Tirupati
-
పరిపూర్ణం.. తెప్పోత్సవం
తిరుచానూరు పద్మావతీ దేవి వార్షిక తెప్పోత్సవాలు ఐదోరోజు బుధవారంతో పరిపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు అమ్మవారి మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సిరులతల్లిని పుష్కరిణి మధ్యలోని నీరాడ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం 6.30గంటలకు దివ్యాలంకార శోభితురాలైన శ్రీవారి దేవేరి తెప్పపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి వైభవంగా అమ్మవారికి గరుడసేవ నిర్వహించారు. ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, శ్రీవాణి, ఆలయ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. – చంద్రగిరి -
బస్పాస్ల జారీకి బ్రేక్
– 14 నుంచి పునఃప్రారంభం తిరుపతి అర్బన్ : జిల్లాలో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభముతున్న నేపథ్యంలో బుధవారం ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు బస్ పాస్లు జారీ చేపట్టారు. అయితే కొత్త మోడల్లో పాస్ ఇవ్వాలని నిర్ణయించినందున ప్రక్రియను నిలుపుదల చేసినట్లు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథం వెల్లడించారు. ఈ మేరకు శనివారం నుంచి జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో విద్యార్థులకు బస్పాస్లు జారీ చేయనున్నట్లు వివరించారు. అలాగే కొత్తగా బస్పాస్ తీసుకునేవారు రిజిస్ట్రేషన్ కోసం బస్టాండ్కు వెళ్లలేని పరిస్థితుల్లో ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. వీఆర్కు వెంకటగిరి ఎస్ఐ వెంకటగిరి (సైదాపురం) : వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావును వీఆర్కు పంపుతూ ఎస్పీ హర్షవర్ధన్రాజు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విధి నిర్వహణలో అలసత్వం, దురుసు ప్రవర్తన కారణంగా ఆయనపై వేటు పడినట్లు తెలిసింది. ఎస్ఐ వ్యవహారశైలిపై పలు ఆరోపణలు రావడంతో ఎస్పీ విచారణ చేయించి వచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నేడు 501 నుంచి ఎస్జీటీల కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఎస్జీటీల సీనియారిటీ జాబితాలో 501 సీరియల్ నంబర్ నుంచి ఈనెల 12న బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చిత్తూరులోని షర్మన్ పాఠశాలలో గురువారం 501 నంబర్ నుంచి 1000 వరకు ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. సంబంధిత టీచర్లు కౌన్సెలింగ్కు తప్పక హాజరు కావాలని ఆదేశించారు. -
ఉద్యమం.. యువతే కీలకం
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై చేపట్టిన ఉద్యమంలో యువత పాత్ర కీలకమని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో యువనేతలతో సమావేశం నిర్వహించారు. భూమన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ప్రజలకు చేసింది శూన్యమని తెలిపారు. సంక్షేమాన్ని గాలికి వదిలేసి కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించడం మినహా అభివృద్ధిని విస్మరించాలని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం సాగిస్తోందన్నారు. ప్రభుత్వం మెడ లు వంచి ప్రజలకు అన్ని పథకాలు అందించేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని సూచించారు. ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్సీపీ కొనసాగించే యుద్ధానికి యువత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. యువతకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని బూటకపు హామీలతో చంద్రబాబు, పవన్కల్యాణ్ మోసం చేశారని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, విద్యార్థివిభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉదయ్వంశీ, ఓబుల్రెడ్డి, టౌన్బ్యాంక్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి, నేతలు లవ్లీ వెంకటేష్, ముప్పాల సాయికుమారి పాల్గొన్నారు. -
అడ్మిషన్లు లేని అటానమస్!
ప్రతిష్టాత్మక టీటీడీ నిర్వహణలోని విద్యాలయాలు.. అటానమస్ హోదా దక్కింది.. సొంతంగా అడ్మిషన్లు చేపట్టే మహత్తర అవకాశం అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు బంగరు భవితను అందించే మహద్భాగ్యం వరించింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పరిస్థితి తయారైంది. స్వయంప్రతిపత్తి హోదా ఫలాలను పిల్లలకు అందించే అదృష్టం.. అధికారుల అలసత్వంతో దూరమైంది. చివరకు ప్రవేశాలకు కరువై విద్యార్థులను వెతుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది. పేరుకే అటానమస్.. పెత్తనం మాత్రం ప్రభుత్వం చేతిలోనే పెట్టేసిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పేద బిడ్డల భవిష్యత్తో ఆడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నచూపు బాధాకరం అటానమస్ హోదా సాధించినా ఫలితం శూన్యం. హోదా ఫలాలను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత టీటీడీ యాజమాన్యానిదే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీటీడీ కళాశాలలకు స్వయంప్రతిపత్తి హోదా వచ్చింది. ప్రస్తుతం విద్య వ్యవస్థను టీటీడీ చిన్న చూపు చూడటం బాధాకరం. తిరుపతిలో ఇప్పటివరకు ప్రభుత్వ కళాశాల లేదు. కేవలం టీటీడీ కళాశాలలపైనే పేద విద్యార్థులు ఆధారపడి ఉన్నారు. ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల కాకపోవడం దారుణం. – బి.ఓబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతి దిశగా అడుగులు వేయలేదు నాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించిన ఎస్పీడబ్లూ, ఎస్జీఎస్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలకు గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయి అటానమస్ హోదా వచ్చింది. కానీ అటానమస్ సాధించినా అడ్మిషన్ల విషయంలోనూ, పరిపాలనలోనూ స్వతహాగా నిర్ణయాలు తీసుకునే దిశగా టీటీడీ యాజమాన్యం అడుగులు వేయలేదు. హోదాను సద్వినియోగం చేసుకుని కళాశాల అభివృద్ధికి కృషి చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. – చిన్నా, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి, తిరుపతి ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం తిరుపతిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేకపోవడం బాధాకరం. ప్రస్తుతం ఉన్న టీటీడీ కళాశాలలకు అటా నమస్ హోదా దక్కినా అధికారుల నిర్లక్ష్యంతో స్వతహాగా అడ్మిషన్లు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల కోసం టీటీడీ అధికారులు ప్రయత్నించి ఉంటే అటానమస్ హోదాతో ఆయా కళాశాలలు అడ్మిషన్లు చేపట్టి మెరిట్ స్టూడెంట్స్కు అవకాశం దక్కేది. ఆన్లైన్ ద్వారా చేపట్టే ప్రవేశాలతో పేదలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదముంది. – హేమాద్రి యాదవ్, స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, తిరుపతి తిరుపతి సిటీ : ప్రపంచ ప్రసిద్ధి ఆధ్మాత్మిక సంస్థ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాలపై అధికారులు శీతకన్ను వేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అటానమస్ హోదా సాధించి ఏడాది గడుస్తున్నా స్వయంప్రతిపత్తి ఫలాలు విద్యార్థులకు దక్కడం లేదు. ప్రస్తుతం అటానమస్ హోదాతో కొనసాగుతున్న ఎస్వీ ఆర్ట్స్, ఎస్పీడబ్ల్యూ, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలల్లో సొంతంగా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టే అవకాశముంది. అయితే టీటీడీ అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వ అనుమతి రాకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది సైతం ఉన్నత విద్యామండలి ఆదేశాలతో ఆన్లైన్ అడ్మిషన్లు, మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజస్ (ఓఏమ్డీసీ) ద్వారా రాష్ట్ర స్థాయి వెబ్కౌన్సిల్ విధానంలో డిగ్రీ ప్రవేశాలు చేపట్టనున్నారు. అటానమస్ హోదా అంటే కేవలం పరీక్షలను సొంతంగా నిర్వహించి ఫలితాలను విడుదల చేయడంతోనే అధికారులు సరిపెడుతున్నారు. దీంతో రాష్ట్ర స్థాయి ఓపెన్ కాంపిటీషన్లో పేద, గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఈ క్రమంలోనే పలువురు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలితం శూన్యం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు డిగ్రీ కళాశాలలకు అటానమస్ హోదా దక్కినా వాటి ఫలాలను విద్యార్థులకు అందించే దిశగా అడుగులు వేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో స్వయంప్రతిపత్తి కేవలం పేరుకే పరిమితమైనట్లు పలువురు ఉద్యోగులు, అధ్యాపకులు పెదవి విరుస్తున్నారు. హోదాతో దాతలను ఆకర్షించి కళాశాలలో విద్యార్థులకు మరింత అధునాతన మౌలిక వసతులు, నూతన భవనాలు నిర్మించే అవకాశాన్ని టీటీడీ యాజమాన్యం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకుల పరిస్థితి దయనీయం టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న 180మంది తాత్కాలిక ఉద్యోగుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. టైం స్కేల్ లేదా శాశ్వత ఉద్యోగులుగానో టీటీడీ గుర్తించకుండా కాలయాపన చేస్తోంది. అటానమస్ హోదా లభించడంతో తమ జీవితాలలో వెలుగులు నిండినట్టేనని భావించిన తాత్కాలిక ఉద్యోగులకు చివరకు నిరాశే మిగిలింది. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. టీటీడీ విద్యాసంస్థలలో 35ఏళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. స్వయం ప్రతిపత్తి హోదా దక్కినా.. టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కరువు సొంతంగా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోరని అధికారులు ఓమ్డీసీ ద్వారానే కసరత్తు సాగుతోందంటున్న విద్యామండలి అగమ్యగోచరంగా 180 మంది తాత్కాలిక అధ్యాపకుల భవిత టీటీడీ నిర్లక్ష్యంపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు ప్రతిష్ట పెరిగేది అటానమస్ హోదాలో స్వయంగా అడ్మిషన్లకు అనుమతి లభించి ఉంటే కళాశాలల ప్రతిష్ట పెరిగేది. దీంతో ప్రతి అటానమస్ డిగ్రీ కళాశాలలో పేద విద్యార్థులకు సులువుగా అడ్మిషన్లు లభించి ఉన్నత విద్యను అభ్యసించే సౌలభ్యం ఉండేది. కానీ టీటీడీ నిర్లక్ష్యం కారణంగా పేద పిల్లలకు అన్యాయం జరిగింది. ఈ క్రమంలోనే కళాశాల సీట్లతో పాటు హాస్టల్ సీట్లను సైతం టీటీడీ పెంచాల్సిన అవసరముంది. – బి.స్రవంతి, పీడీఎస్ఓ జిల్లా సభ్యులు, తిరుపతిఈ నెలలో నోటిఫికేషన్ వచ్చేనా? ఉన్నత విద్యామండలి డిగ్రీ అడ్మిషన్ల కోసం కసరత్తుసాగిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ రెగ్యులర్ ఫలితాలు విడుదలై 3 నెలలు గడిచింది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు సైతం ఇటీవల విడుదలయ్యాయి. కానీ డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానం అమలు చేయాలనే ఉద్దేశంతో నియమించిన కమిటీ నివేదిక సైతం నెల క్రితం వచ్చేసింది. అయితే ఇప్పటికీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల కాకపోవడం గమనార్హం. ఈ నెలలో అయినా నోటిఫికేషన్ విడుదలయ్యేనా అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు అనధికారికంగా ఇప్పటికే సీట్ల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ, టీటీడీ విద్యాసంస్థలలో ప్రవేశాలకు భారీగా గండిపడే ప్రమాదం ఉంది. -
గుడిని కూల్చేసిన టీడీపీ గూండాలు
సాక్షి, తిరుపతి: తిరుచానూరులో టీడీపీ గూండాలు రౌడీయిజానికి దిగారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు.. ఆలయాన్ని కూల్చివేశారు. తిరుచానూరు వారాహి అమ్మవారి గుడిని రాత్రి రాత్రే నేలమట్టం చేసిన టీడీపీ నేతలు.. ఆలయ ఆనవాళ్లు లేకుండా స్వర్ణముఖి నదిలో కలిపేశారు. అనంతరం.. టీడీపీ నేత కిశోర్రెడ్డి ఆలయ భూమిని కబ్జా చేసేశారు. గుడి ఆనవాళ్లను హిందూ సంఘాలు.. స్వర్ణముఖి నది నుంచి బయటకు తీశాయి. హిందూ సంఘాలను అడ్డుకున్న పోలీసులు.. విగ్రహాన్ని తీసుకుపోయారు. టీడీపీ నేత కిశోర్రెడ్డి, పోలీసులు తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేపట్టాయి. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. -
తోట దాటని మామిడి
పాకాల: మండలంలో సుమారు 8 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ తోటల్లో 30 వేల నుంచి 35 వేల టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పాకాల చుట్టుపక్కల ప్రాంతాల్లో తోతాపురి, బేనీషా, ఖాదర్, సింధూర, మల్లిక, నీలం, నాటు కాయలు ఎక్కువగా సాగుశారు. పాకాల మండలంలో అత్యధికంగా తోతాపురి(బెంగళూరు రకం) సుమారుగా 6,500 టన్నులు దాకా రావచ్చని అంచనా.నిరాశేమామిడి రైతులు, చిరు వ్యాపారులు మామిడి పంటపై అధిక పెట్టుబడులు పెట్టారు. ఆశించిన రీతిలో పంట దిగుబడి రావడంతో లాభాలు రావచ్చని ఆశపడ్డారు. కానీ పంట కోయకనే ధరలు పతనమవ్వడంతో ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు. కాయలు కోయకుండా తోటల్లోనే వదిలేస్తూ ధర కోసం నిరీక్షిస్తున్నారు. తోటల్లో కాయలు పండ్లుగా మాగి కుళ్లిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దోమ కాటుతో తోటల్లోనే పండ్లు చెడిపోతున్నాయి. పంట పెట్టుబడులు, కోత కూలీలు, బాడుగలు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.పెట్టుబడులు అధికంమామిడి పంటలో మంచి దిగుబడికి 7 నుంచి 10 సార్లు దున్నకాలు చేపడుతారు. దున్నకాల తర్వాత పశువుల ఎరువుతో పాటు డీఏపీ, సూపర్ పాస్పేట్, వేపపిండిని కలిపి పిచికారీ చేస్తారు. ఎకరానికి రూ.30 వేలకు ఖర్చు చేస్తారు. ఇవి కాకుండా కాయల కోత సమయంలో కూలీలు, కోసిన కాయలు తరలించడానికి బాడుగలకు అదనంగా ఖర్చు చేస్తారు. అయితే ప్రస్తుతం మామిడి కాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంపై తీవ్ర నష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.వెలవెలబోతున్న దామలచెరువుదేశంలోనే మామిడి కాయలకు దామలచెరువు ప్రసిద్ధి. గతంలో మామిడి కాయల సీజన్లో దుకాణాల వద్ద రద్దీ అధికంగా ఉండేది. దామలచెరువు దిగువ గేటు నుంచి ఎగువ గేటుకు వెళ్లాలంటే సుమారు అర్ధగంట నుంచి గంట సమయం పట్టేది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కాయలు తీసుకెళ్లేందుకు లారీలు వందల సంఖ్య వేచి ఉండేవి. అలాంటిది ఇప్పుడు మామిడికి మద్దతు ధర లేక పోవడంతో వెలవెలబోతోంది. ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా లారీలు కనిపించడం లేదు.గిట్టుబాటు ధర కల్పించాలిప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మామిడి కాయలకు గిట్టుబాటు ధర కల్పించడంపై రైతులతో సంప్రదించాలి. రైతుల కష్టాలను గుర్తించి పంటకు తగ్గట్టుగా గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే మామిడి జ్యూస్ ఫ్యాక్ట రీ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాయలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలి.– ఏ.కృష్ణయ్య, మొగరాల, పాకాల మండలంఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాంప్రభుత్వం సూచించిన ధరకు రైతుల వద్ద నుంచి మామిడి కాయలను ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. రైతులు కోతలు జరపకుండా ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ పరిస్థితులను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళతాం. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం.– శైలజకుమారి, ఉద్యాన అధికారిణి, పాకాల -
డ్వాక్రా మహిళ ఆత్మహత్య
శ్రీకాళహస్తి: రుణం కట్టలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని చెంచులక్ష్మి కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసుల కథనం.. సుమలత అలియాస్ ఉష(40) డ్వాక్రా గ్రూప్లో సభ్యురాలు. ఈమె అందులో రుణం పొంది కంతులు కడుతుండేవారు. మంగళవారం ఆమె రూ.20 వేలు డ్వాక్రా గ్రూప్లో కట్టాల్సి ఉండగా సమయానికి డబ్బు అందలేదు. అవమానాల పాలవుతామనే బాధతో పురుగుల మందు తాగేసింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మెడలో గొలుసు చోరీ చంద్రగిరి: వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఘటన తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధి మంగళం సమీపంలోని చెన్నాయగుంట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. చెన్నాయగుంట ప్రాంతానికి చెందిన భారతి మరో మహిళతో కలసి వాకింగ్ చేసేందుకు వెళ్లింది. వాకింగ్ చేస్తున్న క్రమంలో ముఖానికి మాస్కులు ధరించుకుని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మహిళ మెడలోని గొలుసును చోరీ చేసి పరారయ్యారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జేసీబీ, రెండు ట్రాక్టర్లు సీజ్ రేణిగుంట: మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలపై గత వారంలో శ్రీసాక్షిశ్రీలో వచ్చిన వరుస కథనాలకు గాజులమండ్యం పోలీసులు స్పందించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై వరుస దాడులు నిర్వహించారు. ఎల్లమండ్యం పంచాయతీలోని పిల్లపాళ్యం సమీపంలో మంగళవారం ఉదయం జేసీబీతో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా గాజులమండ్యం సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ సుధాకర్ తమ సిబ్బందితో వెళ్లి సీజ్ చేశారు. అలాగే రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. -
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
శ్రీకాళహస్తి: ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేసినట్లు రెండవ పట్టణ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎమ్మార్పల్లెకు చెందిన అల్తాఫ్(19)బైక్ మెకానిక్. శ్రీకాళహస్తి మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్(20)తో కలిసి మద్యం, గంజాయికి బానిసయ్యారు. ఈజీ మనీ కోసం వారు తిరుపతి బస్స్టేషన్, రైల్వేస్టేషన్, శ్రీకాళహస్తి బస్స్టేషన్, రైల్వేస్టేషన్ పరిసరాల్లో బైక్లు దొంగలించే వారు. ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కుని పారిపోయేవారు. తిరుపతి ఎస్సీ హర్షవర్ధన్రాజు ఆదేశాలతో శ్రీకాళహస్తి డీఎస్పీ పర్యవేక్షణలో రెండవ పట్టణ సీఐ నాగార్జునరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండు వద్ద ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
‘అయ్యో’ర్ల పడిగాపులు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్జీటీలు బదిలీల కౌన్సెలింగ్ కోసం జిల్లా కేంద్రంలో పడిగాపులు కాశారు. రాత్రి 9.50 గంటల సమయం అయినప్పటికీ కౌన్సెలింగ్ను విద్యాశాఖ అధికారులు ప్రారంభించలేదు. ఈ కౌన్సెలింగ్కు హాజరైన ఎస్జీటీ టీచర్ల సీనియారిటీ ప్రకారం బదిలీలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. టీచర్లు కౌన్సెలింగ్ కేంద్రంలో చీకటిలో కూర్చుని రాత్రంతా నిరీక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రాత్రి 9.20 గంటలకు ఎస్జీటీల సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో సమగ్ర సీనియారిటీ జాబితాను ప్రదర్శించాలని టీచర్లు డిమాండ్ చేశారు. అధికారులు 350 వరకు జాబితాను విడుదల చేసి మిన్నకుండి పోయారు. సమగ్ర సీనియారిటీ జాబితాను విడుదల చేస్తే బదిలీల్లో న్యాయం జరుగుతుందని పలువురు ఎస్జీటీలు వెల్లడించారు. సంఘం నాయకులకు నో ఎంట్రీ కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో టీచర్ల తరపున సమస్యలను పరిష్కరించుకునేందుకు వివిధ సంఘాలు పాల్గొనడం ఆనవాయితీ. అయితే ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సంఘం నాయకులు హాల్లోకి రాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారులు హుకుం జారీ చేశారు. ఎన్నడూ లేని వింత విధానాలను చిత్తూరు విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్నారని వివిధ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం నాయకులు ఇతర జిల్లాల్లో విచారించగా నాయకులను అనుమతిస్తున్నారని తెలిసింది. నేడు ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ జిల్లాలోని ఎస్జీటీలకు నేటి నుంచి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చిత్తూరు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఎస్జీటీలు సీనియారిటీ జాబితా ప్రకారం సీరియల్ నం.351 నుంచి 700 వరకు ఉదయం 9.30 గంటలకు, సీరియల్ నం.701 నుంచి 1000 వరకు మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎస్జీటీలు చిత్తూరు శర్మన్ పాఠశాలలో జరిగే కౌన్సెలింగ్ కు తప్పక హాజరు కావాలని డీఈఓ కోరారు. రాత్రి 9.50 గంటలైనా ప్రారంభం కాని కౌన్సెలింగ్ -
● రోగుల జేబులు గుల్ల చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రి ● పట్టించుకోని అధికారులు
తిరుపతి తుడా: ‘సేవలు చేయం.. రోగుల దోపిడీయే మా సంకల్పం’ అంటూ చెలరేగిపోతోంది తిరుపతిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం. తుడా రోడ్డులో వెలసిన ఆ ఆస్పత్రి ధనార్జనే లక్ష్యంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తరచూ రోగుల బంధువులతో గొడవలకు దిగుతోంది. ఏదైనా జబ్బుతో ఆస్పత్రికి వస్తే లేనివి ఉన్నట్లు చూపుతూ లక్షలు గుంజేయడం రివాజుగా మారుతోంది. ఓపీ నుంచే గుంజుడు మొదలు ఆస్పత్రిలో ఓపీ తీసుకోవడం మొదలు వైద్య, వివిధ అనవసర పరీక్షలు, ఆపై అడ్మిషన్, చికిత్స అంతా ఇక రోగి బంధువుల చేతిలో ఉండదు. ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపుతూ రోగి తోపాటు బంధువులను భయాందోళనకు గురిచేయడం ఆస్పత్రికి అలవాటుగా మారింది. ఐసీయూ పేరుతో రోజుకు వేలాది రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. డబ్బు కోసం శవాలకు సైతం చికిత్స అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో వివాదాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. రోగుల బంధువులను కట్టడి చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎవరైనా అక్కడ ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతోంది. కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆ ఆస్పత్రిలో చేరితే ఇక అంతే! గంగాధరనెల్లూరుకు చెందిన 58 ఏళ్ల మహిళకు తల తిరుగుతుండడంతో ఇటీవల ఆస్పత్రికి వచ్చారు. రోగి బంధువుల ముందు నానాహంగామా సృష్టించి స్కానింగ్ చేయించారు. అత్యవసరంగా ఐసీయూలో చికిత్స అందించాలంటూ హడావిడి చేశారు. ఏదో జరిగిపోతుందన్న భయంలో ఒకరోజు బంధువులు అందుకు సరే అన్నారు. వారం రోజులు పాటు ఐసీయూలో చికిత్స అందించి వ్యాధి నయం అయిపోయిందంటూ పంపిం చేశారు. రోజుకు రూ.30 వేల చొప్పున రూ.2.10 లక్షలు, మెడిసిన్కు లక్ష ఇరవై వేలు, ఓపీ, వివిధ స్కానింగ్ల కోసం మరో రూ.28,000 కట్టించుకుని జేబులు నింపుకున్నారు. ఈ ఆస్పత్రి రిపోర్టులను మరో వైద్యుని దగ్గర చూపించగా బాధితుడికి ఐసీయూలో చికిత్స అందించే అంత వ్యాధి లేదని నిరూపితమైంది. దీంతో ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. అలాగే నాలుగు రోజుల క్రితం రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళకు అందించిన చికిత్స వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రోగి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు తరచూ వివాదాలు, గొడవలు జరుగుతున్నాయి. తుడా రోడ్డులోని ఆస్పత్రిలో రోగి బంధువుతో సిబ్బంది వాగ్వాదంనేమ్ బోర్డుల్లో మాత్రమే వైద్యులు ఆస్పత్రిలోకి ప్రవేశించిన వెంటనే ప్రముఖ వైద్యుల పేర్లతో డిస్ప్లే కనిపిస్తుంది. అబ్బా... ఇక్కడ ఇంతమంది వైద్యులు ఉంటారా..? అని అనుకుంటే పొరబాటే. కానీ అక్కడ ఆ స్థాయిలో వైద్యులు అందుబాటులో ఉండరు. గెస్ట్ డాక్టర్లు ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో అక్కడే నర్సులు, ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ల అవతారం ఎత్తుతారు. నానా హంగామా చేసి బిల్లులు మెడకు చుట్టేస్తారు. – శ్రీహరి, రోగి బంధువు -
రోడ్డుకు అడ్డంగా గోడ
పెళ్లకూరు: పెళ్లకూరు మండలం, శిరసనంబేడు గ్రామం మీదుగా అమ్మన్ ట్రై స్టీల్ పరిశ్రమకు వెళ్లే రహదారికి అడ్డంగా గ్రామానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వేలూరు మురళికృష్ణారెడ్డి మంగళవారం ఏకంగా గోడ కట్టి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారు. స్థానికుల సమాచారం మేరకు.. పదిహేనేళ్లు కిందట గ్రామంలో స్టీల్ పరిశ్రమ నెలకొల్పారు. పరిశ్రమ వాహనాలు గ్రామంలోని ప్రధాన వీధి గుండా రాకపోకలు సాగిస్తుండడం వల్ల లారీ కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. అప్పటి నుంచి ప్రధానవీధి గుండా పరిశ్రమ వాహనాలు రాకుండా నిలిపేశారు. ఆ సంస్థ తాత్కాలికంగా వేరే రహదారి ఏర్పాటు చేసుకుంది. ఈ మార్గాన్ని ఆనుకొని ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన పట్టా భూముల్లో రోడ్డు ఏర్పాటు చేసినట్లు, నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని కొందరు బాధితులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నిర్వాసితులకు పరిశ్రమ యాజమాన్యం అడ్వాన్స్ అందజేసినట్లు సమాచారం. ఈ పరిహారం విషయంలో గ్రామానికి చెందిన నిర్వాసితుల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ప్రస్తుతం వెంచర్ యాజమాన్యం తాత్కాలిక రోడ్డును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. పూర్తి స్థాయి పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ టీడీపీ నాయకుడు మురళీకృష్ణారెడ్డి పట్టుబట్టారు. వాహనాల రాకపోకలు జరగకుండా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టించారు. ఈ విషయమై గ్రామంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన
● రోడ్డుపై బైఠాయించిన రైతులు ● ధర తగ్గిస్తున్న దళారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ పాకాల: దళారులు, ఫ్యాక్టరీ యజమానులతో కుమ్మకై ్క మామిడికి గిట్టుబాటు ధర కల్పించడం లేదని మామిడి రైతులు పాకాల మండలం, దామలచెరువు హైస్కూల్ గేటు వద్ద మంగళవారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ర్యాంపుల వద్ద దళారులు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.8,000కు కాకుండా కేవలం టన్నుకు రూ.4,000కు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే దళారులు, సప్లయర్స్, ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చెయ్యాలని, రేటు తగ్గించి కొనుగోలు చేసే దళారులపై కేసులు నమోదు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.4 వేలు నేరుగా రైతుకే అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తోటల్లోనే మామిడి కాయలు మాగి పోతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. తక్కువ ధరకు తోతాపురి రకాన్ని కొనుగోలు చేయడంతో తోటలపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సంతోష్సాయి, సీఐ సుదర్శన్ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ధర్నా చేస్తామని మామిడి రైతులు హెచ్చరించారు. -
గజ వాహనం..భక్తజన పావనం
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం దివ్యాలంకార శోభితురాలైన శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై ఆశీనులై ఐదు మార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి అమ్మవారు గజ వాహనాన్ని అధిష్టించి తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. ఇదిలావుండగా తెప్పోత్సవాల్లో చివరి రోజైన బుధవారం రాత్రి గరుడ వాహనంపై అమ్మవారు ఊరేగనున్నారు. ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవారాజులు, సూపరింటెండెంట్లు రమేష్, శ్రీవాని, ఆలయ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. – చంద్రగిరి -
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్న ఉద్యోగుల సమస్యలను నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని అధికారులను టీటీడీ ఈఓ శ్యామల రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిపాలనా భవన సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ పరిధిలోని అంశాలకు సంబంధించి వారితో చర్చించి అనుమతులు తీసుకుని పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ఫండ్ కేటాయింపులో, ఇతర అలవెన్స్ల చెల్లింపులో అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు చేపట్టాలని సూచించారు. జీఎన్బీ, ఎస్వీ పూర్ హోమ్, కే.టీ.వినాయకనగర్, రామనగర్ ప్రాంతాల్లోని టీటీడీ క్వార్టర్స్లో డ్రైనేజీ సమస్యలు, భవనాల లీకేజీలు, విద్యుత్ వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇప్పటికే కేటాయించిన ఇళ్ల స్థలాలపై వివిధ శాఖల అనుమతుల విషయంలో సీనియర్ అధికారులతో కమిటీ వేసి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, డిఎల్వో వరప్రసాద్ రావు, వివిధ శాఖల డిప్యూటీ ఈఓలు, ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీ సీ షెడ్ వద్దకు చేరింది. సోమవారం అర్ధరాత్రి వరకు 84,258 మంది స్వామివారిని దర్శించుకోగా 33,502 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
రక్షణేది బాబు?
మహిళలకుఏడాది పాలనలో పెరుగుతున్న అత్యాచారాలు, దాడులు మహిళలకు రక్షణ కల్పించాలని అంబేడ్కర్ విగ్రం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు తిరుపతి మంగళం : ‘మహిళలు మా అక్క చెల్లెమ్మలు.. తోబుట్టువులు.. మా ఇంటి ఆడపడుచులు.. మహిళలకు అన్యాయం జరిగితే ఎందాకై నా వెళ్తాం.. అంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్కళ్యాణ్ ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి రాగానే మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యమయ్యారు. నిత్యం అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు’ అంటూ వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, తిరుపతి నగర బూత్ కమిటీ ఇన్చార్జ్ ముప్పాల సాయికుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించమంటూ గొంతు చించుకుని అరిచారని, వారిని నమ్మి ఓట్లేసినందుకు తగిన శాస్తి జరిగిందని మండిపడ్డారు. కూటమి నాయకుల చేతుల్లో అత్యాచారాలకు, దాడులకు గురవుతున్న మహిళలకు, బాలికలకు ఏమి న్యాయం చేశారని ప్రశ్నించారు. మహిళల పట్ల కూటమి నాయకులు కీచకుల్లా మారారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, దాడులపైన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఓ మహిళ హోమ్ మంత్రిగా ఉండి కూడా మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించలేకపోతున్నారని మండిపడ్డారు. మహిళా రక్షణ చట్టాలు నిర్వీర్యం తిరుపతి అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్ల ఆందోళన గతంలో మహిళా రక్షణకు పెద్దపీట గత వైఎస్సార్సీపీ పాలనలో తమ నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి మహిళా రక్షణ కోసం దిశ, నిర్బయ వంటి అనేక చట్టాలను తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా రక్షణ చట్టాలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. కూటమి నాయకులు మహిళల పట్ల ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు గోలి విజయలక్ష్మి, పునీత, పుష్ప, శారద, శాంతారెడ్డి, రాజేశ్వరి, యశోద, రాధ, మాదవి, కృష్ణవేణమ్మ, సాయికుమారి, షర్మిల, రెడ్డిరాణి, పార్వతమ్మ, దుర్గ, కవితమ్మ పాల్గొన్నారు. -
ఆధునిక సమాజానికి సంస్కృతం దిక్సూచి కావాలి
తిరుపతి సిటీ: ఆధునిక సమాజానికి సంస్కృత జ్ఞానం దిక్సూచి కావాలని ఇందుకోసం ప్రతి విద్వాంసుడు నడుం బిగించాలని జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర నాసిక్లో కేంద్ర సంస్కృత వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగో ఉత్కర్ష మహోత్సవం మంగళవారంతో ముగిసింది. కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ సంస్కృత భాషాభివృద్ధికి ప్రతి వ్యక్తి ప్రతినబూనాలని కోరారు. ఆధునిక సమాజంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో భావిభారతానికి సంస్కృత ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు. ఈ మేరకు ఉత్కర్ష మహోత్సవంలో రోడ్డమ్యాప్ తయారు చేయడం జరిగిందని చెప్పారు. అనంతరం నిర్వాహకులు వీసీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలు సంస్కృత వర్సిటీల నుంచి అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అడ్డగోలు అడ్మిషన్లే.. పెట్టుబడి!
చిత్తూరు కలెక్టరేట్ : తిరుపతి జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలల్లో ఇష్ణారాజ్యంగా అడ్మిషన్లు చేపడుతున్నారు. ముందస్తుగా అడ్మిషన్ పొందితే ఫీజులో రాయితీ ఇస్తామంటూ ఆఫర్లు కురిపిస్తున్నారు. తీరా అడ్మిషన్ చేసుకున్నాక ఫీజులు మరింత పెంచేసి తల్లిదండ్రులను నిలువునా ముంచేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ పేర్లతో సీట్ల దందాను కొనసాగిస్తున్నారు. ఏజెంట్లను నియమించుకుని అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. విద్యను వ్యాపారంగా మార్చేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.ప్రత్యేక బ్యాచ్ల పేరుతో దోపిడీకార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో బ్రాంచ్లో ఒక్కో ధర ఉంటోంది. ఐఐటీ, టెక్నో, స్పార్క్ ఇలా పలు రకాల పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యాసంస్థల్లో అడ్మిషనన్ల సమయంలో ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించకూడదనే నిబంధన ఉంది. అయితే పలు పాఠశాలల్లో ముందస్తుగా ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. విద్యార్థుల నైపుణ్యాల్లో తారతమ్యాలు సృష్టించి వారు మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారు. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బ్యాచ్లలో భవిష్యత్లో ఇంజినీర్, డాక్టర్లు అయ్యేందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామంటూ ఇష్టానుసారం ఫీజులు పెంచేసి వసూలు చేస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం అవ్వకనే ప్రైవేట్, కార్పొరేట్ బడుల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయంటే అతిశయోక్తి కాదేమో.గత ఐదేళ్లలో అడ్డుకట్టప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల్లో జరుగుతున్న అడ్డగోలు వసూళ్లు, అక్రమాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రత్యేకంగా ఫీజు నియంత్రణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్లో నిష్ణాతులైన విద్యావేత్తలను నియమించి క్షేత్రస్థాయి పర్యవేక్షణ ముమ్మరం చేసింది. కమిషన్ సభ్యులు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందగానే నేరుగా సంబంధిత కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టేవారు. ఏవైనా అక్రమాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే ఆయా పాఠశాలల అనుమతులను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టేవారు. దీంతో గత వైఎస్సార్సీపీ సర్కారు ఐదేళ్ల పాలనలో కార్పొరేట్ పాఠశాలల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్పొరేట్ యాజమాన్యాలతో లాలూచీపడి విద్యను వ్యాపారంగా మార్చేసింది. ప్రభుత్వ బడుల బలోపేతం గాలికొదిలేసి కార్పొరేట్కు రెడ్కార్పెట్ వేసింది.విద్యాశాఖ విఫలంజిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల పాఠశాలలు నిర్వహిస్తున్న అడ్డగోలు అడ్మిషన్ల దోపిడీని జిల్లా విద్యాశాఖ అధికారులు అరికట్టాల్సి ఉంది. ఆయా పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీ పర్వం విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ నోరు మెదపడం లేదు. ఎంఈవోలు, డీవైఈవోలు తనిఖీలు సైతం చేయడం లేదు. ఆయా విద్యాసంస్థల నిర్వాహకులతో లాలూచీ పడ్డారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముందస్తు అడ్మిషన్లు, అడ్డగోలు ఫీజుల వసూళ్ల పై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.ప్రభుత్వ బడులు మూసేయాల్సిందేజిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తుగా అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెట్టారు. ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రికి సంబంధించిన విద్యాసంస్థలో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అధిక ఫీజులు, ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ వల్ల ప్రభుత్వ బడులను భవిష్యత్లో మూసివేయాల్సిన పరిస్థితులు వస్తాయి.– శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి. తిరుపతి జిల్లా -
దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయండి
తిరుపతి క్రైమ్: రేణిగుంటలోని సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని సాక్షి జర్నలిస్టులు సోమవారం పలుచోట్ల పోలీసు అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. అందులో భాగంగా సోమవారం రాత్రి రేణిగుంట సీఐ జయచంద్రకు, మంగళవారం తిరుపతి అర్బన్ జిల్లా లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ రవిమనోహరాచారికి సాక్షి బ్రాంచ్ మేనేజర్ సత్యేంద్రబాబు, బ్యూరో ఇన్చార్జ్ రవిరెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. సిబ్బందికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రెండు జిల్లాల్లోని మరికొన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మంగళవారం ఫిర్యాదులు అందజేశారు. ● అధికారులకు వినతిపత్రాలు అందజేసిన ‘సాక్షి’ యాజమాన్యం -
మేం భయపడం.. ఎలాంటి విచారణకైనా సిద్ధం: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతోందని.. ఇందుకోసం తప్పుడు కేసులు, సాక్ష్యాలు సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీఎస్పీడీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీ అక్రమ నిర్బంధం, అబద్దపు వాంగ్మూల సేకరణకు జరుగుతున్న ప్రయత్నాలు, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీని అక్రమంగా నిర్బంధించారు. బాలాజీని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తోంది. అయినా మేం భయపడం. ఎందుకంటే తప్పుడు కేసులు నిలవబడవు కాబట్టి. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం అని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్లు చెప్పాలంటూ బాలాజీతో సహా ముగ్గురుని పోలీసులు వేధిస్తున్నారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయంలో కాకుండా ఓ రహస్యప్రదేశంలో వాళ్లను హింసిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. తమ వాళ్లను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేస్తుండడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆయన్ని ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. పోలీసుల దుశ్చర్యను ప్రశ్నిస్తూ.. హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయబోతున్నట్లు సమాచారం. -
Tirumala: తిరుమల కొండల్లో అగ్ని ప్రమాదం
సాక్షి, తిరుపతి: తిరుమల శేషాచలం కొండల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శిలాతోరణం, శ్రీవారి పాదాలకు వెళ్లే అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నాం మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఫైరింజన్లకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది. కెమికల్ ల్యాబ్లో తప్పిన ప్రమాదంమరోవైపు జిల్లాలోని ఏర్పేడు మండలం ఐసర్ విద్యా సంస్థ కెమికల్ ల్యాబ్లో మంగళవారం మధ్యాహ్నాం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ల్యాబ్లో ఉన్న విద్యార్థులు బయటకు పరుగులు తీయగా.. సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకుని మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. -
ఒకే బస్సు.. నలభై అడుగుల రోడ్డు!
