Tirupati
-
జువ్వలపాళెం చెరువులో దొంగలు పడ్డారు!
నాయుడుపేటటౌన్: మండలంలోని జువ్వలపాళెం చెరువులో దొంగల్లా రాత్రి సమయాల్లో ఇష్టారాజ్యంగా మట్టి అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజలుగా రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా చెరువులో జేసీబీలతో మట్టి తవ్వి, అక్రమ తరలిస్తున్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. జువ్వలపాళెం పంచాయతీ పరిధిలోని బిరదవాడ, మందబైలు గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు చెరువులో మట్టి తవ్వి, అక్రమ తరలిస్తున్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. మట్టి అక్రమంగా తరలిస్తున్న వారిని నిలదీస్తే వారు అధికార పార్టీ బడాబాబుల అనుమతితోనే చెరువులో మట్టి తవ్వి తరలిస్తున్నట్లు బహాటంగా చెబుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. జువ్వలపాళెం చెరువులో అర్ధరాత్రి సమయాల్లో అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి మట్టి అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేయనున్నట్లు బిరదవాడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పనబాక గంగాబాబు తెలిపారు. పార్టీ పటిష్టత దిగజారిపోయేలా స్థానిక అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ దందాలపై పార్టీ అధి నాయకులకు సైతం ఫిర్యాదు చేస్తమని గంగాబాబు పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మట్టి అక్రమ తరలింపునకు అడ్డుకట్టు వేయాలని కోరారు. -
చదువుల గుడి.. తడబడి
●ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆచరణలో అవేమీ కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో కళాశాలలను సమస్యలు చుట్టుముడుతున్నాయి. పలు పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా సత్ఫలితాలు ఒనగూరడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల లేమి..శాశ్వత అధ్యాపకుల కొరత పట్టి పీడిస్తోంది. జేఈఈ, నీట్ శిక్షణ తదితర అంశాల అమలు తీరును పరిశీలిస్తే అంతులేని ఆవేదన మిగులుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి సిటీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సమస్యలతో సతమతవుతున్నాయి. శనివారం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికుతున్నట్లే భావించాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాలు లేమితో పాటు ఆశించిన స్థాయిలో ఇంటర్ ఫలితాలు రాకపోవడం, శాశ్వత అధ్యాపకుల కొరత, విద్యార్థులను జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో సరైన శిక్షణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలల్లో పిల్లలను చేర్పించేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాగే కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం కావడం, నూతన సిలబస్కు అనుగుణంగా అధ్యాపకులకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడంలో అధికారుల విఫలం తదితర సమస్యలు ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పట్టి పీడిస్తున్నాయి. వేధిస్తున్న అధ్యాపకుల కొరత జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సుమారు 72 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకుల కొరత పీడిస్తోంది. అధ్యాపకుల నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు బట్టీ చదువులే గతిగా మారింది. ఒక్కో కళాశాలలో సింగిల్ డిజిట్ కూడా పర్మనెంట్ అధ్యాపకులు లేకపోవడం బాధాకరం. పలు కళాశాలల్లో పూర్తిస్థాయిలో ప్రిన్సిపాళ్లను నియమించకపోవడంతో ఇన్చార్జిలతోనే కళాశాలలను నెట్టుకొస్తున్నారు. తల్లికివందనం ఊసేలేదు! ఇంటర్ తరగతులు ప్రారంభమయ్యేనాటికి అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు గారడీ మాటలేనని తేలిపోయింది. ఈ ఏడాదికి సంబంధించి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు చెల్లించాల్సిన తల్లికివందంపై ఇప్పటివరకు ఊసే ఎత్తకపోవడం విచారకరం. నూతనంగా కళాశాలల్లో ప్రవేశాలు పొందే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సైతం తల్లికి వందనం ఎప్పటికి దక్కుతుందో చెప్పలేమని అధికారులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొగ్గు చూపని తల్లిదండ్రులు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలవైపు విద్యార్థులు, తల్లిదండ్రులు మొగ్గు చూపకపోవడంతో గత రెండేళ్లుగా ప్రవేశాలు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. జిల్లాలోని సుమారు 21 ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని గ్రూపుల్లో సింగిల్ డిజిట్కే ప్రవేశాలు పరిమితమవుతున్నాయి. అధికారులు అడ్మిషన్ల కోసం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సంప్రదించినా విద్యార్థులు, తల్లిదండ్రులు వెనకడువేస్తున్నారు. జిల్లా సమాచారం కళాశాలల ద్వితీయ విద్యార్థుల సంఖ్య సంవత్సరం సంఖ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 21 1677 ఏపీఆర్జేసీ 1 107 ఎయిడెడ్ 1 336 ఏపీఎస్డబ్ల్యూఆర్ 10 629 ఏపీటీడబ్ల్యూఆర్ 3 239 బీసీ రెసిడెన్షియల్ 2 209 హైస్కూల్ ప్లస్ 23 601 కేజీబీవీ 4 151 ఏపీఎస్ఎస్ 5 365వేసవి సెలవుల అనంతరం 2026–27 విద్యా సంవత్సరంలో కళాశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉచిత టెక్ట్స్బుక్స్తో పాటు స్టడీ మెటీరియల్ కిట్ను అందజేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ ఆచరణలో విఫలమవుతోంది. సీబీఎస్ఈ విధానంలో నూతన సిలబస్ను రూపొందించి సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఏప్రిల్లోనే పుస్తకాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదు. తూతూ మంత్రంగా పుస్తకాల పంపిణీ చేసి, అధికారులు చేతులు దులుపుకున్నారు. కళాశాలల భవనాలు, ఆర్వో ప్లాంట్ల శుద్ధి, మరుగుదొడ్లు, క్రీడాప్రాంగణాలను ప్రత్యేక నిధులతో వేసవి సెలవుల్లో మరమ్మతుల చేయాల్సి ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కళాశాలలకు వేసిన తాళం వేసినట్టే ఉండటం గమనార్హం. టీటీడీ జూనియర్ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకులు ఇద్దరు మాత్రమే ఉండటం గమనార్హం. అధ్యాపకుల నియామకాలపై టీటీడీ దృష్టిపెట్టకపోవడం పేద విద్యార్థులు ఉచిత పుస్తకాల పంపిణీకి నోచుకోకపోవడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కార్పొరేట్ స్థాయి వసతులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు మించి మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పూర్తి స్థాయిలో అందజేస్తాం. విద్యార్థుల సరిపడా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు గత ఏడాది కంటే పెరగనున్నాయి. ఇప్పటికే అధ్యాపకులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల జూన్ చివరి నాటికి పూర్తి స్థాయిలో అడ్మిషన్లు చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రభుత్వం నుంచి మెరిట్ స్కాలర్ షిప్లు, తల్లికి వందనం వంటి అన్ని సౌకర్యాలు విద్యార్థులు అందనున్నాయి –జి రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి -
తోతాపురి..
తిరుపతి అర్బన్: మామడి రైతుల భవిష్యత్ ఈ ఏడాది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. తాము పండించిన మామడి పంటను అమ్ము కోవడానికి రైతులు గత ఏడాది నానా తిప్పులు పడిన సంగతి తెలిసిందే. మామిడి కొనుగోలు చేసేవారు లేక కొందరు రైతులు ఉచితంగా గ్రామాల్లో పంపిణీ చేసిన సందర్భాలు లేకపోలేదు. అలాగే మామిడి సాగు వృథా అని కొందరు మామిడి చెట్లను తొలగించారు. గత ఏడాది ఫ్యాక్టరీలు తోతాపురికి కిలోకు రూ.8 ఇస్తారని, ప్రభుత్వం రూ.4 ఇస్తుందని, మొత్తంగా కిలోకి రూ. 12 గిట్టుబాటు కల్పిస్తామని చెప్పారు. అయితే పలుచోట్ల ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.4 మాత్రమే ఇచ్చినట్లు రైతులు వాపోతున్నారు. గత ఏడాది పెద్ద ఎత్తున సమస్యలు వచ్చాయి. ఈ ఏడాదీ అలాంటి ఇబ్బందులు తిరిగి చోటుచేసుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు. నిద్రావస్థలో ఉద్యానశాఖ గత ఏడాది నెలకొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంది. అయితే ఉద్యానశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు లేదని స్పష్టం అవుతోంది. రాష్ట్రస్థాయిలో గత ఏడాది మామిడి సమస్యలు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు లేదని స్పష్టమవుతోంది. ఈ ఏడాది కిలోకి రూ.7 చొప్పున ఫ్యాక్టరీల నుంచి ఇప్పిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి పైసా లేదు మామిడి సాగుకు ఏటా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది కంటే ధర పెంచి ఇవ్వాల్సి ఉంది. అయితే తగ్గించి ఇస్తామని చెప్పడాన్ని రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. -
ఐఐటీలో బయోగ్యాస్ ప్లాంట్కు పరిశీలన
ఏర్పేడు: తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసే అంశంపై శాసీ్త్రయ పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) ప్రతినిధుల బృందం శుక్రవారం ఐఐటీని సందర్శించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపు లక్ష్యంగా ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలను అధికారులు అధ్యయనం చేశారు. పర్యటనలో సీఎస్ఐఆర్ సీనియర్ సాంకేతిక అధికారి సి.చంద్రశేఖర్, సీనియర్ పరిశోధన ఫెలో పి.రాజేష్ పాల్గొన్నారు. ఐఐటీ జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ చమన్ మెహతా సమక్షంలో ఈ బృందం ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యసాధ్యాలను నిశితంగా పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ ద్వారా ఇంధనాన్ని తయారు చేసే విధానంపై వారు చర్చించారు. హాస్టళ్లలో ఉత్పత్తి అయ్యే సేంద్రియ వ్యర్థాలను ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చనే అంశంపై అధికారులు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏర్పేడు డిప్యూటీ ఎంపీడీఓ రమణ కుమార్, పంచాయతీ కార్యదర్శులు పి.ఝాన్సీ రాణి, పి.వెంకటముని, ఇంజినీరింగ్ అసిస్టెంట్ సాధిక్ తదితరులు పాల్గొన్నారు -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
నాగలాపురం: ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉంటూ అర్హుల ఓట్లను తొలగించకుండా బూత్ లెవల్ ఏజెంట్లు అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నాగలాపురంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోట రాజేష్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూమన మాట్లాడుతూ జాతీయ ఎన్నికల కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్ఐఆర్) బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి నేతలందరూ కలసి వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. బీఎల్ఏలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నెల రోజులు పాటు కష్టపడి అర్హులు ఓట్లు, వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓట్లను తొలగించకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలసి ఓటరు జాబితా నుంచి ఓట్లు తీసివేయడానికే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపడుతున్నారని, ఇటీవల పశ్చిమ బంగా, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా అర్హుల ఓట్లను తొలగించిందని ఆయన గుర్తు చేశారు. పశ్చిమ బంగాలో సుమారు 91 లక్షల తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు, తమిళనాడులో డీఎంకే అనుకూలంగా ఉన్న 75 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సమన్వయకర్త దృష్టికి తేవాలని బీఎల్ఏలకు భూమన దిశానిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ గ్రామస్థాయి నాయకులు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి అర్హత కలిగిన వారి ఓట్లు, పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్ పిలుపునిచ్చారు. ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారి ఓట్లను కూడా తొలగించకుండా ఉండేలా చూడాలని, ఆ బాధ్యత పూర్తిగా బీఎల్ఏలే చూడాలన్నారు. చంద్రబాబు మళ్లీ అడ్డదారిన గెలిచేందుకు ప్రస్తుత ప్రభుత్వం అడ్డగోలు కార్యక్రమాలను తీసుకొస్తుందని, ఇలాంటి కుయుక్తులను పార్టీ శ్రేణులు సమన్వయంతో ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, ఎస్ఐఆర్ నియోజవర్గ ఇన్చార్జి వేలూరు రాకేష్, ఎస్ఐఆర్ టాస్క్ఫోర్స్ ఇన్చార్జి వెంకటనారాయణరెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్రెడ్డి, నియోజక వర్గ ఇన్చార్జి, నరేంద్రం సనత్ కుమార్, భాను ప్రకాష్రెడ్డి, ఏడు మండలాల మండల అధ్యక్షులు అపరంజిరాజు, గవ్వర్ల కృష్ణయ్య, చలపతి రాజు, సొరకాయలు, మనినాయుడు, దయాకర్రెడ్డి, భాస్కర్ నాయు డు నాయకులు చిన్నదొరై, అన్నాదొరై, శ్యామ్, మహేష్ రెడ్డి, ఏవీఎం బాలాజీ రెడ్డి, షాబుద్దీన్, రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.సమన్వయంతో పనిచేయాలి -
ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: అరణియార్ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న అధికార పార్టీ ముఠాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్బీ పేట విలేజ్ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.చంద్రన్ ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం ఆయన ఆ అసోసియేషన్ సభ్యులతో కలసి తిరుపతి ప్రెస్క్లబ్లో మాట్లాడారు. పిచ్చాటూరు మండలం నుంచి నాగలాపురం మండలం సురుటపల్లికి ఇరువైపుల దాదాపు 23 గ్రామాల వారు ఆరణియార్ నది నీటితో పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. నదిలో నుంచి సుమారు 150 టిప్పర్లు, 120 ట్రాక్టర్లు, 50 ఇటాచీలతో ఇసుక, గ్రావెల్, రోడ్డు కంకరను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నేత సత్యవేడు నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్రెడ్డి తన అనుచరులతో యథేచ్ఛగా అక్రమ దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. విలేజ్ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహజ వనరులను ధ్వంసం చేస్తున్న విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సదరన్ జోన్, చైన్నెలో ఫిర్యాదు చేశామన్నారు. ఆ మేరకు న్యాయస్థానం ఇసుక, గ్రావెల్, కంకర తరలింపును నిలిపివేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇందుకు సంబందించిన కాపీలను జిల్లా మైనింగ్శాఖతోపాటు ఆయా ప్రభుత్వశాఖాధికారులకు అందించినా స్పందన లేదన్నారు. ఇసుక, గ్రావెల్, రోడ్డు మెటల్ రవాణాను అడ్డుకుని న్యాయం చేయాలని విజ్ణప్తి చేశారు. అసోసియేషన్ సభ్యులు బాబునాయుడు, సుబ్రమణ్యం, జి.బాలాజీ, డి.మనోహర్, ఎస్.విల్సన్, కె. మధుబాబు, కె.రవీంద్రకుమార్ పాల్గొన్నారు. -
ప్రకృతి పరిరక్షణలో అందరి భాగస్వామ్యం అవసరం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, దీనిని కాపాడుకుంటేనే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్యాన్ని కాపాడే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి కపీలతీర్థం సమీపంలోని నగరవనంలో అధికారులు, విద్యార్థులు, వాకర్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ పవన్ కుమార్, ఎఫ్ఆర్ఓలు సుదర్శన్ రెడ్డి, మాధవి పాల్గొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
చంద్రగిరి: మంగళం క్వార్టర్స్ పంచాయతీ పద్మావతి నగర్లో టీటీడీకి చెందిన నిరుపయోగ భవన సముదాయంలో భవన నిర్మాణ కార్మికుడు శివయ్య(70) శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నిరుపయోగంగా ఉన్న భవనంలో శివయ్య నుదుటిపై పెద్ద గాయమై విగత జీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పలు ఆధారాలను సేకరించారు. మృతుడు పచ్చికాపల్లం సమీపంలోని బలసలగుంట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దశాబ్దాలుగా మంగళం ప్రాంతంలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడని, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భవన నిర్మాణ కార్మికుడు శివయ్య మృతిపై హత్య కేసు నమోదు చేసినట్లు తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. సినిమా షూటింగ్లకు అడ్డాగా ఎస్వీయూ తిరుపతి సిటీ: రాయలసీమకు సరస్వతి నిలయంగా పేరుగాంచిన ఎస్వీయూ అధికారుల నిర్లక్ష్యంతో సినిమా షూటింగ్లకు అడ్డాగా మారుతోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎస్వీయూ ప్రాంగణంలో ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతించకూడదనే నిబంధనలున్నా, వాటిని వర్సిటీ అధికారులు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ప్రైవేటు కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీయూలో లా కళాశాల భవనాన్ని వర్సిటీ అధికారులు తమిళ సినిమా షూటింగ్కు కేటాయించడం దారుణమన్నారు. ఆ భవనాన్ని షూటింగ్ నిమిత్తం కేటాయించడంతో షూటింగ్ నిర్వహించే యాజమాన్యం కళాశాల భవనాన్ని ఉన్న నేమ్ బోర్డులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు షూటింగ్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, లేనిపక్షంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. 22 మందికి జరిమానా తిరుపతి లీగల్: తిరుపతి రూరల్, తిరుచానూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడపడం, పబ్లిక్ స్థలంలో ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, ఇతర నేరాలకు పాల్పడిన 22 మందికి రూ.1,41,900 జరిమానా విధిస్తూ తిరుపతి రెండో ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ షేక్ కరీముల్లా మస్తాన్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఎంఆర్ పల్లి, తిరుచానూరు పోలీసులు 22 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. -
ఘనంగా విత్తన దినోత్సవం
చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం విత్తన దినోత్సవం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ వి.చంద్రిక అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు విత్తన నాణ్యతపై అవగాహన కల్పించాలనే వీసీ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సరైన సమయంలో నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకుని విత్తుకుంటేనే ఆశించిన మేర అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయ డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ మునిరత్నం మాట్లాడుతూ రైతులు తమ సొంత అనుభవాలకు శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలను జోడించి, రైతు స్థాయిలోనే స్వయంగా విత్తనోత్పత్తి చేసుకోవడం ద్వారా ఆర్థికంగా అధిక లాభాలు గడించవచ్చన్నారు. మొక్కల ప్రజనన విభాగపు అధిపతి డాక్టర్ వసుంధర మాట్లాడుతూ పంట పండించడానికి నేల, నీరు ఎంత బాగున్నప్పటికీ సరైన విత్తన రకాన్ని ఎంపిక చేసుకోవడమే అత్యంత కీలకమైన అంశమన్నారు. అధిక దిగుబడులు సాధించాలంటే నేల స్వభావం, నీటి లభ్యత, నాణ్యమైన విత్తనం, రుతుపవనాల గమనంపై అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఎమ్ రెడ్డి శేఖర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి వేరుశనగ ప్రజనన విభాగ శాస్త్రవేత్తలు రూపొందించిన ‘వేరుశనగ పంటలో విత్తనోత్పత్తి పద్ధతులు‘ అనే పుస్తకాన్ని అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. విశ్వ విద్యాలయం రూపొందించిన పంట రకాలు, బయో పెస్టిసైడ్స్ , జీవన ఎరువులు, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
శ్రీసిటీలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
శ్రీసిటీ(వరదయ్యపాళెం): ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026ను పురస్కరించుకుని శ్రీసిటీలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా సోలమ్ ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) సభ్యులు ఎన్. నాగేశ్వరరాజు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రాంతీయ డైరెక్టర్ హెచ్.డి. వరలక్ష్మి పాల్గొన్నారు. శ్రీ సిటీ హార్టికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ విభాగం ఇన్చార్జి డి.ఎన్. రెడ్డి అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం అతిథులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి దిశగా కృషిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సత్యవేడు అటవీ శాఖ రేంజ్ అధికారి త్రినాథరెడ్డి గౌరవ అతిథిగా హాజరై, మొక్క నాటారు. ఈ సందర్భంగా నాగేశ్వరరాజు మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఎదుర్కొని, భూమి భవిష్యత్తును కాపాడడం మనందరి ఉమ్మడి బాధ్యత అని ప్రపంచ పర్యావరణ దినోత్సవం గుర్తుచేస్తోందని చెప్పారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పులు ప్రస్తుతం అతిపెద్ద సవాలు అని, దీనిని ఎదుర్కొనేందుకు శ్రీసిటీ కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. శ్రీసిటీ హార్టికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్ విభాగం ఇన్చార్జి డీఎన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీసిటీలో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా మొక్కలు నాటామని, ఈ ఏడాదిలో మరో పది వేలకుపైగా మొక్కలు నాటే ప్రణాళిక ఉందని తెలిపారు. -
చెరువులో దొంగలు పడ్డారు!
జువ్వలపాళెం చెరువులో రాత్రి వేళలో అక్రమార్కులు దొంగల్లా మట్టి తవ్వి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు తిరుపతి అన్నమయ్య సర్కిల్: టీటీడీలో కొత్తగా తెరపైకి వచ్చిన ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ అక్ర మాల వివాదంపై విచార ణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయ న తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈఈ 27, ఏఈ 10, ఏటీఓ 19, విద్యుత్ జేఈ 4 మొత్తం 60 పోస్టులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే 2023 నవంబర్ 23న నోటిఫికేషన్ ఇచ్చాం. 30 వేల దరఖాస్తులు వచ్చాయి. రాయలసీమ వా సులకు ప్రత్యేక కేటాయింపులు జరపకపోవడంతో న్యాయ వివాదాలు తలెత్తే ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్పట్లో తాత్కాలికంగా నోటిఫికేషన్ నిలిపివేశాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన ఏడాదిన్నర తర్వా త అంటే గత మే 10, 11న అవే పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు. లీగల్ సమస్యలు తలెత్తుతాయని తమ పాలనలో నోటిఫికేషన్ నిలిపివేస్తే, అదే నోటిఫికేషన్ ఇప్పుడు యథావిధిగా ఇచ్చారు. 2 పోస్టులకు, 3 మూడు పోస్టులకు గత ప్రభుత్వంలో ఒకే చోట పరీక్ష రాసే అవకాశం ఇచ్చాం. అయి తే ఇప్పుడు సాంకేతిక కారణాలు చూపి, అవకాశం ఇవ్వలేదు. సెంట ర్లు మార్పు చేయడంతో 18 వేల మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. దీని వెనుక కుట్ర దాగి ఉంది. టీటీడీ చైర్మన్, ఆయనకు కొమ్ముకాసే ఇద్ద రు సభ్యుల సహకారంతో ఒక్కో పోస్టును రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలకు అమ్ముకున్నారనే చ ర్చ జరుగుతోంది. న్యాయపరమైన సమస్యలు పరి ష్కరించకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే 20 24–25లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారికి అవకా శం కల్పించలేదు. రాష్ట్రం మొత్తం ఒకే జోన్గా పరిగణించడంతో రాయలసీమ ప్రాంతం వారికి అన్యాయం జరిగింది. సీమ ప్రాంత వాసులకు ప్రత్యేక అవకాశం కల్పించాలనే ఆరోజు నోటిఫికేషన్ రద్దు చేశాం. ఇప్పుడు టీటీడీ చెర్మన్ బీఆర్ నాయుడు, టీడీపీ వాళ్లు డబ్బులు దండుకున్నారు. గత ప్రభుత్వంలో 60 పోస్టుల భర్తీ బాధ్యతను మద్రాస్ ఐఐటీ వాళ్ల కు అప్పగించాం. పారదర్శకంగా భర్తీ ప్రక్రియ సా గాలని ఆరోజు ఆ నిర్ణయం తీసుకున్నాం.’ అన్నారు. -
యువత భాగస్వామ్యం అవసరం
రేణిగుంట: ఙమొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రేణిగుంట మండలంలోని తూకివాకం సమీపంలో తుడా ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, తుడా చైర్మన్ సి.దివాకర్ రెడ్డి పాల్గొని, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతోపాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే మొక్కలు బతకవన్నారు. మొక్కల సంరక్షణలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరారు. ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయని, సాధారణంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.4 డిగ్రీలుగా ఉండగా, ప్రస్తుతం 15 డిగ్రీలు దాటితే తీరప్రాంతాల్లో నివసించే మూడో వంతు జనాభా తీవ్ర ప్రభావానికి గురవుతున్నారన్నారు. తిరుపతి, శేషాచలం కొండల్లో ఉన్న చెట్ల కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో తుడా అధికారులు, ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ఎంపీడీవో రవిచంద్ర, స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భద్రతా ప్రమాణాలు పాటించకుంటే సీజ్
తిరుపతి మంగళం : విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి పాఠశాల, కళాశాలల బస్సులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా పరిధిలో విద్యా సంస్థలకు చెందిన బస్సులపై శుక్రవారం రవాణా శాఖాధికారులు ప్రత్యేక తనిఖీలు చేశారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈ తనిఖీలను ఆరు బృందాలుగా విభజించిన మోటారు వాహన తనిఖీ అధికారులు నిర్వహించారు. ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో సుమారు 850 విద్యాసంస్థల బస్సులను పరిశీలించి, సాంకేతిక లోపాలున్న 75 వాహనాలకు నోటీసులు జారీ చేశారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు, మరమ్మతులు చేసి, వాహనాలను తిరిగి తనిఖీకి తీసుకురావాలని సంబంధిత యాజమాన్యాలను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని బస్సులు అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి, ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందిన తర్వాతే రోడ్లపై వాహనాలను నడపాలని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ సూచించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా మోటారు వాహన చట్టాలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. అనంతరం జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్తో పాటు మోటారు వాహన తనిఖీ అధికారులు బస్సుల నిర్వహణ, ఫిట్నెస్, పర్మిట్, పన్నుల చెల్లుబాటు, అత్యవసర మార్గ ద్వారాల ఏర్పాటు, వేగ నియంత్రణ పరికరాల అమరిక, వాటి పనితీరు, అగ్నిమాపక పరికరాల లభ్యత, చెల్లుబాటు కాలం, డ్రైవర్ల లైసెన్స్లతో పాటు వారి అనుభవం ప్రత్యేక తనిఖీలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల బస్సులు, యాజమాన్య నిర్లక్ష్యంపై ప్రశ్నించాలన్నారు. -
‘టీటీడీ ఛైర్మన్ ఆ పోస్టులను అమ్ముకున్నారు’
సాక్షి, తిరుపతి: టీటీడీలో మరో కొత్త వివాదం తెరపైకి రాగా, 60 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలపై విచారణ జరగాలని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు నిలిపేసిన పోస్టులపై నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. లీగల్ సమస్యలపై వస్తాయనే కోర్టు తాతాల్కికంగా నిలిపేసిందన్న భూమన.. టీటీడీ ఛైర్మన్ ఒక్కో పోస్ట్ను రూ.30-40 లక్షలకు అమ్ముకున్నారంటూ ఆరోపించారు.‘‘రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక కేటాయింపులు జరపకపోవడంతో న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా నోటిఫికేషన్ నిలిపివేశాం. ఎన్నికల తర్వాత నిర్వహించాలని నిలిపివేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన ఏడాదిన్నర తర్వాత గత మే నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు...టీటీడీ చైర్మన్, ఆయనకు కొమ్ముకాసే ఇద్దరు సభ్యులు సహకారంతో ఒక్కో పోస్ట్ను 30-40లక్షలకు అమ్ముకున్నారనే చర్చ జరుగుతోంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. 2024-25 ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించలేదు. రాష్ట్రం మొత్తం ఒకే జోన్గా పరిగణించారు, రాయలసీమ ప్రాంతం వారికి అన్యాయం జరిగింది. రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక అవకాశం కల్పించాలనే ఆ రోజు నోటిఫికేషన్ రద్దు చేశాం...రాష్ట్రం మొత్తం ఒకే జోన్ కిందకు తీసుకు వచ్చారు. ఒక్కో పోస్ట్ లక్షలాది రూపాయలకు పోస్ట్లు అమ్ముకుంటున్నారు. 60 పోస్టుల భర్తీకి మద్రాస్ ఐఐటీ వాళ్లకు బాధ్యత అప్పగించాం. పారదర్శకంగా ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం.. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నోటిఫికేషన్ నిలిపివేశాము’’ అని భూమన వివరించారు. -
అర్ధరాత్రిలో తెలుగు తమ్ముళ్ల వీరంగం
భాకరాపేట:చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు మండలంలో కొందరు టీడీపీకి చెందిన యువకులు పుట్టిన రోజు వేడుకల పేరుతో నానా హంగామా సృషించారు. రాత్రి వేళ పిల్లలు భయపడుతారని చెప్పినందుకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బాధితులు శారద అనే మహిళ తెలిపిన వివరాల మేరకు.. బుధవారం అర్ధరాత్రి చిన్నగొట్టిగల్లు పంచాయతీ పరిధిలోని రాజువారిపల్లెలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇంటి ముందు కొందరు టీడీపీకి చెందిన యువకులు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కేకలు వేస్తూ టపాకాయలు పేలుస్తూ నానా హంగామా చేశారు. శారద అనే మహిళ మరికొందరు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ యువకులు ఆమె కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. బండ రాళ్లతో కొట్టి భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటనలో శారద, జానకీరామ్, ఎర్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై బాధితులు భాకరాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
డబ్బులిస్తామన్నా టికెట్లకు దిక్కులేదు!
శ్రీకాళహస్తి దేవస్థానంలో దర్శన టికెట్లు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మేము కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం నుంచి బయలుదేరి ఉదయం 3 గంటలకు శ్రీకాళహస్తి చేరుకున్నాం. ఉదయం ఆలయం వద్దకు వస్తే సిబ్బంది వాట్సాప్ విధానం ద్వారా మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, లేకపోతే ఉచిత దర్శన క్యూలో వెళ్లాలని సూచించారు. దీంతో తిరిగి గదికి వెళ్లి ఫోన్ తీసుకొచ్చి టికెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. దర్శన టికెట్ల జారీ విధానంపై స్పష్టమైన సమాచారం, ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించాలి. – పద్మావతి, విశాఖపట్నం -
అమ్ముకునేశారు
డీఎస్సీ మోసాలపై సీబీఐతో విచారణ చేయించాలి. రాష్ట్రంలో 13 లక్షల మంది పరీక్షలు రాస్తే అందులో 16,465 మందికి మెరిట్లో వచ్చారన్నారు. వారి వివరాలు ప్రకటించాలి. అలాగే క్రీడా కోటాలో 421 పోస్టులను మార్కెట్లో సరుకుల్లా అమ్ముకున్నారు. నిరుద్యోగులను నట్టేట ముంచారు. – హేమంత్రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్, యువత విభాగం లోకేష్ రాజీనామా చేయాలి డీఎస్సీ పరీక్ష పేపర్ లీకై ంది. దీని వెనుక కూటమి నాయకులు ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లీక్ వ్యవహరంతోనే అవుట్స్సోరింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ అయ్యారు. అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. – మనోజ్రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు -
చదివింది ఇంజినీరింగ్..చేసేది దొంగతనం
రేణిగుంట: రేణిగుంట రైల్వేస్టేషన్ పరిధిలో ఆగి ఉన్న రైళ్లలోప్లాట్ఫారాలపై బ్యాగ్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని గురువారం రేణిగుంట జీఆర్పీ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి నాలుగు లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్లో గురువారం జీఆర్పీ సీఐ యతీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఇటీవల రైళ్లలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో డీఎస్ఆర్పీ ప్రమోద్ ఆదేశాల మేరకు ఎస్ఐ మధుసూదన్ రావు సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. రైళ్లలో దొంగతనం చేసే వ్యక్తి రేణిగుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం– 1 పై ఉండగా అరెస్ట్ చేశామని తెలిపారు. అతను అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రంగారెడ్డి కుమారుడు రమేష్రెడ్డి (33)గా గుర్తించినట్టు వెల్లడించారు. విచారణలో నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం, ఉన్నత విద్యను అభ్యసించి, ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్టపోయినట్టు తేలిందన్నారు. ఆ తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు పడి, అప్పులు పెరగడంతో సులభంగా డబ్బు సంపాధించాలనే ఉద్దేశంలో ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామన్నారు. ఇతనిపై గుంతకల్ రైల్వే పోలీస్ స్టేషన్లో 8 కేసులు, గుత్తి రైల్వే పోలీస్ స్టేషన్లో ఒక కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటికి వచ్చాడని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 36 గ్రాముల బంగారం, ల్యాప్టాప్, డిజిటల్ కెమెరాను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఐపీఎఫ్లు నవీన్, వెంకటేశులు పాల్గొన్నారు. -
దగా డీఎస్సీ!
