Tirupati
-
బంగారు కొండ
●తిరుపతి సిటీ: బీవీఎస్సీ విద్యార్థిని రిషిత 9 పసిడి పతకాలను సాధించి రికార్డు నెలకొల్పింది. మార్చి 30వ తేదీన తిరుపతి వెటర్నరీ వర్సిటీ 13వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్సీ) కోర్సులో విద్యార్థిని రిషిత 9 బంగారు పతకాలు సాధించి, గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పతకాలు అందుకుని ప్రశంసలు పొందారు. వెటర్నరీ అధికారిగా సేవ చేయాలన్నదే లక్ష్యం చాలా సంతోషంగా ఉంది. నిరంతర కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం, అక్క ఆదర్శంతో 9 బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించాను. వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకోవడం గర్వంగా అనిపించింది. మాది ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, అమ్మ గృహిణి. అక్క వెటర్నరీ వైద్యురాలు. ఆమె స్ఫూర్తితో ఇన్ని పతకాలు సాధించాను. చిన్ననాటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. పదో తరగతి లో పదికి 10 పాయింట్లు, ఇంటర్లో 985 మార్కు లు సాధించి ఎంసెట్లో ర్యాంక్తో బీవీఎస్సీలో చే రాను. విజయవాడ గన్నవరం పశువైద్య కళాశాలలో బీవీఎస్సీలో సీటు సాధించి తొలి ఏడాది నుంచి కష్టపడి చదివాను. అధ్యాపకుల సహకారం మరువలేనిది. వర్సిటీ, కళాశాల, బాలికల విభాగం, ఎన్సీసీ, ఎక్స్ట్రా కరికులమ్, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఎల్పీటీ ప్రాజెక్ట్ ఇలా ఎనిమిది విభాగాల్లో టాపర్ నిలిచి బంగారుపతకాలు సాధించాను. అలాగే యూనివర్సిటీ పరిధిలో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థిగా మరో పతకం సాధించాను. దీంతో పాటు మరో వెండిపతకం సైతం లభించింది. వెటర్నరీ ఆఫీసర్గా పాడి పరిశ్రమకు సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రస్తుతం యూనివర్సిటీ పరిధిలో ఎంవీఎస్సీ చేసేందుకు సన్నద్ధమవుతున్నా. – కారు మంచి రిషిత, బీవీఎస్సీ విద్యార్థిని, గన్నవరం పశువైద్య కళాశాల -
భాకరాపేట వైపు మళ్లిన కరి
చంద్రగిరి: కొన్ని రోజులుగా చంద్రగిరి మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగు తన గమనాన్ని మార్చుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు కూచివారిపల్లి సమీపంలో తిష్ట వేసి నానా బీభత్సవం సృష్టించింది. తాజాగా మంగళవారం సాయంత్రం ఒంటరి ఏనుగు చంద్రగిరి నుంచి భాకరాపేట వైపు తన గమనాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో నాగపట్ల అటవీ ప్రాంతం నుంచి భాకారాపేట కనుమలలో రోడ్డు దాటుతుండగా ప్రయాణికులు గమనించారు. దీంతో వాహనాదారుల అప్రమత్తమయ్యే తమ వాహనాలను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఏనుగు గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒంటరి ఏనుగు హల్చల్ చంద్రగిరి మండలంలోని ఎగువ కూచివారిపల్లిలో సోమవారం అర్ధరాత్రి ఒంటరి ఏనుగు స్థ్వైర్య విహారం చేసింది. అరటి, వరి పంటలతోపాటు ఫెన్సింగ్ రాళ్లు, మోటార్లను ధ్వంసం చేసింది. నెల రోజులుగా ఏనుగు పొలాలపై దాడులు చేస్తుండటంతో సర్వం కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, గజ దాడులను అడ్డుకోవాలని కోరుతున్నారు. -
శ్రీసిటీలో తైవాన్ బృందం
శ్రీసిటీ(వరదయ్యపాళెం): ౖతెవాన్ దేశానికి చెందిన ఐదుగురు వ్యాపార ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. తైవాన్ నాన్–వోవెన్ పాబ్రిక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్(టీఎన్ ఎఫ్ఏ) సంస్థ చైర్మన్ షెల్లీ చియన్ నేతృత్వంలో విచ్చేసిన వారికి శ్రీసిటీ ప్రెసిడెంట్(ఆపరేషన్స్) సతీష్ కామత్ సాదర స్వాగతం పలికారు. పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా శ్రీసిటీ ప్రత్యేకతలను వివరిస్తూ శ్రీసిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(బిజినెస్ డెవలప్మెంట్) బోడ్గన్జార్జ్ సమగ్రంగా వివరించారు. తైవాన్కు చెందిన రెచి ప్రెసిషన్ సంస్థ శ్రీసిటీలో డైకిన్ కంపెనీతో కలసి ప్లాంట్ ఏర్పాటు చేయడాన్ని వారి దృష్టికి తెచ్చారు. వీరి పర్యటన చాల ప్రత్యేకమైనదిగా భావిస్తున్నామని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది శ్రీసిటీ, తైవాన్ మధ్య ఆర్థిక వ్యాపార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీసిటీ ప్రణాళికాబద్ధ అభివృద్ధి, రాష్ట్రప్రభుత్వ ప్రో–యాక్టివ్ దృక్పథాన్ని ప్రశంసించిన షెల్లీ చియన్, శ్రీసిఈ సందర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ అద్భుతమని కొనియాడారు. తమ పెట్టు బడులకు శ్రీసిటీ అనువైన క్రేంద్రంగా వావిస్తున్నామని, పరిశ్రమల ఏర్పాటు కోసం తప్పక పరిశీలిస్తామని తెలిపారు. పర్యటనలో భాగంగా తైవాన్ ప్రతినిధులు, శ్రీసిటీ అధికారులతో చర్చలు జరిపారు. -
బ్రహ్మర్షి ఆశ్రమంలో గవర్నర్ దంపతులు
రామచంద్రాపురం: మండల పరిధిలోని సి రామాపురం సమీపంలో ఉన్న శ్రీబ్రహ్మర్షి గురూజీ ఆశ్రమాన్ని మంగళవారం తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల దంపతులు సందర్శించారు. ముందుగా వారికి ఆశ్రమ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమ ప్రాంగణంలోని లక్ష్మీనారాయణ మందిరం, జైన్ మందిరాలను దర్శించినంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గవర్నర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. బ్యాక్లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానంచిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల (విభిన్న ప్రతిభావంతుల) బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దృష్టి లోపం గల వారికి (14 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ 2, ఏఎన్ఎం గ్రేడ్ 3 మహిళలు 11), బధిర (మూగ, చెవుడు) లోపం గల వారికి 9 పోస్టులు, ఏఎన్ఎం గ్రేడ్ 3 (మహిళ) 9, శారీరక (చలన) లోపం గల దివ్యాంగులకు 1 పోస్టు (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, జనరల్) పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలన్నారు. 01–07–2026 నాటికి 52 ఏళ్లు (42+10) మించకూడదని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 15వ తేదీ లోపు చిత్తూరు కలెక్టరేట్లోని విభిన్నప్రతిభావంతుల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాలకు www.chioorr.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కచ్చిత సమాచారంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే తిరుపతి అర్బన్: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ప్రతి కుటుంబం నుంచి కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తూ, వేగవంతంగా సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పొరబాట్లకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయ సమాచారం, సామాజిక–ఆర్థిక స్థితిగతులు పూర్తిగా పరిశీలించి నమోదు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ భరత్నాయక్, డీపీవో సుశీలాదేవి, డీడీఓ నారాయణరెడ్డి, డీఆర్డీఏ పీజీ శోభనబాబు, డీఎంహెచ్వో బాలకృష్ణనాయక్ పాల్గొన్నారు. ఏపీఆర్జేసీ దరఖాస్తుల గడువు పొడిగింపు తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గుడువు మరో మారు పొడిగించారు. మంగళవారంతో ముగిసిన దరఖాస్తుల గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి ఇంటర్ తరగతులు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ జి రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీబీఎస్ఈ విధానం అమలులో భాగంగా ఈనెల 23వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 24 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. జూన్ ఒకటో తేదీన తిరిగి కళాశాలలు పున:ప్రారంభమవుతాయని తెలియజేశారు. -
ప్రభుత్వ భూమి ఆక్రమణ
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని జగ్గరాజుపల్లి పంచాయతీ పరిధిలో తిరుపతికి చెందిన కొందరు వ్యక్తులు శ్రీనివాస్ గార్డెన్ పేరుతో ఒక వెంచర్ వేశారు. ఆ వెంచర్కు ప్రభుత్వ భూమిని ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మించారని మంగళవారం గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు మాట్లాడుతూ సర్వే నంబర్లు 107–1, 108–1,2,3, 282–20, 280, 282, 283 ఉన్న ఈ ప్రభుత్వ భూములను తిరుపతికి చెందిన శ్రీనివాసా గార్డెన్న్స్ ప్లాట్లుగా మార్చి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించారని తెలిపారు. అధికారులు సర్వే చేసి, ఆక్రమణలను తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. వ్యాపారులు ఇలా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంతో ఎస్సీ, ఎస్టీలైన తమకు జానెడు జాగా దొరకడం కష్టతరంగా మారిందని వారు వాపోయారు. మంగళవారం గ్రామస్తులు మండల తహసీల్దార్ను కలసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నేత మృతి సూళ్లూరుపేట రూరల్: మండలంలోని ఆర్టీసీ డిపో వద్ద జాతీయ రహదారి పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నేత సుధాకర్ (45) మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. దొరవారిసత్రం గొల్లపాళెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు జీ. సుధాకర్ సూళ్లూరుపేటలోని తన భార్య శ్రావణి, కుమార్తె శ్రుతిని ఆటోలో ఎక్కించుకుని గొల్లపాళెం గ్రామానికి బయలుదేరారు. సూళ్లూరుపేటలోని ఆర్టీసీ డిపో వద్ద వారు వెళతుతున్న ఆటోను వెనుకవైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడడంతో సుధాకర్ రోడ్డుపై పడ్డాడు. అదే క్రమంలో మరో మిని లారీ వేగంగా ఆతని పై ఎక్కడంతో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రావణి, శ్రుతిలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుత్రిని మెరుగైన చికిత్స కోసం చైన్నెకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం
వెంకటగిరి రూరల్: ఏపీ జోన్–4 పరిధిలో ఏపీ మోడల్ స్కూళ్ల విద్యార్థులకు ఏపీ మోడల్ స్కూల్ ద్వారా ఐఐటీ, జేఈఈ, ఈఏపీ సెట్ కోచింగ్కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తులసిజ్యోతి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏపీ జోన్–4 పరిధిలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేసిన వంద మంది బాలురకు శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఐఐటీ, జేఈఈ, ఎంసెట్లో శిక్షణలో అనుభజ్ఞలైన అధ్యాపకులచే విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడంతోపాటు అభ్యాస పాఠ్యపుస్తకాలు (స్టడీమెటీరియల్) రోజు వారీ పరీక్షలు, వారాంత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. గవర్నర్ అబ్దుల్ నజీర్కు సాదర వీడ్కోలు తిరుపతి, అన్నమయ్యసర్కిల్: రెండు రోజుల పాటు తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని మంగళవారం సాయంత్రం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి తిరుగు పయనమైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సాదర వీడ్కోలు పలికారు. ఎస్పీ సుబ్బరాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, ఏఎస్పీ రవి మనోహరచారి, ఆర్టీఓ రామ్మోహన్, వివిధ శాఖల అధికారులు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. రిజిస్ట్రార్పై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం! – ఎస్వీయూ ఈసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిపాలనా భవనంలో మంగళవారం పలు కీలక అంశాలపై వీసీ అధ్యక్షతన ఈసీ సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ సాధారణ బడ్జెట్ ప్రధాన అజెండాగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఆన్లైన్ విధానంలో సమావేశంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎడ్యుకేషన్) పలు అంశాలపై ఆరా తీశారని, రిజిస్ట్రార్ వద్ద సమగ్ర సమాచారం లేకపోవడంతో ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో బుధవారం వర్సిటీలో జరగాల్సిన అకడమిక్ సెనేట్ సైతం వాయిదా పడింది. అలాగే వర్సిటీలో ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు అధ్యాపకులపై వచ్చిన నివేదికల ప్రకారం తక్షణ చర్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇందులో ఓ ప్రొఫెసర్కు ఈసీ సమావేశంలో క్లీన్చిట్ ఇచ్చినట్టు తెలిసింది. రూ.225 కోట్ల బడ్జెట్కు ఆమోదం లభించింది. అటానమస్ కళాశాలలకు అప్లియేషన్ ఫీజు రూ.59 వేలుగా నిర్ణయించారు. -
చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు
తిరుపతి లీగల్: చెక్ బౌన్స్ కేసులో చిత్తూరు, కొంగారెడ్డిపల్లి, నీలా ఎన్ క్లేవ్కు చెందిన పీఎస్ ప్రేమ్కృష్ణకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమా నా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి పి కోటేశ్వరరావు మంగళవారం తీర్పు చెప్పా రు. పాకాల మండలం, బాలిరెడ్డిగారిపల్లెకు చెంది న పి.జయ చంద్రారెడ్డివద్ద ప్రేమ్కృష్ణ 2017 జూన్ 15వ తేదీ రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దానికి గాను ప్రేమ్కృష్ణ ఓ ప్రో నోటును రాసి ఇచ్చాడు. ఆ సొమ్ము అసలు, వడ్డీ చెల్లించే క్రమంలో 2018 జూలై 20వ తేదీ ప్రేమ్కృష్ణ రూ.5 లక్షల విలువ చేసే చెక్కును జయచంద్ర రెడ్డికి ఇచ్చాడు. అతను ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. దీంతో జయచంద్రారెడ్డి కోర్టులో ప్రేమ్కృష్ణ పై చెక్కు బౌన్స్ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రేమ్ కృష్ణకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. భూసేకరణ వేగవంతం చేయండి తిరుపతి అర్బన్: జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం జేసీ గోవిందరావుతో కలసి కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. మాట్లాడుతూ కోర్డు కేసులకు పరిష్కారం చూపుతూ భూ సేకరణ పూర్తి చేయాలని వివరించారు. రీసర్వే పనులు, మ్యుటేషన్, రెవెన్యూ క్లినిక్ పటిష్టంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. మరోవైపు పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాల ని వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, గీతాంజలి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, చైన్నె నేషనల్ హైవే పీడీ రవీంద్రనాథ్, శ్రీ సిటీ మేనేజర్ భగవాన్, సంబంధిత తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు శివప్రసాద్, భాస్కర్, శిరీష పాల్గొన్నారు. -
● తేజోమూర్తి.. స్వర్ణకీర్తి
మిరుమిట్లు గొలుపుతూ ధగధగలాడే స్వర్ణ రథంలో తేజోమూర్తి అయిన శేషాచలవాసుడు కొలువుదీరారు.. తిరువీధుల్లో విహరించారు.. భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథోత్సవం దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సిరి సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే మంగళవారం శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీవారి స్వర్ణరథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, కలియుగవైకుంఠవాసుడిని దర్శించుకున్నారు. – తిరుమల స్వర్ణరథంపై విహరిస్తున్న మలయప్పస్వామిఅది టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమావేశం.. అందరూ సీఎం ఏమి మాట్లాడుతారోనని ఉత్కంఠ.. ఆయన వ్యంగ్యోక్తులతో చులకన.. ముఖ్యనేతల నుంచి చిన్నస్థాయి నాయకుల వరకు అందరికీ చురకలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు.. అసలే రెండు వర్గాలున్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో అందరిపై తిట్ల దండకం మొదలు పెట్టడంతో అవమానంగా భావిస్తున్న నేతలు.. ఇదేమిటబ్బా అని తెలుగుతమ్ముళ్లలో అంతర్మథనం.. ఇదీ సీఎం చంద్రబాబు సూళ్లూరుపేట పర్యటన సారాంశం. అవమానం.. -
ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరా?
● కలెక్టరేట్ వద్ద బీటీఏ నిరసన ● సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తిరుపతి అర్బన్: ఉద్యోగుల సమస్యలను పట్టించుకోరా? అని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ ప్రశ్నించారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రభుత్వం సమస్యలకు పరిష్కారం చూపకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 18న విజయవాడలో జరగనున్న మహాధర్నాకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పెర్నాటి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు సిద్ధయ్య, నేతలు మల్యాద్రి, విజయమోహన్, రెడ్డప్ప, నాగరాజు, శేషయ్య, వెంకట్రావ్, సుబ్రమణ్యం, వెంకయ్య, విశ్వనాధ్, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
చెరువు కట్ట తవ్వి.. అక్రమ కట్టడం కట్టి..!
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి నగర శివార్లలో భూ ఆక్రమణ దారులు ఇప్పటి వరకు చెరువులు, కుంటలు, కాలువలను దర్జాగా కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టారు. ఇప్పుడు చెరువు కట్టను సైతం తవ్వేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. తుమ్మలగుంట నుంచి జాతీయ రహదారికి వెళ్లే దారిలో ఓంశక్తి ఆలయం వద్ద చెరువు కట్ట తవ్వేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. చెరువులోకి నీరు వచ్చినపుడు కట్ట తవ్వేయడంతో వరదనీరు గ్రామంలోకి చొరబడే అవకాశం ఉంటుందని కట్టకు ఆనుకుని నివాసముంటున్న వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టను తవ్వేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నట్టు నీటి పారుదలశాఖ, రెవెన్యూ శాఖల అధికారులకు సమాచారం అందించినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించి అక్రమ కట్టడాలను తొలగించి కట్టను యథావిధిగా పటిష్టం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రుయా సూపరింటెండెంట్గా డాక్టర్ మనోహర్
తిరుపతి తుడా: రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ బి మనోహర్ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రఘు నందన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుయా సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ రాధ ఉద్యోగ విరమణ చేశారు. ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభుతో పాటు ఉద్యోగ విరమణ చేసిన సూపరింటెండెంట్ డాక్టర్ రాధ ఇతర వైద్య అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో రాయలసీమ పరిధిలోని అన్ని మెడికల్ కళాశాలలో సీనియర్స్ జాబితాలో ముందు వరుసలో ఉన్న రుయా పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మనోహర్ను (ఎఫ్ఏసీ) సూపరింటెండెంట్గా నియమించారు. సుదీర్ఘకాలం పాటు రుయా చిన్నపిల్లల విభాగంలో ఆయన విస్తృత సేవలు అందించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి విభాగాధిపతిగా 30 వసంతాలకు పైగా విశేష సేవలు అందించారు. చిన్నపిల్ల విభాగంలో అత్యున్నత వైద్య ప్రమాణాలు అందించే స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి అమోఘం. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం న్యాయబద్ధంగా ఆయనకు దక్కాల్సిన రుయా సూపరింటెండెంట్ పోస్టులో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏడీ రమేష్, పలువురు వైద్య అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
వెయ్యి ఎకరాలు అన్యాక్రాంతం
పుల్లంపేట: మండలంలో దాదాపు వెయ్యి ఎకరాలు ప్రభుత్వభూములు అన్యాక్రాంతమయ్యాయని ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వభూములను కూటమి నాయకులు, కార్యకర్తలు దోచుకున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులకు విషయం తెలిసినప్పటికీ అటువైపు కన్నెత్తిచూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి తోడు విద్యుత్శాఖ అధికారులు అడిగిందే తడవుగా ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయడంతో కబ్జాదారులు దర్జాగా ఆక్రమణల పర్వానికి తెరలేపారని ఆరోపించారు. మండలంలోని అనంతసముద్రం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 325లో 0.03 సెంట్లు, సర్వేనంబర్ 307 శ్మశానస్థలం 0.07 సెంట్లు చూపించి ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించుకున్న ఘనత కూటమి నాయకులకే దక్కుతుందన్నారు. ఎక్కడా ప్రభుత్వం ఒక సెంటు భూమిని మంజూరు చేయకపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక మండలంలో దాదాపు 350 దొంగ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారన్నారు. రెవెన్యూ అధికారులు అనంతసముద్రం రెవెన్యూపరిధిలో రూ.6 కోట్ల విలువైన భూములను కూటమి నాయకులకు కట్టబెట్టారన్నారు. దేవసముద్రం చెరువులో నుంచి టిప్పర్లతో యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, రైతులు వ్యవసాయ అవసరాలకు అడిగితే నిబంధనలు గుర్తుకు వస్తాయా? అని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను నిలదీశారు. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం మీకే చెల్లిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ మండలంలో రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఎంపీడీఓ జయశ్రీ మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో ఇంటిపన్నులను ఆన్లైన్ విధానంలోనే స్వీకరించాలన్నారు. వైద్యాధికారి అశ్వినిచంద్ర మాట్లాడుతూ గర్భిణులకు పీఎమ్ఎస్ఎమ్ఏ పథకం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఐరన్ ఫోలిక్ యాసిడ్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ కొత్తగా ఇండ్లు మంజూరు కాలేదని హౌసింగ్ ఏఈ హరిప్రసాద్ తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఏఈ కుమార్ చౌదరి కోరారు. పశువైద్యాధికారి సుదీష్ మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కో–ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్టాక్, వైస్ ఎంపీపీలు జయశంకర్, సుబ్బరత్నమ్మ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
తెప్పపై శ్రీరామచంద్రమూర్తి
తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీరామచంద్ర పుష్కరిణిలో స్వామివారు విహరిస్తూ భక్తులకు కటాక్షించారు. తెప్పోత్సవంలో భాగంగా ఉదయం ఆలయంలో సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్రోక్తంగా చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. అక్కడ తెప్పపై సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. -
పురస్కారం.. చేసింది నమస్కారం
చిన్న ప్రశంస.. ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది.. మరిన్ని విజయాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇక రాష్ట్రస్థాయి పురస్కారమైతే ఆ సంతోషం మరింత ఎక్కువ.. అదే దేశస్థాయి పురస్కారమైతే ఆ ఆనందం మాటల్లో చెప్పనలవికానిది.. అదే నేడు శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాళెం వాసుల్లో నెలకొంది. కారణం.. ఆ పంచాయతీ దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ ఎంపికై ప్రథమస్థానం నిలిచింది.●డెయిరీకి పాలుపోస్తున్న మహిళా పాడి రైతులుతిరుపతి అర్బన్: కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్శాఖ నేతృత్వంలో ఏటా సుస్థిత అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపిన పంచాయతీలకు డీడీయూపీఎస్వీపీ (దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్) పురస్కారాన్ని అందిస్తారు. ఈ ఏడాది దేశంలోనే శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాళెం పంచాయతీని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పంచాయతీకి కేంద్ర సర్కార్ రూ.కోటి నగదు అవార్డును అందిస్తోంది. ఆ నిధులు పంచాయతీ అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. స్నేహక పూర్వక గ్రామ విభాగంలో ఈ ఎంపిక జరుగుతుంది. అందుకు ప్రధానంగా లెక్కించే అంశాలు మహిళా సానుకూల గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, నీటి స్వయం సమృద్ధి గ్రామం తదితర తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. తొమ్మిది అంశాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పంచాయతీల్లో దేశ వ్యాప్తంగా ఏటా 27 పంచాయతీలను ఎంపిక చేశారు. అందులో మొదటి స్థానంలో బొక్కసపాళెం పంచాయతీని ఎంపిక చేశారు. ఈ పంచాయతీలో వ్యవసాయం, పాడి పంటలు ప్రధాన జీవనాధారం అయినప్పటికీ మహిళలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రధానంగా టైలరింగ్, డెయిరీ ఉత్పత్తులు, కలంకారీ, సబ్బుల తయారీ తదితర వృత్తుల్లో బొక్కసంపాళెం పంచాయతీ సత్ఫలితాలు సాధించడంతో డీడీయూపీఎస్వీపీ అవార్డుకు ఎంపికై ప్రథమస్థానంలో నిలిచింది. డీపీఓ సుశీలాదేవితోపాటు గ్రామ సర్పంచ్ రేఖ, పంచాయతీ కార్యదర్శి విజయ్, డిప్యూటీ ఎంపీడీఓ పద్మజతోపాటు మహిళలకు పలు విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన వారిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు. డీడీయూపీఎస్వీపీ పురస్కారానికి బొక్కసంపాళెం ఎంపిక దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం హర్షణీయం దేశంలోనే శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాళెం పంచాయతీ ప్రథమ స్థానం దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దేశ వ్యాప్తంగా డీడీయూపీఎస్వీపీ పురస్కారానికి 27 పంచాయతీలను ఏటా ఎంపిక చేసినప్పటికీ బొక్కసంపాళెం మొదటి స్థానంలో ఉండడం అభినందనీయం. పురస్కారానికి రూ. కోటి నగదు అవార్డు రానుంది. ఆ నిధులు పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేస్తాం. పంచాయతీ ప్రజలతోపాటు అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తున్నాం. – సుశీలాదేవి, జిల్లా పంచాయితీ అధికారి -
తిరుమలలో వైభవంగా వార్షిక వసంతోత్సవాలు
తిరుమల: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది.ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఏప్రిల్ 1న పౌర్ణమి గరుడసేవ రద్దుశ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దయింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు. -
తెప్పోత్సవం..తేజోమయం
తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం రాత్రి శ్రీరామచంద్ర పుష్కరిణిలో వేడుకగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలంకరణలతో సర్వాంగ సుందరంగా అలకరించిన తెప్పపై సీతారాములు కొలువై పుష్కరిణిలో ఐదు చుట్టు ప్రదక్షిణ చేసి, భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ఆలయంలో సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, నారికేళ జలాలతో అభిషేకం చేశారు. రాత్రి సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్రపుష్కరిణికి వేంచేపు చేశా రు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెప్పపై పుష్కరిణిలో విహరిస్తున్న సీతారామలక్ష్మణులు -
ట్రావెల్స్ రెస్ట్రూమ్లో డ్రైవర్ హత్య
● బాటిల్తో దాడి చేసి పరారైన క్లీనర్.. పోలీసుల గాలింపు తిరుపతి క్రైం : నగరంలోని చింతలచేను రోడ్డులో ఉన్న మంజునాథ ట్రావెల్స్ రెస్ట్రూమ్లో ఓ డ్రైవర్ అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మృతుడు స్టాన్లీ సెల్వరాజ్ ఎం (70), తండ్రి మలోనీ, తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా రామగౌండనూర్ మల్లమూప్పన్పట్టి గ్రామానికి చెందినవాడు. అతడు మంజునాథ ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చింతలచేను రోడ్డులోని మంజునాథ ట్రావెల్స్ రెస్ట్రూమ్లో స్టాన్లీ సెల్వరాజ్ తలకు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉండగా గుర్తించారు. ఘటన సమయంలో అదే గదిలో రాజా అనే వ్యక్తి కూడా ఉన్నట్లు సహోద్యోగులు పోలీసులకు తెలిపారు. తాడిపత్రికి చెందిన రాజా అదే ట్రావెల్స్లో క్లీనర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో రాజా మృతుడిపై బాటిల్తో దాడి చేసి, అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి అనంతరం స్టాన్లీ సెల్వరాజ్ గది ముందు కుప్పకూలిపోయినట్లు తెలిసింది. కొంతసేపటి తర్వాత సహోద్యోగులు తిరుమల, చిన్న గోపీ గమనించి, వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అతడు మార్గంమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని తిరిగి రెస్ట్రూమ్ వద్దకు తీసుకువచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం నిందితుడు రాజా పరారై, తన మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
విన్టెక్ కార్మికుల ధర్నా
రేణిగుంట: మండలంలోని విమానాశ్రయ మార్గంలో ఉన్న ఔషధ తయారీ సంస్థ విన్టెక్ వద్ద సోమవారం కార్మికులు ధర్నాకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కంపెనీ గేటు ముందు బైఠాయించారు. కార్మికులు మాట్లాడుతూ, ప్రధానంగా ఆహారం, రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని, కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నామన్నారు. సుమారు 250 మంది ఆపరేటర్లు, 1000 మందికి పైగా ఉద్యోగులు ఇక్కడ సేవలందిస్తున్నారని తెలిపారు. 2025 జూన్లో విన్టెక్ కంపెనీని లెక్చర్ అనే మరో సంస్థ స్వాధీనం చేసుకుందని, ఆ సమయంలో తమ ఉద్యోగాలకు ఎటువంటి ముప్పు ఉండదని ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. మాట తప్పిన యాజమాన్యం, ఒప్పందానికి విరుద్ధంగా గతేడాది జూలై నుంచి తమను విధులకు దూరం చేశారని, కంపెనీ ఇబ్బందుల్లో ఉందంటూ బయటకు పంపించేశారని వాపోయారు. కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని, గత 20 రోజులుగా అధికారులు కూడా సరైన స్పందన ఇవ్వడం లేదన్నారు. మార్చి 14న ఇచ్చిన నోటీసు ప్రకారం ఏప్రిల్ 1 నుంచి తమకు కనీసం భోజనం, రవాణా సదుపాయాలు కూడా నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపిందని వివరించారు. ఇప్పటికే 250 మందిలో చాలా మంది వేరే పనులు వెతుక్కుని వెళ్లిపోయారని, ప్రస్తుతం ఉన్న 109 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ధర్నా చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి వింగ్టెక్, లక్స్షేర్ కంపెనీల మధ్య జరిగిన వ్యాపార వైఫల్యం కారణంగా ఉద్యోగులమైన మమ్మల్ని బలి చేయడం అన్యాయం. మా దుస్థితిని సీఎం దష్టికి తీసుకొని వెళ్లేందుకే నిరసన తెలుపుతున్నాం. సీఎంను నేరుగా కలవలేకపోయినా మా బాధ, మాకు జరిగిన అన్యాయం గురించి సీఎంకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకూ ఈ నిరసనను కొనసాగిస్తాం. – చంద్రకళ, కంపెనీ ఉద్యోగి, రేణిగుంట లేబర్ అధికారుల నిర్లక్ష్యం వల్లే.. ప్రైవేట్ కంపెనీ యాజమాన్యంతో లేబర్ అధికారులు లోపాయికార ఒప్పందం కుదుర్చుకుని కార్మికుల పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యం వల్లే కార్మికులు ప్రస్తుతం వీధిపాలయ్యారు. కార్మికులను యథావిధిగా కొనసాగించకపోతే కార్మికులకు అండగా సీఐటీయూ ఉండి జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతాం. – సెల్వరాజ్, సీఐటీయూ నేత, రేణిగుంట -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం మాజీ మంత్రి కొడాలి నాని, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కమిషనర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. టీడీపీ నేతల దాడి.. కేసు నమోదు ఏర్పేడు: మండలంలోని మేర్లపాక పంచాయతీలో ఉన్న పుష్పిత్ ఐరన్ పరిశ్రమ సిబ్బందిపై మేర్లపాక మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు రమణారెడ్డి, అతని కుమారుడు గోపాల్రెడ్డి దాడి చేయడంతో వారిపై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మేర్లపాక పంచాయతీ పరిధిలోని పుష్పిత్ ఐరన్ పరిశ్రమలోకి వెళ్లేందుకు టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రమణారెడ్డి, అతని కుమారుడు గోపాల్రెడ్డి ప్రయత్నించారు. గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో మునికృష్ణయ్య అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం బాధితుడు మునికృష్ణయ్యతో ఫిర్యాదు చేయించారు. దీంతో ఏర్పేడు పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డయాలసిస్ యంత్రాలకు విరాళం పెళ్లకూరు: సీఎం చంద్రబాబుకు సోమవారం పెళ్లకూరుకు చాగణం లలితమ్మ, భాస్కరరావు మెమోరియల్ ట్రస్టు అధినేత చాగణం గౌరీశంకర్ రూ.35.45 లక్షల చెక్కును అందజేసినట్లు ట్రస్టు సీఈఓ పెనుబల్లి సీతారామనాయుడు తెలిపారు. తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో కిడ్నీ బాధితులకు అందుబాటులో చికిత్స అందించేందుకు గాను ట్రస్టు తరఫున నాలుగు డయాలసిస్ యంత్రాలు కొనుగోలు చేయడం కోసం తమవంతు విరాళం అందించినట్లు చెప్పారు. ఈ క్రమంలో నాయుడుపేటకు విచ్చేసిన చంద్రబాబును చాగణం ట్రస్టీ గౌరీశంకర్ మర్యాదపూర్వకంగా కలిసి రూ35.45 లక్షల చెక్కును అంచారన్నారు. -
రాష్ట్ర గవర్నర్కు సాదర స్వాగతం
రేణిగుంట: రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, టాస్క్ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జెవీ.రమణ, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీ హరిరావు, శ్రీ కాళహస్తి ఆర్ర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఏపీఆర్జేసీ దరఖాస్తుల నేడు తుది గడువు తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు మంగళవారంతో ము గియనుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు అప్రమత్తం కావాలని అధికారులు సూచించారు. వచ్చే నెల 15న హాల్టికెట్లు విడుదల, అదే నెల 24వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఏపీ పాలిసెట్–2026కు వచ్చేనెల 4వ తేదీతో గడువు ముగియనుంది. 16 నుంచి ఎల్ఎల్ఎమ్ పరీక్షలు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని న్యాయ కళాశాలల్లో ఎల్ఎల్ఎమ్ మొదటి, మూడవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 16వ తేదీ నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వచ్చే నెల 4వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, 13వ తేదీన హాల్టికెట్లు విద్యార్థులకు అందించనున్నట్లు తెలియజేశారు. యువకుడి ఆత్మహత్య రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీ తాతయ్య కాలవకు చెందిన అనిల్ (25) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు గాజుల మండ్యం పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. తాతయ్య కాలవ గ్రామానికి సమీపంలోని పొలాల్లో యువకుడు ఉరివేసుకున్నాడనే సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించడంతో గాజుల మండ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానికులను విచారించగా అనిల్ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువుల వద్ద పెరిగాడని, తనకు ఎవరు లేరనే బాధతో ఆదివారం రాత్రి పొలం వద్ద ఉరి వేసుకుని ఉండవచ్చని స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆరు ఇళ్లకే ౖపైపె మెరుగులు
నాయుడుపేట బిరదవాడ సమీపంలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఆరు ఇళ్లను మాత్రమే అందంగా శోభాయమానంగా తీర్చిదిద్ది ౖపైపె మెరుగులు దిద్దారు. సోమవారం సీఎం చంద్రబాబు రెండు ఇళ్లకు గృహ ప్రవేశం చేయించారు. నాలుగు ఇళ్ల తాళాలను లబ్ధిదారులు అందజేశారు. అవి పోగా మిగిలిన టిడ్కో సముదాయంలోని చాలా బ్లాక్ల్లో పనులు పూర్తి కాలేదు. అధికారులు సీఎం చంద్రబాబు ఇళ్ల ప్రారంభం కోసం అంతా ఆర్భాటం చేశారే తప్ప, మిగిలిన ఇళ్లల్లో ఎలాంటి పనులు చేయలేదు. ఆరు ఇళ్లకు మాత్రమే మరమ్మతులు చేసి, అన్ని ఇళ్లను ప్రారంభించినట్లు హాంగామా చేశారు. -
పీజీ.. నో క్రేజీ!
