కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించి గడువు కోరినా పట్టించుకోలేదన్నారు. శనివారం తెల్లవారుజామున దుండగులు క్యాంటీన్లోకి ప్రవేశించి పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పారు. విషయం తెలుసుకుని ప్రశ్నించిన యువరాజ్పై దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. -
భూమన కుటుంబం వెంటే మేమంతా
తిరుపతి రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కుటుంబం వెంటే తామంతా ఉంటామని, ఆయనపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం తిరుపతి పద్మావతీపురంలోని ఆయన ఇంటికి వెళ్లి భూమన అభినయ్రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపిన అనంతరం మోహిత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిని టార్గెట్ చేసుకుని సర్కారు వేధింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను, ప్రశ్నించే వారిపై రాజకీయంగా వేధించేందుకు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. భూమన కుటుంబానికి చెందిన పట్టా భూముల్లోకి రెవెన్యూ అధికారులను పంపించి కూల్చివేతలు చేయించడం, బఫర్ జోన్ పేరుతో రివెట్మెంట్ వాల్ను కూల్చివేయడం పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యేనని ఆయన విమర్శించారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు అనేకం ఉన్నప్పటికీ భూమన కుటుంబ ఆస్తులే ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. స్వర్ణముఖి నది బఫర్ జోన్ ఆక్రమించి గోడలు కట్టడం చట్ట విరుద్ధమే అయితే హెరిటేజ్ ఫ్యాక్టరీ కూడా స్వర్ణముఖి నదికి ఆనుకునే ఉంది కదా? కూల్చివేతలు దాని నుంచే మొదలు పెడదామా? అని మోహిత్రెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే లక్ష్యమా?చంద్రబాబు ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్న భూమన కుటుంబం చంద్రబాబుకు కంటిలో నలుసులా మారిందని, అందుకే ఆ కుటుంబంపై పగబట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మోహిత్రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేసే ఉడత ఊపులకు, బెదిరింపులకు భూమన కుటుంబం భయపడదని, ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, బాబు సర్కారు రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి తదితరులు ఉన్నారు. -
17 లక్షల నుంచి 14 లక్షలకు పడిపోయిన జిల్లా ఓటర్లు
● మొత్తంగా 2,87,835 ఓట్లు తగ్గిన వైనం ● 31న ముసాయిదా జాబితా వెల్లడి ● ఈఎఫ్లు వెనక్కి ఇవ్వని వారికి నోటీసులు ● తిరుపతిలో 90,882, చంద్రగిరిలో 50,273 ఓట్లు తగ్గుదల తగ్గిన ఓట్లు ఇలా.. మృతి చెందిన ఓటర్లు 63,497 డూప్లికేట్ ఓటర్లు 66,265 శాశ్వత వలస ఓటర్లు 1,24,798 డబుల్ ఎంట్రీలు 31,683 ఇతర ఓటర్లు 1592 మొత్తం తగ్గిన ఓట్లు 2,87,835తిరుపతి అర్బన్: ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ(సర్)తో జిల్లా ఓటర్లు భారీగా తగ్గిపోయాయి. దాదాపు 2,87,835 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్వోలకు ఇవ్వలేదు. వీరంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 17,69,438 మంది ఓటర్లకు సంబంధించి 40 రోజుల పాటు (జూన్ 15 నుంచి జూలై 24 వరకు) బీఎల్వోల ఇంటింటా సర్వే నిర్వహించారు. వంద శాతం ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఓటర్ల నుంచి 14,81,603 ఫారాలు మాత్రమే తిరిగి వెనక్కి వచ్చాయి. వాటిని ఆన్లైన్ పద్ధతిలో డిజిటలైజేషన్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,87,835 మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి వెనుక్కిరాలేదు. ఈ ఓట్లు శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్లు, మృతులు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో 2,87,835 ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం ఈనెల 31 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. మరోవైపు మ్యాపింగ్ జరగని ఓట్లు 1,62,167, మ్యాపింగ్ వివరాలు సక్రమంగా నమోదుకాని ఓటర్లు 70 వేలకు పైగా ఉండడంతో వారందరికీ ఈఆర్వోల నుంచి నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు అందుకున్నవారు గుర్తింపు కార్డులు, ఆధార్కార్డుతో హాజరుకావాల్సి ఉంది. అత్యధికంగా తిరుపతిలో తగ్గిన ఓట్లు సర్ నేపథ్యంలో అత్యధికంగా తిరుపతి నియోజకవర్గంలోనే 90,882 ఓట్లు తగ్గిపోగా.. చంద్రగిరిలో 50,273 ఓట్లు.. అత్యల్పంగా కోడూరు నియోజకవర్గంలో 26,048 ఓట్లు తగ్గాయి. మొత్తంగా 14,81,603 మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్వోలకు అందించారు. మ్యాపింగ్ కాని ఓట్లు, మ్యాపింగ్ అయిన వివరాలు సక్రమంగా లేని ఓట్లు నోటీసుల తర్వాత పరిశీలన అనంతరం ఎన్ని ఓట్లు మిగులుతాయో చూడాల్సి ఉంది. నియోజకవర్గం గతంలోని ఉన్నట్లు తగ్గిన ఓట్లు సూళ్లూరుపేట 2,43,284 27,946 వెంకటగిరి 2,45,781 36,505 కోడూరు 2,06,065 26,048 చంద్రగిరి 3,13,795 50,273 తిరుపతి 2,95,288 90,882 శ్రీకాళహస్తి 49,123 32,836 సత్యవేడు 2,16,102 23,345 మొత్తం 17,69,438 2,87,835 -
అయ్యో.. తల్లీ!
ముక్కుపచ్చలారని ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారని తెలిస్తే ఎవరికై నా గుండె తరుక్కుపోవాల్సిందే. కుటుంబ కలహాలతో ఎనిమిదేళ్ల క్రితం భర్త దూరమైనా ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా పెంచింది. ఆస్తిపాస్తులు.. ఉండడానికి ఇల్లు లేకపోయినా రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేస్తోంది. గ్రామంలో పశువుల కాపరిగా ఉంటూ.. మధ్యమధ్యలో కూలీనాలి చేసి పెద్ద కుమారుడిని ఐటీఐ వరకు చదివించింది. ఇంతలో విధి ఆ కుటుంబంపై పగబట్టింది. పశువులు మేపుతుండగా పాము కాటేయడంతో తల్లి కూడా అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే రెక్కలు విప్పుకుంటున్న ఆ బిడ్డలు ఏ పంచన చేరాలి.. ఎలా బతకాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో ఎలా బతుకుతారోనని స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. ఈ ఘటన బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కంచనపుత్తూరులో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుచ్చినాయుడుకండ్రిగ: పాము కాటుకు గురై పశువుల కాపరి మృతి చెందిన ఘటన కంచనపుత్తూరు గిరిజన కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం.. మండలంలోని కంచనపుత్తూరు గిరిజన కాలనీకి చెందిన మానికల వెంకటరత్నమ్మ (28) పశువుల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం సాయంత్రం గ్రామంలోని బీడు భూముల వద్ద పశువులు మేపుతుండగా వెంకటరత్నమ్మను పాము కాటు వేసింది. వెంటనే పొలాల నుంచి రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు తెలపగా, ఆస్పత్రికి బయలు దేరేలోపే వెంకటరత్నమ్మ మృతి చెందింది. ఇల్లు కూడా లేదు వెంకటరత్నమ్మకు ఇల్లు కూడా లేదు. రేకులతో చిన్నపాటి షెడ్డులాగా ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఎండావానలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం తల్లి మృతితో బిడ్డల పోషణతోపాటు.. ఉండడానికి సరైన ఇల్లు కూడా లేకపోవడంతో ఎలా బతుకుతారో..ఏమోనని స్థానికులు ఆవేదనకు లోనవుతున్నారు. చేతికొచ్చిన ఆడ బిడ్డను ఎవరు చూసుకుంటారోనని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి ముగ్గురు పిల్లల పోషణతోపాటు పెద్ద కుమారుడి ఐటీఐ చదువుకు సహకరించాలని కోరుతున్నారు. అలాగే ఉండడానికి పక్కా ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. పాము కాటుతో పశువుల కాపరి మృతి ఎలా బతికేదమ్మా! మానికల వెంకటరత్నమ్మ, చిరంజీవి దంపతులకు ఇద్దరు కుమారులు వెంకటాద్రి, పురుషోత్తమ్, కుమార్తె గౌతమి ఉన్నారు. వెంకటాద్రి ప్రస్తుతం ఐఐటీ చదువుతున్నాడు. మిగిలిన ఇద్దరూ చదువు కు దూరమయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం చిరంజీవి కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి మృతి చెందారు. అప్పటి నుంచి వెంకటరత్న మ్మ ముగ్గురు పిల్లలను కూలిపని, పశువుల కాపరి గా ఉంటూ పోషిస్తోంది.ఇప్పుడు తల్లి కూడా దూరమవ్వడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 78,721 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,018 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. 6న టీటీడీ మిక్సిడ్ రైస్ ఈ–వేలం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన బియ్యాన్ని ఆగస్టు 6న ఈ–వేలం ద్వారా విక్రయించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వేలంలో మొత్తం 20 లాట్లలో సుమారు 7,938 కిలోల మిక్సిడ్ రైస్ అందుబాటులో ఉంచనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్ట 5వ తేదీ సాయంత్రం లోపు కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.50 వేల ఈఎండీ ఆన్న్లైనన్లో చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో లేదా ఫోన్ 0877–2264429 లేదా టీటీడీ కొనుగోలు వెబ్సైట్ను సందర్శించవచ్చని పేర్కొంది. ఆర్టీసీ డ్రైవర్లకు కౌన్సెలింగ్ తిరుపతి అన్నమయ్యసర్కిల్: ప్రమాదరహిత వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో పది డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. టీపీటీవో జగదీష్ మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ చేసి, ప్రమాదాలకు దారితీసే ప్రధాన కారణాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ పి.విశ్వనాథ్, ఆర్ఎస్డీ గోపాల్ పాల్గొన్నారు. ఓపెన్ కాని వెబ్ఆప్షన్ సైట్ తిరుపతి సిటీ: వెబ్ ఆప్లన్లా...అయ్యో రామచంద్రా ఏమి చెప్పాలి..? అంటూ ఏపీఈఏపీసెట్ కౌన్సెలింగ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు, తల్లి దండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్– 2026 కౌన్సెలింగ్లో భాగంగా సాంకేతిక విద్యామండలి శనివారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు అవకాశం కల్పించింది. కాగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న 20 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్నెట్ సెంటర్ల వద్ద, సచివాలయాల వద్ద, కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద పడిగాపులు కాశారు. రాత్రి 7గంటల అవుతున్నా వెబ్ సైట్ ఓపెన్ కాలేదని తెలిపారు. ఏమిటీ నిర్లక్ష్యం... ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ విద్యార్థులకు నరకం చూపించిన ఉన్నత విద్యామండలి అధికారులు వెబ్ఆప్షన్ల ప్రక్రియలోనే ఆదే తంతును కొనసాగిస్తున్నారు. ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు వెబ్ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని, విద్యార్థులు వెంటనే ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ప్రకటించారు. కానీ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. -
సీఐపై కోర్టు ఆగ్రహం
సాక్షి టాస్క్ ఫోర్స్ : సామాన్య ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీకి అండగా నిలిస్తే.. కోర్టు దృష్టిలో నిందితులుగా నిలవాల్సి ఉంటుందన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఆలస్యంగా వెలుగుచూసిన కథనం ప్రకారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని పెద్దగోర్పాడుకు చెందిన 77 ఏళ్ల వృద్ధురాలు ఎస్.చిట్టెమ్మ తన భర్త ఎస్.క్రిష్ణమనాయుడు మరణించిన తరువాత గ్రామంలోని ఇంటి నెంబరు 12–24లో నివసిస్తున్నారు. ఆ ఇంటికి పైభాగంలో నివసించే క్రిష్ణమనాయుడు సోదరుడు సూరినేని శ్రీనివాసులు నాయుడుతో చిట్టెమ్మకు ఆ ఇంటికి సంబంధించిన సివిల్ వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో చిట్టెమ్మ ఈ ఏడాది మార్చి 18న హైదరాబాద్లో నివసిస్తున్న తన కుమారుడు దగ్గరకు వెళ్లారు. ఈ సమయంలో శ్రీనివాసులు నాయుడు పాకాల సీఐ చిన్నగోవిందు యాదవ్ సహకారంతో తన సమీప బంధువులతో పాటు పాకాల మండల టీడీపీ అధ్యక్షుడు బోయపాటి నాగరాజనాయుడుతో కలిసి ఆ ఇంటి తాళం పగులగొట్టి అక్రమంగా లోపలికి ప్రవేశించారు. ఇంటి పరిసరాలను గునపాలతో ధ్వంసం చేశారు. ఈ దాడిలో రూ.3.10 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై వృద్ధురాలు మార్చి 19న పాకాల ఎస్హెచ్ఓగా ఉన్న సీఐ చిన్నగోవిందుకు ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోలేదు. తిరుపతి జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో ఆమె ఈ దారుణంపై పాకాల ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. తన ఇంటి లోపలికి దౌర్జన్యంగా ప్రవేశించడం,వస్తువుల ధ్వంసం, అదే సమయంలో సీఐ చిన్న గోవిందు వారికి రక్షణగా నిలబడడం వంటి వీడియో దృశ్యాలను కోర్టుకు సమర్పించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి చట్టాన్ని అతిక్రమించిన సీఐ చిన్నగోవిందు యాదవ్సహా 8మందిపై తక్షణం కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. -
పక్షుల ప్రాముఖ్యతపై అవగాహన
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఎకో క్లబ్, యూత్ రెడ్ క్రాస్ కమిటీ వారు విద్యార్థులకు పక్షుల ప్రాముఖ్యత, ఆర్నిథెరపీ ద్వారా ఒత్తిడి నివారణ అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ నారాయణమ్మ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా సమయపాలన, సానుకూల ఆలోచన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఆర్నిథెరపీని ఉపయోగించుకొని మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ద్వారా విద్యలోనూ, జీవితంలోనూ మంచి విజయాలను సాధించగలరని తెలిపారు. ఆర్నిథాలజిస్ట్ కార్తీక్ సాయి మాట్లాడుతూ పక్షుల వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, పక్షుల కిలకిలరావాల ద్వారా కలిగే సౌండ్ థెరపీ ప్రయోజనాలను వివరించారు. -
ముగిసిన స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి జూనియర్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. రెండు కళాశాలల్లో దాదాపు అన్ని గ్రూప్లలో సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులగా జరిగిన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో తొలిరోజు రెండు వందలకు పైగా సీట్లు భర్తీకాగా, రెండవ రోజు 300కు పైగా సీట్లను భర్తీ చేశారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో చివరి రోజు సుమారు 200 సీట్లు వరకు భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ఆరు విడదలతో జరిగిన మెరిట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కంటే స్పాట్ కౌన్సెలింగ్ ప్రక్రియలోనే సుమారు 40 శాతంపైగా సీట్లు భర్తీ కావడం విశేషం. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను శుక్రవారం డీఈఓ ఫణికుమార్ పద్మావతి జూనియర్ కళాశాలలో పర్యటించి పర్యవేక్షించారు. 22 స్టార్టర్లు చోరీ నాగలాపురం: మండలంలోని వేంబాక్కం గ్రామంలో ఒకే రోజు రాత్రి 22 వ్యవశాయ విద్యుత్ మోటారు స్టార్టర్లు చోరీకి గురికావడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు విద్యుత్ మోటారు ఆన్ చేయడానికి ప్రయత్నించగా స్టార్టర్లు కనిపించలేదు. వెంటనే బాధిత రైతులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వారం క్రితం 30 స్టార్టర్లు చోరీకి గురైనట్టు రైతులు ఆరోపించారు. ఒక్కో స్టార్టర్ విలువ రూ.5,500 ఉంటుందని, వారం రోజుల వ్యవధిలోనే రూ.2,86,000 నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2,87,759 ఓట్లు తగ్గాయి ‘సర్’ తిరుపతి అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 17,69,438 ఓట్లర్లుకు గాను 14,81,679 మందికి చెందిన ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే తిరిగి బీఎల్వోలకు చేరాయి. 2,87,759 ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి చేరలేదు. వీరంతా శాశ్వతంగా వెళ్లిపోయినవారు, డూప్లికేట్లు, మృతి చెందిన వారుగా భావిస్తున్నారు. లారీని ఢీకొన్న బైక్ చంద్రగిరి: లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలైన ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వరంగల్కు చెందిన రవి(34) పట్టణంలోని పోలీసు స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్గా పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రవి, జోగుల కాలనీకి చెందిన సయ్యద బాషాతో కలసి ఐతేపల్లిలోని దాబాకు వెళ్లారు. అనంతరం ద్విచక్ర వాహనంలో అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అగరాల సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద సర్వీసు రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందగా, సయ్యద్బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
సూళ్లూరుపేట: పట్టణ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్స్కు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠాను శుక్రవారం అరెస్ట్ చేసి వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే 96 గ్రాములు బరువు కలిగిన నాలుగు బంగారు చైన్లుతో పాటు ఒక కేటీఎం డ్యూక్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్టు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. సూళ్లూరుపేట సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చైన్నెలోని కొరుక్కుపేటకు చెందిన కే.మోసెస్ (33), మరియాదాస్ ఆనంద్ (20) తమిళనాడు దొంగలు ఈ ప్రాంతానికి మోటార్ సైకిల్పై వచ్చి అక్కడక్కడా చైన్ స్నాచింగ్స్కు పాల్పడుతున్నట్టు గుర్తించామన్నారు. సూళ్లూరుపేట పట్టణంలోని పార్కువీధిలో ఓ మహిళ మెడలో చైన్ లాక్కుని ఉడాయించిన ఘటనలో సీసీ కెమెరాల్లో చూసి నిందితులను గుర్తించామని తెలిపారు. అప్పటి నుంచి వీరిద్దరిపై నిఘా పెట్టి శుక్రవారం అరెస్ట్ చేసి విచారించగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిపై తమిళనాడులో 15 కేసులు, దొరవారిసత్రం, పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లో ఐదు కేసులున్నాయని తెలిపారు. అలాగే మరియాదాస్ ఆనంద్పై తమిళనాడులో 12 కేసులు, సూళ్లూరుపేట ఐదు కేసులున్నాయని పేర్కొన్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్కుమార్తో పాటు సిబ్బంది ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ మేరకు వారికి క్యాష్ రివార్డులను అందజేశారు. -
మెగా పీటీఎంతో విద్యాప్రమాణాల మెరుగు
తిరుపతి ఎడ్యుకేషన్ : మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాల ద్వారా విద్యాప్రమాణాలు మరింత మెరుగుపడుతాయని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని ఎస్పీజేఎన్ఎం హైస్కూల్లో శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మెగా పీటీఎం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,550 పాఠశాలల్లో సుమారు 1.52 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మెగా పీటీఎంను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది పాఠశాలల్లో మౌలిక వసతుల పెంపునకు డోనర్ యాప్ను తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, డీఈఓ కేవీఎన్.కుమార్, తిరుపతి అర్బన్ ఎంఈఓలు బాలాజీ, భాస్కర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. సగం వేతనం విరాళం తన ఒక నెల వేతనంలో సగం మొత్తాన్ని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు విరాళంగా అందించారు. తిరుపతిలోని ఎస్పీజేఎన్ఎం పాఠశాలలో నిర్వహించిన పీటీఎంలో డోనర్ యాప్ ఉపయోగాన్ని వివరించారు. అనంతరం నగం వేతనం మొత్తాన్ని ఈ యాప్ ద్వారా అందించారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రూ.50 వేలు, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రూ.50 వేలు, డీఈఓ రూ.20 వేలు, అలాగే తల్లిదండ్రులు తమ విరాళాలను స్వచ్ఛందంగా డోనర్ యాప్ ద్వారా అందించారు. -
అర్హులందరికీ న్యాయం చేస్తాం
తిరుపతి అర్బన్: అర్హులైన దివ్యాంగులు అందరికీ ఉచిత వాహనాల పంపిణీలో న్యాయం చేస్తామని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. వాహనాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో 70 మంది దివ్యాంగులకు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో మూడు చక్రాల వాహనాలు, స్కూటీలను పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ గోవిందరావుతోపాటు తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు మూడు చక్రాల వాహనాలకు దరఖాస్తులు చేసుకుంటే అర్హతను బట్టి అందిస్తారని వివరించారు. అలాగే అర్హులైన దివ్యాంగులకు రూ.6వేలు, వ్యాధిగ్రస్తులకు రూ.15వేలు పింఛన్ ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
30న కలెక్టరేట్ ముట్టడి
తిరుపతి సిటీ : ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలోని తాత్కాలిక బోధనేతర సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, టైమ్ స్కేల్ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గండికోట నాగవెంకటేష్ స్పష్టం చేశారు. శుక్రవారం ఈ మేరకు కలెక్టరేట్ ముట్టడి కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తాత్కాలిక బోధనేతర సిబ్బంది క్రమబద్ధీకరణతోపాటు రూ.26వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భద్రతా ప్రయోజనాలు అందించాలని కోరారు. నేతలు సుబ్బరాయుడు, గోపి, సురేష్, శ్రీనివాసులు, శ్రీహరి, శైలజ, సునీత పాల్గొన్నారు. -
స్విమ్స్లో అరుదైన శస్త్ర చికిత్స
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఓ పేషెంట్కు అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఎర్రావారిపాళెంకు చెందిన సిద్ధరాజు (48)కి టీటీడీ ప్రాణదానం పథకం ద్వారా గుండె శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ వనజాక్షమ్మ మాట్లాడుతూ గుండె వైఫల్యంతో మూడు నెలలుగా బాధపడుతున్న రోగి సిద్ధరాజు మందులతో చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన మేరకు మెరుగుదల కనిపించలేదన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ డిఫిబ్రిలేటర్ పరికరాన్ని అమర్చాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ణయించారని తెలిపారు. కార్డియాలజీ విభాగాన్ని సంప్రదించగా, వైద్యుల ప్రత్యేక కృషితో ప్రాణదానం పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరైందన్నారు. దీంతో ఈనెల 18వ తేదీన విజయవంతంగా కార్డియాక్ రీసింక్రోనైజేషన్ థెరపీ– డిఫిబ్రిలేటర్ ిపరికరాన్ని అమర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోగి బంధువులు టీటీడీకి, స్వీమ్స్ వైద్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. -
నంది విద్య నటేశ్వరితో.. సంస్కార విలువల పెంపు!