గొంతు నొక్కేశారు! సాధారణంగా నియామకాల్లో అభ్యర్థుల పరిశీలన కోసం 1:2 లేదా 1:3 నిష్పత్తిలో జాబితాలు విడుదల చేస్తారు. కానీ, ఈ డీఎస్సీలో వింతగా 1:1 నిష్పత్తిలోనే మెరిట్ లిస్టులను విడుదల చేయడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు ప్రత్యామ్నాయ అవకాశం లేకుండా పోయింది. మరొక విచిత్రమేమిటంటే 1:1 లిస్టులో పేర్లున్న అభ్యర్థులకు సైతం ఉద్యోగం రాకపోవడం. ఆ ఎంపిక జాబితాలో పేర్లుండి సర్టిఫికెట్ పరిశీలనకు హాజరైన సమయంలో అనర్హులని తిప్పి పంపారు. అన్ని అర్హతలున్నా అనర్హులని ముద్ర వేసి తెరవెనుక అనుకూలమైన వారికి పోస్టులు అమ్ముకున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. చిత్తూరు కలెక్టరేట్ : లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటమాడింది. ఎంతో కాలంగా ఎదురుచూసి, రాత్రింబగళ్లు కష్టపడి చదివిన అర్హులైన అభ్యర్థులకు డీఎస్సీ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేస్తూ అర్హులకు మొండిచేయి చూపించింది. బాధిత డీఎస్సీ అభ్యర్థులను నిలువునా ముంచేసింది. పరీక్షల నిర్వహణ నుంచి ఎంపిక ప్రక్రియ వరకు ప్రతి అడుగులోనూ అంతులేని అక్రమాలు చోటుచేసుకోవడంతో.. ‘ఇది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ’ అంటూ అభ్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. రూల్స్ మార్చేశారు పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకలా.. ఎంపిక ప్రక్రియకు వచ్చేసరికి మరోలా నిబంధనలను మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు రావాల్సిన చోట, తెరవెనుక జరిగిన మార్పుల వల్ల టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు సైతం నష్టపోవాల్సిన దుస్థితి వచ్చింది. నిబంధనలను తుంగలో తొక్కి, తమకు నచ్చిన వారికి లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు సర్కారు ఈ విధమైన మార్పులకు పాల్పడిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అర్హుల పొట్టగొట్టారు! డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పెద్ద వివాదంగా మారింది. క్రీడల్లో ఎలాంటి ప్రవేశం లేని వారికి, నకిలీ సర్టిఫికెట్లు ఉన్నవారికి ఈ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టేశారు. నిజమైన క్రీడాకారులు, అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. లిస్టులో పేరున్నా.. అనర్హులే! అధికారిక మెరిట్ లిస్టులో పేర్లు ఉన్నా చంద్రబాబు సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. మెరిట్ లిస్టులో టాప్లో ఉన్న అభ్యర్థులను సైతం ఏదో ఒక చిన్న సాంకేతిక కారణం చూపించి అనర్హులు అంటూ ముద్ర వేసింది. అర్హులను పక్కనబెట్టి, వెనుక వరుసలో ఉన్న వారికి ఉద్యోగాలు కట్టబెట్టడానికే ఈ అనర్హత డ్రామా ఆడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సీబీఐతో విచారణ జరపాల్సిందే పరీక్షల నిర్వహణ, కీ విడుదల, మెరిట్ లిస్టుల ప్రకటన, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని నిరుద్యోగ యువత మండిపడుతోంది. విద్యాశాఖ అధికారుల తీరుపై నమ్మకం పోయిందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని యువత, నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తోంది. -
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ షురూ
తిరుపతి సిటీ: ఎస్వీయూలో 63 నుంచి 68 వరకు ఈనెల 10వ తేదీన జరగనున్న కాన్వొకేషన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్ కార్డులను శుక్రవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎగ్జామినేషన్ డీన్ ప్రొఫెసర్ కే.సురేంద్రబాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎస్వీయూ అధికారిక వెబ్సైట్ను సంపద్రించి తమ హాల్టికెట్ నంబర్లను పొందుపరచి అడ్మిట్ కార్డులు పొందవచ్చని వెల్లడించారు. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ కాకపోయినా, సమస్యలు ఎదురైనా వర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ను సంప్రదించాలని సూచించారు. ఈఎస్ఐ ఆస్పత్రి తనిఖీ తిరుపతి తుడా: స్థానిక ఆర్సీ రోడ్డులోని ఈఎస్ఐ ఆస్పత్రిని గురువారం విజయవాడ రీజియన్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర విభాగం, ఇన్ పేషెంట్ల వార్డులు, స్టోర్స్, రెడీయాలజీ, ఫిజియోథెరపీ తదితరుల విభాగాలతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అసంపూర్తిగా ఉన్న పాత ఓపీ భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రీజియన్ డైరెక్టర్ రామారావు, మెడికల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈఈ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు పాల్గొన్నారు. డీసీఓగా సురేష్కుమార్ తిరుపతి అర్బన్: జిల్లా కో–ఆపరేటివ్ అధికారిగా సురేష్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారిగా పనిచేస్తున్న ఆయనకు జిల్లా అధికారి బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు ఆయన కలెక్టరేట్లోని తమ చాంబర్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పర్యాదపూర్వకంగా కలిశారు. డీసీఓగా పనిచేస్తున్న నాగవర్థి మే 31న ఉద్యోగ విరమణ పొందారు. ఈ క్రమంలో డివిజనల్ అధికారికి బాధ్యతలు కట్టబెట్టారు. నోటీసులకు వివరణ ఇచ్చిన ఉద్యోగులు తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఇటీవల సంచలం సృష్టించిన నకిలీ చలానాల వ్యవహారంపై వర్సిటీ అధికారులు బుధవారం 9 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు మరో ఉద్యోగికి సైతం ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఉద్యోగులు గురువారం వర్సిటీ అధికారులకు నకీలి చలానాల వ్యవహారంలో తమ పాత్రపై లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. దీంతో ఉద్యోగుల వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సర్వే ఏడీగా రాంప్రసాద్ తిరుపతి అర్బన్: జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్గా ఎస్ఎస్ రాంప్రసాద్ గురువారం కలెక్టరేట్లోని తమ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిశారు. జిల్లాలో అడిషనల్ ఏడీగా పనిచేస్తున్న ఎస్ఎస్ రాంప్రసాద్కు ఏడీగా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు జిల్లాలో ఏడీగా పనిచేస్తున్న అరుణ్కుమార్ కర్నూల్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. భూ సర్వేను చాలెంజ్గా తీసుకోండి భూ సర్వే ప్రక్రియను పూర్తి చేయడానికి గట్టిగా పనిచేయాల్సి ఉందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్వే ఏడీకి స్పష్టం చేశారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు. ఆ బీఎల్వోలపై శాఖాపరమైన చర్యలు తిరుపతి అర్బన్: సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సరవణ ప్రక్రియ అంశంతోపాటు మ్యాపింగ్ ఇంటింటా సర్వేలో వెనుకబడిన బీఎల్వోలపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులుతో కలసి బీఎల్వోలతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న బీఎల్వోలు పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. అలాగే సర్పై సమీక్ష సమావేశాలకు గైర్హాజరు అవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తిరుపతి ఆర్డీవో రామ్మోహన్తోపాటు ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
పట్టుదలతోనే విజయం
తిరుపతి అర్బన్: క్రమశిక్షణతోపాటు పట్టుదలతోనే హర్షిత్ ఆల్ఇండియా స్థాయిలో జేఈఈ అడ్వాన్స్డ్లో 15వ ర్యాంక్ కై వసం చేసుకున్నాడని విశ్వం విద్యాసంస్థల కరస్పాండెంట్ తులసీ విశ్వనాథ్రెడ్డి, డైరెక్టర్లు విశ్వచందన్రెడ్డి, విశ్వశ్రీ పేర్కొన్నారు. గురువారం తిరుపతిలోని విశ్వం స్కూల్లో హర్షిత్తో పాటు విద్యార్థి తల్లి డాక్టర్ గిరిజాను దుశ్శాలువాతో ససత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వం విద్యాసంస్థల్లో చదువుకున్న హర్షిత్ 2019లో సైనిక్ స్కూల్ ప్రవేశంలో రాష్ట్రంలో 3వ ర్యాంక్ను సాధించాడన్నారు. అలాగే కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యాక్షుడు విశ్వనాథ్ద్రెడ్డి హర్షిత్ను అభినందించారు. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి అదనపు సమాచారం కోసం 8688888802, 9399976999 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. -
యంత్రాలు సరిగా పని చేయలేదు
శ్రీకాళహస్తి ఆలయంలో అమలు చేస్తున్న ఆన్లైన్ టికెట్ విధానం భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మేం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం శ్రీకాళహస్తికి చేరుకున్నాం. అద్దె గదిలో ఫ్రెష్అప్ అయ్యి, రూ.2,500 రాహు–కేతు పూజ నిర్వహించుకోవాలని ఆలయంలోకి వచ్చాం. అయితే ఆలయంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ మిషన్ల ద్వారా రాహు–కేతు పూజ టికెట్లు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మిషన్లు ఏర్పాటు చేశారు కానీ అవి సరిగా పనిచేయడం లేదు. పనిచేసినా వాటిని ఎలా ఉపయోగించాలో మాకు అర్థం కావడం లేదు. – రాఘవేంద్ర రెడ్డి, మహబూబ్నగర్ -
ఇబ్బందులు పెరుగుతున్నాయి
శ్రీకాళహస్తి ఆలయంలో అమలు చేస్తున్న ఆన్లైన్ టికెట్ విధానం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేం రాజమండ్రి నుంచి ప్రయాణించి ఆలయానికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శన టికెట్లు పొందడంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. అందరికీ ఆన్లైన్ విధానంపై అవగాహన ఉంటుందని ఎలా అనుకుంటారు? ఆన్లైన్ విధానాన్ని కొనసాగించినా, భక్తుల సౌకర్యార్థం నగదు చెల్లించి నేరుగా టికెట్లు పొందే పాత విధానాన్ని కూడా కొనసాగించాలి. – సత్యనారాయణ, రాజమండ్రి -
విద్యుత్ షాక్తో యువ రైతు మృతి
– యాతలూరులో విషాదం వెంకటగిరి రూరల్ : విద్యుత్ షాక్తో యువ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని యాతలూరులో గురువారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్ఐ బ్రహ్మనాయుడు కథనం.. యాతలూరు గ్రామానికి చెందిన నాగవోలు ప్రసాద్రెడ్డి (33) గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో కూలీలతో పనులు చేయించారు. పొలం సమీపంలోని వ్యవసాయ మోటారు వద్ద ప్రమాదశాత్ విద్యుత్ ఘాతానికి గురయ్యారు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రసాద్రెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి ఏడాదిన్నార వయసు ఉన్న బాబు, భార్య ఉన్నారు. ప్రసాద్ మృతి చెందడంపై యాతలూరు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలియజేశారు. పరిశోధన అంశాలపై చర్చ చంద్రగిరి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాలలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగానికి సంబంధించిన పరిశోధన అంశాలపై మూడు రోజులపాటు జరగనున్న చర్చా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్ సత్యనారాయణ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనువైన నూతన విత్తన రకాల రూపకల్పనపై దృష్టిసారించాలన్నారు. వర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డీన్ డాక్టర్ పి.మునిరత్నం మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశోధన నైతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.రెడ్డి శేఖర్, వర్సిటీ జెనెటిక్స్ విభాగపు అధిపతి డాక్టర్ ఎస్.వసుంధర, ప్లాంట్ బ్రీడింగ్ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎల్వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
నిశీధిలో హాహాకారాలు
చంద్రగిరి మండలం, ఐతేపల్లె సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాలాయపల్లి : బాబు హామీల ప్రతులను దహనం చేస్తున్న నేదురుమల్లి రామ్కుమార్రెడ్డివెంకటగిరి నియోజకవర్గంలో.. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సాఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమానికి ఆ పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, నేతలు హాజరై విజయవంతం చేశారు. వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సెంటర్లో జరిగిన కార్యక్రమంలో నేదురుమల్లి పాల్గొని చంద్రబాబు అండ్ కో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రతులను దహనం చేశారు. -
ఒంటరి ఏనుగు హల్చల్
భాకరాపేట: ఎరవ్రారిపాలెం మండలం నెరబైలు – తలకోన మార్గంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తోంది. భక్తులు, వాహనదారులు, స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. వాహనదారుల పైకి ఒంటరి ఏనుగు దాడికి యత్నిస్తోంది. దీంతో భక్తులు, ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీయాల్సి వస్తోంది. గత కొన్ని రోజులుగా నెరబైలు, చింతగుంట గ్రామ సమీపంలో తిరుగుతూ పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు రైతాంగానికి భారీ నష్టాన్ని చేకూర్చుతోంది. రాత్రి వేళల్లో ఆయా గ్రామాల సమీపానికి చేరుకుని స్థానికుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పంటలను కాపాడుకోవడానికి రైతులు ప్రాణాలకు తెగించాల్సి వస్తోంది. కొందరు ప్రాణాలను పణంగా పెట్టి పొలాల్లోనే కాపలా కాయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖ మొద్దు నిద్ర వీడనంటోంది. ఒంటరి ఏనుగును కట్టడి చేసి, రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్టు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. -
స్పోర్ట్స్ కోటా వెబ్సైట్లో పెట్టాలి
డీఎస్సీపై సమగ్ర విచారణకు ఆదేశించాలి సీబీఐ విచారణకు ఆదేశించాలి డీఎస్సీలో అవినీతి జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలి. త్రుటిలో ఉద్యోగాన్ని కోల్పోయిన ఎంతో మంది అభ్యర్థులు నేడు బాధపడుతున్నారు. వారి అనుమానాలను నివృత్తి చేయాలంటే సమగ్ర విచారణ జరగాలి. దీంతో పాటు మెగా డీఎస్సీ ప్రక్రియలో కొంతమంది కోచింగ్ సెంటర్ల ప్రతినిధుల హస్తం సైతం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తక్షణం ప్రభుత్వం నిజాలను నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది. – సుందర్రాజు, ఎన్ఎల్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడు, తిరుపతి ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగం దారుణం కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా కింద అభ్యర్థులకు పరీక్షలు లేకుండా నేరుగా ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం దారుణం. ప్రభు త్వం నిజాయితీగా డీఎస్సీ ప్రక్రియ జరిపి ఉంటే తక్షణం స్పోర్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలు వెబ్సైట్లో ఉంచాలి. సుమారు 460 మందికి పైగా అనర్హులు ఉద్యోగాలు పొందార నే అనుమానాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. – అశోక్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, తిరుపతి అవినీతి జరగనప్పుడు భయమెందుకో? డీఎస్సీలో అవినీతికి అస్కారమేలేదంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పుడు తక్షణం విచారణకు ఆదేశించాలి. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ధ్రువపత్రాలు మెరిట్లిస్ట్ను వెబ్సైట్లో ప్రజల ముందు ఉంచడంలో ఎందుకు భయపడుతున్నారు. తక్షణం వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. డీఎస్సీ వివరాలు వెబ్సైట్లో ఉంచాలి. – ఆర్ ఆషా, పీడీఎస్ఓ, జిల్లా కార్యదర్శి, తిరుపతి తిరుపతి సిటీ: మెగా డీఎస్సీ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పాలని, నిజాలు నిగ్గు తేల్చాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా విషయంలో అనర్హులకు ఉద్యోగాలు లభించాయని, ఆ కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల వివరాలు, ధ్రువపత్రాలు తక్షణం ప్రభుత్వం వెబ్సైట్లో ఉంచాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో పాటు ఫలితాల విడుదల ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారికంగా విడుదల చేయకుండా కేవలం అభ్యర్థికి నేరుగా సమాచారం అందించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఇందులో కొంతమంది కోచింగ్ సెంటర్ల ప్రతినిధుల హస్తం ఉందని డీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. జిల్లాలో సుమారు 5 వేల మంది అర్హులైన నిరుద్యోగుల పరిస్థితి వర్ణణాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకుని, నిరుద్యోగుల అనుమానాలను నివృత్తి చేయాలంటే చంద్రబాబు సర్కార్ తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వారు ఇంకా ఏమన్నారంటే.. నిరుద్యోగులు అల్లాడుతున్నారు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు సక్రమమా..అక్రమమా? తేలాలంటే పూర్తిస్థాయి విచారణ జరగాలి. సీబీఐ, సిట్టింగ్ జడ్జి స్థాయిలో విచారణ జరిగితే నిజాలు బయటపడతాయి. డీఎస్సీలో త్రుటిలో ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు అవినీతి జరిగిందని తెలిసి అల్లాడిపోతున్నారు. డీఎస్సీలో అవకతవకలకు పాల్పడి, మా కడుపు కొట్టారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తిరుపతి డీఎస్సీ అంతా అవినీతిమయం మెగా డీఎస్సీ అంతా అవినీతిమయమైంది. తమ అనుచరులకు అధికారపార్టీ నేతలు ఉద్యోగాలను అమ్ముకుని రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. ఎంతో మంది పేద నిరుద్యోగులు ఏళ్ల తరబడి అప్పులు చేసి కోచింగ్ తీసుకున్న వారి కడుపు కొట్టారు. ఇంత దారుణం గతంలో ఎన్నడూ చూడలేదు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిలో 90 శాతం మందివి నకిలీ ధ్రువపత్రాలనే అనుమానం ఉంది. – ప్రేమ్కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షులు ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలి మెగా డీఎస్సీ అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం దారుణం. ప్రభుత్వం నిజాయితీగా, నిక్కచ్చిగా అవినీతికి తావులేకుండా మెగా డీఎస్సీని నిర్వహించి ఉంటే తమ నిజాయితీ ఇదీ..అని ఉద్యోగాల పొందిన వారి మెరిట్ లిస్ట్ను, వారి ధ్రువపత్రాలను బయటపెట్టాలి. ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు బయటపడి ప్రభు త్వ నిజాయితీ తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటాతో పాటు మిగిలిన పోస్టుల ఫలితాలపైనా అనుమానాలను నివృత్తి చే యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – శివ బాలాజీ, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు, తిరుపతి -
భారీగా మోహరించిన పోలీసులు
అలిపిరి వద్దకు భూమన అభినయ్ రెడ్డి, బాధితులైన చిరు వ్యాపారులను రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అలిపిరి మార్గంలో ఉదయం ఏడు గంటలకే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, పార్టీ శ్రేణులు రాకపోకలపై తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, వంద మందికి పైగా పోలీసులు అలిపిరి ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటూ కొంతమంది కానిస్టేబుళ్లు ఫ్లెక్సీలను ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. తిరుపతి తుడా: అలిపిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బలగాలు మోహరించడంతో ఆందోళన నెలకొంది. పోలీసు చెక్ పాయింట్లు, తనిఖీలతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందంటూ హడావుడి. ఇందుకు సంబంధించిన బ్యానర్లతో పోలీసులు కనిపించడం ఆశ్చ ర్యం కలిగించింది. అయినా అనుకున్న విధంగా వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి బాధితులైన చిరు వ్యాపారు లతో కలిసి అలిపిరి సమీపంలోకి చేరుకున్నారు. ఈ క్రమంలో తోపుడు బండ్లతో వస్తున్న అభినయ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ముందుకు చొచు కుని వచ్చే క్రమంలో పోలీసులు పెద్ద సంఖ్యలో చేరు కుని రోప్ల సాయంతో నిలువరించారు. ద్వితీయ శ్రేణి నాయకులు, మహిళా కార్యకర్తలు అడ్డుపడడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో పార్టీ నేతలకు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. అరగంట పాటు అలిపిరి ప్రాంతంలో వాహనాలు స్తంభించిపోయాయి. బాధితులకు న్యాయం చేయాలని పార్టీ శ్రేణులు గర్జించడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలగించిన చోటే స్టాళ్లను ఏర్పాటు చేయాల్సిందేనంటూ భూమన అభినయ్ డిమాండ్ చేయడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అడ్డొచ్చిన కార్యకర్తలు, పలువురు నేతలను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాల్లో పడేసి అరెస్టు చేశారు. అలిపిరిలో ఉద్రిక్తత పలువురి అరెస్టు చిరు వ్యాపారులకు అండగా నిలిచిన భూమన అభినయ్ రెడ్డితోపాటు పదుల సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్టేషన్కు తర లించారు. మల్లం రవిచంద్రారెడ్డితో పాటు వివిధ విభాగాల అధ్యక్షులు, ద్వితీయ శ్రేణి నేతలు, మహిళా నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి, ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
బొక్కసంపాళెం పంచాయతీకి జాతీయ స్థాయి గుర్తింపు
శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలంలోని బొక్కిసంపాళెం పంచాయతీ జాతీయ స్థాయి మహిళా స్నేహపూర్వక పంచాయతీగా ఎంపికై ంది. దీంతో ఆ పంచాయతీ అభివృద్ధికి రూ. కోటి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఢిల్లీలో అవార్డు ప్రదానం చేశారు. పంచాయతీ ఎంపికకు కృషి చేసిన తిరుపతి జిల్లా డీపీఓ సుశీలాదేవి, డిప్యూటీ ఎంపీడీఓ పద్మజ, పంచాయతీ కార్యదర్శి విజయ్, పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజకు జాతీయ స్థాయిలో అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా డీపీఓ సుశీలాదేవి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి విజయ్ను ఆమె అభినందించారు. -
తిరుమల అలిపిరి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, తిరుమల: తిరుమలలోని అలిపిరి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అలిపిరి వద్ద వీధి వ్యాపారులకు మద్దతుగా ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, భూమన అభినయ్ రెడ్డితో పాటుగా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, ఎస్సీ యూనివర్సిటీ పోలీసు స్టేషన్కు అభినయ రెడ్డిని పోలీసులు తరలించారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు, వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ఈడ్చుకెళ్లారు.మరోవైపు.. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అంతకుముందు అలిపిరి-జూపార్క్ రోడ్లో వీధి వ్యాపారులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కూటమి నేతలు సూచనతో బలవంతంగా చిరు వ్యాపారుల తోపుడు బండ్లు తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి నేతల అప్రజాస్వామ్య చర్యలపై భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో అలిపిరి జూపార్క్ రోడ్ వ్యాపారులకు మద్దతుగా క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు పర్యటన చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తల పర్యటనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ 30 యాక్ట్ పేరుతో అడ్డుకునేందుకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ అలిపిరి వద్ద తోపుడు బండ్లు వ్యాపారులకు వైఎస్సార్సీపీ మద్దతుగా నిలిచింది. -
Tirumala: తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ!
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని 83,858 మంది దర్శించుకున్నారు. 35,941 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.38 కోట్లు సమర్పించారు.సర్వదర్శనానికి 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
4 నుంచి వైఎస్సార్సీపీ నిరసన
వెంకటగిరి(సైదాపురం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో ఈనెల 4వ తేదీ నుంచి నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలపై వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మంగళవారం వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి సమీక్షించారు. నిరసన కార్యక్రమాలు విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకున్నారు. టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పటిష్ట చర్యలు తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ జేఈఓ (వైద్యం, విద్య) డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్వీబీసీ కార్యాలయం నుంచి టీటీడీ డీఈఓ వెంకట సునీల్తో కలిసి కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ టీటీడీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. -
వంచన, వెన్నుపోటే చంద్రబాబు పెట్టుబడి
తిరుపతి మంగళం : ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో వంచన, మోసం, కపటం, ద్రోహం, వెన్నుపోటు పెట్టుబడిగా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పద్మావతీపురంలోని తన నివాసం వద్ద ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ను ఎ మ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డితో పాటు పార్టీ శ్రేణులతో కలిసి ఆయ న ఆవిష్కరించారు. అనంతరం భూమన మాట్లాడు తూ 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కుట్రలు, కుతంత్రాలు, మోసాలతో ప్రజలను వంచించి, మోసిగించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చి నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన పాపాన పోలేదని, కాబట్టే నోటికి వచ్చినట్లుగా ఏకంగా 143 హామీలను గుప్పించి అందులో ప్రధానంగా సూపర్సిక్స్ అమలు చేస్తానంటూ సూపర్గా మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఎంతకాలం ప్రజలను మోసగించి, వెన్నుపోటు పొడిచి అధికారం ఏలుతావ్? చంద్రబాబు అని ప్రశ్నించారు. ప్రజలకు మోసాలతో కూడిన హామీలను గుప్పించి, వంచించి, వెన్నుపోటు పొడిచి రెండేళ్లు అవుతోందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ నుంచి మండల స్థాయి నుంచి 12వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేసిన ద్రోహా న్ని ఎండగడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు. పార్టీ నాయకులు రామస్వామి వెంకటేశ్వర్లు, తొండమనాటి వెంకటేష్రెడ్డి, లవ్లీ వెంకటేష్, ఆరే.అజయ్కుమార్, నల్లానిబాబు, వాసుయాదవ్, ఉదయ్వంశీ, మల్లం రవికుమార్రెడ్డి, బత్తల గీతాయాదవ్, గోపాల్రెడ్డి, కల్లూరి చెంగయ్య, అనీల్రెడ్డి, తులసి పాల్గొన్నారు. -
శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్ల విక్రయాల్లో అక్రమాలు
– టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఆగ్రహం తిరుపతి మంగళం: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్లుగా తిరుమల శ్రీవారి పవిత్రతను దిగజారుస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు శ్రీవారి లడ్డూ ప్రసాదంతో కూడా రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్లలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆయన మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రోజుకు ఏడు వేలకు పైగా వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను విక్రయిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఆన్లైన్లో పెట్టిన దర్శనాల టికెట్లు సెకన్లలో అయిపోయినట్లు చూపించి వాటిని రూ.లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. ఎస్వీ భక్తి చానల్, దళిత గోవిందం, శ్రీనివాస కల్యాణం, వేల సంఖ్యలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. ఐదేళ్ల జగనన్న పాలనలో వీఐపీ దర్శనాలకు కాకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేసినట్టు చెప్పారు. అప్పట్లో రోజుకు మూడు వేల లోపే వీఐపీ దర్శనాలు కల్పించేవాళ్లమని, ఇప్పుడు ఏడు వేలకు పైగా వీఐపీ దర్శన టికెట్లను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైన టీటీడీ పాలక మండలిని, ఉన్నతాధికారులను రోజూ సామాన్య భక్తులు దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీరంగనీతులని, చేసేవన్నీ నీచమైన పనులేనని ఆయన విమర్శించారు. పనుల్లో పురోగతి చూపండి తిరుపతి అర్బన్: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో అధికారులు పురోగమనం చూపాల్సి ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ, రెవెన్యూ సమస్యలు, పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలు, రీసర్వే పనులు, 22ఏ నిషేధిత జాబితాలోని కేసుల పరిష్కారం, మాన్యువల్ రికార్డ్స్ను డిజిటలీకరణ, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అన్ని అంశాల్లోను ఎప్పటికప్పుడు పురోగతి చూపాలన్నారు. -
నియామక పత్రాల పంపిణీలో అధికార దుర్వినియోగం
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అధికారులు పారదర్శకంగా పంపిణీ చేయాల్సిన అంగన్వాడీ పోస్టుల నియామక పత్రాలను ఏకంగా టీడీపీ నాయకులు పంచిపెడుతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సామాజిక మాధ్యమాల్లో ఈ ఘనతను టీడీపీ మద్దతుదారులు ప్రచారం చేసుకుంటుండగా, వాటిని ఖండిస్తూ నియోజకవర్గ ప్రజలు, విద్యావంతులు, మేధావుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్యవేడు ఐసీడీఎస్ పరిధిలో 31 అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అభ్యర్థులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. నియమితులైన వారికి నియోజకవర్గ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ ఆధ్వర్యంలో నియామక పత్రాలు పారదర్శకంగా పంపిణీ చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. అయితే టీడీపీ నాగలాపురం మండల అధ్యక్షుడు టీజేబీ ప్రణీత్ రెడ్డి తన కార్యాలయానికి పిలిపించుకుని, నియామక పత్రాలను అందజేయడం, వారిని సత్కరిస్తూ పార్టీకి పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించిన విషయాలను వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తిగా సంబంధిత శాఖ అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది నిర్వహించాలి కానీ ఇక్కడ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు నేరుగా జోక్యం చేసుకున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఐసీడీఎస్ పీడీ తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలి
నాయుడుపేట టౌన్: ‘వైఎస్సార్ సీపీ బూత్ లెవల్ ఏజెంట్లు (ఎస్ఐఆర్) స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ విధానంపై సైనికుల్లా పని చేయాలి. దొంగ ఓట్ల చేర్పులపై ప్రత్యేక నిఘా ఉంచి అడ్డుకట్ట వేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కలిగి ఉండేలా చూడాలి. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడితే నికచ్చిగా అడ్డుకోవాలి. మోసగాడు, మాయల మరాఠీ అయిన చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలి.’ అని మాజీ మంత్రి, ఉమ్మడి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. నాయుడుపేటలోని డీఎస్ఆర్ కల్యాణ మండపంలో మంగళవారం వైఎస్సార్ సీపీ బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై పార్టీకి చెందిన బీఎల్ఏలతోపాటు నాయకులందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి బీఎల్ఏ తన పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎస్ఐఆర్ విధానంతో చేపడుతున్న ఓటర్ల జాబితా పరిశీలనకు క్షుణంగా పరిశీలించాన్నారు. ఈ విధానంలో పలు రాష్ట్రాలు నిర్లక్ష్యం వహించడంతో లక్షల ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు మాయల మరాఠీ అని, ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తూ తిమ్మిని బమ్మిని చేసేలా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్ల చేర్పులు తదితర అక్రమాలకు పాల్పడితే వెంటనే గుర్తించి వాటిని అడ్డుకోవాలన్నారు. గతంలో చంద్రబాబు కుప్పం నియోజవర్గంలో తమిళనాడుకు చెందిన 35 వేల దొంగ ఓట్లు చేర్పించారని, ప్రతిసారి ఎన్నికల్లో దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తుండడాన్ని అడ్డుకోవాలన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు, అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. ఓటు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపండి ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి ఒక్కరు ఓటు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. ప్రతి పోలింగ్ బూత్లో సంబంధిత వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు వారి పరిధిలోని జాబితాలను క్షుణంగా పరిశీలించి, తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీకి వెన్నుముఖలా పనిచేయాలని ఎంపీ సూచించారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ బీఎల్ఏలు దొంగ ఓట్లు నమోదు కాకుండా, చనిపోయిన వారి ఓట్లు తొలగించేలా చూడాలన్నారు. బీఎల్ఏలు అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి ఎస్ఐఆర్ ప్రక్రియను ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. దీనిపై ఎలాంటి అనుమానాలున్నా, తనకుగానీ పార్టీకి కేటాయించిన టాస్క్ఫోర్స్ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. అనంతరం ఆరు మండలాలకు సంబంధించి వైఎస్సార్ సీపీ బూత్ లెవల్ ఏజెంట్లకు టాస్క్ఫోర్స్ అధికారిగా వచ్చిన మహేష్ పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీఎల్ఏలు చేపట్టాల్సిన పలు అంశాలపై క్షుణంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, ఎన్డీసీసీబీ మాజీ డైరెక్టర్ మద్దాలి సోమశేఖర్రెడ్డి, వేణుంబాక మునస్వామి నాయుడు, కటకం జయరామయ్య, బైనా మల్లికార్జునరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీలు ధనలక్ష్మి, అనీల్రెడ్డి, అరుణారెడ్డి, శేఖర్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు ఒట్టూరు కిషోర్యాదవ్ పాల్గొన్నారు. -
ఏమార్చేశారు!
