Tirupati
-
15 నుంచి ఎస్వీయూ కళాశాలలకు సెలవులు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు ఈనెల 15 నుంచి జూన్ 28వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్డీ కోర్సుల చదువుతున్న విద్యార్థులకు జూన్ 29వ తేదీన యథాతధంగా తరగతులు ప్రారంభమవుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు. నేటితో ముగిసిన గడువు – తుది దశలో బ్రిడ్జి మరమ్మతు పనులు రేణిగుంట: పట్టణానికి ముఖద్వారంగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి మరమ్మతు పనులు చేసేందుకు గత నెల 13వ తేదీ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేశారు. మే 12వ తేదీలోపు పనులు పూర్తి చేసి యథావిధిగా బ్రిడ్జిలో రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు అప్పుట్లో వెల్ల డించారు. అధికారులు ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ప్రస్తుతం బ్రిడ్జి మరమ్మతు పను లు చివరి దశలో ఉన్నాయి. రెండు రోజుల్లో పనులు పూర్తి చేసి రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మరో అండర్ బ్రిడ్జ్ ద్వారా స్థానికులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రహదారిలో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా బ్రిడ్జి మరమ్మతు పనులను పూర్తి చేసి వాహనచోదకుల ఇక్కట్లు తొలగించాలని కోరుతున్నారు. ముక్కంటి సేవలో కర్ణాటక హైకోర్టు జడ్జి శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని మంగళవారం కర్ణాటక హైకో ర్టు జడ్జి శ్రీషానంద కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయాధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వామి అమ్మవార్ల జ్ఞాపిక అందజేశారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలా..!
●కేంద్రమంత్రి రాజీనామా చేయాలి ఇంటర్ రెండేళ్లు పుస్తకాల పురుగులుగా మారి శ్రమించి నీట్ రాసిన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏని రద్దు చేయాలి. పేపర్ను లీక్ చేసి, రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నీట్ లీకేజ్కి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ఉద్యమిస్తాం. – చిన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు, తిరుపతి ఎన్టీఏని రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను ఆట వస్తువులుగా చేసి చెలగాటమాడుతోంది. నీట్ పేపర్ లీక్ చేసి, రూ.కోట్లు దండుకుంటున్న ఎన్టీఏ అధికారులు, కేంద్ర విద్యామంత్రిత్వశాఖ పూర్తి బాధ్యత వహించాలి. తక్షణం ఎన్టీఏని రద్దు చేయాలి. రూ.లక్షలు వెచ్చించి కొన్ని ఏళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం దారుణం. – అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, తిరుపతి విద్యావ్యవస్థ నిర్వీర్యం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి.నీట్ పేపర్ లీక్ కు కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ప్రతిష్టాత్మక నీట్ను సక్రమంగా నిర్వహించలేని దు స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉండడం బాధాకరం. పరీ క్ష రద్దు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. తక్షణం ఎన్టీఏని రద్దు చేయాలి. – ప్రేమ్ కుమార్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఎస్వీయూ తిరుపతి సిటీ: దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు. గత మూడేళ్లుగా యూజీ నీట్ పరీక్ష వివాదాస్పదంగా మారుతున్నా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. మే 3వ తేదీన జరిగిన నీట్ దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది రాశారని, వారి జీవితాలతో ఎన్టీఏ ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా పేపర్ లీక్ చేస్తూ అవినీతి ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తిరుపతి జిల్లాలో ఈ ఏడాది 4,542 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో సుమారు 60 శాతం మంది విద్యార్థులు సుదూర ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకుని పరీక్ష కాస్త మెరుగుగా రాశారని, కానీ పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట్ రాసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు పరీక్ష రద్దుపై ఏమన్నారంటే.. ఏటా ఇదే తంతు మా అబ్బాయి రెండేళ్లుగా విజయవాడలో నీట్కు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. గత ఏడాది 5 మార్కుల తేడాతో సీటు దగ్గరకు వచ్చి చేజారింది. ఈ ఏడాది 590 వరకు వస్తాయని నమ్మకంతో ఉన్నాం. కానీ పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దు కావడం మానసికంగా కుంగిపోతున్నాం. మళ్లీ పరీక్ష రాయాలంటే పేపర్ ఎలా వస్తుందో భయంగా ఉంది. ప్రతి ఏడాది పేపర్ లీక్ తంతు కొనసాగుతోంది. – సుశీలమ్మ, నీట్ విద్యార్థి తల్లి, తిరుపతి విద్యార్థులపై మానసిక ఒత్తిడి నీట్ రద్దు దారుణం. ఎన్టీఏ పరీక్షను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైంది. మా అమ్మాయి ఈ ఏడాది నీట్ రాసింది. ఏడాది కోచింగ్కు రూ.4 లక్షలు వెచ్చించాం. మాకు రిజర్వేషన్ ఉంది. మంచి మార్కులతో సీటు వస్తుందని ధైర్యంగా ఉన్నాం. కానీ పరీక్ష రద్దుతో ప్రతి విద్యార్థీ మానసిక ఒత్తిడికి గురయ్యారు. – ప్రభాకర్రెడ్డి, నీట్ విద్యార్థి తండ్రి, తిరుపతి రూరల్ ఆశలన్నీ అడియాశలయ్యాయి ఈ ఏడాది నీట్ బాగా రాశా. రూ.లక్షలు వెచ్చించి హైదరాబాద్లో పేరొందిన కోచింగ్ సెంటర్లో లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నా. కానీ లీకేజ్ పేరుతో నీట్ రద్దు చేశారు. 585కు పైగా మార్కులు వస్తాయని సంతోషంగా ఉన్నా. ఆశలన్నీ అడియాశలయ్యాయి. మళ్లీ పరీక్ష రాయలంటే అన్ని మార్కులు సాధిస్తాననే నమ్మకం లేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దారుణం. – శ్రీలత, నీట్ విద్యార్థిని, తిరుపతి మళ్లీ రాయాలంటే భయంగా ఉంది మే 3వ తేదీ జరిగిన నీట్ బాగా రాశాను. పేపర్ లీక్ కావడంతో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో మళ్లీ పరీక్ష రాయాలంటే భయమేస్తోంది. పరీక్ష పేపర్ ఎలా వస్తుందోనని మనసులో భయంగా ఉంది. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నా. మళ్లీ ప్రిపరేషన్ ప్రారంభించాల్సిన పరిస్థితి. – శివ శంకర్, నీట్ విద్యార్థి, రేణిగుంట వైద్యవిద్యలో ప్రవేశం ప్రస్తుత తరుణంలో ఆషామాషీ కాదు.. అయినప్పటికీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లక్షలాది మంది సిద్ధమయ్యారు. తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలన్న ఆకాంక్షతో తల్లిదండ్రులు తమ తహతకు మించి రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ ఇప్పించారు. తమ బిడ్డలను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో విద్యార్థులు ‘నీట్’గా పరీక్ష రాశారు. అయితే కేంద్ర విద్యాశాఖ, ఎన్టీఏ నిర్లక్ష్యంతో పేపర్ లీక్.. ఫలితంగా లక్షలాది విద్యార్థులు షాక్కు గురయ్యారు. విద్యార్థుల జీవితాలతో ఆటలా? అని నిలదీస్తున్నారు.బిగ్ బాంబ్ -
పోటెత్తిన జనం
గంగ రంగ వైభవం..వైభవంగా గంగమ్మ జాతర సంబరాలు తాతయ్యగుంట గంగమ్మ విశ్వరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తిరునగరిలో గంగమ్మజాతర వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆలయ ఆవరణలోని కొడిస్తంభానికి బంకమట్టితో గంగమ్మ విశ్వరూప ప్రతిమను తీర్చిదిద్దే పనిలో పలు సామా జిక వర్గాల వారు నిమగ్నమయ్యారు. ఆ రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి వేచి ఉన్నారు. దీంతో గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీతిరుపతి కల్చరల్: శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర తిరుపతిలో వైభవంగా జరిగింది. ఈ నెల 5వ తేదీ రాత్రి చాటింపుతో మొదలైన జాతర వారం రోజుల పాటు అత్యంత కోలాహలంగా సాగింది. రోజువారీ విభిన్న వేషాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం జాతర చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో గంగమ్మ ఆలయం కిక్కిరిసింది. సోమవారం అర్ధరాత్రి అమ్మవారికి మహాశాంతి అభిషేకం తర్వాత అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో పొర్లుండాలతో ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుబడిలో భాగంగా వేపాకు చీరలతో గంగమ్మను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. జాతర చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు విశేష సంఖ్యలో భక్తులు వివిధ పౌరాణిక, జానపద, సీ్త్ర వేషాలు ధరించి తిరుపతి వీధుల్లో కేరింతలతో విహరిస్తూ సందడి చేశారు. డప్పుల దరువుల నడుమ చిందులు వేస్తూ గంగమ్మ ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించారు. భక్తజనంతో గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. గంగమ్మ దర్శనంలో భాగంగా ఆలయాధికారులు, పోలీసులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. జాతరను పురస్కరించుకుని గంగమ్మ ఆలయం వద్ద భక్తులు మజ్జిగ, అంబళ్లు పంపిణీ చేశారు. వివిధ వేషధారణలో భక్తులుబారులు తీరిన భక్తులు తాతయ్యగుంట గంగమ్మ జాతరలో చివరి రోజు మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమ్మవారు విశ్వరూపం దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంభం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంకమట్టితో సర్వాంగసుందరంగా అమ్మవారి విశ్వరూప ప్రతిమ కొలువు తీర్చే పనిలో పలువురు నిమగ్నమయ్యారు. అమ్మవారి విశ్వరూప ప్రతిమ తయారీలో కుమ్మరి, కంసాలి, విశ్వబ్రాహ్మణ, చాకలి, దళితులు తదితర సామాజిక వర్గాలవారు భక్తిప్రపత్తులతో అమ్మవారి విశ్వరూపాన్ని కొలువు తీర్చుతారు. అమ్మవారి విశ్వరూప ప్రతిమ చంపను పేరంటాల వేషధారుడు నరకడంతో జాతర సమాప్తం అవుతుంది. -
ఆకు రౌడీల ముసుగులో ఆక్రమణలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: నిజాయితీ వార్తలు రాసే సీనియర్ జర్నలిస్టులకే నిలువ నీడలేదు.. జర్నలిస్టుల ముసుగులో ఆకు రౌడీలు స్థలాలు ఆక్రమిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్, రాష్ట్ర మున్సిపల్ విభాగం ఉపాధ్యక్షులు రామస్వామి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నగరంలో ఆ పార్టీ శ్రేణులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారన్నారు. నగరంలోని ఎర్రమిట్టలో రూ.కోట్లు విలువైన భూమిని ఆక్రమించుకునేందుకు.. టీడీపీ నాయకులు జర్నలిస్టుల పరిరక్షకులం అన్న పేరుతో వాళ్ల ఆకతాయి సైన్యం అంతా ఆక్రమణలకు తెగబడ్డారన్నారు. ఎక్కడ ఆక్రమించాలో అక్కడ వీళ్లు వాలిపోయి ఓనరుల్లాగా చెలామణి అవుతారని మండిపడ్డారు. మొన్న జరిగిన ఘటనలో ఆ స్థల యజమానులపై ఎన్ని రకాలైన బీభత్స కార్యక్రమాలు చేయాలో అన్ని రకాలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల తీరుని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఎవరు నిజమైన జర్నలిస్టులో.. జర్నలిస్టు ముసుగేసుకుని ఎవరు నాటకాలాడుతున్నారో అందరికీ తెలుసనన్నారు. 30 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో అత్యంత నీతి నిజాయితీలతో వార్తలు రాసే వారు నిలువ నీడలేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకు రౌడీల అండతో పేట్రేగిపోతున్న వారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
గడువులోపు భూసేకరణ పూర్తి చేయాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: భూ సేకరణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ మిని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావుతో కలసి భూ సంబంధిత పెండింగ్ పనుల పురోగతిపై పర్చువల్గా రెవెన్యూతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానెల్లూరు, పాగలి, ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులు కూడా త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. వెబ్ ల్యాండ్పై ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, వైజాగ్– చైన్నె కారిడార్ పైపు లైను పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరు పేట ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, అనురాధ, రోజ్ మాండ్, ల్యాండ్ అండ్ సర్వే రికార్డు లు అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, ఏపీఐఐసీ తిరుపతి, నెల్లూరు జోనల్ మేనేజర్లు విజయ్ భరత్రెడ్డి, ఎల్. శివకుమార్, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్, తహసీల్దార్లు, డీటీలు, సెక్షన్ ఆధికారులు భాస్కర్, చంద్రశేఖర్, భార్గవి, శివప్రసాద్ పాల్గొన్నారు. -
గంగమ్మ దర్శనం ఆనందదాయకం
తిరుపతి కల్చరల్: తాతయ్య గుంట గంగమ్మను మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు శాస్త్రోక్తంగా పూజలు చేసి, మ్మవారి హారతి, తీర్థప్రసాదాలు జిల్లా కలెక్టర్కు అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం కలెక్టర్ ఆలయం వద్ద ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ను మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ శారదాదేవి, గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు మంచి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఏటా మున్సిపల్ కార్పొరేషన్, తుడా, టీటీడీ వారి సహకారంతో తిరుపతిలో గంగమ్మ జాతరను జరుపుకుంటున్నారన్నారు. జాతర ఏర్పాట్లపై నెల రోజుల నుంచి జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులతో సమీక్ష చేశామన్నారు. జాతర సందర్భంగా ప్రత్యేక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బందోబస్తు, కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండ తీవ్రత నేపథ్యంలో భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ తదితర సదుపాయాలను దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేశారని తెలిపారు. గంగమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఏ.జయకుమార్, దేవదాయ శాఖాధికారులు రామకృష్ణారెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు. -
గంగజాతర ఇంగ్లిషు గ్రంథం ఆవిష్కరణ
తిరుపతి కల్చరల్: సున్నపు కుండలు వేషంలో పెద్ద గంగమ్మ, చిన్నగంగమ్మలైన అక్కాచెల్లెళ్లు తిరుపతి ప్రజల కు కై కాల వారు వేసే ఈ వేషాల్లో దర్శనమిస్తారు. ఈ మేరకు మంగళవారం గంగమ్మల వేషధారణలో ఉన్న కై కాల వారు ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి ఇంగ్లిషులో రచించిన ‘ది ఫోక్ ఫెస్టివల్ ఆఫ్ గంగ జాతర ఇన్ తిరుపతి’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగమ్మలు ఆవహించిన కై కాల వారు మాట్లాడుతూ పేటశ్రీ 30 ఏళ్లకు ముందే తెలుగులో ‘తిరుపతి గంగజాతర ’ అనే పుస్తకాన్ని రెండు ఎడిషన్లు ప్రచురించారని, ద్రావిడ విశ్వవిద్యాలయం వారు ఇంగ్లిషులో ఆయన రాసిన 120 పేజీల పుస్తకాలను కూడా ప్రచురించి తిరుపతి గంగమ్మలకు ఎంతో సేవ చేశారన్నారు. ఆచార్య పేటశ్రీ మాట్లాడుతూ తాను తిరుపతిలో పుట్టి పెరిగానని, మన గంగమ్మ జాతరను ప్రపంచానికి తెలిజేసే ప్రయత్నం చేశానని తెలిపారు. ప్రస్తుతం తాను రచించిన ఈ ఇంగ్లిషు గ్రంథంలో వందేళ్లకు ముందు జాతర ఎలా ఉందో?, ఇప్పుడు ఎలా ఉందో? కొత్తగా రాసిన అధ్యాయంలో వివరించానన్నారు. భవిషత్తులో తమిళ, కన్నడ భాషల్లో కూడా ‘ తిరుపతి గంగజాతర ’ పుస్తకాన్ని ఆ గంగమ్మ తల్లి చలువతో వెలువరిస్తానని చెప్పారు. గంగమ్మల చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. -
గోడ దూకి గోవా వెళ్లాడు!
చంద్రగిరి: పరీక్షలు సరిగ్గా రాయలేదనే కారణంగా భయపడి ఎవరికీ చెప్పకుండా గోడ దూకి పారిపోయిన విద్యార్థి ఆచూకీని తిరుచానూరు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గోవాలోని వాస్కోలో బాలుడిని పోలీసులు సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గీతం జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువున్న జస్వంత్ రెడ్డి మార్చి 12వ తేదీన ఎవరికీ చెప్పకుండా కళాశాల నుంచి వెళ్లిపోయాడు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఈ విషయమై తిరుచానూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాల గాలింపు, సాంకేతిక ఆధారాలతో జస్వంత్ రెడ్డి గోవాలోని వాస్కో ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసు బృందం మంగళవారం వాస్కోకు చేరుకుని, అక్కడి పోలీసుల సహకారంతో బాలుడిని సురిక్షతంగా అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని విచారించగా ఇంటర్ ఫైనల్ పరీక్షలు సరిగ్గా రాయకపోవడంతో భయపడి ఎవరికీ చెప్పకుండా వచ్చేసినట్లు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం బాలుడిని పోలీసులు తిరుచానూరుకు తీసుకొచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ విద్యార్థులపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు వారి మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారిని ప్రోత్సహించాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో లేదా ఉపాధ్యాయులతో మాట్లాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. -
ఎవరూ లేని ఇళ్లే అతని టార్గెట్..!
● రాత్రుల్లో చోరీకి పాల్పడే దొంగను అరెస్టు చేసిన తిరుచానూరు పోలీసులు ● రూ.8లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం ● వివరాలను వెల్లడించిన సీఐ సునీల్ కుమార్ దొంగ అరెస్టు చంద్రగిరి: తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీల కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సునీల్ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తిరుపతి జీవకోన, నవజీవన కాలనీలో ఉంటున్న వరదరాజుల మణి జల్సాలకు అలవాటు పడి ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో మార్చి 27వ తేదీన మంగళం తుడా క్వార్టర్స్లోని ప్లాట్ నంబర్ 51లో కాపురమున్న వెంకటేష్ బంధువుల ఇంట్లో శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. ఈ విషయం గుర్తించిన వరదరాజుల మణి 29వ తేదీన పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి బీరులోని ఉంచి 57 గ్రాముల బంగారు ఆభరణాలు, 512 గ్రాముల వెండి ఆభరణాలను దోచుకెళ్లాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తుల కదలికల గురించి విచారణ చేపట్టడంతో పాటు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళం సమీపంలోని ఆశ కల్యాణ మండపం సమీపంలో వరదరాజుల మణిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించడంతో సుమారు 3 ఇళ్లలో చోరికి పాల్పడినట్లుగా తేలింది. గత ఏడాది నవంబర్లో జైలు నుంచి బెయిల్పై వచ్చిన మణి తిరిగి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అలిపిరి, తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో 3 ఇళ్లలో చోరీలు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై తిరుచానూరు, అలిపిరి, సీసీఎస్, తిరుపతి రూరల్ పోలీసు స్టేషన్లలో 19 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామన్నారు. చోరీ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ సునీల్ కుమార్, ఎస్లు, క్రైం సిబ్బంది ప్రభాకర్, ప్రసాద్, షఫీలను ఎస్పీ అభినందించి వారికి నగదు రివార్డులను అందజేశారు. -
ప్రశాంతంగా ఈఏపీసెట్
తిరుపతి సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2026 (ఎంసెట్) జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. తిరుపతి రేణిగుంట రోడ్డులోని చదలవాడ ఇంజినీరింగ్ కళాశాల, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల, అన్నమయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్, పుత్తూరు శ్రీవెంకటేశ పెరుమాల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని 5 పరీక్ష కేంద్రాల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్కు జరిగిన తొలిరోజు పరీక్షకు 96.50 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12గంటల వరకు నిర్వహించిన తొలి సెషన్లో 616 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 592 మంది పరీక్ష రాశారన్నారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 1,331 మందికి గాను 1,287 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. రెండో రోజు బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల్లో మరో 1,450 మంది వరకు పరీక్షకు హాజరవుతారని వెల్లడించారు. మృతదేహం కోసం నిరీక్షణ సైదాపురం: మనుబోలు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైదాపురం గ్రామానికి చెందిన కొత్తలూరు కళ్యాణ్(23) మృతదేహం కోసం బంధువులు మంగళవారం రాత్రి వరకు నిరీక్షించారు. పోస్టుమార్టం అలస్యం కావడంతో బుధవారం మృతదేహాన్ని అప్పగిస్తారనే సమాచారం అందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తిరుగుముఖం పట్టారు. మండలంలోని రాగనరామాపురం గ్రామానికి చెందిన కొత్తలూరు శేఖర్ పనులు చేసుకుని జీవించేవాడు. కొంత కాలం నుంచి రాగనరామాపురం నుంచి వచ్చి సైదాపురం ఎస్టీ కాలనీలో కాపురం ఉంటున్నారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్న కళ్యాణ్(23) డ్రైవర్గా పని చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో మనుబోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ మృతి చెందాడు. దీంతో కల్యాణ్ మృత దేహాన్ని పోస్టుమార్టానికి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా మంగళవారం రాత్రియినా మృతదేహం అప్పగించకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కళ్యాణ్ మృతదేహం కోసం నిరీక్షించారు. కాని మృతదేహం రాకపోవడంతో తిరుగుముఖం పట్టారు. బుధవారం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారని తెలిసింది. చిన్నవయస్సులోనే కళ్యాణ్ మృతి చెందడంతో ఆకుటుంబంలో పెను విషాదం నెలకొంది. -
టౌన్బ్యాంకుపై పచ్చపాతం
ఆ బ్యాంకుది శతాబ్ద చరిత్ర.. తిరునగరిలో ఎందరో ఉద్యోగులకు జీవనాధారం.. వేలాది మంది ఖాతాదారులకు ఆర్థికంగా అండ.. అయితే నేడు దానిపై ‘పచ్చ’పాతం. ఉద్దేశపూర్వకంగా బ్యాంకులో గోల.. అరుపులు.. దూషణలు.. వెరసి డిపాజిటర్లు, ఖాతాదారుల్లో ఆందోళన, భయం.. శతాబ్ద చరిత్ర ఎక్కడ దెబ్బతింటుందోనని ఆందోళన.. ఇదీ నేడు తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్ దుస్థితి. సాక్షి టాస్క్ఫోర్స్: 108 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగుల పేరుతో కొందరు వ్యక్తులు బ్యాంకు పరిపాలనను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు దిగారని షేర్ హోల్డర్లు, డిపాజిటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఎండీ చాంబర్లోకి అనుమతి లేకుండా దూసుకెళ్లిన కొందరు ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పాలకమండలిని అవమానించేలా అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారని సమాచారం. సాధారణంగా ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు రౌడీల్లా ప్రవర్తించడం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. బ్యాంకు హాలులో పెద్దఎత్తున గోల చేస్తూ ‘చేతకాని పాలకమండలి దిగిపోవాలి’ అంటూ అరుపులు, దూషణలతో హంగామా సృష్టించిన ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలిసింది. రూ.4 వేల జీతం కోసం పనిచేస్తున్నారా? బ్యాంకు డైరెక్టర్లు కేవలం రూ.4 వేల జీతం కోసం పనిచేస్తున్నారంటూ ఉద్యోగులే బహిరంగంగా దూషించారని షేర్ హోల్డర్లు మండిపడుతున్నారు. పరిపాలనపై విమర్శలు చేయడం వేరు కానీ, సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించడం వెనుక దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని వారు అంటున్నారు. ఉద్యోగం చేయకుండా జీతాలు? 46 రోజులుగా బ్యాంకు లోపల, బయట నిరసనల పేరుతో ఉద్యోగులు విధులను పక్కన బెట్టి ఆందోళనలు చేస్తున్నారని, అయినప్పటికీ రెండు నెలలుగా జీతాలు తీసుకుంటున్నారని పలువురు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. సాధారణ కస్టమర్లు సేవల కోసం బ్యాంకుకు వస్తే, గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. డిపాజిటర్లలో భయం బ్యాంకులో నిత్యం నిరసనల కారణంగా డిపాజిటర్లు కూడా వెనక్కి తగ్గే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కొనసాగితే బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుందని, ప్రజల నమ్మకం కోల్పోతుందని పలువురు షేర్ హోల్డర్లు ఆందోళన వ్యక్తం చేశారు.108 ఏళ్ల వారసత్వాన్ని కాపాడేదెవరు? స్వాతంత్య్రం రాక ముందే ప్రారంభమైన ఈ కో–ఆపరేటివ్ బ్యాంక్ వేలాది కుటుంబాలకు అండగా నిలిచింది. అలాంటి సంస్థను కొందరి రాజకీయ ఆశల కోసం బలి చేయాలని చూస్తున్నారని ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకును కాపాడాల్సిన ఉద్యోగులే బ్యాంకు ప్రతిష్టను వీధికీడ్చడం బాధాకరమని అంటున్నారు. రాజకీయ ప్రేరేపిత శక్తులు వెంటనే ఆగాలని డిపాజిటర్లు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్లో టీడీపీ దాష్టీకమా? టీడీపీ రాజకీయాల కోసం బ్యాంకు వేదిక? ఈ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు టీడీపీ నాయకుల ప్రోత్సాహంతోనే ఉద్యోగులు ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారని బ్యాంకు వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్యాంకు చైర్మన్ పదవిపై కన్నేసిన మాజీ చైర్మన్ వర్గమే ఈ ఉద్రిక్తతలకు తెరలేపిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొందరు ఉద్యోగులే బయట నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అనధికారికంగా చెప్పడం గమనార్హం. దీంతో బ్యాంకు పరిరక్షణ పేరుతో మొదలైన ఆందోళన ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపుగా మారిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
దొరవారిసత్రం: గుర్తు తెలియని సుమారు 35 ఏళ్లు వయస్సు కలిగిన ఓ వ్యక్తి రైలు నుంచి జారి పడిపోయిన మృతి చెందిన ఘటన పోలిరెడ్డిపాళెం రైల్వేస్టేషన్కు సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం వెలుగు చూసింది. స్థానిక రైల్వే గ్యాంగ్ సిబ్బంది, జీఆర్పీ పోలీసుల కథనం మేరకు.. చైన్నె వైపు వెళ్లే గుర్తుతెలియని రైలు నుంచి జారి పడిపోయి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు వద్ద ఎలాంటి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, జమునా మత్తూరు తాలూకాకు చెందిన పెరుమాళ్ గోపాల్కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తిరుపతి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (టాస్క్ఫోర్స్) 2019లో శేషాచలం, కరకంబాడి ఫారెస్ట్ బీట్, కృష్ణాపురం సెక్షన్, ఎస్వీఎన్పీ చామల రేంజ్ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. నిందితుడు గోపాల్ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా మార్చి తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో అతనికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిదొరవారిసత్రం: ప్రమాదశాత్తు ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో దాని కింద పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల, పోలీసుల కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాళెం ఎస్సీకాలనీ చెందిన కలింబాకం చెంగయ్య(29) ట్రాక్టర్లో నాయుడుపేటకు షామియానా, కుర్చీలు తీసుకువెళ్లి అక్కడ అన్లోడ్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో నెలబల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి జాతీయ రహదారి మధ్యలోని డివైడర్ను ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ను నడుపుతున్న చెంగయ్య ట్రాక్టర్ కిందనే పడి తీవ్ర గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు దొరవారిసత్రం: మండలంలో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని మంగళవారం పోలీసులు రక్షించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వేణుంబాకం గ్రామానికి చెందిన షేక్ సలాం(28)కు, అతని భార్యతో కొంత కాలంగా వివాదాలు తలెత్తాయి. దీంతో అతని భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటి రావాలని ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో సలాం మనస్తాపం చెందాడు. పంట పొలాలకు పిచికారి చేసే పురుగుల మందు, మద్యం సీసా తీసుకుని గ్రామానికి దూరంగా వెళ్లాడు. తొలుత ఎడమ చేయి కోసుకున్నాడు. తరువాత మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్యహత్యకు యత్నిస్తూ ఫొటోలను తీసుకుని చనిపోతున్నట్లు అతని బంధువులకు పంపాడు. అతను ఎక్కడ ఉన్నడో తెలియక సలాం పంపిన ఫొటోలను అతని బంధువులు దొరవారిసత్రం పోలీసులు పంపారు. అతని సెల్ఫోన్ లోకేషన్ను పోలీసులు గుర్తించారు. వెంటనే అతను ఉన్న స్థలానికి అంబులెన్స్ను తీసుకువెళ్లి అతనిని చికిత్స నిమిత్తం నాయుడుపేటలో ప్రైవేటు ఆస్పత్రి తరలించారు. సలాం ఆరోగ్యం పరిస్థితి కుదుట పడినట్లు పోలీసులు తెలిపారు. -
ఖేలో ఇండియా సంయుక్త కార్యదర్శి ఐసర్ సందర్శన
ఏర్పేడు:ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా సంయుక్త కార్యదర్శి వినీల్కృష్ణ మంగళవారం తిరుపతి ఐసర్ను సందర్శించారు. ఆయనకు ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతాను భట్టాచార్య, ఐసర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్సింగ్ కోహ్లీ జ్ఞాపిక అందజేసి, ఘనంగా సత్కరించారు. ఆయన పర్యటన సందర్భంగా ఐసర్ విద్యాసంస్థల్లో క్రీడలు, యువత సాధికారత, సంపూర్ణ అభివృద్ధి ప్రాముఖ్యతపై చర్చించారు. విద్యార్థుల్లో విద్య, పరిశోధన, ఫిట్నెస్, క్రీడా సంస్కృతిలో శ్రేష్టతను ప్రోత్సహించాలనే ఉమ్మడి దృక్పథాన్ని ఆయన పర్యటన ప్రతిబింబించిందని స్పష్టం చేశారు. -
రూ.10 కోట్లు విలువైన పార్క్ స్థలం కబ్జా..!
సాక్షి, టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గుడి, బడి, ప్రభుత్వ స్థలాలు.. ఇలా దేన్నీ వదలకుండా ఆక్రమించేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీకి కేటాయించిన రూ.10 కోట్ల విలువజేసే 1.57 ఎకరాల పార్క్ స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు ఆక్రమించి పట్టపగలే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్క్ స్థలం కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిస్తున్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకి సమీప బంధువునని చెబుతుండడం వల్ల సదరు ఎమ్మెల్యే స్పందించి నిర్మాణ పనులను నిలిపివేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పుదిపట్ల గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 558లో ఉన్న దరఖాస్తు పట్టా భూమిని గతంలో ఓ ప్రైవేట్ వెంచర్ సంస్థ అభివృద్ధి చేసి పార్క్కు కేటాయించినట్టు సమాచారం. ఆ స్థలంపై చాలాకాలం నుంచి కన్నేసిన స్థానిక టీడీపీ నేత ఇప్పుడు అధికార బలంతో స్వా«దీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు తిరుపతి కోర్టును ఆశ్రయించగా, అది పార్కు స్థలమేనని కోర్టు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా రికార్డులు మార్చి ఆక్రమణదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని, ఆ స్థలంపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తున్నందున కింది కోర్టు ఆదేశాలు ధిక్కరణ కింద చర్యలు కోరతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 55 అర్జీలు
తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 55 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెకేషన్ కోర్టు షెడ్యూల్ విడుదల తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యవసర సివిల్ కేసులు దాఖలు చేసుకోవడానికి ఏర్పాటైన వెకేషన్ కోర్టు ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ తేదీల్లో విధులు నిర్వహిస్తుందన్న షెడ్యూలను వెకేషన్ కోర్టు జడ్జి, మదనపల్లి రెండో అదనపు జిల్లా జడ్జి పీవీఎస్ సూర్యనారాయణమూర్తి సోమవారం విడుదల చేశారు. ఈనెల 13, 20 తేదీల్లో చిత్తూరులోనూ, ఈనెల 14, 25వ తేదీల్లో తిరుపతిలో, ఈనెల 12, 15, 19, 21, 26 తేదీలు మదనపల్లిలోను, ఈనెల 18వ తేదీ పీలేరులోనూ, ఈనెల 22వ తేదీ శ్రీకాళహస్తిలో విధులు నిర్వహించనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జడ్జి సూర్యనారాయణ మూర్తి వెకేషన్ కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు. ముగిసిన ఏపీపీజీసెట్ తిరుపతి సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్వీయూ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరిగిన ఏపీ పీజీసెట్–2026 సోమవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలో 23 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పీజీసెట్ ప్రశాంతంగా ముగిసిందని కన్వీనర్ ప్రొఫెసర్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మూడు సెషన్లలో 13 సబ్జెక్టులకు సంబంధించి ప్రవేశ పరీక్ష జరిగిందని, 88 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. నాలుగు రోజులుగా జరిగిన పరీక్షలకు 19,118 మంది హాజరు కావాల్సి ఉండగా 16,406 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. దీంతో పీజీసెట్–2026 పరీక్షకు మొత్తం 85.8 శాతం హాజరు నమోదైందని, ఫలితాలు ఈనెలాఖరులోపు వెల్లడించి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ముక్కంటి సేవలో హైకోర్టు జడ్జి శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని సోమవారం ఏపీహైకోర్టు జడ్జి కిరణ్మయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద బీకే వెంకటేశులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. స్థానిక న్యాయమూర్తి కృష్ణప్రియ పాల్గొన్నారు. ఎస్వీయూలో పదోన్నతులు తిరుపతి సిటీ: ఎస్వీయూలో నాన్టీచింగ్ ఉద్యోగులకు పదోన్నతులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం ముగ్గురు టెక్నికల్ ఉద్యోగులకు పదోన్నతి కల్పించారు. అలాగే బుధవారం మరో ఏడుగురు నాన్టీచింగ్ ఉద్యోగులకు వర్సిటీ అధికారులు పదోన్నతులు కల్పించనున్నట్లు సమాచారం. బి.మనోజ్ కుమార్ సింగ్కు సీనియర్ మెకానిక్ నుంచి ఫోర్మెన్గా పదోన్నతి లభించింది. ఆయనను నాన్టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్, సుబ్రమణ్యం, సభ్యులు ఘనంగా సన్మానించారు. భవిత సెంటర్ను సద్వినియోగం చేసుకోండి తిరుపతి కల్చరల్: బైరాగిపట్టెడలోని ఎంజీఎం హైస్కూల్ ఉన్న భవిత సెంటర్ను దివ్యాంగ పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సహిత విద్య సమన్వయకర్త చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ప్రత్యేక అవసరాలు ఉన్న బడి ఈడు పిల్లల కోసం ఐఈఆర్టీ బి.జ్ఞానమ్మ నెహ్రూ నగర్, చిన్నగుంట, కుమ్మరితోపు ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. ఆయన సర్వేను తనిఖీ చేశారు. -
ఎవరా 28 మంది?