● అభివృద్ధి పేరిట ఇళ్లకు మార్కింగ్ వేసిన అధికారులు ● నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు సాక్షి, టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పేరిట అధికారులు చిత్రవిచిత్రాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రగిరి మండలం ఐతేపల్లె– ఏ.రంగంపేట మార్గంలో ఒకే బస్సు తిరుగుతుంది. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏమాత్రం లేవు. అయితే రోడ్డు విస్తరణ పేరిట 5 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఇళ్లకు మార్కింగ్ వేశారు. ఐతేపల్లె నుంచి ఏ.రంగంపేట వరకు 40 అడుగుల రోడ్డు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏళ్ల నుంచి ఇళ్లు, దుకాణాలు నిర్మించుకుని ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు రోడ్డు విస్తరణ అంటూ కూల్చేస్తే తామంతా ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు మరో రెండు రోజుల్లో స్థానికులతో సమావేశం నిర్వహించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఇష్టారాజ్యంగా దౌర్జన్యం ఈ క్రమంలో సోమవారం అధికారులతో కలిసి కొంత మంది ఐతేపల్లైపె పడ్డారు ఆగమేఘాలపై జేసీబీలతో ఇష్టారాజ్యంగా ఇళ్లు, దుకాణాలను కూల్చేశారు. అసలు రోడ్డు విస్తరణకు పనులు ఎప్పుడు మంజూరు చేశారు..? వాటికి సంబంధించి అనుమతులు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నిస్తే తమకు అదంతా తెలియదని, మార్కింగ్ చేసిన ప్రదేశం వరకు కూల్చేస్తామంటూ ధ్వంసం చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేం దారుణమని అడిగితే బెదిరింపులకు పాల్పడినట్లుగా స్థానికులు తెలిపారు. కనీసం ఇళ్లు, దుకాణాలు కోల్పోయే బాధితులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యం చేయడంపై మండిపడ్డారు. ఎవరూ లేని సమయంలో..! రోడ్డు విస్తరణ నిర్వాసితులకు ఎలాంటి పరిహారం గురించి చర్చింకుండా, ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దౌర్జన్యంగా కూల్చివేత పనులను చేపట్టడంపై ఐతేపల్లె వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై నిరసనకు దిగారు. దౌర్జన్యంగా కూల్చివేతలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసినందుకు మా పొట్టకొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ఉదయం, సాయంత్రం కేవలం ఒక్క బస్సు మాత్రమే వస్తుందని, అలాంటిది 40 అడుగుల రోడ్డు ఎందుకని ప్రశ్నించారు. నిబంధనలకు పాటించకుండా దౌర్జన్యంగా కూల్చివేతలకు పాల్పడడం ఏంటని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయకపోతే సహించేది లేదన్నారు. జేసీ దృష్టిలోనే లేదంట..! బాధితులు ఈ మేరకు సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జేసీ శుభం భన్సల్కు వినతి పత్రం సమర్పించారు. తమ గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అన్యాయంగా ఇళ్లు, దుకాణాలు కూల్చేశారని, తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. దీనిపై స్పందించిన జేసీ మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, వీటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. -
తిరునగరం డ్రగ్స్ కలకలం!
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సంకీర్తనలతో అలరారే తిరుపతి నగర ప్రతిష్ట మసకబారుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులతో విలసిల్లే ఆధ్యాతి్మక క్షేత్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోతోంది. సాక్షాత్తు వైకుంఠనాధుని పాదాల చెంత డ్రగ్స్ మహమ్మారి వికటాట్టహాసం చేస్తోంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన ఖాకీలే కూటమి నేతల అండతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడం శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తిరుపతి క్రైమ్: ఆధ్యాత్మిక నగరానికి మాదక ద్రవ్యాల మరకలు అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్ మాఫియా మూలాలు తిరుపతి నగరంలో దొరకడం కలవరపాటు గురిచేస్తోంది. ఇప్పటివరకు గంజాయి మాత్రమే సరఫరా అవుతుందనే వినికిడి ఉండగా.. ఇప్పుడు కొత్తగా కొకై న్, ఎపిడ్రిన్ వంటి డ్రగ్స్ కూడా లభిస్తుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. తిరుపతి నుంచే హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా జరిగినట్లుగా కూకట్పల్లి పోలీసులు గుర్తించారు. ఇందులో తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్నాయనే విషయం బయటకు రావడంతో శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారు. కూటమి సర్కారు వచ్చి ఏడాది అవుతుంది. ఇప్పటికే జిల్లాలో మద్యం, గంజాయి సరఫరా యథేచ్ఛగా సాగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పుణ్యక్షేత్రంలోనే అధిక సంఖ్యలో వైన్ షాపులు వెలిశాయి. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లో బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయి. ఇష్టానుసారం పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చి 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.ఎవరెవరు ఉన్నారో..?ఇప్పటివరకు ఈ డ్రగ్స్ దందాలో హైదరాబాద్ పోలీసులు తిరుపతికి చెందిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్లు గుర్తించారు. వీరు కాకుండా ఇంకెవరైనా ఖాకీలు ఉన్నారా ? అనే కోణంలో తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. మత్తు పదార్థాలను కట్టడి చేయాల్సిన పోలీసులే నిందితులుగా మారుతున్నారంటే.. ఎంత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుందో ఆలోచించాల్సిన విషయం. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ డ్రగ్స్ వ్యవహారంలోకి ఖాకీలు తలదూర్చినట్లు విశ్వనీయ సమాచారం. విషయం బయట పడగానే వీరిద్దరిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారి చర్యలు చేపట్టారు. విధుల నుంచి పూర్తిగా తొలగించారు. అయితే డ్రగ్స్ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ? ఈ దందాలో ఇంకా ఎవరి హస్తం అయినా ఉందా అనే దిశగా జిల్లా పోలీసులు విచారణ చేపట్టకపోవడం దురదృష్టకరం. ఇప్పటికై నా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది.గత ప్రభుత్వంలో పటిష్ట భద్రతగత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపింది. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి చాలావరకు గంజాయి నిర్మూలనకు కృషి చేశారు. అక్రమ మద్యం, గంజాయి లేకుండా చేయడంలో సఫలీకృతమయ్యారు. తిరుపతి ప్రతిష్టను ఇనుమడింపజేశారు. అనునిత్యం తిరుపతి నగరంపై ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు భరోసా కల్పించారు. అయితే కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచే ఆధ్యాత్మికక్షేత్రంలో అష్టదరిద్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కొత్తగా మాదక ద్రవ్యాల విక్రయాలు కూడా మొదలయ్యాయి. వీటి మూలాలను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
పుస్తకాల ఆవిష్కరణ
తిరుపతి సిటీ: కేంద్రీయ సంస్కృత వర్సిటీల నాలుగో ఉత్కర్ష మహోత్సవాల్లో తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ అధ్యాపకులు రచించిన పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. మహారాష్ట్ర నాసిక్ నగరంలో చేపట్టిన ఉత్కర్ష మహోత్సవాల్లో ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, అధ్యాపకుల బృందం పాల్గొంది. వీసీ మాట్లాడుతూ నేటి తరానికి భారతీయ సంస్కృతిని, జ్ఞానాన్ని అందించేందుకు విద్వాంసులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఎన్ఎస్యూ గణిత విభాగం అధ్యక్షులు రమేష్ బాబు రచించిన వేదిక్ మ్యాథమెటిక్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. చైతన్య ఫిలాసఫీ అనే గ్రంథాన్ని సైతం ఆవిష్కరించారు. యువకుడి ఆత్మహత్య రాపూరు : మద్దెలమడుగు వద్ద ఆదివారం రాత్రి రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఒడిశాకు చెందిన అజయ్నాయక్ (20) ఓ దాబాలో వంట మాస్టర్గా పనిచేస్తుంటాడన్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాల కారణంగా గూడ్సు రైలు కిందపడినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
నిధుల దుర్వినియోగంపై నిరసన
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో రూ.2.74 కోట్ల దుర్వినియోగంపైవార్డు సభ్యుడు ఎం.కిరణ్ కుమార్ రెడ్డి నిరసన తెలిపారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్ ప్రదీప్ కుమార్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగంపై గతంలో మాజీ ఉప సర్పంచ్ ఎ.సుబ్రమణ్యం రెడ్డి ఫిర్యాదు మేరకు రాష్ట్ర లోకాయుక్త విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చిందన్నారు. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అప్పట్లో కేసును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. పంచాయతీ ఖర్చుల వివరాలు, చెల్లించిన బిల్లుల రికార్డులను పరిశీలిస్తే అవకతవకలు అర్థమవుతాయన్నారు. అందుకు అవసరమైన పత్రాలను అధికారులకు అందించారు. ఈక్రమంలోనే సర్పంచ్ అవినీతి, అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, సీఎంఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎల్పీఓ నివేదిక ప్రకారం చిగురువాడ పంచాయతీలో రూ. 2.74 కోట్ల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. ఇప్పటికీ అధికారులు స్పందించకుంటే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి ఏసీబీ విచారణ కోరతానని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు మాట్లాడుతూ సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
బత్తినయ్య సేవలో మోహన్బాబు
ఏర్పేడు: మండలంలో ముసలిపేడు సమీపంలోని భక్తకంఠేశ్వరుడు(బత్తినయ్య) కోనను సినీనటులు మంచు మోహన్బాబు, మంచు విష్ణు సోమవారం దర్శించుకున్నారు. వారు నటించిన కన్నప్ప సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మోహన్బాబుకు అత్యంత ఇష్టదైవమైన బత్తినయ్య కోనకు వెళ్లారు. ప్రత్యేక అభిషేక పూజలు చేసి పరమ శివుని భక్తునిపై తీసిన కన్నప్ప చిత్రం విజయం సాధించేలా కటాక్షించాలని ప్రార్థించారు. -
రమణీయం..రథోత్సవం
మాడవీధుల్లో సాగుతున్న రథోత్సవం తిరుపతి కల్చరల్ : శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్నాల వీధి, భేరివీధి, గాంధీరోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మణల నడుమ వైభవంగా కొనసాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథంపై ఉప్పు, మిరియాలు చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి, నమ్మాళ్వార్ ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వైభవంగా అశ్వవాహన సేవ చేపట్టారు. భక్తజన బృందాల కోలాటాలు, భజనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, ఎస్ఈ–2 జగదీశ్వర్రెడ్డి, డిప్యూటీ ఈఓ వీఆర్ శాంతి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రథోత్సవంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో భక్తులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. నేడు చక్రస్నానం శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు (ఆళ్వార్ తీర్థం)లో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు స్వామి, అమ్మవార్లు బంగారు తిరుచ్చిపై, చక్రతాళ్వార్ పల్లకిలో ఊరేగనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీవారు ఉభయ నాంచారులతో మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 8.40 నుంచి 9.30 గంటల నడుమ ధ్వజావరోహణం, ఆస్థానంతో బ్రహ్మో త్సవాలు పరిపూర్ణం కానున్నాయి. -
అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పీజీఆర్ఎస్ నిర్వహించారు. జేసీతోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, సుధారాణి, రోజ్మాండ్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. కలెక్టరేట్లో 242 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. అందులో రెవెన్యూ సమస్యలపై 129, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్–9, పంచాయతీ రాజ్ –14, పోలీస్ శాఖ –10 మిగిలిన విభాగాల్లో కొద్ది పాటి అర్జీలు వచ్చాయని వివరించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే దిశగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు. పోలీస్ గ్రీవెన్స్కు 94 అర్జీలు తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్న్ రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. -
అవార్డులతో ప్రతిభకు ప్రోత్సాహం
తిరుపతి కల్చరల్ : ప్రతిభ గల విద్యార్థులు ప్రోత్సహించేందుకే ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. పదోతరగతి, ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అందించారు. మంత్రి మాట్లాడుతూ పేదరికం కారణంగా పిల్లలకు చదువుకు దూరం కాకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ఏపీని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ అమలు చేస్తోందని వెల్లడించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యావ్యవస్థను అద్భుతంగా తయారుచేసేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని వివరించారు. అందులో భాగంగానే ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకే షైనింగ్ స్టార్స్ అవార్డులను అందిస్తున్నట్లు వెల్లడించారు. సర్కారు పాఠశాలల్లో చదువుకుని ఉత్తమ మార్కులు సాధించి అవార్డు అందుకున్న విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం 207 మంది పదోతరగతి విద్యార్థులు, 40 మంది ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. అలాగే రూ.20వేల చొప్పున నగదు, మెడల్స్ అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, నేతలు సుగుణమ్మ, పసుపులేటి హరిప్రసాద్, డీఈఓ కేవీఎన్ కుమార్, సర్వశిక్ష అభియాన్ సీఎంఓ సురేష్ పాల్గొన్నారు. -
అపోహలు సృష్టించి.. అరాచకం
కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ప్రజల తరఫున ప్రశ్నించే పత్రికపై కక్షగట్టింది. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాక్షి మీడియాకు అంటగట్టేందుకు పన్నాగం పన్నింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అపోహలు సృష్టించేందుకు తెగబడింది. ఇదే అదునుగా ప్రజా గొంతుకను అణగదొక్కాలని పథకం వేసింది. అందులో భాగంగా పచ్చమూకను రెచ్చగొట్టింది. గూండాలను రంగంలోకి దించింది. సాక్షి కార్యాలయంపై దాడికి ఉసిగొల్పింది. సోమవారం సాయంత్రం ఈ మేరకు తిరుపతిలోని టీడీపీ నేతల ఆధ్వర్యంలో రేణిగుంటలోని సాక్షి యూనిట్ ఆఫీస్కు రౌడీమూక తరలివచ్చింది. గేటును తన్నుతూ లోపలికి చొరబడేందుకు యత్నించింది. రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణం సృష్టించింది. అడ్డుకోబోయిన పోలీసులపై సైతం దౌర్జన్యానికి పాల్పడింది.సాక్షి ప్రతినిధి, తిరుపతి : రేణిగుంటలోని తిరుపతి సాక్షి యూనిట్ కార్యాలయంపై సోమవారం సాయంత్రం టీడీపీ మూక దాడికి తెగబడడంపై పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో మాట్లాడిన మాటలను సాక్షి మీడియాకు చుట్టడడంపై మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ఇంతటి అరాచకానికి పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దాడులతో సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తున్న సాక్షి పత్రికను నిలువరించేందుకే కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకగా సేవలందిస్తున్న పత్రిక కార్యాలయంపై దాడి చేయడమంటే, జనంపై దాడి చేయడమే అని స్పష్టం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో రౌడీయిజం చేయడమేంటని నిలదీస్తున్నారు.‘సాక్షి’పై దాడి సరికాదురాష్ట్రంలో సాక్షి కార్యాలయాలపై జరుగుతున్న దాడులు సరికాదు. ఆ టీవీలో ప్రసారమైన అంశంపై చానల్ యజమాన్యం వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఇలా కక్షగట్టి దాడి చేయడం పద్ధతి కాదు. ఉద్యోగులను భయాందోళన కలిగించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు.– నాగరాజు, సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శిభౌతిక దాడులు అన్యాయం‘సాక్షి’పై కక్షకట్టి భౌతికంగా దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించా లి కానీ కార్యాలయాలపై దాడి ఎంతవరకు సమంజసం. నిరసన పేరుతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో సంస్థ ఆస్తికి నష్టం కలుగుతుంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు ఏం అవుతుందో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నా రు. – గంగరాజు, సీపీఎం చిత్తూరు జిల్లా కార్యదర్శిమీడియా స్వేచ్ఛను అణిచివేసే కుట్రనిరంతరం ప్రజాపక్షాన నిలిచి సమాజంలో అరాచకాలను, అక్రమాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న సాక్షి మీడియాపై టీడీపీ నేతలు విచక్షణా రహితంగా దాడి చేయడం ప్రజా స్వరాన్ని, మీడియా స్వాతంత్య్రాన్ని ఆణిచివేసే కుట్ర. పత్రికా స్వేచ్ఛపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించక కఠిన చర్యలు తీసుకోవాలి. – ఎస్. జయచంద్ర,సీఐటీయూ తిరుపతి జిల్లా కార్యదర్శి దాడి దుర్మార్గంసాక్షి కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య. టీడీపీ ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడడం విడ్డూరం. పొరబాటు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పత్రికా కార్యాలయంపై దాడులకు పూనుకోవడం రాజ్యాంగ విరుద్ధం. పోలీసులు కేసు నమోదు చేయాలి. – వందవాసి నాగరాజు, సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శిసెక్షన్ 30 బేఖాతర్రేణిగుంటలో ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. అయితే టీడీపీ నేతలు మాత్రం అధికారమే అండగా చట్టాన్ని అతిక్రమించారు. వందల మంది గూండాలతో కలిసి సాక్షి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇష్టారాజ్యంగా దాడికి యత్నించారు. రోడ్డుపై బైఠాయించారు. చివరకు పోలీసులపై సైతం రౌడీయిజం చేశారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం తూతూమంత్రంగా చర్యలు చేపట్టారు. టీడీపీ నేతలను దాదాపు బతిమాలుకుంటూ సాక్షి కార్యాలయం వద్ద నుంచి పంపించారు.రేణిగుంటలోని సాక్షి యూనిట్ కార్యాలయంపై పచ్చమూక వికృత చేష్టలను పాత్రికేయలోకం ఖండించింది. ప్రజా వాణిని వినిపించే పత్రికను అణచివేసేందుకే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారని భగ్గుమంది. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల్లో సాక్షి విలేకర్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. రౌడీమూకపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా యాదమరి పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరిస్తూ దురుసుగా ప్రవర్తించారు. -
దివ్యదర్శనం..దైవాధీనం
సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో తిరుపతికి తరలివచ్చే యాత్రికులకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కష్టతరంగా మారింది. భక్తి శ్రద్ధలతో కాలినడకన శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లాలనుకునే భక్తులు ఇకపై దివ్యదర్శనం టోకన్లు పొందడం దైవాధీనంగా మారుతోంది. టీటీడీ తీసుకుంటున్న పలు నిర్ణయాలు భక్తుల పాలిట శాపాలుగా మారుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ముందుస్తుగా ఎలాంటి ప్రచారం లేకుండా అనూహ్యంగా చేపట్టే మార్పులు ఇబ్బందికరంగా పరిణమిస్తాయని స్పష్టం చేస్తున్నారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్: శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా మార్పుచేశారు. శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్కి మారుస్తూ టీటీడీ చర్యలు చేపట్టింది. ఈమేరకు ఈ నూతన కౌంటర్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. పెరగనున్న రద్దీ తిరుపతి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి మెట్టు వద్దకు యాత్రికులు చేరుకుని దివ్యదర్శనం టోకన్లు పొంది అక్కడి నుంచి నేరుగా కాలినడకన తిరుమలకు చేరుకునేవారు. అయితే అనూహ్యంగా టోకన్ జారీ కౌంటర్లను అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్కు మార్పుచేశారు. అసలే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అత్యధిక సంఖ్యలో యాత్రికుల రద్దీ ఉంటుంది. అలిపిరి నుంచి కాలినడక వెళ్లే వారు ఒకవైపు, అదే సమయంలో శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్లే భక్తులు దివ్యదర్శనం టోకెన్ల కోసం ఇక్కడికి చేరుకోవడంతో రద్దీ మరింత పెరిగి కొత్త సమస్యలు తలెత్తే అవకాశముంది. ఊహించని పరిణామాలకు ఆస్కారం దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ లభ్యత మేరకు అనే విషయం భక్తులకు ప్రశ్నార్ధకం కానుంది. శ్రీవారి మెట్టు చేరుకుని అక్కడి నుంచి వ్యయ ప్రయాసలతో అలిపిరి వద్దకు వచ్చి టోకెన్ పొందలేని వారు నిరుత్సాహానికి గురికావల్సిందే. ముందు వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత ప్రాతిపదికన టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో భక్తుల మధ్య పోటీతత్వం ఏర్పడి ఊహించని పరిణామాలు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. అలిిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద నిర్దేశించిన కౌంటర్లలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణలో వారి భద్రత, రాక పోకల్లో ఉత్పన్నమయ్యే ట్రాఫిక్ సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే. శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ జారీ కేంద్రం మార్పు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో నూతన కౌంటర్లు ప్రారంభం టీటీడీ నిర్ణయంతో భక్తుల అయోమయం ముందస్తు ప్రచారం లేక అవస్థలుకాలినడక తప్పని తిప్పలు శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్ జారీ కేంద్రాల మార్పు సమాచారం తెలియని భక్తులకు తిప్పలు తప్పవు. . టోకెన్ జారీ కేంద్రాల మార్పు గురించి తెలియని వారు మొదట శ్రీవారి మెట్టుకు చేరుకుంటారు. అక్కడికి తిరుపతి నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంది. విషయం తెలుసుకుని తిరిగి 15 కిలోమీటర్ల దూరంలోని అలిపిరి వద్ద రావాలి. టోకెన్లు పొందిన తర్వాత మళ్లీ 15 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీవారి మెట్టు వద్దకు చేరుకోవాలి. దీంతో అదనంగా ప్రయాణ ఖర్చు పెరిగే ప్రమాదముంది. -
హెరిటేజ్ ఫ్యాక్టరీతో నష్టపోతున్నాం
చంద్రగిరి: హెరిటేజ్ ఫ్యాక్టరీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని.. నీటి కాలుష్యం వల్ల పంట దిగుబడులు సరిగ్గా చేతికిరాక.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కాశిపెంట్ల సమీపంలో ఉన్న హెరిటేజ్ ఫ్యాక్టరీ ముందు స్థానికులు, రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనకారులు మాట్లాడుతూ.. హెరిటేజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల ఏర్పాటు చేస్తామని, ఇంటింటికి తాగునీరు అందిస్తామని, రోడ్లు నిర్మించి ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చారని తెలిపారు. దీంతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరించామన్నారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా.. గాలి, నీటి కాలుష్యం వల్ల తమ పంటలు నాశనం అవుతున్నాయని.. ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని వాపోయారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని.. నిరసనకారులు, అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారమయ్యేలా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని ఫ్యాక్టరీ అధికారులు హామీ ఇవ్వడంతో స్థానికులు తాత్కాలికంగా నిరసనను విరమించారు. -
‘చంద్రబాబు.. ఎల్లకాలం మీ ఆటలు సాగవు’
తిరుపతి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఖండించారు. ఆయన ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా క్షమాపణలు చెప్పడం జరిగిందని, దీన్ని రాజకీయం చేస్తన్నారని నారాయణస్వామి మండిపడ్డారు. మహిళా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్ జగన్ అని, గత ఐదేళ్లలో మహిళా అభ్యున్నతి ఆయన కృషి చేశారన్నారు. కార్పొరేటర్లు, మేయర్, జడ్పి చైర్మన్, రాష్ట్ర స్థాయి పదవుల్లో 60 శాతం మహిళలకు అందించిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. చంద్రబాబ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఆయన రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవని, చంద్రబాబ ఇది గుర్తుపెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు నారాయణస్వామి. -
అమానుషం.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై టీడీపీ దౌర్జన్యం
రాష్ట్రంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. నిరసనకారుల ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షికి ఆపాదిస్తూ సాక్షి కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ముందుగా ప్లాన్ చేసి ‘సాక్షి’పై దాడులకు దిగుతుంది పచ్చపార్టీ. ఆ వ్యాఖ్యలతో సాక్షి మీడియాకు సంబంధం లేకపోయినా అసత్య ఆరోపణలతో దాడులకు పాల్పడుతుంది పచ్చదండు. సాక్షిపై అసత్య ఆరోఫణలు అనేవి కేవలం దాడులు చేసేందుకే అనే విషయం తేటతెల్లమైంది. టీడీపీ గూండాల దాడితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర బట్టబయలైంది. విజయవాడ సాక్షి మీడియా కార్యాలయం పై టిడిపి పార్టీ రౌడీల దాడుల పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదుసాక్షి మీడియా కార్యాలయం పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్డీసీపీ సరితకు వినతిపత్రం అందించిన విజయవాడ బ్రాంచి మేనేజర్ యశోధరాజు, సాక్షి పేపర్, టీవీ ప్రతినిధులుకర్నూలు:సాక్షి పత్రిక మీడియా కార్యాలయంపై టీడీపీ రౌడీల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన పాత్రికేయులురాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి మీడియా పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరిన జర్నలిస్టుల సంఘాల నేతలుకర్నూలు ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీనివాస్ ఆచారికి వినతి పత్రాన్ని అందించిన సాక్షి మీడియా పాత్రికేయులు సాక్షి కార్యాలయాలపై టీడీపీ కుట్రపూరిత దాడులు👉 ఏపీలో అన్ని జిల్లాల్లో సాక్షి కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తల భౌతిక దాడులు 👉టీడీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాడులకు కుట్ర👉రాళ్లు, కర్రలతో దాడులు చేస్తన్న టీడీపీ గూండాలు👉దాడులకోసం ఉదయం నుంచి టీడీపీ మూకల మోహరింపు👉పథకం ప్రకారం ఆర్గనైజ్డ్గా సాక్షి కార్యాలయాలపై దాడులు👉విజయవాడ, మంగళగిరి, వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళంలో దాడులు👉సాక్షి బోర్డులు ధ్వంసం చేసి, ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నం👉అన్ని జిల్లాల్లో సాక్షి ఆఫీసులపై దాడులు చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు👉రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న అధికార పార్టీ👉రాష్ట్ర చరిత్రలో ఏ మీడియాపైనా జరగని రీతిలో టీడీపీ నేతల దాడులు మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ దౌర్జన్యం👉సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం👉మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు దౌర్జన్యం👉. టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు కలిసి సాక్షి కార్యాలయం బోర్డు ధ్వంసం👉బోర్డున ధ్వంసం చేసిన మాదిగ కార్పోరేషన్ చైర్మన్ శిరీష్👉అడ్డుకునేందుకు పోలీసులు యత్నం, వాగ్వాదంఆందోళన పేరుతో విజయవాడ, మంగళగిరి, తిరుపతి, కడప, శ్రీకాకుళం, అనంతపురంలోని సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. రేణిగుంట సాక్షి ఆఫీస్ వద్ద టీడీపీ గూండాల బీభత్సం సృష్టించారు. రేణిగుంటలోని సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి దిగారు. అదే సమయంలో సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు.అనంతపురంలోని సాక్షి కార్యాలయంపై సైతం టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. నిరసనకారల ముసుగులో సాక్షి కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు.. సాక్షి బోర్డు తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. శ్రీకాకుళం, కడప సాక్షి కార్యాలయాల వద్ద కూడా పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు. -
నకిలీ పత్రాలతో ఆస్తులు అమ్మేసిన వ్యక్తి అరెస్ట్
తిరుపతి రూరల్: నకిలీ పత్రాలు సృష్టించి విలువైన ఆస్తులు కాజేసి ఇతరులకు అమ్మేసిన వ్యక్తిని తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ చిన్న గోవిందు కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండల పరిధిలోని శ్రీనివాస హౌసింగ్ సొసైటీలో శారద అనే మహిళకు చెందిన ఆస్తిని చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన మునిరత్నంరెడ్డి మరో ఇద్దరితో కలిసి రూ.86 లక్షలకు విక్రయించాడు.అలాగే వేదిక్ అపార్ట్మెంట్లో ఒక సారి అమ్మిన స్థలాన్ని మరొకరికి కట్టబెట్టి అక్రమంగా సొమ్ము చేసుకున్నాడు. రాజ కుమారి అనే మహిళకు సంబంధించిన ఆస్తిని తన భార్యపై రిజిస్టర్ చేసుకుని వేరొకరికి అమ్మేశాడు. ఇలా ఎంతో మంది భూములకు నకిలీ పత్రాలతో విక్రయించినట్లు పోలీసులకు వరుస ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన పోలీసులు మునిరత్నం రెడ్డిని ఆదివారం మల్లవరం క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చైన్నెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నిందితుడి నుంచి పలు డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గారడీ
● పీఠం ఎక్కిన తర్వాత బురిడీ ● యువతీయువకులను మోసం చేసిన చంద్రబాబు ● ఏటా 4లక్షల ఉద్యోగాలు.. జాబ్ క్యాలెండర్ అంటూ వంచన ● నిరుద్యోగ భృతి పేరిట శఠగోపం ● అయోమయంలో ఆప్కాస్ సిబ్బంది భవితవ్యం ● రద్దు చేసే దిశంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ● కలగానే ఒకటో తేదీన వేతనం ● కూటమి సర్కార్ వైఖరిపై మండిపడుతున్న జనం ● గత వైఎస్సార్సీపీ హయాంలో 2.25 లక్షల మందికి ఉద్యోగావకాశం ● జగనన్న పాలనలో ఉపాధి కల్పనే లక్ష్యం వేతన జీవుల వెతలు ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖున వేతనాలు జమ చేస్తామని బాబు చెప్పిన మాటలు నమ్మి వేతన జీవులు మోస పోయారు. జిల్లాలో సుమారు 85వేల మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు సకాలంలో జీతం అందక ప్రతి నెలా నరకం అనుభవిస్తున్నారు. ఏడాదిగా ఏనాడూ ఒకటో తేదీన జీతం జమకాకపోవడంతో ఈఎంఐలు, లోన్లు, వడ్డీలు, నిత్యావసర సరుకులకు నానా అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తిరుపతి సిటీ : యువతకు ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచి జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల భృతి అందిస్తాం. పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించి యువతకు ఉపాధి కల్పించి తీరుతాం అంటూ సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు అండ్ కో ప్రగల్భాలు పలికారు. యువతను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్న ఒక్క ఉద్యోగం లేదు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యూటర్న్ తీసుకున్న కూటమి సర్కార్ను చూసి మోస పోయామంటూ యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. అలాగే ఉద్యోగాల కల్పన మాట దేవుడెరుగు ఉన్నవాటిని తొలగించి చిరుద్యోగులను రోడ్డుపాలు చేస్తున్నారు. ఆప్కాస్ను పూర్తిగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గాలం వేసి..నామం ఎన్నికలలో యువతకు గాలం వేసి ఓట్లు దండుకునేందుకు యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ ఊరు వాడా తిరుగుతూ అబద్ధపు మాటలతో ముఖాముఖి పేరుతో సభలు నిర్వహించారు. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలను ఏటా భర్తీ చేస్తాం. ఏడాదికి 4లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం. నిరుద్యోగ భృతిని అందిస్తామని ఊదరగొట్టారు. అధికారం చేపట్టి విద్యాశాఖ మంత్రిగా తనకు మాత్రమే ఉపాధి కల్పించుకుని నిరుద్యోగులకు శఠగోపం పెట్టేశారు. 2024 జూన్ నుంచి ఏడాదిగా ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వంగా పేరుపొందింది. ఆప్కాస్ రద్దు దిశగా అడుగులు జిల్లాలో తాత్కాలిక ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆప్కాస్ ఉద్యోగులపై కక్ష పెంచుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15వేల మందిని తొలగించింది. అంతటితో ఆగకుండా జగనన్న పాలనలో ఏర్పాటు చేసిన ఆప్కాస్నే పూర్తిగా రద్దు చేసేందుకు అడుగులు వేస్తోంది. దీంతో జిల్లాలో సుమారు 30వేల మంది తాత్కాలిక ఉద్యోగులు వీధిన పడనున్నారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఉద్యోగులకు టైం స్కేల్ అందిస్తూ పీఎఫ్ను వర్తింపజేస్తామని హామీ చెప్పిన కూటమి సర్కార్ చేతులెత్తేసింది. జీతభత్యాలు సైతం సక్రమంగా అందిచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. త్వరలో ఆప్కాస్ను రద్దు చేసేందుకు పావులు కదుపుతోంది. దీంతో ఆప్కాస్ ఉద్యోగులు ఆందోళనకు సిద్దమవుతున్నారు.భృతి అంతా భ్రాంతి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో యువతకు చేసింది శూన్యం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో కలిపి ఖాళీగా ఉన్న సుమారు 98వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీ తుంగలో తొక్కేసింది. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన యువతకు అదే ఏడాదిలో ఉద్యోగం కల్పించేందుకు పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని గాలికి వదిలేసింది. నిరుద్యోగ భృతి కోసం పడిగాపులు కాస్తున్న యువతకు చివరకు భ్రాంతినే మిగిల్చింది. సూపర్ సిక్స్ పేరుతో చేసిన వంచననే మళ్లీ యువత విషయంలో పునరావృతం చేసింది. బకాయితో పాటు చెల్లించాలి యువగళంలో లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి చెల్లించాలి. గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. ఇప్పటి వరకు 12నెలలకు గాను ఒక్కో నిరుద్యోగికి రూ. 36వేలు చెల్లించాల్సి ఉంది. ఏడాదికి 4లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. తూతూ మంత్రంగా మెగా డీఎస్సీ అంటూ హంగామా చేస్తున్నారు. – రవిశంకర్రెడ్డి, ఎంబీఏ, తిరుపతి జాబ్ క్యాలెండర్ ఊసే లేదు ఎన్నికల హామీలలో భాగంగా కూటమి నేతలు యువతను ఆకట్టుకుంటూ పథకాలను అమలు చేస్తా మని మేనిఫెస్టోలో పెట్టా రు. కానీ సూపర్సిక్స్ హామీ ల్లో ఒక్కటీ అమలు కాలేదు. కనీసం యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రతి ఏడాది జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఆ ఊసే ఎత్తడం లేదు. యువతను కూటమి సర్కార్ వంచించింది. వైఎస్సార్సీపీ పాలనలో తొలి ఏడాదిలోనే 2.25లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అందులో మా అక్కకు సైతం ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. – సుకన్య, ప్రైవేటు ఉద్యోగి, తిరుపతి రూరల్ ఉద్యోగాలు ఎక్కడ? తమను గెలిపిస్తే ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు యువతను నమ్మించాడు. ఈ ఏడాది కాలంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని 6.47 లక్షల ఉద్యోగాలు ఇస్తే అందులో 2.25 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్నవాటిని తీసేస్తున్నారు. ఉద్యోగులకు భద్రత కరువైంది. ఉద్యోగం ఇచ్చే వరకు రూ.3వేల భృతి ఇస్తామన్న బాబు 12 నెలలు గడిచినా ఆ మాటే మరిచారు. – కదిరి రాజేంద్ర, తిరుపతి ఇది దగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. యువతకు జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి లేదు. సుమారు లక్ష మంది పని చేస్తున్న ఆప్కాస్ను ఎత్తేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమైన విషయం. కూటమి ప్రభుత్వం కాదు ఇది యువత పాలిట దగా ప్రభుత్వం. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. – పి.శరత్చంద్ర, మణిపిరెడ్డిపల్లె, పాకాల మండలం కక్ష గట్టింది కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ఉద్యోగులపై కక్ష గట్టింది. వేధింపులకు పాల్పడుతూ తొలగించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఇలా చిరుద్యోగులపై కత్తిగట్టడం దారుణం. టైమ్ స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తూ పీఎఫ్ సైతం వర్తింపజేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తాం. పోరు బాట పట్టి సర్కారు మెడలు వంచుతాం. – జి.చిన్న బాబు, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిరుద్యోగులపై ప్రతాపమా? గత 25ఏళ్లుగా ప్రభుత్వ సంస్థలలో చాకిరీ చేస్తున్న చిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం ప్రతాపం చూపడం సరికాదు. ఆప్కాస్ను తొలగిస్తామనడం దారుణం. చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెనెట్టుకొస్తున్న తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు కృషి చేస్తుందని భావించాం. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఊహించలేదు. టైంస్కేల్ ఉద్యోగులుగా గుర్తించకపోతే ఉద్యమిస్తాం. – పి.బాబు, జేఏసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వైఎస్సార్సీపీ పాలనలో స్వర్ణయుగం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేసింది. అర్హులైన వారికి ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించింది. ఈ క్రమంలో వేలాది మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలు దక్కించుకున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.25లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అన్ని శాఖలలోనూ పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను ఆప్కాస్ కిందకి తెస్తూ ఉద్యోగ భద్రత కల్పించారు. ఔత్సాహిక యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో జాబ్ మేళాలు నిర్వహించి తొలి ఏడాదిలోనే సుమారు 1.24లక్షల ఉద్యోగాలను యువతకు అందించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు సచివాలయ సిబ్బంది 5,010 వలంటీర్లు 11,938 ఎండీయూ ఆపరేటర్లు 369 వైన్షాప్ సిబ్బంది 856 విద్యా, వైద్య రంగాల్లో 8,752 ప్రభుత్వ శాఖలలో(శాశ్వత, తాత్కాలిక) 10,257 జాబ్ మేళాల్లో ఉద్యోగాలు పొందిన వారు 33,740 -