తిరుపతి రూరల్: టీటీడీ, హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీకంచీ కామకోటి పీఠం సంయుక్తంగా చేపట్టిన శ్రీనంది విద్య నటేశ్వరిశ్రీ కార్యక్రమం విద్యార్థుల్లో సంస్కారవంతమైన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వర్చువల్ ద్వారా అనుగ్రహ భాషణం చేశారు. వంద పాఠశాలల్లో విజయవంతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వంద పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు విజయేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. విద్యార్థుల్లో కళాభిరుచి, క్రమశిక్షణ, సంస్కార విలువలను పెంపొందించేందుకు మృదంగం, భారతీయ నృత్య కళల సమ్మేళనంగా దీనిని రూపొందించామన్నారు. 2025 డిసెంబర్లో మొదటగా 50 పాఠశాలల్లో ప్రారంభంచి, ఈ ఏడాది వంద పాఠశాలలకు విస్తరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు టీటీడీ విద్యాసంస్థలు పాల్గొనగా, తిరుపతి పరిసర ప్రాంత పాఠశాలలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించినట్లు వివరించారు. ప్రముఖ కళాకారులకు సన్మానం ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మవిభూషణ్ డా.ఉమయాళ్పురం కె.శివరామన్, ప్రముఖ భరతనాట్య కళాకారిణి రేవతి రామ్మోహన్ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో ఏ.శరత్ ఘనంగా సత్కరించారు. అనంతరం వారు అందించిన కళాప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చివరగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ప్రదర్శించిన అష్టలక్ష్మి వైభవం నృత్యరూపకం అలరించింది. లలిత సహస్రనామం నుంచి నందివిద్య నటేశ్వరి నందివిద్య నటేశ్వరి అనే పేరు శ్రీలలిత సహస్రనామంలోని 733, 734 నామాల నుంచి ఆవిర్భవించిందని స్వామివారు తెలిపారు. జూలై 23న ఏకకాలంలో 100 వేదికలపై నిర్వహించిన కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. టీటీడీ ఆర్థిక సహకారంతో పాటు శ్రీవారి సుప్రభాతం, విష్ణు సహస్రనామం, గోవింద నామాలు తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను విద్యార్థులకు పుస్తక ప్రసాదంగా ఉచితంగా అందించారు. -
బంద్ విజయవంతం
తిరుపతి సిటీ: నీట్ లీక్ వ్యవహారంలో ఎన్టీఏని రద్దు చేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర పదాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని అన్ని విద్యార్థి, ప్రజా, మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. నగరంలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రధాన ద్వారం నుంచి ర్యాలీగా బయలు దేరిన నేతలు పలు విద్యా సంస్థలను సందర్శించి తరగతులను బహిష్కరించాలని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నీట్ లీకేజ్కి కారణమైన కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 24 మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. 2014 నుంచి దేశంలో 152 పేపర్లు లీక్ కావడం దారుణమన్నారు. మద్దతు పలికిన ప్రైవేటు విద్యాసంస్థలు నేతల పిలుపు మేరకు శుక్రవారం తిరుపతి జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. ఈ మేరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంపై విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ యథావిధిగా సాగింది. యూనివర్సిటీలపై కన్నెర్ర బంద్కు పిలుపు నిచ్చినా ఎస్వీయూ, సంస్కృత వర్సిటీ, మహిళా వర్సిటీలు స్పందించకుండా తరగతులను కొనసాగించడంపై విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు కన్నెర్ర చేశారు. వర్సిటీలలో నడుస్తున్న తరగతులను బహిష్కరించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వర్సిటీ గేట్లు వేసి విద్యార్థి సంఘాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనుకాడకుండా గేట్లు పైకి ఎక్కి జాతీయ జెండాలతో నిరసన తెలిపారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులు జయచంద్ర, అక్బర్, ప్రవీణ్, లోకేష్, మల్లికార్జున, వీరేష్, సాయిలక్ష్మి, చిన్న, ఐరాల లోకేష్, పవిత్ర, రామకృష్ణ, అశోక్, వినోద్, శివబాలాజీ పాల్గొన్నారు. -
రాజకీయ కక్షతోనే విధ్వంసం
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులనే టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించడం, జైళ్లకు పంపడం, దాడులు చేయడం వంటి అరాచకాలు సృష్టిస్తున్నారని, రాజకీయ కక్షతోనే వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కుటుంబ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి నారాయణస్వామి మీడియా తో మాట్లాడారు. రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీలేదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి అవినీతి అక్రమాలతో రెడ్బుక్ పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఎండగడుతూ పోరాటాలు చేస్తున్నారని గుర్తుచేశారు. దాంతో పాటు టీటీడీలో జరుగుతున్న అపచారాలపైన నిత్యం ప్రశ్నిస్తున్నారన్న అక్కసు, కక్షతో భూమన గొంతు నొక్కేయాలన్న దురాలోచనతో వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. 24 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన పంట పొలాలు ఇప్పుడు ఆక్రమణ ఎలా అయ్యాయని ప్రశ్నించారు. స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న రైతులంతా ప్రహారీలు నిర్మించుకున్నారని తెలిపారు. వారంతా ఆక్రమణలకు పాల్పడినట్లేనా? అని ప్రశ్నించారు. బఫర్ జోన్లోనే ప్లాంట్ నిర్మాణం చంద్రగిరి మండలం, కాశిపెంట్ల వద్ద ఉన్న హెరిటేజ్ సంస్థ వ్యర్థ జలాల ప్లాంట్ ఏకంగా స్వర్ణముఖి నది బఫర్ జోన్లోనే నిర్మించడం ఆక్రమణ కాదా ? అని నారాయణస్వామి ప్రశ్నించారు. చట్టం ఏమీ చంద్రబాబు చుట్టం కాదని మండిపడ్డారు. అనంతరం వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాజకీయ కక్ష తప్ప ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోరన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక తీరును ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపడమే ఆయన నైజమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిత్యం ఎండగడుతున్న భూమన గొంతుకను నొక్కేసేందుకే ఆయన ఆస్తులను ధ్వంసం చేయిస్తున్నారని మండిపడ్డారు. విలువతో కూడిన రాజకీయం చేసే భూమన కరుణాకరరెడ్డి ఆస్తులే కాదు.. ఆయన ప్రాణాలు పోయినా చంద్రబాబు బెదిరింపులకు భయపడరని స్పష్ట చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాల కోసం తామంతా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలబడుతామని హెచ్చరించారు. అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు ఈ విధంగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్సీసెల్ అధ్యక్షుడు కోటూరు ఆంజనేయులు, పార్టీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు చేజర్ల మురళి పాల్గొన్నారు.మా ఆస్తులే కాదు.. మా ఇల్లు కూల్చేసినా భయపడే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టకుండా ఉంటాం.. అని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి స్పష్టం చేశారు. తమ నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి కోసం మా ఆస్తులు, ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా ఆయన వెన్నంటే ఉండి పోరాడుతామని పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు భూమన అభినయ్రెడ్డిని కలిసి వారి ఆస్తుల విధ్వంసంపై చర్చించారు. కేవలం భూమన కుటుంబాన్ని భయపెట్టి భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్రెడ్డి గొంతు నొక్కేందుకే చంద్రబాబు ఆడుతున్న కపట నాటకం ఇది ఒక భాగమన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేయడమే భూమన కరుణాకరరెడ్డికి తెలుసన్నారు. ఇప్పటివరకు చూసింది కొంతేనని, ఇకపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలను చేపడుతామని హెచ్చరించారు. -
దౌర్జన్య‘కూటమి’
వెంకటగిరి(సైదాపురం): ‘వెంకటగిరి నియోజకవర్గంలో అక్రమాలు, ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు శ్రుతి మించిపోతున్నాయి.. వాటిని పట్టించుకోవాల్సిన అధికారులే చోద్యం చూస్తున్నారు...’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మండిపడ్డారు. స్థానిక నేదురుమల్లి కార్యాలయంలోని ఎన్జేఆర్ భవనంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాత్రీపగలు తేడాలేకుండా ఇసుక, మట్టి అక్రమ రవాణా సాగుతోందన్నారు. వెంకటగిరి పట్టణంలో నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఆస్తులను సైతం కబ్జా చేసేందుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే చోద్యం చూస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా జరిగిన పనులకు ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ రూ.40లక్షల మేర బిల్లులు మంజూరు చేసి టీడీపీ నేతలకు పంచిపెట్టిందని ఆరోపించారు. ఇందులో టీడీపీ, జనసేన నేతల మధ్య వార్ కూడా నడుస్తోందన్నారు. క్రమశిక్షణ చర్యలు తప్పవు వైఎస్సార్సీపీ కార్యక్రమాలకు కొందరు కార్యకర్తలు, నేతలు హాజరు కావడం లేదని, ఇలాంటివారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని నేదురుమల్లి హెచ్చరించారు. అఽధికార పార్టీ ప్రజాప్రతినిధులతో దైవదర్శనాలకు వెళ్లడం, పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేయడం లాంటి విషయాలు తమ దృష్టికి వచ్చాయని, అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపీగా వెళ్తున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమన్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. మూడు రోజుల్లోనే ఐదు వేల మందికి పైగా సంతకాలు చేశారన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు పులి ప్రసాద్రెడ్డి, వెందోటి కార్తీక్రెడ్డి, మన్నారపు రవికుమార్యాదవ్, శ్రీనివాసులురెడ్డి, యోగిరాజు, మోహన్రావు, నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
తిరుమల శ్రీవారి భక్తులకు కీలక సమాచారం
సాక్షి, తిరుమల: భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం వెల్లడించింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు ప్రవేశం నిలిపివేస్తున్నట్టు తెలిపింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 31 వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు భారీ వర్షాలు, తుఫాన్లను దృష్టిలో ఉంచుకుని ముందుస్తు జాగ్రత్తలో భాగంగా పుష్కరిణిని పూర్తిగా మూసివేస్తామని టీటీడీ తెలిపింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని వెల్లడించింది. 40 రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరని, శ్రీవారి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా, శ్రీవారి బ్రహ్మూత్సవాలు ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి జరగనున్నాయి. చదవండి: హనుమాన్ విగ్రహం దొంగ టీడీపీ నేత -
హనుమాన్ విగ్రహం దొంగ టీడీపీ నేత
తిరుపతి క్రైం/తిరుమల/తగరపువలస: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలురాయి వద్ద బుధవారం వేకువజామున అపహరణకు గురైన ఆంజనేయస్వామి విగ్రహం కేసు గురువారం సంచలన మలుపు తిరిగింది. ఈ ఘటనలో అరెస్టయిన నిందితుడు భీమిలికి చెందిన టీడీపీ నాయకుడేనన్న విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా, వార్తా ఛానళ్లలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. నిందితుడు విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొట్నూరు రాము కుమారుడు, ఐటీడీపీ కార్యదర్శి జశ్వంత్కుమార్ (22) అని తేలింది. ఈ విగ్రహం చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? జశ్వంత్కు ఎవరైనా ప్రోత్సాహం అందించారా? చోరీ సమయంలో ఇంకెవరైనా సహకరించారా? అనే కోణాల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు జశ్వంత్ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజకు అత్యంత కీలక సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. బీటెక్ చదివి, ఐటీడీపీలో భీమిలి నియోజకవర్గం కార్యదర్శిగా కొనసాగుతున్న జశ్వంత్కు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కూడా సాన్నిహిత్యం ఉన్నట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. వీరితో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని గతంలో పలువురిని బెదిరించిన సందర్భాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడు ఆంజనేయస్వామి విగ్రహం అపహరణ కేసులో పోలీసులకు చిక్కిన విషయం బుధవారమే తెలిసినా, టీడీపీ ఉన్నత నాయకత్వం సూచనల మేరకు పొట్నూరు రాము మౌనం పాటించారు. సాంకేతికత ఆధారంగా నిందితుడి అరెస్ట్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మామండూరు మిట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోని చిన్న అభయ ఆంజనేయస్వామి విగ్రహం అపహరణకు గురైన కేసును తిరుపతి జిల్లా పోలీసులు 15 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ వివరాలను జిల్లా ఏఎస్పీలు గురువారం మీడియాకు వెల్లడించారు. టీటీడీ ఏవీఎస్ఓ ఎ.వెంకట శివకుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా విస్తృతంగా గాలింపు నిర్వహించారు. నిందితుడు ప్రయాణించిన జీపును గుర్తించి, అతని కదలికలను విశ్లేషించారు. రైల్వే పోలీసుల సహకారంతో ఒంగోలు రైల్వే స్టేషన్లో విశాఖపటా్ననికి చెందిన పొట్నూరు జశ్వంత్ కుమార్ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి విగ్రహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, జశ్వంత్ కుమార్ ఇంజినీరింగ్ వరకు చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడని, మూడేళ్లుగా మానసిక పరిస్థితి స్థిరంగా లేదని కుటుంబ సభ్యులు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గొర్ల మండలంలోని భువనేశ్వరి పీఠంతో అతనికి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. నిందితుడు పొట్నూరు జశ్వంత్ కుమార్ను రిమాండ్కు తరలించి, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు వెల్లడించారు. కాగా, నిందితుడు జశ్వంత్ మానసిక స్థితి బాగోలేదని తిరుపతి పోలీసులు చెప్పడం సరికాదని భీమిలి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు రైల్వేస్టేషన్లో విగ్రహంతో జశ్వంత్ దొరకగానే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందని, అతడి బ్యాక్ గ్రౌండ్ తెలిసిపోయిందని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు.. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని డైవర్షన్ డ్రామాకు తెర లేపారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన కూడా నిందితుడు తన స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లొచ్చారని స్థానికులు తెలిపారు. -
ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షే
వరదయ్యపాళెం: వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కుటుంబానికి చెందిన భూములకు వేసిన ప్రహరీ గోడను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే విధ్వంసం చేయడం రాజకీయ కక్షలో భాగమేనని వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ స్పష్టం చేశారు. ఈ పరిణామాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 23 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి వారి అనుభవంలో ఉన్న భూములను కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం చంద్రబాబు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతును అణచివేసేందుకు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్బాబు పూనుకున్నారని దుయ్యబట్టారు. సరికొత్త సంప్రదాయానికి ఒడిగడుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లో ఉన్నాయని ఆయన హితవు పలికారు. -
ధ్వంసం చేయడం సరికాదు
వెంకటగిరి (సైదాపురం): తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి పంట పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను బుధవారం రాత్రి పోలీసులు, రెవె న్యూ అధికారులు ధ్వంసం చేయడం సరికాదని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని, పట్టా స్థలంలో వరదనీరు పొలంలోకి రానివ్వకుండా నిర్మించుకున్న ప్రహరీని అధికారులు కూల్చివేయడం దారుణమన్నారు. భవిష్యత్లో అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆగస్ట్ 22న ఐఐటీ 8వ స్నాతకోత్సవం ఏర్పేడు: తిరుపతి ఐఐటీ 8వ స్నాతకోత్సవం ఆగస్టు 22న ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్లో నిర్వహించనున్నట్టు ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్.సత్యనారాయణ తెలిపారు. ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని పట్టభద్రులైన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. 27న ఐఐటీలో యువంతర్ –2026 ఈనెల 27న తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఐఐటీలో బీటెక్ కోర్సుల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు యువంతర్– 2026 పేరిట తమ అకాడమిక్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఓరియంటేషన్, ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ జరుతుందని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ, జేఈఈ అడ్వాన్స్డ్ చైర్పర్సన్ డాక్టర్ ఎం.నబిల్ లాంఛనంగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. -
అష్టదిగ్బంధనంలో భూమన వ్యవసాయ క్షేత్రం
● వందలాది మంది పోలీసులతో ముట్టడి ● రక్షణ గోడ కూల్చివేత ● ఎవ్వరినీ రానీయకుండా అడ్డగింత ● టీడీపీ అనుకూల మీడియాకు అనుమతి ● కట్టుకథలతో భూమనను భూ కబ్జదారుగా చిత్రీకరించే ప్రయత్నం ● పోలీసుల కుఠిలత్వంపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు కబ్జాకోరులుగా చిత్రీకరించడానికేనా? భూమన కుటుంబాన్ని భూ కబ్జాదారుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు, పచ్చ మీడియాను రంగంలోకి దించినట్టు తిరుపతి నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మల్లం రవి ఆరోపించారు. పచ్చ మీడియాతో పాటు ఆ భూమితో సంబంధం లేని వ్యక్తులను ఎలా అనుమతిస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ కక్ష సాధింపుతో వ్యవసాయ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని భూమన కుటుంబంపై అబాండాలు వేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. దీంతో పోలీసులు, వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడవగా.. కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, తనపల్లి సమీపంలో టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని పోలీసు బలగాలతో అష్టదిగ్బంధనం చేశారు. గురువారం తెల్లవారు జాము నుంచే వందలాది మంది పోలీసులు వ్యవసాయ క్షేత్రాన్ని చుట్టుముట్టారు. వ్యవసాయ క్షేత్రంలోకి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, సాధారణ ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులను కూడా అనుమతించకుండా అడ్డుకున్నారు. భూమన వ్యవసాయ క్షేత్రానికి ఆనుకుని ప్రవహించే స్వర్ణముఖి నది వద్ద పొలాలకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న రక్షణ గోడను రెవెన్యూ అధికారులు తొలగించారు. భారీ యంత్రాలను రంగంలోకి దించి పునాదులను సైతం పెకళించారు. వ్యవసాయ భూమికి రక్షణగా ఏర్పాటు చేసుకున్న రక్షణ గోడను పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా ప్రతినిధులకు మాత్రం పోలీసులు వ్యవసాయ క్షేత్రం లోపలికి అనుమతిచ్చి రక్షణ గోడను కూల్చివేసే దృశ్యాల చిత్రీకరణకు అవకాశం కల్పించారు. పోలీసులు తాము ఎవ్వరినీ లోపలకు పంపలేదని వాదనకు దిగడంతో లోపల జరిగే విధ్వంసకర చర్యలను పచ్చ మీడియా తన కట్టుకథలతో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు చూపారు. కక్ష సాధింపులకు నిదర్శనమిది వ్యవసాయ క్షేత్రం వద్ద సాధారణ మీడియాను అడ్డుకున్న పోలీసులు, టీడీపీ అనుకూల మీడియాను మాత్రం గుట్టుగా లోపలికి వెళ్లడానికి అనుమతించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ముందే సిద్ధం చేసిన కథనాలకు అనుగుణంగా అక్కడ పునాదుల తవ్వకాల లైవ్ వీడియోలు చిత్రీకరణ జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోందని విమర్శించారు. వందలాది మంది పోలీసులను మోహరించి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని చుట్టుముట్టడం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ కక్షలకు అద్దం పడుతోందని, ప్రతిపక్ష నేతలను భయపెట్టడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. -
సీ్త్ర విలువలకు దర్పణం సీ్త్ర సూక్తం
తిరుపతి కల్చరల్: నేటి ఆధునిక సమాజంలో సీ్త్ర విలువ పెంచే చట్టాలు రావాలన్న లక్ష్యంగా సాగిన ‘సీ్త్ర సూక్తం’ పద్యనాటకం జనాలను మేల్కొలిపింది. అభినయ ఆర్ట్స్ 26వ వార్షికోత్సవంలో భాగంగా మహతి కళాక్షేత్రంలో చేపట్టిన జాతీయ స్థాయి నృత్య, నాటక పోటీలు గురువారంతో ఆరో రోజుకు చేరాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కళా బృందాలు ప్రదర్శించిన శాసీ్త్రయ, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆలరింపజేశాయి. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్కు చెందిన శ్రీశ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ వారి ‘సీ్త్ర సూక్తం’ పౌరాణిక పద్యనాటక ప్రదర్శన సభికులను ఆలోచింపజేసింది. పురుష సూక్తం పోయి సీ్త్ర సూక్తం రావాలని ఈ నాటిక ద్వారా చాటారు. అనంతరం విశాఖపట్నం శ్రీతెలుగు కళాసమితివారు ప్రదర్శించిన ‘చిటికిన వేలు’ సాంఘిక నాటిక సందేశాత్మంగా నిలిచింది. నృత్య, నాటక ప్రదర్శన కళాకారులను అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్.రెడ్డి, ప్రతినిధులు జ్ఞాపికలు, పారితోషకంతో ఘనంగా సత్కరించి అభినందించారు. -
లీకులపై గర్జిద్దాం రండి!
తిరుపతి సిటీ: ‘పోటీ పరీక్షల పేపర్లు లీకవుతున్నాయి. దీనికి బాధ్యత వహించాల్సిన పాలకులు తప్పించుకుంటున్నారు. గళం విప్పుతున్న వారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీతో ఇప్పటికే 24 మంది ప్రాణాలు వదిలారు. వీరి ఆత్మశాంతికై నా రండి.. పోరాడుదాం.. ఐకమత్యంగా గళం విప్పుదాం..’ అంటూ విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు. నేడు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ పాటించనున్నట్టు పేర్కొన్నారు. నోరు మెదపరెందుకు బాబూ? ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని ప్రగల్భాలు పలికే డిప్యూటీ సీఎం పవన్ నీట్ పేపర్ లీకేజ్పై స్పందించక పోవడం దారుణమని పలువురు ఎండగడుతున్నారు. సీఎం చంద్రబాబు, యువగళం అంటూ హంగామా చేసిన మంత్రి లోకేష్ యువతకు జరిగిన అన్యాయంపై నోరు మెదపరా..! అంటూ ప్రశ్నిస్తున్నారు. నీట్ లీక్పై కూటమి సర్కార్ వైఖరికి నిరసనగా శుక్రవారం విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తున్నట్టు పేర్కొన్నారు. నీట్ లీకేజ్పై పవన్, బాబు స్పందించరా? -
30న కలెక్టరేట్ ముట్టడి
తిరుపతి ఎడ్యుకేషన్:సమగ్ర శిక్ష (ఎస్ఎస్)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో ఈ నెల 30న చేపట్టే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదనం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు గురువారం వారు తిరుపతి అర్బన్ ఎంఈఓలు బాలాజీ, భాస్కర్నాయక్కు వినతిపత్రం అందించి ముట్టడికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తిరుపతి జిల్లా చైర్మన్ గండికోట నాగవెంకటేష్ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న తమకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా తక్షణమే కూటమి ప్రభుత్వం మినిమమ్ టైమ్ స్కేల్ను అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమగ్రశిక్ష అభియాన్ సీఆర్ఎంటీ యూనియన్ నాయకులు ధనపాల్, వేణుగోపాల్, నవీన్కుమార్, జ్యోత్స్న, రమాదేవి, రూపాదేవి, శాలిని, హసీనా, రేఖ పాల్గొన్నారు. -
విద్యావ్యస్థ నిర్వీర్యం
కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసింది. నీట్ లీకేజ్తో విద్యార్థులు డాక్టర్ కలకు దూరమయ్యారు. అవినీతికి పాల్పడ్డ మంత్రికి ప్రధాని మోదీ వత్తాసు పలుకుతున్నారు. యువత తిరగబడితే ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకమే. తస్మాత్ జాగ్రత్త. –సుందరరాజు, ఎన్ఎల్ఎస్ఏ, జాతీయ అధ్యక్షుడు అవినీతికి అడ్డాగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూటమి సర్కార్ అవినీతికి అడ్డగా మార్చుకుంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్లు దోచుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. ఉన్నత విద్యను పేదలకు దూరం చేసేందుకు ప్రయత్నిస్తే తిరగుబాటు తప్పదు. – చిన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమతి సభ్యులు, తిరుపతి ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పేపర్ లీక్తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరి కుటుంబాలకు భరోసా ఎవరిస్తారు. యువత ప్రాణాలు పోతున్నా మోదీ సర్కార్ చలించకపోవడం దారుణం. తక్షణం ఎన్టీఏని రద్దు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలి. –అక్బర్, ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి, తిరుపతి స్పందించరా? నీట్ లీకేజ్పై యవతరం రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించకపోవడం దారుణం. విద్యార్థుల ప్రాణాలు అంటే అంతా చులకనా..?. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఏ అవినీతికి వత్తాసు పలకుతోందా?. –ప్రేమ్కుమార్, వైఎస్సార్సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షులు, తిరుపతి -
పంట బీమా తప్పనిసరి
తిరుపతి అర్బన్: పంట బీమా రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందని, ప్రతి రైతూ పంట బీమా చేసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి జిల్లా అగ్రికల్చర్ అధికారులతో పంట బీమాపై సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు, వర్షాభావం, తుపాన్లు, తాజాగా ఎన్నినో ప్రభావం తదితర పరిస్థితులతో పంటలకు నష్టం జరిగితే పంట బీమా ఆదుకుంటుందని తెలిపారు. అగ్రికల్చర్, ఉద్యానశాఖ, సహకార, రెవెన్యూశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వివాదాల పరిష్కారానికి ‘విశ్వాస్’ తిరుపతి అర్బన్: పెండింగ్లోని ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) జరిమానా వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం వన్టైమ్ సెటిల్మెంట్ కోసం ఏర్పాటు చేసిన విశ్వాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీజనర్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్–1 రవితేజకుమార్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో సూచించారు. ఈ పథకం జూన్ 29 నుంచి ఆరు నెలలు మాత్రమే అమల్లో అందుబాటులో ఉంటుందని, ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం కోర్టు కేసులను తగ్గించడం, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జరిమానా వివాదాలను త్వరితగతిన ముగించడమేనని పేర్కొన్నారు. 2024, జూన్ 14 కంటే ముందు జరిగిన పీఎఫ్ చెల్లింపులు ఆలస్యానికి సంబంధించి జరిమానాలు భారీగా తగ్గించనున్నట్టు వెల్లడించారు. రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల అటానమస్ హోదాలో గత నెల 27 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు జరిగిన డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో 97.4 శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించినట్టు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎ విద్యుల్లత తెలిపారు. డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ భద్రమణి, డాక్టర్ దివ్యవాణి, డాక్టర్ సునీత, డాక్టర్ సరిత పాల్గొన్నారు. బొప్పాయి రైతులను ఇబ్బంది పెడితే కేసులు తిరుపతి అర్బన్: బొప్పాయి రైతులను ఇబ్బంది పెడితే క్రిమినల్ కేసులు తప్పవని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ హెచ్చరించారు. గురువారం ఆయన జాయింట్ కలెక్టర్ గోవిందరావుతో కలసి బొప్పాయి రైతుల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమీక్షించారు. డిమాండ్ లేదంటూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఊరు కోమని హెచ్చరించారు. సమావేశానికి రావా లని వ్యాపారులను ఆహ్వానించినా వారు హాజరుకాకపోవడం బాధ్యతారహిత్యమని పేర్కొన్నారు. మార్కెట్లలో కృత్రిమంగా బొప్పాయి నిల్వలు ఉంచి డిమాండ్ లేదని చూపితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యానశాఖ జిల్లా అధికారి జయభరత్రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి సురేంద్రబాబు పాల్గొన్నారు. నేడు యథావిధిగా పీటీఎం తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు (పీటీఎం)ను కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్.కుమార్ తెలిపారు. విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ పీటీఎంలో భాగంగా కలెక్టర్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్పీజేఎన్ఎం పాఠశాలలో శుక్రవారం చేపట్టిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు. -
ఆపెన్నా హస్తం లేదా?