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి అర్బన్ మండలం అక్కారంపల్లి రెవెన్యూ ఎర్రమిట్ట భూమిపై నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్టుల ముసుగులో రూ.కోట్లు విలువైన భూమి ఆక్రమణలో పాత్రదారులు, సూత్రదారుల్లో టీడీపీ, జనసేన, మరి కొందరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వివాదాస్పద భూమికి సంబంధించి మొత్తం 28 మందికి పట్టాలు సిద్ధం చేశారని జర్నలిస్టులు చెబుతున్న మాట. అందులో జర్నలిస్టుల ముసుగులో టీడీపీ, జనసేనకు చెందిన ముఖ్య నాయకులు బినామీ పేర్లతో పట్టాలు సిద్ధం చేసుకున్నారని చర్చ జరుగుతోంది. ఎర్రమిట్టలో ఆదివారం అంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అటువైపు తొంగి చూడకపోవటానికి కారణాల గురించి జర్నలిస్టులు ఆరా తీస్తున్నారు. తిరుపతి అర్బన్ మండలం అక్కారంపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 101/3లోని సుమారు ఎకరం భూమి విషయంలో సోమవారం తీవ్ర వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఓ జర్నలిస్ట్ సోమవారం రాత్రి చేసిన పోస్ట్పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 20 ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు సెంటు స్థలం కూడా లేదని, అటువంటి వారిని పక్కనపెట్టి టీడీపీ, జనసేనకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఏమిటని సీనియర్లంతా సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఎర్రమిట్టలోని విలువైన భూమి విషయంలో అధికారుల సహకారంతోనే ఆక్రమణకు యత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 28 మందిలో టీడీపీ, జనసేనకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు కొందరికి ఇచ్చి.. మిగిలిన స్థలాన్ని పార్టీ నాయకులు నివాసాలు నిర్మించుకునేందుకు పథకం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భూ వివాదం అమరావతికి చేరినట్లు సమాచారం. జిల్లా అధికారులు కూడా పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఏడాది కాలంగా రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. రూ.కోట్లు విలువ చేసే భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రమిట్టలో జరుగుతున్న దౌర్జన్యంపై స్థానికులు ఫొటోలు, వీడియోలు తీస్తుంటే రౌడీలు గుంపుగా వచ్చి బెదిరిస్తున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. దౌర్జన్యంగా ఇళ్లు కూల్చేస్తున్నా పోలీసులు ఎక్కడికి వెళ్లారో అర్థం కావడం లేదు. టీడీపీ నాయకులు చెబితేనే రక్షణ కల్పిస్తారా? భూములు కోల్పోయిన పేదల పక్షాన వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం చేయటం కోసం పోరాటం చేస్తాం. – భూమన అభినయరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త. -
● బరితెగిస్తున్న భూ మాఫియా ● నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోట్లు విలువైన స్థలాల కబ్జా ● అడ్డుపడుతున్న ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ● నిర్లక్ష్యధోరణిలో అధికార యంత్రాంగం
సాక్షి టాస్క్పోర్స్: వెంకటగిరిలో భూ మాఫియా బరితెగిస్తోంది. పట్టణ నడిబొడ్డున ఉన్న రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు భూ ఆక్రమణదారులు పావులు కదుపుతున్నారు. కొందరు అధికారులతో కుమ్మకై ఏకంగా దశాబ్దాల క్రితం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, క్రీడా ప్రాంగణాలు సైతం వదలడంలేదు. సుమారు 20 ఎకరాలు విలువైన భూమిని కాజేసేందుకు పాలువులు కదుపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు సైతం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పడి భూ ఆక్రమణలు జరగకుండా అడ్డుపడుతోంది. ఈ భూ వ్యవహారంపై గతంలో వెంకటగిరి తహసీల్దార్, శ్రీకాళహస్తి ఆర్డీఓ, తిరుపతి జిల్లా కలెక్టర్కు వేర్వేరు రూపాల్లో వినతి పత్రాలు సైతం సమర్పించారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఏ మాత్రం స్పందన రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఏస్లో స్థానిక ఎమ్మెల్యేకు సైతం వినతి పత్రం సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్లముందే రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని నడిబొడ్డులో ఉన్న మున్సిపల్ కార్యాలయం ఎదురుగా 1965వ సంవత్సరానికి పూర్వం సర్వే నంబర్ 199–3, 199–4,199–5,200–2లో తాలుకా సమితి కార్యాలయం కోసం ప్రభుత్వం 6.61 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో వసతి గృహానికి 3 ఎకరాలు పోను మిగిలిన 3 ఎకరాలను షేక్ అబ్దుల్ కరీం సాహెబ్, వెంకట సుబ్బయ్యల వారసులమంటూ దొంగ రికార్డులను సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు పలు వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 1974లో వెంకటగిరి రాజా నుంచి 18 ఎకరాలను ఆనాటి విశ్వోదయ కళాశాల యాజమాన్యం కొనుగోలు చేసినట్లు పలువురు పట్టణ వాసులు చెబుతున్నారు. ఇందులోనే భవనాలు కూడా నిర్మించారు. 1968వ సంవత్సరం నుంచి 2015వ సంవత్సరం వరకు ఆ భవనాలు, స్థలాన్ని విశ్వోదయ కళాశాల హాస్టల్ నిర్వహణకు ఉపయోగించారు. అయితే తాజాగా రెవెన్యూ శాఖలో లూప్లైన్స్ తెలుకుని అబ్దుల్ కరీం, వెంకటేశ్వరయ్య అనే పాత యజమానుల పేర్లతో ఆధారం చేసుకుని ఆ స్థలానికి సంబంధం లేని వ్య క్తులను వారసులుగా తెరపైకి తీసుకొస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఖాళీగా ఉన్న ఆ స్థలంలో గతంలో పనిచేసిన తహసీల్దార్ని ప్రలోభాలకు గురి చేసి నివాసాలు ఏర్పాటు చేసినట్లు అడంగల్లో తప్పు డు నివేదికను తయారు చేసినట్లు సమచారం. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ల్లో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువ చేస్తుందని పలువురు పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అమ్మవారిపేట చెరువు సర్వే నంబర్ 215 సర్వే నంబర్లోని 36 ఎకరాలు ఉండగా పదుల సంఖ్యలో చెరువు ఆక్రమణలకు గురైపోయింది. ఆ స్థలాల్లో భవనాలు సైతం నిర్మాణాలు చేపడినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ వారసులను సృష్టించి కబ్జాకు యత్నం -
21న జీఎస్ఎల్వీ ఎఫ్17 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 21న సాయంత్రం 3.15 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్17 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. అనివార్య కారణాలతో ప్రయోగం వాయిదా పడితే జూన్ 10వ తేదీన చేసే అవకాశం ఉంది. ఈ ప్రయోగం ద్వారా 1,117 కిలోలు బరువు కలిగిన ఈఓఎస్–05 (జీఐశాట్–1ఏ) అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. వరుసగా రెండు పీఎస్ఎల్వీ పరాజయాల తరువాత చేయబోయే ప్రయోగం అయినందున ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది సగం గడిచిపోయినప్పటికీ జనవరి నెలలో చేసిన పీఎస్ఎల్వీ సీ62 పరాజయం ఇస్రో శాస్త్రవేత్తలను కొంత ఆత్మరక్షణలో పడేసింది. అందుకే జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే జీఎస్ఎల్వీ ఎఫ్17 రాకెట్ శిఖరభాగాన అంటే క్రయోజనిక్ దశపై ఉపగ్రహాన్ని అమర్చే విషయంలో కొంత సాంకేతికలోపం తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాంకేతిక లోపాలన్నింటిని సవరించుకుని ఈనెల 21న లేదా జూన్ 10న ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపగ్రహంతో ఉపయోగాలు జీఎస్ఎల్వీ ఎఫ్17 రాకెట్ ద్వారా రోదశీలోకి పంపబోయే ఈఓఎస్–05 (జీఐశాట్–1ఏ) ఉపగ్రహం పూర్తిగా భూ పరిశీలన ఉపగ్రహం కావడం విశేషం. అయితే భూ పరిశీలనలో ఈఓఎస్–05 ఉపగ్రహం సెకెండ్ జనరేషన్ శాటిలైట్ కావడం విశేషం. ఈ ఉపగ్రహంలో మల్టీ స్పెక్ట్రల్, హైపర్ స్పెక్ట్రల్ బ్యాండ్స్ అనే రెండు రకాల బ్యాండ్స్ను అమర్చి పంపుతున్నారు. ఈ బ్యాండ్లలోలున్న ఉపకరణాలను ఉపయోగించి ఆకాశంలో మేఘాలు లేని పరిస్థితుల్లో, దేశంలోని విశాలమైన ప్రాంతాలను నిజమైన సమయ ఛాయాచిత్రాలను తరచుగా అందిస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఎంచుకున్న క్షేత్ర చిత్రాన్ని ప్రతి 30 నిమిషాలకు 42 మీటర్ల స్పేషియల్ రిజల్యూషన్తో భారత భూభాగాన్ని మొత్తంగా ఛాయాచిత్రాలను అందిస్తుంది. ఇది దేశంలోని వ్యవసాయం, భూమి, సముద్రాల మీద అధ్యయనం చేయడంతో పాటు దేశ రక్షణకు కూడా ఉపయోగపడనుంది. -
జూనియర్ జడ్జిల బదిలీలు
తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ సివిల్ జడ్జిలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కొంతమంది జూనియర్ సివిల్ జడ్జిలకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న ఎం.మాధవిని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎకై ్సజ్ న్యాయమూర్తిగా, చిత్తూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి షేక్ బాబాజాన్ను కడప జిల్లా మైదుకూరు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, పుత్తూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సి.జానకిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేసినట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే శ్రీకాళహస్తి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణప్రియను ప్రకాశం జిల్లా ఒంగోలు ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తిగా, తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ ఉమర్ ఫరూక్ను కడప జిల్లా జమ్మలమడుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి సీకేవీ సత్య కాంత్ కుమార్ను నెల్లూరు జిల్లా ఉదయగిరి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి. కోటేశ్వరరావును కడప ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా, తిరుపతి మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఎం సంధ్యారాణిని కర్నూలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. కాగా తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ను గుంటూరు జిల్లా తెనాలి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ శ్రీకాంత్ను కృష్ణాజిల్లా విజయవాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే గుంటూరు ప్రత్యేక రైల్వే కోర్టు జడ్జిగా ఉన్న పి. రమాదేవిని తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, కృష్ణాజిల్లా, విజయవాడ ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న జి. లెనిన్ బాబును తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న పి. పరేష్ కుమార్ను చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జడ్జి రమాదేవి తిరుపతి మూడో, ఐదో, రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా జీ లెనిన్ బాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుపతి రెండు, నాలుగు, చిత్తూరు ఎకై ్సజ్ కోర్టుల ఇన్చార్జి న్యాయమూర్తిగా వ్యవహరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 18వ తేదీ లోపు బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
‘యువికా–2026’ ప్రారంభం
సూళ్లూరుపేట: దేశంలోని యువతను ఇస్రోలో యువశాస్త్రవేత్తలుగా తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఏటా నిర్వహిస్తున్న యువత ప్రోగ్రామ్ యువికా–2026 కార్యక్రమాన్ని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి చైర్మన్ డాక్టర్ కే నారాయణన్ వర్చువల్ పద్ధతిలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. సోమ వారం నుంచి ఈనెల 22 వరకు ఇస్రోలోని సతీష్ధవన్ స్పేస్ సెంటర్తో సహా ఏడు కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా షార్లోని బ్రహ్మ ప్రకాష్హాలులో ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల నుద్దేశించి షార్ శాస్త్రవేత్తలు ప్రసంగించారు. షార్లో జరుగనున్న యువికా–2026 కార్యక్రమంలో 57 మంది విద్యార్థులు పాల్గొంటుండగా ఇందులో 30 మంది బాలురు, 27 మంది బాలికలను ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 మంది, మధ్యప్రదేశ్ నుంచి 14, చత్తీష్గడ్ నుంచి 14, ఒడిశా నుంచి 14 మంది పదిరోజుల పాటు షార్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పది రోజుల పాటు సీనియర్ శాస్త్రవేత్తల ఉపన్యాసాలు, షార్లోని వివిధ విభాగాలను సందర్శించడం, చిన్న రాకెట్ నమూనాలు, రోవర్ కిట్ల రూపకల్పన, నక్షత్రాలను వీక్షించడం, యోగా కార్యక్రమాలను కూడా పొందపరిచి నిర్వహించనున్నారు. ఈనెల 22న నిర్వహించబోయే ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు జ్ఞాపికలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చి యువికా కార్యక్రమాన్ని ముగిస్తారు. సోమవారం నాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కే నారాయణన్ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ దేశంలో యువత ఎక్కువ ఉందని, ఇందులో బాగా చదువుకుని ఇస్రోలోకి భావి శాస్త్రవేత్తలుగా రావాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలు అందించాలని తద్వారా గౌరవాన్ని పొందుతారన్నారు. భవిష్యత్తులో ఇస్రో నుంచి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా గగన్యాన్ ప్రాజెక్ట్ను చేపట్టామని మరీ చెప్పారు. ఈకార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్, కంట్రోలర్ రమేష్బాబు, ఎంఎస్ఎం గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ పాల్గొన్నారు. -
ఘనంగా సోమనాథ్ స్వాభిమాన పర్వం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వం జరిగింది. సోమనాథస్వామి ఆలయం పునర్నిర్మాణం చేసి 75 ఏళ్లు కావడంతో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అఖండ విశ్వాసం పేరుతో ముక్కంటి ఆలయంలో ఉత్సవం నిర్వహించారు. ఆలయంలో ఉదయం సోమనాథేశ్వరస్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథ సంకల్పం, సోమనాథ గీతాలాపన చేశారు. భక్తులకు ప్రసాద వితరణ, కళాకారుల భజన, కోలాటాలు, శివసేవకులు ఓం జెండాల ప్రదర్శన, మేళ తాళాల నడుమ సోమనాథేశ్వరస్వామి చిత్రపటంతో శోభాయాత్ర తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, హేమావతి పాల్గొన్నారు. -
టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
వరదయ్యపాళెం: రాష్ట్రంలో రోజురోజుకు మితిమీరుతున్న టీడీపీ నాయకుల ఆగడాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తెలిపారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకులు దశరథరామిరెడ్డిని ఆయన పరామర్శించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నూకతోటి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు రోజువారీ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి అఘాయిత్యాలను నియంత్రించాల్సిన పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. నీచ సంస్కృతిని వీడనాడి రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, నాయకులు భానుప్రకాష్ రెడ్డి, కోడూరు బాబురెడ్డిలు ఉన్నారు. -
నవోదయలో విశ్వం ఉత్తమ ఫలితాలు
తిరుపతి అర్బన్: జాతీయ స్థాయిలో 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదల చేసిన 11వ తరగతి ప్రవేశ పరీక్షలో విశ్వం విద్యార్థులు శ్రావ్య, రిచిత, ప్రవీణ్, గగన్ హర్ష, గణేశ్, హర్ష, హర్షిత, తనుష, కావ్య, అస్మా, లిఖిత, వరుణ్ సందేశ్, చరితార్థ, ప్రీతం, తేజస్వి, శ్రీదేవి తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను తిరుపతిలోని తమ విద్యాసంస్థలో సోమవారం విశ్వం విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్ రెడ్డి, సాయిగణేష్ స్కూల్ కరస్పాండెంట్ చెంచురెడ్డి అభినందించారు. అలాగే 6వ, 9వ తరగతి ప్రవేశ పరీక్షల్లో కే. గీతిక, సి.కార్తీక్, శ్రీహాన్రెడ్డి, పి.నిశాంత్, సి.హేమతేజ, హెచ్ అనన్య, ఎం.భావదీష్, ఆర్.నికోలస్ ఫ్రాంక్లిన్, కే.సిద్ధార్థ, బి.సాయి అభిరామ్, బి.హనీశ్రీ, ఎస్.ఎం.ఇలియాస్, కే. సాయికృష్ణ, లిఖిత, జోషిక తదితరులతో పాటు మొత్తం 56 మంది విశ్వం విద్యార్థులు నవోదయ విద్యాలయాలకు ఎంపికై నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్. విశ్వనాథ రెడ్డి తెలిపారు. గత 36 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్ స్కూల్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ పోటీ పరీక్షలకు విశ్వం విద్యా సంస్థలు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నవోదయ, సైనిక్, ఇతర రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షల శిక్షణ వివరాల కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
చదువుకుంటాం.. అవకాశం కల్పించండి సార్
తిరుపతి అర్బన్: చదువుకుంటాం.. తమకు గురుకులంలో సీటు ఇప్పించి అవకాశం కల్పించండి సారూ.. అని పేద విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కోరారు. సోమవారం కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డీఆర్వో నరసింహుల ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్లో 348 అర్జీలు వచ్చాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, భరత్ నాయక్, రోజ్మాండ్, అనురాధ పాల్గొన్నారు. తమ కుమార్తె మాధురి గురుకులం స్కూల్లో చదువుకోవాలని అంటోంది.. మాకు అవకాశం కల్పించండి ప్లీస్ అంటూ శ్రీకాళహస్తి మండలంలోని చల్లపాళెం అరుంథతి వాడకు చెందిన దివ్యాంగులు మందా సుబ్రమణ్యం, మహాలక్ష్మి దంపతులు కోరారు. అలాగే తమ బిడ్డ కామేశ్వరికీ బిరడవాడ సాంఘిక సంక్షేమం శాఖకు చెందిన గురుకుల కళాశాలలో ఎంపీసీ సీటు ఇప్పించాలని నాయుడుపేట మండలం అన్నమేడు ఎస్సీ కాలనీకి ఎం. కామేశ్వరి కోరారు. డేటా ఎంట్రీ కరెక్షన్ కోసం తిరుపతి అర్బన్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ రెండు నెలలుగా తిరుగుతూనే ఉన్నా, ఉద్యోగులు పట్టించుకోవడం లేదని తిరుపతి ఆటోనగర్కు చెందిన జీ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి కోసం తన కూమార్తెలు తనని వేధిస్తున్నారని పెళ్లకూరు మండలంలోని చెన్నప్పనాయుడుపేట గ్రామానికి చెందిన కడూరు మునెమ్మ(84) సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో అధికారులకు ఓ వినతిపత్రం అందజేశారు. -
అంతర్రాష్ట్ర మొబైల్ దొంగ అరెస్టు
తిరుపతి క్రైం : అంతర్రాష్ట్ర మొబైల్ దొంగను తిరుపతిలో అరెస్టు చేసినట్లు ఏఎస్పీ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన ఎనిమిది ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ కథనం మేరకు.. నేపాల్ దేశం బఝంగ్ జిల్లా, మయపటగాం గ్రామానికి మహేష్ బహదూర్ జటారా అలియాస్ సంతోష్ తాప అలియాస్ డాబా మహేష్ కుమార్ (29) రాత్రి వేళల్లో పెద్ద షాపింగ్ మాల్స్ను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో తిరుపతి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇస్కాన్ ఆలయం సమీపంలో నిందితుడిని అరెస్తు చేశారు. నిందితుడి వద్ద నుంచి శాంసంగ్, వీవో, ఒప్పో, వన్ప్లస్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
స్థలాపాపం.. తలాపిడికెడు
రేణిగుంట: మండలంలోని తూకివాకం పంచాయతీలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి పక్కనే 928, 929 సర్వే నంబర్లో కాలువ యథేచ్ఛగా ఆక్రమణ జరుగుతున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా కలెక్టరేట్కు కూత వేటు దూరంలో ఈ తంతు జరుగుతున్న అధికారులు మాత్రం తమకేమీ కనిపించడం లేదన్న చందంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో చిన్న ఇల్లు నిర్మించుకుంటేనే రెవెన్యూ అధికారులు నానా హంగామా చేస్తున్నారని, వారి కళ్లముందే ఇంత జరుగుతున్నా కనీస చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కాలువ ఆక్రమణ జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్యాం ప్రసాద్ను వివరణ కోరగా సిబ్బందిని పంపి, పరిశీలించి ఆక్రమణ జరుగుంటే చర్యలు చేపడతామన్నారు. సచివాలయ భవనమే గోడౌన్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని రూ.40 లక్షల వ్యయంతో సచివాలయ భవనాలను నిర్మించారు. సచివాలయ భవనం 90 శాతం పూర్తయినప్పుటికీ మిగిలిన పనులు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం వదిలేసింది. తూకివాకం సచివాలయ భవనానికి ప్రైవేట్ వ్యక్తులు తలుపు అమర్చుకుని గోడౌన్ వినియోగిస్తున్నారు. నివారించాల్సిన పంచాయతీ అధికారులు స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఉన్నారని గ్రామస్తులు అంటున్నారు. పత్తాలేని ఇరిగేషన్ అధికారులు పంట కాలువలను పరిరక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు అటువైపు చూడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కాలువ ఆక్రమణకు గురవుతుందని స్థానికులు తెలిపినా ఇరిగేషన్ అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. కాలువలో తోలిన మట్టిపెడచెవిన వీఆర్వో మాటలు వారం కిందట స్థానిక వీఆర్వో, సచివాలయ సర్వేయర్తో కలిసి కాలువను సర్వే చేశారు. సర్వే రిపోర్ట్ వచ్చేంతవరకు నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆదేశించారు. కానీ వీఆర్వో మాటను ఆక్రమణలు లెక్కచేయకుండా పనులు శరవేగంగా చేస్తున్నారు. వీఆర్వోకు తెలిసే పనులు చేస్తున్నారా? లేక ఆయన్ని లెక్కచేయకుండా చేస్తున్నారా? అన్నది శేష ప్రశ్నగా మిగిలింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పాగా వేస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే స్థలాలపై కన్నేస్తున్నారు. ఆక్రమణలకు కొంత మంది నాయకుల అండదండలుండడం.. అధికారులు ఉదాశీనంగా వ్యవహరించడంతో విలువైన స్థలాలు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంటున్నాయి. తూకివాకం పంచాయతీలో ఆక్రమణల పర్వం ఇదీ. -
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీకి 54 వినతులు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ ిసీఎండీ’ కార్యక్రమానికి 54 వినతులు అందినట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 9133331912కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి తొట్టంబేడు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. తొట్టంబేడు పోలీసుల కథనం మే రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన హషూబ్(25) డైరేడేలో సేల్స్ మార్కెటింగ్గా పనిచేస్తుంటాడు. ఇతడు వారంలో మూడు శ్రీకాళహస్తి, మూడు రోజులు సూళ్లూరుపేటలో విధులు నిర్వహిస్తూ సూళ్లూరుపేటలోని పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తడ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తొట్టంబేడు మండలం బీడీ కాలనీ వద్ద వాహనం అదుపు తప్పి గట్టును ఢీకొన్నాడు. స్థానికులు గుర్తించి 108లో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక డంపింగ్పై కేసు నమోదు నాయుడుపేట టౌన్: మండలంలోని పండ్లూరు వెంగమాంబపురం సమీపంలో స్టీల్ ప్లాంట్ వెనుక అటవీ ప్రాంతంలో ఇసుక డంపింగ్ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. స్టీల్ప్లాంట్ వెనుక ఇసుక నిల్వలు ఉండడంపై పోలీసుల విచారణలో ఓజిలి మండలం సగుటూరు గ్రామానికి చెందిన అనీల్ అనే వ్యక్తి ఇసుకను ట్రాక్టర్లతో తీసుకువచ్చి డంపింగ్ చేసి లారీల్లో తరలించేందుకు ప్రయత్నిస్తుట్లుగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఇసుక డంపింగ్పై రెవెన్యూ అధికారులతో పంచనామా నిర్వహించి ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకుని అనీల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాణం తీసిన పేకాట నాగలాపురం: పేకాట స్థావరంపై పోలీసుల దాడితో భయపడిన జూదరి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని కా లంజేరి పరిసరాల్లో నాలుగు రోజులుగా కొందరు వ్యక్తులు వ్యవసాయ పొలాల మధ్య పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఎస్ఐ సునీల్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు అర కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నారన్న విషయాన్ని గమనించిన పేకాటరాయుళ్లు అక్కడ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు పక్కనే ఉన్న అరణియార్ చెరువులో దూకగా, ఈశ్వర్ అనే వ్యక్తి చెరువులో చిక్కుకున్నాడు. పరిస్థితిని గమనించిన ఎస్ఐ సునీల్, కానిస్టేబుల్ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చెరువులోకి దిగి అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఈశ్వర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఈశ్వర్, నారాయణవనం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది పేకాటారాయుళ్లు పాల్గొన్నట్లు, వీరందరు పిచ్చాటూరు, ఊత్తుకోట, నారాయణవనం మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. సంఘటన స్థలానికి పుత్తూరు డీఎస్పీ రవి కుమార్, సత్యవేడు సీఐ మురళి నాయుడు చేరుకుని వివరాలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మినీ ట్రక్ బోల్తా రేణిగుంట: టైర్ పంక్చర్ కావడంతో టమాట లోడ్డుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తాపడిన ఘటన రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం చెరువు సమీపం, పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి వంతెన పై సోమవారం చోటు చేసుకుంది. టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి మినీ ట్రక్కు బోల్తాపడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రక్కులోని టమాటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కును తొలగిచి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
ఏడుగురు నిందితుల అరెస్టు
రేణిగుంట: మండలంలోని ఎర్రమరెడ్డిపాళెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కంపెనీలో జరిగిన రాగి వైర్లు, కాపర్ బస్బార్లు ఇతర కాపర్ సామగ్రి చోరీ కేసులో తమిళనాడుకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు... మండలంలోని ఎర్రమరెడ్డిపాళెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కంపెనీలో జరిగిన రాగి వైర్లు, కాపర్ బస్బార్లు ఇతర కాపర్ సామగ్రి చోరీ జరిగినట్లు పోలీసులకు ఏప్రిల్ మొదటి వారంలో ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూరల్ మంజునాథరెడ్డి, ఎస్ఐ హరీష తమ సిబ్బందితో ముమ్మర గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, టోల్ ప్లాజా వివరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కేసును ఛేదించిన పోలీసులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన అనిత (27), సరసు (55), హిందు, ఇల్లవారాసి, మణికండన్, ఆనందబాబు, కుమార్ శబరిని తిరుపతి బ్లిస్ హోటల్ సమీపంలోని గుజిరి షాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు చోరీ చేసిన సొత్తును విక్రయించి, ఖర్చు చేసి, మళ్లీ చోరీలకు పాల్పడేందుకు వచ్చినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమర్థవంతంగా పని చేసిన పోలీసులను అధికారులు అభినందించారు. -
తిరుచానూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన
చంద్రగిరి: భూములను కబ్జా చేసి అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్న కానిస్టేబుల్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలంటూ సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. ఆదివారం కూలి పనులు చేసిన భవన నిర్మాణ కార్మికులపై దాడికి పాల్పడడంతో సీపీఐ నేతలు తిరుచానూరు పోలీసు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ మాట్లాడుతూ.. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలోని సర్వే నం.246/2లో అవిలాలకు చెందిన నారాయణకు 2.60 ఎకరాలు ఉందన్నారు. ఇందులో 2023లో టీటీడీ విశ్రాంత ఉద్యోగి గుర్రప్ప 60 అంకణాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత కొంత కాలంగా తిరుపతిలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శేఖర్రెడ్డి కుమారుడు మోహన్రెడ్డి గుర్రప్పకు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం గుర్రప్పకు చెందిన స్థలంలో భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ పనులు చేస్తుంటే మోహన్రెడ్డి అక్కడికి వెళ్లి వారిపై దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపించారు. కొంత మంది యువకులకు మద్యం తాపించి దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పనులు ముగించుకుని వెళ్తున్న చిరంజీవి అనే భవన నిర్మాణ కార్మికుడిపై మోహన్రెడ్డి, తన అనుచరులతో కలసి మూకుమ్మడిగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో కార్మికులపై దాడులు జరిగాయని, పోలీసులు సైతం మోహన్రెడ్డికి పరోక్షంగా సహకారం అందిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. పోలీసుల ఎదుటే స్థల యజమానిపై దాడికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. పోలీసు పవర్ ఉందనే దురంహకారంతో దాడులు చేస్తున్న మోహన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట కార్మికులతో కలసి నినాదాలు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నారు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ధ్రువీకరణ’కు ఇదే సమయం
●తిరుపతి అర్బన్ : పదోతరగతి, ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. జూన్లో ఇంజినీరింగ్, పీజీ తదితర కోర్సులతోపాటు నీట్ ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలోనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతి విద్యార్థికీ నూతన కోర్సులో ప్రవేశం పొందేందుకు పలు సరిఫికెట్లు అవసరం. కోర్సులో చేరే సమయంలో ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు తీస్తుంటారు. వెంటనే తమకు సర్టిపికెట్లు మంజూరు చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తుంటారు. ఆలస్యమైతే ఆందోళనకు గురవుతుంటారు. అలాగే హడావుడి నేపథ్యంలో సర్టిఫికెట్లలో పలు తప్పులు సైతం దొర్లుతుంటాయి. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ముందస్తే మంచిది అకడమిక్ ఇయర్ ఆరంభమయ్యే వరకు వేచి ఉండకుండా, అవసరమయ్యే సర్టిఫికెట్లకు ఈ నెలలోనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా సకాలంలో సర్టిఫికెట్ జారీ అవుతుందని వెల్లడిస్తున్నారు. ఆఖరి క్షణం వరకు ఆందోళన చెందే ప్రమాదం తప్పుతుందని తెలియజేస్తున్నారు. ఏటా జూన్, జూలై, ఆగస్ట్లో ఒక్క తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికే వివిధ సర్టిఫికెట్ల కోసం లక్షకు పైగా దరఖాస్తులు వస్తుంటాయని వివరిస్తున్నారు. ఈ మేరకు ముందు జాగ్రత్తగా కుల, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నివాస, ఓబీసీ, ఆధార్, రేషన్ కార్డుల్లో తప్పుల సవరణ, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. దీంతో ప్రశాంతంగా ఎలాంటి తప్పులు లేకుండా ఇబ్బండి పడపత్రంతోపాటు ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నివాస, ఓబీసీ, ఆధార్, రేషన్కార్డుల్లో తప్పుల సవరణ, పలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను తీసుకోవడానికి దరఖాస్తులు చేసుకుంటే ప్రశాంతంగా తప్పులు లేకుండా, ఇబ్బందులు పడకుండా సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు ఉంటుందని వెల్లడిస్తున్నారు. -
సమ్మర్.. సంబరం
గతంలో వేసవి అంటేనే వినోదం తిరుపతి సిటీ: సమ్మర్ అంటేనే సంబరం...వేసవిలో ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా..పిల్లలకు సమ్మర్ సెలవులు ఎన్నో వినోదాలను, సంబరాలను తెచ్చిపెట్టేది. నేటి ఆధునిక సమాజంలో పెద్దలతో పాటు పిల్లల జీవితం ఉరుకులు పరుగులుగా మారింది. దీంతో నేటి పిల్లలు వేసవి సెలవులను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. మూడు తరాలు వెనక్కి వెళ్లి చూస్తే... అప్పటి పిల్లలు వేసవి మళ్లీ ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసేవాళ్లు.. వేసవి సెలవులపై కొందరు అధ్యాపకులు, అధికారులు, విశ్రాంత ఉద్యోగులను పలకరిస్తే తమ చిన్నతనంలో వేసవి సెలవులను ఎలా గడిపారో గుర్తుచేసుకుంటున్నారు. నీతి కథలు మనస్సును తాకేవి మాది తిరుపతి ఎస్ఆర్పురం. నేను పాఠశాల విద్యనభ్యసించే సమయంలో వేసవి సెలవులు వస్తే తెలియని ఆనందంలో మునిగిపోయేవారం. సెలవుల్లో మా తాతగారి ఊరు చిత్తూరుకు వెళ్లేది. తాత చెప్పే నీతికథలు మనస్సును తాకేవి వీటితో పాటు శతకం పద్యాలు బోధించే వారు. చుట్టుపక్కల స్నేహితులతో క్రికెట్, చెస్, క్యారమ్స్ ఆడుతూ సంతోషంగా గడిపేవారం. నేడు సెల్ఫోన్లు, ఉరుకులు పరుగుల జీవితంలో నేటి బాలలకు నిజమైన వినోదాన్ని కోల్పోతున్నారు. – గోపాల్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, తిరుపతి జిల్లా వినోదం ఉండేది.. మా ఊరు రొంపిచెర్ల దగ్గర చిన్న పల్లెటూరు. వేసవి సెలవులు అంటే మాకు వినోదాన్ని అందించే ప్రధాన ఘట్టంగా భావించేవారం. పల్లెలోని చెరువు, బావులల్లో ఊరిలోని స్నేహితులతో కలసి స్విమ్మింగ్ చేసేవారం. పశువులు ఎక్కువగా ఉండటంతో వాటితో రోజంతా గడుపుతూ మైదానాలలో మేత కోసం తీసుకెళ్లి ఊరిలోని పిల్లలతో గోళీల ఆటలు, అష్టాచెమ్మ, కబడ్డీ ఆటలు ఆడేవాళ్లం. పెద్దలంటే గౌరవంతో కూడిన భయం ఉండేది. తల్లిదండ్రులు, అవ్వా తాతల వద్ద ఎంజాయ్ చేసేవాళ్లం. ప్రస్తుతం పిల్లలది 24 గంటలు పలు కోచింగ్లతో మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. – రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతి ఆ రోజులు మరుపురానివి మాది తిరుపతి. చిన్నతనంలో వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఊరు విజయపురం వెళ్లే వాళ్లం. ఊరులోని బంధుమిత్రుల పిల్లలతో చెరువులో స్విమ్మింగ్ చేయడం, మామిడి తోటలో మామిడిపళ్లు తినడం, సాయంత్రం అందరం ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోవడం చేసేవాళ్లం. అమ్మమ్మతో పాటు ఇంటిలోని పెద్దలు నీతికథలు, మహాభారతంలోని కీలక ఘట్టాలను ఆకట్టుకునే విధంగా కథలుగా చెప్పి వినిపించేవారు. ఆ రోజులు మరువలేం. – డాక్టర్ సి భువనేశ్వరి, ప్రిన్సిపల్, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాల, తిరుపతి వేసవి సెలవుల కోసం ఎదురు చూసేవాళ్లం ప్రాథమిక విద్య నభ్యసించే రోజుల్లో వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయా అంటూ ఎదురుచూసే వాళ్లం. మాది తిరుపతి మా అమ్మమ్మ వాళ్లది నెల్లూరు దగ్గర ఓ పల్లెటూరు. అమ్మమ్మ రుచికరమైన వంటలు వండిపెట్టేది. అప్పుడు చైనీస్, జంక్ ఫుడ్స్ లేవు. ఆరోగ్యం ఎంతో బాగుండేది. గుడుమూతలు, అష్టాచెమ్మ, బారకట్ట, మేక పులి వంటి ఆటలతో సంతోషంగా గడిపేవాళ్లం. ప్రస్తుతం అంతా యాంత్రికంగా మారింది. – శకుంతలాదేవి, రిటైర్డ్ కేంద్రప్రభుత్వ అధికారి, తిరుపతి -
ఇసుక లారీ మాయం?
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పండ్లూరు వెంగమాంబపురం అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది నుంచి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక డంపింగ్ చేసి పొట్టులారీ బస్తాల మాటున ఇసుకను తరలింపు చేస్తుండడంపై గ్రామస్తులు ఐదు రోజుల కిందట పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకోవడంతో ఇసుక లోడింగ్కు సిద్ధమవుతున్న లారీ డ్రైవర్తో పాటు క్లీనర్లు లారీని వదిలి పరారయ్యారు. దీంతో పోలీసులు లారీ టైర్లకు గాలితీసివేసి లారీ యజమాని ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే అధికార పార్టీ నేతల అండదండలతో పొట్టు బస్తాల మాటున తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్తులు కనుగొని అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు పట్టుకున్న లారీని ఎందువల్లనో ఐదు రోజులుగా ఇసుక డంపింగ్ చేసి ఉన్న ప్రాంతంలోనే నిలిపి వేసి ఉంచారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ ఉన్న లారీ మాయం కావడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. పోలీసులు కేసు కట్టి తీసుకువెళ్లారా.. లేక అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి లారీని వదలేశారా అంటూ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయమై నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబును వివరణ కోరగా ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నించిన లారీపై కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడ లారీయే లేదని మాయమైన విషయం చెప్పడంతో డీఎస్పీ సైతం అవాక్కయ్యారు. ఈ విషయమై సీఐతో మాట్లాడి పరిశీలించి చర్యలు చేపడుతామని డీఎస్పీ వెల్లడించారు. -
చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు సాదర వీడ్కోలు
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం తిరుగు పయనమైన భారత ప్రధాన ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ వారి దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు,డీఆర్ ఓ జి. నరసింహులు, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి అందించి సాదరంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు.. ● తిరుపతి జిల్లా రెండురోజులు పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ కి రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డీఆర్ఓ నరసింహులు తదితర అధికారులు సాదరంగా వీడ్కోలు పలికారు. -
పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
వెంకటగిరి రూరల్ : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టర్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని విద్యుత్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ యూనియన్ జిల్లా ప్రథమ మహాసభ పట్టణంలోని పింజల వీరయ్య కల్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణంలోని క్రాస్రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దుగ్గిరాల సూరిబాబు, సుదర్శన్రెడ్డి, జేఎల్ఎం గ్రేడ్–2 రాష్ట్ర కన్వీనర్ పెంచల ప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హసరత్తయ్య, జాకీర్ హుస్సేన్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నూతన కమిటీ ఏర్పాటు చేశారు. నూతన కమిటీ సభ్యులు జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మస్తానయ్య, జిల్లా అధ్యక్షుడిగా కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా నాదమునిరెడ్డి, కోశాధికారిగా పురుషోత్తం, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీ, చీఫ్ అడ్వైజర్గా, ఆఫీసు బైరర్స్గా జ్యోతి, ఏడుకొండలు బాబు, సిహెచ్ నారాయణ, రవీంద్ర, వెంకటరమణ, జగదీశ్వర్రెడ్డి, ప్రసాద్, ఎల్ లక్ష్మణ రావు, నాగూరుబాబు, మునిశేఖర్, తేజ ఎంపికయ్యారు. కాంట్రాక్టర్ కార్మికుల నూతన కమిటీ అధ్యక్షులుగా సుబ్రమణ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ హేమకుమార్, ఉపాఽధ్యక్షులుగా సుబ్రమణ్యం, చిరంజీవి, ఎస్కే ఆసిఫ్ రవి, వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా కుమార్ , తదితర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ కార్మికుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్పీడీసీఏల్ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యంరాజు, జిల్లా నాయకులు నాగయ ఈటే కొండయ్య, గిరి, మజార్, సునీల్ పాల్గొన్నారు. టీడీపీ నేత పోస్టింగ్పై పోలీసులకు ఫిర్యాదు? కలువాయి(సైదాపురం): మండలంలోని కుల్లూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేపై టీడీపీ నేత ఒకరు సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టింగ్ పెట్టారు. దీనిపై వీఆర్వోలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం, కుల్లూరు గ్రామంలో రీ సర్వేలో రెవెన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పతున్నారని, పెద్ద పెద్ద రైతుల తోటల్లో లిక్కర్ పార్టీల్లో వీఆర్ఓ, సర్వేయర్ పాల్గొని, భూ మార్పిడి చేస్తున్నారని, 400 ఎకరాల వరకు గోల్మాల్ జరిగినట్లు ఈనెల 5న టీడీపీ నేత పోస్టింగ్ పెట్టారు. ఈ పోస్ట్పై కుల్లూరు, వెంకటరెడ్డిపల్లి, వీఆర్వోలు కలువాయి పోలీసు స్టేషన్ల్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,512 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,988 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. బర్డ్ ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళం తిరుమల: గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాసులు రెడ్డి ఆదివారం బర్డ్ ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డీని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు. గంగజాతరకు పటిష్ట భద్రత తిరుపతి క్రైం : తిరుపతి గంగమ్మ జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్టు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు తెలిపారు. జాతర ప్రాంగణంలో జేబుదొంగలు, గొలుసు దొంగలు సంచరించే అవకాశాలు ఉన్నందున భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు బంగారు ఆభరణాలు అధికంగా ధరించి రావద్దని, విలువైన వస్తువులను ఎల్లప్పుడూ తమ కంటికి కనిపించేలా జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. స్విమ్స్ కార్మికుడు రూకేష్ ఆరోగ్యం విషమం తిరుపతి తుడా: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి కార్మికుడు రూకేష్ ఆరోగ్యం విషమించిందని, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే.వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్విమ్స్ కార్మికులు గత 73 రోజుల నుంచి సమస్యల పరిష్కారం కోసం ఆస్పత్రి వద్ద నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆదివారం ఆయన దీక్షా శిబిరంలో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై రూకేష్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన రూకేష్ కోలుకున్న అనంతరం తన కుటుంబ పోషణ కోసం తిరిగి విధుల్లో చేరాడని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై స్విమ్స్ యాజమాన్యం, టీటీడీ అధికారులు పదేపదే హామీలు ఇస్తూ కాలయాపన చేస్తుండడం వల్ల కార్మికుల్లో తీవ్ర ఆందోళన, మానసిక ఒత్తిడి పెరిగిందన్నారు. కార్యక్రమంలో స్విమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జి రవి, నాయకులు గోపి, వెంకటేష్, మారిముత్తు, బృందా పాల్గొన్నారు. తేనెటీగల దాడి – 20 మందికి గాయాలు పెనగలూరు: మండలంలోని దామనచర్ల అటవీ ప్రాంతంలో ఆదివారం తేనెటీగలు దాడి చేయడంతో ఇరవై మందికి గాయాలయ్యాయి. మూడు 108 వాహనాలలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం గాయపడిన వారిని తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. చిట్వేలి మండలం, గరుగుపల్లి గ్రామానికి చెందిన దాదాపు నలభై మంది దామనచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న గుర్రప్పస్వామి ఆలయం వద్దకు పొంగుబాలు పెట్టుకునేందుకు వచ్చారు. ఆలయం సమీపంలో ప్రసాదాలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో ఇరవై మందికి గాయాలయ్యాయి. అక్కడున్న ప్రజలు 108కు సమాచారం ఇవ్వడంతో చిట్వేలి, పెనగలూరు, నందలూరు మండలాల నుంచి 108 వాహనాలు దామనచర్ల అటవీ ప్రాంతానికి వెళ్లి గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంత మందికి తీవ్ర గాయాలైనటుట సమాచారం. -
బియ్యమే దిక్కు!
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదోడి సూపర్ మార్కెట్గా పిలుచుకుంటున్న చౌక దుకాణాల్లో బియ్యమే దిక్కుగా మారింది. రేషన్ కార్డుదారులకు కందిపప్పు జాడే కరువైంది. కందిపప్పు ధరలు మార్కెట్లో ఎక్కువగా ఉండడంతో సామాన్య, పేద ప్రజలు కొనుగోలు చేయలేక చౌక దుకాణాల్లో అందుబాటులోకి అవస్థలు పడుతున్నారు. 23 నెలలుగా బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. అప్పుడప్పుడూ అరకొర చక్కెర మాత్రమే ఇస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణాల్లో బియ్యంతోపాటు చక్కెర, గోధమ పిండి, రాగిపిండి, రాగులు , కందిపప్పు తదితర వస్తువులను పంపిణీ చేశారు. చిరుధాన్యాలు సైతం కార్డుదారులకు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కార్డుదారులకు చౌకదుకాణాల్లో సరుకులు కరువయ్యాయని పలువురు కార్డుదారులు వాపోతున్నారు. పౌరసరఫరాలశాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చౌకదుకాణాల్లో అన్ని రకాల సరుకులు ఇవ్వడంలేదని.....తమ ప్రభుత్వంలో కార్డుదారులకు అవసరమైన అన్ని సరుకులను పంపిణీ చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ అమల్లోకి తీసుకురాకపోవడంతో పలువురు మండిపడుతున్నారు. దానికితోడు జిల్లాలోని 369 ఎండీయూ వాహనాలను రద్దు చేశారు. ఇంటింటికీ వెళ్లి సరుకులు ఇచ్చే సౌకర్యం లేకుండా పోయింది. గతంలో ప్రతి నెలా 1వ తేదీ నుంచి 18 వరకు సరుకులు ఇచ్చేవారు. ప్రస్తుతం 1 నుంచి 15 వరకు మాత్రమే ఇచ్చేలా కుదింపు చేశారు. మూడు రోజుల పాటు కుదింపు చేయడంతో కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. 266 మంది డీలర్ల కొరత జిల్లాలో 1457 చౌక దుకాణాలు ఉన్నాయి. అయితే పలువురు డీలర్లకు రాజకీయ రంగు పులమడంతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన డీలర్లు అంటూ పలువురిని ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. రాజీమానా చేయకుంటే కేసులు పెడుతామని చెప్పడంతో 266 మంది రేషన్ షాపులను వదిలిపెట్టేశారు. ఆ తర్వాత ఆ షాపులను కూటమి ప్రభుత్వానికి చెందిన వారికి ఇస్తామని చెప్పారు. అయితే మూడు పార్టీల్లో సమన్వయం లేకపోవడంతో 20 నెలలుగా వాటిని భర్తీ చేయకుండా కొందరు పొదుపు సంఘాలకు, పక్క డీలర్లకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్చార్జిలు సక్రమంగా బియ్యాన్ని ఇవ్వడం లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. చౌక దుకాణాల్లో 23 నెలలుగా అదే తంతు -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు
చంద్రగిరి: ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..తిరుపతి గిరిపురానికి చెందిన సంపత్ రాజు, సుగుణలత(52) బెంగళూరు నుంచి కారులో తిరుపతికి వస్తున్నారు. ఈ క్రమంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి, తొండవాడ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఆపై రోడ్డుకు అటువైపునకు దూసుకెళ్లి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో సుగుణలత అక్కడికక్కడే మృతి చెందగా, సంపత్రాజు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడు సంపత్రాజుకు ప్రథమ చికిత్సను అందజేశారు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రమాద వివరాలను తెలుసుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, సుగుణలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
ఇసుక లారీ మాయం?