ఎంసెట్ ఫలితాల్లో మెరుపులు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ ఈఏపీ (ఎంసెట్) ఫలితాలు ఆదివారం విడుదల చేశారు. ఇందులో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభను చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో తిరుపతికి చెందిన మాండవ్యపురం భానుచరణ్రెడ్డి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించారు. అలాగే ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో మణిద్వీప్రెడ్డి 7వ ర్యాంకు, ఓ.ఆరుష్ లక్ష్మణ్ 45వ ర్యాంకు, ధనుష్ 59, యశ్విత 69, మౌనిక 94, వి.యశ్వంత్ 135, డి.లావణ్య 230, లక్ష్మీసహస్ర 322, ఎ.జెస్విత 398, కె.జస్విత 444, వై.శివకృతిక్ 492, హర్షవర్ధన్ 528, ఎం.ఉమేష్ 551, ఎం.హిమవర్ష 787, సి.రామలక్ష్మమ్మ 799, వి.లక్ష్మీహర్షిత 800, కె.మంజునాథ మహర్షి 900, కె.టీనారాణి 919, వి.సాధన 925వ ర్యాంకులు దక్కించకుని సత్తా చాటారు. ఏఐ రంగంలో రాణించాలి ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును మాండవ్యపురం భానుచరణ్రెడ్డి సాధించారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ఎం.జయభారత్రెడ్డి, ఎం.సురేఖ దంపతుల కుమారుడైన భానుచరణ్రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో రాణించడమే తన లాంగ్ టర్మ్ గోల్ అని తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుతం ఐఐటీ బాంబేలో సీటు పొంది సీఎస్ఈ చదవడమే తన లక్ష్యమని వెల్లడించారు. – మాండవ్యపురం భానుచరణ్రెడ్డి, తిరుపతి -
పేరూరులో రూ.20 కోట్ల భూమి కబ్జా
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబరు 529లోని ఎకరా భూమి ఆక్రమణకు గురైంది. తిరుపతి– చంద్రగిరి మార్గంలోని స్టాఫ్ క్వార్టర్స్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఈ భూమి విలువు ప్రస్తుతం మార్కెట్లో రూ.20 కోట్ల వరకు ఉంది. దీనిపై రెండు నెలల క్రితమే సాక్షిలో వార్త ప్రచురితం కావడంతో ఆక్రమణదారులు కొంతకాలం పనులు నిలుపుదల చేశారు. ఆదివారం మళ్లీ ఆక్రమిత భూమిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే భూమిపై కోర్టును ఆశయ్రించిన ఓ మహిళ అక్కడకు వెళ్లి పనులు అడ్డుకునేందుకు విఫలయత్నం చేసింది. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత ఒత్తిడి కారణంగానే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
డిగ్రీలో ప్రవేశాలు అంతంతే
ఇంటర్ పూర్తి చేసి సాధారణ డిగ్రీ పూర్తి చేస్తే ఉద్యోగాలు దొరకవనే అపోహ కారణంగా డిగ్రీలో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. దీంతో ఆ ఎఫెక్ట్ పీజీ కోర్సులపై పడుతోంది. ప్రస్తుతం డిగ్రీ కోర్సులలోనూ ప్రభుత్వం డబుల్ మేజర్ సబ్జెక్ట్తో పాటు ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఎన్ఈపీతో డిగ్రీ స్థాయిలో విదార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు. – పీసీ వెంకటేశ్వర్లు, కన్వీనర్, పీజీ సెట్–2025 పీజీ కోర్సులతో ఉన్నత ఉద్యోగాలు పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఎన్ఈపీ ద్వారా విద్యారంగంలో పలు నూతన సంస్కరణలకు బీజం పడింది. ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పీజీ కోర్సులతో పాటు స్కిల్డెవలప్మెంట్ పెంపొందించుకోవాల్సిన అవసరముంది. డిగ్రీలో ప్రవేశాలు తగ్గడంతో పాటు డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగాల వైపు యువత వెళ్లడమే పీజీలో అడ్మిషన్లు తగ్గడానికి ప్రధాన కారణం. – సీహెచ్ అప్పారావు, వీసీ, ఎస్వీయూ ఆలోచించాల్సిందే.. డిగ్రీ పూర్తి చేసిన యువత ఉపాధి వైపు చూస్తున్నారు. పీజీ, పీహెచ్డీలపై అధునిక యువత ఉత్సాహం చూపకపోవడంపై ఆలోచించాల్సిందే. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థి తన లక్ష్యం మెడిసిన్, ఇంజినీరింగ్ అనే భావిస్తున్నారు. దీంతో సాధారణ డిగ్రీలో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. తల్లిదండ్రులు సైతం వారి ఆలోచనను ప్రొత్సహిస్తున్నారు. ఉన్నత విద్యే లక్ష్యంగా విద్యార్థుల అడుగులు పడాలి. –సురేంద్రబాబు, ఎగ్జామినేషన్స్ డీన్, ఎస్వీయూ -
క్రేజ్ లేని పీజీ
● పోస్టు గ్రాడ్యుయేషన్పై విద్యార్థుల నిరాసక్తత ● గత ఏడాది కంటే 6 వేలు తక్కువగా దరఖాస్తులు ● భారీగా పడిపోతున్న సాధారణ డిగ్రీలో ప్రవేశాలు ● యూజీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి వైపు చూస్తున్న యువత తిరుపతి సిటీ : పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పెద్ద చదువుగా భావించేవారు. పీజీ చేసిన వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండేది. అత్యున్నత విద్యగా గుర్తింపు పొందిన పీజీకి ప్రస్తుతం ఆదరణ కరువవుతోంది. ఎంఏ, ఎమ్కాం, ఎమ్మెస్సీ తదితర కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏటా తగ్గుముఖం పడుతున్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్, ఎంబీబీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులపై మొగ్గు చూపుతున్నారు. దీంతో సాధారణ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పీజీ కోర్సులకు ఆదరణ తగ్గుతోందని వెల్లడిస్తున్నారు. తగ్గిన దరఖాస్తులు గత ఏడాది పీజీ సెట్కు 32 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది 6 వేలు తగ్గడం గమనార్హం. 31 సబ్జెక్టులకు సంబంధించి పీజీలో సుమారు 25 వేల సీట్లు ఉండగా 25,688 దరఖాస్తులు రావడంతో పీజీ కోర్సులలో ప్రస్తుతం ఉన్న సీట్లకు అందిన దరఖాస్తులతో పోలిస్తే పోటీ 1:1గా ఉంటుందనడంలో సందేహంలేదు. ఈ ఏడాది పీజీకి దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లు వచ్చిన దరఖాస్తుల వివరాలు కోర్సులు పీజీసెట్–2024 పీజీసెట్–2025 కెమికల్ సైన్స్ 8,551 6,070 లైఫ్ సైన్స్ 3,753 4,027 కంప్యూటర్ 2,975 2,333 కామర్స్ 2,215 1,438 ఇంగ్లిష్ 1,127 898 హ్యుమానిటీస్ 1,575 883 జువాలజీ 1,875 1,548 గణితం 2,200 1,175 ఫిజిక్స్ 1,495 938 బోటనీ 1,370 1,295 మిగిలినవి 6,013 5,083ఉపాధి వైపు యువత మొగ్గు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల వైపు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం యూజీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం వైపు ఎక్కువగా మొగ్గుతున్నారు. – భూపతినాయుడు, రిజిస్ట్రార్, ఎస్వీయూ -
నలుగురు ఎర్రదొంగల అరెస్ట్
తిరుపతి మంగళం : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అటవీప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 48 ఎరచ్రందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ జి. బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ మురళీధరరెడ్డి టీమ్ శనివారం అన్నమయ్య జిల్లా బురకాయల కోట అటవీ ప్రాంతం చేరుకుంది. స్థానిక అటవీ అధికారులు జయప్రసాదరావు, మోహన్ రెడ్డి, షబీన్ తాజ్ ల సహకారంతో వేపూరి కోట ఫారెస్ట్ బీటు పరిధిలో కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున వీరుఅన్నగారిపల్లె సమీపంలోని వంకగట్టు వద్ద ఎర్రదొంగలు కనిపించారు. పారిపోయేందుకు యత్నింగా వెంబడించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. నిందితులతోపాటు ఎరచ్రందనం దుంగలు, మోటారు సైకిల్ను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గరుడునిపై నృసింహుని విహారం
రాపూరు : పెంచలకోనలోని పెనుశిల శ్రీలక్ష్మీనరసింహాస్వామివారు చందనాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆదివారం స్వాతి నక్షత్రం శ్రీవారి జన్మనరక్షత్రం కావడంతో మూల మూర్తిని చందనంతో అలంకరించారు. ఉదయం అభిషేకం, పుష్పాలంకరణ, శాంతి హోమం జరిపించారు. అనంతరం కనులపండువగా కల్యాణోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేపట్టారు. రాత్రి శ్రీవారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనం అధిష్టించి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. 23న ఒలింపిక్ రన్ తిరుపతి కల్చరల్ : జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన ఒలింపిక్ రన్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ త్వరలో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. . అనంతరం 40 ఏళ్లుగా క్రీడలకు సేవలందిస్తున్న ప్రసన్నకుమార్ని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్, కోశాధికారి సాయికుమార్, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, సహ కార్యదర్శి విజయ్కుమార్, రత్నాకర్, తైక్వాండో సంఘం నేత గోపీనాయుడు, బ్యాడ్మింటన్ సంఘం నేత శివయ్య, రాకెట్ బాల్ సంఘం నేత ప్రేమ్, రోయింగ్ సంఘం శ్రీధర్, రైఫిల్ రోయింగ్ సంఘం హిమత్ పాల్గొన్నారు. టీటీడీ కాలేజీల్లో పేద విద్యార్థులకు దగా తిరుపతి కల్చరల్ : టీటీడీ జూనియర్ కళాశాలల్లో పేద విద్యార్థులను దగా చేస్తున్నారని, ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాల వారికి పెద్దపీట వేస్తున్నారని ఓబీసీ విద్యార్థుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. తిరుపతి నగరంలో టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో అడ్మిషన్కు పెద్దసంఖ్యలో బీసీ, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే ఈడబ్ల్యూఎస్ కింద తక్కువ మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థులకు సీట్లు కేటాయించారని మండిపడ్డారు. ఎక్కువ మార్కులు సాధించిన పేద విద్యార్థులకు సీట్లు దక్కకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 330 మార్కులు సాధించిన ఓసీ విద్యార్థినికి పద్మావతి మహిళా కళాశాలలో సీటు లభించిందని, అయితే ఎస్టీ విద్యార్థినికి 530 మార్కులు వచ్చినా తిరస్కారమే ఎదురైందన్నారు. పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ఈడబ్ల్యూఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం నేతలు విజయ్ ఉత్తరాది, వెంకటేష్, సంభరం పాల్గొన్నారు. -
టీటీడీ విజిలెన్స్ వైఫల్యం.. తిరుమలలో మరో అపచారం.. వీడియో
తిరుపతి: తిరుమలలోని అలిపిరి చెక్ పాయింట్కు సమీపంలోని ఏటీఎం సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మద్యం తాగిన వ్యక్తులు ఖాళీ సీసాను అలిపిరి మెట్ల మార్గంలో వేయడం శ్రీవారి భక్తులు ఆగ్రహానికి కారణమైంది.అయితే, అలిపిరి తనిఖీ కేంద్రానికి కూతవేటు దూరంలో అలిపిరి నడక మార్గం ప్రారంభం అవుతుంది. ఈ ప్రాంతంలో దాదాపు 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా టీటీడీ నిఘా ఉంచింది. అలిపిరి మెట్ల మార్గం ప్రారంభ ద్వారం వద్ద లగేజీ కౌంటర్కు అభిముఖంగా ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో అండర్ పాస్ ద్వారా అలిపిరి మెట్ల మార్గం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ అండర్ పాస్ ద్వారాకాలినడక ప్రారంభిస్తారు. ఏటీఎంకు ఆనుకుని కొంత ఖాళీస్థలం ఉండటంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు.టీటీడీ విజిలెన్స్ నిఘా వైఫల్యమే ఇందుకు కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ నిద్ర మత్తులో తూలుతోందనే విషయం ఇటీవల వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగిన ‘మాకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్య ధోరణి విజిలెన్స్ నిఘా విభాగం సిబ్బందిలో పెరిగిపోయింది. సిబ్బంది పనితీరును నిరంతరాయంగా పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో వరుస నిఘా వైఫల్యాలు వెలుగు చూస్తున్నాయి. పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.🚨 #BRNaiduUnfitForTTDఅలిపిరి మెట్ల మార్గంలో కాకుండా.. మద్యం సీసాలపై నడుచుకుంటూ భక్తులు కొండపైకి వెళ్లాలా @ncbn, @PawanKalyan, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ?శ్రీవారి సన్నిధిలో మద్యాన్ని ఏరులైపారిస్తున్న కూటమి ప్రభుత్వం. మందు తాగేసి బాటిల్స్ ను మెట్లపై విసురుతున్న మందుబాబులు… pic.twitter.com/HftbdINhv1— YSR Congress Party (@YSRCParty) June 8, 2025 -
అదుపు తప్పిన కారు.. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..
సాక్షి,తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో కారు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ పైకి కారు దూసుకెళ్లింది. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు ప్రయాణిస్తున్నారు. అయితే, వారు ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ కాకపోవడంతో మొదటి ఘాట్ రోడ్డు 4వ మలుపు సమీపంలో డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స కొనసాగుతోంది. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . శనివారం అర్ధరాత్రి వరకు 88,257 మంది స్వామిని దర్శించుకున్నారు. 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.68 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు జ్యేష్టాభిషేకంఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది.ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్
సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడి తిరుపతి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రథమ, ద్వితీయ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు శనివారం ప్రకటించింది. గత నెల 12 నుంచి 20వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షకు ప్రథమ సంవత్సర జనరల్ విద్యార్థులు 7,985మంది హాజరవ్వగా వారిలో 4,068(51శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర జనరల్ విద్యార్థులు 4,708మందికి 3,360(71శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 301 మందికి 160(53శాతం) మంది, ద్వితీయ సంవత్సరంలో 244మందికి 188(75శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్, ఒకేషనల్లో కలిపి 13,238 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా వారిలో 7,770(59శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో తిరుపతి జిల్లా 4వ స్థానం సాధించినట్లు ఆర్ఐఓ జి.రాజశేఖర్రెడ్డి తెలిపారు. తిరుపతి నుంచి మూడు రాష్ట్రాలకు ఆర్టీసీ సర్వీసులు తిరుపతి అర్బన్: తిరుపతి నగరం నుంచి దేశంలోని ముఖ్యమైన అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేయడానికి గతంలోనే ప్రణాళికలు తయారు చేశారు. వాటిని అమలు చేయాల్సి ఉందని తిరుపతి డీఎం బాలాజీ తెలిపారు. ఆయన శనివారం తమ చాంబర్ నుంచి మాట్లాడుతూ ప్రస్తుతం తిరుపతి నుంచి తమిళనాడుకు ప్రతి రోజు 131 నడుస్తున్నాయి, అలాగే తమిళనాడు ఆర్టీసీ నుంచి తిరుపతికి రోజు 136 సర్వీసులు వచ్చిపోతున్నాయి వెల్లడించారు. తిరుపతి నుంచి కర్నాటకకు 41 సర్వీసులు నడుస్తున్నాయని, కర్నాటక నుంచి తిరుపతికి 33 సర్వీసులు వచ్చిపోతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణాకు తిరుపతి నుంచి 62 సర్వీసులున్నాయని, తెలంగాణ నుంచి తిరుపతికి 61 సర్వీసులు ఉన్నట్లు చెప్పారు. వీటితోపాటు కేంద్రపాలిత ప్రాంతం అయిన పాండిచ్చేరికి నిత్యం ఉదయం, సాయంత్రం బస్ సర్వీసులు నడుపుతున్నట్లు వివరించారు. అయితే తాజాగా ఒడిస్సా రాష్టం వారు ఈ నెల 11 నుంచి పూరి – తిరుపతికి రెండు సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పూరి నుంచి తిరుపతికి ట్రయల్ రన్గా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు. అత్యాధునికంగా అలిపిరి టోల్ ప్లాజా తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈఓ శ్యామల రావు ఆదేశించారు. శనివారం ఈఓ తన ఛాంబర్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల వాహనాలు, లగేజీని తక్కువ సమయంలో స్కాన్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టీటీడీ ఐటీ విభాగం, విజిలెన్స్ కసరత్తు చేయాలన్నారు. -
విజన్ డాక్యుమెంట్స్ సిద్ధం చేయండి
తిరుపతి అర్బన్ : విజన్ డాక్యుమెంట్స్ 2047కు సంబంధించి ఏ పనులు చేపట్టాలనే అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో టెలికాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహాలతోపాటు నియోజకవర్గ ఇన్చార్జి అధికారులతో సమీక్షించారు. ఈనెల 9న సీఎం చంద్రబాబు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్పై వర్చువల్గా జిల్లా అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు. అలాగే ఏడాది కాలంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వాటిని, శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్న వాటిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అలాగే ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాలపై అవగాహన పెంచాలని సూచించారు. ఆదివారం డివిజన్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించే సీనియర్ సిటిజనన్ యోగా కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ఈనెల 9న సోమవారం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు, డివిజన్, జిల్లా ప్రధాన కేంద్రంలో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆర్ఐఓలు యోగా పై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని చెప్పారు. -
కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం
● టీడీపీ నేతలా వ్యవహరిస్తున్న సీఐ ● పసుపు చొక్కా వేసుకోండంటూ సీఐపై మండిపాటు ● తిరుపతి రూరల్ సీఐపై చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆగ్రహం ● బాధితులతో కలిసి డీఎస్పీకి ఫిర్యాదు తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్ పంచాయతీలో జరిగిన వివాదంపై శనివారం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి బాధితులతో కలిసి సీఐ చిన్నగోవిందుతో పాటు గొడవలకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్ పంచాయతీ సర్పంచ్ ముసుకు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా తన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి జన్మదిన వేడుకలు జరుపుకుంటుండగా స్థానిక టీడీపీ మహిళా నేత హేమలత, ఆమె కుమారుడు చిట్టి.. సర్పంచ్ ప్లెక్సీలను చించివేశారు. దీంతో తమ ప్లెక్సీలు ఎందుకు చింపుతున్నారని అడిగిన సర్పంచ్ కోటేశ్వరరావుతో పాటు అతని భార్య ముని పుష్పపై దాడి చేశారన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడైనా పల్లెల్లో ఏదైనా గొడవ జరిగితే పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతియుత పద్ధతిలో అణచివేస్తారన్నారు. కానీ తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు మాత్రం గొడవలకు గల కారణాలు తెలుసుకోకుండా సర్పంచ్ ఇంటికి బర్త్డే పార్టీకి వచ్చిన గ్రామస్తుల అందరిపై లాఠీ చార్జి చేయడం, అక్కడ టీడీపీ ప్లెక్సీలు అలాగే ఉండగా, వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను బలవంతంగా తాను సీఐ అన్న విషయం మరిచి ఆయనే చించివేయడం, తన సిబ్బంది చేత చించివేయించడం వంటి పనులు చేశారన్నారు. అలా చేయడం పోలీసులకు తగదని, ఖాకీ చొక్కా వేసుకుని అలాంటి పనులు చేయడం కంటే పసుపు చొక్కా వేసుకుని చేస్తే బాగుంటుందని మోహిత్రెడ్డి హితువు పలికారు. పోలీస్ స్టేషన్లోనూ కవ్వింపు చర్యలు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు బాధితులతో కలసి చెవిరెడ్డి మోహిత్రెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్పీని కలవడానికి వస్తారని తెలుసుకున్న సీఐ చిన్నగోవిందు ముందుగానే టీడీపీకి చెందిన వర్గీయులను అక్కడకు పిలిపించుకున్నట్లు బాధిత వర్గాలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడకు చేరుకోవడంతో లింగేశ్వర నగర్కు చెందిన టీడీపీ వర్గీయులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసులు చూస్తుండగానే బూతులు తిడుతూ వారిని రెచ్చగొట్టేలా వ్యవహరించారన్నారు. అనంతరం సీఐ చిన్నగోవిందు చర్యలను తప్పుబడుతూ కొంత సేపు నిరసన వ్యక్తం చేసి వెళ్లారు. సీఐ ఏకపక్ష ధోరణి గతంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి టీడీపీ వాళ్లపై ఫిర్యాదులు తీసుకోకుండా సీఐ ఏకపక్షంగా వ్యవహరించారని మోహిత్రెడ్డి ఆరోపించారు. ఇటీవల వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఒకరు ఏదో పోస్టు పెట్టారని అతడిపై కక్ష గట్టి స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో అక్రమంగా అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు పంపించారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలనే టార్గెట్గా పెట్టుకుని వేధింపులకు దిగుతున్న సీఐపై న్యాయ పోరాటం చేస్తామని, అంతకంటే ముందు ఆయన పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. తమ ఫిర్యాదుపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానంలో ప్రైవేటు కేసులు వేస్తామన్నారు. లింగేశ్వరనగర్ పంచాయతీలో తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు చేసిన అరాచకం వీడియోలను కోర్టు ముందు పెట్టి కచ్చితంగా ఆయనపై కేసులు నమోదయ్యేలా చూస్తామని, అంతకంటే ముందుగా తమ పార్టీ సర్పంచ్ ఫ్లెక్సీలు చించివేసి గొడవకు కారకులైన వారందరిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చెవిరెడ్డి మోహిత్రెడ్డి వెంట పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
నాయుడుపేటటౌన్ : ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తు తెలియని వ్యక్తి నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద మృతి చెందిన ఘటన శనివారం సూళ్లూరుపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ మాల కొండయ్య తెలిపిన మేరకు వివరాలు ఇలా.. చైన్నె ఈ రోడ్ నుంచి జబల్పూర్నకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు నుంచి శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలి యని వ్యక్తి జారి పడి మృతి చెందినట్లుగా స్టేషన్ సూపరిండెంట్ లక్ష్మీనారాయణ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి చేతిపై ఇంగ్లీష్లో జ్యోతి పేరుతో టాటు వేసుకుని ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని స్ధానిక ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో భద్రపరిచి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. -
మామిడీలా
● గిట్టుబాటుపై ఆందోళన ● రైతులకు సర్కారు భరోసా కరువు తిరుపతి అర్బన్ : జిల్లాలో 60 వేల ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. ఈ ఏడాది పంట దిగుబడి రెండు నెలలు ఆలస్యంగా వచ్చింది. ఎప్పుడు లేని విధంగా పూత పెద్ద ఎత్తున రాలిపోయింది. 60 వేల ఎకరాల్లో 3.75 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అంచనా. మామిడి గుజ్జు పరిశ్రమ నిర్వాహకులు సిండికేట్ కావడంతో మార్కెట్లో మామిడికి నామమాత్రపు ధరలకు అడుగుతున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. పరిశ్రమ నిర్వాహకుల కష్టాలు మామిడి గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కూడా తమ వద్ద 1.60 లక్షల టన్నుల గుజ్జు నిల్వలున్నాయని చెబుతున్నారు. వాటిని విక్రయిస్తేనే పెట్టిన పెట్టుబడులు వస్తాయని కానీ ఏడాదిగా నిల్వ ఉండడంలో బ్యాంక్లకు చెల్లించాల్సిన రుణాలను కట్టలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోయాయని దీంతోనే సరైన ధరలకు కొనుగోలు చేయలేక పోతున్నామంటున్నారు. తోతాపురి టన్నుకు రూ.12 వేలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తోతాపురి మామిడికి టన్నుకు రూ.12 వేలు చొప్పున కొనుగోలు చేయాలని ఇటీవల ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు. అయితే ఇందులో టన్ను రూ.8 వేలు లెక్కన ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకుంటే...మిగిలిన రూ.4 వేలు రైతుల ఖాతాల్లో సర్కార్ జమ చేస్తుందని వెల్లడించారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం తమిళనాడు రాష్ట్రం నుంచి తోతాపురి టన్ను కేవలం రూ.4 వేలకే లభిస్తుండడంతో కొనలేకపోతున్నారు. మరోవైపు జిల్లాలో ఒక్కో రైతు తిరుచానూరులోని మామిడి కాయల మండికి తోతాపురిని పంపుతున్నారు. జులై ఆఖరుకు జిల్లా వ్యాప్తంగా మామిడి పంట కోతలు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మామిడికి గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
అలిపిరికి టోకెన్ల జారీ కేంద్రం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే దివ్యదర్శనం భక్తుల సౌకర్యార్ధం దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్కు మార్చినట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఈఓ భూదేవి కాంప్లెక్స్, అలిపిరి టోల్ ప్లాజాలను పరిశీలించారు. శ్రీవారి మెట్టు వద్ద భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారనే ఫిర్యాదులు రావడంతో తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం నుంచి మార్చామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో రోజుకు సరాసరి 5 వేల టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. శ్రీనివాస మంగాపురంలో టోకెన్లు జారీ చేసేందుకు ఆర్కియాలజీ శాఖ అనుమతి రాగానే అక్కడ టోకెన్లు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సీవీ అండ్ ఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ హర్షవర్థన్ రాజు, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు. -
9 నుంచి టీటీడీ కళాశాలల్లో అడ్మిషన్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర (ఎస్వీ), శ్రీపద్మావతి మహిళా (ఎస్పీడబ్ల్యూ) జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 9వ తేదీ నుంచి తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆ మేరకు ఎస్వీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సి.ప్రకాష్బాబు తెలిపారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్, తెలుగు, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్వీ జేసీలో 792 సీట్లకు దాదాపు 5,200 మంది, ఎస్పీడబ్ల్యూ జేసీలో 968సీట్లకు దాదాపు 9వేల మంది విద్యార్థులు టీటీడీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారని, ఆయా విద్యార్థులకు ఇదివరకే సమాచారాన్ని అందించినట్లు పేర్కొన్నారు. వీరికి 9వ తేదీ నుంచి తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తారని, మిగిలిన సీట్లకు మలివిడత అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించి భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అడ్మిషన్లు పొందిన ఆర్ట్స్ విద్యార్థులు రూ.4,400/–, సైన్సు విద్యార్థులు రూ.5,350/– ఫీజు చెల్లించాలని చెప్పారు. హాస్టల్లో సీటు పొందిన వారు హాస్టల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజనల్ టీసీతో పాటు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన అన్ని ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. -
వైఎస్సార్ రైతు భరోసా
అన్నదాతకు అండగా..● 8,73,146 మంది రైతులకు రూ.663.07 కోట్లు పెట్టుబడి సాయం ● ఏటా రూ.13,500 సేద్యం కోసం రైతుకి సాయం ● రెండు సీజన్ల్లో తెలుగు గంగనీరు..రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం తిరుపతి అర్బన్ : రబీ, ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు పంట పెట్టుబడులు, సేద్యం ఖర్చులకు గత వైఎస్సార్సీపీ సర్కార్ ఐదేళ్ల పాటు (2019–24)వరుసగా క్రమం తప్పకుండా జిల్లాలో 8,73,146 మంది రైతులకు రూ.663.07 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించారు. దీంతో రైతులు అప్పులు చేయకుండా సర్కారు ఇచ్చిన రైతు భరోసాతోనే వ్యవసాయం పండుగలా చేశారు. గత ఐదేళ్ల పాలన స్వర్ణయుగమేనంటూ అన్నదాతలు చర్చించుకుంటున్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నకిలీ విత్తనాలకు స్వస్తి చెప్పి...నాణ్యమైన విత్తనాలు రాయితీలతో ఇవ్వడం, యూరియా కృత్రిమ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఉచిత పంట బీమా కల్పించింది. దెబ్బతిన్న పంటలకు ఇన్ఫుట్ సబ్సిడీలను అందించి రైతులను ఆదుకుంది. పెట్టుబడి సాయంగా రైతులకు ఏటా రూ.13500 క్రమం తప్పకుండా ఇవ్వడం, కౌలు రైతులకు బ్యాంక్ రుణాలు ఇప్పించి గత జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. తెలుగుగంగ 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రబీతోపాటు ఖరీఫ్లోనూ సాగునీరు ఇవ్వడంతో జిల్లాలో ఏటా 70 వేల నుంచి 80 వేల ఎకరాల బీడు భూములు సైతం సాగులోకి తీసుకొచ్చిన రైతు బాంధవుడిగా ఒకే ఒక్కడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులు మదిలో నిలిచిపోయారు. ఒకే ఒక్కడు వైఎస్సార్ రైతు భరోసా నిధుల (2019–24) వివరాలు సంవత్సరం రైతుల సంఖ్య లబ్ధి పొందిన మొత్తం(రూ.కోట్లలో) 2019–20 1,55,207 119.97 2020–21 1,79,030 134.81 2021–22 1,81,711 136.55 2022–23 1,76,435 134.73 2023–24 180,763 137.01 -
కక్ష సాధింపుతోనే కేసులు
చిల్లకూరు : కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ , గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేరుగ మురళీధర్ పేర్కొన్నారు. ఇటీవల గూడూరు మండలం పోటుపాళెం పంచాయతీకి చెందిన పురుటిపాళెంకు చెందిన దయాకర్తో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపారని, వారు బెయిల్పై శనివారం విడుదల కావడంతో వారిని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అన్యాయంగా కేసులు నమోదు చేసి భయాందోళనలకు గురి చేస్తున్నారని దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తగిన సమయంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హితవు పలికారు. అక్రమ కేసుల్లో ఉన్న ప్రతి కార్యకర్త, నాయకుడికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర యువత కార్యదర్శి కొండూరు సునీల్రెడ్డి, గూడూరు ఎంపీపీ బూదూరు గురవయ్య, నాయకులు అశోక్, తదితరలు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ చంద్రగిరి : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ శనివారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త నల్లాని రాజేశ్వరి, మహిళా కమిషన్ చైర్మన్ను కలిసి సత్కరించి, సాధికారత పుస్తకాన్ని అందజేశారు. అనంతరం ప్రతి మహిళా సాధికారత దిశగా ముందుగా సాగేలా చేయూతనందించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నాయుడుపేటటౌన్ : బైక్పై వెళుతున్న వ్యక్తి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మైలురాయిని ఢీకొని పూడేరు మణి(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నరసారెడ్డి కండ్రిగ–కృష్ణామనాయుడు కండ్రిగ గ్రామాల మధ్య రహదారిపై శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. చిట్టమూరు మండలం గునపాడు గ్రామానికి చెందిన మణి నాయుడుపేటలో పనులు చూసుకుని సాయంత్రం బైక్పై గ్రామానికి వెళుతుండగా మార్గ మధ్యలో నరసారెడ్డి కండ్రిగ దాటిన తరువాత బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న మైలు రాయిను ఢీకొంది. ఈ ప్రమాదంలో మణి తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందాడు. ఎస్ఐ ఆదిలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేస్తున్నారు..?
తిరుపతి రూరల్: తనను లిక్కర్ స్కాంలో ఇరికించాలని కుట్రలు చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ‘నాకు చిన్నప్పటి నుంచి సన్నిహితుడైన, హైదరాబాద్లో నివసిస్తున్న వెంకటేశ్, ఆయన భార్య, ఏడాది వయసున్న కుమారుడిని సిట్ అధికారులు తీసుకువెళ్లి రెండు రోజులుగా హింసిస్తున్నారు. నాపై తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వారిపై ఒత్తిడి తేవడం అన్యాయం, అనైతికం. మీ టార్గెట్ నేనే అయితే వచ్చి అరెస్టు చేసుకోండి. దయచేసి నాతో ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టకండి’ అని కోరారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని నివాసం వద్ద శుక్రవారం మీడియా సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. నైతిక విలువలున్న వెంకటేశ్ను సిట్ అధికారులు కార్యాలయంలో బంధించి భయపెడుతున్నారని మండిపడ్డారు. ఏఎస్పీ శ్రీనివాస్ విచక్షణ కోల్పోయి అనరాని మాటలతో మానసికంగా బాధించడం తగదన్నారు. తప్పుడు స్టేట్మెంట్లో సంతకం పెట్టకుంటే ఈ కేసులో కాకున్నా, తనవద్ద విచారణలో ఉన్న ఏదో ఒక కేసులో ఇరికించి శాశ్వతంగా జైలు జీవితం గడిపేలా చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయినా, వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఎంత డబ్బు కావాలన్నా తీసిస్తా, వర్కులు ఇప్పిస్తా, మంచి సంబంధాలు ఏర్పాటు చేయిస్తా. ఒక్క సంతకం పెట్టు చాలు అని ప్రలోభపెడుతున్నట్టు తెలిసిందని చెవిరెడ్డి వివరించారు. ‘ వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ఏఎస్పీ శ్రీనివాస్ సిట్ కార్యాలయంలోని బల్లలను గుద్దుతూ గట్టిగా అరుస్తూ భయానక వాతావరణం సృష్టించారని సిబ్బందే చెబుతున్నారు. అమాయకులను వేధిస్తూ ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి కొల్లు శ్రీనివాస్ ఇదంతా చేస్తున్నారో తెలియడం లేదు. నన్ను అరెస్టు చేయాలన్న తపన, తాపత్రయం, అందుకోసం చేస్తున్న అరాచకం చూసిన సిట్ కార్యాలయ సిబ్బంది మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని శ్రీనివాస్ గమనించాలి’ అని చెవిరెడ్డి సూచించారు. అమాయకులను హింసిస్తున్న కొల్లు శ్రీనివాస్ను ప్రకృతి మర్చిపోదని, సమాజం హర్షించదని గుర్తించాలని పేర్కొన్నారు. -
అవినీతి లేదు!