కలువాయి(సైదాపురం): కలువాయి మండలం, రాజుపాళెం సమీపంలోని పెన్నా నదిలో కూటమి నాయకులు బరితెగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దర్జాగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో మనుషులు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించాలని నిబంధన కున్నా పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా భారీ ప్రొకై ్లనర్లు పెట్టి వందల టిప్పర్లతో ఇసుకను తోడేస్తున్నారు. రాజుపాళెం నుంచి వెంకటరెడ్డిపల్లి వద్ద ఉన్న వంతెన వరకు దాదాపు 4 కి.మీ వరకు వరకు పెన్నా నదిలోనే రోడ్డు నిర్మించారు. వాల్టా చట్టం నిబంధనలు అతిక్రమించి మరీ తవ్వకాలు సాగిస్తున్నారు. పెన్నాలోకి వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాజుపాళెంలో రోజుకు వందల లారీల ఇసుక తరలిస్తున్నారు. తెలిసినా ఇటువైపు ఏ ఒక్క అధికారీ కన్నెత్తి చూడడం లేదు. ఇసుక లారీల కారణంగా ప్రధాన రహదారులు గుంతలమయంగా మారినా పట్టించుకోవడం లేదు. హైవేపై భారీ టిప్పర్లు వెళ్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారు తప్ప అడ్డంగించేందుకు సాహసం చేయడం లేదు. ఇవేవీ అధికారులకు కనిపించడం లేదా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పర్యావరణానికి ముప్పు ఇటీవల కుల్లూరు హైవే పక్కన ఇసుక డపింగ్ యార్డ్ను అనధికారికంగా ఏర్పాటు చేశారు. పెన్నాలోకి అడ్డంగా రహదారి నిర్మించడం వల్ల నది వారధి వెంబడి పంటలు వేసిన రైతులకు నీరందని పరిస్థితి నెలకొంది. ఇసుక అక్రమ రవాణాపై ఇటీవల వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆ పార్టీ నేతలతో కలిసి తెలుగురాయపురం అక్రమ రీచ్లో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన చెందారు. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ ఇంతవరకు చర్యలు లేవు. పెన్నా నదిలోకి అక్రమార్కులు ఏర్పాటు చేసిన బాట నిషేధం ఉన్నా.. జూన్ 1 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు పెన్నాలో ఇసుక తవ్వకాలు నిషేధం విధించారు. అయితే కూటమి నేతలు స్టాక్ పాయింట్ అని పేరు చూపించి నేరుగా పెన్నాలోనే భారీ యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. యథేచ్ఛగా టిప్పర్ల సాయంతో తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు సైతం స్పందించకపోవడం గమనార్హం. పెన్నా నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు -
డిజిటల్ పోర్టల్
తిరుపతి అర్బన్:ఐటీ హబ్ విస్తరణ దిశగా జిల్లా అడు గులు వేస్తోందని, మౌలిక సదుపాయాల అన్వేషణకు పెట్టుబడిదారులు, భూ యజమా నుల మధ్య సమన్వయం చేయాల్సి ఉందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూ ములు, యజమానుల ఆస్తుల వివరాలను ఐటీఐఎన్ఎఫ్ఆర్ఏ.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. అదనపు సమాచారం కోసం జిల్లా ఐటీ మేనేజర్ రమేష్ 9353494415ను సంప్రదించాలని సూచించారు. టమాట లారీ బోల్తా చంద్రగిరి: భాకరాపేట ఘాట్ రోడ్డులో గురువారం టమాట లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయే క్రమంలో డ్రైవర్ లారీపై నియంత్రణ కోల్పోయి పక్కకు రావడంతో బోల్తా కొట్టినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పింఛన్ ఇవ్వమంటే లంచం డిమాండ్ చేశాడు! – ఇంజినీర్ అసిస్టెంట్కు షోకాజ్ నోటీస్ సత్యవేడు: సత్యవేడు పంచాయతీ పరిధిలోని సచివాలయం–4లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ అశోక్ చక్రవర్తికి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు షోకాజ్ నోటీసు అందజేశారు. సత్యవేడు పంచాయతీలోని కోమటిగుంటకు చెందిన ఓ వ్యక్తి పక్షవాతానికి గురయ్యాడు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అనారోగ్యానికి గురైన బాధితుడికి పింఛన్ వ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఇదిలావుండగా పంచాయతీ పరిధిలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ అశోక్ డిజిటల్ అసిస్టెంట్గానూ విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడు రోజుల క్రితం పింఛన్ ఇవ్వాలంటే కొంత డబ్బు ఇవ్వాలని బాధిత కుటుంబీకులను డిమాండ్ చేశాడు. ఆపై బాధిత కుటుంబీకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ కార్యాలయ ఏఓ త్రివిక్రమారావు, సత్యవేడు సచివాలయ కార్యదర్శి మునిరవికుమార్ విచారణ చేపట్టారు. విచారణలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేశాడని బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ ఇంజినీరింగ్ అసిస్టెంట్కు షాకాజ్ నోటీసు అందజేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. -
థాయ్లాండ్లో విద్యార్థినుల ప్రతిభ
తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులు అంతర్జాతీయ వేదికపై ప్రతిభ కనబరిచారు. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పి.హరిణిసూర్యం, ఫార్మా స్యూటికల్ సైన్సెస్ విభాగానికి చెందిన జి.శ్రీసాయి హర్షిత థాయ్లాండ్లోని ప్రిన్స్ ఆఫ్ సాంగ్క్లా యూనివర్సిటీ (పీఎస్యూ), పట్టానీ క్యాంపస్ నిర్వహించిన ఐదు రోజుల ‘లీడర్షిప్ ఫర్ సస్టయినబుల్ డెవలప్మెంట్’ అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విశ్వ విద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. భారత్, మలేషియా, ఫిలిప్పిన్స్, థాయ్లాండ్ దేశాలకు చెందిన విద్యార్థులతో కలిసి పాల్గొన్న వీరు నాయకత్వ లక్షణాలు, బృంద సహకారం, భిన్న సంస్కృతుల అవగాహనతో పాటు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీలు)పై అనుభవాత్మక శిక్షణ పొందారు. కార్యక్రమంలో భాగంగా పట్టానీ ప్రాంతంలోని సాంస్కృతిక, వ్యవసాయ కేంద్రాలను సందర్శించి సుస్థిర వ్యవసాయ విధానాలు, పశుపోషణ పద్ధతులను అధ్యయనం చేశారు. అనంతరం ఎస్డీజీ–1 (పేదరిక నిర్మూలన) అంశంపై వివిధ దేశాల విద్యార్థులతో కలిసి చర్చించి తమ ఆలోచనలను పంచుకున్నారు. విద్యార్థినుల ప్రతిభను ఎస్పీఎంవీవీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఉమా వెన్నం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉషా, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి అభినందించారు. -
రాష్ట్ర స్థాయిలో హాకీ జట్టుకు తృతీయ స్థానం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇటీవల గుంటూరులో 16వ రాష్ట్ర స్థాయి జూనియర్ మెన్ హాకీ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల నుంచి హాకీ జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా హాకీ జట్టు అపార ప్రదర్శన కనబరచి తృతీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా గురువారం తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ క్రీడా మైదానంలో తిరుపతి జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి క్రీడాకారులను అభినందించారు. రానున్న రోజుల్లో జిల్లా మొదటి స్థానం సాధించేలా కృషి చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి ఆదిత్య తెలిపారు. హాకీ అసోసియేషన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్కృష్ణ, సీనియర్ డీఎస్ఏ కోచ్ లక్ష్మీకరుణ, కేఐసీ హాకీ కోచ్ ఎం.అశోక్రెడ్డి, సీనియర్ హాకీ క్రీడాకారుడు భీమా, క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా హాకీ జట్టు క్రీడాకారులతో హాకీ అసోసియేషన్ ప్రతినిధులు -
ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థల(ఐటీఐ)లో రెండో దశ ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ కన్వీనర్ గణేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులకు సంబంధించి ఐటీఐఏడీఎంఐఎస్ఎస్ఐఓఎన్ఎస్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉందని, అభ్యర్థులు ఏ ఐటీఐలో చేరదలచుకున్నారో ఆ ఐటీఐలో ఆప్షన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సర్టిఫికేట్ వెరిపికేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 6న, ప్రైవేటు ఐటీఐలో ఆగస్టు 8న ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. అదనపు సమాచారం కోసం 9492861369, 8500021856, 9441647174, 9533717170 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కోడలి నుంచి ప్రాణహాని! తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి – రేణిగుంట మార్గంలో సుమారు 15 ఏళ్ల క్రితం తన కుమారుడు చనిపోయాడని, దీనికి సంబంధించి తమ కోడలికి శిక్ష పడిందని, ఆమె నుంచి ఇప్పుడు ప్రాణహాని ఉందని చంద్రగిరి నియోజకవర్గం, నర్సింగాపురం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు నిరంజన్శెట్టి, శ్యామల ఆవేదన వక్తం చేశారు. గురువారం వారు తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడు సంపాదించిన నగదు, నట్రా వ్యవహారం కోర్టులో నడుస్తోందన్నారు. దీనిపై పరిణామాలు ఎలా ఉంటాయో తెలియడం లేదన్నారు. ప్రస్తుతం తమ జీవన పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. మరోవైపు పొంచి ఉన్న ప్రాణహాని నుంచి కాపాడి కోడలి వద్ద నుంచి తమకు చెందాల్సిన నగదు, బంగారు అప్పగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 31న ఖాళీ గోనె సంచుల ఈ–వేలం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను ఈ నెల 31న ఈ–వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ‘రేట్ కాంట్రాక్ట్‘ ప్రాతిపదికన విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనే వ్యక్తులు, సంస్థలు ఈ నెల 30వ తేదీ సాయంత్రంలోపు కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.30 వేలు ఈఎండీ చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ కొనుగోలు వెబ్సైట్ను సందర్శించవచ్చు. అదనపు సమాచారం కోసం టీటీడీ జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని 0877–2264429 ఫోన్ నంబర్ సంప్రదించాలని టీటీడీ పేర్కొంది. 26న జిల్లా క్రికెట్ జట్టు ఎంపికతిరుపతి ఎడ్యుకేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 26న అండర్–14 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆ మేరకు సీడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసమూర్తి, సతీష్యాదవ్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, వాయల్పాడు, చిత్తూరులో ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. తిరుపతి డివిజన్కు సంబంధించి మంగళం రోడ్డులోని సీవీ క్రికెట్ అకాడమీలో, మదనపల్లి డివిజన్కు సంబంధించి వాయల్పాడులోని జీవీఎస్ఈఎస్ మైదానం, చిత్తూరు డివిజన్కు సంబంధించి చిత్తూరులోని పోలీస్ గ్రౌండ్లో ఈ ఎంపిక ఉంటుందని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే క్రీడాకారులు 01–09–2012 – 31–08–2014 లోపు జన్మించిన వారు అర్హులని, ఆసక్తి ఉన్న వారు ఆయా డివిజన్ల పరిధిలో నిర్వహించే ఎంపికలో ఉదయం 8గంటలకు హాజరవ్వాలని తెలిపారు. అలాగే తెల్లని దుస్తులు, సొంత క్రీడా సామగ్రి, ఆధారు కార్డు, బర్త్ సర్టిఫికెట్ పత్రాలను వెంట తీసుకురావాలని కోరారు. మరిన్ని వివరాలకు 88861 85559, 98665 04500, 90002 14966నంబర్లలో సంప్రదించాలని వారు సూచించారు. అమేజాన్ కంపెనీ బస్సు బోల్తా – తృటిలో తప్పిన పెను ప్రమాదం నాగలాపురం: అమేజాన్ కంపినీకి వెళ్తున్న బస్సు పొలంలోకి బోల్తా పడిన ఘటన మండలంలోని మలిమేలుకండ్రిగ గ్రామంలో బుధవారం రాత్రి 11.30 ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. తమిళనాడు పుదువాయిల్లోని అమేజాన్ కంపినీకి చెందిన బస్సు నాగలాపురంలో ఉద్యోగులను దింపి, తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యంలోని మలిమేలుకండ్రిగ వద్ద బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో ఉద్యోగుల ఎవరూ లేకపోవడం ప్రాణనష్టం తప్పింది. డ్రైవర్ నిద్ర మత్తులోనే బస్సు పొలంలోకి దూసుకెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సునీల్ తెలిపారు. -
జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలు
శ్రీకాళహస్తి: జల్సాలకు అలవాటు పడి వరు చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడితోపాటు ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం.. పట్టణంలోని శ్రీరామ్నగర్ కాలనీలో జూలై 7వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటి గ్రిల్స్, ప్రధాన ద్వారాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం బీరువాలో ఉన్న బంగారు నగలను అపహరించి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి వన్టౌన్ పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వన్ టౌన్ సీఐ సి.వెంకటేష్ ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. జూలై 22న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాలాయపల్లె మండలం, వెంగమాంబాపురానికి చెందిన అక్కుర్తి నవీన్ అలియాస్ లవ్లీ (26), తిరుపతికి చెందిన డేరంగుల జగదీష్ (25) ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితులపై తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు దొంగతనాల కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. నవీన్్పై 24, జగదీష్పై 8 పాత కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 8 గ్రాముల బంగారు గొలుసు, 4 గ్రాముల బరువు గల ఒక జత బంగారు కమ్మలు, చోరీకి వినియోగించిన ఆటో, రెండు ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ.1.2 లక్షలు ఉంటుందన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన వన్టౌన్ సీఐ వెంకటేష్, ఎస్ఐలు రామకృష్ణ, స్వాతి, ఏఎస్ఐలు ఆనందయ్య, గంగయ్య, పోలీసు సిబ్బంది శంకరయ్య, భానుతేజతో పాటు కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, డీఎస్పీ నరసింహమూర్తి అభినందించారు. -
ఆక్రమణల అడ్డగింత
రామచంద్రాపురం: మండల పరిధిలోని పిల్లారికోన గుట్టను తవ్వి చెరువులో పోస్తున్న అక్రమార్కుల బరితెగింపు చర్యను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత రెచ్చిపోయారు. అడ్డుకున్న గ్రామస్తులపై దౌర్జన్యానికి తెగబడ్డాడు. వివరాలు.. నెత్తకుప్పం గ్రామ లెక్క దాఖల సర్వే నం.306, 309లో సుమారు 20 ఎకరాల పిల్లారికోన చెరువు ఉంది. దానికి సంబంధించిన మొరవ వాగును, పరిసర అటవీ భూములను టీడీపీ నాయకుడు మురళి ఆక్రమించాడు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో చెరువులో తవ్వకాలు చేపడుతున్నాడు. దీన్ని స్థానికులు అడ్డుకుని, అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోగా సదరు టీడీపీ నేత గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగాడు. ఈ అక్రమ తవ్వకాల వల్ల వర్షాలప్పుడు గ్రామం ముంపునకు గురయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు పిల్లారికోనలో ఇప్పటికే తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోందని వాపోయారు. స్పందించని అధికారులు ఈ అక్రమాలపై సంబంధిత అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదన్నారు. సంబంధిత కలెక్టర్ స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ప్రయివేటు పరం
పుల్లంపేట: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రైవేటు రాష్ట్రంగా మార్చేస్తోందని మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం మండల పరిషత్ అధ్యక్షుడు ముద్దా.బాబుల్రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన ఆయన కాసేపు సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ప్రైవేటుపరం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టుందని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థుల చదువులతో పాటు పేదల వైద్యం కోసం వేలకోట్లు ఖర్చు చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను నిర్మిస్తే ఆయా కళాశాలలను ప్రైవేటుపరం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని పది ఆర్టీసీ బస్టాండ్లను ప్రైవేటుపరం చేశారని చెప్పారు. బ్రిటీష్ హయాంలో 1907లో ఏర్పడిన రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటు పరం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటుపరం చేయడం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆస్తులను తన వారికి దోచిపెట్టడానికే వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మించిన పోర్టులు, ఫిష్షింగ్ హార్బర్లను సైతం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినా మహిళగా ఉన్న హోంమంత్రి స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రానికి 28 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, 23 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.6 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, అందులో కొన్ని ఇప్పటి వరకూ చాలాభాగం నిధులు గ్రౌండింగ్ కాలేదని కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటన విడుదల చేసిందని గుర్తుచేశారు. నిత్యం అబద్ధాలు, మోసాలు, కుట్రలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్ల హామీలు ఇంతవరకు నెరవేరలేదని చెప్పారు. ఆయన వెంట రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి.అమరనాథరెడ్డి, మాజీ శాసనసభ్యుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, మాజీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డి, సుదర్శన్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ సయ్యద్ ముస్టాక్, జెడ్పీటీసీ సభ్యులు రామనాథం, సీనియర్ నాయకులు విజయ్కుమార్రెడ్డి, ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి, రంజిత్రెడ్డి, తల్లెం.భరత్కుమార్రెడ్డి, నళినీరెడ్డి, రంగారెడ్డి, రాంబాబు పాల్గొన్నారు. -
ఆరుతడులుగా నీళ్లు పెట్టుకోవాలి
శ్రీకాళహస్తి రూరల్ : ఎల్నినో ప్రభావంతో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయని, తద్వారా వరి రైతులు ఇక నుంచి ఆరు తడులుగా నీళ్లు పెట్టుకోవాలని ఆచా ర్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రతిమ, డాక్టర్ సంధ్యారాణి తెలిపారు. గురువారం మండలంలోని కొత్తూరు, ఏర్పేడు మండలంలోని దుర్గిపేరి రెవెన్యూ పరిధిలో వారు పంట పొలాల ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడు తూ మే, జూన్ నెలల్లోనే పంటలు సాగు చేశామని, కానీ అనూహ్యంగా బోర్లలో నీరు తగ్గటం వల్ల పంటలు ఎండుముఖం పట్టాయని తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట పిలకదశ నుంచి పరిపక్వత దశలో ఉందన్నారు. ప్రధానంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని, ఇక నుంచి ఆరుతడులుగా నీళ్లు పెట్టుకోవాలని సూచించారు. ఈ సీజన్లో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు కామన్ సర్వీస్ సెంటర్లో వరి పంటకు ఎకరాకు రూ.160 చెల్లించి బీమా చేయించుకోవాలని సూచించారు. వారి వెంట తిరుపతి సహాయ వ్యవసాయ సంచాలకులు ధనుంజయరెడ్డి, శ్రీకాళహస్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (రెగ్యులర్) పి.రమేష్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మమతారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మైసూర్ రాజ కుటుంబానికి చెందిన డాక్టర్ ప్రమోదదేవి వాడియర్, మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వాడియర్, టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్తో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లుచేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. -
కొనుగోలు స్థలంపై రాజకీయం తగదు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తమ స్వాధీనానుభవంలో ఉన్న స్థలంపై రాజకీయం చేయడం సరికాదని డాక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుచానూరు సమీపంలో తనపల్లి, నల్లమానికాల్వ గ్రామ లెక్కదాఖలా సర్వే నం.4/2లోఏలో 0.53 సెంట్లు స్థలాన్ని 2008 రామ్ప్రసాద్రెడ్డి భార్య పి.విజయకుమారి దగ్గర నుంచి తన భార్య బి.రాధిక పేరుపై కొనుగోలు చేశామన్నారు. అప్పటి నుంచి తమ స్వాధీనానుభవంలో ఉందన్నారు. అయితే తమ స్థలానికి ఆనుకొని కొంత పోరంబోకు స్థలం ఉందని, ఆ స్థలాన్ని కూడా తన భార్య రాధికకు 2014 లోనే పి.విజయకుమారి విక్రయపత్రం ద్వారా రాసిచ్చిందన్నారు. కాగా ఈ స్థలంలో తాను ఈనెల 20వ తేదీన కాంపౌండ్ వాల్ నిర్మించుకునే సమయంలో విజయకుమారి భర్త రామ్ప్రసాద్రెడ్డి, ఆమె కుమారుడు సుజన్కుమార్ రెడ్డి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ భూమికి సంబంధించి ఏ పార్టీకి గాని, ఏ రాజకీయ నాయకునికి గానీ సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. -
హనుమాన్ విగ్రహం చోరీ.. మాయం చేసింది టీడీపీ నేతనే!