నాయుడుపేట మండల పండ్లూరు వెంగమాంజపురంలో ఐదు రోజుల క్రితం పోలీసులు సీజ్ చేసిన లారీ మాయమైంది.సిండికేట్గా మారిన మామిడి మండీ యజమానులు సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026ఆశనిరాశల నడుమ మామిడి రైతులు ఊగిసలాడుతున్నారు. ఒక ఏడాది దిగుబడి బాగుంటే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. మరో ఏడాది రేటు అధికంగా ఉంటే సక్రమంగా పంట చేతికందక దెబ్బతింటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తోటలు కళకళలాడుతున్నప్పటికీ ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు మండీ యజమానుల మాయాజాలమే కారణంగా ఆరోపిస్తున్నారు. సిండికేట్గా మారి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో మార్కెటింగ్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దామలచెరువు, తిరుపతి, చిత్తూరు, బంగారుపాళెం, పాకాల, పుత్తూరు చందూర నిలువు దోపిడీపై ఆగ్రహం ఏడాది పాటు మామిడి చెట్లను సంరక్షించుకుంటూ, వివిధ రకాల వాతావరణ సమస్యలను ఎదుర్కొని, చీడపీడలకు రూ.లక్షలు ఖర్చుచేసి పండించిన పంటకు యజమానులైన తాము ధరను నిర్ణయించే స్థితిలో లేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్ యార్డ్ వ్యాపారులు నిలువునా దోచుకొంటున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆక్రోశిస్తున్నారు. అధికారులు సైతం మామూళ్లు దండుకుని తమను రోడ్డుపాలు చేస్తున్నారని వాపోతున్నారు. రైతుల పక్షాన నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కనీసం జ్యూస్ ఫ్యాక్టరీలను త్వరగా తెరిపిస్తే నేరుగా సరుకును అమ్ముకొనే అవకాశం కలుగుతుందని కోరతున్నారు. ఆదిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడింగ్ చేస్తున్న కూలీలుపుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. సుమారు 2.65 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 70శాతం నుంచి 75 శాతం వరకు పంట దిగుబడి రావడంతో రైతులు కొంత ధైర్యంగా కోతలకు ఉపక్రమించారు. అయితే 10 రోజుల వ్యవధిలో ఒక్కసారిగా మామిడి ధరలు పతనమవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మార్కెట్ యార్డుల నుంచి వివిధ రకాల మామిడిని తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, గుజరాజ్, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. దీంతో మామిడి సీజన్ ప్రారంభంలో ధర ఆశాజనకంగా ఉంటుంది. అందులో భాగంగానే సీజన్ ప్రారంభంలో బేనీషా టన్ను ధర రూ.70 వేలు పలకగా, ప్రస్తుతం రూ.25 వేలకి పడిపోయింది. జిల్లా మొత్తం మీద మామిడి దిగుబడిలో 75 శాతంతో అగ్రభాగాన నిలిచే తోతాపూరి తొలుత టన్ను ధర రూ.25 వేల నుంచి రూ.30 వేలు పలికింది. అయితే ప్రస్తుతం రూ.9 వేలకు తగ్గిపోవడంతో రైతులు నివ్వెరపోతున్నారు. అలాగే చందూర రూ.30 వేల నుంచి రూ.14 వేలకి పడిపోయింది. దీనిపై ప్రశ్నించిన రైతులకు నెల్లూరు, విజయవాడ మార్కెట్లలో డిమాండ్ తగ్గిందని వ్యాపారులు కుంటి సాకులు చెబుతున్నారు. సాధారణంగా పల్ప్ ఫ్యాక్టరీలు తెరవక ముందు తోతాపూరి ధరలు ఆశాజనకంగా ఉంటాయి. ఫ్యాక్టరీలు తెరిచాక అన్ని ప్రాంతాల నుంచి సరుకు ఎక్కువగా రావడం వల్ల కాస్త ధర తగ్గడానికి అవకాశముంటుంది. ఓ పక్క ఫ్యాక్టరీలు తెరవక ముందే తోతాపూరితో పాటు అన్ని రకాలకు ధరలను సగానికి సగం తగ్గించేశారు. దీంతో మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వ్యాపారులు, అధికారుల కుమ్మక్కు
మామిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలడానికి వ్యాపారులతో పాటు అధికారులు కుమ్మక్కు కావడమే ప్రధాన కారణం. ధరలను ఇష్టారాజ్యంగా ప్రకటిస్తున్న వ్యాపారులపై మార్కెటింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఆదిశగా తనిఖీలు చేయడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. – టి.కేశవులు, అధ్యక్షుడు, మామిడి రైతు సొసైటీ, పుత్తూరు కఠిన చర్యలు తప్పవు జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలను నియంత్రిస్తే కఠిన చర్యలు తప్పవు. మార్కెట్ యార్డుల్లోని సెక్రటరీలు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ధరలను నియంత్రించే వ్యాపారులను యార్డు నుంచి తొలగిస్తాం. వారి లైసెన్సులను సైతం రద్దు చేస్తాం. – టి.సురేంద్రబాబు, ఏడీ, మార్కెటింగ్, తిరుపతి -
తిరుపతిలో భూ వివాదం
సాక్షి టాస్క్ ఫోర్స్: తిరుపతి నగర నడిబొడ్డులోని ఎర్రమిట్టలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న భూమిలోకి టీడీపీ గూండాలు ప్రవేశించారు. దౌర్జన్యంగా జేసీబీలతో చదును చేసి గందరగోళం సృష్టించారు. మహిళలు, స్థానికుల కథనం మేరకు.. తిరుపతి అర్బన్ మండలం, అక్కారంపల్లి సర్వే నం.101/3లో రూ.కోట్ల విలువచేసే 1.05 ఎకరరాల భూమి ఉంది. ఈ భూమి తమదేనని వృద్ధురాలు తులశమ్మ, మరి కొందరు కొంత కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏడాది క్రితం కొందరు యత్నించి విఫలమయ్యారు. అసలే ఆదివారం, కోర్టులకూ సెలవులు ఉండడంతో పథకం ప్రకారం ఆ భూమిలో ఉదయం రెండు జేసీబీలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ వృద్ధురాలు తులశమ్మ నిరి్మంచుకున్న రేకుల షెడ్డును, దాని చుట్టూ ఉన్న చెట్లను తొలగించడం ప్రారంభించారు. దీంతో తులశమ్మ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత సమయానికి మరికొందరు మహిళలు అక్కడికి చేరుకుని జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందస్తు పథకం ప్రకారం అక్కడే ఉన్న టీడీపీ గూండాలు మహిళలను అడ్డుకోవడం ఇబ్బంది అవుతుందని భావించి.. టీడీపీ సానుభూతి పరులైన కొందరు మహిళలను పిలిపించారు. ఎంతకూ పనులు ఆపకపోవడంతో బాధిత మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మరి కొందరు జేసీబీలకు అడ్డుపడ్డారు. తిరుపతి ఎర్రమిట్టలో టీడీపీ దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టుల ముసుగులో టీడీపీ చేస్తున్న భూ కబ్జా అని మండిపడ్డారు. తిరుపతి నగరంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని బాధితులతో కలిసి సీపీఐ నేతలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. -
వేరుశనగ సాగుకు సమయం ఆసన్నం
● రాయితీ విత్తన కాయల కోసం ఎదురుచూపులు ● పచ్చిరొట్ట విత్తనాలు ఇవ్వని దుస్థితి ● విత్తన పంపిణీలో కాలయాపన తిరుపతి అర్బన్: రైతులకు ప్రతి సీజన్లో 50 శాతం రాయితీలో ప్రభుత్వం వేరుశనగ విత్తనాలను ఇస్తుంది. అయితే గత రబీ సీజన్లో చంద్రబాబు సర్కార్ వేరుశనగ విత్తనాల ధరలు ఎక్కువగా ఉన్నాయని రాయితీలో ఇవ్వలేమంటూ ఎగనామం పెట్టింది. ఈ ఖరీఫ్ సీజన్లో ఇస్తారా? లేదా తెలియడం లేదు. ఇప్పటి వరకు రైతులకు విత్తనాలు వస్తాయనే సమాచారాన్ని ఇవ్వకపోవడంతో వారంతా దిక్కులు చూస్తున్నారు. సాధారణంగా 30 కిలోల బస్తా రూ.2,500 పలుకుతుంది. ప్రభుత్వం 50 శాతం రాయితీలో ఇస్తే రూ.1,250కే వస్తుంది. ఎకరం సాగుకు 30 కిలోల బస్తాలు 4 కావాల్సి ఉంది. బస్తాపై రూ.1,250 చొప్పున నాలుగు బస్తాలకు రైతులకు రూ.5 వేలు ఆదా ఆవుతుంది. 5 ఎకరాలు ఉన్న రైతుకు అయితే రూ.25 వేలు ఆదా అవుతుంది. గత రబీ సీజన్లో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులు పంట సాగుకు మొగ్గు చూపలేదు. ఈ సీజన్లోనైనా సబ్సిడీ విత్తన కాయలు ఇస్తారో? లేదోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు పచ్చిరొట్ట విత్తనాలు ప్రశ్నార్థకం పచ్చరొట్ట విత్తనాలు(జీలగలు, జనుములు, పిల్లిపెసర)50 శాతం నుంచి 60 శాతం రాయితీలో ఇస్తుంటారు. అయితే రబీ సీజన్లో నామమాత్రంగా అందించారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు పచ్చిరొట్ట విత్తనాలు ఇస్తామని రైతులకు భరోసా కల్పించకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు.జూన్ మొదటి వారం నుంచే పంట సాగు సాధారణంగా మేలో భూములు దుక్కి చేసుకున్న రైతులు జూన్ మొదటి వారం నుంచి వేరుశనగ పంట సాగు చేస్తుంటారు. అయితే పచ్చిరొట్ట విత్తనాలు మే మొదటి వారంలో ఇచ్చి ఉంటే రైతులు వాటిని చల్లుకుని ఉండేవారు. అయితే మే నెల నాలుగో వారంలో విత్తనాలు వస్తాయని అధికారులు అంటున్నారు. ఆ తర్వాత విత్తనాలు జూన్ మొదటి వారంలో రైతులకు పంపిణీ చేస్తారు. వాటిని రైతులు చల్లుకుంటే జూన్ నాలుగో వారం లేదా జూలై మొదటి వారంలో దుక్కి చేయాల్సి ఉంది. తర్వాత జూలై మొదటి వారం తర్వాత వేరుశనగ పంట సాగుచేయాల్సి ఉంటుంది. అంటే ఒక నెల ఆలస్యంగా సాగుచేయడం ద్వారా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు వేరుశనగ ప్రధాన పంట ఒకప్పుడు వేరుశనగ పంట సాగుకు తిరుపతి జిల్లా పెట్టిన పేరుగా ఉండేది. జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాలకు పైగా పంటను సాగు చేసేవారు. గత ప్రభుత్వంలో ప్రతి మండలంలోనూ రబీ సీజన్తోపాటు ఖరీఫ్ సీజన్లోనూ వేరుశనగ సాగుచేసేవారు. రాయితీ విత్తనాలతోపాటు రైతుకు అవసరం అయిన పనిముట్లు, పురుగుమందులు సమకూర్చడంతోపాటు రైతులను ప్రోత్సహించేవారు. చంద్రబాబు సర్కార్లో రాయితీ విత్తనాలు ఇవ్వడం మానుకున్నారు. దీంతో సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. గత రబీ సీజన్లో వేరుశనగ విత్తనాల రేట్లు పెరిగాయని, సబ్సిడీ విత్తనాలను రైతులకు ఇవ్వడం మానుకున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వేరుశనగ విత్తనాలు ఇస్తామని, ప్రభుత్వం నుంచి అధికారుల ద్వారా రైతులకు ఇప్పటి వరకు భరోసా కల్పించలేదు. దీంతో రైతులు ఖరీఫ్ సీజన్కు సంబంధించి తమ పొలాన్ని దుక్కి చేసుకుందామా? వద్దా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రబీలో సబ్సిడీ విత్తన కాయల విషయంలో చేతులెత్తేసింది. ఇక మిగిలింది ఖరీఫ్ సాగే. జిల్లాలో అత్యధికంగా సాగు చేసే పంట వేరుశనగే. జూన్ మొదటి వారం నుంచి సాగుకు అనుకూలమైన సమయం. గత రెండు రోజుల నుంచి అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురవడంతో కర్షకులు సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం అందించే రాయితీ వేరుశనగ విత్తన కాయలు ఈ సీజన్లోనైనా ఇస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. -
లిడ్క్యాప్ భూముల కబ్జాకు యత్నం
తిరుపతి రూరల్: మండలంలోని దామినేడు వద్ద లిడ్క్యాప్ సంస్థకు చెందిన భూములను చదును చేస్తుండగా దళిత సంఘాల నేతలు శనివారం అడ్డుకున్నారు. దళిత సంఘం నేత సుధాకర్బాబు మాట్లాడుతూ దామినేడు లెక్క దాఖలా సర్వే నంబర్ 71/ఏ 2.80 సెంట్లు, 72/3ఎ 1.74 సెంట్లు, 72/2ఏ 1.11 సెంట్లు, 101/3ఏ 0.83 సెంట్లు, 101/2 ఏ 2.70 సెంట్లు మొత్తం 9.23 ఎకరాలు ఉండగా అందులో 6 ఎకరాల భూమిని 1973 – 74లో అప్పటి ప్రభుత్వం చర్మ కారులకు లిడ్ క్యాప్ సంస్థ పేరున కేటాయించిందన్నారు. మాదిగల అభ్యున్నతికి కోసం కేటాయించిన భూమిని తిరుపతికి చెందిన గిరిధర్, రామ్మూర్తి, గోవింద్ చదును చేస్తుండగా అడ్డుకున్నామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణ దారులకు లిడ్ క్యాప్ పరిరక్షణ కమిటీ సభ్యులు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. సదరు భూమిపై సమగ్ర సమాచారం అందేంత వరకు ఒక వారం రోజుల పాటు ఎవరూ ఆ భూమిలోకి ప్రవేశించకూడదని ఇరువర్గాల వారికి సూచించారు. అనంతరం కమిటీ చైర్మన్ పి.సుబ్బయ్య మాట్లాడుతూ చర్మకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను రక్షించాలని పోలీసులను కోరారు. ఇప్పటికే ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు వేర్వేరుగా ఫిర్యాదులు అందించామన్నారు. అడ్డుకున్న వారిలో లిడ్ క్యాప్ భూముల పరిరక్షణ కమిటీ సభ్యులు వాలముని, బి.కృష్ణ, కే.కాటయ్య, డి.రాంబాబులు ఉన్నారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
తిరుమల: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సుబేందు సమంతా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేష్ నాయక్ శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అలాగే సినీ దర్శకుడు సముద్రఖని, దర్శకుడు మొహర్ రమేష్ కూడా తిరుమలేశుని దర్శించుకున్నారు. ఈకేవైసీ చేయించుకోండి తిరుపతి అర్బన్: రేషన్కార్డు ఉన్న వారు తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా ఫౌరసరఫరాల శాఖాధికారి శేషాచలం రాజు శనివారం తెలిపారు. కార్డులో ఉన్న సభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. మీ రేషన్కార్డు, ఆధార్కార్డును రేషన్ డీలర్ లేదా సచివాలయం వద్దకు వెళితే మీ వేలిముద్రలు తీసుకుంటారని వెల్లడించారు. దీంతో ఈకేవైసీ పూర్తి అవుతుందన్నారు. జిల్లాలో 6 లక్షల రేషన్కార్డులున్నాయని, సుమారుగా 17 లక్షల మంది సభ్యులున్నారని పేర్కొన్నారు. అయితే 68 వేల మంది సభ్యుల ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లు చూపుతుందని చెప్పారు. వారు తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. అయితే 5ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు ఈకేవైసీ అవసరం లేదని స్పష్టం చేశారు. -
పెంచలకోన క్షేత్రం.. భక్త జన సంద్రం
రాపూరు:మండలంలోని పెంచలకోన క్షేత్రం శనివా రం భక్తులతో కిక్కిరిసింది. బ్రహ్మోత్సవాల అనంత రం వచ్చే మొదటి శనివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెనుశిల లక్ష్మీనరసింహాస్వా మి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామివారిని దర్శించు కుని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 4 అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు పూలంగిసేవ నిర్వహించారు. 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నిత్యకల్యాణ మండలంలో కొలు వు దీర్చి, విశేషాలంకరణ చేసి, శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ఊజంల్సేవ చేశారు. -
వసంతోత్సవం.. పరిసమాప్తం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన వసంతోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన చేశారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులు, సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామి, రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి, ఆస్థానం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.45 నుంచి 3.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రాజోపచారం చేశారు. చక్రధార, శంఖధార, సహస్రధార, మహాకలశాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో కురువేరు, వట్టివేరు, రోజా, మల్లె, సంపంగి, గులాబి, దవణం, తులసి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. కాగా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధన శేఖర్ పాల్గొన్నారు. -
ప్రతి నిర్మాణం అనుభవపాఠం!
ఏర్పేడు: తిరుపతి ‘భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ(ఐసర్)’ శాశ్వత ప్రాంగణంలో ప్రతి నిర్మాణం విజ్ఞానాన్ని అందించేలా అను భవ పాఠం నేర్పుతోంది. ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్లో కొలీజియం(ఆడిటోరియం) భవనానికి రసాయన ఫార్ములాలను అరలు లాగా అమర్చడంతో కొత్తగా ఐసర్ను చూసేందుకు వచ్చిన వారు వినూత్నంగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూసి అబ్బురపడుతున్నారు. దాని సమీపంలో ఉన్న సైన్స్ ప్రయోగ భవనాలను విభిన్న ఆకృతులు, దేశంలో పేరెన్నిక గల సైన్స్ నిపుణులు, శాస్త్రవేత్తల పేర్లు, వివిధ సైన్స్ ఫార్ములాలను రాయడం, భవనాల ఆకృతులు కూడా విభి న్నంగా కనిపిస్తున్నాయి. వ్యాసాశ్రమంలో అక్రమాలపై ఫిర్యాదు ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని శ్రీవ్యాసాశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆశ్రమ పూర్వ విద్యార్థుల సంఘం భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినట్లు వెల్లడించారు. ఆశ్రమంలో వ్యవస్థాపకులు సద్గు రు మలయాళ స్వామి ఆశయాలకు అనుగుణంగా పాలన జరగడం లేదని అందులో పేర్కొన్నా రు. చిత్తూరులోని వ్యాసాశ్రమానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారని ఆరోపించారు. ఆశ్రమంలో భక్తులను లో పలికి రానివ్వకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేశారని, ఆశ్రమంలో గతంలో ఉన్న వేదవిద్య, కంటి వైద్యశాల వంటివి మూతవేశారన్నారు. ఆశ్రమంలో నిధులను నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసి దుర్వినియోగం చేస్తున్నారని, వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖను పంపినట్లు తెలిపారు. శ్రీవారి సేవలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్తిరుమల: భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ దంపతులు శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వదించారు. అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి సేవలో కేంద్ర ఎన్నికల అధికారి చంద్రగిరి: కేంద్ర ఎన్నికల అధికారి గ్యానేష్ కుమార్ దంపతులు శనివారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని, అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
శాస్త్రోక్తంగా చక్రస్నానం
నాగలాపురం: మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం ఉదయం పద్మసరస్సులో చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు భట్టాచార్యులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, నిత్య కై ంకర్యాలు పూర్తి చేశారు. 6.30 గంటలకు స్వామివారిని పల్లకిలో కొలువుదీర్చి, గ్రామోత్సవం నిర్వహించారు. పల్లికి సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి వారికి స్నపన తిరుమంజనం చేశారు. 10.45 గంటలకు కోనేటిలో జలాలకు సంప్రోక్షణ చేసి, చక్రస్నానం నిర్వహించారు. అదే సమయంలో భక్తులు కోనేటిలో స్నాన మరిచారు. తరువాత ఉత్సవర్లకు ఆస్థానం జరిపారు. సాయంత్రం 7 గంటలకు విశ్వక్సేనుడితో కలిసి స్వామి వారిని మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్ రాయులు, ఉదయ్ కుమార్, అర్చకులు దేవరాజ్ భట్టాచార్యులు పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఏర్పేడు: మండలకేంద్రానికి సమీపంలో శనివారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్పేడుకు చెందిన వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి కథనం మేరకు.. మండల కేంద్రంలోని కమ్మవీధికి చెందిన వంకాయలపాటి కరుణాకర్నాయుడు(65) జాతీయ రహదారి పక్కన ఉన్న తన పొలానికి మట్టి తోలించడానికి వెళ్లి తిరిగి ఇంటికి బైక్పై వస్తుండగా, ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదాన్ని తప్పించబోయే క్రమంలో శ్రీకాళహస్తి వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి లారీలో ఉన్న పెద్ద గ్రానైట్రాయి మృతుని పక్కన పడింది. దీంతో కరుణాకర్నాయుడికి బలమైన గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బైక్ను ఢీకొన్న బైక్పై వెళుతున్న యువకుడి కాలు విరగగా, తలకు గాయమైంది. దీంతో క్షతగాత్రుడిని తిరుప తి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీకాంత్రెడ్డి, ఎస్ఐ రవిప్రకాష్ తెలిపారు. -
గంగమ్మకు తిరుమల వెంకన్న సారె
తిరుపతి కల్చరల్: తాతయ్యగుంట గంగమ్మకు శనివారం శ్రీవారి సారె సమర్పించారు. టీటీడీ తరఫున పోటు ఏఈఓ గుండ్లూరు మునిరత్నం తిరుమలలోని శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు సారెను గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలో శ్రీపుండరీకవల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల మధ్య శోభాయాత్రగా గంగమ్మ ఆలయానికి సారెను తీసుకెళ్లి ఆలయ అర్చకులకు శేషవస్త్రాలు, పసుపు, కుంకుమ వంటి సారెను అందజేశారు. గంగమ్మకు టీటీడీ ఉగ్యోగులు సారె తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా శనివారం టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీ పవన్, అసోసియేట్ ప్రెసిడెంట్ మణికంఠ, కోశాధికారి రేఖ, భరత్, శివ, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చీర్ల కిరణ్, టీటీడీ ఉద్యోగుల సంఘం నేతలు రమాదేవి, మదన్మోహన్, చిన్నంగారి సూరిబాబు, ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్కుమార్ కుటుంబ సమేతంగా శనివారం గంగమ్మ తల్లికి సారెను సమర్పించారు. అనంతరం జాతర ఏర్పాట్ల నిమిత్తం ఆయన రూ.25 వేలు నగదును ఆలయ చైర్మన్ నైనాన్ మహేష్యాదవ్కు అందజేశారు. తరువాత శాప్ చైర్మన్ రవి నాయుడు గంగమ్మ తల్లి జాతర నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు విరాళాన్ని ఆలయ చైర్మన్ మహేష్యాదవ్కు అందజేశారు. -
జనసేన నేతలపై తిరుగుబాటు బావుటా!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన నాయకులపై ఆ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు మాకొద్దంటూ డిమాండ్ చేశారు. నాయకులు సొంత వ్యాపారాలు, పనుల్లో బిజీగా ఉంటూ.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు తమకు వద్దంటూ సీనియర్ నాయకుల సమక్షంలోనే నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంపై ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మరి కొందరు ముఖ్య నాయకులు హాజరయ్యారు. కొద్ది సేపటికి జిల్లా అధ్యక్షుల నియామకంపై చర్చ ప్రారంభమైంది. వెంటనే వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాము ఫోన్చేసినా, ఏదైనా చెప్పుకునేందుకు వెళ్లినా స్పందించరని మండిపడ్డారు. ఆ వెంటనే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నాయకత్వం పైనా నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేని నాయకులు, స్పందించని జిల్లా అధ్యక్షులు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపాదిత పేర్లపైనా అభ్యంతరం ప్రస్తుతం సూచించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో డాక్టర్ హరిప్రసాద్, కిరణ్రాయల్, విజయ్ పేర్లు ప్రస్తావించడంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, విజయ్కి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తలు ఒకానొక సమయంలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా కార్యకర్తలంతా లేచి.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తామని తేల్చిచెప్పారు. అప్పటి వరకు జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగటానికి వీల్లేదని పట్టబట్టారు. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా వేయాల్సి వచ్చింది. -
విజయ్కు సీఎం చాన్స్ ఇవ్వాల్సిందే: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏమాత్రం మంచి చేయని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం తాతయ్య గుంట గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా తాజా తమిళ రాజకీయ సంక్షోభంపైనా ఆమె స్పందించారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. కాబట్టి విజయ్కు సీఎంగా ప్రమాణం చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అవకాశం ఇవ్వాలి. తద్వారా తమిళ ప్రజల నిర్ణయాన్ని ఆయన ఆమోదించాలి అని రోజా అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి, విజయ్కు దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారామె. ‘‘జగనన్నకు, విజయ్కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు. అలాగే హామీల అమలు విషయంలోనూ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు’’ అని అన్నారామె. జగనన్న పాలనలో తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈవీఎంల మోసంతో కూటమి ప్రభుత్వం ధికారంలోకి వచ్చిందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ల బండారం బయటపడుతుందని ఆర్కే రోజా అన్నారు. -
అల్లుడు గారు.. ఈ పెళ్లి మా అమ్మాయికి ఇష్టం లేదు..!
తిరుపతి జిల్లా: పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడిని నమ్మించి...అవసరాల నిమిత్తం అతని రూ.11లక్షల 38వేలు తీసుకుని, తీరా పెళ్లి కోసం నిలదీస్తే ఇష్టం లేదని మోసం చేసిన ఓ కుటుంబంపై బాధితుడు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. బాపట్ల జిల్లా గూడపల్లి గ్రామానికి చెందిన సుజేంద్ర(35) ఏర్పేడు మండలం చింతలపాళెం డీఆర్డీవో ప్రాంగణంలో ఎస్ఎస్సీ ప్రాజెక్టు కింద డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్. సుజేంద్ర పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా, తొట్టంబేడు మండలం తాటిపర్తికి చెందిన కమలాకర్, తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి అతడి నుంచి పలుమార్లు రూ.11,38,756 నగదును ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకున్నారు. అలాగే, రూ.2లక్షలు విలువైన రెండు ఐఫోన్లు కూడా తీసుకున్నారు. మార్చి 6న యువతితో సుజేంద్రకు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 22న పెళ్లి జరిగే విధంగా లగ్న పత్రిక రాసుకున్నారు. అప్పటినుంచి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గట్టిగా నిలదీయడంతో యువతికి పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో తాను ఇచ్చిన నగదు, రెండు ఐఫోన్లు తిరిగి ఇచ్చేయాలని బాధితుడు డిమాండ్ చేశారు. నగదు తిరిగి ఇవ్వలేమని వారు ప్లేటు ఫిరాయించారు. తనను ఉద్దేశపూర్వకంగా పెళ్లి పేరుతో నమ్మించి అధిక మొత్తంలో నగదు తీసుకుని పక్కా ప్లాన్తో మోసగించారని బాధితుడు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యువతి, ఆమె తల్లిదండ్రులు, సోదరునిపై ఏర్పేడు ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఎవరికి వారు పంచుకున్నారు
తిరుపతిలోని కూటమి ముఖ్య నేతలు డివిజన్ల కోసం పట్టుపడుతున్నారు. ఎవరూ ఎవరి మాటను లెక్కచేయకపోవడంతో టీడీపీ, జనసేన ఎవరికి వారు డివిజన్లను పంపకాలు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మూడు నెలల కిందట సమావేశమైనప్పుడు ముఖ్యమైన నాయకుల్లో ఒక్కొక్కరు ఐదు డివిజన్ల చొప్పున బాధ్యతలు తీసుకోవాలని మాట్లాడుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 20 డివిజన్లు తనకే అప్పగించాలని పట్టుబట్టినట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు. ఇకపోతే నరసింహయాదవ్ 10 నుంచి 15 డివిజన్లు అడిగినట్లు చెబుతున్నారు. అన్నా రామచంద్రయాదవ్ ఐదు డివిజన్లు అడిగారని ప్రచారం జరిగింది. అయితే మబ్బు దేవనారాయణరెడ్డి నగరంలోని అన్ని డివిజన్ల బాధ్యత తనకు అప్పగిస్తే అభ్యర్థులందరినీ గెలిపించుకొస్తానని చెప్పినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. అలాగే జేబీ శ్రీనివాసులు అడిగినట్లు తెలిసింది. ఇందులో జనసేనకు ఎన్ని అనే ప్రస్తావన రాలేదని సమాచారం. ఎందుకంటే ఆ సమావేశంలో జనసేన ముఖ్యనేతలు లేరని తెలిసింది. -
వ్యాక్సినేషన్ కార్యక్రమం తనిఖీ
సూళ్లూరుపేట రూరల్: మండలంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మహిళలకు శుక్రవారం నిర్వహించిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీఎంచ్ఓ బాలకృష్ణానాయక్ తనిఖీ చేశారు. మండలంలోని కుదిరి, 104 వాహనం మందులు, షార్లోని గిరిజన కాలనీలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్లను వేసినట్లు అధికారులు తెలిపారు. వైద్యులు జయశ్రీదేవి, ఐ. రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం నాయుడుపేట టౌన్: మండలంలోని నరసారెడ్డికండ్రిగ వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. నరసారెడ్డికండ్రిగ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అ క్కడికక్కడే మృతిచెందినట్లుగా స్థానికులు గుర్తించారు. అయితే మృతదేహంపై అనేక వాహనాలు వెళ్లడంతో శరీర భాగాలు చిందరవందర కావడంతో ఆనవాళ్లు గుర్తుపట్టలేనంతగా మారాయి. సు మారు 35 ఏళ్ల వ్యక్తి శరీరంపై ఎలాంటి దుస్తులు లేవని, కేవలం డ్రాయిర్ మాత్రమే ఉందని ఏ ఎస్ఐ తెలిపారు. డేవిడ్ అనే అంబులెన్స్ డ్రైవర్ సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడి ఉన్న శరీర భాగాలను గోనెసంచిలో వేసి పోలీసులకు అప్పగించడంతో వారు ఆ మృతదేహాన్ని మార్చరీలో భద్రపరిచినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
మెరిసిన జిల్లా విద్యార్థులు
ఏపీఈసెట్ ఫలితాల్లో తిరుపతి సిటీ: పాలిటెక్నిక్ డిప్లొమో పూరైన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం గత నెల 23న నిర్వహించిన ఏపీ ఈసెట్–2026 పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తిరుపతి జిల్లాలో 92.62 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 1,522 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,463 మంది ఏపీఈసెట్ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,355 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మళ్లీ బాలికలదే పైచేయి.. ఉన్నత విద్యామండలి విడుదల చేసిన ఏపీఈసెట్–2026 ఫలితాల్లో జిల్లాలో బాలుర కంటే బాలికలే అత్యధిక శాతం మంది ఉత్తమ మార్కులు సాధించారు. ఏపీఈసెట్కు 980 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 902 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే 483 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా 453మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర స్థాయిలో మెరిసిన జిల్లా విద్యార్థులు జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. 20 విభాగాల్లో జరిగిన ఏపీ ఈసెట్ పరీక్షలో ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగంలో తిరుపతి శ్రీపురంకాలనీకి చెందిన సి వెంకట నిఖిత రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించింది. ఆమె తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ విభాగంలో డిప్లొమో పూర్తి చేసింది. అలాగే చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం, దామల చెరువుకు చెందిన విద్యార్థి సీ పునీత్ కుమార్ బీఎస్సీ(గణితం) స్ట్రీమ్లో ఈసెట్ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించారు. ఆయన చిత్తూరు విజ్ఞాన సుధ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి ఏపీఈసెట్ పరీక్షలో ర్యాంకు సాధించారు. ఏపీ ఈసెట్ ఫలితాల్లో పలు విభాగాల్లో రాష్ట్రస్థాయిలో ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలవిద్యార్థులు కుసుమ 9వ ర్యాంక్, ఎస్ గౌరి 19, భువనేశ్వరి 24, రమ్యకృష్ణ 30, కే నిఖిత 52, నందిని 47, శైలజ 64, శిరీష 74 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ వై ద్వారకనాథ్రెడ్డి, అధ్యాపక బృందం అభినందించారు. -
బుడిబడి నడకలేవీ..?