డీఎస్సీ నియామకాల్లో నిలువునా మునిగిన ప్రతిభావంతులు మెరిట్ లేని వారికి ఉద్యోగాలు కుప్పం మండలానికి చెందిన రాధాకృష్ణ (పేరు మార్చాం) ఐదేళ్లుగా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. డీఎస్సీ కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో అధికారిక కీ ప్రకారం అతనికి అత్యుత్తమ మార్కులు వచ్చాయి. విద్యాశాఖ మొదట విడుదల చేసిన సెలెక్షన్ లిస్టులో ఎంపికయ్యారు. కుటుంబ సభ్యులు సంబరపడ్డారు. తీరా సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లే సమయానికి, అధికారులు సాంకేతిక కారణాలతో సవరించిన రెండో జాబితాలో రాధాకృష్ణ పేరు లేదు. అతనికంటే 8 మార్కులు తక్కువ వచ్చిన ఓ అభ్యర్థి పేరు ఆ స్థానంలో ప్రత్యక్షమైంది. అధికారులను నిలదీస్తే అది పై నుంచి వచ్చిన ఆర్డర్స్ .. మాకేం తెలియదని సమాధానం ఇచ్చారు. ఇక ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. మెరిట్ లేని వారికి మెగా డీఎస్సీలో ఉద్యోగాలు కల్పించారు. గత ఏడాది ఆగస్టులో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 1,478 మందికి గాను 1,099 మందికి కాల్లెటర్లు పంపారు. సర్టిఫికెట్లు పూర్తి చేసుకున్న మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదనే మెలిక పెట్టారు. ప్రతిభను నమ్ముకున్న అభ్యర్థులకు అన్యా యం చేశారు. ప్రతిభ కనబరచిన వారు న్యాయం కోసం విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగు తుంటే, కనీస అర్హత మార్కులు (కట్ ఆఫ్) సాధించని వారు, అసలు మెరిట్ జాబితా ఆఖరి పేజీల్లో ఉన్నవారు అనూహ్యంగా నియామకపత్రాలు అందుకోవడం అర్హులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఇది ఒక్క కుప్పంలోని రాధాకృష్ణ పరిస్థితే కాదు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత ఏడాది డీఎస్సీ రాసిన నిరుద్యోగుల దుస్థితి. పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించినా ఉద్యోగం సంపాదించలేకపోయారు. కట్ ఆఫ్ కంటే తక్కువ వచ్చిన వారు అనూహ్యంగా నియామక పత్రాలు అందుకుని ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. డీఎస్సీ గోల్మాల్ వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వేలాది మంది అర్హులకు మెగా డీఎస్సీలో అన్యాయం జరిగింది. పారదర్శకతకు నిలువుటద్దంగా నిలవాల్సిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేసింది. అంతర్గత అవకతవకల కారణంగా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి, ఉద్యోగం ఖాయమనుకున్న ప్రతిభావంతుల పేర్లు రాత్రికి రాత్రే మాయం చేశారు. అసలు క్వాలిఫైయింగ్ మార్కులు సైతం రాని వారు నియామక పత్రాలతో పాఠశాలల్లో అడుగుపెట్టడం విద్యాశాఖ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మారింది. ఏ జాబితా ఫైనల్? చంద్రబాబు సర్కారు చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ అక్రమాలకు, అవకతవకలకు నిలువెత్తు నిదర్శనంగా మారింది. విడతల వారీగా మారుతూ వచ్చిన ఫలితాల జాబితా, మెరిట్ లిస్ట్లు పలు అనుమానాలకు తావిచ్చింది. సాధారణంగా ఏ పరీక్షలైనా అత్యంత పకడ్బందీగా ఒకేసారి తుది మెరిట్, సెలెక్షన్ లిస్టులను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ మెగా డీఎస్సీలో వింత పోకడలకు తెరలేపారు. అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తూ, అనుమానాలకు తావిచ్చేలా ఒక్కోసారి ఒక్కొక్క రకమైన జాబితాను తెరపైకి తీసుకొచ్చారు. మొదటి సారి విడుదల చేసిన ప్రాథమిక మెరిట్ జాబితాలో చాలామంది అభ్యర్థులు టాప్ ర్యాంకుల్లో కనిపించారు. ఉద్యోగం ఖాయమని ధీమాగా ఉన్న అభ్యర్థుల పేర్లు.. మరుసటి రోజు వచ్చే సరికి మాయమైపోయాయి. వారి స్థానంలో వెనుకబడిన ర్యాంకర్ల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. ఒకే కేటగిరీ, ఒకే పోస్టుకు సంబంధించి మూడు నుంచి నాలుగు సార్లు సవరించిన జాబితాలను విడుదల చేశారు. ఏ జాబితా ఫైనల్? ఏ జాబితా ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నారో తెలియని అయోమయ స్థితిని కల్పించారు. అసలు మతలబు ఇదే చంద్రబాబు సర్కారు సృష్టించిన ఈ సాంకేతిక సాకుల వెనుకే అసలు మాయాజాలం దాగి ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కావా లనే మొదట ఒక లిస్ట్ వదిలి, అభ్యర్థుల స్పందనను చూసి, ఆ తర్వాత తెరవెనుక జరిగిన చర్చలు, పైరవీల ఆధారంగా లూప్ పోల్స్ వెతుక్కుంటూ అనర్హులను జాబితాల్లోకి చొప్పించడానికి లిస్టుల మార్పిడి ప్రక్రియను ఆయుధంగా వాడుకున్నట్లు బాధిత డీఎస్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పారదర్శకతను సమాధి చేస్తూ సాగిన జాబితాల మెగా డీఎస్సీ గోల్మాల్ పై తక్షణమే సీఐడీ విచారణ చేయించాలని బాధితులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతా మా ఇష్టం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో చిత్తూరు జిల్లా కేంద్రంగా గత ఏడాది ఆగస్టులో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఒక్కొక్క విడతలో ఒక్కో రకమైన జాబితాను విడుదల చేశారు. బాధిత నిరుద్యోగులు తమకు అన్యాయం జరిగిందని అడిగితే, సాంకేతిక లోపం అంటూ సాకులు చెప్పారు. ఈ సాకులు చెప్పడం వెనుక రూ.వందల కోట్ల అవినీతి జరిగిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పలు రకాల కొత్త పేర్లను సృష్టించి మార్కులను తారుమారు చేయడం, రోస్టర్ పాయింట్లను ఇష్టానుసారంగా మార్చేయడం, నకిలీ స్పోర్ట్స్, పీహెచ్ సర్టిఫికెట్లు సమర్పించడం వల్ల అర్హులైన నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగినట్టు స్పష్టమవుతోంది. -
తిరుపతి–రక్సౌల్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి–రక్సౌల్ ఎక్స్ప్రెస్(రైలు నంబర్ 17433/17434)ను సోమవారం ఎంపీ మద్దిల గురుమూర్తి జెండా ఊపి, ప్రారంభించారు. తిరుపతి రైల్వేస్టేషన్లో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలుగా అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. ఈ రైలు నడపడం ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తరాది రాష్ట్రాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. స్టేషన్ డైరెక్టర్ మోహన్కృష్ణ, మేనేజర్ చిన్నపరెడ్డి, సీసీఆర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ఫొటోతో అగ్నిగుండ ప్రవేశం
నాగలాపురం: నాగలాపురంలోని పడమట దళితవాడలోని ముత్తు మారియమ్మన్ తిరుణాళ్లల్లో భా గంగా ఆదివారం అర్ధరాత్రి అగ్నిగుండ ప్రవేశం కా ర్యక్రమం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని, భక్తి శ్రద్ధలతో అగ్నిగుండ ప్రవే శం చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. చి త్తూరు, తిరుపతి జిల్లాల ఎస్సీ సెల్ సభ్యుడు దేశప్పన్ అన్న కుమారుడు అజిత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అజిత్ తలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టుకుని జై జగన్ నినాదాలు చేస్తూ అగ్నిగుండ ప్రవేశం చేశాడు. సీఎం ఆడియోతో పింఛన్ సర్వర్ సమస్యలు తిరుపతి అర్బన్: బాబు ప్రభుత్వం ప్రచారానికి పె ద్దపీట వేస్తుందంటూ జనం మండిపడుతున్నారు. ‘పింఛన్ల పంపిణీలో రెండేళ్లుగా శ్రమ లేకుండా మీ కు చంద్రబాబు పింఛన్ ఇస్తున్నారూ..గుర్తు పెట్టుకోండి’ అని 10 సెకన్ల ఆడియో పింఛన్దారుడికి వినిపించిన తర్వాతే అన్లైన్లో తీసుకుంటుంది. ఆ తర్వాత పింఛన్ నగదు చెల్లిస్తారు. ఈ నెలలో(జూన్ నుంచి) సోమవారం ఆ వీడియోను 20 సెకన్లుకు పెంచడంతోనే సర్వర్ సమస్యలు వచ్చా యని పింఛన్దారులు మండిపడుతున్నారు. -
తిరుమలలో కుండపోత వర్షం
తిరుమల: తిరుమల కొండపై కుండపోతగా వర్షం కురుస్తోంది. రెండు గంటలకు పైగా వర్షం కురుస్తోంది. దాంతో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన ప్రాంతాలన్నీ జలమయంగా మారడంతో భక్తులు అగచాట్లు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నా.. తిరిగి వసతి ప్రాంతాలకు వెళ్లాలన్నా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమలలో ఉన్నపళంగా వాతావరణం మారిపోయి వర్షం పడటం ఆరంభించింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో తిరుపతి నగరంలో కూడా రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
భారీ కోతలకు సిద్ధమైన బాబు ప్రభుత్వం
● తల్లికి వందనంపై స్పష్టత ఇవ్వని యంత్రాంగం ● అర్హులందరికీ లబ్ధి చేకూరడంపై సందేహం ● పలు నిబంధనలు తీసుకువస్తున్నట్టు ప్రచారం ● తప్పుల సవరణకు చర్యలు శూన్యం తిరుపతి అర్బన్ : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పడం సీఎం చంద్రబాబుకు ఆది నుంచీ అలవాటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే ఒక్కో కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వివిధ కారణాలతో వేలాది మంది తల్లులకు నిరాశనే మిగిల్చారు. అక్కడితో ఆగకుండా అర్హులందరికీ ఇస్తామంటూ ఆశపెట్టి ఎందరో తల్లులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. అయితే నగదు జమ చేయకుండా వారిని మానసిక క్షోభకు గురిచేశారు. మళ్లీ ఇప్పుడు 2026–27 విద్యాసంవత్సరానికి అదే బాటలో లబ్ధిదారులను ఇబ్బంది పెట్టేందుకు నూతన నిబంధనలు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల హామీ ఇలా.. ‘‘ నా ఆడబిడ్డల కోసం నేను హామీ ఇస్తున్నా...తల్లికి వందనం పథకాన్ని కచ్చితంగా అమలు చేస్తా..ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఏటా రూ.15వేల చొప్పున అందిస్తా’’ అంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక ఒక్కో బిడ్డకు రూ.13వేలు మాత్రమే ఇస్తామంటూ నాలుక మడతపెట్టేశారు. విద్యార్థులకు అకౌంట్ అవసరమా..? తల్లికి వందనం పథకం పొందడానికి విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ ఉండాలంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. కొందరు సచివాలయ ఉద్యోగులు సరైన అవగాహన లేకపోవడంతో తల్లులతోపాటు విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ ఉండాలని...ఆ మేరకు ఖాతాలు ఓపెన్ చేసుకోవాలని సలహాలు ఇచ్చేస్తున్నారు. ఈ అంశంపై విద్యాశాఖాధికారులు స్పష్టత ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోత పెట్టడమే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 2,79,377 మంది, ఇంటర్లో మరో 60 వేల మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా 3,39,377 మంది విద్యార్థులకు తల్లికి వందనం వర్తించాల్సి ఉంది. అయితే ఆధార్కు బ్యాంక్ లింకేజీ, రేషన్కార్డుల్లో తప్పులు, ఈకేవైసీ, బయోమెట్రిక్ తదితర 47 కారణాలు చూపించడంతోపాటు 75 శాతం హజరు లేదంటూ మరో 20శాతం మందికి ఎగనామం పెట్టారు. దీంతో అవాకై ్కన తల్లులు రేషన్, ఆధార్కార్డులతోపాటు స్కూల్ సర్టిఫికెట్లలోని పొరబాట్లను సవరించుకున్నప్పటికీ రెండో దశ, మూడో దశ అంటూ తిప్పించుకుని ముఖం చాటేశారు. -
తస్మాత్ జాగ్రత్త
‘‘ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలి.. ఎస్ఐఆర్ ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలి.. వైఎస్సార్సీపీ అనుకూల ఓట్ల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేయాలి.. కూటమి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి.. అర్హులైన ఒక్క ఓటరుకు కూడా అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏమాత్రం ఏమరుపాటుకు గురికాకుండా బాధ్యతాయుతంగా ముందడుగు వేయాలి’’ అని పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాళహస్తిలో నిర్వహించిన అవగాహన సదస్సులో బూత్లెవల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. శ్రీకాళహస్తి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కీలక పాత్ర పోషించాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా పనిచేయాలని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేసిన బీఎల్ఏల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భూమన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అర్హులైన వారి పేర్లు తొలగిపోకుండా, కొత్తగా అర్హత పొందిన వారందరి పేర్లు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద మార్పులు గానీ, నిబంధనలకు విరుద్ధంగా ఓట్ల తొలగింపునకు యత్నిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. రాబోయే నెలరోజులు బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు. ఎత్తుగడలను తిప్పికొట్టాలి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి మార్పును నిశితంగా పరిశీలించాలన్నారు. బీఎల్ఏల అప్రమత్తతే పార్టీకి ప్రధాన బలమని స్పష్టం చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించేందుకు యత్నిస్తే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసి అడ్డుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు, బీఎల్ఏలు ధైర్యంగా ముందుకు సాగాలని, ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సమయస్ఫూర్తితో పనిచేస్తూ ఓటర్ల ధ్రువీకరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమన్వయ చేసుకోవాలి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని కోరారు. ఓట్లను కాపాడుతామంటున్న నేతలు, బీఎల్ఏలుసమష్టిగా పనిచేయాలి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కారణంగా అనేక రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు జరిగాయని తెలిపారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని కోరారు. శ్రీకాళహస్తి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, సిద్ధ గుంట సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సంధ్యారాణి, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, బర్రె సుదర్శన్ రెడ్డి, చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కూనాటి రమణయ్య యాదవ్, కొగిలి సుబ్రమణ్యం, గంగారి రమేష్, సిరాజ్ బాషా, ఉత్తరాజి శరవణ కుమార్, చంద్రయ్య నాయుడు, కంఠా ఉదయ్కుమార్, పఠాన్ ఫరీద్, గోరా, శ్రీవారి సురేష్, బతి శెట్టి, కోలూరు హరినాయుడు, ప్రభాకర్, నాగేష్, నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. -
తప్పుల సవరణకు లేని చర్యలు
జనమే ప్రధానం.. జైలుకు భయపడం ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటాం.. జనం కోసం వందసార్లు జైలుకు వెళతామని మోహిత్రెడ్డి తెలిపారు.వివిధ కారణాలతో పేద కుటుంబాలవారు సైతం తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. చిన్న చిన్న తప్పులకు అనర్హుల కింద పరిగణించారని వాపోతున్నారు. అయితే ఈ ఏడాదైనా వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తల్లికి వందనం పథకంపై జోరుగా కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని పలువురు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు పన్నాగాలు పన్నుతున్నారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. -
ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీ పెయిడ్ విధానం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్ విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో 4,735 సర్వీసులకు రూ.1.19 కోట్లు, తిరుపతి జిల్లాలో 4,942 సర్వీసులకు రూ.2.29 కోట్లు, చిత్తూరు జిల్లాలో 4,193 సర్వీసులకు రూ.1.63 కోట్లు, అన్నమయ్య జిల్లాలో 4,324 సర్వీసులకు రూ.1.68 కోట్లు, కడప జిల్లాలో 4,520 సర్వీసులకు రూ.1.98 కోట్లు, అనంతపురం జిల్లాలో 2,829 సర్వీసులకు రూ.1.41 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,432 సర్వీసులకు రూ. 88.81 లక్షలు, కర్నూలు జిల్లాలో 3,243 సర్వీసులకు రూ.1.63 కోట్లు, నంద్యాల జిల్లాలో 3,278 సర్వీసులకు రూ.1.54 కోట్లతో సంస్థ రీచార్జ్ చేసింది. -
అగ్నిగుండ మహోత్సవానికి వచ్చి..
– రోడ్డు దాటుతూ వృద్ధుడి దుర్మరణం ఏర్పేడు: తిరుపతి–శ్రీకాళహస్తి మార్గం ఏర్పేడు మండలం, అంజిమేడు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందాడు. ఏర్పేడు ఎస్ఐ రవిప్రకాష్ తెలిపిన వివరాలు.. ఏర్పేడు మండలం, పాగాలి పంచాయతీ, క్రిష్ణంపల్లికి చెందిన మాణికుప్పం మునిరత్నంరెడ్డి(65) ఆదివారం పాతవీరాపురంలో జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి అగ్నిగుండ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చాడు. బంధువుల ఇంట్లో భోజనం చేసి స్వగ్రామానికి తిరుగుపయనమయ్యాడు. అంజిమేడుకు చేరుకుని అక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్లాలన్న ఆలోచనతో పాతవీరాపురం నుంచి నడుచుకుంటూ అంజిమేడు సమీపంలోని ఓ హోటల్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తలకు బలమైన రక్తగాయం కావడతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య పార్వతి, కుమారులు ముద్దుకృష్ణారెడ్డి, వెంకటమునిరెడ్డి, ఈశ్వర్రెడ్డి, కుమార్తె జానకి ఉన్నారు. చిన్న కుమారుడు ఈశ్వర్రెడ్డికి మినహా మిగిలిన వారందరికి వివాహాలయ్యాయి. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో డాక్టర్ మునస్వామి మృతి
సూళ్లూరుపేట:తిరుపతి స్విమ్స్ లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ కారణి మునస్వామి ఆదివారం ఉదయం రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. తడ మండలం మాంబట్టు శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించేందుకు ఆయన వస్తుండగా టాటా రియర్సన్ కంపెనీ సమీపంలో కారు వెనుక టైర్ పగలడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. కారులో అన్ని బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ ఆయనకు ముప్పు తప్పలేదు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్ఐ కొండపనాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖుల నివాళి తిరుపతి స్విమ్స్ వైద్యుడు మునస్వామి మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, తిరుపతి రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ సమ్మన సోమ్ప్రకాష్యాదవ్, తుడా ప్రత్యేక అధికారి బాబయ్య, బీజేపీ నేతలు సైకం జయచంద్రారెడ్డి, రెడ్డీశ్వరరెడ్డి, స్విమ్స్, రుయా, బర్డ్, పద్మావతి మెడికల్ కళాశాల డాక్టర్లు, ప్రొఫెసర్లు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. -
ముక్కంటి సేవలో సమాచారశాఖ కమిషనర్
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని సమాచారాశాఖ కమిషనర్ గాజుల ఆదెన్న కుటుంబ సమేతంగా ఆదివారం సేవించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఈఓ బీకే వెంకటేశులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు. కదులుతున్న బస్సు దిగబోయి.. – విద్యార్థిని పాదం నుజ్జునుజ్జు వరదయ్యపాళెం: వరదయ్యపాళెం ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న బస్సు నుంచి దిగే ప్రయత్నంలో 16 ఏళ్ల విద్యార్థిని పాదం మీదుగా బస్సు వెనుక టైరు వెళ్లడంతో పాదం నుజ్జునుజ్జు అయ్యింది. బాధిత యువతి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. పాండూరు గ్రామానికి చెందిన హారిక సూళ్లూరుపేట వెళ్లేందుకు బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు బయలుదేరుతుండగా హారిక తల్లి హడావుడిగా దిగేయడంతో, తల్లి వెంట తానూ దిగేందుకు హారిక ప్రయత్నించింది. ఈ క్రమంలో కాలు జారి బస్సు కింద పడిపోవడంతో వెనుక టైరు ఆమె కుడి కాలి పాదం పైనుంచి వెళ్లింది. పాదం తీవ్రంగా దెబ్బతిని రక్తస్రావమైంది. వెంటనే బస్సును ఆపి 108 అంబులెన్స్ ద్వారా శ్రీకాళహస్తికి తరలించి వైద్యం చేయించారు. విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. ఆగిన నారాయణాద్రి రేణిగుంట: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం రాత్రి రేణిగుంట వద్ద నిలిచిపోయింది. ఏమి జరిగిందో తెలియక ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. స్థానికుల కథనం.. తిరుపతి నుంచి సాయంత్రం 6.20 నిమిషాలకు బయలుదేరిన నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైలు రేణిగుంట వారపు సంత రైల్వే గేట్ సమీపంలో నిలిచిపోయింది. గంట పాటు చీకటిలో రైలు నిలిచిపోవడంతో ఏమి జరిగిందో తెలియక ప్రయాణికులు కొంత భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత యథావిధిగా రైలు బయలుదేరి వెళ్లింది. రైల్లోని కో పైలట్ను అడగ్గా ట్రైన్కి పవర్ కట్ అవడం వల్ల రైలును ఆపేశామని తెలిపారు. నేడు ‘డయల్ యువర్ సీఎండీ’ తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 1న సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ కార్యాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. అయ్యో ‘పాప’ం – టిన్నర్ తాగి మూడేళ్ల చిన్నారి మృతి దొరవారిసత్రం : తాగునీరు అనుకుని పెయింట్లో కలిపే టిన్నర్ తాగి మూడేళ్ల చిన్నారి దీప్తి మృతి చెందిన ఘటన బూదూరులో ఆదివారం జరిగింది. వివరాలు.. బూదూరు ఎస్సీ కాలనీకి చెందిన పైపూరి మోహన్కుమార్, నవీన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె దీప్తి ఇంట్లో పొయ్యి వెలిగించేందుకు తీసుకువచ్చిన టిన్నర్ను తాగేసింది. గుర్తించి తల్లిదండ్రులు వెంటనే బైక్పై సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వైవీ చౌదరి ఘటన స్థలం పరిశీలించారు. దర్యాప్తు చేపట్టారు. సద్వినియోగం చేసుకోండి తిరుపతి సిటీ:ఎస్వీయూ పరిధిలో ఇయర్లీ ప్యాట ర్న్ విధానంలో యూజీ పూర్తి చేసి ప్రాక్టికల్స్ పెండింగ్లో ఉన్న విద్యార్థులకు సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు డీన్ సురేంద్రబాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజమాణిక్యం తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే ప్రాక్టికల్స్కు విద్యార్థులు హాజరుకావాలని సూచించారు. -
తొట్టంబేడులో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
– అర్ధ ఎకరా వరి పంటకు నష్టం తొట్టంబేడు: తొట్టంబేడు మండలంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతుకు శాపంగా మారింది. వివరాలు.. తొట్టంబేడు మండలం, శేషమనాయుడుకండ్రిగ గ్రామానికి చెందిన ఓ రైతు 12 ఎకరాల వరకు వరి పైరు నాటాడు. అయితే విద్యుత్ అధికారులు నూతనంగా 11 కేవీ త్రీ ఫేజ్ విద్యుత్ వైర్లు లాగేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆ రైతుకు చెందిన సుమారు అర్ధ ఎకరా వరి పైరు దెబ్బతింది. రూ.20 వేల వరకు నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు కోరారు. -
జనమే ప్రధానం..
‘ప్రజల కోసం పోరాటం చేయడంలో ముందుంటాం. నా తండ్రి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని 230 రోజులు జైలులో పెట్టారు. నాపైన, నా కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెడుతున్నారు. అభివృద్ధి చేసినా అవినీతి అంటూ విషప్రచారం చేస్తున్నారు. కావాలనే కక్షగట్టి రోజూ విషబీజాలు నాటుతున్నారు. అయినా మేం భయపడం. ప్రజల కోసం పోరాటం ఆపం. జనమే మాకు ప్రధానం.. వంద సార్లు జైలుకు వెళ్లడానికి కూడా మేం సిద్ధం..’ అని వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి స్పష్టం చేశారు. తుడాలో ఏసీబీ అధికారుల విచారణ నేపథ్యంలో ఆయన ‘ఏసీబీ విచారణ..సమగ్ర వివరణ’ పేరుతో ఓ బుక్లెట్ను విడుదల చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్: తుడాలో అవినీతి జరిగిందంటూ సాగుతున్న ప్రచారానికి తుడా మాజీ చైర్మన్, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తుడా నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసినందుకు జైలుకు పంపుతామంటే తాము సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంట గ్రామంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 2019లో తుడా చైర్మన్గా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి రూ.29 కోట్ల బడ్జెట్ ఉన్న తుడాను 2024లో తాను తుడా చైర్మన్గా దిగే సమయానికి రూ.400 కోట్లకు పెంచినట్టు గుర్తుచేశారు. గత ఐదేళ్ల జగనన్న పాలనలో తుడా అభివృద్ధిని చూసి ఓర్వలేకే అవినీతి బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ఏసీబీ, విజిలెన్స్ విచారణను గౌరవించి ఇన్నాళ్లు తాము మౌనం పాటించామని, కానీ అసత్య ప్రచారం హద్దులు దాటుతుంటే వాస్తవాలు ప్రజలకు చెప్పక తప్పలేదన్నారు. తుడాలో జరిగిన ప్రతి పనికీ, ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్కలు ఉన్నాయని, చెవిరెడ్డి కుటుంబానికి అవినీతి మరకలు అంటించేందుకు అధికారులను బలిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. బుక్లెట్ విడుదల 2019 నుంచి 2024 వరకు తుడా పరిధిలో చేపట్టిన అభివృద్ధికి సంబంధించి పూర్తి వివరాలతో ‘తుడాపై ఏసీబీ విచారణ – సమగ్ర వివరణ’ పేరుతో మోహిత్రెడ్డి బుక్లెట్ విడుదల చేశారు. అందులో ప్రతి ఆరోపణకు ఆధారాలతో సమాధానం ఇచ్చామని చెప్పారు. బుక్లెట్లోని ఒక్క అంశమైనా తప్పని నిరూపిస్తే పూర్తి బాధ్యత వహించడానికి తాము సిద్ధమన్నారు. చట్టబద్ధంగానే బదలాయింపు తుడా నుంచి రూ.220కోట్లు అక్రమంగా ఎంపీడీఓల ఖాతాలకు దారిమళ్లించారని చేస్తున్న ఆరోపణలపై స్పందించిన మోహిత్రెడ్డి అదంతా చట్టబద్ధంగానే జరిగిందన్నారు. కలెక్టర్ అనుమతి, తుడా వీసీ అంగీకారంతోనే ఎంపీడీఓల ఖాతాలకు నిధులు మళ్లించారని చెప్పారు. ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టిన దాఖలాలు లేవన్నారు. అధికారులను వేధించొద్దు తమపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా తుడా కేంద్రంగా జరిపే విజిలెన్స్ విచారణలో ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించడం సరికాదన్నారు. ఏవైనా ప్రశ్నలు ఉంటే తమను నేరుగా నిలదీయాలని సూచించారు. తుడాలో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాధించలేదన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, చంద్రగిరి ఎంపీపీ హేమేంద్ర కుమార్రెడ్డి, చంద్రగిరి మండల పార్టీ అధ్యక్షుడు కొటలా చంద్రశేఖర్రెడ్డి, చంద్రగిరి మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ మస్తాన్, పేరూరు మాజీ సర్పంచ్ దామినేటి కేశవులు, పార్టీ నాయకులు హరిప్రసాద్ రెడ్డి, కరమలవల్లీ, యశ్వంత్రెడ్డి, రాజేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేస్తే.. అవినీతి అంటారా? తుడా పరిధిలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే అవినీతి జరిగిందని అంటున్నారని, తుడా ఆదాయం, ఆస్తులు పెరగడం, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం కూడా అవినీతేనా..?అని మోహిత్ ప్రశ్నించారు. సూరప్పకసం, అవిలాల, తుడా టవర్స్, పార్కుల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందే జరిగాయని గుర్తుచేశారు. తుడా ఒక్కో సిమెంట్ బెంచ్కి రూ.9 వేల వరకు ఖర్చు చేస్తే, గతంలో చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాలు, వైజాగ్ వద్దనున్న చోడవరం పార్కులో ఒక్కో బెంచ్కి రూ.14 వేల వరకు ఖర్చు చేశారని గుర్తుచేశారు. దీనిని బట్టి అవినీతి ఎక్కడ జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. నాని ఆరోపణలపై ఆగ్రహం తుడాలో అవినీతి జరిగిందంటూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తన పేటీఎం బ్యాచ్తో చేయిస్తున్న ఆరోపణలపై మోహిత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో కర్మక్రియల భవనాలు, ధ్యాన మందిరాలు, కల్యాణ మండపాలు, సిమెంటు రోడ్లు, మురుగు కాలువలు, అండర్ డ్రైనేజీ, మినరల్ వాటర్ ప్లాంట్లు, మెడికల్ క్యాంపులు, ప్రతి ఇంటికీ పండ్లు, పూల చెట్లు, పార్కులు వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అభివృద్ధి చేసినందుకు జైలుకు పంపుతామంటే సిద్ధమే -
ప్రజలకు అన్యాయం చేస్తే సహించం
డక్కిలి: ప్రజలకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వెంబలూరులో పూల కృష్ణయ్య, పూల వెంకటేశ్వర్లుకు చెందిన పట్టా భూమిలో నిమ్మచెట్లను అక్రమంగా అధికారులు తొలగించడంపై ఆయన మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. బాధితులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాము కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూమిలో దౌర్జన్యంగా నిమ్మ చెట్లు తొలగించి దారి వేసేందుకు తహసీల్దార్, పోలీసులు చర్యలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారం నుంచి నిద్ర లేకుండా తమ పొలం వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. స్పందించిన నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాత్రి వేళ జేసీబీలు తీసుకువచ్చి అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటేనే వారు తప్పు చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేసి అక్రమంగా వ్యహరిస్తున్న అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, తప్పు చేసిన అధికారులను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. పార్టీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులురెడ్డి, బాలాయపల్లె మండల కన్వీనర్ వెందోటి కార్తీక్రెడ్డి, మాధవయ్యపాళెం సొసైటీ మాజీ అధ్యక్షుడు నర్రావుల వేణు గోపాల్ నాయుడు, నేతలు కసుమూరు మధురెడ్డి, ఎంఎల్ నారాయణరెడ్డి, పాయసం పోలయ్య, శ్రీహరిరెడ్డి, గుండోలు మధు పాల్గొన్నారు. -
తుమ్మలగుంటలో ఘనంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజున తిరుమల తరహాలో గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు ఆదివారం రాత్రి పౌర్ణమి గడియల్లో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారు మలయప్ప స్వామి అలంకరణలో గరుడునిపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. పౌర్ణమి గరుడ సేవ తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీ దంపతులు, వారి తనయులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. -
ఎస్వీ సంగీత కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతి కల్చరల్:టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ సంగీత, నృత్య కళాశా ల, ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాలలో 2026, 2027 విద్యా సంవత్సరానికి పలు రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరకాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 2 నుంచి కళాశాలలో దరఖాస్తులు జారీ చేయనున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 30వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50 చెల్లించి దరకాస్తు పొందవచ్చు. రెగ్యులర్ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రెగ్యులర్ కోర్సు చదివే విద్యార్థులకు మాత్రమే నిబంధనలకు లోబడి హాస్టల్ వసతి కల్పించనున్నట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు 0877–22697, 9848374408, 9440793205ను సంప్రదించాలని టీటీడీ సూచించింది. కల్వర్టును ఢీకొన్న కారు – ఒకరికి తీవ్ర గాయాలు చంద్రగిరి: అదుపుతప్పి కల్వర్టును కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు నడింపల్లి వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని బాబ్జీకి తీవ్ర గాయాలు కాగా వెంకట రవికుమార్, కృష్ణారెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. టోల్గేట్.. తప్పని నిరీక్షణ ఏర్పేడు:తిరుపతి–శ్రీకాళహస్తి మార్గం, ఏర్పేడు మండలం, మేర్లపాక సమీపంలో ని టోల్గేటు వద్ద నిత్యం వాహనాలు బారులుతీరి నిలిచిపోతున్నాయి. టోల్ప్లాజ్ వద్ద వాహనాల ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం చేస్తుండడంతో వాహనాలు బారులుతీరుతున్నాయి. ఇక్కడ నిత్యం ఇదే తంతు. సిబ్బంది కూడా వాహనదారులతో తరచూ ఘర్షణకు దిగుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటనలు గతంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షించి, సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు. నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు తిరుపతి క్రైం : శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమలు చేస్తున్నట్లు సబ్–డివిజనల్ పోలీస్ అధికారులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ తిరుమల, తిరుపతికి శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ఇతర సామూహిక కార్యక్రమాలకు పోలీసు అనుమతి తప్పనిసరని వివరించారు. పోలీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే వివాహాలు, అంత్యక్రియలు, సంప్రదాయ కుటుంబ కార్యక్రమాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని తెలిపారు. -
ఉపాధిలో అవినీతిపై విచారణ
కలువాయి(సైదాపురం) : కలువాయి మండలం వెంకటరామరాజుపేటలో చేపట్టిన ఉపాధిహామీ పనుల్లో అవినీతిపై శనివారం ఆత్మకూరు క్లస్టర్ ఏపీడీ శంకర్నారాయణ విచారణ చేపట్టారు. బినామీ మస్టర్లు, హార్టికల్చర్, ఫెరికల్చర్లో అక్రమాలపై సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన ‘అవినీతి ఉపాధి’ కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు విచారణ పూర్తి చేసి నివేదికను పీడీకి అందించినట్లు ఏపీడీ శంకర్నారాయణ వెల్లడించారు. 6 నుంచి ఇంటర్ తరగతులు తిరుపతి సిటీ : జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలు జూన్ 6వ తేదీ నుంచి పునఃప్రారంభమవుతాయని ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. 5వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నందున, 1 నుంచి ప్రారంభం కావాల్సిన తరగతులను 6వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు. -
గాలివాన నేపథ్యంలో అప్రమత్తం
తిరుపతి రూరల్ : ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశించారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెలిపారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. . విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసరుగా నియమించినట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్, విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. సర్కిళ్లు, డివిజన్ల స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారులు,సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ప్రజలు సైతం వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలను తాకవద్దని, లైన్ల కింద నిలబడవద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపడడం వంటి ఘటనలను గుర్తిస్తే వెంటనే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. -
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
తిరుపతి క్రైమ్ : మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో శనివారంతిరుపతి రైల్వే స్టేషన్, బస్స్టాండ్, పార్శిల్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు, పార్శిళ్లు, సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని తెలిపారు. యువత మత్తు బారిన పడకుండా కాపాడడం ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని వెల్లడించారు. ప్రజల సహకారంతో మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వివరించారు. -
ఎగవేతకు పథకం
తిరుపతి అర్బన్ : ఈకేవైసీ లేదంటూ జిల్లాలో 60వేల మందికిపైగా రైతులకు అన్నదాతా సుభీభవ పథకం వర్తించలేదు. మొత్తం 2,12,004 మందిని సుఖీభవ పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే 1,54,908 మందికి మాత్రమే నగదు జమ చేశారు. 57,096 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదని మొండిచేయి చూపారు. దీంతో రైతులు పెట్టుబడి సాయం కోసం అప్పులు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం తూతూమంత్రంగా పథకాలను అమలు చేస్తోంది. రెండేళ్లలో అరకొరగానే లబ్ధిదారులకు విదిలిస్తోంది. ప్రధానంగా ఈకేవైసీ పేరుతో పేదలకు సక్రమంగా సంక్షేమం అందకుండా కోతలు పెడుతోంది. ఆదమరచిన వారిని ఏకంగా జాబితా నుంచి తొలగించేస్తోంది. ఏళ్ల తరబడి పథకాలు పొందిన వారికి సైతం రిక్తహస్తం చూపిస్తోంది. -
కట్టుదిట్టంగా ఓటుకు కాపలా
ఎస్ఐఆర్పై బీఎల్ఏలకు అవగాహన ‘‘ఓట్ల రక్షణే లక్ష్యంగా కృషి చేయాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించాలి. వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్లకు అండగా నిలవాలి. ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కూటమి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు మన వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించాలి’’ అని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ బూత్లెవల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి రూరల్ : చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ ముక్కోటి ఆలయం వద్ద నారాయణి గార్డెన్స్ కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై అవగాహన కల్పించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప హాజరయ్యారు. అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పరిశీలకులుగా వజ్ర భాస్కర్రెడ్డి, భరత్ పాల్గొన్నారు. బాధ్యత బీఎల్ఏలదే.. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అనుకూలమైన ప్రతి ఓటును కాపాడే బాధ్యత బీఎల్ఏలదేనని, ఓటు పరిరక్షణలో వారి పాత్ర కీలకమని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా, కొత్తగా అర్హత పొందిన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. నిర్లక్ష్యానికి తావులేకుండా బీఎల్ఓలతో పాటు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఎత్తుగడలను అడ్డుకోవాలి ఎస్ఐఆర్ ప్రక్రియలో టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ఎత్తుగడలను అడ్డుకోవాలని చెవిరెడ్డి మోహిత్రెడ్డి కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి మార్పును నిశితంగా పరిశీలించాలని, బీఎల్ఏల అప్రమత్తతే పార్టీకి ప్రధాన ఆయుధమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓట్ల తొలగింపునకు యత్నిస్తే వెంటనే అభ్యంతరం తెలపాలని సూచించారు. చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 3.09 లక్షల ఓటర్లు ఉండగా, అందులో సుమారు 1.30 లక్షల మందికి ఓటు వెరిఫికేషన్ జరగాల్సి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో ప్రతి బీఎల్ఏ తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. సమష్టిగా పనిచేయాలి పరిశీలకులు వజ్ర భాస్కర్రెడ్డి, భరత్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పెద్దసంఖ్యలో ఓట్లు తొలగించడంతో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ముఖ్యమంత్రులే ఓడిపోయారన్నారు. ఈ క్రమంలో బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేస్తూ అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియలో బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు, చెవిరెడ్డి హర్షిత్రెడ్డిలు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసి ప్రతి ఓటరును చేరుకోవాలని పిలుపునిచ్చారు. -
ప్రమాదకరం.. పొగాకు వాడకం
తిరుపతి తుడా : పొగాకు వాడకం ప్రమాదకరమని ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని డీఎంహెచ్ఓ బాలకృష్ణనాయక్ తెలిపారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్వీ వైద్య కళాశాల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. డీఎంహెచ్ ఓ మాట్లాడుతూ పొగాకు వినియోగంలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప్కుమార్ , డీపీఎమ్ఓ డాక్టర్ చత్ర ప్రకాష్ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ నాగేంద్ర కుమార్, డిప్యూటీ డెమో బలరామరాజు పాల్గొన్నారు స్విమ్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో.. స్విమ్స్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో శనివారం పద్మావతి ఓపీడీ బ్లాక్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్, మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్, ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు. -
సాయి గిరిధర్కు డీఎస్పీగా ఉద్యోగోన్నతి
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ఫోర్స్ రిజర్వు ఇన్స్పెక్టర్ సాయి గిరిధర్కు డీఎస్పీగా ఉద్యోగోన్నతి లభించింది. శనివారం ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ హెడ్, ఎస్పీ సుబ్బరాయుడును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఈ క్రమంలోనే టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, ఏఎస్పీ కులశేఖర్ను కూడా కలిశారు. రైల్వే సీపీఆర్ఓగా బాలాజీ కిరణ్ తిరుపతి అన్నమయ్యసర్కిల్ : దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్ఓగా ఐఆర్టీఎస్ అధికారి వై.బాలాజీ కిరణ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. నాయుడుపేటకు చెందిన బాలాజీ కిరణ్కు విస్తృత పరిపాలనా అనుభవం, వృత్తి నైపుణ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ సామర్థ్యం ఉందని, ఈ క్రమంలో మీడియా అనుసంధానం, రైల్వేతో ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా బాలాజీకిరణ్కు రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ అభినందనలు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 78,389 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 45,283 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
కలెక్టరైతే నాకేంటి..!