సాక్షి,తిరుపతి: తిరుమల కొండపై కలకలం రేపిన అంజనేయస్వామి విగ్రహం చోరీ కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న హనుమాన్ చిన్న విగ్రహాన్ని అపహరించిన వ్యక్తిని రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.తిరుమలలో అపచారానికి పాల్పడి విగ్రహాన్ని చోరీ చేసిన నిందితుడు విశాఖపట్నం జిల్లా, భీమిలి నియోజకవర్గం, టి. నగరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత పొట్నూరు యశ్వంత్గా దర్యాప్తులో తేలింది. నిందితుడు యశ్వంత్కు టీడీపీలోని కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్,గంటా శ్రీనివాసరావు సహా పలువురు పార్టీ ముఖ్య నేతలతో యశ్వంత్ దిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. -
మీ దౌర్జన్యాలకు నేను భయపడను.. వెనక్కి తగ్గను: భూమన
తిరుపతి: సీమ జిల్లాల్లో ముఠా కక్షదారులు శత్రువులు ఆస్తులు ధ్వంసం చేసి సంతప్తి చెందిన మాదిరిగా తమ కుటుంబ ఆస్తులపై చంద్రబాబు దాడి చేసి తృప్తి పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబును వ్యతిరేకించేవారిని టార్గెట్ చేసి వారి కుటుంబ ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమాలకు కూటమి నేతలు దిగారని భూమన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఎత్తి చూపుతున్న కారణంగా ద్వేషంతో, ప్రతీకార పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. తన ఆస్తులు విధ్వంసం చేసినంత మాత్రాన తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు భూమన. ‘21 ఏళ్ల క్రితం ఈ ఆస్తులు కొనుగోలు చేశాం.. రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి, మీరు సీఎం గా ఉన్నప్పుడు కనిపించలేదా?, నా వాణి బలంగా వినిపిస్తున్నందుకే ఈ కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు. నేను అవినీతి మోసాలు చేసినవాడ్ని కాదు.తిరుపతిలో రౌడీ రాజకీయాలు ఏనాడు అవకాశం ఇవ్వలేదు. జీవితం అంతా విలువలతో రాజకీయాలు చేసిన వాడ్ని. నా ఆస్తులు విధ్వంసం చేసినంత మాత్రాన నేను వెనక్కి తగ్గను. నేను ఆశయాలతో బ్రతికేవాడ్ని, ఆశలతో బ్రతికే వాడిని కాదు. నేను అన్నిటికి సిద్ధం..మా కుటుంబ ఆస్తులు ధ్వంసం చేసినా నీ తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటా. 1991 లో ప్రారంభించిన హెరిటేజ్ కూడా నది పోరంబోకు స్థలంలోనే ఉంది. నా కుటుంబ ఆస్తులు దాడి చేయడం ద్వారా నాకు మరింత ఉత్సాహంగా మీ తప్పులను ఎత్తి చూపిస్తా’ అని హెచ్చరించారు. -
తిరుపతిలో మరో భూ కబ్జా
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతిలో వృద్ధ దంపతుల భూమిని టీడీపీ నేత కబ్జా చేసిన వ్యవహారం మరువక ముందే.. మరో టీడీపీ నేత భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్దనున్న తమ స్థలాన్ని తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ కబ్జా చేశారని చంద్రగిరి నియోజకవర్గం రంగంపేట పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్రెడ్డి భార్య, టీడీపీ మహిళా కార్యకర్త, మునిరాజమ్మ ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వద్దకు ఐదుసార్లు వెళ్లినా స్పందనలేదంటూ బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. భూ కబ్జా నుంచి తమకు న్యాయం చేయాలంటూ రెండు చేతులు జోడించి కన్నీటితో వేడుకున్నారు.ఆమె ఇంకా ఏమన్నారంటే.. 2017లో తిరుచానూరు రోడ్డు మార్కెట్ యార్డు సమీపంలోని సర్వే నెంబరు 252/2ఏ లోని 80 సెంట్ల భూమిని రూ.మూడున్నర కోట్లకు కోనుగోలు చేశాం. ఆన్లైన్ రికార్డుల్లో మా పేరు ఉంది. అనంతరం కొద్దిరోజుల పాటు విదేశాల్లోని మా కుమార్తె వద్దకు వెళ్లాం. ఆ సమయంలో స్థలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని మేము అడ్డుకునే ప్రయత్నం చేశాం. అయితే, స్థలం వద్ద జేబీ శ్రీనివాస్ మనుషులు వచ్చి మాపై దాడులు చేయడంతో పాటు ‘ముసలామెను గోతిలో పూడ్చిపెట్టండి.. చంపేయండి’.. అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా పట్టించుకోవడంలేదు. 40 ఏళ్లుగా టీడీపీలో ఉంటున్న మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. మా స్థలంలోని కరెంట్ మీటర్ను దౌర్జన్యంగా తొలగించారు. జేబీ శ్రీనివాస్ వద్దకెళ్లి మా స్థలాన్ని ఇవ్వాలని ప్రాథేయపడినా పట్టించుకోలేదు. -
తిరుమలలో దారుణం
తిరుమల: తిరుమల–తిరుపతి మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద భక్తులు నిత్యం పూజలు నిర్వహించే ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం వేకువజామున అపహరించడం కలకలం రేపింది. ఈ ఘటనతో టీటీడీ భద్రతా వ్యవస్థ, విజిలెన్స్ విభాగం రాత్రి గస్తీ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఉదయం పూజల కోసం వచ్చిన స్థానికులు, భక్తులకు విగ్రహం కనిపించకపోవడంతో వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తుల కదలికలను గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. విగ్రహాన్ని వాహనంలో తరలించారా? లేక కాలినడకన తీసుకెళ్లారా? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.తిరుమలలో 24 గంటలపాటు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆంజనేయస్వామి విగ్రహం మాయం కావడం భద్రతా వ్యవస్థ సమర్థతపై సందేహాలకు తావిస్తోంది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్డులోని చిన్న దేవాలయాలు, విగ్రహాలు, మండపాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచిస్తున్నారు.పోలీసుల అదుపులో నిందితుడు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, ఇతర కీలక సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు విశాఖపట్నానికి చెందిన పి.జస్వంత్గా గుర్తించారు. నిందితుడి నేపథ్యం, విగ్రహం స్వా«దీనం తదితర అంశాలపై తిరుపతి జిల్లా పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పోలీసులు అలా ఎందుకు చెప్పారు? హనుమాన్ విగ్రహం చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విగ్రహాన్ని త్వరలోనే స్వా«దీనం చేసుకుని బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు పూర్తి స్థాయి నివేదిక కోరినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి తిరుపతి జిల్లా పోలీసులు విడుదల చేసిన ప్రకటనపై పలు ప్రశ్నలు, సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక అడుగు ఎత్తున్న హనుమాన్ రాతి విగ్రహాన్ని జూలై 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో గోవిందమాల ధరించిన ఓ భక్తుడు తీసుకెళ్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పోలీసులు, టీటీడీ విజిలెన్స్తో కలిసి 10 ప్రత్యేక బృందాల ద్వారా ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటన ఎక్కడికి దారితీస్తుందోనని ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. ఈ విగ్రహం పురాతనమైనది కాదని చెప్పే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విగ్రహాన్ని కొందరు భక్తులు 2000 సంవత్సరం తర్వాత ప్రతిష్టించారని ప్రత్యేకించి చెప్పడంలో ఉద్దేశం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన టీటీడీ నిఘా, భద్రత వ్యవస్థలో డొల్లతనాన్ని మరోమారు ఎత్తి చూపింది. -
స్పోర్ట్స్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
తిరుపతి అర్బన్: రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్లో జిల్లా సమగ్రశిక్ష–సహిత విద్య విభాగానికి చెందిన సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులు సత్తాచాటారని ఐఈ కో ఆర్టినేటర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా అగిరిపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా స్పార్ట్స్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఏడు కాంస్య పతకాలను దక్కించుకున్నారని వెల్లడించారు. జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి అర్బన్ మండలం ఎస్ఎన్పురం జెడ్పీ హైస్కూల్కి చెందిన కే.ముని మూడు విభాగాల్లో ప్రతిభ చూపి మూడు కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. అలాగే శ్రీకాళహస్తి మండలం ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ హైస్కూల్కు చెందిన పి.చరణ్ కాంస్య పతకం, తిరుపతి అర్బన్ మండలం ఎంజీఎం స్కూల్ హిమబిందు, జ్ఞానేష్ ఉత్తమ ప్రతిభ చూపారని చెప్పారు. చంద్రగిరి మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నందకిషోర్ 400 మీటర్ల రన్నింగ్లో ఉత్తమ ప్రతిభ చూపాలని వివరించారు. ఐఈఆర్పీలు వెంకటరమణ, జ్ఞానమ్మ పాల్గొన్నారు. -
అట్రాసిటీ కేసులకు పరిష్కారం చూపండి
తిరుపతి అర్బన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆయన బుధవారం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివరించారు. అలాగే సివిల్ రైట్స్ డే క్రమం తప్పకుండా నిర్వహించాలని చెప్పారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు ఇంటి స్థలాలు, భూ సమస్యలు, బీఆర్ అంబేడ్కర్ భవన నిర్మాణం తదితర అంశాలకు పరిష్కారం చూపాలని కోరారు. నివాస ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందులో డీఆర్వో నరసింహులు, సత్యవేడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే లు కోనేటి ఆదివాలం, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, అడిషనల్ ఎస్సీ శ్రీనివాసులు, డీఎస్పీలు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, విభాగాల వారీగా హెచ్వోడీలు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ -
ఘనంగా రైతు దినోత్సవం
రేణిగుంట: మండలంలోని కరకంబాడి సమీపంలో ఉన్న రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం కోకా కోలా ఇండియా ఫౌండేషన్ సహకారంతో జాతీయ మామిడి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావ్, రాస్ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటరత్నం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరు రైతులు, అధికారులు చేపట్టిన వ్యవసాయ ప్రదర్శనను సందర్శించారు. జేసీ మాట్లాడుతూ కోకాకోలా ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఉన్నతి మ్యాంగో పథకం ద్వారా జిల్లాలోని రైతుల ఆదాయం పెంచడానికి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విదేశాలకు ఎగుమతి అయ్యేలా మామిడి ఉత్పత్తులను తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ శ్రీనివాసులు, ఉద్యాన శాస్త్రవేత్త సుధాకర్, జిల్లా ఉద్యాన అధికారి జయభరత్రెడ్డి, రాష్ట్ర సామాజిక ప్రకృతి వ్యవసాయ పథకం సంచాలకులు షణ్ముగం, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల సమస్యపై సమావేశం వాయిదా
తడ: పులికాట్ సరస్సులో చేపల వేటపై ఆంధ్ర, తమిళనాడు జాలర్ల మధ్య తరచూ ఘర్షణ జరుగుతోంది. ఈ వివాదాల పరిష్కారం కోసం ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు జిల్లాలఽ ఉన్నతాధికారులు గురువారం తడలో నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చొరవతో తిరువళ్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుపతి జిల్లా ఎస్పీ, ఇతర ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టారు. దీనికి తిరువళ్లూరు అధికారులు సమ్మతించారు. బుధవారం సాయంత్రం తమిళనాడులో అత్యవసర సమావేశం ఉండడంతో అధికారులు రావడం లేదన్న సమాచారం అందజేశారు. దీంతో సమావేశం వాయిదా పడినట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. గతంలో జరిగిన గొడవలకు సంబందించిన కేసులో ఆంధ్రా పరిధిలోని మత్స్యకారులు పదేళ్లుగా తిరువళ్లూరు కోర్టుకు తిరుగుతున్నారు. ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగితే తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కారమవుతాయని ఎదురు చూసిన జాలర్లకు నిరాశ ఎదురైంది. చోరీ కేసులో ముమ్మర దర్యాప్తు నాగలాపురం: పిచ్చాటూరు మండలం సిద్దిరాజు కండ్రిగ పంచాయతీ అగ్రహారంలో మాజీ సర్పంచ్ జయచంద్ర నాయుడు ఇంట్లో మంగళవారం భారీ చోరీ జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆదేశాల మేరకు పుత్తూరు సీఐ రవీంద్ర, పిచ్చాటూరు ఎస్ఐ రాఘవేంద్ర, తిరుపతి క్లూస్ టీం బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంట్లోని సీసీటీవీ పుటేజీని పరిశీలించి ఇంటి యజమాని జయచంద్ర నాయుడు, పని మనిషి సహా అందరినీ విచారించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. ఓట్లు పోతాయన్న ఆందోళన వద్దు తొట్టంబేడు: తమ ఓట్లు పోతాయని ఎవరూ ఆందోళన చెందొద్దని తొట్టంబేడు డిప్యూటీ తహసీల్దార్ జీవన్ కుమార్ తెలిపారు. మండలంలోని పూడి పంచాయతీలో బతికి ఉన్న ఒక మహిళ చనిపోయినట్లు ఓటరు జాబితాలో పేర్కొన్నారు. దీనిపై సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. స్పందించిన తహసీల్దార్ భారతి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ జీవన్ కుమార్ను ఆదేశించారు. ఆయన గ్రామానికి వెళ్లి పోలింగ్ స్టేషన్ 263కు సంబంధించిన బీఎల్ఏల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎం.మునమ్మ పేరుతో ఇద్దరు ఉన్నారని తెలిపారు. వారిలో ఒకరికి 66 ఏళ్లు, మరొకరికి 54 ఏళ్లు ఉన్నాయని, 66 ఏళ్లున్న ఉన్నవారి వివరాలు మరణించిన వారి జాబితాలో ఉన్నాయని తెలిపారు. 54 ఏళ్ల వయస్సు ఉన్నవారు ప్రస్తుతం యాక్టివ్ ఓటర్గా ఉన్నారని వివరణ ఇచ్చారు. ఎవరి ఓటునూ తొలగించలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీఆర్వో (బీఎల్వో) భాగ్యశ్రీ, ఎలక్షన్ ఆపరేటర్ సురేష్, వీఆర్ఏలు హరి, శివ, టీడీపీ బీఎల్ఏ ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ బీఎల్ఏ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రూ.41 లక్షలకు మహిళ ఐపీ తిరుపతి లీగల్ : తిరుపతి నగరంలోని కొర్లగుంట మారుతీనగర్కు చెందిన బి.కళ్యాణి అనే మహిళ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో రూ.41 లక్షలకు ఐపీ దాఖలు చేసినట్టు ఆమె తరపు న్యాయవాది జి.వెంకటకుమార్ తెలిపారు. ఫిర్యాదులోని వివరాల మేరకు... పిటిషనర్ కళ్యాణి తన తల్లి అనారోగ్యం పాలుకావడంతో చికిత్స నిమిత్తం రాధ అనే మహిళ వద్ద రూ.ఐదు లక్షలను అప్పుగా తీసుకున్నారు. పది నెలలు వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఆమె వద్ద ప్రైవేటు చిట్టీలు వేశారు. చీటీ పాడిన సొమ్మును వడ్డీలకు జమ చేస్తూ అసలు చెల్లించాలంటూ రాధ చెబుతూ వచ్చారు. కళ్యాణి వద్ద రాధ, ఆమె భర్త కాళీ ప్రోనోట్లు, చెక్కులలో సంతకాలు తీసుకున్నారు. ఆమె బాగానికి వచ్చిన ఇంటిని విక్రయించగా వచ్చిన రూ.20 లక్షలను కూడా రాధ తీసుకున్నారు. ఇంకా సొమ్ము చెల్లించాలంటూ రాధ, ఆమె భర్తతో పాటు మరికొంతమంది కళ్యాణిని వేధిస్తూ వచ్చారు. కళ్యాణికి ఎటువంటి ఆధారం లేక సొమ్ము చెల్లించలేని స్థితిలో ఐపీ దాఖలు చేసినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. ఐదుగురిని ఆమె ప్రతివాదులుగా తెలిపారు. -
తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం
తిరుమల: తిరుమలలో బుధవారం పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నరేష్, దర్శన్, పేష్కార్ రామ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
552 హెక్టార్లలో జీడి మామిడి తోటలు ఉన్నాయి
సత్యవేడు ప్రాంతంలో ప్రస్తుతం 552 హెక్టార్లలో జీడిమామిడి తోటలు ఉన్నాయి. అటవీ ప్రాంతం అభివృద్ధిలో ఎక్కడా నిర్లక్ష్యం లేదు. అనుకూల పరిస్థితులను బట్టి తోటల పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్నాం. యూకలిప్టస్, క్లోన్స్ రకం తైలం చెట్లను ఈ ప్రాంతంలో నాటడంతో ఆరేళ్లకు ఓసారి కట్టింగ్ చేస్తున్నారు. వాటిని తమిళనాడులోని ఒక పరిశ్రమ, శ్రీకాళహస్తి సమీపంలోని మరో పరిశ్రమకు సరఫరా చేస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో గ్రీనరీ, స్థానికులకు ఉపాధి, ఆదాయం పరంగా రాబడిని సంస్థకు చేకూరుస్తూ ఎక్కడా ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నాం. – బ్రహ్మయ్య, డివిజనల్ మేనేజర్, ఏపీఎఫ్డీసీ, సత్యవేడు డివిజన్ -
టీడీపీ జిల్లా అధ్యక్షురాలి తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
● డ్వాక్రా సంఘ సభ్యులతో సమీక్షపై మండిపాటు ● తనకు మాటైనా చెప్పకపోవడంపై అధికారులను తప్పుపట్టిన ఎమ్మెల్యే తిరుపతి తుడా: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాకలక్ష్మి వ్యవహార శైలిపై తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అసంతృప్తి వ్యక్తంచేశారు. పనబాక లక్ష్మి మంగళవారం తిరుపతి మెప్మా పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులతో తిరుపతిలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆరణి శ్రీనివాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో నగర అభివృద్ధితోపాటు వివిధ శాఖలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మెప్మాపై సమీక్ష జరిగే క్రమంలో పనబాకలక్ష్మి నిర్వహించిన సమీక్షపై ఆరాతీశారు. సమీక్ష విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఈ విషయంపై కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఆ సమీక్ష గురించి తమకు కూడా తెలియదని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. దీనిపై మెప్మా సీఎంఎం కృష్ణవేణి మాట్లాడుతూ పీడీ ఆదేశాల మేరకు కొన్ని డివిజన్ల పరిధిలోని డ్వాక్రా సంఘం సభ్యులను పంపినట్లు చెప్పారు. కమిషనర్కు, డిప్యూటీ కమిషనర్కు, ఎమ్మెల్యేకి కూడా తెలియకుండా మీరు సమీక్ష ఎలా నిర్వహిస్తారు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపైన ఇలాంటివి పునరావృతం కాకూడదని ఎమ్మెల్యే సున్నితంగా హెచ్చరించారు. -
9వ బెటాలియన్ తనిఖీ
వెంకటగిరి రూరల్ : మండలంలోని 9వ బెటాలియన్ను బుధవారం కర్నూల్ రేంజ్–11 డీఐజీ డి.ఉదయభాస్కర్ తనిఖీ చేశారు. ఆయనకు కమాండెంట్ ఈఎస్ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆయన ప్రధాన కార్యాలయం, భెల్ ఆఫ్వర్క్, ఎంట్రీ గ్రూపులను పరిశీలించారు. బీడబ్ల్యూవో స్పోర్ట్స్, యూనిట్ క్యాంటీన్, యూనిట్ వైద్యశాల, కంపెనీ కార్యాలయాలను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, యూనిట్ సమగ్ర పనితీరుపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎన్హెచ్ విజయ్ ఆనంద్, ఖన్నా, రామకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సులోచన పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరిస్తున్న డీఐజీ ఉదయ భాస్కర్ -
తిరుమలలో మరో వివాదం
తిరుమల: శ్రీవారి క్షేత్రంలో రాజకీయ, సినిమా, వాణిజ్య ప్రచారాలపై నిషేధం అమలులో ఉంది. ఒక మహిళ పెద్ది సినిమా పోస్టర్ను పట్టుకుని అలిపిరి నడకమార్గంలో పాదయాత్ర చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై అధికారికంగా స్పష్టత లేదు. వైరల్ అవుతున్న చిత్రాల్లో మహిళ చేతిలో భారీ ‘పెద్ది’ సినిమా పోస్టర్ను పట్టుకుని అలిపిరి నడకమార్గంలో కనిపించింది. అలాగే మోకాళ్ల పర్వతం గోపురం సమీపంలో పోస్టర్తో ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో సినిమా, రాజకీయ లేదా వాణిజ్య ప్రచారాలకు టీటీడీ అనుమతి ఇవ్వదు. ఇలాంటి నిషేధాలు అమలులో ఉన్నప్పటికీ పోస్టర్తో నడకమార్గంలో పాదయాత్ర చేయడం ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఇంత పెద్ద పోస్టర్తో మహిళ నడిచినా భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ లేదా విజిలెన్స్ విభాగం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఘటన జరిగిన తేదీ, మహిళ వివరాలు, ఆమె పోస్టర్తో నడకమార్గంలోకి ఎలా ప్రవేశించిందనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోల ఆధారంగానే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. -
జీడి తోటలు మాయం
జీడీ తోటలు మాయంసత్యవేడు మండలం వానెల్లూరు ప్రాంతంలో ఉన్న జీడిమామిడి తోట ఒకప్పుడు సత్యవేడు పేరు వింటేనే గుబాళించే జీడిమామిడి సువాసనలు... నాణ్యమైన దిగుబడులతో పచ్చని పసిడి పంటగా విరబూసిన ఆ తోటలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వేలాది ఎకరాల్లో కళకళలాడిన జీడిమామిడి వనాలు నేడు ఉనికికే పరీక్షగా మారి కనుమరుగవుతుంటే, సంబంధిత అటవీ శాఖ అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు. తోటల పునరుద్ధరణపై కనీస శ్రద్ధ చూపకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జీవనోపాధి కోల్పోయిన కూలీలు ఆవేదనతో లబోదిబోమంటున్నా అటవీ అధికారుల పట్టింపులేనితనం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది. వరదయ్యపాళెం: సత్యవేడు, వరదయ్యపాళెం పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు జీడిమామిడి తోటలు విరివిగా ఉండేవి. సీజన్లో ఈ తోటల ద్వారా వచ్చే జీడిమామిడి పండ్లు చైన్నె, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలలోని పండ్ల మార్కెట్లకు పెద్దఎత్తున వెళ్లేవి. అంతేకాక పండ్లతో పాటు వచ్చే జీడిపప్పు గింజలకు గిరాకీ ఉండేది. తద్వారా బయట ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఎగబడి మరీ జీడిమామిడి గింజలను కొనుగోలు చేసేవారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన జీడిమామిడి పంట నేడు సత్యవేడు ప్రాంతంలో అంతరించిపోయింది. 1975 నుంచి జీడిమామిడి పంట సాగు: సత్యవేడు డివిజన్ అటవీ అభివద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో 1975 నుంచి జీడిమామిడి పంట 5400 హెక్టార్లలో సాగయ్యేది. అడవికండ్రిగ, అరుదూరు, రాచర్ల, చిలమత్తూరు, వానెల్లూరు, కొత్తమారికుప్పం, అంజూరు, ఆంబాకం, టీపీపాళెం, రాజులకండ్రిగ, రాజుగుంట, సత్యవేడు, ఓబులరాజుకండ్రిగ, కాంబాకం, బత్తవల్లం ప్రాంతాల్లో జీడిమామిడి తోటలు సాగయ్యేవి. ప్రస్తుతం కొత్తమారికుప్పం, రాజులకండ్రిగ, రాజుగుంట, బత్తలవల్లం, కాంబాకం గ్రామాలకే పరిమితమయ్యాయి. ఈ తోటలను అధికారులు పర్యవేక్షించేవారు. కాపు వచ్చే సమయంలో బహిరంగ వేలం ద్వారా రైతులు, వ్యాపారులకు పంటను అప్పగించేవారు. ఏడాదికి రూ.కోటికి పైగా ఏపీఎఫ్డీసీకి ఆదాయం వచ్చేది. కూలీలకు సైతం చేతినిండా పని లభించేది. తర్వాత అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో తోటల నిర్వహణ భారంగా మారింది. ప్రస్తుతం ఈ పంట సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల పరిధిలో 500 హెక్టార్లకే పరిమితమైంది. మిగిలిన చోట్ల జీడిమామిడి తోటలకు బదులు తైలం తోటలను సాగు చేస్తున్నారు. అటవీశాఖ అశ్రద్ధ జీడిమామిడి తోటలు అంతరించిపోవడానికి అటవీశాఖ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. గతంలో తోటల నిర్వహణపై అటవీ సిబ్బంది సరైన శ్రద్ధ చూపలేదని వాపోతున్నారు. ఈ పంట ద్వారా ఏడాదిలో 5 నెలలు వేలాది మందికి ఉపాధి లభించేది. తైలం చెట్ల పెంపకం ద్వారా ఉపాధి సైతం కోల్పోయామని కూలీలు ఆందోళన చెందుతున్నారు. సత్యవేడులో అంతరిస్తున్న జీడి మామిడి తోటలు అంచెలంచెలుగా తొలగింపు తోటల నుంచి దిగుబడి తగ్గుముఖం పట్టడం, ఆశించిన స్థాయిలో పంట రాకపోవడం తదితర కారణాలతో 1997 నుంచి పంటల తొలగింపును అంచెలంచెలుగా చేపట్టారు. వాటి స్థానంలో యూకలిప్టస్, క్లోన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. జీడి మామిడి తోటలను తొలగించడంతో కూలీలకు ఉపాధి కరువైంది. -
శాస్త్రోక్తంగా రాజసూయ యాగం
శ్రీకాళహస్తి: పట్టణంలోని చైన్నె రోడ్డులో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాజసూయ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామికి వివిధ అభిషేకాలు, పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను చప్పరాలపై అధిష్టించి గ్రామంలో ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. డీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు – వచ్చే నెల 6 వరకు గడువు తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల కాలవ్యవధిగల డిఫార్మసీ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వై.ద్వారకనాథ్రెడ్డి తెలిపారు. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తిగల గల వారు బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఆగస్టు 6వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9908857585, 9966761446, 9550690007 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 82,105 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,484 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
తిరుమల ఘాట్లో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ
● ఆందోళన చెందుతున్న శ్రీవారి భక్తులు ● టీటీడీ నిఘా వ్యవస్థపై తీవ్ర విమర్శలు సాక్షి టాస్క్ఫోర్స్: తిరుమలలో పరిధిలో మరో ఘోర అపచారం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డు ఏడో మైలు వద్ద నిత్యం పూజలు అందుకునే చిన్న శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుమలలో చోటు చేసుకుంటున్న ఘటనలు చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద చిన్న ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్ర పాలకుడిగా భావించి భక్తులు పూజలు చేస్తున్నారు. ఈ మధ్యే హనుమాన్ జయంతి రోజు టీటీడీ ఉన్నతాధికారులు ఆర్భాటంగా ఆంజనేయుడి ప్రతిమకు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కాలినడకన వెళ్లి వచ్చే భక్తులు.. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ చిన్న ఆంజనేయ స్వామిని వాహనాల్లో ప్రయాణించే వారు ఇక్కడ ఆగి పూజలు చేస్తుంటారు. ఈ విగ్రహాన్ని చూసే పీవీఆర్కే ప్రసాద్ పెద్ద ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించారని పెద్దలు చెబుతున్నారు. అలా నిత్య పూజలు అందుకునే చిన్న ఆంజనేయస్వామి ప్రతిమ చోరీకి గురైంది. అర్ధరాత్రి దాటాక ఓ వ్యక్తి విగ్రహాన్ని సంచిలో వేసుకుని ఎత్తుకెళ్లాడు. అత్యంత ప్రతిష్టాత్మక తిరుమల శ్రీవారి చెంతనే ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి భద్రత లేకపోవడంపై భక్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలి, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యంపై ద్వజమెత్తారు. నిఘా వ్యవస్థ ఏమైనట్టు? టీటీడీ నిఘా వ్యవస్థకు అత్యంత పటిష్టమైనదిగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తిరుమల పవిత్రతను కాపాడడంలో టీటీడీ ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ కీలక పాత్రపోషిస్తోంది. అటువంటి నిఘా వ్యవస్థ కొంత కాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అలిపిరి టోల్ గేటు నుంచి తిరుమలకు వెళ్లే వాహనాల్లో నిషేధిత వస్తువులు కొండపైకి తీసుకెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆలయ పరిసరాల్లో పలుమార్లు నిషేధిత వస్తువులు పట్టుబడడంమే ఇందుకు నిదర్శనం. శ్రీవారికి రక్షణగా నిలబడిన క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి విగ్రహాన్నే చోరీ తీసుకెళుతున్నా నిఘా వ్యవస్థ పసిగట్టలేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా టీటీడీ వివాదాస్పదం అవుతూనే వుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించి నెలల తరబడి దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీవేంకటేశ్వరునికి అతి సమీపంలో.. వేలాది మంది పూజలు అందుకునే పరమ పవిత్రమైన ఆంజనేయస్వామి విగ్రహమే దొంగతనానికి గురవ్వడాన్ని భక్తులు మహాపచారం, ఘోరం, మహాపాపంగా భావిస్తున్నారు. -
రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపు
తిరుపతి సిటీ: నీట్ పేపర్ వరుస లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. ఈ మేరకు ఎస్వీయూలో బుధవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ిపీడీఎస్యూ, పీడీఎస్ఓ, ఎన్ఎస్యూఐ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని తీర్మానించారు. నాయకులు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిన ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల చలో పార్లమెంట్ కార్యక్రమంలో లక్షలాది మంది యువత శాంతియుతంగా పాల్గొన్నారని, వారిని చర్చలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్ర విద్యార్థి సంఘాల పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో శుక్రవారం బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు ప్రవీణ్ కుమార్, చిన్న, అక్బర్, పవిత్ర, మల్లికార్జున, బాలాజీ, వినోద్, అశోక్, రవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లికి వందనం.. మళ్లీ నిరుత్సాహం
అడ్డగోలు నిబంధనలతో పలువురికి అందని పథకం ఎన్నికల ముందు అర్హులైన అందరికీ తల్లికి వందనం పథకాన్ని అందజేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున నగదు బదిలీ చేస్తామని గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకాన్ని అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. దీనికితోడు పలు నిబంధనలు పెట్టారు. దీంతో అనేక మంది అర్హులకు పథకం అందలేదు. గత ఏడాదికంటే ఈ సారి మరింతమందిని అనర్హుల జాబితాలో చేర్చడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతి అర్బన్: తిరుపతి జిల్లాలో 2026–27 ఏడాదికి సంబందించి 2,42,089 మంది పిల్లలను మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులుగా అధికారులు తేల్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల వద్ద నోటీస్ బోర్డులో అర్హుల జాబితాను, మరోవైపు అనర్హుల జాబితాను ప్రచురించారు. ఒక్క కుటుంబంలో ఒక్క విద్యార్థి ఉన్నవారు 93,300 మంది, ఇద్దరు పిల్లలు ఉన్నవారు 71,574 మంది, ముగ్గురు పిల్లలు ఉన్నవారు 9793 మంది, నలుగురు పిల్లలు ఉన్నవారు 606, ఐదుగురు పిల్లలు ఉన్న వారికి 42 మందికి, ఆరుగురు పిల్లలు ఉన్న నాలుగు కుటుంబాలకు తల్లికి వందనం జాబితాలో అర్హులుగా ఉన్నట్లు వెల్లడించారు. అడ్డగోలు నిబంధనలు పేద కుటుంబాలకు చెందిన వందలాది మంది విద్యార్థుల పేర్లు అర్హుల జాబితాలో లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అడ్డదిడ్డమైన కారణాలు చూపడంపై మండిపడుతున్నారు. ప్రధానంగా విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడారని, అలాగే కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించారని, పట్టణ ప్రాంతాల్లో 1000 అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉందని, కుటుంబానికి నెలసరి ఆదాయం రూ.12 వేలకంటే ఎక్కువ ఉందని తెలిపారు. నాలుగు చక్రాల వాహనం ఉందని, రైస్ కార్డు లేదని, తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చెప్పే వాటిలో తమకు లేవని, తాము ఆదాయపు పన్ను ఎక్కడ కడుతున్నామో చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించడానికే ఇలా నిబంధనలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పరిశీలించి అర్హులకు పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. -
ఆరోగ్యశాఖలో
ప్రతి పనికీ సపరేటు టీం.. అడిగినంత ఇవ్వాల్సిందే సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని కామవాంఛ తీర్చాలని వేధింపులకు గురిచేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళా ఉద్యోగినికి ఎదురైన ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్న విషయం వెలుగులోకి రావడంతో కార్యాలయంలోని కొందరు ‘పిశాచాల’ బాగో తం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ ఒక్క మహిళా ఉద్యోగి కాకుండా మరింత మంది బాధితులు ఉన్నారనే ప్రచారం గుప్పుమంటోంది. అంతా వారి కనుసన్నల్లోనే.. పక్క జిల్లా నుంచి డిప్యుటేషన్పై తిరుపతికి వచ్చిన ఓ అధికారి తన అనుచరుల ద్వారా వైద్యశాఖ కార్యాలయాన్ని శాసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కార్యాలయంలో తన పట్టును, పలుకుబడిని పెంచుకునేందుకు, వసూళ్ల కోసం కొన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేసే యూడీసీలను ఎంపిక చేసుకున్నారు. తాను చెప్పినట్టు నడుచుకునే వారిని జిల్లా కార్యాలయానికి డిప్యుటేషన్పై తెచ్చుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో సెక్షన్ బాధ్యత అప్పగించారు. ప్రైవేటు ఆస్పత్రుల అనుమతులు, రెన్యువల్ కోసం ఒకరిని, ఎక్స్రే, స్కానింగ్ సెంటర్ల అనుమతులు, రెన్యువల్స్ కోసం మరొకరికి బాధ్యతలు అప్పగించారు. ఇంకా బదిలీలు, డిప్యుటేషన్లు, బిల్లుల మంజూరు వంటి కార్యకలాపాలకు ఒక్కొక్కరికీ బాధ్యతలు అప్పగించారు. అనుమతులు, రెన్యువల్స్ చేయాలంటే రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి. ఇటీవల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ రోగికి సర్జరీ చేస్తుండగా మరణించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆ ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ అనుమతులు రద్దుచేశారు. అదే ఆస్పత్రికి తిరిగి అనుమతులు తెప్పించేందుకు నగదు చేతులు మారడంతో.. అందుకు సంబంధించిన ఫైల్ చకచకా కదులుతున్నట్లు సమాచారం. డిప్యుటేషన్పై తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తిష్టవేసిన కొందరు అధికారులు తమను అడిగేవారు లేరన్నట్టు రెచ్చిపోతున్నారు. చేయి తడిపతే నిబంధనలన్నీ పక్కనపెట్టి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు, రెన్యువల్స్ చేసేస్తున్నారు. ఎక్స్రే, స్కానింగ్ సెంటర్లకు కూడా ఎడాఎడా అనుమతులిచ్చి జేబులు నింపుకుంటున్నారు. మరో వైపు శారీరక వాంఛలు తీర్చుకునేందుకు మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమకు అనుకూలంగా ఉన్న వారితో కమిటీ ఏర్పాటు చేసి.. నివేదికలు సిద్ధం చేసేపనిలో నిమగ్నమయ్యారు. ఆరోగ్యశాఖలో ‘పిశాచాల’ తీరుపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. ఆ సంఘానికే ఎందుకు అంత ప్రాధాన్యతకామవాంఛ తీర్చాలని అధికారులు తనను వేధింపులకు గురి చేశారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి కన్నీటి పర్యంతమవుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్పందించిన అధికారి ఆరుగురు వైద్యశాఖ అధికారులతోనే ఓ కమిటీని ఏర్పాటు చేశారు. బాధిత మహిళను మభ్యపెట్టేందుకే ఆ కమిటీని ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే.. ఆ కమిటీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులే అంతా. ఆ కమిటీలో మరేశాఖ అధికారులు లేకపోవడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అధికారపార్టీ (తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘం) పేరుతో ఏర్పాటు చేసుకున్న సంఘంలోని కీలక ఉద్యోగులు అందులో ఉన్నారు. వీరు.. కామ వాంఛను తీర్చాలి అన్న అధికారికి మద్దతుగా.. అనుకూలంగా రిపోర్టు రాసేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను అనుకూలంగా రాసేందుకు ఓ రిటైర్డ్ అడ్మినిస్ట్రేషన్ అధికారిని పిలిపించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కార్యాలయంలో కొంత మంది ఉద్యోగులు నిద్రించినప్పుడు సీసీ కెమెరాలు ఆపేసిన వారికి మెమోలు ఇచ్చి వదిలేయడంపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, మహిళా ఉద్యోగినులపై వేధింపులపై సమగ్ర విచారణ జరిపి ‘పిశాచాల’పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. -
నడకమార్గంలో ‘పెద్ది’ సినిమా పోస్టర్తో మహిళ హల్చల్
సాక్షి, తిరుమల: తిరుమలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ లోపం మరోసారి బయటపడింది. తిరుమల నడక మార్గంలో ‘పెద్ది’ సినిమా పోస్టర్తో ఓ మహిళ హల్చల్ చేసింది. నిషేధం ఉన్నా పోస్టర్తో మహిళ రావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయ, సినిమా ప్రచారాలకు తిరుమలలో అనుమతి లేదు. పెద్ది సినిమా పోస్టర్తో మహిళ నడిచిన వీడియో వైరల్గా మారింది. తిరుమల పవిత్రతపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.కాగా, గత శుక్రవారం(జులై 17) తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం శ్రీరంగం నుంచి పట్టువ్రస్తాల సమర్పణ వైభవంగా జరుగుతుండగా, మరోవైపు మహాద్వారం గుండా అనుమతి లేకుండానే ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడన్న ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధుల కథనం ప్రకారం.. రాజారెడ్డి అనే వ్యక్తి అధికారిక అనుమతి లేకుండానే శుక్రవారం తిరుమల ఆలయ మహాద్వారం ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. మహాద్వారం వద్ద విధులు నిర్వహించే విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాల్సి ఉండగా, ఈ ఘటనలో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. -
‘తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?’