అభివృద్ధి తప్ప.. ● తుడా చైర్మన్కు ఎలాంటి ఎగ్జిక్యూటీవ్ పవర్ ఉండదు ● నిస్పక్షపాత విచారణ జరిగితే.. మాకష్టం ప్రజలకు తెలుస్తుంది ● మీడియాతో తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి రూరల్ : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)లో అభివృద్ధి పనులు చేయడం తప్ప.. అవినీతికి ఆస్కారం లేదని, అక్కడ చైర్మన్కు ఎలాంటి కార్యనిర్వహణ అధికారాలు ఉండవని తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. తుడాలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తుడా అథారిటీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏదేదో అసత్య ప్రచారాలను పత్రికల్లో రాస్తే వారిపై పరువునష్టం దావా వేయడానికి వెనుకాడనని తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఆయన ఇంటి వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఒక చిన్న కార్యాలయంలా ఉన్న తుడా ఆఫీసును ఒక కార్పొరేట్ కార్యాలయం మాదిరిగా రూపుదిద్దామన్నారు. తిరుపతి నగరంతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రెండు మండలాలకు పరిమితమైన తుడాను 9 నియోజక వర్గాలకు విస్తరింపజేయడం జరిగిందన్నారు. తుడా చైర్మన్కు టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా జగనన్న ప్రభుత్వంలో తీసుకొచ్చామన్నారు. నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కింద ఉన్న శ్రీసిటీని జగనన్న సహకారంతో తుడా పరిధిలోకి తీసుకొచ్చామని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు. ఏళ్ల తరబడి ఒకే హోదాలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇప్పించడం జరిగిందన్నారు. తుడా ఆదాయం రెట్టింపు 2019లో తుడా చైర్మన్గా తాను బాధ్యత తీసుకునే సమయానికి రూ.26 కోట్ల బడ్జెట్ ఉండేదన్నారు. ఆ తరువాత వందల కోట్లు ఆదాయంగా తీసుకొచ్చి మొదటి ఏడాదికి రూ.15 కోట్లకు పైగా ఉద్యోగుల భవిష్యత్తు కోసం ిఫిక్స్డ్ డిపాజిట్ వేయడం జరిగిందన్నారు. ఏళ్లుగా సూరప్పకశం వద్ద 145 ఎకరాలు ఆక్రమణ భూమిని తుడాకు తీసుకొచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల్ల స్థలాలకు విక్రయించి తుడాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టామని చెవిరెడ్డి వివరించారు. అన్నమయ్య సర్కిల్ వద్ద తుడా టవర్స్ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి విడిపించి తుడాకు అప్పగించడం వల్లనే తుడా టవర్స్ వచ్చాయన్న వాస్తవం గుర్తించాలన్నారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు 15 ఎకరాల స్థలం ఆక్రమిస్తే సొంత పార్టీ వాళ్లు అని కూడా చూడకుండా వారితో న్యాయ పోరాటం చేసి ఆ స్థలాలు తుడాకు స్వాధీనం చేసి ప్లాట్లుతో తుడాకు ఆదాయం వచ్చేలా చేశామని ఆయన చెప్పారు. అవును.. చంద్రగిరికే ఎక్కువ పెట్టాను.. చంద్రగిరికి తుడా నిధులు అధికంగా ఖర్చు పెట్టారని చెబుతున్నారు.. అవును నిజమే.. ఎక్కువ గానే పెట్టాను.. ఏ దేశానికి రాజైనా తల్లికి బిడ్డ అన్న చందంగా రాజకీయాల్లో తాను ఏ స్థాయికి ఎదిగినా తల్లివంటి చంద్రగిరికి తాను బిడ్డనేనని, అందుకే అధికంగా ఖర్చు చేసి అభివృద్ది చేశానని చెవిరెడ్డి వివరించారు. ఇప్పుడు జరిగే విజిలెన్స్ విచారణలో కూడా నిస్పక్షపాతంగా నివేదిక తయారు చేస్తే తాము చేసిన అభివృద్ధి పడిన కష్టం ప్రజలకు తెలుస్తుందన్నారు. ఏ తప్పు జరగకున్నా తప్పు జరిగినట్లు నివేదిక ఇస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని చెవిరెడ్డి స్పష్టం చేశారు. తుమ్మలగుంట చెరువు అభివృద్ధి తప్పా మంత్రి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడైన హరిక్రిష్ణ వీసీగా పనిచేయడం వల్ల ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని, తుడా పాలనలో అధికారాలన్నీ ఆయనకే ఉంటాయన్నారు. తుమ్మలగుంట చెరువు అభివృద్ధి చేయడం తప్పే అయితే చంద్ర బాబు ఆదేశాలతో అవిలాల చెరువుకు టీటీడీ రూ.70 కోట్లు ఖర్చు చేయడం కూడా తప్పే అవుతుందని చెవిరెడ్డి తెలిపారు. చంద్రబాబు గోదావరి పుష్కరాల సమయంలో చోడవరం నియోజకవర్గ పరిధిలో సిమెంటు బెంచీలు తయారు చేయించి ఒక్కో బెంచీకి రూ.15,750 చెల్లించారని, ఐదేళ్ల తరువాత అదే క్వాలిటీతో అదే కొలతలతో అదే కాంట్రాక్టర్ చేత ఒక బెంచీ రూ.8 వేలుకు తయారు చేయించామన్నారు. ఇందులో ఏది ఎక్కువ..? ఎక్కడ అవినీతి జరిగిందో పెద్దలు ఆలోచించాలని సూచించారు. తుడా పరిధి రెండు నియోజకవర్గాల నుంచి రెండు జిల్లాలకు విస్తరించినప్పుడు ఉద్యోగులు, వారి జీతాలు, రవాణా వంటి ఖర్చులు పెరుగుతాయన్న విచక్షణ కూడా తెలియడం లేదన్నారు. తుడాకు టీటీడీ బోర్డులో స్థానం కలిగినప్పుడు తిరుపతి పర్యటనకు వచ్చే ప్రముఖుల ప్రొటోకాల్కు వాహనాలను పెట్టినమాట వాస్తవమేనని చెవిరెడ్డి స్పష్టం చేశారు. -
డీమ్డ్ యూనివర్శిటీగా ఆదిశంకర
నెల్లూరు (టౌన్): ఆదిశంకర గ్రూపు ఆప్ ఇన్స్టిట్యూట్కు డీమ్డ్ యూనివర్శిటీగా కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించిందని ఆ విద్యాసంస్థల గ్రూపు చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలోని మినర్వా గ్రాండ్లో డీమ్డ్ యూనివర్శిటీ లోగోను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జోన్లో డీమ్డ్ యూనివర్శిటీగా గుర్తింపు పొందింది కేవలం ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల మాత్రమేనని చెప్పారు. 2001లో కేవలం 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఇంజినీరింగ్ కళాశాల నేడు 8వేల మంది విద్యార్థులతో ఉందన్నారు. కోవూరు సమీపంలోని రామన్నపాలెం వద్ద కొత్తగా ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలను 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిందు మధ్వాచార్య, ప్రొఫెసర్లు వేణుమాధవ్, ధనుంజయ, ఏఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
తిరుపతి రూరల్, (రామచంద్రాపురం) : రామ చంద్రాపురం మండలం చల్లావారి పల్లెకు చెందిన కాంతమ్మ (70) శుక్రవారం పొలం వద్ద గడ్డికోసుకుని వస్తుండగా వెనుకనే వచ్చిన ఓ వ్యక్తి వృద్ధురాలి మెడలోని బంగారం గొలుసును లాక్కొని వెళ్లాడు. దీంతో వృద్ధురాలు వారిని పట్టుకోలేక గట్టిగా కేకలు పెట్టినప్పటికీ అక్కడ అందుబాటులో ఎవ్వరు లేరు. అనంతరం రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాగిరి
పాకాల : దారి విషయమై వైఎస్సార్సీపీ వర్గీయులను టీడీపీ నాయకులు చితకబాదిన సంఘటన శుక్రవారం పాకాల మండలంలోని మద్దినాయనపల్లి పంచాయతీ ఐయ్యవారిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు స్వర్ణలత, సుబ్బమ్మ, రాణి తెలిపిన వివరాల మేరకు.. తమ ఇంటికి ఆనుకుని గ్రామకఠం, చెరువు పొరంబోకు స్థలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో తమపై దాడికి దిగారని ఆరోపించారు. అధికారం చేతిలో ఉందిని, పక్క గ్రామాల నుంచి టీడీపీ చెందిన రౌడీలను, నాయకులను పిలిపించి దాడులకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. ఆడవారని కూడా చూడకుండా జాకెట్లను సైతం చింపేసారని వాపోయారు. ఇదే దారి విషయమై నెల క్రితం కూడా టీడీపీకి చెందిన గూండాలు దౌర్జన్యం చేసారని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు వివరించారు. అయితే బాఽధితుల వైపు నిలవాల్సిన ఎస్ఐ అధికార పార్టీ గూండాలు, నాయకుల కొమ్ము కాస్తూ భాదితులైన తమని బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ ఈ విషయంపై చొరవ చూపాలని కన్నీటి పర్యంతమయ్యారు. రెవెన్యూ అఽధికారులు కూడా టీడీపీ గూండాలకే మద్దతు తెలుపుతూ వారికి అనుకూలంగా పత్రాలను సృష్టించి పేదలకు అన్యాయం చేస్తున్నారని బాధకు లోనయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దాడికి పాల్పడ్డ టీడీపీ గూండాలపై కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని బాధితులు వాపోయారు. గొడవకు చెందిన సంఘటనను వీడియో తీస్తున్న శంకరపై దాడికి దిగి రక్త గాయాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ కంఠం, చెరువు పొరంబోకు స్థలం ఆక్రమణకు యత్నం సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు భయం గుప్పెట్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు -
ఆనాటి.. ఆ స్నేహమానందగీతం!
● వివాహ వేడుకల్లో చిన్ననాటి స్నేహితుల అపూర్వ కలయిక ● తలుపు తట్టిన మధురజ్ఞాపకాలు ● భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి ఆర్కే రోజా నగరి : చిన్ననాటి స్నేహితులందరూ తమ స్నేహితురాలి కుమారుని పెళ్లిలో కలుసుకున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా స్నేహితురాలు శంకరమ్మ కుమారుడు చంద్రారెడ్డి, మోక్షితకు శుక్రవారం ఉదయం అన్నమయ్య జిల్లా పీలేరులోని ఎస్వీఎస్ఎస్ కల్యాణ మండపంలో వివాహమైంది. గురువారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా, భాకరాపేట పాఠశాలలో 10వ తరగతి వరకు కలసి చదువుకున్న వారంతా ఆ వివాహ వేడుకలకు హాజరయ్యారు. వీరిలో కొందరు ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. వారిలో ఒకరైన రోజా సినీ రంగంలోను, రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా స్నేహమాధుర్యం మళ్లీ వారిని బడి ఈడు పిల్లలుగా మార్చేసింది. ఆ నాటి స్నేహం ఆనంద గీతమై ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. బాధలు తెలియని నవ్వులు, మౌనం తెలియని మాటలు, కల్మషమెరుగని ప్రేమలు, కష్టం ఎరుగని క్షణాలతో గడిపిన రోజులను తలచుకొని చిన్న పిల్లలైపోయారు. చదువులమ్మ బడిలో చేసిన అల్లరిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. మనసులో మరపురాని బాల్యపు పుటలను తిరగవేశారు. అందులో నిండిన ఆనంద క్షణాలను ఆస్వాధించారు. బడిస్నేహం వారిని కొత్త బంగారు లోకానికి తీసుకెళ్లింది. చిన్ననాటి కథలు మధుర జ్ఞాపకాల తలుపులను తెరిచాయి. ఇకపై అందరూ టచ్లో ఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు మళ్లీ కలుసుకున్న తీపి క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఫొటోలు తీసుకుని భద్రపరుచుకున్నారు. స్నేహితులకు తమ పిల్లలను, కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలిసి ఆనందాలు పంచుకోవడం మరువలేని క్షణాలని, తాను ఎంతో భావేద్వాగానికి గురయ్యానని ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. -
రాత్రి పూట కౌన్సెలింగ్
● 273 మంది ఎస్జీటీ ఉద్యోగోన్నతులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ● రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ● అవస్థల్లో ఉపాధ్యాయులు చిత్తూరు కలెక్టరేట్ : ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగోన్నతుల ప్రక్రియ పరిశీలన.. రాత్రి 7 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియ శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన టీచర్లు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇష్టానుసారంగా బదిలీ ఉత్తర్వులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లకు శుక్రవారం బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఈ ఉత్తర్వుల్లో అవకతవకలు, ఇష్టానుసారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. క్యాన్సర్, గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న టీచర్లు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న టీచర్లకు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో మినహాయింపు కల్పించాల్సి ఉంటుంది. వారు ఆన్లైన్లో నమోదు చేసుకున్న ప్రాంతాలకు బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది టీచర్లకు శ్రీకాళహస్తి నుంచి మదనపల్లికి, నాగలాపురం నుంచి పెద్దమండ్యం, శ్రీకాళహస్తి నుంచి చౌడేపల్లి ఇలా దూరప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ విషయం పై బాధితులు చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్దకు వచ్చి సంప్రదిస్తుంటే తమకు ఎలాంటి సంబంధం లేదంటూ చేతులెత్తేశారు. 273 మందికి ఉద్యోగోన్నతులు జిల్లాలోని ప్రభుత్వ, మున్సిపల్, జెడ్పీ, నగరపాలక యాజమాన్యాల్లో పనిచేస్తున్న టీచర్లకు ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియను డీఈఓ వరలక్ష్మి, ఏడీలు వెంకటేశ్వరరావు, సుకుమార్ పర్యవేక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 273 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శుక్రవారం రాత్రి మొత్తం కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగోన్నతులు కల్పించే ప్రక్రియను చేపట్టారు. -
పెళ్లింట విషాదం
● కూతురి పెళ్లి పనులకు వెళ్లి తండ్రి హఠాన్మరణం కేవీబీపురం: మరికొద్ది రోజుల్లో జరగాల్సిన పెళ్లి ఇంట విషాదం అలుముకుంది. కూతురి పెళ్లి పనుల్లో నిమగ్నమైన తండ్రి గుండెపోటుతో మృతి చెందిన ఘటన కేవీబీపురం మండలం కోవనూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోవనూరు గ్రామానికి చెందిన సాంబయ్య(43) తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన పెద్ద కుమార్తెకు శ్రీకాళహస్తి రాజీవ్నగర్కు చెందిన వ్యక్తితో ఈనెల 8వతేదీన వివాహం నిశ్చయించుకున్నారు. ఈ తరుణంలొ సాంబయ్య విధులకు లీవు పెట్టి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం శ్రీకాళహస్త్రిలో షాపింగ్ ముగించుకుని ఇంటికి తిరుగు వెళుతుండగా సాంబయ్య గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు శ్రీకాళహస్త్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాంబయ్య మృతితో కోవనూరులొ విషాదఛాయలు అలుముకున్నాయి. కేవీబీపురం ఎస్ఐ నరేష్ చేతుల మీదుగా సాంబయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం సాంబయ్య అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. -
‘పది’ పరీక్షల నిర్వహణలో విఫలం
తిరుపతి రూరల్ : పదో తరగతి పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందని వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చేరుకున్న ఆయన ఓ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల తీరని నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో 6.14 లక్షల మంది విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించలేకపోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం తన తప్పిదాన్ని అంగీకరించి ఎలాంటి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్ చేయించాలన్నారు. జవాబు పత్రాలు దిద్దడంలో చోటు చేసుకున్న తప్పులకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి, వైవీపాళెం పార్టీ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, చంద్రగిరి నియోజక వర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్రెడ్డి, కుప్పం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్, విద్యార్థి విభాగం నుంచి వచ్చిన వివిధ మండలాల అధ్యక్షులు హరి, వినోద్, యశ్వంత్, రఫి, ఓంప్రకాష్రెడ్డి, రాజారెడ్డి, చరణ్రెడ్డి, జగన్ రెడ్డి ఉన్నారు. -
పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావొద్దు
తిరుపతి క్రైమ్ : పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకురావద్దని, ఎవరైనా పోలీసులు తప్పు చేయాలంటే వారి వెనకాల కుటుంబం ఉందని గుర్తు చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏఆర్ పోలీసు సిబ్బందితో పరేడ్ నిర్వహించారు. పోలీసులలో ఏ ఒక్క పోలీసు తప్పు చేసిన దాని ప్రభావం పోలీసులందరి మీద పడుతుందన్నారు. ఏదైన సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా తప్పు చేస్తే... చర్య లు మాత్రం చాలా సీరియస్గా ఉంటాయన్నా రు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తుంటే పోలీసు ఉద్యోగం వదలిపెట్టాలన్నారు. పోలీసు ఉద్యోగంలో ఉండి తప్పు చేస్తే.. మాత్రం ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. 9న షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో ఈనెల 9వ తేదీన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం కలెక్టర్, ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి రూ.20 వేలు నగదు, ప్రశంసా పత్రం, పతకం అందించనున్నట్లు డీఈఓ తెలిపారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 67,284 మంది స్వామి వారిని దర్శించుకోగా 31,268 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.34 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 25 నుంచి డిగ్రీ ఇన్స్టెంట్ పరీక్షలు తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో 2022–23 బ్యాచ్ డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్గా చదవి పరీక్షలలో తప్పిన విద్యార్థులకు ఈనెల 25వ తేదీ నుంచి ఇన్స్టెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈనెల 16వ తేదీలోపు పరీక్ష ఫీజును చెల్లించాలన్నారు. రూ.1500 అపరాధ రుసుముతో 18 వరకు, రూ.3500 అపరాధ రుసుముతో ఈనెల 20వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు – రేపు ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష తిరుపతి అర్బన్: యూపీఎస్సీకి చెందిన ఇ–ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాల్లో 791 మంది అభ్యర్థులు హజరు కానున్నారని వెల్లడించారు. పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షకు అభ్యర్థులు గుర్తింపుకార్డు తెచ్చుకోవాలని సూచించారు. తిరుపతిలోని రెండు పరీక్షా కేంద్రాలైన తిరుచానూరు రోడ్డు లక్ష్మీపురం సర్కిల్ సమీపంలోని ఎస్డీఎస్ ఆర్ట్స్ కళాశాల, బాలాజీ కాలనీ, వెస్ట్ చర్చిరోడ్డు మార్గంలోని శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూపీఎస్సీ అబ్జర్వర్ న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన కిరణ్ కర్లా అరోరాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
కంటైనర్లో మంటలు
తడ పోలీస్ స్టేషన్ ఎదుట కంటైనర్లో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.దొంగలు అరెస్టు దొరవారిసత్రం, ఓజిలి మండలాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025– 10లోనాడు సంక్షేమం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. సచివాలయ సిబ్బంది ద్వారా అర్హత కలిగిన ప్రతి ఇంటి గడపను తాకింది. నేడు మోసంప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నాయకులు ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు సవరించారు. గత ఐదేళ్లల్లో సర్వేలు లేకుండా సంక్షేమ పథకాలు గత ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ సర్కారు ఎలాంటి సర్వేలు నిర్వహించకుండానే సంక్షేమ పథకాలను అమలు చేసింది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా సంక్షేమ పాలనను అందించింది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నవరత్నాల హామీల మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలను ప్రజలకు అందించింది. అయితే ప్రస్తు త కూటమి సర్కారు సర్వే ల పేరుతో చేస్తున్న కుట్రలను ప్రజ లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల గోప్యతపై అనుమానం సచివాలయం సిబ్బంది పలుమార్లు ఇంటికి వచ్చి ఆధార్, రేషన్కార్డు వివరాలు సేకరించారు. సేకరించిన వివరాలు గోప్యంగా ఉన్నాయా లేవా అనే ఆందోళన ఉంది. అందించిన సేవల కన్నా చేసిన సర్వేలు ఎక్కువగా ఉన్నాయి. సర్వేల్లో వ్యక్తిగత వివరాలతో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయంగా ఉంది. – వై.భాగ్యమ్మ, కొత్త ఒడ్డిపల్లి, పాకాల మండలంఆశ చూపి మోసం చేశారు ఎన్నికల్లో వివిధ రకాల హామీలను ఆశ చూపి మోసం చేశారు. ఏడాది గడిచినా హామీల్లో అమలు చేయకపోయినా ప్రతి ఇంటా ప్రతి రోజు 17 రకాల సర్వేల పేరుతో సర్వేలు చేస్తున్నారు. సర్వేల ద్వారా ఏమైనా పథకాలు వస్తాయిలే అనే ఆశతో ఉన్నారు. నేటికి ఎలాంటి ప్రయోజనం కానరాలేదు. – శ్రీనివాసులురాజు,సైదాపురం మండలం సర్వేల ఆంతర్యం ఏమిటో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలోనే సచివాలయ ఉద్యోగుల నేతృత్వంలో 17కి పైగానే సర్వేలు చేపట్టారు. సర్వే చేసిన సందర్భంగా సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ఆశ పడ్డాం. అయితే మొదటి ఏడాది కాలం పథకాలు ఇవ్వలేదు. పథకాలు ఇవ్వకపోవడంతో తొలగిస్తారనే ఆందోళన తప్పడం లేదు. – సుదర్శన్, తిరుపతి పథకాలు అమలేదీ సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు ఎక్కడా....ఎప్పుడు ఇస్తారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 12 నెలలు పూర్తి అయింది. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో కూర్చున్న తర్వాత పథకాలకు డబ్బులు లేదని మాట్లాడుతున్నారు. పథకాలు ఇవ్వనప్పుడు సర్వేలు ఎందుకు చేయించారో ప్రజలకు చెప్పాలి. – యశోద, తిరుపతి ఎందుకు చేస్తున్నారో తెలియదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పలుసార్లు ఇళ్ల వద్దకు సచివాలయం సిబ్బంది వచ్చి సర్వేల పేరుతో ఆధార్ నమోదు, వేలి ముద్రలు సేకరించారు. సర్వేలపై ప్రశ్నిస్తే ఒక్కోసారి ఒక్కో రకమైన సమాధానాలు ఇచ్చారు. పలుసార్లు సర్వే పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరించడం ఏమిటో అర్ధం కావడం లేదు.– ఒత్తూరు మునిక్రిష్ణ, మెట్టు, చిట్టమూరు మండలంఎన్నికల సమయంలో సూపర్ –6 హామీలంటూ చంద్రబాబు అలవికాని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత సర్వేల మీద సర్వేలు చేస్తూ ఏడాదిగా కూటమి ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పటి వరకు ప్రజలకు ఏ ఒక్క పథకం అందకపోవడంతో చేసిన సర్వేలన్నీ ఉత్తుత్తివేనా అని జనం నిట్టూరుస్తున్నారు. సర్వేలో వ్యక్తిగత సమాచారం తీసుకున్న ఉద్యోగులు వాటిని ఎందుకు తీసుకున్నారో ప్రజలకు చెప్పలేకపోతున్నారు. ఈ సమాచారం గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో సర్వేలు చేశారే గాని.. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఎగ్గొట్టారు. ఈ సర్వేల తతంగంపై జిల్లాలోని ప్రజల ఆగ్రహంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి హామీలు గుప్పించింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీలు నెరవేర్చాల్సి ఉంటుంది. అయితే ఆ హామీలను అమలు చేయకుండా సర్వేలతోనే ఏడాదిగా కాలయాపన చేసింది. సర్వేలతో ప్రజలకేమైనా లాభం చేకూరిందా అంటే అదీ లేదు. ఇంటింటికి తిరిగి సర్వేలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిగా సర్వేల పైనే ఎక్కువ మక్కువ చూపించింది. సచివాలయ ఉద్యోగులను పలు మార్లు ఇంటింటికి తిప్పి ప్రజల వ్యక్తిగత సమాచారాలను సేకరించారు. ఆ సమాచారాలు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తే సంక్షేమ పథకాల అమలు కోసమని మాయమాటలు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో సచివాలయ సిబ్బంది నెలల తరబడి ఇంటింటికీ తిరిగి ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించారు. హౌస్హోల్డ్ సర్వే పేరుతో వివరాలు సేకరించారు. మనమిత్ర క్యాంపెయిన్ పేరుతో సర్వేలు చేపట్టారు. నాన్ రెసిడెంట్ పేరుతో సమాచారాన్ని సేకరించారు. అదర్ డిపార్ట్మెంట్ ఈకేవైసీ సొసైటీ బ్యాంక్ ఓటర్ల పేరుతో సర్వే చేపట్టారు. ఇవే కాకుండా పలు రకాల సర్వేలు చేపట్టి ప్రజలను గందరగోళానికి గురిచేశారు. విచారణ పేరుతో పింఛన్ల కోత పింఛన్ రూ.1000 పెంచామని గొప్పలు చెప్పకుంటున్న ప్రభుత్వం విచారణ పేరుతో వేలాది పెన్షన్లను తొలగించే చర్యలు ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం పీ4 సర్వే చేపట్టడం ఇందులో భాగమనే సందేహాలు ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. సంపాదన పరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, ఫింఛనర్ల పేర్లు చోటుచేసుకున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సర్వేపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే గుట్టు బాబుకే ఎరుకని పరిశీలకులు వివరిస్తున్నారు. – 10లోన్యూస్రీల్కూటమి ఏడాది పాలనలో సర్వేలతో కాలయాపన సర్వేలు ఎందుకని అడిగితే సంక్షేమ పథకాల కోసమంటూ సమాధానం సర్వేలు చేశారే తప్ప పథకాలు అమలు చేయని వైనం సేకరించిన వ్యక్తిగత సమాచారానికి గోప్యత కరువు ? పీ 4 సర్వేతో అన్ని వర్గాల్లో ఆందోళన కూటమి ప్రభుత్వం పీ4 పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమయ్యింది. సంక్షేమ పథకాల ఎత్తివేతకే ఈ సర్వే చేస్తున్నారనే అనుమానం బలపడింది. ఇప్పటికే ఎన్నికల ముందు ఎడతెరిపి లేని హామీలిచ్చిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయకపోగా ఏదో ఒక నెపంతో నీరుగార్చే యత్నాలు చేపట్టిన విషయం ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలో పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టిసిపేషన్న్ (పీపీపీ) పేరిట సర్వే చేపట్టారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించి ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, దాతల సహకారంతో గుర్తించిన నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగు పరచడమే సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు అంటున్నారు. అయితే ఈ సర్వే ఎన్నో సందేహాలు ప్రజల్లో తలెత్తాయి. సర్వేలో కుటుంబ సభ్యుల పేరిట వ్యవసాయ భూమి ఎంత ఉంది? మున్సిపల్ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలు ఉన్నాయి? నాలుగు చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా? ఇన్న్కం ట్యాక్స్ ఏమైనా చెల్లిస్తున్నారా? నెలకు విద్యుత్ వినియోగం ఎంత ? అనే అంశాలపై సచివాలయ సిబ్బంది ఆరా తీసి వివరాలు సేకరించి నమోదు చేశారు. సర్వే సిబ్బంది సేకరిస్తున్న వివరాల్లో ఎక్కువ భాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది.తిరుపతి జిల్లా సమాచారం జిల్లాలోని మండలాలు 33 మొత్తం జనాభా 21.97 లక్షలు పురుష జనాభా 10.99 లక్షలు మహిళల జనాభా 10.98 లక్షలు రూరల్ జనాభా 13.47 లక్షలు అర్బన్ జనాభా 8.50 లక్షలు మొత్తం కుటుంబాలు 5.72 లక్షలు ఎస్సీ జనాభా 5.19 లక్షలు ఎస్టీ జనాభా 1.71 లక్షలు వ్యక్తిగత సమాచారం గోప్యత ఉందా? వివిధ రకాల సర్వేల పేరుతో కూటమి ప్రభు త్వం సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాలకు గోప్యత లేని దుస్థితి. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు వివిధ సర్వేలు చేపట్టిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కూటమి చేపట్టిన వివిధ సర్వేల్లో సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకే వాడుతున్నారా? ఇంకేమైనా కుట్రలు చేస్తున్నారా అనే సందేహం ప్రజల్లో తలెత్తుతోంది. -
ఉజ్వల భవితకు ఐఐటీ
ఏర్పేడు: జేఈఈ అడ్వాన్సుడ్–2025 అర్హత సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు తిరుపతి ఐఐటీ శనివారం ఓపెన్హౌస్ పేరిట ఆహ్వానించినట్లు ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఏర్పేడు సమీపంలో ఉన్న తిరుపతి ఐఐటీలో చేపడుతున్న విద్యా కార్యక్రమాలు, క్యాంపస్లో ఉన్న అధునాతన సౌకర్యాలు, అందుబాటులో ఉన్న కోర్సులు, అండర్ గ్రాడ్యుయేట్ కరికులం, డ్యూయల్ డిగ్రీ వెసులుబాటు, హాస్టల్ సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణ సౌకర్యాలు, విద్యార్థులు తమ మేథస్సుతో నూతన ఆవిష్కరణ వైపు తీర్చిదిద్దేందుకు ఐఐటీలో ఉన్న అవకాశాలను గురించి ప్రత్యేక సెషన్ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే కార్యక్రమ అనంతరం విద్యార్థులు, వారి దల్లిదండ్రులతో క్యాంపస్ టూర్ ఏర్పాటు చేసి ఐఐటీలో ఉన్న అధునాతన సౌకర్యాలు, బోధనాభ్యసన విధానాలపై ప్రత్యక్ష అనుభవం కల్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈ సెషన్కు విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి స్వయంగా పాల్గొనవచ్చని, ఇక్కడకు వచ్చేందుకు వీలు కాని వారు ఆన్లైన్లోనూ హాజరు కావచ్చన్నారు. తిరుపతి ఐఐటీ అధికారిక వెబ్సైట్లో వివరాలు పొందుపరిచి ఉన్నట్లు , ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకుని ఓపెన్హౌస్ సెషన్లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.తిరుపతి ఐఐటీ క్యాంపస్ నేడు తిరుపతి ఐఐటీలో ఓపెన్ హౌస్ సెషన్ -
ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష
తిరుపతి అర్బన్ : డీఎస్సీ పరీక్షలకు తొలి రోజే 126 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం 4 కేంద్రాల్లో మాత్రమే ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో పరీక్షలు చేపట్టారు. కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు డీఈవో కేవీఎన్ కుమార్ కరకంబాడీ రోడ్డులోని అన్నమాచార్య ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఉదయం జరిగిన సెషన్స్కు 573 మందికి 509 మంది మాత్రమే హజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన సెషన్స్కు 570 అభ్యర్థులకు 508 మంది హాజరయ్యారు. తొలి రోజు తిరుపతిలోని అన్నమాచార్య కళాశాల , పుత్తూరులోని శ్రీవెంకటేశ్ పెరుమాళ్ కళాశాల, గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, విద్యానగర్ ఎన్బీకేఆర్ కళాశాలలో మాత్రమే రెండు సెషన్స్లో పరీక్షలు నిర్వహించారు. ఈనెల 30 వరకు డీఎస్పీ పరీక్షలకు సంబంధించి 33,607 మంది అభ్యర్థులు సెషన్స్ల వారీగా పరీక్షలు రాయాల్సి ఉంది. ● తొలిరోజు 126 మంది గైర్హాజరు -
పోలీసులకే రక్షణ లేదు!