ఒక పంచాయతీ కార్యదర్శి.. ఏకంగా కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేసేస్తున్నాడు. విధుల నుంచి తప్పించినప్పటికీ ఏం ఎరగనట్టు కార్యాలయానికి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నాడు. వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ సాగుతున్నప్పటికీ తనకేం పట్టనట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితులను భయపెట్టేందుకే సదరు కార్యదర్శి హల్చల్ చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. విచారణ కమిటీ ఎదుట ఎవరూ నోరెత్తకుండా బెదిరించేందుకు యత్నిస్తున్నాడని మండిపడుతున్నారు. చంద్రగిరి : తిరుచానూరు పంచాయతీ కార్యదర్శి మణిపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో విధుల నుంచి తప్పిస్తూ కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఈ మేరకు ఇన్చార్జి కార్యదర్శిగా తిరుపతి రూరల్ ఈఓపీఆర్డీ దయాసాగర్ను సైతం నియమించారు. అలాగే మణిపై విచారణ నిమిత్తం ఎర్రావారిపాళెం డిప్యూటీ ఎంపీడీఓ పద్మారాణి, శ్రీకాళహస్తి డీడీఓ సుస్మిత, తిరుపతి డీడీఓ గంగా భవానీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం ఈ మేరకు ప్రత్యేక కమిటీ విచారణ సైతం చేపట్టింది. ఒక్కొక్కరినీ పిలిపించి.. తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక కమిటీ విచారణలో భాగంగా సిబ్బందితో మాట్లాడారు. పనిచేస్తున్న వారితో పాటు గతంలో కార్యదర్శి మణి విధుల నుంచి తప్పించిన సిబ్బందిని సైతం పిలిపించి విచారణ చేపట్టారు. కార్యదర్శి మణి వ్యవహార శైలి, మహిళలతో ఆయన వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు సంబంధించిన పలు ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. సిబ్బంది తెలిపిన వివరాలను అధికారులను నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా పంచాయతీ కార్యదర్శి మణిని సైతం అధికారులను విచారించారు. తుది నివేదికను కలెక్టర్కు అందజేస్తామని వివరణ ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో విధుల నుంచి తప్పిస్తూ కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను పంచాయతీ ఈఓ మణి బేఖాతరు చేయడం చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడు సచివాలయానికి మణి రావడంతో ఉద్యోగులు అవాక్కయ్యారు. ఆపై ఉద్యోగుల సమాచారం, పారిశుద్ధ్య కార్మికులకు విధుల కేటాయింపులను సదరు కార్యదర్శి మణి చేపట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ ఆదేశాలంటే లెక్కలేదా అంటూ తోటి ఉద్యోగులు సైతం మండిపడుతున్నారు. లైంగిక వేధింపులే కాకుండా పంచాయతీలో భారీగా మణి అవినీతికి పాల్పడినట్లుగా పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
విశ్వం విద్యాసంస్థలకు ప్రశంస
తిరుపతి అర్బన్ : తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యాసంస్థల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ప్రశంసించారు. శనివారం విశ్వం స్కూల్లో విశ్వం సైనిక్– నవోదయ 2026 బ్రోచర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, శాసీ్త్రయ బోధనా విధానం, సమగ్ర కోచింగ్ ద్వారానే ఈ స్థాయి విజయాలు సాధ్యమని తెలిపారు. విశ్వం విద్యా సంస్థల అధినేత విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయాలు, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి అదనపు సమాచారం కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. విశ్వచందన్రెడ్డి, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
తిరుమల: శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు
తిరుమల: భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రోజూ 1,500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులో ఉంచనుంది.మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీచేయనుంది. ప్రస్తుతం రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 శ్రీవాణి దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచి ఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ సదుపాయం 2025 మే 1 నుంచి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తించనుంది. ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కలి్పస్తుంది. కాగా ఈ విధానం జూన్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని టీటీడీ పేర్కొంది. -
ప్రతి ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలి
రైల్వేకోడూరు అర్బన్: నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి చెందిన ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ సర్ ప్రక్రియలో కీలక భూమిక పోషించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రాజ్ కల్యాణ మండపంలో జరిగిన సర్ ప్రక్రియ అవగాహన కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, రాజంపేట, కడప పరిశీలకులు సురేష్బాబు, కొండూరు అజయ్రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతంగా ఉందని, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు ఎలాంటి కుట్రలకైనా పాల్పడవచ్చని తెలిపారు. సర్ ప్రక్రియలో భాగంగా నియోజవర్గంలో ఓట్లు తొలగింపుపై పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు దృష్టి పెట్టాలన్నారు. కొని పార్టీలకు అనుకూలంగా తొలగింపులు చేపడితే చట్ట రీత్యా పోరాడాలని తెలిపారు. కార్యకర్తలు సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. నియోజకవర్గంలో 2.15 లక్షల ఓట్లు ఉన్నాయనిన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే నియోజకవర్గ నాయకత్వాన్ని సంప్రదించాలని తెలిపారు. జిల్లా, నియోజకవర్గ పరిశీలకులు నరసింహారెడ్డి, సహదేవరెడ్డి, పంజంవేణుగోపాల్రెడ్డి, సాయికిషోర్రెడ్డి, చెవు శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, రాయలసీమ బూత్కన్వీనర్ తల్లెంభరత్కుమార్రెడ్డి, కృష్ణారెడ్డి, తిప్పన నాగభుషణం, వెంకటరెడ్డి, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, నందాబాల, విజయ్కుమార్రెడ్డి, లింగంలక్ష్మీకర్, సుదర్శన్రెడ్డి, సతీష్రెడ్డి పాల్గొన్నారు. -
వైద్య వృత్తి దైవంతో సమానం
తిరుపతి తుడా: వైద్య వృత్తి దైవంతో సమానమని, సేవాభావంతో కొనసాగించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పిలుపునిచ్చారు. స్విమ్స్లో పీజీ వైద్య విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రొగ్రామ్ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వివిధ కళాశాలల్లో యూజీ, పీజీ విద్యనభ్యసించి భగవంతుని స్వరూపమైన టీటీడీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్ హాస్పిటల్ నుంచి వైద్య వృత్తిలోకి ప్రవేశించడం అదృష్టమన్నారు. సేవభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. చికిత్స చేసి ప్రాణంకాపాడే దేవుడుగా డాక్టర్లను నమ్ముతారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. డీన్ డాక్టర్ అలోక్ సచన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడిమోహన్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ముక్తీశ్వరయ్య, కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ యర్రమరెడ్డి, డాక్టర్ రామ్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
తొండవాడలో పర్యటన
చంద్రగిరి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ బీఎల్సీ హౌసింగ్ పథకం కేంద్ర బృందం శుక్రవారం మండల పరిధిలోని తొండవాడలో శుక్రవారం పర్యటించింది. పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకుని గృహ అవసరాలను తీర్చడం, పీఎంఏవై పథకాన్ని మూల్యాంకనం చేయడానికి, పీఎంఏవై అర్బన్ బీఎల్సీ పథకాన్ని పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బృందంలోని సభ్యులు ప్రొఫెసర్ సుమనాగుప్తాప్త, దేబో స్మితగోష్, భిక్రమ్ ఖాన్లతో కూడిన ప్రత్యేక బృందం జగనన్న కాలనీని సందర్శించింది. అందులో భాగంగా పీఎంఏవై హౌసింగ్ పథకం ఆధ్వర్యంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లేఅవుట్లలో ఉన్న లబ్ధిదారులతో సమావేశమై వివరాలను సేకరించారు. సేకరించిన వివరాలను సంబంధించిన నివేదికను భారత ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ హోసింగ్ మంత్రిత్వ శాఖకు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను చూసి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా హౌసింగ్ పీడీ గోపాల్నాయక్, ఈఈ శ్రీరాములురెడ్డి, శేషగిరి, డీఈఈ రమణయ్య, పీఎంఏవై హౌసింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కాటమరాజు, మహమ్మద్ అనీఫ్, సరస్వతి, ఏఈలు పాల్గొన్నారు. -
బెంగాల్ రాష్ట్ర పరిస్థితి రానీయొద్దు
తిరుపతి మంగళం : ‘సర్’ ఓటరు సవరణతో మొన్నటి రోజున బెంగాల్ రాష్ట్రంలో ఓట్లు తొలగించి ఓడించిన పరిస్థితి కనిపిస్తోంది. అదే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా వైఎస్సార్సీపీ శ్రేణులు, క్లస్టర్ ఇన్చార్జులు, బీఎల్ఏలు జాగ్రత పడాలి’ అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి సూచించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో సర్ ఓటరు సవరణపై బీఎల్ఏలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వచారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సర్ ఓటరు సవరణ పేరుతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే కాకుండా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చేందుకు చంద్రబాబు, లోకేష్ కుట్రలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఒక్కో నియోజకవర్గంలో 30 నుంచి 40వేల ఓట్లను బీజేపీ తొలగించిందని ఆరోపించారు. మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అదే కుట్రలు పన్నేందుకు తీవ్ర పయత్నాలు చేస్తోందన్నారు. క్లస్టర్ ఇన్చార్జ్లు, బీఎల్ఏలు ప్రతి ఇంటికీ వెళ్లి 2002 నుంచి 2025 వరకు సంబంధించిన ఓటర్లు ఉన్నారా? అన్న విషయాలకు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు.బీఎల్ఏల చేతిలోనే వైఎస్సార్సీపీ గెలుపు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు బీఎల్ఏల చేతిలోనే ఉందన్నారు. సర్ ఓటరు సవరణలో బీఎల్ఏలు కీలకపాత్ర పోషించాలన్నారు. జగనన్న గెలుపు బీఎల్ఏల చేతిలో ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఓటరు సవరణలో కూటమి నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా వాటిని తిప్పికొట్టేలా పనిచేయాలని కోరారు. అనంతరం సర్ ఓటరు సవరణపై బీఎల్ఏలు చేయాల్సిన అంశాలను డిజిటల్ స్క్రీన్పై ఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్రెడి వివరించారు. ఇప్పటికి పది సార్లు సర్ ఓటరు సవరణ చేశారని, ప్రస్తుతం 2002 నుంచి 2025వరకు గత 20 ఏళ్ల తరువాత తిరిగి సర్ ఓటరు సవరణ చేస్తున్నారన్నారు. ఇందులో మన పార్టీ బీఎల్ఏలు ఎంతో కీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. తిరుపతి కో–ఆపరేటీవ్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, ఎస్సార్సీపీ బూత్ కమిటీ అధ్యక్షురాలు సాయికుమారి, క్లస్టర్ ఇన్చార్జ్లు బృంగీ నవీన్, షేక్ ఇమ్రాన్ బాషా, తమ్ముడు గణేష్, పడమటి కుమార్ పాల్గొన్నారు. -
అక్షరాస్యులుగా తీర్చిదిద్దుదాం
తిరుపతి అర్బన్: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని డీఆర్వో నరసింహులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని తమ చాంబర్లో అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జూన్ 30 వరకు నిరక్ష్యరాసులను వలంటీర్లుగా గుర్తించి అక్షర ఆంధ్ర యాప్లో వారి పేర్లు నమోదు చేయాలన్నారు. జూలైలో తరగతులు ప్రారంభించి 2027 మార్చి వరకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. వయోజన విద్య నోడల్ ఆఫీసర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
నిందితుడి అరెస్ట్
సత్యవేడు: సత్యవేడు, నాగలాపురం, మాదరపాకం (తమిళనాడు) పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న మదనంబేడుకు చెందిన గోవర్ధన్రెడ్డి(23)ని సత్యవేడు పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయినాథ్చౌదరి, ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్ఐ కథనం.. మండలంలోని కాళమనాయుడుపేట పంచాయతీ పరిధిలోని గాంధీపురానికి చెందిన హిమయవర్మ ఇంట్లో మే 17న పగటిపూట చోరీ జరిగింది. దీనిపై మే 18న ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. సీఐ మురళీనాయుడు సూచనల మేరకు దర్యాప్తు చేపట్టారు. సత్యవేడు గాంధీరోడ్డు మార్గంలోని మాదరపాకం చెక్ పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా సత్యవేడు, నాగలాపురం, మాదరపాకం(తమిళనాడు)లో తనే చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద ఉన్న 20 గ్రాముల బంగారం, వెండి 30 గ్రాములు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సూమారు రూ.4.5 లక్షలు ఉంటుందన్నారు. శ్రీసిటీ, మదనంబేడు, వీఆర్ కండ్రిగ, పాదిర్వేడులో చోరీకి సంబంధించి గత ఏడాది నిందితుడు జైలుకు వెళ్లి వచ్చాడు. మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటైన నిందితుడు పలు కేసుల్లో పట్టు బడి జెలుకెళ్లడం, బయటకు వచ్చాక చోరీలకు పాల్పడడం అలవాటు చేసుకున్నాడు. నిందితుడిపై పీడీ యాక్ట్ అమలు చేయడానికి చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి నాయుడుపేట టౌన్: నాయుడుపేటలోని రాజగోపాలపురం రెండవ వీధిలో నివాసం ఉంటున్న కారణి ప్రసాద్(29) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. ప్రసాద్ తల్లి చంద్రమ్మతో కలిసి రాజగోపాలపురంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. చంద్రమ్మ ఈ నెల 25న సొంత పనుల మీద నెల్లూరుకు వెళ్లారు. ఇంట్లో ప్రసాద్ ఒక్కడే ఉంటున్నాడు. ప్రసాద్ కోసం అతని స్నేహితుడు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించక పోవడంతో ప్రసాద్ తల్లి చంద్రమ్మకు సమాచారం అందించారు. ఆమె రాజగోపాలపురం వద్ద ఉన్న ఇంటి వద్దకు వెళ్లి చూడాలని స్నేహితులను కోరింది. ఈ క్రమంలో శుక్రవారం ప్రసాద్ స్నేహితుడు ఇంటికి వెళ్లి చూడగా ప్రసాద్ ఇంట్లో మంచంపై మృతిచెంది పడి ఉండటాన్ని గుర్తించారు. తల్లి చంద్రమ్మతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శివశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రసాద్ మృతదేహం బాగా కలిమిపోయి నల్లగా మారి ఉండడంతో మృతిచెంది రెండు రోజులు అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం సమీపంలోనే మద్యం సీసాలు పడి ఉండడాన్ని గుర్తించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ వెల్లడించారు. -
తొండవాడలో పర్యటన
కేంద్ర బృందం తొండవాడలోని జగనన్న కాలనీని పరిశీలించింది. వసతులపై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆదాయ వనరుగా డీఎస్సీ అనంతరం భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీపై తొలి సంతకం పెట్టినా ఆ ప్రక్రియను ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. మహానాడులో వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం కంటే డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఇప్పటికే ఉన్న స్పోర్ట్స్ కోటాను కాదని అదనపు క్రీడలను అందులో చేర్చి అర్హత లేని వారికి పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారని చెప్పారు. డీఎస్సీ కోసం 3.5 లక్షల మంది పరీక్షలు రాసినా తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేసుకునేలా మొత్తం ప్రక్రియ నడిపించారని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను బయటపెట్టే బాధ్యతను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగానికి అప్పగించారన్నారు. -
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధం చేద్దాం
తిరుపతి అర్బన్: స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సహకరించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన డీఆర్వో నరసింహులుతో కలసి రాజకీయ పార్టీ నేతలతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(సర్) ప్రక్రియ జూన్ 5 నుంచి మొదలు పెట్టనున్నట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వేరే ప్రాంతాలకు తరలిపోయిన వారి పేర్లను తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. మీడియా సహకరించాలి సర్పై ఓటర్లకు అవగాహన పెంచడానికి మీడియా సైతం పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు బీఎల్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం జూన్ 15 నుంటి జూలై 14వ తేదీ వరకు ఇంటింటికి బీఎల్వోలు వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని వెల్లడించారు. జూలై 14లోపు పోలింగ్ స్టేషనన్ తుది జాబితా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. -
యంత్ర పరికరాలు.. పచ్చ నేతల కుతంత్రాలు
తిరుపతి అర్బన్: సులభతరంగా వ్యవసాయం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం దారితప్పుతోంది. మండల స్థాయిలో పలుకబడి కలిగిన నేతలకు కల్పతరువుగా మారింది. ఎస్సీలకు 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు పంపిణీ చేయనుండడంతో వాటిని బినామీల పేరుతో దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు తెలుస్తోంది. మిగిలిన యంత్ర పరికరాలను అదే రీతిలో తమ వారికే దక్కేలా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టమవుతోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఆ నియోజకవర్గ ముఖ్యనేతల ద్వారా సిఫార్సులు వెళ్లినట్టు సమాచారం. నిజమైన రైతుకు మొండిచేయే మిగలనున్నట్టు స్పష్టమవుతోంది. పనిముట్లు తక్కువ..దరఖాస్తులెక్కువ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ప్రతి ఏటా ట్రాక్టర్లు, వరికొత యంత్రాలతోపాటు 24 రకాల చిన్న చిన్న పనిముట్లను రాయితీతో అందించేవారు. అయితే చంద్రబాబు సర్కార్లో 9 రకాల పనిముట్లు మాత్రమే ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వనించారు. జిల్లా వ్యాప్తంగా 853 యంత్రపరికరాలకు 2,781 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ట్రాక్టర్లు 28 యూనిట్లు మంజూరు చేశారు. దీంతో వాటికి డిమాండ్ పెరిగింది. ఏకంగా 812 మంది దరఖాస్తు చేసుకున్నారు. వరికొత యంత్రాలకు చెక్ పెట్టారు. మిగిలిన 8 రకాల పనిముట్లపై రైతులు పెద్దగా ఆసక్తి చూప లేదు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రాయితీ ఎస్సీ, ఎస్టీలకు 50శాతం రాయితీలో పనిముట్లు, ఇతర కులాల వారికి 40శాతం రాయితీతో ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే కొందరు పపచ్చ నేతలు రాయితీ ట్రాక్టర్లు బినామీ పేర్లతో కొట్టేసేందుకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. జిల్లా సమాచారం -
టీచర్ పోస్టులను అమ్మేశారు
చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా విద్యార్థులను దగా చేస్తోందన్నారు. డీఎస్సీ పోస్టులను మార్కెట్లో కూరగాయల్లా అమ్మేశారని ఆరోపించారుఅన్ని శాఖల్లో నారా లోకేష్ తలదూర్చి డబ్బులు దండు కోవడంపై శ్రద్ధ చూపిస్తూ పేద విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పరిపాలన చేతగాని లోకేష్ను మంత్రి పదవి నుంచి గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో విద్యార్థి విభాగం నేతలు ఓబుల్రెడ్డి, భానుప్రకాష్రెడ్డి, తిరుపతి నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు స్వరూప్, వర్సిటీ అధ్యక్షుడు ప్రేమ్కుమార్, చెంగల్రెడ్డి, యశ్వంత్రెడ్డి, వినోద్, రఫీ, శేషారెడ్డి, నక్కా హరినాథ్తో పాటు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నేతలు పాల్గొన్నారు. -
టీటీడీలో ఎక్స్టెన్షన్ నియామాలకు బ్రేక్
సాక్షి, టాస్క్ఫోర్స్: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో రిటైర్డ్ కానున్న పలువురు అధికారులకు మళ్లీ అదే కీలక స్థానాల్లో ఎక్స్టెన్షన్ కల్పించే విషయంపై శుక్రవారం ‘సాక్షి’లో ‘గోవిందా ఇదేమైనా బాగుందా’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. ప్రస్తుతానికి ఆయా డివిజన్లలో ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న ఇంజినీరింగ్ అధికారుల ఎక్సెటెన్షన్ నియామకాలను నిలుపుదల చేసినట్లు తెలిసింది. కాగా ఆ స్థానాలకు ఆదే డివిజన్లోని సీనియర్లకు ఇన్చార్జిగా నియమించేందుకు ఫైల్ సిద్ధం చేశారని సమాచారం. -
ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది నవంబర్లో జరిగిన డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులకు సంబంధించిన మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు డీన్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం తెలిపారు. ఫలితాల కోసం విద్యార్థులు వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. రుణాలు మంజూరు చేయండి తిరుపతి అర్బన్: స్వయం సహాయక సంఘాలకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన బ్యాంకర్లతో కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ విద్యకు సంబంధించిన రుణాల విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రుణాల మంజూరు శాతం పెంచాలన్నారు. అలాగే పీఎంఈజీసీ పథకం రుణాలు మంజూరైన యూనిట్లు అన్ని గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీఐ ఎల్డీఓ రవీంద్రబాబు, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, ఎల్డీఎం రవికుమార్, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ సామంచి శర్మ తదితరులు పాల్గొన్నారు. సప్లిమెంటరీకి 93.76 శాతం మంది హాజరు తిరుపతి సిటీ: జిల్లాలో గత ఏడు రోజులగా జరుగుతున్న ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలలో శుక్రవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగిన ఫిజిక్స్ పేపర్–1 పరీక్షకు 1,3426 మందికి గాను 93.76శాతంతో 12,589 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ఐఓ జీ.రాజశేఖర్రెడ్డి తెలిపారు. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరిగిన సెకండ్ ఇయర్ కామర్స్, సోషియాలజీ పరీక్షకు 962 మందికి గాను 832 మంది హాజరైనట్లు తెలిపారు. చురుగ్గా విద్యుత్ పునరుద్ధరణ పనులు తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో గురువారం రాత్రి బలమైన గాలలతో కూడిన వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేసినట్టు సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ, నెల్లూరు జిల్లాలోని కావలి గ్రామీణం, కొండాపురం, కోవూరు, ముత్తుకూరు, జలదంకి, దగదర్తి, అల్లూరు మండలాల్లోని 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో 26 ఫీడర్లు, 114 కి.మీ.మేరకు విద్యుత్ లైన్లు, 213 స్తంభాలు, 131 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛ తిరుపతి పై ప్రజాభిప్రాయ సేకరణ తిరుపతి తుడా: స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ పోటీలలో సిటిజన్ ఫీడ్ బ్యాక్ ప్రక్రియ కొనసాగుతోంది. గడచిన పది రోజులుగా తిరుపతిలో అమలవుతున్న పరిశుభ్రత, చెత్త సేకరణ, పురపాలన, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలతో కుడిన సేవల ఆధారంగా స్వచ్ఛ యాఫ్లో అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు. తిరుపతి వ్యాప్తంగా అధికారులు అభిప్రాయ సేకరణలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ప్రకాశం పార్కులో అధికారులు, సిబ్బంది వాకర్స్ నుంచి అభిప్రాయాలను నమోదు చేయించారు. -
అవినీతి ఉపాధి!
కలువాయి(సైదాపురం): వెంకటగిరి నియోజకవర్గంలో ఉపాధి పథకం అవినీతిమయంగా మారింది. నియోజకవర్గ పరిధిలోని కలువాయి మండలంలో అర్హత కలిగిన నిరుపేద కూలీలకు కాకుండా ప్రస్తుతం సనిచేస్తున్న సీనియర్, జూనియర్ మేట్లదే పెత్తనం సాగుతోంది. తమ కుటుంబ సభ్యుల పేర్లుపై సపరేటుగా ఫేస్ అటెండెట్స్ తీసుకుని బినామీ మస్టర్లు వేసి నిధులు దిగమింగుతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మండలంలోని చింతలపాళెం పంచాయతీ, మజరా గ్రామమైన వెంకటరామరాజుపేట గ్రామంలో సీనియర్ మేట్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులు, బంధువులకు సపరేట్గా మస్టర్లు వేసి పని చేసినట్లుగా చూపిస్తున్నారని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. అలాగే ఆ మేట్ కుమారుడు బీటెక్ చదువుకుంటున్నా మస్టర్లో పేర్లు నమోదు చేయడం కొసమెరుపు. గతంలో నాటిన మొక్కలకు నేడు బిల్లులు నిమ్మ, మామిడి తోటల అభివృద్ధిలో భాగంగా రైతుల కు ఉపాధి హామీ పథకం ద్వారా చెట్లు నాటేందుకు గుంతలు తీసినప్పటి నుంచి మూడేళ్ల పాటు వాటి సంరక్షణకు నిధులను మంజూరు చేస్తున్నారు. దీన్ని అసరాగా చేసుకుని ఉపాధి సిబ్బంది మరో చేతివాటం ప్రదర్శించారు. వెంకటరామరాజుపేట గ్రామానికి చెందిన జాబ్కార్డు 20087 పొట్టపల్లి చెంచయ్య వర్క్ ఐడీ 02090220010–ఐఎఫ్–జిఐఎస్–1078645, మరో జాబ్కార్డు నంబర్ 20085 పొట్టపల్లి యానాదయ్య వర్క్ ఐడీ 02090220010 –ఐఎఫ్–జిఐఎస్–10786 52 మూడేళ్ల క్రితం నాటిన నిమ్మ మొక్కలకు ఈ ఏడాది నాటినట్టు చూపి బిల్లులు మంజూరు చేశారు. భయమే లేదు గతంలో కలువాయి మండలంలో పనిచేసిన ఇద్దరు టీఏలు, ఈసీ, కంప్యూటర్ అపరేటర్లు అవినీతి పాల్పడి టెర్మినేషన్ కూడా అయ్యారు. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది ఏమాత్రం భయపడకుండా ఆడిట్ అధికారులను సైతం మేనేజ్ చేస్తూ అవినీతికి అందలం వేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం నాటిన నిమ్మ చెట్లు ఇవే రోజా మొక్కలకు కూడా బిల్లులు కలువాయి మండలంలో రోజా మొక్కలు నాటిన వారికి కూడా బిల్లులు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెంకటరామరాజుపేటలో విరివిరు చిన్నమ్మ జాబ్కార్డు నం.20126 ఫోర్లి కల్చర్ పేరిట వర్క్ ఐడీ నం.0209022010–ఐఎఫ్–19187012063272 రోజా మొక్కలు నాటినట్లు చూపి మెటీరియల్ పేమెంట్ కింద గత ఫిబ్రవరి 9వ తేదీన రూ.60 వేలు కలువాయి ఎంసీసీలో నమోదు చేశారు. అసలు రోజా మొక్కలు అక్కడ నాటకనే బిల్లులు దిగమింగారు. వెంకటగిరి నియోజకవర్గంలో వెలుగు చూస్తున్న అక్రమాలు -
ప్రాణదాన పథకానికి 168 మంది ఎంపిక
తిరుపతి తుడా: పేద రోగులకు టీటీడీ ప్రాణదాన పథకం కింద స్విమ్స్లో ఉచిత శస్త్ర చికిత్సల కోసం 168 మంది రోగులను ఎంపిక చేసినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. గురువారం స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయ కమిటీ హాల్లో స్విమ్స్ డైరెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎంపిక ప్రక్రియలో శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, బర్డ్ హాస్పిటల్ డాక్టర్ రామ్మూర్తి, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, రుయా హాస్పిటల్ డాక్టర్ సుబ్బలక్ష్మి, మెటర్నటీ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసులు, వైధ్యాధికారులు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. అర్హతలను బట్టి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడానికి వివిధ విభాగాల కింద 168మంది రోగులను ఎంపిక చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఉపాధి కూలీ మృతి పుల్లంపేట: రోడ్డు ప్రమాదంలో ఉపాధి కూలీ మృతిచెందిన ఘటన మండల పరిధిలోని రెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని రెడ్డిపల్లె దళితవాడకు చెందిన తుమ్ములూరు లక్ష్మీనరసమ్మ గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఉపాధి హామీ పనుల నిమిత్తం రెడ్డిపల్లె చెరువుకట్ట సమీపంలో వెళ్తున్నారు. అదే సమయంలో రైల్వేకోడూరు నుంచి కడప వైపు వెళుతున్న ఎంహెచ్ 43కె 6352 నంబరు గల లారీ వేగంగా ఆమెను ఢీకొట్టింది. దీంతో లక్ష్మీనరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేట్ అంబులెన్స్
– ఆరుగురికి స్వల్పగాయాలు నాయుడుపేట టౌన్: నాయుడుపేట పట్టణ పరిధిలోని 71వ జాతీయ రహదారిపై గురువారం మృతదేహాన్ని తరలిస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సాయితో పాటు క్లీనర్ కోదానవాసి సాయి గాయపడ్డారు. అదేవిధంగా మృతదేహాన్ని తరలించుకుపోతున్న మరో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. తిరుపతి నుంచి విజయనగరానికి మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్లో తరలించుకుపోతున్నారు. మార్గమధ్యం నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారి వద్దకు వచ్చే సరికి అంబులెన్స్ డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. డ్రైవర్ సాయితో పాటు క్లీనర్, అంబులెన్స్లో ఉన్న మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివశంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం నెల్లూరుకు తరలించారు. అంబులెన్స్లోని మృతదేహాన్ని మరో అంబులెన్స్లో విజయనగరానికి తరలించుకు వెళ్లారు. -
వెంటాడిన మృత్యువు
కారును ఢీకొట్టిన ట్రాలీ లారీ పెళ్లకూరు: తిరుమల దైవదర్శన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కారులో స్వగ్రామానికి బయల్దేరారు. చిన్నారితో కబ్లు చెప్పుకుంటూ..ఆనందంగా ముందుకు సాగుతున్నారు. కానీ మృత్యువు ట్రాలీ లారీ రూపంలో వారిని వెంటాడింది. కారును ఢీకొట్టడంతో ఒక్కసారిగా భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికే కారులోని వారు రక్తపు మడుగులోకి జారుకునేశారు. చిన్నారి వాహనంలోనే చిక్కుకుపోయి మృత్యుఒడికి చేరింది. ఈ విషాద ఘటన బుధవారం అర్ధరాత్రి పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామ ఫ్లైఓవర్పై చోటు చేసుకుంది. పోలీసులు స్థానికుల కథనం.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, బోగోలు మండలం, జువ్వలదిన్నె గ్రామానికి చెందిన రాజు శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని అదే రోజు అర్ధరాత్రి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో చిల్లకూరు గ్రామం ఫ్లై ఓవర్ వద్ద బెంగళూరు నుంచి నెల్లూరు వైపు ట్రైన్వీల్స్ లోడ్డుతో వెళుతున్న ట్రాలీ లారీ ముందు వెళుతున్న కారుని అధిగమించే క్రమయంలో అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జస్వి(4) తీవ్ర గాయాలతో కారులోనే మృతి చెందింది. రాజు శ్రీనివాసరెడ్డి మోకాలు, చేతులకు రక్త గాయాలయ్యాయి. నరకయాతన నక్కా సుమిజోసెఫ్కు కాలు విరిగిపోయింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుగా మారడంతో చిన్నారితో సహా క్షతగాత్రులు కారులోనే ఇరుక్కుపోయారు. కాపాడండంటూ కేకలు వేస్తూ ఆర్థనాదాలు మిన్నంటించారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి అతి కష్టం మీద చిన్నారి మృతదేహంతోపాటు క్షతగాత్రులను వెలికితీశారు. ఆ పై చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రాలీలారీ డ్రైవర్ ఉపేంద్రను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కారు ఓవర్ స్పీడ్ దెబ్బకి..!
చంద్రగిరి: మితిమీరిన వేగంతో వెళ్తూ కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఆపై పొలాల్లోకి దూసుకుపోయింది. కారు ఢీకొన్న దెబ్బకు విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో రెండు గంటల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. గురువారం ఈ సంఘటన చిన్నరామాపురం నుంచి భీమవరానికి వెళ్లే మార్గంలోని మూలపల్లె వద్ద చోటుచేసుకుంది. అయితే ప్రమాదానికి కారణమైన వ్యక్తులు కారును అక్కడే వదిలేసి, మరో వాహనంలో అక్కడి నుంచి ఉడాయించారని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న సమయంలో అది కారుపై పడి ఉండి పెను ప్రమాదం జరిగి ఉండేదని చెప్పారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. రోడ్డుకు అడ్డంగా కంటైనర్ వాహనం – గంట పాటు శ్రమించిన పోలీసులు సూళ్లూరుపేట రూరల్: సూళ్లూరుపేటలోని మన్నారుపోలూరు కోనేరు సమీపం వద్ద 16 చక్రల కంటైనర్ వాహనం మలుపు తిరిగే సమయంలో పక్కనే ఉన్న నిర్మాణంలో ఉన్న డ్రైనేజ్లో తిగబడింది. లారీ రోడ్డుకు అడ్డంగా తిరిగి ఆగిపోయింది. రోడ్డుకు రెండు వైపుల భారీ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. గంట పాటు వాహనాలు నిలబడిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ అజయ్కుమార్ తన సిబ్బందితో వెళ్లి జేసీబీ సహాయంతో గంటపాటు శ్రమించి డ్రైనేజీలో ఇరుక్కున్న లారీని బయటకు తీశారు. ఆపై ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
ప్రమాదాలకు దూరంగా ఉండండి
తిరుపతి రూరల్: బలమైన గాలీవాన కురిసే సందర్భాల్లో విద్యుత్ ప్రమాదాల భారిన పడకుండా వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి గురువారం ఒక ప్రకటనలో కోరారు. బలమైన గాలుల కారణంగా సంస్థ పరిధిలో అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్తు లైన్లు తెగి పోవడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయన్నారు. ఇటువంటివి జరిగిన సందర్భాల్లో వినియోగదారులు తెగిపడిన విద్యుత్ తీగలను తాకకుండా దూరంగా ఉండాలన్నారు. ఇంట్లో కూడా విద్యుత్ పరికరాలకు సంబంధించిన వైర్లను తాకవద్దన్నారు. విద్యుత్ తీగల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరగా నిలబడవద్దని సూచించారు. తమ ప్రాంతంలో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపోవడం లాంటి సంఘటనలను గుర్తించినట్లయితే వినియోగదారులు వెంటనే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ బిల్లుపై ముద్రించబడిన తమ ప్రాంత అసిస్టెంట్ ఇంజినీర్ మొబైల్ నంబరుకు గానీ లేదా విద్యుత్ శాఖ టోల్–ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారాన్ని తెలియజేయవచ్చన్నారు. -
అంబా..దాహం
ఎండలు మండిపోతున్నాయి. గుక్కెడు నీటి కోసం అనేక మూగజీవులు అల్లాడిపోతున్నాయి. కాలువలు, చెరువుల్లో చెమ్మలేకపోవడంతో గొంతు తడుపుకోవడానికి తహతహలాడుతున్నాయి. ఎక్కడ నీరు దొరికితే అక్కడ సేదతీరిపోతున్నాయి. తనివితీరా నీళ్లు తాగి ఉపశమనం పొందుతున్నాయి. ఇలాంటిదే శ్రీకాళహస్తి మండలం, తొండమనాడు ప్రాంతంలో గురువారం కనిపించింది. ఓ ఆవు నీటి కోసం పోరాడుతూ.. తీరా ఓ బోరు మోటారు వద్ద నీళ్లు రావడాన్ని గమనించి అక్కడికి పరుగులు తీసింది. ఆపై తనివితీరా నీళ్లు తాగి సేదతీరడం కనిపిచింది. – సాక్షి, తిరుపతి ఫొటో గ్రాఫర్ -
విద్యార్థి మిత్ర కిట్టు.. కనిపిస్తే ఒట్టు!