సాక్షి, తిరుపతి: ‘‘తిరుమలలో హనుమాన్ విగ్రహం మాయమైంది. వందల ఏళ్ల పురాతన విగ్రహం చోరీకి గురైంది. కూటమి చేస్తానన్న తిరుమల ప్రక్షాళన ఇదేనా? అంటూ వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.‘‘25 వేల మందికి పైగా మెట్ల మార్గం పాదయాత్ర ద్వారా తిరుమలకు వెళ్లే మార్గంలో ఈ విగ్రహాన్ని దర్శిస్తారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి రోజున వైభవంగా టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. విగ్రహం చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి...టీటీడీ విజిలెన్స్ అధికారులు చోరీ చేసిన దొంగను పిచ్చివాడిగా ముద్ర వేసే కుట్ర జరుగుతోందని మాకు సమాచారం. నిత్యం కొండపై ఏదో ఒక ఘోరం, అపచారం జరుగుతోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు చెందిన అంశం ఇది. చంద్రబాబు బాధ్యతా వహించాలి. టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. -
ఎస్వీయూలో అగ్నిప్రమాదం
తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రిన్సి పాల్ గదిలోని వస్తువులు బూడిదయ్యాయి. వీటి విలువ రూ.3 లక్షలకు పైగా ఉంటుందని సిబ్బంది చెప్పారు. వైస్ చాన్సలర్ నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నష్టం అంచనాతో పాటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణ, భద్రతా ప్రమాణా లు ప్రశ్నార్థకంగా మారాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రేమ్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రాపూరి ప్రసాద్, సీఐటీయూ నేత మాధవ్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
తిరుపతి ఐఐటీతో అవగాహన ఒప్పందం
ఏర్పేడు: తిరుపతి ఐఐటీతో నామ్టెక్ మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ ఎంవోయూపై సంతకాలు చేశారు. భాగస్వామ్య సహకార పరిశోధన, ఇంజినీరింగ్, అధునాతన తయారీ రంగాలలో ఆవిష్కరణలను బలోపేతం చేసే ఉమ్మడి కార్యక్రమాలను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుందన్నారు. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లాభాపేక్ష లేని విద్యా కార్యక్రమమైన న్యూ ఏజ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఫౌండేషన్ స్థాపించిన న్యూ ఏజ్ మేకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నామ్టెక్) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అవగాహన ఒప్పందం ప్రకారం తిరుపతి ఐఐటీ, నామ్టెక్ సంస్థలు విద్యార్థుల ఇంటర్న్షిప్లు, పరిశ్రమల అనుభవం, ఉమ్మడి కార్యాచరణ పరిశోధన ప్రాజెక్టులు, అధ్యాపకుల సామర్థ్యాభివృద్ధి, కన్సల్టెన్సీ అసైన్మెంట్లు, ఎగ్జిక్యూటివ్ విద్య, సర్టిఫికేషన్ కార్యక్రమాలతో పరస్పర సహకారం అందించుకుంటాయని తెలిపారు. విక్సిత్ భారత్ 2047, జాతీయ విద్యా విధానం 2020 కింద భారతదేశపు విస్తృత ఆశయాలకు మద్దతుగా, విద్యా, పరిశోధన శిక్షణా వ్యవస్థతో ఏకం చేయడానికి భాగస్వామ్యం దోహదం చేస్తుందన్నారు. ఐదేళ్ల పాటు ఎంవోయూ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో కాంపిటెన్సీ డెవలప్మెంట్ అండ్ అవుట్రీచ్ డీన్ ప్రొఫెసర్ అరుణ్ కె.తంగిరాల, సెంటర్ ఫర్ స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డీన్ ప్రొఫెసర్ అనిల్ కుమార్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ కె.పి.నవీన్, కాంపిటెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సలహాదారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గోర్తి, రిజిస్ట్రార్ బ్రిగేడియర్ డాక్టర్ కె. పి.కృష్ణ కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ రుచిక పాల్గొన్నారు. -
రోడ్డున పడేయకండి బాబూ!
తిరుపతి సిటీ: ఎస్వీయూలో కాంట్రాక్ట్ అధ్యాపకులు రోడ్డెక్కారు. బాబు సర్కార్ వ్యవహారశైలితో తమకు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన చెందుతూ పిడికిలి బిగించారు. మంగళవారం ఎస్వీయూ ప్రధాన ద్వారం వద్ద వర్సిటీలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులు సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వర్సిటీకి సేవలందిస్తున్న తమకు ప్రభుత్వ భరోసా కల్పించాలని కోరారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసి అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియలో తమను అనర్హులుగా పరిగణించడం దారుణమన్నారు. మానవతా దృక్పథంతో గత కొన్నేళ్లుగా వర్సిటీని నమ్ముకుని సేవ చేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, వర్సి టీ అధికారులు పట్టించుకోకపోవడంతో నడిరోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తక్షణం ప్రభుత్వం నిబంధనలను సడలించాలని వేడుకున్నారు. లేఎస్వీయూలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చలపతి సాహసం .. నిలిచిన ప్రాణం!
చంద్రగిరి: ఓ హెడ్ కానిస్టేబుల్ తన ప్రాణాలను లెక్కచేయకుండా బావిలోకి దూకి మహిళను కాపాడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చంద్రగిరి మండలం, రాయలపురానికి చెందిన ఊహకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లకు భర్తతో విభేదాలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో ఊహ శ్రీనివాసమంగాపురంలోని తన అక్క ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో తిరుపతి జీవకోనకు చెందిన మల్లికార్జునతో ఊహకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సహజీవనం వరకు వెళ్లింది. సోమవారం ఊహ, జీవకోనలోని మల్లికార్జున నివాసానికి వెళ్లి తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఆమె ఇబ్బంది పెట్టడంతో మల్లికార్జున తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. మంగళవారం మల్లికార్జున కుటుంబ సభ్యులు శ్రీనివాసమంగాపురానికి చేరుకుని ఊహను మందలించారు. తీవ్ర ఆవేదనకు లోనైన ఊహ ఆత్మహత్య చేసుకోవడానికి పరుగులు తీసింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ చలపతి ఊహతో పాటు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. అయితే ఎంతకీ వినని ఊహ గ్రామ సమీపంలోని ఓ బావిలోకి దూకేసింది. హెడ్కానిస్టేబుల్ చలపతి వెంటనే బావిలోకి దూకి ఆమె ప్రాణాలు కాపాడాడు. అనంతరం బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
బుతుకుతో ఆటలా?
●.. ఇవి మచ్చుకు కొన్ని ఘటనలు మాత్రమే. నాయుడుపేట పట్టణంతోపాటు సూళ్లూరుపేట నియోజకవర్గం మొత్తం ఆన్లైన్, లాటరీ, సింగిల్ నంబర్లాట చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలువురు పేదలు, మధ్యతరగతి ప్రజలు జూదానికి బానిసై బతుకులను సర్వనాశనం చేసుకుంటున్నారు. చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నాయుడుపేటటౌన్: నాయుడుపేట పట్టణంలో లాటరీ, సింగిల్ నంబర్లాట ముమ్మరంగా సాగుతోంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో పలువురు పేదలు లాటరీ, సింగిల్ నంబర్లాట ఆడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కూలీల నుంచి వ్యాపారులు, ఉద్యోగస్తులు సైతం ఈ జూదాలకు అలవాటు పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. రూ.10 మొదలుకొని వేల రూపాయులు పెడుతూ కాటాన్, సింగల్ నంబర్లాటలో మునిగితేలుతున్నారు. పట్టణంలో వీధికో ఏజెంట్ పెట్టి జూదం నిర్వహిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. సింగిల్ నంబర్లాట పట్టణం నుంచి గ్రామాలకు సైతం విస్తరిస్తోంది. ఎలా జరుగుతోందంటే? పంట్టణంలో సింగిల్ నంబర్లాటతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన లాటరీ టిక్కెట్ విక్రయ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల లాటరీ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ బడుగు వర్గాలతో పాటు మధ్య తరగతి వారు, పలువురు ఉద్యోగులు సైతం వేలల్లో లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరికి నంబరు మాత్రమే చిన్న పాటి చీటీలో రాసి ఇస్తుంటారు. ఉదయం నుంచి కష్టార్జితంతో కూలి పనులు చేసుకుని వచ్చిన డబ్బులు, జూదరులకు ధారబోస్తున్నారు. రిక్షా కార్మికులు మొదలుకొని వివిధ పనులు చేసే వారు కాయకష్టం చేసే సొమ్మంతా జూదానికే తగలేస్తున్నారు. సింగిల్ నంబర్ల జూదంలో రూ.10 పెడితే రూ.750, రూ.20 కడితే రూ.1,500, రూ.100 కడితే రూ.7,500, రూ.1000 కడితే రూ.75 వేలు వస్తాయని ఆశజూపుతున్నారు. లాటరీ టిక్కెట్లు కూడా ఇదే తరహాలో నిర్వహిస్తున్నారు. నాయుడుపేటలో విచ్చలవిడిగా లాటరీ, సింగిల్ నంబర్లాట చర్యలు తప్పవు లాటరీ టిక్కెట్లు, సింగిల్ నంబర్ల విక్రేతలపై చట్టపరమైన చర్యలు చేపడుతాం. గతంలో నాయుడుపేటలో పలువురు లాటరీ విక్రేతలపై కేసు నమోదు చేసి ఉన్నారు. లాటరీ, సింగిల్ నంబర్ల జూదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఐలు, ఎస్ఐలకు ఆదేశాలిచ్చాం. – చెంచుబాబు, డీఎస్పీ, నాయుడుపేట -
● నాలుగు నెలలుగా అందని వేతనాలు ● పస్తులతో కాలం గడుపుతున్న వైనం
పారిశుద్ధ్య కార్మికుల ఆకలికేకలు వరదయ్యపాళెం:పారిశుద్ధ్య కార్మికులు ఆకలికేకలతో అలమటిస్తున్నారు. మండలంలోని ఇందిరానగర్కు చెందిన గిరిజన పారిశుద్ధ్య కార్మికులు నాగరాజు, మునిభూషణ నాలుగు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊరిలో చెత్త ఊడ్చడం, డ్రైన్లు శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. అయితే నాలుగు నెలలుగా వేతనా లు రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రతిసారీ ‘రేపు రండి, ఫైల్ పెండింగ్ లో ఉంది, ఫండ్స్ రాలేదు‘ అనే సమాధానం చెబుతు న్నారని వాపోతున్నారు. ఇంట్లో బియ్యం అయిపోయాయి.. పిల్లల అవసరాలు తీర్చ లేకున్నాం.. ఓ వైపు అప్పులు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన చెందతు న్నారు. ఇలావల సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆర్డీఓ దేవేందర్రెడ్డి, డీఎల్డీఓ జాలిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే బిల్లులు చెల్లించండి అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ స్థానిక ఎంపీడీఓ విజయమ్మ, పంచాయతీ కార్యదర్శి మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. -
మీరు పెట్టండి.. మేం పీకేస్తాం!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టినా.. దాన్ని దౌర్జన్యంగా తొలగించారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం, ఇనగలూరు రెవెన్యూ పరిధిలోని జగ్గరాజుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సర్వే నం.107/12, 280/4, 20లోని విలువైన ప్రభుత్వ, రోడ్డు పోరంబోకు భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణపై సాక్షి దిన పత్రికలో ఈనెల 18న ‘కబ్జా చేసి.. దర్జాగా ప్రహరీ నిర్మించి’ శీర్షికన వార్త వెలువడింది. ఏర్పేడు– వెంకటగిరి మార్గంలో ఉన్న ఈ విలువైన ప్రభుత్వ భూమి ప్రభుత్వానిదే అని బోర్డులో స్పష్టంగా రాసి, నాటారు. ఆ బోర్డును టీడీపీ నేతలు పీకేశారు. కర్రలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి కింద పడేశారు. ఈ విషయాన్ని స్థానికలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. -
కూటమి పాలనలో లాఠీలతో లా అండ్ ఆర్డర్ నడి రోడ్డుపై మహిళల బట్టలు విప్పినా పట్టించుకోరా?
● టీడీపీ గూండాలకు కొమ్ముకాస్తున్న హోంమంత్రి ● రెండేళ్ల కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు ● తిరుపతి అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ మహిళల ధర్నా తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లాఠీలతో లాండ్ ఆర్డర్ నడిపిస్తున్నారని, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ తిరుపతి నగర బూత్కమిటీ అధ్యక్షురాలు ముప్పాల సాయికుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు పూల మాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, దాడులను ఖండిస్తూ ధర్నాకు దిగారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాన్, హోంమంత్రి అనిత డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు చేపతబట్టి నినాదాలు మిన్నంటించారు. ఈ సందర్భంగా ముప్పాల సాయికుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ గూండాల దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. రెండు రోజుల క్రితం గుంటూరులో టీడీపీ గూండాలు విచక్షణ కోల్పోయి నడిరోడ్డుపై ఓ మహిళలను వివస్త్రను చేసి కొట్టిపడేస్తే పట్టించుకునేవాళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, హత్యాచారాలు జరుగుతున్నా హోంమంత్రి అనిత మహిళగా ఉండి మహిళలకు రక్షణ కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. రాజ్యమేలుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని సాయికుమారి మండిపడ్డారు. జగనన్న ఐదేళ్ల పాలనలో దిశ, నిర్భయ వంటి చట్టాలను తీసుకురావడంతో మహిళలు నిర్భయంగా తిరగగలిగారన్నారు. మహిళల జోలికి ఎవరైనా వెళ్లాలంటే బయపడేలా చట్టాలను అమలు చేసి మహిళలకు ధైర్యాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు జగనన్న అని కొనియాడారు. చంద్రబాబుకు మహిళలే చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా నాయకురాళ్లు గోలి విజయలక్ష్మి, కల్లూరి లక్ష్మి, పుష్పలత, కృష్ణవేణమ్మ, రాణెతమ్మ, మవిత, కుమారి, జ్యోతి, పల్లవి, లత తదితరలు పాల్గొన్నారు. -
నిర్మాణ పనులు వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: జాతీయ రహదారుల నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గోవిందరావుతో కలసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడువులోపు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూసేకరణకు సంబంధించి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కారం మార్గాలు చూపుతామని వివరించారు. అలాగే శ్రీసిటీ, కొల్లడం, ఇరుగుళం, రాళ్లకుప్పం, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తిరుపతి, నెల్లూరు నేషనల్ హైవే పీడీలు వెంకటేశ్వర్లు, రమేష్, సదరన్ రైల్వే అధికారి వామనమూర్తి, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శివకుమార్, ఆర్టీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. -
అటవీ భూములను అనాధీనంగా మార్చేసిన కూటమి నేతలు రీసర్వేలో సబ్డివిజన్ చేసుకుని 861.41 ఎకరాలు కొట్టేసే యత్నం
● ఇప్పుడు క్వారీ లీజు పేరుతో దరఖాస్తులు! ● పట్టించుకోని అటవీశాఖ అధికారులు పెళ్లకూరు:మండలంలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పెన్నేపల్లి గ్రామంలో సర్వేనం.115లో 150ఎకరాలు, సర్వే నం. 116లో 264, కానూరులో సర్వేనం.91లో 1,088, శిర సనంబేడులో 378, రోసనూరులో సర్వే నం.219లో 365, బంగారంపేటలో సర్వే నం.1లో 362, ఊడిపూడి గ్రామంలో 240, అనకవోలు గ్రామంలో 67 ఎక రాలు మొత్తం 2,914 ఎకరాలతో పాటు 1,663 సోష ల్ ఫారెస్టు భూములు కూడా ఉన్నాయి. ఈ భూము ల్లో జామాయిల్, సరుగుడు, నేరేడు తదితర మొక్కలు పెంచి అటవీ సామర్థ్యం పెంపొందించాల్సి ఉంది. అనాధీనంగా అటవీ భూములు ఇక్కడి అటవీ భూములను అనాధీన భూములుగా కొందరు మార్చుకొని లీజు మాటున దోపిడీ చేసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న అటవీ భూములను ఇటీవల రీ సర్వేలో సర్వే నం.91–2ఏ సబ్ డివిజన్ చేసుకొని 861.41 ఎకరాలు అటవీ భూములను అనాధీన భూములుగా రికార్డుల్లో పొందుపరచడం విశేషం. పాత రెవెన్యూ రికార్డుల్లో (ఎఫ్ఎంబీ) అటవీ భూములుగా ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలతో కలిసి కొందరు రెవెన్యూ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా అనాధీన భూములుగా మార్పు చేయడంపై స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పుడు అలా.. మరి ఇప్పుడూ..? 2014–18లో కానూరు, పెన్నేపల్లి గ్రామాలకు చెందిన గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకోవడానికి ఆయా కాలనీల సమీపంలో ఉన్న అటవీ భూముల్లో ముళ్ల పొదలను తొలగించి పెసర, మినుము సాగుచేశారు. దాంతో అప్పటి అటవీశాఖ అధికారులు గిరిజనులకు నోటీసులు జారీ చేసి ఆ భూముల్లో ఉన్న పంటను యంత్రాలతో తొలగించి చదును చేశారు. కానీ ప్రస్తుతం రెండేళ్లుగా అటవీ భూములను అనాధీన భూములుగా మార్చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. నిఘా ఎక్కడ? వెంకటగిరి ఫారెస్టు రేంజ్ కింద పెళ్లకూరు మండలంలోని అటవీ భూములపై పెళ్లకూరు, దొరవారిసత్రం, నాయుడుపేట ప్రాంతాలకు చెందిన అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఉంది. కానీ అటవీ భూములను అనాధీన భూములుగా మార్చేసి, లీజు కు దరఖాస్తులు చేసుకుంటున్నా ఇక్కడి అధికారులు తమకు పట్టదన్నట్లు వ్యవహరించడం గమనార్హం. లీజు కోసం దరఖాస్తులు? అటవీ భూములను అనాధీన భూములుగా మార్పు చేసుకొని, సంబంధిత భూముల్లో గ్రావెల్ తవ్వకాల కోసం అధికార పార్టీ నేతలు లీజులు కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి అటవీ భూముల్లో పుష్కలంగా గ్రావెల్, ఐరన్ఓర్ ఉండడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాబందులు మాదిరి వాలిపోయేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. 2008లో ఎన్వోసీ మంజూరు కానూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ భూము ల్లో లీజు కోసం 2008లో అప్పటి తహసీల్దార్ ఎన్వోసీ మంజూరు చేశారు.కానీ ఇక్కడి అటవీ భూము లను రీసర్వేలో అనాధీనంగా మార్పులు చేశారు. రాష్ట్ర స్థాయి నేతల నుంచి లీజులకు అనుమతులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడి భూములన్నీ అటవీ భూములని జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించాము. – హరికృష్ణ, తహసీల్దార్ పెళ్లకూరు -
అటవీ ప్రాంతాల్లో చెరువుల పునరుద్ధరణకు చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాతో పాటు అటవీ ప్రాంతాల్లో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన చిన్న నీటిపారుదల చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునరుజ్జీవన పనులు చట్టప్రకారం చేపడుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ పనులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అటవీ శాఖలే నిబంధనలకు అనుగుణంగా చేపడుతున్నాయని తెలిపారు. పోలీస్ గ్రీవెన్స్కు 76 అర్జీలు తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 76 ఫిర్యాదులు అందినట్టు జిల్లా ఏఎస్పీలు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇన్నోవేషన్ స్టార్టప్పై శిక్షణ తిరుపతి సిటీ: ఎస్వీయూలో అధ్యాపకులకు ఆరు రోజుల పాటు జరగనున్న ఇన్నోవేషన్ స్టార్టప్ ఎకో సిస్టం అండ్ ఎంటర్ప్రైనర్ షిప్ ఎంపవరింగ్ ఎడ్యుకేటర్స్ టు బిల్డ్ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ అనే అంశంపై అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. రూసా ఫేజ్–2, సెంటర్ ఆఫ్ఎక్సలెన్స్ ఇన్ వైరస్ లైక్ పార్టికల్స్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వీసీ టాటా నర్సింగరావు సోమవారం ప్రారంభించారు. అనంతనం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలను గుర్తించి వాటికి సరైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. ఉపయోగకరమైన ఆవిష్కరణలు, స్టార్టప్లుగా రూపుదిద్దే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు కల్పించాలని పేర్కొన్నారు. రెక్టార్ ఆచార్య అప్పారావు మాట్లాడుతూ యువప్రతిభను గుర్తించి విద్యార్థులను ఆవిష్కరణలు, వ్యవస్థాపకత స్వయం ఉపాధి వైపు నడిపించడంలో అధ్యాపకుల పాత్ర కీలకమని తెలిపారు. కాలేజ్ ఆఫ్ సైన్సెస్ ప్రిన్సిపల్ ఆచార్య పద్మావతి, వైజాగ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ రవి ఈశ్వరపు, ఆచార్య హేమ, ఆచార్యులు కేవీ సుచరిత, బాలాజీ, రాజశేఖర్, వంశీ రాయల బృందం పాల్గొంది. 5వ బ్రిక్స్ వర్కింగ్ సమావేశం ప్రారంభం ఏర్పేడు: భారత ప్రభుత్వ విజ్ఞాన మరియు సాంకేతిక శాఖ (డిఎస్టి) ఆధ్వర్యంలో తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో సోమవారం తిరుపతి ఐఐటీ నవవిష్కర్ ఐ–హబ్ ఫౌండేషన్ (ఐఐటీటీఏన్ఐఎఫ్) సహకారంతో, జియోస్పేషియల్ టెక్నాలజీలు, వాటి అనువర్తనాలపై 5వ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సమావేశాన్ని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ ప్రారంభించారు. ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశం, సమకాలీన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో, సుస్థిరాభివృద్ధిని పెంపొందించడంలో జియోస్పేషియల్ టెక్నాలజీల పాత్రపై చర్చించడానికి బ్రిక్స్ దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల ప్రతినిధులు వర్చువల్గా హైబ్రిడ్ పద్ధతిలో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న వక్తలు బ్రిక్స్ దేశాల్లో జియోస్పేషియల్ ఎకోసిస్టమ్లను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ సహకారం, సాంకేతిక ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రముఖులు నొక్కి చెప్పారు. సామాజిక సవాళ్లను పరిష్కరించడంలో జియోస్పేషియల్ టెక్నాలజీల పరివర్తనాత్మక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రటరీ గౌతమ్ గోవింద్, నేషనల్ జియోస్పేషియల్ ప్రోగ్రామ్ డివిజన్ హెడ్ డాక్టర్ మనోరంజన్ మొహంతి, డీఎస్టీకి చెందిన సైంటిస్ట్ డాక్టర్ శుభాపాండే, డాక్టర్ అరిందమ్ భట్టాచార్య, నవవిష్కార్ ఐ–హబ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోషన్ శ్రీవాస్తవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రచందనం కేసులో ఏడుగురికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఏడుగురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం.. 2016 సెప్టెంబర్ 11న ప్రొద్దుటూరు రేంజ్, కాజీపేట సెక్షన్, లంకమల్ల రిజర్వ్ ఫారెస్ట్, పాయ బావి రాస్తా, జాండ్లవరం బీట్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా, మైదుకూరు మండలం, జాండ్లవరం గ్రామానికి చెందిన కె.రామసుబ్బయ్య అలియాస్ లారీ, ఎం.పెంచలయ్య, ఐ. పుల్లయ్య, బాలినేని చిన్న రాయుడు, జి.నాగేంద్ర అలియాస్ పిల్లగాడు, ఎం.సురేష్ అలియాస్ పొట్టోడు, ఎం.సుబ్బయ్య, గుజ్జుల సుబ్బయ్య అలియాస్ శెట్టిలు సుమో వాహనంలో అక్రమంగా 110 కిలోల 19 ఎర్రచందనం దుంగలను తరలిస్తూ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుబడ్డారు. ఎనిమిది మంది పై ఫారెస్ట్ సిబ్బంది కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ దశలో మూడో నిందితుడిగా ఉన్న పుల్లయ్య మృతి చెందాడు. నేరం ఏడుగురిపై రుజువు కావడంతో న్యాయమూర్తి ఏడుగురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. సోమవారం తీర్పు సమయంలో ఆరవ నిందితుడుగా ఉన్న సురేష్ కోర్టుకు హాజరు కాకపోవడంతో అతనిని వారెంట్ పై హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. -
రిజిస్ట్రేషన్లపై సమ్మెట!