హమ్మయ్యా..పరీక్షలు పూర్తయ్యాయి.. కొన్ని రోజులు విరామం.. ఆ తరువాత పోటీలో మళ్లీ పరుగు తప్పదు..డిగ్రీ పరీక్షలు రాసేశాం..ఇక ఇప్పుడేం చేయాలి.. ఉన్నత విద్యా.. ఇక చదివే ఓపిక లేదు.. ఏదో ఉద్యోగం చూసుకుంటే సరిపోద్దీ.. మళ్లీ పీజీ అంటే పీజీ సెట్ రాయాలి.. మరో రెండేళ్లు చదవాలి.. అంత కష్టం ఎక్కడబ్బా.. వద్దులే అన్నట్లుగా యువత ఉపాధి వైపు చూస్తుండడంతో పోస్ట్రుగాడ్యుయేన్ చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పీజీ సీట్లు భర్తీ కాక మిగిలిపోతున్నాయి. తిరుపతి సిటీ: పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటేనే పెద్ద చదువుగా భావించేవారు. పీజీ చేసిన వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండేది. విద్యలోనే ఉన్నత చదువుగా గుర్తింపు పొందిన పీజీకి ప్రస్తుతం ఆదరణ తగ్గడంతో యూనివర్సిటీల భవితవ్యం ఆగమ్య గోచరంగా మారింది. క్రమక్రమంగా సాధారణ పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ లాంటి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గత మూడేళ్లుగా భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నారు.ఇందుకు ప్రధాన కారణం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్, ఎంబీబీఎస్తోపాటు త్వరగా ఉపాధిని అందించే ఏఐ, మిషన్ లెర్నింగ్, కోడింగ్, క్యాంటమ్ టెక్నాలజీ అంటూ పలు ప్రొఫెషనల్ కోర్సులపై మొగ్గు చూపడంతో సాధారణ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని అధ్యాపకులు, వర్సిటీ అధికారులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు యూనివర్సిటీల్లో ఉన్నత విద్యగా గుర్తింపు పొందిన పీజీ కోర్సులకు ఆదరణ తగ్గడానికి నూతన విద్యావిధానం, కామన్ పీజీసెట్ సైతం ప్రధాన కారణమని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. భారీ స్థాయిలో తగ్గిన దరఖాస్తులు ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీ సెట్–2026కు దరఖాస్తులు గత ఏడాది కంటే సుమారు 7 వేలకు పైగా తగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని సుమారు 17 యూనివర్సిటీల్లో 30 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన పీజీ సెట్కు 18 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 30 పాఠ్యాంశాలకు సంబంధించిన కోర్సుల్లో సుమారు 24 వేలకు పైగా సీట్లు ఉన్న నేపథ్యంలో 1:1 ప్రాతిపదికన సైతం దరఖాస్తులు అందకపోవడంతో పీజీ కోర్సుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది పీజీ సెట్ పరీక్ష అర్హత సాధించిన ప్రతి విద్యారి్థకీ కచ్చితంగా సంబంధింత కోర్సులో సీటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. పలుసార్లు గడువు పొడిగించినా... పీజీసెట్కు దరఖాసులు పెంచాలని ఉన్నత విద్యామండలి విశ్వ ప్రయత్నం చేసినా దరఖాస్తులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పలుసార్లు దరఖాస్తుల గడువును పెంచుతూ ప్రసార మాద్యమాల ద్వారా ప్రచారం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు అందలేదు.మూడేళ్లుగా ఏపీపీజీ సెట్ దరఖాస్తుల పరిస్థితి ఇదీ... 2024లో... ఏపీపీజీసెట్కు అందిన దరఖాస్తులు – 33,149 మొత్తం భర్తీ కావాల్సిన పీజీ సీట్లు (31 విభాగాల్లో) – 25 వేలు పీజీసెట్ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు – 30, 207 భర్తీ అయిన సీట్లు – 22,4382025లో... పీజీ సెట్కు వచ్చిన దరఖాస్తులు – 25,688 మొత్తం భర్తీ కావాల్సిన సీట్లు – 25 వేలు గత ఏడాది పీజీసెట్ రాసిన అభ్యర్థులు –21,995 భర్తీ అయిన సీట్లు – దాదాపు 19,500పీజీ కోర్సులతో ఉన్నత స్థాయి ఉద్యోగాలు వర్సిటీల్లో పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఎన్ఈపీ ద్వారా విద్యారంగంలో పలు నూతన సంస్కరణలకు బీజం పడింది. ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పీజీ కోర్సులతో పాటు స్కిల్డెవలప్మెంట్ పెంపొందించుకోవాల్సి అవసరం ఉంది. ఈ మేరకు ప్రతి పీజీ కోర్సుల్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. డిగ్రీలో ప్రవేశాలు తగ్గడంతో పాటు డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఉద్యోగాల వైపు యువత వెళ్లడమే పీజీలో అడ్మిషన్లు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. –ప్రొఫెసర్ బి దేవప్రసాద్రాజు, పీజీసెట్–2026 కోకన్వీనర్, ఎస్వీయూ డిగ్రీలో ప్రవేశాలు తగ్గడం ఒక కారణమే ప్రస్తుతం యువత తొందరగా లైఫ్ సెటిల్మెంట్ కోసం చూస్తున్నారు. సాధారణ డిగ్రీ పూర్తి చేస్తే ఉద్యోగాలు దొరకవనే అపనమ్మకం ఇటు తల్లిదండ్రులలోనూ, అటు విద్యార్థులలోనూ పాకిపోయింది. దీంతో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి యూజీ కోర్సుల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పట్టాయి. ఆ ఎఫెక్ట్ పీజీ కోర్సులపై పడుతోంది. ప్రస్తుతం డిగ్రీ కోర్సులలోనూ ప్రధాన సబ్జెక్ట్తో పాటు ఏఐ, మిషన్ లరి్నంగ్, డేటా సైన్స్ వంటి కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఉన్నత విద్య లక్ష్యంగా విద్యార్థి అడుగులు పడాలి. –ప్రొఫెసర్ కే సురేంద్రబాబు, ఎగ్జామినేషన్ డీన్, ఎస్వీయూ నేరుగా ప్రవేశాలు కలి్పంచడం ఉత్తమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీలకు కామన్ పీజీసెట్ను నిర్వహించడంతో అడ్మిషన్లపై ప్రభావం పడుతోంది. ఆయా వర్సిటీలకు పీజీ అడ్మిషన్ల బాధ్యతను అప్పగించాలి. ఉన్నత విద్యామండలి ఈ విషయంపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. పీజీ కోర్సులకు గత వైభవం రావాలంటే పీజీసెట్ను రద్దు చేసి నేరుగా విద్యార్థి మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయించడం ఉత్తమం. అప్పుడే పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. యూనివర్సిటీలు మనుగడకు ఎటువంటి ప్రమాదం ఉండదు. –రాజేశ్వరీదేవి, ప్రైవేటు పీజీ కళాశాల అధ్యాపకురాలు, తిరుపతి మే 5 నుంచి పరీక్షలు ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీ పీజీసెట్–2026 ప్రవేశ పరీక్షకు గడువు ముగిసింది. మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పీజీసెట్ పరీక్షలు నిర్వహించనున్నాం. –ప్రొఫెసర్ పద్మావతి, పీజీసెట్ కన్వినర్, ఎస్వీయూ -
రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రాజారెడ్డి నగర్లోని సాయి నివాస్ అపార్ట్మెంట్లో దుర్ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తూ ఐదవ అంతస్తు నుంచి కింద పడిపోయి పుష్ప (13) అనే బాలిక మృతి చెందింది. పుష్ప తండ్రి ధను బహదూర్ నేపాల్కు చెందినవారు. జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి తిరుపతికి వలస వచ్చారు. సాయి నివాస్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈరోజు సాయంత్రం పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. తల్లి కాజల్ పుష్పను వెతుకుతుండగా అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు నుంచి పడినట్లు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న అలిపిరి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మోజు చిన్నారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు నాయుడుపేట సభ అట్టర్ ఫ్లాప్
నాయుడుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన తిరుపతి జిల్లా నాయుడు పేట సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఆ సభకు భారీగా జనం తరలివస్తారని అంచనా వేసిన టీడీపీ శ్రేణులకు చేదు అనుభవమే ఎదురైంది. సుమారు 70 శాతం కుర్చీలు ఆ సభా ప్రాంగణంలో ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక చంద్రబాబు మాట్లాడుతుండగా టీడ్కో లబ్ధిదారులు వెళ్లిపోయారు. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం పేరుతో టీడీపీ శ్రేణులు ఇక్కడ భారీ హంగామా చేశాయి. విపరీతమైన హడావుడి మధ్య ఈ సభ ఏర్పాటు చేసినా అది చివరకు అట్టర్ఫ్లాప్ అయ్యింది. -
తిరుపతిలో భూ దందాకు సూత్రధారి, పాత్రధారి లోకేష్: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రూ.1000 కోట్ల భూమిని కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ దందాకు సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ అని చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘కారు చౌకగా అమ్మడమే కాకుండా 15 ఏళ్ల పాటు జీఎస్టీ రియింబర్స్ చేస్తారట. స్టాండ్ డ్యూటీ కూడా రియింబర్స్మెంట్ చేస్తారట. ఎటువంటి ప్రకటన లేకుండానే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల్లో నారా లోకేష్ భాగస్వామిగా ఉన్నారా?. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమి అప్పనంగా కారు చౌకగా 22 ఎకరాలు 94 కోట్లుకు కూటమి ప్రభుత్వం అమ్మేస్తోంది. వందల కోట్లు దోపిడికి శ్రీకారం చుట్టారు.టూరిజం స్థలాలు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వాలి అంటే పీపీపీ విధానంలో ఇస్తున్నారు, దీనికి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వడం దారుణం. దివ్య శ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరు, సైబర్ సిటీ డెవలపర్ సంస్థ హైదరాబాద్ వ్యాపారాలు చేసే సంస్థలకు అమ్మేశారు. వ్యాపార ఒప్పందాలలో 15 ఏళ్ల పాటు ఏపీ జీ.ఎస్.టి ప్రోత్సాహం, స్టాంప్ డ్యూటీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు. ఐదేళ్ల పాటు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణంప్రభుత్వం ప్రకటన ఎక్కడా లేకుండా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచి పెడుతోంది. లోకేష్ ఈ రెండు సంస్థల బినామీనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టడం దారుణం. లాభదాయకం కానీ పక్షంలో ఎలాంటి చర్యలు ఉంటాయో జీవోలో స్పష్టం చేయలేదు. 300-400 కోట్లు డబ్బులు తీసుకుని 22 ఎకరాలు స్థలం మంత్రి లోకేష్కు ఇచ్చారని సమాచారం. ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇలాంటివి కేటాయించడం మతలబు ఏంటి?. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి. -
నిరంతర వ్యాయామంతో ఆరోగ్యం
ఏర్పేడు: వ్యాయామం దినచర్యగా మార్చుకుని క్రమం తప్పకుండా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని తిరుపతి ఐఐటీ డీన్ ప్రొఫెసర్ శశిధర్గుమ్మా అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఆదివారం ఉదయం ఐఐటీ క్రీడా విభాగం, ఫిట్నెస్ క్లబ్తో కలిసి ‘టైకా’ సహకారంతో 3వ ’5కే ఫిట్నెస్ ఫ్యూజన్ క్యాంపస్ రన్’ను నిర్వహించారు. తిరుపతి ఐఐటీ, ఐసర్ విద్యార్థులతో పాటు తిరుపతి, నాయుడుపేట, నెల్లూరు, కడప, చిత్తూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మొత్తం 250 మంది 5కే రన్పోటీలలో పాల్గొన్నారు. డీన్ ప్రొఫెసర్ శశిధర్ గుమ్మా జెండా ఊపి 5కే ఫిట్నెస్ ఫ్యూజన్ క్యాంపస్ రన్’ ప్రారంభించారు. మొదటి ఐదు స్థానాలలో నిలిచిన వారికి ప్రోత్సాహక నగదు బహుమతులను, పతకాలను ఐఐటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.పి.కృష్ణకుమార్, క్రీడా సలహాదారు డాక్టర్ ఎస్.ఉదయకుమార్, ఐఐటీ స్పోర్ట్స్ అధికారి అయ్యప్పన్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీ క్రీడా అధికారి డాక్టర్ అయ్యప్పన్, జూనియర్ క్రీడా అధికారులు టి. శ్రీధర్ రెడ్డి, ఎం.పవన్, ఫిట్నెస్ క్లబ్ సమన్వయకర్త జాషువా డేనియల్ పాల్గొన్నారు. మహిళలు– పురుషుల విభాగంలో మొదటి మూడు స్థానాలలో నిలిచింది వీరే మహిళల విభాగం 1.మయూరి(నాయుడుపేట 6వ తరగతి విద్యార్థిని) (మొదటి స్థానం) 2.నాగేశ్వరి(రెండవ స్థానం) 3. నిత్య(మూడవ స్థానం) పురుషుల విభాగం 1.విఽ.ధనుష్ (నల్గొండ జిల్లా ముకుందపురం) (మొదటి స్థానం) 2. సికిందర్ (రెండవ స్థానం) 3. ఎల్. శివరాజ్ (మూడవ స్థానం) -
తప్పిపోయిన బాలుడి గుర్తింపు
తిరుమల : కర్ణాటక రాష్ట్రం, యాదగిరి జిల్లా, బిరనకల్ల తండాకు చెందిన కార్తీక్ (16) తప్పిపోయిన నేపథ్యంలో ఆ బాలుడిని తిరుమల పోలీసులు గుర్తించారు. 9వ తరగతి చదువుతున్న కార్తీక్ తల్లిదండ్రులు మందలించడంతో మార్చి 20న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ నెల 23న యాదగిరి మహిళా పోలీస్ స్టేషన్న్లో కేసు నమోదు చేశారు. యాదగిరి పోలీసుల సమాచారం మేరకు తిరుమల టూ టౌన్ టౌన్ పోలీసులు వెంటనే స్పందించారు. తిరుమల పరిధిలో ఫొటో ఆధారంగా బాలుడిని గుర్తించారు. అనంతరం బాలుడిని ఆదివారం మంగళంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహానికి అప్పగించి, తదుపరి చర్యల కోసం కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ.. తిరుమలలో రద్దీ నేపథ్యంలో తప్పిపోయిన వారు, ఇంటి నుంచి వెళ్లిపోయిన వారిని గుర్తించడం సవాలే అయినప్పటికీ, 24 గంటలు కమాండ్ కంట్రోల్ సెంటర్, టీటీడీ విజిలెన్స్, పోలీసుల సమన్వయంతో ఇలాంటి కేసులను వేగంగా ఛేదిస్తున్నామని తెలిపారు. తిరుమల టు టౌన్ పోలీసులు, యాదగిరి పోలీసుల సమన్వయాన్ని ఆయన అభినందించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు తొట్టంబేడు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం.. మండలంలోని పెద్దకన్నలి పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనం, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తొట్టంబేడు ఎస్ఐ వెంకటసుబ్బయ్య, పోలీసులు క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళను వేధించిన వ్యక్తిపై కేసు తిరుపతి క్రైం: ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై నగరంలోని అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామకిషోర్ కథనం మేరకు.. తిరుపతిలోని వినాయకనగర్కు చెందిన ఓ మహిళ టీటీడీలో సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. గతంలో కుటుంబ వివాదాల సమయంలో హేమాద్రి అనే వ్యక్తి తనను ప్రెస్ రిపోర్టర్గా పరిచయం చేసుకుని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం సాన్నిహిత్యం పెంచుకుని, ఫొటోలు సేకరించి, ఆమె వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ, వెంటాడుతూ, శారీరక హాని కలిగిస్తానని బెదిరిస్తూ వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం బాధితురాలు అలిపిరి పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును అలిపిరి పోలీస్స్టేషన్ ఎస్ఐ సీ శ్రీవాణి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి స్వాధీనం : నలుగురి అరెస్టు
పాకాల: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వారిని సీఐ చినగోవిందు సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఆదివారం వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ తన సిబ్బందితో పాకాల మండల పరిధిలోని కుందేటివారిపల్లి, శంకంపల్లి రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు అనుమానాస్పద ప్రవర్తన కలిగిన నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఒక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో తిరుపతి మంచాల వీధికి చెందిన పూజారి ముని, లింగేశ్వర్ నగర్కు చెందిన ముల్లతంటి రాకేష్, తాతయ్యగుంటకు చెందిన సింగనమల్లి సునీల్కుమార్, అక్కనగారి వెంకటసాయి ఉన్నారని తెలిపారు. వీరు తిరుపతికి చెందిన జనార్దన్ వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసిందని అతడిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నిందితులపై సీఐ చినగోవిందు కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ తరుణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
యుద్ధోన్మాదాన్ని ఆపాలి
– కార్మిక, ప్రజా సంఘాల నేతల డిమాండ్ తిరుపతి కల్చరల్: అమెరికా, ఇజ్రాయిల్ ఏకపక్ష నిర్ణయంతో ఇరాన్పై కొనసాగిస్తున్న దుర్మార్గమైన యుద్దోన్మాదాన్ని వెంటనే ఆపాలని పలు రాజకీయ, కార్మిక, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం గంధమనేని శివయ్య భవన్లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు పి.మురళి, వందవాసి నాగరాజు , సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నేత వెంకటరత్నం, కాంగ్రెస్ పార్టీ నేత రాంభూపాల్రెడ్డి, ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలు రాధాకృష్ణ, లక్ష్మి, మైనారిటీ నేత ఇసాక్, ప్రజానాట్య మండలి రాష్ట్ర నేత పెంచలయ్య, కేవీపీఎస్ నేత శీను, ఏవైఎఫ్ నేత రామకృష్ణ, మహిళా సమాఖ్య నేత జయలక్ష్మి, ఆర్పీఐ దక్షిణాది నేత పి.అంజయ్య, డీహెచ్పీఎస్ నేత కాళయ్య, బీసీ సంఘర్షణ సమితి నేత బి.లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించారు. అమెరికా–ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడులను కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం ఖండించకపోవడం చూస్తుంటే ట్రంప్కు మోదీ సాగిలపడినట్లు స్పష్టం అవుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో దళిత నేతలు హరిబాబు, ధనంజయులు, దేవానందం, పౌర సమాజ చైతన్య వేదిక కార్యదర్శి ఏఎన్.పరమేశ్వరరావు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల కీచులాట
సూళ్లూరుపేట: టీడీపీ ఆవిర్భావ వేడుకలో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, సూళ్లూరుపేట టీడీపీకి గాడ్ఫాదర్లా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త కొండేపాటి గంగాప్రసాద్ సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వివాదాలు చేసుకున్నారు. ఆదివారం సూళ్లూరుపేట పట్టణంలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ సభలో పేర్లను పిలిచే క్రమంలో వేనాటి సతీష్రెడ్డి వర్గీయులు, పార్టీలో సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్రెడ్డి మధ్య వివాదాలు బహిర్గతం అయ్యాయి. సుధాకర్రెడ్డిని ఎమ్మెల్యే విజయశ్రీ, గంగాప్రసాద్ వారించినా వినకుండా ముందుకొచ్చి మరీ గట్టిగా మాట్లాడడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి వేనాటి సతీష్రెడ్డి ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఆవిర్భావ సభలో ఆయనతో పాటు ఆయన వర్గీయులు ఉన్నట్టుండి ప్రత్యక్షం కావడం అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. సతీష్రెడ్డి వర్గీయులను వేదికపై ప్రొటోకాల్ ప్రకారం పిలవాలని చెప్పడంతో వేదికపైనే సుధాకర్రెడ్డి, సతీష్రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ క్రమంలో వేదిక దిగువ భాగంలో ఉన్న సతీష్రెడ్డి వర్గీయులు పేర్లు పిలవలేదని పెద్ద ఎత్తును కేకలు వేయడంతో వేదికపై వెనుక భాగంలో ఉన్న సుధాకర్రెడ్డి అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చి వారిపై విరుచుకుపడి మాట్లాడటం విమర్శలకు దారితీసింది. పార్టీలో సీనియర్ నాయకుడనని చెప్పుకునే ఆయన ఒక్క ఉదుటను రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎమ్మెల్యే విజయశ్రీ ఏంది సార్ ఇది.. అని అంటే ఆమెకు కూడా వేలు చూపించి మరీ వాదించడం విమర్శలు చెలరేగాయి. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రూపుల వివాదం నడుస్తుండడం. ఇప్పుడు మరోసారి బహిర్గతం అయ్యాయని తెలుగుతమ్ముళ్లు అంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ కార్యాలయం వేనాటి వారికి చెందిన రూమ్లో మాత్రమే నడిచింది. ఎన్ని వివాదాలున్నా నాయకులు, కార్యకర్తలు ఇక్కడే కార్యక్రమాలు చేసేవారు. 2024లో అధికారం వచ్చాక పార్టీ కార్యాలయాన్ని మార్చడానికి సుధాకర్రెడ్డే శ్రీకారం చుట్టి తన లాడ్జిని కార్యాలయంగా మార్చేయడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అక్కడికే వెళుతున్నారు. ఇలా వివాదాలు చినికి చినికి గాలివానగా మారి ఆవిర్భావ సభ గందరగోళంగా మారింది. పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ను మరిచి పదవుల ప్రాపకం కోసం వాదులాడుకోవడం విమర్శలకు దారి తీసింది. -
అంతా మా ఇష్టం
– పంచాయతీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఓజిలి: మండలంలోని పెదపరియ గ్రామ పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం తలుపులు తెరుచుకుని పార్టీ జెండాను ఎదురుగా కట్టి ఎగురవేశారు. ఈ విషయమై ఈఓపీఆర్డీ జమీర్బాషాను వివరణ కోరగా ఈ రోజు సెలవు కావడంతో టీడీపీ నాయకులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం మా దృష్టికి రాలేదన్నారు. సోమవారం పంచాయతీ కార్యదర్శితో విచారణ చేయిస్తామని చెప్పారు. -
పెన్నాలోకి రోడ్డేసిన ఘనులు
కలువాయి (సైదాపురం): నిన్నటి వరకు తెలుగురాయపురం నందు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులు ప్రస్తుతం రాజుపాళెం నందు ఏకంగా పెన్నాలోకి రహదారి నిర్మించి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పొక్లయిన్ల సహాయంతో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. మీడియాలో వరుస కథనాలు వస్తే మమ్మల్ని ఏం చేస్తారు అంటూ బహిరంగంగానే అక్రమంగా ఇసుక తరలిస్తుంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగురాయపురం, రాజుపాళెం నందు రోజుకు వందల లారీలు తరలి వెళ్తోంది. ఇది పెన్నా నది ప్రవాహానికి ముప్పు ఏర్పడుతుందని తెలిపినా అక్రమంగా ఇసుక రవాణాను ఆపేందుకు ఏ అధికారి సాహసించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేగాక హైవేపై భారీ టిప్పర్లు వెళ్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లు ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వందల టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తుండడంతో పెన్నాలో ఇసుక మిగులుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కుల్లూరు హైవే పక్కన ఇసుక డంపింగ్ యార్డ్ అనధికారికంగా ఏర్పాటు చేశారు. పెన్నాలోకి అఢ్డంగా రహదారి నిర్మించడం వల్ల పెన్నా నది వారధి వెంబడి పంటలు వేసిన రైతులకు నీరు అందని పరిస్థితి కూడా నెలకొంటోంది. ఇసుక అక్రమ రవాణాపై వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి , నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులతో తెలుగురాయపురం అక్రమ రీచ్లో సాక్షాలతో అకమ రవాణా విషయాన్ని బయట పెట్టినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తుపాన్లు వచ్చినప్పుడు నది ప్రవాహం పొలాలు, గ్రామాలపై పొంగి పొర్లే ప్రమాదం ఉందని, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని తెలిసినా అక్రమ రవాణా ఆపే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. పెన్నానదిలో టిప్పర్ -
ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఉందా?
వెంకటగిరి(సైదాపురం): ‘మున్సిపాలిటీలో కౌన్సిలర్ల పదవీ కాలం ముగిసింది.. మరో రెండు రోజుల్లో పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉందా..?’ అని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. పట్టణంలో తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లతో కలసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను ఇంకా వేధిస్తున్నట్లు ఆరోపించారు. ఈ దిశగా అమరావతినే రాజధానిగా నియమించేందుకు సుమారు 5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మళ్లీ రాజధానికి భూములు కావాలంటూ రైతులను మరోసారి మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ఎద్దేవా చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. పెన్నా నదిని కూడా తవ్వేస్తూ పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై గ్రీన్ ట్రిబ్యునల్కు పిటిషన్ దాఖలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యులు బొలిగర్ల మస్తాన్యాదవ్, నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు చిట్టేటి హరికృష్ణ, మాజీ కౌన్సిలర్లు బాలయ్య, ఆరి శంకరయ్య, పేర్నేటి సుబ్బారావు, ఆటంబాకం శ్రీనివాసులు, గోపాల కృష్ణ, పూజారి లక్ష్మి, ఉమామహేశ్వరి, కందాటి కళ్యాణి, సుభావలి, విజయలక్ష్మి, కల్లు మల్లీశ్వరి, వైఎస్సార్సీపీ కన్వీనర్లు ప్రసాద్రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మన్నారపు రవికుమార్, వెందోటి కార్తీక్రెడ్డి, నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కందాటి రాజారెడ్డి, పూజారి శ్రీనివాసులు, చింతపట్ల మురళీ, మల్లిరెడ్డి, కొండూరు వెంకటరత్నంరాజు , అల్లంసాయి, కల్లు సతీష్, ప్రసాద్రెడ్డి, జనార్ధన్, వెందోటి బాబు, గోపాల్ యాదవ్, మోహన్రావు, రాంగోపాల్రెడ్డి, కంభం విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
కొత్త పింఛన్లేవి బాబు?
తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మాట దెవుడెరుక... కనీసం అర్హత ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు, వితంతువులకు పింఛన్లు ఇస్తే వారంతా సంతోషంగా తమ జీవనం సాగిస్తారు. జిల్లాలో తాజా లెక్కల ప్రకారం (మార్చిలో) 2,64,061 మంది పింఛన్లు తీసుకున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా పింఛన్లకు అర్హత ఉన్నవాళ్లు 60 వేల మందికి పైగా ఉన్నట్లు అధికారుల వద్ద లెక్కలు ఉన్నాయి. వీరందరికీ పింఛన్ ఇప్పిస్తే వారి సమస్యలు తీరుతాయని కనిపించిన అధికారి వద్ద బాధితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. అనుమతి ఎప్పుడు? అర్హులైన వారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో వారంతా గ్రామ, వార్డు పరిధిలోని సచివాలయాల నుంచి మండల, డివిజన్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్ వరకు పింఛన్ల కోసం తిరుగుతున్నారు. ఈ క్రమంలో అధికారులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి రాలేదంటూ సమాధానం ఇవ్వడంతో వారంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా అనుమతి ఇవ్వకుంటే...ఇంకెప్పుడు ఇస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రతినెలా జిల్లాలో 500 నుంచి 600 పింఛన్లు తగ్గిపోతున్నాయి. ఎందుకని అధికారులను ప్రశ్నిస్తే వారంతా మృతి చెందారంటూ సమాధానం ఇస్తున్నారు. పింఛన్ల సంఖ్య తగ్గిపోతున్నా..కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.రెండేళ్లుగా ఎదురుచూపులు -
వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి బంగారు తిరుచ్చిపై శ్రీసీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. కందిపప్పు ఇవ్వరా? తిరుపతి అర్బన్ : చౌక దుకాణాలను సూపర్ మార్కెట్ తరహాలో అన్ని సరుకులు పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రగల్బాలు పలికి కేవలం బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. అరకొర చక్కెర, గోధమపిండి మాత్రమే ఇస్తున్నారు. 20 నెలలుగా కందిపప్పు ఇవ్వలేదు. నూనె జాడే కనిపించలేదు. కందిపప్పు ధరలు పెరిగాయంటూ పూర్తిగా ఎగనామం పెట్టేశారు. జిల్లాలోని 1457 చౌకదుకాణాల పరిధిలో 6 లక్షల మంది కార్డుదారులుఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీలర్లు మాత్రం వచ్చే నెల కందిపప్పు వస్తుందంటూ నెలలుగా ఊరడిస్తూ వస్తున్నారు. విద్యుత్తుశాఖ తిరుపతి డివిజన్లోకి కోడూరు తిరుపతి రూరల్ : ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్తు శాఖ తిరుపతి టౌన్ డివిజన్ పరిధిలోనికి కోడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు విలీనం అయ్యాయని సీఎండీ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు తిరుపతి టౌన్ డివిజన్ పరిధిలో తిరుపతి నగరంతో పాటు తిరుపతి రూరల్ మండలంలో కొంత భాగం, రేణిగుంట మండలం వరకు పరిమితమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు, కోడూరు మండలాల్లో ఉన్న ఆరు సెక్షన్ల విద్యుత్తు సిబ్బంది తిరుపతి టౌన్ డివిజన్ ఈఈ పరిధిలోనికి వస్తారని స్పష్టం చేశారు. ఇకపై కోడూరు నియోజకవర్గంలోని విద్యుత్తు వినియోగదారులు వారి సమస్యల పరిష్కారం కోసం కడపకు వెళ్లాల్సిన అవసరం లేదని, తిరుపతి డివిజన్కు రావాల్సి ఉంటుందన్నారు. నేడు గ్రీవెన్స్ రద్దు తిరుపతి అర్బన్: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో సోమవారం పీజీఆర్ఎస్ను కలెక్టరేట్తోపాటు సచివాలయం, మండల, డివిజన్ కార్యాలయాల్లోనూ రద్దు చేశారు. అధికారులందరూ సీఎం కార్యక్రమాలలో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. -
రంగులపై రణం
ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు ప్రాంతం నగరి. ఇక్కడ పవర్ లూమ్స్తోపాటు చేనేత మగ్గాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ఎక్కువ మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు సంతోషంగా సాగుతున్న వారి జీవితాలను రంగులు నాశనం చేస్తున్నాయి. తమిళనాడులో నిషేధానికి గురైన నూలు డైయింగ్ యూనిట్లు నగరి పట్టణంలో ఏర్పాటయ్యాయి. వాటి నుంచి వచ్చే విషపూరిత రసాయనాలు భూమిలో కలిసిపోయి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ విషయం తెలిసినా పాలకులు పట్టించుకోవడం లేదు. అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పట్టణ వాసులు రోగాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతలపట్టెడలో నీటి పారుదల కాలువలో రసాయన నీరునిరుపయోగంగా ఉన్న ఈటీపీ ప్లాంటు నగరి : నగరిలో ఉన్న నేత పరిశ్రమకు అనుబంధంగా డైయింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ రాను రాను ఉత్పత్తి తగ్గిపోవడంతో పనిలేక డైయింగ్ యూనిట్లు మూతపడ్డాయి. ఇదే సమయంలో తమిళనాడులో నిషేధానికి గురైన అత్యధిక సామ ర్థ్యం కలిగిన డైయింగ్ యూనిట్ల వారు సరిహద్దులో ఉన్న నగరిపై కన్నేశారు. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం వారికి బాగా కలిసి వచ్చింది. అనుమతికి మించి సామర్థ్యం ఉన్న యూనిట్లను ఏర్పాటుచేశారు. ప్రస్తు తం 18 మిషన్ డైయింగ్ యూనిట్లు, 22 మాన్యువల్ డైయింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇవి స్థానిక పరిశ్రమల అవసరాలకంటే అనేక రెట్లు ఎక్కువ సామ ర్థ్యం కలిగినవి. వీటిలో 90 శాతం వరకు తమిళనాడుకు చెందిన ఉత్పత్తుల కోసమే పనిచేస్తున్నాయి. ఈ అంశాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ కౌన్సిల్ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నగరి పట్టణంలో రసాయనాలు వదలి సిద్ధం చేసే నూలు ఇక్కడి నుంచి సేలం, ఈ రోడ్డు వరకు సరఫరా అవుతున్నట్టు పేర్కొన్నారు. కొరవడిన పర్యవేక్షణ డైయింగ్ యూనిట్లకు అనుమతులు ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆపై అవి నిబంధనలను తుంగలో తొక్కుతున్నా అణువంతైనా చలించడం లేదు. దశాబ్దాల తరబడి నివాసాల మధ్య హాని కలిగించే యూనిట్లు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ చేపట్టిన తనిఖీలో తేలిన పలు అంశాలను కూడా పీసీబీ అధికారులు గుర్తించిన దాఖలాలు లేవు. ప్రజలకు హాని కలుగుతున్నా, పర్యావరణం పాడైపోతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆయా యూనిట్ల నుంచి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుండడంతో ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడంలో విఫలమౌతోంది. డైయింగ్ యూనిట్లను సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం.. అందుకు స్థలం చూపించి శంకుస్థాపన కూడా చేశాం అని చెబుతున్నా ఆచరణలో అమలుకావడం లేదు. స్వచ్ఛత కనుమరుగు లక్షల లీటర్ల రసాయన నీరు డైయింగ్ యూనిట్ల నుంచి బయటకు వస్తుండడంతో భూగర్భ జలాలు తాగడానికి అనువుకానివిగా మారాయి. దీనికితోడు డైయింగ్ యూనిట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండడంతో నగరిలోని భూగర్భ జలాలు స్నానానికి కూడా వీలుకాని విధంగా మారిపోయాయి. ఇప్పటికే పలువురు చర్మ, కిడ్నీ సమస్యలతోపాటు క్యాన్సర్, వెంట్రుకలు రాలిపోవడం తదితర సమస్యలతో సతమతమవుతున్నారు. తమిళనాడులో నిషేధించిన డైయింగ్ యూనిట్లను ఇక్కడ ఏర్పాటుచేయడానికి ఎందుకు అనుమతి ఇచ్చా రన్న ప్రశ్నకు సమాధానం చెప్పే నాథుడు లేడు. బీటీఎం వీధిలో కాలువల్లో పారుతున్న రసాయన నీరు మూతపడిన ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంటు మాన్యువల్ డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే రసాయన రంగునీటిని శుద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంటును ఏర్పాటుచేశారు. దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ప్లాంటు విద్యుత్ బకాయిలను చెల్లించి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చారు. యూనిట్ల వారు మళ్లీ విద్యుత్ బకాయిలు పెట్టడం, నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో మూతబడింది. దాన్ని మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఆ ప్లాంటుకు హానికర రసాయన నీటిని పంపే మాన్యువల్ డైయింగ్ యూనిట్ల నిర్వాహకులు నీటిని కాలువల్లో వదిలేస్తున్నారు. ఆ నీరు భూమిలోకి ఇంకిపోవడంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఆ నీటిని తాగుతున్న స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. నగరిలో విచ్ఛలవిడిగా డైయింగ్ యూనిట్లు ఊపందుకుంటున్న రసాయన వ్యతిరేక పోరాటం రసాయన ప్రమాదాన్ని ఇంకా ఎంతకాలం భరించాలంటూ నగరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ సమితి పేరిట ఇప్పటికే నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. పలువురు అధికారులకు వినతిపత్రాలు అందించారు. మరోవైపు ప్రజలు కూడా అధికారులను నిలదీస్తున్నారు. ఇటీవల ఏకాంబరకుప్పంలో డైయింగ్ యూనిట్ల పరిశీలనకు వెళ్లిన మున్సిపల్ కమిషనర్, అధికారులను స్థానికులు చుట్టుముట్టారు. బోర్ల నుంచి పలు రంగుల్లో నీరు వస్తోందని, దాన్ని ఎలా తాగాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలు ఉద్యమ రూపం దాల్చి ఉద్ధృతం కాకమునుపే సమస్య పరిష్కారానికి అధికారులు చొరవచూపాల్సిన అవసరం ఉంది. -
పింఛన్ కోసం తిరుగుతూనే ఉన్నాం
నాపేరు సుబ్బమ్మ, మాది కేవీబీపురం మండలంలోని ఎస్ఎల్ పురం ఎస్టీకాలనీ. మా కుమారుడు పేరు ఇ.బాలాజీ, అయితే 2024 మార్చిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన గాయాల నేపథ్యంలో మా కుమారుడు బాలాజీకి ఓ కాలు తీసివేశారు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పింఛన్ కోసం తిరుగుతున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని చెబుతున్నారు.అనుమతి వస్తే పింఛన్కు దరఖాస్తు చేసుకుంటాం. – కుమారుడు ఇ.బాలాజీతో తల్లి సుబ్బమ్మ మా బిడ్డకు పింఛన్ ఇప్పించండి నా పేరు మానస. మా భర్త గోపాలకృష్ణ, మాది శ్రీకాళహస్తి మండలంలోని జగ్గరాజు పల్లి గ్రామం. పేదరికంలో జీవనం సాగిస్తున్నాం. పోలియోతో మా బిడ్డ సామిత్(8) మంచానికే పరిమితం అయ్యాడు. పింఛన్ ఇప్పిస్తే ఆ డబ్బులతో మా బిడ్డకు వైద్యం చేయిస్తాం. వైద్య ఖర్చులు పెట్టుకోలేక అప్పులు చేయాల్సి వస్తుంది. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. – బిడ్డను చేతిలో పెట్టుకుని వెళుతున్న తల్లి మానస ఎప్పుడిస్తారా అని ఎదురుచూస్తున్నాం నా రెండు కాళ్లు పూర్తిగా సచ్చుబడిపోయాయి. మాది నారాయణవనం మండలంలోని ఎరిగంపట్టు గ్రామం, పేద కుటుంబానికి చెందిన తమకు పింఛన్ ఇప్పిస్తే ఆ నగదుతో జీవనం సాగిస్తాం. 20 నెలలుగా తిరుగుతున్నాం. అయితే అనుమతి రాలేదంటూ అధికారులు వాయిదా వేస్తున్నారు. ఎప్పుడు అనుమతి ఇస్తారోనని ఎదురుచూస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమకు పించన్ వస్తే అదే వరంగా భావిస్తాం. – నారాయణ, నారాయణవనం మండలం అనుమతి రాలేదంటున్నారు.. నా పేరు లీలావతి. ఆరోగ్యం సరిగాలేక మంచానికే పరిమితం అయ్యాను. నాగాలాపురం మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాం. బతకడం కష్టంగా మారుతోంది. పింఛన్ ఇప్పిస్తే ఆ డబ్బులతోనే నా జీవనం సాగిస్తాం. పింఛన్లు ఇవ్వడానికి అనుమతి రాలేదంటూ అధికారులు చెబుతున్నారు. ఎప్పుడు అనుమతి వస్తుందో తెలియడం లేదు. ఈ క్రమంలో కుటుంబం గడవడం కష్టంగా మారింది. – లీలావతి, వ్యాధిగ్రస్తురాలు, నాగలాపురం ● -
25 వేల గృహాలకు సోలార్ విద్యుత్ లక్ష్యం
రేణిగుంట/తిరుపతి రూరల్: ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఏప్రిల్ 14వ తేదీ లోగా 25 వేల గృహాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించామని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. రేణిగుంట పారిశ్రామికవాడలో సోలార్ పరికరాల గోడౌన్ను ఆదివారం సీఎండీ శివశంకర్ లోతేటి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. వినియోగదారులకు రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ ఆమర్చేందుకు సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఏప్రిల్ 4 నుంచి 14 వరకు ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించే ’సూర్యఘర్ ఉత్సవ్’ కార్యక్రమం ద్వారా సోలార్ విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని అన్నారు. సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ముగిసేలోగా సంస్థ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఎస్సీ,ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ను అమర్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, ఇప్పటికే సంబంధిత ఏజెన్సీలను ఆదేశించామన్నారు. సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్, ఐటి) పి. అయూబ్ ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణాదేవి, ఎం.ఉమాపతి, జనరల్ మేనేజర్ వి.విజయన్, తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్రశేఖర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చిన్న రెడ్డప్ప, బాలాజీ, గంగాధర్ రెడ్డి , రేణిగుంట సెక్షన్ ఏడీ రమేష్, ఏఈ పుణ్య కోటి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి నాలుగు మాడవీధులలో ఊరేగనున్నారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనల అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 31న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవం నిర్వహిస్తారు. 1న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా రోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అలాగే రోజూ సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఉంటుంది. ఈ సందర్భంగా మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. -
తిరుపతి శివార్లలో చెడ్డీ గ్యాంగ్
తిరుపతి రూరల్: తిరుపతి నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. తిరుపతి రూరల్ మండలం రఘునాథరిసార్ట్స్లోని ఓ ఇంటిలోకి శుక్రవారం రాత్రి కిటికీ విరిచి ప్రవేశించారు. చోరీకి పాల్పడే సమయానికి ఇంటి యజమాని పైఅంతస్తు నుంచి గట్టిగా అరవడంతో పారిపోయినట్టు సమాచారం. ప్రమాదకరమైన చెడ్డీ గ్యాంగ్ తిరుపతి పరిసరాల్లో తిరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి నగరంలోని ఆస్టర్ నారాయణాద్రి చైర్మన్ డాక్టర్ సునందకుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన ఈ చెడ్డీ గ్యాంగ్ ఇంటి యజమాని లోపల ఉన్నట్టు తెలుసుకుని ఎటువంటి చోరీకి పాల్పడకుండా వెళ్లిపోయారు. అయితే తన ఇంటిలోకి దొంగలు వచ్చి వెళ్లడంపై ఆ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేయాలని సదరు వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖరీదైన ఇళ్లు, దూరంగా ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఒంటిపై దుస్తు లేకుండా కేవలం చెడ్డీ మాత్రమే ధరించి శరీరానికి గ్రీజ్ రాసుకుని తిరిగే ఈ గ్యాంగ్ పర్యటించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను ఆధారంగా చేసుకుని పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి క్రైం పోలీసులు పాత నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టినట్టు సమాచారం.ఓ ఇంటి కిటికీ విరిచి చోరీకి విఫలయత్నం -
విద్యుత్తు సరఫరాలో అలసత్వం వద్దు
తిరుపతి రూరల్: సదరన్ డిస్కం పరిధిలో విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన సరఫరా అందించాలని, సరఫరాలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని డిస్కం సీజీఎం క్రిష్ణారెడ్డి హెచ్చరించారు. గత రెండు రోజులుగా శ్రీకాళహస్తి, మదనపల్లి ప్రాంతాల్లో పర్యటించిన ఆయన డయల్ యువర్ సీఎండీకి వస్తున్న ఫిర్యాదుల్లో విద్యుత్తు అంతరాయంపై అధికంగా వస్తున్నాయని ఇకపై ఆ పరిస్థితి ఉండరాదన్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం, సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదన్న ఫిర్యాదు వినియోగదారుల నుంచి వస్తే ఎంతటి వారైనా ఇబ్బందులు పడకతప్పదన్నారు. అనంతరం 33కేవీ/11కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లను తనిఖీ చేశారు. విద్యుత్తు సబ్ స్టేషన్లలో ఏదేనీ మరమ్మతులు వుంటే వెంటనే సరిచేసుకోవాలని, వేసవిలో అధికంగా వినియోగించే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని అక్కడి సిబ్బందికి సూచించారు. -
‘పట్టా’భిషేకానికి వేళాయె!
– రేపే ఎస్వీ వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవం చంద్రగిరి:తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు ఇన్చార్జి వీసీ డాక్టర్ జేవీ రమణ తెలి పారు. శనివారం వర్సిటీలోని వైఎస్సార్ పరిపాలనా భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పశు వైద్యకళాశాల ఆడిటోరియంలో చేపట్టే కాన్వొకేషన్కు చాన్సలర్ హోదాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారన్నారు. మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ నితిన్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. 2023–24 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ పూర్తి చేసిన 415మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు చెప్పా రు. అందులో 8మంది పీహెచ్డీ, 144 మంది ఎంవీఎస్సీ, 227మంది బీవీఎస్సీ అండ్ ఏహెచ్, 36 మంది బీటెక్ డెయిరీ టెక్నాలజీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నట్లు వివరించారు. అకడమిక్ విద్యలో ప్రతి భ చూపిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పలువురు అధ్యాపకులకు రఅవార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. ఉత్తమ డాక్టరేట్ పరిశోధనకు శ్రీముప్పవరపు ఫౌండేషన్ బంగారు పతకం, పశుపోషణలో విశేష మాస్టర్స్ పరిశోధనకు డాక్టర్ ప్రతాప్ వి రెడ్డి బంగారు పతాకం ప్రదానం చేయనున్నట్లు వివరించారు. రిజిస్ట్రార్ వినూ తదితరులు పాల్గొన్నారు. -
బరితెగింపు
అటవీ ప్రాంతంలో చదును పనులు చేస్తున్న హిటాచీసాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించేశారు. ఇన్నాళ్లు ఇసుక, గ్రావెల్పై పడిన పచ్చ నేతలు, ఇప్పుడు రిజర్వ్ ఫారెస్టుపై కన్నేశారు. నకిలీ పత్రాలను సృష్టించి, హిటాచీలను పెట్టి ఏకంగా అటవీ భూమి ఆక్రమణకు తెగబడ్డారు. వివరాలు.. రామచంద్రాపురం–చంద్రగిరి సరిహద్దులో కురప్ప కణం రిజర్వ్ ఫారెస్టు ఉంది. అందులో కొంత భూమిని చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన టీడీపీ నేత కామసాని రూపసుందర్ రెడ్డి ఆక్రమించుకున్నారని అదే పార్టీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హిటాచీలతో భూమి చదును చేయిస్తున్న దృశ్యాలను అప్లోడ్ చేశారు. జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆ వీడియో మండిపడ్డారు. విలువైన అటవీ సంపదను ధ్వంసం చేయడంతో పాటు దశలవారీగా గుట్టలను చదును చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నాడని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కోరాడు. అర్ధరాత్రి దాడులు..! టీడీపీ నేత సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై అట వీ అధికారులు స్పందించారు. శుక్రవారం అర్ధరాత్రి అడవిని ఆక్రమించుకుంటున్న ప్రాంతానికి చేరుకున్నా రు. పనులను అడ్డుకోవడంతో పాటు ఆక్రమణలకు పాల్పడిన టీడీపీ నేత రూప సుందర్ రెడ్డి, ఆయన కుమారుడు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని, తిరుపతిలోని అటవీ కార్యాలయానికి తరలించారు. నకిలీ పత్రాలను సృష్టించి.. టీడీపీ నేత రూపసుందర్ రెడ్డి నకిలీ పత్రాలను సృష్టించి, దొడ్డిదారిలో ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు తర్వాత ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు వెల్లడిస్తుండడం గమనార్హం. అటవీ భూమిని ఆక్రమించిన టీడీపీ నేతలు విచారణ చేపట్టాం రామచంద్రాపురం మండలం కురప్ప కణం అటవీ ప్రాంతంలో ఆక్రమణలపై ఫిర్యాదు రావడంతో దాడులు చేశాం. పనులను అడ్డుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. అయితే ఆ భూమికి సంబంధించి డీకేటీ పట్టాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనిపై విచారణ చేపట్టాం. – రమేష్ బాబు, ఎఫ్ఎస్ఓ, చంద్రగిరి -
కమనీయం.. కల్యాణం
తిరుపతి కల్చరల్ : శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి కమనీయంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. అందులో భాగంగా సర్వాంగసుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలోని కల్యాణ వేదికకు వేంచేపు చేశారు. అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేపట్టారు. అనంతరం రక్షా బంధన, అగ్రిప్రతిష్ట, మధుపర్కరం, కన్యాదానం, మహా సంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగల్య పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. వేద మంత్రోచ్చరణలు, భక్తజనం రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఊరేగించారు. టీటీడీ ఈఓ రవిచంద్ర, ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. ఆభరణాల బహూకరణ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఒక బంగారు గజలక్ష్మీ పతకం, రెండు వెండి దీప స్తంభాలు రూ.62.44 లక్షలు విలువ చేసే అభరణాలు బహూకరించారు. తిరుమల నుంచి పేష్కార్ రామకృష్ణ, బొక్కసం ఇన్చార్జి గురురాజస్వామి తీసుకువచ్చి డిప్యూటీ ఈఓ నాగరత్నకు అందజేశారు. ముత్యాల తలంబ్రాలు ఊరేగింపు సీతారాముల కల్యాణం సందర్భంగా ఉదయం 9 గంటలకు టీటీడీ పరిపాల నా భవనం నుంచి ఏనుగు మీ ద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందించారు. -
నారాయణాచార్యులు సరస్వతీ పుత్రుడు
తిరుపతి అర్బన్: పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతీ పుత్రుడుగా ఖ్యాతి చెందారని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంగీతం, సాహిత్యం, నాట్యంలో అపార ప్రతిభ చూపాలని వెల్లడించారు. అనేక భాషల్లో పాండిత్యం సంపాదించి అనేక నవలలు, నాటకాలు, కావ్యాలు రచించి తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, డీఆర్ఓ నరసింహులు పాల్గొన్నారు. ఆక్రమణలు లేవు.. పట్టా భూములే! రేణిగుంట: మండలంలోని కొత్తపాళెం రెవెన్యూ లెక్క దాఖలాలో ఓ ప్రైవేటు వెంచర్లో పలు సర్వే నంబర్లులోని 8.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారులు వెంచర్లలో కలుపుకున్నారన్నది అవాస్తవమని దివంగత శేషారెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేట్ వెంచర్ మధ్యలోని అనాధీనం భూములను మార్కెట్ విలువ కంటే నాలుగు రెట్లు అధికంగా ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించి క్రమబద్ధీకరించుకున్నట్లు వివరించారు. దీంతోనే తమకు 0.67 సెంట్లు విస్తీర్ణంలోని కొంత భూభాగం తమకు అధికారికంగా సంక్రమించిందన్నారు. ప్రభుత్వం తమ భూముల్లోని 0.955 సెంట్లు రోడ్డు, ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుని ఇప్పటివరకు తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు. పసల మునిరెడ్డి అనే వ్యక్తి దురుద్దేశంతో తమ వెంచర్పై అసత్య ఆరోపణలు చేశారని, అలాంటివి నమ్మవద్దని కోరారు. అక్రమ కేసులపై విచారణ చేపట్టండి పుల్లంపేట:దళితులపై నమోదుచేసిన అక్రమ కేసులపై విచారణ జరిపి న్యాయం చేయాలని మండల పరిధిలోని వత్తలూరు గ్రామపంచాయతీకి చెందిన దళితులు పోలీసులను కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు యథేచ్ఛగా కొనసాగడమే కాకుండా దళితుల ఆస్తులకు భరోసా లేదని వారు వాపోయారు. వత్తలూరు రెవెన్యూ పరిధిలోని పర్వేనంబరు 1042, 1053, 1055లలో 2012వ సంవత్సరం నుండి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. సంబంధిత భూములకు సంబంధించి 2024లో మాపేర్లతో అసైన్మెంట్ కమిటీలో నమోదు చేయబడ్డాయని తెలిపారు. అనివార్య కారణాలతో అప్పటి అన్నమయ్య జిల్లా కలెక్టరు అసైన్మెంట్ కమిటీని రద్దు చేశారని వారు పోలీసులకు వివరించారు. ఆయా వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి తమపై నమోదు చేసిన కేసులను పునర్విచారించి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వత్తలూరు గ్రామానికి చెందిన బాధిత దళితులు పాల్గొన్నారు. -
కీర్తనల నడుమ ఊంజల్సేవ
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంట శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఊంజల్ సేవ కీర్తనల నడుమ కమనీయంగా సాగింది. శనివారం వేకువ జామున సుప్రభాత సేవతో శ్రీవారిని మేల్కొలిపి, నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం ఉభయ నాంచారుల సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామిని, పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి ఉయ్యాలలో కొలువు దీర్చారు. అన్నమయ్య కీర్తనల నడుమ ఊంజల్ సేవ కన్నుల పండుగగా సాగింది. అనంతరం ఉభయ దేవేరులతో కలసి తిరుచ్చి వాహనం అధిరోహించిన శ్రీవారు మేళతాలాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు నారికేల, కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. భక్తులను కటాక్షించి ఆలయం చేరుకొన్న స్వామి, అమ్మవార్లకు మంగళహారతులిచ్చి పవళింపు సేవ నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారి వేణుగోపాల్ పర్యవేక్షించారు. టీటీడీకి రూ.20 లక్షలు విరాళం తిరుమల:చందనా బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం టీటీడీ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,01,116 విరాళంగా అందించింది. అదేవిధంగా బెంగళూరుకు చెందిన క్రెడ్వెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,00,116 విరాళంగా అందించింది. ఈ మేరకు క్రెడ్వెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు విరాళం డీడీలను తిరుపతి లోని ఈఓ బంగళాలో టీటీడీ ఈఓ ఎం.రవిచంద్రకు అందజేశారు. చందనా బ్రద ర్స్ సంస్థల ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. గంజాయి విక్రేత అరెస్టు – 1.8 కేజీల గంజాయి స్వాధీనం తిరుపతి రూరల్: తిరుపతి నగరంతోపాటు నగర శివార్లలో గుట్టుగా గంజాయి విక్రయించే వ్యక్తిని తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు అతని నుంచి 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య ఆచారి మాట్లాడారు. తిరుపతి పరిసరాల్లోని కాలేజీలు, హాస్టళ్లు వద్ద కుర్రాళ్లకు గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నట్టు రహస్య సమాచారం రావడంతో నిఘా పెట్టామన్నారు. ఎంకేనాయుడు కాలనీ సమీపంలోని అవిలాల క్రాస్ వద్ద సాయిప్రసాద్ అనే యువకుడు 10గ్రాముల గంజాయి ప్యాకెట్లతో పట్టుబడ్డాడు. అతనిని విచారించారు. సాయిప్రసాద్ స్నేహితుడైన గౌరీశంకర్తో కలిసి ఒడిశా రాష్ట్రం, బరంపురం నుండి గంజాయి తీసుకువచ్చి తిరుపతిలోని విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు అంగీకరించాడరన్నారు. 10గ్రాముల గంజాయి ప్యాకెట్టు రూ.500కి అమ్ముతున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. అతని వద్ద అమ్మకానికి సిద్ధంగా పెట్టుకున్న 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు వివరించారు. ఎస్పీ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్ సూచనల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశాయన్నారు. -
బతుకు బండలు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. గల్ఫ్ యుద్ధం కాస్తా.. మనదేశంలో జన జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత చిన్నపాటి టిఫిన్ సెంటర్ యజమానుల నుంచి బడా హోటళ్ల నిర్వాహకుల వరకు అందరినీ వేధిస్తోంది. లక్షలాది మంది జీవనోపాధికి గండికొడుతోంది. ‘బండ’ బాధలు భరించలేక కొందరు దుకాణలను బంద్ చేసుకున్నారు. మరికొందరు బ్లాక్ మార్కెట్పై ఆధారపడి నెట్టుకొస్తున్నారు. ఇంకొందరు పాత పద్ధతిలో కట్టెల పొయ్యలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కలప వ్యాపారులు సైతం డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి హోటల్ నిర్వాహకులను నిలువుదోపిడీ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే గృహ వినియోగదారులు సైతం సకాలంలో గ్యాస్ సిలిండర్ లభించకపోవడంతో నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు పలువురు ఇండక్షన్ స్టవ్లు వినియోగించుకుంటున్నారు. కొందరు వంట చెరుకుతో ఆహారపదార్థాలు తయారు చేసుకుని క్షుద్బాధ తీర్చుకుంటున్నారు. ఏది ఏమైనా అందరి బతుకులను పశ్చిమాసియా యుద్ధం అయోమయంలోకి నెట్టేస్తోంది. అందులో గ్యాస్ బండ జీవన విధానమే మార్చుకునే పరిస్థితులను తీసుకువస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి గ్యాస్ కొరత కారణంగా తిరుపతిలో మూసివేసిన హోటళ్లు -
విద్యార్థినులకు అభినందన
తిరుపతి సిటీ : మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి ఏ టుడే నేషనల్ లెవల్ టెక్నో అండ్ కల్చరల్, స్పోర్ట్స్ ఫెస్ట్లో తిరుపతి పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులు ప్రథమ స్థానం సాధించారు. శనివారం ఈ మేరకు ప్రతిభ చూపిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ అభినందించారు. ఆమె మాట్లాడుతూ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలో తమ కళాశాల విద్యార్థినులు విజేతలుగా నిలవడం గర్వంగా ఉందని వెల్లడించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి భారతి, వైస్ ప్రిన్సిపల్ భద్రమణి, డిప్యూటీ వార్డెన్ భారతి, జ్యోతి, సరిత పాల్గొన్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు తిరుపతి అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 11.30గంటలకు దొరవారిసత్రం మండలం నెలబల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారని చెప్పారు. అనంతరం 11.50 గంటలకు నాయుడుపేట మండలం పుదూరులో టిడ్కో గృహాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 12.40 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 2.40 గంటలకు నాయుడుపేట మండలం బిరదవాడలో రాజకీయ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 4.20 గంటలకు హెలిక్యాప్టర్లో బయలుదేరి 4.35కి ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీ గ్రౌండ్కు చేరుకుంటారన్నారు. 4.45 గంటలకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించనున్న పీ4 కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. 6.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు తిరుగుప్రయాణం కానున్నట్లు వివరించారు. రేపటి నుంచి గవర్నర్ పర్యటన తిరుపతి అర్బన్ : గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 30వ తేదీ నుంచి రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ గవర్నర్ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. అనంతరం 3 గంటలకు తిరుపతి బైపాస్ రోడ్డు సమీపంలోని తాజ్ హోటల్కు వెళతారని వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి స్నాతకోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం 6.25 గంటలకు తిరుమల శ్రీభాగ్య రెస్ట్హౌస్ చేరుకుని రాత్రి బస చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని వివరించారు. 3.20 గంటలకు హైదరాబాద్కు వెళ్లనున్నట్లు వెల్లడించారు. పక్కాగా వ్యర్థాల నిర్వహణ తిరుపతి అర్బన్ : హాస్టళ్లలో వ్యర్థాల నిర్వహణను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శనివారం తిరుపతి బైరాగిపట్టెడలోని బీసీ హాస్టల్లో జరిగిన స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్రలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్లను వేరు చేయడంలో సోర్స్ సెగ్రిగేషన్ పద్ధతిని అమలు చేయాలని సూచించారు. తడి చెత్తను శాసీ్త్రయ విధానంలో డీ కంపోజ్ చేసి ఎరువుగా మార్చాలన్నారు. ఆ ఎరువును అదే హాస్టల్లో ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ తదితర కూరగాయలను పండించేందుకు వినియోగించాలని స్పష్టం చేశారు. పొడి చెత్తను ప్రతి గురువారం స్వచ్ఛరథం ద్వారా సేకరించి రీసైక్లింగ్కు పంపించాలని సూచించారు. బీసీ వెల్పేర్ జిల్లా అధికారి భరత్కుమార్రెడ్డి, డీపీఓ సుశీలాదేవి పాల్గొన్నారు. -
చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది!
సత్యవేడు: కడుపున పుట్టిన చిన్నారి ప్రాణాన్ని కన్నతల్లే చిదిమేసింది. చంటిపాపను చంపిన కేసులో నిందితురాలు తల్లి హేమావతి(28)ని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ మురళీనాయుడు ఆధ్వర్యంలో నిందితురాలు హేమావతిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తల్లి తన నవశిశువును చంపిన కేసుకు సంబంధించి వివరాలను సీఐ వెల్లడించారు. సరసరాజు అగ్రహారంలోని పద్మప్రియ ఇంటి సముదాయంలో మొదటి అంతస్తులో వెంకటేష్, హేమావతి దంపతుల కుటుంబం నివశిస్తోంది. ఆరు నెలల క్రితమే వీరు తమిళనాడు, చిన్న బొమ్మాజిగుంట గ్రామం నుంచి దళవాయి అగ్రహారం వచ్చారు. సమీపంలోని సిమెంటు ఇటుకుల తయారీ కేంద్రంలో వెంకటేష్ పనిచేస్తున్నాడు. వీరికి వృతిక్(5) అనే కుమారుడు ఉన్నాడు. దళవాయి అగ్రహారం వచ్చాక ఆడబిడ్డ జోవిక జన్మించింది. కుమార్తె జన్మించిన తరువాత తల్లి హేమావతి ఇంట్లో పని ఒత్తిడితో అధిక కోపం ప్రదర్శిస్తూ ఇంట్లో పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు పగులగొట్టేది. బిడ్డ తరచూ ఏడుస్తుండడంతో విసుగు చెంది కూతురుని ఎక్కడైనా వదిలేసి వచ్చేయాలని పలుసార్లు భర్తకు చెప్పేది. మార్చి 26వ తేదీ ఉదయం 7 గంటలకు పాప పాలకోసం ఏడవడం మొదలు పెట్టింది. ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో ఆమె తన కూతురు జోవికకు శ్వాస ఆడకుండా ముక్కు, నోరు మూసి పట్టుకోవడంతో పాప చనిపోయింది. దీనిపై భర్త వెంకటేశ్ ఫిర్యాదు మేరకు స్ధానిక ఎస్ఐ సాయినాథ్చౌదరి కేసు నమోదు చేశారు. కేసు విచారణను సీఐ మురళీనాయుడు చేపట్టారు. గ్రామ పెద్దలు హేమావతిని పోలీస్ స్టేషన్కు తీసుకురావడంతో మార్చి 27వ తేదీ రాత్రి నిందితురాలిని అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐలు సాయినాథ్చౌదరి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
సంపూర్ణం.. సూర్యపూజోత్సవం
తెప్పపై విహరిస్తున్న స్వామి, అమ్మవార్లు ఆలయంలో భక్తుల రద్దీ నాగలాపురం : శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న సూర్య పూజోత్సవాలు శనివారంతో సంపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా వేకువజామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. ఉదయం 11 గంటలకు దేవదేవేరులకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి గర్భాలయాన్ని స్పృశించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించిన భక్తులు పులకించారు. గోవింద నామస్మరణలతో ఆలయం మార్మోగింది. అనంతరం ఉభయదేవేరీ సమేతంగా స్వామివారిని తిరుచ్చి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి సర్వాలంకారభూషితులైన స్వామి, అమ్మవార్లను పుష్కరిణలో తెప్పపై కొలువుదీర్చారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఏడుపర్యాయాలు ప్రదక్షిణ చేయించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను పరవశింపజేశాయి. ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ మునిశంకరయ్య, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, ఆలయ అధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. -
5 నుంచి సూర్యఘర్ ఉత్సవ్
తిరుపతి రూరల్ : రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ను విరివిగా అమర్చడమే లక్ష్యంగా ఏప్రిల్ 5 నుంచి 14వ తేదీ వరకు ‘సూర్యఘర్ ఉత్సవ్’ నిర్వహించనున్నట్టు ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. శనివారం ఈమేరకు రూఫ్ టాప్ సోలార్, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరు అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు రూఫ్టాప్ సోలార్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులను త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. జాప్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసిస్టెంట్ ఇంజనీర్లు తమ పరిధిలో వ్యవసాయ విద్యుత్ సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులతో స్వయంగా మాట్లాడి, స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరారు. సీనియారిటీ లిస్టును ఆయా సెక్షన్ల నోటీసు బోర్డులో ప్రదర్శించాలని సూచించారు.ఒకే అంశంపై పలుమార్లు అభ్యర్థనలు నమోదైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అనంతపురం సర్కిల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేసిన ఫిర్యాదుపై డీఈ ఎం. శ్రీనివాసులు నాయుడుకు షోకాజ్ నోటీసు జారీ చేశామని, అలాగే ఏఈఈ బి. బాలచంద్రపై సస్పెన్షన్ వేటు వేశామని వివరించారు. కాన్ఫరెన్స్లో సంస్థ డైరెక్టర్లు కె. గురవయ్య, పి.అయూబ్ ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, కె.ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, సీహెచ్ రామచంద్రరావు, జనరల్ మేనేజర్లు జి.చక్రపాణి, వి.విజయన్, ఎస్ఈలు రమణ, ఇస్మాయిల్ అహ్మద్, శేషాద్రి శేఖర్, రాఘవేంద్ర, మోసెస్, సోమశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు, ప్రదీప్ కుమార్, సుధాకర్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిపై పచ్చ రాబందులు
పుల్లంపేట: టీడీపీ నేతల భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. అధికారం అండతో తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో కోట్ల రూపాయల విలువైన 133 ఎకరాల ప్రభుత్వ భూమిపై రాబందుల్లా వాలిపోయారు. పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించేసుకున్నారు. చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేసేశారు. వారి ఆక్రమణలను అడ్డుకున్నందుకు దళితులపై అక్రమంగా కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుల్లంపేట మండలంలోని దళవాయిపల్లి సర్వే నంబర్ 225లో వంద ఎకరాలు, వత్తలూరు సర్వే నంబర్ 1042, 1055లో 24 ఎకరాలు, తిప్పాయిపల్లి సర్వే నంబర్ 1094/6లో 9 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చెట్టు, పుట్టలతో ఉన్న ఈ భూమిని స్థానిక నిరుపేదలైన దళితులు చదును చేసుకుని సాగు చేసుకునేవారు. విలువైన భూములు దళితుల సాగు చేసుకోవటం జీర్ణించుకోలేని టీడీపీలోని పెత్తందారులు వారిపై దౌర్జన్యాలకు తెగబడేవారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భూములను ఆక్రమించుకున్నారని 15 మంది దళితులపై కేసులు నమోదు చేయించారు. అప్పటి నుంచి టీడీపీ నేతలు, దళితుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకునేవి.వైఎస్సార్సీపీ హయాంలో దళితులకు భూ పంపిణీకి ఏర్పాట్లు2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్లకు 2022లో ఆ పార్టీ నాయకులు ఇరు వర్గాల మధ్య రాజీ చర్చలు జరిపి కేసులు వెనక్కు తీయించుకునేలా కృషి చేశారు. నిరుపేద దళితుల జీవనాధారం కోసం సాగు చేసుకున్న ప్రభుత్వ భూములను వారికే పంపిణీ చేయాలని 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని సాంకేతిక కారణాల కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమైంది. 2024లో ప్రభుత్వం వచ్చిన వెంటనే పంపిణీ చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దళితుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ప్రభుత్వం మనదే కదా అని టీడీపీ నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ముగ్గురు టీడీపీ నాయకులు ప్రభుత్వ భూముల్లోకి చొరబడి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఆపై రాత్రికి రాత్రే భూముల చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నేతల భూ ఆక్రమణ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు కంచె తొలగించారు. అయినప్పటికీ దళితులపై దౌర్జన్యానికి దిగి... వారిపైనే టీడీపీ నాయకులు కేసులు పెట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంతోపాటు తమపై దౌర్జన్యానికి దిగారని దళితులంతా కలిసి శనివారం పుల్లంపేట పోలీస్ స్టేషన్కు చేరుకుని న్యాయం చేయమని వేడుకున్నారు. అదేవిధంగా టీడీపీ నేతల దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశారు.ప్రభుత్వ భూమి అమ్మకానికి పెట్టేసిన పోలీసులుపుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలోని 9 ఎకరాలను ఓ పోలీసు అధికారి ఏకంగా అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. తొమ్మిది ఎకరాలు రూ.40 లక్షలకు బేరం కుదిరినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?మాది వత్తలూరు హరిజనవాడ. భూమి లేని పేదవాళ్లం. 2012 నుంచి ఆ భూమిలో పంటలు సాగు చేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వంలో మాపై కేసులు పెట్టారు. కోర్టుల చుట్టూ తిరిగాము. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక కోర్టులో రాజీపడ్డాం. పంటలు సాగు చేసుకుంటూ వచ్చాం. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దౌర్జన్యంగా రాత్రికి రాత్రే టీడీపీ నాయకులు భూములను ఆక్రమించి తిరిగి మాపైనే కేసులు నమోదు చేయించారు. ఇదెక్కడి న్యాయం?– నల్ల బ్రహ్మయ్య, పుల్లంపేట మండలంజీవితమంతా పోరాటమే గత 20 ఏళ్లుగా భూమి కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మేము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వమని వేడుకుంటున్నాం. చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది ఎకరాల భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. పేదవాళ్లు భూమి కావాలంటే ఇన్ని కష్టాలా?– ఎస్.జయమ్మ, వత్తలూరుమాపైనే అక్రమ కేసులుమా నాన్న గారు ఉన్నప్పటి నుంచి భూమి కోసం పోరాడుతున్నాం. ఈ భూమి కోసం పోరాడి పోరాడి మా నాన్న కూడా మరణించాడు. భూమి మాత్రం ఇవ్వలేదు. అక్రమ కేసులు మాత్రం నమోదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – ఎస్.మహేష్, వత్తలూరు గ్రామం -
గోతులు తీసి.. కంచె వేసి..