● బీహార్ను తలపిస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అరాచకాలు ● కానిస్టేబుల్పై దాడి ఘటన లో బాధ్యులపై చర్యలు తీసుకోండి ● విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి డిమాండ్ శ్రీకాళహస్తి : మనం ప్రజాసామ్య దేశంలోనే ఉన్నామా..? నియంత పాలనలో బతుకుతున్నామా..? అని అనుమానం కలుగుతోందని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి డ్రైవర్.. పోలీస్ కానిస్టేబుల్ అన్వర్ బాషాపై దాడి చేయించిన ఘటనపై ఆయన మాట్లాడారు. అధికార పార్టీలో ఉండి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను బలవంతంగా పిలిపించి కొట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. శ్రీకాళహస్తి రూరల్ సీఐ దగ్గరుండి కానిస్టేబుల్ను తీసుకెళ్లి ఎమ్మెల్యే ముందు నిలబెట్టి కొట్టించడం చూస్తుంటే రక్షణ వ్యవస్థ ఎలా దిగజారిందనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. డీఎస్పీ సమాధానం చెప్పాలి బాధ్యతాయుతమైన డీఎస్పీ స్థానంలో ఉన్న అధికారి అలాంటి ఘటనలేవీ జరగలేదని బుకాయించడం.. కాసేపటికే ఎస్పీ కార్యాలయం నుంచి ఘటన జరిగింది వాస్తవమే కానీ క్షమాపణ చెప్పించలేదు... అని అధికారిక ప్రకటన ఇవ్వడంపై డీఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటారు కదా.. మరి ఈరోజు శ్రీకాళహస్తిలో ఓ కానిస్టేబుల్ పై దాడి జరిగింది. దీనిపై కానిస్టేబుల్కు ఏ విధమైన న్యాయం చేస్తారో ప్రజలకు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మధు సూదన్రెడ్డి డిమాండ్ చేశారు. విలేకరుల పైన గత నెలలో దాడి చేశారనీ, ఈరోజు పోలీసులపైన దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టి పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీఐపై చర్యలు తీసుకొని కానిస్టేబుల్పై దాడిచేసిన వారిని శిక్షించాలని కోరారు. శ్రీకాళహస్తిలో ఏడాది కాలంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై 270 అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఎమర్జెన్సీ రోజులను కూటమి పాలన గుర్తుకు తెస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. -
కానిస్టేబుల్పై ‘అధికార’ జులుం
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రజలకు రక్షణ కల్పించే రక్షకభటులపైనా అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ బైక్ ఆపిన పాపానికి ఓ కానిస్టేబుల్ను ఇంటికి పిలిపించి మరీ థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. వివరాలివీ.. శ్రీకాళహస్తి పట్టణంలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అన్వర్బాషా 3వ తేదీ రాత్రి ఎస్ఐతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఎమ్మెల్యే సతీమణి కారు డ్రైవర్ సాయికుమార్ బైక్పై అటుగా వెళ్తున్నాడు. కానిస్టేబుల్ అతన్ని ఆపి తనిఖీ చేయగా.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. కానిస్టేబుల్పై తిరగబడ్డాడు. తాను ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్నంటూ రెచ్చి పోయి నానా హంగామా సృష్టించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో డ్రైవర్కు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ 145గా చూపించడంతో అతని సంతకం తీసుకుని ఎస్ఐ ఫైన్ చలనా రాసి పంపేశారని తెలిసింది. అయితే, ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్ తనపై దాడిచేసి కొట్టి గాయపరిచాడని ఎమ్మెల్యే సతీమణి ఎదుట డ్రైవర్ మొరపెట్టుకున్నట్లు సమాచారం. దీంతో.. బుధవారం ఉదయాన్నే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అన్వర్ బాషాను శ్రీకాళహస్తి రూరల్ సీఐ రవినాయక్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని.. ఆ సమయంలో ఎమ్మెల్యే ఎదుటే కానిస్టేబుల్పై డ్రైవర్ సాయికుమార్ దాడిచేశాడని, సీఐ ఆ దాడిని అడ్డుకున్నారని సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే, కానిస్టేబుల్పై దాడి అవాస్తవమంటూ శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. కానీ, కానిస్టేబుల్ అన్వర్బాషా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీకాళహస్తిలో పోలీసు కానిస్టేబుల్ అన్వర్బాషాపై దాడి జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు ఖండించారు. -
‘రక్షించాల్సిన వ్యవస్థలు నైతికతను కోల్పోతున్నాయి’
తిరుపతి: ఏపీలో రక్షించాల్సిన వ్యవస్థలే నైతికతను కోల్పోతున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విమర్శించారు. యలమంద మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై బాధితురాలికి అండగా ఉంటే తనపై ఫోక్సో కేసును పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా చెవిరెడ్డి తెలిపారు. తమతో తప్పుడు కేసులు పెట్టించారని బాధితులే చెప్పారని, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. గన్మెన్తో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, తనను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వ పెద్దల కళ్లు చల్లబడతాయనుకుంటే అందుకు తాను సిద్ధమేనన్నారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. తప్పుడు స్టేట్మెంట్ రిట్ పిటిషన్ వేస్తానన్నారు చెవిరెడ్డి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మీరు.. తన కింద సిబ్బందిని ఎందుకు వేధిస్తున్నారన్నారు. వైఎస్సార్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. -
Vennupotu Dinam: నిరసన హోరు
జిల్లాలో వెన్నుపోటు దినాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనలతో బుధవారం జిల్లా , నియోజకవర్గ కేంద్రాల్లో కదం తొక్కారు. పోలీసుల బెదిరింపులు, హెచ్చరికలు, నిషేధాలు పక్కనపెట్టి హామీలు అమలు చేయాలని కార్యకర్తలు గర్జించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో వైఎస్సార్సీపీ శ్రేణులు జెండాలతో దండులా కదిలివచ్చింది. ఎక్కడికక్కడ బారికేడ్లను ఛేదించుకొని నిరసనలకు కదిలివచ్చారు. ఉవ్వెత్తున కార్యకర్తలు తరలిరావడంతో ఆయా ప్రాంతాల్లో నిరసన హోరుతో దద్దరిల్లింది.చిత్తూరు అర్బన్ : హామీల పేరిట ప్రజలను దగా చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టేలా వెన్నుపోటు దినం నిర్వహించారు. మండు టెండను లెక్కచేయని జగనన్న సైన్యం రోడ్డెక్కి కూటమి సర్కారు మోసాన్ని ఎండగట్టింది. వేల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినంతో ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసి హామీల అమలుపై ప్రభుత్వ తీరును తూర్పారబట్టింది. ∙చిత్తూరులో జరిగిన నిరసనలో సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయలేదు. పార్లమెంటు పరిశీలకులు చువ్వా రాజశేఖర్రెడ్డితో కలిసి కలెక్టర్ సుమిత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నాయకులు కెపి.శ్రీధర్, జగదీ‹Ù, గాయత్రీదేవి, లీనారెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, విజయసింహారెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ∙పుంగనూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా హాజరు కావడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వెన్నుపోటు దినంలో కదంతొక్కారు. పాత బస్టాండు, పోలీస్ స్టేషన్, గోకుల్ సర్కిల్, అంబేడ్కర్ కూడలి వరకు నిరసన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, నాయకులు పెద్దిరెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి , అనూషారెడ్డి, పోకల అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులకు నిరసనకు దిగారు.ఈకార్యక్రమంలో సమన్వయకర్త కృపాలక్షి్మ, మండల కనీ్వనర్లు పాల్గొన్నారు. అలాగే కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వెన్నుపాటు నిరసనలకు కదం తొక్కారు. ఇక పలమనేరులో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులుతో కలిసి పలమనేరు సెంటర్లో వెన్నుపోటు నిరసన కార్యక్రమం హోరెత్తించారు. రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే డా.సునీల్కుమార్ ఆధ్వర్యంలో బంగారుపాళ్యం తహసీల్దార్ కార్యాలయం వద్ద వెన్నుపోటు దినం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, పార్టీ నేతలు కుమార్రాజా, ధనంజయరెడ్డి, బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసమే బాబు నైజం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసగించడం చంద్రబాబు నైజం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగభృతి, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏడాది అవుతున్నా ఇచ్చిన దాఖలాలు లేవు. – రాజశేఖర్రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా ఏడాది పండుగ నిర్వహిస్తోంది. ప్రజల్లో ఏడాది తిరగకుండానే తిరుగుబాటు మొదలయింది. నాణ్యమైన మద్యం, తక్కువ ధరలకు అందిస్తామని ఎరగా చూపి చంద్రబాబు ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు అంతా మద్యం కుంభకోణమే నడుస్తోంది. కూటమి పాలనకు తెరపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. – నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రజలు నిలదీసే రోజులు వస్తాయి 30 యాక్టు అమల్లో ఉందని, కేసులు పెడతామనే బెదిరింపులు, పోలీసుల హెచ్చరికలను కార్యకర్తలు లెక్కచేయలేదు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలి. హామీల నుంచి పాలకులు తప్పించుకోలేరు. ప్రజలే నిలదీసే రోజులు త్వరలో వస్తాయి. – భరత్ , ఎమ్మెల్సీ, కుప్పం అప్పులు తీసుకురావడమే సంపద సృష్టా? సంపద సృష్టించడమంటే ప్రతి మంగళవారం అప్పు లు తీసుకురావడమేనా..? పోలీసులు 110 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా ..వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. గతంలో గగ్గోలు పెట్టిన పెద్దలు ఇప్పుడు అప్పులు చేయడం దేనికో ప్రజలకు చెప్పాలి. ఏడాదిలో ఒక్క హామీ అమలు చేయలేదు. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే పలమనేరు -
ఉగ్రవాదంపై అప్రమత్తంగా ఉండాలి
● టీటీడీ, విజిలెన్స్ అధికారులతో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ తిరుమల : దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇస్లామిక్, తీవ్రవాదం ఉగ్రవాదం నుంచి తిరుమలను సురక్షితంగా కాపాడుకోవాలని తిరుమల అదనపు ఎస్పీ రామకష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆస్థాన మండపంలో టీటీడీ విజిలెన్స్, సివిల్, ఏఆర్ పోలీసులు, ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్, ఆక్టోపస్, ఫైర్, బాంబ్ స్క్వాడ్తోపాటు టీటీడీ సిబ్బంది అర్చకులు, పోటు కార్మికులు, ట్యాక్సీ డ్రైవర్లు, మఠాల నిర్వాహ కులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇస్లామిక్ ఫండమెంటలిజం, టెరర్రిజం ద్వారా దాడులకు పాల్పడుతూ దేశసమగ్రతను, భద్రతను దెబ్బతీస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో హిందువుల రాజధానిగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని రక్షించుకునేందుకు ఇక్కడ పనిచేసే అధికారుల నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఉగ్రవాదులు మనతోపాటు ఉంటూ ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తారని, మనమందరం అప్రమత్తంగా ఉంటూ వారి ఆచూకీ గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ప్రతి ఒక్కరూ తాము పనిచేసే ప్రదేశంలో అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా విలువైన ప్రాణాలను రక్షించవచ్చునని ఏఎస్పీ తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన బాంబుదాడులు, వాటిని అమలు చేసిన విధానాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తిరుమలలో ఉగ్రముప్పును అడ్డుకునేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేపట్టామని తెలిపారు. అందులో భాగంగానే అక్రమంగా తిరుమలలో ఉంటున్న హాకర్లు, వలసదారులను గుర్తించి 800 మందిని బలవంతంగా తిరుపతికి తరలించామన్నారు. అదేవిధంగా వారు నిర్మించుకున్న 150 షెడ్లను కూల్చివేశామని తెలిపారు. నిరంతరాయంగా భద్రతా చర్యలను కొనసాగిస్తున్నామని చెప్పారు. సమావేశంలో తిరుమల డీఎస్పీ విజయ్ శేఖర్, టీటీడీ వీజీఓ సురేంద్ర, వివిధ భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
సబ్సిడీ వేరుశనగ..
● పచ్చనేతలకే తొలి ప్రాధాన్యత ● జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో వేరుశనగ సాగు ● ఎకరాకు 1.20 క్వింటాళ్లు అవసరం.. అంటే 12 వేల క్వింటాళ్లు ఇవ్వాలి ● కానీ జిల్లాకు వచ్చింది 3,280 క్వింటాళ్లే ● ఎకరాకు ఒక బస్తా.. 3 ఎకరాలకు పైన ఎంత భూమి ఉన్నా గరిష్టంగా 3 బస్తాలే ● 40 శాతం రాయితీతో విత్తనకాయలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు ● ఆందోళనలో అన్నదాతలు తిరుపతి అర్బన్: ఖరీఫ్ సీజన్ అనగానే మొదట సాగయ్యే పంట వేరుశనగ. ఈసారి 80 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేయడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే 5 నుంచి 10 శాతం వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. అందులో ప్రధానంగా వరి సాగు 60 వేల ఎకరాలు, వేరుశనగ పంట 10 వేల ఎకరాలు, ఆరుతడి పంటల్లో ప్రధానంగా నువ్వులు పంట 4 వేల ఎకరాలు, మిగిలిన 6 వేల ఎకరాల్లో జొన్నలు, సజ్జలు, రాగులు, మినుములు, కొర్రలు, అరికలు, సాములు తదితర పంటలు సాగుచేస్తారు. 10 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు.. జిల్లాలోని 34 మండలాల్లో తిరుపతి అర్బన్ మినహాయిస్తే మిగిలిన 33 మండలాల్లో ఖరీఫ్ సీజన్లో 10 వేల ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేయనున్నారు. 10 వేల ఎకరాల సాగుకు ఎకరాకు 1.20 క్వింటాళ్లు చొప్పున 12 వేల క్వింటాళ్లు వేరుశనగ విత్తనకాయలు అవసరం. అయితే ఈ సీజన్కు కేవలం 3,280 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయని అగ్రికల్చర్ అధికారులు అంటున్నారు. 30 శాతం మాత్రమే వేరుశనగ విత్తనాలు మాత్రమే జిల్లాకు చేరాయి. రేపోమాపో కూటమి నేతల చేత ప్రారంభోత్సవం చేయించిన తర్వాత పంపిణీ చేయడానికి అగ్రికల్చర్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పచ్చనేతలకే తొలి ప్రాధాన్యత 30 శాతం మాత్రమే వేరుశనగ కాయలు రావడంతో తొలి ప్రాధాన్యత పచ్చనేతలకే ఇవ్వాలని ఇప్పటికే కూటమి నేతలు అగ్రికల్చర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో నిజమైన రైతులకు నష్టం తప్పదని పలువురు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కే6, డీసీజీఎస్ 1694 రకాల వేరుశనగ కాయలు మాత్రమే జిల్లాకు వచ్చాయి. మార్కెట్లో డిమాండ్ లేని రకాలు వచ్చాయని పలువురు రైతులు విమర్శలు చేస్తున్నారు. ఆందోళనలో అన్నదాతలు 40 శాతం రాయితీతో విత్తనాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కేజీ వేరుశనగ కాయలు రూ.93. అయితే అందులో సబ్సిడీ 37.20 మినహాయిస్తే కేజీ రూ.55.80 చొప్పున రైతులకు అందజేయనున్నారు. మొత్తంగా 30 కేజీల బస్తా రూ.1674కి రైతులకు అందించనున్నారు. జిల్లాలో 442 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. అయితే అందులో 160 రైతు సేవా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు లేరు. దీంతో కొందరు అగ్రికల్చర్ అసిసెంట్లకు రెండు రైతు సేవా కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. రైతు పాస్ పుస్తకాల జెరాక్స్లను అగ్రికల్చర్ అసిస్టెంట్లకు సమర్పించాల్సి ఉంది. కనిష్టంగా ఎకరం భూమి ఉన్న రైతుకు ఒక బస్తా(30కేజీలు).. రెండు ఎకరాలు ఉంటే 2 బస్తాలు, మూడు ఎకరాలు ఉంటే 3 బస్తాలు ఇవ్వాలని నిర్ణయించారు. 3 ఎకరాలకు మించి ఎన్ని ఎకరాలు ఉన్నా గరిష్టంగా 3 బస్తాలు మాత్రమే ఇవ్వనున్నారు. అయితే ఒక ఎకరం సాగుకు 30 కేజీల బస్తాలు 4 సంచులు అవసరం అవుతాయి. అంటే 120 కేజీలు ఎకరా పొలంలో పంట సాగుకు అవసరం ఉంటుంది. గరిష్టంగా 3 బస్తాలు ఇస్తే ఒక్క ఎకరం కూడా పంటను సాగు చేయలేమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్లో రైతులకు కష్టాలు తప్ప.. ప్రయోజనాలు కల్పించడం లేదని పలువురు వాపోతున్నారు. మొత్తంగా రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలు అందుతాయో లేదో రెండు రోజులు వేచి చూడాల్సి ఉంది. -
పేదల స్థావరాలపై ప్రతాపం
ఏర్పేడు: శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులోని పేదలపై టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. బుధవారం గ్రామానికి చెందిన 30మంది కుండలు తయారు చేసుకునే పేదలు బంకమట్టి నిల్వ చేసుకున్న స్థావరాలను టీడీపీ నేతలు ధ్వంసం చేసి స్థలాన్ని జేసీబీతో చదును చేశారు. స్థానికుల కథనం మేరకు.. గ్రామశివార్లలో ప్రభుత్వ భూమి రెండెకరాలు ఉంది. ఈ స్థలంలో దశాబ్దాల తరబడి కుమ్మరులు బంకమట్టి తెచ్చి అక్కడే నిల్వ చేసుకుని కుండలను తయారుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు కక్షపూరితంగా జేసీబీతో చదును చేసేశారు. బాధితులు మాట్లాడుతూ తాము నిల్వ చేసుకున్న మట్టినంతా పల్లపు ప్రాంతాల్లోకి తోసి చదును చేశారని, రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని వాపోయారు. ఉపాధి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
ముత్యపు పందిరిపై తేజోమూర్తి
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం రాత్రి స్వామివారు ముత్యపు పందరి వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా ఉదయం సింహవాహనంపై స్వామివారు ఊరేగారు. 10 నుంచి 11 గంటల వరకు దేవదేవేరులకు స్నపన తిరుమంజనం వేడుకగా చేపట్టారు. సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, డిప్యూటీ ఈఓ వీఆర్ శాంతి, ఏఈఓ కె.మునికృష్ణారెడ్డి, ఏవీఎస్ఓ మోహన్రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
మన జీవితంలో యోగా భాగం కావాలి
చంద్రగిరి: ప్రతి ఒక్కరి దైనందిత జీవతంలో యోగ ఒక భాగం కావాలి అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం చంద్రగిరి కోటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ప్రజలు, జిల్లా అధికారులు, విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. సీఎం పిలుపు మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాంధ్ర క్యాంపెన్లో భాగంగా తిరుపతి జిల్లాలోని చంద్రగిరి కోటలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారుగా 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువు చెప్పిన విధంగా ఆసనాలను ఆసక్తిగా వింటూ ప్రజలు, అధికారులు, యువత మహిళలు ఆసనాలు వేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్ధన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, మహిళలు, విద్యార్థులు, పాల్గొన్నారు. చంద్రగిరి కోటలో అట్టహాసంగా యోగాంధ్ర పాల్గొన్న జిల్లా కలెక్టర్, అధికారులు యువత, మహిళలు, విద్యార్థులు -
తారాస్థాయికి జనసేన నేతల వర్గపోరు
● కార్యక్రమం ఏర్పాట్లలో వివాదం, ఘర్షణ ● ఒకరికి కత్తి పోట్లు చిల్లకూరు : గూడూరు నియోజకవర్గంలో జనసేన నేతలు, కార్యకర్తల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం జనసేన నేతలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. ఒక వర్గానికి చెందిన వారు బుధవారం రాత్రి టపాకాయలు తీసుకుని వచ్చేందుకు గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్దకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గానికి చెందిన వారు అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో సాయి అనే యువకుడిపై మరో వర్గానికి చెందిన యువకుడు కత్తితో దాడి చేశాడు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా కాలికి గాయమైంది. దాడికి పాల్పడిన వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన సాయిని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ ఎస్ఐ తిరుపతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో గూడూరు పట్టణంలో అల్లర్లు, దాడులు, ప్రతిదాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. రెండు రోజుల క్రితం రెండో పట్టణంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీన్ని మరువకనే జనసేన కార్యకర్తల మధ్య వర్గపోరు జరిగి కత్తితో దాడులు చేసుకునే వరకు రావడంతో పట్టణ ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి గట్టి చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. విద్యా మండలి సమావేశానికి వీసీ తిరుపతి సిటీ : మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీసీలు, రిజిస్ట్రార్ల సమావేశానికి ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధు మూర్తి, ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో వర్సిటీల పాలన, పరిశోధనాభివృద్ధి, రీసెర్చ్ పబ్లికేషన్, ప్రపంచ ర్యాంకుల స్థాయి మెరుగుపరచడం, అధ్యాపకుల కొరత, భర్తీ ప్రక్రియ, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. దేవదాయశాఖ ఇన్స్పెక్టర్పై కక్షకాణిపాకం : జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సుమనప్రియ సస్పెన్షన్ వెనుక అంతర్యమేమిటో అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల కిందట బంగారుపాళ్యం మండలంలోని శ్రీ మొగిలి దేవస్థాన హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించారంటూ కొందరు వ్యక్తులు (కూటమి నేతలు) శనివారం దేవదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన మరుసటి రోజే దీనిపై ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే విచారణకు పిలిచారు. అత్యవసరంగా ఆదివారం విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ఆ శాఖ అధికారులే ఓ అధికారి తీరుపై మండిపడుతున్నారు. కక్ష పూరితంగానే సుమన ప్రియను సస్పెండ్ చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షులుగా ఉన్న వ్యక్తులు లెక్కించే సమయంలో సీసీ ఫుటేజీలో ఉన్నారా..? సీసీ ఫుటేజీలో సుమన ప్రియ డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయా ? అనే విషయాలు అధికారులు దాచి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి, కూటమి నేతలకు అంటకాగిన కొందరు అధికారులు సుమన ప్రియపై కక్ష కట్టి సస్పెండ్కు పూనుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈమెను సస్పెండ్ చేసి కార్యాలయంలో పనిచేసే మరో అధికారికి ఈ సీటును కేటాయించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు పెద్ద ఎత్తున రాజకీయాలు నడిచినట్లు విమర్శలు వస్తున్నాయి. -
అర్జున్దాస్ గది తలుపులు తెరిచిన అధికారులు
తిరుపతి కల్చరల్: శ్రీస్వామి హథీరాంజీ మఠం మాజీ మఠాధిపతి అర్జున్దాస్ అధికారిక గది(డోలు)ను దేవదాయశాఖ అధికారులు, మఠం పరిపాలన అధికారి బాపిరెడ్డి, మఠాధిపతి ఓంప్రకాష్దాస్ సమక్షంలో బుధవారం తెరిచి పంచనామా నిర్వహించారు. మఠాధిపతిగా అర్జున్దాస్ ఉన్నప్పుడు మఠం నిబంధనలకు విరుద్ధంగా పలు అక్రమాలకు, భూములు అన్యాక్రాంతానికి పాలు పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ అర్జున్ దాస్ను సస్పెండ్ చేస్తూ విచారణకు ఆదేశించింది. ఈమేరకు అర్జున్ దారు అధికారిక గదిని 2023 జూన్ 8వ తేదీన అధికారులు సీజ్ చేశారు. అప్పటి నుంచి అర్జున్దాస్ మళ్లీ మఠాధిపతిగా కొనసాగేందుకు కోర్టుల ద్వారా ప్రయత్నం చేసినా ఫలితం లేదు. మఠాధిపతిగా ఓం ప్రకాష్ను ధార్మిక పరిషత్ నియమిస్తూ మఠం ఆధీనంలోని ఆలయాలకు సంబంధించిన కార్యకలాపాలను చూసుకోవాలని పరిషత్ సూచించింది. అర్జున్దాస్ అధికార గదిలో ఉన్న వస్తువులు, రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని బాపిరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ రెవెన్యూ విభాగం స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ డాక్టర్ కె.సత్యవతి, దేవదాయ శాఖ ఆర్జేసీ కార్యాలయ తహసీల్దార్ వీఆర్ కృష్ణ, మఠం సూపరింటెండెంట్ కేశవులు, మఠం లా ఆఫీసర్ కవిత, ల్యాండ్స్ క్లర్క్ సీతారామయ్య, మఠం సిబ్బంది పాల్గొన్నారు. -
ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం మొదలైంది: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో జరిగిన అన్యాయాలపై పేద ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోకు ఆయన కూటమి ప్రభుత్వ హామీల వినతి పత్రం సమర్పించారు. వంచన, మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. 143 హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ నేతలపై ఇప్పటిదాకా 2,466 కేసులు పెట్టారు. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయం పై పేద ప్రజలు పక్షనా పోరాటాలు కొనసాగిస్తాం.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పూరించిన సమరశంఖంలో ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం అయ్యింది అని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ కేంద్రంగా ప్ర‘మాదక’ర దందా!
పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది. కూటమి సర్కారు వచ్చి ఏడాదవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మద్యం, గంజాయి దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సర్కారే బెల్టుషాపులను ప్రోత్సహిస్తోంది. పర్మిట్ రూంలకు ఇష్టానుసారం అనుమతులిచ్చేస్తోంది. దీనికితోడు ఇప్పుడు డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో రూ.కోటి విలువైన కొకైన్ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉండడం కూటమి ప్రభుత్వం, పోలీసుశాఖ వైఫల్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన కూటమి సర్కారు ప్రతిపక్ష ఎంపీపై ఎదురుదాడికి దిగడం నిజంగా సిగ్గుచేటు.. హాస్యాస్పదం.. జీడిమెట్ల(హైదరాబాద్)/తిరుపతిక్రైమ్: తిరుపతి నుంచి హైదరాబాద్కు కొకైన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు యత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను బాలానగర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్ పరారీలో ఉన్నాడు.వీరి వద్ద రూ.కోటి విలువచేసే 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ షాపూర్నగర్లోని డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఎస్వోటీ డీసీపీ డి.శ్రీనివాస్ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నేహితుడి చేత డ్రగ్స్ తరలింపు తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశచూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్కు పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్లుగానే సురేంద్ర కొకైన్ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కూకట్పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి, దేవరాజు యేసుబాబులను హైదరాబాద్ రప్పించాడు. అదేవిధంగా చేగూడి మెర్సి మార్గరెట్, షేక్ మస్తాన్ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్పల్లిలోని జయనగర్లో కలుసుకున్నారు. జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు ఐదుగురు కూకట్పల్లి భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకైన్ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించి విచారించగా అసలు బండారం బయటపెట్టారు. అసలు డ్రగ్స్ వీరికి ఎక్కడ నుంచి వచ్చిoదనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజేశ్, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై కట్కం గౌతం పాల్గొన్నారు. పోలీస్శాఖ ఆరా గుణశేఖర్ తిరుపతిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతను పంపిన మనుషులు డ్రగ్స్తో హైదరాబాద్లో పట్టుబడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మాట్లాడగా.. గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. పోలీస్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కానిస్టేబుల్ గుణశేఖర్కు తిరుపతి ఎంపీ గురుమూర్తికి సంబంధాలు అంటగట్టే యత్నాలు జరుగుతుండడం అందరినీ విస్తుగొలుపుతోంది. కొన్ని నెలల క్రితం గుణశేఖర్ ఎంపీ వద్ద కొద్ది రోజులు గన్మేన్గా ఉద్యోగం నిర్వహించాడు. దానిని సాకుగా తీసుకుని ఈ కేసును ఎంపీకి అంటగట్టాలని కూటమి నేతలు యత్నించడం కుట్రపూరితమే. -
కూటమి ప్రభుత్వం.. చేసింది శూన్యం
తిరుపతి మంగళం : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ గురుమూర్తి, తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డితో కలిసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై బుధవారం వెన్నుపోటు దినం పాటిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఏడాది పాలనలో 800 మందికిపైగా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన సూపర్సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నుపోటు దినంగా నామకరణం చేశారని, ఆ మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల నిరసనలు తెలిపి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సత్యనారాయణపురం నుంచి ర్యాలీ తిరుపతి జీవకోన మార్గంలోని సత్యనారాయణపురం సర్కిల్ నుంచి బుధవారం ఉదయం 9గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి తెలిపారు. సత్యనారాయణపురం నుంచి తిరుమల బైపాస్రోడ్డులోని మున్సిపల్ పార్క్ వరకు నిరసన ర్యాలీ కొనసాగుతుందని వెల్లడించారు. అనంతరం తిరుపతి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నట్లు వివరించారు. -
వెన్నుపోటు దినం.. ఊరూరా ఉద్యమం
● ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ● నేడు జిల్లావ్యాప్తంగా ఆందోళనకు సన్నద్ధమైన శ్రేణులు తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ప్రభుత్వం వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీతో కలసి బుధవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. గూడూరు : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నేతృత్వంలో పట్టణంలోని టౌన్క్లాక్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సర్కార్ తీరును ఎండగడుతూ నిరసన చేపట్టనున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు,కార్యకర్తలతోపాటు స్వచ్ఛందంగా ప్రజలు హజరుకానున్నారు. వెంకటగిరి : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నేతృత్వంలో రాపూరులోని పడమటి వీధి సిద్ధులయ్య ఆల యం నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లనన్నారు. అనంతరం నిరసన చేపట్టనున్నారు. సత్యవేడు : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో వరదయ్యపాళెం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు చేసిన మోసాలను వివరించనున్నారు. శ్రీకాళహస్తి : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని శ్రీరామనగర్కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం కూటమి సర్కార్లో దోపిడీ విధానం, కక్ష సాధింపు చర్యలు, అమలు చేయని హామీలపై నిరసన చేపట్టనున్నారు. తిరుపతి: తిరుపతి నగరంలోని జీవకోన నుంచి లీలామహల్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాలఅధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, మేయర్ శిరీషా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించనున్నారు. చంద్రగిరి : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి టవర్క్లాక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. స్థానికంగా జరుగుతున్న అరాచకాలతోపాటు కూటమి సర్కార్ ఇచ్చిన హామీల నెరవేర్చకపోవడంపై నిరసన వ్యక్తం చేయనున్నారు. సూళ్లూరుపేట : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో నాయుడుపేటలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం నిరసన వ్యక్తం చేయనున్నారు. -
వరుస భేటీలు.. విషయం ఏంటో?