తిరుపతి అర్బన్:సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాల పెత్తనం ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ డాక్యుమెంటేషన్ రైటర్లు ఆందోళన బాట పట్టారు. డాక్యుమెంటేషన్ రైటర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. తమ దుకాణాలకు తాళం వేసి ్ద నిరసన చేపట్టారు. దీంతో డాక్యుమెంటేషన్ సిద్ధం చేసి ఇచ్చేవాళ్లు లేక రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోయాయి. పడిపోయాయి జిల్లాలో 18 సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. తిరుమల సబ్రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కేవలం మ్యారేట్ సర్టిఫికెట్స్ మాత్రమే జారీచేస్తారు. ఆస్తుల క్రయవిక్రయాలు చేపట్టరు. మిగిలిన 17 సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మొత్తంగా రోజుకు 2 వేల రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. అయితే డాక్యుమెంట్స్ను సిద్ధం చేయడానికి రైటర్లు లేకపోవడంతో క్రయవిక్రయదారులు సొంతంగా డాక్యుమెంట్స్ను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 60 రిజిస్ట్రేషన్లు మాత్రమే నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. -
మూగ జీవాలకు ప్రత్యేక చికిత్స
చంద్రగిరి: అంతుపట్టని వ్యాధితో గత కొద్ది రోజులుగా మృత్యువాత పడుతున్న గొర్రెలు, మేకలకు పశుసంవర్థక శాఖ అధికారులు ప్రత్యేక చికిత్సను అందజేశారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అకాల మరణం.. తల్లడిల్లుతున్న ప్రాణం’ అన్న శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన చంద్రగిరి ఏడీ ప్రసాద్, కల్రోడ్డుపల్లి పశువైద్యాధికారిణి మోనిక యాదవ్లు తొండవాడ, శానంబట్ల గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన జీవాలకు తిరుపతి వెటర్నరీలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అది చిటుక వ్యాధిగా గుర్తించినట్లు వారు తెలిపారు. అనంతరం వాటికి ఈటీ, టీటీ టీకాలను కూడా అందజేసినట్లు తెలిపారు. టీకాలు వేసిన 15 రోజుల తర్వాత రోగ నిరోధక శక్తి వస్తుందని, అప్పటి వరకు జీవాలకు లేతగడ్డి పెట్టకూడదని చెప్పారు. అలాగే ప్రతి రోజూ పొటాషియం పర్మాంగనేట్ అనే ద్రవణాన్ని తాపించాలని, తర్వాత 15 రోజులకు ఈటీ బూస్టర్ టీకాలను అందజేస్తామని తెలిపారు. తొండవాడ, శానంబట్లలోని సుమారు 950 జీవాలకు ఈ టీకాలను అందజేసినట్లు వెల్లడించారు. రైతులు కూడా చిటుకు వ్యాధిపై అవగాహన పెంచుకుని, జీవాలను పరిరక్షించుకోవాలని సూచించారు. ఫోన్ లేకున్నా ప్రసాదంశ్రీకాళహస్తి: మొబైల్ ఫోన్ లేకపోయినా శివయ్య ప్రసాదం పొందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల ‘ఫోన్ లేకుంటే శివప్రసాదం లేనట్టే’ శీర్షికన ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. దీనిపై దేవదాయశాఖ స్పందించింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆఫ్లైన్లో కూడా ప్రసాదం దొరికేలా కౌంటర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఆర్డరు కాపీని ఈవో వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మన్ కొట్టేసాయి సోమవారం విడుదల చేశారు. -
18 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: అన్నమయ్య జిల్లా, పీలేరు రోడ్డు మార్గంలో, గుడిపాల – రాణీపేట హైవేలో రెండు చోట్ల కారులో తరలిస్తున్న 18 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారు అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. ఏఆర్ఎస్ఐ కె.మహేశ్వరనాయుడు బృందం స్థానిక అటవీ సిబ్బంది జగదీష్, ఆషాబీతో కలసి అన్నమయ్య జిల్లా కేవీ పల్లి–పీలేరు మార్గంలో పొంతల చెరువు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున ఒక కారు వేగంగా వస్తూ టాస్క్ఫోర్స్ బృందాన్ని గమనించి కారును ఆపి అందులోని వ్యక్తులు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఇద్దరినీ పట్టుకోవడంలో మరో వ్యక్తి పారిపోయాడు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడు తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. 11 ఎర్రచందనం దుంగలు, కారుతో సహా పట్టుబడిన వారిని తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాసులు రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ విచారించారు. ఈ కేసును సీఐ ఖాదర్ బాషా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాణీపేట హైవేలో 7 ఎర్రచందనం దుంగలు స్వాధీనం తిరుపతి నిఘా విభాగం డివిజినల్ పారెస్టు అధికారి కె.రామకొండారెడ్డికి అందిన సమాచారం మేరకు గుడిపాల – రాణీపేట హైవేలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సుబ్బరాయుడు నేతృత్వంలో సోమవారం ఉదయం యల్లమంద ఫారెస్టు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇన్నోవా వాహనం అతి వేగంగా వెళ్లింది. వాహనాన్ని వెంబడించి రాణీపేట హైవేలోని బొమ్మసముద్రం వద్ద పట్టుకునే ప్రయత్నంలో వాహనం ఆపి అందులోని వ్యక్తులు పారిపోయారు. అందులో 7 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వ్యక్తులు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. వాహనం సీజ్ చేసి 229.200 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేసి కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఎఫ్ఎస్వో చంద్రబాబు, ఇన్చార్జి ప్రసాద్కుమార్, సిబ్బంది సాయి కిరణ్ పాల్గొన్నారు. -
మెట్లపై నుంచి జారిపడి యువకుడి మృతి
తిరుపతి రూరల్: మద్యం మత్తులో మెట్లపై నుంచి జారి కిందపడిన యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగేశ్వర్ నగర్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తికి చెందిన భాస్కర్ (28) తిరుపతిలోని ఆంధ్ర బ్యాంకు కాలనీలో టెన్నిస్ అసిస్టెంట్ కోచ్గా పనిచేస్తున్నాడు. లింగేశ్వర్ నగర్లోని ఓ ఇంట్లో స్నేహితుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. స్నేహితుడు తన స్వగ్రామానికి వెళ్లడంతో భాస్కర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ క్రమంలో మద్యం సేవించిన భాస్కర్ మొదటి అంతస్తు నుంచి మెట్లపై దిగుతుండగా అదుపుతప్పి బోర్లా పడిపోయాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి తెలిపారు. పది రోజులు జైలు రేణిగుంట: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి తిరుపతి స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు పది రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం.. రేణిగుంట మండలం, కరకంబాడి తారకరామనగర్కు చెందిన పి.వెంకటేష్ (30) ఇటీవల మద్యం సేవించి వాహనం నడుపుతూ రేణిగుంట అర్బన్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై మోటార్ వాహన చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని తిరుపతిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. నేరం రుజువు కావడంతో నిందితుడు వెంక టేష్కు పది రోజుల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. -
మేకల చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
సత్యవేడు: మదనంబేడులో రెండు మేకల చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ సాయినాథ్చౌదరి తెలిపారు. మందనంబేడుకు చెందిన రైతు మునస్వామికి చెందిన మేక, మేకపోతు ఇంటి వద్ద కట్టి ఉండగా 18వ తేదీ రాత్రి చోరీ చేసినట్టు సత్యవేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు దాసుకుప్పం సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఈ కేసులో హనుమంతామపురానికి చెందిన రాజేష్(22), దాసుకుప్పానికి చెందిన మునివేలు(20)ను అరెస్ట్ చేసి నట్టు పోలీసులు తెలిపారు. మునివేలుపై సత్యవేడు పోలీస్ స్టేషన్లో2, నాగలాపురంలో 3 కేసులున్నట్టు తెలిపారు. ఇరువురినీ గంజాయి పరీక్ష చేయగా.. పాజిటీవ్ వచ్చిందన్నారు. ఒక్క రోజులోనే ఎస్ఐ లావణ్య, హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు, హనుమంతు, ప్రతాప్, పద్మనాభరెడ్డి కలసి కేసును ఛేదించినట్టు వెల్లడించారు. వీరికి డీఎప్పీ రవికుమార్, సీఐ మురళీనాయుడు రూ.1000 క్యాష్ అవార్డు అందించనున్నారు. -
పాలకోడేటి జగన్నాథరావు అస్తమయం
శ్రీకాళహస్తి: సంస్కృత పండితుడు, ఆధ్యాత్మిక గ్రంథకర్త, శ్రీకాళహస్తి స్థలపురాణాన్ని సరళమైన తెలుగులో వ్యాఖ్యానించి భక్తులకు అందించిన ప్రముఖ సాహితీవేత్త పాలకోడేటి జగన్నాథరావు పరమపదించారు. రాజమహేంద్రవరం విరించి వానప్రస్థాశ్రమంలో నివసిస్తూ జీవితాంతం పరమేశ్వరునికి అక్షరార్చన చేస్తూ అనేక విలువైన గ్రంథాలను రచించారు. గురుకుల విద్యను అభ్యసించిన ఆయన కళాశాలలో అధ్యాపకునిగా వేలాది మంది విద్యార్థులకు బోధించారు. అచ్చతెలుగు శృంగార శాకుంతలంకు వ్యాఖ్యానం, స్వాధ్యాయ సందోహం పేరిట వేదమంత్రాలకు వివరణ, వేదసూక్తుల ఆంధ్రానువాదం, నాయనార్ల సమగ్ర చరిత్ర వంటి అనేక రచనలు చేశారు. గతంలో శ్రీకాళహస్తి మాహాత్యంను వచన రూపంలో అందించిన ఆయన, అనంతరం శివపురాణాంతర్గతమైన శ్రీకాళహస్తి స్థలపురాణాన్ని 9,430 శ్లోకాలకు సరళమైన వ్యాఖ్యలతో ఐదు భాగాలుగా విభజించి గ్రంథరూపంలో వెలువరించారు. ఈ రచన శ్రీకాళహస్తి శివభక్తుల నుంచి విశేష ఆదరణ పొందింది. కంచీ పీఠాధిపతుల ఆదేశాల మేరకు కంచీ మహాత్యం గ్రంథాన్ని అనువదిస్తున్న సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సాహితీవేత్తలు, వేదపండితులు, శివభక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ రెవెన్యూ డివిజనల్ అధికారి, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు, నాగరాజుజట్టి తదితరులు ఆకాంక్షించారు. -
మెగా పోలీసు నోటిఫికేషన్కు కృషి చేయండి
తిరుపతి సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను 2,700 నుంచి 10 వేలకు పెంచి మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసేలా కృషి చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షుడు మన్నం ప్రేమ్కుమార్ విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఎస్వీయూకు విచ్చేసిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంటనే 10 వేల పోస్టులతో మెగా పోలీస్ నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ యువత ఆవేదనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీని కోరినట్లు తెలిపారు. విద్యార్థి నాయకులు లిఖిత, పవను, కిషోర్, వంశీ పాల్గొన్నారు. డిజిటల్ గుర్తింపు కార్డులను స్వీకరించాలి తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఆర్టీసీ బస్సుల్లో రాయితీ లేదా ఉచిత ప్రయాణ సౌకర్యం పొందేందుకు ప్రయాణికులు చూపించే డిజిటల్ గుర్తింపు పత్రాలను స్వీకరించాలని అధికారులు కండక్టర్, డ్రైవర్లకు సూచించారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్టీసీ డిపోలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాల డిజిటల్ రూపాలలో కూడా స్వీకరించాలని తెలిపారు. ప్రయాణికులు తమ గుర్తింపు పత్రాలను వాట్సాప్లోని ఆధార్ లేదా మొబైల్ ఫోన్లోని ఫొటో/డిజిటల్ రూపంలో చూపించినప్పుడు, అవి స్పష్టంగా ఉండి చెల్లుబాటయ్యే వివరాలు కలిగి ఉంటే, వాటిని అనవసరంగా తిరస్కరించకూడదని సిబ్బందికి సూచించారు. రాయితీ లేదా ఉచిత ప్రయాణానికి అర్హత ఉన్న ప్రయాణికులకు, వారి చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రం డిజిటల్ రూపంలో ఉన్న కారణంగా ప్రయాణ సౌకర్యాన్ని నిరాకరించరాదన్నారు.శివాలయంలో ఆభరణాల చోరీ రేణిగుంట:మండలంలోని వెదుళ్లచెరువు గ్రామంలోని శ్రీ శ్రీ ఓంకార జ్యోతి లింగేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం ఉద యం పూజారి గుర్తించి రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అర్బన్ ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా ఆధారాలను సేకరించారు. దుండగులు ఆలయంలోని హుండీని పగులగొట్టి, అందులో ఉన్న నగదుతో పాటు స్వామి, అమ్మవార్లకు అలంకరించే సుమారు రూ.6 లక్షల విలువచేసే వెండి, బంగా రు ఆభరణాలు చోరీ చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఒంటరి కుటుంబాలే టార్గెట్
ఒంటరి కుటుంబాలను టార్గెట్ చేస్తూ... ఎవరూ లేరని తెలిసినా, వృద్ధులు ఉన్నారని తెలిసినా వారి ఆస్తులను కబ్జా చేస్తున్నారు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో భూ ఆక్రమణలు, మట్టి, గ్రావెల్తో వ్యాపారాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ గుండాల వలే దౌర్జన్యం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు వారికి కొమ్ముకాస్తున్నారు. అవిలాలలో వృద్ధులకు చెందిన 3.17 ఎకరాల భూమిని కబ్జా చేశారు. పోరంబోకు భూమిలో ఆర్చి కట్టారు. ధర్నాలు చేసినా తొలగించడం లేదు. తిరుపతి శివజ్యోతి నగర్లో విలేకరుల పేర్లు చెప్పి మూడు ఎకరాలు కబ్జా చేశారు. అరాచకాలు, అన్యాయాలు తార స్థాయికి చేరుకున్నాయి. – మల్లం రవిచంద్రారెడ్డి, తిరుపతి నగరం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అధికార పార్టీ నేతల అండతోనే అధికార పార్టీ నేతల అండతో జిల్లాలో భూఆక్రమణలు సాగుతున్నాయి. తిరుపతి రూరల్ అవిలాలలో వనజాక్షికి చెందిన భూమిని అధికార పార్టీ నేతలు ఆక్రమించి, 22ఏలో పెట్టి. మళ్లీ 22ఏ నుంచి తొలగించి, ఒకరికి రిజిస్ట్రేషన్ చేసి.. ,వెంటనే మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం విడ్డురంగా ఉంది. న్యాయంగా పీజీఆర్ఎస్ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుంటే పోలీసులు డ్రోన్లుతో మా ఫొటోలు తీయడం ఏంటి..?. అక్రమంగా కేసులు పెట్టాలని చూస్తే ఊరుకోం. మంగళంలో రూ.7 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమించారు. –మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి -
ఈజీగా దోపిడీలతో చెలామనీ!
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కలకలం వరదయ్యపాళెం: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం నకిలీ కరెన్సీ ముఠాలు, పట్టపగలే దోపిడీలకు పాల్పడే ముఠాలు, యువకులను టార్గెట్ చేసే సెల్ఫోన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు సామాన్య ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. బయట పడ్డ నకిలీ బ్లాక్మనీ ముఠా బండారం తిరుపతి జిల్లా పిచ్చాటూరులో సంచలన ఘటన చోటుచేసుకుంది. నకిలీ బ్లాక్మనీని అసలు కరెన్సీకి ఐదు రెట్లు ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న ముఠాను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన అజ్జీరా రాజారామును లక్ష్యంగా చేసుకుని, అతడిని ఇంటికి పిలిచి ఆట కోసం వాడే టాయ్ కరెన్సీని ఒరిజినల్గా చూపించారు. నమ్మిన బాధితుడి నుంచి రూ.20 వేలు తీసుకుని, బయటకు వెళ్లే సమయంలో కత్తులతో బెదిరించి ఇంటి తలుపులు మూసేశారు. సమాచారం అందుకున్న పిచ్చాటూరు పోలీసులు దాడి చేసి ప్రకాష్, మురళి, షేక్ అబ్దుల్ అక్మల్, పల్లపు రవికుమార్, కరేటి ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5000 టాయ్ కరెన్సీ నోట్లు, చెక్కపెట్టీ, లగేజ్ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ పేరుతో ఇలాంటి ముఠాలు జిల్లాల్లో చురుగ్గా తిరుగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘సాయం‘ పేరుతో దోపిడీ వరదయ్యపాళెం మండలం, సంతవేలూరు మార్గంలో మరో దారుణం జరిగింది. కళతూరు గిరిజన కాలనీకి చెందిన శరత్కుమార్(18) బైక్పై వెళ్తుండగా ఇద్దరు యువకులు అడ్డుకున్నారు. ‘బైక్లో పెట్రోల్ అయిపోయింది, సాయం చేయండి‘ అని నమ్మించారు. మంచితనంతో సాయం చేస్తుండగా, ఒకడు శరత్ జేబులోని సెల్ఫోన్ లాక్కునేందుకు యత్నించాడు. ప్రతిఘటించడంతో మరొకడు బీరు సీసాతో శరత్ తలపై కొట్టాడు. గాయపడిన శరత్ నుంచి ఫోన్ లాక్కుని దుండగులు పరారయ్యారు. ఇలాంటి ఘటనలు రోజువారీ జరుగుతుండడం ఒంటరిగా గ్రామీణా ఆధారంలో వెళ్లే వాహనదారులు, పాదాచార్యులు ఆందోళనకు గురవుతున్నారు. పేట్రేగిపోతున్న చైన్ స్నాచింగ్ ముఠా చిత్తూరు జిల్లా, విజయపురం మండలం, పన్నూరు గ్రామంలో పట్టపగలు దోపిడీ కలకలం సష్టించింది. హెల్మెట్లు ధరించి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు గహిణి కామాక్షి వద్దకు వచ్చి స్పేనర్ కావాలని అడిగారు. ఆమె సాయం చేసేందుకు రాగానే, చేతిలోని హెల్మెట్తో బలంగా కొట్టారు. తేరుకునేలోపే మెడలోని రూ.4 లక్షల విలువైన బంగారు తాళిబొట్టు, చైన్ను లాక్కుని వేగంగా పారిపోయారు. ఇలాంటి ఘటనలు రోజువారీ జిల్లాలో అక్కడక్కడా జరుగుతుండడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. పోలీసులకు సవాల్ ఈ మూడు ఘటనలు చూస్తే జిల్లాల్లో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని స్పష్టమవుతోంది. నకిలీ కరెన్సీ, దోపిడీలు, స్నాచింగ్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలు, యువకులు టార్గెట్ అవుతున్నారు. పోలీసు శాఖ హైవేలు, గ్రామీణ రోడ్లపై రాత్రిపగలు గస్తీ పెంచాలి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజలు కూడా అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
రాష్ట్ర స్థాయికి ఉద్యమం
జిల్లాలో జరుగుతున్న భూ కబ్జాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజంపై ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకుపోతాం. అన్యాయం జరిగిన వారి పక్షనా పోరాటాలు చేస్తూంటే....పోలీసులు డ్రోన్లు, కెమెరాలతో మా ఫొటోలు తీస్తున్నారు. గూండాలు, రౌడీల ఫొటోలు తీయండిజ దైర్యం ఉంటే వారిని లోపల పెట్టండి. తిరుపతిలో ఓ వృద్ధుడిని ఇంటిలో నుంచి గెంటేశారు. వేణుగోపాల్ నగల్లో దౌర్జ్యనాలు, వనజాక్షి భూమి కబ్జా, గాంధీపురం ఆక్రమణలు అధికారులకు కనిపించడం లేదా..? –వందాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆక్రమణలు సరికాదు ప్రభుత్వాలు వస్తుంటాయి...పోతుంటాయి. అయితే ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములు ఇష్టారాజ్యంగా ఆక్రమించడం సమంజసం కాదు. అధికారం ఉందని కక్ష పూరితంగా వ్యవహరించడంతో మళ్లీ మరో పార్టీ అధికారంలోకి వస్తే ఇదే సంస్కృతిని పాటిస్తే పేద, సామాన్య ప్రజల మనగుడ ప్రశ్నార్థకంగా మారుంది. – గోపాల్రెడ్డి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు న్యాయం చేయండి సార్ తిరుపతి రూరల్, అవిలాల పరిధిలో సర్వే నం.476–1లోని 3.17 ఎకరాల భూమిని ఆక్రమించారు. నా వయస్సు 75 ఏళ్లు. ఈ వయస్సులో నా భూమిని కాపాడుకోవడానికి రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. ముందే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. దొంగపత్రాలు సృష్టించి మా భూమిని ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లోకయుక్తకు కూడా ఫిర్యాదు చేశాం. – వనజ, భూ బాధితురాలు, తిరుపతి రూరల్ -
మాపైనే ప్రతాపమా?