తిరుపతి అర్బన్: పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్లు, మూడు జతల యూనిఫాం, షూ అందించాల్సి ఉంది. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మరో రెండు వారాల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. అయితే ఈ ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు ఇంకా విద్యాశాఖ అధికారులకు అందలేదు. ఇప్పుడల్లా కిట్లు అందే పరిస్థితి లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాన్ని సాకుగా చూపించి విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీలో జాప్యం చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది. జిల్లాలో 1,42,369 మంది విద్యార్థులకు విద్యాసామగ్రి అందించాల్సి ఉంది. అయోమయం పాఠశాల ప్రారంభం నాటికి పుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం ఇవ్వకుంటే ఎలా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యూనిఫాం ముందే అందిస్తే టైలర్లకు ఇచ్చి కుట్టించుకోవడానికి వీలుంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత రెండు, మూడు నెలలకు పుస్తకాలు, బ్యాగ్లు, యూనిఫాం ఇస్తే ఏం ప్రయోజనమని పెదవి విరుస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికై నా ఇస్తారో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు. క్లస్టర్ల బెడద తప్పదా? ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయందా తగ్గిపోయింది. ఈ క్రమంలో క్లస్టర్ల పేరుతో పాఠశాలలను విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 200కు పైగా పాఠశాలను క్లస్టర్ల పేరుతో విలీనం చేశారు. జిల్లాలో ఇప్పటికీ పది మంది పిల్లలకు లోపు ఉన్న పాఠశాలలు వందకు పైగా ఉన్నట్లు సమాచారం. ఆయా పాఠశాలల పరిధిలోని ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య పెంచడానికి వేసవి సెలవుల్లో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టారు. బడిఈడు పిల్లలు బడిలో ఉండాలని తల్లిదండ్రులను ఒప్పించారు. కానీ పిల్లలకు కావాల్సిన విద్యాసామగ్రి పంపిణీలో జాప్యం చేస్తే వారంతా జారిపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో మళ్లీ క్లస్టర్ల పేరుతో పాఠశాలల విలీనం జరిగితే తమ ఉద్యోగాలు ప్రశ్నార్థకమేనని చర్చించుకుంటున్నారు. -
ఎబోలాపై ఆందోళన వద్దు
●తిరుపతి తుడా: ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా మహమ్మారి అనుభవాలను గుర్తుచేస్తోంది. ఈ వైరస్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులపై ఫోకస్ పెట్టాయి. అయితే ఎబోలా వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధిని అరికట్టవచ్చని చెబుతునానరు. వైరస్ ప్రభావం ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బీ.మనోహర్ మీడియాకు తెలిపారు. అప్రమత్తం ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ తరహాలో వైరస్ ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ఏపీడెమిక్ డిసీజెస్తో ఆస్పత్రిలో చేర్పించారు. ఐసోలేషన్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎబోలా వైరస్ సోకిందన్న ప్రచారం వ్యాప్తి చెందడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. వైరస్ కాదని నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఆస్పత్రిలో ఐసోలేషన్ సెంటర్లను సిద్ధం చేశారు. తిరుపతి రుయాలో 15 బెడ్ల సామర్థ్యంతో ఎబోలా ఐసోలేషన్ను సిద్ధం చేశారు. అవసరమైన కిట్లు, మందులను సిద్ధంగా ఉంచారు. జనరల్ ఫిజీషియన్, పల్మనాలజీ విభాగాలు సంయుక్తంగా ఐసోలేషన్ను పర్యవేక్షించనున్నాయి. రుయా సూపరింటెండెంట్ రెండు వైద్యుల బృందాలను సిద్ధం చేశారు. కోవిడ్ లక్షణాలే ఎబోలా వైరస్ లక్షణాలు సైతం కోవిడ్ తరహావే అని రుయా జనరల్ ఫిజీషియన్ విభాగాధిపతి డాక్టర్ తులసీరామ్ తెలిపారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్తో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అనంతరం ఐసోలేషన్ వార్డును తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ ఎబోలా వైరస్ సోకితే జ్వరం, ఒళ్లు, కాళ్లు, కీళ్ల నొప్పులు, నీరసం, త్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు వంటి లక్షణాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అనుమానం వచ్చిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అడవి మాంసం, గబ్బిలాలు, ఇతర పక్షులు తిన్న పండ్లను తీసుకోవడం ద్వారా ఈ వైరస్ విస్తరిస్తుందన్నారు. అంటువ్యాధి కనుక ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం వంటివి చేయాలన్నారు. సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు రుయా ఆస్పత్రిలో ఎబోలా వైరస్ ఐసోలేషన్ను సిద్ధం చేశాం. వైద్యులు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాం. ఈ వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కోవిడ్ తరహా వ్యాధి గనుక ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ మనోహర్, రుయా సూపరింటెండెంట్ -
నేడు డీఎస్సీ అక్రమాలపై ధర్నా
తిరుపతి మంగళం : డీఎస్సీ–2025 అక్రమాలపై శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే ధర్నాకు రావాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నారా లోకేష్ విద్యాశాఖామంత్రిగా ఉండి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చెవిరెడ్డి హర్షిత్రెడ్డితో పాటు విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్రెడ్డి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 87,691 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 49,958 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.99 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. దళిత నాయకుడిపై దాడి – మహానాడులో ఉద్రిక్తత వరదయపాళ్యం: పిచ్చాటూరులో నిర్వహించిన మహానాడు సమావేశంలో దళిత నాయకుడిపై దాడి జరగడం ఉద్రిక్తతకు దారితీసింది. పల్లికొండేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ పద్మనాభరాజు నివాసంలో జరిగిన సమావేశానికి మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో అడవికొడియంబేడు దలళితవాడకు చెందిన టీడీపీ తిరుపతి పార్లమెంటరీ ఎస్సీసెల్ కార్యదర్శి రవిపై తిరుపతి పార్లమెంటు టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు కె.సతీష్నాయుడు, పిచ్చాటూరు మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు ఎం.తిరుమలైరెడ్డి వర్గీయులు దాడి చేశారు. రవిని కొట్టడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. అదే సమయంలో పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పద్మనాభరాజు సోదరుడు లక్ష్మణరాజు కూడా రవిని దూషిస్తూ ఇంటి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వరరావుకు రవి తన సమస్యను వివరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. 3న మేనేజర్ పోస్టులకు పరీక్ష తిరుపతి అన్నమ్యసర్కిల్: తిరుపతి ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్ట్కు జూన్ 3న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శ్రీకాళహస్తి ఈ–డివిజనల్ మేనేజర్ పోస్ట్కు అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ – పీజీ కాలేజీలో పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ కారాలయ అధికారవర్గాలు తెలిపాయి. -
వెంటాడిన మృత్యువు
మృత్యువు వెంటాడింది. శ్రీవారి దర్శనానంతరం స్వగ్రామానికి వెళ్తున్న వారిని ట్రాలీ రూపంలో ఢీకొట్టింది. తప్పు చేసిన వారికే పదోన్నతులా? విజిలెన్స్ నివేదికలో పేర్లు వచ్చిన కొందరు అధికారులకు వరుసగా పదోన్నతులు లభించడం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. స్క్రాప్ స్కాంకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొనే ఎస్ఈలకు ప్రమోషన్లు కల్పించి క్షేత్ర స్థాయిలో పనిచేసే ఒకరిద్దరిపై చర్యలు తీసుకోవడం వెనుక సంస్థలోని ఓ డైరెక్టర్ అండదండలు ఉన్నాయా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులను పక్కనబెట్టి, అక్రమాలకు సహకరించిన వారినే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు విద్యుత్ ఉద్యోగుల్లో బలంగా వినిపిస్తోంది. -
పేలుతున్నాయ్!
ఓవర్లోడ్తో కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు తిరుపతి రూరల్ : మండుతున్న ఎండలతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు టపాకాయల్లా పేలుతున్నాయి. విద్యుత్ వాడకం విపరీతంగా పెరగడం.. ట్రాన్స్ఫార్మర్లపై అధికలోడ్ పడి డీటీఆర్లు కాలిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 585 33/11కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా.. సుమారు 2 లక్షల నుంచి 2.5 లక్షల విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారానే నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోకి విద్యుత్తు సరఫరా అవుతోంది. ఇటీవల గృహ విద్యుత్ వినియోగదారులు అత్యధికంగా విద్యుత్తు వాడకాన్ని పెంచేశారు. వ్యవసాయ విద్యుత్తు కూడా అంచనాలకు మించి వాడుతున్నారు. దీనికారణంగా ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి కాలిపోతున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పది రోజుల క్రితం రేణిగుంట వద్దనున్న 220కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చేలరేగినట్టు తెలుస్తోంది. వాటితోనే ప్రమాదం లైఫ్టైమ్ పూర్తయిన ట్రానన్స్ఫార్మర్లు పెలుడుకు గురవతున్నాయని, వాటి వల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్తు సబ్స్టేషన్ల వద్ద సరైన ఎర్తింగ్ లేకపోవడం వల్ల కూడా డీటీఆర్లు కాలిపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఒకే నెలలో 500కుపైగా..! ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని సుమారు 1,600 విద్యుత్తు సబ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా 7,38,780 ట్రాన్న్స్ఫార్మర్లు నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. వేసవి అవసరాల దృష్ట్యా డీటీఆర్ల సామర్థ్యం పెంచినప్పటికీ వినియోగదారుల నుంచి ఒక్కసారిగా ఊహించని రీతిలో వాడకం పెరిగిపోయింది. దీంతో లోడ్ బ్యాలెన్స్ చేయకలేక ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక నెల వ్యవధిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధిక లోడ్ కారణంగా 500కు పైగా విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) కాలినట్టు పేర్కొంటున్నారు. తిరుపతి జిల్లాలో 220, చిత్తూరు జిల్లాలో 180, అన్నమయ్య జిల్లాలో 110వరకు కాలిపోయినట్టు సమాచారం. ఇటీవల తిరుపతి రూరల్ మండలం, పెరుమాళ్లపల్లి గ్రామంలోని ఓ అపార్ట్మెంట్లో మీటర్ బాక్సులు పేలిపోయి మంటలు వ్యాపించాయి. -
ఒంటరి మహిళ ఇల్లు కూల్చివేత
తిరుపతి తుడా: ఆమె ఒంటరి మహిళ. ఒక్కగానొక్క కొడుకు మానసిక వ్యాధిగ్రస్తుడు. 75 ఏళ్ల వయసులో ఆమె కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. దూరపు బంధువులు తప్ప ఆమెకు నా అన్న వారు ఎవరూ లేరు. తిరుపతిలో 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంట్లో నివసిస్తోంది. అలాంటి ఒంటరి మహిళ ఇంటిని పక్కింటి వ్యక్తి తనకున్న అధికార పార్టీ నాయకుల అండతో కూల్చి వేయించాడు. పాత భవనానికి సెట్బ్యాక్ స్థలం వదల్లేదని 70 ఏళ్ల తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ధాక్షిణ్యంగా ఇంటిని కూల్చేశారు. పాత భవనాన్ని ఇప్పుడు ఆక్రమణ పేరుతో తొలగించడం అన్యాయమని అధికారులకు తెలిసినా రాజకీయ ఒత్తిళ్లతో తొలగించక తప్పలేదు. వేకువజామునే దండయాత్ర కరుడుకట్టిన టీడీపీ నాయకురాలిగా గుర్తింపు పొందిన ఇంద్రాణి ఇంటిపై ఆ పార్టీ నేతలు బుధవారం వేకువజాము నుంచే దండయాత్ర చేయించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పెద్ద సంఖ్యలో పోలీసులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ప్లానింగ్ యంత్రాంగం ఒక్కటై తెల్లవారక ముందే యంత్రాలతో ఇల్లును తొలగించేశారు. కనికరం లేకుండా ఒంటరి మహిళ అని చూడకుండా టీడీపీ ముఖ్య నేతలు క్రూరత్వంతో వ్యవహరించారని బాధితురాలు కన్నీరు పెట్టుకున్నారు. వీరి కుటుంబం అంతా రామచంద్రపురం మండలం, కమ్మపల్లికి చెందిన టీడీపీ వారే. బాధితురాలు ఇంద్రాణి ఇంటికి ఆనుకుని ఉన్న స్థలం యజమాని మంత్రి నారా లోకేశ్ ద్వారా ఒత్తిడి తెచ్చి తొలగింపజేశారని బాధితురాలు ఆరోపించింది. పాత భవనానికి ఇప్పుడు నిబంధలు ఏమిటంటూ స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. నా ఉసురు తగులకుండా పోదు ఎవ్వరూ లేని నాపై టీడీపీ నేతలు, అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారు. 70 ఏళ్లుగా లేని ఆక్రమణ ఈ రోజే ఎందుకు కనిపించింది. మంత్రి నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, శాప్ చైర్మన్ రవినాయుడు ఒత్తిడితో నా ఇల్లును తొలగించారు. మా కుటుంబం, మా బంధుగణం అంతా కరుడుగట్టిన టీడీపీ వాళ్లమే. మాకే ఇంత అన్యాయం చేస్తారా..?. ఈ పాపంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ సర్వనాశనం అయిపోతారు. – ఇంద్రాణి, బాధితురాలు -
సరైన మార్గదర్శకత్వం విజయానికి సోపానం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి సోపానం అని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మినారాయణ తెలిపారు. దేశంలో ఐఐటీ–జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యాసంస్థలు ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలోని ఏఐఆర్ బైపాస్ రోడ్డులో ఉన్న హోటల్ ఇష్టా వేదికగా ఏర్పాటు చేసిన ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ఫౌండేషన్ కోచింగ్ను అందుబాటులోకి తీసుకు వస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఫౌండేషన్ కోర్సులు వారానికి మూడు రోజులు నిర్వహించబడతాయని, ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో అందుబాటులో కలవని చెప్పారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచి మెదడు చురుగ్గా ఉండేందుకు మరో ఐదు రకాల చిట్కాలను సోదోహరణంగా వివరించారు. రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసోనెనన్స్ కట్టుబడి ఉందన్నారు. ఈ ఫౌండేషన్ సెంటర్ విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలోపేతం చేసుకోవడానికి, ఐఐటీ–జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 50 పైగా క్యాంపస్లతో విజయవంతంగా దూసుకుపోతోందన్నారు. మరింత సమాచారానికి 9959154371, 9985310069 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
● జేసీబీతో చదును ● స్థానికుల ఫిర్యాదుతో అడ్డుకున్న రెవెన్యూ అధికారులు ఏర్పేడు: మండలంలోని రావిళ్లవారి కండ్రిగలో విలువైన ప్రభుత్వ భూమిపై కూటమి నేతల కన్ను పడింది. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత రూ.4 కోట్ల విలువైన 4.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో బుధవారం జేసీబీ పెట్టి చదును చేయడం ప్రారంభించాడు. స్థానికులు తహసీల్దార్ రాజశేఖర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన అక్కడకు చేరుకుని జేసీబీని అడ్డుకున్నారు. వివరాలు.. మండలంలోని పెనుమల్లం రెవెన్యూ, రావిళ్లవారికండ్రిగ గ్రామ పరిధిలో సర్వే నం.197/1లో 4.05 ఎకరాల అనాధీనం భూమి ఉంది. ఈ భూమి విలువ మార్కెట్లో రూ.4కోట్లకు పైగా ఉంటుంది. ప్రభుత్వ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్నేశాడు. అధికార పార్టీ అండదండలు చూసుకుని ఎటువంటి అనుమతులు లేకుండా బుధవారం ఉదయం జేసీబీ పెట్టి చదును చేయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన గ్రామస్తులు తహసీల్దార్కు ఫోన్చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ వీఆర్వో హరిని ఘటనా స్థలానికి పంపించి చదును చేసే పనులను అడ్డుకున్నారు. అయితే స్థానిక వీఆర్వో ఆక్రమణదారునికి వంతపాడుతున్నట్లు స్థానికులు అతనిపై మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ భూమిపై కోర్టులో కేసు వేయగా, ప్రభుత్వ భూమిగా తేల్చడంతో అప్పట్లో ఇక్కడ స్థానికులకు ఇంటి స్థలాలను మంజూరు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వం మారడంతో విలువైన ఆ భూమిని కొట్టేసేందుకు ప్రయత్నించాడు. ఆక్రమణదారుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మేకల కాపరి బాలికపై అఘాయిత్యం వరదయ్యపాళెం: మండలంలోని రాచకండ్రిగలో మానవత్వానికే మాయనిమచ్చలాంటి ఘటన వెలుగుచూసింది. పొట్టకూటి కోసం మేకలు మేపుకుంటున్న 16 ఏళ్ల బాలికపై అదే ఊరికి చెందిన 46 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి తెగబడ్డాడు. నిందితుడి అఘాయిత్యంతో బాలిక గర్భం దాల్చడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు కాతరి వెంకటరమణయ్య (46) కూడా మేకల మందతో అడవికి వెళ్తుండేవాడు. అదే ఊరికి చెందిన బాలిక మేకలు మేపుకునేందుకు వచ్చి ఒంటరిగా దొరకడంతో మాయమాటలు చెప్పి, బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సోమవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. విషయం తెలుసుకున్న శ్రీసిటీ పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్ 64 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ బీవీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ ప్రియాంక సిబ్బందితో స్వయంగా దర్యాప్తు చేపట్టి, నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశారు. బుధవారం సత్యవేడు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. బాధిత బాలికను శ్రీసిటీ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా కౌన్సెలింగ్, పునరావాసం కల్పిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
గంజాయిపై ఉక్కుపాదం
తిరుపతి క్రైం : తిరుపతి జిల్లాను ప్రమాద రహితంగా, గంజాయి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలనపై బుధవారం తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా ట్రాఫిక్, హైవే మొబైల్ వాహనాలు, గంజాయి నిర్ధారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ బస్సును పరిశీలించారు. జిల్లాలోని 11 రోడ్ సేఫ్టీ మొబైల్ వాహనాలకు సేఫ్టీ కోన్సం, రిఫ్లెక్టివ్ జాకెట్లు, రేడియం స్టిక్కర్లు, ట్రాఫిక్ బాటమ్ లైట్లు తదితర ఆధునిక భద్రతా పరికరాలను అందజేశారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి కూలింగ్ గ్లాసులు, నీళ్ల బాటిళ్లు, రేడియం జాకెట్లు, బాటన్ లైట్లు పంపిణీ చేశారు. జాతీయ రహదారులపై గుర్తించిన 43 బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. హైవే మొబైల్ వాహనాల ద్వారా నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్, సీట్బెల్ట్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గంజాయి నిరోధానికి ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతి జిల్లాలో 10 వేల రాపిడ్ గంజాయి టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటికే 4 వేల కిట్లను అన్ని సబ్ డివిజన్లకు పంపిణీ చేసినట్లు చెప్పారు. యూరిన్ శాంపిళ్ల ఆధారంగా ఐదు నిమిషాల్లో ఫలితాలు వెల్లడించే ఈ కిట్లతో గంజాయి వినియోగదారులను గుర్తించనున్నారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక మొబైల్ బస్సు ఏర్పాటు చేసి గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలిసారి పరీక్షల్లో పాజిటివ్గా తేలిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వగా, పదేపదే గంజాయి వినియోగం నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్మగ్లర్లపై కఠిన చర్యలు గంజాయి వినియోగదారుల ద్వారా రవాణాదారుల వివరాలు సేకరించి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత నెలలోనే 4,500 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి నేరస్తులపై ప్రత్యేక షీట్లు తెరిచినట్లు పేర్కొన్నారు. గంజాయి, ఎరచ్రందనం స్మగ్లింగ్, రౌడీషీటర్లపై గత రెండేళ్లలో 37 పీడీ కేసులు నమో దు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి (శాంతి భద్రతలు), ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, వివిధ సబ్ డివిజన్ అధికారులు, ఆర్టీవోలు, సీఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు. -
ప్రియుడు వదిలేశాడనీ..!
– ఉరి వేసుకుని మహిళ మృతి చంద్రగిరి:ప్రియుడు వదిలేశాడని ఉరి వేసుకుని మహిళ మృతి చెందిన ఘటన తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. బీహార్కు చెందిన తిట్లీదేవి(40) రెండున్నరేళ్ల క్రితం భర్తను వదిలేసి, ప్రియుడితో పారిపోయి తిరుపతికి చేరుకుని సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలసి ముళ్లపూడి వద్ద ఓ డెయిరీ ఫాంలో కూలీలుగా పనిచేస్తున్నారు. గత పది రోజులు క్రితం ప్రియుడు, తిట్లీదేవిని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనయ్యింది. మంగళవారం రాత్రి డెయిరీ ఫాం వద్ద ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం డెయిరీ నిర్వాహుకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తిట్లీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుధాకర్ పేర్కొన్నారు. తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిపై వేటు చంద్రగిరి: లైంగిక వేధింపుల కారణంగా తిరుచానూరు పంచాయతీ కార్యదర్శి మణిపై కలెక్టర్ వెంకటేశ్వర్ చర్యలు తీసుకున్నారు. ఇటీవల కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగనిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిగా మణిని విధుల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్ ఈవోగా తిరుపతి రూరల్ ఈఓపీఆర్డీ దయా సాగర్ను నియమించారు. సైన్స్ ఆవిష్కరణలో ప్రపంచ భాగస్వామ్యాల బలోపేతం – డల్హౌసీ యూనివర్సిటీతో తిరుపతి ఐసర్ ఎంవోయూ ఏర్పేడు: సైన్స్ రంగంలో నూతన ష్కరణలు, పరిశోధనలకు ప్రపంచ భాగస్వామ్యాల బలోపేతం ఎంతైనా అవసరమని తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య అన్నారు. పరిశోధన, స్టార్టప్లు, ఆవిష్కరణ, పరిశ్రమ భాగస్వామ్యాలలో భారత్–కెనడా సహకారం మరింత పెంచే వ్యూహాత్మక కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఐసర్, కెనడా దేశం హాలీఫాక్సలోని డల్హౌసీ యూనివర్సిటీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐసర్ డైరెక్టర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెనడాలోని డల్హౌసీ యూనివర్సిటీలో క్రియేటీవ్ డిస్ట్రక్షన్ ల్యాబ్–అట్లాంటిక్ ఆవిష్కరణ సెషన్లలో పాల్గొన్నారు. ఐసర్ డైరెక్టర్, డల్హౌసీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నోని మెక్డొనాల్డ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తొలి తిరుపతి–డాల్హౌసీ ఇన్నోవేషన్ రీసెర్చ్ రౌండ్ టేబుల్ను ప్రారంభించారు. తిరుపతిలోని ట్రినిస్టిట్యూషనల్ గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాంపస్పై చర్చించారు. ఏఐ, డిజిటల్ సిస్టమ్లు, ఆరోగ్య సాంకేతికతలు, అధునాతన మెటీరియల్స్, వ్యవసాయం, కీలకమైన ఖనిజాలతో భారతదేశం, కెనడా దేశాల సైన్స్ ప్రగతి, నూతన ఆవిష్కరణలకు సరికొత్త అధ్యాయానికి ఈ ఒప్పందం బీజం వేసిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
29న జరిగే ధర్నాను విజయవంతం చేయండి
తిరుపతి రూరల్: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకుందున్న సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగంతో పాటు మిగతా విద్యార్థి సంఘాలను కలుపుకుని ఈనెల 29న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే ధర్నాకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నేతలు తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవడంతోపాటు డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో అర్హులైన వారికి న్యాయం జరగలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ఆయన మంత్రి పదవిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టే ఆందోళనకు ప్రతి ఒక్కరూ తరలిరావాలన్నారు. -
నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు!
దొరవారిసత్రం: దొరవారి సత్రం మండలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. ఆమె కుమారుడే పెట్రోలు పోసి నిప్పంటించి చంపేశాడని తేల్చారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ సంఘమేశ్వరరావు, స్థానిక ఎస్ఐ జీవీ చౌదరి దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని చందనముడి గ్రామ పరిధి, ఎస్సీ కాలనీకి చెందిన అంబూరు సుజాత (37) గత నెల 25న అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు అప్పట్లో కేసు నమోదు చేశారు. తల్లిపై పెట్రోల్ పోసి! సుజాతకు, ఆమె పెద్ద కుమారుడు సుధీర్కు మధ్య గత కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తల్లిపై కక్ష పెంచుకున్న సుధీర్ గత నెల 25వ తేదీన రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి అర్ధరాత్రి సమయంలో మేడపై నిద్రసిస్తున్న తల్లిపై పోసి నిప్పటించాడు. ఆపై ఏమీ తెలియనట్లు కిందకు వచ్చేశాడు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో సుజాత కేకలు వేసింది. పక్కనే నిద్రిస్తున్న రెండో కుమారుడు విష్ణు నిద్రలేచి అరవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలార్పారు. అప్పటికే శరీరం అంతా కాలి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది. పొంతన లేని సమాధానాలతో.. తల్లి మృతి విషయంలో పెద్ద కుమారుడు అన్ని ఆధారాలు దాచి పెట్టడడంతో పాటు ప్రమాదం జరిగినట్లు చిత్రికరించాడు. అదేవిధంగా తల్లిని చికిత్స కోసం తరలించిన దగ్గర అంతా పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానిస్తూ వచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే క్లూస్ టీమ్ సేకరించిన ఆధారులను బట్టి సుజాతది హత్యగా పరిగణనలోకి తీసుకున్నారు. చివరిగా సుఽఽధీర్ను విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు సుధీర్ను బుధవారం సూళ్లూరుపేట కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు డిమాండ్ విధించినట్లు పోలీసుల తెలిపారు. -
అర్హులందరికీ న్యాయం చేయండి
తిరుపతి అర్బన్: శెట్టిపల్లిలో అర్హులందరికీ న్యాయం చేయాలని భూ బాధితుల కమిటీ అధ్యక్షుడు జి.చిన్నబాబు డిమాండ్ చేశారు. బుధవారం శెట్టిపల్లికి చెందిన పలువురు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన తమకు వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.387,388,402,403,409,410,411,425,426,475 పరిధిలో 450 కుటుంబాలకు చెందిన వారు 2008లోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణా లు చేపట్టారని గుర్తుచేశారు. అయితే ఆ కుటుంబా లకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామాంజుల నాయక్కు వినతిపత్రాన్ని అందించారు. శెట్టిపల్లి భూ బాధితుల కమిటీ నాయకులు పాల్గొన్నారు. -
మహాఖర్చు గురూ!
ఇదేనా పొదుపు బాబూ! టీడీపీ చేపట్టిన వర్చువల్ మహానాడు ఖర్చులు తడిసి మోపెడయ్యాయని తమ్ముళ్లు లబోదిబో మంటున్నారు. ఈ ఖర్చులు ఎమ్మెల్యేలు భరించాల్సి ఉన్నా.. కొందరు మండల పార్టీ నాయకులు, వ్యాపార వేత్తలకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంధన పొదుపు పేరుతో చేపట్టిన వర్చువల్ మహానాడు తమ జేబులకు చిల్లుపడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్చువల్ మహానాడు కాకుండా.. ముందుగా అనుకున్నట్లు నెల్లూరులో నిర్వహించి ఉంటే తమపై ఖర్చుల భారం పడేది కాదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. అధికారమా.. మజాకా? వర్చువల్ మహనాడు కార్యక్రమం కేవలం పార్టీ కార్యక్రమమే. అయితే కొందరు నాయకులు అధికారాన్ని ఉపయోగించుకున్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణిలో ప్రభుత్వ మండల పరిషత్ కార్యాలయంలో మహానాడు నిర్వహించి ఔరా అనిపించారు. అదే విధంగా చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాలలో టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించడం గమనార్హం. సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి, చిత్తూరు జిల్లాలో బుధవారం అన్ని మండల కేంద్రాలతో పాటు సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీలతో పాటు చిత్తూరు, తిరుపతి నగరాల్లో నాలుగు డివిజన్లకు ఒక చోట వర్చవల్ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి నగరంలో 12 చోట్ల, చిత్తూరులో ఐదు చోట్ల మినీ మహానాడు నిర్వహించారు. ప్రతి క్లస్టర్లో నాయకులు, కార్యకర్తలు వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా మహానాడుకు హాజరైన వారందరికీ భోజన వసతులు ఏర్పాటు చేశారు. అనేక చోట్ల చికెన్ బిరియాని ఏర్పాటు చేశారు. శ్రీరంగరాజపురంలో.. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పాయికట్టు ఆరిమాకులపల్లిలో వెలసిన శ్రీఆరిమానిగంగమ్మ ఆలయం వద్ద బుధవారం టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోనే వేదిక ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణ చుట్టూ, గాలి గోపురం వద్ద, ఆలయం ఎదురుగా రోడ్డుపై టీడీపీ జెండాలు, తోరణాలు ఏర్పాటుచేశారు. దొరవారిసత్రంలో.. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని సింగనాలత్తూరులో ప్రభుత్వ పాఠశాలలో మినీ మహానాడు నిర్వహించారు. స్పందన కరువు వర్చువల్ మహానాడు కార్యక్రమానికి అనేక మండలాల్లో స్పందన కరువైంది. అధిష్టానం ఆదేశాలని చెప్పి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు మండల పార్టీ నాయకులపై ఒత్తిడి చేసి నిర్వహించిన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులందరూ హాజరుకాలేదు. అందుబాటులో ఉన్న వారిని మాత్రం పిలిపించుకుని మమ అనిపించిన కార్యక్రమాలు ఉన్నాయి. భారీగా చేసిన వర్చువల్ మహానాడు కార్యక్రమాలు ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులపైనే భారం తిరుపతి, చిత్తూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలే వర్చువల్ మహానాడు ఖర్చులు భరించారు. ఎక్కువ శాతం మండల పార్టీ నాయకుల మహానాడు ఖర్చును భరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. తిరుపతి, చిత్తూరు నగరాల్లో కొందరు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు ఖర్చులు భరించారు. అదే విధంగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా మహానాడు నిర్వహణకు సొంత డబ్బులు ఖర్చుచేసినట్లు తెలిసింది. కార్యకర్తల తరలింపునకు కూడా జేబులో నుంచి ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదువులు పొందిన వారు, సంపాదించుకున్నోళ్లు పెట్టినా ఇబ్బంది లేదు కానీ, ఎటువంటి ప్రయోజనం పొందని వారి నుంచి కూడా వసూళ్లు చేయడం, ఖర్చు చేయించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వర్చువల్ మహానాడు కార్యక్రమానికి కొందరు రూ.లక్ష ఖర్చు చేస్తే.. మరి కొందరు రూ.5 లక్షలు ఖర్చు చేసిన నాయకులు ఉన్నారు. -
ఒంటరి మహిళ ఇల్లు కూల్చివేత
తిరుపతిలో అధికార పాఈర్ట నేతలు చెలరేగి పోతున్నారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఒంటరి మహిళ ఇంటిని కూల్చివేయించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం ఏర్పేడులో నాలుగు కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని ఓ టీడీపీ నాయకుడు కబ్జాకు యత్నించాడు.బాబూ.. రెండేళ్లయ్యింది.. రోడ్లెప్పుడేస్తారు? తిరుపతి జిల్లాల్లో అభివృద్ధికి నోచుకోని రహదారులు గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026‘మేం అధికారంలోకి వచ్చిన ఏడాదికే రహదారులన్నీ బాగుచేస్తాం. అతుకులు..గతుకులు లేకుండా అద్దాల్లా తీర్చిదిద్దుతాం. ఊరికి చుట్టాలొచ్చినప్పుడు వారు మెచ్చుకునేలా మార్చేస్తాం’ అంటూ కూటమి పార్టీ నేతలు జబ్బలు చరిచారు. మమ్మల్ని నమ్మండంటూ ఊదరగొట్టారు. తీరా ఏడాదికాదు.. రెండేళ్లు కావస్తున్నా ఎక్కడి గుంతలు అక్కడే వదిలేశారు. గత ఏడాది పండక్కి అక్కడక్కడా రోడ్లేసినట్టు బిల్డప్ ఇచ్చి నిధులు పంచుకుతిన్నారు. ఆ తర్వాత మరమ్మతులు కూడా చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అతుకులు.. గతుకుల రోడ్లపై ప్రయాణం చేయలేక వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వచ్చిన రోడ్ల దుస్థితిపై ప్రత్యేక కథనం.. శ్రీకాళహస్తి– తడ మార్గంలోని చిద్రమైన ఆర్అండ్బి రోడ్డు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘రెండేళ్లైంది.. రోడ్లు ఎప్పుడు బాగు చేస్తారు సీఎం చంద్రబాబు సారూ’.. అంటూ జిల్లా ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తిరుపతి జిల్లాలో అనేక రోడ్లు ఆధ్వానంగా మారినా పట్టించుకోవడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన తరువాత 2025 సంక్రాంతి పండుగకు రోడ్లన్నీ బాగు చేస్తామని గొప్పలు ప్రకటించారని.. ఆ తర్వాత అక్కడక్కడా తూతూమంత్రంగా నాసిరకం రోడ్లేసి చేతులు దులుపుకున్నారని మండిపడుతున్నారు. చాలా చోట్ల రాళ్లు, మట్టి, గ్రావెల్ పోసి ప్రజల కళ్లకు గంతలు కట్టారని రగిలిపోతున్నారు. అవి కొద్దిరోజులకే మళ్లీ యథాస్థితికి చేరాయని పేర్కొంటున్నారు. 2027 సంక్రాంతి వస్తున్నా ఇప్పటికీ రహదారులు బాగు చేసిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరం, రూరల్ పరిధిలో ఎక్కువగా గులకరాయి పొడితో గుంతలను కప్పేశారు. ఆ పొడి కూడా కొద్ది రోజులకు కొట్టుకుపోయింది. ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. మరికొన్ని చోట్ల అయితే నాసిరకమైన కంకర, చిప్స్ కలిపి గుంతలను కప్పిపెట్టారు. నరకదారులు తిరపతి జిల్లా పరిధిలోని గ్రామీణ రహదారులు మరీ అధ్వానంగా మారాయి. వెంకటగిరి– బాలాయపల్లి మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. గమ్యస్థానాలకు చేరేంత వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు పరిధిలోని రహదారులు గుంతలమయంగా మారాయి. చిన్నపాటి వర్షం వస్తే నీరు నిలిచి బురద గుంతలుగా మారిపోతున్నాయి. మేనకూరు సెజ్ పరిసర ప్రాంతాల్లో అయితే రహదారులు మరీ అధ్వానంగా మారాయి. ఇలాంటి రహదారులు చూస్తే పారిశ్రామిక వేత్తలు ఎలా పెట్టుబడులు పెడుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు దుస్థితికి చేరాయి. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని రహదారులు అత్యంత దారుణంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల రహదారుల ఏర్పాటు కోసం కంకర తోలి అలాగే వదిలేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. పుత్తూరు మండలం, తడుకు వయా గూళూరు, పొట్టిగుట్టలు, శిరుగురాజుపాళెం రహదారులు దారుణంగా అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. తిరుపతి–రైల్వేకోడూరు రహదారిలో పలు చోట్ల గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకంగా మారింది. -
మధుసూదన్ సార్.. మంచి పనిచేశారు!