సాక్షి,టాస్క్ఫోర్స్: తరతరాలుగా పొలాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్న దారులను గోతులు తీసి, కంచెలు వేసిన దుర్మార్గమైన ఘటన చిన్నగొట్టిగల్లు మండలం మట్లువారిపల్లెలో చోటు చేసుకుంది. రెవెన్యూ, పోలీసులు అధికారులు ఈ దౌర్జన్య కాండను చూస్తూ మౌనంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 50 మంది రైతులకు చెందిన 80 ఎకరాల పంట పొలాలకు వెళ్లే 5 రోడ్లను జేసీబీలతో కందకాలు తవ్వి, మట్టి కుప్పలని అడ్డంగా పోశారు. అయినా వెళతారనే అనుమానంతో కంచెలు కూడా వేయడం దుర్మార్గమని రైతులు వాపోతున్నారు. దారులు మూసివేయడంతో రైతులు సకాలంలో వారి పొలాలకు వెళ్లాలన్నా.. పంట ఉత్పత్తులను ఇంటికి తెచ్చుకోవాలన్నా.. పశువులను పొలాల దగ్గరికి తీసుకుపోవాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై అధికారులను ప్రశ్నించినా వారు మౌనంగా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెవిరెడ్డికి సమీప బంధువులమని రాజకీయ కక్షతోనే తమ పంట పొలాలకు పోనీయకుండా అధికారుల అండతో గోతులు తీశారని సంబంధిత రైతులు వాపోయారు. కేవలం గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులుగా ఉండడం, ఓటు వేయడమే కారణమని వారు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు పోలీసుల ఎదుటే టీడీపీ నాయకులు దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రైతులపై రెవెన్యూ, పోలీసు టీడీపీ నాయకులు చేస్తున్న పనులను చూసి ఇప్పటికే అనేక మంది రైతులు తమ పొలాలను పంటలు వేసుకోవడానికి కూడా భయపడుతున్నట్లు వాపోయారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
వేదనారాయణుడి శిరస్సున రవితేజం
నాగలాపురం: మండలంలోని టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో సూర్య పూజోత్స వంలో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం రవికిరణాలు గర్భాలయంలోని స్వామివారి శిరస్సును తాకాయి. అర్చకులు వేకువ జా మున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసి, సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అలయంలోని పరివార దేవతలకు అభిషేకాలు, విశేష పూజలు చేసి భక్తుల సర్వదర్శనం క ల్పించారు. అనంతరం శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారికి అమ్మవారి మండపంలో కల్యాణోత్స వం వైభవంగా నిర్వహించారు. తొలుత టీటీ డీ తరఫున అధికారులు ఆలయ మర్యాదలతో ఆలయం చుట్టు ప్రదక్షిణ చేసి పట్టు వస్త్రాల ను సీతారాముల వారికి సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ క ల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సూర్య భగవానుడు అస్తమించే సమయంలో రవి కిరణాలు మెల్లమెల్లగా ఆలయ ప్రధాన గోపురం నుంచి గ ర్భాలయంలోని స్వామివారి శిరస్సును తాకా యి. ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు పులకించారు. అనంతరం సూర్య కిరణాలు పయనించిన మార్గాన్ని ఆలయ పరిచారకులు పుణ్యజలంతో అభిషేకించారు. కిరణాలు స్వామివారి శిరస్సును తాకిన వెంటనే భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయం మారుమోగింది. నేత్ర పర్వంగా తెప్పోత్సవం సూర్యపూజ సందర్భంగా నిర్వహిస్తున్న తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజన శుక్రవారం సాయంత్రం శ్రీ దేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం పుష్కరిణిలో తెప్పపై కొలువు దీర్చారు. స్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగి, భక్తులకు దర్శనమిచ్చారు. వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సూపరింటెండెంట్ మునిశంకర్, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, ఆలయాధికారులు శ్రీనివాసులు, ఉదయ్ కుమార్, పాల్గొన్నారు. -
భవన దుస్థితిపై ఆరా
దొరవారిసత్రం: నెమిలమిట్ట అగ్రహారం పరిధిలోని ప్రాథమిక పాఠశాల భవన దుస్థితిపై ఇంటిలిజెన్స్ పోలీస్ అధికారులు శుక్రవారం ఆరా తీశారు. ‘శ్లాబ్ పెచ్చులూడి పడి విద్యార్థికి గాయాలు’ అనే వార్త సాక్షి దినపత్రికలో ప్రచురితమైన విషయం విధితమే. దీంతో ఇంటిలిజెన్స్ పోలీస్ అధికారులతో పాటు స్థానిక విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల భవనం పరిస్థితి ఎలా ఉందని స్థానిక ఉపాధ్యాయుడు శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. భవనం పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నూతన భవన నిర్మాణం కోసం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి పాకాల: స్థానిక రైల్వే స్టేషన్కి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రయాణిస్తున్న రైలు నుంచి జారి పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే పోలీసులు కథనం మేరకు.. తిరుపతి వైపు వెళుతున్న రైలు నుంచి జారి పడి సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతి చెందాడని, తెల్ల రంగుపై నల్ల రంగు గీతలు కలిగిన చొక్కా ధరించి ఉన్నాడని, అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిత్తూరు ఆర్పీ ఎస్ఐ ధర్మేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టీల్ పరిశ్రమలో ప్రమాదం.. కార్మికుడి మృతి పెళ్లకూరు: మండలంలోని పెన్నేపల్లిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో గురువారం జరిగిన ప్రమాదంలో వలస కార్మికుడు(42) మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. పరిశ్రమలోని యంత్రాల వద్ద పని చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడంతో వలస కార్మికుడుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. ఈ విషయమై పోలీసులు సమాచారం లేదు. పేకాటరాయుళ్ల అరెస్టు రూ.1.47 వేలు స్వాధీనం చంద్రగిరి: మండలంలోని పాతశానంబట్ల గ్రామానికి దక్షణం వైపు అడవిలో శుక్రవారం సాయంత్రం పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరు వ్యక్తులు పారిపోయారు. రహస్యంగా అందిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి తమ సిబ్బందితో సంఘటనాస్థలికి చేరుకుని జూదరులపై దాడి చేశారు. ఈ క్రమంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.1.47,600 నగదు, పేకముక్కలు, నాలుగు ద్విచక్రవాహనాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుస్థితిలో మత్స్యశాఖ
తిరుపతి అర్బన్: మత్స్యశాఖ దుస్థితికి చేరుకుంటోంది. తిరుపతిలోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయం వారు రూ.65 వేలు కరెంట్ చార్జీ బకాయిలు ఉండడంతో రెండు రోజుల క్రితం విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో ఉద్యోగులు చేసేదేమీ లేక..సమీపంలోని మత్స్య దర్శినికి చెందిన భవనంలోకి తమ ఫైళ్లను, ఫర్నిచర్ను మార్చుకుని, విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయ నిర్వహణకు పైసా నిధులు విడుదల చేయకపోవడంతో పలు కార్యాలయాల పరిస్థితి దయనీయంగా మారింది. మత్స్యశాఖ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో చేపలు పెంచడానికి, మట్టి గుంతల్లోకి నీరు నింపడానికి విద్యుత్ మోటార్ ఉండేది. అయితే ఏడాది కిందట మోటారు చోరీకి గురైంది. కొత్త మోటారు కొనుగోలు చేయడానికి రూ.30 వేలు ఖర్చు అవుతుందని, నిధులు లేకపోవడంతో మోటారు కొనుగోలు చేయడం మానుకున్నారు. మోటారు లేకపోవడంతో చేపపిల్లలు పెంచే కార్యక్రమానికి స్వస్తి చెప్పేశారు. తాజాగా విద్యుత్ బిల్లు కట్టలేదని...కనెక్షన్ కట్ చేయడం పెద్ద చర్చినీయాశంగా మారింది. మూడేళ్ల కిందట మత్స్యదర్శి భవనం పూర్తి జిల్లా మత్స్యశాఖ కార్యాలయం వద్దే గత వైఎస్సార్సీపీ పాలనలో రూ.3 కోట్లు ఖర్చు చేసి మత్స్యదర్శిని పేరుతో ఓ భవనాన్ని నిర్మించారు. తిరుపతి నగరానికి వచ్చే యాత్రికులు మత్స్యదర్శిని చూడడానికి వచ్చే సందర్భంలో జిల్లాలో ఉంటున్న అన్ని రకాల చేపలను ప్రదర్శనగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో విద్యుత్ కనెక్షన్తోపాటు పలు పరికరాలను సమకూర్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ భవనం జోలికి వెళ్లలేదు. కనీసం ఆ భవనాన్ని ప్రారంభోత్సవం చేయకుండా వదిలిపెట్టేశారు. అయితే మత్స్యశాఖ జిల్లా కార్యాలయానికి విద్యుత్ సరఫరా కట్ చేయడంతో ఆ భవనాన్ని ఇలా వాడుకోవాల్సి రావడం విడ్డూరంగా ఉంది. -
అరటితోటకు నిప్పు
ఓబులవారిపల్లె: ఆకతాయి చేష్టలతో అరటితోట కంచెకు నిప్పు పెట్టడంతో దాదాపు ఆరు వేల అరటి చెట్లు పూర్తిగా కాలిపోయి బూడిదైన ఘటన ఓబులవారిపల్లె మండలంలో చోటు చేసుకుంది. పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని గ్రామ సమీపంలోని కొత్తపిచ్చమ్మ, రామసుబ్బారెడ్డి దంపతులకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఇందులో అమృతపాణి రకం అరటితోటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అరటి గెలలు కోతకు వచ్చాయి. కొన్ని రోజుల్లో కాయలు విక్రయించుదామని ఆశగా ఉన్నారు. అయితే శుక్రవారం కొందరు ఆకతాయిలు తోటకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి తోట పూర్తిగా కాలి బూడిదయ్యింది. మంటలు పక్కనే ఉన్న నిమ్మ చెట్లకు కూడా వ్యాపించడంతో అవి కూడా కాలిబూడిదయ్యాయి. అలాగే డ్రిప్పు పైపులు కాలిపోయాయి. బాధితుల స్వగ్రామం పుల్లంపేట మండలం, కొమ్మనవారిపల్లి పంచాయతీ, వల్లూరుపల్లి. చుట్టు పక్కల వారు మంటలను చూసి రైతులకు సమాచారం ఇవ్వగా వారు పొలం వద్దకు వచ్చి చూసేసరికి పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆరు వేల అరటిచెట్లు కాలిపోవడంతో దాదాపు రూ.10 లక్షల మేర పంట నష్టం వాటిల్లింది. -
పీజీ.. నో క్రేజీ!
హమ్మయ్యా..పరీక్షలు పూర్తయ్యాయి.. కొన్ని రోజులు విరామం.. ఆ తరువాత పోటీలో మళీపరుగు తప్పదు..డిగ్రీ పరీక్షలు రాసేశాం..ఇక ఇప్పుడేం చేయాలి.. ఉన్నత విద్యా.. ఇక చదివే ఓపిక లేదు.. ఏదో ఉద్యోగం చూసుకుంటే సరిపోద్దీ.. మళ్లీ పీజీ అంటే పీజీ సెట్ రాయాలి.. మరో రెండేళ్లు చదవాలి.. అంత కష్టం ఎక్కడబ్బా.. వద్దులే అన్నట్లుగా యువత ఉపాధి వైపు చూస్తుండడంతో పోసు్ట్రగాడ్యుయేన్ చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పీజీ సీట్లు భర్తీ కాక మిగిలిపోతున్నాయి. తిరుపతి సిటీ: పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటేనే పెద్ద చదువుగా భావించేవారు. పీజీ చేసిన వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండేది. విద్యలోనే ఉన్నత చదువుగా గుర్తింపు పొందిన పీజీకి ప్రస్తుతం ఆదరణ తగ్గడంతో యూనివర్సిటీల భవితవ్యం ఆగమ్య గోచరంగా మారింది. క్రమక్రమంగా సాధారణ పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ లాంటి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గత మూడేళ్లుగా భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్, ఎంబీబీఎస్తోపాటు త్వరగా ఉపాధిని అందించే ఏఐ, మిషన్ లర్నింగ్, కోడింగ్, క్యాంటమ్ టెక్నాలజీ అంటూ పలు ప్రొఫెషనల్ కోర్సులపై మొగ్గు చూపడంతో సాధారణ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని అధ్యాపకులు, వర్సిటీ అధికారులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు యూనివర్సిటీల్లో ఉన్నత విద్యగా గుర్తింపు పొందిన పీజీ కోర్సులకు ఆదరణ తగ్గడానికి నూతన విద్యావిధానం, కామన్ పీజీసెట్ సైతం ప్రధాన కారణమని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. భారీ స్థాయిలో తగ్గిన దరఖాస్తులు ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీ సెట్–2026కు దరఖాస్తులు గత ఏడాది కంటే సుమారు 7 వేలకు పైగా తగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని సుమారు 17 యూనివర్సిటీల్లో 30 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన పీజీ సెట్కు ఇప్పటి వరకు 17,621 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 30 పాఠ్యాంశాలకు సంబంధించిన కోర్సుల్లో సుమారు 24 వేలకు పైగా సీట్లు ఉన్న నేపథ్యంలో 1:1 ప్రాతిపదికన సైతం దరఖాస్తులు అందకపోవడంతో పీజీ కోర్సుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది పీజీ సెట్ పరీక్ష అర్హత సాధించిన ప్రతి విద్యార్థికీ కచ్చితంగా సంబంధింత కోర్సులో సీటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. పలుసార్లు గడువు పొడిగించినా... పీజీసెట్కు దరఖాస్తులను పెంచాలని ఉన్నత విద్యామండలి విశ్వ ప్రయత్నం చేస్తున్నా దరఖాస్తులు అంతంత మాత్రంగానే ఉండడం విశేషం. ఇప్పటికే పలుసార్లు దరఖాస్తుల గడువును పెంచుతూ ప్రసార మాద్యమాల ద్వారా ప్రచారం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు అందలేదు. శనివారంతో పీజీసెట్–2026 దరఖాస్తుల గడువు ముగియనుండడంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు.ఎస్వీయూ పరిపాలనా భవనం -
‘అరసం’ సభల పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి కల్చరల్ : బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్యభవన్లో శుక్రవారంఅభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్, నేత సాకం నాగరాజు మాట్లాడుతూ తిరుపతిలో మే 23 నుంచి రెండు రోజుల పాటు మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాలుగు దశాబ్దాల అనంతరం తిరుపతి వేదికగా మహాసభలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. అరసం తిరుపతి, చిత్తూరు జిల్లా శాఖల అధ్యక్ష, కార్యదర్శులు యువశ్రీ మురళి, నెమిలేటి కిట్టన్న, గంటా మోహన్, పల్లిపట్టు నాగరాజు, ఉపాధ్యక్షుడు గోవిందయ్య పాల్గొన్నారు. -
గుంట..గుటుక్కు
చినుకు జాడ లేక జలవనరు చావుకు దగ్గరవుతున్నాయని కర్షకులు ఆవేదన చెందే రోజులు పోయాయి.. చినుకు మాట దేవుడెరుగు.. అసలు జలవనరులే మాయమవుతున్నాయి.. రాజకీయదన్నుతో ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. గ్రామస్థాయి ‘పచ్చ’ నేతలు వీటిపై కన్నేయడంతో కుంటలు కనుమరుగవుతున్నాయి. రామచంద్రాపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మండలంలో ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా పచ్చ తమ్ముళ్లు పాగా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భూబకాసురులు బరితెగించి, విలువైన సాగు, తాగునీటి వనరులు, పర్యావరణానికి పట్టుకొమ్మలైన పచ్చని కొండలను కబళిస్తున్నారు. తాజాగా కుప్పంబాదూరు పరిధిలోని అత్తికుంట అక్రమార్కుల చెరలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న చందంగా పచ్చ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అంచలంచెలుగా చదును మండలంలోని కుప్పంబాదూరు లెక్కల దాఖలాలోని 133/8 సర్వే నంబర్లో ఉన్న 2.50 ఎకరాల కుంట తిరుపతి, పచ్చికాపలం ప్రధాన రహదారికి ఆనుకొని ఉంది. అయితే కొందరు స్థానిక కూటమి నేతలు యంత్రాలతో అవకాశం ఉన్నప్పుడల్లా అంచలంచెలుగా చదును చేసుకుని, ఆక్రమిస్తున్నారు. ఇటీవల రాత్రి వేళలో దుకాణ గదుల నిర్మాణం చేపట్టారు. సాగునీటి కుంటను ఆక్రమణలకు పాల్పడుతుండడంతో సమీప గ్రామాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పొంచివున్న ముప్పు రాయలచెరువు నిండిన ప్రతిసారీ మొరవ గండి కొట్టి అదనపు జలాలను అత్తికుంటకు మళ్లిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ కుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు కురిసి రాయలచెరువు నిండితే, ఆ నీరు అత్తికుంటలోకి వెళ్లలేక చుట్టుపక్కల ముంపునకు గురవడంతోపాటు చెరువు కట్ట తెగితే కింద ఉన్న పలు గ్రామాలకు ముప్పు పొంచి ఉందని, గతంలో భారీ వర్షాలకు చెరువు నిండినప్పుడు ఈ మార్గంలో గండి కొట్టి నీటి ప్రవాహాన్ని మళ్లించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ మౌనం, నాయకుల అండ ఈ అక్రమాలపై స్థానిక గ్రామస్తులు పలుసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి, స్థానిక కూటమి నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటానికే భయపడుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో, పచ్చ పార్టీ నేతలకు ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా? అని మండల ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రైతుల ఆవేదన ప్రధాన రహదారికి అనుకుని బహిరంగంగా ఆక్రమణలు జరుగుతుంటే మండల రెవెన్యూ అధికారి తీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. తరతరాలుగా సాగు, తాగునీరు అందిస్తున్న కుంటలను ఇలా ఆక్రమించుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వస్తే ఊళ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చి, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని పరిసర ప్రాంతాల రైతులు కోరుకుంటున్నారు.విడతల వారీగా కుంటను పూడ్చేస్తున్న అక్రమార్కులుక్షేత్రస్థాయిలో పరిశీలించి.. చెబుతాం ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో సమాచారం లేదు. వీఆర్ఏ లేనందున క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారికి సమాచారం అందించి, అధికారికంగా చర్యలు తీసుకుంటాం. – రాజశేఖర్, వీఆర్వో, కుప్పంబాదూరు -
కల్యాణ వైభోగం.. చూసిన కన్నులదే భాగ్యం
నాయుడుపేట : విశేషాలంకరణలో శ్రీరామచంద్రమూర్తిసిరి కల్యాణపు బొట్టును బెట్టి..మణి బాసికం నుదుటిన గట్టి.. పారాణి పాదాలకు బెట్టి..పెళ్లి కూతురైన సీతమ్మను చూసి భక్తులు తరించారు. సంపెంగ నూనెను కురులదువ్వి..సొంపుగ కస్తూరి నామం దీర్చి..చెంపన జివ్వాజి చుక్కను పెట్టి..పెళ్లి కొడుకై న రామయ్యను చూసి భక్త జనం పరవశించింది. జానకి దోసిట కెంపులు పోయగా..రాముని దోసిట నీలపురాశులై ఆణిముత్యాలు తలంబ్రాలుగా ఇరువుల మెరవగా భక్తకోటి మురిసింది. వేద మంత్రాలు.. మంగళవాయిద్యాలు మోగగా.. మోమున సిగ్గుతో తలదించుకుని ముసి ముసి నవ్వుల సీతమ్మ మెడలో రామయ్య తాళి కట్టిన కమనీయ ఘట్టం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నేత్రపర్వంగా సాగింది.. శ్రీరామనవమి సందర్భంగా రెండు జిల్లాల్లోని పలు ఆలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణం చూసిన కనులదే భాగ్యం అన్న రీతిలో వైభవంగా సాగింది. –సాక్షి నెట్వర్క్ -
మహాదేవుని మహిమ… ఆకాశంలో వెలిగిన లింగరూపం!
తిరుపతి: నగరంలో వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పరమేశ్వరుని మహిమాన్విత రూపం దర్శనమిచ్చింది. దేదీపంగా ప్రకాశిస్తూ మహాలింగరూపం సాక్షాత్కరించింది. కట్టెదుట కనిపించిన దివ్యతేజస్సును వీక్షించి భక్తజనం పులకించింది. అపురూపంగోవిందనామస్మరణతో మార్మోగే తిరునగరిలో ఓ అపురూపం దర్శనమిచ్చింది. పవిత్ర తిరునామం స్పురించేలా ఓ సీతాకోకచిలుక భక్తులను ఆకట్టుకుంది. శ్రీవారి నుదుటిన వెలుగొందే మూడు నామాల తరహాలో కనిపించిన ఈ అద్భుతానికి ప్రజానీకం ప్రణమిల్లింది. ఉదయం ఉక్కపోత.. సాయంత్రం వడగళ్ల కుండపోతశ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత, మండుటెండ ఇబ్బంది పెట్టింది. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని చాలావేగంగా గాలులు వీచాయి. మండలంలోని జాడుపల్లి, బాణాపురం పంచాయతీల పరిధిలోని వడగళ్లతో కూడిన భారీ వాన కురిసింది. – మెళియాపుట్టి -
శాస్త్రవేత్తకు బెదిరింపులు
తొట్టంబేడు: మండలంలోని శాస్త్రవేత్తను హైదరాబాద్కు చెందిన వ్యక్తులు పోలీసులు ద్వారా బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తొట్టంబేడు మండలం గ్రామీణ శాస్త్రవేత్తలు తయారు చేసిన సుమారు రూ.5 కోట్ల విలువ చేసే జీవామృతాన్ని హైదరాబాద్కు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి తీసుకెళ్లి తిరిగి డబ్బు చెల్లించకుండా గ్రామీణ శాస్త్రవేత్తలను మోసం చేశాడు. గ్రామీణ శాస్త్రవేత్తలకు దుర్గాప్రసాద్ డబ్బులు చెల్లించకపోవడంతో కోర్టుకు వెళ్లారు. అయినా ఇప్పటి వరకు దుర్గాప్రసాద్ డబ్బులు చెల్లించలేదు. అతను రాజకీయంగా పలువురి రాజకీయ నాయకుల ద్వారా పోలీసులతో తొట్టంబేడులో వివాదాలకు ఆజ్యం పోస్తున్నాడు. అందులో భాగంగా శ్రీకాళహస్తిలోని పోలీసులకు దుర్గాప్రసాద్ వాస్తవాలు చెప్పకుండా, అబద్ధాలు చెప్పి పోలీసులను జీవామృతం ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకువచ్చాడు. పోలీసులు కూడా వాస్తవాలు తెలసుకోకుండా శాస్త్రవేత్త కారాకొల్లు శాస్త్రవేత్త చంద్రశేఖర్ నాయుడిని బెదిరించారు. గ్రామీణ శాస్త్రవేత్తలకు డబ్బులు చెల్లించకుండా రాజకీయంగా, పోలీసులు పరంగా వివాదాలకు ఆజ్యం పోశారు. జీవామృతం ఫ్యాక్టరీ వద్ద హైదరాబాద్ చెందిన నాన్ లోకల్ వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా శాస్త్రవేత్తను బెదిరించడం సబబు కాదని స్థానికులు అంటున్నారు. కాగా శ్రీకాళహస్తి గ్రామీణ శాస్త్రవేత్తలు నాన్ లోకల్ వ్యక్తులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దొంగ ప్రేమజంట అరెస్టుతొట్టంబేడు: ఆ ప్రేమజంట రూటే వేరు. దర్జాగా దొంగలించడం ఆ మొత్తంతో జల్సాలు చేయడం వారి నైజం. తొట్టంబేడు పోలీసు కథనం మేరకు.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన కిరణ్ ఐటీఐ వరకు చదివాడు. జియో టవర్ వద్ద టెక్నీషియన్గా పనిచేసేవాడు. అయితే అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. కసి పెంచుకున్న అతను తన ప్రియురాలితో కలసి స్కెచ్వేశాడు. అదే కంపెనీకి చెందిన టవర్ల వద్ద పరికరాలను చోరీ చేసేందుకు ప్లాన్ వేశాడు. సెల్ఫోన్ వాడితే పోలీసులకు పట్టుపడతామని, వాకీటాకీలతో చోరీలకు పాల్పడ్డారు. పోలీసు రెక్కీతో బుధవారం పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 40 రోటర్లు, డమ్మీగన్, రెండు వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 226 మంది రోగుల ఎంపిక తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో టీటీడీ ప్రాణదాన పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సల కోసం 226 మంది రోగులను ఎంపిక చేసినట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. ఆస్పత్రిలోని డైరెక్టర్ కార్యాలయంలో గురువారం పద్మావతి చిన్న పిల్లల హృదయాల డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ కోటిరెడ్డి, బర్డ్ హాస్పిటల్ డాక్టర్ రామ్మూర్తి, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, రుయా హాస్పిటల్ డాక్టర్ సుబ్బలక్ష్మి, మెటర్నటీ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసులు, స్విమ్స్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ డీ గోపి తదితరులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉచిత శస్త్ర చికిత్సకు పేదరోగులను ఎంపిక చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్డియాలజీ విభాగంలో నలుగురు, కార్డియో థొరాసిక్ 19 మంది, ఈఎన్టీ ఒకరు, జనరల్ సర్జరీ 9 మంది, మెడిసిన్ విభాగంలో 20, మెడికల్ ఆంకాలజీలో ముగ్గురు, నెప్రాలజీలో 72 మంది, న్యూరాలజీకి సంబంధించి 15 మంది, న్యూరో సర్జరీకి 48 మంది, గైనకాలజీలో ఇద్దరు, రేడియేషన్ ఆంకాలజీ ఇద్దరు, రేడియాలజీ ఇద్దరు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో 24 మంది, సర్జికల్ ఆంకాలజీ నలుగురు, యూరాలజీ విభాగంలో ఇద్దరు చొప్పున మొత్తం 226 మంది పేషెంట్లను ఎంపిక చేశామని చెప్పారు. -
సిద్ధేశ్వరా.. గుట్ట కర కరా..!
మండలంలోని ప్రకృతి వనరులను అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టలను, కొండలను సైతం వడియాలు, అప్పడాల్లా కరకరలాడిస్తున్నారు. పర్యావరణ విధ్యంసకులవుతున్నారు! దీనికి ‘సిద్ధేశ్వరగుట్ట’ నిలువెత్తు నిదర్శనంగా ఉంటోంది. తనను నిలువెల్లా ఛిద్రం చేశారని గుట్ట ఆక్రోశిస్తోంది.రామచంద్రాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మండలంలో అనుపల్లె, రాయలచెరువు, గణేష్ పురం, గుండోడు కణం, ప్రాంతాల్లో అడవులను కొల్లగొట్టేశారు. ప్రస్తుతం సి. రామాపురం లెక్క దాఖలాలో సర్వే నంబర్ 28లోని సిద్ధేశ్వర గుట్టనూ పిండి చేసి కోట్లు గడిస్తున్నారు.! సిద్ధేశ్వర గుట్టలో ఎన్నో ఏళ్లనాటి వృక్షాలను నేలమట్టం చేసి, హిటా,ఈ, జేసీబీలతో గుట్టలను తవ్వేస్తున్నారు. రోజూ వందలాది లారీల్లో అక్రమ గ్రావెల్ తరలిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ జేబులు నింపుకుంటున్నారు. వీరి దెబ్బకు అడవులు, గుట్టలు రూపురేఖలు మారిపోతున్నాయి. మరోవైపు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వీటిపై ఫిర్యాదులు అందుతున్నా ఒత్తిళ్లకు జడిసి అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. పైగా నేతల అరాచకాలకు సహకరిస్తూ తప్పుడు నివేదికలిస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. ఉన్నతాధికారులైనా స్పందించి, సిద్ధేశ్వరగుట్ట పరిరక్షణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. భారీ యంత్రాలతో ప్రకృతితో పాటు బండలను నాశనం చేసిన అక్రమార్కులు -
భూ ఆక్రమణ నిజమేనా?