డ్రోన్లతో ఫొటోలు తీయడమేంటి? కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న అఖిలపక్ష నేతలు తిరుపతి అర్బన్: జిల్లాలో జరుగుతున్న భూకబ్జాలు, రౌడీయిజం, గూండాయిజానికి అడ్డుకట్ట వేయాలిగానీ.. ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు డ్రోన్ కెమెరాలతో ధర్నా చేస్తున్న వారి ఫొటోలను తీయడం విడ్డూరంగా ఉందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. సోమవారం అన్ని పార్టీలకు చెందిన నేతలు కలెక్టరేట్ వద్ద తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్ ప్రాంతాల్లో జరుగుతున్న భూ ఆక్రణలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. వృద్ధులకు చెందిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలన చేయడం...తర్వాత వాటికి దొంగ పట్టాలు సృష్టించి కబ్జా చేయడం లాంటివి జరుగుతున్నాయన్నారు. విదేశాల్లో నివాసం ఉంటున్న వారి ఆస్తులు ఆక్రమించడం రివాజుగా మారుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలపై న్యాయ పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు. అర్జీల వెల్లువ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 446 అర్జీలు వచ్చాయి. డీఆర్వో నరసింహులు ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యాక్రమాన్ని చేపట్టారు. డీఆర్వోతోపాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, భరత్నాయక్, రోజ్మాండ్ అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సమస్యలపై 261 అర్జీలు వచ్చాయి. -
ట్రాన్స్జెండర్లకు ఆటోల పంపిణీ
తిరుపతి అర్బన్: ముగ్గురు ట్రాన్స్జెండర్లకు సోమవారం తిరుపతి కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా కలెక్టర్ ఎస్.వెంటేశ్వర్ ఆధ్వర్యంలో ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్స్, వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారి వినోద్తోపాటు పలువురు పాల్గొన్నారు. లైంగిక దాడి యత్నంలో ఇద్దరికి జైలు చిత్తూరు అర్బన్: ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక ఆడికి యత్నించిన కేసులో అనుకుట్టి వెంకటేష్, శశికుమార్ అలియార్ కుమార్ రాజా అనే ఇద్దరు ముద్దాయిలకు 42 నెలల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని 6వ అదనపు జిల్లా కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి హరిత తన తీర్పును వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీ కథనం మేరకు.. 2017 మే 27వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరుపతి నగరంలోని రుయా ఆసుపత్రి వద్ద ఓ మహిళ తన గమ్యం వెళ్లడానికి ఆటో ఎక్కారు. ఆటో నడిపే శశికుమార్ అలియాస్ కుమార్ రాజ, అతని స్నేహితుడు వెంకటేష్ ఆటోలోనే ఉన్నారు. మహిళను ఇస్కాన్ ఆలయ సమీపంలోకి తీసుకెళ్లాక ఆమైపె లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించారు. నిందితుల నుంచి తప్పించుకున్న మహిళ.. తన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. ఆపై బాధితురాలి తల్లి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు మూడున్నరేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
పింఛనో.. రామచంద్రా!
తిరుపతి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 25 నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు అర్హత ఉన్న ఏ ఒక్కరికీ కొత్త పింఛన్ల దరఖాస్తుకు అనుమతివ్వలేదు. సాధారణంగా ప్రతి ఏటా జూలై, జనవరిలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశాలు కల్పించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటి అవకాశాలేవీ కల్పించలేదు. పైగా కార్యాలయాల చుట్టూ అర్హులు తిరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవా రం కొత్తగా పీజీఆర్ఎస్లో అర్జీలు ఇచ్చే ప్రదేశంలో క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. అర్జీదారులు తమ సమస్య పరిష్కారం కోసం తమ మొబైల్తో క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసి సమస్యను తెలియజేస్తే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి చేరుకుంటుందని అధికారులు అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఆ క్యూఆర్ కోడ్ సక్రమంగా పనిచేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తంగా అర్జీదారుల దృష్టిని క్యూ ఆర్ కోడ్ వైపు మళ్లించినట్లు తెలుస్తుంది. పింఛన్ ఇప్పించండయ్యా! నా పేరు కమలమ్మ. మాది పుత్తూరు మండలం, తడుకు గ్రామం. నాకు 91 శాతం వైకల్యం ఉంది. ఏడాదిగా పింఛన్ కోసం తిరుగుతూనే ఉన్నా. వీల్చైర్కే పరిమితమైన. అధికారులకు అర్జీలిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు. తల్లిదండ్రులకు సైతం భారంగా మారుతున్నా. ఇప్పటికై నా అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలి.ఇంటి స్థలాలు చూపండి సార్ ఏర్పేడు మండలంలోని పెనుమల్లం ఎస్టీ కాలనీకి చెందిన పలువురు మహిళలలు తమకు ఇంటిస్థలాలు ఇవ్వాలని సోమవారం కలెక్టరేట్లో అర్జీలను అందజేశారు. అన్నదమ్ముళ్లు విభజన నేపథ్యంలో ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటున్నామని, విడిపోయిన నేపథ్యంలో స్థలం ఇస్తే కొత్తగా ఇంటిని నిర్మించుకుంటామని తమ చిన్న బిడ్డలతో కలెక్టరేట్కు వచ్చి అధికారులకు అర్జీలను అందించారు. –పెనుమల్లం ఎస్టీ కాలనీ వాసులు -
నాణ్యమైన విద్యే లక్ష్యం
తిరుపతి రూరల్: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 258 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ‘షైనింగ్ స్టార్స్ – 2026’ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ముఖ్యఅతిథులుగా విచ్చేసి విద్యార్థులకు సరికెట్లు, నగదు బహుమతులను అందించి అభినందించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నెల 24న జరిగే పేరెంట్–టీచర్ సమావేశాలకు ప్రతి తల్లిదండ్రి హాజరుకావాలని పిలుపునిచ్చారు. మార్కులే కొనమానం కాదు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే సమాజ అభివృద్ధికి బలమైన పునాది అన్నారు. మార్కులే జీవిత విజయానికి కొలమానం కాదన్నారు. పిల్లలను ఇతరులతో పోల్చి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం షైనింగ్ స్టార్స్ అవార్డుల పంపిణీ ద్వారా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ.20వేల నగదు, మెడల్, ప్రశంసాపత్రాలు అందజేశారు. తిరుపతి, సూళ్లూరుపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, నెలవల విజయశ్రీ,అరవ శ్రీధర్, డీఈఓ కేవీఎన్ కుమార్, ఆర్ఐఓ గోపాల్రెడ్డి, రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్, యాదవ, వన్నెకుల క్షత్రియ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
కన్నీటి సుడులు..కష్టాల వినతులు
బాధలు భరించలేక.. కన్నీటి సుడులతో కష్టాలు చెప్పుకుందామని పలువురు అభాగ్యులు సోమవారం తిరుపతి కలెక్టరేట్ మెట్లెక్కారు. చంటిబిడ్డలనెత్తుకుని కొందరు, ఊతకర్రల సాయంతో వృద్ధులు, వీల్చైర్కే పరిమితమైన దివ్యాంగులు, మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లు ఎటుచూసినా కనిపించారు. అర్జీలు చేతబట్టి ‘అయ్యా.. మా కష్టాలు తీర్చండి మహాప్రభో’ అంటూ అధికారుల కాళ్లావేళ్లాపడ్డారు. నెలల తరబడి తిరుగుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. – ఫోటోలు–సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి -
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజలు
రైల్వేకోడూరు అర్బన్: ఇసుక అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డుకున్న ఘటన తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు పరిధిలో చోటుచేసుకుంది. చిట్వేలి–కోడూరు రోడ్డు విస్తరణకు ఎంతో కాలంగా స్థానికులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దశాబ్దాల కాలంనాటి వీరి కల వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవతో నెరవేరింది. రోడ్డు బాగుపడింది. అయితే ఇటీవల టీడీపీ నాయకుల అక్రమ ఇసుక రవాణా కారణంగా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలో చిట్వేలి మండలంలోని పెద్దూరు గ్రామంలో ప్రధాన రహదారి ఇసుక లారీల రాకపోకలతో అధ్వానంగా మారింది.ఈ లారీల వల్ల దశాబ్దాలుగా కలలుగని సాధించుకున్న రోడ్డు కళ్లెదుటే పాడవుతుంటే గ్రామస్తులు తట్టుకోలేకపోయారు. ఇసుక అధికలోడ్తో తరలిస్తున్న దాదాపు 20 లారీలను అడ్డుకున్నారు. 20 టన్నులు మోయాల్సిన రోడ్డుపై 50 టన్నుల ఇసుక రవాణా ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు కూడా గ్రామస్తులకు మద్దతుగా నిలిచారు. గ్రామస్తుల ఆగ్రహంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో సమాచారం అందుకున్న రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ వినోద్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆగిన లారీలను పక్కనబెట్టించి ట్రాఫిక్ను క్రమబద్ధికరించారు.అయితే ఈ ఇసుక అక్రమ దందాపై పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న విషయం ఆసక్తిగా మారింది. కాగా, చంద్రబాబు ప్రభుత్వంలో రైల్వేకోడూరులో టీడీపీ నాయకుల అరాచకాలు ముఖ్యంగా భారీ ఇసుక దందా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వర్గ విభేదాలతో రచ్చయినా ఇవేమీ పట్టించుకోని టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డి.. తన అనుచరుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను జనసేన ఎమ్మెల్యేగా ప్రకటించి గెలిపించుకొని తన హవా, అధికార దర్పాన్ని కొనసాగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. తాజాగా సాగుతున్న ఇసుక అక్రమ దందా టీడీపీ వినాశనానికే దారితీస్తుందని స్థానికులు విమర్శిస్తున్నారు. -
అంతరిక్షం.. అద్భుత అనుభవం
సూళ్లూరుపేట : అంతరిక్షంలోకి వెళ్లడమంటే అద్భుత అనుభవమని భారతీయ వ్యోమగామి శుభాన్ష్శుక్లా తెలిపారు. విక్రమ్–1 రాకెట్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆదివారం ఆయన షార్ కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా బ్రహ్మప్రకాష్ హాల్లో స్పేస్ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు, షార్ ఉద్యోగుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. శుభాన్ష్శుక్లా మాట్లాడుతూ ప్రతి భారతీయ విద్యార్థి ఒక వ్యోమగామి కావాలని, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. అంతరిక్షయాత్ర, ఐఎస్ఎస్లో ఎదురైన అనుభవాలను వివరిస్తూ.. స్పేస్లోకి వెళ్లడమంటే చావు బతుకులు సమస్యే అయినప్పటికీ ఆ అనుభూతి ఎప్పటికీ మరిచిపోలేమని వెల్లడించారు. ఆక్సియం స్పేస్ మిషన్ నుంచి తిరిగొచ్చే సమయంలో అసలు భూమికి చేరుతామా.. లేదా.. అనే సందేహం మాత్రం ఉండేదని తెలిపారు. అయితే స్పేస్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు కారణంగా సురక్షితంగానే వెళతామనే ధైర్య మాత్రం ఉందని వెల్లడించారు. అనంతరం ముఖాముఖిలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే శుభాన్ష్శుక్లాకు ఇస్రో బాహుబలిగా పేరుపొందిన ఎల్వీఎం3 రాకెట్ నమూనాను జ్ఞాపికగా షార్ అధికారులు అందజేశారు. -
‘మల్లిమడుగు’లో మట్టి మాఫియా
రేణిగుంట : మండలంలోని కరకంబాడి పంచాయతీలో ఉన్న మల్లిమడుగు జలాశయం నుంచి రాత్రి వేళల్లో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ నేత పేరు చెప్పుకొని వందల ట్రిప్పుల మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. మట్టి, ఇసుక అక్రమ తరలింపుపై కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా మట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే రేణిగుంట మండలంలోని అధికారులు మాత్రం కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను బేఖాతర్ చేసేస్తున్నారు. మల్లిమడుగు జలాశయంలో ప్రతిరోజూ రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల వరకు మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. వందల టిప్పుల గ్రావెల్ను భారీ టిప్పర్లలో కడప జాతీయ రహదారి మీదుగా తిరుపతి సమీపంలోని వెంచర్లకు తరలిస్తున్నా స్పందించడం లేదు. హైవేలో పెట్రోలింగ్ వాహనం ఉన్న సమయంలోనే మట్టి అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ కన్నెత్తిచూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు.. మట్టి అక్రమ తవ్వకాలను, రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చూపుతున్నారు. నెలవారీ మామూళ్లు ముడుతుండడంతోనే అధికారుల అక్రమ తవ్వకాలు, రవాణా వైపు వెళ్లడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాలను సైతం తుంగలో తొక్కే స్థాయిలో ముడుపులు చేతులుమారుతున్నాయని స్థానికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులే నేరుగా దాడులు చేస్తే కానీ, మల్లిమడుగు సంరక్షణ సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. మల్లిమడుగు జలాశయంలో హిటాచీజలాశయంలోనే హిటాచీలు.. వారం రోజులుగా హిటాచీలు మలిమడుగు జలాశయంలోనే ఉంచుతున్నారు. రాత్రి వేళ తవ్వకాలు సాగిస్తున్నారు. స్థానిక అధికారులకు తెలిసే మొత్తం దందా నడుస్తున్నప్పటికీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచ్చలవిడిగా మట్టి తోడేస్తుండడంబతో జలాశయానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అకాల మరణం..తల్లడిల్లుతున్న ప్రాణం
చంద్రగిరి: అంతుచిక్కన వ్యాధి సోకి గొర్రెల మృత్యువాత పడుతున్న ఘటన మండలంలోని చంద్రగిరి, శానంబట్ల, తొండవాడ ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఇక్కడ నెల రోజుల వ్యవధిలో 130కిపైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట మూర్చవ్యాధి సోకి కుప్పకూలిపోతున్నాయని, నాలుగు రోజుల వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెబుతున్నారు. ఆపై ప్రాణాలు పోతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 10 మంది పాడి రైతులుకు చెందిన 130కి పైగా జీవాలు మృత్యువాతపడ్డాయని వాపోతున్నారు. చలించని పశువైద్యశాఖ మేకలు, గొర్రెలకు చంద్రగిరిలోని పశుసంవర్థక శాఖ కార్యాలయంతో పాటు తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో సైతం చికిత్స చేయిస్తున్నట్టు పెంపకందారులు చెబుతున్నారు. అక్కడి వైద్యాధికారులు నామమాత్రపు చికిత్సలు చేసి పంపుతున్నారని, వారు చికిత్స చేసినా మరణాలు ఆగడం లేదని వాపోతున్నారు. వ్యాధి ఏమిటనేది అధికారులే నిర్ధారించకపోతున్నారని ఆరోపిస్తున్నారు. చివరకు మృతి చెందిన గొర్రెను పోస్టుమార్టం సైతం నిర్వహించారని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటాలు మృతి చెందుతున్న జీవాలను కొంత మంది పాడి రైతులు తక్కువ ధరకే మార్కెట్లకు విక్రయిస్తున్నారు. వాటిని రోజుల తరబడి ఫ్రిడ్జ్లతో నిల్వ చేసి ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చంద్రగిరి, తొండవాడ, ఏ.రంగంపేటతో పాటు తిరుపతి రూరల్లోని కాలూరు, మల్లవరం, పుదిపట్ల, చెర్లోపల్లిలోని మాసం దుకాణాదారులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఆదివారంతో పాటు మరో రెండు రోజులు వాటిని విక్రయిస్తున్నారు. వ్యాధులు సోకి మృతి చెందిన జీవాలను దహనం చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ అలా చేయడం లేదు. -
రమ్యమైన జీవితాన్నివ్వండి
పెద్దపంజాణి:ఆమె ఉన్నత విద్య అభ్యసిస్తోంది. కోర్సు పూర్తికావస్తుండడంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశపడింది. విధి చిన్న చూపు చూసింది. అరుదైన వ్యాధి ఆమెను పట్టుకుంది. భవిష్యత్తుౖపై ఎన్నో ఆశలు పెట్టు కున్న ఆమె నేడు ప్రాణాల కోసం పోరాటం చేస్తోంది. పెద్దపంజాణి మండలం కరసనపల్లికి చెందిన వెంకటరమణ, లక్ష్మీ దంపతుల కుమార్తె రమ్యశ్రీ సీఏ చదువుతోంది. ప్రస్తుతం ఫైనలియర్లో ఉంది. త్వరలో కోర్సు పూర్తికానున్న నేపథ్యంలో ఆమె కు ఫాంజియోలియోమయోమాటోసిన్ అనే అరుదైన ఊపిరి తిత్తుల వ్యాధి వచ్చింది. ఇది మహిళల్లో అరుదుగా కనిపిస్తుందని, దీనివల్ల ఊపిరితిత్తుల్లో అసాధారణ కణాల పెరుగుదల జరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని వైద్యులు తెలిపారు. వ్యాధి ముదిరిన దశలో ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే పరిష్కారమని పేర్కొన్నారు. ఇందుకు సుమారు రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు ఏమి చేయాలో దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు.ఒకప్పుడు కుటుంబ సభ్యు లతో సంతోషంగా గడిపిన రమ్యశ్రీ ఇప్పుడు వెంటిలేటర్పై ఉండి ప్రాణాల కోసం పోరాటం చేస్తోంది. ఇప్పటికే ఉన్న పొదుపు మొత్తం చికిత్సకే ఖర్చు కావడంతో తల్లిదండ్రులు బిడ్డను బతికించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా, క్రౌడ్ ఫండింగ్ వేదికల ద్వారా నిధుల సేకరణ కొనసాగుతోంది. రమ్యశ్రీ ప్రాణాలను కాపాడేందుకు తమకు చేతనైనంత సహాయం అందించాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రజలను వేడుకుంటున్నారు. -
దోపిడీనే అభివృద్ధా!
రాష్ట్రాభివృద్ధి పేరుతో ప్రజలను చంద్రబాబు, లోకేష్ దోచుకుంటూ మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆరోపించారు.సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని.. మాది కదిరి దగ్గర ముట్టుకుల్లె. చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ కంప్యూటర్స్ ఒకేషనల్ కోర్సు చదివా. ఇంటర్లో 1000 మార్కులకు 966మార్కులు సాధించా. షైనింగ్ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మా తండ్రి కూలీ. ప్రస్తుతం మా చదువు కోసం కేరళలో కూలి పనిచేస్తున్నారు. ఆయనను ప్రతినిత్యం తలచుకుంటూ ఎలాగైనా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా రాణించి కుటుంబాన్ని సంతోషపెట్టాలన్నదే నా లక్ష్యం. – దినేష్ కుమార్ నాయక్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, చంద్రగిరి -
గరుడునిపై వెంకన్న విహారం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సాక్షాత్కార వైభవోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం గరుడ వాహనంపై శ్రీవారు విహరించారు. ఈ సందర్భంగా దేవదేవేరులకు కనులపండువగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం వేడుకగా స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం వైభవంగా ఊంజల్ సేవ చేశారు. అనంతరం గరుడునిపై స్వామివారిని కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. వైభవోత్సవాల్లో భాగంగా సోమవారం పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. -
ఏఈఈ పోస్టుల దరఖాస్తులకు నేడే ఆఖరు
● ఆగస్ట్ 22 నుంచి 29 వరకు రాత పరీక్షలు తిరుపతి రూరల్ : ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల దరఖాస్తులను సోమవారంతో గడువు పూర్తవుతుందని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్ట్ 22 నుంచి 29వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ తేదీల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. దళారుల మాటలు, సామాజిక మాధ్యమాల ద్వారా వెలువడే సమాచారం నమ్మవద్దని కోరారు. నేడు ‘డయల్ యువర్ సీఎండీ’ తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661 నంబర్కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని వివరించారు. ఫోన్ చేసిన సమయంలో వినియోగదారులు తమ విద్యుత్ సర్వీస్ నంబర్ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆలస్యంగా నడిచిన రైళ్లు దొరవారిసత్రం : సాంకేతిక సమస్యల కారణంగా ఆదివారం పలు రైల్లు ఆలస్యంగా నడిచాయి. దొరవారిసత్రం రైల్వేస్టేషన్కు సమీపంలో డౌన్లైన్ పట్టాలపై సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడడంతో చైన్నెఽ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు సుమారు అరగంట ఆలస్యంగా నడిచినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. తొలుత చైన్నె నుంచి నెల్లూరుకు వెళ్లే మెమో రైలు 97 కిలోమీటర్ వద్ద ఆగిపోయింది. అలాగే మధురై నుంచి నిజాముద్దీన్కు వెళ్లే నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ 96 కిలోమీటర్ వద్ద నిలిచిపోయింది. చైన్నె నుంచి అహ్మదాబాద్కు వెళ్లే నవజీవన్ ఎక్స్ప్రెస్ 94 కిలోమీటర్ వద్ద ఆగిపోయింది. రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. నేటి నుంచి దస్తావేజు లేఖర్ల సమ్మె ప్రశ్నార్థకంగా రిజిస్ట్రేషన్లు తిరుపతి అర్బన్ : రిజిస్ట్రేషన్ కార్యాలయాల పగ్గాలను ఈ నెలాఖరు నుంచి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. దీని జిల్లాలోని దస్తావేజు లేఖర్లు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైఖరి కారణంగా తమ ఉపాధికి గండి పడుతుందని వాపోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తమను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తులకు సంబందించి రిజి స్ట్రేషన్ల ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారనుంది. -
మహిళ మెడలో గొలుసు చోరీ
సూళ్లూరుపేట : పట్టణంలోని పార్క్వీధిలో సత్య జూనియర్ కళాశాల ఎదురుగా ఓ మహిళ మెడలో గొలుసును గుర్తుతెలియని వ్యక్తుల లాక్కెళ్లారు. శనివారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సీపీ ఫుటేజీని ఆదివారం పరిశీలించారు. బాధితురాలు మరో మహిళతో కలిసి బజారులో వెళుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. అపహరణకు గురైన బంగారు గొలుసు 24 గ్రాములు ఉంటుందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ అజయ్కుమార్ తెలిపారు. బావిలో పడి యువకుడి మృతి ఓజిలి : మండలంలోని మానమాలలో ఆదివారం చేపలను పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మన్నూరు వెంకటేష్(35) అనే యువకుడు మృతి చెందాడు. వివరాలు.. వెంకటేష్ కొంతకాలంగా ఫిట్స్తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని బావి వద్దకు చేపలు పట్టుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో ఫిట్స్ రావడంతో బావిలో పడిపోయాడు. వెంకటేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా బావిలో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయం కోరి.. సెల్ఫోన్ లాక్కెళ్లి..! వరదయ్యపాళెం : మండలంలోని సంతవేలూరు మార్గంలో వీరాస్వామినగర్ వద్ద ఓ యువకుడి సెల్ఫోన్ను ఇద్దరు దుండగులు అపహరించారు. వివరాలు.. కళత్తూరు గిరిజన కాలనీకి చెందిన కె.శరత్కుమార్(18) ఆదివారం బైక్పై వరదయ్యపాళెం వెళ్లి తిరిగివస్తుండగా ఇద్దరు యువకులు అడ్డుకున్నారు. తమ బైక్లో పెట్రోల్ అయిపోయిందని, సాయం చేయాలని తమిళంలో కోరారు. ఇందుకు అంగీకరించిన శరత్ కొంతదూరంపాటు వారి బైక్ను కాలితో నెట్టుకుంటూ తన బైక్తో తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వారిలో ఒకడు శరత్ బైక్పై కూర్చుని హఠాత్తుగా జేబులోని సెల్ఫోన్ను లాక్కునేందుకు యత్నించాడు. శరత్ ప్రతిఘటించడంతో ఇద్దరు దుండగులు బీరు సీసాతో దాడి చేశారు. అనంతరం సెల్ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వరదయ్యపాళెం ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. ప్రహరీ గోడ ధ్వంసంపై కేసు తిరుపతి క్రైమ్ : నగరంలోని కృష్ణతేజ థియేటర్ సమీపంలో నిర్మిస్తున్న ప్రహరీ గోడను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. రేణిగుంట రోడ్డు ప్రాంతానికి చెందిన ఏజీపీ సిటీ ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజర్ తల్లూరు చాణక్య (38) కృష్ణతేజ థియేటర్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సీఎన్జీ స్టేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో నిర్మాణ పనులు ముగించుకుని సిబ్బందితో కలిసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిర్మాణ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, రాత్రి నిర్మించిన ప్రహరీ గోడ, బేస్మెంట్ సెంటరింగ్తో పాటు ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.50 వేల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 90,045 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,573 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
శ్రీవారి సేవలో శ్రీరంగం పీఠాధిపతి
తిరుమల: శ్రీరంగం శ్రీమత్ ఆండవన్ఆశ్రమం పీఠాధిపతి వరాహ మహాదేశికన్స్వామీజీ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామీజీ తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకోగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఆలయ పేస్కార్ రామకృష్ణ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీశ్రీ వరాహ మహాదేశికన్ స్వామీజీకి సంప్రదాయబద్ధంగా శ్రీవారి చటారి సమర్పించి ఆలయ మర్యాదలు నిర్వహించారు. అనంతరం స్వామీజీ ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తదనంతరం మఠంలో నిర్వహించిన కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు స్వామీజీతో మర్యాదపూర్వకంగా సమావేశమై పలు ఆధ్యాత్మిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అర్చకులు, వేద పండితులు, మఠ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరిష్కుమార్సింగ్, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ఆచార్య, మహారాష్ట్ర మినిస్టర్ నితీష్ నారాయణ రాణే, ఎంపీ నారాయణ రాణే, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. -
ఆశలకు నిబంధన