నాయుడుపేట టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమానప్రయాణం చేయించి హెచ్ఎం మధుసూదన్ ఆదర్శంగా నిలిచారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అన్నమేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్.మధుసూదన్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమాన ప్రయాణం చేయిస్తామని హెచ్ఎం ముందుగా హామీ ఇచ్చారు.దీంతో పదో తరగతిలో అన్నమేడుకు చెందిన చెంబేటి శశి (588) మార్కులు, అన్నమేటి యమున (577), కాంపాలం భవిత (568) మార్కులు సాధించారు. దీంతో ఈ ముగ్గురు విద్యార్థినులను హెచ్ఎం సోమవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ విమానంలో రేణిగుంటకు తీసుకువచ్చారు. అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేలా హెచ్ఎం ఆదర్శంగా నిలవడంతో ఎంఈఓ బాణాల మునిరత్నంతో పాటు స్కూల్ ఉపాధ్యాయులు హెచ్ఎంకు అభినందనలు తెలిపారు.చదవండి: ట్రాఫిక్ చలానా ఉంటే పిల్లనివ్వను -
అభ్యున్నతికి మార్గదర్శకం
తిరుపతి కల్చరల్: స్వయం ఉపాధి మహిళల అభ్యున్నతికి మార్గదర్శకమని సాక్షి బ్రాంచ్ మేనేజర్ సత్యేంద్రబాబు తెలిపారు. సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బైరాగిపట్టెడలోని అనంగా బ్యూటీ స్టూడియో అండ్ ఇన్స్టిట్యూట్లో మహిళలకు నెల రోజులుగా చేపట్టిన బ్యూటీషియన్ కోర్సు శిక్షణ తరగతులు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయశక్తితో ఎదిగి, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో పలు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నట్లు తెలిపారు. సాక్షి మైత్రి మహిళ ద్వారా శిక్షణ పొందిన మహిళలు నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ స్వయం ఉపాధిలో రాణించి అభివృద్ధి పథంలో పయనించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్ టి.చంద్రశేఖర్, శిక్షకురాలు, మాస్టర్స్ ఇన్ కాస్మోటాలజిస్ట్ వై.శ్యామల, మహిళలు పాల్గొన్నారు. ఘనంగా ముగిసిన బ్యూటీషియన్ శిక్షణ -
ఎడ్సెట్లో ఎస్వీయూ విద్యార్థికి పదో ర్యాంక్
తిరుపతి సిటీ: బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 8వ తేదీన నిర్వహించిన ఏపీ ఎడ్సెట్–2026 ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. తిరుపతి రూరల్, పేరూరు తారకరామ నగర్కు చెందిన ఎస్వీయూ విద్యార్థి సి కుష్వంత్ ఇంగ్లిష్ మెథడాలజీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 115 మార్కులు సాధించి పదో ర్యాంకు కై వసం చేసుకున్నాడు. విద్యార్థి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో బీఏ ఇంగ్లిష్, ఎస్వీయూలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ ఇంగ్లిష్లో తాను పీహెచ్డీ చేయాలన్నదే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 89,399 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 49,985 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
హిందీ పరీక్షకు 72 శాతం మంది గైర్హాజరు
తిరుపతి అర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ హిందీ పరీక్షకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 72 శాతం మంది విద్యార్థులు గైర్హాజరు కావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 28 శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ వెల్లడించారు. 236 మంది విద్యార్థులకు 67 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 332 మంది విద్యార్థులకు 292 మంది హాజరయ్యారని తెలిపారు. 40 మంది విద్యార్థులు గైర్హాజరు హాజరయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షకు సంబంధించి 130 మంది విద్యార్థులకు 109 మంది హాజరయ్యారని చెప్పారు. ఇంటర్ సప్లిమెంటరీకి 93.93 శాతం.. తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మంగళవారం 93.93 శాతం మంది హాజరయ్యారని ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఫస్ట్ ఇయర్ బయాలజీతో పాటు బ్యాక్లాగ్ విద్యార్థులకు మ్యాథ్స్1బీ, జూవాలజీ పరీక్షకు 2,703 మంది హాజరుకావాల్సి ఉండగా 2,539మంది హాజరయ్యారని వెల్లడించారు. దీంతో 93.93 శాతం హాజరు నమోదైందన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన సెకండ్ ఇయర్ జువాలజీ, ఎకనామిక్స్ పరీక్షకు 1,707 మందికి గాను 1,532మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. బక్రీద్ కారణంగా గురువారం జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పరీక్షలు వచ్చే నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ కామర్స్, సోషియాలజీ పరీక్షలు యధావిథిగా జరుగుతాయని తెలిపారు. భూసేకరణ వేగవంతం చేయండి తిరుపతి అర్బన్: రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్వో నరసింహులతో కలసి మంగళవారం జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు చెందిన అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా నిర్ణయించుకున్న మేరకు దశల వారీగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి వారం పనుల్లో పురోగతి చూపాలన్నారు. అధికారుల సమన్వయంతో ముందడుగు వేస్తేనే విజయవంతంగా ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో రైల్వే ప్రాజెక్టు అధికారి వామనమూర్తి, సదరన్ రైల్వే అధికారి శశిభూషణ్, తిరుపతి, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయభరత్రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
టౌన్: మండలంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని కారుమంచువారి కండ్రిగ సమీపంలో కొందరు యువకులు క్రికెట్ ఆడుతుండగా తొప్పాని యశ్వంత్ (26) సమీపంలో అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే యశ్వంత్ మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. యఽశ్వంత్ డిప్లొమా వరకు చదివి ఉద్యోగం కోసం చూస్తున్నాడు. యశ్వంత్ మృతితో తల్లిదండ్రులు రవికుమార్, లతతో పాటు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పిడుగు పడి.. కొబ్బరిచెట్టులో మంటలు నాయుడుపేట టౌన్: పట్టణంలోని ఎల్ఏ సాగరం గిరిజన కాలనీలోని ఓ కొబ్బరి చెట్టుపై మంగళవారం పిడుగుపడింది. దీంతో కొబ్బరి చెట్టుపై మంటలు చెలరేగాయి. ఈ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జనావాసాల మధ్య కొబ్బరిచెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగుపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మెరుపులు, పిడుగుల దాటికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో టీవీలు, ఏసీలు తదితర ఎలక్ట్రానిక్ సామగ్రి కాలిపోయాయని స్థానికులు తెలిపారు. ఎబోలా వైరస్పై సమావేశం రేణిగుంట: విదేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్ నివారణపై డీఎంహెచ్ఓ బాలకష్ణ నాయక్ ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో డైరెక్టర్ భూమి నాథన్తో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి వచ్చే యాత్రికులపై అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే విమానాశ్రయంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రేణిగుంట విమానాశ్రయానికి ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ విమానాలు రాకపోయినా ఇతర విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డీఎంహెచ్ఓ పలు సూచనలు చేశారు. ట్రాన్సిట్ హబ్ల ద్వారా ఆఫ్రికా దేశాలు లేదా ఇతర ప్రభావిత అంతర్జాతీయ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను గుర్తించే రోజువారీ ప్రయాణికుల జాబితాల/ప్యాసింజర్ మానిఫెస్ట్లను వైద్యాధికారులతో పంచుకోవాలని విమానాశ్రయ అధికారులను కోరారు. అధిక ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన ప్రయాణికులను తనిఖీ చేసి,తక్షణ క్వారంటైన్ నిర్వహణ కోసం తిరుపతిలోని ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఒక ప్రత్యేక ఈవీడీ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచుతామని డీఎంహెచ్ఓ తెలిపారు. -
వ్యక్తి ఆత్మహత్య
బుచ్చినాయుడుకండ్రిగ: అనారోగ్య సమస్యలు తాళలేక పురుగుల తాగి ఆత్మాహత్య పాల్పడిన సంఘటన బుచ్చినాయుడుకండ్రిగలో చోటు చేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్ కథనం మేరకు.. బుచ్చినాయుడుకండ్రిగ అరుంధతివాడకు చెందిన బట్టేపాటి దశయ్య (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గత 24వ తేదీ అర్ధరాత్రి పురుగుల నివారణ మందు తాగాడు. ఇది గమనించిన భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు. మృతుడి కుమారుడు విష్ణువర్థన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ముక్కంటి సేవలో హైకోర్టు న్యాయమూర్తి శ్రీకాళహస్తి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య కుటుంబ సమేతంగా మంగళవారం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈఓ బీకే వెంకటేశులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు ప్రత్యేక రాహుకేతు పూజలను చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుత్తణి ఆలయంలో ఆంధ్రా మహిళ వాచ్ చోరీ తిరుత్తణి: తిరుత్తణి మురుగన్ ఆలయంలో స్వామి దర్శనానికి క్యూలైన్లో వెళ్లిన ఆంధ్రాకు చెందిన మహిళ వద్ద ఖరీదైన వాచ్ చోరీకి గురైంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి శ్రీరామ్నగర్కు చెందిన రాజేంద్రప్రసాధ్ కుటుంబంతో కలిసి మంగళవారం ఉదయం తిరుత్తణికి వచ్చింది. ఆలయ మాడ వీధిలో రూ.100 ప్రత్యేక దర్శన క్యూలైన్లో కుమారుడు దినేష్, కోడలు శ్వేతతో కలిసి రాజేంద్రప్రసాద్ స్వామి దర్శానికి వెళ్లారు. ఆ సమయంలో శ్వేత (32) చేతికి కట్టుకున్న బంగారు, వజ్రపు రాళ్లు పొదిగిన రూ. 7 లక్షల విలువైన చేతి వాచ్ అదృశ్యమైంది. వాచ్ చోరీపై రాజేంద్రప్రసాద్ తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ శివకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి ఆలయంలో మహిళ వద్ద ఖరీదైన వాచ్ వినూత్న రీతిలో అదృశ్యం ఘటన కలకలం రేపింది.దారి ఆక్రమణ రేణిగుంట: మండలంలోని గురవరాజుపల్లి పంచాయతీ వైఎస్సార్ నగర్లో స్థానిక టీడీపీ నాయకుడు దారి ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కారణంగా ఆ వీధిలో కాలువ లేకపోవడంతో పైనుంచి వచ్చే మురుగు నీరంతా ఇళ్ల మధ్య నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో మొత్తం 20 అడుగుల దారి ఉంటే ఇక్కడ మాత్రం కనీసం ఆరడుగులు దారి కూడా లేకుండా ఆక్రమణకు పాల్పడినట్లు స్థానికులు వాపోతున్నారు. కాపురాలు ఉండే ప్రదేశంలో మురుగునీరు నిల్వ ఉండడంతో ఎక్కడ అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయో? అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. స్థానిక అధికారులకు పలుమార్లు సమస్య తెలిపినా టీడీపీ నాయకుడికి భయపడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రేణిగుంట: పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి మరమ్మతులు చేసేందుకు నెలరోజుల పాటు మూసివేశారు. అయినప్పటికీ అధికారుల సమన్యయ లోపంతో ఎక్కడ పనులు అక్కడే వదిలేసి యథావిధిగా వాహనాల రాకపోకలను కొనసాగించారు. నెల రోజుల వ్యవధిలో అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు వెళ్లేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి అండర్ బ్రిడ్జిలో నీళ్లు రావడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరమ్మతుల కోసం నెల రోజులు బ్రిడ్జిను మూసేసిన అధికారులు వర్షపు నీళ్ళు వెళ్లేందుకు చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని వాహనచోదకులు వాపోతున్నారు. -
మహిళల భద్రతే లక్ష్యం
తిరుపతి క్రైం : మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. మహిళల హక్కులు, చిన్నారుల భద్రత, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై తిరుపతి తుడా కచ్చపి ఆడిటోరియంలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళలు, పురుషులతో సమానంగా ముందుకు సాగినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో బాధ్యతాయుతమైన ఆలోచనలు, పరస్పర గౌరవ భావన పెంపొందించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సెల్ఫోన్లు, సోషల్ మీడియా దుర్వినియోగం కారణంగా మహిళలు, చిన్నారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల మొబైల్ వినియోగంపై పర్యవేక్షించాలని, టెక్నాలజీని అవసరానికి మించి వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ చిన్నారులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. -
వర్సిటీ సిబ్బందికి నిబంధనలు అడ్డురాలేదు.. అక్రమాలను ఆపాల్సిన ఉన్నతాధికారులు ఉదాశీనంగా ఉన్నారు.. ప్రశ్నించేవారు ఎదురుపడలేదు.. ఇకేముంది నకిలీ చలానాలను కంప్యూటర్లో మార్ఫింగ్ చేశారు.. ఉద్యోగి వెరిఫై సిగ్నేచర్ను ఫేక్ స్టాంప్తో దందా నడిపారు.. రూ.లక్షల్లో న
ఉలిక్కిపడ్డ ఎస్వీయూ! ●బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026తిరుపతి సిటీ: ఎస్వీయూలో పాలన అస్తవ్యస్థంగా మారింది. రెండేళ్ల నుంచి వర్సిటీలో ఏమి జరుగుతోందో అర్థంకాని పరిస్థితి. రాజకీయ జోక్యాలు, అవినీతి, కుంభకోణాలు, ఫలితాల విడుదలలో జాప్యం తదితర ఘటనలతో నిత్యం వార్తలలో కెక్కుతుండడంతో వర్సిటీ పరువు, ప్రతిష్ట దిగజారుతోందని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అర్హత లేని వారిని సైతం పరిపాలనా భవనంలోని పలు కీలక విభాగాలల్లోకి గత రెండేళ్లలో అధికారులు, నాన్టీచింగ్ సిబ్బందిని బదిలీ లు చేశారు. దీంతో అవినీతికి మరింత ఆజ్యం పోసినట్లైంది. భారీ కుంభకోణం బట్టబయలు వర్సిటీలో మంగళవారం భారీ కుంభకోణం బయటపడింది. విద్యార్థులు యూజీ, పీజీ తదితర ధ్రువపత్రాల కోసం వర్సిటీకి రూ.వేల ఫీజులు చెల్లిస్తుంటారు. విద్యార్థులు చెల్లించిన బ్యాంకు చలానాలను పరిపాలనా భవనంలోని పలు విభాగాలకు చెందిన కొందరు ఉద్యోగులు, అధికారులు, బయటి వ్యక్తులతో కలసి డూప్లికేట్ చలానాలను కంప్యూటర్లో మార్ఫింగ్ చేసి, సొమ్ము కాజేసిన ఘటన బయటపడింది. దీంతో ఒక సారిగా వర్సిటీ ఉలిక్కిపడింది. పరిపాలనా భవనంలోని పలు సెక్షన్లలో గందరగోళం నెలకొంది. కొందరు ఉద్యోగులు, బయట వ్యక్తులు కలసి వర్సిటీ రబ్బరు స్టాంపులను సైతం ఫోర్జరీ చేసి కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో లా, ఎంబీఏ విభాగాలకు చెందిన చలానాలు అధిక మొత్తంలో ఉన్నట్లు సమాచారం. రూ. లక్షల్లో సొమ్ము కాజేసి వర్సిటీకి శఠగోపం పెట్టినట్లు వర్సిటీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరింత లోతుగా విచారణ చేపడితేగాని అసలు బండారం బయట పడదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.వర్సిటీకి నష్టం కలిగిస్తే సహించం ఎస్వీయూలో నాన్టీచింగ్ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్ పనిచేస్తుంది. కానీ కొందరు ఉద్యోగులు వర్సిటీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తే అసోసియేషన్ ఎట్టి పరిస్థితిలో సహించదు. డూప్లికేట్ చలానాలను తయారు చేసిన వ్యవహారంలో కొందరు ఉద్యోగులు, బయట వ్యక్తులు, విద్యార్థి నాయకులు ఉన్నట్లు తెలిసింది. ఓ మహిళా ఉద్యోగి వెరిఫై సిగ్నేచర్ను ఫేక్ స్టాంప్ తయారు చేసి దందా నడిపారని తెలుస్తోంది. ఈ విషయాన్ని నాన్టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణిస్తుంది. అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. వాస్తవాలు బయటకి రావాలంటే మరింత లోతైన విచారణ చేపట్టాలని అధికారులను కోరుతున్నాం. – శ్రీధర్, సుబ్రమణ్యం, నాన్టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, అధ్యక్ష,కార్యదర్శులు -
త్వరలో దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ
– శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి శ్రీసిటీ (వరదయ్యపాళెం): దివ్యాంగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శ్రీసిటీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. విజయవాడలో ఈ నెల 25న నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026లో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషనన్తో ఈ మేరకు శ్రీసిటీ ఎండీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. గ్రోత్ సమ్మిట్లో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీ ఎప్పుడూ సమగ్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ, ఇతర నైపుణ్యాలు అందించడం ద్వారా వారికి స్వయం ఉపాధి మార్గాలను సృష్టించడమే కాకుండా, సామాజిక సమానత్వం, పారిశ్రామిక పురోగతిపై తమ కట్టుబాటును మరింత బలపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ‘‘ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’’ లక్ష్యానికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్లో కోటి మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలనే సంకల్పానికి దివ్యాంగ యువత శిక్షణ కార్యక్రమం తోడ్పాటు అందించనుందని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ, దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ అందించేందుకు శ్రీసిటీ చొరవ చూపడం అభినందనీయమన్నారు. -
దోపిడీ కేసులో ముగ్గురి అరెస్టు
సత్యవేడు: చెదులపాకం(తమిళనాడు)కు చెందిన ఎస్.నాగరాజు అనే వ్యక్తిని కత్తితో బెదిరించి 3 గ్రాములు ఉంగరం దోచుకున్న కేసులో సత్యవేడుకు చెందిన సంతోష్(19), నితీష్కుమార్(19), నవీన్ కుమార్(16) పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సాయినాథ్ చౌదరి కథనం మేరకు.. తమిళనాడులోని చెదులపాకం గ్రామం నుంచి సత్యవేడు తన స్కూటర్పై ఎస్.నాగరాజు వస్తున్నాడు. మాదరపాకం చెక్పోస్టు వద్ద సత్యవేడుకు చెందిన సంతోష్ లిఫ్ట్ అడిగాడు. తెలిసిన వ్యక్తి కనుకే తన స్కూటర్పై తీసుకుని సత్యవేడులోని శ్రీకాళహస్తి బస్టాండ్ వద్దకు వచ్చారు. తన ఇంటి వ ద్దకు వదలి వెళ్లాలని నాగరాజును సంతోష్ కోరాడు. అక్కడి నుంచి బయలు దేరి కొంత దూరం రాగానే తన వద్ద దాచుకున్న కత్తితో ఎస్.నాగరాజును బెరించా డు. గురుకుల పాఠశాల సమీపంలోని జగనన్న కాలనీ వద్దకు పోవాలని చెప్పాడు. అక్కడ వేచి ఉన్న నితీష్ కుమార్, నవీన్కుమార్తో కలసి నాగరాజును చితక బాదారు. అతని వద్ద ఉన్న 3 గ్రాముల బంగారు ఉంగరాన్ని లాక్కున్నారు. డబ్బులు ఇవ్వాల ని కోరారు. తన వద్ద డబ్బులు లేదంటే ఫోన్ఫే చేయా లని కోరారు. నెట్వర్క్ అందక ఫోన్పే జరగలేదు. వెంటనే బాధితుడు పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫోన్ పే నంబర్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. నిందితులను మంగళవారం కోర్టుకు హాజరు పరిచి, రిమాండుకు తరలిచారని ఎస్ఐ తెలిపారు. -
చెరువైతే నాకేంటి?
దర్జాగా చెరువు ఆక్రమణ సాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వ ఖాళీస్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ పాగా వేయడం అక్రమార్కుల నైజం. పొరంబోకు స్థలాలు, వాగులు, వంకలతోపాటు తోపాటు చివరకు చెరువులపైన కూడా కబ్జాదారులు కన్ను పడింది. దీంతో ఏకంగా చెరువును యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. ఇటువంటి ఆక్రమణలు నివారించాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం గమనార్హం. వెంకటగిరి మండలంలోని పారవోలు పంచాయతీ బసవాటి చెరువు రోజురోజుకు ఆక్రమణకు గురవుతోంది. ఈ చెరువు సర్వే నంబర్ 13లో 69.95 ఎకరాలు ఉండగా సుమారు 20 ఎకరాల మేర ఆక్రమణకు గురైంది. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ నేత సుమారుగా 3.5 ఎకరాలు చెరువును ఆక్రమించి, బోరు వేయడంతోపాటు కంచె వేసి, యథేచ్ఛగా వరిపంట సైతం సాగు చేస్తున్నారు. అయినా సంబంధిత ఇరిగేషన్శాఖ అధికారులు తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారా? చెరువు ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారపార్టీ నేతల అండదండలతో చెరువు ఆక్రమణలకు గురికావడంతోపాటు రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతుంటే పాలకులు ఏమీ చేస్తున్నారని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. చెరువు ఆక్రమణలో మరి కొందరు అక్రమంగా బోరు వేయడంతోపాటు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయడంపై ట్రాన్స్కో అధికారులు వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆక్రమణలు ఇలాగే జరిగితే భవిష్యత్తులో చెరువులు కూడా కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని, దీంతో పంటలు సాగు సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవడంతోపాటు, నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నత అధికారులు, పాలకులు స్పందించి భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చెరువులను పరిరక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
భాకరాపేట కనుమలో ఐషర్ బోల్తా
చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట కనుమ లో మంగళవారం ఐషర్ వాహనం బ్రేక్ ఫెయిల్ అయ్యి బోల్తా పడింది.కాన్వొకేన్ల చలానాలు.. జన్యూన్ ధ్రువపత్రాల మాటేమిటి!వచ్చేనెల 5వ తేదీన ఎస్వీయూ స్నాతకోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వందలాది మంది విద్యార్థులు కాన్వొకేషన్ కోసం రూ.వేలల్లో ఫీజుల చెల్లించారు. ఇందులోనూ మాఫియా హస్తం ఉందా? అనే అనుమానం కలుగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జన్యూన్ సర్టిఫికెట్ల వ్యవహారంలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రార్ కార్యాలయంతో సంబంధం లేకుండా జన్యూన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి, అవినీతికి పాల్పడినట్లు అరోపణలు వస్తున్నాయి. లా, ఎంబీఏ విభాగాలకు చెందిన చలానాలను డూప్లికేట్ చేసి రూ.లక్షలు కాజేశారంటే మిగిలిన యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి విద్యార్థులు చెల్లించిన ఫీజుల పరిస్థితి ఏమిటి, ఎన్ని రోజులుగా వ్యవహారం నడుస్తోందంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఎస్వీయూ పరిపాలనా భవనం -
ఆర్యూబీ కోసం ఎంపీ గురుమూర్తికి వినతి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: సూళ్లూరుపేట నియోజకవర్గం తడ దక్షిణ క్యాబిన్ వద్ద రైళ్ల రాకపోకల కారణంగా లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని స్థానిక నాయకులు మంగళవారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికి వినతిపత్రం సమర్పించారు. సమస్యపై వెంటనే స్పందించిన ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు సంబంధిత రైల్వే శాఖ అధికారులకు లేఖ రాసి, తడ సౌత్ కేబిన్ సమీపంలోని ఎల్సీ గేట్ నంబర్ 49 వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం లెవెల్ క్రాసింగ్ గేటు తరచుగా మూసివేయడం కారణంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ప్రస్తావించారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు కూడా ఎక్కువసేపు గేటు వద్ద నిలిచిపోవాల్సి వస్తోందని తెలిపారు. అలాగే శ్రీ సిటీ ప్రాంతానికి ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులకు ఆలశ్యం అవుతోందని, దీని ప్రభావం వారి దైనందిన జీవన విధానంపై పడుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రజల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణం అవసరమని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సౌకర్యవంతమైన రవాణా దృష్ట్యా తక్షణమే సంబంధిత రైల్వే అధికారులను ఆదేశించి ప్రతిపాదనను పరిశీలించి ఆర్యూబీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరారు. -
పెట్టుబడి నష్టం
కాయ కష్టం..నేలతల్లిని నమ్ముకుని రూ.వేలు వ్యయం చేసి..కాయకష్టం చేసి మామిడి దిగుబడులు సాధించిన కర్షకులకు గిట్టుబాటు ధర గగనమైంది. తిరుపతి జిల్లాలో సంప్రదాయ పంట మామిడి అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ పంట ధరలు రెండేళ్లుగా సీజన్ ప్రారంభం నుంచే పతనం కావడంతో అమ్ముకోలేక ఇబ్బందులు పడుతూ నష్టాల బారిన పడుతున్నారు. నాణ్యమైన పంటకు గిరాకీ.. రైతులు పంట దిగుబడి సమయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కాయలకు దెబ్బలు తగలకుండా, వలల సాయంతో కాయలను దింపి, గ్రేడ్లలో కాయలను మార్కెట్కు తరలించడంతో రైతులకు మంచి గిట్టబాటు ధర లభిస్తుంది. నాణ్యత లోపిస్తే పంటకు గిరాకీ లేక రైతు నష్టాలపాలవుతారు. – జీ.ఎం.సైదుల్లా. జీ.ఎం.ఎస్ మామిడి మండీ యజమాని. దామలచెరువు మా రాష్ట్రంలో కూడా సరైన ధర లేదు ఏటా సీజన్లో నేను మామిడి వ్యాపారం చేస్తుంటాను. ఇక్కడి నుంచి మామిడి కాయలను కొని మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటాను. ఈ ఏడాది అక్కడ కూడా సరై ధరలు లేకపోవడంతో ఇక్కడ వ్యాపారం చేయలేకపోతున్నాం. ప్రతీ సంవత్సరం వందల టన్నుల ఎగుమతి చేస్తుంటాం. ఈ సారి ఉన్నంతలో వ్యాపారా లావాదేవీలు జరుపుతున్నాం. – చంద్రశేఖర్, వ్యాపారి, మహారాష్ట్ర(నాగపూర్) గిట్టుబాటు ధర కల్పించాలి.. మామిడి రైతుల వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం నేరుగా పరిశీలించి వారిని ఆదుకునేలా చర్యలు చేపట్టాలి. రెండేళ్లుగా మామిడి రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. గిట్టుబాటు ధర కాదు కదా కనీసం పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. ఈ ఏడాదైనా ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకుని పుణ్యం కట్టుకోవాలి. – పురుషోత్తం నాయుడు, రైతు, పూతలపట్టు మండలంరోడ్ల పక్కన పారపోసిన నాణ్యతలేని మామిడి కాయలు పాకాల: మామిడి మార్కెట్ రైతులకు నష్టాల రుచి చూపిస్తోంది. లాభాల మాట దేవుడెరుగు.. కనీసం పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది మామిడి పూర్తి స్థాయిలో కోతకు రాక మునుపే ధరలు లేక రోడ్లపై పారబోయాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లు మామిడి రైతులకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, కనీసం ఈ ఏడాదైనా లాభాలు రాకపోతాయా?.. అప్పులు తీర్చి కాస్త ఉపశమనం పొందుదామనుకున్న రైతులకు మళ్లీ నిరాశే మిగిలింది. మామిడికి మార్కెట్లో సరైన ధరలు లేకపోవడంతో మరింతగా అప్పుల్లోకి కూరుకుపోయే పరిస్థితి దాపరించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కలుగు చేసుకుని, మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. దక్కని గిట్టుబాటు ప్రస్తుతం రైతులు 4 టన్నుల కాయలు విక్రయించాలంటే కూలీలు, రవాణాతో కలిపి ఖర్చు రూ.10 వేలు అవుతోంది. దీంతో పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా గాలివానలకు భయపడి పంటను ముందుగానే కోయడం, నాణ్యత లేని కాయలను మార్కెట్ తరలించడంతో కూడా రైతులు నష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు. ఇలా పక్వానికి రాకుండా తొందరపడి కోసిన కాయలను రైతులు రోడ్ల పాలు చేయాల్సి వస్తోంది. దామలచెరువు మామిడి మార్కెట్లో నాణ్యమైన తోతాపురి టన్ను రూ.10 వేల నుంచి 16 వేలు, బేనిషా రూ.17వేల నుంచి రూ.25 వేలు, మల్లిక రూ.15 వేల నుంచి రూ.25 వేలు, పుల్లూరు రూ.8 వేల నుంచి రూ.16వేలు, ఖాదర్ రూ.20వేల నుంచి రూ.27వేలకు విక్రయిస్తున్నారు. నాటు కాయలకు గిరాకీ లేకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మార్కెట్ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదని, అన్ని రకాల కాయలు మార్కెట్లోకి రాలేదని వ్యాపారస్తులు, మండీల యజమానులు తెలిపారు. -
ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం
విజయవాడ: ఏపీలో ఒకవైపు తీవ్రమైన ఎండలు.. మరొకవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండతో కాసింత ఉపశమనం పొందామనుకునే లోపే పిడుగులతో కూడిన వర్ష బీభత్సంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ రోజు(మంగళవారం, మే 26వ తేదీ) చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. మండల పరిధిలోని కారుమంచివారి కండ్రిగ గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతిచెందాడు. - గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడు కారుమంచి వారు కండ్రిగ గ్రామానికి చెందిన తోప్పని యశ్వంత్(22) గా గుర్తింంచారు. అదేవిధంగా పట్టణంలోని ఎల్ ఏ సాగరం గిరిజన కాలనీలోని పాఠశాల ఆవరణంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు పడి ఆ చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అయితే సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 98,058 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 49,234 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.09 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించ బోరని స్పష్టం చేసింది. పోలీస్ గ్రీవెన్స్కు 85 అర్జీలు తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీ లు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు తిరుపతి అర్బన్: అభివృద్ధి పనుల్లో జాప్యం చేయవద్దని, గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గోవిందరావుతో కలసి పలు కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుడా పరిధిలో చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని చెప్పారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ పనులు, వీధిదీపాలు తదితర సదుపాయాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. అలాగే పారిశ్రామికాభివృద్ధికి అవసరం అయిన భూసేకరణ పారదర్శకంగా ఉండాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి నిత్యం కృషి చేయాలని డీఎంఅండ్ హెచ్ఓకు స్పష్టం చేశారు. దరఖాస్తుల ఆహ్వానం చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరంలో రెండేళ్ల డిప్లొ మా ఇన్ యానిమల్ హస్బండ్రీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ వీసీ వినోద్ ఓ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. మంగళవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఆసక్తిగల విద్యార్థు లు www.rvvu.edu.in వెబ్సైట్ ద్వారా దరఖా స్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
కరాటే జాతీయస్థాయి ఎంపిక పోటీలు
సత్యవేడు: మండల కేంద్రంలోని వైదేహి కళ్యాణ వేదికలో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి కరాటే ఎంపిక పోటీలకు 400 మంది హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఎంపిక పోటీల్లో కటా, కుముతీ విభాగాలకు ఆంఽఽధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి కటా పోటీల్లో 250 మంది, కుముతే పోటీల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలకు జీఎం భువనేశ్వర్, జే.సూర్య, జగదీష్, టి సూర్య, పురుషోత్తం కాబిన్, హరి ఆర్గనైజర్లుగా వ్యవహరించారు. 30 మంది మాస్టర్లు ఈ పోటీలను పర్యవేక్షించారు. సత్యవేడు నుంచి 40 మంది క్రీడాకారులు పాల్గొనగా 35 మంది ప్రథమస్థానం, ముగ్గురు ద్వితీయ స్థానం, ముగ్గురు తృతీయస్థానంలో నిలిచారు. చంద్రశేఖర్ నాయుడు(తిరుపతి), రత్నాకర్(తిరుపతి), నందా(కుప్పం), ప్రతాప్(కుప్పం), ఆఖిల్(హైదరాబాద్), పందామన్(తమిళనాడు) సతీస్(ఆంధ్రా) విజేతలుగా ఎంపిక చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన విల్సన్ రాబర్ట్ మిల్లర్, బాలాజీ, రాజశేఖర్, మాజీ సర్పంచ్ మంజులా రమేష్, విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. -
స్పోర్ట్స్ కోటాలో రూ.50 కోట్ల అక్రమ సంపాదన..?