తిరుపతి అర్బన్ : నియోజకవర్గ అభివృద్ధి కోసం.. ప్రజా సమస్యలు పరిష్కారం కోసమంటూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం నోరెత్తిన దాఖలాలు లేవు. కానీ...కలెక్టర్ వెంకటేశ్వర్ను మాత్రం పదేపది కలుస్తున్నాన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై కలెక్టర్ను కలిసినట్లు సమాచారశాఖ ద్వారా ఓ ప్రకటన విడుదల చేయిస్తున్నారు. సొంత సమస్యలో...లేదా ప్రజా సమస్యలో తెలియడం లేదు...మొత్తానికి కలెక్టర్ను మాత్రం తరచూ కలుస్తున్నారంటూ జిల్లాలోని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే సమాచారశాఖ వారు విడుదల చేస్తున్న ప్రకటనలోనే ఏ సమస్యపై కలెక్టర్తో చర్చించారో...ఆ సమస్య ఎంత మేర పరిష్కరించారో తెలియజేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. -
భక్తుల భద్రతకు భరోసా
శ్రీవారి భక్తుల భద్రతే లక్ష్యంగా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. విష్ణునివాసం, శ్రీనివాసం వద్ద నిఘా పెట్టారు.చదును చేసి.. చెరువు కబ్జా! కలువాయి మండలం మాదన్నగారిపల్లెలో చెరువు పోరంబోకు భూమిని టీడీపీ స్థానిక నేత ఆక్రమించాడు.బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోఅవినీతికి ఆయనే ఆదర్శం.. మోసానికి మరోరూపం.. కుట్రలు.. కుతంత్రాలే ఆయన నైజం.. నయవంచనకు నిలువెత్తు నిదర్శనం.. వెన్నుపోటు అంటే ఆయనకే పేటెంటు.. సదరు ఘనత వహించిన బాబుగారు ఏళ్ల తరబడి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏనాడూ ఇచ్చిన మాట చెల్లించరు.. ఓట్ల కోసం అలవి కాని హామీలను సైతం సునాయాసంగా గుప్పించేస్తారు. ఆకాశం నేలమీదకు దించేస్తానంటారు.. సంపదను సృష్టించి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేస్తానంటారు.. ఎలాగైనా పీఠం ఎక్కడమే పరమావధిగా భావిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను బుట్టదాఖలు చేసేస్తారు.. ఇదే తంతును చంద్రబాబు మరోసారి కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆశువుగా వల్లించిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజలను బురిడీ కొట్టించారు. సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటంగా తీసుకువచ్చిన మేనిఫెస్టోను మూలన పడేశారు. అభివృద్ధి సంగతి దేముడెరుగు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు.. రోజుకో మాట చెబుతూ జనాలకు కుచ్చుటోపీ పెట్టేశారు. తత్వం బోధపడడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. బాబు మాటలు నమ్మి మోసపోయామంటూ మధనపడుతున్నారు. కూటమి సర్కారు తీరుకు నిరసనగా బుధవారం వెన్నుపోటు దినం పాటించాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పోటెత్తాలని పిలుపునిస్తున్నారు. అస్తవ్యస్తంగా ఉంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచింది. పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. సంక్షేమం, అభివృద్ధి రెండు స్తంభించిపోయాయి. కనీసం పేద, బడుగు బలహీన వర్గాలకు ఒక్క పథకం కూడా అందలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆర్బాటంగా సూపర్సిక్స్తో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు. ఏడాది గడిచింది ఒక రూపాయి రాలేదు. గతంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు – మోహన్, మాజీ సర్పంచ్, కురింజలం, వరదయ్యపాళెం ఒక్క పథకం అందలేదు గత ప్రభుత్వమే ఎంతో మేలుగా ఉంది. కూటమి సర్కార్ మా లాంటి పేదలకు ఏమి చేయలేదు. సంవత్సరం అయిపోయింది. ఇంక ఏం చేస్తారో నమ్మకం లేదు. గతంలో జగనన్న ఏడాదిలో ప్రతి నెలా ఏదో ఒక పథకంతో బ్యాంకు ఖాతాలో డబ్బు జమచేశారు. సొంత ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ ఉండడం లేదు. రెక్కల కష్టమే మిగులుతోంది. పిల్లల చదువులు కష్టంగా మారాయి. ఎన్నికల సమయంలో తల్లికి వందనం, కుటుంబంలో ఉన్న మహిళల అందరికి నెలకు రూ.1500 అన్నారు. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. – వెంకటరత్నమ్మ, అడుసుపాళెం, రేణిగుంట ఉద్యోగాలు లేవు యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు యువతతో మీటింగ్ పెట్టి ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 5ఏళ్లలో 20లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటాం అంటూ ఊదరగొట్టారు. ఇప్పటికీ ఆ ఊసేలేదు. ఉద్యోగం వచ్చేవరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అదీ అమలు చేయలేదు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి రోడ్డుపాలు చేస్తున్నారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన ఏడాదికి తూతూమంత్రంగా భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. – రామకృష్ణ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ, తిరుపతి రూరల్ దారుణంగా ఉంది ఏడాదిగా ఒక్క రూపాయి పేదలకు అందలేదు. ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ మహిళలకు చేరలేదు. గ్రామీణ ప్రాంతంలోని మాలాంటి పేదల పరిస్థితి దారుణంగా ఉంది. జగనన్న పాలనలో ఆసరా పథకం, సున్నావడ్డీ, అమ్మ ఒడితో ఎంతో మంది ఆర్థికంగా బలపడ్డారు. ఈ ఏడాది నుంచి పథకాలు రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా తల్లికివందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు పథకాలను అమలు చేసి ఆదుకోవాలి. – టి.రేణుక, గృహిణి, సూళ్లూరుపేటసంజయ్మూర్తికి సాదర వీడ్కోలు రేణిగుంట : జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన కంప్ట్రోలర్, ఆడిట్ జనరల్ సంజయ్మూర్తికి మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్ వెంకటేశ్వర్ సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రతిమను బహూకరించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న లాసెట్ ప్రవేశ పరీక్ష గురువారం జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే హాల్టికెట్లను ఆన్లైన్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. తిరుపతి కేంద్రంగా జరగనున్న ఎస్వీసీఈ, శ్రీరామ, అన్నమాచార్య, చదలవడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లాసెట్ చైర్మన్, వీసీ ప్రొఫెసర్ ఉమ తెలిపారు. విద్యార్థులు హాల్టికెట్లతో పాటు ఐడీ ప్రూఫ్ను వెంట తీసుకురావాలని సూచించారు. పరీక్ష 9 గంటల నుంచి 10.30 వరకు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని తెలిపారు. 8న చెస్ టోర్నమెంట్ తిరుపతి కల్చరల్ : తిరుపతి యశోదనగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 8వ తేదీన చెస్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున, చెస్ సంఘం సీఈఓ బాలాజీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఈ మేరకు టోర్నీ బ్రోచర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెస్ పోటీలు జరుగుతాయన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆసక్తిగల క్రీడాకారులందరూ టోర్నీలో పాల్గొనవచ్చని వెల్లడించారు. విజేతలకు ఆకర్షణీయమైన ట్రోఫీలు అందించనున్నట్లు చెప్పారు. పాల్గొన్న క్రీడాకారులందరికీ మెడల్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. మధ్యాహ్న భోజన వసతి ఉంటుందని తెలిపారు. క్రీడాకారులు ఎంట్రీ ఫీజు కింద రూ.200లు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8555921134,8985080370 నంబర్లలో సంప్రదించాలని వెల్లడించారు.కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు ఎస్.రెడ్డెప్ప, నడ్డినారాయణ, పంచముఖేశ్వరరావు, ఎస్.మునిరాజ, గురునాథం, తహసున్నీసా, రెడ్డెప్ప, ఇమామ్, లక్ష్మీనారాయణ, జ్ఞానప్రసూన పాల్గొన్నారు.తిరుపతి సిటీ : సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా చంద్రబాబు అండ్ కో మోసపూరిత హామీలను గుప్పించారు. సూపర్ సిక్స్ అంటూ బూటకపు మేనిఫెస్టోను ప్రకటించారు. ఊరు వాడా తిరుగుతూ ప్రజలను నమ్మించారు. అమలు చేయలేమని తెలిసీ ఇష్టారాజ్యంగా 143 హామీలను మేనిఫెస్టోను తీసుకువచ్చారు. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి ఆర్థిక స్థితి బాగోలేదంటూ మేనిఫెస్టోను మూలన పడేశారు. అభివృద్ధిని అటకెక్కించి సంక్షేమ పథకాలను గాలికొదిలేశారు. ప్రధానంగా మహిళా శక్తి పేరుతో ఆడపడుచులకు ఇచ్చిన హామీలు తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు వంటి పథకాలను పక్కనపెట్టేశారు. నీకు 15వేలు..నీకు 15వేలు..మరి నీకు 18వేలంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు నేడు చేతులెత్తేశారు. దీపం–2 అంటూ.. ఉచిత గ్యాస్ అంటూ జనం చెవిలో పువ్వులు పెట్టేశారు. తూతూమంత్రంగా పథకం అమలు చేస్తున్నారు. పథకం జిల్లాలో కనీసం 30శాతం మందికి కూడా ఉచిత సిలిండర్ అందించిన దాఖలాలు లేవు. కుల వృత్తులు, వైద్య, విద్యా రంగాల పరిస్థితి మరింత దయనీయ స్థితికి చేర్చేశారు. వెటకారపు మాటలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలను హేళన చేస్తూ వెటకారంగా మాట్లాడడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ పేరుతో హామీలను గుప్పించారు. ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు చేయాలంటే డబ్బులు లేవు.. సంపద సృష్టించి తర్వాత అందిస్తాం...అలా సంపద సృష్టించే ఐడియాలు ఏమైనా ఉంటే తనకు చెవిలో చెప్పాలంటూ అవహేళనగా నిండు సభలో చంద్రబాబు మాట్లాడడంతో సూపర్సిక్స్ పథకాల అమలు అసాధ్యమని తేలిపోయింది. దీంతో బడుగు బలహీన వర్గాలు, పేదలను సైతం బాబు వెన్నుపొటు పొడిచేందుకు వెనుకాడడని ఆయన నైజం మరోసారి బయటపడిందంటూ జిల్లావాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పశ్నించిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తన అనుచరులను, పార్టీ కార్యకర్తలను యథేచ్ఛగా దోచుకోండి.. దాచుకోండి అంటూ ప్రొత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలు చెప్పారు ప్రజలను వంచించి ఓట్లు వేయించుకున్నారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఆడబిడ్డ నిధిపై నోరు మెదపడం లేదు. మహానాడు వేదికగా పథకాల అమలుపై స్పష త ఇస్తారనుకున్నాం. ఆ ప్రస్తావనే లేదు. నీకు 15...నీకు...15...నీకు 18 అంటూ ప్రగల్భాలు పలికి మహిళలకు మాయమాటలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఉన్న పింఛన్లను తొలగించారు. నామమాత్రంగా దీపం పథకం పేరుతో కొందరికే నగదు జమచేశారు. బాబు పాలన దారుణంగా ఉంది.– ఓ.అంకమ్మ, సైదాపురం, వెంకటగిరి పశ్నించే గళం ఏమైంది? ప్రభుత్వాలు తప్పు చేసినా, సామాన్య ప్రజలకు అన్యాయం జరిగినా స్పందించి ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ గళం ఏమైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది. కనీసం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రశ్నించాలి. గత ప్రభుత్వంలో ప్రతి మహిళకు ఏడాదిలోనే జగనన్న లక్షల రూపాయల లబ్ధి చేకూర్చారు. ప్రస్తుతం గ్రామీణ మహిళలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. పట్టించుకునే నాథుడు లేడు. ఆడబిడ్డ నిధి, తల్లికివందనం, ఉచిత బస్సు ఊసే ఎత్తడం లేదు. – బి.ధనమ్మ, యలమంద, చంద్రగిరి– 8లో– 8లోన్యూస్రీల్ప్రజలను మరోసారి బురిడీ కొట్టించిన బాబు ఏడాదిగా అమలు కాని హామీలు మేనిఫెస్టో మళ్లీ బుట్టదాఖలు దాడులు.. అక్రమ కేసులు.. అరెస్ట్లకే పాలన పరిమితం సంపద సృష్టి పేరుతో సంక్షేమ పథకాలకు తూట్లు చంద్రబాబు వైఫల్యాలపై నేడు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నిరసన వెన్నుపోటు దినంగా పాటిస్తూ ఆందోళన జిల్లాలో ఏడాదిగా పథకాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు తిరుపతి 1,89,569 చంద్రగిరి 2,17,678 శ్రీకాళహస్తి 1,75,095 వెంకటగిరి 1,82,767 సూళ్లూరుపేట 1,67,990 గూడూరు 1,51,874 సత్యవేడు 1,39,087 సంక్షేమం కింద ప్రజలకు అందాల్సిన మొత్తం పథకం లబ్ధిదారుల చేరాల్సిన నగదు తల్లికి వందనం రూ.870 కోట్లు ఆడబిడ్డ నిధి రూ.2,359.15కోట్లు ఉచిత బస్సు రూ.2,123 కోట్లు అన్నదాత సుఖీభవ రూ.4,598 కోట్లు నిరుద్యోగ భృతి రూ.984.23 కోట్లు చెప్పింది ఇదీ.. ఏడాదిగా చేసింది ఇదీ.. సూపర్ సిక్స్ పథకాలను అందిస్తాం బూటకపు హామీలుగానే మిగిలిపోయాయి ఏటా 4లక్షల ఉద్యోగాలు.. 5ఏళ్లలో 20లక్షలు ఇచ్చింది శూన్యం ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రస్తావనే లేదు ప్రతి నిరుద్యోగికీ భృతి నెలకు రూ.3వేలు పట్టించుకోలేదు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15వేలు ఊరిస్తూనే వస్తున్నారు అన్నదాత సుఖీభవ కింద రైతుకు ఆర్థిక సాయం రూ.20వేలు ఊసే లేదు 18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 నోరు మెదపడం లేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తావనే ఎత్తలేదు వలంటీర్లకు గౌరవవేతనం నెలకు రూ.10వేలు వ్యవస్థనే తొలగించేశారు 50ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్ 12వేల మందికి తీసేశారు అర్చకులకు నెలకు రూ.15వేలు శఠగోపం పెట్టేశారు ఉచిత ఇసుక ధరలు పెంచి దోచుకుంటున్నారు కరెంట్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు సామాన్యుడు కట్టలేని స్థాయికి పెంచారు సత్యవేడులో ఆర్డీఓ కార్యాలయం అవునా...మేం చెప్పామా...! సత్యవేడులో వంద పడకల ఆస్పత్రి నానుస్తూనే ఉన్నారు తిరుమల పవిత్రతను కాపాడుతాం అపచారాలు నిత్యకృత్యం పోటు వృత్తిని కుల వృత్తిగా పరిగణిస్తాం పట్టించుకున్న పాపాన పోలేదు ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యం జిల్లాలో 10వేల మంది ఉద్యోగుల తొలగింపుదాడులు.. దౌర్జన్యాలు కూటమి ప్రభుత్వ పాలన ఏడాది గడుస్తున్నా జిల్లా ప్రజలకు చిల్లిగవ్వ చేతికందలేదు. బాబు పాలన నవ్విపోదురుగాక నాకేంటి.. అన్నట్టు కొనసాగుతోంది. దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భూకబ్జా లు పెరిగిపోయాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కూటమి నేతలు వాలిపోతున్నారు. అధికారులు, సామాన్య ప్రజలను బెదిరించి రాత్రికి రాత్రే జేసీబీలతో చదును చేసుకుని స్వాహా చేస్తున్నారు. ఉచిత ఇసుక అంటూ ఊదరగొట్టి పచ్చమూకకు ప్రకృతి వనరులను అప్పగించేశారు. సీసీ రోడ్లు, భవనాలు, పంచాయితీ పనులు, ఆర్ అండ్బీ, గనుల కాంట్రాక్టు వంటి పనులను తెలుగుతమ్ముళ్లకు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేశారు. పశ్నించి వారిపై దాడులకు పాల్పడటం, విచక్షణారహితంగా గాయపరుస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయవద్దని పోలీసులను సైతం శాసిస్తున్నారు. -
‘వెన్నుపోటు’ ప్లకార్డుల ఆవిష్కరణ
ప్లకార్డును ఆవిష్కరిస్తున్న భూమన తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ బుధవారం చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన ప్లకార్డులను వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలో నివాసంలో ఆయన మాట్లాడుతూ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పేలా నిరసన వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ పాల్గొన్నారు. -
‘తోతాపురి’ టన్ను రూ.12వేలు
తిరుపతి అర్బన్ :తోతాపురి రకం మామిడిని టన్ను రూ.12వేలకు కొనుగోలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కల సి మామిడి గుజ్జు ఫ్యాక్టరీ యజమానులతో సమీక్షించారు. రూ.12వేలకు తగ్గించి కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్యాక్టరీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే రైతులకు అండగా నిలవాలని సూచించారు. తిరుపతి ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, చిత్తూరు ఉద్యానశాఖ అధికారి మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. గ్రీవెన్స్ అర్జీలకు ప్రాధాన్యతప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ద్వారా వచ్చే అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టరేట్తోపాటు మండల, డివిజన్ స్థాయిలో ప్రజలు అందించే అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై అధికంగా అర్జీలు వస్తున్నాయని వివరించారు. వాటికి పరిష్కారం చూపించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు పీ–4 కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్, డీపీఓ సుశీలాదేవి పాల్గొన్నారు. -
శ్రీహరి బస్టాండ్ కూల్చివేతకు సన్నాహాలు
తిరుపతి అర్బన్ : తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ప్రాంగణంలోని శ్రీహరి బస్టాండ్లో మొదటి ఐదు ప్లాట్ఫామ్లను కూల్చేందుకు టెండర్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. చిత్తూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్కు టెండర్ దక్కింది. కూల్చివేతకు రూ.13లక్షలు కేటాయించారు. తిరిగి అదే స్థలంలో రేకులతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఆ టెండర్ను ఈ నెలాఖరులో ఖరారు చేయనున్నారు. ప్రధానంగా కూల్చడానికి నిర్ణయించిన ప్రాంతంలో ఐదు ప్లాట్ఫామ్లతోపాటు 4 దుకాణాలు, ఓ మరుగుదొడ్డి సెంటర్, కార్గో సెంటర్, రిజర్వేషన్ కార్యాలయం, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ఏటీఎం)కార్యాలయం ఉన్నాయి. వీటిని ఏ ప్రాంతంలోకి మార్చాలనే అంశంపై ఆర్టీసీ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టారు. అదే ప్రాంతంలోని ఏడుకొండల బస్టాండ్ పక్కనే టీటీడీ వారు దర్శన టిక్కెట్ల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఆ కౌంటర్ను ఆర్టీసీ కార్గోకు వినియోగించాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ కౌంటర్ను శ్రీనివాస బస్టాండ్లో ఖాళీగా ఉన్న రెండు దుకాణాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఏటీఎం కార్యాలయం సైతం శ్రీనివాస బస్టాండ్లోని ఓ దుకాణంలోకి మార్పు చేయాలని చూస్తున్నారు. అలాగే ప్రయాణికులకు కల్పించాల్సిన వసతులపై నివేదిక రూపొందించేందుకు ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, డీఎం బాలాజీ, ఏఓ షెషబాన్, ఏటీఎం డీఆర్ నాయుడుతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 10న నివేదికను డీపీటీఓ వెంకట్రావ్కు అందించనున్నారు. అనంతరం ఈ నెల 15 నుంచి శ్రీహరి బస్టాండ్ కూల్చివేత పనులు చేపట్టనున్నారు. ● 15 నుంచి పనులు మొదలు? -
బస్సు ఢీకొని యువకుడి మృతి
తడ : మండలంలోని బీఎల్పాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. దొరవారిసత్రం మండలం, ఉచ్చూరు గ్రామానికి చెందిన చిత్త్రూు మునీంద్ర(25) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆరంబాకంలో పని ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుంగా తిరుపతి నుంచి చైన్నె వెళుతున్న తమిళనాడు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మునీంద్రను 108లో సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. జాతరలో ఘర్షణ – యువకుడికి కత్తిపోట్లు ఏర్పేడు : మండలంలోని వికృతమాల పంచాయతీ తుడా కాలనీలో గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. మరో యువకుడు సైతం గాయపడ్డాడు. వివరాలు.. తుడా కాలనీలో జాతరకు రేణిగుంట మండలం మర్రిగుంట నుంచి కొందరు యువకులు వెళ్లారు. అక్కడ స్థానిక యువకులు కొందరు మద్యం మత్తులో వీరిని దూషిస్తూ దాడికి దిగారు. దీంతో మర్రిగుంటకు చెందిన సాయి(22)ని కత్తితో పొడిచేశారు. మధు అనే యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. సమాచారం అందుకున్న ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి హుటాహుటిన గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు. హోటల్లో ఫుడ్ పాయిజన్ – ఇద్దరు యువకులకు అస్వస్థత రేణిగుంట : పట్టణంలోని ఓ హోటల్లో బిరియానీ తిని ఇద్దరు యువకులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. హోటల్ తనిఖీలు నిర్వహించారు. మాంసాహారం నిల్వ ఉండడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో హోటల్ను సీజ్ చేశారు. డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు మాట్లాడుతూ బిరియానీ ఫుడ్ పాయిజనింగ్ కావడంతో ఇద్దరు యువకులు ఆస్పత్రి పాలైనట్లు వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హోటల్ను సీజ్ చేసినట్టు తెలిపారు. కార్యదర్శి మణి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
రేణిగుంట : స్థానిక వేణు గోపాలపురం సమాధుల వద్ద ముళ్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోలీసులు తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ఉంటాయని, ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. చదును చేసి.. చెరువు కబ్జా! కలువాయి(సైదాపురం):మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక, మట్టి తవ్వకాలతోపాటు చెరువుల ఆక్రమణ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కలువాయి మండలంబ మాదన్నగారిపల్లెలో సర్వే నంబర్ 56లో ఉన్న 3 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని ఓ టీడీపీ నేత కబ్జా చేసేశాడు. యథేచ్ఛగా చదును చేసుకుని ఆరుతడి పంటల సాగుకు రంగం సిద్ధం చేసేసుకున్నాడు. కలువాయి చెరువుకు అంతర్భాగమైన ఈ భూమిని పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పీజీసెట్ షెడ్యూల్లో స్వల్ప మార్పు తిరుపతి సిటీ : ఎస్వీయూ ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న ఏపీ పీజీసెట్–2025 షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పు చేసినట్లు తెలిసింది. 9వ తేదీన నిర్వహించాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ పరీక్షను డీఎస్సీ షెడ్యూల్ నేపథ్యంలో 10వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. డీఎస్సీకి హాజరుకానున్న విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.54 లక్షల విరాళం తిరుమల : టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు కర్ణాటకులోని మంగుళూరుకు చెందిన విదా రవిచంద్రన్ అనే భక్తురాలు రూ.54 లక్షలను విరాళంగా అందించారు. మంగళవారం ఈ మేరకు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. అల్లిమడుగు కొండపై గుర్తు తెలియని మృతదేహం శ్రీకాళహస్తి: పట్టణంలోని తుపాను సెంటర్ పక్కన అల్లిమడుగు కొండపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరారు. -
అభివృద్ధి లేదు.. అంతా అరాచకమే!
తిరుపతి రూరల్ :‘‘రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదు.. అంతా అరాచకమే నడుస్తోంది. ఎన్నికల సమయంలో సూపర్సిక్స్.. సెవెన్ అంటూ చంద్రబాబు హామీలు గుప్పించారు. అధికారం కోసం నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పేశారు. ఇప్పుడు గల్లా పెట్టెలో డబ్బులు లేవు అంటూ చేతులెత్తేశారు. పదవి కోసం ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అందుకే బుధవారం జిల్లావ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో నిరసన వ్యక్తం చేయనున్నాం’’ అని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం చంద్రగిరిలోని వైఎస్ఎంఆర్ కల్యాణ మండపంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా భూమనతోపాటు చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిశీలకుడు చావా రాజశేఖర్రెడ్డి హాజరయ్యారు. భూమన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు బుధవారం చేపట్టే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో టీడీపీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు బయటకు రావడానికి 3 ఏళ్లు పట్టిందన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు అధికారం పోయిన రెండు నెలలకే రోడ్డుపైకి వచ్చారని వెల్లడించారు. ప్రజలను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసేంత వరకు పోరాటం చేయాలని కోరారు. రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగం చంద్రగిరి నుంచే ప్రారంభమైనట్టుందన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు. మాఫియా పాలన నడుస్తోంది కూటమి ప్రభుత్వంలో మాఫియా పాలన నడుస్తోందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు చొప్పున ప్రతి నెలా ఇస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మాట ఇచ్చారన్నారు. ఎంత మందికి ఇచ్చారు..? ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సుపై ఒక్కొక్కసారి ఒక్కో మంత్రి మీడియా ముందుకు వచ్చి ఉగాది నుంచి ఇస్తాం.. దీపావళికి అమలు చేస్తాం.. సంక్రాంతి నుంచి అమలు చేస్తాం అని ఉత్తుత్తి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని స్పష్టం చేశారు. మట్టి, ఇసుక అక్రమ రవాణా, భూ కబ్జాలు, లిక్కర్ మాఫియాను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. -
బాలుడు అదృశ్యంపై కేసు
రేణిగుంట : ఇంటి నుంచి ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేశామని గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ తెలిపారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్కు చెందిన సంగీతాదేవి, మోహన్సింగ్ దంపతులు 8 నెలలుగా రేణిగుంట మండలం వినాయకపురంలో నివాసం ఉంటున్నారు. మే 25వ తేదీ మధ్యాహ్నం వారి కుమారుడు ఆదిత్య (12) తోటి పిల్లలతో ఆడుకొని వస్తానని వెళ్లాడు. . సాయంత్రానికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. బంధువులు, తెలిసినవారిని విచారించగా వారి దగ్గరికి వెళ్లలేదని తెలియడంతో మంగళవారం గాజుల మండ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. టెంపో బోల్తా : ఐదుగురికి గాయాలు ఓజిలి : మండలంలోని రాచపాళెం వద్ద మంగళవారం ఉదయం టెంపో బోల్తా పడడంతో ఐదుగురు గాయపడ్డారు. వివరాలు.. హైదరాబాద్కు చెందిన 14 మంది టెంపోలో అరుణాచలం, రామేశ్వరం, పాండిచ్చేరిలో వివిధ దేవాలయాలను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో టెంపో అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగంది. ప్రశాంతి, సబిత, అంజమ్మ అనే మహిళలతోపాటు, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఎస్ఐ స్వప్న ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తుల భద్రతకు భరోసా
● చోరీల కట్టడికి ప్రత్యేక నిఘా బృందం ● విష్ణునివాసం, శ్రీనివాసం వద్ద నిరంతర పర్యవేక్షణ ● పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసులు తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు భద్రతా పరంగా భరోసా కల్పించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రధానంగా భక్తులు బస చేసే విష్ణునివాసం, శ్రీనివాసం సముదాయాల వద్ద చోరీల కట్టడిపై దృష్టి సారించారు. ఇటీవల భక్తుల సెల్ఫోన్లు, ఇతర వస్తువులు అపహరణకు గురవుతున్న నేపథ్యంలో పకడ్బందీగా నిఘా పెట్టారు. విష్ణునివాసం కాంప్లెక్స్కు కూత వేటు దూరంలోనే ఈస్ట్ పోలీసుస్టేషన్, రైల్వేస్టేషన్ వద్ద పోలీసు కంట్రోల్ పాయింట్ ఉంది. ఈ ప్రాంతం తరచూ యాత్రికులతో రద్దీగా ఉంటుంది. దీంతో ఒకవైపు వాహనాల రాకపోకలు, మరోవైపు ఆటోలు, ద్విచక్ర వాహన చోదకులు, పాదచారుల తాకిడికి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలో దొంగలను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. అప్రమత్తంగా ఉన్నప్పటికీ దొంగలు విష్ణునివాసంలోకి వెళ్లి భక్తులతో పాటు కలసిపోయి చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్లను తస్కరించేస్తున్నారు. విష్ణు నివాసంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ హల్చల్ చేస్తున్నారు. స్పందించిన ఎస్పీ విష్ణునివాసం, శ్రీనివాసం సముదాయాలలో 15 రోజులుగా జరుగుతున్న సెల్ఫోన్ల వరుస చోరీలపై ఎస్పీ హర్షవర్ధన్రాజు స్పందించారు. సెల్ఫోన్లు అపహరించేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని డీఎస్పీ భక్తవత్సలానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఐ శ్రీనివాస్ తన బృందంతో విష్ణునివాసం, శ్రీనివాసం సముదాయాల వద్ద ఫింగర్ ప్రింట్స్ సేకరణ యంత్రం ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం సెల్ఫోన్ల దొంగతనాలకు పాల్పడిన 15 మందిని గుర్తించి అదుపులోకి తీసుకుని వారి నుంచి 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన భక్తులకు సెల్ఫోన్లను అందించారు. నిందితులు తమిళనాడు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.మరో 30 సీసీ కెమెరాల ఏర్పాటు విష్ణునివాసంతో పాటు శ్రీనివాసం సముదాయాలలో సీసీ కెమెరా పర్యవేక్షణ లేని ప్రదేశాలను గుర్తించి అదనంగా 30 కెమెరాలను అమర్చాలని పోలీసులు నిర్ణయించారు. అపరిచితులు, అప్పటిప్పుడు కొత్తగా పరిచయం చేసుకునే వారితో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు మైకు ద్వారా సూచనలిస్తున్నారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 84,418 మంది స్వామిని దర్శించుకున్నారు. 34,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.89 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ప్రభుత్వ భూములు అమ్మేస్తున్న.. డిప్యూటీ తహసీల్దారుపై చర్యలు తీసుకోండి
● అసలైన ఉద్యోగం పక్కనబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం ● భూ ఆక్రమణలకు అసలైన సూత్రధారి డిప్యూటీ తహసీల్దారే ● కలెక్టర్కు విన్నవించిన తిరుపతి రూరల్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ తహసీల్దారు కార్యాలయంలో ప్రధాన డిప్యూటీ తహసీల్దారు గా విధులు నిర్వహిస్తున్న మోహన్ అసలైన ఉద్యోగం వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారని తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్ర మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ను కలిసి ఆయన భాగోతాన్ని వివరించారు. ఇంకా ఏం చెప్పారంటే.. మండలంలోని అన్ని గ్రామాల్లో తన ద్విచక్ర వాహనంపై ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ విలువైన ప్రభుత్వ భూములు, కాలువలు, కుంటలు, బంజరు భూములు, రెవెన్యూకు సంబంధం లేని మఠం భూములను సైతం పరిశీలించి.. ఆక్రమణదారులకు ధారాదత్తం చేస్తున్నాడని ఆరోపించారు. ఆ తరువాత భూములు ఆక్రమించిన అక్రమార్కులతో కలసి ఆ భూములను అడ్డదారిలో అమ్మేసి 25 శాతం వాటా తీసుకుంటున్నారని వివరించారు. ఒక బాధ్యత గల రెవెన్యూ అధికారిగా ఉండాల్సిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలసి భూములు అమ్మేస్తుండడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తారని తెలిపారు. ఏదైనా పనిమీద తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సదరు డెప్యూటీ తహసీల్దార్ తన చుట్టూ తిప్పించుకోవడం రివాజుగా మారుతోందన్నారు. డబ్బులు ముట్టజెబితేగానీ పనులు చేయడం లేదని చెప్పారు. స్థానిక తహసీల్దార్ కూడా డెప్యూటీ తహసీల్దార్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, ఆయన చెప్పందే ఒక్క ఫైలు కూడా ముందుకు కదలనీయడం లేదని తెలిపారు. ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్న సదరు డెప్యూటీ తహసీల్దార్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ వెంకటేశ్వర్ సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
మృత్యుంజయ స్వామికి ప్రత్యేక పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, కలశ స్థాపన చేశారు. అనంతరం స్వామివారికి చందనం, నారికేళ్ల, పసుపు, కుంకుమ, విభూధి వంటి వాటితో అభిషేకాలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 78, 031 మంది స్వామివారిని దర్శించుకోగా 32,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.46 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించరని టీటీడీ విజ్ఞప్తి స్పష్టం చేసింది. ఆగమ సలహాదారుగా వేదిక్ ఆచార్యులు తిరుపతి సిటీ: టీటీడీ వైఖాసన ఆగమ సలహాదారులుగా ఎస్వీ వేదిక్ వర్సిటీ వైఖాసన విభాగ సహాయ ఆచార్యులు డీఆర్ పరాశరం భావనారాయణ నియమితులయ్యారు. వర్సిటీలో సోమవారం రిజిస్ట్రార్ డాక్టర్ పి.భాస్కరుడు ఆయన్ను అభినందించారు. వేదిక్లో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ (శాస్త్రి), ఎంఏ (ఆచార్య), పీహెచ్డీ, సర్టిఫికెట్, డిప్లొమో కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల అభ్యర్థులు అర్హత, దరఖాస్తు వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూడాలని సూచించారు. ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. -
● రియల్టర్లకు అధికార యంత్రాంగం దాసోహం ● ఆగమేఘాలపైన అనుమతులు ● చెరువు, కలుజుకు అడ్డుగా ప్రహరీ గోడ నిర్మాణం ● దగ్గరుండి పనులు చేయిస్తున్న ఇరిగేషన్ అధికారులు
రేణిగుంట: ఇరిగేషన్ అధికారులు రియల్టర్లకు దాసోహమైపోయారు. చెరువు, కలుజులకు అడ్డుగా పనులు చేస్తున్నా తామే అనుమతించామంటూ చెప్పుకొస్తున్నారు. కానీ భారీ వర్షాలు వస్తే మాత్రం ముప్పుతప్పదని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ.. ఆ కథ ఏందో మీరే చదవండి.. రేణిగుంట మండలం, జిపాళ్యం పంచాయతీలోని కుర్రకాలువ గ్రామ లెక్క దాఖల సర్వే నంబర్ 18/1లో 4.21 ఎకరాల మేర సాగుకు పనికిరాని ప్రభుత్వ భూమి (డ్రైల్యాండ్) చెరువు కింద ఉంది. ఇక్కడ చెరువు నుంచి అధనపు నీళ్లు వెళ్లేందుకు కలుజు ఏర్పాటు చేశారు. కలుజు నుంచి వచ్చే నీళ్లు భూమి మధ్యలోని కాలువ ద్వారా పద్మానగర్ మీదుగా ఏర్పేడు మండలం, వికృతమాల చెరువుకు చేరుతాయి. వాటిని చేతిలో పెట్టుకుని.. గతంలో పక్కనే ఉన్న డీకేటీ భూమికి చెందిన పత్రాలు పెట్టుకొని ఫ్రీ హోల్డ్లో రెవెన్యూ అధికారుల ద్వారా కొందరు రియల్టర్లు అనుమతులు పొందారు. ఇదే అదునుగా కలుజు భూమి పై కన్నుపడింది. అధికార పార్టీ నియోజకవర్గ నేత అండదండలతో ఇరిగేషన్ అధికారుల నుంచి కలుజు కాలువకు పైపులు వేసేందుకు అనుమతులు తీసుకున్నారు. సుమారు 30 అడుగుల వెడల్పుతో ఉన్న కలుజుకు మధ్యలో రెండు పైపులను వేసి మట్టి తొలి పూడ్చివేశారు. కలుజు కింద భూమిలో లేఅవుట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చర్యలేవి తిరుపతి–పాపానాయుడుపేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమి కావడంతో రియల్టర్లు కన్ను పడింది. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అటువైపు వెళ్లేందుకు సాహసించడం లేదు. కాలువ పోరంబోకులో పేదలు చిన్న ఇల్లు నిర్మించుకుంటేనే కూలదోసే.. రెవెన్యూ అధికారులు ఇంత జరుగుతా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. వర్షమొస్తే ముప్పే 99 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు ఉండేది ఒకటే కలుజు. చెరువు నిండిన తర్వాత అధనపు నీళ్లు వెళ్లే కలుజు కింద 10 అడుగుల దూరంలో ప్రహరీ గోడ అడ్డుగా నిర్మించారు. గతంలో భారీ వర్షాలు పడినప్పుడు చెరువు నీళ్లు కలుజు గుండా వెళ్లేవి. పద్మానగర్లోని సగం ఇళ్లు మునకకు గురయ్యేవి. ఇంతటి నీటి ప్రవాహం వచ్చే ప్రదేశంలో లే అవుట్ వేసి అమాయకులకు ప్లాట్లు అమ్మే ఏర్పాట్లు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. భారీ వర్షాలొస్తే ఇబ్బందులు తప్పవని స్థానికులు చెబుతున్నారు. అనుమతులతోనే పనులు మా నుంచి అన్ని అనుమతులు తీసుకున్నారు.కలుజు నుంచి వచ్చే నీళ్లను అంచనా వేసి, మేము డిజైన్ చేసిన విధంగానే రియల్టర్లు పనులు చేస్తున్నారు. పైపులు పైన ఎటువంటి నిర్మాణాలు చేపట్టరు. ముందు కాలువ ద్వారా నీళ్లు పోయేవి, ఇప్పుడు పైపుల ద్వారా నీళ్లు వెళతాయి. ఎంత వాన వచ్చిన ఎటువంటి ఇబ్బందీ ఉండవు. – ప్రకాష్రావు, ఇరిగేషన్, డీఈ, శ్రీకాళహస్తి మేమే అనుమతిచ్చాం సోమవారం ఉదయం కలుజు ప్రహరి గోడ మధ్య ట్యాంకు నిర్మించేందుకు జేసీబీతో పెద్ద గుంతను తవ్వారు. ఇరిగేషన్ డీఈ ప్రకాష్రావు చెరువు వద్దకు చేరుకొని పరిశీలించి తమ అనుమతులతోనే చేస్తున్నారని చెప్పారు. పైపుల పైన ఎటువంటి నిర్మాణం జరపరని తెలిపారు. కానీ కలుజుకు అడ్డుగా పైపుల పైన ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేశారు. అది రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు మాత్రం కనబడకపోవడం గమనార్హం. -
నెత్తిన బరువు పెట్టారు బాబూ!
తిరుపతి: మధ్యాహ్నం వేళ రేషన్ దుకాణం వద్ద క్యూలో వేచి ఉండలేక తమ సంచులను క్యూలో పెట్టిన దృశ్యంతిరుపతి జిల్లాలో రేషన్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో లబ్ధిదారులు చౌకదుకాణాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈనెల 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ అందించనుండడంతో కార్డు దారులు క్యూ కడుతున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 1,457 రేషన్ దుకాణలు ఉండగా.. వీటిలో 300 దుకాణాల దాకా ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జ్ డీలర్లకు అప్పజెప్పడంతో వారు ఒక గంట రెగ్యులర్ షాపు వద్ద.. మరో గంట ఇన్చార్జ్ షాపు వద్ద సరుకులు ఇవ్వాల్సి వస్తోంది. ఇదిలావుండగా కంది పప్పు, చక్కెర అరకొర ఇస్తుండడంపై కార్డుదారులు మండిపడుతున్నారు. – తిరుపతి అర్బన్ -
బైక్ అదుపు తప్పి యువకుడి మృతి
ఏర్పేడు: మండలంలోని వికృతమాల టీసీఎల్ కంపెనీ సమీపంలో విధులు ముగించుకుని వెళుతూ బైక్ నుంచి అదుపు తప్పి కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు.. బాపట్ల జిల్లా, ఇంకోలుకు చెందిన మహబూబ్ జానీ కుమారుడు కాలేషా(25) మూడు నెలల కిందట వికృతమాల సమీపంలోని టీసీఎల్ కంపెనీలో సూపర్వైజర్గా చేరాడు. స్థానికంగానే ఉంటూ ఇక్కడే పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి విధులు ముగించుకుని బైక్పై బయల్దేరాడు. కొంత దూరంలోనే స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో కాలేషా తలకు బలమైన రక్తగాయమైంది. క్షతగాత్రుని 108 వాహనంలో చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతదేహానికి తిరుపతి ఎస్వీ వైద్యకళాశాలలో పోస్ట్మార్టం నిర్వహించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వైఎస్సార్సీపీలో చేరికలు
కోట: కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆరోపించారు. ఆయన సోమవారం విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై బుధవారం గూడూరులో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పార్టీలో చేరిన పలువురు యువకులు చిట్టమూరు మండలం, ఎల్లూరుకు చెందిన 20 మంది యువకులు, కోటకు చెందిన పలువురు యువకులు మేరిగ మురళీధర్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. గూడూరు నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటు ఉంటానని హామీ ఇచ్చారు. కోట, చిట్టమూరు మండలాల కన్వీనర్లు పలగాటి సంపత్కుమార్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఎంపీపీ అంజమ్మ, జెడ్పీటీసీ కోటయ్య, నాయకులు భక్తవత్సల్రెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి, ప్రసాద్గౌడ్, నాగూర్రెడ్డి, రాఘవరెడ్డి, రాజశేఖర్రెడ్డి, సుధాకర్ నాయుడు, ఎన్వీ రమణయ్య, కస్తూరిరెడ్డి, షనీల్రెడ్డి, రాజారెడ్డి, కోటేశ్వరరెడ్డి, పి.సురేంద్ర పాల్గొన్నారు. -
ఏఐ రంగంలో రాణించాలి
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తిరుపతికి చెందిన ఎం.భానుచరణ్రెడ్డి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరిలో 51వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 4వ ర్యాంకు సాధించాడు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ఎం.జయభారత్రెడ్డి, ఎం.సురేఖ దంపతుల కుమారుడైన భానుచరణ్రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో రాణించడమే తన లాంగ్ టర్మ్ గోల్ అని తెలిపాడు. ప్రస్తుతం ఐఐటీ బాంబేలో సీటు పొంది సీఎస్ఈ చదవడమే తన లక్ష్యమని తెలిపాడు. – ఎం.భానుచరణ్రెడ్డి, తిరుపతి జేఈఈ అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చిల్లకూరు: గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డుకు చెందిన వేగూరు నితన్రెడ్డి జాతీయ స్థాయిలో 535వ ర్యాంకు సాధించాడు. నితిన్ రెడ్డి తండ్రి రవీంద్రరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి సుచిత్ర సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్. నితిన్రెడ్డి హైదరాబాద్లో చదువుకుంటూ అక్కడే కోచింగ్ తీసుకుని జాతీయ స్థాయిలో రాణించాడు. -
బ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధిగా బాలాజీ శర్మ
నగరి: తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి అధికార ప్రతినిధిగా పుత్తూరుకు చెందిన బాలాజీ శర్మ నియమితులయ్యారు. సోమవారం బ్రాహ్మణ సంఘ ఆవిర్భావ దినోత్సవం శ్రీకాళహస్తి బ్రాహ్మణ భవనంలో వేడుకగా జరిగింది. చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తాటితోపు తదితర బ్రాహ్మణ సంఘాలు అన్నిటిని కలుపుతూ బ్రాహ్మణులంతా ఐక్యంగా ఒక తాటి మీదకు రావాలనే సంకల్పంతో రాష్ట్ర యువజన అధ్యక్షుడు, తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీవేదం హరిప్రసాద్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధికార ప్రతినిధిగా బాలాజీ శర్మ, సంయుక్త కార్యదర్శిగా బాలాజీ రావు, మహిళా విభాగం నుంచి టీకే లలిత, కలంచేరీ గీతలను నియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు, క్రమశిక్షణ మండలి అధ్యక్షుడు కొత్తపల్లి అజయ్కుమార్, శ్రీకాళహస్తి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ప్రకాశం, పుత్తూరు బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆలూరు రామకృష్ణ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 286 కిలోల ఎర్రచందనం స్వాధీనం రేణిగుంట: కడప వైపు నుంచి రేణిగుంట వైపు వస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు అనుమానంతో ఆపగా వాహనాన్ని వదిలి డ్రైవర్ పరారయ్యాడు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 286 కిలోల బరువు గల తొమ్మిది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వివరాలు.. తిరుపతి అటవీ క్షేత్రాధికారి బీ.సుదర్శన్రెడ్డికి అందిన రహస్య సమాచారం మేరకు టీఎన్.పాలెం సెక్షన్ సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి 11.30 గంటలకు కడప నుంచి రేణిగుంట రోడ్ వరకు పెట్రోలింగ్ చేయగా.. రాత్రి 11.45 గంటలకు ఒక వాహనం అతివేగంగా రావ డం గమనించారు. అటవీ అధికారులు శ్రీ నివాసపురం వద్ద ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవరు వాహనంలో నుంచి దూకి పరారయ్యాడు. ఈ దాడుల్లో ఎఫ్ఎస్ఓ చైతన్య, ఎఫ్బీఓ కే.వెంకటేశ్వరరావు, ప్రొటెక్షన్ వాచర్లు సిసింద్రీ, వెంకటేష్, ప్రసాద్, నవీన్, రవి పాల్గొన్నారు. -
పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్, ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపైన్ బ్యానర్స్, పోస్టర్స్, పాంప్లెట్స్ను సోమవారం కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని సంస్థలను సమన్వయం చేసుకుని టీబీ నిర్మూలనకు ప్రజలను చైతన్య వంతులను చేయాలన్నారు. జేసీ శుభం బన్సల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా కుష్టు, క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి పాల్గొన్నారు. -
వంచించడం..బాబు నైజం!