తిరుపతి సిటీ : యూనివర్సిటీల్లో శాశ్వత అధ్యాపక పోస్టులను వేల సంఖ్యలో భర్తీ చేస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా విడుదల చేసిన నోటిఫికేషన్లో లోగుట్టు బయటపడింది. అడ్డగోలు నిబంధనలతో దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అభ్యర్థుల ఆశలను అడియాశలు చేస్తూ కడుపుకొట్టింది. దారుణంగా కఠిన నిబంధనలు విధించడంలో స్కూటినీ ప్రక్రియలో పలు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సుమారు 90శాతం మందిపై అనర్హత వేటు పడింది. యూజీసీ పేస్కేల్తో మెలిక అధ్యాపకపోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేసేందుకు పలు నిబంధనలను తెరపైకి తీసుకువచ్చారు. యూజీసీ పేస్కేలుతోపాటు సుమారు 8ఏళ్ల పాటు బోధన అనుభవం ఉంటేనే అధ్యాపక పోస్టులకు అర్హులంటూ మెలిక పెట్టేశారు. దీంతో వేలాది మంది దరఖాస్తులను అనర్హుల జాబితాలో చేర్చారు. ఎస్వీయూలో 1,292 దరఖాస్తులకు గాను 130 దరఖాస్తులను అర్హత జాబితాలో ఉంచి మిగిలిన 1,162 దరఖాస్తులు అనర్హులంటూ తిరస్కరించారు. అలాగే పద్మావతి మహిళావర్సిటీకి సంబంధించి అధ్యాపక పోస్టుల కోసం 370మంది దరఖాస్తు చేసుకోగా అందులో 352 మంది దరఖాస్తులు అనర్హులంటూ తొలగించారు. కుప్పం ద్రవిడ వర్సిటీలోని పోస్టులకు 369 దరఖాస్తులు రాగా అందులో 348 దరఖాస్తులను నిబంధనల పేరుతో తొలగించారు. దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎస్వీయూ, మహిళా వర్సిటీ, ద్రవిడ వర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వర్సిటీల్లో 10 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులకు దాదాపు యూజీసీ పే స్కేల్ స్థాయి ఎవరికీ కల్పించలేదు. దీంతో ఎంతో ఆశతో శాశ్వత అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు అందరినీ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఇంత దారుణంగా అడ్డగోలు నిబంధనలు పెట్టి తమ కడుపు కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలకు లోబడిన మరికొందరు అభ్యర్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. యూజీసీ పేస్కేల్తో పాటు తగిన అనుభవం ఉన్నా ఏ సబ్జెక్ట్లో పీజీ పూర్తి చేసి ఉంటారో అదే సబ్జెక్ట్లో పీహెచ్డీ పూర్తి చేసి ఉన్న వారు మాత్రమే అర్హులని, అనుబంధ సబ్జెక్టులలో పీహెచ్డీ చేసిన వారు అనర్హులని మరో నిబంధన విధించి దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. జీఓ నంబర్ 20 నిబంధనల ప్రకారం స్కూటినీ నిర్వహించామని చెబుతున్న అధికారులు అన్ని వర్సిటీలలోనూ ఒకే నిబంధనలు వర్తింపజేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి అసోసియేట్ ప్రొఫెసర్ అర్హత, అనర్హత జాబితాలోని లోపాలను సరిచేసి కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను గుర్తించాలని, ఈ మేరకు జాబితాను విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.తండ్రి బాటలోనే తనయుడు లోకేష్ నడుస్తున్నారు. చంద్రబాబు వైఖరినే కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో అవి చేస్తాం.. ఇవి చేస్తామని ఊరించి ప్రజలకు టోపీ పెట్టినట్టుగానే.. చినబాబు సైతం ఉద్యోగాల పేరుతో ఊరించి మొండిచేయి చూపుతున్నారు. అందులో భాగంగానే విశ్వవిద్యాలయాల్లో శాశ్వత అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వేలాదిమందిలో ఆశలు రేకెత్తించారు. అనంతరం అడ్డగోలు నిబంధనలు విధించి దరఖాస్తు చేసుకున్నవారిలో 90శాతం మందిని అనర్హులంటూ ముద్ర వేసి తప్పించేశారు. ఇందులో ఏళ్ల తరబడి వర్సిటీల్లో సేవలందిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ప్రధాన బాధితులుగా మారిపోయారు. ఏం చేయాలో తెలియక.. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక.. దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. -
అలరించిన నాటకం
తిరుపతి కల్చరల్ : తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఆదివారం ప్రదర్శించిన పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అభినయ ఆర్ట్స్ 26వ వార్షికోత్సవంలో భాగంగా చేపట్టిన జాతీయ నాటక, నృత్య పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు అద్భుతంగా నృత్యాలు ప్రదర్శించారు. ఆనందనిలయం, ‘అనగనగా ఓ రాత్రి, ‘నెట్ నాటికలు సందేశాత్మకంగా సాగాయి. అనంతరం కళా బృందాలను అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్,రెడ్డి ఘనంగా సత్కరించారు. నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’ తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు అధికారులు ఆది వారం వెల్లడించారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మండల, డివిజన్ కార్యాలయా ల్లో సైతం అర్జీలు సమర్పించవచ్చని వివరించారు. -
● రూ.100 కోట్ల సేవా కార్యక్రమాలు ● మీడియా సమావేశంలో ‘రా ఎన్టీఆర్’ ఆర్గనైజర్ సాయిరూప్
ప్రజాసేవే లక్ష్యం తిరుపతి రూరల్: రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యంగా ‘రా ఎన్టీఆర్’ సేవా సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాయిరూప్ స్పష్టం చేశారు. తమ సంస్థకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు. తిరుపతిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘రా ఎన్టీఆర్’ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. పదేళ్ల క్రితం జరిగిన ఓ ఆడియో ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఇచ్చిన పిలుపే ‘రా ఎన్టీఆర్’ ఏర్పాటుకు స్ఫూర్తి అని చెప్పారు. గ్రామాల్లో సేవ చేయాలన్న నిర్ణయం ఆ నాడే తీసుకున్నట్టు వివరించారు. ‘సేవతో యువ జాగృతి’ ద్వారా యువతలో సామాజిక చైతన్యం పెంపొందించి డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, ‘మన ఊరు – మన బాధ్యత‘ ద్వారా గ్రామాల్లో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, రైతు సదస్సులు నిర్వహించడం, ‘ఊరి మాట–పాలకుల దాకా’ కార్యక్రమంతో గ్రామీణ సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఒకటైన వస్తున్నాం.. ఊరువాడ పోస్టర్ను ఆవిష్కరించారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ను కలిసే అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. -
భక్తుల భద్రకు ప్రాధాన్యం
తిరుమల: అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం తిరుమల పద్మావతి విశ్రాంతి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత కొన్నేళ్లుగా చోటుచేసుకున్న వన్యప్రాణుల ఘటనలు, వాటి ధోరణులపై సమగ్ర విశ్లేషణ చేపట్టి, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని సూచించారు. టీటీడీ డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు మాట్లాడుతూ, గత రెండేళ్లలో చిరుతలు ఎక్కువగా సంచరించిన ప్రాంతాలు, ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాల పనితీరు, వన్యప్రాణుల సంచార ధోరణులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ సాయిబాబా, టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, తిరుమల విజిలెన్స్ అధికారి సురేంద్ర పాల్గొన్నారు. -
యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: యూపీఎస్సీకి సంబంధించిన సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాల్లో యూపీఎస్సీ పరీక్షలపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్–ఏ), ( వింగ్–బీ) రెండు సెంటర్లలో మాత్రమే ఆదివారం పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూపీఎస్సీ అబ్జర్వర్ నిధిగర్గ్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. షైనింగ్ స్టార్స్ అవార్డ్స్కు 44 మంది ఎంపిక – మహిళా వర్సిటీలో రేపు అవార్డుల ప్రదానం తిరుపతి సిటీ: తిరుపతి జిల్లాలో 2025– 2026 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసి అత్యుత్తమ మార్కులు సాధించిన 44 మంది విద్యార్థులను ఇంటర్మీడియట్ విద్యామండలి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్కు ఎంపిక చేసినట్లు డీఐఈఓ డాక్టర్ డీ.గోపాలర్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం సత్కరించి షైనింగ్ స్టార్స్గా గుర్తించనుందని చెప్పారు. ఎంపికై న విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం మహిళా వర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, ధ్రువపత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఎంపికై న 44 మందిలో ఏడుగురు విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు కావడం అభినందనీయమన్నారు. పరిశోధనలకు ప్రోత్సాహం తిరుపతి సిటీ: క్వాంటమ్ టెక్నాలజీలో పరిశోధలను ప్రోత్సహించి, అభివృద్ధి చేసేందుకు ఎస్వీయూ పెద్ద పీఠ వేస్తుందని వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. శనివారం వర్సిటీ సెనేట్ హాల్లో రూసా ఫేజ్ 2, ఎస్వీయూ క్యూఏఐసీ ఆంధ్రప్రదేశ్ సైనన్స్ సిటీ, అమరావతి క్వాంటం వ్యాలీ సంయుక్తంగా నిర్వహించిన క్వాంటమ్ టెక్నాలజీ పై జరిగిన వర్క్షాప్నకు ఆయన హాజరై పలువురు ప్రముఖులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి క్వాంటం వ్యాలీ దార్శనికతకు అనుగుణంగా, క్వాంటం టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధికి వర్సిటీ ప్రధాన కేంద్రంగా మారడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సీఈఓ వెంకటేశ్వర్లు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ సలహాదారు డాక్టర్ వెంకటస్వామి, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, రూసా కో–ఆర్డినేటర్ ఆచార్య సుచరితతో పాటు సైన్స్, ఇంజినీరింగ్, ఎంసీఏ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ల జారీ జాప్యం ‘సర్’ తిరుపతి అర్బన్: విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్ జారీ విషయంలో జాప్యం నెలకొంటోంది. 2026–27 విద్యా సంవత్సరం నేపథ్యంలో జూన్ నుంచి ఆగస్టు వరకు వివిధ కోర్సుల్లో చేరాల్సిన విద్యార్థులు కులధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ, స్థానికత సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ తదితర యాభై రకాలకు పైగా సర్టిఫికెట్స్ను తీసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు తహసీల్దార్లు సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) పేరుతో తాము క్షేత్ర స్థాయిలో ఉన్నామంటూ కార్యాలయానికి రావడం మానేశారు. వచ్చినా సర్టిఫికెట్స్ జోలికి వెళ్లకుండా అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు తాము బిజీగా ఉంటామని, ఆ తర్వాత రావాలని తల్లిదండ్రులు, విద్యార్థులకు సూచిస్తున్నట్టు సమాచారం. -
విక్రమార్కుడు
విక్రమ్–1 రాకెట్ ప్రయోగం దిగ్విజయం నింగిలోకి దూసుకెళ్తున్న విక్రమ్–1 రాకెట్సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్ థవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు చెందిన విక్రమ్–1 రాకెట్ను శనివారం మధ్యాహ్నం 12:05:30 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. రాకెట్ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయ 6 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రయోగ సమయంలో మరో 4.59 నిమిషాలుండగా కౌంట్డౌన్ ప్రక్రియ ఉన్నట్టుండి ఆగిపోయింది. వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలు స్కైరూట్ ప్రతినిధులు ఆందోళన చెందారు. ప్రయోగానికి ఐదు నిమిషాల ముందు ఈ చిన్నపాటి సాంకేతిక లోపాన్ని సవరించుకుని 30 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగాన్ని నిర్వహించారు. రాకెట్ ద్వారా ఆరు బుల్లి తరహా ఉపగ్రహాలను రోదశీలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇస్రో చరిత్రలో మొట్టమొదటి ప్రయివేట్ రాకెట్ కాబట్టి ఈ ప్రయోగాన్ని ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. నాలుగు దశల్లో రాకెట్ ప్రయోగం ఇలా.. రాకెట్ నాలుగు దశలతో విజయవంతంగా ప్రయోగించారు. మొదటి మూడు దశలు ఘన ఇంధనంతో, నాలుగో దశ ద్రవ ఇంధనంతో ప్రయోగించే విధంగా డిజైన్ చేసుకున్నారు. 22 మీటర్లు పొడవు, 1.7 మీటర్ల వెడల్పు కలిగిన రాకెట్ ప్రయోగ సమయంలో 1.5 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి నిప్పులు చిమ్ముతూ రివ్వున దూసుకెళ్లింది. మొదటి దశకు కలాం–1,200, రెండో దశకు కలాం–250, మూడో దశకు కలాం–100 దశలను ఘన ఇందనంతో రూపొందించారు. నాలుగో దశలో మోనో మీథైల్ హైడ్రోజన్ (ఎంఎంహెచ్), నైట్రోజన్ టెట్రాకై ్సడ్ (ఎన్టీఓ) శక్తితో పనిచేసే నాలుగు రామన్–1 ఇంజిన్ల సమూహంతో రూపొందించారు. ఇది మొత్తంగా 3.4 కేఎన్ థ్రస్ట్ను అందిండంతో 350 కేజీల బరువు కలిగిన ఆరు చిన్న తరహా ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టేందుకు వీలైంది. దిగ్విజయంగా.. విక్రమ్–1 ప్రయోగాన్ని వీక్షించేందుకు విచ్చేసిన విద్యార్థులు విక్రమ్–1 రాకెట్ ప్రయోగం దిగ్విజ యంగా పూర్తయ్యింది. మధ్యలో కౌంట్డౌన్ ప్రక్రియ నిలిచిపోయి ఆందోళనలో పడేసింది. మళ్లీ శాస్త్ర వేత్తలు సరిచేసి రాకెట్ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో భారతావని సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా విద్యార్థుల ఈలలు, కేకలు, చప్పట్లతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. విద్యార్థుల కోలాహలం విక్రమ్–1 ప్రయోగాన్ని వీక్షించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూల్స్ విద్యార్థులతో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు విచ్చేశారు. షార్ కేంద్రంలోనే శబరి గిరిజన కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ నుంచి ప్రయోగాన్ని వీక్షించారు. రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగివైపు వెళుతున్నంత సేపు విద్యార్థులు ఈలలు, చప్పట్లు, కేకలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. -
ఎస్వీయూలో జాబ్మేళా రేపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో సోమవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ శ్రీనివాసులు తెలిపారు. పేరుగాంచిన ఎమ్ఎన్సీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్మేళాలో పాల్గొని సుమారు 600 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని తెలిపారు. ఎస్ఎస్స్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, ఏదైని డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపటి నుంచి దస్తావేజు లేఖరుల నిరసనలు శ్రీకాళహస్తి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీఓ నం.396ను నిరశిస్తూ సోమవారం నుంచి తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తా వేజు లేఖరులు, స్టాంపు వెండర్లు నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. దస్తావేజు లేఖర్లు పెన్డౌన్ నిర్వహించనుండడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. స్టాంపుల కథ కంచికే జిల్లాలో ప్రతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆనుకొని అనేక మంది స్టాంపు వెండర్లు జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి లైసెను్ుస్ల తెచ్చుకుని స్టాంపు వెండర్లుగా కాలం నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ నూతన విధానంతో అసలు స్టాంపు పత్రాలే అవసరం ఉండదు. తద్వారా రిజిస్ట్రేషన్లకు స్టాంపు పత్రాల కొనుగోలు అవసరం ఉండదు. ఫలితంగా వేలాది మంది స్టాంపు వెండర్లు జీవనోపాధి కోల్పేయే ప్రమాదం ఉంది. సబ్ రిజిస్ట్రార్లకు వినతిపత్రాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న పెన్ డౌన్ కార్యక్రమానికి సంబంధించి శనివారం జిల్లాలోని అనేక చోట్ల దస్తావేజు లేఖరులు సంబంధిచి సబ్ రిజిస్ట్రార్లకు వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వం పునరాలోచించి ఆ జీఓను వెనక్కి తీసుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. -
18 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం
– తమిళ స్మగ్లర్ అరెస్టు భాకరాపేట: భాకరాపేట అటవీశాఖ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో శనివారం 18 ఎరచ్రందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకొని స్మగ్లర్ను అరెస్టు చేసినట్లు భాకరాపేట రేంజ్ అటవీ క్షేత్రాధికారి ఎన్. వెంకటరమణ తెలిపారు. చిన్నగొట్టిగల్లు మీదుగా తమిళనాడుకు కారులో ఎరచ్రందనం అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతి జిల్లా అటవీశాఖాధికారి వి.సాయిబాబా ఆదేశాలతో భాకరాపేట రేంజ్ అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్లు కలిసి శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రత్యేక నిఘా ఉంచి, వాహనాలను తనిఖీ చేశారు. కోటబైలు క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున చిన్నగొట్టిగల్లు వైపు నుంచి అతి వేగంగా వచ్చిన కారును ఆపేందుకు ప్రయత్నించారు. కారు ఆపిన వెంటనే డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది చుట్టుముట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 18 ఎరచ్రందనం దుంగలు గుర్తించారు. వాటితో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కారు, ఎరచ్రందనం దుంగల విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ దాడిలో అటవీ బీట్ అధికారులు ఎం.సదాశివయ్య, జేబీ నిఖిల్, వై.రాజేష్కుమార్, సి.రవి, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు. -
బరితెగిస్తున్న గేటు వసూళ్లదారులు
రేణిగుంట: రేణిగుంట వారపు సంతలో గేటు వసూళ్ల దారులు రెచ్చిపోతున్నారు. వ్యాపారులు అడిగినంత ఇవ్వడం లేదని దాడులకు తెగబడుతున్నారు. మరికొందరిపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ బూతుపురాం అందుకుంటున్నారు. శనివారం రాత్రి రేణిగుంటలోని వారపు సంతలో భార్యాభర్త ఇద్దరు కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. గేటు వసూళ్లదారులు వచ్చి అధిక మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించడంతో భార్యాభర్తలిద్దరిపై దాడికి యత్నించారు. అడిగినంత ఇస్తేనే వ్యాపారాలు చేసుకోవాలని, లేదంటే మీకు దిక్కున చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. చుట్టుపక్కల వాళ్లు వీడియోలు తీయడం మొదలు పెట్టడంతో గేటు వసూళ్లుదారులు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ప్రతి వారం ఇలాంటివి నిత్యకృత్యంగా మారుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. -
లెక్క పక్కాగా ఉండాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ‘దేశ వ్యాప్తంగా ఆస్తులను కలిగి ఉన్న శ్రీస్వామి హథీరాంజీ మఠం ఆస్తుల వివరాలు, లావాదేవీలు పక్కాగా ఉండాలి. ఆగస్టులో మళ్లీ వస్తాం. ఆస్తుల వ్యవహారం తెలుస్తాం’ అని నిర్వాహక అధికార పరిపాలన కమిటీ హెచ్చరించినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు నియమించిన హథీరాంజీ మఠం పరిపాలన కమిటీ శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు తిరుపతి గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠానికి చేరుకుని భూ వ్యవహారాలు, తదితర అంశాలపై సిబ్బందిని అడిగి వివరాలు సేకరించింది. మహంతుగా అర్జున్దాస్ బాధ్యతలు చేపట్టకముందు మఠానికి ఉన్న ఆస్తులు, ఎక్కడ ఉన్నాయో, ఏయే సర్వే నెంబర్లలో ఉన్నాయో సమగ్ర సమాచారం అందించాలని పరిపాలన కమిటీ ఆదేశించినట్లు సమాచారం. కమిటీ విచారణకు వస్తుందని తెలిసినా కొంతమంది ఉద్యోగులు విధులకు రాకపోవడంపై ఆగ్రహించినట్లు తెలుస్తోంది. మఠంకు సంబంధించి తిరుపతికి ఒక నగదు రికార్డు, తిరుమలకు ఒక నగదు రికార్డు పరిపాలనపరంగా నిర్వహిస్తుండగా, తిరుపతికి సంబంధించి గత ఏడాది అక్టోబర్ నుంచి నగదు పుస్తకంలో ఎటువంటి లావాదేవీలు నమోదు జరగలేదనే విషయాన్ని గుర్తించినట్లు తెలిస్తోంది. తిరుమలకు సంబంధించిన ఈ ఏడాది మార్చి వరకు మాత్రమే నమోదు అయిందనే విషయం పై అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చైర్మన్ జస్టిస్ డీవీ రమణ, సభ్యులు తీవ్ర అసంతృప్తి చేసినట్టు సమాచారం. 2006 తర్వాత మఠం భూములకు సంబంధించి లీజు ప్రక్రియ, దాని ద్వారా వచ్చే నగదు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు ఎన్ని, ఈ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి... తదితర వివరాలతో కూడిన నివేదికను తయారు చేయాలని అడ్మినిస్ట్రేటివ్ కమిటీ భావించింది. నలుగురు సభ్యులతో స్టాప్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కమిటీ మఠం లా ఆఫీసర్ కవిత, ఏఈవో కృష్ణారెడ్డి, హెడ్స్గా మఠం సిబ్బంది సీతారామయ్య, సుబ్రహ్మణ్యం అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సూచించిన విధంగా నివేదికలను తయారు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు రెండో వారంలో ప్రతి ఒక్క ఉద్యోగి రికార్డులతో సిద్ధంగా ఉండాలని అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చైర్మన్ దుప్పల వెంకటరమణ, సభ్యులు మఠం అధికార సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. కాగా కమిటీ విచారణకు సభ్యునిగా నియమితులైన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర హాజరు కాలేదని తెలిసింది. -
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రవేశం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం శ్రీరంగం నుంచి పట్టువ్రస్తాల సమర్పణ వైభవంగా జరుగుతుండగా, మరోవైపు మహాద్వారం గుండా అనుమతి లేకుండానే ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధుల కథనం ప్రకారం.. రాజారెడ్డి అనే వ్యక్తి అధికారిక అనుమతి లేకుండానే శుక్రవారం తిరుమల ఆలయ మహాద్వారం ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తమిళనాడు దేవదాయశాఖ మంత్రి, కమిషనర్, వారి కుటుంబ సభ్యులతో కూడిన బృందానికి టీటీడీ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు సమాచారం. అయితే, ఆ అధికారిక జాబితాలో లేని వ్యక్తి వారితో పాటు లోపలికి వెళ్లాడని ఆరోపిస్తున్నారు. మహాద్వారం వద్ద విధులు నిర్వహించే విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాల్సి ఉండగా, ఈ ఘటనలో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని భక్తులు, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
సిద్ధార్థలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్ ప్రారంభం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్ను శుక్రవారం తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లారుతూ ఐడియా ల్యాబ్లో సీఎస్సీ మెషన్కటింగ్, త్రీడి ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఐఓటీ ల్యాబ్లతో విద్యార్థులు తమ నైపుణ్యతను పెంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేటివ్ టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. యువ ఇంజినీర్లు స్టార్టప్లను, ఇంకుబేషన్ కార్యక్రమాలలో పాల్గొని మంచి ఎంటర్ప్రెన్యువర్లుగా ఎదగాలన్నారు. ఐడియా ల్యాబ్ కో–ఆర్డినేటర్ రత్నకమల మాట్లాడుతూ సాంకేతిక పరమైన ఐడియాల ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఇంప్లిమెంటేషన్, స్టార్టప్స్ అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవచ్చని తెలిపారు. కళాశాల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు అధునాతన సాంకేతిక విజ్ఞనానికి ఐడియాను, టెక్నాలజీని జోడించి అభివృద్ధి పరచడానికి ఐడియా ల్యాబ్ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ప్రిన్సిపాళ్లు రమేష్కుముద్, జనార్దనరాజు, కో–ఆర్డినేటర్ సునీల్కుమార్రెడ్డి, హెచ్వోడీలు. అధ్యాపకులు ల్గొన్నారు. -
జగన్ 2.0 యాప్ ఆవిష్కరణ
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానిస్తూ సమాచార మార్పిడి, సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చే లక్ష్యంతో రూపొందించినదే జగన్ 2.0 సూపర్ యాప్ అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసం వద్ద శుక్రవారం జగన్ 2.0 సూపర్ యాప్ను ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డితో పాటు పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ సోషల్ మీడియాలో మన వాళ్లు పోస్ట్ చేసిన పోస్టులను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్ చేయడం, కుట్రలు పన్నడం జరుగుతున్న నేపథ్యంలో జగన్ 2.0 సూపర్ యాప్ను పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చినట్టు తెలిపారు. తద్వారా ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పవచ్చన్నారు. ఈ యాప్లో మన పార్టీ వాళ్లు మాత్రమే ఉంటారని, ఎవరు పడితే వాళ్లు డిలీట్ చేసే హక్కు ఉండదన్నారు. ఇది ఒక మంచి పరిణామమన్నారు. పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటారన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, పార్టీకి సంబంధించిన ఏ అంశమైనా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమవ్వవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ యాప్ను డౌన్లోడు చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ శ్రేణులు కెఎ.సత్య, తుడా వెంకటరెడ్డి, మునిరెడ్డి, బెల్లం రమేష్, కోటూరు ఆంజినేయులు, నల్లాని బాబు, వాసుయాదవ్, రాజేష్, ఉదయ్వంశీ, పసుపులేటి సురేష్, అమరనాథ్రెడ్డి, విడగొట్టి రమణ, లవ్లీ వెంకటేష్, వెంకటేష్రాయల్, ధనశేఖర్, విజయలక్ష్మి, పుణీత తదితరులు పాల్గొన్నారు. -
రీ నీట్లో శ్రీచైతన్య విద్యార్థుల విజయకేతనం
తిరుపతి సిటీ: ఎన్టీఏ గురువారం రాత్రి విడుదల చేసిన రీ నీట్ యూజీ ఫలితాల్లో తిరుపతిలోని పలు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించి అత్యుత్తమ ర్యాంకులను కై వసం చేసుకున్నారు. శ్రీ చైతన్య విద్యార్థుల హవా తిరుపతిలోని శ్రీచైతన్య విద్యా సంస్థల విద్యార్థులు పలు కేటగిరీలలో సుమారు 145 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. విద్యార్థులు కే.మునిలక్ష్మీధర్ 1,574 ర్యాంకు, అభిజ్ఞరెడ్డి 1,800, సింధూర 3,004, ఉదయ్కుమార్ 3,467, దేవిదుర్గ 3,798, యశ్వంత్నారాయణ 3,998 ర్యాంకులు సాధించగా 10 వేల లోపు 14 ర్యాంకులు, 20 వేల లోపు 36 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను డైరెక్టర్లు సుష్మశ్రీ, నాగేంద్రబాబు, ఏజీఎం బీవీ.ప్రసాద్, డీన్లు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభినందించారు. ఏజీఎం ప్రసాద్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ర్యాంకులు వస్తాయని, వాటి ఆధారంగా ఎంబీబీఎస్లో సీట్లు కేటాయిస్తారని చెప్పారు. నారాయణ విద్యార్థుల ప్రతిభ తిరుపతి నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని డీజీఎం కొండలరావు తెలిపారు. విద్యార్థులు వైశాలి భాస్కర్ 284, నవ్యశ్రీ 578, భరత్ 1,564, సాయి మౌనిష 1,857, రెడ్డి ప్రవర్థిని 1,991, హిమేష్ చాంద్యాదవ్ 2,830 ర్యాంకులు సాధించారని చెప్పారు. వీటితో పాటు మరో 70 మంది విద్యా ర్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించబోతున్నారని తెలిపారు. ప్రతిభ చూసిన విద్యార్థులను డీన్లు శ్రీనివాసరావు, వేణుగోపాల్ అభినందించారు.