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కూటమి పాలనలో నిర్వహించిన మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగ నియామకాల్లో శాప్ చైర్మన్ రవినాయుడు సుమారు రూ.50 కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇమ్రాన్ బాషా ఆరోపించారు. యూనివర్సిటీలో టీ తాగడానికి టికానా లేని ఆయన నేడు రూ.కోట్ల ఆస్తులకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు. సోమవా రం సాయంత్రం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం క్రీడా విధానాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ ఇందులో భాగంగా 3 శాతం స్పోర్ట్స్ కోటా కింద మెగా డీఎస్సీలో 421 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారన్నారు. స్పోర్ట్స్ కోటాను దుర్వినియోగం చేస్తూ డీఎస్సీ నియామకాల్లో ఒక్కొక్క పోస్టుకు సుమారు రూ.15 లక్షల చొప్పున 300 మంది అనర్హులకు కట్టబెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి బేరసారాల మాటల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని గుర్తుచేశారు. అక్రమ వసూళ్ల దందాను సంబంధింత శాఖ ముఖ్య అధికారి నడిపించాడనే ప్రచారం ఉందన్నారు. ఈ వ్యవహారాలపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా సీఎం చంద్రబాబు ఏమాత్రం స్పందించక పోవడం సందేహాలకు తావిస్తోందన్నారు. నగర యువజన విభాగం అధ్యక్షుడు లక్కాకుల దినేష్ రాయల్ మాట్లాడుతూ చంద్రగిరి ప్రాంతానికి చెందిన రవినాయుడు తిరుపతిలో పెత్తనం సాగిస్తూ తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుల మధ్య చీలికలు తెస్తున్నారని ఆరోపించారు. యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు మోహన్ రాజ్ మాట్లాడుతూ తిరుపతిలో భూకబ్జాలకు పాల్పడుతూ అక్రమ దందాలకు పాల్పడుతున్న రవినాయుడిని నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు తలారీ జీవన్, శరత్యాదవ్, వెంకటకిరణ్, భరత్, రోహిత్ ఆచారి పాల్గొన్నారు. -
కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27కు ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద ప్రాఽతిపదికన భర్తీ చేయడానికి ఈ నెల 27 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. దరఖాస్తు గడువు జూన్ 5వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని చెప్పారు. జూన్ 9న సర్టిఫికెట్ల పరిశీలన, జూన్ 16న మెరిట్ జాబితా విడుదల, జూన్ 18న నియామక ఉత్తర్వులు, జూన్ 20 విధుల్లో చేరిక ఉంటుందన్నారు. కేజీబీవీఆర్ఈసీఆర్యుఐటీఎంఈఎన్టీ .ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆసక్తి ఉన్న బీఈడీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. కనిష వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 45 ఏళ్లుగా వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు మరో ఐదేళ్లు వయస్సు(50) సడలింపు ఉందని పేర్కొన్నారు. దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు అర్హులుగా చెప్పారు. ప్రతి అభ్యర్థి రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అయితే పీఈటీ, కొన్ని వృత్తి విద్యా పోస్టులకు టెట్ అవసరం లేదని తెలిపారు. జిల్లాలో 9 కేజీబీవీల్లోను 13 పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. వడదెబ్బకు వృద్ధురాలి మృతి నాగలాపురం: పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో వడదెబ్బ కారణంగా కృష్ణమ్మ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు కథనం మేరకు.. నీరువాయి గ్రామానికి చెందిన కృష్ణమ్మ (74) ఆదివారం ఎండ తీవ్రత తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందించి, ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికి మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. విద్యుత్శాఖ జూనియర్ లైన్మన్ మృతి వరదయ్యపాళెం: మండలంలోని కాంబాకం సచివాలయ పరిధిలో జూనియర్ లైన్మన్గా విధులు నిర్వహిస్తున్న ఏ.రాజశేఖర్ (26) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బీజీఆర్కాలనీ సమీపంలో విద్యుత్ లైన్ పాడైపోవడంతో దాన్ని మరమ్మతు చేస్తేందుకు విద్యుత్ స్తంభం ఎక్కిన రాజశేఖర్ విద్యుత్ షాక్కు గురై, కింద పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు, విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రాజశేఖర్ను చికిత్స నిమిత్తం సత్యవేడుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. -
ప్రత్యేక సవరణపై అప్రమత్తత అవసరం
– ఎంపీ గురుమూర్తి తిరుపతి మంగళం : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అప్రమత్తంగా ఉండాలని సత్యవేడు నియోజకవర్గ నాయకులకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. తిరుపతిలోని ఎంపీ కార్యాలయంలో సోమవారం వైఎస్సార్ సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్తోపాటు పార్టీ నాయకులు ఎంపీ గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి బూత్ పరిధిలో బీఎల్ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు, ఎలాంటి అక్రమ తొలగింపులు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి నాయకులు ఇప్పటికే వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, ఫారం దాఖలు, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన తదితర అంశాలపై ఎంపీ గురుమూర్తి వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాలని, ప్రజలకు ఎస్ఐఆర్పై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యేకంగా యువ ఓటర్లు, మహిళలు, వృద్ధుల పేర్లు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీ గురుమూర్తి కోరారు. -
అంతర్జిల్లా ముఠా అరెస్టు
తిరుపతి క్రైం : ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాల్సిన ముగ్గురు యువకులు దు రలవాట్లు, ఈజీ మనీ ఆశతో చైన్ స్నాచర్లుగా మా రిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. తిరుపతి జిల్లాతోపాటు నెల్లూరు, కావలి, గూడూరు ప్రాంతాల్లో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను తిరుపతి సీసీఎస్, వెస్ట్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్స్)ఆర్ల శ్రీనివాసులు ఆదివారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. తిరుపతిలో పెరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.రామకృష్ణ, క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మే 25 ఉదయం అలిపిరి–చెర్లోపల్లి రోడ్డులోని సైనన్స్ సెంటర్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు చైన్ స్నాచింగ్ కేసుల్లో వారి ప్రమేయం బయటపడింది. దీంతో శీలం నాగార్జున రెడ్డి (28), నల్లగొండ వెంకట మురళి (26), లింగాలదిన్నే విష్ణువర్ధన్ రెడ్డి (28)ని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బెంగళూరులో అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేయగా, మరొకరు బీకాం కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్, ఇంకొకరు బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదివి బెంగళూరులోని ప్రముఖ సంస్థలో సిస్టమ్ ఇంజినీర్గా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. వీరు ఉన్నత చదువులు చదివిన్నప్పటికీ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, విలాసవంతమైన జీవనశైలి తదితర దురలవాట్లకు బానిసలై ఉద్యోగాలు కోల్పోవడంతో డబ్బు సంపాదించాలనే ఆశతో చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది చైన్ స్నాచింగ్ కేసులకు పాల్పడినట్లు వారు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువ చేసే సుమారు 130 గ్రాముల, బంగారు ఆభరణాలు, యమహా ఎఫ్ జెడ్ మోటార్ సైకిల్, హోండా ఆక్టివా స్కూటీ, మొబైల్ ఫోన్లు, హెల్మెట్లు, క్యాపులు, మాస్కులు స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీ ఎం. భక్తవత్సలం నేతృత్వంలోని తిరుపతి వెస్ట్, క్రైమ్ పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించి, రివార్డులు ప్రకటించారు. -
రైల్వే పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం
సూళ్లూరుపేట రూరల్: స్థానిక రైల్వేస్టేషన్ పరిధిలోని కేఎం నంబర్ 81–2–4 పోస్టు సమీపంలోని ఆర్ఎస్ ఆరోగ్య కేంద్రం వద్ద 54 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని సోమవారం రైల్వే పోలీసులు గుర్తించారు. జీఆర్పీఎఫ్ హెచ్సీ రమేష్ కథనం మేరకు.. గుర్తుతెలియని వ్యక్తి రైల్వే పట్టాలపై అపస్మారస్థితిలో పడి ఉన్నాడు. రైల్వే పోలీసులు వెంటనే గుర్తించి సూళ్లూరుపేట స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రైల్వే పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి తొట్టంబేడు: మండలంలోని శివనాథపురం గ్రామానికి చెందిన రమేష్ (35) అనే వ్యక్తి సోమవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. గ్రామం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న రమేష్ను 108 వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మద్యం అధికంగా తీసుకున్నాడని వైద్యం చేసి పంపించేశారు. తెల్లవారే సరికి రమేష్ మృతి చెందాడు. మృతిపై అనుమానాలు ఉనానయంటూ భార్య అర్చన ఫిర్యాదు మేరకు తొట్టంబేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
లంచాల చంద్రం.. శనక్కాయల దొంగ!
ప్రతి అర్జీని పరిశీలించండితిరుపతి అర్బన్: ప్రతి అర్జీని అధికారులు నిశితంగా పరిశీలించి, సంబంధిత సమస్యను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జేసీతోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, శివశంకర్ నాయక్, భరత్ నాయక్ 423 అర్జీలను అందుకున్నారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై 246 అర్జీలు, పింఛన్ల కోసం 24 అర్జీలను స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ ప్రతి అర్జీలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే అర్జీదారుడికి సమాచారం స్పష్టంగా చెప్పాలన్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని చెప్పారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి దేశసమైక్యత సమగ్రతకు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జమాత్ ఏ ముస్లిమిన్ నేతలు కోరారు. ఆ మేరకు సోమవారం కలెక్టరేట్లో డీఆర్వో నరసింహులుకు వినతి పత్రం అందజేశారు. జమాత్ ఏ ముస్లిమిన్ నేతలు రఫీతోపాటు పలువురు పాల్గొన్నారు. మా కుటుంబాలను ఆదుకోండి సార్ పెనగలూరు మండలం వెలగచెర్ల చెరువుకట్ట వద్ద జరి గిన రోడ్డు ప్రమాదంలో మరణించిన పెంచలయ్య, వెంకటయ్య కుటుంబాలతోపాటు గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కూలీలు సోమవారం అధికారులకు వినతిపత్రం అందజేశారు. స్నేహితుడి జేబు కొట్టేసిన చంద్రబాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి: విద్యార్థి దశ నుంచే చోరీలు చేయడం, మాయమాటలు చెప్పడం అలవాటైన చంద్రబాబు గొప్ప ప్రజా నాయకుడని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. తిరుపతిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి చంద్రబాబు నీతిమాలిన చేష్టలను భూమన తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తాను దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టు చంద్రబాబు నీతులు చెబుతున్నాడు. కానీ ఆయన గతం తెలిసిన వారు ఛీ కొట్టకుండా ఉండలేరు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్ వంశీ, పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఇరగం అనిల్ రెడ్డి, పార్టీ నాయకుడు అరుణ్ యాదవ్ పాల్గొన్నారు. -
ఆర్డీఓ కార్యాలయం ఎదుట శెట్టిపల్లి భూ బాధితుల ధర్నా
దళితుల నిరసన తమ అనుభవంలోని భూమికి మరొకరికి పట్టా లు ఇచ్చారని, వాటిని రద్దు చేసి తమకు ఇవ్వాల ని ఎస్టీ కాలనీ దళితులు కోరారు.●తిరుపతి రూరల్: శెట్టిపల్లి పరిసరాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారందరికీ న్యాయం చేస్తామని గత ప్రభుత్వంలో అధికారులు జీ.ఓ 173ని తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడు న్యాయం చేయకపోవడంతో బాధితులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆకస్మికంగా వంద మందికిపైగా బాధితులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు అక్కడకు చేరుకుని కార్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం నేత వందవాసి నాగరాజు మాట్లాడుతూ శెట్టిపల్లి వద్ద స్థలాలు కొన్న వారందరికీ న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఇకపై తిరుపతి వచ్చే సీఎం, మంత్రుల పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తామని హెచ్చరించారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ రామమోహన్ అందుబాటులో లేనందున ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి ఝాన్సీకి వినతిపత్రం అందజేశారు. నోటిఫికేషన్లో పేరున్నా కుదరదంటున్నారు! శెట్టిపల్లి రైతులకు న్యాయం చేసేటపుడు అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరికీ న్యాయం చేస్తామని, అందరికీ ఎలా ప్లాట్లు కేటాయింపులు జరుగుతాయో.. మీకు కూడా అలాగే చేస్తామని అప్పటి అధికారులు మాట ఇచ్చారు. గత ప్రభుత్వం మా అందరి పేర్లును నోటిఫికేషన్లో పొందు పరచి మాకు ధైర్యం కలిగించింది. ఈ ప్రభుత్వంలో అంతా అయిపోయిందని చెప్పి మీకు సాయం చేయడం కుదరదంటున్నారు. ఇదెక్కడి న్యాయం. –మస్తానయ్య, బాధితుడు పుస్తెలు అమ్ముకుని ప్లాటు కొన్నా.. కూలి పనులు చేసుకుని బతుకుతున్న నాకు 2006లో అక్కడ తక్కువ ధరకు ప్లాటు వస్తుందంటే ఆశపడి మెడలోని పుస్తెలు అమ్ముకుని కొనుగోలు చేశా. ఆ ప్లాటు రిజిస్ట్రేషన్ సమయంలో కూడా డబ్బులు చాలకుంటే ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి చేసుకున్నా. ఇప్పుడు మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ తప్పు అంటున్నారు. అలాంటప్పుడు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మాలాంటి పేదల కడుపుల్లో మంట రగల్చిన అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. – కుసుమకుమారి, బాధితురాలు -
అంకితభావంతో పనిచేయాలి
కేవీబీపురం: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. విద్యాశా ఖ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఎంఈఓలు లక్ష్మీపతి, రవికుమార్ మండల కేంద్రంలో, అలాగే రాగిగుంటలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూ లం హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన అంజూరు పాలెం ఏ.ధనుష్ (578), రెండో స్థానం మంజూరు పి. సూర్య (574), మూడో స్థానం రాగిగుంట కె. భవ్య శ్రీ (573) సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే ఆదిమూలం సత్కరించి, జ్ఞాపిక, రూ. 5వేలు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే మండలంలో 500 మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు జ్ఞాపిక అందజేసి, సత్కరించారు. అనంతరం బడి పిలుస్తోంది ప్రచార రథాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం, డీఈఓ కుమార్లు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీహరి యాదవ్, రమేష్, బాలాజీ, అయ్యప్ప, జనార్ధన్, ఆర్ముగం, శివరావు, ఎంపీడీఓ మాలతి, ఏఎస్ఓ పార్థసారథి, సత్యవేడు ఎంఈఓ రవి పాల్గొన్నారు. -
చిట్టత్తూరు చెరువు దున్నేశారు!
తొట్టంబేడు: చిట్టత్తూరు రెవెన్యూ లెక్కల దాకాల, సర్వే నంబర్ 41, 42, చిన్న చెరువు పెద్ద చెరువు ఉన్నాయి. ఈ చెరువులు తెలుగు గంగ కాలవ ఆనుకుని ఉండడంతో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ఈ విషయం గుర్తించిన కబ్జాదారులు చెరువును ఆక్రమించుకుని, దున్నేసి సాగు చేస్తున్నారు. మా చెరువుని కాపాడండి అని గత ప్రభుత్వం హయాంలో ఒక దినపత్రిక వార్త రాయడంతో అప్పటి అధికారులు వెంటనే స్పందించి, చెరువు భూముల్లో ఎవరు దిగకూడని జేసీబీతో పెద్ద కాలువ తీయించారు. కబ్జాదారులు సుమారు 25 ఎకరాలు చెరువును మళ్లీ ఆక్రమించుకుని పంటలు పండించే వారు. ఇది తప్పు అని గత ప్రభుత్వంలో చిట్టత్తూరు గ్రామ ప్రజలు అప్పటి అధికారులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన అధికారులు చిట్టతూరు చెరువు భూమిని సర్వే చేయించి, హద్దులను ఏర్పాటు చేసి, పెద్ద కాలువ తవ్వించారు. అప్పటి నుంచి ఆ భూముల్లోకి ఎవరు దిగకుండా ఉన్నారు. మళ్లీ మొదట కొచ్చిన భూ కబ్జా వ్యవహారం ఆయకట్టదారుడే అందరినీ ఉసిగొలిపి చెరువును దున్నేయండని సలహా ఇచ్చి చెరువును దున్నేశారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. అయితే మామూళ్ల మత్తుకు అలవాటపడిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చిట్టత్తూరు చెరువు ఆక్రమణలను అడ్డుకుంటారా? అసలు చేరువే లేకుండా చేస్తారా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్షలు
తిరుపతి అర్బన్ : యూపీఎస్సీ పరీక్షలను ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి తిరుపతిలోని పద్మావతి బాలికోన్నత పాఠశాల, పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సజావుగా పరీక్షలు నిర్వహించిన అధికారులను అభినందించారు. ఉదయం పరీక్షకు 64.01 శాతం, సాయంత్రం సెషన్కు 63.11 శాతం హజరైనట్లు వెల్లడించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరిశీలకుడు శేషగిరిబాబు, డీఆర్ఓ నరసింహులు పాల్గొన్నారు. -
2 నుంచి 8 వరకు ‘సీసీఎల్’
తిరుపతి ఎడ్యుకేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) ఆధ్వర్యంలో జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు కార్పొరేట్ క్రికెట్ లీగ్ (సీసీఎల్) పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం ఈ మేరకు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బిడ్డింగ్ ద్వారా జట్ల ఎంపిక చేపట్టారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పర్యవేక్షణలో ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం ఏసీఏ సంయుక్త కార్యదర్శి విజయ్కుమార్ మాట్లాడుతూ ఐపీఎల్, ఏపీఎల్ తరహాలో టర్ఫ్ పిచ్లపై పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సమయాభావం కారణంగా కేవలం 8 జట్లతో తొలిసారిగా ఈ పోటీలను నిర్వహించనున్నట్లు వివరించారు. అయితే ఈ పోటీలకు నగరంలో విశేష స్పందన వచ్చిందని, మొత్తం 22జట్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. కానీ, బిడ్డింగ్ ద్వారా 8జట్లను మాత్రమే ఎంపిక చేశామన్నారు. తిరుపతి గొల్లవానిగుంటలోని క్రికెట్ మైదానంలో జూన్ 2నుంచి 8వ తేదీ వరకు ప్రతి రోజు రెండు మ్యాచ్లను లైవ్ ద్వారా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విన్నర్స్కు రూ.లక్ష, రన్నర్స్కు రూ.50వేల బహుమతి అందించనున్నట్లు వివరించారు. సమావేశంలో సీడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసమూర్తి, సతీష్యాదవ్, కోశాధికారి శివప్రసాద్, ఉపాధ్యక్షులు శ్రీధర్కుమార్, రవి, సభ్యులు సత్యశ్రీనివాస్, రమణ, మార్కండేయులు, అంపైర్ కమిటీ సభ్యులు సుదర్శన్, రామకృష్ణ, ఉదయ్కుమార్, జీవన్, ప్రసాద్ పాల్గొన్నారు. ఎంపికై న జట్లు తిరుపతి హోటల్స్, రమణ లాజిస్టిక్స్, జీవీఎస్సీఎస్ (టీచర్స్), జర్నలిస్టులు (జేశాప్), సీపీఎస్ ఉద్యోగుల సంఘం, జేఎస్ఈఈ సొల్యూషన్స్ తిరుపతి వార్డు సచివాలయ సంఘం జాతీయ సంస్కృత విద్యాపీఠం -
నేత..మేత!
కలువాయి(సైదాపురం): కొందరు భూ ఆక్రమణదారులు దర్జాగా మేతపోరంబోకు భూమి ఆక్రమించి నిమ్మ మొక్కలు నాటిన ఘటన కలువాయి మండలం, తిరుమలపాడులో చోటుచేసుకుంది. వివరాలు.. తిరుమలపాడు, కేశమనేనిపల్లి గ్రామాల్లో 438 సర్వే నంబర్లో 630 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిని కొందరు కూటమి నేతలు ఆక్రమించుకొని నిమ్మ మొక్కలు సాగుచేశారు. మరికొందరు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. పొలం కొన్న వారు నిమ్మ మొక్కలు నాటుతున్నారు. బోర్లు వేసి తిరుమలపాడు గ్రామం నుంచి అక్రమంగా కరెంట్ తీసుకొని ఉపయోగిస్తున్నారు. త్రీ ఫేజ్ కరెంటు వైర్లు దారి వెంబడి మూడు కిలోమీటర్లు మేర రోడ్డుపైనే పరిచారు. ఎటువంటి అనుమతులు లేకుండా కరెంట్ చౌర్యం చేస్తున్నా విద్యుత్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మరి కొందరు డ్రిప్ను ఉపయోగించి నిమ్మ మొక్కలు సాగుచేస్తున్నారు. ప్రభుత్వం భూమితోపాటు ఫారెస్టు భూమి కూడా వదలకుండా ఆక్రమించేస్తున్నారు. అడివిలో చెట్లను నరికి పొలాల చుట్టూ కంచె వేసుకుంటున్నారు. వీటితోపాటు అటవీ జంతువుల కోసం పొలం వద్ద కరెంట్ తీగలను ఏర్పాటు చేసి వేటాడుతున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఆక్రమణదారుల చెర నుంచి మేత పోరంబోకు భూమిని విడిపించి, నిరుపేదలకు ఇవ్వాలని కేశమనేనిపల్లి, తిరుమలపాడు గ్రామాల నిరుపేదలు కోరుతున్నారు. కలువాయి మండలంలో మేత పోరంబోకు భూమి ఆక్రమణ -
టీటీడీకి రూ.20 లక్షల విరాళం
తిరుమల : టీటీడీకి ఆదివారం గుంటూరుకు చెందిన ఇద్దరు భక్తులు వేర్వేరుగా రూ.20లక్షల విరాళాలను అందించారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు మాదాల శేషగిరిరావు రూ.10,01,116, వడ్లమూడి మిత్రేష్ అనే భక్తుడు ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,111 విరాళంగా అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో డిప్యూటీ ఈఓ లోకనాథానికి డీడీలను అందించారు. టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. ఆర్సీడీఎస్ జిల్లా అధ్యక్షుడిగా మనోజ్కుమార్రెడ్డి నాయుడుపేట టౌన్ : రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా కె.మనోజ్కుమార్రెడ్డి నియమితులయ్యారు. ఆదివారం ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆర్సీడీఎస్ రాష్త్ర అధ్యక్షుడు యర్రపురెడ్డి సురేంద్రరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి సామాజికవర్గం ఐక్యత, ఆత్మీయత, సేవే లక్ష్యంగా కృషిచేస్తానని వెల్లడించారు. నేటి నుంచి ‘పది’ సప్లిమెంటరీ తిరుపతి కల్చరల్ : పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలను సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎస్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జూన్ 2వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈనెల 28వ తేదీ నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్షను బక్రీద్ పండుగ కారణంగా జూన్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించారు. విద్యార్థులకు ఏదైనా సమస్య తలెత్తితే 7842641323 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. నేడు ‘డయల్ యువర్ సీఎండీ’ తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నారు. ఆదివారం ఈ మేరకు సీఎండీ కార్యాలయం అధికారులు మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకు రావచ్చని, ఫోన్ చేసిన సమయంలో సర్వీసు నంబరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సర్కిల్ స్థాయిలో సైతం.. వినియోగదారులు సర్కిల్ స్థాయిలో సైతం డయల్ యువర్ ఎస్ఈకి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు తిరుపతి వినియోగదారులు 8712652679 నంబర్కు, చిత్తూరు: 7993147979, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: 08612320427, అన్నమయ్య: 9440817449, వైఎస్సార్ కడప: 08562242457, కర్నూలు: 7382614308, నంద్యాల: 7382618976, అనంతపురం: 9154790350, శ్రీసత్యసాయి: 9963707847 ఫోన్ చేయాలని వివరించారు. సాహితీ శిఖరం ‘ఏటుకూరి’ తిరుపతి కల్చరల్: అరసం పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సాహితీ శిఖరం ఏటుకూరి ప్రసాద్ అని, ఆయన హఠాన్మరణం తీరని లోటని పలువురు వక్తలు తెలిపారు. ఆదివారం అరసం సభల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి ఏటుకూరి ప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మహాసభలు జరుగుతున్న తరుణంలో ఏటుకూరి తుది శ్వాస విడవడం బాధాకరమన్నారు. ఏటుకూరి జీవితం పరిపూర్ణమైందని, సమాజ శ్రేయస్సు కోసం నిత్యం పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి, వల్లూరు శివప్రసాద్, నేతలు సాకం నాగరాజు, యువశ్రీ మురళి, గంటా మోహన్, కిట్టన్న, సీపీఐ జాతీయ నేత నారాయణ, హరినాథరెడ్డి, ఆనంద్, సంజీవమ్మ, సుశీలమ్మ, కుసుమకుమారి పాల్గొన్నారు. -
గత వైఎస్సార్సీపీ హయాంలో 145 గోదాముల నిర్మాణానికి శ్రీకారం
● నిధులు లేవని పనులు నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ● సర్కారు నిర్లక్ష్యంతో అప్పటికే పూర్తి చేసినవి సైతం నిరుపయోగం ● పంటలను నిల్వ చేసుకునేందుకు ఇబ్బందిపడుతున్న రైతాంగం నిల్వకు తప్పని ఇక్కట్లు జిల్లావ్యాప్తంగా రైతులు రబీ, ఖరీఫ్ సీజన్లలో ఏటా 5.5 లక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నారు. అందులో సొంత వాడకం 1.5 లక్షల టన్నులు మినహాయిస్తే మిగిలిన 4 లక్షల టన్నులను విక్రయిస్తున్నారు. ఆ మేరకు గోదాములు నిర్మించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. అయితే కొత్త గోదాము నిర్మాణ పనులను చంద్రబాబు సర్కార్ అటకెక్కించేసింది. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని 37 గోడౌన్లలో 34,300 టన్నులు, శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ పరిధిలో 5వేల టన్నులు, మల్టీపర్పస్ ద్వారా పూర్తి చేసిన 18 గోదాముల్లో 15వేల టన్నులు, మొత్తంగా 54,300 టన్నులు మాత్రమే నిల్వచేసుకునే సౌకర్యం ఉంది. అయితే ఇందులో సైతం పలు గోడౌన్లు నిరుపయోగంగా ఉండడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుపతి అర్బన్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 145 గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 74వేల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను రైతులు నిల్వలు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వరి, వేరుశనగ, సజ్జ, రాగులు, చిరుధాన్యాలతోపాటు ఇతర పంటలను స్టోర్ చేసుకునేలా మల్టీపర్పస్ గోడౌన్ల నిర్మాణం చేపట్టారు. పంటను నిల్వ చేసుకుని మంచి ధర వచ్చిన తర్వాత రైతులు అమ్ముకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని సంకల్పించారు. ప్రాథామిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నేతృత్వంలో గోదాములను నిర్వహించాలని తలపెట్టారు. 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 3 గోదాములు, 500 మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకునేలా 142 నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఈ మేరకు ఒక్కో గోడౌన్కు రూ.44 లక్షలు మంజూరు చేశారు. ఈ క్రమంలో తొలి దశలో 46 గోదాములు, రెండో దశలో 21, మూడో విడతలో 78 నిర్మించాలని నిర్ణయించారు. అందులో తొలి దశ కింద 28 గోడౌన్లును నిర్మించేశారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మిగిలిన పనులు నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోడౌన్ల ఊసే లేకుండా పోయింది. నిధులు లేవంటూ నిర్లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గోడౌన్ల నిర్మాణానికి నిధులు లేవంటూ నిర్లక్ష్యం వహించింది. గత వైఎస్సార్సీపీ హయాంలో పూర్తి చేసిన 28 గోదాములను సైతం అందుబాటులోకి తీసుకురాకుండా గాలికి వదిలేసింది. అలాగే మిగిలిన గోదాములకు నిధుల కొరతంటూ మంగళం పాడేసింది. స్పందించిన కలెక్టర్ నిర్మాణ పనులు పూర్తయిన గోడౌన్లకు రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం ఆయన స్పందించారు. డీసీఓ నాగవర్ధినికిఆదేశాలు ఇచ్చారు. అవసరాల మేరకు జిల్లా పరిషత్ నిధులు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. -
జారుతారు
వరదయ్యపాళెం: తిరుపతి నుంచి పుత్తూరు, పిచ్చాటూరు, నాగలాపురం, ఊత్తుకోట మీదుగా చైన్నెకి వెళ్లే 716ఏ జాతీయ రహదారి అధ్వానంగా మారిపోయింది. ప్రధానంగా కొప్పేడు దళితవాడ వద్ద రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. మండే ఎండల తాకిడి తారు పూర్తిగా కరిగిపోయి వాహనదారులకు నరకం చూపిస్తోంది. ఇదే పరిస్థితి ఈ మార్గంలో పలుచోట్ల తలెత్తింది. ముద్రపడిపోయి.. కొప్పేడు సమీపంలో రహదారిపై తారు కరిగిపోయింది. జీబ్రా క్రాసింగ్ వద్ద తెల్లటి గీతలు వంకర్లు తిరిగిపోయాయి. భారీ వాహనాల రాకపోకలతో తారు ఊడిపోయి అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు మధ్యలో తారు కరిగి టైర్ల గుర్తులు అలాగే ముద్రపడిపోయాయి. ప్రమాదకరంగా ప్రయాణం ఈ రహదారి తిరుపతి–చైన్నె మధ్య కీలకమైన మార్గం. నిత్యం వందలాది లారీలు, బస్సులు, కార్లు ఈ దారిలో వెళుతుంటాయి. కరిగిన తారుపై ద్విచక్ర వాహనాలు జారిపోతున్నాయి. ఉబ్బిన చోట్ల కార్లు అదుపుతప్పుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు వెల్లడిస్తున్నారు. నాణ్యత లేకపోవడంతోనే.. ప్రతి వేసవిలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని, నాణ్యతలేని మెటీరియల్ వాడడం వల్లే తారు వెంటనే కరిగిపోతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఎన్హెచ్–716ఏపై కొప్పేడు దళితవాడ వద్ద వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు., ఎండ తీవ్రతను తట్టుకునేలా నాణ్యమైన రోడ్డు నిర్మించాలని హైవే అధికారులను డిమాండ్ చేస్తున్నారు. -
పార్టీ విజయం కోసం కలిసి పనిచేద్దాం
కార్వేటినగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరినీ కలుపుకుని పనిచేద్దామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మహా సముద్రం దయాసాగర్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు వల్లివేడు పృథ్వీరెడ్డి, పెనుమూరు మండల నాయకులు ఆదివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డిని తిరుపతిలోని వారి స్వగృహంలో కలిశారు. ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి పనిచేసిన కార్యకర్తలు, నాయకులను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. అదే విధంగా గ్రామ స్థాయిలో నూతనంగా నియామకాలు చేపట్టిన కమిటీ సభ్యులకు స్థానిక ఎన్నికలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండేలా చూడాలని తెలిపారు. కూటమి నాయకుల ఎత్తులను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. -
నిమ్మళం లేక.. నైరాశ్యం!