రేణిగుంట: తమ గ్రామంలో జరుగుతున్న భూ అక్రమణలపై తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సర్వే నవబర్లతోసహా టైప్ చేసి వివిధ ప్రచార మధ్యమాల్లో పెట్టడంతో స్థానిక అధికార పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. అధికారులు సైతం ఈ విషయంపై మౌనం పాటించడంలో నిజంగానే అక్రమాలు జరిగాయ అనేది స్థానికంగా చర్చనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీలోని కొత్తపాళెంలో కొత్తపాళెం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 8.5 ఎకరాల ప్రభుత్వ అసైనన్డ్ భూమిని అక్రమంగా లేఅవుట్లుగా మార్చి, విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నంబర్లు 146, 147, 149, 150, 151, 152, 153, 155, 156, 157, 158, 159, 166, 172, 173, 174, 175 పరిధిలో ఉన్న సుమారు 8.5 ఎకరాల భూమిని కబ్జాదారులు గుప్పిట్లోకి తీసుకున్నారు. 2005లో ప్రభుత్వం పేదలకిచ్చిన ఈ అసైనన్డ్ భూమిని, రికార్డుల్లో మార్పులు చేసి రియల్ వెంచర్లుగా మార్చారని, కఠినమైన 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న సుమారు 1.06 ఎకరాల భూమిని కూడా ఈ అక్రమ లేఅవుట్లో కలిపేశారు. ఈ భూమిలో రోడ్లు వేస్తున్నా, లేఅవుట్ అభివృద్ధి చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ మెసేజ్ వ్యాప్తి చెందడంతో అధికార పార్టీ నాయకులు, స్థానిక రెవెన్యూ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయమై తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని వివరణ కోరగా సిబ్బందిని పంపి సర్వే చేయిస్తామని, ఏదైనా ఆక్రమణ ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఖోఖో పోటీల్లో బీవీఆర్ఎస్ జెడ్పీహెచ్ పీఈటీ ప్రతిభ
కలువాయి(సైదాపురం): జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు కాంస్య పతకం సాధించింది. ఇందులో మండలకేంద్రంలోని బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్ ప్లస్ వ్యాయామ ఉపాధ్యా యుడు నిడిగుంట రాజా ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొని, తన ప్రతిభన చూపి రాష్ట్రానికి కాంస్య పతకం సాధించడంలో తమ వంతు కృషి చేశా డని బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్డీ అబ్బాస్ ఆలీ తెలిపారు. కాంస్య పతకం సాధించిన రాజాను హైస్కూల్ ప్లస్ అసిస్టెంట్ మల్లికార్జున్రెడ్డి, స్టాఫ్ సెక్రటరీ పెంచల పుల్లయ్య, విద్యా కమిటీ చైర్మన్ కలువాయి మహే ష్, సహచర ఉపాధ్యాయులు అభినందించారు. ప్రకృతి వ్యవసాయంపై చర్చాగోష్టిచంద్రగిరి: ఎస్వీ అగ్రికల్చర్ కళాశాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రకృతి వ్యవసాయంపై గురువారం రైతులతో చర్చాగోష్టి నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సు మతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ రెడ్డిశేఖర్, ప్రసాద రావు, జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి షణ్ముగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్ర వేత్త లు కేవీ నాగమాధురి, ఎస్ మురళీకృష్ణ, ఎస్. కలీముల్లా, కె. విశ్వనాథ్, పి.మహేశ్వరరెడ్డి, టీఎం హేమలత, బి.సంతోష్ కుమార్ పాల్గొన్నారు. బాలికల వసతి గృహాల తనిఖీ నాయుడుపేట టౌన్: పట్టణంలోని లోతువానిగుంట ఎస్సీ బాలికలు 1, 2 వసతి గృహాలను గురువారం ఎస్సీ కమిషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీపతి బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థినులకు అందుతున్న వసతులపై ఆయన ఆరా తీశారు. వసతిగృహంలో బాలికలకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల గదులు, మరుగుదొడ్లు తదితర వాటిని తనిఖీ చేశారు. ఏమైనా సమస్యలున్నాయా? అని విద్యార్థులను ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ బాలికల వసతిగృహంలో వార్డెన్లు నిత్యం పర్యవేక్షిస్తూ వారికి ఆరోగ్యకరమైన భోజనాలను అందించాలని సూచించారు. -
ఆన్లైన్ యాప్తోనే జనగణన
తిరుపతి అర్బన్: ఆన్లైన్ యాప్ ఆధారంగానే జనగణన ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్లో 2026–27కు చెందిన జనగణన ( 16వ సెన్సస్ ఆపరేషన్స్)కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజుల శిక్షణ చేపట్టారు. డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలితో పాటు పలువురు హాజరయ్యారు. 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనగణన పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు డైట్ కాలేజ్ లెక్చరర్ సుధారాణి, ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజ్, తిరుపతి ఉదయ్, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ రమాదేవి, స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజమోహన్ రెడ్డి, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
జీవితం ఆటో..ఇటో!
ప్రస్తుతం ప్రజారవాణా వ్యవస్థ ఆటోవాలా చేతిలోకి చేరింది.. రవాణాశాఖాధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు.. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం..ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపకపోవడం ఆటోవాలాలకు వరంగా మారింది. ఆర్టీఏ, ఆర్టీసీ, పోలీసు శాఖలు వైఫల్యం చెందడంతో ఆటోల హవా కొనసాగుతోంది. ఆటోలో ప్రయాణంతో జీవితం ఎటు పోతుందో తెలిసినా.. తప్పని సరి పరిస్థితిలో జనం తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటన గురువారం తిరుపతి నగరంలో చోటు చేసుకోగా సాక్షి తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫోటోగ్రాఫర్ తిరుపతి -
ఫీల్డు అసిస్టెంట్పై వేటు
సత్యవేడు: ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశారు. మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 28 పంచాయతీల పరిధిలో 672 పనులకు రూ.12.81 కోట్టు ఖర్చు చేశారు. ఆడిట్ సిబ్బంది పరిశీలనలో చిన్నఈటిపాకం, కొత్తమారికుప్పం, మల్లవారిపాళెం వెస్టు, ఇరుగుళం పంచాయతీలలో పశువులు షెడ్లు కొన్ని అసంపూర్తి, మరి కొన్ని పూర్తి చేసి దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఆంబాకం పంచాయతీలో 8 మంది కూలీల్లో మహిళలకు బదులుగా పురుషులు పనిచేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఫీల్డు అసిస్టెంట్ పి.అరుణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పలు పంచాయతీల్లో జరిగిన అవకతవకలకు రూ. 1.33 లక్షలు రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సరిత, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏఓ త్రివిక్రమరావు, ఏపీఓ విజయభాస్కర్, డీఆర్పీలు కమల్నాద్, కావమ్మ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డు అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాయింట్ ఆపరేషన్ తిరుపతి క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనల నేపథ్యంలో జాతీయ రహదారులపై సుదూర ప్రయాణ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు, రవాణా, అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించాయి. టోల్ప్లాజాల వద్ద భద్రతా ప్రమాణాలు, వాహనాల స్థితి, అగ్నిమాపక ఏర్పాట్లపై అధికారదులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నేతృత్వంలో ఈ సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఏర్పేడు, వడమాలపేట టోల్ప్లాజాల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ట్రావెల్స్ వాహనాలు, సుదూర ప్రయాణ వాహనాలను ఆపి అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి తనిఖీలను ప్రతిరోజూ నిరంతరంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పేర్కొన్నారు. -
పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు!
నాయుడుపేట టౌన్: విచారణ పేరుతో తీసుకువచ్చి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి గురువారం నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించారని ఆయన తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. పెళ్లకూరు మండలం కలవకూరు వద్ద స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక దందాను అడ్డుకోవడంతో సత్యనారాయణరెడ్డితో పాటు పెళ్లకూరు ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, మరికొంతమంది నాయకులు, రైతులను సైతం అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. విచారణ పేరుతో సత్యనారాయణరెడ్డిని కస్టడీకి తీసుకున్న పెళ్లకూరు పోలీసులు ఆయన్ని బుధవారం ఉదయం పెళ్లకూరు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అయితే పోలీసులు ఆయనతో మాట్లాడేందుకు విలేకరులను సైతం అనుమతించలేదు. పెళ్లకూరు పోలీస్స్టేషన్ నుంచి గురువారం సాయంత్రం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాల వద్దకు తీసుకువచ్చి వైద్య పరీక్షలు జరిపారు. అక్కడి నుంచి నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట సత్యనారాయణరెడ్డిని హాజరుపరిచారు. గురువారం సాయంత్రం తిరిగి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి తరఫు న్యాయవాది చదలవాడ కుమార్ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సత్యనారాయణ రెడ్డి తనకు జరుగుతున్న అన్యాయం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారని తెలిపారు. విచారణ పేరుతో తీసుకువచ్చి పెళ్లకూరు లాకప్లో నిర్బంధించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో లాకప్లో నిర్భంధించి కనీసం నిద్రపోయేందుకు బెడ్డు కూడా ఇవ్వకుండా ఆరోగ్యం సరిగా లేదని మాత్రలు ఇవ్వాలని చెప్పినా ఇవ్వకుండా విచక్షణారహితంగా వ్యవహరించారని సత్యనారాయణరెడ్డి న్యాయమూర్తి ఎదుట తన బాధను చెప్పుకున్నారని చెప్పారు. కేవలం అధికారపార్టీ నేతల ఒత్తిడితో అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని సత్యనారాయణరెడ్డి న్యాయమూర్తి ఎదుట వాపోయినట్లు న్యాయవాది వివరించారు. -
స్పష్టమైన లక్ష్యానికి నిరంతర సాధన అవసరం
తిరుపతి సిటీ:విద్యార్థులు స్పష్టమైన జీవిత లక్ష్యాన్ని ఎంచుకుని అందుకోసం నిరంతర సాధన చేయాలని వీసీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావు పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఫిజిక్స్ విభాగంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో విద్యార్థులకు వారం రోజులపాటు అందిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు భాష, వ్యక్తీకరణ, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. తద్వారా ఉన్నత ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ దేవ ప్రసాదరాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కౌటిల్య సంస్థ డైరెక్టర్లు శామ్యూల్ రెడ్డి, శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రతి మనిషికి కాలానుగుణమైన నైపుణ్యాలు అవసరమన్నారు. కార్యక్రమంలో రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ లోకనాథం, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారులు సులేమాన్, సునేష్, స్కిన్ డెవలప్మెంట్ ట్రైనర్ దీప్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిరంతర నిఘా ఉండాలి
రేణిగుంట: జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ వద్ద నిరంతర నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లో భద్రపరచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను గురువారం సాయంత్రం రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బీయూ, సీయూలు, వీవీ ప్యాట్లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీ కాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, ఈవీఎం గోడౌన్ ఇన్చార్జి, జీఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ వై రమేష్ బాబు పాల్గొన్నారు. స్విమ్స్లో పేదరోగికి విలువైన శస్త్ర చికిత్స తిరుపతి తుడా: స్విమ్స్ ఆసుపత్రిలో టీటీడీ ఎస్వీ ప్రాణదాన పథకం ద్వారా నిరుపేద రోగికి ఉచితంగా రూ.5 లక్షల విలువైన శస్త్ర చికిత్స విజ యవంతంగా పూర్తి చేశారు. గురువారం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ రోగిని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లా కోయ్యలగూడెం మండలం, సారిపల్లి గ్రామానికి చెందిన వెంకట సత్యవతి అనే పేద పేషెంట్ వెన్నుముక ట్యూబర్ క్లోసిస్ వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉండటంతో ఆమెకు ఎస్వీ ప్రాణదానం పథకం కింద రూ. 5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించినట్లు చెప్పారు. స్విమ్స్ న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, పేషెంట్ను గురువారం డిశ్చార్జ్ చేశారు. రోగి, వారి కుటుంబ సభ్యులు డైరెక్టర్కు, టీటీడీకి, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవస్థాపకత నైపుణ్యాలపై శిక్షణ తిరుపతి సిటీ: ఎస్వీయూ హోమ్సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రూసా 2.0 సహకారంతో ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్ విద్యార్థులకు వ్యవస్థాపకత నైపుణ్యాలు, ఫైర్ స్టార్టర్ అనే అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం వర్సిటీలో జరిగిన శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి వీసీ టాటా నర్సింగరావు ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఇలాంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగకరమని, వర్సిటీ విద్యార్థుల ఉన్నతికి అన్ని విధాల ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ విజయ్ మాథూర్, రూసా సీఈఓ వంశీ, కన్వీనర్ ప్రొఫె సర్ సుచరిత, అధ్యాపకులు ఆర్కే అనురాధ, బి స్వరూపారాణి, కే అనురాధ పాల్గొన్నారు. -
వేదనారాయణస్వామి నాభిని తాకిన రవి కిరణాలు
నాగలాపురం: మండలంలోని టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో సూర్యపూజోత్సవంలో భాగంగా మూడోరోజైన గురువారం రవి కిరణాలు గర్భాలయంలోని స్వామివారి నాభిని తాకాయి. ఆలయ అర్చకులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. పరివార దేవతలకు అభిషేకాలు, విశేష పూజలు చేసి భక్తుల సర్వదర్శనం కల్పించారు. అనంతరం ఉదయం 10 గంటలకు సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారికి అమ్మవారి మండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన సేవ నిర్వహించి, దూపదీప నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు సూర్య భగవానుడు అస్తమించే సమయంలో రవికిరణాలు మెల్లమెల్లగా ఆలయ ప్రధాన గోపురం నుంచి గర్భాలయంలోని స్వామివారి నాభిని తాకాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు పులకించారు. అనంతరం సూర్యుని కిరణాలు పయనించిన మార్గాన్ని ఆలయ పరిచారకులు పుణ్యజలంతో అభిషేకించారు. ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణలతోఅలయం మారుమోగింది. నేత్ర పర్వం.. తెప్పోత్సవం సూర్యపూజోత్సవం సందర్భంగా నిర్వహించిన తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం పుష్కరిణిలో తెప్పపై కొలువు దీర్చారు. అనంతరం స్వామివారు మూడు సార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేదపండితులు వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ మునిశంకరయ్య, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, ఆలయ అధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఉదయ్ కుమార్, పాల్గొన్నారు. -
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు అమానుషం
తిరుపతి మంగళం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయాలకు సంబంధం లేని వైఎస్.భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమని మాజీ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. వైఎస్. భారతి ఏరోజూ ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకోరని, కుటుంబం, సేవా కార్యక్రమాలు వరకే పరిమితం అవుతున్నారన్నారు. అలాంటి భారతిపై నిత్యం విమర్శలు చేయడం వారి నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. వైఎస్.భారతి వెంకటప్ప మెమోరియల్ స్కూల్ ద్వారా దాదాపు 2 వేల మంది పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యాబోధన ఉచితంగా అందించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారన్నారు. వైఎస్. జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన రోజు నుంచి రాజకీయంగా ఎదుర్కోలేక భారతిపై నిత్యం ఆరోపణలు చేస్తూ రాజకీయాల్లో ఫేమ్ అవాలనుకునే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైఎస్.భారతి ఏ నాడు ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని, ఎవరినీ విమర్శించలేదని, ఎప్పటికప్పుడు హుందాగా నడుచుకుంటూ.. ధైర్యంగా ముందుకు సాగుతూ.. మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళా శక్తి వైఎస్. భారతి అని పేర్కొన్నారు. సమాజంలో గౌరవంగా ఉంటూ, సమాజానికి సేవ చేస్తున్న వైఎస్. భారతిని రాజరీయ లబ్ధి కోసం మహిళలే సమాజం తలదించుకునేలా దుర్భాషలాడడం మహిళా సమాజానికే సిగ్గుచేటన్నారు. ఎస్వీయూలో జాబ్ మేళా రేపు తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయీమెంట్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన కంపెనీ ప్రతినిధులు జాబ్మేళాకు హాజరవుతారని, సుమారు 550 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ పూర్తి చేసిన అభ్యుర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు వర్సిటీలోని ఎంప్లాయీమెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. -
వారంలోపు పుస్తకాలు
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇంటర్ సెకండ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నూతన సిలబస్తో కూడిన పుస్తకాలు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కానీ, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఇంటర్ బోర్డు అధికారులు వారంలోపు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. నూతన సిలబస్కు అనుగుణంగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు సమర్థులైన అధ్యాపకులు ఉన్నారు. పోటీ పరీక్షలకు సైతం విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నాం. – జి.రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి -
ఆదేశాలు బేఖాతర్
మా రాజ్యం.. మా ఇష్టం అన్నట్టు అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. కాసుల కక్కుర్తితో అక్రమార్కులకు వంత పాడుతున్నారు. స్వర్ణముఖి నదీపరీవాహక ప్రాంతాల్లో ఆక్రమణలకు సహకారం అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. రెవెన్యూ అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. అక్రమ కట్టడాలను తొలగించాలని ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను బుట్టదాఖలు చేసేశారు.సాక్షి, టాస్క్ఫోర్స్ : తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీ దక్షిణపు కండ్రిగ లెక్క దాఖలా సర్వే నంబరు 160లోని స్వర్ణముఖి నది పోరంబోకు భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు కనీసం మాత్రం స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్వర్వులను అమలు చేసేందుకు కోర్టు రెండు నెలల సమయం ఇచ్చినప్పటికీ అధికారుల్లో చలనం కనిపించడం లేదని మండిపడుతున్నారు. ధిక్కరణ ముప్పు? హైకోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారుల పై ఎటువంటి చర్యలు ఉంటాయో అని రెవెన్యూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తొలగింపు చర్యలకు ఉన్నతాధికారులు ఆసక్తి చూపలేదని చర్చించుకుంటున్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్, ఆర్డీఓ, తిరుపతి రూరల్ తహసీల్దార్ తదితరులు ఉన్నారు. వీరికి కోర్టు దిక్కరణ ముప్పు తప్పదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడెక్కిన వ్యవహారం అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే ఆక్రమణల జోలికి అధికారులు వెళ్లడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నది పరీవాహక భూములను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితో హైకోర్టు ఉత్తర్వుల ను సైతం అధికారులు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడువు దాటినా.. నది పోరంబోకు భూముల్లో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేసేశారు. అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. దీంతో స్థానికుడు ముచ్చేలి కిరణ్కుమార్రెడ్డి పలు మార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. వారు పట్టించుకోక పోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించారు. కేసు నంబరు 29317 కింద విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్ మెంట్ యాక్ట్ 1905 ప్రకారం స్వర్ణముఖి నది భూమిపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని స్పష్టం చేసింది. సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులను అమలు చేయడానికి రెండు నెలల సమయమిచ్చింది. ఈ క్రమంలో కోర్టు ఇచ్చిన గడువు పూర్తవడంతో రెవెన్యూ అధికారులపై కోర్టు దిక్కరణ పిటిషన్ వేయనున్నట్లు ఫిర్యాదీ కిరణ్ కుమార్రెడ్డి వెల్లడిస్తున్నారు. -
సమాధానం చెప్పాల్సిందే..
నది పొరంబోకు భూముల్లో అక్రమ కట్టడాలను రెండు నెలల్లో తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆదేశాలను అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తున్నాం. దీంతో కలెక్టర్తో పాటు ప్రతివాదులందరూ కోర్టుకు హాజరై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్టు ధిక్కరణ కింద వారికి జరిమానా పడవచ్చు. జైలు శిక్ష కూడా విధించే అవకాశముంది. – పసపాల సుధాకర్రెడ్డి, న్యాయవాది ఉత్వర్తులను అమలు చేస్తాం చిగురువాడ దక్షిణపు కండ్రిగ సర్వే నంబరు 160లో ఆక్రమణలను తొలగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను తప్పకుండా అమలు చేస్తాం, అక్రమ కట్టడాలను తొలగిస్తాం. ఆయా భూములను స్వాధీనం చేసుకుంటాం. చిగురువాడ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – జనార్ధన్రాజు, తహసీల్దారు, తిరుపతి రూరల్ -
కోచింగ్ బాటలో విద్యార్థులు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల భయం వెంటాడుతోంది. దీంతో వారు ట్యూషన్లు, కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఆ స్థాయి బోధన కళాశాలల్లో అందకపోడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు నూతన సిలబస్ను ప్రవేశపెట్టిన ఇంటర్ బోర్డు ఈ మేరకు తగిన సదుపాయాలను విద్యార్థులకు అందించడంలో విఫలమైంది. కేవలం పుస్తకాలను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటోంది. ప్రస్తుతం కళాశాలల్లో 60శాతం మంది అధ్యాపకులు పదవీ విరమణకు చేరువలో ఉన్నారు. వారికి నూతన సిలబస్పై తూతూమంత్రంగా శిక్షణ ఇచ్చి బోధించమనడంతో అధ్యాపకులు కాస్త భారంగానే భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
విద్యతోపాటు పరిశోధనలు అవసరం
తిరుపతి సిటీ:యువతకు విద్యతోపాటు నూతన పరిశోధనల దిశగా దృష్టి సారించడం అవసరమని టీటీడీ డీఈఓ వెంకట సునీల్ తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహించిన దక్షిణ భారత న్యూమిస్మాటిక్ సొసైటీ వార్షిక సదస్సు బుధవారంతో ముగిసింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ న్యూమిస్మాటిక్స్ అనేది కేవలం నాణేల సేకరణ మాత్రమే కాదని, మన చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకునే ప్రధాన అధ్యయన రంగమని వెల్లడించారు. గొప్ప వారసత్వ సంపద కలిగిన మనదేశంలో నాణేల అధ్యయనం ద్వారా అనేక చారిత్రక అంశాలను వెలికితీయవచ్చని వివరించారు. ఇలాంటి సదస్సులు యువతలో చరిత్రపై ఆసక్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు పరిశోధన దిశగా ముందుకు వచ్చి, మన దేశపు వారసత్వాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. అనంతరం విశ్రాంత ప్రొఫెసర్ శకుంతలను ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, అధ్యాపకులు భీమన్న, మల్లికార్జునరావు, కిషన్, ప్రసాద్ రావు, సుబ్రమణ్యం, ఉష, విజయశ్రీ, ఉమారాణి, తేజోవాణి, శ్రీదేవి పాల్గొన్నారు. రూ.10 లక్షల విరాళం తిరుపతి అన్నమయ్యసర్కిల్: బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బుధవారం రూ.10 లక్షల విరాళం అందింది. విజయవాడలోని ఆయూష్ ఆస్పత్రి డాక్టర్ ఉప్పాలచక్రపాణి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు డీడీని అందజేశారు. డాక్టర్ కోడెల శివరామకృష్ణ పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 23 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 78,381 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,451 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.46 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఫిజిక్స్ పరీక్షకు 246 మంది గైర్హాజరు తిరుపతి అర్బన్ : జిల్లాలో బుధవారం నిర్వహించిన పదోతరగతి భౌతికశాస్త్రం పరీక్షకు 246 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ వెల్లడించారు. మొత్తం 27,068 మందికి గాను 26,822 మంది విద్యార్థులు పరీక్షకు హజరైనట్లు వివరించారు. అలాగే ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ పరీక్షలకు సంబంధించి 839 మంది విద్యార్థులకు 732 మంది మాత్రమే హాజరయ్యారని, 107 మంది రాలేదన్నారు. ఈ క్రమంలోనే నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామని తెలిపారు. జిల్లా మానిటరింగ్ కో–ఆర్డినేటర్ 5, ఫ్లయింగ్ స్క్వాడ్ 27, సిట్టింగ్ స్క్వాడ్ 33 కేంద్రాలను పరిశీలించినట్లు వివరించారు. లాసెట్ దరఖాస్తుకు గడువు పెంపు తిరుపతి రూరల్ : రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో పద్మావతి మహిళా వర్సిటీ మే 4వ తేదీన నిర్వహిస్తున్న ఏపీ లా సెట్, పీజీ లాసెట్కు గడువు పొడిగించినట్లు కన్వీనర్ సీతాకుమారి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు రూ.1000 ఆలస్య రుసుముతో ఈ నెల 28వ తేదీ, రూ.2వేలతో 31, రూ.4వేలతో ఏప్రిల్ 3, రూ.10వేలు చెల్లించి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి ప్రతిభ తిరుపతి సిటీ : థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. విజేత జట్టులో ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చెందిన విద్యార్థి మనోజ్కుమార్ ఉత్తమ ప్రతిభను కనబరిచాడు. బుధవారం ఈ మేరకు మనోజ్కుమార్ను ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పీడీ డాక్టర్ ముస్తాక్, అధ్యాపకులు పాల్గొన్నారు -
గ్రీన్ రేటింగ్పై అవగాహన సదస్సు
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : రాష్ట్రంలోని పరిశ్రమలలో సుస్థిర విధానాలు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా బుధవారం ‘గ్రీన్ రేటింగ్’పై శ్రీసిటీలో అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏపీపీసీబీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం ‘గ్రీన్ రేటింగ్’ విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పరిశ్రమల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా భాగం కావాలన్నారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం లక్ష్యాన్ని, తీర ప్రాంతంలో ప్రతిపాదించిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రణాళికను ప్రస్తావించారు. సుస్థిరత శ్రీసిటీలో భాగం శ్రీసిటీలో గ్రీన్ రేటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు డాక్టర్ కృష్ణయ్యకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రసన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సుస్థిరత అనేది శ్రీసిటీలో అంతర్భాగమని పేర్కొన్నారు. హరిత భవనాలు, పునరుత్పాదక శక్తి వినియోగం, సమర్థవంతమైన నీటి, వ్యర్థాల నిర్వహణ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఏపీపీసీబీ రూపొందించిన ప్రోత్సాహక వ్యవస్థతో తమ పరిశ్రమలు క్రమంగా ప్రపంచ స్థాయి హరిత ప్రమాణాలను పాటిస్తున్నాయని చెప్పారు. అనంతరం సీఐఐ గ్రీన్్ కో దక్షిణ ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ చైర్మన్ నిహాల్ కౌల్ మాట్లాడారు. ఇంధన శక్తి, నీరు, వ్యర్థాల వినియోగాన్ని క్రమబద్ధం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు కంపెనీకి లాభాలు కూడా సాధ్యమవుతాయని చెప్పారు. సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.ముత్తుసెళియన్ స్వాగత ఉపన్యాసం చేశారు. శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో సమగ్ర వ్యర్థాల నిర్వహణ, ఈ–వ్యర్థాల రీసైక్లింగ్ సదుపాయాలు త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని డాక్టర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. -
‘గరుడ’ ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరి
తిరుపతి అర్బన్ : గరుడ వారధిపై ద్విచక్రవాహనదారులు ప్రయాణించాలంటే హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో రహదారుల భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.వారు మాట్లాడుతూ గరుడ వారధిపై భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. రోడ్లపై ప్రమాదకర ప్రాంతాలను బ్లాక్స్పాట్స్గా గుర్తించాలని ఆదేశించారు. రహదారుల సమీపంలో రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయాలని, మద్యం దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. క్షతగాత్రులకు అత్యవసర చికిత్స నిమిత్తం ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ క్రమంలోనే విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థులకు ప్రత్యేకంగా మత్తు పదార్థాల వినియోగంతో తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పించాలని కోరారు. మెడికల్ స్టోర్స్లో మత్తు పదార్థాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం గంజాయి నివారణ, డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో అవగాహన పోస్టర్ ఆవిష్కరించారు. అడిషనల్ ఎస్పీ రవిమనోహరచారి, నేషనల్ హైవే పీడీలు వెంకటేశ్వర్లు, రవీంద్రరావు, చౌదరి, ఆర్అండ్బీ ఎస్ఈ రాజానాయక్, ఆర్టీఓ మురళీమోహన్, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు. -
ఆక్రమణలో కుంట
చంద్రగిరి: లక్షలాది రూపాయల విలువైన కుంట పోరంబోకు స్థలాలపై టీడీపీ గద్దలు వాలాయి. గత కొన్ని నెలలుగా కుంటపోరంబోకును ఆక్రమించుకోవడానికి అన్ని విధాలుగా వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో కుంటపోరంబోకు ఆక్రమణలపై 10 రోజులకు ముందే సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో బుధవారం టీడీపీకి చెందిన ఓ నేత కుంట భూమిని ఆక్రమించుకోవడంతోపాటు పిల్లర్లు వేయడానికి గుంతలను తీశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆక్రమణలను అడ్డుకున్నారు. వివరాల్లోకెళితే.. మండల పరిధిలోని చంద్రగిరి శివారుల్లోని తొండవాడ పంచాయతీకి చెందిన అరుణ కాలనీ సమీపంలో సర్వే నంబరు 306/1లో 48 సెంట్ల గుర్రాలకుంట ఉంది. చంద్రగిరితోపాటు పరిసర ప్రాంతాల్లో పడిన వర్షపు నీరు గుర్రాలకుంట ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్తుంది. అయితే అదే ప్రాంతానికి చెందని ఓ టీడీపీ నాయకుడు గుర్రాలకుంటను ఆక్రమించుకోవడానికి గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఓ నేత అభయం ఇవ్వడంతో కుంటను ఆక్రమించుకోవడానికి తెగబడ్డాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తాను నిర్మించుకుంటున్న ఇంటి సమీపంలోని కుంట పోరంబోకు స్థలంలో పిల్లర్లు వేయడానికి గోతులు తీశాడు. ఆపై పనులను శరవేగంగా చేపట్టాడు. తిరుపతి–చంద్రగిరి రహదారికి ఆనుకుని భూమి ఉండడంతో మార్కెట్లో భారీగా విలువ ఉంది. విలువైన స్థలాన్ని అధికారం అడ్డంపెట్టుకుని ఆక్రమించుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. మా నాయకుడు చెప్పాడు.. కట్టేస్తున్నాం గుర్రాలకుంటలో అక్రమ నిర్మాణాలకు పూనుకున్న ఆ నేత, ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన తమ నాయకుడు చెప్పాడని, అందుకే తాను ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నానంటూ స్థానికులను బెదిరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. కుంటపోరంబోకులో అక్రమ నిర్మాణాలను చేసుకోమని ఆ నేత చెప్పడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి పేరు చెప్పి అక్రమ నిర్మాణాలకు పాల్పడడం ఏమిటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గుర్రాలకుంటలో అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలకు అడ్డు గుర్రాలకుంట భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు తెలుసుకున్న తహశీల్దార్ శివరామసుబ్బయ్య, నిర్మాణాలను అడ్డుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో వీఆర్ఓతోపాటు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరంగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. గుర్రాలకుంటలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ముందే చెప్పిన సాక్షి గుర్రాలకుంట ఆక్రమణలపై ఈ నెల 16వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. గతంలో ఇదే రీతిలో అక్రమణకు పాల్పడితే రెవెన్యూ అధికారులు అడ్డుకుని, హెచ్చరిక బోర్డును సైతం ఏర్పా టు చేశారు. అధికారుల హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా మరోసారి ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు సాక్షి గుర్తించింది. దీనిపై ‘ఆక్రమణల పోరంబోకులే..!’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. -
చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం
తిరుపతి అర్బన్: జిల్లాలో ఎస్టీ, ఎస్సీల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, డీఆర్ఓ నరసింహులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడు తూ ఎస్సీ, ఎస్టీల సమస్యలను స్వయంగా అధికారులు తనిఖీ చేసి తక్షణమే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని స్పష్టం చేశారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి స్థల కేటాయింపులను సత్వరమే చేపట్టాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, ఆర్డీఓలు రామ్మోహన్, భాను ప్రకాష్రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, బీసీ వెల్పేర్ అధికారి భరత్రెడ్డి, సాంఘిక సంక్షేమ, సాధికార అధికారి హరీష్, ఆర్అండ్బీ ఈఈ రాజానాయక్, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డీఎంహెచ్ఓ బాలకృష్ణనాయక్, అగ్రికల్చర్ జేడీ ప్రసాద్రావు, కార్మిక శాఖ అధికారి చిన్న లాలప్ప పాల్గొన్నారు. -
టీకాల ప్రాముఖ్యతపై అవగాహన
తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సెమినార్ హాల్లో వయోజన టీకాల ప్రాముఖ్యతపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఐవీ లలితకుమారి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.వి.జ్యోత్స్నకల్పనా, ఎం.పల్లవి, ఆర్.దివ్య తిరుపతి మెడిగో హాస్పిటల్ వారి సహకారంతో కార్యక్రమం చేపట్టారు. మెడిగో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.సజిత్ టీకాల అవసరం, వాటి ప్రాముఖ్యతను వివరించారు. మెడిగో హాస్పిటల్ వైద్యులు డా.వాసిరెడ్డి తేజ వయోజనులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల టీకాలను వివరించారు. కార్యక్రమంలో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఇం.ఇనీరింగ్, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అగ్రగామిగా ‘పోషణ’
చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోషణ ఇంక్యుబేటర్ రాష్ట్రంలోనే అగ్రగామినిగా నిలిచిందని వీసీ శారదా జయలక్ష్మి తెలిపారు. బుధవారం తిరుపతిలోని వ్యవసాయ కళాశాలలో పలు అంకుర సంస్థల ఔత్సాహికులకు ప్రోత్సాహకంగా రూ.1.01 కోట్ల గ్రాంట్లు పంపిణీ చేశారు. సీడ్ కేటగిరి కింద 12 మందికి, ప్రీ–సీడ్ కేటగిరీ కింద ఇద్దరిని గుర్తించారు. ఈ క్రమంలోనే అంకుర సంస్థలతో ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పోషణ ఇంక్యుబేటర్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వర్చువల్గా హాజరైన వీసీ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పోషణ ఇంక్యుబేటర్ విశేషంగా కృషి చేస్తోందన్నారు. యువత కొత్త ఆలోచనలతో ఆధునిక వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని కోరారు. డాక్టర్ సుమతి మాట్లాడుతూ వ్యవసాయ అంకుర సంస్థలు ముందుకు సాగేందుకు గ్రాంట్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. సాంకేతికత వినియోగం పెంచడం ద్వారా రైతులకు మేలు చేకూర్చే ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. ఔత్సాహికులు మాట్లాడుతూ గ్రాంటు నగదుని వినియోగించి వ్యవసాయ రంగంలో నూతన మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పోషణ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కదిరి మోహన్ పాల్గొన్నారు. -
పోలీసు కస్టడీకి కామిరెడ్డి
– నెల్లూరు జిల్లా జైలు నుంచి తీసుకొచ్చిన పోలీసులు పెళ్లకూరు: నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని బుధవారం పోలీసు కస్టడీ నిమిత్తం పెళ్లకూరు పోలీసు స్టేషన్కు పోలీసులు తీసుకువచ్చారు. స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతో పోలీసులు పలు సెక్షన్లతో కేసులు నమోదు చేసి రిమాండ్పై జిల్లా జైలుకు ఆయనను తరలించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న కలవకూరు వద్ద స్వర్ణముఖి నదిలో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో చేపట్టిన ఇసుక అక్రమ తవ్వకాలను వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించి, పలు నాన్బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని రేణిగుంట ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. ఆయన్ను హుటాహుటిన కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. అనంతరం బుధవారం రోజున సత్యనారాయణరెడ్డిని రెండు రోజులు పోలీస్ కస్టడీ నిమిత్తం పెళ్లకూరు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న వివిధ ప్రాంతాల వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు స్టేషన్ వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ లోపలికి ఎవ్వరినీ అనుమతించలేదు. పోలీసు స్టేషన్ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించడంతో ఆందోళన చెందారు. కామిరెడ్డి భద్రతపై వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో పోలీసులు సత్యనారాయణరెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం. 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం – ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు రాపూరు–పెంచలకోన మార్గంలో 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. రైల్వేకోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన ఆర్ఎస్ఐ ఎన్.బాలచెన్నయ్య బృందం స్థానిక ఎఫ్ఓ జాన్ రంజిత్ కుమార్తో కలసి మంగళవారం నుంచి నెల్లూరు జిల్లా రాపూరు మండలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది. బుధవారం తెల్లవారుజామున పెంచలకోన రోడ్డులో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు టాస్క్ఫోర్స్ సిబ్బందిని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని రాపూరు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. వారిని విచారించి పరిసరాల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 13 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఓ మోటారు సైకిల్తో పాటు అరెస్టయిన వారిని, ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారణ అనంతరం ఎస్ఐ రఫీ కేసు నమోదు చేశారు. వరకట్నం కేసు నమోదు పుత్తూరు: అత్తింటి వారు వరకట్నం వేధిస్తున్నట్టు వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక కృష్ణానగర్కు చెందిన ఎం.మోహనప్రియ(33)ను తిరుపతి చెర్లోపల్లి, రజక కాలనీకి చెందిన ఎం.రాజేష్కుమార్కు వచ్చి పెద్దలు పెళ్లి చేశారు. ఆమెను భర్త రాజేష్కుమార్, అత్త మంజుల వరకట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. అంతటి ఆగక ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఈ క్రమంలో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పుత్తూరు పోలీసులు బుధవారం తెలిపారు. రైలు కింద పడ్డ విద్యార్థి ఓబులవారిపల్లె:రేణిగుంట–నంద్యాల వెళ్లే డెమో ప్యాసింజర్ రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి రెడ్డెయ్య రైలు కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల కథనం.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రాజంపేటకు చెందిన రెడ్డెయ్య ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం కళాశాలలో పరీక్షలు రాసి రాజంపేటకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు వచ్చాడు. రన్నింగ్లో రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారి రైలు ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయాడు. విద్యార్థులు కేకలు వేయడంతో చైనులాగి వెంటనే రైలును నిలిపివేశారు. రెడ్డెయ్య కుడి కాలుకు తీవ్రంగా గాయమైంది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ రెడ్డెయ్యను 108 వాహనంలో రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. -
సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ
ఏర్పేడు: చిత్తూరు ఆత్మ సౌజన్యంతో తిరుపతి జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో వాతావరణ ప్రతికూల పరిస్థితులలో వ్యవసాయ సాగులో రైతులు అనుసరించాల్సిన పద్ధతులపై బుధవారం రైతులకు శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా వనరుల కేంద్రం ఏఓ శ్రీనివాస్ పాల్గొని వాతావరణ ప్రతికూల పరిస్థితులలో రైతులు అనుసరించాల్సిన సాగు పద్ధతులను వివరించారు. విత్తన శుద్ధి చేసి మొక్కలను నాటుకోవడం, దేశీయ విత్తనాలను వాడడంతో కొంతవరకూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మంచి దిగుబడులను సాధించవచ్చని అన్నారు. ఏఓ సాగరిక మాట్లాడుతూ రైతులంతా ప్రకృతి వ్యవసాయంవైపు దృష్టి సారించాలన్నారు. అనంతరం రైతులతో కలసి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. రైతులకు కూరగాయ విత్తనాలు, ఆకు కూర గింజల ప్యాకెట్లు పంపిణీ చేశారు. రైతులకు శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందించారు. కార్యక్రంలో బీఆర్సీ ఇన్చార్జి రంగయ్య, ఏఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు డ్యూటీలు చేయలేం.. బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 10 మంది మహిళా పోలీసులు పోలీసు శాఖలో పనిచేయలేమని బుధవారం ఎంపీడీఓ వెంకటరత్నమ్మకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుశాఖలో బందోబస్తు డ్యూటీలు, ఇతర రకాల విధులుంటాయని, వాటిని నిర్వహించలేమన్నారు. మరో శాఖలకు మార్చాలని నాన్ విల్లింగ్ లెటర్లు ఇస్తున్నామని తెలిపారు. మండలంలోని 14 మంది ఉండగా ఇందులో నలుగురు విల్లింగ్ లెటర్ ఇవ్వగా, మిగిలిన 10 నాన్ విల్లింగ్ లెటర్ ఇచ్చారు. వీటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీడీఓ వెంకటరత్నమ్మ తెలిపారు. మధ్యాహ్న భోజనం తనిఖీ వరదయ్యపాళెం: మధ్యాహ్నం భోజనం పథకంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పక పాటించాలని, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందజేయాలని తిరుపతి జిల్లా డీఈఓ కేవీఎస్ కుమార్ తెలిపారు. మండలంలోని గోవర్ధనపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓ సరస్వతి, ఉపాధ్యాయులు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్ వినోద్ పాల్గొన్నారు. పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ చంద్రగిరి: స్వయం ఉపాధిలో భాగంగా గ్రామీణ ప్రాంతవాసులకు మూడు రోజులపాటు పుట్టగొడుగుల పెంపకంపై అందించిన శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకంపై చంద్రగిరి మండలం కొత్త శానంబట్ల గ్రామస్తులకు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో విత్తన తయారీలో పుట్టగొడుగులకు ఆశించే తెగుళ్లు, పురుగుల నివారణపై డాక్టర్ పి.అరుణశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ వివరించారు. శిక్షణార్థులకు పుట్టగొడుగుల బెడ్డు, విత్తనాలు, కవర్లు, రబ్బర్ బాండ్లపై వారికి సూచనలు అందించారు. అనంతరం వివిధ పుట్టగొడుగుల రకాలు, వాటి పెంపకానికి సంబంధించిన బుక్లెట్లను వారికి అందించారు. ముగింపు కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.రెడ్డి శేఖర్, డాక్టర్ వేమన, అరుణశ్రీ, గ్రామస్తులు, వ్యవసాయశాఖ విద్యార్థులు పాల్గొన్నారు. -
మన్నిక కోసం భారతి సిమెంట్
రాపూరు: నాణ్యమైన, మన్నికై న భవనాల నిర్మాణం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారైన భారతి సిమెంట్స్ను ఎంచుకోవాలని ఆ సంస్థ మార్కెటింగ్ ఆఫీసర్ బాబ్జాన్ సూచించారు. రాపూరులోని శివాని ఫర్టిలైజర్స్ సహకారం, భారతి సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ మేసీ్త్రలు, కార్మికులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయావుతుందని తెలిపారు. కట్టడాలు పూర్తి నాణ్యతతో దీర్ఘకాలం మనగలిగేందుకు దోహదపడుతుందని చెప్పారు. తమ సిమెంట్ తయారీకి నాణ్యమైన ముడి పదార్థాలనే ఎంచుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం హాజరైన మేసీ్త్రలు, కార్మికులకు ఉచిత బీమా సదుపాయం కల్పించి, బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో శివాని ఫర్టిలైజర్స్ అధినేత ఏటూరి పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రణామం.. పునీతం
ఆలయంలోకి ప్రవేశిస్తున్న సూర్య కిరణాలు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేదనారాయణస్వామి ఆలయంలో సూర్యపూజోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు బుధవారం ఈ మేరకు స్వామివారికి సూర్యభగవానుడు ప్రణమిల్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో గర్భాలయ రెండో మెట్టును తన కిరణాలతో స్పృశించాడు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి భక్తులు పునీతులయ్యారు. ఈ సందర్భంగా సూర్య కిరణాలు పయనించిన మార్గాన్ని అర్చకులు పుణ్యజలాలతో అభిషేకించారు. భక్తులు గోవిందనామ స్మరణతో పులకించారు. అనంతరం దేవదేవేరులను విశేషంగా అలంకరించి, తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చారు. మాడ వీధుల్లో కనులపండువగా ఊరేగించారు. స్వామి, అమ్మవార్లను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ మునిశంకరయ్య, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, అధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. – నాగలాపురం -
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
– 28 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చంద్రగిరి: స్థానిక శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మార్చి 28 నుంచి ఏప్రిల్ 6 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కార్యక్రమంలో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి మొదలైన వాటిని నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ దినేష్కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మార్చి 27న అంకురార్పణ బ్రహ్మోత్సవాలకు 27న సాయంత్రం అంకురార్పణతో శ్రీకారం చుడతారు. సేనాధిపతి ఉత్సవం, విష్వక్సేనారాధాన, పుణ్యాహవచనం, వాస్తు పూజ, అంకురార్పణ నిర్వహిస్తారు. 28న ఉదయం 8 నుంచి 8.45 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహిస్తారు. -
‘ఎర్ర’ స్మగ్లర్లకు జైలు, జరిమానా
తిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ముగ్గురు స్మగ్లర్లకు ఐదేళ్లు జైలుశిక్ష, విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం... ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం 2016లో చంద్రగిరి మండలంలోని ముంగిలిపట్టు, పనపాకం ఫారెస్ట్ బీట్, తిరుపతి రేంజ్, చిత్తూర్ డివిజన్ పరిధిలో తనిఖీలు చేసింది. ఎర్రచందనం చెట్లను నరికి, దుంగలుగా కట్ చేసి, వాహనాల్లో తరలించడానికి యత్నిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రాధమిక విచారణలో వీరు తమిళనాడు, సేలం జిల్లా, కడియం బట్టు తాలూకా పుమరతురు గ్రామానికి చెందిన ఎస్ తంగరాజ్, ఆర్కాట్ తాలూకా, సెనగల తుంపాడికి చెందిన టి.రాజేంద్రన్, కర్ణాటకలోని సజ్జాపురకు చెందిన బి.నవాజ్ అని తేలింది. కేసు తుది విచారణగా రాగా నిరూపితం కావడంతో తంగరాజ్, రాజేంద్రన్కు ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.3.10లక్షల జరిమానా, నవాజ్కు ఐదేళ్లు జైలు శిక్షతోపాటు రూ.6.10లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
‘పోరాటంతోనే పెండింగ్ జీతాలు సాధించాం’
తిరుపతి అన్నమయ్య సర్కిల్: పోరాట పటిమతో గత 22 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను ప్రభుత్వం విడుదల చేసిందని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఎస్ఐహెచ్ఎం) తిరుపతి ఉద్యోగులు తెలిపారు. మంగళవారం జూపార్కు రోడ్డులోని ఏపీటీడీసీ ఆవరణలోని ఎస్ఐహెచ్ఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. సమావేశంలో టీచింగ్ స్టాఫ్ కె.శివరామకృష్ణ, ఎన్ఎస్కె చౌదరి, ఎస్.భార్గవి, వై.సునీత, బోధనేతర ఉద్యోగులు అమిదున్నీసా, సి.నరేష్. పి. జ్యోత్స్నాదేవి, త్యాగరాజ, రమాదేవి, వాణి, మాధవరావు, శ్రీనివాస్రెడ్డి, ప్రమీల, మున్నా తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం..రథోత్సవం
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు మంగళవారం ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు రథోత్సవం కళాబృందాల భక్తి సంకీర్తనాలాపన, భజనలు, భక్తజన సందడి నడుమ కోలాహలంగా సాగింది. శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారు రథాన్ని అధిరోహించి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రథాన్ని లాగుతూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అలాగే అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తర్వాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరుమంజనం. ఆస్థానం, సాయంత్రం 6నుంచి 7 గంటల వరకు ఉయ్యాలసేవ, ఆ తర్వాత రాత్రి అశ్వవాహన సేవ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, ఇంజినీరింగ్ అఽధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. నేడు చక్రస్నానం శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తారు. -
క్షయపై అవగాహన ర్యాలీ
తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ, అవగాహన ర్యాలీ మంగళవారం నిర్వహించారు. రుయా వద్ద ర్యాలీని డీఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. క్షయ అనుమానిత లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నివారణ సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్బారావు, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ జే.రాధ, డాక్టర్ రవిరాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వన భక్షకుడు..!
దోపిడీ దందా చేయడంలో అధికార పార్టీ నేతలకు తానేమీ తీసిపోనని ఓ అటవీ అధికారి పేట్రేగిపోతున్నారు. అవసరాల నిమిత్తం అడవి నుంచి ఎండు కట్టెలు తెచ్చుకున్నా జరిమానా విధించే అటవీ అధికారులే వన భక్షులైతే..!? చంద్రగిరిలో ఓ అటవీ అధికారి ఏకంగా ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా మట్టిని తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రగిరి: మండలంలో పనపాకం రేంజ్ పరిధిలోని తూర్పుపల్లె అటవీ ప్రాంతంలో గతంలో ప్రభుత్వం ప్లాంటేషన్లో భాగంగా పెద్ద ఎత్తున అల్లనేరేడు చెట్లను పెంచింది. అటవీ సిబ్బంది కృషి ఫలితంగా అల్లనేరేడు చెట్లు ఏపుగా పెరిగి కాయలు కాసే స్థితికి వచ్చాయి. అయితే పనపాకం రేంజ్ కార్యాలయంలోని ఓ అధికారి ధన దాహానికి ప్లాంటేషన్లో ఎర్రమట్టి తరిగిపోతోంది. మూడు రోజుల పాటు రాత్రుల్లో తూర్పుపల్లెకు చెందిన స్థానికుడు, కింద స్థాయి అధికారితో చేతులు కలిపి జేసీబీల సాయంతో మట్టి లోడి ట్రాక్టర్లలో తరలించేశాడు. పక్క మండలంలో అనధికార విక్రయాలు ప్లాంటేషన్ నుంచి తవ్వేసిన ఎర్రమట్టిని పాకాల మండలంలో విక్రయించారనేది స్థానికుల ఆరోపణ. పాకాల మండలంలో ఇళ్ల నిర్మాణాలతో పాటు గాదంకి సమీపంలోని ఓ నర్సరీకు సైతం ఈ మట్టిని తరలించినట్లు సమాచారం. మూడు రోజుల పాటు సాగిన ఈ దందాలో సుమారు 70 లోడ్లకు పైగా మట్టిని విక్రయించారని, ఒక్కో ట్రాక్టరు మట్టిని సుమారు రూ.4వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం..! ప్లాంటేషన్ నుంచి మట్టిని తరలించడం ముమ్మాటికి నేరమే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్లాంటేషన్ నుంచి మట్టిని తరలించినట్లు ఫిర్యాదు వచ్చింది. క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తాం. ప్లాంటేషన్కు నష్టం వాటిల్లినట్లు నిర్ధారణైతే చర్యలు తీసుకుంటాం. – సాయిబాబా, ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ నర్సరీకు తరలించి.. నకిలీ బిల్లులు సృష్టించి..!పనపాకంలోని నర్సరీతో పాటు గాదంకిలోని నర్సరీకి మట్టిని తరలించడంతో పాటు అక్కడి అధికారులతో ఆయన కుమ్మకై ్క దొంగ బిల్లులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల కళ్లుగప్పి మట్టి కోసం సుమారు రూ.2లక్షలకు పైగా బిల్లులు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఆ అధికారిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికారి అవినీతి బాగోతం బయటపడటంతో చర్చనీయాంశమైంది. అటు అటవీ శాఖలోనూ కథలు..కథలుగా చెప్పుకుంటున్నారు. -
మట్టికాసురులు..!
సాక్షి టాస్క్ఫోర్స్: ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో గ్రావెల్ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. రోజూ వందలాది టిప్పర్ల లోడ్లతో తమిళనాడుకు దర్జాగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.తమిళనాడులో ఇక్కడి గ్రావెల్ మట్టికి మంచి డిమాండ్ ఉంది. దీంతో ఒక్కో టిప్పర్ గ్రావెల్ రూ.30 వేల నుంచి రూ.50 వేలు వరకు ఉండడంతో ఇదే అవకాశంగా అధికార పార్టీకి చెందిన బడా నేతలు రూ. కోట్లు దండుకుంటున్నారు. పిచ్చాటూరు మండలంలోని మాలగుంట, కారూరు, వెంకటరెడ్డి కండ్రిగ, బంగాళ గ్రామాల్లో గ్రావెల్ క్వారీ నుంచి ఎర్రమట్టి రోజూ వందలాది లోడ్లు తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ప్రభుత్వ భూముల నుంచి ఈ దోపిడీ చేస్తున్నారు. దీనిపై స్థానికులు పలుచోట్ల అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తమకు అనుమతులు ఉన్నాయని బుకాయిస్తూ వారిపైనే దౌర్జన్యం చేస్తున్నారు. అడ్డొస్తే తొక్కించి మరీ వెళ్తామని వార్నింగ్ ఇస్తూండడంతో వెనుకంజ వేస్తున్నారు. పబ్లిగ్గా ఇంత జరుగుతున్నప్పటికీ మైనింగ్ శాఖ అధికారులు మొదలు పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పదుల సంఖ్యలో స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా..వారికి అనుమతులున్నాయంటూ సాక్షాత్తు అధికారులే చెబుతుండడంతో గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. ఉన్నతాధికారులైనా స్పందించి దీనికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. క్వారీలో టిప్పర్లకు మట్టి నింపుతున్న హిటాచీలు -
పారదర్శకంగా ‘కుల ధ్రువీకరణ’
తిరుపతి అర్బన్ : జిల్లా పారదర్శకంగా కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్యాస్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీ పూర్తి చేసిన తర్వాతే సర్టిఫికెట్ మంజూరు చేయాలని స్పష్టం చేశారు. అసంపూర్ణ పత్రాలు, తప్పుడు సమాచారం ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మ్యుటేషన్, రీసర్వేలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. 22ఏ అంశాల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి త్వరితగతిన భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. శ్రీసిటీ సమీప ప్రాంతాల్లో పెండింగ్ ప్రాజెక్టులకు భూసేకరణ, కోర్టు కేసుల పరిష్కారం అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్ మాండ్, అనురాధ, భరత్ నాయక్, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్భరత్రెడ్డి, ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కూమర్, శ్రీసిటీ మేనేజర్ భగవాన్ పాల్గొన్నారు. తడలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు సూళ్లూరుపేట: మండల కేంద్రమైన తడలో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. తడ కండ్రిగ పరిధిలోని శ్రీకాళహస్తి రోడ్డులో ఎస్ఎస్ఆర్ వైన్ షాపు, కేఆర్ జీవా ఫ్రైడ్ రైస్ షాప్లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై 6–ఏ కేసులు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఓ రామాంజనేయులురెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పీ.వెంకటాద్రి, రెవెన్యూ అధికారులు వనజ, ఆర్ఐ వీ.భారతి పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణేదీ..?
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వ పాలనలో బీసీలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యచ్చం వాసుయాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలను చులకనగా చూస్తున్నారని, దాడులకు తెగబడుతున్నారని.. తిరుపతి ప్రకాశం రోడ్డులో సచివాలయ అడ్మిన్ సెక్రటరీ నాగార్జున యాదవ్పై దాడి ఘటనను ఆయన ఉదహరించారు. పన్ను చెల్లించమని కోరిన ఆయనపై ఒక ప్రింటర్స్ అధినేత తన స్నేహితులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేయడం శోచనీయమని ఖండించారు. రుయా ఆసుపత్రిలో నాగార్జున యాదవ్ను పరామర్శించి ఆయన మాట్లాడారు. కూటమి నాయకులు ఇలా పేట్రేగిపోతూ దాడులు చేయడం వెనుక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అండదండలు ఉండటమేనని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యాదవ్పై దాడి కేసును నీరుగార్చేందుకు స్థానిక కార్పొరేటర్తో పాటు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే సచివాలయ ఉద్యోగులతో పాటు వైఎస్సార్సీపీ బీసీ నాయకులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నాగార్జున యాదవ్ను పరామర్శించిన వారిలో పార్టీ బీసీ నాయకులు కట్టా గోపీయాదవ్, శరత్యాదవ్, మురళీయాదవ్, కృష్ణ యాదవ్, శేషుయాదవ్, శశియాదవ్ ఉన్నారు. -
సూర్యతేజం
నాగలాపురం: నాగలాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేదనారాయణ స్వామివారి సూర్య పూజ తెప్పోత్సవాలకు మంగళవారం వైభవంగా శ్రీకారం చుట్టారు. ఐదరోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు దేవదేవేరులకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. ఈ క్రమంలోనే సాయంత్రం భానుడి కిరణాలు వేదనారాయణుని గర్భాలయాన్ని స్పృశించడంతో భక్తుల పులకించారు. గోవింద నామస్మరణలతో పరవశించారు. అనంతరం ఉభయదేవేరీ సమేతంగా స్వామివారిని విశేషంగా అలంకరించి తెప్పలపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు.. వేదమంత్రోచ్ఛారణల నడుమ నేత్రపర్వంగా తెప్పోత్సవం నిర్వహించారు. -
● అపురూపం
గోవిందనామస్మరణతో మార్మోగే తిరునగరిలో మంగళవారం ఓ అపురూపం దర్శనమిచ్చింది. పవిత్ర తిరునామం స్పురించేలా ఓ సీతాకోకచిలుక భక్తులను ఆకట్టుకుంది. శ్రీవారి నుదుటిన వెలుగొందే మూడు నామాల తరహాలో కనిపించిన ఈ అద్భుతానికి ప్రజానీకం ప్రణమిల్లింది. తిరుపతి నగరంలో మంగళవారం వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పరమేశ్వరుని మహిమాన్విత రూపం దర్శనమిచ్చింది. దేదీపంగా ప్రకాశిస్తూ మహాలింగరూపం సాక్షాత్కరించింది. కట్టెదుట కనిపించిన దివ్యతేజస్సును వీక్షించి భక్తజనం పులకించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి -
‘గాలేరు– నగరి’ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా భరత్
తిరుపతి అర్బన్: గాలేరు–నగరి సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా భరత్ నాయక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి పూల మొక్కను అందజేశారు.4 నుంచి ‘మై సైన్స్ గ్యారేజ్’ తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఏప్రిల్ 4 నుంచి ఏడాది పొడవునా మై సైన్స్ గ్యారేజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ మేరకు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 3, 4, 5వ తరగతి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పిల్లలే స్వయంగా ప్రయోగాలు చేసేలా, విభిన్న వస్తువులు రూపొందించేలా సైన్స్లోని మూల సూత్రాలను అనుభవపూర్వకంగా నేర్చుకునేలా ఈ గ్యారేజ్ను నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి నెలా మొదటి ఆదివారం మై సైన్స్ గ్యారేజ్ నిర్వహించనున్నామని, దీనికి సంబంధించిన మెటీరియల్ను సైన్స్ సెంటర్ అందిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థులకు రూ.2వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు హెచ్టీటీపీఎస్://టీఐఎన్వైయూఆర్ఎల్.కామ్/ఆర్ఎస్సీటీమైసైన్స్గ్యారేజ్’ లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరాఉఉ. పూర్తి వివరాలకు 79896 94681, 0877–2286202 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నాణేలు.. చరిత్రకు ప్రతిబింబాలు తిరుపతి సిటీ : నాణేలు కేవలం లావాదేవీలకే కాదని, దేశ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. నాణేల అధ్యయన సంస్థ వారు మంగళవారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో చేపట్టిన నాణేల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం అదనపు ఈఓ మాట్లాడుతూ నాణేల అధ్యయనంపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రిన్సిపల్ వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ చరిత్ర, పురావస్తు విద్యలపై విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించేకు అధ్యయన సంస్థ కృషి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు పండితులు, అధ్యాపకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. డాక్టర్ రాజారెడ్డి, శకుంతల, కిషన్, టీటీడీ డీఈఓ వెంకట సునీల్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, జయరామయ్య, మధుసూదన్ రావు, అధ్యాపకులు భీమన్న, మల్లికార్జునరావు, ప్రసాద్రావు, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
సత్వరమే వినతుల పరిష్కారం
తిరుపతి అర్బన్ : గ్రీవెన్స్లో ప్రజలు వివిధ సమస్యలపై అందించే వినతులను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ గ్రీవెన్స్లో వచ్చే అర్జీలను పెండింగ్లో ఉంచకూడదని స్పష్టం చేశారు. అలాగే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను వేగవంతం చేయాలని కోరారు. అక్షర ఆంధ్ర ద్వారా అక్షరాస్యతను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి, డీఎస్ఓ శేషాచలంరాజు, డీసీఓ నాగవర్ధిని, జీఎస్డబ్ల్యూఎస్ కో–ఆర్డినేటర్ జగదీష్ పాల్గొన్నారు. -
బాధ్యతగా మత్స్యకారుల భద్రత
తిరుపతి మంగళం : పులికాట్ సరస్సు పరిధిలోని సుమారు 20వేల మంది మత్స్యకారుల భద్రతను కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు పార్లమెంట్లో మత్స్యకారుల సమస్యలను ప్రస్తావించారు. ఎంపీ మాట్లాడుతూ రిజర్వ్ చేసిన మత్స్యకార ప్రాంతాల్లో పెద్ద యాంత్రిక పడవలతో పొరుగు రాష్ట్రాల జాలర్లు అక్రమంగా చొరబడి వలలు, పడవలకు నష్టం కలిగించడమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధికి, శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పులికాట్ ముఖద్వారం వద్ద పూడికతీత, మత్స్యకారుల అక్రమ చొరబాట్ల నిరోధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాంతీయ మత్స్యకార నిర్వహణ మండళ్లు ఏర్పాటు చేస్తే సమస్యల తీరిపోదని స్పష్టం చేశారు. తీరంలో కట్టుదిట్టంగా గస్తీ పెట్టాలని, అక్రమంగా చొరబడిన మర పడవలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని శాశ్వత అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 81,483 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,777 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 81,483 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 5.12 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
అర్హులు ఎవరంటే?
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే ఐదు శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్న్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉన్న వారికి ఐదు శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు. చిత్తూరు కలెక్టరేట్ : అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతి ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31లోగా (www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేయనుంది. మే 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30వ తేదీ వరకు ముగింపు సందర్భంగా కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఏడు కేంద్రాల్లో నిర్వహణ ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ)లలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భావి శాస్త్రవేత్తలకు వేదికగా యువికా–2026 సద్వినియోగం చేసుకోవాలి 9వ తరగతి విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యువ విజ్ఞాని కార్యక్రమానికి జిల్లాలోని 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ణానం పై ఆసక్తిని పెంపొందించేందుకు, వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం గొప్ప వేదిక. ఈ శిక్షణలో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 20 శాతం ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. – సుమిత్కుమార్గాంధీ, కలెక్టర్, చిత్తూరు -
వాటర్ ప్లాంట్లకు అనధికారికంగా విద్యుత్ వినియోగం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని వా టర్ ప్లాంట్లకు అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్నారని అందిన ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. ఏపీఎస్పీడీసీఎల్ కా ర్పొరేట్ ఆఫీసులో సోమవారం జరిగిన డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంలో కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ఒక వినియోగదారుడు మాట్లాడుతూ తమ ప్రాంతంలో నిర్వహిస్తున్న రెండు వాటర్ ప్లాంట్లు రూ.లక్షల్లో వి ద్యుత్ బిల్లులు బకాయిలు పడ్డాయని, బిల్లు చె ల్లించని కారణంగా సిబ్బంది ఆ సర్వీసులకు వి ద్యుత్ సరఫరా నిలిపివేస్తే అనధికారికంగా విద్యుత్ను వినియోగించుకుంటూ సంస్థకు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు.ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎండీ శివశంకర్ తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యుత్ చౌర్యం జరిగేది నిజమని తేలితే కేసు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సిబ్బందిపై విచారణ జరిపి వారి పాత్ర ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంస్థకు నష్టం కలిగించే ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. 50 మంది వినియోగదారులు తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకు రావడంతో నో డల్ ఆఫీసర్లు వాటిని పరిష్కరించాలన్నారు. సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్ కె. గురవయ్య, కె. రామమోహన్ రావు పాల్గొన్నారు. -
శ్రీ బాలాజీ ఆరోగ్యవర ప్రసాదిని స్కీమ్కు రూ.11 లక్షల విరాళం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి అహ్మదాబాద్కు చెందిన అరిహంత్ డెస్ట్రాప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు రూ.11 లక్షల విరాళం ఇచ్చారు. ప్రతినిధుల కోరిక మేరకు సోమవారం తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ రవిచంద్రకు విరాళ డీడీ అందజేశారు. ఈ మొత్తాన్ని పేద రోగులకు వైద్య సేవలకు ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ దాతలకు ధన్యవాదాలు తెలియజేసి, వారి సేవాభావాన్ని అభినందించారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
– కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు 294 అర్జీలు తిరుపతి అర్బన్: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను పరిష్కారించడంలో నిర్లక్ష్య చూపవద్దని, అలా కాదని నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ గోవిందరావు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జేసీతోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, రోజ్మాండ్, అనురాధ, గీతాంజలి తదితరులు అర్జీదారుల నుంచి 294 అర్జీలను స్వీకరించారు. అందులో ప్రధానంగా 183 అర్జీలు రెవెన్యూ సమస్యలపై అందుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఏ విభాగానికి చెందిన అర్జీలను ఆ విభాగానికి చెందిన అధికారులు వేగవంతంగా పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ఇంటర్ విద్యార్థి ఆచూకీ తెలపండి.. తిరుపతి రూరల్ మల్లంగుంటలోని ఓ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థి జస్వంత్రెడ్డి ఈ నెల 11న కళాశాల హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారని, ఇప్పటి వరకు కనిపించడం లేదని వైఎస్సార్ ఎస్యూ, ఎన్ఎల్ఎస్ఐ, ఏన్ఎస్యూఐ, ఓబీసీ, బీసీ యువజన, జీజేఎస్ విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. జస్వంత్రెడ్డి తల్లిదండ్రులతో కలసి విద్యార్థి సంఘం నేతలు జాయింట్ కలెక్టర్కు సోమవారం కలెక్టరేట్లో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు ఓబుల్రెడ్డి, నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్రాజు, ఎన్ఎస్యూవై జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ, జీజేఎస్ అధ్యక్షుడు మహేంద్ర నాయక్, ఓబీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది, బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్యాదవ్, విద్యార్థి సంఘం నేతలు చెంగల్రెడ్డి, యశ్వంత్రెడ్డి, రఫీ, వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వంట నూనెలు సలసల
తిరుపతి అర్బన్: చంద్రబాబు సర్కార్లో నిత్యావసర సరుకులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పేదోడి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. తాజాగా ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఓ వైపు గ్యాస్ సిలిండర్ల డిమాండ్ చోటుచేసుకోవడంతోపాటు మరో వైపు వంట నూనె ధరలు పెంచేశారు. లీటర్ పై రూ.10 నుంచి 15 వరకు పెంచేశారు. వేరుశనగ నూనె అయితే ఏకంగా రూ.20 నుంచి రూ.25 పెంచేశారు. యుద్ధం నేపథ్యంలో విదేశాల నుంచి దిగుబడి తగ్గిందని, ఉత్పత్తులు తగ్గాయని, సుంకాలు పెరిగాయంటూ పలు వంకలు చెబుతూ వంటనూనె ధరలు ఇష్టారాజ్యంగా పెంచేశారు. సన్ప్లవర్ ఆయిల్ లీటర్ రూ..166 నుంచి 178కి, వేరుశనగ నూనె లీటర్ రూ. 215 నుంచి రూ. 240కి, అలాగే పామాయిల్ లీటర్ రూ.131 నుంచి 142ి పెంచేశారు. ఎందుకు రేట్లు పెంచారంటే ఇరాన్– ఇజ్రాయిల్ యుద్ధం అంటూ వ్యాపారులు సమాధానం ఇస్తున్నారు. మహిళపై హత్యాయత్నం రేణిగుంట: మండలంలోని మామండూరులో ఓ వ్యక్తి, ఓ మహిళను తనతో మునుపటిలా వివాహేతర సంబంధం కొనసాగించాలని బలవంతం చేసి, అంగీకరించకపోవడంతో ఆమైపె హత్యాయత్నానికి పాల్పడినట్లు రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు... మండలానికి చెందిన 36 ఏళ్ల మహిళ, శనివారం రాత్రి అమరరాజా ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళుతుండగా గంగమ్మ గుడి సమీపంలో ఓ వ్యక్తి ఆమెను అడ్డగించి, మునుపటిలా తనతో చనువుగా ఉండాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో కోపోద్రిక్తుడై తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమైపె దాడి చేసి, గాయపరిచాడు. గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే కరకంబాడి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం నిందితుడు తనకు తానే కత్తితో గాయాలు చేసుకుని తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీస్ స్టేషన్న్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. పంటలపై అడవి పందుల దాడి బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కుక్కంబాకంలో రైతులు సాగు చేసిన పంటలను అడవి పందులు ధ్వంసం చేస్తుండడంతో రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కంబాకం గ్రామం అడవీ ప్రాంతానికి అనుకుని 165 ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సాగు చేసిన పంటలను అడవిపందులు రాత్రి వేళలో ధ్వంసం చేస్తున్నాయి. పందుల బెడదతో కొంతమంది రైతులు పంటలను వేయకుండా మానుకున్నారు. అర్ధరాత్రి కారు దగ్ధం చంద్రగిరి: రోడ్డు ప్రమాదానికి గురైన కారు దగ్ధమైన ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. పూతలపట్టు–నాయుడుపేట రోడ్డు కోట సమీపంలో ఈ నెల 17వ తేదీన కారు బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పోలీసులు క్రేన్ సాయంతో పక్కకు తీసి పెట్టారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి కారులో నుంచి మంటలు వ్యాపించి, దగ్ధమైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుప్పిని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం సూళ్లూరుపేట రూరల్: స్థానిక జాతీయ రహదారిపై కోటపోలూరు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం గుర్తుతెలియన వాహనం చుక్కల దుప్పిని ఢీకొంది. ఈ ప్రమాదంలో చుక్కల దుప్పికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారి దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని గాయపడిన చుక్కల దుప్పికి చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. నలుగురు జూదరుల అరెస్టు శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని ఉడమలపాడు శివార్లలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి, ఏడుగురు జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.8,500 నగదు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు శ్రీకాళహస్తి రూరల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ సి. వెంకటేష్ పాల్గొన్నారు. -
గజ వాహనంపై జగదభిరాముడు
తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం రాత్రి గజవాహనం జగదభిరాముడు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామి వారి హనుమంత వాహన సేవ వేడుకగా సాగింది. అనంతరం ఉదయం 10.30 గంటలకు ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలోని సాంస్కృతిక వేదికపై ఆదివారం ప్రదర్శించిన పలు సంగీత, నృత్య కళా బృంద ప్రదర్శనలు భక్తులను అలరించాయి. -
తెలుగుగంగ కాలువలో పడి యువకుడి మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: ఉబ్బలమడుగు సమీపంలోని తెలుగుగంగ కాలువలో కాలు జారిపడి తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు తిరువట్టూరు టౌన్కు చెందిన జయశంకర్ కుమారుడు జీవా (25) ఓప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. 15 మంది స్నేహితులతో కలసి ఆదివారం ఉబ్బలమడుగు జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. ఉబ్బలమడుగు జలపాతం వద్ద జీవా స్నేహితులతో పాటు మద్యం సేవించి సమీపంలో ఉన్న తెలుగుగంగ కాలువ వద్దకు వచ్చారు. ఇందులో ముగ్గురు స్నేహితులు తెలుగుగంగ కాలువలో ఈత కొట్టారు. కాలువలో మద్యం మత్తులో ఈత కొట్టుతున్న ముగ్గురు గట్టుపైకి రావటానికి ఇబ్బంది పడుతుండగా జీవా వారిని పైకి లాగడానికి ప్రయత్నిస్తుండగా కాలుజారి కాలువలో పడిపోయాడు. దీంతో జీవా కాలువలోని నీటిలో మునిగిపోయి, గల్లంతు అయాడు. వెంటనే స్నేహితులు పోలీసు, ఫైర్, రెవెన్యూ, ఫారెస్టు అధికారులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హరిప్రసాద్, సిబ్బందితో కలసి జీవా మృతదేహాం కోసం గాలించగా, మృతదేహాం లభ్యమైంది. జీవా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
విద్యార్థులే పని మనుషులు
తిరుపతి అర్బన్: వసతి గృహాల్లో అవసరం అయిన మేరకు వంట నిర్వాహకులతోపాటు ఇతర సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులే పని మనుషుల అవతారం ఎత్తుతున్నారు. ఎవరైనా గుర్తించి ప్రశ్నిస్తే వెంటనే విద్యార్థులతో పనులు చేయించడం మానేస్తున్నారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ అదే తంతు జరుగుతుంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని హాస్టళ్లలో అవసరం అయిన మేరకు సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని పలువురు నిపుణులు అంటున్నారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని ఇంటిగ్రేటెడ్ ఎస్సీ బాలుర హాస్టల్లో 9 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉంది. అయితే కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. దీంతో హాస్టల్ విద్యార్థులతో పలు పనులు చేయించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్లో ఒకప్పుడు 340 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం 270 మందికి సంఖ్య పడిపోయింది. విద్యార్థులకు పనులు చెప్పకండి విద్యార్థులకు పనులు చెప్పకూడదని, అవసరం అయిన మేరకు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హాస్టల్ విద్యార్థులతో మాట్లాడారు. అలాగే వార్డెన్లు అందుబాటులో ఉంటూ విద్యార్థులకు సరైన సమయంలో భోజనం అందించాలని సూచించారు. ఆయన వెంట వివిధ సంఘాలకు చెందిన నేతలు నరేష్, మునిశేఖర్ తదితరులు ఉన్నారు. -
క్రికెట్ కప్ పోలీస్ జట్టు కై వసం
రేణిగుంట: సీఆర్ఎస్ క్రీడా మైదానంలో ఆదివారం రేణిగుంట డివిజన్ పోలీస్, రేణిగుంట జర్నలిస్టుల జట్ల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోలీస్ జట్టుకు అర్బన్ సీఐ జయచంద్ర కెప్టెన్గా వ్యవహరించగా, జర్నలిస్ట్ జట్టుకు మురళి నాయకత్వం వహించారు. పోలీస్, ప్రెస్ క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథులుగా రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ పాల్గొని ఇరుజట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకుని మ్యాచ్ ప్రారంభించారు. డీఎస్పీ శ్రీనివాసరావు టాస్ వేయడంతో రేణిగుంట జర్నలిస్టు టీం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. జర్నలిస్ట్ టీం నిర్ణీత 15 ఓవర్లకు 110 పరుగులు చేసింది. 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పోలీస్ టీం 14.1 ఓవర్లో 111 పరుగులు చేసి విజయభేరి మోగించారు. సురేష్ ఆల్ రౌండర్గా నిలిచి పోలీస్ టీమ్ గెలవడంలో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కై వసం చేసుకున్నారు. బెస్ట్ బౌలర్ జర్నలిస్టు టీమ్ స్పీడ్ స్టార్ నిషార్ అహ్మద్, బెస్ట్ బ్యాట్స్మన్గా బిన్నీ కై వసం చేసుకున్నారు. పోటీల్లో గెలుపొందిన పోలీస్ టీం కెప్టెన్ జయ చంద్ర విన్నింగ్ ట్రోఫీని, జర్నలిస్ట్ టీం కెప్టెన్ మురళి రన్నర్స్ ట్రోఫీని డీఎస్పీ శ్రీనివాసరావు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. -
ఆ ఐదేళ్లు..అభివృద్ధికి ప్రతీక!