అద్భుతమైన పథకం.. మహాద్భుతమైన నిబంధనలు.. ఇంకేం పేద విద్యార్థులకు ఇబ్బందే ఉండదు. అక్షరాలు కదం తొక్కుతాయి. పేద పిల్లలందరూ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల తలుపులు తడతారు. పేదలందరికీ కార్పొరేట్ విద్య అందుతుంది. పేదింట అక్షరాల పూదోటలు విలసిల్లుతాయనుకున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి.. ప్రభుత్వం మారింది.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పేద విద్యార్థులు కార్పొరేట్ గడప తొక్కలేక మగ్గిపోతున్నారు. ఇదీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యా పథకం పరిస్థితి. సరైన అవగాహన కల్పించడంలో విఫలం విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు తమ ప్రాంతంలోనే ఉండే మంచి స్కూలును ఎంపిక చేసుకుంటే, ఉచిత విద్య పథకంలో అవకాశం కల్పిస్తామనే అవగాహన కల్పించలేదని విమర్శలున్నాయి. అలాగే కార్పొరేట్ పాఠశాలతోపాటు గుర్తింపు ఉన్న స్కూళ్లను ముందే సంప్రదించి...నామ్ అకడమిక్ పేరుతో రూ.30వేలు చెల్లించడం కుదరదని చెప్పడంలోను విద్యాశాఖ వెనుకబడి ఉందని చర్చసాగుతోంది. దీంతోనే అడ్మిషన్లు లేకుండా ఖాళీగా ఉన్న ప్రైవేటు స్కూళ్లను ఎక్కువగా ఎంపిక చేస్తున్నారని తెలుస్తుంది. తిరుపతి అర్బన్: పేద విద్యార్థులకు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో విద్యను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత విద్య పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థి తమ నివాసానికి సమీపంలోని ప్రైవేటు స్కూల్లో చేర్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ప్రతి కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలో 25శాతం అడ్మిషన్లు ఇవ్వాలనే నిబంధన పెట్టారు. ఆ విధానాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కచ్చితంగా అమలు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లుపొడుస్తుందనే విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ఏ గ్రేడ్లోనే కార్పొరేట్ స్కూళ్లలోనే కాకుండా బీ,సీ గ్రేడ్ల పరిధిలోని ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలను విద్యాశాఖాధికారులు చేర్పిస్తున్నారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో నాన్ అకడమిక్ ఫీజు రూ.30వేలు డిమాండ్ ఉచిత విద్య పథకానికి సంబంధించి కార్పొరేట్ స్కూళ్లను ఏ గ్రేడ్గా విభజించారు. అలాంటి స్కూళ్లలో పిల్లలను చేర్చుకుంటే విద్యాశాఖ ఒక విద్యా ర్థికి రూ.13 వేలు చొప్పన స్కూల్కు చెల్లించాలి (తల్లికి వందనంకు ఇచ్చే డబ్బులు), అలాగే మధ్యతరగతి ప్రైవేటు స్కూళ్లను బీ గ్రేడ్గా విభజన చేశారు. అలాంటి స్కూల్కు విద్యాశాఖ వారు ఒక్కో విద్యార్థికి రూ.11,500 చెల్లించాలి. మిగిలిన 1500 విద్యార్థి తల్లిఖాతాలో జమ చేస్తారు(తల్లికి వందనం రూ.13 వేలు నగదు విభజన), చిన్న ప్రైవేటు స్కూళ్లను సీ గ్రేడ్గా విభజన చేశారు. అలాంటి స్కూల్కు విద్యాశాఖ వారు ఒక్కో విద్యార్థికి రూ.10వేలు చెల్లిస్తారు. మిగిలిన రూ.3 వేలు నగదు విద్యార్థి తల్లి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు (ఏ గ్రేడ్)ఉచిత విద్య స్కీమ్ ద్వారా పిల్లలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. నాన్ అకడమిక్ పేరుతో అదనంగా రూ.30 వేలు ఒక్కో విద్యార్థి చెల్లించాలని మెలిక పెట్టేస్తున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు వారి జోలికి వెళ్లడం లేదు. ఇక బీ గ్రేడ్లో భాగంగా మీడియం స్కూళ్ల విషయానికి వస్తే ఒకటో తరగతిలో అడ్మిషన్లు తక్కువ శాతం ఉన్నవారు మాత్రమే పేద పిల్లలను చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. సీ గ్రేడ్లో భాగంగా చిన్న ప్రైవేటు స్కూళ్లు, ప్రధానంగా మండల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణంలో కొత్తగా పెడుతున్న చిన్న పాఠశాలల వారు మాత్రమే తమకు సరైన అడ్మిషన్లు లేకపోవడంతో పేద పిల్లలకు ఉచిత విద్య పథకం ద్వారా చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ సైతం అదే దారిలో అడుగులు వేస్తుంది. మొత్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలతో పనిలేకుండా అడ్మిషన్లు కోసం ఎదురుచూస్తున్న ప్రైవేటు స్కూళ్లలోనే ఉచిత విద్య పథకం ద్వారా చేర్చుతున్నారనే విమర్శలున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్యకు తగ్గుతున్న ఆదరణ నాలుగు విడతల్లో 25 శాతం విద్యార్థుల భర్తీ ఉచిత విద్య పథకంలో భాగంగా జూన్ 12 లోపు నాలుగు విడతల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను విద్యాశాఖ వారు ప్రైవేటు స్కూళ్లలో చేర్చించాల్సి ఉంది. అయితే మొదటి విడతలో 523 మంది పేద విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే అందులో 106 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్ తమకు నచ్చకపోవడంతో అడ్మిషన్లు తీసుకోలేదు. రెండో విడతలో 261 మందిని ఎంపిక చేశారు. వీరు ఈ నెల 16 లోపు అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరూ ఆడ్మిషన్లు తీసుకోలేదు. మూడో విడత ప్రక్రియ ఈ నెల 17 నుంచి 31వ తేదీ లోపు, నాలుగో విడత జూన్ 1 నుంచి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. -
టీడీపీ మూకలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
– మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరిక తిరుపతి తుడా: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ మూకలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని శుక్రవారం రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాయచోటిలో మంత్రి రామ్ప్రసాద్రెడ్డి భూ దందాలు, రౌడీయిజం, గంజాయి అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. రామ్ప్రసాద్రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వారికి ఇదే పరిస్థితి భవిష్యత్లో ఎదురవుతుందన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దాడి చేయడంపై ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. వంటగ్యాస్ లీక్.. ఐదుగురికి గాయాలు డక్కిలి: వంటగ్యాస్ లీక్ కావడంతో ఐదుగురు గాయపడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు కథనం మేరకు.. మండలంలోని దగ్గవోలు గ్రామానికి చెందిన బొడుగు జయమ్మ ఇంట్లో వంటగ్యాస్ లీకై ంది. వంట గ్యాస్ లీకై న సంఘటన గమనించిన జయమ్మ పక్కింటివారితోపాటు స్థానికులు, సమీప ప్రాంతంలో ఉన్న వారికి ఈ విషయం తెలియజేసింది. దీంతో పక్కింట్లో ఉన్న వీరపు వెంకటేశ్వర్లు భార్య మంజులతోపాటు బోడుబోయిన సుబ్రమణ్యం, పాడి ప్రసాద్ తదితరులు జయమ్మ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ గ్యాస్ లీకై ఉండడంతో గ్యాస్ను నివారించేందుకు ఆతృతగా గ్యాస్ రెగ్యులేటర్ను సరిచేశారు. తర్వాత గ్యాస్ను వెలిగించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని జయమ్మ, వెంకటేశ్వర్లు, మంజుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్, సుబ్రమణ్యం స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రిలో తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
దొరవారిసత్రం: మావిళ్లపాడు సమీపంలోని ఓ దాబా వద్ద జాతీయ రహదారికి పక్కనే గుర్తుతెలియని సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి డాబా వద్దకు బైక్పై వచ్చి మద్యం మత్తులో పడిపోయాడు. అక్కడ ఉన్న దాబాకు చెందిన వారు నీళ్లు తాగించి పంపారు. శుక్రవారం ఉదయం చూసేసరికి దాబాకు 100 మీటర్లు దూరంలో బైకు ఒక పక్క, ఒంటిపై దుస్తులు లేకుండా కేవలం డ్రాయిర్తో పడిపోయి మృతి చెందడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూటుగా మద్యం తాగిన అతను పడిపోవడంతో తాగేందుకు నీళ్లు లేక గొంతు ఎండిపోయి మృతి చెంది ఉండవచ్చని స్థానిక పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ చౌదరి ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృత దేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధి పనుల్లో పురోగతి చూపాలి
తిరుపతి అర్బన్: కేంద్రం చేపట్టిన అన్ని అభివృద్ధి పనుల్లో పురోగతి చూపాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అధ్యయన కమిటీ చైర్మన్ మాగంటి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తిరుపతికి విచ్చేసిన కమిటీ బృందం శుక్రవారం తాజ్ హోటల్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రానికి సంబంధించిన అమృత్, అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్)2.0, పీఎం స్వానిధి, అర్బన్ చాలెంజ్ ఫండ్, ఎన్యూడీఎం, పీఎం ఈ–బస్సు సేవా తదితర కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తిరుపతిలో మెరుగైన సౌకర్యాలకల్పన, పట్టణ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. మరోవైపు మెప్మా ఆధ్వర్యంలో మూడు విడతల్లో 3,752 మంది వీధి వ్యాపారులకు రూ.15.69 కోట్లు మంజూరుకు సంబంధించి పరిస్థితి ఏమిటని ఆరా తీశారు. పార్లమెంటరీ అధ్యయన కమిటీ సభ్యులు, అధికారులు సురేష్కుమార్, కరుణ, అనీల్కుమార్రెడ్డి, ప్రభాకర్, టీటీడీ ఈఓ రవిచంద్ర, జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శారదాదేవి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు లారీ దగ్ధం –తప్పిన పెను ప్రమాదం రేణిగుంట: కడప చైన్నె రహదారి రేణిగుంట సమీపంలోని రామకృష్ణాపురం సర్కిల్లో శుక్రవారం రాత్రి చైన్నె నుంచి రైల్వే కోడూరుకు వెళుతున్న లారీ మంటలకు ఆహుతైంది. స్థానికుల కథనం మేరకు.. రైల్వే కోడూరు చెందిన లారీ డ్రైవర్ ఖాజా హుసేన్ లారీలో రాయి లోడ్ చేసుకుని చైన్నెకి వెళ్లి అన్లోడ్ చేసి ఖాళీ లారీతో తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు టైర్లు వద్ద నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ లారీని పక్కకు ఆపి సురక్షితంగా బయటపడ్డాడు. రేణిగుంట అర్బన్ ఎస్ఐ ధర్మారెడ్డి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారు. ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే పూర్తిగా లారీ కాలిపోయింది. చోరీల కేసులో నిందితుడి అరెస్టు తిరుపతి క్రైం: తాళాలు వేసి ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని తిరుపతి జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.18.50 లక్షల నగదు, 126 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నెహ్రూ నగర్కు చెందిన ఉల్కేష్ (27) విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయాలను గమనిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూవచ్చాడు. తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో వరుసగా జరిగిన చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల దృశ్యాలు, అనుమానితుల కదలికలను విశ్లేషించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు 2024లో తిరుపతి నగర పరిధిలో మొత్తం ఆరు చోరీ కేసులకు పాల్పడినట్లు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి రూ.18.50 లక్షల నగదు, 126.135 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారు గొలుసులు, ఉంగరాలు, చైన్లు, లక్ష్మీ డాలర్ చైన్, చెవిపోగులు తదితర ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. కేసు ఛేదించిన పనిచేసిన సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
వైభవం..రథోత్సవం
నాగలాపురం: మండల కేంద్రంలోని వేదనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై విహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు భట్టాచార్యులు వేకువ జామున ఆలయ శుద్ధి, నిత్య కై ంకర్యాలు పూర్తి చేశారు. 6.30 గంటలకు స్వామివారిని రథంలో కొలువుదీర్చి గోవింద నామ స్మరణల నడుమ కోలాహలంగా రథోత్సవం జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకున్న వేదనారాయణుడికి ఆలయ ప్రాంగణలో స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం 4.30 గంటలకు రాములవారి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఆర్జిత కళ్యాణోత్సవం జరిపారు. రాత్రి 8 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను అశ్వ వాహనంపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు, పండరి భజనల నడుమ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ ఽశ్రీనివాసులు రెడ్డి, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్ రాయులు, ఉదయ్ కుమార్, అర్చకులు దేవరాజ్ భట్టాచార్యులు పాల్గొన్నారు. -
రక్తమోడిన రహదారులు
రాజంపేట: వైఎస్సార్ కడప జిల్లాలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణా లు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజంపేటలోని తిరుపతి, కడప బైపాస్ రోడ్డులో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓబులవారిపల్ల మండల గాడివారిపల్లెకుచెందిన కోటకొండ సుబ్బమ్మ (56), తిరుపతి ఆటోనగర్కు చెందిన పూర్ణచంద్రరాజు మృతి చెందారు. పోలీసులు స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నీళ్లు చల్లించేందుకు వచ్చి కాటికి.. తిరుపతి ఆటోనగర్కు చెందిన పూర్ణచంద్రరాజు, బత్తలబాలాజీ, కృష్ణమనేని శశిధర్ గురువారం రాత్రి కడపకు కారులో బయలుదేరారు. రాజంపేట బైపాస్లో ఉస్మాన్నగర్ వద్దకు రాగానే ప్రైవేటు బస్సు, కారు ఢీ కొన్నాయి. ముందుసీటులో ఉన్న పూర్ణచంద్రరాజు అక్కడక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న బత్తలబాలాజీ, వెనుక సీట్లో కూర్చున్న కృష్ణమనేని శశిథర్ గాయపడ్డారు. బత్తల బాలాజీ పెద్దనాన్న ఇటీవల మృతి చెందారు. పెద్దకర్మలో భాగంగా వీరు నీళ్లు చల్లించేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. విషాదం నింపింది. -
రూటు మార్చిన ఇసుకాసురులు
నాయుడుపేట టౌన్: స్వర్ణముఖి నది నుంచి ఇసుక పొట్టు మాటున తరలిపోతోంది. తరచూ తనిఖీలతో ఇసుకాసురులు రూటు మార్చి పొట్టు బస్తాల మాటున తరలిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో డంపింగ్ చేసి, అధికారులు, పోలీసుల కళ్లు గప్పి, పొట్టు మాటున లారీల్లో తమిళనాడుకు తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వెంగమాంబపురం సమీపంలో రహదారి పక్కనే ఉన్న ఓ స్టీల్ పరిశ్రమ వెనుకన ఉన్న అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది నుంచి ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలించి, డంపింగ్ చేసుకుని అర్ధరాత్రి సమయాల్లో లారీల్లో పొట్టుబస్తాల మాటున నిరంతరంగా తరలిస్తున్నారు. ఈ విషయమై అధికారులు, పోలీసులకు తెలిసినా పట్టించుకోక పోవడం ఆంతర్యం ఏమిటోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల కిందట వెంగమాంబపురం రహదారి పక్కనే ఉన్న స్టీల్ పరిశ్రమ వెనుక అటవీ ప్రాంతంలో ట్రాక్టర్లతో అక్రమంగా డంపింగ్ చేసిన ఇసుక నిల్వలను లారీలలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సమయానికే లారీ డ్రైవర్, క్లీనర్లు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అప్పటి నుంచి ఇసుక డంపింగ్ యార్డు వద్ద పొట్టుబస్తాలతో ఆపి ఉన్న లారీని పోలీసులు సీజ్ చేసి, తీసుకువెళ్లక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ సీజ్పై ఇంకా మంతనాలు జరుగుతున్నాయా? లేక అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోవడం లేదా? అని ప్రజలు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా తమిళనాడుకు ఇసుక అక్రమ రవాణా దందా సాగుతుందనడానికి ఈ సంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఏపీ పీజీసెట్ –2026 ప్రారంభం
తిరుపతి సిటీ: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ పీజీసెట్–2026 శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రం కోడ్ను ఎస్వీయూ వీసీ, పీజీసెట్ చైర్మన్ ప్రొఫెసర్ నర్సింగరావు వర్సిటీలోని పీజీ సెట్ కార్యాలయంలో విడుదల చేశారు. ఏపీ పీజీసెట్ – 2026లో భాగంగా తొలి రోజు శుక్రవారం మధ్యాహ్నం 4 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 397 మంది దరఖాస్తు చేసుకోగా 319 మంది హాజరుకాగా 78 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ ప్రొఫెసర్ పద్మావతి, కోకన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్రాజు తెలిపారు. తొలిరోజు 80శాతం హాజరు నమోదైందని పరీక్ష ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయన్నారు. ఈనెల 11వ తేదీ వరకు పీజీ సెట్ కొనసాగుతుందని తెలిపారు. అక్రమంగా చెరువు మట్టి తరలింపు ఏర్పేడు: మండలంలోని కోబాక పంచాయతీ కుప్పయ్యకండ్రిగ చెరువులో శుక్రవారం సమీపంలోని ప్రైవేటు వెంచర్కు అక్రమంగా మట్టి తరలిస్తుండడంతో పోలీసులు ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో మట్టి రాత్రింబవళ్లు తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వి తరలిస్తు న్నారు. చెరువును ఇప్పటికే పెద్ద పెద్ద గోతులుతో తవ్వేసి మట్టిని ప్రైవేటు వెంచర్లకు విక్రయిస్తూ కొందరు అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 70,001 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,085 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
స్వర్ణరథ రంగ వైభవం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు స్వర్ణరథోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్లు రమేష్ బాబు, రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్ పాల్గొన్నారు. -
‘మీరు చేసిన తప్పలకు శిక్ష అనుభవించాల్సిందే’
తిరుపతి: ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతూనే ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి రాజకీయం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై రాంప్రసాద్రెడ్డి వర్గీయులు దాడి చేయడం అత్యంత హేయమన్నారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో టీడీపీ గుండాలు దాడిలో గాయపడిన రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామి రెడ్డిను పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు.రౌడీయిజం చేస్తారు అనే రామ్ ప్రసాద్ రెడ్డికు మంత్రి పదవి ఇచ్చారు, రాయచోటిలో మంత్రి రాంప్రసాద్రెడ్డి భూ దందాలు, రౌడీ ఇజం, గంజాయి అక్రమాలు పెరిగిపోయాయి. ఖచ్చితంగా మీరు చేసిన శిక్షకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. దశరథ రామిరెడ్డి వైఎస్సార్సీపీలో ఉన్నారనీ మీరు దాడి చేశారు, దీనికి శిక్ష అనుభవించక తప్పదు. అన్యాయంగా మనుషుల్ని వేటాడి, కొట్టి, హత్య చేసేందుకు కుట్ర చేశారు. రామ్ప్రసాద్రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోరు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా దాడి చేశారు. ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదు, లా అండ్ ఆర్డర్ పూర్తి గా ఫెయిల్యూర్ అయ్యింది’ అని విమర్శించారు. -
స్విమ్స్పై బోర్డు సభ్యుడి పెత్తనం
సాక్షి టాస్క్ఫోర్స్: టీటీడీ ఆస్పత్రులు ఓ బోర్డు సభ్యుడుకి ఆదాయ వనరుగా మారింది. మెడికల్ షాపులు, ఇతర టెండర్లలో మితిమీరిన జోక్యం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఆ వ్యక్తి కారణంగా వివాదస్పదమవుతున్నాయి. ఆ వ్యక్తి మితిమీరిన జోక్యంతో స్విమ్స్, శ్రీ పద్మావతి ఆస్పత్రి రోగుల పాలిట శాపంగా మారాయి. మామూళ్ల పేరుతో టెండర్ దారులను లొంగదీసుకోవడం, మాట వినకపోతే వివిధ ఆరోపణలతో అడ్డుకోవడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. దీంతో ఆస్పత్రుల నిర్వహణ టీటీడీకి సవాల్గా మారింది. టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్, శ్రీ పద్మావతి, బర్డ్, చిన్నపిల్లల ఆస్పత్రులు నడుస్తున్నాయి. ఈ ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన మందులు సరఫరా, శానిటేషన్ నిర్వహణ, ఆహారం, ఇతర కొనుగోళ్లు టెండర్ల ద్వారా నిర్వహిస్తారు. ఈ క్రమంలో టీటీడీలోని ఓ బోర్డ్ సభ్యుడు టెండరుదారులను టార్గెట్ చేశారు. దాదాపు ఏడాదిన్నర పైగా ఆయన ఈ హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ తన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. తాను అడిగింది ఇవ్వాలని, చెప్పింది చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. అడిగింది ఇవ్వని పక్షంలో వారిపై వైఎస్సార్సీపీ ముద్ర వేయడం, అక్రమాలు జరుగుతున్నాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇదే విషయాలతో టీటీడీ పెద్దలను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ ఆయన మాఫియాను నడిపిస్తున్నారు. ఇప్పుడు స్విమ్స్ వంతు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తామని చెబుతున్న టీటీడీ పెద్దలు ఆస్పత్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్విమ్స్లో మూడు మెడికల్ షాపులకు గాను కేవలం ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మెడికల్ షాపు యజమానిని లొంగదీసుకునేందుకు ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తాను అన్నింటిలోనూ పక్కాగా ఉండానని, మీరు అడిగింది ఇస్తే రోగులకు సరసమైన ధరలకు మందులు అందించలేమని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఎన్నాళ్లు నిమ్మకుండి పోయారు. ఆ మెడికల్ షాప్నకు టెండర్ అయిపోవడంతో కొనసాగింపు లేకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. రూ.2 కోట్లు ఇస్తే రెండేళ్లు కొనసాగించేలా ఆర్డర్ తీయిస్తానని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ యజమాని ససేమిరా అనడంతో అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. టీటీడీకి ఈ మెడికల్ షాపు ద్వారానే దాదాపు రూ.31 లక్షలు ఆదాయం సమకూరుతోంది. టీటీడీ ప్రస్తుతం టెండర్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో ఆయననే కొనసాగించేందుకు బోర్డు తీర్మానం చేసింది. 20 రోజుల క్రితం ఆయన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చైర్మన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే స్విమ్స్ డైరెక్టర్ సైతం ఆ బోర్డు సభ్యుడి గుప్పెట్లో ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్ చెప్పిన ఉత్తర్వులు ఇవ్వకుండా డైరెక్టర్ తెలివిగా వ్యవహరిస్తున్నట్లు స్విమ్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం జరిగిన బోర్డు మీటింగ్లోనూ ఈ మెడికల్ షాప్ వ్యవహారాన్ని ఆ బోర్డు సభ్యుడు ప్రస్తావించగా చైర్మన్ గట్టిగా బదులిస్తూ ఏమి చేయాలో తనకు తెలుసు, కొనసాగించాలని డైరెక్టర్కి చెప్పాము కదా అంటూ గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది. మెడికల్ షాపులు, టెండర్లలో మితిమీరిన జోక్యం టీటీడీకి భారీ నష్టం పద్మావతి ఆస్పత్రిలో మెడికల్ షాపు అర్ధంతరంగా తొలగించడంతో టీటీడీకి భారీగా నష్టం చేకూరింది. రోగుల మందుల కష్టాలు పక్కన పెడితే నెలకు రూ. 21 లక్షలు టీటీడీ ఖజానాకు సమకూరేది. బోర్డు సభ్యుడు అడిగింది ఇవ్వకపోవడంతో నిర్ధాక్షణ్యంగా తొలగించేందుకు కుట్రపన్నారు. గతంలో ఆ బోర్డు సభ్యుడు మాటలను విశ్వసించిన చైర్మన్ ముందు వెనుక చూసుకోకుండా తల ఊపేశారు. మెడికల్ షాప్ టార్గెట్ వెనుక బోర్డు సభ్యుడు వ్యక్తిగత ఎజెండా ఉందని ఆయన గుర్తించలేకపోయారు. తద్వారా టీటీడీ ఆదాయానికి గండి పడడంతో పాటు రోగులు మందుల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. స్విమ్స్లోను ఇదే తరహా ఎత్తులు వేయడంతో బోర్డు సభ్యుడు వ్యవహారంపై చైర్మన్కు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న మెడికల్ షాపునే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. కొనసాగింపు ఆర్డర్ ఇవ్వాల్సిన స్విమ్స్, వీసీని ఆయన గుప్పెట్లో పెట్టుకుని ఉత్తర్వులు జారీ అవ్వకుండా అడ్డుపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చైర్మన్ ఆదేశాలని డైరెక్టర్ పెడచెవిన పెట్టినట్లు స్విమ్స్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. చైర్మన్ మాట నెగ్గుతుందా... లేదా బోర్డు సభ్యుడి టార్గెట్ ఫలిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. మందుల షాపు రానివ్వకుండా అడ్డు శ్రీపద్మావతి ఆస్పత్రిలో రోజుకు వెయ్యి మందికి పైగా రోగులు వస్తుంటారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో మెడికల్ షాపును నా అనుకున్న వాళ్లకు రాకపోవడంతో అడుగడుగునా ఆ బోర్డు సభ్యుడు అడ్డుపడుతున్నాడు. గతంలో ఉన్న మెడికల్ షాపును వివిధ ఆరోపణలతో ఆ యజమానికి వైఎస్సార్ సీపీ ముద్ర వేసి సాగనంపడంలో ఆయన విజయం సాధించారు. ఈ క్రమంలో సుమారు ఎనిమిది నెలల పాటు పద్మావతి ఆస్పత్రిలో మెడికల్ షాపు లేకుండా పోయింది. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నా మాత్రం మెడికల్ షాపును ఏర్పాటు చేయలేక టీటీడీ చేతులెత్తేసింది. తాను సిఫార్సు చేసిన ఏజెన్సీకి అర్హత లేకపోవడంతోనే మరో మెడికల్ షాపును రానివ్వకుండా ఆయన అడ్డుపడుతున్నారు. దీంతో రోగుల మందుల కష్టాలు తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో టీటీడీ విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. -
స్మార్ట్ అగ్రి ప్రాజెక్ట్కు ద్వితీయ బహుమతి
తిరుపతి సిటీ: ఏర్పేడు ఐసర్ విద్యాసంస్థలో ఇటీవల నిర్వహించిన ఏఐ ఫర్ లైఫ్ హాకథాన్ కార్యక్రమంలో ఎస్వీయూకు చెందిన ఎంసీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రూపొందించి స్మార్ట్ అగ్రి ఏఐ ప్రాజెక్ట్కు ద్వితీయ స్థానం లభించింది. విజేతలకు నిర్వాహకులు రూ.5 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆధునిక ఏఐ ఆధారిత అగ్రికల్చర్ ప్లాట్ ఫామ్ ప్రాజెక్టును ప్రొఫెసర్ కే విజయలక్ష్మి ఆధ్వర్యంలో రూపొందించిన విద్యార్థులు ఎస్ వంశీ, కే శ్రీనివాసులను గురువారం వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జి అంజిబాబు, ప్రొఫెసర్ శ్రీదేవి పాల్గొన్నారు. డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల అటానమస్ హోదాలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ గతనెల 16 నుంచి 29వ తేదీ వరకు జరిగిన నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కేవలం ఆరు రోజుల్లో విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాల్లో 97 శాతం విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారని, 13 విభాగాల్లో వంద శాతం ఫలితాలు సాధించామని చెప్పారు. ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు సహకరించిన ఎగ్జామినేషన్ సెక్షన్ బృందం, అధ్యాపకులను ఆమె ఈ సందర్భంగా అభినందిచారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్న్స్ డాక్టర్ ఎ విద్యుల్లత, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్న్స్ డాక్టర్ భద్రమణి, డాక్టర్ దివ్యవాణి, సూపరింటెండెంట్ శాంతి, నీలదాస్, సుధాకర్, చంద్రశేఖర్, లక్ష్మయ్య, సునీత, సరిత, శిరీష, శైలజ పాల్గొన్నారు. టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షల విరాళాలు తిరుమల : టీటీడీ ట్రస్టులకు దాతలు రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన నవ్య మార్కెటింగ్ యాజమాన్యం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. అలాగే గుంటూరుకు చెందిన వెంకటకృష్ణచైతన్య టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మరో రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. దాతల తరఫున విరాళాల డీడీలను టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు బుధవారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు. దాతలకు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలను అందజేసి సత్కరించారు. -
నేడు ఎడ్సెట్
తిరుపతి సిటీ: బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ ఎడ్సెట్–2026 శుక్రవారం జరగనుంది. కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు తిరుపతి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు తిరుపతి జాపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్లో 800 మంది, పుత్తూరు వెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 160 మంది పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఉండదని సూచించారు. తప్పని ఏనుగుల బెడద – కొండ్రెడ్డికండ్రిగ చెరువులో గజరాజుల హల్చల్ చంద్రగిరి: అటవీ సమీప గ్రామాల్లో ఏనుగుల బెడద తగ్గడం లేదు. రెండు నెలలుగా ఏనుగుల దాడులతో ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. మండలంలోని కొండ్రెడ్డికండ్రిగ చెరువులోకి గురువారం సాయంత్రం ఏనుగుల గుంపు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. చెరువులో సుమారు గంట పాటు తిష్టవేసిన ఏనుగులు అక్కడ నుంచి పంట పొలాలపై దాడులకు పూనుకున్నట్లు రైతులు వాపోతున్నారు. పక్వానికి వచ్చిన మమాడి కాయలను నాశనం చేస్తున్నాయని, వరి, జొన్న, అరటి తోటలను తొక్కేయడంతోపాటు వ్యవసాయ సామగ్రిని ధ్వంసం చేస్తున్నట్లు వాపోతున్నారు. -
శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల:తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ తిరుమల దేవి గురువారం తిరుమలలో శ్రీవారి ని దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు పలకగా, టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. ప్రభుత్వ భూమి కబ్జా కలువాయి(సైదాపురం): మండలంలోని వెంకటరెడ్డిపల్లి జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వ భూమిని కొందరు కూటమి నాయకులు కబ్జా చేసి, రెవెన్యూ అధికారులు పెట్టిన ప్రభుత్వ బోర్డును సైతం తొలగించి అక్రమ నిర్మాణాల కోసం రంగం సిద్ధం చేశారు. విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న, ప్రభుత్వ భూమి అని అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన లెక్క చేయకుండా నిర్మాణం చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బోర్డు తొలగించి, ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
అక్రమాలకు అధికారిక అనుమతులు
● ఇసుక, గ్రావెల్, మట్టి తరలింపునక ఇష్టారాజ్యంగా అనుమతులు ● ఒక్కో అనుమతికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మామూళ్లు ● ఓ మంత్రికి ప్రతి ట్రిప్నకు రూ.వెయ్యి మామూలు ● రోజూ వందల ట్రిప్పుల అక్రమ రవాణా అడ్డుకోవడం మరిచిన అధికారులుప్రకృతి సంపదను అక్రమంగా తవ్వి, తరలించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపేవారు. కేసులు పెట్టడం, అపరాధ రుసుములు వసూలు చేయడం చేసేవారు. అందుకే అక్రమార్కులు ఆ పనులకు వెళ్లాలంటే భయపడేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ప్రయత్నాలే చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలు, రవాణా గురించి అధికారులకు సమాచారం ఉన్నా.. స్థానికులు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారి కరువయ్యారు. అక్రమాలకు అధికారే అనధికారిక అనుమతులు ఇవ్వడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.సాక్షి టాస్క్ఫోర్స్: ప్రకృతి సంపదను అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆదేశాలతో అధికార బృందం అనుమతులు ఇచ్చింది. అధికారుల అండతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో మైనింగ్ దొంగలు చెలరేగిపోతున్నారు. అక్రమంగా తవ్వి విక్రయించే సొమ్ము నుంచి నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు వెళ్తున్నట్లు సమాచారం. అలాగే ఆ మంత్రికి కూడా అక్రమ సంపాదనలో నెలనెలా డబ్బుల పంపుతున్నట్టు కూటమికి చెందిన ఓ నాయకుడు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజక వర్గం నుంచి ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ సంపాదనలో మామూళ్లు తీసుకెళ్లి ఇవ్వాల్సిందేనని చెప్పడం విశేషం. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, చంద్రగిరి, నగరి, గంగాధనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజక వర్గాల పరిధిలో గత రెండేళ్లుగా విచ్చలవిడిగా ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ తవ్వకాలు జరిపి తమిళనాడుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ అక్రమాల విషయం ప్రతి రోజూ ఏదో ఒక పత్రిక, మీడియాలో ప్రసారం అవుతున్నా.. రెండు రోజులు ఆపి, మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. అలా కొనసాగించడానికి కారణం ఏమిటని కూటమి నేతలను ఆరా తీస్తే.. ‘మాదేం లేదు. నెలనెలా ఆ మంత్రికి తీసుకెళ్లి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమైంది, ఈ నెల రాలేదు’ అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అనుమతులు ఇలా.. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో భారీగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమంగా తవ్వి, తరలించాలంటే ముందుగా జిల్లా అధికారి ఒకరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు సమర్పించాలి. ఆ తరువాత స్థానికంగా ఉన్న నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇచ్చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయిలో పంపకాలు ఇలా ఉంటే.. మంత్రి గారికి ప్రతి వాహనానికి రూ.వెయ్యి ఇచ్చేయాలి. అలా రోజుకు ఎన్ని వాహనాల ద్వారా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలిస్తే అన్ని రూ.వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క సత్యవేడు నియోజక వర్గంలోనే 41 క్వారీలు ఉంటే.. రోజుకి 50 వాహనాలు, నెలకు 25 వేలు ట్రిప్పులు తరలిస్తున్నాయి. ఈ లెక్కన ఒక సత్యవేడు నియోజక వర్గం నుంచే నెలకు సుమారు రూ.3 కోట్లు మామూళ్లు వెళుతున్నట్లు అంచనా. ఒక్క సత్యవేడు నియోజక వర్గం నుంచే ఇలా ఉంటే.. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మిగిలిన ఏడు నియోజక వర్గాల నుంచి నెలకు ఎంత మొత్తంలో అక్రమ రవాణా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నియోజక వర్గాల్లో మాత్రం ఎక్కువ శాతం స్థానిక నాయకులే జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
వైభవం.. వసంతోత్సవం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ మూడు రోజుల ఉత్సవాలకు తొలి రోజున విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 8.30 గంటలకు మలయప్పస్వామివారు ఉభయ నాంచారులతో ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేయగా, గోవింద నామస్మరణలతో ఆలయ వీధులు మారుమోగాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి, ఊంజల్ సేవను జరిపారు. వసంతోత్సవాలను పురస్కరించుకుని నిత్య కల్యాణోత్సవం, తిరుప్పావడ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేశ్, ఆలయ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, పలువురు అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథోత్సవం జరగనుంది. -
ట్రై సైకిళ్లు మా కొద్దు బాబూ!
తిరుపతి అర్బన్: ‘మూడు చక్రాల మోటార్ వాహనం ఇస్తేనే తీసుకుంటాం. ట్రై సైకిళ్లు మా కొద్దు బాబూ’ అని దివ్యాంగులు భీష్మించారు. దీంతో నెల రోజులుగా ట్రైసైకిళ్లు కలెక్టరేట్ వద్ద ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. తమ అవసరాల నిమిత్తం లోకల్లో రవాణా చేయడానికి సౌకర్యంగా ఉంటుందని పలువురు దివ్యాంగులు మోటార్ వాహనాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. సాధారణ సమయంలోనే కాకుండా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లోనూ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సహాయ సంచాలకులు బి. వినోద్కు దాదాపుగా 300 మంది దివ్యాంగులు దరఖాస్తులు అందజేశారు. అయితే మూడు చక్రాల మోటార్ సైకిల్ ఒక్కొక్కటి రూ.1.20 లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని, మూడు చక్రాల సైకిల్ అయితే రూ.12 వేలు వస్తుందని, ట్రైసైకిళ్లను నెల రోజుల కిందట తెప్పించారు. ఆ మేరకు దరఖాస్తులు చేసుకున్నవారికి వచ్చి మూడు చక్రాల సైకిల్ను తీసుకుపోవాలని ఆహ్వానిస్తున్నారు. అయితే వాళ్లు మాత్రం తాము దరఖాస్తులు చేసుకున్నది మూడు చక్రాల మోటార్ వాహనం కోసమని, ట్రై సైకిల్ తమకు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ట్రైసైకిళ్లు తుప్పు పడుతున్నాయి. -
ముగిసిన డీమ్డ్ యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్లు
శ్రీకాళహస్తి: పట్టణంలో స్థానిక బ్రాహ్మణ సమాజ కమ్యూనిటీ హాల్ వేదికగా కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలోని పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ డీమ్డ్ యూనివర్సిటీ వారు నిర్వహించిన స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఆయుర్వేదం, సంస్కృతం తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ ప్రక్రియకు శ్రీకాళహస్తి పట్టణ, పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్చాన్సలర్ జి. శ్రీనివాసులు, డీన్ వెంకటరమణ పాల్గొని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలు, కోర్సుల ఎంపిక, భవిష్యత్తు అవకాశాలపై సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 25 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్తో పాటు ఆయుర్వేదం, ఎంబీఏ కోర్సులపై ఆసక్తి చూపినట్లు నిర్వాహకులు తెలిపారు. విలువల కూడిన విద్యాబోధన విద్యను వ్యాపార దక్పథంతో కాకుండా, భారతీయ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ అందించడమే తమ యూనివర్సిటీ ప్రత్యేకత అని వీసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ అధ్యక్షుడు సింగరాజు ప్రకాశం పాల్గొన్నారు. గుడిమల్లం ఆలయ ఈఓగా మునిశేఖర్ ఏర్పేడు: గుడిమల్లంలోని ఆనందవల్లీ సమేత పరశురామేశ్వరాలయం ఈఓగా మునిశేఖర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న రామచంద్రారెడ్డి గత నెలాఖరున ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో తిరుపతి దేవాదాయశాఖలో ఉన్న ఈఓ మునిశేఖర్ను ఇక్కడకు బదిలీ చేశారు. దీంతో ఆయన గురువారం విధుల్లో చేరారు. ఆలయ చైర్మన్ బత్తల గిరిబాబును కలసి సమన్వయంతో ఆలయాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మద్యం తరలిస్తున్న బొలేరో బోల్తా బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని నెరిణికండ్రిగ సమీపంలోని కేటీరోడ్డు చీటికాలువ వంతెన వద్ద గురువారం అదుపు తప్పి మద్యం తరలిస్తున్న బొలేరో బోల్తా పడింది. రేణిగుంటలోని మద్యం గోడౌన్ల నుంచి వరదయ్యపాళెంలోని మద్యం షాపులకు మద్యం బాటిళ్లు తీసుకెళ్లుతున్న బొలేరో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బొలేరోలోని మద్యం బాటిళ్లు పగిలిపోగా, సుమారు రూ. 10 లక్షలు నష్టం వాట్టిల్లినట్లు తెలిసింది. -
తప్పని ఏనుగుల బెడద
చంద్రగిరి మండలంలోని కొండ్రెడ్డికండ్రిగలో ఏనుగులు గురువారం సాయంత్రం హల్ చల్ చేశాయి. జనం భీతిల్లిపోయారు.రేయింబవళ్లు తరలింపు.. అక్రమ సంపాదన కోసం స్థానిక టీడీపీ నేతలు రేయింబవళ్లు ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారు. భారీ యంత్రాల ద్వారా తవ్వి పక్కనే ఉన్న తమిళనాడుకు తరలిస్తున్నారు. టిప్పర్ల ద్వారా తరలించి తమిళనాడులో అధిక ధరకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాల గురించి ఎవరైనా మాట్లాడితే వారిపై దాడులకు తెగబడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల వద్దకు గుర్తు తెలియన వ్యక్తులకు అనుమతులు ఉండవు. క్వారీల సరిహద్దుల్లోనే అనుచరులను కాపాలా ఉంచుతున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి క్వారీలోకి ప్రవేశిస్తుంటే.. వెంటనే అక్రమార్కులకు సమాచారం ఇస్తారు. కొత్త వ్యక్తిని ఫాలో అవుతారు. క్వారీ వివరాల కోసమే వెళ్లి ఉంటే వారిపై దాడులకు తెగబడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విలేకరులు ఎవరైనా వెళితే.. వారిపైనా దాడులకు యత్నిస్తున్నట్లు తెలిసింది. -
జిల్లాలో విద్యావ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు కాలేజీలు ఇష్టానుసారంగా విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్నాయి. నీట్, జేఈఈ కోచింగ్ పేరుతో తల్లిదండ్రులను ఆకర్షిస్తూ నిలువునా దోచేసేస్తున్నాయి.
ఇష్టారాజ్యంగా ఇంటర్ అడ్మిషన్లు ●కమీషన్ల ఆశ చూపి టీచర్లకు గాలం కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు కమీషన్ల ఎర వేసి గాలం వేస్తున్నాయి. పాఠశాలలో పది పాసైన విద్యార్థులను తమ కళాశాలలో చేర్పించేందుకు రెఫర్ చేయాలని ఒక్కో అడ్మిషన్కు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఉపాధ్యాయులు అదే ప్రవృత్తిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మభ్యమాటలు చెప్పి కమీషన్ ఇచ్చే కళాశాలలో ప్రవేశాల కల్పిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సిటీ: పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలలు నిబంధనలు తుంగలో తొక్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు తెరతీసి తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏకంగా తరగతులను ప్రారంభించాయి. ఎలాగైనా తమ కళాశాలలో ప్రవేశాలను పెంచుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కేవలం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలో మాత్రమే అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల కాకముందే ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రవేశాలు ముగింపు దశకు చేరుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు పదో తరగతి ఉత్తీర్ణులైన తమ పిల్లలను పట్టణాల్లో పేరొందిన కళాశాలలో ఇంటర్ చదివించాలని తల్లిదండ్రుల పరితపిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు యాజమాన్యాలు మీ పిల్లల ఫీజులో రాయితీ ఇస్తామని, నీట్, జేఈఈ కోచింగ్ ఇస్తూ ఇంటర్మీడిట్ టాప్ మార్కులతో పాస్ చేస్తామని మభ్యపెడుతున్నాయి. సాధారణ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థికి రూ.1.80 లక్షల నుంచి 2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. దీంతో పాటు హాస్టల్ ఫీజు నెలకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. బైపీసీ ప్లస్ నీట్ కోచింగ్కు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ల సమయంలో సగం ఫీజు కట్టాలని, మిగిలిన ఫీజు రెండు నెలలో చెల్లించాలని తల్లిదండ్రులను మభ్యపెడుతూ కోట్లు దోచుకుంటున్నాయి. దీంతో తల్లిదండ్రులు అప్పులు చేసి ప్రైవేటు యాజమాన్యాలు అడిగినంతా ముట్టజెబుతున్నారు. అనుమతులు లేని కళాశాలలతో జాగ్రత్త సుమా! తిరుపతి జిల్లాలో సుమారు 109 ప్రైవేటు కళాశాలలు ఉండగా అందులో కేవలం 75 కళాశాలలకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు సమాచారం. పలు కళాశాలలు అనుమతి ఒక చోట కళాశాలలు బ్రాంచీల పేరుతో మరో చోట నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కళాశాలలు తిరుపతి జిల్లాలో 33వరకు ఉన్నట్లు సమాచారం. కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు కళాశాలల నడుపుతున్న అధికారులు చోద్యం చూస్తుండటం గమనార్హం. జిల్లా సమాచారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 72 కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు 105 ఇంటర్ ఫస్ట్ ఇయర్కు అనుమతి ఉన్న సీట్ల సంఖ్య సుమారు 25 వేలు పూర్తి స్థాయి అనుమతులు ఉన్న ప్రైవేటు కళాశాలలు 63 అనుమతి ఒక చోట కళాశాల మరోచోట నడుపుతున్న కళాశాలలు 33 అపార్ట్మెంట్లు, నివాస గృహాల్లో నడుస్తున్న కళాశాలలు 54 ల్యాబ్లు, క్రీడామైదానాలు లేని కళాశాలలు సుమారు 80కి పైన నిబంధనలు పాటించకుంటే చర్యలు ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలు ఇంటర్ అడ్మిషన్లు చేపట్టినా, అధిక ఫీజు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు పిల్లలను ఇంటర్లో చేర్పించే క్రమంలో కళాశాల ఎంపికపై జాగ్రత్త వహించాలి. – జి రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి -
మూడు ప్రత్యేక రైళ్లు రెగ్యులరైజేషన్
10 నుంచి తిరుచానూరు–నాందేడ్ వీక్లీతిరుపతి అన్నమయ్యసర్కిల్: ప్రయాణికుల రద్దీని దృష్ట్యా తిరుపతి మార్గంలో నడిచే మరో మూడు రైళ్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ తెలిపారు. ఇందులో నాందేడ్ – తిరుచానూర్, తిరుపతి–పంఢరాపూర్, జాల్నా – తిరుచానూరు రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రైలు నెంబర్ 17637 జాల్నా– తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల 11 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు జాల్నాలో సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి రాత్రి 9.10 గంటలకు చర్లపల్లికి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుచానూరుకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 17638 తిరుచానూరు – జాల్నా వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుచానూరులో మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. జాల్నా, తిరుచానూర్ మధ్య నడిచే రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో వికారాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రైలు నెంబర్ 17636 నాందేడ్ – తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు నాందేడ్లో శనివారం మధ్యాహ్నం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు విజయవాడకు, మధ్యాహ్నం 12.20 గంటలకు తిరుచానూరుకు చేరుకుంటుంది. ప్రత్యేక రైలు రైలు నెంబర్ 17634 తిరుచానూరు – నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల 10 నుంచి ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుచానూరులో ఆదివారం రాత్రి 7.45 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు వేకువజామున 2.40 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. నాందేడ్, తిరుచానూర్ మధ్య నడిచే ఈ వీక్లీ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల్లో బాసర, నిజామాబాద్, కోరుట్ల, లింగంపేట్ జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుపతి, పంఢరాపూర్ మధ్య నడిచే రైళ్లు రేణిగుంట, రాజంపేట, కడప, యరగ్రుంట్ల, తాడిపత్రి, గుత్తి, ధోనే, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్నగర్, షాద్నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. -
దత్తత.. ఏదీ దక్షత..?