● వెన్నుపోటు దినం రేపు ● కూటమి మోసాలను ఎండగడదాం ● వైఎస్ఆర్సీపీ జిల్లా పార్లమెంటు పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి శ్రీకాళహస్తి: రేపు జరగబోయే వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని తిరుపతి జల్లా పార్లమెంట్ పరిశీలకుడు మేడ రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఆత్మీయ సమావేశం సోమవారం పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ‘వెన్నుపోటు’ పొడిచిన టీడీపీ ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలిపారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, జిల్లా కలెక్టరేట్ వద్ద ‘నిరసన కార్యక్రమాలు’ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బియ్యపు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని కుట్రలు, కుతంత్రాలు భయానక వాతావరణాన్ని సష్టించాలని చూస్తున్నారన్నారు. అలాగే జూన్ 4న జరిగే వెన్నుపోటు దినాన్ని విజయవంత చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, బర్రె సుదర్శన్ రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, ఇన్చార్జ్ కిషోర్ రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షుడు గంగారి రమేష్, రేణిగుంట ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు కోగిల సుబ్రమణ్యం, కోవి చంద్రయ్య నాయుడు, ఢిల్లీ బాబు, జనార్ధన్యాదవ్, నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీది, గోరా, అస్లాం, బాబు, గఫుర్, సాగిరబీ తదితరులు పాల్గొన్నారు. -
మోటార్ల దొంగలు అరెస్ట్
ఏర్పేడు:విద్యుత్ మోటారు స్టార్టర్లు, వైర్లను దొంగలిస్తున్న ముఠాను సోమవారం ఏర్పేడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు రేణిగుంట డీఎస్పీ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఎస్పీ విష్ణువర్ధన్ రాజు ఆదేశాలతో నిందితులను పట్టుకునేందు కు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఏర్పేడు మండంలో ఆరు కేసులు, రేణిగుంట, గాజులమండ్యం, శ్రీకాళహస్తి రూరల్ మండలాల్లోని కేసులకు సంబంధించి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. సాంకేతిక సహాయంతో దొంగతనాలు జరుగుతున్న తీరుపై ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి, గాజులమండ్యం సీఐ మంజునాఽథ్రెడ్డి, ఏర్పేడు ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, ఏఎస్ఐ ధర్మసింగ్, సిబ్బందితో కలసి సమగ్ర దర్యాప్తు చేసినట్లు వివరించారు. సోమవారం వికృతమాల టీసీఎల్ కంపెనీ సమీపంలో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి 40 ట్రాన్స్ఫార్మర్ల రాగి వైరు, 77 స్టార్టర్ల రాగి వైరు మొత్తం 795 కిలోల రాగి వైరును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పట్టుబడిన నిందితులలో శ్రీకాళహస్తి మండలం, ఎర్రగుడిపాడుకు చెందిన కె.వెంకట్రామయ్య(45), శ్రీకాళహస్తికి చెందిన కత్తి మణి(35), ఎర్రగుడిపాడుకు చెందిన జెండా వెంకటేష్ అలియాస్ చిరంజీవి(45) ఉన్నట్టు తెలిపారు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీరి నుంచి ఈ స్క్రాబ్ను తిరుపతికి చెందిన ఖాదర్బాషా, సయ్యద్వాజిద్ హుస్సేన్, షేక్ బషీద్, శ్రీకాళహస్తికి చెందిన షేక్ హుస్మాన్, వెంకటగిరికి చెందిన సత్నా గోపాలకృష్ణ తక్కువ ధరకు కొనుగోలు చేశారని, చోరీ సొత్తు అని తెలిసి కూడా కొనుగోలు చేయడంతో వీరి ఐదుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. నిందితులపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశామన్నారు. -
సొంతింటి కల నెరవేర్చండి
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పీ.హరినాథ్రెడ్డి ఆరోపించారు. సోమవారం తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట, సీపీఐ నాయకులు, పేదలు, కార్మికులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 32లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పలు సభల్లో గ్రామాల్లో 3సెంట్లు, పట్టణాల్లో 2సెంట్లు చొప్పున అర్హులకు స్థలాలు ఇవ్వాలని, అధికారంలోకి వస్తే ఆ విధంగా స్థలాలు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థతిపై అవగాహన ఉన్న చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా వాటిని అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. పింఛన్ తప్ప ఏ ఒక్క హమీనైనా కూటమి ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి చుట్టూ దృష్టి మరల్చి రాష్ట్ర ప్రజల స్థితిగతులను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతగూడు కోసం పేదలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారని, ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు చొప్పున అందజేయాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గసభ్యులు శివారెడ్డి, కార్యదర్శి విశ్వనాథ్, ఎన్డీ రవి, కేవై రాజ పద్మనాభరెడ్డి, రామక్రిష్ణ, బలరాం, రత్నమ్మ, శ్రీరాములు, శివ, విజయ, రామముర్తి, కాలయ్య, మునిశ్వర్, ప్రమీల, వెంకటేష్, బాషా తదితరలు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక నగరంలో అలవిగాని హామీలు
● ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రగల్భాలు ● అర్చకులకు నెలకు రూ.15 వేలు వేతనం అంటూ ప్రచారం ● 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీకి పింఛన్ ఇస్తామని ప్రకటన ● ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు ● స్వరం కలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ● ఏడాది గడుస్తున్నా హామీల జోలికెళ్లని అధినేతలు ● అధికారం కోసం నమ్మించి మోసం చేశారంటున్న జిల్లా ప్రజలు శ్రీవేంకటేశ్వర స్వామి సాక్షిగా! ● ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదే ● డబుల్ ఇంజిన్ సర్కార్తో సంక్షేమ పథకాలను మరింత పరుగులు పెట్టిస్తా ● తిరుమల పవిత్రతను కాపాడుతా ● 50 వేలకుపైగా వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలలో పనిచేసే అర్చకులకు రూ.15వేలు వేతనం అందిస్తా ● అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల అర్చకులకు రూ.5వేల నుంచి రూ.10 వేలు అందిస్తా ● పోటు వృత్తిని కుల వృత్తిగా పరిగణించి గుర్తిస్తాం ● బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ సొసైటీని బలోపేతం చేస్తాం ● 50 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికీ పింఛన్ అందింస్తాం. ● షరతులు లేకుండా ప్రతి పేదవారికి పింఛన్లు పంపిణీ చేస్తాం తిరుపతి తుడా : అధికారం కోసం అడ్డదారులు తొక్కడం..అమలు కాని హామీలతో వంచించడం.. మాయమాటలు చెప్పి నమ్మించడం.. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలకు విస్మరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ‘నేను మారాను.. నన్ను నమ్మండి’ అంటూ మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు మరోసారి ప్రజలను నిలువునా ముంచేశారు. ఏడాది గడుస్తున్నా ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయకపోవడంతో జిల్లా ప్రజలు రగిలిపోతున్నారు. ఊరూరా నమ్మించి..వంచించి! అధికారమే పరమావధిగా భావించే చంద్రబాబు మారిన మనిషిలా నటించారు. తనతోక పార్టీ అధినేతతో కలసి జిల్లాలో ఊరు వాడా తిరిగి సామాన్య, బడుగు బలహీన వర్గాలను టార్గెట్ చేసుకుని నమ్మించేశారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు తొలి సంతకం హామీని అభాసుపాలు చేశారు. అంతటితో ఆగకుండా మరోసారి శ్రీవేంకటేశ్వర స్వామిని సాక్షిగా అంటూ రాష్ట్రంలోని దేవాలయ ట్రస్ట్బోర్డు నియామకాలలో బ్రాహ్మణులకు చోటు కల్పిస్తానని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పింఛన్లు తుంచి..అభాగ్యులను ముంచి అధికారంలోకి వస్తే పెంచిన పింఛన్ను అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా 12 నెలల కాలంలో ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనలో జిల్లా వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం 15 వేల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2024 మే నెలకు 2,71,183 అందిచగా.. కూటమి ప్రభుత్వ హయాంలో 2025 జూన్ నెల వాటిని 2,60,379 తగ్గించేశారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదుచంద్రబాబు సత్యవేడు ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. కనీసం ఆ ప్రస్తావన ఎత్తకపోవడం దారుణం. ఏడాది పాలన పూర్తవుతున్నా సత్యవేడు ప్రజలకు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. 100 పడకల ఆస్పత్రి మాటేలేదు. మున్సిపాలిటీగా గుర్తిస్తామన్నారు. ఆ ప్రస్తవన ఎత్తడం లేదు. బైపాస్రోడ్డు, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుపై స్పందించే నాయకుడేలేడు. – శివయాదవ్, వరదయ్యపాళెం మండలం మాటిచ్చి నెరవేర్చకపోతే ఎలా? ఎన్నికల సమయంలో చంద్రబాబు పుట్టిన రోజు గూడూరుకు విచ్చేశారు. అప్పడు ఎన్నికల సభలో పలు హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే వాటన్నింటినీ అమలు చేస్తామన్నారు. కానీ ఏడాది పూర్తవుతున్నా హామీల జోలికి వెళ్లడం లేదు. పేదలు నరకయాతన అనుభవిస్తున్నారు. – కోట్లపూడి శ్రీనివాసులు, కాశీపురం, వాకాడు మండలం ఈవీ ఆటోలు.. ఎక్కడ లోకేశం! యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతి అంకుర ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన సభలో తన తండ్రికి మించి నారా లోకేష్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నగరంలో అత్యధికంగా ఆటోలు ఉండడాన్ని గుర్తించిన లోకేష్ అండ్ కో వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆటో డ్రైవర్లా ఖాకీ చొక్కా ధరించి వారికి పెద్ద దిక్కుగా ఉంటానని మాయ మాటలు చెప్పారు. డీజిల్ ఆటోలు నడపడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుందని, యూరప్ దేశాల తరహాలో తిరుపతిలోనూ ఎలక్ట్రికల్ చార్జింగ్ ఆటోలను నడపాలని సూచించారు. అధికారంలోకి వచ్చాకా ఆటోవాలాలందరికీ సబ్సిడీపై ఈవీ ఆటోలు కొనిచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని నమ్మించారు.ఆధునిక హంగులతో ఆటో స్టాండు, చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీలకు ఏడాది కావస్తున్నా ఆ ఊసే ఎత్తకపోవడంపై ఆటోవాలాలు విమర్శలు గుప్పిస్తున్నారు. పేదలందరికీ రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానంటూ నమ్మించి వంచిచడంపై రగిలిపోతున్నారు.దగా చేయడం పవ నిజమా? చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఊగిపోతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు మించిన నాయకుడు లేడంటూ మద్దత్తు పలికారు. ఈ క్రమంలో తిరుపతి పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు స్వరం కలిపారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయాంలో అమరరాజ ఫ్యాక్టరీని తిరుపతి నుంచి తరిమేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరరాజా ఫ్యాక్టరీని తిరిగి రప్పిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. ఏడాది కావస్తున్నా తెలంగాణలో స్థాపించిన అమరరాజాను అక్కడ ఖాళీ చేయించి తిరుపతికి రప్పించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. -
జేఈఈ అడ్వాన్స్డ్లో మెరుపులు
తిరుపతి ఎడ్యుకేషన్ : దేశంలోని ప్రముఖ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏటా ఎన్టీఏ ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 18న జాతీయ స్థాయిలో నిర్వహించిన అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో తిరుపతి జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. జిల్లాలోని వివిధ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వంటి కేటగిరిల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఓపెన్ కేటగిరిలో ఎం.భానుచరణ్రెడ్డి జాతీయ స్థాయిలో 51వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 4వ ర్యాంకు సాధించాడు. అలాగే డీ.మణిదీప్రెడ్డి ఓపెన్ కేటగిరిలో 345వ ర్యాంకు, జి.హిమేష్రాఘవ చంద్ర ఓపెన్లో 468, ఓబీఎస్ కేటగిరిలో 61వ ర్యాంకు, ఎం.శశాంక్రెడ్డి ఓపెన్లో 618, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 40వ ర్యాంకు, కె.యశ్విత ఓపెన్లో 906, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 67వ ర్యాంకు సాధించారు. వీరితో పాటు పలువురు విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించారు.జేఈఈ అడ్వాన్స్డ్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం తిరుపతి ఎడ్యుకేషన్ : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో తిరుపతిలోని శ్రీచైతన్య విద్యాసంస్థ విద్యార్థులు జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. సోమవారం ఆ విద్యాసంస్థలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏజీఎం బీవీ.ప్రసాద్ వివరాలను వెల్లడించారు. ఈ ఫలితాల్లో పి.సాయిముకేష్ 115వ ర్యాంకు, ఎం.మునికృష్ణ 228, ఎస్.అశోక్నాయక్ 542, ఎం.భరత్ 847, సి.సహస్త్ర 1202, బీఆర్.కుళ్ళాయప్పనాయక్ 1,335, మోక్షిత్శర్మ 1,371, జ్ఞానసాత్విక్ 1,625, అమూల్య 1,830, కె.అభిరామ్సాయి 2017, గంగా మనోజ్కుమార్ 2,333, ఎ.మణి 2453, జ్ఞానదీక్షిత 3,450, ఎన్.భానుప్రకాష్ 3,992, కె.జీవన్కుమార్ 4,099, కె.కార్తికేయ 4,696, ఎం.కావ్య 4,698, వరుణ్తేజ్ 5,161, ఎస్.హేమంత్చౌదరి 5,189, మణీష్ 5,263, వీరితో పాటు 42 మంది తమ విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆ విద్యాసంస్థ డీన్లు కెఎల్జి.ప్రసాద్, రామమోహన్రావు, శ్రీనివాసరావు, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు అభినందించారు. -
4న వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం
తిరుపతి మంగళం: అబద్దపు హామీలతో రాష్ట్ర ప్రజలను వంచించి మోసగించిన చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలందరికీ తెలియజేయాల్సి అవసరం ఆసన్నమయిందని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో ఆదివారం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెన్నుపోటు దినంగా నామకరణం చేశారని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రజలకు ఇచ్చిన సూపర్సిక్స్ హామీల్లో ఇంత వరకు ఏ ఒక్కటి నెరవేర్చిన పాపానపోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కన్నా వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం, జైళ్లకు పంపడమే పనిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పెట్టుకున్నారన్నారు. జూన్ 4వతేదీన నిర్వహించే వెన్నుపోటు దినంను రాష్ట్రానికే ఆదర్శంగా తిరుపతిలో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు.కూటమి నేతల్లో వణుకు పుట్టాలితిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 4వతేది తిరుపతిలో నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమంతో కూటమి నాయకుల వెన్నులో వణుకు పుట్టేలా చేద్దామన్నారు. ముందుగా జీవకోన సత్యనారాయణపురం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం తిరుపతి ఆర్డీవోకి వినతిపత్రం సమర్పించి నిరసన తెలుపుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, చంద్రబాబు అబద్దపు హామీలతో మోసపోయిన ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు తలారి రాజేంద్ర, నల్లాని బాబు, కట్టా గోపీయాదవ్, కల్లూరి చెంగయ్య, సాకం ప్రభాకర్, పార్టీ యువజన విభాగం జిల్లా, నగర అధ్యక్షులు ఉదయ్వంశీ, దినేష్రాయల్, అసెంబ్లీ బూత్కమిటీ ఇంచార్జ్ ముప్పాల సాయికుమారి, నాయకులు షేక్ ఇమ్రాన్బాష, అమరనాధ్రెడ్డి, డిష్ చంద్ర, మద్దాలి శేఖర్, రాపూరి ప్రసాద్, అనీల్రెడ్డి, రవికుమార్రెడ్డి, రమణారెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGHవరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 78,031 మంది స్వామిని దర్శించుకున్నారు. 32,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.46 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
కలెక్టరేట్లో బోర్డుల ఏర్పాటు
తిరుపతి అర్బన్ : అర్జీదారులు తికమక పడకుండా కొత్తగా వివరాల బోర్డు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ విభాగంలో 32 విభాగాలున్నాయి. అందులో ఏ బ్లాక్లో 15, బీ బ్లాక్లో 17 శాఖలున్నాయి. అయితే కలెక్టరేట్ అధికారులు కార్యాలయంలోనికి అర్జీదారులు వెళ్లే మార్గం వైపు కాకుండా తిరిగీ వచ్చే మార్గం వైపు శాఖల వారీ వివరాలకు చెందిన బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో సాక్షి దినపత్రికలో గత నెల 27న సారు...ఎక్కడ మీ చాంబరు అంటూ కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన కలెక్టరేట్ ఉద్యోగులు అర్జీదారులకు వీలుగా కలెక్టరేట్లోకి వెళ్లగానే కనిపించేలా కొత్తగా ఓ బోర్డును ఏర్పాటును చేశారు. మొత్తంగా వెళ్లే మార్గంలో ఓ బోర్డు...తిరిగి వచ్చే మార్గంలో మరో బోర్డును అర్జీదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య తిరుపతి క్రైమ్:నగరంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రామేశ్వర్ రెడ్డి(32) భార్య మహితతో కలిసి రాఘవేంద్ర నగ ర్లో నివాసం ఉంటున్నాడు. ఇతను ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే మద్యాని కి బానిసై ఇటీవల తరచూ భార్య ఆమె తండ్రితో గొడవ పడేవాడు. ఇదేవిధంగా శనివారం అర్ధరాత్రి కూడా గొడవ జరిగింది. దీంతో స్థానికులు అందరూ ఇరువురికి నచ్చజెప్పి పంపించేశారు. ఈ క్రమంలో మృతుడు భార్య మహిత ఇంటి లోపలికి వెళ్లి ఉరి వేసుకుంటానని భర్తను బెదిరించింది. అయితే ఇంటిలో నుంచి బయటికి వచ్చే సమయానికే భర్త తీవ్ర మనస్తాపానికి గురై బయటే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. బైక్ను ఢీకొన్న లారీ – యువకుడి దుర్మరణం నాయుడుపేటటౌన్ : మండల పరిధిలోని మేనకూరు పరిశ్రమల కేంద్రం సమీపంలో ఆదివారం కంటైనర్ లారీ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఓజిలి మండలం గ్రద్దగుంట గ్రామానికి చెందిన పగడాల చిరంజీవి(24) అనే యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. గ్రద్దగుంట గ్రామానికి చెందిన చిరంజీవి మేనకూరు సెజ్ పరిధిలో టీవీఎస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆదివారం డ్యూటీకి వెళ్లేందుకు బైక్లో బయలుదేరి పరిశ్రమకు కొద్ది దూరంలో ఉండగా కంటైనర్ లారీ వేగంగా వచ్చి చిరంజీవి వస్తున్న బైక్ను ఢీకొంది. దీంతో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. -
10 కి.మీ.నడిచి వెళ్లి సరుకులు ఎలా తెచ్చుకోవాలి
చిట్టమూరు : ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ సరుకులు తమ గ్రామానికి వచ్చే ఎండీయూ వాహనాలను నిలిపి వేస్తే 10 కిలో మీటర్లు నడిచి వెళ్లి ఎలా సరుకులు తెచ్చుకోవాలని కోతలగుంట గ్రామస్తులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం ఈశ్వరవాక గ్రామానికి సుమారు 10 కిలో మీటర్లు ఉంటుందన్నారు. గ్రామంలో 120 కుటుంబాల వారు నివాసం ఉన్నారన్నారు. ఇంత దూరం పంట పొలాల్లో నడిచి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉందన్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి పాలనలో సేవలు ఒక్కొక్కటిగా రద్దవుతుండటంతో జనం వీధిన పడ్డారు. నాడు ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ల వ్యవస్థకు నేడు మంగళం పాడారు. గ్రామ సచివాలయాల్లో అందుతున్న సేవలు నేడు అందకపోవడంతో జనం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లక తప్పడం లేదు. తాజాగా ఇంటింటికీ రేషన్ను చేరవేసే వాహనాలను రద్దు చేసి లబ్ధిదారులు దుకాణాల వద్దకు వెళ్లి బియ్యం, చక్కెర ఇతర సరుకులు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఆదివారం రేషన్ కోసం జనం వీధుల బాట పట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. డీలర్లు వాహనాల్లో రేషన్ తీసుకుని లబ్ధిదారుని నివాసానికి వెళ్లి సరుకులు పంపిణీ చేసేవారు. కూటమి పాలన వచ్చిన వెంటనే రేషన్ డోర్ డెలివరీకి మంగళం పాడేసింది. దీంతో ఆదివారం చౌక దుకాణాల వద్ద రేషన్ కోసం పలువురు వృద్ధులు మహిళలు మండు టెండలో నిరీక్షించి అష్టకష్టాలు పడి హమ్మయ్య ఈ రోజుకు తీసుకున్నామని కొంత మంది ఊపిరిపీల్చుకోగా మరికొంత మందికి బియ్యం అందక నిట్టూరుస్తూ ఇంటి బాట పట్టారు.గంటల తరబడి ఎండలో నిరీక్షణరేషన్ డోర్ డెలివరీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో చేసేది లేక లబ్ధిదారులు ఆదివారం ఉదయమే దుకాణాల వద్దకు పరుగులు తీశారు. అయితే కూటమి ఎమ్మెల్యే, స్థానిక నాయకులు వచ్చే వరకు రేషన్ వేయమని చెప్పడంతో లబ్ధిదారులు ఎండలో క్యూలైన్లో బారులు తీరక తప్పలేదు. కొన్ని చోట్ల కూటమి నేతలు వచ్చి ప్రారంభించి వెళ్లిపోయాక డీలర్లు ఇద్దరు, ముగ్గురికి సరుకులు పంపిణీ చేసి సోమవారం రండి అని వెనక్కు పంపించి వేశారు. తిరుపతి నగరంలోనే కాకుండా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు అనేక ప్రాంతాల్లో సర్వర్లు మొరాయించడంతో గంటల తరబడి ఎండలో వేచి ఉండక తప్పలేదు. రెండు, మూడు కిలోమీటర్ల నుంచి లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు తరలిరావడం కనిపించింది. గంటల తరబడి వేచి ఉండి రేషన్ తీసుకుని నెత్తిన పెట్టుకొని ఎండలోనే సొంత ఊర్లకు తిరిగి వెళ్లడం కనిపించింది. మరికొన్ని చోట్ల రేషన్ దుకాణాలు తెరుచుకోకపోవడంతో లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇంకొన్ని చోట్ల దుకాణాలు ఆలస్యంగా తెరుచుకోవడంతో అప్పటి వరకు కార్డుదారులు పడిగాపులు పడ్డారు.కంది పప్పు, చక్కెర సగం మందికే..కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప మిగిలిన సరుకులు అరకొరగానే సరఫరా చేస్తున్నారు. ఆదివారం ఆర్భాటంగా ప్రారంభించిన రేషన్ దుకాణాల్లోనూ కందిపప్పు, చక్కెర అరకొరగానే ఇచ్చారు. తిరుపతి జిల్లాలో మొత్తం 1457 చౌక దుకాణాలు ఉన్నాయి. ఈ చౌక దుకాణాల పరిధిలో 6.03 లక్షల రేషన్ కార్డు దారుల కోసం ప్రతి నెలా 8,350 మెట్రిక్ టన్నుల బియ్యం, 600 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 1200 మెట్రిక్ టన్నుల చక్కెర దిగుమతి చేయాల్సి ఉంది. అయితే ఈ నెల కోటా కింద బియ్యం మాత్రమే పూర్తి స్థాయిలో దిగుమతి అయ్యాయని అధికారులు చెబుతున్నారు. కందిపప్పు, చక్కెర మాత్రం సగం మాత్రమే దిగుమతి అయ్యాయ ని వెల్లడించారు. ఫలితంగా కార్డు దారులందరికీ పూర్తి స్థాయిలో కందిపప్పు, చక్కెర ఇచ్చే పరిస్థితి లేదని సంబంధిత అధికారులు చెప్పడం గమనార్హం.బండ్లు తీసేసి ఇవేం పనులయ్యాఉన్న బండ్లు తీసేసి ఇవేం పనులయ్యా. రేషన్ షాపు సరుకులు నేరుగా ఇంటికి వచ్చి ఇస్తావున్నారు కదా, వాటిని రద్దు చేసి ఏమి సాధిస్తారు. ఇప్పుడు గోతాం తీసుకుని ఎదురు చూసి తీసుకునే పరిస్థితి. ఇక నుంచి రేషన్ కష్టాలు మళ్లీ పడాల్సిందేనా. – తుపాకులు రేణుక,కోటపోలూరు, సూళ్లూరుపేట మండలంపాత దుకాణాలకు ముస్తాబుతిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రేషన్ దుకాణాల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. పాత రేషన్ దుకాణాలకు మామిడి తోరణాలు, పూలు అలంకరించి స్థానిక ఎమ్మెల్యే, కూటమి నేతల ద్వారా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్లను ఆహ్వానించవద్దని అధికారులను ఆదేశించారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులే ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఆలస్యమైనా కూటమి నేతలు వచ్చే వరకు రేషన్ వేయడానికి వీల్లేదని అనేక చోట్ల డీలర్లకు హుకుం జారీ చేసినట్లు సమాచారం.ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు!నరసింగాపురంలోని చౌక దుకాణాన్ని ఇష్టం వచ్చిన సమయంలో తెరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో రేషన్ ఇవ్వడం మానేశారు. గ్రామస్తులంతా ప్రశ్నించారు. దీంతో డీలరు మాపై దౌర్జన్యానికి దిగుతున్నారు. గతంలో ఇస్తున్న మాదిరిగానే రేషన్ అందించాలి.– కోమల, నరసింగాపురం -
సినీనటుడు సోనూసూద్కు ఘన స్వాగతం
రేణిగుంట : సినీ నటుడు సోనుసూద్కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి సోనూసూద్ హైదరాబాదు నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో అప్పటికే భారీగా చేరుకున్న ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు రేణిగుంట : రేణిగుంట మండలం కరకంబాడి కట్ట పుట్టాలమ్మ ఆలయం ముందు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు తారకరామానగర్కు చెందిన నన్నయ్యవేలు ద్విచక్ర వాహనంపై ఆదివారం మధ్యాహ్నం వస్తుండగా కడప వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో యువకుడు లారీ చక్రం కింద కాలు పడటంతో తీవ్ర గాయమైంది. హైవే పెట్రోలింగ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. లారీని రేణిగుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. -
రేషన్ పంపిణీ గడువు కుదింపు
● జూన్లో 1 నుంచి 15 వరకే సరుకుల పంపిణీ ● రెండు రోజులు తగ్గింపుపై కార్డుదారులు అసంతృప్తి తిరుపతి అర్బన్ : చౌక దుకాణాల్లో రేషన్ సరుకులను కార్డుదారులకు పంపిణీ చేస్తున్న గడువును ఈనెల నుంచి రెండు రోజులు తగ్గించారు. సాధారణంగా ప్రతి నెలా 1 నుంచి 17 వరకు కార్డుదారులకు సరుకులు ఇచ్చేవారు. అయితే జూన్ నెల నుంచి 1 నుంచి 15 వరకు మాత్రమే ఇవ్వనున్నారు.ఆ మేరకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు జూన్ నుంచి ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ వచ్చి సరుకులు ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పారు. చౌకదుకాణం వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. డీలర్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు ఇవ్వాల్సి ఉంది. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 95,080 మంది స్వామివారిని దర్శించుకోగా 39,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నేర నియంత్రణకు కట్టడి తిరుపతి క్రైమ్ : జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి నేర నియంత్రణ కట్టడి చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి, మే నెలలో సాధించిన పురోగతి వివరాలను వెల్లడించారు. రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న 1,997 మంది అనుమానిత వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 13 ప్రదేశాల్లో కార్డన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించి 525 వాహనాలను తనిఖీ చేయగా అందులో ఎలాంటి రికార్డులు లేని 105 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలుగురి స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు. వీరు ఆయా పాఠశాలల్లో ఆదివారం ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, యూటీఎఫ్, ఎస్టీయూ, ఎంటీఎఫ్ నాయకులు వీరిని సత్కరించి అభినందించారు. -
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
గూడూరు రూరల్: గూడూరు రెండో పట్టణం, ఎగువవీరారెడ్డిపల్లి సమీపంలో ఓ ప్రయివేటు లే అవుట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న గూడూరు డీఎస్పీ గీతాకుమారి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉత్తర భారత దేశానికి చెందిన సుమారు 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి హత్యకు గురైనట్లు తెలిపారు. మృతుడు హిందీ మాట్లాడే వ్యక్తిగా తెలుస్తోందని, అతని కుడి చేతిపై అశోక్ అని హిందీలో అక్షరాలు ఉన్నాయని తెలిపారు. దీన్ని బట్టి ఇతను స్థానికుడు కాదన్నారు. ఇతను ఈ ప్రాంతంలో ఎక్కడైనా పరిశ్రమల్లో పనిచేస్తున్నాడా అనే విషయంపై ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. మృతుడి ముఖంపై పదునైన ఆయుధంతో దాడి చేశారని, దీంతో పాటుగా అతని శరీరంపై అక్కడక్కడా గాయాలున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో గూడూరు పరిసర ప్రాంతాల్లో నేరాల సంఖ్య అధికమవుతోందని తెలిపారు. ఈ హత్యకు సంబంధించి త్వరలోనే నిజాలను నిగ్గు తేల్చుతామని చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు. వీరి వెంట ఎస్ఐ సుబ్రహ్మణ్యంరాజు, సిబ్బంది ఉన్నారు. -
ముగిసిన కానిస్టేబుల్ పరీక్షలు
● 5049 మంది హాజరు.. 165 మంది గైర్హాజరు తిరుపతి క్రైమ్ : నగరంలో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆదివారం స్వయంగా ఆయనే పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తూ.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి అభ్యర్థిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసి క్యూలైన్ పద్ధతిలో పరీక్ష కేంద్రానికి అనుమతించారు. పరీక్ష కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్ పద్ధతిలో తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద ఉన్న హాల్ టికెట్లు పూర్తిస్థాయిలో పరిశీలించి అనుమతించారు. కానిస్టేబుల్ రాత పరీక్షకు వచ్చిన అభ్యర్థుల ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్న తీరు ఎస్పీ పరిశీలించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి డిగ్రీ ఉమెనన్స్ కాలేజ్, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. ఇందులో మొత్తం 5214 మందికి గాను 5049 మంది హాజరయ్యారు. 165 మంది గైర్హాజరయ్యారు. -
వృద్ధులకు ఇంటి వద్దనే బియ్యం
● కాలువలు శుభ్రం చేయలేదని ఫిర్యాదు ● అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ తిరుపతి రూరల్ : యోగి మల్లవరంలో ఆదివారం 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇళ్ల వద్దకే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. కలెక్టర్ వస్తున్నారని తెలుసుకున్న కాలనీ వాసులు అక్కడకు చేరుకుని మురుగు కాలువలు శుభ్రం చేసి రెండు నెలలు గడుస్తోందని ఫిర్యాదు చేశారు. పంచాయతీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదనడంతో తిరుపతి రూరల్ ఎంపీడీఓ రామచంద్రకు ఫోన్ చేసి కాలువలు తక్షణం శుభ్రం చేయించాలని ఆదేశించారు. అలాగే సంబంధిత జిల్లా అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు రేషన్ షాపు డీలర్ వాసుతో మాట్లాడి డీలరు వద్దనే రేషన్ పంపిణీ బాగుందా..? బండిపైన తీసుకువెళ్లడం బాగుందా..? కార్డు దారులు ఏమంటున్నారు..? అంటూ ప్రశ్నించారు. సర్వర్ పనిచేయకపోవడం వల్ల చాలా మంది కార్డు దారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వయో వృద్ధుల ఇళ్లకు బియ్యం ఎలా తీసుకెళ్లి ఇస్తారని కలెక్టర్ ప్రశ్నించడంతో ఆటోలో తీసుకెళ్లి ఇవ్వాల్సిందేనని డీలర్ సమాధానం ఇచ్చారు. మరి రవాణా ఖర్చులు రావు కదా..? అన్న ప్రశ్నకు డీలరు నుంచి సమాధానం లేదు. దానిపై ప్రభుత్వంతో మాట్లాడి డీలర్లకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. పర్యటనలో డీఎస్ఓ రాజు, తహసీల్దారు రామాంజులు నాయక్, సీఎస్డీటీ యుగంధర్ పాల్గొన్నారు. -
హామీల అమలుకు పోరు
చిల్లకూరు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని అబద్దాల బాబుకు బుద్ది చెబుదామని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సాసీపీ పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి పిలుపు నిచ్చారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లోని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ నివాసంలో ఆదివారం ఆయన పారీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు పర్యాయాలు చంద్రబాబు ప్రజలకు అబద్దాలు చెప్పి గద్దెనెక్కారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్రెడ్డి ప్రతి సంక్షేమ పథకం నేరుగా పేదల ఇంటి ముంగిటకే అందించారని గుర్తు చేశారు. అతి పెద్ద సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుడితే వాటిని తామే చేపడుతున్నట్లు ప్రకటనలు ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏడాది దాటుతున్నా అమలు చేయక ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని దీనికి నిరసనగా ఈ నెల 4న చేపట్టే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాద్యక్షుడు మెట్టా రాధాక్రిష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, చేవూరు విజయమోహన్రెడ్డి, మగ్దూమ్, సుబాన్, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నిలదీత తిరుపతి మంగళం: ఏదైన ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలప్పుడు తప్ప ఇంకెప్పుడు తమరు కనిపించరు.. ఇక మా సమస్యలు ఎవ్వరికి చెప్పుకోవాలి.. మా సమస్యలు పట్టించుకునే వారెవ్వరంటూ తిరుపతి 47వ డివిజన్కు చెందిన మాధవనగర్ వాసులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును నిలదీశారు. మాధవ నగర్లోని రేషన్షాపు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు స్థానిక సమస్యలపై ప్రజలు విన్నవించారు. మాధవ నగర్లో సీసీరోడ్లు సక్రమంగా లేవని, మురుగు కాలువలను వారానికి ఒక సారి కూడా శుభ్రం చేయరని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా తమ కాలనీల్లో ఒక్క సీసీ రోడ్డు కానీ, ఒక్క మురుగు కాలువ నిర్మించారా? అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గతంలో నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేవాళ్లని, తాము కూడా ఏ కష్టం లేకుండా ఇంటి వద్దే సరుకులు తీసుకునేవాళ్లమని స్థానిక ప్రజలంతా చెప్పారు. అయితే ఇప్పుడు మళ్లీ రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తీసుకోవాలంటే పనులు మానుకుని వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకపోగా మరిన్ని సమస్యలు కల్పిస్తున్నారని ఎమ్మెల్యేని నిలదీశారు.దీంతో స్థానిక ప్రజల సమస్యలు చూడండంటూ అధికారులకు చెప్పి ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
బుచ్చినాయుడుకండ్రిగ : తెలుగు గంగ కాలువలో దిగి గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం చల్లంవారి గిరిజన కాలనీ వద్ద లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేవీబీపురం మండలంలోని సూరమాల గ్రామంలోని పంట పొలాల్లో నిండ్ర మండలం అగరంపేటకు చెందిన రమేష్, రమ్య దంపతులు కాపలాదారులుగా ఉంటున్నారు. బెంగళూరులో ఉంటున్న రమ్య తమ్ముడు మధు (24) వేసవి సెలవుల నిమిత్తం పది రోజుల కిందట అక్క ఇంటికి వచ్చాడు. శనివారం సాయంత్రం సోదరి కొడుకులు లతీఫ్, మౌనీష్తో సరదాగా కలసి ముగ్గురు ద్విచక్ర వాహనంలో తెలుగుగంగ కాలువ వద్దకు వెళ్లారు. మధు, లతీఫ్ కాలువలో దిగి కాళ్లు కడుగుతుండగా మధు అదుపు తప్పి కాలువలో పడిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో లతీఫ్ కూడా కాలువలో పడిపోగా, కాలువ బయట ఉన్న మౌనీష్ కేకలు వేయటంతో కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి లతీఫ్ను కాపాడగా, మధు గల్లంతు అయ్యాడు. మధు కోసం బాధితులు రాత్రయ్యే వరకు గాలించి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం మండలంలోని చల్లంవారి గిరిజన కాలనీ వద్ద కాలువలో మధు మృతదేహాన్ని గిరిజనులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ విశ్వనాథనాయుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టి.. కలకలం రేపింది. ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుండి విమానం వెళ్లింది. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరిన ఫలితం శూన్యం.ఇవాళ విమానం చక్కర్లపై టీటీడీ భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో దాడి తర్వాత తిరుమలలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో తిరుమల ఉందని.. ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ గత నెల 8న కూడా తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పోలీస్ అవుట్ పోస్ట్కు కూటమి బ్యానర్లు
రేణిగుంట: రేణిగుంట మండలంలో తిరుపతి, చైన్నె, నెల్లూరు రహదారులు కలిసే ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నియంత్రణ, నిత్య పర్యవేక్షణకు పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అవుట్ పోస్ట్ మూడు వైపులా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు బ్యానర్లు కట్టేశారు. దీంతో అవుట్ పోస్ట్ నిరుపయోగంగా మారింది. నిత్యం అనేక మంది ప్రముఖులు విమానాశ్రయం నుంచి ఇదే మార్గాన తిరుమలకి వెళ్లి వస్తుంటారు. అలాంటి ముఖ్యమైన మార్గంలో అవుట్ పోస్ట్ను నిరుపయోగంగా ఉంచడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వంచించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
● ఏడాది పాలనలో ఒక్క హామీ అమలు చేయని కూటమి ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు ● కూటమి అరాచకాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు ● 4న వెన్నుపోటు దినంగా నామకరణం ● నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ● పోస్టర్ ఆవిష్కరణలో భూమన కరుణాకరరెడ్డి తిరుపతి మంగళం : వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసం వద్ద శనివారం పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి జూన్ 4వ తేదీ నిర్వహించనున్న వెన్నుపోటు దినానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం భూమన మాట్లాడుతూ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రజలను నమ్మించి, అబద్ధపు హామీలిచ్చి వంచించడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు, పవన్కళ్యాణ్ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి సూపర్సిక్స్ హామీలు అంటూ ఏడాది అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చని ప్రజాద్రోహులన్నారు. రాష్ట్రానికే ఆదర్శం కావాలి తిరుపతిలో నిర్వహించే నిరసన కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా విజయవంతం చేద్దామని భూమన పిలుపునిచ్చారు. పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ వాసుయాదవ్, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి, పార్టీ నాయకులు వెంకటరెడ్డి, సాకం ప్రభాకర్, నల్లాని బాబు, తలారి రాజేంద్ర, కట్టా గోపీయాదవ్, కడపగుంట అమరనాథ్ధ్రెడ్డి, ఉదయ్వంశీ, దినేష్రాయ ల్, షేక్ ఇమ్రాన్బాషా, రాపూరి ప్రసాద్, చింతా రమే ష్, అనిల్రెడ్డి, రాజేష్, పసుపులేటి సురేష్, మల్లం రవి, సాయికుమారి, పుణీత, పుష్పలత పాల్గొన్నారు. వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయండివైఎస్సార్సీపీ నేతలే టార్గెట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో సుమారు 800 మందికిపైగా తమ నాయకులపై దాడులు చేశార ని, అందులో 370 మందికి పైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కూటమి అరాచకాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ పాలనపై ఇప్పటికే ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని, వారే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు వరగబెట్టిందేమీ లేదన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నామకరణం చేసినట్టు వెల్లడించారు. జూన్ 4వ తేదీన తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు వెల్లడించారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,721 మంది స్వామివారిని దర్శించుకోగా 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. 92.78 శాతం పింఛన్ల పంపిణీ తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం 92.78 శాతం పింఛన్లు పంపిణీ చేసి, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్టు డీఆర్డీఏ పీడీ శోభనబాబు తెలిపారు. కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తిరుపతిలోని ఎస్టీవీ నగర్లో పలువురికి పింఛన్లు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. -
ట్రాన్స్కో పనుల అడ్డగింత
చిన్నమాంబట్టు వద్ద ట్రాన్స్కో పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఒక చోట చెప్పి మరోచోట పనులు మొదలెట్టారని ఆరోపించారు. – 8లోమోసం చేశారు చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేశాం. ఆడపడుచులకు నేను ఉన్నా.. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. ఆడబిడ్డ నిధితో కుటుంబ రూపురేఖలు మారుతాయని చెప్పాడు. ఉచిత బస్సు అంటూ మహిళలను నమ్మించాడు. ఉచిత గ్యాస్ అన్నాడు. కేవలం 10 శాతం మందికి కూడా అందించ లేదు. ఇంత దగా చేస్తాడని కలలో కూడా ఊహించ లేదు. – అనసూయమ్మ, గృహిణి, తిరుపతి సంక్షేమ పథకాలేవి బాబు చంద్రబాబు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు. అధికారం చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్నా తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు, సూపర్సిక్స్ హామీలు ఏమయ్యాయో అర్థం కాలేదు. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రెండేళ్లకు సంబంధించి తల్లికి వందనం ఇవ్వాలి. ఆడబిడ్డ నిధి కింది నెలకు రూ.1500 చొప్పున గత ఏడాది నుంచి జమచేయాల్సిందే. –రమణమ్మ, కార్మికురాలు, తిరుపతి రూరల్ -
పింఛన్లు.. వీధుల్లోనే ఇక్కట్లు
తిరుపతిలో పింఛన్ల పరిస్థితి ఇదీ..!ఎక్కడున్నారయ్యా..!కూటమి ప్రభుత్వంలో పింఛన్ లబ్ధిదారుల పరిస్థితి అయోమయంగా మారుతోంది. గత ప్రభుత్వంలో ఇంటి ముంగిటకే వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో పండుటాకులు పడరానిపాట్లు పడాల్సి వస్తోంది. అధికారుల కోసం పడిగాపులు కాయాల్సి పరిస్థితి ఎదురవుతోంది. దీనికితోడు వారు చెప్పిన చోటుకు వెళ్లి పెన్షన్ తెచ్చుకోలేక పలువురు అగచాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇలాంటిదే తిరుపతిలో శనివారం అడుగడుగునా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి -
దొంగ అరెస్ట్
● 21 గ్రాముల బంగారు, 480 గ్రాముల వెండి స్వాధీనం తిరుపతి క్రైమ్: నగరంలోని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను అరెస్ట్ చేసినట్లు క్రైమ్ పోలీసులు శనివారం తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 4వ తేదీన ఎంఆర్ పల్లి సమీపంలో నివాసముంటున్న పుల్లారెడ్డి సొంత పనుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. పనులు ముగించుకొని గత నెల 16వ తేదీన ఇంటికి చేరుకోగా.. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంటి తాళాలు పగులగొట్టడంతోపాటు ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగలు పడినట్లు ఆనవాళ్లు గుర్తించారు. అదేవిధంగా గత రెండు నెలలుగా చెర్లోపల్లి పద్మావతి నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దొంగతనాలు జరిగాయి. వీటిపై క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నగొట్టిగల్లుకు చెందిన భానుచంద్రాచారి అలియాస్ భాను నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. పై తెలిపిన నాలుగు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు అతను నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 21 గ్రాముల బంగారు, 488 గ్రాముల వెండి, రెండు సామ్సంగ్ టీవీలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
తిరుపతి క్రైమ్: తిరుపతిలో నివాసముంటున్న ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అలిపిరి ఎస్ఐ లోకేష్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని జీవకోన అరుణోదయనగర్లో నివాసముంటున్న రమేష్(43)కు భార్య సుమతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ట్రావెల్స్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తీవ్రమైన ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలని శుక్రవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని తనువు చాలించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. అప్పుడే మొదలెట్టేశారా? – ఆర్టీసీ బస్సును ఆపేసిన టోల్గేట్ సిబ్బంది ఏర్పేడు: రేణిగుంట–శ్రీకాళహస్తి మార్గం మేర్లపాక సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ హైవే టోల్గేట్ వద్ద శనివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్సును టోల్గేట్ సిబ్బంది ఆపేశారు. ఆర్టీసీ యాజమాన్యం ఫాస్ట్ట్యాగ్ రీచార్జి చేశారని, అది చూపడం లేదని కండెక్టర్ చెప్పినా సిబ్బంది వినిపించుకోలేదు. ప్రయాణికులు సుమారు అర్ధగంట పాటు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. ఎండకు తట్టుకోలేక పలువురు వృద్ధులు బస్సులోనే నీరసించారు. చివరకు సిబ్బంది బస్సును అనుమతించారు. -
బ్యాంక్లోనే బ్యాగ్ కొట్టేద్దామని!