నిమ్మ రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పడిలేచే ధరలతో దిక్కుతోచని దుస్థితి దాపురించింది. అరకొర దిగుబడి వచ్చినప్పుడు అంతా ఆశాజనకంగా ఉంటోంది. చెట్టు నిండా కాయలు వస్తే మాత్రం రేటు ఒక్కసారిగా తగ్గిపోయి నిరాశే మిగులుతోంది. దీనికితోడు ఈదురుగాలుల కారణంగా పలు తోటల్లో చెట్లు నేలకొరిగాయి. ఇదే అదునుగా విజృంభించిన తెగుళ్లు కాయల నాణ్యతపై ప్రభావం చూపాయి. ఈ క్రమంలోనే ఇటీవల వరకు కేజీ నిమ్మ రూ.200 వరకు పెరిగింది. కోతలు పూర్తి చేసుకుని మార్కెట్కు వచ్చేసరికి కేజీ రూ.20కి పడిపోయింది. సైదాపురం : ప్రస్తుతం మార్కెట్లో నిమ్మ ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈనెల మొదటి వారంలో కేజీ రూ.100 నుంచి రూ.200 వరకు ధర పలికింది. అయితే ప్రస్తుతం రూ.20కి కూడా కొనేవాళ్లు లేకపోవడంతో నిమ్మ రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల పెనుగాలులు వీయడంతో కొన్ని ప్రాంతాల్లో నిమ్మతోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు తెగుళ్లు సైతం నిమ్మ రైతులను నిలువునా ముంచేశాయి. నష్టాల బాటలోనే.. ఈ ఏడాది నిమ్మ రైతులకు నష్టాలు తప్పేలా లేవు. తెగుళ్ల కారణంగా కాయల నాణ్యత దెబ్బతింది. దీంతో వ్యాపారులు కొనేందుకు ముందుకు రావడంలేదు. మార్కెట్కు కాయలను తీసుకెళ్లినా అరకొర రేట్లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా పడిపోయిన నిమ్మ ధరలు -
దిక్కుతోచడం లేదు
కాయలున్న సమయంలో ధరలు లేక నష్టపోతున్నాం. ధరలుంటే అసలు దిగుబడి ఉండదు. ప్రస్తుతం నిమ్మకు తెగుళ్లు సోకాయి. ఈ కాయలను కొనేందుకు ఎవరూ రావడం లేదు. విధి లేక మార్కెట్కు తీసుకెళుతున్నాం. కొందరు కోతల ఖర్చులైనా మిగులుతాయని చెట్లకే కాయలను వదిలేస్తున్నారు. ఈ నెల తొలివారం వరకు ధరలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రేటు చూస్తే కడుపు మండిపోతోంది. కేజీ కాయలను రూ.20కే అడుగుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. – దాయోదర్రాజు, నిమ్మ రైతు, సైదాపురం నష్టపోయాం నిమ్మ చెట్లకు వివిధ రకా ల తెగుళ్లు పట్టాయి. ఇటీవల కురుస్తున్న జల్లులకు నల్లమచ్చల తెగులు సైతం సోకింది. దీంతో 30శాతం పంట పూర్తిగా దెబ్బతింది. మచ్చ లేని కాయలనే ఏరుకుని కొనుగోలు చేస్తున్నారు. ధరలు పుంజుకుంటున్న సమయంలోనే మాకు తెగుళ్ల కారణంగా భారీ నష్టం వచ్చింది. అలాగే ఈదురుగాలులకు చెట్టు పడిపోవడంతో మరింతగా నష్టపోయాం. ఈ ఏడాది పెట్టుబడి సంగతి దేముడెరుగు.. తీసుకున్న అప్పులకు వడ్డీ కూడా కట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి కష్టం పగవాళ్లకి కూడా రాకూడదు. గాలిలో దీపం మాదిరిగా తయారైంది నిమ్మరైతుల దుస్థితి. – శ్రీనివాసులు రాజు, నిమ్మ రైతు, సైదాపురం -
శ్రీవారి సేవలో భారత క్రికెట్ ఫీల్డింగ్ కోచ్
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం భారత క్రికెట్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. నేడు ఏపీఐఐసీ పార్కుకు శంకుస్థాపన డక్కిలి : మండలంలోని సంగనపల్లెలో ఏపీఐఐసీ పార్కుకు సోమవారం విజయవాడ నుంచి ముఖ్యమత్రి చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్కు నిర్మాణానికి 15 ఎకరాలను కేటాయించామన్నారు. ఈ క్రమంలోనే శంకుస్థాపనకు కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాజరుకానున్నట్లు వివరించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్రమోద వరదయ్యపాళెం: వరదయ్యపాళెంకు చెందిన డాక్టర్ మన్నెం మునిప్రమోద ప్రతిష్టాత్మక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో (ఐబీఆర్ ) అచీవర్గా నిలిచి సత్తా చాటారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ రివ్యూస్ (ఐజేఆర్ఏఆర్) వాల్యూమ్ 12, ఇష్యూ 4లో ఆయన రెండు వ్యాసాలు ప్రచురితమయ్యాయి. అందులో ‘సెలెస్టియల్ బాడీ కాన్స్టంట్ ఖగోళ శాస్త్రానికి సంబంధిత పరిశోధన వ్యాసం 2025 అక్టోబర్ సంచికలో రాగా.. ‘మ్యాజిక్ టేబుల్స్’ గణితంలోని ఆసక్తికరమైన అంశంపై రాసిన మరో వ్యాసం అదే ఏడాది డిసెంబర్ సంచికలో ప్రచురితమైంది. ఒకే జర్నల్ వాల్యూమ్లో రెండు వేర్వేరు అంశాలపై వ్యాసాలు ప్రచురించడం అరుదైన ఘనతగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. 2026 ఏప్రిల్ 28న ఈ రికార్డును ఽధ్రువీకరించడంతో శనివారం ఐబీఆర్ అచీవర్’ సర్టిఫికెట్ను అందుకున్నట్టు ప్రమోద తెలిపారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ బిస్వరూప్ రాయ్ చౌదరి సంతకంతో కూడిన ధ్రువపత్రంతో పాటు ఐబీఆర్ మెడల్, బ్యాడ్జ్, గుర్తింపు కార్డు అందజేసినట్టు ఆయన వివరించారు. కాగా, డాక్టర్ ప్రమోద ప్రస్తుతం వరదయ్యపాళెం తహసీల్దారు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యామ్నాయానికి స్వాగతం పలుకుతాం తిరుపతి కల్చరల్: దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ వచ్చి తీరుతుందనే విశ్వాసం తమకు ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ స్పష్టం చేశారు. అది కాక్రోచ్ రూపంలో వచ్చినా, మరో రూపంలో వచ్చినా స్వాగతం పలుకుతున్నామన్నారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడిదారులు రెండు వర్గాలుగా విడిపోయి, వారికి వారే పోటీగా మారారని తెలిపారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాలు నిరూపించాయని వెల్లడించారు. తాజాగా తమిళనాడులో సైతం కొత్తపార్టీని ఎన్నుకున్నారని గుర్తుచేశారు. ప్రత్యామాన్నయ రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనేందుకు వామపక్షక్ష వాదులు, సీపీఐ సిద్ధంగా ఉండాలని కోరుతున్నట్లు పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో కూడా అవినీతికి, అవినీతికి మధ్యే పోటీ ఉందని వెల్లడించారు. అనుమానాస్పదంగా గర్భిణి మృతి పెళ్లకూరు : మండలంలోని దొడ్లవారిమిట్టకు చెందిన ఆటో డ్రైవర్ సీమకోటి ప్రభాకరన్ భార్య భువన (25) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు.. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన ప్రభాకరన్ దంపతులు జీవనోపాధి కోసం దొడ్లవారిమిట్ట గ్రామంలో తమ బంధువులతో కలిసి నివాసం ఉంటున్నారు. వారికి ప్రణవ్, అర్షిక అనే ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం భువన నాలుగు నెలల గర్భిణి. అయితే ముగ్గురు పిల్లలను పోషించే పరిస్థితి లేదని మూడు రోజుల క్రితం గర్భనిరోధక మాత్రలు తెచ్చుకుని మింగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అప్పటి దాకా ఆరోగ్యంగా ఉన్న భువన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయిందంటూ ఇంట్లో ఉన్న అత్త కేకలు వేయడంతో హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్మ చెట్ల తొలగింపుపై ఆవేదన
డక్కిలి: మండలంలోని వెంబులూరులో శనివారం రాత్రి తమ 56 సెంట్ల పట్టా భూమిలోని నిమ్మ చెట్లను అక్రమంగా తొలగించాలని రైతులు పూల వెంకటేశ్వర్లు, పూల కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ తహసీల్దార్ శ్రీనివాసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వాపోయారు. రాజకీయ ఒత్తిడి కారణంగానే అధికారులు తమ పట్టా భూమిలో కాలువ పొరంబోకు కలిసిందని సాకు చూపించి నిమ్మచెట్లను జేసీబీతో తొలగించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అధికారుల వైఖరిపై వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులురెడ్డి, మాధవయ్యపాళెం సొసైటీ మాజీ అధ్యక్షుడు నర్రావుల వేణుగోపాల్నాయుడు మండిపడ్డారు. రాత్రివేళ అక్రమంగా రైతుల భూమిలోకి పోలీసులతో కలిసి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడడం దారుణమన్నారు. రైతులకు కనీసం ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా నిమ్మ చెట్లను తొలగించడం సరికాదని స్పష్టం చేశారు. కాలువ పొరంబోకు భూమి అని అధికారులు గుర్తిస్తే సర్వే చేయించాలని, భూ యజమానులకు నోటీసులు ఇవ్వాలని, రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. -
దందాలకు అడ్డుపడుతున్నాడనే హత్య
వి.కోట: తమ దందాలకు అడ్డుపడుతున్నాడనే విలేకరి జగన్మోహన్రెడ్డిని నిందితులు హత్య చేసినట్టు తేలిందని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. వారు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. విలేకరి జగన్ మోహన్రెడ్డి హత్య కేసు విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని, కొంతమంది వి.కోటలో గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని దందాలు చేస్తున్నట్టు తెలిసిందని తెలిపారు. తప్పుచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విలేకరి హత్యకు తమీమ్ను బీఎస్పీ శ్రీనివాస్ ప్రేరేపించాడన్నారు. బీఎస్పీ శ్రీనివాసులు ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని వివిధ కేసుల్లో పోలీసుల పేర్లు చెప్పి చాలా మంది ప్రజల నుంచి డబ్బు వసూలు చేసినట్టు తేలిందన్నారు. ఎవరైనా గ్యాంగ్గా ఏర్పడి మీడియా సపోర్ట్ ఉందని, ప్రెస్ రిపోర్టర్నని, తాను లీడర్నని బెదిరించి డబ్బులు తీసుకుని ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుల పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. పథకం ప్రకారం.. అన్ని విషయాల్లోనూ విలేకరి జగన్ అడ్డు పడుతున్నాడని, అతన్ని అడ్డు తొలగించుకోవాలని బీఎస్పీ నేత శ్రీనివాస్ హత్యకు పథకం పన్నినట్టు తేలిందన్నారు. అదేవిధంగా ఒక మహిళ మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిపారు. ఆమె భర్త న్యాయం చేయాలని పోలీసు స్టేషన్కు వెళ్లగా బీఎస్పీ శ్రీనివాసులు కలుగజేసుకుని న్యాయం చేస్తానని చెప్పి నమ్మించాడన్నారు. అతని నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశాడన్నారు. అందులో కొంత మొత్తం తీసుకున్నాడని, మిగిలిన మొత్తానికి అగ్రిమెంట్ రాసుకున్నాడని తెలిపారు. అదే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడని, బైరెడ్డిపల్లిలో సహజీవనం సాగించేవాడని గుర్తించామన్నారు. అంతేగాక బంగారు నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9 లక్షలను బీఎస్పీ శ్రీనివాసులు, గణపతి, ముళబాగల్ శివ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో విలేకరి జగన్మోహన్రెడ్డి కలుగజేసుకున్నాడని తెలిపారు. వారి వద్ద తీసుకున్న నగదు తిరిగి ఇచ్చేయాలని హితవుపలికాడన్నారు. దీంతో అన్ని విషయాల్లోనూ తమకు అడ్డుపడుతున్నాడని జగన్మోహన్రెడ్డిపై కక్ష పెంచుకున్నాడని తెలిపారు. అదేవిధంగా గంజాయి, మత ఘర్షణల కేసులు తనపై నమోదు కావడానికి జగన్మోహన్రెడ్డి కారణమయ్యాడని తమీమ్ కక్ష పెంచుకున్నాడన్నారు. ఈ నేపథ్యంలో తమీమ్, బీఎస్పీ శ్రీనివాసులు కలిసి అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నారని తెలిపారు. రెండు సార్లు విఫలమయ్యారని, మూడో సారి హత్య చేశారని తెలిపారు. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మత విద్వేషాలను రగిల్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలు మార్పింగ్ చేసి రాజకీయ విభేదాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నట్టు గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. -
తిరుమలలో పకడ్బందీగా పారిశుద్ధ్యం
తిరుమల: వేసవి సెలవునేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్ధీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో పారిశుద్ధ్య నిర్వహణపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకంగా మరుగుదొడ్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను అమలు చేస్తోంది. అలాగే రోడ్ల పరిశుభ్రత విషయంలో కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. రియల్ టైమ్ రోడ్ స్వీపింగ్, చెత్త సేకరణ, నీటి స్ప్రే వంటి పనులు నిరంతరం కొనసాగిస్తోంది. రోజూ సుమారు 60 టన్నుల నుంచి 75 టన్నుల వరకు చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. ఈ మేరకు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు పరిసరాల పరిశుభ్రతలో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేస్తోంది. గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం శ్రీకాళహస్తి : పట్టణంలోని విజయ రైతు డిపో షాపింగ్ కాంప్లెక్స్ మెట్లపై గుర్తుతెలియని వృద్ధుడి (65) మృతదేహాన్ని గుర్తించిట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై గోధుమ రంగుపై నలుపు గీతల ఫుల్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు డ్రాయర్ ఉందని వెల్లడించారు. ఆనవాళ్లను బట్టి ఎవరైనా గుర్తుపడితే 9440900008, 9154141887 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. చేదబావిని మింగిన ఘనుడు! పలమనేరు: కబ్జాకు ఏదీ అనర్హం కాదని కూటమి నేతలు నిరూపిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములు, వంకలు, వాగులు, చెరువులను సైతం ఆక్రమించుకుంటున్నారు. పలమనేరు మండలం సముద్రపల్లి పంచాయతీ నూనేవారిపల్లిలో దశాబ్దాల క్రితం గ్రామస్తుల దప్పికతీర్చేందుకు బ్రిటీషర్లు కట్టించిన చేదబావిని టీడీపీ యువనేత ఆక్రమించుకుని బావిని పూడ్చేశాడు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. నూనేవారిపల్లెలో బ్రిటీషువారు రాతికట్టడంతో చేదబావిని కట్టించారు. కొన్నాళ్ల క్రితం అది ఎండిపోయింది. ఈ చేదబావిపై టీడీపీ నేత జయచంద్ర కన్ను పడింది. ఇటీవల బావిని పూడ్చేశాడు. రెండు రోజుల క్రితం రాతి స్తంభాలను తొలగించాడు. దాని ఆనవాళ్లు లేకుండా చేసి తన ఇంటి స్థలంలో కలుపుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. -
‘రాహు–కేతు’ పేరిట దోపిడీ
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే రాహు–కేతు పూజల పేరిట భక్తులను కొందరు దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ఆలయ పరిసరలు, సమీపంలోని చిన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తామని రూ.వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. అనంతరం నాగశిలలు, పూజా సామగ్రిని ఎక్కడపడితే అక్కడ వదిలివెళ్లిపోతున్నారని పలువురు మండిపడుతున్నారు. గతంలో భరద్వాజ తీర్థం వద్ద నాగశిలలను వదిలేవారు. అక్కడ భద్రత కట్టుదిట్టం చేయడంతో ప్రస్తుతం ఆలయ సమీప ప్రాంతాల్లో పడేస్తున్నారని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భక్తుల్లో అవగాహన కల్పించడంలో పాలకమండలి, అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆలయ పరిసరాల్లో స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
సామాన్య భక్తులకే ప్రాధాన్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుమలలో సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి తెలిపారు. ఆదివారం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లను జేఈఓ శరత్తో కలిసి పరిశీలించారు. అదనపు ఈఓ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నామన్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో పకడ్బందీగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఆ ప్రాంతాల్లో నాణ్యమైన మౌలిక వసతులు కల్పించామని వెల్లడించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద కొందరు ఆటో డ్రైవర్లపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని, అవసరమైతే ఆటోలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సీవీఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని, టీటీడీ అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, మోసపూరిత చర్యలపై విజిలెన్స్కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం శ్రీనివాసం, విష్ణు నివాసం వద్ద సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించారు. టీటీడీ సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు. -
థల్ సైనిక్ క్యాంప్నకు ఎన్సీసీ కేడెట్లు
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్సీసీ కేడెట్లు థల్ సైనిక్ క్యాంపునకు ఎంపికై నట్టు కల్నల్ నోయిల్ వివేక్ మోనిష్ తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం వార్షిక శిక్షణా శిబిరంలో భాగంగా విద్యార్థులకు లెఫ్టినెంట్ కల్నల్ లోకనాథన్ ఆధ్వర్యంలో ఫైర్, ఫైటింగ్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో చెలరేగే అగ్నిజ్వాలలను ఎలా నివారించాలి, ఇంధన లీకేజీలను ఎలా అరికట్టాలనే అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. తుపాకులతో గురిచూసి కాల్చడం, క్లిష్టమైన అడ్డంకులను అధిగమించే జిగ్ జాగ్ రన్నింగ్పై శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే త్వరలో ఢిల్లీలో నిర్వహించే ప్రతిష్టాత్మక థల్ సైనిక్ క్యాంపునకు కేడెట్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. కేడెట్లలో సాహసం, సైనిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించడమే క్యాంపు ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు ప్రసాద్రెడ్డి, కార్తీక్, బాలాజీ, హేమంత్, అరుణ్ పాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే పులవర్తికి ‘చెప్పు’ చూపించిన మరో కూటమి నేత
తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతలు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానికి జనసేన పార్టీ నేత మురళి రెడ్డి చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడంతో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి వచ్చారు ఎమ్మెల్యే పులవర్తి నాని. ముక్కోటి అగస్తేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇందుమూలిరెడ్డిని కలిసేందుకు వచ్చిన తొండవాడ గ్రామానికి వచ్చారు పులవర్తి నాని. అయితే అంతకుముందు తొండవాడ గ్రామాన్ని శత్రుదేశం పాకిస్థాన్ తో పోల్చడం పై ఎమ్మెల్యే ముందుగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన నేత మురళి రెడ్డి చెప్పు చూపించారు. తమ ఊరిని పాక్తో పోలుస్తావా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. గడచిన ఎన్నికల్లో 566 ఓట్లు మెజారిటీ ఇచ్చిన తొండవాడ గ్రామాన్ని పాకిస్థాన్ తో ఎలా పోల్చుతావు అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే కాలుకున్న చెప్పు తీసి.. సమాధానం చెప్పు అంటూ హెచ్చరించారు. అయితే జనసేన నేత మురళీరెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. -
బీఆర్ నాయడు అరాచకాలపై నా పోరాటం ఆగదు: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అరాచకాలపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత అని అన్నారు. తిరుమలలో జరుగుతున్న అవినీతిని నిలువరిస్తా అని భూమన చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మం ముసుగులో కొందరు నా ఇంటి ముట్టడికి వచ్చారు. ఒబెరాయ్ హోటల్కు స్థలం ఇస్తే సాధవులు ఎందుకు ఖండించలేదు. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత. బీఆర్ నాయుడు నీ బెదిరింపులకు నేను భయపడను. దాడులకు భయపడే వాడిని కాదు.. భయపెట్టేవాడిని. తిరుమలతో జరుగుతున్న అవినీతిని నిలువరిస్తా’ అని తెలిపారు.బీఆర్ నాయుడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారు. బీఆర్ నాయడు అరాచకాలపై నా పోరాటం ఆగదు.సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే నా ఇంటి ముట్టడికి కొంత మంది వచ్చారు. సాధు పరిషత్ అధ్యక్షుడు అయినంత మాత్రాన సాధువులు అయిపోరు. బీఆర్ నాయుడు అక్రమాలను నేను ప్రశ్నిస్తున్నానే కారణంగా నాపై కుట్రలు చేస్తున్నారు. బీఆర్ నాయుడు నీ గుండెల్లో నిద్రపోతా అని హెచ్చరించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే జగత్ గురువులు, జగత్ కిలాడీలు, టీడీపీ కార్యకర్తలు పసుపు వస్త్రాలు విసర్జించి కాషాయం ధరించి నా ఇంటి ముట్టడికి వచ్చారు. టీడీపీ నాయకుడు నారాయణ రావు సన్యాసులు ముసుగులో ఇంటి ముట్టడికి యత్నించారు. 20 టికెట్లను బ్లాక్లో అమ్ముకునే వ్యక్తి అట్లూరి నారాయణ రావు. సన్యాసి ముసుగులో నా ఇంటి ముట్టడికి సిద్ధపడ్డారు. బీఆర్ నాయుడు తొత్తులుగా వాళ్లంతా నా ఇంటిని ముట్టడికి విఫలయత్నం చేశారు. బీఆర్ నాయుడు.. కాషాయం ముసుగులో ఇలాంటి సన్యాసులను నాపైకి పంపిస్తున్నాడు. బీఆర్ నాయుడు కాదు బీఆర్ కాముడు. ఈ దొంగ స్వామీజీలు కాదు నాకు చెప్పాల్సింది. జగద్గురు కంచి స్వామీజీ, కుర్తాళం పీఠాధిపతి, అహోబిలం పీఠాధిపతిలు చెబితే నేను వింటాను’ అని అన్నారు. -
దశరథరామిరెడ్డిపై దాడి దారుణం
● దుండగులను అరెస్ట్ చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ● దశరథరామిరెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శ తిరుపతి కల్చరల్: తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయ చోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ధైర్యం చెబుతూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకుడిపై దాడి జరగడం అత్యంత హేయమన్నారు. రాజకీయ కక్షలతో హింసకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, బాధ్యులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులూ తొందర పడొద్దు తిరుపతి అర్బన్: జిల్లాలోని మామిడి రైతులు తొందరపడి కాయ లు పూర్తి పక్వానికి రాకముందే కోతకు వెళ్లడం ద్వారా నష్టాలు వస్తాయని, పూర్తి పక్వానికి వచ్చాకే కోతకు వెళ్లాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సూచించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వర్చువల్ పద్ధతిలో ఉద్యానశాఖ అధికారులతో మామిడి ధరలపై కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోతాపురి, బేనిషా, ఖాదర్ వంటి టేబుల్ రకాల మామిడికి వాస్తవంగా మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయని ఉద్యానశాఖ అధికారులను ప్రశ్నించారు. రైతులు పూర్తి పక్వానికి వచ్చాకే మామిడి కాయల కోత చేపట్టేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ నెల 25 తర్వాత జిల్లాలోని అన్ని గుజ్జు పరిశ్రమలు ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. అలాగే మామిడి కోతలు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా కోతలు చేపట్టాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 87,689 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 44,476 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.29 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. -
గ్యాస్ ట్యాంకర్లో డ్రైవర్ మృతి
నాగలాపురం: మండలంలోని కారణి సమీపంలో ఉన్న దాబాలో పార్కింగ్ చేసిన గ్యాస్ ట్యాంకర్లో డ్రైవర్ మృతి చెందిన ఘటన శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లో కెళితే అనంతపురం నుండి గుమ్మిడిపూండికి వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ లారీ డ్రైవర్ శుక్రవారం రాత్రి కారణి సమీపంలో ఉన్న దాబాలో పార్కింగ్ చేసి వాహనంలోనే నిద్రపోయాడు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో డ్రైవర్ ఎంత లేపినా స్పందించకపోవడంతో దాబా నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే 108 అంబులెన్సు పిలిపించారు. అంబులెన్స్ సిబ్బంది పరిశీలించగా డ్రైవర్ మద్యం సేవించలేదని, నిద్రలోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీలో ఉన్న డ్రైవింగ్ లైసెన్సు ఆధారంగా మృతుడిని తమిళనాడు నామక్కల్కు చెందిన శరవణన్(53)గా గుర్తించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించినట్లు, అంతవరకు మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచనున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
తిరుపతి పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు.మా కుటుంబాన్ని వీధిపాలు చేశారు నాకు భర్త లేడు. ముగ్గురు బిడ్డలను నేనే పోషించుకుంటున్నాను. ఏడేళ్లుగా బండిపై టిఫిన్ అమ్ముకుంటూ బతుకుతున్నాం. నా కష్టాన్ని చూసి ఉదయం, సాయంత్రం వేళల్లో నా బిడ్డలు నాకు సహాయంగా నిలబడ్డారు. తోపుడు బండిపై టిఫిన్ విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్న నా కుటుంబాన్ని పాలకులు రోడ్డుపాలు చేశారు. రేపటి నుంచి మేము ఎలా బతకాలి. మా పాపం ఊరికే పోదు. దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరు సర్వనాశనం అయిపోతారు. – సునంద, బాధితురాలు బుద్ధి లేక ఓట్లు వేశాం పేదలపై ప్రతాపం చూపిస్తారనేనా? మీకు ఓట్లు వేసింది. బుద్ధి గడ్డి తిని మీకు ఓట్లు వేశాం. అందుకు మా చెప్పుతో మేమే కొట్టుకున్నట్లు అయింది. ఒక పాలకుడైన మాకు అండగా నిలబడ్డాడా. మా ఉసురు తగలకుండా పోదు. తిరుపతందా రోడ్లు, ఫుట్ పాత్ లను అక్రమించి వ్యాపారం చేసుకుంటున్నారు. వాటిని వదిలి మా పైనే పడతారా. మేము ఏ పాపం చేశామని మాకు ఈ శిక్ష వేశారు. – దేవి, బాధితురాలు ఓట్ల కోసం ఏ నా కొడుకు మా ఇళ్లకు రావద్దు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. మాకు అండగా ఉంటారనుకున్న వాళ్లే మమ్మల్ని శత్రువులుగా చూశారు. ఇక ఏ నా కొడుకు ఓట్లు కోసం మా గడప తొక్కద్దు. వస్తే చెప్పులతోనే కొడతాం. పేదల పైనా మీ ప్రతాపం. ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములు తినేస్తున్నారు. అలాంటి వాళ్లను వదిలి పొట్టకూటి కోసం కష్టపడే మా కడుపు కొడతారా. – సుబ్బలక్ష్మమ్మ, బాధితురాలు సర్వనాశనం అయిపోతారు మాపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి, వంట సామగ్రి, తోపుడుబండ్లను ధ్వంసం చేశారు. మా కుటుంబాలను వీధిలోకి లాగారు. యాత్రికులకు, వాహనచోదకులకు మా వల్ల ఎలాంటి ఆటంకం లేదు. తక్కువ ధరలకే మేము మంచి టిఫిన్ అందిస్తున్నాం. వ్యాపారం జరిగితే కానీ పూట గడవని మాలాంటి వాళ్లపై ఈ ప్రభుత్వం దౌర్జన్యం చేయడం సిగ్గుచేటు. నాకు ప్రత్యామ్నాయం చూపించండి. – సంధ్య, బాధితురాలు -
మృత్యువులోనూ వీడని మిత్ర బంధం
నారాయణవనం: వారందరూ కలిసి చదువుకున్నారు.. కలిసే పెరిగారు. కష్టసుఖాల్లో తోడుంటూ స్నేహానికి నిలువుటద్దంగా నిలిచారు. చివరికి మృత్యువు కూడా ఆ స్నేహబంధాన్ని విడదీయలేకపోయింది. విధి స్నేహితుల బంధాన్ని అర్ధంతరంగా ముగించే సింది. మిత్రులిద్దరూ మృత్యుఒడికి చేరడాన్ని తల్లిదండ్రులు, బంధువులు తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శనివారం మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే మృతి చెందగా మరో మిత్రుడు ఉదయ్ కుమార్ తీవ్ర గాయాలతో తిరుపతి రూయాలో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ గిరిబాబు కథనం మేరకు .. గోవిందప్పనాయుడు కండ్రిగకు చెందిన మునికృష్ణయ్య కుమారుడు ఉదయ్కుమార్ (19), ఎస్ యువరాజ్ (17), కే యువరాజ్ (18) ముగ్గురు బాల్యం నుంచి మంచి స్నేహితులు. వీరు ఎక్కడికెళ్లినా కలిసి తిరిగేవారు, చదువుకునే వారు. శనివారం ఉదయ్కుమార్ తన మోటార్ సైకిల్పై ఇద్దరు మిత్రులతో కలిసి మండలంలోని సింగిరికోనకు వెళ్లారు. నారాయణవనం నుంచి పాత సర్వీస్ రోడ్డులో తమ గ్రామానికి మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి బయలుదేరారు. మండలంలోని జాతీయ రహదారిలో బొప్పరాజుపాళెం బస్సు స్టాప్ వద్ద కలుసుకునే క్రమంలో పుత్తూరు నుంచి నాగలాపురం వైపు వెళుతున్న కారు వెనుక నుంచి మోటార్ సైకిల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో తిరుపతి వైపు వెళుతున్న మరో కారు కిందపడిన యువరాజులిద్దరినీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో యువరాజులిద్దరూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఉదయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఉదయ్కుమార్ను చికిత్స నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రూయాకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గిరిబాబు పేర్కొన్నారు. గ్రామంలో విషాద ఛాయలు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా మెలిగిన వారు ఇప్పుడు విగత జీవులవడం గోవిందప్పనాయుడు కండ్రిగలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ బిడ్డలు చావులోనూ ఒకటిగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. -
ఎవరి కోసం ఈ తాపత్రయం
పేదలని కూడా చూడకుండా కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులపై దండెత్తడం వెనుక రాజకీయ ఒత్తిళ్లేనని బాధితులు ఆరోపించారు. సమీపంలో అరకు వ్యాలీ కాఫీ పేరుతో శాప్ చైర్మన్ రవి నాయుడు తన బినామీ పేరుతో పెద్ద కొట్టును నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ 24 గంటలూ కావాల్సినవి దొరుకుతున్నాయి. తన వ్యాపార సామ్రాజ్యానికి చిరు వ్యాపారులు అడ్డుగా ఉన్నారని భావించే తొలగింపునకు అనధికారిక ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఓ వ్యక్తి కోసం తమ కుటుంబాలను రోడ్డుపాలు చేస్తారా? అంటూ బాధితులు బోరున విలపించారు. తమ తోపుడు బండ్లు, మొబైల్ వ్యాన్లు, వంట సామగ్రిని సైతం యంత్రాలతో ధ్వంసం చేశారని మండిపడ్డారు. పేదలపై ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అంటూ నిలదీశారు. అయినా కనికరించని పాలకులు పేదల పక్షాన నిలబడకపోగా పోలీసులు, అధికారులు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేశారు. అనంతరం రోడ్డు పొడవునా గాడి తవ్వించారు. తిరుపతి తుడా: కూటమి ప్రభుత్వం పేదలపై పగ పట్టింది. పేదలపై అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోంది. ఏళ్లపాటు వ్యాపారాలు చేసుకుంటున్న తోపుడుబండ్లు, టిఫిన్ సెంటర్లపై ఉక్కుపాదం మోపింది. ప్రత్యామ్నాయం చూపకుండా బలహీనులను రోడ్డున పడేసింది. తమ కడుపు కొట్టొద్దంటూ వేడుకున్న మహిళలపై కూటమి కనికరం చూపలేదు. యంత్రాలను మహిళలపై ప్రయోగించింది. తొలగింపును అడ్డుకున్న వారిని నిర్ధాక్షిణ్యంగా లాగి పడేసింది. ఈ క్రమంలో ఓ యువతితోపాటు మరో మహిళకు గాయాలయ్యాయి. శ్రీవారి పాదాల చెంత తిరుపతిలోని అలిపిరి వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. చిరువ్యాపారుల అర్తనాదాలు నిత్యం గోవింద నామ స్మరణలతో మారుమోగే శ్రీవారి పాదాలు చెంత అలిపిరిలో చిరు వ్యాపారుల ఆర్తనాదాలు మిన్నంటాయి. అలిపిరి జూ పార్కు రోడ్డులో ఏడెనిమిది ఏళ్లుగా పేదలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. హఠాత్తుగా పోలీసుల సహకారంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ యంత్రాంగం రోడ్డు ఆక్రమణల పేరుతో పేదలపై దండయాత్ర చేసింది. ఫుడ్ వేస్ట్ను రోడ్లపై పారబోయడంతో తరచూ జంతువులు వస్తున్నాయని, రోడ్డును అపరిశుభ్రంగా చేస్తున్నారన్న కారణాలతో జూపార్క్ రోడ్డు లోని చిరు వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటలకే పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఇడ్లీ, దోసె, చట్నీ, సాంబార్లతో వ్యాపారం సాగిస్తున్నారు. వారిని ఖాళీ చేయమని కార్పొరేషన్ సిబ్బంది చెప్పడంతో గంటపాటు చిరు వ్యాపారులకు, సిబ్బందికి వాదోపవాదనలు జరిగాయి. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందేనని హుకుం జారీ చేయడంతో చిరు వ్యాపారులు బాధితులుగా మారారు. ఈ క్రమంలో పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది చిరు వ్యాపారులపై కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఆహారం సైతం పారబోసి తోపుడు బండ్లు, మొబైల్ వ్యాన్లను జేసీబీల సాయంతో ట్రాక్టర్లలో ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు. బాధితులతో కలిసి సీపీఎం నేతలు జేసీబీ, ట్రాక్టర్లకు అడ్డుగా నిలబడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. తమ వ్యాపార సామగ్రిని తరలించకుండా చేసేందుకు చిరు వ్యాపారులు విఫలయత్నం చేశారు. పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది బాధితులను పక్కకు నెట్టి దౌర్జన్యంగా వాటిని తరలించారు. బాధితులు బోరున విలిపించారు. నోరు కొట్టుకుంటూ దేవుడా మాకు దిక్కెవరు.. మా కడుపు కొట్టి మమ్మల్ని రోడ్డుపాలు చేస్తారా? అంటూ బోరున విలపించారు. కూటమినేతలపై భగ్గుమన్నారు. తమ సామగ్రిని తొలగించకుండా అడ్డుపడిన ఓ యువతి చందుకు తీవ్ర గాయం అయ్యింది. జేసీబీ తగలడంతో ఆ యువతి నొప్పిని భరించలేకపోయింది. పక్కనే ఉన్న యువతి తల్లి సైతం బోరున విలిపించారు. ఆ యువతితోపాటు మరో మహిళ చేతికి గాయాలయ్యాయి. ఏమిటీ దౌర్జన్యం? -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
– ఎంపీ గురుమూర్తి తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి తెలిపారు. తిరుపతిలోని ఎంపీ కార్యాలయంలో శనివారం పార్లమెంటు పరిధిలోని పలువురు వివిధ సమస్యలపై ఎంపీని కలిసి వినతులు అందజేశారు. వైఎస్సార్సీపీ పాలనలో తమకు ఎలాంటి సమస్యలు ఉండేవి కావని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలేనని ప్రజలు ఎంపీ వద్ద విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ వారికి హామీ ఇచ్చారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
సూళ్లూరుపేట: తడ మండలం కొండూరు వద్ద అపాచీ కంపెనీకి వెళ్లే క్రాస్రోడ్డు సమీపంలోని గోరింటాకు చెట్ల మధ్యలో సుమారు 55 ఏళ్ల గుర్తు తెలియనివ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఈ విషయం గుర్తించారు. శుక్రవారం ఎండకు వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడని భావించిన స్థానికులు 108 అంబులెన్స్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది అతడిని వెంటనే సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ 22వ తేదీ ఉదయం మృతి చెందాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతని ఊరు, పేరు తెలియలేదు. మృతుడు మెర్యూన్ కలర్, తెలుపు అడ్డగీతలు కలిగిన టీషర్టు, గ్రే కలర్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. కొండూరు వీఆర్వో ఫిర్యాదు మేరకు తడ ఎస్ఐ కొండపనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువెక్కడ చంద్రన్నా?
సాక్షి, టాస్క్ఫోర్స్: దశాబ్దాల కాలంగా అదొక గ్రామ చెరువు... ఆ చెరువు నీరే సుమారు వంద ఎకరాల ఆయకట్టుకు ఆయుపట్టు. అయితే ఆ చెరువు శ్రీకాళహస్తి పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉండడంతో అధికార పార్టీ నాయకుల కన్నుపడింది. 2015లో డీకేటీ పట్టాలను చెరువులో ఇచ్చినట్లు పట్టాలను సృష్టించి వారం రోజులుగా ఏకంగా చెరువునే పూడ్చి, మట్టి తోలి చదును చేసి రియల్ వెంచర్గా మార్చేశారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు అడ్డుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఏర్పేడు మండలం పాగాలి రెవెన్యూ పరిధిలో ఎస్ఈజడ్, అనేక పరిశ్రమలు వెలిశాయి. దీంతో ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పరిశ్రమల ఆనుకుని ఉన్న పాగాలి చిన్న చెరువుపై అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనాయకుడి కన్నుపడింది. సర్వే నం.163–1, 2, 5, 6,7లలో ఎన్.దొరస్వామి పేరుతో మొత్తం 4.5200 ఎకరాలు, సర్వే నంబరు: 163–3,4, 8,9లలో కె.సుబ్రమణ్యం పేరుతో 3.5100 ఎకరాలు డీకేటీ పట్టాలు పొందారు. ఆ పట్టాదారులను అడ్డు పెట్టుకుని చెరువునే కబ్జాకు తెగబడ్డారు. నిజంగా చెరువులో వీరికి డీకేటీ పట్టాలు మంజూరు చేసి ఉంటే పదేళ్లుగా సాగు చేయకుండా ఇప్పుడే ఎందుకు చదును చేసి వెంచర్గా మార్చారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఏర్పేడు తహసీల్దార్ రాజశేఖర్ అక్కడకు చేరుకుని పనులను నిలుపుదల చేశారు. అయితే తమ వద్ద అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయంటూ సదరు నాయకుడు చెరువు మొత్తం చదును చేసి పనులను పూర్తి చేశారు. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. రియల్ వెంచర్గా మారిన పాగాలి చెరువు -
దళిత రైతుల భూములపై టీడీపీ నేతల కన్ను
తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కుర్ర కాలువలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దళిత రైతుల భూములపై టీడీపీ నేతలు కన్నేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుర్ర కాలువ గ్రామంలో దళిత రైతులు సుబ్రహ్మణ్యానికి చెందిన 3.39 ఎకరాల భూమిపై టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. సొంత భూమిలో నీటి బోరు వేసుకుంటుంటే టిడిపి నేత మోహన్ నాయుడు అడ్డుకున్నారు. దౌర్జన్యంగా బోర్వెల్ లారీని వెనక్కు పంపించేశారు. దాంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోయిందని బాధిత సుబ్రహ్మణ్యం ఆరోపించారు. పంటలను కాపాడుకునేందుకు సూత్రాలు తెచ్చి బోరు వేస్తుంటే అడ్డుకున్నారని సుబ్రహ్మణ్యం భార్య ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా
సాక్షి, తిరుపతి: ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు వేస్ట్ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 24 గంటల గడవక ముందే విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫ్యామిలీ పంచాయితీలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కళంకిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి విప్ పదవి తొలగింపుతో సరిపెట్టారు.బాధిత మహిళ ఆరోపణలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఫ్యామిలీ పంచాయితీకి 4 వారాల గడువు ఇచ్చిన పవన్.. చట్టపరమైన చర్యలు లేకుండా సెటిల్ చేసుకోవాలని బాలరాజును ఆదేశించారు. కుటుంబ సభ్యుల నుంచే బాలరాజు వ్యవహార శైలిపై ఆరోపణలు ఉన్నాయి. పవన్ ఫ్యామిలీ సెటిల్మెంట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు విడుదల చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది. ఇప్పటికే అరవ శ్రీధర్కు సంబంధించి పలు వీడియోలు విడుదల చేసిన బాధితురాలు.. తాజాగా మరో కీలక వీడియోను బహిర్గతం చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అరవ శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది. ఆ వీడియోలో ‘చంద్రబాబు వేస్ట్’ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా సంచలనంగా మారింది.