కల్లిపూడిలో ట్రాన్స్ఫార్మర్ ఎమ్మెల్యే సతీమణి తొట్టంబేడు మండలాన్ని దత్తత తీసుకోవడంతో తమ గ్రామం రూపురేఖలు మారిపోతాయని ప్రజలు సంబరపడ్డారు. అపరిష్కృత సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారు. గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని భావించారు. తీరా చూస్తే గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. కనీసం అవసరమైన విద్యుత్ సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొట్టంబేడు మండలంలోని కల్లిపూడి గ్రామాన్ని బొజ్జల రిషితమ్మ దత్తత తీసుకున్నారు. తమ గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కరించకపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. రెండు రోజులుగా విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్కో అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారే లేరని, పేరుకే దత్తత గ్రామం తప్పితే సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని మండిపడుతున్నారు. – తొట్టంబేడు -
ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
తిరుపతి ఎడ్యుకేషన్ : అన్నమయ్య సర్కిల్లో ప్రభుత్వ గ్రేడ్–1 గ్రంథాలయంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు ఏర్పాటు చేసిన ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తెలిపారు. వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో 5 నుంచి పదో తరగతి విద్యార్థులకు యోగ, ధ్యానం, డ్రాయింగ్, పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంగ్లిష్ గ్రామర్, కథలు చెప్పడం, చెప్పించడం, కంప్యూటర్ పరిచయం, ఇంటర్నెట్ వినియోగం, క్రాఫ్ట్ వర్క్స్, తెలుగు పద్యాలు, తెలుగు గ్రామర్, వ్యక్తిత్వ వికాసం, జనరల్ నాలెడ్జ్ లోఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయాధికారి జె.శివప్రసాద్ పాల్గొన్నారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: బాలాజీ రైల్వేడివిజన్ ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ అన్నారు. గురువారం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తిరుపతికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ను తిరుపతికి తరలించి పరిపాలన కేంద్రాన్ని బలోపేతం చేయాలన్నారు. తిరుపతి జిల్లా గుంతకల్లు, గుంటూరు, బెజవాడ, చైన్నె, డివిజన్లు నాలుగు రైల్వే డివిజన్లతో అనుసంధానం కలిగి ఉండడంతో పరిపాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వి చౌదరి, శ్రీధర్ బాబు, వైఎస్ బాబు, హేమంత్ కుమార్, చిట్టిబాబు, నీలేష్ కుమార్, నీలాద్రి, రమేష్,తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఆస్పత్రిగా స్విమ్స్ అభివృద్ధితిరుపతి తుడా: రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా స్విమ్స్ను అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. గురువారం స్విమ్స్ ఆస్పత్రిలో రూ.55 కోట్లతో ఏర్పాటు చేసిన పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్ లీనియర్ యాక్సిలరేటర్ తదితర ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ విశ్వవిద్యాలయం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్ డాలర్స్ దివాకర్రెడ్డి, బోర్డు సభ్యులు సదాశివరావు, పనబాకలక్ష్మీ, జారకీదేవి, భాను ప్రకాష్రెడ్డి, వైధ్యాధికారులు పాల్గొన్నారు. -
ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షల ఫీజు తేదీల ప్రకటన
తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పలు డిగ్రీ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు తేదీలు, పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ వర్సిటీ స్టడీసెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21 నుంచి, సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. పరీక్షలు హాజరుకానున్న అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఓపెన్ వర్సిటీ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ ఓల్డ్ ప్యాటర్న్) పరీక్షలు జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మొదటి, రెండు, మూడో సంవత్సరం డిగ్రీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఈనెల 25వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్వీ జూపార్క్ క్యూరేటర్గా అనురాగ్ మీనా తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 2020 బ్యాచ్ ఇండియన్ ఫా రెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి అనురాగ్ మీ నా బుధవారం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూపార్క్) క్యూరేటర్గా బాధ్యతలు స్వీకరించారు. అటవీ సంరక్షకుడిగా పదోన్నతి పొంది కర్నూలు సర్కిల్కు బదిలీ అయిన సెల్వం స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్కు చెందిన అనురాగ్ మీనా వన్యప్రాణుల నిర్వహణలో తనకున్న అపారమైన అనుభవంతో కొత్తగా బాధ్యతలను చేపట్టారు. ఇంతకుముందు రైల్వే కోడూరులో సబ్–డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (సబ్–డీఎఫ్ఓ)గా, ఆ తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని నంద్యాలలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించేందుకు విచ్చేసిన అనురాగ్ మీనాకు ఎస్వీ జంతు ప్రదర్శనశాల అధికారులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. రేపు ఎస్వీయూలో జాబ్మేళా తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాకు హాజరై సుమారు 1,800కు పైగా పలు రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ, డిప్లొమో అర్హతగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
విషమపరీక్ష
ఎస్వీయూ పరిపాలనా భవనం పీజీసెట్ అభ్యర్థులు సొంత జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు రాసుకునే పరిస్థితి లేదు. ఏపీపీజీసెట్–2026కు ఆతిథ్యమిస్తున్న ఎస్వీ యూనివర్సిటీలోనే పరీక్ష కేంద్రం లేకపోవడంతో అభ్యర్థులు పొరుగు జిల్లాల్లో పరీక్షలు రాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్యయప్రయాసల కోర్చి, పరీక్ష ముందు రోజే కేటాయించిన కేంద్రాలకు చేరుకుని అక్కడ బస చేయాల్సి వస్తోంది. దీంతో అభ్యర్థులు అవస్థలు పడాల్సి వస్తోంది. తిరుపతి సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా 17 యూనివర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీజీసెట్–2026కు ఆతిథ్యమిస్తున్న ఎస్వీ యూనివర్సిటీలో పీజీసెట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. తిరుపతి జిల్లాలో ఒక పరీక్ష కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో తిరుపతి జిల్లా నుంచి పీజీ సెట్ పరీక్షకు హాజరవుతున్న వేలాదిమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పడం లేదు. 3 వేల మంది దరఖాస్తు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీపీజీసెట్కు ఈ ఏడాది జిల్లా నుంచి సుమారు 3 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరు పరీక్ష రాసేందుకు తిరుపతి జిల్లాలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించలేదు. దీంతో వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో జిల్లా విద్యార్థులకు సెంటర్లను కేటాయించారు. శుక్రవారం నుంచి పీజీసెట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఒక రోజుముందే చేరుకుని వ్యయ ప్రయాసలకోర్చి సమీపంలోని హోటళ్లలో బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్కో అభ్యర్థికి కనీసం రూ.5 వేలు ఖర్చు అవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. అధికారులు చొరవ చూపాలి ఉన్నత విద్యామండలి అధికారులతోపాటు ఎస్వీయూ అధికారులు పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు. గత ఏడాది పీజీసెట్ ప్రవేశ పరీక్ష సెంటర్ల ఏర్పాటులో చొరవ చూపకపోవడం, జిల్లా విద్యార్థులకు సెంటర్లు సుదూర ప్రాంతాల్లో కేటాయించడంతో వందలాది మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. గత మూడేళ్లగా దరఖాస్తుల వివరాలివీ.. కోర్సుల వివరాలు 2024లో 2025లో 2026లో కెమికల్ సైన్స్ 8,551 6,070 3,581 లైఫ్ సైన్స్ 3,753 4,027 3,260 కంప్యూటర్ 2,975 2,333 1,884 కామర్స్ 2,215 1,438 980 ఇంగ్లిష్ 1,127 898 746 హ్యుమానిటీస్ 1,575 883 634 జువాలజీ 1,875 1,548 1,221 గణితం 2,200 1,175 835 ఫిజిక్స్ 1,495 938 653 బోటనీ 1,370 1,295 1,012 మిగిలిన అన్ని కోర్సులు 6,013 5,083 4,312 మొత్తం 30,934 25,688 19,118ప్రవేశ పరీక్ష..తప్పని తిప్పలు ఆదరణ కోల్పోతున్న ఏపీ పీజీసెట్ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు 23 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఏపీపీజీసెట్–2026కు ఆదరణ కరువవుతోంది. 17 యూనివర్సిటీల్లో 143 కోర్సులకు సంబంధించి 20 వేలకు పైగా సీట్లు ఉండగా కేవలం 19,118 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పీజీసెట్కు హాజరయ్యే విద్యార్థులకు 1:1 ప్రాతిపదికన సీట్లు కేటాయించినా పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోనున్నట్లు గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి పీజీ కోర్సుల్లో ప్రవేశాలు భారీ స్థాయిలో పడిపోతుండటం యూనివర్సిటీలపై ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు భూమి పూజ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ప్రపంచ ప్రఖ్యాత క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ శ్రీసిటీలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో నూతన తయారీ కేంద్ర నిర్మాణాన్ని బుధవారం ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలో తొలి తయారీ యూనిట్ కానుంది. మంత్రి లోకేశ్ దీనికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మోడ్రన్ ఎయిర్ కండిషనింగ్ను కనిపెట్టడం నుంచి 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ సంస్థగా ఎదగడం వరకు క్యారియర్ ఎప్పుడూ ఆవిష్కరణల్లో ముందంజలో ఉందన్నారు. శ్రీసిటీలో పరిశ్రమ ద్వారా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. క్యారియర్ గ్లోబల్ చైర్మన్, సీఈఓ డేవిడ్ ఎల్ గిట్లిన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ క్యారియర్ భారత ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి పెళ్లకూరు: మండలంలో గొర్రెల కాపరి బుధవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. వివరాలు.. పెళ్లకూరు మండలంలోని శిరసనంబేడు గ్రామానికి చెందిన సంచి సిద్ధార్థన(52) బుధవారం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి గొర్రెలు మందను తీసుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలో ఉన్న గొర్రెల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మామిడిపై బాంబు
ఈ ఏడాదీ గడ్డుకాలమే? ●సాధారణంగా రైతు ఏం కోరుకుంటాడు..అందరికంటే తనకు పంట దిగుబడులు బాగుండాలని..మంచి లాభాలు రావాలని ఆశిస్తాడు. అయితే మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు తయారైంది మామిడి రైతు పరిస్థితి. గత ఏడాది కాయలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు పాలుకాగా.. ఈ సీజన్లో కూడా అదే స్థితి నెలకొనే సూచనలు దాపురించాయి. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం మన మామిడిపై పడింది. యుద్ధం కారణంగా జిల్లాలోని మామిడి గుజ్జు ఎగుమతులు ఆగిపోయి, నిల్వలు పేరుకుపోయాయి. మామిడి సీజన్ ప్రారంభమైనా ఇంకా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 48,360 మెట్రిక్ టన్నుల పల్ప్ నిల్వలు జిల్లాలో 8 మామిడి ఫ్యాక్టరీలున్నాయి. ఈ ఫ్యాక్టరీల నుంచి తోతాపురి కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఫ్యాక్టరీల వద్ద 48,360 మెట్రిక్ టన్నుల మామిడి గుజ్జు నిల్వలున్నాయి. వాటిని విక్రయిస్తేనే మళ్లీ మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ఆసక్తి చూపుతుంటాయి. అయితే యద్ధం నేపథ్యంలో గుజ్జు ఎగుమతి లేదంటూ ఫ్యాక్టరీలు ఆవేదన చెందుతున్నాయి. ఈ తరుణంలోనే మే మొదటి వారం ముగుస్తున్నా ఫ్యాక్టరీలు మామిడి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదని చర్చసాగుతోంది. తిరుపతి అర్బన్: మామిడి రైతులకు ఈ ఏడాది గడ్డుకాలం తప్పేలాలేదు. గత ఏడాది ఓ వైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మరోవైపు ఫ్యాక్టరీలు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తోతాపురికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు రూ.8 చొప్పున, ప్రభుత్వం రూ.4 చొప్పున కిలో రూ.12 గిట్టుబాటు ధర వస్తుందని రైతులు గత ఏడాది భావించినప్పటికీ అంతంత మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులే పునరావృతం అవుతాయేమోనని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. 98,700 ఎకరాల్లో మామిడి సాగు ఈ ఏడాది 98,700 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. అందులో 70 వేల ఎకరాల్లో తోతాపురి రకం సాగులో ఉంది. నీలం రకం 18,500 ఎకరాలు, బేనీసా రకం 10,200 ఎకరాలు సాగులో ఉంది. సాధారణంగా దిగుబడి బాగా వస్తే ఎకరం 5 నుంచి 7 టన్నులు వస్తుంది. గత ఏడాది మంచి దిగుబడి వచ్చింది. అయితే ధరలు లేవంటూ రైతులు ఆందోళన చెందారు. ఈ ఏడాది ఎకరం 3 నుంచి 4 టన్నులకు మించి రావడం లేదు. దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రేట్లు లేకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. తగ్గిన రేట్లు మామిడి అంటే ప్రధానంగా సాగులో ఉండేది తోతాపురి రకం. అయితే ఏ గ్రేడ్ రకం కిలో రూ.15, బీ గ్రేడ్ రకం రూ.10 నుంచి రూ.12 వరకు రేట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఓ వైపు సరైన రేట్లు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సాధారణంగా ఫ్యాక్టరీలు మే మొదటి వారం నుంచి మామిడి కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఇంకా కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టకపోవడంతో రైతులకు టెన్షన్ తప్పడం లేదు. కోతకు మామిడి పంట సిద్ధంగా ఉంది. అయితే కొనుగోలు చేసేవారు కనిపించడం లేదు. మరోవైపు ఆకాల వర్షాలతో మామిడి రాలిపోతుందనే ఆందోళన రైతులను వేధిస్తోంది. త్వరలో కొనుగోలు ప్రక్రియ జిల్లాలోని ఫ్యాక్టరీలు మామిడి కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టనున్నాయి. అయితే వారి వద్ద 48 వేల మెట్రిక్ టన్నులు మామిడి గుజ్జు నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది. మామిడిలో అత్యధికంగా తోతాపురి రకం సాగులో ఉంది. ఈ ఏడాది మామిడి నాణ్యత ఆధారంగా తోతాపురి కేజీ రూ.10 నుంచి రూ.15 వరకు రేట్లు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గింది. జిల్లాలో గత ఏడాది 73,500 ఎకరాల్లో మామిడి సాగులో ఉండేది. ఈ ఏడాది రైల్వే కోడూరు నియోజకవర్గం జిల్లాలో చేర్చడంతో మామిడి సాగు పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 98,700 ఎకరాల్లో మామిడి సాగులో ఉన్నట్లు లెక్కలు ఉన్నాయి. మొత్తంగా రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో మామిడి కోనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. – ఎన్. చిన్న రెడ్డెయ్య, ఇన్చార్జి జిల్లా అధికారి, ఉద్యానశాఖ -
చైన్నెకి తాగునీరు విడుదల
రాపూరు: మండలంలోని కండలేరు జలాశయం నుంచి బుధవారం చైన్నె నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు, నెల్లూరు, తిరుపతి జిల్లాల రైతులకు తాగు, రెండో పంట సాగుకు నీరు విడుదల చేసినట్లు తెలుగుగంగ ఎస్ఈ సుబ్రమణ్యేశ్వరావు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్ప్లాంట్ యూనిట్ నుంచి నీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, నీటి స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కండలేరు జలాశయంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. చైన్నె నగర ప్రజలకు, పరిశ్రమలకు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీటి అవసరాల కోసం 130 రోజుల్లో 13 టీఎంసీల 78 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో 70 వేల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 54 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. చెన్న నగరానికి తాగు నీటి కోసం 5 టీఎంసీలు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలకు తాగు నీటి కోసం 2 టీఎంసీలు, స్వర్ణముఖి బ్యారేజ్కి 2 టీఎంసీలు, మేనకూరు పారిశ్రామిక వాడకు ఒక టీఎంసీని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నీటిని సెప్టెంబర్ 15వ తేదీ వరకు అంటే 130 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ అనిల్బాబు, ఏఈ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
17న విజయవాడలో బీసీల మేధోమథన సదస్సు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: బీసీల ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ నెల17న బీసీల మేధోమథన సదస్సును విజయవంతం చేయాలని బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ విజయవాడ బెంజి సర్కిల్ వద్దనున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు, వివిధ బీసీ కుల సంఘ నాయకులు, ఉద్యోగులు, మేధావులు హాజరు కానున్నట్లు చెప్పారు. కేంద్రం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ చట్టాలు చేయడానికి చేసిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభనపైన బీసీ నేతలు సుదీర్ఘంగా చర్చిస్తారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అధిగమించే అంశాల పైన చర్చ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.నాగమల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కంభం లోకయ్య, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి జ్యోతి, అధికార తెలుగు భాషా సంఘం మాజీ సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, ఐటీ విభాగం మండల అధ్యక్షుడు శివ కోటి యాదవ్, బీసీ నాయకులు ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ తీగలు పడి వ్యక్తి మృతి తిరుపతి రూరల్: విద్యుత్ తీగలు తెగిపడటంతో షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో బుధవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం కై లాసపురానికి చెందిన ఓబుల్ నాయుడు, ప్రభావతి దంపతులు పదేళ్ల క్రితం తిరుపతిలోని గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీకి వచ్చి నివాసముంటున్నారు. హమాలీగా పనిచేసే ఓబుల్ నాయుడు బుధవారం పనులు ముగించుకుని వర్షం ఆగిన తరువాత నడిచి వెళ్తుండగా తన ఇంటికి సమీపంలోని ఓ విద్యుత్ తీగ తెగి అతనిపై పడింది. షాక్కు గురైన ఓబుల్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తన భర్త మరణానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. -
పోరాటం ఉధృతం చేయాలి
చంద్రబాబు పుట్టిన ఊరినే కాదు..రాయలసీమను కరువుసీమగా మార్చి, రైతులను కన్నీళ్లు పెట్టించి పైశాచిక ఆనందాన్ని పొందే చంద్రబాబు ద్రోహాన్ని సీమ జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని చెప్పాలి. ఇది కేవలం నీటి సమస్యగా మాత్రమే చూడవద్దు. ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభం కావాలి.. లేదంటే పోరాటం ఉదృతం చేయాలి. –చెవిరెడ్డి మోహిత్రెడ్డి, వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతి రూరల్: ‘జగనన్న పాలనలో 90 శాతానికి పైగా పనులు పూర్తి అయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేసింది చంద్రబాబే అన్న నిజాన్ని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.. స్వప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించి ప్రజా ఉద్యమానికి ఊపిరిపోయాలి.’ అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. భాకరాపేట సమీపంలోని లేక్వ్యూ రిసార్ట్స్లో ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం – చంద్రబాబు మోసం’ అన్న అంశంపై వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థి విభాగం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మోసాలు బట్టబయలయ్యాయని అన్నారు. కరువుసీమగా మార్చేందుకే బాబు కుట్ర -
కంటి పరీక్షకు టార్చిలైటే వైద్య పరికరం!
సత్యవేడు: స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో కంటి పరీక్షకు టార్చిలైటు ఒక్కటే వైద్య పరికరంగా కంటి వైద్యుడు సేవలందిస్తున్నారు.ీ స్థానిక సీహెచ్సీలో కంటి పరీక్షలకు వైద్యపరికరాలు లేవు. డాక్టర్ టార్చిలైట్తో కంటిపొరలను పరీక్షించి, మందులు రాసి ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ‘ముఖ్యమంత్రి ఐ కేంద్రాన్ని’ సత్యవేడు సీహెచ్సీలో ఏర్పాటు చేశారు. అప్పట్లో అపోలోకు కాంట్రాక్టు ఇచ్చారు. కంటి పరీక్షలకు అవసరమైన పరికరాలన్నీ కాంట్రాక్టర్ స్థానిక వైద్యశాలలో కంటి పరీక్షలకు అవసరమైన అన్ని పరికరాలు సమకూర్చారు. గత ఐదేళ్లు పేదలకు కంటి పరీక్షలు సక్రమంగా నిర్వహించి, ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చేవారు. కాంట్రాక్టు ముగియడంతో కాంట్రాక్టర్ అన్ని పరికరాలు తీసుకెళ్లడంతో గదులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సత్యవేడు వైద్యశాల లో కంటి పరీక్షకు టార్చిలైట్ ఒక్కటే పరికరంగా డాక్టర్ వినియోగిస్తున్నారు. వైద్యశాలో 12 పోస్టులకు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనస్తీషియా, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసన్, గైనకాలజిస్టు ఇద్దరికి ఒకరే ఉన్నా రు. రోజు వారీ 300 నుంచి 350 వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నారు. వైద్యశాలకు పలు రకాల మాత్రలు, మందులు సరఫరా కావడంలేదు. వసతి నామమాత్రంగా ఉంది. డెలివరీలు నెలలో 10 చేస్తున్నారు. పెద్ద ఆపరేషన్ 1, కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వారంలో నాలుగు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అందినన్ని రకాల వైద్యసేవలు నేడు అందడంలేదు. ప్రస్తుతం పేదవాడకి మెరుగైన వైద్యం అందడంలేదు. -
శ్రీసిటీలో ఉద్యోగ ఆధారిత వెల్డింగ్ శిక్షణ
తిరుపతి అర్బన్: వికలాంగ యువతకు ఉద్యోగ ఆధారిత వెల్డింగ్ శిక్షణ ఈ నెల 10న శ్రీసిటీలో నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హి జ్రా, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు బి. వినోద్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, శ్రీసిటీ సంయుక్తంగా వర్డల్ బ్యాంక్ ఆర్ఏఎంపీ ప్రాజెక్టు ద్వారా 3–6 నెలలు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నివాస సౌకర్యం, ప్రాక్టికల్ శిక్షణ, వందశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. 18–35 ఏళ్ల వికలాంగ యువత(సీ్త్ర, పురుషులు) అర్హులుగా పేర్కొన్నారు. పదో తరగతి లేదా ఇంటర్ చదువుకుని ఉండాలని చెప్పారు. అదనపు సమాచారం కోసం వాటాప్స్ నంబర్ 99596 10777లో సంప్రదించాలన్నారు. సముద్రనాచు సాగుకు ఒప్పందం తిరుపతి అర్బన్: పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాల్లో సముద్రనాచు సాగుకు కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ నేతృత్వంలో గ్రీన్ క్లైమేట్ ఫండ్(జీసీఎఫ్) ప్రాజెక్టు ఆధ్వర్యంలో సముద్ర నా చు సాగును ప్రోత్సహిస్తూ త్రైపాక్షిక అవగా హన ఒప్పందం కుదుర్చుకున్నారు. మంగళవారం కలెక్టరేట్లో మత్స్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం, ఆర్ఈఏడీఎస్ ఎన్జీఓ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. వాకాడు మండలంలో 50 ఫైలట్ సముద్ర నాచు యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. మత్స్యశాఖ జిల్లా అధికారి రాజేష్, డీఆర్డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభావతి, ఆర్ఈఏడీఎస్ సంస్థ ప్రతినిధి కట్టా వందనం పాల్గొన్నారు. దివ్యాంగుల సొమ్ము మింగేశాడు! తిరుపతి అర్బన్: దివ్యాంగుల సొమ్మును విభి న్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సహాయ సంచాలకులు బి. వినోద్ దోచు కున్నారని దివ్యాంగుల సంఘం నేతలు మండిపడుతున్నారు. ది వ్యాంగులకు అవగాహన సదస్సుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన రూ. కోటి పైగా అవినీతి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు మంగళవారం దివ్యాంగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి, నాయకులు మురళీగౌడ్, సుధాకర్, సుచేంద్ర, పద్మావతి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గోవిందరావుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆ శాఖ ఏడీ వినోద్ను వివరణ కోరగా తాను ఏ తప్పు చేయలేదన్నారు. పైసా కూడా అవినీతికి పాల్పడలేదని చెప్పారు. -
పాలిసెట్లో ఉత్తమ ర్యాంకులు
– వందశాతం అర్హత సాధించిన విశ్వం విద్యార్థులు తిరుపతి అర్బన్:తమ సంస్థల్లో శిక్షణ పొందిన విద్యార్థులు పాలిసెట్ –2026లో ఉత్త మ ర్యాంకులు సాధించారని విశ్వం విద్యా సంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మా ట్లాడుతూ తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యా సంస్థల్లో 2026 సంవత్సరం పాలిటెక్నిక్ ఎంట్రెన్స్కు శిక్షణ పొంది న విద్యార్థులు 100 శాతం అర్హత సాధించారని చెప్పారు. తమ విద్యార్థి వెల్దుర్తి మోక్షిత్ 120కి 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఎస్వీయూ రీజియన్లో నూ, జిల్లాలో స్థాయిలోనూ మొదటి ర్యాంకు దక్కించుకున్నారని వెల్లడించారు. అలాగే జీ. భరణి 120కి 118 మార్కులు, మునిశంకర్, బి. హర్షిత్, కే. హర్షవర్ధన్, ఎన్.హాసిని, కే.పవ్యశ్రీ తదితరులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. అలాగే 2026 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశ్వం టాలెంట్ స్కూల్ విద్యార్థిని కే. గీతిక 300 మార్కులకు 285 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రథమ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వం విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి, కరస్పాండెంట్ తులసి విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. -
రూ.2 వేల కోట్ల సంపద దోచేశారు!
ప్రఖ్యాత శైవక్షేత్రం గుడిమల్లం పరశురామేశ్వరాలయం ప్రధాన గోపుర కలశాలను తొలగించి, అందులో నిక్షిప్తమై ఉన్న వజ్ర, వైఢ్యూరాలు, మణులు, మాణిక్యాలు, కెంపులు, విలువైన ఇతర నవరత్నాలను ఆలయాధికారులతో కలిసి మాయం చేశారు. ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. నియమాలను పాటించకుండా 2,600 ఏళ్ల నాటి ఆలయ కలశాలను మాయం చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ చేయించి, వాస్తవాలను నిగ్గుతేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి. – చిందేపల్లి మధుసూదన్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
లోకేష్ అన్నా.. మా రోడ్ల కష్టాలు చూడరాదా?
మొదలు కాని తడ–శ్రీకాళహస్తి రోడ్డు పనులు వరదయ్యపాళెం: రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఊపందుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే శ్రీసిటీకి అనుబంధంగా శ్రీకాళహస్తి–తడ, నాగలాపురం–చిన్న పాండూరు, ఊత్తుకోట వయా సత్యవేడు మీదుగా శ్రీసిటీ, వరదయ్యపాళెం–చిన్న పాండూరు రోడ్ల మీదుగానే శ్రీసిటీ వెళ్లే రోడ్లన్నీ దుస్థితికి చేరుకున్నాయి. ఈ రోడ్లన్నీ ధ్వంసమై వాహనచోదకులు, కార్మికులు రాకపోకలు సాగించలేక తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓ పరిశ్రమకు భూమిపూజ చేసేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రానున్నారు. ఆయన హెలికాప్టర్లో రానున్నారు. ‘హెలికాప్టర్లో వస్తున్నారు..వెళుతున్నారు గానీ సత్యవేడు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్ల దుస్థితి మీకు ఎలా తెలుస్తుంది.’ అని కార్మికులు, నియోజకవర్గ ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మీరు తెచ్చిన స్పీడ్ ఆఫ్ బిజినెస్ లాగే రోడ్ల విషయంలోనూ శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. టెండర్లు పిలిచినా జరగని పనులు శ్రీకాళహస్తి–తడ,వరదయ్యపాళెం–చిన్న పాండూరు రోడ్ల మరమ్మతులకు మూడు నెలల కిందట నిధులు మంజూరై, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నా రు. అయితే ఇప్పటివరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మంత్రి గారూ కాస్త స్పందించండి సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడ పర్యటనకు రానున్న మంత్రి లోకేష్ రోడ్ల అభివృద్ధిపై స్పందించాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. శ్రీసిటీ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి తోడ్పాటు నివ్వాలని చెబుతున్నారు. -
అంతా పరశురామేశ్వరునికే ఎరుక..!
● వివాదాస్పదంగా పురాతన గుడిమల్లం ఆలయ కలశాల తొలగింపు ● కలశాలలో వజ్ర వైఢూర్యాలు, కెంపులు, బంగారు ఆభరణాలు, నవరత్నాలు నిక్షిప్తం! ● తొలగించిన కలశాలు కనిపించకుండా చేయడంపై అనుమానాలు గుడిమల్లం ఆలయంఅది 2600 ఏళ్ల నాటి ఆలయం.. ఫలితం కొంత మేర దెబ్బతినింది.. జీర్ణోద్ధర పేరుతో ఆలయ మరమ్మతులు చేపట్టారు.. ఆలయ గోపుర కలశాలు గోప్యంగా తొలగించారు.. అందులో ఏమున్నదీ బయట పొక్కనీయలేదు.. పురాతన కలశాలు కావడంతో అందులో నిధులు నిక్షిప్తం అయి ఉంటాయన్నది భక్తుల నమ్మకం.. అయితే నిర్వాహకులు ఏమీ లేవని బుకాయిస్తున్నారు.. అందులో ఏమున్నదీ ఆ పరశురామేశ్వరునికే ఎరుక అని భక్తులు అంటున్నారు.సాక్షి టాస్క్ఫోర్స్ : గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం.. 2600 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయంలో స్వయంభువుగా వెలసిన పరశురామేశ్వరుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఆలయ మహా కుంబాభిషేక మహోత్సవం పేరుతో 2600 ఏళ్ల కిందట ప్రతిష్టించిన ప్రధాన గోపుర కలశాల తొలగింపు వ్యవహారం ఆలయ పెద్దల మెడకు చుట్టుకుంది. కలశాలలో నిక్షిప్తమై ఉన్న ప్రతీదీ ఓ అమూ ల్యమైన బ్రహ్మపదార్థమేనన్న విశ్వాసం ప్రజల్లో ఉన్నప్పటికీ.. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన ఆలయ పెద్దలు నోరు మొదపడం లేదు. శ్రీకాళహస్తికి సమీపంలోని గుడిమల్లం పరశురామేశ్వరాలయం దేశంలోనే తొలి శివాలయంగా చరిత్రకెక్కడంతో కొన్నేళ్లుగా భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న ఈ చారిత్రక ఆలయంలో కొంత పైకప్పు వర్షాలకు ఉరుస్తుండడంతో ఆలయ ఈఓ, చైర్మన్ పురావస్తుశాఖ అనుమతులు తీసుకుని జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించడంతోపాటు ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ జీర్ణోద్ధరణ పనులను పూర్తి చేసి, గత నెల 19వ తేదీ నుంచి 23 వరకు మహా కుంభాభిషేకం నిర్వహించారు. వివాదంగా పాత కలశాల తొలగింపు జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా రెండు వేల సంవత్సరా ల కిందటి ఆలయ ప్రధాన గోపురంపై ఉన్న మూడు కలశాలను తొలగించారు. అయితే వాటిని తొలగించిన తీరు, తొలగించిన తర్వాత కలశాల అవశేషాలను కూడా కంటికి కనిపించకుండా దాచిన విధానంపై భక్తలు నిర్ఘాంతపోతున్నారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించే పురావస్తుశాఖ ఆధీనంలో నడుస్తున్న ఈ ఆలయంలో చిన్న బండరాయికి మేకు కొట్టాలన్నా సవాలక్ష ఆంక్షలు ఉన్న పరిస్థితుల్లో నిబంధనలు పాటించకుండా గుట్టుగా కలశాలను తొలగించి, అందులో సున్నం తప్ప మరేమీ లేదని, కలశాలు కూడా పొడి, పొడిగా మారాయని ఆలయ నిర్వాహకులు బుకాయించడంతో పెద్ద కుట్ర దాగి ఉందన్న అనుమానాలను అందరూ వ్యక్తం చేస్తున్నారు. అప్పటి రాజుల కాలంలో నిర్మించిన ఆలయం కావడంతో వజ్ర వైఢూర్యాలు, కెంపులు, బంగారు ఆభరణాలు, నవరత్నాలు నిక్షిప్తం చేసి కలశాలకు విశేష శక్తిని చేకూర్చేలా అప్పట్లో నిర్మించి ఉంటారని భక్తులు విశ్వసిస్తున్నారు. అందువల్ల ఆలయ ప్రధాన గోపుర కలశాలతోపాటు, అందులో ఉన్న ప్రతీ పదార్థం వెలకట్టలేనిది. అయితే గుట్టుగా ఆలయ ఈఓ కూడా లేకుండా కలశాలను తొలగించిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తొలగించిన కలశాల అవశేషాలను ఎక్కడ పడేశారన్న ప్రశ్నకు ఆలయ పాలకులు నీళ్లు నములుతున్నారు. -
ఆనందంగా ఉంది
పాలిసెట్లో 120కి 120 రావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంక్, జిల్లా, ఎస్వీయూ రీజియన్ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం ఐఐటీలో సీటు సాధించడమే. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. వారి ప్రోత్సాహంతో పాటు విశ్వం విద్యా సంస్థల డైరెక్టర్, టీచర్ల సహకారంతో నేను ఈ ర్యాంకు సాధించా. – వెల్దుర్తి మోక్షిత్, స్టేట్ 10వ ర్యాంకర్, తిరుపతి సంతోషానిచ్చింది పాలిసెట్లో జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. 120 మార్కులకు గాను 119 స్కోర్ చేయడం సంతృప్తి నిచ్చింది. జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 35 వ ర్యాంక్ రావడం సంతోషానిచ్చింది. శశి విద్యా సంస్థలకు ధన్యవాదాలు. ఇంటర్ పూర్తి చేసి జేఈఈలో రాణించి ఐఐటీలో చదవాలన్నది నాకోరిక. ఆ దిశ ప్రయత్నం చేస్తున్నాను. – ఎన్ గిరీష్, జిల్లాస్థాయి 3 ర్యాంకు, తిరుపతి ఇదే స్ఫూర్తితో ముందుకెళతా! పాలిసెట్లో 120కి 119 మార్కులు వచ్చాయి. జిల్లా స్థాయిలో 3వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 59వ ర్యాంక్ రావడం గర్వంగా ఉంది. నా లక్ష్యం ఐఐటీలో సీటు సాధించడమే. ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించాలన్నదే లక్ష్యం. శశి విద్యాసంస్థల ఉపాధ్యాయుల సహకారం మరులేనిది. ఇదే స్ఫూర్తితో ముందుకెళతా. – శ్యామ్నాథ్ శ్రీహర్ష, జిల్లాస్థాయి 3 ర్యాంకర్, తిరుపతి -
చిన్న నిర్లక్ష్యం.. బ్యాంకుల్లోకి నీరు
తిరుమల : తిరుమలలో చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందికి దారి తీసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. షాపింగ్ సముదాయానికి ఎదురుగా ఉన్న బ్యాంకుల సముదాయంలో ఓ బ్యాంక్ మరుగుదొడ్డిలో నీటి కొళాయి ఆపకపోవడంతో రాత్రంతా నీరు పోతూనే ఉండడంతో, ఉదయం కల్లా యూనియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, తిరుపతి సహకార బ్యాంకు, కెనరా బ్యాంకుల్లోకి నీరు చేరడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, బ్యాంకుల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. సోమవారం సాయంత్రం ఎవరో నీటి కుళాయి తిప్పి ఆపకుండా వదిలేయడంతో మంగళవారం ఉదయం బ్యాంక్ మెట్లపై నుంచి నీరు ప్రవహిస్తుండడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారితోపాటు పారిశుద్ధ్య సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తొలగించారు. విద్యార్థి ఈమెయిల్కు రీవాల్యుయేషన్ ఫలితాలు తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భాగంగా రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే ఫలితాలను వారి సెల్ఫోన్ నంబర్లకు మెసేజ్ ద్వారా, ఈ మెయిల్స్ ద్వారా పంపడం జరుగుతుందని ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయంపై ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పాకాల: వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడడంతో కారులో ముందు సీట్లో కూర్చోన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని దామలచెరువు సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు కథనం మేరకు.. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన నాగరాజు, అతని కుటుంబ సభ్యులతో కలసి ఏప్రిల్ 30వ తేదీన రైలులో తిరుమలకు ప్రయాణమయ్యారు. సోమవారం దర్శనం చేసుకున్న అనంతరం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ప్రైవేట్గా ఏపీ29ఏబి6219 నంబర్ కారును బుక్ చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు 2 గంటలకు దామలచెరువుకి సమీపంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై గుండ్లగుట్టపల్లి వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ముందు సీటులో నాగరాజు(36) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఎస్ఐ తరుణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నమాచార్యుల వర్ణన నిరుపమానం
తిరుపతి కల్చరల్: అన్నమాచార్యుల వర్ణనా వైచిత్రి నిరుపమానమని, ఆయన సంకీర్తనల్లో శృంగార నాయికల భావాలను మధుర భక్తితో అద్భుతంగా ఆవిష్కరించారని హైదరాబాద్కు చెందిన నాగపద్మిని ఉద్ఘాటించారు. అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాలు సోమవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి, ‘అలమేలుమంగా’ అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య శృంగార సంకీర్తనల భావ వైశాల్యం అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెకు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, సంచాలకులు లత పాల్గొన్నారు. -
బాబు పతనం తమిళనాట ప్రారంభమై.. ఏపీలో ముగుస్తుంది
చంద్రగిరి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పతనం తమిళనాడు ఎన్నికల్లో మొదలై ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ముగుస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆరోపించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద సోమవారం టీవీకే అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలతో కలసి విజయోత్సవాల్లో పాల్గొన్న చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆ ఇద్దరిదీ ఒకే నినాదం ఏపీలో పార్టీలన్నీ ఒక వైపు.. జగనన్న మాత్రమే ఒక వైపు ఉన్నారనీ.. అలాగే తమిళనాడులో పార్టీలన్నీ ఒకవైపు.. విజయ్ పార్టీ ఒకవైపు నిలిచిందని హర్షిత్ రెడ్డి అన్నారు. జగనన్న లాగే ఆయన కూడా ఒంటరి పోరాటం చేశారనీ.. ఒంటరిగానే ప్రచారం చేశారనీ.. ఒంటి చేత్తో తన పార్టీని గెలిపించారన్నారు.. తమ నాయకుడు జగనన్న ఎప్పుడూ చెబుతున్నట్టు సింహం సింగిల్గా వస్తుందని, ఆ ఇద్దరు ఒకే నినాదంతో ముందుకు వెళుతున్నారన్నారు. సింగిల్గా పోటీచేసి అద్భుతమైన విజయాన్ని విజయ్ సొంతం చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. జగనన్న కటౌట్ పట్టుకుని ఎన్నికల్లో ప్రచారం చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. తమిళనాడులో ప్రారంభమై.. ఏపీలో ముగుస్తుంది.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల్లో ఏ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారో వారంతా ఓటమి పాలయ్యారన్నారు. తమిళనాడు ఎన్నికల్లో ప్రారంభమైన చంద్రబాబు పతనం ఏపీలో జరగబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్తో ముగుస్తుందన్నారు. టీడీపీ పతనానికి అదే నాంది అవుతుందన్నారు. టీవీకే అభిమానుల సంబరాలు చంద్రగిరి టవర్ క్లాక్వద్ద టీవీకే అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీవీకే అధినేత విజయ్ తీసుకున్న ఫొటోను ప్లెక్సీలుగా, ప్లకార్డులుగా ముద్రించి ప్రదర్శనగా టవర్ క్లాక్ వద్దకు తీసుకువచ్చారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి విజయ్ విజయోత్సవాన్ని ఆనందాన్ని తెలుపుతూ భారీ కేక్ కట్చేశారు. వైఎస్సార్సీపీ, టీవీకే పార్టీ జెండాలతో ఆకర్షణీయంగా తయారు చేయించిన భారీ కేక్ను చెవిరెడ్డి హర్షిత్రెడ్డి కట్చేసి విజయ్ అభిమానులు అందరికీ పంచి పెట్టారు. -
దాడులు చేస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం
తిరుపతి తుడా: ‘‘రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పై రోజురోజుకూ అధికార పార్టీ కార్యకర్తలు, నేతల దాడులు అధికమయ్యాయి. దశరథరామిరెడ్డికి రెండు కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. తలపై తీవ్రంగా గాయపరిచారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు మాత్రం దుండగులపై కేసులు పెట్టకుండా దశరథరామిరెడ్డిపైనే కేసు నమోదు చేశారు. అధికారపార్టీకి కొమ్ముకాయకుండా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలి’’ అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. మంత్రి మండిపల్లె రామ్ప్రసాద్రెడ్డి అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని సోమవారం సాయంత్రం వారు పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఎవరైతే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దశరథరామిరెడ్డిపై దాడి దారుణం రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిపై కూటమి నేతలు విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను వైఎస్సాఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, రైల్యేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, పుల్లంపేట ఎంపీపీ బాబుల్ రెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం వారు దశరథరామిరెడ్డి సతీమణితో మాట్లాడి దాడికి సంబంధించిన వివరాలను ఆరాతీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటిలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని, అన్యాయంగా కల్యాణ మండపాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారన్నారు. దీనిపై నిలదీసిన దశరథరామిరెడ్డిపై విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
నిశితంగా పరిశీలించి..పరిష్కరించండి
తిరుపతి అర్బన్: అర్జీలను నిశితంగా పరిశీలించి..వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో అర్జీదారులు 307 అర్జీలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, అనురాధ, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి పాల్గొని, అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సమస్యలపై అధికంగా 172 అర్జీలను అందుకున్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేస్తున్నారు! వెంకటగిరిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు ఆక్రమించేస్తున్నారని పలు పార్టీలకు చెందిన నేతలు, పూర్వ విద్యార్థుల సంఘం, రైతు కూలీ సంఘం నేతలు, స్థానికులు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ బీకే ప్రసాద్, వైఎస్సార్ సీపీ నేత చిట్టేటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వితంతువు పింఛన్ ఇప్పించండి తన భర్త మృతి చెందాడని, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, పెద్ద కుమారుడు జస్వంత్(6ఏళ్లు) దివ్యాంగుడని, తనకు వితంతు పింఛన్ ఇప్పించాలని తిరుపతికి చెందిన నరసమ్మ కోరారు. తనకు రేషన్కార్డు కూడా లేదన్నారు. కార్మికులను తొలగిస్తే...అదనపు భారం పుత్తూరు సీహెచ్సీలో 8 మంది శానిటేషన్ కార్మి కులు పనిచేస్తుంటే ఇద్దరు తొలగించడంతో తమపై అదనపు పని భారం పడుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
శ్మశానాన్ని తవ్వేస్తున్నారు!