అట్టహాసంగా సర్పంచ్ల అభినందన సభ చంద్రగిరి: ‘నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాం.. గత ఐదేళ్ల జగనన్న పాలనలో రెండేళ్ల పాటు కరోనాతో కాలం గడిచిపోయినా కేవలం మూడేళ్లలో భవిష్యత్తు తరాలు చెప్పుకునేలా పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. రూ.978 కోట్లు ఖర్చు చేసి 5,096 అభివృద్ధి పనులను పూర్తి చేశాం. గెలుపోటములు సహజం.. చేసిన అభివృద్ధి మాత్రం కళ్ల ముందే కనిపిస్తుంది.. ఇప్పటి సర్పంచ్ల పేర్లు తరతరాలు గుర్తుండిపోతాయి.. సర్పంచ్ల సహకారం మరువలేనిది.. సర్పంచ్గా మంచి పేరు తెచ్చుకున్న వారంతా పదవి ముగియగానే జగనన్నకు సైనికులుగా మారి క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలి.. ఐదేళ్ల ప్రజాసేవకు ఆత్మీయ సత్కారం చేస్తున్నాం.’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ ముక్కోటి సమీపంలోని నారాయణీ గార్డెన్స్ కల్యాణ మండపంలో సర్పంచ్ల అభినందన సభను నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నుంచి సుమారు 90 మంది సర్పంచ్లు ఆ సభకు హాజరై చెవిరెడ్డి కుటుంబం నుంచి ఆత్మీయ సత్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ తన కుటుంబంలో ఒక భాగమైన సర్పంచ్లను అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి పంచాయతీలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు వరకు ఖర్చు చేశామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ చరిత్రలో ఇంతలా అభివృద్ధి పరుగులు పెట్టించిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల్లో ఏదో జరిగింది? గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఒక మనిషి చేతికి సిరా చుక్క పెట్టుకున్నప్పటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీలకు ఓటు వేసి బయటకు రావాలంటే 6 నుంచి 7 నిమిషాల సమయం పడుతుందని, అయితే పోలింగ్ జరిగిన రోజు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ జరిగినా రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటల వరకు ఒక నిమిషానికి మూడు ఓట్లు పడిననట్టుగా ఎన్నికల కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం నిర్ధారణ అవుతోందన్న చర్చ టీవీ డిబేట్లలో జరుగుతోందని చెవిరెడ్డి అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, మాయా జాలంతో గెలిచిన వారు ప్రజల ముందు ఎప్పటికై నా దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు. అభివృద్ధికి ప్రతీకలుగా నిలిచారు చంద్రగిరి నియోజకవర్గంలోని సర్పంచ్లు అభివృద్ధికి ప్రతీకలుగా నిలిచారని వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి స్పష్టం చేశారు. సిమెంటు రోడ్లు, రచ్చబండ లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రా లు, కల్యాణ వేదికలు, కర్మక్రియల భవనాలు, యోగ, ధ్యాన మందిరాలు, మహిళా భవనాలు ఇలా చెప్పలేనంతగా అభివృద్ధి చేసి చూపడం చంద్రగిరి చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. చివర గా రాష్ట్ర వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ మాట్లాడారు. గత ప్రభు త్వంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక పోయామని, వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇప్పుడున్న సర్పంచ్లు తిరిగి పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఆరు మండలాల పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచ్తో పాటు వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. నేటి సర్పంచ్లే.. రేపటి జగనన్న సైనికులు ఇప్పుడు సర్పంచ్లుగా ఉన్న వారంతా ఏప్రిల్ 2వ తేదీ తరువాత పదవీ కాలం ముగిసిన తర్వాత జగనన్నకు సైనికులుగా మారాలని పిలుపునిచ్చారు. జగనన్నను అధికారంలోకి తీసుకు వచ్చేంత వరకు పోరాడాలని సూచించారు. -
సూర్య పూజకు ముందే ఆలయంలోకి కిరణాలు
నాగలాపురం: సూర్యపూజకు రెండు రోజుల ముందే ఆలయంలోకి సూర్య కిరణాలు ప్రవేశించాయి. మండలంలోని టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 24 నుంచి 28 వరకు సూర్యపూజ, తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో మొదట మూడు రోజులు సాయంత్రం 5.30 నుంచి 6 గంటల సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో ఆలయం ప్రధాన గోపురం మీదుగా సూర్య కిరణాలు 630 అడుగులు దూరంలో ఉన్న ఆలయ గర్భగుడిలోని స్వామివారి పాదాలను తాకడం విశేషం. మొదటి రోజు పాదాలు, రెండవ రోజు నాభి, మూడో రోజు శిరస్సుపై కిరణాలు తాకుతాయి. ఈ మేరకు ఆదివారం సూర్యపూజకు రెండు రోజుల ముందే ముందుస్తుగా సూర్యుడు అస్తమించే సమయంలో ఆలయ ప్రధాన గోపురంలోని రెండో మెట్టును సూర్యకిరణాలు తాకాయి.నేడు ‘డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ’ తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ సంస్థ సీఎండీ కార్యాల యం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు 89777 16661కు కాల్ చేసి, తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. -
గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
వెంకటగిరి రూరల్: పట్టణంలోని ఏపీ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఆర్జేసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ పి.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతోపాటు నాగార్జున సాగర్లోని డిగ్రీ కళాశాలలో బీఏ (40), బీకామ్(60) బీఎస్సీ(120), వెంకటగిరి జూనియ ర్ కళాశాలలో ఎంపీసీ (60) బైపీసీ(40), ఎంఈసీ (30) ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే తిరుపతి జిల్లాలోని చిలమానుచేను, ముక్కవారిపల్లి బాలుర పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశానికి (80) సీట్లు, వెంకటగిరి బాలికల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి (80) సీట్లు , 6,7,8 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా అధికార వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 24వ తేదీన ప్రవేశ పరీక్ష తిరుపతిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 87126 25075, 87126 25050, 87126 25056, 87126 25049 నంబర్లను సంప్రదించాలని సూచించారు. చెక్పోస్టు ఉద్యోగిపై దాడిసూళ్లూరుపేట: మన్నారుపోలూరులో వద్ద ఉన్న మినీ చెక్పోస్టులో విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ అనే ఉద్యోగిపై అధికారపార్టీకి చెందిన చోటా నాయకులు ఆదివారం దాడి చేశారు. అధికారపార్టీకి చెందిన ఒక చోటా నేత ట్రాక్టర్లో మెటల్ తీసుకుండగా చెక్పోస్టులో విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ టాక్స్ కట్టమన్నారు. అధికార పార్టీలో ఉన్న తమనే టాక్స్ కట్టమంటావా! ఎంత ధైర్యం నీకు.. అని అనడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో వెంకటరమణ ట్రాక్టర్ తాళాలు తీసుకోవడంతో అతనిపై అధికారపార్టీకి చెందిన కొంతమంది చోటా నాయకులు దాడి చేశారు. -
బీఆర్ నాయుడు దూరంగా ఉండటం చంద్రబాబు నటనే: భూమన
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు చంద్రబాబు నటించారని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ నాయుడును అటెండర్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల పర్యటన సందర్భంగా చంద్రబాబు.. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు నటించారు. చంద్రబాబు కార్యకర్తలతో కూడా నాటకాలు ఆడుతున్నారు. బీఆర్ నాయుడుది కల్మష స్వభావం. చంద్రబాబు అన్నప్రసాదానికి వెళ్లే బీఆర్ నాయుడు నక్కి నక్కి ఉన్నారు. బీఆర్ నాయుడుకు అటెండర్ కూడా పట్టించుకోరు. నీతి మాలిన బీఆర్ నాయుడు నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు. బీఆర్ నాయుడును తీసేసి దేవాలయ ప్రతిష్ట కాపాడితే అర్థవంతంగా ఉండేది.కీలక సమావేశంలోనే బీఆర్ నాయుడు.. చంద్రబాబు పక్కన లేడు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయం అయ్యాడో?. ప్రసాదం ఇచ్చే సమయంలోనూ మాయావి బీఆర్ నాయకుడు మాయమయ్యాడు. బీఆర్ నాయుడికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాల్సిందే. వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్టు బీఆర్ నాయుడు పరిస్థితి ఉంది. నిన్న ఘటన చూసిన తర్వాత బీఆర్ నాయుడుకి ఎవరైనా మర్యాద ఇస్తారా?. అధికారం లేని పదవి, ఆదరణలేని ఉద్యోగుల మధ్య ఉండటం అవసరమా?. బీఆర్ నాయుడుని తీసేయడానికి చంద్రబాబుకు భయం. చంద్రబాబు పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఇద్దరూ స్వామి వారి ద్రోహులే. చంద్రబాబు ఓ కళంకితుడికి పదవి ఇచ్చారు. అసమర్థుడు అని తేలిన తర్వాత కూడా బీఆర్ నాయుడు పదవి అంటిపెట్టుకున్నారు. పవన కల్యాణనంద స్వాముల వారు కొండపై ప్రతీ రాయిని కడిగినా పాపం పోదు.బీఆర్ నాయుడు కుమారుడు జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఏప్రిల్ ఐదో తేదీన జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసమే బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారా?. బీఆర్ నాయుడుని ఇంకా పదవిలో కొనసాగించడం అత్యంత హేయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. -
ఇక పల్లె పాలన ‘ప్రత్యేక’ం
స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు పది రోజుల్లో ముగియనున్నది. అయితే బాబు సర్కారు స్థానిక స్థంస్థల ఎన్నికలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. బాబు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి.. దాన్ని అమలు చేయలేక నిస్సహాయంగా మిగిలింది. దీనికితోడు పలు న్యాయపరమైన సమస్యలున్నాయి. ఈ క్రమంలో పల్లె పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. తిరుపతి అర్బన్: పల్లె పగ్గాలు ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఏప్రిల్ 2తో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తోంది. సాధారణంగా గడువు లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే బీసీ రిజర్వేషన్తోపాటు పలు సాంకేతిక న్యాయపరమైన అంశాలను పరిష్కారంచాల్సి ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ జాప్యం అయ్యేలా ఉంది. దీంతో ఏప్రిల్ 2 తర్వాత పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించడానికి జిల్లాధికారులు జోరుగా కసరత్తు చేస్తున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పలువురు ఆశావహులు అలోచనలో పడ్డారు. జిల్లాలో 811 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీలకు ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వ్యవసాయ, ఉద్యానశాఖ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, ఇరిగేషన్ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఆరోగ్యశాఖ అధికారులు తదితర విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించనున్నారు. అధికారుల కొరత కారణంగా పలు మండలాల్లో రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతలు ఒకే అధికారికి అప్పగించనున్నారు. ఎన్నికల జాప్యానికి ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశం కొలిక్కిరావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది. ఈ చిక్కుముడులు వీడిన తర్వాతే ఎన్నికలు ఉంటాయని చర్చసాగుతోంది. జూన్ తర్వాత ఎన్నికలుంటాయని రాజకీయ నేతలు అంచన వేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు నిర్వహిస్తే కార్యకర్తలకు వందశాతం సంతృప్తి పరచలేమని, ఏడాదిపాటు ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎప్పుడుంటుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా సమాచారం... జిల్లా జనాభా : 25.50 లక్షలు మండలాలు: 36 రెవెన్యూ డివిజన్లు: 3మున్సిపాలిటీలు: 5కార్పొరేషన్: 1పంచాయతీలు: 811కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు: 25 నుంచి 30 వరకు -
సీఎం చంద్రబాబుకు సాదర వీడ్కోలు
రేణిగుంట: రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన అనంతరం శనివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమైన సీఎం చంద్రబాబు నాయుడికి సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈఓ ముద్దాడ రవీంద్ర, డీఐజీ షిమోజి బాయ్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, భాను ప్రకాష్, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు సాదరంగా వీడ్కోలు పలికారు. ముందుగా విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చంద్రగిరిలో చిరుత కలకలం? చంద్రగిరి: మండలంలో చిరుత పులి కనిపించడంతో కలకలం రేగింది. మండలంలోని ఎం.కొంగరవారిపల్లి, నడింపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత గాండ్రింపులు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. శనివారం ఎం.కొంగరవారిపల్లి జగనన్న కాలనీ సమీపంలో ఉపాధి కూలీలు పనులు నిమిత్తం వెళ్లారు. పని పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి సిబ్బంది పనులను ఫొటోలు తీస్తున్న క్రమంలో చిరుత పులి గాండ్రించిన శబ్ధం వారికి వినిపించింది. అలాగే పనులు చేస్తున్న సమీపంలో చిరుతపులి పాద ముద్రలను సైతం సిబ్బంది గుర్తించారు. బోలిగుండు నారవ వద్ద చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా తరచూ చిరుత గాండ్రింపులు వినిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుత పులి సంచారంపై అటవీ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. టీటీడీకి రూ.10 లక్షలు విరాళం తిరుమల: జేఎంసీ ట్రస్టు చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులును ముఖ్యమంత్రి అభినందించారు. -
ఈద్ ముబారక్
ఈద్గా మైదానంలో నమాజ్ చేస్తున్న ముస్లింలు నెల‘రోజా’లు భక్తిశ్రద్ధలతో సాగిన దీక్షలు శుక్రవారం నెలవంక తొంగి చూడడంతో జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సమత, మమతల కలయిక, దానధర్మాలకు ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగను శనివారం వైభవంగా జరుపుకున్నారు. ఈద్గాలకు ర్యాలీగా వెళ్లి సామూహికంగా నమాజ్ చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. పండుగపూట బంధుమిత్రులు విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. తమకు తోచిన ధాన ధర్మాలు చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి ఎస్వీయూనివర్శిటీ సమీపంలోనున్న ఈద్గా మైదానంలో రంజాన్ వేడులను ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకున్నారు. – తిరుపతి కల్చరల్ -
అగ్రిగోల్డ్ యజమానుల ఆస్తులు జప్తు చేయాలి
తిరుపతి కల్చరల్: కస్టమర్లను నట్టే ముంచిన అగ్రిగోల్డ్ యజమానుల బినామీ ఆస్తులు జప్తు చేసి, బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గంధమనేని శివయ్యభవన్లో శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్పేర్ అసోసియేషన్ ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం విజయవాడ కేంద్రంగా త్వరలో ప్రత్యేకకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుటుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో మేరకు ప్రభుత్వం సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు. అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షుడు టి.జనార్దన్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల విలువల నేడు రూ.30 వేల కోట్లకుపైగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, అసోసియేషన జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్, ఉమాశంకర్, జయచంద్ర, జయరామయ్య, ఉమాదేవి, ఉమారాణి, సుశీల, రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు. -
జగనన్న కాలనీలో యథేచ్ఛగా మట్టి తరలింపు
ఏర్పేడు: మండలంలోని చిందేపల్లిలో తెలుగు తమ్ముళ్లు కాసులవేటలో ఉన్నారు. బరితెగించి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా రవాణా చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వారి అక్రమాలను అరికట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏర్పేడు మండలం చిందేపల్లిలో గత ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరవాసులకు ఇళ్ల స్థలాలను కేటాయించి, ఇళ్లను నిర్మించారు. అయితే శనివారం చిందేపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఏకంగా జగనన్న కాలనీలో జేసీబీ పెట్టి ట్రాక్టర్లతో గుంతలు తవ్వి ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలించారు. ఈ తంతు పట్టపగలే జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూసిన అధికారి లేరు. జగనన్న కాలనీలో వీధులకు మట్టి తోలుకోమని హౌసింగ్ అధికారులు తమకు అనుమతులిచ్చారని చెప్పుకుంటూ యథేచ్ఛగా మట్టిని ట్రాక్టర్ల ద్వారా తవ్వి తరలిస్తున్నారు. 10 అడుగుల లోతుకు పైగా మట్టిని తవ్వేయడంతో సమీపంలో నిర్మించిన ఇళ్లు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. అయితే మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే మండలంలోని నచ్చనేరి అటవీ ప్రాంతం నుంచి కొన్ని రోజులుగా రేయింబవళ్లు మట్టిని ప్రైవేటు వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నా అధికారగణం మిన్నకుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పల్లెల్లో భయం.. భయం
కలువాయి(సైదాపురం): గ్రామాల్లో చెత్త సేకరించుకుంటున్న నెపంతో కొందరు మహిళలు ముఠాగా ఏర్పడి చిన్న పిల్లలని టార్గెట్ చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల కిందట కలువాయి మండలం పెన్న బద్వేలులో చెత్త ఏరుకుంటూ సంచరిస్తున్న నగురులు మహిళలు పెన్న బద్వేల్ పాత ఊరు ఎస్సీ కాలనీలో తుమ్మల రమేష్ కుమార్తెకు చాక్లెట్లు ఇస్తూ చూట్టూముట్టడంతో ఆ బాలిక కేకలు వేయడంతో కాలనీ వాసులు అక్కడకు చేరుకుని గుర్తు తెలియని మహిళలను అడ్డగించారు. అయితే వారు సమీపంలో ఉన్న ఆటో ఏక్కి పరాయ్యారని కాలనీ వాసులు తెలిపారు. -
భారత ప్రభుత్వ హిందీ సలహా కమిటీ సభ్యుడిగా పీసీ రాయులు
తిరుపతి కల్చరల్: భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ పరిధిలోని హిందీ సలహా కమిటీ సభ్యుడిగా తిరుపతికి చెందిన డాక్టర్ పీసీ రాయులను నామినేట్ చేస్తూ శనివారం భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈయన గతంలో ఎఫ్సీఐ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ, బొగ్గు, ఉక్కు పరిశ్రమలు వంటి చట్టబద్ధమైన సంస్థల్లో సభ్యునిగా పని చేశారు. ఆయన మూడేళ్ల కాల వ్యవధి గల ఈ హిందీ సలహా కమిటీ సభ్యుడుగా కొనసాగనున్నారు. -
వైభవంగా మత్స్య జయంతి
నాగలాపురం: మండలంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో మత్స్య జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగు, దొరై, దేవరాజ్ భట్టాచార్యులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, మూలవర్లకు నిత్య కై ంకర్యాలు పూర్తి చేసి, దీప దూప నైవేద్యాలు సమర్పించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఉత్సవమూర్తులను తిరిచ్చి వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. మత్స్య జయంతి సందర్భంగా మత్స్య కారులు మాల ధరించి, ఇరుముడులతో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. తరువాత రాములవారి మండపంలో మహా శాంతి హోమం నిర్వహించి, స్వామి వారికి స్నప తిరుమంజనం చేసి, అభిషేక జలాన్ని భక్తులపై చల్లారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణలో అన్నదానం ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు గరుడవాహనంలో స్వామివారి ఉత్సమూర్తులు కొలువదీరి తిరువీధుల్లో ఊరేగారు. సూపరింటెండెంట్ శంకరయ్య, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఉదయ్ కుమార్, ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
గరుడ వాహనంపై లోకాభిరాముడు
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి లోకాభిరాముడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కటాక్షించారు. ఉదయం 8 స్వామివారి పల్లకీ సేవ వేడుకగా సాగింది. ఈ సందర్భంగా మోహినీ అవతారంలో శ్రీరామచంద్రమూర్తి పల్లకీలో కొలువై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 9.30 గంటలకు గరుడ పాదుకల ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం 10 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. శ్రీకోదండరామునికి గొడుగులు శ్రీభాష్యకార కై ంకర్య ట్రస్ట్ వారు శ్రీకోదండరామస్వామివారికి శనివారం నాలుగు గొడుగులు కానుగా అందజేశారు. తమిళనాడుకు చెందిన శ్రీభాష్యకార కై ంకర్య ట్రస్ట్ అధ్యక్షుడు మాధవ నాయుడు, ఫౌండర్ ట్రస్టీ దినేష్కుమార్ ఆధ్వర్యంలో ఈ గొడుగులు తీసుకొచ్చి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్నకు అందజేశారు. -
● వియ్యాల వారి విందు
నాయుడుపేట పట్టణానికి చెందిన కొత్త అల్లుడు పఠాన్ ఆరాఫత్కు ఆయన అత్తమామలు గౌస్బాషా, షాహినా దంపతులు షడ్రుచులతో కూడిన 60 రకాల వంటలతో విందు పెట్టారు. గౌస్బాషా, షాహినా దంపతుల కుమార్తె షామిదకు ఇటీవల పఠాన్ అరాఫత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో రంజాన్ పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి మటన్, చికెన్, రొయ్యల బిర్యానీతోపాటు మటన్, చికెన్ హలీమ్లు, వివిధ రకాల వంటలు, స్వీట్లు తదితరాలను ప్రత్యేకంగా తయారు చేసి విందు భోజనం పెట్టారు. అల్లుడు, కూతురిపై తమకున్న అభిమానన్ని చాటుకున్నారు. – నాయుడుపేట టౌన్ -
క్యాంపస్ డ్రైవ్లో 20మందికి ఉద్యోగాలు
తిరుపతి సిటీ: స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తమిళనాడులోని చైన్నెకి చెందిన వీల్స్ ఇండియా కంపెనీ ప్రతినిధులు శనివారం పాలిటెక్నిక్ విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఇంటర్వ్యూలకు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలోని పలు పాలిటెక్నిక్ల నుంచి ట్రిపుల్ఈ, ఈసీఈ, మెకానికల్, ఆటోమొబైల్స్ విభాగల నుంచి రాత పరీక్షలో అర్హత సాధించిన 58 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కంపెనీ హెచ్ఆర్, టెక్నికల్ బృందాలు రెండు రౌండ్లలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించి 20మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ వై ధ్వారకనాథ్రెడ్డి మాట్లాడుతూ విద్యాభ్యాసానికి, పారిశ్రామిక అవసరాలకు మధ్య వారధిగా నిలుస్తూ, విద్యార్థులకు నాణ్యమైన ప్లేస్మెంట్ అవకాశాలను అందించడంలో ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందుంటుందని తెలపారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ రాధ, ఆర్ జయచంద్ర, బాలాజీ, కంపెనీ ప్రతినిధులు మణికందన్, విజయ్, ఆకాష్ పాల్గొన్నారు గుర్తు తెలియని వ్యక్తి మృతి తిరుపతి క్రైం : నగరంలోని రవీంద్ర నగర్లో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. రవీంద్ర నగర్లోని విద్యుత్ సబ్స్టేషన్ పక్కన శనివారం ఉదయం సుమారు 35 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం ఉండగా స్థానికులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందజేశారు. వారు వచ్చి సంఘటన స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఎడమ చేతిపై ‘సుబ్బు‘ అనే పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించారు. అలాగే అతను నలుపు రంగు టీషర్ట్, తెలుపు రంగు 3/4 ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతనికి సంబంధించిన బంధువులెవరైనా ఉంటే వెంటనే అలిపిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరసింహరావును సంప్రదించాలని పోలీసులు కోరారు. సమాచారం కోసం 9440796752, 9154141869 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. తెలుగుగంగ కాలువలో యువకుడి గల్లంతు వెంకటగిరి రూరల్: పట్టణంలోని బంగారుపేట సమీపంలో ఉన్న తెలుగంగ కాలువలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. బంగారుపేటకు చెందిన చెంజి రమేష్ (39) వెంకటగిరి పట్టణంలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం బహిర్భూమి కోసం తెలుగంగ వంతెన వద్దకు వెళ్లి కాలువలో కాళ్లు కడుగుతుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకొపోయి గల్లంతయ్యారు. ఈ మేరకు రాపూరు అగ్నిమాపక అధికారి కుప్పయ్య నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలసి తెలుగంగ కాలువలో రమేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. రమేష్కు భార్య, తండ్రి ఉన్నారు. -
ఇసుక దోపిడీపై ఫిర్యాదు
పెళ్లకూరు: నిబంధనలకు విరుద్ధంగా స్వర్ణముఖినదిలో ఇసుక దోపిడీని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిది చిందేపల్లి మధుసూదన్రెడ్డి శనివారం అడ్డుకుని రెవెన్యూ, మైనింగ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్న ప్రదేశానికి ఆయన చేరుకుని, అక్కడ ఇసుక దోపిడీపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్వర్ణముఖినదిలో ఇసుక మాఫియా రోజురోజుకు పేట్రేగిపోతుదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో ఇచ్చిన డీసిల్టింగ్ అనుమతులు మాటున యంత్రాలతో 20 అడుగులు పైగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో తాగు, సాగునీటికి కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణముఖినదిలోని పైపొరను రోజు వారీ కూలీలతో తవ్వకాలు జరిపి అవసరాల నిమిత్తం తీసుకెళ్లేందుకు జిల్లా అధికారులు అనుమతులు ఇచ్చారన్నారు. ఆ అనుమతులు ఇక్కడ కాంట్రాక్టర్ భేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతలతో కలిసి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. కూటమి నేతల చేస్తున్న ఇసుక దోపిడిని అడ్డకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిలతో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు ప్రిస్కిల్లా, ఎంపీపీ శేఖర్రెడ్డిలతో పాటు 26మంది రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం మంచిదికాదన్నారు. ఇసుక తవ్వకాల విషయమై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇసుక తవ్వకాలు జరుపుతున్న యంత్రాలను రెవెన్యూ సిబ్బందికి అప్పగించి, స్థానిక తహసీల్ధార్ హరికృష్ణకు, వీఆర్వో వంశీకృష్ణకి ఫిర్యాదు చేసినప్పటికి స్పందించకపోవడంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆనంద్, కౌషిక్రెడ్డి, కార్తిక్రెడ్డి, సునీల్, మహేష్లు ఉన్నారు. -
బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టారా?
తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో మరో వివాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గైర్హాజరయ్యారు. కనీసం సీఎం చంద్రబాబు స్వాగత కార్యక్రమంలో కూడా బీఆర్ నాయుడు కనిపించలేదు. టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి.. సీఎం చంద్రబాబుకు ఎందుకు స్వాగతం చెప్పలేదు.. సమీక్షా సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారనేది అనేక సందేహాలకు తావిచ్చింది.బీఆర్ నాయుడిని సీఎం చంద్రబాబు కావాలనే దూరం పెట్టారా? అనే అనుమానం వస్తుంది. ఇటీవల బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం కావచ్చొనది పలువురి అభిప్రాయంగా ఉంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో సీఎం చంద్రబాబు.. టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. మరి అటువంటి సమావేశానికి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు హాజరు కాలేదనేది ఇక్కడ ప్రశ్న. టీటీడీలో అంతర్గత విభేదాలా.. లేక ప్రోటోకాల్ వివాదమా? అనేది అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది. -
తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ.. భక్తుల ఆశ్చర్యం
సాక్షి, తిరుపతి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చంద్రబాబు.. టీటీడీలోనూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు జరిపారు. అనంతరం, 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. నాటి నిర్ణయం మేరకు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ హయాంలోనే ల్యాబ్ బలోపేతమైంది.ఇంత జరిగినా బిల్డప్ బాబు చంద్రబాబు మాత్రం ప్రసాదం నాణ్యతకు తానే దృష్టిపెట్టినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. అయితే, వైఎస్ జగన్ గతంలోనే తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, తాజాగా చంద్రబాబు క్రెడిట్ చోరీని చూసిన శ్రీవారి భక్తులు నివ్వెరపోతున్నరు. -
ఎవరికీ వంటబట్టలే!