వరదయ్యపాళెం: మండలంలోని బత్తలవల్లంలో శ్మశాన స్థలాన్ని సైతం అధికార టీడీపీకి చెందిన గ్రావెల్ మాఫియా తవ్వేస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలో చెదులుపాకం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 156/1లో ఉన్న శ్మశాన స్థలాన్ని, శ్మశానానికి వెళ్లే దారిని సైతం గ్రావెల్ మట్టి కోసం జేసీబీలతో తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు సోమవారం వరదయ్యపాళెం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అదే చెదులుపాకం రెవెన్యూలో 156/2లో గల 5.44 ఎకరాల కుంట పొరంబోకు భూములను సైతం దర్జాగా తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న శ్మశాన స్థలాన్ని పరిశీలించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుని శ్మశాన స్థలంలో గ్రావెల్ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 72 అర్జీలు
తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 72 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీ లు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. రేపటి నుంచి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ: తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు టీటీడీ డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు బుధవారం నుంచి వచ్చేనెల 3వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు, హెల్ప్లైన్ డెస్క్ నంబర్ల కోసం https://admission.tirumala.org వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు తిరుపతిరూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహించకూడదని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. సోమవారం ఉదయం డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో జాప్యాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలను అందించేందుకు సంస్థ అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కే. గురవయ్య, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. రైలు ఢీ కొని వ్యక్తి మృతి ఓబులవారిపల్లె : పుల్లంపేట మండలం, రెడ్డిపల్లి సమీపంలో సోమవారం నంద్యాల రేణిగుంట డెమో రైలు ఢీకొని పులియాల మహేష్ (35) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. పుల్లంపేట మండలం, కేతరాజుపల్లి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డిపల్లి సమీపంలో రైలు పట్టాలుపై ప్రమాదవశాత్తు రైలు ఢీ కొంది. రైలు ముందు భాగంలోని కల్పింగ్ వద్ద మృతదేహం, తలభాగం ఇరుక్కుపోయింది. దీంతో అక్కడికక్కడే మహేష్ మృతి చెందాడు. మృతదేహం తీసేందుకు వీలుకాకపోవడంతో పరిశీలించిన డ్రైవర్ రెడ్డిపల్లి నుంచి ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్ వరకు మృతదేహాన్ని రైలు ఈడ్చుకుంటూ వచ్చింది. దీంతో కింద వేలాడుతున్న కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్లో దాదాపు రైలు గంటసేపు నిలిచిపోయింది. మృతుడు ఓబులవారిపల్లి మండలం, బొంతవారిపల్లిలో వివాహం చేసుకుని ఉండడంతో బంధువులు రైల్వేస్టేషన్కు చేరుకుని గుర్తించి వేలాడుతున్న మృతదేహాన్ని బయటకు లాగారు. గంగమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు తిరుపతి క్రైం : మంగళవారం నుంచి ప్రారంభమయ్యే గంగ జాతరకు వచ్చే ప్రతి భక్తుడు ప్రశాంతంగా, సురక్షితంగా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని విధాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. గంగమ్మ జాతర తిరుపతి నగరానికి ఆధ్యాత్మికంగా, సంప్రదాయపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగినదన్నారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఇక తిరుపతి సబ్డివిజన్ డీఎస్పీ బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. జాతర ఏర్పాట్ల పరిశీలన తిరుపతి తుడా: తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ శారదాదేవి సోమవారం పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ అప్పగించిన విధులను ఆయా విభాగాల అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. సమన్వయంతో సమష్టిగా పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. -
కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటింది!
తిరుపతి అర్బన్: కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటిందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. లెఫ్టినెంట్ జనరల్ వెంకటేశ్రెడ్డి నేతృత్వంలో 27వ కార్గిల్ విజయ్ దివస్తోపాటు ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన క్రమంలో 21 మంది వెటరన్స్ బృందంతో విజయ్ అమృత్ కలశ్యాత్రకు శ్రీకారం చుట్టడం అ భినందనీయమన్నారు. ఈ యాత్ర సోమవారం తి రుపతికి చేరడంతో కలెక్టరేట్ వద్ద వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులర్పించారు. అలాగే విజయ అమృత్ కలశాలపై పుష్పాలు సమర్పించి, అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విజయ్ అమృత్ కలిశ్ యాత్రలో తాను భాగమైనందుకు తనకు చాలా గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. చి త్తూరు ఎంపీ ప్రసాద్రావు మాట్లాడుతూ మన సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడి విజయం సాధించారన్నారు. బ్రిగేడియర్ శివ శంకర్ , కల్నల్ బీయు హ రి, మేజర్ రఘురామ్ రెడ్డి, కెప్టెన్ ఎస్సీ భండారి పాల్గొన్నారు. -
ఆశల అంబులెన్స్..
శ్రీకాళహస్తి రూరల్: ఆస్మా వ్యాధితో బాధ పడుతున్న తమ కుటుంబ సభ్యుడిని ‘బతికించుకుద్దాం’ అన్న ఒకే ఒక్క ఆశతో బెంగాల్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆ కుటుంబ ప్రయాణం ఊరందూరు హైవేపై అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆగి ఉన్న లారీ రూపంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కాటేసింది. పేషెంట్ను కాపాడుకోవాలనే తపనతో 1,650 కిలోమీటర్లు అంబులెన్స్లో ప్రయాణించిన ఆ ఆరుగురిలో నలుగురు అశువులుబాయగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో మత్యువుతో పోరాడుతున్నారు. బతుకుపోరాటంలో మరో ఇద్దరు డ్రైవర్ రాకేష్ పండిట్ (29), బంధువు ధగోడిస్ (45) ఎంజీఎం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కళ్ల ముందే నలుగురిని కోల్పోయి, తాము బతుకుతామో లేదో తెలియని స్థితిలో వారి ఆవేదన వర్ణనాతీతం. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రశ్న? పేషెంట్ను బతికించుకునేందుకు రాష్ట్రం దాటి వచ్చిన వారు, మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. జాతీయ రహదారిపై ఇలా లారీలు ఆపడంతో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో.. అని స్థానికులు కన్నీళ్లతో ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదం కాదిది.. నిర్లక్ష్యానికి బలైన నాలుగు నిండు ప్రాణాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు మృతదేహాలను బెంగాల్కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అంబులెన్స్లో ఇరుక్కున్న మృతులు అలసట.. నిద్రమత్తే శాపమైంది! 1,650 కిలోమీటర్లు అంటే మాటలు కాదు. రెండు రాత్రులు, ఒక పగలు అలుపెరగకుండా ప్రయాణం. డ్రైవర్ కళ్లలో నిద్ర, శరీరంలో అలసట, అదే వారి ప్రాణం తీసిందని డీఎస్పీ నర్సింహమూర్తి తెలిపారు. రోడ్డుపై సిగ్నల్ లైట్లు లేకుండా నిలిపిన సిమెంట్ లారీ వారి పాలిట యమపాశమైందన్నారు. ఒకే కుటుంబం.. ముగ్గురు మృతులు.. డ్రైవర్ల అన్నదమ్ముల్లో ఒకరు ఆగి ఉన్న సిమెంట్ లారీని అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అశులుబాయగా, డ్రైవర్లుగా వచ్చిన అన్నదమ్ముల్లో ఒకరు పరలోకాలకు వెళ్లారు. నుజ్జునుజ్జయిన అంబులెనన్స్లో నుంచి బయటకు తీసిన మృతదేహాల్లో బ్రజ డోలాయ్ (48), ఆయన తండ్రి జతిన్ డోలాయ్ (63), భార్య టగారి డోలాయ్ (35), ఒకే కుటుంబానికి చెందిన వారు. అంబులెనన్స్ డ్రైవర్ రితేష్ పండిట్ (24) ఒకరిదిగా గుర్తించారు. 1,650 కి.మీ ప్రాణం కోసం పరుగెత్తి.. అనంత వాయువుల్లో కలిసిన బెంగాలీ కుటుంబం -
ఆంధ్రా సరిహద్దుల్లోనూ మార్మోగిన ‘విజిల్’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లా సరిహద్దులోని తమిళనాడు అసెంబ్లీ స్థానాల్లోనూ విజయ్ పార్టీ సత్తా చాటింది. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, సత్యవేడు, నగరి, గంగాధరనెల్లూరు, కుప్పం సమీపంలో.. తమిళనాడు అసెంబ్లీ నియోజక వర్గాలు గుమ్మడిపూడి, తిరుత్తణి, అరక్కోణం, సోలింగరం, కంచి, కాటా్పడి, వేలూరు, తిరువళ్లూరు, క్రిష్ణగిరి, హోసూరు, తిరుపత్తూరు, బొడుగూరు, వేపనపల్లి ఉన్నాయి. ఓట్ల లెక్కింపులో గుమ్మడిపూడి, అరక్కోణం, కంచి, కాట్పాడి, తిరువళ్లూరు, క్రిష్ణగిరి, హోసూరు, తిరుపత్తూరు అసెంబ్లీ స్థానాల్లో విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఈ నియోజక వర్గాల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితాలపై జిల్లా వాసుల ఆసక్తి ⇒ తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఆసక్తి చూపించారు. సరిహద్దు గ్రామాల ప్రజలతో పాటు చిత్తూరు, గంగాధరనెల్లూరు, సత్యవేడు, నగరి, సూళ్లూరుపేట, తిరుపతి వాసులు ఉదయం నుంచి టీవీలు, మొబైల్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు ఆరాట పడ్డారు. విజయ్ పార్టీ విజయంపై స్వీట్లు పంచిపెట్టడం కనిపించింది. వ్యాపారులు, కొందరు రాజకీయ నాయకులు తమిళనాడు ఎన్నికలపై బెట్టింగ్లు కాయడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు విజయ్ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. -
శ్రీకాళహస్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీకాళహస్తి రూరల్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోల్కతాకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆస్తమా చికిత్స చేయించుకునేందుకు కోల్కతా నుంచి బెంగళూరుకు అంబులెన్స్లో బయలుదేరిన వారు తిరుపతి–పూతలపట్టు రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు శ్రీకాళహస్తి పోలీసులు వెల్లడించారు. కోల్కతాకు చెందిన బ్రజ డోలాయ్ (48) ఆస్తమాతో బాధపడుతున్నాడు.వైద్యుల సూచన మేరకు బెంగళూరులో చికిత్స కోసం ఈనెల 2న బ్రజ డోలాయ్తోపాటు భార్య టగారి డోలాయ్ (35), అంబులెన్స్ డ్రైవర్ రితేష్ (24), అతని సోదరుడు జతిన్ డోలాయ్ (63), మరో మహిళ ధగోడిస్ (45), మరో డ్రైవర్ రాకేష్ పండిట్ (29) బయలుదేరారు. సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్న వీరి అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బ్రజ డోలాయ్, భార్య టగారి డోలాయ్, జతిన్ డోలాయ్, రితేష్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ధగోడిస్ (45), అంబులెన్స్ డ్రైవర్ రాకేష్ పండిట్ (29) శ్రీకాళహస్తి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోల్కతాలోని బంధువులకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
లేదు మాకు సాటి.. నత్తతోనే పోటీ!
రేణిగుంటలో అండర్ బ్రిడ్జి మరమ్మతులు ఇప్పటికి 50 శాతమే పూర్తి అండర్ బ్రిడ్జిని మూసివేసి ఇప్పటికి 20 రోజులు గడిచినా ఇప్పటికీ 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో పది రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించడం అనుమానమే అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు మాత్రం ఈ నెల 15 నుంచి 20వ తేదీలోపు అండర్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతుండడం గమనార్హం. రేణిగుంట : రేణిగుంట పట్టణంలోని ప్రధాన ప్రవేశ ద్వారమైన రైల్వే అండర్ బ్రిడ్జిని మరమ్మతుల కారణంగా ఏప్రిల్ 12వ తేదీన మూసివేశారు. కేవలం నెలరోజుల్లోనే అన్ని పనులు పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటికే 20 రోజులు గడిచినా అరకొరగానే పనులు పూర్తి చేశారు. దీంతో రేణిగుంటవాసులు, వాహనదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన పనులు సాగుతున్నాయని, అధికారులు చెప్పినట్టు నెలలో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపడంలో విఫలం ప్రధాన రహదారిని మూసివేసిన తర్వాత వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూపడంలో అధికారులు వైఫల్యం చెందారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే రహదారిని మూసివేసే సమయంలో ముందస్తు జాగ్రత్తలను చేపట్టడంలో నిర్లక్ష్యం వహించారు. చివరకు రేణిగుంటలోని సంత మార్గాన్ని తాత్కాలిక రహదారిగా ప్రకటించి వదిలేశారు. అక్కడి రైల్వే గేట్ కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో స్థానికులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైల్వే అండర్ బ్రిడ్జి పక్కనే మరో అండర్ బ్రిడ్జి వద్ద తాత్కాలిక మార్గం ఏర్పాటు చేశారు. కనీసం ఆ దారికి అయిన మరింతగా మెరుగులు దిద్దేందుకు అధికారులు ముందుకు రాకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. -
తిరుమలలో విస్తృత ఏర్పాట్లు
తిరుమల: వేసవి సెలవులు, అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేపడుతోంది. రూ.2 కోట్లతో వివిధ పనులు చేపట్టారు. బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 3.5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా అందుబాటులో ఉంచారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 91,005 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,257 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’ తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అన్నిశాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. -
మందులు లేవు
మాది పీలేరు. నేను 15 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. తరచూ రుయాకు వచ్చిపరీక్షించుకుని మందులు వాడుతున్నా. అయితే ఇటీవల రెండు మార్లు ఆస్పత్రికి వచ్చినప్పటికీ వైద్యులు సూచించిన మందులు రుయాలో లేవు. దీంతో నాలుగు రకాల మందులను బయటి దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆస్పత్రికి వచ్చేందుకే ఇబ్బందిపడుతున్నాం. మందులు కూడా మేమే కొనుక్కోవాలంటే ఆర్థిక భారం భరించలేం. – రఫీ, రోగి, పీలేరు కొన్ని బయట తీసుకోమన్నారు మాది వెంకటగిరి, నేను నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు తీవ్రంగా గాయపరచాయి. వెంకటగిరి వైద్యులు రుయా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమన్నారు. మార్చి 30వ తేదీన రుయాకు వచ్చాను. వైద్యులు పరీక్షించి నెల రోజుల పాటు ఏడు రకాల మందులు వాడమని సూచించారు. మందుల దుకాణానికి వెళితే నాలుగు రకాలే ఉన్నాయన్నారు. మిగిలిన మూడు రకాల మందులను బయటి షాపులో కొనుక్కోమన్నారు. అవి రూ.3వేలు అవు తాయని చెప్పారు. – భాస్కర్, రోగి, వెంకటగిరి సరిగా చూడడం లేదు మాది తండలం.నేను కొన్ని రోజులుగా చర్మ వ్యాధితో బాధపడతున్నా. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని స్థితిలో రుయాకు వచ్చా. ఇక్కడ ఆశించిన స్థాయిలో వైద్యం అందలే దు. వైద్యులు సక్రమంగా పరీక్షించకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యా. పెద్ద డాక్టర్లు లేరని చెప్పడంతో చిన్న డాక్టర్ల వద్దే వైద్యం చేయించుకున్నా. వైద్యులు ఇచ్చిన చీటీ ప్రకారం మందులు సైతం ఇవ్వలేదు. బయట కొనుగోలు చేయాల్సివచ్చింది. – రాధాకృష్ణ, వ్యాధిగ్రస్తుడు, తండలంజిల్లా సమాచారం జిల్లా స్థాయి ఆస్పత్రి 01 ఏరియా హాస్పిటళ్లు 03 అర్బన్ హెల్త్ సెంటర్లు 26 పీహెచ్సీలు 58 విలేజ్ హెల్త్ క్లినిక్లు 432తిరుపతి తుడా : జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల పనితీరు దారుణంగా తయారైంది. చంద్రబాబు సర్కారు అలసత్వంతో పరిస్థితి దయనీయంగా మారిపోయింది. కనీసం మందులు కూడా అందుబాటులో లేని దుస్థితి దాపురించింది. ఆరోగ్య రక్షణకు అభయమిచ్చే వారే కరువై పేదలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. చూసీచూడనట్టే విధులు రుయాలో రూ.లక్షల వేతనాలు తీసుకుంటున్న వైద్య అధ్యాపకులు కనీసం రోగుల నాడిపట్టేందుకు కూడాఆసక్తి చూపడం లేదు. కొన్ని విభాగాల్లో ఓపీకి రావడమే మానేశారు. దీంతో పీజీ వైద్యులే దిక్కుగా మారారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ పరీక్షలు నిర్వహించకపోవడంతో హౌస్ సర్జన్ల కొరత తల్తెతడం గమనార్హం. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఏడాది పాటు చదువుకున్న కళాశాలలోనే ఇంటర్న్షిప్ చేయాల్సిఉంటుంది. ఫిబ్రవరిలో కొత్త ఇంటర్నషిప్ బ్యాచ్ ఆందుబాటులో ఉండాల్సి ఉంది. పరీక్షల ఆలస్యం కారణంగా 240 మంది హౌజ్సర్జన్లు అందుబాటులోకి రాకుండా పోయారు. అలాగే రోగులను మందుల కొరత వేదిస్తోంది.అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో సగం మందులు ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాల్సి రావడం పేద రోగులకు భారంగా మారింది. నాడు పెద్దపీట.. నేడు చిన్నచూపు... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేశారు. ప్రధానంగా రుయాలో మౌలిక వసతుల మెరుగునకు రూ.450కోట్లు మంజూరు చేశారు. వందల సంఖ్యలో నర్సింగ్, టెక్నికల్ స్టాఫ్ను నియమించారు. అదే స్థాయిలో వైద్య అధ్యాపకుల నియామకాలను చేపట్టి పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో 250 రకాల మందులు నిల్వ ఉంచేలా చర్యలు చేపట్టారు. ల్యాబ్లను ఆధునికీకరించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందుల పంపిణీ చేపట్టారు. ఇంటి వద్దకే వైద్యం, ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. పేదలందరికీ ఖరీదైన చికిత్సలను ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 4వేల రకాల వ్యాధులను తీసుకువచ్చారు. ప్రభుత్వాస్పత్రులకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు అవసరమైన నిధులు విడుదల చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పేదలకు సక్రమంగా వైద్యం అందని దుస్థితి దాపురించింది. ఎఫ్ఎన్ఓలు అందుబాటులో లేకపోవడంతో వృద్ధురాలిని తీసుకెళుతున్న ఆమె మనవడు వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత పేదల పెద్దాస్పత్రిగా పేరుపొందిన రుయాను వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆర్ఐసీయూలో వైద్యం కోసం వచ్చే రోగులకు వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడం ప్రాణాలమీదకు తెస్తోంది. ఈ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అరకొర వెంటిలేటర్లతోనే వైద్యులు నెట్టుకొస్తున్నారు. తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, నాయుడుపేట ఏరియా ఆస్పత్రుల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. 1,100 పడకల సామర్థ్యంతో నిర్వహిస్తున్న రుయాలో ప్రస్తుతం 172 మాత్రమే వెంటిలేటర్లు ఉన్నాయి. మరో 100 వెంటిలేటర్లు అవసరం ఉన్నప్పటికీ, సమకూర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. నిద్రావస్థలో ప్రభుత్వాస్పత్రులు రోగుల బాధ్యత పట్టదు రోగి వ్యాధి తీవ్రతను బట్టి ఒక చోటు నుంచి మరో వార్డుకు, ఎక్స్రేలకు తీసుకెళ్లడం సహజం. ఈ క్రమంలో రోగి సహాయకులుగా ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలను నియమించాల్సి ఉంది. కానీ, రుయాలో సిబ్బంది కొరత కారణంగా పేషెంట్ అంటెడర్లే పరుగులు తీయాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం రుయాలో 400 మంది ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓల అవసరముంది. అయితే ప్రస్తుతం కేవలం 70 మంది మాత్రమే సేవలు అందిస్తున్నారు.ఈ క్రమంలోనే ఎఫ్ఎన్ఓ, ఎమ్ఎన్ఓలు పేద రోగుల వద్ద చేతివాటం ప్రదర్శిస్తున్నారు. -
నీట్గా రాశారు!
తిరుపతి సిటీ: వైద్యవిద్యలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం తిరుపతిలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని 9 సెంటర్లలో పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,542 మందికి గాను 127 మంది గైర్హాజరయ్యారు. 97.02 శాతం మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. నీట్ రాసే విద్యార్థులు గంటకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు ముందుగానే సూచించారు. అయినప్పటికీ పలువురు ఆలస్యంగా రావడంతో తిప్పి పంపేశారు. నీట్ ప్రశ్నపత్రం సాధారణ స్థాయిలోనే వచ్చిందని సబ్జెక్టు నిపుణులు సాక్షికి తెలిపారు. అయితే ఫిజిక్స్ప్రశ్నల సరళి తీరు పలువురు విద్యార్థులను బెంబేలెత్తించినట్లు తెలుస్తోంది. మ్యాథ్స్ సబ్జెక్టు కొంతవరకు తిక మకపెట్టినా, కెమిస్ట్రీ మాత్రం సులభంగానే వచ్చిందని విద్యార్థులు వెల్లడిస్తున్నారు. -
గాలివాన బీభత్సం
పలుచోట్ల విరిగిన చెట్లు తిరుపతి తుడా:తిరుపతి నగరంలో ఆదివారం మధ్యా హ్నం గంటకు పైగా గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో ప్రజా రవాణా కు,విద్యుత్సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ చేరింది. మురు గు కాలువలు పొంగి ప్రవహించాయి. దీంతో బురద, చెత్త రోడ్లపై పేరుకుపోయింది. గాలి ఉధృతికి అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. బాలాజీ కాలనీ, ఎస్వీయూ, మహిళయూనివర్సిటీ, బైరాగి పట్టెడ, హరే కృష్ణ రోడ్డు, ముఖ్యంగా రాజన్న పార్క్, పద్మావతి పా ర్క్లోని చెట్టు విరిగాయి. పలుప్రాంతాల్లో ద్విచక్ర వా హనాలు, కార్లపై చెట్ల కొమ్మలు పడ్డాయి. ఈ క్రమంలో నే రోడ్లపై చెత్తాచెదారాలతోపాటు, చెట్ల కొమ్మలను తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. కారుపై పడిన చెట్టు కొమ్మ తిరుపతి రూరల్ : ఈదురుగాలుల కారణంగా చెర్లోపల్లె నుంచి అలిపిరి వెళ్లే మార్గంలో రిక్షాకాలనీ వద్ద వెళుతున్న కారుపై ఓ చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని యంత్రాలతో చెట్టు కొమ్మను తొలగించారు. అలాగే ఎస్వీయూ ఆవరణలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడటంతో పరిసరాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వృద్ధురాలికి గాయాలు రేణిగుంట: పట్టణంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. వినాయక నగర్లోని ఒక రేకుల ఇంటిపై మామిడి చెట్టు కూలింది. దీంతో రాణెమ్మ(70) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి 108లో ఆస్పత్రికి తరలించారు. -
కూలిన షెడ్.. మందుబాబులకు గాయాలు
రేణిగుంట: పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన కారణంగా ఓ మద్యం దుకాణం వద్ద వేసి షెడ్ కూలిపోయింది. అదే సమయంలో షెడ్లో మద్యం తాగుతున్న పలువురిపై పడిపోయింది. దీంతో మందుబాబులు గాయపడ్డారు. అయితే విషయం బయటకు పొక్కకుండా వైన్షాపు నిర్వాహకులు గుట్టుగా బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. వృద్ధురాలి దారుణ హత్య తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ స్టేషన్ పరిధిలోని చెర్లోపల్లెలో శనివారం రాత్రి ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. మృతురాలు లోకేశ్వరి (60) ఒంటరిగా ఉండడం, ఆరోగ్య సమస్యలు సైతం ఉండడంతో ఆమె మరణంపై ఎవరికీ అనుమానం రాలేదు. కుటుంబీకులు కూడా లోకేశ్వరి అనారోగ్యంతోనే మృతి చెందినట్లు భావించారు. ఆదివారం ఈమేరకు దహన క్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే మృత దేహానికి స్నానం చేయించే సమయంలో ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సీఐ మద్దయ్య ఆచారి చేరుకుని మృతదేహంపై గాయాలను పరిశీలించారు. మృతురాలి కుమారుడు ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోకేశ్వరి ఇంటిపై అంతస్తులో అద్దెకు ఉంటున్న ఇద్దరు యువకులను అనుమానితులుగా గుర్తించారు. వృద్ధురాలి ఒంటిపై నగల కోసం గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వేలిముద్రలు సేకరించారు. అనంతరం అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆ యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే లోకేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అయ్యో..తల్లీ! శ్రీకాళహస్తి రూరల్: ‘కొడుకు చనిపోయిన బాధ ఏడాది పాటు గుండెల్లో గునపంలా పొడుచుకుంది. సంవత్సరీకం జరుపుతుంటే చూస్తూ ఓర్చుకోలేకపోయింది. కొడుకు ఫొటో ఎదుట గుండలవిసేలా రోదిస్తూ అక్కడే సొమ్మసిల్లిపోయింది. కొడుకు మరణించిన రోజే తల్లి కూడా ప్రాణాలు వదిలేసింది’ ఈ విషాద ఘటన శ్రీకాళహస్తి మండలం, చుక్కలనిడిగల్లు దళితవాడలో చోటు చేసుకుంది. వివరాలు.. చుక్కలనిడిగల్లు దళితవాడకు చెందిన పెరిమిడి బాలాజీ, రాజేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. చిన్న కుమారుడు మురళి ఏడాది క్రితం పూతలపట్టు గురుకుల పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచాడు. ట్రిపుల్ ఐటీ న్యూజివీడులో సీటు సంపాదించాడు. అయితే గత ఏడాది మార్చిలో ఇంటికొచ్చిన మురళి స్నేహితులతో కలిసి తెలుగుగంగ కాలువలో ఈతకొట్టేందుకెళ్లి మృత్యువాత పడ్డాడు. అప్పటి నుంచి కుటుంబీకులతోపాటు తల్లి రాజేశ్వరి కుమిలిపోతూ వచ్చింది. కొడుకు చనిపోయిన రోజే మృత్యుఒడికి తనయుడు మురళి చనిపోయి ఏడాది పూర్తవడంతో కుటుంబీకులు ఆదివారం సంవత్సరీకానికి ఏర్పాట్లు చేశారు. తల్లి రాజేశ్వరి కొడుకు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అతని ఫొటో వద్దే కుప్పకూలిపోయింది. కుటుంబీకులు హుటాహుటిన శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే రాజేశ్వరి మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఏడాది వ్యవధిలోనే తల్లీకొడుకు మృత్యుఒడికి చేరడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. రైలు కింద పడి వ్యక్తి మృతి పాకాల : రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. మృతుడు చంద్రగిరివారిపల్లె ఎస్టీ కాలనీకి చెందిన వై.కృష్ణయ్యగా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
అలంకారంగా అటానమస్
అటానమస్ హోదా సాధించాం.. సొంతంగా కళాశాలల పరిపాలన సాగిస్తామని టీటీడీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలు గొప్పలు చెప్పుకున్నాయి. అయితే ఇప్పటికీ సర్వాధికారాలు ఉన్నత విద్యామండలి గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో ఆయా కాలేజీలు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కనీసం డిగ్రీ అడ్మిషన్లు సైతం చేపట్టలేని దుస్థితిలో చిక్కుకున్నాయి. కేవలం పరీక్షల నిర్వహణ.. ఫలితాల విడుదల మినహా చేసేదేమీ లేక చేతులు కట్టుకుని కూర్చున్నాయి. ఈ క్రమంలో అటానమస్ కళాశాలలకు అన్ని అనుమతులు మంజూరు చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రతిష్టాత్మక టీటీడీ ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమాచారం కళాశాల విభాగాలు మొత్తం సీట్లు పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల 21 1,550 ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ 20 1.417 ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల 10 1,068 తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్, పద్మావతి, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలు స్వయం ప్రతిపత్తి హోదా పొంది రెండేళ్లకు పైగా గడుస్తోంది. కానీ, ఇప్పటి వరకు కేవలం పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల తప్ప సొంతంగా వేరే నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం స్వతహాగా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టలేకపోతున్నాయి. ఓఏఎమ్డీసీ నుంచి మినహాయింపు ఇవ్వాలి ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం కామన్ వైబ్సైట్ ఓఏఎమ్డీసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ అడ్మిషన్లు భర్తీ చేసే ప్రక్రియ కొంత కాలంగా కొనసాగుతోంది. ఓపెన్ కాంపిటేషన్ కావడంతో పేరొందిన టీటీడీ విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకు ప్రధాన కోర్సులలో ప్రవేశాలు దొరకడం లేదు. దీంతో ప్రస్తుతం అటానమస్ పొందిన టీటీడీ డిగ్రీ కళాశాలలను ఓఏఎమ్డీసీ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చి సొంతంగా అడ్మిషన్లు చేపట్టుకునే వెసులుబాటు కల్పించాలని విద్యావేత్తలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఓఏఎమ్డీసీ ప్రక్రియ కారణంగా గత ఏడాది సుమారు 120మంది స్థానిక విద్యార్థులు ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపయోగంగా స్వయం ప్రతిపత్తి టీటీడీ అధికారులు చొరవ చూపాలి పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియపై టీటీడీ యాజమాన్యం చొరవ చూపాలని విద్యావేత్తలు కోరుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ అనుమతుల దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే సొంతంగా అడ్మిషన్లు చేపట్టేందుకు టీటీడీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
అరాచక సంస్కృతి
గాయపడిన భార్గవ్ ఆధ్యాత్మిక నేలపై.. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు చంద్రగిరి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం వల్లే దాడులు, దౌర్జన్యాలు, ధ్వంసాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిని ఎప్పకప్పుడు అరికట్టాలని సూచిస్తున్నారు. చంద్రగిరిలో రెచ్చిపోతున్న ముసుగు దళాలు సాక్షి, టాస్క్ఫోర్స్: ఆధ్యాత్మికతతో అలరారే చంద్రగిరి గడ్డ ఇప్పుడు హాహాకారాలతో దద్దరిల్లుతోంది. గోవింద నామస్మరణతో మార్మోగే ప్రదేశం రక్తపు మరకలతో తడిసి ముద్దవుతోంది. గ్రామాల్లో బందిపోట్లను తలపించేలా ముసుగు దళాలు సంచరిస్తుండడం.. ప్రశ్నించే వారిపై దాడి చేయడం.. దాడి చేసే సమయంలో ‘మా నానీ అన్నను ప్రశ్నిస్తే ఇలాగే కొడతాం’ అని హెచ్చరికలు చేయడం.. వంటి చర్యలతో ఆ ముసుగు వెనుక దాగి ఉన్నది చంద్రగిరి ఎమ్మెల్యే నానీనేనా అన్న అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు, తమిళనాడు నుంచి ముసుగు దళాలను పిలిపించి దాడులు చేయిస్తున్నట్టు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా నానీ వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే వారిని కొట్టించడం, అడ్డొచ్చిన వారి ఇళ్లు తగలబెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, కార్లు, బైక్లు దగ్ధం చేయడం వంటి దురాగ తాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్తనాదాలు ఆధ్యాత్మికత, ప్రశాంతత, గోవిందనామస్మరణతో మార్మోగే గడ్డ ఇప్పుడు ఆర్తనాదాలతో హోరెత్తుతోంది. తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో ముసుగు దళా లు అరాచకం చేస్తుండడం సంచలనంగా మారింది. రౌడీ రాజకీయాలను సహించరు తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల వాసులు రౌడీ రాజకీయాలను ఎన్నడూ సహించరు. తిరుపతి, చంద్రగిరి ప్రాంతానికి చిత్తూరు నుంచి వచ్చిన పులివర్తి నానీ రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చి గత రెండేళ్లుగా ప్రశ్నించే వారు, ముడుపులు ఇవ్వని వ్యాపారులు, సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టే వారిని టార్గెట్గా చేసుకుని ముసుగు దళాలతో దాడులు చేయిస్తూ ప్రజల్లో భయానక వాతావరణం కల్పిస్తున్నారన్న విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దుశ్చర్యలను చంద్రగిరి ప్రజలు హర్షించరని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మిత్రపక్షంపైనా దాడులు ఒక పార్టీ.. ఒక మండలం.. ఒక పంచాయతీ.. ఒక ఊరని కాదు.. చంద్రగిరి నియోజకవర్గం మొత్తం ముసుగు దళాలు వరుస దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. ముసుగు దాడులు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు, మిత్రపక్షమైన జనసేన, బీజేపీ వారితో పాటు వ్యాపారస్తులు, రైతులపైనా ఉండడం దారుణమంటున్నారు. పోలీసులు ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం పట్ల చంద్రగిరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భయపడిపోతున్నారు దేశ నలుమూలల నుంచి ఎందరో ఉద్యోగులు, మరెందరో ఆధ్యాత్మిక గురువులు, మేధావులు, శాస్త్రవేత్తలు, సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార వేత్తలు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి, చంద్రగిరిలో స్థిరపడాలని భావిస్తుంటారు. అంతేకాదు శ్రీవారిని దర్శించేందుకు నిత్యం 90 వేల మంది దాకా భక్తులు వచ్చి వెళ్తుంటారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విదంగా తిరుపతి ఒక్కచోటే ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ఇటు ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో ముసుగు దొంగలు చేస్తున్న అరాచకం వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. గోవిందనామాలు పలికే చోట ఆర్తనాదాలు, హాహాకారాలు మార్మోగుతున్నాయి. ముసుగు దళాల దాడిలో తీవ్రంగా గాయపడిన పాకాలకు చెందిన కపిలేశ్వర రెడ్డి (ఫైల్)అరాచకవాదుల దాష్టీకానికి చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామంలో దగ్ధమైన కారు (ఫైల్)చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిలో నానీ సమక్షంలోనే ఓ ఇంటికి నిప్పుపెట్టి దగ్ధం చేసిన అరాచకవాదులు (ఫైల్) తీవ్రంగా గాయపడిన సి.రామాపురానికి చెందిన కోదండం (ఫైల్)అరాచకం..హాహాకారంచంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఎమ్మెల్యే నానీ ముసుగు దళాలచేత అరాచకం సృష్టించారని ఆయా మండలాల్లోని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వర కు 72 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో పాకాల నుంచి 18 మంది, చంద్రగిరి నుంచి 16, తిరుపతి రూరల్ 12, రామచంద్రాపురం 11, చిన్నగొట్టిగల్లులో 7, ఎర్రావారిపాళెంలో 8 మంది రక్త గాయాలకు గురయ్యారు. వీరంతా పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఇక దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కని వాళ్లు వందల మంది ఉన్నారు. ఫ్యామిలీ డాబా లు, బిర్యానీ సెంటర్లు, చికెన్ పకోడా, పూల దుకాణాలు, మెడికల్ షాపు, బట్టల షాపులను జేసీబీలతో ధ్వంసంచేసి నేల మట్టం చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. పంటలను ధ్వంసం చేయించారని, దారులకు అడ్డుగా కందకాలు తవ్వించారని, మామిడి తోటలు నరికించారని ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టించారని మండిపడుతున్నారు. -
8న ఉపనయన మహోత్సవం
తిరుపతి కల్చరల్: రేణిగుంటలోని రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో ఈనెల 8న ఉదయం 7 నుంచి 8.20 గంటల వరకు సామూహిక ఉపనయన మహోత్సవం నిర్వహించనున్నట్టు పీఠం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరసింహాచార్య, రేణిగుంట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం ఎన్జీఓ కాలనీలోని జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి కార్యాలయంలో ఉపనయన మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కుటుంబీకులందరూ సద్వినియోగం చేసుకోవాలని, తమ పేర్లను ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఇందుకోసం ఎలాంటి ఫీజు లేదని, ఉచితంగానే పూజా సామగ్రిని సైతం అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి సౌకర్యం సైతం కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9849120030, 9440855423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సంఘం ప్రతినిధులు రెడ్డి ప్రకాష్, బాలాజీ శర్మ, శివకుమార్, కల్యాణకుమార్, డాక్టర్ చక్రపాణి పాల్గొన్నారు. -
అంగరంగ వైభవం
నాగలాపురం: మండల కేంద్రంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో బాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనం పై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు బట్టాచార్యులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి నిత్య కై ంకర్యాలు పూర్తి చేశారు. గ్రామోత్సవం అనంతరం ఆలయానికి చేరుకున్న వెదనారాయణుడికి ఆలయ ప్రాంగణలో దేవదేరులతో స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం జ్ణాన సరస్వతీ దేవిగా స్వామి వారిని ఊంజల్ సేవలో కొలువు దీర్చి ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి స్వామి వారి ఉత్సవమూర్తులను ముత్యాలతో, సుగంధ పుష్ప మౌలికలతో సుందరంగా అలంకరించి ముత్యపు పందిరి వాహనం పై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ ఽశ్రీనివాసులురెడ్డి, ఆలయ అధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఉదయ్కుమార్ పాల్గొన్నారు. -
ట్రెండింగ్: తమిళనాడు రిజల్ట్.. తిరుమలలో హీరోయిన్ త్రిష
ప్రముఖ హిరోయిన్ త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఆమె (మే 4, సోమవారం) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.ఆదివారం రాత్రి తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన త్రిష.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా, సామాన్య భక్తురాలిలా ఆమె శాంతియుతంగా పూజలు నిర్వహించారు.తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజే త్రిష తిరుమలకు వెళ్లడంతో.. ఆమె విజయ్ పార్టీ విజయం కోసమే ఈ మొక్కులు చెల్లించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి కావడంతో.. ఆయన సన్నిహితురాలైన త్రిష పర్యటనపై అభిమానులు పలు కామెంట్లు చేస్తున్నారు. -
అది ఏకపక్ష కమిషన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన దినేష్కుమార్ ఏకసభ్య కమిషన్.. ఏకపక్ష కమిషన్గా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టుగానే దినేష్కుమార్ తన నివేదికను తయారు చేశారని చెప్పారు. తిరుపతిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ దాదాపు ఏడాదిన్నర పైగా విచారణ జరిపింది. లడ్డూ కల్తీ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టంగా తెలిపింది. అయినా చంద్రబాబు,పవన్లు వైఎస్సార్సీపీ పాలనలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ దినేష్కుమార్తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఏకపక్షంగా మారి చంద్రబాబు పక్షాన నివేదిక ఇచ్చింది. అది అధికారికంగా విడుదల కాక ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల చేతుల్లోకి వెళ్లి విభిన్న కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఒక పత్రికలో అనిల్ సింఘాల్, మరొక దాంట్లో ధర్మారెడ్డి పేర్లు, తర్వాత మా పేర్లను కూడా చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. దినేష్కుమార్ నివేదిక ప్రకారం నేను, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పర్చేజ్ కమిటీలో కేవలం ప్రత్యేక ఆహ్వానితులమే. పూర్తి స్థాయి సభ్యులం కాదు. అసలు సభ్యులైన మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని సీబీఐ గంటల తరబడి విచారించగా, నన్ను మాత్రం 15 నిమిషాల్లోనే బయటకు పంపించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పంపింది’ అని భూమన తెలిపారు. ఈ సమావేశంలో భూమన ఇంకా ఏమన్నారంటే.. దినేష్ కుమార్కు టీటీడీ చైర్మన్ పదవి ఆఫర్ దినేష్కుమార్ అనే వ్యక్తి ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారిగా పేరుంది. గతంలో చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆయనకు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఆశ చూపించి, ఏకసభ్య కమిషన్గా నియమించి, చంద్రబాబు చెప్పినట్టుగా నివేదిక ఇప్పించారు. ఆయన విచారణలో అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి వంటి వారిని పిలిచారా? నిందితులుగా పేర్కొంటున్న జగదీశ్వర్రెడ్డి, బాలాజీ, విజయభాస్కర్, సురేంద్రనాథ్లను విచారించారా? మమ్మల్ని ఎప్పుడైనా విచారణకు పిలిచారా? పిలవకుండానే మీ ఇష్టం వచి్చనట్లు నివేదిక ఎలా ఇస్తారు? ఏడాదిన్నర పాటు సీబీఐ సిట్ అధికారులు ఎనిమిది రాష్ట్రాలు తిరిగి వందల మందిని విచారించి ఇచ్చిన నివేదిక కంటే మీ విచారణ గొప్పదా? సీబీఐ మమ్మల్ని ఎవరినీ దోషులుగా నిర్ధారించలేదు కాబట్టి, మమ్మల్ని దోషులుగా చూపించేందుకు ఉద్దేశ పూర్వకంగానే ఈ ఏకసభ్య కమిష¯Œన్ను ఏర్పాటు చేశారు. దమ్ముంటే కేసులు పెట్టండి? ⇒ దినేష్కుమార్ నివేదికపై ఈనాడులో కథనం వచ్చిన వెంటనే టీటీడీ బోర్డు సభ్యులు హడావుడిగా మీడియా ముందుకు వచ్చి ఈ నెల 6న బోర్డు మీటింగ్లో తీర్మానం చేసి మాపై క్రిమినల్ కేసులు పెడతామని చెబుతున్నారు. చాలెంజ్ చేస్తున్నాం.. దమ్ముంటే కేసులు పెట్టండి. అదే పత్రికలో నేను, భాస్కర్రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులమేనని, చర్యలు బోర్డు నిర్ణయానికే వదిలేశారని రాశారు. అనిల్కుమార్ సింఘాల్పై ఎలాంటి చర్యలకు కమిషన్ ఆదేశించకపోయినా, ఆయన కింద ఉన్న సీఈవో బాలాజీ, ధర్మారెడ్డి, జగదీశ్వర్రెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు సూచించడం ఆశ్చర్యకరం. బీఆర్ నాయుడు వ్యవహారాలపై, కొండపై రెండేళ్లుగా జరుగుతున్న అపచారాలపై కూడా దినేష్ కుమార్ విచారణ చేయాల్సింది. ⇒ చంద్రబాబు హయాంలో కిలో నెయ్యి రూ.321తో సరఫరా చేసిన హెరిటేజ్తో సంబంధం ఉన్న ఇందాపూర్ ఇప్పుడు కిలో నెయ్యి రూ.658తో ఎలా సరఫరా చేస్తోంది? అసలు ఇందాపూర్–హెరిటేజ్ సంబంధం ఏమిటి? దీనిపై కూడా దినేష్కుమార్ విచారణ చేయాలి. 2018లో చంద్రబాబు పాలనలోనే బోలేబాబాకు సంబంధించిన హర్‡్షప్రెష్ డెయిరీకి తలుపులు తెరిచి, ఆ సంస్థ నుంచి సుమారు 82 వేల కేజీల నెయ్యి సరఫరా జరిగిన విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు? 2019లో మా ప్రభుత్వం వచ్చాక ఒక్క డెయిరీ అయినా వచ్చిందా? ⇒ 2023లో నేను టీటీడీ చైర్మన్ అయ్యాక మళ్లీ నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ వైష్ణవి, ప్రీమియం, మావిగంగ డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయి కదా.. కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ విధానం ప్రకారం స్థానిక డెయిరీలకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము నిబంధనలు మార్చాము. నాణ్యత ప్రమాణాలు తగ్గించామని మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ⇒ ఇప్పుడు మీరు చెబుతున్న ఆల్ఫా, ప్రీమియం డెయిరీలు 2014–2019 మధ్య 80 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేశాయి. అలాగే ఇందాపూర్, ఆల్ఫా, బోలేబాబా డెయిరీలు టెండర్లలో పాల్గొన్నది నిజం కాదా? ఈ విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లతో కలిసి త్రిసభ్య కమిషన్ వేయండి. మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యిని పట్టుకుని, అదే నెయ్యిని తిరిగి లడ్డూ తయారీలో వాడారని సీబీఐ చెప్పింది. మీరు వెనక్కి పంపిన అదే నెయ్యిని వైష్ణవి డెయిరీ ద్వారా తిరుమలకు పంపించి లడ్డూలు తయారు చేయించింది మీరు కాదా? జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన నెయ్యినే మీరు ఉపయోగించారు. మా హయాంలో బీటా సైటోస్టెరాల్ పరీక్షల్లో లోపాలు తేలితే 18 సార్లు నెయ్యిని వెనక్కి పంపించాం. మీ హయాంలో కూడా 14 సార్లు తిరస్కరించారనే విషయం వాస్తవం కాదా? మేం ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకుని ల్యాబ్లను ఆధునీకరించాం, ఎఫ్ఎస్ఎస్ఏఐతో కలిసి రూ.30 కోట్ల ల్యాబ్కు పునాదులు వేసింది కూడా మేమే. ఆ తర్వాత మీరు దేవాన్‡్ష పుట్టిన రోజున ఓపెన్ చేశారంతే. 2018లోనే మీరు రూ.4.5 కోట్లకు ఫ్లేవర్ ఝీ కొనుగోలు చేశారు. మీ లడ్డూ నాణ్యమైనదైతే అది ఎందుకు? ఈ ఏకపక్ష కమిషన్ అసలు ఉద్దేశం డైవర్షన్ రాజకీయాలే. ఇందాపూర్–హెరిటేజ్ బంధాన్ని దాచడానికే ఇదంతా. ఈ సమావేశంలో మాజీ మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర పాల్గొన్నారు. -
టీటీడీ ఛైర్మన్ ఆఫర్.. అందుకే నకిలీ రిపోర్టు .. భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, తిరుపతి: లడ్డూలో జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్ తేల్చిందని వైఎస్సార్సీపిీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్గా మారిపోయిందని చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. చంద్రబాబు కంటే ముందే ఈ నివేదిక ఎల్లో మీడియాకు చేరిందన్నారు. దినేష్ కుమార్ అనే వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే చంద్రబాబుకు అనుకూలంగా దినేశ్ కుమార్ నివేదిక ఇచ్చారని తెలిపారు. రిపోర్టులో కక్ష పూరితంగానే చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి కారకులని చెప్పారన్నారు. దినేష్ కుమార్ అనే అధికారి పచ్చి అవినీతి అధికారిగా ముద్రపడిన వ్యక్తి అటువంటి వారికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతోనే ఇలా రిపోర్టు ఇచ్చారని పేర్కొన్నారు.సీబీఐ సిట్లో తమని దోషులుగా నిర్ధారించలేదని అందుకే చంద్రబాబు నాయుడు పన్నాగం పన్ని ఎలాగైనా తమను దోషులుగా నిలబెట్టాలనే ఈ కమిషన్ని నియమించారని తెలిపారు. లడ్డూ వ్యవహారంలో సరైన విచారణ లేకుండా ఏకపక్ష నివేదిక ఇచ్చారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు అని చెప్పిన మిగతా వారిని మాత్రం ఎటువంటి విచారణకు పిలవలేదన్నారు. -
అర్హులకు విద్యుత్ సబ్సిడీ అందాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: విద్యుత్ సబ్సిడీ అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విద్యుత్ కమిటీ సమీక్షలో కమిటీ చైర్మన్ హోదాలో ఎంపీ మాట్లాడారు. కొన్ని ప్రాంతాలు సబ్సిడీ పరిధిలోకి రాకపోవడం వల్ల రైతులు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి లోపాలను వెంటనే సరిదిద్దాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకంపై పట్టణ ప్రాంతాల్లో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రజలకు ఈ పథకం ప్రయోజనాలు చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. వ్యవసాయ అవసరాల కోసం పీఎం కుసుమ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. తీర, మెట్ట ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాలలోని చెరువు కట్టల వద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అవకాశాలపై ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా గ్రామాల్లో విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు వీధి దీపాలను ఆటోమెటిక్ వ్యవస్థలతో అమలు చేయాలన్నారు. దీని ద్వారా విద్యుత్ ఆదా చేయడంతో పాటు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు. -
సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. వడగాల్పులతో జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఉక్కపోత, వేసవి తాపంతో జనం విలవిలలాడుతున్నారు. జిల్లాలో శనివారం ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంది. దీంతో ప్రజలు రోడ్లపైకి రావడానికి భయపడ్డారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల
‘సింధు’కు కన్నీటి నివాళి తిరుపతి క్రైం : తిరుమల–తిరుపతి ప్రాంతాల్లో భద్రతా విధుల్లో విశేష సేవలందించిన ఒక మౌన సైనికురాలు ఇకలేరు. తిరుపతి జిల్లా పోలీస్ శునక దళానికి చెందిన ఎక్స్ప్లోసివ్ డిటెక్షన్ శునకం ‘సింధు’ సహజ కారణాలతో శుక్రవారం తుది శ్వాస విడిచింది. శనివారం పోలీసులు నివాళులర్పించారు. లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన ఆడ శునకం ‘సింధు’ 28 డిసెంబర్ 2013న జన్మించింది. చిన్న వయసులోనే ఆమె ప్రతిభను గుర్తించిన అధికారులు 2014లో హైదరాబాద్లోని ఐఐటీఏ, మొయినాబాద్లో ప్రత్యేక శిక్షణ అందించారు. అక్కడి నుంచి తిరుమల–తిరుపతి ప్రాంతాలకు చేరుకున్న ‘సింధు’ తన సేవా ప్రస్థానాన్ని కొనసాగించింది. 2021లో మంగళగిరిలో నిర్వహించిన రిఫ్రెషర్ కోర్సులో మూడో బహుమతి సాధించడం ద్వారా తన సామర్థ్యాన్ని మరోసారి చాటింది. వయోభారంతో 2023 సెప్టెంబర్ 2 న విధుల నుంచి విరమణ చేసిన ఆమె, విశ్రాంతి జీవితం గడుపుతూ శుక్రవారం సాయంత్రం కన్ను మూసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, ‘పోలీస్ శునక దళం సభ్యులు కూడా మా కుటుంబంలో అంతర్భాగమే’ అన్నారు. సింధు మృతికి పోలీ సు అధికారులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కన్నీటి నివాళులు అర్పించారు. నీట్కు ఏర్పాట్లు పూర్తి తిరుపతి సిటీ: నగరంలో ఏర్పాటు చేసిన 9 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యా హ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్న పరీక్షకు విద్యార్థులను 11గంటల నుంచి లోనికి అనుమతించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,542 మంది పరీక్షకు హాజరుకానున్నారని, విద్యార్థులు నిర్లక్ష్యం వహించకుండా సమయానికి రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయనున్నట్లు తెలిపారు. ప్రశాంతంగా ఏపీ ఐసెట్ తిరుపతి సిటీ: రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్–2026 శనివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఐసెట్కు తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాల్లో 95 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో, రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో, పుత్తూరు శ్రీ వెంకటేశ పెరుమాల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన ఈ ఐసెట్కు 1,598 మందికి గాను 1,518 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలోని ఓ ప్రధాన హోటల్లో మొన్నటి వరకు భోజనం రూ.120 ఉండేది. అదే హోటల్లో నేడు భోజనం రూ.160. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అనేక మంది భక్తులు వెళ్లే మరో హోటల్లో నేడు భోజనం రూ.180కి పెంచారు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో స్పెషల్ భోజనం రూ.180 నుంచి రూ.220 చేశారు. సంప్రదాయ భోజనం పేరుతో వెలసిన హోటల్లో భోజ నం రూ.120 నుంచి రూ.180కి పెంచేశారు. అవే హోటళ్లలో ఇడ్లీ, దోశ, చపాతీ ధరలకు కూడా 20 శాతం పెంచేశారు. తమిళనాడు వాసులు ఎక్కువశాతం వెళ్లే హోటల్లో భోజనం ధరలతో పాటు జ్యూస్ ధరలు కూడా అమాంతం పెంచేశారు. మొన్నటి వరకు ఒక జ్యూస్ ధర రూ.90 ఉంటే.. నేడు అదే జ్యూస్ ధర రూ.146కి పెంచేశారు. ఈ ధరలు మొన్నటి వరకు. నిన్నటి నుంచి వాణిజ్య గ్యాస్ ధరలు పెంచడంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పని జీఎస్టీ చపాతి, పూరీకి జీఎస్టీ లేదని కేంద్రం ప్రకటించినా.. నగరంలోని పలు హోటళ్లలో జీఎస్టీతో కలిపి బిల్లు వేస్తున్నారు. తినుబండారాలు ధరలు కూడా పెరిగాయి. వాణిజ్య గ్యాస్ ధరలు పెరగడంతో మరింత పెరిగే అవకాశం ఉందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలు పర్యాటక, ఆధ్యాతిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. అందకే తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, చంద్రగిరి, కాణిపాకం ప్రాంతాలకు భక్తులతో పాటు పర్యాటకులు కూడా అధికంగా వచ్చి వెళుతుంటారు. పర్యాటకులు, భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాల్లో పలు మెస్ నుంచి స్టార్ హోటళ్ల వరకు నడుపుతున్నారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్ కొరత కారణంగా తిరుపతి, చిత్తూరులో పలు హోటళ్లలో భోజనం ఆపేశారు. మరి కొన్ని హోటళ్లను పూర్తిగా మూసివేశారు. ప్రధానంగా తిరుపతిలో రెండు మూడు హోటళ్లలో మాత్రమే భోజనం లభ్యమవుతుంది. గ్యాస్ కొరత, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ హోటళ్ల నిర్వాకులు భోజనం, టిపిన్స్, చపాతీ, పరోటా ధరలను అమాంతం పెంచేశారు. తాజాగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతో నేటి నుంచి కొత్త ధరలు అమలు చేయనున్నట్లు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి సిటీ: జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడారు. దాదాపు అన్ని మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత్తలు ఒక్కసారిగా 45 డిగ్రీల మార్కును చేరుకున్నాయి. శనివారం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత్తలకు వృద్ధులు, చిన్నారులు, బాలింతల పరిస్థితి వర్ణనాతీతం. ఒకవైపు అదిరిపోయే ఉష్ణోగ్రత్తలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాడ్పులు, మరోవైపు గాలివానతో అకాల వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో సాధారణంగా 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోద వుతుంటాయి. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇంట్లో ఉక్కపోత, బయట సూర్యప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. కాగా శనివారం మధ్యాహ్నం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయంలో కాసేపు ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చినుకులు పడ్డాయి. గతేడాది ఇదే రోజున 36–39 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే 40 డిగ్రీలు దాటడడంతో ప్రధాన రహదారులు, పట్టణంలోని వీధులన్నీ నిర్యానుష్యంగా మారుతున్నాయి. జాగ్రత్తలు అవసరం గత ఏడాది కంటే ఈ సంవత్సరం 20 శాతం అధికంగా వడదెబ్బ సోకే ప్రమాదం ఉందని వైద్యుల నివేదిక. అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి గంటకొకసారి కచ్చితంగా నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, అంబలి, నిమ్మరసం తదితర సహజ సిద్ధ ద్రవపదార్థాలను సేవించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లకూడదు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కాటన్ దుస్తులు ధరించాలి. సన్ స్క్రీన్ లోషన్లు, కూలింగ్ గ్లాసు, గొడుగు, ఒక లీటరు నీరు వెంట తీసుకుని వెళ్లాలి. మాంస పదార్థాలు, మసాలా పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ధూమపానం, మద్యం సేవించరాదు. – డాక్టర్ జ్యోతి కుమార్, ఆయుర్వేద వైద్య నిపుణులు, వీజే హాస్పిటల్, తిరుపతి ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో అటానమస్ హోదాలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను శనివారం విడుదల చేశారు. ప్రిన్సిపల్ వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు గత నెల 8వ తేదీ నుంచి 13 వరకు ప్రాక్టికల్స్, 16వ తేదీ నుంచి 29వరకు థియరీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటానమస్ హోదాలో ఫలితాలను విడుదల చేయడం గర్వకారణమన్నారు. పలు కోర్సులలో 93.6% ఉత్తీర్ణత సాధించగా, మరి కొన్ని కోర్సుల్లో 100 శాతం ఫలితాలు సాధించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్న్స్ డాక్టర్ చలపతి, ఎగ్జామినేషన్ సెక్షన్ ఉద్యోగులు కామేశ్వరరావు, రమేష్, చక్రవర్తి, నాగరాజు, శేషాద్రి, ప్రభాకర్, పురుషోత్తమనాయుడు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. చంద్రగిరి: ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న చంద్రగిరిలో రౌడీలు రాజ్యమేలుతున్నారని, ఎమ్మెల్యే నాని అండతో ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతూ రాక్షసానందం పొందుతున్నారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. పాకాల మండలం శ్రీనివాసపురానికి చెందిన వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ నాయుడిపై శుక్రవారం చంద్రగిరి మండలంలోని తొండవాడ సమీపంలో ఎమ్మెల్యే నాని అనుచరులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. ఈనేపథ్యంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు శనివారం చంద్రగిరి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ పార్టీ నేతపై హత్యాయత్నానికి పాల్పడిన ఎమ్మెల్యే నాని అనుచరులు వెంటనే అరెస్టు చేయాలంటూ నిరసనకు దిగారు. ఆపై బాధితుడు, పార్టీ శ్రేణులతో కలసి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రెస్మీట్లు పెడితే అంతు చూస్తారా..? చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడితే అంతు చూస్తామంటూ హత్యాయత్నానికి పాల్పడతారా? అని ఎమ్మెల్యే నానిని చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ప్రశ్నించారు. తొండవాడ సాయిబాబా ఆలయం వద్ద ఆరుగురు వ్యక్తులు మాధవ నాయుడిని చుట్టుముట్టి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారన్నారు. ‘‘నానీ అన్నపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతావా..? నీ అంతు చూస్తాం..’’ అంటూ దుండగులు పళ్లు రాళ్లగొట్టడంతో పాటు తీవ్రంగా గాయపరిచడం హేయమైన చర్య అన్నారు. చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ను కలసిన ఆయన మాధవ నాయుడిపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుంటే సోమవారం చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మాధవ నాయుడితో కలసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, పార్టీ శ్రేణులు వామ్మో.. హోటల్ తిండా? మెస్ల్లోనూ.. సామాన్యులు తినే మెస్ల్లో భోజనం రూ.80 నుంచి రూ.120 ఉండేది. పదిహేను రోజులుగా అదే హోట ళ్లలో భోజనం రూ.160కి పెంచేశారు. ఇక టిఫిన్స్ విషయానికి వస్తే ప్లేట్ ఇడ్లీ మొన్నటి వరకు రూ.20 ఉండేది. ఇప్పుడు అదే ప్లేట్ ఇడ్లీ రూ.35 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. దోశ,పూరి ప్లేటు రూ.10 నుంచి రూ.15కి పెంచేశారు. వెజ్ రైస్, గోబీ, దొండకాయ రైస్ వంటివి ప్రస్తుతం రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఇవే పదిహేను రోజుల క్రితం వరకు రూ.50 నుంచి రూ.80 మాత్రమే. ఇకపోతే మెస్ల్లో సంగటి, మటన్, చికెన్తో కలిపి భోజనం మొన్నటి వరకు రూ.120 విక్రయించేవారు. ప్రస్తుతం రూ.190 నుంచి రూ.240కి పెంచేశారు. జిల్లాలో శనివారం నమోదైన ఉష్ణోగ్రతలు నియోజకవర్గం నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సీయస్లో) గరిష్టం కనిష్టం వెంకటగిరి 45 28తిరుపతి 44 27 చంద్రగిరి 44 27శ్రీకాళహస్తి 44 27సూళ్లూరుపేట 43 28 కోడూరు 43 27 సత్యవేడు 42 28 నిప్పుల కొలిమి...! రెట్టింపు కానున్న ఆహార పదార్థాల ధరలు తిరుపతి, చిత్తూరు జిల్లాలో హోటళ్లతో పాటు కర్రీ పాయింట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు అన్నం వండుకుని కూరల కోసం కర్రీ పాయింట్లను ఆశ్రయిస్తుంటారు. అటువంటి వారికి ధరల భారం తప్పదు. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో ఇప్పటికే అనేక కర్రీ పాయింట్లు మూతపడ్డాయి. ఉన్న కర్రీ పాయింట్లు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. తాజాగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచడంతో కర్రీ పాయింట్ల నిర్వాహకులు కూడా ఆహార పదార్థాల ధరలను పెంచే అవకాశం ఉంది. అలాగే స్వీట్లు, సేవరీస్ వంటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇరాన్ యుద్ధం పుణ్యమా అని సామాన్యుడి పరిస్థితి దయానీయంగా మారింది. సంపాదన అంతంత మాత్రమే ఉన్నా.. ఖర్చులు అంతకంతకు పెరిగిపోతుండటంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఏజెంట్గా ఉన్నందుకే హత్యాయత్నం గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి బూత్ ఏజెంట్గా, ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంట్గా కూర్చున్నందుకే తనపై ఎమ్మెల్యే నాని అనుచరులు దాడికి పాల్పడ్డారని బాధితుడు మాధవ నాయుడు తెలిపారు. గతంలోనే తనపై రెండుసార్లు దాడికి యత్నించారని, అయితే ఇప్పుడు పక్కా వ్యూహంతో అంతమొందించేందుకు దాడికి తెగబడ్డారన్నారు. ఇదంతా ఎమ్మెల్యే నాని పనే అని, ఆయన అనుచరుడు రామిరెడ్డి అనే వ్యక్తితో తనపై దాడి చేయించాడని స్పష్టం చేశాడు. -
● స్వర్ణరథం.. తరించే ఆబాలగోపాలం
కదిలింది స్వర్ణరథం.. మెదిలింది అమ్మరూపం.. భక్తజనుల పెదవులు అర్చించాయి.. మనసు సిరుల తల్లిని కీర్తించింది.. కరాలు వందనం అర్పించాయి.. కర్ణాలు శ్రీవారి దేవేరి నామస్మరణలతో నిండిపోయాయి.. తనువులో తల్లిలో లీనమైంది.. అణువణువునా.. తనువు తనువునా అమ్మరూపమే కొలువైంది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. –చంద్రగిరి -
కలశాల్లో ఏముందో బహిర్గతం చేయాలి
ఏర్పేడు: గుడిమల్లంలోని ఆనందవల్లీ సమేత పరశురామేశ్వరుని ఆలయంలో ఇటీవల జరిగిన మహాకుంభాభిషేకం మాటున ఆలయ ప్రధాన గోపురంపై ఏన్న వేల ఏళ్ల నాటి కలశాల తొలగించిన తీరుపై కేంద్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపి, అక్రమాలను నిగ్గు తేల్చాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు. గుడిమల్లం ఆలయానికి చేరుకున్న ఆయన నూతన కలశాలను పరిశీలించారు. వేల ఏళ్ల నాటి ఆలయ గోపుర కలశాలను తొలగించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఆ కాలంలో వజ్ర, వైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు, కెంపులు, బంగారు ఆభరణాలను వీధుల్లో రాశులు పోసి విక్రయించే వారని, ఈ నేపథ్యంలో నాటి రాజులు నిర్మించిన కలశాలు కేవలం సున్నం నింపి ఏర్పాటు చేస్తారని తాను భావించడం లేదన్నారు. ఆలయ కలశాలను తొలగించే క్రమంలో సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో అన్ని కోణాల్లో వీడియో చిత్రీకరించి, సరైన పంచనామాతో చేపట్టాల్సిన కార్యాన్ని కనీసం ఆలయ ఈఓ కూడా లేకుండా ప్రైవేటు వ్యక్తులు తొలగించడం మహాపచారమన్నారు. ఇందులో పెద్ద కుట్రకోణం దాగి ఉందన్నారు. తొలగించిన కలశాలను, వాటి అవశేషాలను భక్తులందరూ తిలకించే రీతిలో ఆలయ ప్రాంగణంలో ప్రదర్శనగా పెట్టాల్సింది పోయి అవశేషాలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి చూస్తుంటే కలశాల తొలగింపు వ్యవహారంతో పెద్దస్థాయిలో అక్రమాలు జరిగినట్లు భక్తులను అనుమానాలున్నాయన్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ చేయించి నిజాలను నిగ్గు తేల్చాలని ఆయన కోరారు. ఆలయ ఈఓ రామచంద్రారెడ్డి ఎందుకు ఆగమ శాస్త్ర నిబంధనలను తుంగలో తొక్కి, చారిత్రక కట్టడానికి సంబంధించిన పవిత్ర కలశాలను భక్తుల కళ్లుగప్పి తొలగించి, అందులోని విలువైన వజ్రవైఢూర్యాలను దారిమళ్లించారని విమర్శించారు. ఈ దారిమళ్లించిన అమూల్యపు కలశాల పాపంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణరెడ్డి వాటా ఎంతో ప్రజలకు చెప్పాలన్నారు. మహా కుంభాభిషేకం పేరుతో ఆలయ ఈఓ, చైర్మన్ రూ.లక్షలు విరాళాల పేరుతో దోపిడీ చేశారని, వారు సేకరించిన డొనేషన్ల వివరాలను భక్తుల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
కల్యాణం.. కడు రమణీయం
రథోత్సవంలో పాల్గొన్న భక్తజన సందోహంభక్తులకు మంగళసూత్రాలుచూపుతున్న వేదపండితులు రాపూరు : పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణం కడు రమణీయంగా జరిగింది. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 9.50 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి, పల్లకిలో కొలువు దీర్చి కల్యాణమండపానికి వేంచేపు చేశారు. అంతకుముందు విష్వక్సేనపూజ నిర్వహించారు. అశేష భక్తజన సందోహం గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పుష్పయాగం చేశారు. ఈ కల్యాణం మహోత్సవానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు,ే ఉత్సవ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్రెడ్డి, సోమయ్య, ఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతా రామయ్యస్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమపండితులు రామానుజాచార్యులు పాల్గొన్నారు. కాగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మూహుర్తానికి పలు నూతన జంటలు కోనలో ఒక్కటయ్యాయి. పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో పెంచలకోన కిక్కిరిసింది. బ్రహోత్సవాల సందర్భంగా పెంచలకోనలో వేపినాపి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య బృందం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని నెల్లూరు జిల్లా అడిషినల్ డీఎంహెచ్ఓ ఖాజావల్లి తనిఖీ చేశారు. అలాగే కీర్తి శేషులు డాక్టర్ కృష్ణయ్య, రామసుబ్బమ్మ జ్ఞాపకార్థం ఆర్ఎంపీ వైద్యబృందం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచిత సేవలతోపాటు ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు చంద్రశేఖర్, మస్తాన్బాబు, శివప్రసాద్, మహేష్రెడ్డి పాల్గొన్నారు. నేడు చక్రస్నానం, తెప్పోత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7 గంటలకు వసంతోత్సవం, 9 గంటలకు చక్రస్నానం, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం, 9 గంటలకు అశ్వవాహనసేవ, 11 గంటలకు ధ్వజావరోహణం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. -
చంద్రగిరిలో రౌడీ రాజ్యం
సాక్షి, టాస్క్ఫోర్స్: ‘చంద్రగిరి ఎమ్మెల్యే నానీ అనుచరులు అరాచకం సృష్టించారు. నడిరోడ్డుపై వైఎస్ఆర్సీపీ నేతను చుట్టుముట్టి హతమార్చేందుకు కుట్ర పన్నారు. నోటి నుంచి రక్తం కారుతున్నా వదిలిపెట్టకుండా దాడి చేశారు. నానీ అన్న గురించి ఎక్కడైనా, ఎవరైనా మాట్లాడితే చంపేస్తామంటూ హెచ్చరించి అక్కడి నుంచి పరారయ్యారు. అసలేం జరిగిందంటే.. తిరుపతి జిల్లా పాకాల మండలం, ఆదెనపల్లి పంచాయతీ శ్రీనివాసపురానికి చెందిన జిల్లా వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాధవనాయుడు చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో తమ బంధువు వివాహానికి ద్విచక్ర వాహనంపై శుక్రవారం బయలుదేరాడు. కల్యాణ మండపం సమీపంలోని స్వర్ణముఖినది ఒడ్డున ఉన్న శ్రీసాయిబాబ ఆలయం వద్ద మాధవనాయుడు తన ద్విచక్ర వాహనాన్ని ఆపి దండం పెట్టుకుంటుండగా అప్పటికే ఆయన్ను అనుసరిస్తూ రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన ఆరుగురు ఎమ్మెల్యే నాని అనుచరులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మాధవనాయుడు తలపై గట్టిగా గుద్దడంతో ఆయన బోర్లాపడిపోయారు. ఆ తరువాత కాళ్లతో తన్నుతూ, చేతులతో గుద్దుతూ భయానకం సృష్టించారు. ఓ వైపు ముక్కు, నోటి నుంచి రక్తం కారుతున్నా నోట్లో పళ్లు ఊడిపోయి అరుస్తున్నా వదలలేదు. అంతేగాక ‘‘రేయ్ వీడిని చంపేయండి రా, మన నానీ అన్నకే వ్యతిరేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నాడు.. గత ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంటుగాకూర్చున్నాడు..’ అంటూ మాధవ నాయుడుపై అత్యంత పాశవికంగా చంపేందుకు ప్రయత్నించారు. అప్పటి వరకు చూస్తున్న వాహనదారులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో వదిలిపెట్టారు. తర్వాత బాధితుని సెల్ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రరక్త గాయాలతో మాధవ నాయుడు చంద్రగిరి పోలీసు స్టేషన్కు చేరుకున్నాడు. చంపేందుకు పక్కాగా స్కెచ్ శ్రీనివాసపురం నుంచి మాధవనాయుడు బయల్దేరిన సమయంలో పులివర్తివారిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త రామిరెడ్డి తనను కొంత దూరం అనుసరించి ఎవరికో సమాచారం అందించినట్టు మాధవ నాయుడు పోలీసులకు వివరించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంటుగా నిలబడడంతో అప్పట్లో తనపై దాడికి ప్రయత్నించారన్నారు. ఆ తరువాత గత పదిహేను రోజుల క్రితం పాకాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తాను పాల్గొని ఎమ్మెల్యే నానీ అరాచకంపై ప్రశ్నించినందుకు తనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపించారు. తనపై జరిగిన హత్యాయత్నంకు రామిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా ఆయన పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పదిలో బీవీకే విద్యార్థుల ప్రభంజనం
తిరుపతి సిటీ: తిరుపతి బైరాగిపట్టెడలోని బీవీకే విద్యా సంస్థల విద్యార్థులు గురువారం విడుదలైన పదో తరగతి పలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా సీఈఓ అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ బీవీకే విద్యార్థులు పది ఫలితాల్లో రికార్డు స్థాయిలో మార్కులు సాధించి, ప్రబంజనం సృష్టించారని తెలిపారు. విద్యార్థులు కే వినతి 597, జాహ్నవి 595, జోష్యంత్ 592, మాన్యసాయి 591 సాధించారని చెప్పారు. 570 మార్కులకు పైగా 102 మంది విద్యార్థులకు రావడం పాఠశాలకు గర్వకారణమన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా బోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తమ పాఠశాల లక్ష్యమని చెప్పారు. నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులను మెరిట్ స్టూడెంట్స్గా తీర్చిదితున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందించారు. -
లక్ష్యం వైపు గురిపెడుతున్న బాలికలు
● గొప్ప చదువుల వైపు ఆడబిడ్డలు అడుగులు.. ● దూరచూపుతో గొప్ప సంకల్పంతో నిర్ణయాలు ● ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు ● జిల్లాలో ముందు వరుసలో బాలికలు.. విసుగంటే ఏమిటో తెలియదు.. వారికి పుస్తకాలే పవిత్ర గ్రంథాలు.. లక్ష్యసాధనే ధ్యేయం.. ఉన్నత శిఖరాలకు చేరి తల్లిదండ్రుల కష్టాలు తీర్చడమే లక్ష్యం.. అందుకు పక్కా ప్రణాళికలే పరమావధి.. విరామంటే వారు ఎరుగరు.. చదువే వినోదం, విహారం.. వారికి తెలిసిందల్లా ఏకోన్ముఖ దీక్షే.. అదే ధ్యాస మనస్సు నిండా నిండింది.. బంగారు భవిత కళ్ల ముందు సాక్షాత్కరించింది. పది విజయసారథుల మనోగతంపై ప్రత్యేక కథనం. పది పాస్ అయ్యింది...అయితే పెళ్లి చేద్దామనే కాలానికి నూకలు చెల్లాయి. పది ఉత్తీర్ణతతో ఆగిపోకుండా లక్ష్యం వైపు బాలికలు గురిపెడుతున్నారు. చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు.. కొందరు విద్యార్థులకు ఆర్థిక కష్టాలు, మరికొందరు విద్యార్థులకు కుటుంబ కష్టాలు..అయినప్పటికీ వాటిని అధిగమించి లక్ష్యం చదువువైపే సాగడంతో టెన్త్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి జిల్లాలో ముందువరుసలో నిలబడ్డారు. అంతటి చదువులు ఆగకుండా ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ, డాక్టర్స్, ఇంజినీర్లు, ఉపాధ్యాయులుగా పనిచేయాలనే లక్ష్యంతో పునాదులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఓ వైపు తల్లిదండ్రులు, మరోవైపు ఉపాధ్యాయుల ప్రోత్సాహం మేరకు గొప్ప గొప్ప చదువులు చదువుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వారి అభిమతం వారి మాటల్లోనే.. – తిరుపతి అర్బన్నా లక్ష్యం ఐఏఎస్ నా లక్ష్యం ఐఏఎస్ చదవడమే. చదివించడానికి ఆర్థిక ఇబ్బందులు లేవు. నా తల్లి పి. నిర్మల, తండ్రి ఎస్.జగన్నాథం ఇద్దరు ఉపాధ్యాయులు. అయినప్పటికీ ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమని సూచించారు. ఆ దిశగా చదువుకోవడానికి వరదయ్యపాళెంలోని జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు సైతం ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. దాంతోనే పదిలో 595 మార్కులు సాధించా. అదే స్ఫూర్తితో ఐఏఎస్ చేయాలని నిర్ణయించుకున్నాను. –ఎస్. దిశితసాయి, వరదయ్యపాళెండాక్టర్ కావాలన్నదే నా ఆశయం నా జీవిత ఆశయం డాక్టర్ కావడమే. పేద కుటుంబానికి చెందిన వాళ్లం, మా తల్లిదండ్రులు పి. నాగరాజు, పి. సంపూర్ణ ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ నన్ను కష్టపడి చదివించారు. దానికితోడు శ్రీకాళహస్తి మండలంలోని తొండమనాడు హైస్కూల్లోని ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. దాంతోనే టెన్త్లో 591 మార్కులు సాధించాను. డాక్టర్ కోర్సు పూర్తి చేసి..పది మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని భావిస్తున్నాను. –పి. మోహిత్ చరణ్ సాయి, చల్లపాళెం -
తప్పిపోయిన మహిళ సురక్షితం
నాగలాపురం: అడవిలో తప్పిపోయిన మహిళ ఆచూకీ లభించింది. మండలంలోని బీరకుప్పం గ్రామానికి చెందిన చిన్నముట్టు ద్రాక్షాయణి ఉపాధి హామీ పనులకు వెళ్లి బుధవారం భూపతేశ్వర అడవిలో తప్పి పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నాగలాపురం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం బీరకుప్పం ఎస్సీకాలనీకి చెందిన కొందరు ఉపాధి హామీ పనులకు అడవికి వెళ్లారు. ఆ సమయంలో ఓ మహిళ గట్టిగా కేకలు వినిపించడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఆమెను ద్రాక్ష్యాయణిగా గుర్తించారు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని మహిళను సురక్షితంగా గ్రామానికి చేర్చారు. పసిడి పతకం సాధించిన విద్యార్థినికి సన్మానం తిరుపతి సిటీ: కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైనన్స్ విభాగం 2021– 25 బ్యాచ్ విద్యార్థిని ఎస్ భావన జేఎన్టీయూ పరిధిలో 87.58 శాతం మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. ఇటీవల అనంతపురం జేఎన్టీయూ వేదికగా జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి విద్యార్థిని భావనను కళాశాలలో నగదు బహుమతిని అందజేసి, ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి భావన జేఎన్టీయూ పరిధిలో టాపర్గా నిలివడం శ్రీరామ కళాశాలకు గర్వకారణమని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి కల్పనే ధ్యేయంగా కళాశాల లక్ష్యమని తెలిపారు. విద్యార్థిని భావన మాట్లాడుతూ ఈ ఘనత సాధించడం వెనుక కళాశాల అధ్యాపకులు శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్కుమార్రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వాసు, అధ్యాపకులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు. -
పెద్దశేషుడిపై వేదనారాయణుడు
నాగలాపురం: మండలంలోని శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ మాడ వీధుల్లో విశ్వక్సేన, చక్ర చక్రత్తాళ్వార్, కొడి వస్త్రంతో ఉత్సవమూర్తులు ఊరేగింపు జరిగింది. తరువాత ఆలయంలో ధ్వజస్తంభానికి అభిషేకాలు చేశారు. వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు నడుమ గరుడాళ్వార్ చిత్రపటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేశారు. దీంతో ఉత్సవాలు ప్రాంరంభమయ్యాయి. 12 గంటలకు స్వామివారికి స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను పెద్దశేష వాహనంపై కొలువుదీర్చి, గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఏకాంత సేవ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయాధికారి శ్రీనివాసులు, చెంగల్ రాయులు, ఉదయ్ కుమార్, పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
నేడు ఏపీ ఐసెట్
● జిల్లాలో 4 పరీక్ష కేంద్రాలు తిరుపతి సిటీ: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, పలు కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఐసెట్–2026 శనివారం నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఐసెట్ పరీక్షకు తిరుపతి జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్లో 790 మంది, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో 180 మంది, రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో 300 మంది, పుత్తూరు వద్ద ఉన్న శ్రీ వెంకటేశ పెరుమాల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 328 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగే ఐసెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిశీలన తిరుపతి సిటీ: ఎస్వీయూలో జరుగుతున్న పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను శుక్రవారం వీసీ టాటా నర్సింగరావు, ఎగ్జామినేషన్ డీన్ ప్రొఫెసర్ కే సురేంద్రబాబు పరిశీలించారు. వర్సిటీలోని సైన్స్, ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పరీశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరు గమనించి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 59,186 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,244 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. అటవీశాఖ సీసీఎఫ్గా శ్రీనివాసులురెడ్డి తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (సీసీఎఫ్)గా వై.శ్రీనివాసులురెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న ఇన్చార్జి సీసీఎఫ్, జూపార్కు క్యూరేటర్ సెల్వంను కర్నూలుకు బదిలీచేశారు. కాగా జూపార్కు క్యూరేటర్గా అనురాగ్ మీనా నియమించినట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఐసర్లో ప్రొఫెషనల్ మాస్టర్స్ కోర్సులు ఏర్పేడు: మండలంలోని తిరుపతి ఐసర్లో ఏఐ సంబంధిత నూతన కోర్సులను అందుబాటులోకి వచ్చాయి. సంవత్సర కాల వ్యవధితో ప్రొఫెషనల్ మాస్టర్స్ ప్రోగ్రాంలో భాగంగా బయలాజికల్ డేటాసైన్స్, డేటాసైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తు తిరుపతి ఐసర్ అధికారిక వెబ్సైట్లో వివరాలను పొందుపరిచింది. 60 శాతం పైగా మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్), బీఈ, బీటెక్, నాలుగేళ్ల బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉత్తీర్ణత (లేదా) 55శాతం పైగా మార్కులతో ఎంఎస్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా వెబ్సైట్లో పొందుపరిచారు. ఆసక్తి గల వారు ఈ నెల ఒకటి నుంచి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది జూలై నుంచి కోర్సు ప్రారంభం కానుంది. దరఖాస్తులను linktr.ee/iisertmasters వెబ్సైట్లో చేసుకోవాలి. -
గంజాయి రహిత తిరుపతే లక్ష్యం
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లాను గంజాయి రహిత జిల్లా మార్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు తిరు పతి జిల్లా పోలీస్ శాఖ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు పేర్కొన్నారు. శుక్ర వారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదకద్రవ్యాల నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం నాలుగు అంచెల విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాలు, క ళాశాలలు, కాలనీలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీ లు నిర్వహిస్తూ యువతలో చైతన్యం పెంచుతున్నామని చెప్పా రు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. పదే పదే గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 16 మందిని గుర్తించి వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయగా, అందులో 12 మందికి ఆమోదం లభించి జైలుకు పంపించామని, మిగిలిన నలుగురు పరిశీలనలో ఉన్నారని పేర్కొన్నారు. గంజాయి వినియోగదారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన మెడికల్ టెస్ట్ కిట్లను ప్రవేశపెట్టామని ఎస్పీ తెలిపారు. విద్యాసంస్థల్లో గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న సందర్భాల్లో ఆధారాలతో టెస్టులు నిర్వహించే విధానాన్ని కూడా అ మలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి గంజాయి రహిత తిరుపతి జిల్లాను సాధించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి సంబంధిత సమాచారం ఉంటే వెంటనే 1972, 112 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలని, అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవి మనోహర్ ఆచారి, ఐ రామకృష్ణ , శ్రీనివాస్, ఎస్బీ డీఎస్పీ గీతా కుమారి పాల్గొన్నారు. సాయుధ దళాల పరేడ్పై ఎస్పీ సమీక్ష తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో సాయుధ దళాల పరేడ్ను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు, క్రమశిక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముందుగా నిర్వహించిన పరేడ్ను పరిశీలించిన ఎస్పీ, అనంతరం సాయుధ దళ పోలీసులతో గ్రీవెన్న్స్సెల్ (దర్బార్) సమావేశం నిర్వహించారు. శుక్రవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ వ్యవస్థలో ఏఆర్ విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అదనపు ఎస్పీలు వెంకట్రావు , శ్రీనివాసరావు, డీఎస్పీ చంద్రశేఖర్, ఏఓ సురేష్ కుమార్ పాల్గొన్నారు. -
పది ఫలితాల్లో సత్తా చాటిన తల్లి, కుమారుడు
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన ఓ తల్లీ, కుమారుడు పది ఫలితాల్లో సత్తా చాటారు. వివరాలు.. బుగ్గవీధికి చెందిన శిరీష పదో తరగతి చదువును మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేసి.. సొంతంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. 20 ఏళ్ల తర్వాత తిరిగి చదువుకోవాలనే పట్టుదలతో ముందుకు అడుగు వేశారు. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. తన చిన్న కుమారుడు హర్షతో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. 365 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీనిపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.ఒకేసారి ఉత్తీర్ణులైన తల్లీకుమార్తెలు ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్లకి చెందిన తల్లీకుమార్తెలు ఇంటరీ్మడియెట్, పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి ఉత్తీర్ణులయ్యారు. ఆలమూరులోని బొబ్బా జయశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న కుమార్తె సలాది సాతి్వక పదో తరగతిలో 543 మార్కులు సాధించింది. ఆమె తల్లి కుమారి గురువారం విడుదలైన ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ఇంటర్ పరీక్షల్లో 352 మార్కులతో ఉత్తీర్ణత పొందింది. పదో తరగతి పూర్తి కాగానే కుమారికి వివాహం కావడంతో చదువుకు ఫుల్స్టాప్ పడింది. చదువుపై ఆమెకున్న మక్కువను గుర్తించిన భర్త ప్రసాద్ ప్రోత్సహించారు. దీంతో, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసి ఆమె విజయం సాధించింది.ఉత్తీర్ణత సాధించిన తండ్రి, కుమార్తె రెంటచింతల: టెన్త్ ఫలితాల్లో తండ్రి, కుమార్తె ఉత్తీర్ణత సాధించిన సంఘటన పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో జరిగింది. పరాశక్తి సిమెంట్ కంపెనీలో రోజువారి కూలీ అయిన జిల్లా బాబూరావు ఈ ఏడాది ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ పరీక్షలు రాసి 257 మార్కులు సాధించాడు. ఆయన కుమార్తె చిట్టి స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాలలో చదువుకుని 448 మార్కులు తెచ్చుకుంది. తన కుమార్తె, తానూ ఒకేసారి టెన్త్ పాస్ కావడం సంతోషంగా ఉందని బాబూరావు తెలిపారు. -
పదిలో మళ్లీ ఫల్టీ!