తిరుపతి అర్బన్: మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో ఒకరిద్దదు కాదు.. 28 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పస్తులు ఉండాల్సిన దుస్థితి తిరుపతి జిల్లాలో నెలకొంది. వంట నిర్వాహకులు చేతులెత్తేయడంతో శుక్రవారం తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల్లోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలు, అలాగే వడమాలపేట, రామచంద్రాపురంలోని 40 శాతం పాఠశాలల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించకపోవడంతో వారంతా పస్తులతో ఇంటికి వెళ్లారు. ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న క్రమంలో ఉదయం 7.45 గంటలకు పాఠశాలకు చేరుకున్న పిల్లలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలో ఉంటారు. అనంతరం పాఠశాలలో పెట్టే భోజనం తీసుకున్న తర్వాత ఇంటికి వెళతారు. అయితే శుక్రవారం భోజనం లేదని చెప్పడంతో నిరుత్సాహంతో నీరసంగా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. విద్యార్థులకు అందని ఇస్కాన్ భోజనం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వారి ఆధ్వర్యంలో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల్లోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు, అలాగే రామచంద్రాపురం, వడమాల పేట మండలాల్లోని 40 శాతం ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మధ్యాహ్న భోజనం రోజు అందిస్తుంటారు. మొత్తంగా 494 పాఠశాలల్లోనే 38 వేల మందికి ఇస్కాన్ భోజనం సరఫరా చేస్తుంటారు. అందులో తిరుపతి అర్బన్ మండలాన్ని మినహాయిస్తే 28 వేల మంది పిల్లలకు శుక్రవారం మధ్యాహ్న భోజనం అందలేదు. విద్యాశాఖ సమన్వయ లోపం రంజాన్ పండుగ నేపథ్యంలో శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి 10 గంటలపైన రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించి, శుక్రవారం పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ విషయం గురువారం రాత్రి 10 గంటలపైన ఇస్కాన్ యాజమాన్యానికి సమాచారం అందించాల్సి ఉంది. అయితే వారికి సకాలంలో సమాచారం అందలేదని శుక్రవారం మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేపట్టలేదు. ఆ తర్వాత తిరుపతి సమాచారం వచ్చినప్పటికి వంట మాస్టర్లతోపాటు నిర్వాహకులు, సిబ్బంది అందుబాటులో లేరని భోజనం తయారు చేయని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న ఒకరిద్దరు వంట మాస్టర్లతో తిరుపతి అర్బన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అన్నం ,ఆకుకూరలు, పప్పుతో కూడిన భోజనం అందించారు. తిరుపతి రూరల్, రేణిగుంట, వడమాలపేట , రామచంద్రాపురం మండలాల్లోని పాఠశాలల్లోని పిల్లలకు భోజనం అందలేదు. దీంతో వారంతా పస్తులతో బాధతో ఇంటికి వెళ్లారు. ఆకలి విద్యకు ఆటంకం కాకూడదు.. పిల్లలు కడుపు నిండా తినాలి.. కళకళ లాడుతూ ఇళ్లకు వెళ్లాలన్నది ప్రభుత్వం సంకల్పం.. ఇదే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. అయితే వంట నిర్వాహకులు.. విద్యాశాఖాధికారుల మధ్య సమన్వయ లోపం.. సమాచార అంతరాయం.. అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం వెరసి పేదపిల్లలు శుక్రవారం మధ్యాహ్నభోజనం మిథ్యగా మారింది. ఫలితంగా చిన్నారులు ఆకలితో నకనకలాడుతూ ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది.సమాచారం అందిన వెంటనే తెలియజేశాం రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందిన వెంటనే శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మద్యాహ్నం భోజనం సిద్ధం చేయాలనే సమాచారాన్ని ఇస్కాన్కు ఇచ్చాం. అయితే గురువారం రాత్రి సమాచారం ఆలస్యంగా వచ్చింది. ముందుగా శుక్రవారం సెలవుగా నిర్ణయించి, ఆ తర్వాత శుక్రవారం పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని శనివారం రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించాలని సమాచారం ఇచ్చారు. వంట మాస్టర్లు అందుబాటులో లేకపోవడంతో అందరికీ భోజనం అందించలేకపోయామని వారు వెల్లడించారు. ఇకపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం. –కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి -
సెమీ–ఆటోమెటిక్ పరికరాల అభివృద్ధే లక్ష్యం
ఏర్పేడు: రైతులకు ఉపయోగపడే రీతిలో సెమీ ఆటోమెటిక్ వ్యవసాయ పరికరాల అభివృద్ధే లక్ష్యమని తిరుపతి ఐఐటీ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ తమిదా సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి ఐఐటీలోని రీసెర్చ్ పార్క్లో వడమాలపేట మండలానికి చెందిన రైతులకు సెమీ–ఆటోమెటిక్ వ్యవసాయ పరికరాల అభివృద్ధి ప్రాజెక్ట్లో భాగంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన సీడ్ (సైనన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్) విభాగం స్పాన్సరింగ్ ఏజెన్సీగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ పరిశోధకులు రూపొందించిన యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ వంటి ల్యాబ్ పరికరాలు, వేరుశనగ పొట్టు తీసే యంత్రాలపై ప్రజెంటేషన్లు జరిగాయి. ఈ ల్యాబ్ ద్వారా వ్యవసాయ పరికరాల రంగంలో భవిష్యత్లో మరిన్ని నూతన ఆవిష్కరణలకు ఒక కేంద్రంగా నిలిచేందుకు కృషి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ అజయ్కుమార్, వ్యవసాయ అధికారి విజయకుమార్, వడమాలపేట గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి వెంకటేష్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ షాపుల టెండర్కు దరఖాస్తుల ఆహ్వానం
కాలువలో లారీ బోల్తా ఏర్పేడు మండలం నాగంపల్లి సమీపంలోని కాలువలో ధాన్యం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు.తిరుపతి అన్నమయ్యసర్కిల్: జిల్లాలోని ఆర్టీసీ డిపోల పరిధిలో ఉన్న బస్స్టాండ్లలో షాపుల నిర్వహణకు టెండర్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీఓ ఎం.జగదీష్ తెలిపారు. టెండర్ దరఖాస్తులు ఆయా డిపో మేనేజర్ కార్యాలయాల పనివేళల్లో పొందవచ్చన్నారు. కాగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు గడువు నిర్ణయించినట్లు తెలిపారు. అదే రోజు పూర్తి చేసిన దరఖాస్తులను మధ్యాహ్నం 2 గంటల లోపు తిరుపతి జిల్లా ప్రజా రవాణ శాఖ వారి కార్యాలయంలోని టెండర్ బాక్సులో దాఖలు చేయాలన్నారు, అదే రోజు మధ్యా హ్నం 3 గంటలకు టెండరు దారుల సమక్షంలో టెండర్లు తెరువనున్నట్లు తెలిపారు. స్టాళ్లు, షాపులు ఖాళీ స్థలాల సంఖ్య109 చేపట్టనున్న టెండర్ ప్రక్రియలో ఆసక్తిగలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. తిరుపతి డిపోలోని శ్రీహరి, అన్నమయ్య, శ్రీనివాస, ఏడుకొండలు, రేణిగుంట బస్స్టాండ్, రంగంపేట కమర్షియల్ కాంప్లెక్స్, చంద్రగిరి పల్లెవెలుగు బస్టాండ్, పాకాల, నేండ్రగుంట, భాకరాపేట, పుత్తూరు, శ్రీకాళహస్తి, పిచ్చాటూరు, సత్యవేడు, కేవీబీ పురం, ఏర్పేడు, నాగలాపురం, వరదయ్యపాళెం, వాకాడు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, బాలాయపల్లి బస్టాండ్లలోని షాపులకు టెండర్ల ప్రక్రియ ఉంటుందన్నారు. వివరాలకు ఆయా పరిధిలోని ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించాలని కోరారు. ఆదిలక్ష్మీదేవికి వజ్రాల మంగళసూత్రం రాపూరు: మండలంలోని పెంచలకోనలో ఉన్న ఆదిలక్ష్మీదేవికి హైదరాబాద్కు చెందిన వసంతపు శ్రీనివాస్, మాధవి దంపతులు రూ.11 లక్షల విలువైన ఆభరణాలు శుక్రవారం బహూకరించినట్లు ఏసీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అమ్మవారికి వజ్రాలతో కూడిన బంగారు మంగళసూత్రం, వెండికాలి పట్టీలు, వెండి మెట్లు అందించినట్లు ఆయన తెలిపారు. దాతలకు మూడు ఆలయాల్లో ప్రత్యేకపూజలు, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించినట్లు ఆయన తెలిపారు. -
బాబుపై వ్యతిరేకత
రెండేళ్లలోనే వైఎస్సార్ సీపీ బూత్కమిటీ రాష్ట స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న భూమన కరుణాకరరెడ్డి, ఆర్కే రోజా ‘బాబు సర్కారు గద్దెనెక్కి రెండేళ్లు.. అప్పటి నుంచి ఆడంబరపు మాటలు.. అభివృద్ధి పేరిట ఆకాశయానాలు.. అప్పుల కుప్పలు.. వెరసి పడకేసిన అభివృద్ధి.. అమలుకు నోచుకోని హామీలు.. అందని సంక్షేమం.. ఫలితంగా బాబు పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.’ అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బూత్ కమిటీల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. జాబితాలో డబ్లింగ్ ఓట్లను తొలగించాలి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి మాట్లాడుతూ బూత్ లెవల్, ఎలక్షన్ ఏజెంట్లకు ఇప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బెంగళూరు, చైన్నెలో స్థిరపడివారి ఓట్లు 15వేల నుంచి 20 వేలు ఉన్నాయన్నారు. పొరుగు రాష్ట్రాల్లో మనకంటే ముందుగా ఎన్నికలు జరగడంతో అక్కడ ఓట్లు వేసి, మళ్లీ ఇక్కడ ఓట్లు వేస్తున్నారన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బెంగళూరు నుంచి వచ్చి పంచాయతీకి రూ.కోటి వరకు ఖర్చు చేసినవారు ఉన్నారన్నారు. ఇలాంటి డబుల్ ఓటింగ్ వేసే వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలన్నారు. భూమన కరుణాకరరెడ్డి మా ట్లాడుతూ ప్రజలకు అబద్ధపు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని, ప్రజలకు ఇచ్చి న హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎంతసేపు వైఎస్.జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం, దుర్భాషలాడడం తప్ప మరొకటి లేదన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించి, అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లను చేర్చకుండా చూడాలన్నారు. పార్టీ నేతలమైన తాము ఎంత కష్టపడినా బూత్కమిటీలు, బీఎల్వోలు సక్రమంగా పనిచేస్తేనే వైఎస్సార్ సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాగలమన్నారు. ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. ఎలక్షన్ కమిషన్ పెట్టే ప్రతి సమావేశానికి బూత్ కమిటీలు, బీఎల్వోలు హాజరుకావాలన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మనపార్టీ ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి గ్రహణం పట్టుకుందన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి పడకేసి, రాష్ట్ర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు తెచ్చే రూ.లక్షల కోట్ల అప్పులు దేనికి ఖర్చుపెడుతున్నారో ఆ దేవుడికే ఎరుకన్నారు. ఏదైనా మాట్లాడితే అమరావతి అభివృద్ధి తప్ప చంద్రబాబు నోట మరొకటి రాదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎలా అధికారంలోకి వచ్చారో అందరికీ తెలుసునన్నారు. రాబోయే ఎన్నికల్లో అలా కాకుండా పట్టిష్టంగా బూత్కమిటీలు పని చేసి జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ బూత్కమిటీలు సమర్థవంతంగా పనిచేసినప్పుడే వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురాగలమన్నారు. ఆ బాధ్యత మనందిరిపై ఉందన్న విషయాన్ని బూత్కమిటీలన్నీ గుర్తు పెట్టుకుని పనిచేయాలని కోరారు. వైఎస్సార్సీపీ గెలుపునకు బూత్ కమిటీలే కీలకమన్నారు. జగనన్న మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, మాజీ మేయర్ శిరీష, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, బూత్కమిటీ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్రానికి ‘చంద్ర’ గ్రహణం దొంగ ఓట్లతో జాగ్రత్త -
పెంచలకోన ఆలయానికి రూ.20.78 లక్షల ఆదాయం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో ఏప్రిల్ మాసంలో జరిగే లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు శుక్రవారం జరిగిన వేలం పాటల్లో దేవస్థానానికి రూ.20.78 లక్షల ఆదాయం వచ్చిందని ఏసీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 26 నుంచి జూన్ 7వ తేదీ వరకు 49 తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు వేలం పాటలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ వేలం పాటల్లో రూ.20.78 లక్షల రాబడి వచ్చిందన్నారు. కాలువలో లారీ బోల్తా ఏర్పేడు: వెంకటగిరి మార్గంలోని నచ్చనేరి సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదురుగా శుక్రవారం సాయంత్రం ధాన్యం లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో లారీ క్లీనర్ దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి కథనం మేరకు.. వరదయ్యపాళెంలోని కుమారస్వామికి చెందిన లారీ శుక్రవారం ఏర్పేడు మండలం నాగంపల్లికి చేరుకుని, మహానందరెడ్డి అనే రైతు పొలంలో ఉన్న ధాన్యం 300 బస్తాలు లోడ్ చేసుకుని బయలుదేరింది. ఏర్పేడు– వెంకటగిరి రహదారిలోకి వస్తున్న క్రమంలో డేవిడ్ లూయిస్ లెప్రసీ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఎస్ఎస్ కెనాల్లో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గోపికి స్వల్ప గాయాలు కాగా, క్లీనర్ రూపేష్ చౌదరి(32) క్యాబిన్లో ఇరుక్కుపోయి దుర్మరణం చెందాడు. బిహార్ రాష్ట్రం ఈస్ట్ చంపారన్కు చెందిన రూపేష్ చౌదరి రెండేళ్లుగా కుమారస్వామి వద్ద లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న ఏర్పేడు పో లీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున్న క్లీనర్ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం తిరుమల: హైదరాబాద్కు చెందిన ముత్తా గౌతమ్ దంపతులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు. -
కొలువొక స్వప్నం.. పండుగ పూట ప్రగల్భం
ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు.. గద్దెనెక్కి రెండేళ్లు.. అయినా అమలుకు నోచుకోని హామీలు.. జాబ్ క్యాలెండర్ పేరిట ఉగాది వేళ బాబు ప్రగల్భం.. తీరా చూస్తే తూతూ మంత్రంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ తేదీలు.. అరకొర ఉద్యోగాల భర్తీకి జారీ చేయనున్న నోటిఫికేషన్లకు లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ.. వెరసి కొలువొక స్వప్నంగా మిగిలింది.. ఫలితం నిరుద్యోగ యువత ఆగ్రహం వెలిబుచ్చుతోంది. తిరుపతి సిటీ: ఉగాది రోజున ప్రభుత్వం జాబ్ క్యాలెండ్ విడుదల చేస్తోందని ప్రకటించడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు సర్కార్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. 10 వేల ఉద్యోగాలు ఈ ఏడాది పొడువునా భర్తీ చేస్తామంటూ చావు కబురు చల్లగా చెప్పడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం జాబ్ క్యాలెండర్ పేరుతో పదివేల పోస్టులు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసే ప్రకటనలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా 2 లక్షల మందికి దాటుతున్న వయోపరిమితి చంద్రబాబు సర్కార్ పాలన రెండేళ్లు గడిచింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో వయోపరిమితి మించిపోవడంతో తిరుపతి జిల్లాలో ఏటా సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల కోసం ఎదురు చూసిన ఎంతో మంది నిరుద్యోగులు బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లి చిన్న చిన్న కంపెనీల్లో చిరుద్యోగంతో జీవనం సాగిస్తున్నారు. -
జగనన్నను సీఎం చేసేవరకు నిద్రపోం
తిరుపతి సిటీ: ‘జగనన్నను ముఖ్యమంత్రి చేసేవరకు నిద్రపోం.. అభినయ్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. భూమన కుటుంబం ఆప్యాయత, ఆదరణ మరువలేం’ అని తాజా మాజీ కార్పొరేటర్లు ప్రతినబూనారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఆత్మీయ సన్మాన సభకు మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన్ అభినయ్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తాజా మాజీ మేయర్ డాక్టర్ శిరీషతోపాటు మాజీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తాజా మాజీ మేయర్ డాక్టర్ శిరీష, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుపతిని పాలించిన ఎంతో మంది మహానీయులకు సాధ్యం కానీ అభివృద్ధిని భూమన అభినయ్రెడ్డి అనతి కాలంలోనే చేసి చూపించారన్నారు. ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. తరువాత భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తన 53 ఏళ్ల రాజకీయ జీవితంలో సన్మానాలకు దూరంగా ఉన్నానని, ఇది తనకు తొలి సన్మానమని చెప్పారు. ప్రతి కార్యకర్త, సభకు విచ్చేసిన ప్రతి కార్పొరేటర్ను తన కుటుంబ సభ్యులు, బంధువులుగా భావించి అండగా ఉండడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ సన్మానం చివరిది కావచ్చని సభలో వెల్లడించారు. చారిత్రక అభివృద్ధికి చిహ్నంగా అభినయ్ తిరుపతి నగర రూపురేఖలు మార్చిన యువనేత అభినయ్ నగర చారిత్రిక అభివృద్ధికి చిహ్నంగా మారారని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కొనియాడారు. డిప్యూటీ మేయర్ హోదాలో ఆయన చేసిన మాస్టర్ ప్లాన్రోడ్లతో తిరుపతి రూపం మారిందన్నారు. గాడ్ ఫాదర్లా భూమన కుటుంబం ఎంతో మంది సామాన్యులను రాజకీయ నేతలుగా తీర్చిద్దిందని చెప్పారు. పులికడుపులో పులి పుడుతుందన్న చందంగా భూమన అభినయ్ తిరుపతి ప్రజలకు వరమని కొనియాడారు. వచ్చే ఎన్నికలల్లో అభినయ్ని ఎమ్మెల్యేగా, జగనన్నను సీఎంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని సూచించారు. సమష్టికృషితో అభివృద్ధి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, నగర మేయర్ డాక్టర్ శిరీష సహకారంతో కార్పొరేటర్లతో కలసి సమష్టిగా నగరాభివృద్ధికి కృషి చేశామని మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి అన్నారు. ఎప్పుడూలేనంత అభివృద్ధిని తిరుపతి ప్రజలు కళ్లారా చూశారన్నారు. తిరుపతి ఉన్నంత కాలం నగరపాలక సంస్థ తొలి కౌన్సిల్ను ప్రజలు మరచిపోరన్నారు. 2022 జులై 15వ తేదీ నగరంలోని ప్రతిపాదించిన 14 మాస్టర్ ప్లాన్ రోడ్లకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. అనుకున్న 14 మాస్టర్ ప్లాన్ రోడ్లుతో పాటు మొత్తం 21 రోడ్లును నిర్మించి చూపించామన్నారు. కూటమి ప్రభుత్వం ఎదుట మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు ప్రతిపాదన పెట్టామని, కానీ ఇప్పటివరకు ఆ ఊసేలేదన్నారు. భూమన ఆదర్శనీయులు నగర మేయర్గా తాను భూమన కుటుంబం సభ్యుల నుంచి ఎంతో నేర్చుకున్నానని భూమనకరుణాకరరెడ్డి ఆదర్శనీయులని తాజా మాజీ మేయర్ శిరీష అన్నారు. కరుణాకరరెడ్డి ఉద్యమనేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన యోధుడన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఏదో చేయాలని తపన పడే వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి ఆయన అని కొనియాడారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రజల కోసం ఆయన పడే తపన వర్ణించలేదని చెప్పారు. సమయ పాలన, వాక్ చాతుర్యం, క్రమశిక్షణ వంటి విషయాలను ఆయన వద్ద నేర్చుకున్నానని తెలిపారు. అలాగే డిప్యూటీ మేయర్గా పనిచేసిన భూమన అభినయ్ తిరుపతికి దేవుడిచ్చిన వరమన్నారు. అతి చిన్న వయస్సులో చారిత్రక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మించడాన్ని యావత్ నగర ప్రజలు గర్వించారన్నారు. సాధారణ వ్యక్తులమైన మనందరికీ రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఆ కుటుంబానికి రుణపడి ఉంటామన్నారు. -
బాబు ఉద్యోగాలిస్తానంటే నమ్ముతారా?
రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని, ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ డ్రామాలు ఆడితే ప్రజలు, నిరుద్యోగులు, యువత నమ్మే పరిస్థితులు లేవని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దమ్ముధైర్యం ఉంటే చెప్పిన తేదీలోపు డ్రామాలు ఆడకుండా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత తమ ప్రభుత్వంలో యువతకు ఇచ్చిన ఉద్యోగాలు తమపై కోపంతో పీకేశారని చెప్పారు. ప్రతిపక్షనాయకులను ఎదుర్కోలేక సుమారు 30 వేల మంది ఉద్యోగుల కడుపు కొట్టారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని వివిధ సంస్థల్లో యువకులకు తమ హయాంలో ఉద్యోగాలు కల్పిస్తే తమపై కోపంతో వారికి ఉద్యోగాలు పీకేసి, వారి కుటుంబాలు రోడ్డున పడేటట్లు చేసిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగులుతుందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అలివికానీ హామీలిచ్చి అధికారం చేపట్టాక వాటిని తుంగలో తొక్కడం, నక్కజిత్తుల మాటలు చేప్పడం మామూలేనన్నారు. రెండేళ్లుగా ప్రతి నెలా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెట్పీటీసీ సభ్యురాలు రత్నమ్మ, నాయకులు చెవు శ్రీనివాసులురెడ్డి, మందల నాగేంద్ర, నందబాల, సుబ్బరామరాజు, డీవీరమణ, మలిశెట్టి వెంకటరమణ, బండారు మల్లికార్జున, కస్తూరి రామకృష్ణ, పర్వతం విజయ్కుమార్రెడ్డి, శ్రీరాంవినోద్, గని, దామర్ల సిద్ధయ్య పాల్గొన్నారు. -
అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంపై విజిలెన్స్ దాడి
శ్రీకాళహస్తి: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అందిన విశ్వసనీయ సమాచారంతో శ్రీకాళహస్తిలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంపై దాడులు నిర్వహించారు. శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న ఒక ప్రొవిజన్ షాపు వెనుక భాగంలో గ్యాస్ను అక్రమంగా నింపి, విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో అధికారులు రెవెన్యూ సిబ్బంది సహకారంతో తనిఖీలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ‘శివ గణేష్’ పేరిట నడుపుతున్న దుకాణం వెనుక అక్రమంగా నాగరాణి అనే మహిళ గ్యాస్ రీ ఫిల్లింగ్ కేంద్రం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి వాటిలోని గ్యాస్ను కమర్షియల్ సిలిండర్లలోకి నింపి విక్రయిస్తున్నట్టు తేలింది. తనిఖీల్లో మొత్తం 88 గ్యాస్ సిలిండర్లు, రీఫిల్లింగ్కు ఉపయోగించే పరికరాలు, త్రాసులు, రాడ్లు తదితర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెచ్పీ గ్యాస్కు చెందిన డొమెస్టిక్ సిలిండర్లతోపాటు అనధికారిక కంపెనీలకు చెందిన సిలిండర్లు కూడా లభించినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 57, 272 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,842 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
‘ఉగాది రోజు కూడా చంద్రబాబు అబద్ధాలు’
తిరుపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ నాడు కూడా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జనం నవ్వుతున్నారని సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ‘జగనన్న పాలనలో ప్రతి పేదవాడు,ఉద్యోగి, రైతు, సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ అని ,మ్యానిఫెస్టోలో పెట్టారు. సూపర్ సిక్స్తో సూపర్ మోసం చేశారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 ఇస్తామని,మోసం చేశారు. రైతులుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చారా..? ఏవిధంగా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎవరు సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సిగ్గులేని బీఆర్ నాయుడు.. చైర్మన పదవి నాకు ఏమైనా అన్నం పెడుతుందా అంటాడు.. హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి అంటాడు.. అర్హత లేని వాళ్లకు గౌరవం ఇస్తే ఇలానే ఉంటుంది.. రాజీనామా చెయ్.. బీఆర్ నాయుడు లాంటి అర్హత లేని వాళ్లను తరిమి తరమి కొట్టాలి’ అని ఆర్కే రోజా విమర్శించారు. -
ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాయుడుపేటటౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండడాన్ని గురువారం ఆర్టీసీ కంట్రోలర్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ రామమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉండవచ్చని, చొక్క లేకుండా గళ్ల లూంగీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాం పక్కనే ఖాళీ మద్యం బాటిల్ పడి ఉండడంతో మద్యం సేవించి నీళ్ల దాహంతో గొంతు తడారిపోయి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుడి అరెస్టు తిరుమల : టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన యోగేష్ అనే వ్యక్తి టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని, దర్శన టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం యోగేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యక్తిగత పాపులారిటీ కోసం యోగేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోందని, టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తిరుమలకు రానీయకుండా కూడా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాముడు హెచ్చరించారు. ముక్కంటి సేవలో కేంద్రమంత్రి శ్రీకాళహస్తి: కేంద్రమంత్రి కిషన్రెడ్డి కుటుంబ సమేతంగా గురువారం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు ప్రత్యేక రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి శ్రీకాళహస్తి: పట్టణలలోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు 108 వాహనం ద్వారా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి మార్చూరీకి తరలించారు. ఇతని గురించి తెలిసిన వారు శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులను సంప్రదించాలని వారు కోరారు. -
● నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు ● గద్దెనెక్కి రెండేళ్లైనా ఆచరణకు నోచని హామీలు
వరదయ్యపాళెం: ఎన్నికల సమయంలో చంద్రబాబుతోపాటు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడుకు పలు హామీలిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తకావస్తోంది. అయినా ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేదు. అభివృద్ధి పరంగా వెనుకబడిన సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ ఎన్నికల సమయంలో సత్యవేడుకు వచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఆయన మోసపూరిత హామీలను నమ్మిన నియోజకవర్గ ప్రజలు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆదిమూలాన్ని గెలిపించారు. ఎమ్మెల్యే సైతం నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పలు హామీలు ఇచ్చినప్పటికీ ఒకటి కూడా ఆచరణ కాలేదు. హామీలిచ్చి పరిష్కారం కాని సమస్యలివే.. -
అకాల వర్షం..అపార నష్టం
చంద్రగిరి: అకాల వర్షం కారణంగా రైతులు పంటలను కోల్పోయి అపారంగా నష్టపోయారు. బుధవారం రాత్రి మండలంలో సుమారు రెండు గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలోని బందార్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి భారీ వర్షం కారణంగా వరి, మామిడి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. పంటలను నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. గోనుపల్లిలో వడగళ్లు వాన రాపూరు: మండలంలోని గోనుపల్లిలో బుధవారం రాత్రి కురిసిన వడగళ్లు వర్షానికి వరి, మామిడి, నిమ్మ పంటలు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. గ్రామంలో సుమారు 300 ఎకరాల వరి పంట కోతకు వచ్చిందని, కొందరు వరి కోతలు కోయగా మరికొందరు వరి కోత కోయాల్సి ఉందని చెప్పారు. వర్షంతో ధాన్యం మొత్తం రాలిపోగా పంట నెలకొరిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క రైతుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. అలాగే మామిడి పూత, కాయలు రాలిపోయాయన్నారు. మంచి ధర ఉన్న సమయంలో గాలికి నిమ్మకాయలు రాలిపోయి, తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు బోరుమంటున్నారు. పంట నష్టాన్ని వ్యవసాయాధికారి సోమ సుందర్ అంచనా వేశారు. శుక్రవారం ఉద్యానవన శాఖ అధికారులు పంటను పరిశీలిస్తారని ,పంట నష్టంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. -
పరాభవ నామ సంవత్సరమంతా శుభాలే
శ్రీకాళహస్తి: పరాభవ నామ సంవత్సరమంతా శుభాలేనని శ్రీకాళహస్తీశ్వరాలయ ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీ సత్యనారాయణశర్మ అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా గురువారం శ్రీకాళహస్తీశ్వరాలయంలోని స్వామివారి సన్నిధి వద్ద పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పంచాంగ పఠనం చేస్తూ ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రతి రాశివారు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పరాభవ నామ సంవత్సరంలో వర్షాలు బాగా కురుస్తాయన్నారు. ఆకట్టుకున్న కవి సమ్మేళనం శ్రీకాళహస్తీశ్వరాలయంలోని ఊంజల్సేవ మండపం వద్ద గురువారం రాత్రి జరిగిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకుని ప్రముఖ అవధాని మేడసాని మోహన్ మాట్లాడుతూ ఈ ఏడాది రాశులపై అంత దుష్ప్రభావం ఏమీ చూపడంలేదన్నారు. శ్రీకాళహస్తిలో పుట్టినవారికి దక్షిణామూర్తి, జ్ఞానాంబ, శివయ్య అనుగ్రహంతో ఎంతటి కష్టానైనా ఎదుర్కోగలుగుతారన్నారు. అనంతరం వారిని ఆలయాఽధికారులు వారిని ఘనంగా సన్మానించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల పురవిహారం ఉగాది సందర్భంగా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి పురవిహారం చేశారు. ఆలయంలోని అలంకారం మండపంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్లు పురవిహారం చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
విధులకు వెళుతూ అనంతలోకాలకు..!
ఏర్పేడు: ఏర్పేడు–వెంకటగిరి మార్గంలో నాగంపల్లి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు ఎస్ఐ రవిప్రకాష్ కథనం మేరకు.. ఏర్పేడు మండలం ఆమందూరు బీసీ కాలనీకి చెందిన గురుస్వామి, ప్రమీల దంపతుల కుమారుడు చెంచు గురుచంద్ర(28) రాక్మెన్ కంపెనీలో జూనియర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పాగాలి సమీపంలోని రాక్మెన్ కంపెనీకి వెళ్లేందుకు బైక్పై ఇంటి నుంచి బయలుదేరాడు. నాగంపల్లి సమీపంలోని ఓ ఆస్పత్రి ఎదురుగా ముందు వెళుతున్న కట్టెల లోడ్ ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడుపుతూ సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న చెంచు గురుచంద్ర తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఘనంగా ఉగాది సంబరాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో, వెలుపల ఏర్పాటు చేసిన పుష్ప, విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సతమూర్తులకు వేదమంత్రోచ్ఛారణల నడుమ చందన, పంచామృతం, క్షీర, నారికేళ జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. భక్తకన్నప్పకు సారె సమర్పణ శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా గురువారం తేరువీధిలోని భక్తకన్నప్పకు ఆలయం తరఫున సారె సమర్పించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తకన్నప్ప ఆలయంలో సారెను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆటో, కారు ఢీ – నలుగురికి తీవ్ర గాయాలు చంద్రగిరి: ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చంద్రగిరి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరి జాతీయ రహదారి పెట్రోల్ బంకు వద్ద ఎదురెదురగా ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులోని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా రుయాస్పత్రికి తరలించారు. ఈ మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలో షెడ్లు దగ్ధం బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని గాజులపెళ్లూరు సమీపంలోని రసా జ్యూస్ ఫ్యాక్టరీలో గు రువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 4 షెడ్లు ద గ్ధమయ్యాయి. దీంతో భారీ నష్టం వాటిల్లిందని యాజమాన్యం తెలిపింది. ఉగాది పండుగ కావడంతో ఫ్యాక్టరీలోని షెడ్లలో కార్మికులు లేరని, దీంతో ఎలాంటి ప్రాణహాని కలగలేదని పేర్కొంంది. శ్రీకాళహస్తి నుంచి ఫైర్ ఇంజిన్, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి, పక్కనే ఉన్న షెడ్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. -
అదృశ్యమైన విద్యార్థి మృతి
సైదాపురం: రెండు రోజుల కిందట అదృశ్యమైన విద్యార్థి గంగ కాలువలో శవమై కన్పించాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని చాగణం గ్రామానికి చెందిన బంకాపూరి సుబ్బయ్య కుమారుడు మణికంఠ గూడూరులోని ఓప్రైవేట్ కళాశాల్లో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. మంగళవారం రాత్రి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఎస్ఐ క్రాంతికుమార్ దర్యాప్తు చేపట్టారు. మర్లపూడి సమీపంలోనే ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద బైక్ మాత్రమే ఉండడంతో గంగ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం డక్కిలి సమీపంలో కండలేరు ప్రధాన కాలువ వద్ద శవమై కన్పించడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మణికంఠ మృతదేహాన్ని గంగ కాలువ నుంచి బయటకు తీసి, పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