● పది ఫలితాల్లో 83.93 శాతం ఉత్తీర్ణత ● 19 నుంచి 20కి దిగజారిన జిల్లా ర్యాంకు ● జిల్లాలో బాలికలదే మళ్లీ హవా! ప్రత్యేక తరగతులు.. వంద రోజుల ప్రణాళికలు.. అధికారుల హంగామా.. ఉపాధ్యాయుల ప్రయత్నాలు.. ఏదీ పదిలో ‘ఫలి’ంచలేదు.. గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాలు సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి లోకేష్ బాబు సొంతజిల్లాలో గత ఏడాది కంటే ఓ మెట్టు కిందకు దిగజారాయి. పది ఫలితాల్లో తిరుపతి జిల్లా 20 స్థానంలో నిలిచి అధినేతల పరువు తీశాయి. జిల్లాపై కొరవడిన సీఎం, విద్యామంత్రి పర్యవేక్షణ, లోపించిన అధికారులు ప్రణాళికలే ఇందుకు కారణాలుగా నిలిచాయి.తిరుపతి అర్బన్: జిల్లాలో పదో తరగతి ఫలితాలు నిరుత్సాహపరిచాయి. ఫలితాలు గత ఏడాది కంటే మరీ దారుణంగా పడిపోవడంతో నోరు మెదపలేని స్థితిలో అధికారులు త లలు పట్టుకుంటున్నారు. గురువారం విడుదలైన పది ఫలితాల్లో రాష్ట్రంలో తిరుపతి జిల్లా 20వ స్థానానికి పరిమితమైంది. గత ఏడాది 19వ స్థానంలో ఉన్న జిల్లా దారుణంగా 20వ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది ఎలాగైనా కనీసం టాప్ 10లో స్థానం సాధించాలని అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రణాళిక బద్ధంగా పదో తరగతి విద్యార్థులపై అధికారులు దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ స్కూళ్లతో పాటు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లల్లో సైతం ఈ ఏడాది ఆశించిన స్థాయి లో ఫలితాలు రాకపోవడం గమనార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన టె న్త్, ఇంటర్మీడియట్ ఫలితాలు గురువారం విడుదల చేశారు. టెన్త్కు సంబంధించి 905 మందికి 357 మంది, ఇంటర్మీడియట్లో 2,322మందికి 1,660 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలదే హవా జిల్లాలో విడుదలైన పది ఫలితాల్లో 83.93 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 26,492 మంది హాజరుకాగా 22,235 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 13,938 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా ఇందులో 11,366 మంది ఉత్తీర్ణులై 81.55 శాతం సాధించారు. అలాగే 12,554 మంది పరీక్ష రాయగా ఇందులో 10,869 మంది ఉత్తీర్ణత సాధించి 86.58 శాతంతో మళ్లీ జిల్లాలో తమ సత్తా చాటారు. గత ఏడాది 26,679 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 21,298 మంది ఉత్తీర్ణులయ్యారు. 79.83 శాతం ఉత్తీర్ణత సాధించి 19వ స్థానం దక్కించుకుంది. 25 నుంచి సప్లిమెంటరీ పది ఫలితాల్లో తప్పిన విద్యార్థులకు ఈనెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థుల పరీక్ష ఫీజును శుక్రవారం నుంచి ఈనెల 9వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంటుంది.రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున, రీవెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ. వెయ్యి చెల్లించాలని అధికారులు తెలిపారు. ఈనెల 7వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్ర దేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్త్, ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు మే 5వ తేదీ వరకు గడువు ఉందని చెప్పారు. పరీక్ష ఫీజు మీ సేవా, ఏపీ అన్లైన్ కేంద్రాల్లో చెల్లించాల్సి ఉంటుంది. సీఎం, విద్యాశాఖామంత్రి సొంత జిల్లాలో ఫలితాలపై విమర్శలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్స్ వీరే జిల్లాలోని వరదయ్యపాళెం జెడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థిని ఎస్ దిషితా సాయి 595 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, శ్రీకాళహస్తి బాబు ఆగ్రహారం ఎంపీఎల్హెచ్ఎస్ స్కూల్కు చెందిన జి సాయిపూజిత 594 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. అలాగే తొట్టంబేడు జెడ్పీ హైస్కూల్కు చెందిన పి మోహిత్ చరణ్సాయి 591 మార్కులు సాధించగా వరదయ్యపాళుం జెడ్పీ హైస్కూల్కు చెందిన కే రేఖ 591 మార్కులతో ఇద్దరు మూడో స్థానంలో నిలిచారు. తి రుపతి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన జి నిహారిక 590 మార్కులు సాధించి 4 స్థానంలో నిలిచింది. అలాగే నెరబైలు జెడ్పీ హైస్కూల్కు చెందిన మాధురి 590 మార్కులు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 4.10 శాతం ఎక్కువ ఉత్తీర్ణత గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 4.10 శాతం ఎక్కువ గా ఉత్తీర్ణత సాధించారు. గత ఏడా ది 79.83 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో జి ల్లాకు 19వ స్థానం దక్కింది. అలా గే ఈ ఏడాది 83.93 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే 20 స్థానంలో జిల్లా నిలిచింది. 2026–27కు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఈనెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరుతున్నాం. –కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి సాక్షాత్తు సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి లోకేష్ సొంత జిల్లా తిరుపతిలో పది ఫలితాలు దారుణంగా పడిపోవడంపై జిల్లా వ్యాప్తంగా విద్యావేత్తలు, తల్లిదండ్రులు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా శాఖ మంత్రి సొంత జిల్లాలో విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోందని, కనీసం జిల్లాపై మంత్రి ప్రత్యే క శ్రద్ధ తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత రెండేళ్లుగా పది, ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఆశించిన స్థానాన్ని దక్కించుకోకపోవడం గమనార్హం. అధికారులు 100 రోజుల ప్రణాళిక పేరుతో హంగామా చేసి నా ఆశించిన ఫలితాలు దక్కలేదనే విమర్శలున్నాయి. -
జెష్మితకు రాష్ట్రంలో రెండో స్థానం
తిరుపతి అర్బన్: పది ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలలు సత్తా చాటుకున్నాయి. గురువారం విడుదలైన టెన్త్ ఫలి తాల్లో తిరుపతికి చెందిన జీఎస్ఆర్ మ్యాగ్నెట్ స్కూల్కి చెందిన పి. జెష్మిత 600 మార్కులకు 598 మార్కులు సాధించి స్టేట్లోని రెండో స్థానంలో నిలిచింది. అలాగే 53 మంది విద్యార్థులకు 47 మంది మొదటి తరగతి, ఆరుగురు విద్యార్థులు రెండో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ జి. సత్యనారాయణ ఆమెను అభినందించారు. కోడూరు విద్యార్థికి .. రైల్వేకోడూరు: బలిజవీధికి చెందిన పండ్రా సు బ్రమణ్యం కు మార్తె పండ్రా ఖ్యాతి గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 598 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించింది. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు పండ్రా ఖ్యాతిని అభినందించారు. ఉన్నత స్థాయికి చేరుకోవాలి తిరుపతి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ మార్కు లు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అభినందించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఎస్. దిషిత సాయి, 595 మార్కులతో ప్రథమ స్థానం, జి. సాయి పూజిత 594 మార్కులతో ద్వితీయ స్థానం, మోహిత్ చరణ్సాయి 591 మార్కులతో తృతీయ స్థానంలో నిలిశారు. వీరికి కలెక్టర్ చేతుల మీదుగా ట్యాబ్లను బహూకరించారు. అలాగే విలువైన పుస్తకాలు, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్ కుమార్, డీఆర్వో నరసింహులు, సీఎంఓ సురేష్ పాల్గొన్నారు. -
కోర్టుకెళ్తే మీ బండారం బయట పెడతా
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో పేకాట అడిస్తూ పట్టుబడిన సీఎం చంద్రబాబు నాయుడు సన్నిహితుడు ప్రదీప్రెడ్డి పోలీసులను బెదిరించారు. కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్తే మీకు (పోలీసులకు, ఎమ్మెల్యేకు) క్రమం తప్పకుండా ఇస్తున్న మామూళ్ల సంగతి కూడా చెబుతానని హెచ్చరించారు. పాకాల మండలం చెన్నుగారిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం రహస్యంగా పేకాట ఆడుతున్నట్టు డ్రోన్ కెమెరాల ద్వారా బట్టబయలైంది. తిరుపతి ఎస్పీ కార్యాలయం ఆధీనంలోని కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తమై స్పెషల్ పార్టీ పోలీసులకు ఆ డ్రోన్ వీడి యోలు, లొకేషన్ పంపించారు.వాటి ఆధారంగా స్పెషల్ పార్టీ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రదీప్రెడ్డి అనే వ్యక్తి సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మరో ఇద్దరు ఎమ్మెల్యే నానికి అత్యంత సన్నిహితులు. వీరి ఆధ్వర్యంలోనే పేకాట సాగుతోంది. ఈ క్రమంలో వీరిని ఎలాగైనా తప్పించాలని ఎమ్మెల్యే నాని పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికే విషయం మీడియాకూ తెలియడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ప్రదీప్రెడ్డి పోలీసులను బెదిరించారు. పై నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో పోలీసులు సదరు నిందితులకు రాచమర్యాదలతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. -
‘‘న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అనేక ఏళ్లుగా కోరుతున్నాం. ప్రతిసారీ ఏదో ఒకటి చెబుతున్నారు. ఇప్పుడు 62 రోజులుగా నిరసన తెలుపుతున్నాం. అధికారుల్లో చలనం లేదు. కల్లబొల్లి మాటలతో మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారు. కార్మికులంటే అంత చిన్నచూపు ఎందుకు? సమస్యలు పరిష
స్విమ్స్, టీటీడీ అధికారులకు కార్మికుల హెచ్చరిక గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పరిష్కారమా..తిరుపతి తుడా: స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేశారు. 62 రోజులుగా నిరసన తెలుపుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంతో వర్క్ టు రూల్ను పాటిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద మండుటెండలో ధర్నాకు దిగారు. అధికారులు టీటీడీ సెక్యూరిటీ, స్థానిక పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో స్విమ్స్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సీఐటీయూ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులతో చర్చలు విఫలం... ధర్నా అనంతరం స్విమ్స్ డైరెక్టర్, యాజమాన్యంతో సీఐటీయూ నేతలు, కార్మికులు చర్చలు జరిగాయి. సమస్యను వెంటనే టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, కొంత సమయం ఇవ్వాలని యాజమాన్యం కోరింది. దీనిపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు. తక్షణం సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటం ఉద్ధృతం చేస్తామని తేల్చిచెప్పారు. చర్చలు విఫలం కావడంతో కార్మికులు యథావిధిగా సమ్మెలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు బాలసుబ్రమణ్యం, జయచంద్ర, వేణుగోపాల్, ఆర్.లక్ష్మీ, మునిరాజ, ఎన్.మాధవ్, బుజ్జి, బిల్డింగ్ వర్కర్స్ నగర కార్యదర్శి శ్రీరాములు, నారాయణస్వామి, టీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిద్ధు, ప్రభాకర్, కేశవులు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేంద్ర, స్విమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రవి, అధ్యక్షులు సూరి, మారి ముత్తు, వెంకటేష్, కోటయ్య, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద మండుటెండలో కార్మికుల నిరసన ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం స్విమ్స్లో పనిచేస్తున్న కార్మికుల బతుకులు అధ్వానంగా ఉన్నాయి. సమస్యలు పరిష్కరించా లని అధికారులకు పలు మార్లు విన్నవించినా పట్టించుకోలేదు. కల్లబొల్లి మాటలతో మభ్యపెడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ధర్నాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. సమస్య పరిష్కారం కోసం ప్రాణాలైనా అర్పించేందుకు కార్మికులం సిద్ధంగా ఉన్నాం. – రవి, వర్కర్స్ యూనియన్ కార్యదర్శి, స్విమ్స్ సమస్య పరిష్కరించే వరకు ఉద్యమిస్తాం కార్మికులంటే అధికాారులు చులకనగా ఉంది. కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కార్మిక సంఘాలు, సీఐటీయూ నేతలు పలుమార్లు అధికారులతో చర్చలు జరిపినా మభ్యపెట్టే మాటలు తప్ప సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదు. మా సహనాన్ని పరీక్షించొద్దు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదు. – సుజాత, కార్మికురాలు, స్విమ్స్ఇది బతుకు పోరాటం కొన్నేళ్ల నుంచి రోగులకు సేవ చేస్తున్నాం. శానిటరీ హోదాను రద్దు చేసి వార్డ్ బాయ్స్ హోదా ఇచ్చి వేతనాలు పెంచాలని అడుగుతున్నాం. చిన్న సమస్యను పరిష్కరించేందుకు కూడా అధికారులు చొరవ చూపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మావి గొంతెమ్మ కోరికలు కాదు. బతుకు పోరాటం మాత్రమే. సమస్య పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తాం. – జయమ్మ, వర్క్ర్స్ యూనియన్ సభ్యురాలు, స్విమ్స్ పూట గడవని పరిస్థితి స్విమ్స్లో పనిచేస్తున్న మా పరిస్థితి దారుణంగా ఉంది. పూట గడవని స్థితిలో కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. మేము చేస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూస్తున్న అధికారులు హోదాను మార్చి వేతనాలు పెంచేందుకు ఎందుకు సహరించడం లేదో అర్థం కావడం లేదు. సుమారు రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా టీటీడీ అధికారులు స్పందించక పోవడం దారుణం. – బృంద, కార్మికురాలు, స్విమ్స్ -
పేదల కడుపు కొట్టొద్దు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లో గదులను అద్దెకు తీసుకుని అనేక ఏళ్లుగా దుకాణాలు నిర్వహిస్తున్న పేదలను ఉన్న ఫళంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడం ఎంతవరకు సబబని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ప్రశ్నించారు. పేదల కడుపుకొట్టడం సరైంది కాదన్నారు. ఆయన బుధవారం వైఎస్సార్ విగ్రహం వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కాంప్లెక్స్లో వ్యాపారం చేసుకుంటున్న పేదలకు 33 శాతం పెంచి అద్దె గదులను రెన్యువల్ చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఓ టీడీపీ నాయకురాలు గదులు నిర్మించుకుని వ్యాపారం చేసుకునేవారని తెలిపారు. వారు తనను సంప్రదించి అందరూ పేదవారని ఆదుకోవాలని కోరారని పేర్కొన్నారు. తాము పార్టీలకు అతీతంగా రెండేళ్లు రెన్యువల్ చేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. ఇక్కడున్నది వైఎస్సార్ సీపీ వారు కాదన్నారు. వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సమంజసం కాదన్నారు. 2024 ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తే పేదలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక రోడ్డు మీద పడేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండి పేదలకు సేవ చేయాలని హితవుపలికారు. లేనిపక్షంలో బాధితులతో కలిసి నిరసనకు దిగుతామని హెచ్చరించారు. పేదల షాపులు జోలికి రావద్దు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చెప్పాడంటూ మున్సిపాలిటీ అధికారులు 24 మంది పేదల షాపులకు తాళాలు వేయడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో అనేకమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని, ఎవరూ ఇలా పేదలపై రాజకీయం చేయలేదన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ గదుల్లో అద్దెకు ఉండేవారు టీడీపీ నాయకుడిని కలవాలని, లేనిపక్షంలో గదులు కేటాయించడం కుదరదని అధికారులు చెప్పడంపై ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పగడాల రాజు, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి, పఠాన్ ఫరీద్, శ్రీవారి సురేష్, కంఠా ఉదయ్ కుమార్, వల్లం గోపి, టైలర్ శ్రీను, ఆరిఫ్, చెంత రాజేంద్ర, జీవీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లైసెన్స్.. లెసన్స్
●డ్రైవింగ్ లైసెన్స్ల జారీ ప్రక్రియలో ఆర్టీఏ మరో పరీక్షను చేర్చేందుకు సమాయత్తమవుతోంది. ముందస్తుగా ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం జారధి పోర్టల్లో స్లాట్ నమోదు చేసుకున్న వారికి ఆర్టీఏ కేంద్రాల్లో లెర్నింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉతీర్ణులైన వారికి ఎల్ఎల్ఆర్ ఇస్తారు. దీనికి ఆరు నెలలు గడువు ఉంటుంది. ఆలోపు డ్రైవింగ్ నేర్చుకుని ట్రాక్లలో వాహనం నడిపిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం స్లాట్ నమోదుకు ముందే ఆన్లైన్ టెస్ట్లో పాల్గొనాలనే కొత్త నిబంధనను ఆర్టీఏ తీసుకువస్తోంది. ఆ తర్వాతే ఎల్ఎల్ఆర్కు అనుమతి లభిస్తుంది. తిరుపతి మంగళం : డ్రైవింగ్ లైసెన్స్ మంజూరులో కొత్త నిబంధనలు తీసుకురావడానికి ఆర్టీఏ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు వాహనం లెర్నింగ్ లైసెన్స్ కోసం రెండు పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్టులు 3 గంటల సమయంతో ఆరు మాడ్యూల్స్తో ఉంటాయి. మొదట రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై వీడియోలను వీక్షించాలి. అనంతరం టెస్టులో సరైన సమాధానాలు ఇవ్వాలి. తర్వాత దరఖాస్తుదారుల మొబైల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేస్తేనే స్లాట్ లభిస్తుంది. ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలోని ఐదు ఆర్టీఏ కేంద్రాల పరిధిలో రోజుకు 1000 నుంచి 1500 లెర్నింగ్ లైసెన్స్లు అందజేస్తున్నారు. సాఫ్ట్వేర్ నిపుణులు, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ రంగాల్లో పనిచేసే వారు 3 గంటల పాటు ఈ ముందస్తు టెస్టులకు హాజరుకావడం సాధ్యమవుతుందా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ విధానాన్ని అమలుచేస్తే లెర్నింగ్ లైసెన్స్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఆన్లైన్ టెస్టులకు నిజాయితీగా ఎంతమంది హాజరవుతారనేది కూడా సందేహమే. ఇందులో ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం పెరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి ప్రతి వాహనదారుడు ఎల్ఎల్ఆర్ పరీక్షకు హాజరయ్యే ముందే ట్రాఫిక్, రవాణా శాఖల నింబంధనలు, రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సామర్థ్యానికి మించి వాహనాలు కొనుగోలు చేయడం సరికాదు. నియమాలతోపాటు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన ఉంటేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. వాహనదారులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యమే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. – కొర్రపాటి మురళీమోహన్, తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు... ప్రమాదాల నియంత్రణకు రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అవగాహన ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో రహదారి భద్రత కమిటీ ఆదేశాలతో రవాణాశాఖ ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించింది. ఆన్లైన్ టెస్టులకంటే ఎల్ఎల్ఆర్ పరీక్షలకు హాజరైన సమయంలోనే రోడ్డు నిబంధనలపై అరగంట పాటు వీడియోలను ప్రదర్శించి, మరో అరగంట సూచనలు, సలహాలతో అవగాహన కల్పిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని రహదారి భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నమో నారసింహా.. ప్రణమామి
సరస్వతీ దేవిగా దేవదేవుడు రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామి వారు సరస్వతీదేవి అవతారంలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి క్రేన్ మండపంలో హంస వాహనాన్ని శోభాయమానంగా అలంకరించి స్వామివారిని కొలువుదీర్చారు. మేళతాళాలు, వేదమంత్రాల మధ్య నృసింహుడు హంస వాహనంలో కోన మాడవీధుల్లో విహరించారు. పారువేట మండపం వరకు క్షేత్రోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, వివిధ రకాల పళ్లరసాలు, చందనం, పసుపు, నారికేళంతో అభిషేకించారు. అంతకుముందు టీటీడీ ఆగమ పండితులు రామానుజచార్యులు ఆధ్వర్యంలో ఉదయం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో నరసింహ హోమాన్ని నిర్వహించారు. అలాగే అగ్నిప్రతిష్ట, విశేష హోమాలు చేశారు. రాత్రి స్వామి, అమ్మవార్లను తిరుచ్చిలో కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. హనుమంతునిపై భక్తవరదుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి బంగారు హనుమంత సేవను వైభవంగా నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై కొలువుదీరి తిరు మాడవీధుల్లో ఊరేగు తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. నేడు గరుడ వాహనం పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 10 గంటలకు బంగారు గరుడ వాహనం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఉదయం 6 గంటలకు పూలంగి సేవ, 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ సేవ చేపడతామని పేర్కొన్నారు. గరుడ వాహనానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పట్టువస్త్రాల సమర్పణ ఉత్సవాల్లో భాగంగా పెంచలకోనలోని లక్ష్మీనరసింహునికి మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో చంద్రశేఖర్ పట్టువస్త్రాలను సమర్పించారు. వారికి ఆలయ ఏసీ జనార్ధన్రెడ్డి మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి వేద ఆశ్వీరవచనం అందించారు. కార్యక్రమంలో ఫెస్టివల్ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్రెడ్డి, సోమయ్య, ఉప ప్రధాన అర్చకులు పెంచలయ్యస్వామి, సీతారామయ్యస్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమ పండితులు రాామానుజాచార్యులు పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
తిరుపతి మంగళం: మంగళం పరిధిలోని తిరుపతి–కరకంబాడి ప్రధాన మార్గంలో బుధవారం యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక తిరుమల నగర్లో కాపురం ఉంటున్న శశి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏమి జరిగిందో కాని విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రోడ్డుపై పడిపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని అతన్ని తిరుపతి రుయాకు తరలించారు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వసంతోత్సవాలకు అంకురార్పణ
చంద్రగిరి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి మే నెల 2వ తేదీ వరకు వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా 6 నుంచి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. వసంతోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు రూ.150 చెల్లించి ఉత్సవాల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. వసంతోత్సాల్లో మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అదే విధంగా రాత్రి 7.30 నుంచి 8.30 వరకు అమ్మవారు నాలు గు మాడ వీధుల్లో ఊరేగుతారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసింగ్లో కొత్త దిశ
తిరుపతి క్రైం : తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పోలీసింగ్లో కొత్త దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం అత్యాధునిక డ్రోన్ కెమెరాలను అధికారికంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలను ముందుగానే గుర్తించి వాటిని అరికట్టడంలో డ్రోన్ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. ఈ డ్రోన్ కెమెరాలు కృత్రిమ మేథస్సుతో పనిచేస్తూ పెద్ద సంఖ్యలో ఉన్న జన సమూహాన్ని క్షుణ్ణంగా లెక్కిస్తాయని, అధిక నాణ్యత గల ఫొటోలు, వీడియోలు అందిస్తాయని వెల్లడించారు. వీటితో రాత్రి–పగలు తేడా లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించవచ్చన్నారు. ఈ డ్రోన్లలో అమర్చిన ధ్వని ప్రసార పరికరం ద్వారా ప్రజలకు వాయిస్ సందేశాలు, హెచ్చరికలను ప్రత్యక్షంగా చేరవేయవచ్చని చెప్పారు. అత్యవసర పరిస్థితులు, రవాణా నియంత్రణ, జన సమూహ నిర్వహణలో ఉపయోగపడతాయని వివరించారు. -
పేకాట క్లబ్బులకు ఎమ్మెల్యే నాని కవచం ?
సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ని ఎమ్మెల్యే నాని సొంత మండలమైన పాకాలలో పేకాట క్లబ్బులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. బుధవారం పేకాట ఆడుతున్న నాని అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని రాత్రి వరకు పోలీసులపై ఎమ్మెల్యే నాని ఒత్తిడి చేశారని సమాచారం. దీంతో ఆయన అండతోనే అనుచరులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాకాల మండలంలో పేకాట స్థావరాలను తిరుపతి ఎస్పీ కమాండ్ కంట్రోల్ నుంచి నడిచే డ్రోన్ కెమెరాలు గుర్తించడంతో స్పెషల్ బ్రాంచి పోలీసులు బుధవారం మెరుపుదాడి చేశారు. పలువురు నిందితులను పట్టుకున్నారు. వారిలో ఎమ్మెల్యే నాని ప్రధాన అనుచరులైన ప్రదీప్రెడ్డి, రాజానంద, పాలచిన్న ఉండగా, మరో ముగ్గురు అనుచరులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. పోలీసులు వారిని కూడా రాత్రి అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో రహస్యంగా సమాచారం సేకరించి, ప్లాన్ ప్రకారం మెరుపుదాడి చేయడంతో పేకాట సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో భారీ మొత్తంలో నగదు, పేకాట సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేకాట దందా చాలాకాలంగా నడుస్తున్నప్పటికీ, ఇంతవరకు అధికార యంత్రాంగం ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. మొదలైన హైడ్రామా పేకాట స్థావరంలో పట్టుబడిన వ్యక్తులను స్పెషల్ బ్రాంచి పోలీసులు స్థానిక పోలీసులకు అప్పగించగా ఇక్కడే అసలు హైడ్రామా మొదలైంది. పట్టుబడిన వారికి స్టేషన్ బెయిల్పై ఇచ్చి పంపాలని ఎమ్మెల్యే నాని పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో పోలీసులు వారిని వదిలి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.నగదు, వాహనాలు స్వాధీనం పాకాల మండలం చెన్నుగారిపల్లి పంచాయతీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు వారి నుంచి రూ.45 వేలు నగదు, 14 సెల్ఫోన్లు, ఒక ఆటో, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్పెషల్ బ్రాంచి పోలీసులు పాకాల పోలీసులకు అప్పగించారు. సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ తరుణ్ కేసు నమోదు చేశారు. -
పొలం విషయమై వ్యక్తిపై దాడి
వెంకటగిరి రూరల్ : మండలంలోని శివలింగాపురం వద్ద బుధవారం పొలం విషయంపై జరిగిన ఘర్షణలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పారవోలు హరిజవాడకు చెందిన వెంకటసుబ్బయ్య పొలం వద్దకు వెళుతుండగా శివగిరికి చెందిన కొందరు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేటలో బుధవారం ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. పీలేరుకు చెందిన శంకర్ వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో తిరుపతికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఏ.రంగంపేట వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో శంకర్ కుడికాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ పథం తిరుపతి అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి బుధవారమూ స్వచ్ఛ పథం పేరుతో ని రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగిస్తామని జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి తెలిపారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తొలి బుధవారం జిల్లాలోని 811 పంచాయతీలకు గాను 755 పంచాయతీల్లో కార్యక్రమాన్ని అమలు చేశామని చెప్పారు. ఇందులో భాగంగా 930 కిలోమీటర్ల రోడ్లలో 2,990 మంది పారిశుద్ధ్య కార్మికులు 1,124 టన్నుల చెత్త కుప్పలు, వ్యర్థాలను తొలగించారని వెల్లడించారు. చెక్బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు నాయుడుపేట టౌన్ : చెక్బౌన్స్ కేసులో ఒకరికి ఆరు నెలల జైలుశిక్ష విధించడంతోపాటు రూ.6 లక్షలు చెల్లించాలని నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మీనాక్షి సుందరి బుధవారం తీర్పు ఇచ్చారు. న్యాయవాది కొమ్మ శ్రీనివాసులు కథనం మేరకు.. నాయుడుపేట పట్టణానికి చెందిన దక్షణాది బాబుకు 2020లో అప్పు చెల్లించడంలో భాగంగా దాసరి శశిధర్ రూ.6 లక్షల చెక్కు ఇచ్చాడు. దాన్ని బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. దీనిపై బాధితుడు నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వాపరాలను విచారించిన జడ్జి మీనాక్షి తీర్పు చెప్పారు. నిందితుడు దాసరి శశిధర్కు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. బాధితుడైన దక్షణాది బాబుకు రూ.6 లక్షలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. -
రాజకీయ ఒత్తిడితోనే..
రెండు నెలల క్రితం అధికారులు వచ్చి షాపుల ముందున్న రేకులు తొలగించాలని చెప్పారు. మేమే స్వచ్ఛందంగా తొలగించాము. ఇప్పుడు షాపులు మొత్తం తొలగించాలని అంటున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ఇలా చేస్తున్నట్టు అనుమానం ఉంది. ఉన్నతాధికారులు మాకు న్యాయం చేయాలి. – శివ ప్రసాద్, బాధితుడు, కరకంబాడి మా పరిస్థితి ఏమిటి? మా నాన్న పాల దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా షాపును తొలగిస్తామనడం బాధగా ఉంది. అభివృద్ధికి మేము అడ్డుకాము. అధికారులు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెప్పడం న్యాయం కాదు. మా 20 కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. – సిద్ధేష్ బాధితుడు కరకంబాడి -
చాలెంజ్గా తీసుకోండి
కుంగిపోవద్దు..తిరుపతి అర్బన్: పదో తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఫలితాల కోసం 31,435 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు మందలిస్తారని, బంధుమిత్రులు హేలళ చేస్తారని మానసిక క్షోభను అనుభవిస్తూ కుంగిపోతుంటారు. వాటి ఫలితంగా క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. విద్యార్థులు అలా కుంగిపోకుండా చాలెంజ్గా తీసుకుని ముందడుగు వేయాలని పలువురు నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు కూడా వారిని మందలించకుండా ధైర్యం చెప్పాలని సూచిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష తప్పినంత మాత్రాన భవిష్యత్ లేదని తల్లిదండ్రులు, బంధువులు ముద్రవేసి మానసికంగా కుంగిపోయేలా చేయవద్దని విద్యావేత్తలు చెబుతున్నారు. పరీక్షల్లో సాధించిన మార్కులు బతకడానికి కొలమానం కాదని, విద్యార్థుల సృజనాత్మకతకు సూచికగానే భావించాలని పేర్కొంటున్నారు. పరీక్షల్లో తప్పిన వారిని తల్లిదండ్రులు మందలించకుండా ధైర్యం చెప్పి ప్రోత్సహించాలని, అప్పుడే వారు మరింత ధృడంగా తయారై ఏ పరీక్షలనైనా ఎదుర్కొంటారని చెబుతున్నారు. ప్రతి ఏటా ఫలితాలు విడుదలైన కొద్ది రోజుల్లోనే సప్లిమెంటరీ, ఇన్స్టెంట్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు మళ్లీ నిర్వహిస్తారని, వాటిలో విజయం సాధించేందుకు పట్టుదలతో కృషి చేస్తే సరిపోతుందని వెల్లడిస్తున్నారు. పరీక్ష ఫలితం కొలమానం కాదు పరీక్షల్లో తప్పిన ఎందరో ప్రయోజకులయ్యారు విద్యార్థి దశలో పలు పరీక్షల్లో తప్పిన ఎంతో మంది విద్యార్థులు ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతోపాటు ఇంజినీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులుగా రాణించారు. దేశ రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో నిలిచారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని అది మళ్లీ చేయకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. పరీక్ష తప్పితే జీవితం కోల్పోయినట్లు భావించడం సరికాదు. విద్యార్థికి ఉండాల్సిన ప్రధాన లక్షణం చిన్నతనం నుంచే ఆటుపోట్లను ఎదుర్కోంటూ ముందుకు సాగడమే. గురువారం టెన్త్ పరీక్షల ఫలితాలు రానున్నాయి. మార్కులు తక్కువ వచ్చినా.. ఎక్కువ వచ్చినా పాజిటివ్గా తీసుకోవాలి. తర్వాత లోటుపాట్లు సవరించుకుంటూ భవిష్యత్కు పునాదులు వేసుకోవాలి. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి -
దుకాణాల తొలగింపునకు యత్నం
అడ్డుకున్న బాధితులు ●రేణిగుంట: మండలంలోని కరకంబాడి రైల్వే గేట్ సమీపంలో రేణిగుంట– కడప జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించేందుకు అధికారులు బుధవారం ప్రయత్నించారు. వారిని బాధితులు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా రోడ్డు పక్కన దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఉన్నఫళంగా తొలగిస్తే ఎక్కడికి పోవాలని వాపోయారు. వారు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల రోడ్డు విస్తరణ కోసమని అధికారుల సూచనల మేరకు దుకాణాల ముందు ఉన్న రేకులను స్వచ్ఛందంగా తొలగించామని తెలిపారు. ఇప్పుడు సుమారు 20 దుకాణాలకు పైగా కూల్చి వేస్తామనడం దారుణమన్నారు. ముందుగా నోటీసులు ఇవ్వడంతోపాటు ఉపాధి కల్పించి దుకాణాలను కూల్చాలని కోరారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దుకాణాల ముందు రేకులు తొలగించిన దృశ్యం -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 72,362 మంది స్వామిని దర్శించుకున్నారు. 29,166 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.05 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
‘బాబు రాజకీయ జీవితామంతా కుట్ర, వెన్నుపోటు’
సాక్షి, తిరుపతి: టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీపై “హత్య రాజకీయాలు” ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుకు “మెగలోమానియా” అనే వ్యాధి ఉందని.. తనను తాను అతిశయోక్తిగా చూపించుకుంటారంటూ భూమన విమర్శించారు. మీడియా సంస్థలు చంద్రబాబును అతిగా పొగడ్తలతో ప్రోత్సహిస్తున్నాయంటూ భూమన మండిపడ్డారు.హింసా, కుల రాజకీయాలకు చంద్రబాబే తెర తీశారని.. పలు పాత హత్య ఘటనలపై చంద్రబాబు పాత్ర ఉందని భూమన ఆరోపించారు. వైఎస్ జగన్పై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైలులో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, కేసులు పెరిగాయి. “సూపర్ సిక్స్” హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమైంది, దేవుడిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ ప్రజల కోసం పనిచేసే నాయకుడని, చంద్రబాబు మేనేజ్మెంట్ రాజకీయాలపై ఆధారపడుతున్నారన్న భూమన.. 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల నాయకుడిగా అభివర్ణించిన భూమన.. టీటీడీ భూములను కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.టీటీడీలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు పెరిగాయన్న భూమన.. ఇసుక, గ్రావెల్ దోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని భూమన కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. -
జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగం ఎప్పుడో?
సూళ్లూరుపేట:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకెళుతున్న సమయంలో వరుసగా రెండు పీఎస్ఎల్వీ వైఫల్యాలతో ప్రయోగాలకు చాలాకాలం బ్రేక్ పడింది. ఈ రెండు ప్రయోగాలు విజయవంతమై ఉంటే మార్చి నెల 21 నాటికే జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగం జరిగి ఉండే ది. ప్రస్తుతం ఈ ప్రయోగం కూడా ఎప్పుడు నిర్వహి స్తారో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితి నెలకొంది. జీఎస్ఎల్వీ ఎఫ్–17 రాకెట్ అనుసంధానం పనులు మొదటి వెహికల్ అసెంబ్లింగ్ భవనంలో నిర్వహిస్తున్నారు. మూడో దశ అంటే క్రయోజనిక్ దశకు పైభాగంలో శాటిలైట్ అమర్చే రింగ్ విషయంలో సాంకేతిక లోపం తలెత్తి ఈ ప్రయోగం కూడా మరి కొంతకాలం బ్రేక్ పడింది. ఈ రింగ్ పంపేటప్పుడు మారిపోయిందని, శాటిలైట్ మోసే అంత స్టంట్ లేని రింగ్ను పంపారని, దీనికి బదులుగా బాగా స్టంట్ ఉన్న రింగ్ అవసరం ఉందని అది వచ్చిన తరువాతే శాటిలైట్ అమర్చే ప్రక్రియను చేపడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రయోగం ద్వారా 1,117 కిలోల బరువు కలిగిన ఈఓఎస్–5 ఉపగ్రహా న్ని పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అయితే గత ఏడాది మే 18న పీఎస్ఎల్వీ సీ61, ఈ ఏడాది జనవరి 13న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ62 రెండు ప్రయోగాలు మూడో దశలో ఒకే సాంకేతికపరమైన కారణాలతో వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది. మే నెలలో అయినా ప్రయోగాలు ఉంటాయా; అన్న విషయం అనుమానంగానే ఉంది. జీఎస్ఎల్వీ ఎప్17 ప్రయోగం విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఉత్సాహంగా కనిపించడం లేదు. ప్రస్తుతానికి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లో కూడా ప్రయోగాల సందడి కనిపించకుండా పరిస్థితి స్తబ్దుగా ఉంది. -
పెట్రోల్ బంకుల్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
తిరుపతి రూరల్: నగర శివార్లలోని పెట్రోల్ బంకులను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సోమవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవిలాల సమీపంలోని ఇండియన్ ఆయి ల్ కార్పొరేషన్, విద్యానగర్ వద్దనున్న భారత్ పెట్రోలియం, కూరపాటి ఫిల్లింగ్ స్టేషన్, చెర్లోపల్లి వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తిరుపతి రూరల్ తహసీల్దార్ జనార్దన్రాజు పాల్గొన్నారు. అధికారుల పర్యవేక్షణలో బంకులు సూళ్లూరుపేట:నియోజకవర్గంలోని ఆయా మండలాల తహపీల్దార్లు ఎప్పకప్పుడు స్టాక్ రిపోర్ట్ తెప్పించుకుంటూ బంకులను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తహసీల్దార్లు పెట్రోల్ బంకులపై నిఘాకు వీఆర్వోలను ఏర్పాటు చేశారు. రేషన్ పద్ధతిలో మాత్రమే ఆయిల్ ఇస్తున్నారు. మంగళవారం తహసీల్దార్ శైలకుమారి అన్ని బంకులను తనిఖీలు చేశారు. ఆటోవాలాల నిరసన తిరుపతి కల్చరల్:పెట్రోల్, డీజిల్ కొరతను తక్షణ మే నివారించాలని, అక్రమ నిల్వలు ఉన్న పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద వినూత్నంగా ఆటోకు తాళ్లు కట్టుకుని లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎస్. జయచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రమణ్యం, సీఐటీయూ నాయకులు పరుశురాం, యుగంధర్, జిల్లా ఆటో యూనియన్ కార్యదర్శి వాసు, నాయకులు రాము, ప్రసాద్, బాదుల్లా కేశవులు ప్రైవేట్ బస్సు యూనియన్ కార్యదర్శి శేషయ్య వరదారెడ్డి పాల్గొన్నారు.