స్టేషన్ వద్ద గుమికూడిన జనం సైదాపురం: సైదాపురం పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని ఓ బ్యాంక్కు వచ్చిన మహిళ బ్యాగ్ను మహిళా దొంగ కొట్టేసేందుకు యత్నించిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. బాధితురాలి కథనం.. మండలంలోని అనంతమడుగు గ్రామానికి చెందిన బండి శశికళ సైదాపురంలోని సిండికేట్ బ్యాంకులో బంగారు రుణం చెల్లించేందుకు శనివారం స్వగ్రామం నుంచి బ్యాంకుకు చేరింది. శశికళ ఓచర్ రాస్తున్న సమయంలో ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. ఓచర్ రాసి బ్యాగును చూడగా.. బ్లేడుతో కోసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అక్కడే ఉన్న ఆ మహిళను ప్రశ్నించగా బ్యాంకులో నుంచి ఉడాయిచింది. స్థానికులు ఆ మహిళను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం బాధితురాలు రాపూరు సీఐ సత్యనారాయణ, ఎస్ఐ క్రాంతికుమార్కు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. చోరీకి యత్నించిన మహిళా దొంగ -
ట్రాన్స్కో పనుల అడ్డగింత
తడ: ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలోని పరిశ్రమల అవసరాలకు మాంబట్టు సెజ్ పరిధిలో చిన్న మాంబట్టు దళితవాడకు ఎగువన ఏపీ ట్రాన్స్కో ఏర్పాటు చేసే 130–కేవీ సబ్ సస్టేన్ పనులను శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పనులు చేయడం భావ్యం కాదన్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు, గ్రామ ప్రజాపత్రినిధులకు తెలపకుండా చదును చేసే ప్రయత్నం మానుకోవాలని కోరారు. పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పాటు చేసే సబ్ స్టేషన్ కోసం గ్రామ అవసరాలకు పనికి వచ్చే స్థలాన్ని ఎంపిక చేయడం ఏమిటని నిలదీశారు. గత ప్రభుత్వంలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం వేరొక ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు గ్రమావసరాలకు పనికొచ్చే స్థలంలో సబ్స్టేషన్ నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ట్రాన్స్కో డీఈ బలరామ్మూర్తి స్పందిస్తూ ఏవైనా అభ్యంతరాలుంటే రెవెన్యూ అధికారులకు తెలపాలని సూచించారు. ఎస్ఐ కొండపనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. అభ్యంతరాలను సోమ వారం రెవెన్యూ అధికారులకు తెలిపి అక్కడి నుంచి వేరొక చోటుకు మార్పు చేసుకోవాలని చెప్పారు. సర్పంచ్ రమణయ్య, ఎంపీటీసీ శ్రీపతిబాబు, ట్రాన్స్కో ఏఈ ప్రవీణ్, ఏడీఈ సురేష్, తడ ఏఈ మురళి ఉన్నారు. -
మహిళలను వంచించి ముంచేసిన చంద్రబాబు
● ఏడాది గడుస్తున్నా ఊసేలేని సంక్షేమ పథకాలు ● జగనన్న పాలనలో మహిళలకు పెద్దపీట ● బాబుని నమ్మి మోసపోయామంటున్న మహిళలు తిరుపతి సిటీ:ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో 18 ఏళ్లు పైబడిన కుటుంబంలోని ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి కింద అందిస్తామని ప్రగల్భాలు పలికారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ ఊరువాడా ఊదరగొట్టారు. సూపర్సిక్స్ అమలు చేసి తీరుతామని మహిళలను ఆ పార్టీవైపు తిప్పుకున్నారు. నమ్మి ఓటేసిన మహిళలను నిలువునా ముంచేశారు. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా కనీసం ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా నాన్చుతున్నారు. కడపలో జరిగిన మహానాడు వేదికగానైనా పథకాల అమలుపై ప్రకటన చేస్తారని జిల్లా మహిళలు ఎదురు చూశారు. కానీ ఆ ఊసే లేదు. మళ్లీ చంద్రబాబు మోసం చేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు, తల్లికి వందనం పథకాలను ఊరిస్తున్నారు తప్ప అమలు చేసిన పాపాన పోలేదు. జిల్లాలో 9 లక్షల మంది మహిళలకు ఏడాదిగా బాబు సర్కార్ కుచ్చుటోపీ పెట్టింది. మహిళలను మహరాణులు చేసిన జగనన్న పథకాలుజిల్లాలోని ప్రతి మహిళా జగనన్న ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందారు. నవరత్నాలు జిల్లాలోని ప్రతి కుటుంబానికీ వలంటీర్ల ద్వారా అందించారు. ప్రధానంగా సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్లోని సుమారు 3.36 లక్షల మందికి వడ్డీ రీయింబర్స్మెంట్తో కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు. జిల్లాలోని పేదకాపు సామాజికవర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేల చొప్పున నాలుగేళ్లపాటు 1.21లక్షల మందికి రూ.726 కోట్లు జమచేశారు. ఈబీసీ నేత్తం కింద రూ.15 వేలు చొప్పున నాలుగేళ్లపాటు అందించారు. చిరువ్యాపారులకు లక్ష మందికి రూ.391 కోట్లు రుణ సహాయం చేశారు. బడుగు, బలహీన మహిళలకు 1.21లక్షల మందికి ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లపాటు అందించి ఆదుకున్నారు. జగనన్న చేదోడు పథకం కింద ఏడాదికి రూ.10వేల చొప్పున అందించారు. జిల్లాలో 2.57లక్షల పేద మహిళలకు 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలం మంజూరు చేసి ఇళ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పేరుతో అర్హులైన ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూర్చారు. ఏడాదికి రూ.14 వేలు పిల్లల చదువుల కోసం అమ్మఒడి కింద మహిళల ఖాతాల్లో జమచేశారు. వసతి దీవెన, విద్యా దీవెన సైతం తల్లిఖాతాలలో జమచేసి పేద మహిళల గుండెల్లో దేవుడుగా వెలుగొందారు.ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అలవిగాని హామీలు గుప్పించారు. అధికారం చేపట్టిన వెంటనే మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తామంటూ ఊదరగొట్టారు. ఉచిత బస్సు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచుతామంటూ జబ్బలు చరిచారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ ప్రలోభపెట్టారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి, విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలంటూ రెచ్చగొట్టారు. పండుగ కానుకలు, పెళ్లి కానుకలంటూ ఊరించి ఉసూరుమనిపించారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తు న్నా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్నీ అమ లు చేయక నట్టేట ముంచేశారని మహిళలు ఆవేదన చెందుతున్నారు. -
గొంతు కోసిన కత్తి ఏమైంది?
నాయుడుపేట టౌన్(తిరుపతి): నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో జంట ఆత్మహత్య ఘటన మిస్టరీగా మారింది. లాడ్జీలో కొన్ని గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, మృతుడి గొంతు కోసిన కత్తి కనిపించకపోవడం.. మృతుల సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో తెలియక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వారి కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం, ఏకొల్లు పంచాయతీ, కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెందిన జమ్మల సుబ్రహ్మణ్యం, అలీయాస్ మణి, అదే గ్రామానికి చెందిన బొడిపెద్ద శీరిష వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరూ నాయుడుపేట పట్టణంలోని ఓలాడ్జీలో గురువారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై మణి తల్లి జమ్మల లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బాబి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మణి గొంతుపై కత్తితో కోసిన గాట్లు ఉండడం, అతని మృతదేహంపై నుంచే కుర్చీ వేసుకుని చున్నీతో శీరిష ఉరేసుకుని మృతి చెంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా గొంతు కొసుకునేందుకు వినియోగించిన కత్తి లాడ్జీ గదిలో ఎక్కడా లభించలేదు. మృతు లు మణి, శీరిష సెల్ ఫోన్లు సైతం లేకపోవడం మిస్టరీగా మారింది. మణి, శీరిష మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శీరిష పథకం ప్రకారమే మణికి అతిగా మద్యం తాగించి కత్తితో గొంతు కొసి హతమార్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తర్వాత ఆమె కూడా గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా లాడ్జీ సిబ్బంది వ్యవహర శైలిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. లాడ్జీలో సీసీ కెమెరాలు కొన్ని గంటల పాటు పనిచేయకపోవడంపై విచారిస్తున్నారు. మృతులు ఇద్దరూ నాయుడుపేట లాడ్జీలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు పలుమార్లు రిసెప్షన్ వద్దకు రావడం గుర్తించారు. శిరీష లాడ్జీ కిందకు వచ్చి పలువురితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు మణి, శిరీష మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.ప్రేమ జంట ఆత్మహత్య -
AP: ఒంటరి మహిళలు, వివాహితలే టార్గెట్.. యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళలను లైంగికంగా వేధిస్తున్న యూట్యూబర్ హేమాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధింపులకు గుర్తిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో యూట్యూబర్ హేమాద్రిని తిరుచానూర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు హేమాద్రి.. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు, ఒంటరి మహిళలకు, వివాహితలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం, వారితో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు సేకరించాడు. కొద్ది రోజుల తర్వాత వారిని సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినట్టు బాధితులు.. పోలీసులు ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. హేమాద్రిని అరెస్ట్ చేశారు. మరోవైపు.. హేమాద్రి అరెస్ట్ తెలియడంతో తిరుచానూర్, తిరుపతి, చంద్రగిరి నుంచి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. -
టీటీడీ సేవలు దారుణం
తిరుమల: తిరుమల శ్రీవారి క్యూలైన్లో శుక్రవారం రాత్రి భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్.. ఈవో డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. గత 20 రోజులుగా క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి బయటకు వస్తోంది. అయితే టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యుల సూచనల మేరకు గత 15 రోజులుగా టీటీడీ ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను స్వీకరిస్తూ వస్తోంది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. పేరుకు బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు తెచ్చినా, సర్వదర్శనం ప్రారంభం అయ్యేందుకు దాదాపు మధ్యాహ్నం 12 గంటలు అవుతోంది. క్యూలైన్లో సైతం సరైన సదుపాయాలు కల్పించడం లేదనే వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. అయితే దీన్ని పాత వీడియో అంటారనే ఉద్దేశంతో సమయం, స్థలం, తేదీతో సహా ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీటీడీ అందిస్తున్న సేవలు దారుణంగా ఉన్నాయని భక్తులు ఆ వీడియోలో విమర్శిస్తున్నారు. సామాన్య భక్తుల వ్యధ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
బాబు పాలనలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం
కూటమి ప్రభుత్వం పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు విద్యను అమ్మేసేందుకు సిద్ధమైంది. 2024 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని సుమారు లక్ష మంది విద్యార్థులకు రూ.235 కోట్ల మేర ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా మొండిచెయ్యి చూపుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొందరు మధ్యలోనే విద్యనాపేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అమ్మఒడి, వసతి దీవెన, విదేశీ విద్య పథకాలకు మంగళం పాడేసింది. చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ.15వేలు నగదు అందిస్తామని చెప్పి ఇంతవరకు పైసా అందించకుండా వేధిస్తోంది. జిల్లాలోని 5.65 లక్షల మంది విద్యార్థులకు 2024 విద్యాసంవత్సరంలో రూ.847,50 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వం నాడు–నేడు పథకం ద్వారా నిర్మించ తలపెట్టిన సుమారు 47పాఠశాలల భవనాలను పూర్తి చేయకుండా మొండికేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని పూర్తిగా మార్చేసింది. పౌష్టికాహారానికి మంగళం పాడేసి నాసిరకం ఆహారాన్ని అందిస్తోంది. సీబీఎస్ఈ సిలబస్ను నిర్వీర్యయం చేసే ప్రయత్నం చేస్తూ, ఐబీ సిలబస్ను ఎత్తివేసే కుట్రకు తెరలేపింది. -
జగనన్న పాలనలో ప్రభుత్వ విద్యకు అందలం
పేదరికం చదువులకు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. జిల్లాలో ప్రతి ఏటా 2.57లక్షల మందికి అమ్మఒడి ద్వారా పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏడాదికి రూ.14వేలు చొప్పున నగదు జమచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో బైజూస్తో ఒప్పందం కుదుర్చుకుని సుమారు 1.13 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఐబీ (ఇంటర్నేషనల్ బేసిక్ కరికులమ్) సిలబస్తో అంతర్జాతీయ స్థాయి విద్యనందించారు. ప్రపంచంతో పోటీ పడేలా సీబీఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టారు. ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. నాడు–నేడు పథకం ద్వారా జిల్లాలోని 1,021 ప్రభుత్వ పాఠశాలలను రూ.574కోట్లతో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ప్రతి ఏడాదీ పది, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఘనంగా సత్కరించి ప్రోత్సాహకాలను అందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విదేశీ పర్యటన పేరుతో అమెరికా వైట్హౌజ్, ఐక్యరాజ్య సమతి సభలో ప్రసంగించే అవకాశాన్ని కల్పించారు. పేద విద్యార్థులు ఇంటర్తోనే చదువు ఆపేయకుండా డిగ్రీ వైపు ప్రొత్సహించి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో యూజీ చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికీ విద్యాదీవెన పేరుతో ప్రతి ఏడాదీ ఫీజురీయింబర్స్మెంట్ అందించారు. గతంలో చంద్రబాబు సర్కార్ బకాయిలు పెట్టిన సుమారు రూ.245 కోట్ల ఫీజురీయింబర్స్ మెంట్ను సైతం 2019లో అధికారం చేపట్టిన మూడు నెలలకే చెల్లించారు. దీంతో పాటు అర్హులైన ప్రతి యూజీ విద్యార్థికి వసతి దీవెన కింద రూ.648కోట్ల మేర అందించారు. విద్యారుణాలు జిల్లాలో 1,870 మందికి రూ.56 కోట్లకుపైగా అందించారు. విదేశీ విద్యను ప్రొత్సహించారు. ఇందు కోసం రూ.252.27 కోట్లు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో గోరుముద్దు పేరుతో రుచికరమైన పోషకాహారం అందిస్తూ విద్యార్థులను ఆకట్టుకున్నారు. -
డ్రగ్స్ నిర్మూలనపై విస్తృత ప్రచారం
తిరుపతి అర్బన్: అవగాహనతోనే డ్రగ్స్ను నిర్మూలించొచ్చని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం డ్రగ్స్ నిర్మూలపై ఎస్పీ హర్షవర్ధన్రాజు, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ఫలితాలను యువతకు వివరించాలని సూచించారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్లు, డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. వారం రోజుల్లోగా డీ అడిక్షన్ సెంటర్ను పూర్తి స్థాయిలో వసతులు కల్పించి, వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నంబర్పై సరైన ప్రచారం కల్పించాలన్నారు. అనంతరం మాదక ద్రావ్యాల నిషేధంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్డీవోలు రామమోహన్, భానుప్రకాష్రెడ్డి, కిరణ్మయి, డీఈవో కేవీఎన్ కుమార్, డీఎంహెచ్వో బాలకృష్ణనాయక్, ఆర్టీవో మురళీమోహన్, ఆర్టీసీ ఏటీఎం డీఆర్ నాయుడు, ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వాసుదేవచౌదరి, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, డ్రగ్స్ అధికారులు పాల్గొన్నారు -
పోలీసుల తీరుపై ఆర్డీఓ అసహనం
కలువాయి(సైదాపురం): కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్లో రెవెన్యూ సమస్యలపై వినతిపత్రాలు అందించేందుకు అర్జీదారులు పోటెత్తారు. అయితే అర్జీదారులను నియంత్రించడానికి ఒక్క పోలీసు మాత్రమే వచ్చారు. ఆయన అర్జీదారులను కట్టడి చేయలేకపోవడంతో ఆర్డీఓ పావని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీకు లెటర్ పెట్టాం కదా ?’ అని పోలీసులను అడగ్గా.. సిబ్బంది తక్కువగా ఉన్నారని సమాధానం చెప్పారు. అయితే కొందరు అర్జీదారుల మధ్య పొలం, దారి సమస్యలపై గొడవలు జరగడం.. వారిని పోలీసులు నిలువరించలేకపోవడంతో ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు అవగాహన కల్పించండి తిరుపతి అర్బన్: ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామఉత్కర్ష అభియాన్ పథకం ద్వారా గిరిజనుల సాధికారత, ఆర్థిక, సామాజికాభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. -
వర్షాలతో అప్రమత్తం
తిరుపతి అర్బన్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందస్తుగా వచ్చిన నేపథ్యంలో వర్షాల విషయంలో అధికారులు అప్రత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్(ఎన్ఓపీ) ప్రకారం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు రామమోహన్, భానుప్రకాష్రెడ్డి, కిరణ్మయి, డీపీఓ సుశీలాదేవి, ఐసీడీఎస్ పీడీ వసంతబాయ్ తదితరులు పాల్గొన్నారు. బదిలీల టెన్షన్ తిరుపతి అర్బన్: జిల్లాలో ఉద్యోగుల బదిలీల అంశం హాట్ టాపిక్గా మారింది. బదిలీల ప్రక్రియ పూర్తి చేయడానికి ఇక రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో పలువురు ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యేల లెటర్లతో విజయవాడకు క్యూకడుతున్నట్లు చర్చసాగుతోంది. బదిలీల నేపథ్యంలో వారం రోజులుగా పలు విభాగాల్లో పాలన కూడా స్తంభించింది. వచ్చే సోమవారం సాయంత్రానికి బదిలీల జాబితా విడుదలవుతుందని ఉద్యోగులు అంటున్నారు. ఏ స్థానంలో ఎవరు ఉంటారో ఏ స్థానం నుంచి ఎవరు బదిలీ అవుతారో తెలియడం లేదు. ఇదిలావుండగా కలెక్టరేట్లోని ఓ విభాగం ఇన్చార్జిగా పనిచేస్తున్న మహిళా అధికారి తిరుపతి అర్బన్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఆమె గతంలో చంద్రగిరి తహసీల్దార్గా పనిచేసిన అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో తహసీల్దార్గా పనిచేసిన ఓ అధికారి కూడా తిరుపతికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కండలేరు ఇన్చార్జి ఈఈగా రామచంద్రమూర్తి రాపూరు: మండలంలోని కండలేరు జలాశయం ఇన్చార్జి ఈఈగా రామచంద్రమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన నెల్లూరు డివిజన్ 2లో ఈఈగా పనిచేస్తూ కండలేరుకు ఇన్చార్జి ఈఈగా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఈఈ విజయకుమార్రెడ్డికి ఎస్ఈగా పదోన్నతి కల్పిస్తూ చిత్తూరు జిల్లా గాలేరు–నగిరి సుజల స్రవంతికి బదిలీ చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 69,019 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలగుతున్నారు. -
చైన్నెలో వలస కార్మికుడి మృతి
రేణిగుంట: పొట్టకూటి కోసం చైన్నెకి వలసవెళ్లి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న సమయంలో పిట్స్ రావడంతో తోటి కార్మికులు హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. గతంలో రేణిగుంటలో పనిచేసినట్లు తెలపడంతో గత వారం రోజులుగా రేణిగుంట పరిసర ప్రాంతాల్లో సహచర కూలీలు మృతుడి ఫొటో పట్టుకొని వెతుకుతున్నారు. రేణిగుంటలో శుక్రవారం మేస్త్రి నారయ్య మాట్లాడుతూ తనతోపాటు కొంతమంది కార్మికులను చైన్నెకి పనికి తీసుకొని వెళ్లే వాడినన్నారు. ఆ క్రమంలో రేణిగుంటలో యేసు అనే కార్మికుడు 20 రోజుల క్రితం పని కోసం తమతోపాటు చైన్నెకి వచ్చాడని, పది రోజులు పనిచేసి కూలీ డబ్బులు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యే సమయంలో అతనికి పిట్స్ వచ్చాయని తెలిపారు. సమీపంలోని ప్రభుత్వ కేఎంసీ హాస్పిటల్కు తరలించకగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు తెలిపారు. పోలీసులు వస్తేనే మృతదేహం ఇస్తామని హాస్పిటల్ వారు తెలిపారని, ఎవరికై నా మృతుడి ఆచూకీ తెలిస్తే 9550349981, 7989245532 నంబర్లలో సంప్రదించాలని మేస్త్రీ కోరుతున్నారు. -
భార్యపై కక్ష పెంచుకుని హత్య
నాయుడుపేట టౌన్: భార్యపై కక్షతోనే భర్త రాయితో కొట్టి గొంతు నూలిమి హత్య చేసినట్లు సీఐ బాబి వెల్లడించారు. హత్య కేసులో నిందితుడైన మానికల శ్రీనివాసులును శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిందితుడిని హాజరుపరిచి సీఐ వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శ్రీనివాసులు, భార్య వీణమ్మ(28), ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారని తెలిపారు. భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భార్య అనుమానంతో నిత్యం వేధించేది. దీంతో శ్రీనివాసులు భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీ రాత్రి భార్య, భర్తలిద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో వీరి మధ్య వివాదం రేగింది. శ్రీనివాసులు ఇదే అదనుగా అక్కడే ఉన్న రాయితో భార్యపై దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీఐతో పాటు ఎస్ఐ ఆదిలక్ష్మి, పోలీసులు అన్ను దయాకర్, పోలయ్య, వెంకీలను డీఎస్పీ చెంచుబాబు అభినందించినట్లు తెలిపారు. -
● గ్రీవెన్స్ చుట్టూ తిరుగుతున్న వితంతువులు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభత్వుం అధికారం చేపట్టిన తర్వాత కొత్త పింఛన్లకు మంగళం పాడేసింది. గత ఏడాది జూన్లో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు జిల్లాలో 2,71,183 మందికి అందించగా.. ఈ ఏడాది జూన్లో 2,60,379 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేశారు. కూటమి ఏడాది పాలనలో జిల్లాలో 10,804 పింఛన్లు తగ్గించారు. ప్రతి నెలా వెయ్యి పింఛన్లు తగ్గిస్తున్నారు. ఈ అంశంపై అధికారులను ప్రశ్నిస్తే...పింఛన్లు తగ్గించలేదని వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. తొలగించిన వారి జాబితా ఇవ్వడానికి అధికారులు విముఖత చూపుతున్నారు. నేడు, రేపు పింఛన్ల తనిఖీల జాబితా విడుదల కూటమి ఏడాది పాలనలో 10,804 మందికి పింఛన్లు తగ్గించారు. మరోవైపు జిల్లాలో గత ఆరు నెలలుగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.6 వేలు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులను తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. వీరి జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ జాబితా వస్తే అందులో ఎంత మందిని తొలగిస్తారో తెలియని పరిస్థితి. మరోవైపు రూ.4 వేలు ఫించన్ తీసుకుంటున్న వారిని జూన్ రెండో వారం నుంచి తనిఖీలు చేయనున్నారు. స్పౌజ్ పింఛన్లకు కొత్త మెలిక స్పౌజ్ కేటగిరిలో వితంతువులకు పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఏ కేటగిరిలోనైనా పింఛన్లు తీసుకుంటున్న భర్త మృతి చెందితే మాత్రమే వారి సతీమణులకు పింఛన్లు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఆ మేరకు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు మృతి చెందిన పింఛన్దారుల భార్యలకు 3,940 పింఛన్లు మంజూరు చేశారు. వాటిని వెరిఫికేషన్ చేస్తున్నారు. అందులో 1,500 పింఛన్లు సర్వర్ సమస్యలతో గుర్తించలేకపోతున్నామని చెబుతున్నారు. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వితంతువులై పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారు 6,500 మందికి పైగా ఉన్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నాయి. 50 ఏళ్లకే పింఛన్ ఎక్కడా? జిల్లాలో ప్రస్తుతం జూన్లో 2,60,379 మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ ఉసేలేదు. 50 ఏళ్లు పైబడి పింఛన్లకు అర్హులైన వారు జిల్లాలో 70 వేల మందికి పైగానే ఉన్నారు. మరోవైపు 60 ఏళ్లు దాటి పింఛన్లకు అర్హులైన వారు, వితంతువులు, కళాకారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వివిధ వ్యాధిగ్రస్తులు మరో 30 వేల మంది వరకు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో కొత్తగా లక్ష మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. వితంతు పింఛన్ కోసం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అభాగ్యులు (ఫైల్) ఈ తగ్గించిన ఏడాది పింఛన్లు జనవరి 641 పిభ్రవరి 804 మార్చి 730 ఏప్రిల్ 620 మే 611 జూన్ 851పింఛన్లు తొలగించలేదు ఏడాది కాలంలో పింఛన్లు మేము తొలగించలేదు. అందులో చాలా మంది మృతి చెందారు. పలువురు వరుసగా మూడు నెలలు పింఛన్లు తీసుకోలేదు. దీంతోనే ఆ పింఛన్లు తగ్గాయి. మే నెలకు సంబంధించి పింఛన్లు 2,60,379 మందికి ఈ నెల 31 నుంచి అందిస్తాం. –టీఎన్ శోభన్బాబు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
డక్కిలి: మండలంలోని దగ్గవోలు గ్రామానికి చెందిన బోనుబోయిన వెంకటసుబ్బయ్య (55) గురువారం పూటుగా మద్యం సేవించి మద్యం మత్తులో గడ్డి మందు సేవించాడు. బంధువులు గూడూరులోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శుక్రవారం ఉదయం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్ఐ శశిశంకర్ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్ఎస్యూ డీఈ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ దూర విద్యాకేంద్రం ఆధ్వర్యంలో పలు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.రంగనాథన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సంస్కృతంలో ఆరు నెలల వ్యవధి సర్టిఫికెట్ కోర్సు, ఏడాది వ్యవధి డిప్లొమో, రెండు సంవత్సరాల వ్యవధి పాక్శాస్త్రి కోర్సులు ఉన్నాయని తెలియజేశారు. ఈ కోర్సులకు ఆసక్తిగల వారు వచ్చేనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9440626562 నంబర్ను సంప్రదించాలని సూచించారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం వైఎస్సార్ జిల్లా బద్వేల్కు చెందిన గాజులపల్లి శంకర్రావు, ధర్మపత్ని శ్రీదేవి రూ.లక్ష విరాళంగా అందించినట్లు ఆలయ ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. దాతకు మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాలు అందించినట్లు ఆయన తెలిపారు. టమాట లారీ బోల్తా నాయుడుపేట టౌన్ : పట్టణ పరిఽధిలోని గోమతి సర్కిల్ సమీపంలో జాతీయ రహదారిపై టమాట లోడ్డుతో వెళుతున్న మీనీ లారీ శుక్రవారం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లి నుంచి నెల్లూరుకు మినీ లారీలో టమాటాలు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ముందు వెళుతున్న వాహనాన్ని అదిగమించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కగా పొలాల్లోకి వెళ్లి లారీ బోల్తా పడింది. క్షతగాత్రులను శ్రీకాళహస్తికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. దళిత బాలికపై అత్యాచార యత్నం నిందితుడిపై పోక్సో కేసు రేణిగుంట: దళిత బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన కామాంధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు. రేణిగుంట మండలం, కరకంబాడికి చెందిన ప్రసన్నకుమార్(38) అదే ప్రాంతంలో ఓ హోటల్ వద్ద ఉన్న దళిత బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సోతోపాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు అర్బన్ సీఐ జయచంద్ర తెలిపారు. -
తిరుపతి ఎంపీ ‘వెలుగులు’
● 22 గ్రామ పంచాయతీలకు రూ.21.20 లక్షలతో వీధిలైట్లు వరదయ్యపాళెం: మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి తన నిధుల ద్వారా వీధిలైట్ల పంపిణీకి చొరవ చూపారు. ఆ మేరకు మండలంలోని 22 పంచాయతీలకు సంబంధించి రాచర్ల, కంచరపాళెం, అరుదూరు, యానాదివెట్టు, కడూరు, తొండంబట్టు, పులివల్లం, మత్తేరిమిట్ట, వరదయ్యపాళెం, కాంబాకం, కురింజల్లం, ముస్లింపాళెం, ఇందిరానగర్, సీఎల్ఎన్పల్లి, కళత్తూరు, అంబూరు, సంతవేలూరు, నెల్లటూరు, గూడలవారిపాళెం, అయ్యవారిపాళెం, మావిళ్లపాడు, వరదయ్యపాళెం గ్రామ పంచాయతీలకు రూ. 21.2 లక్షలతో వీధిలైట్లను పంపిణీ చేశారు. ఆ మేరకు శుక్రవారం వరదయ్యపాళెం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నాయుడుదయాకర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, రాష్ట్ర చేనేత కార్మిక విభాగం సభ్యులు బొప్పన తిలక్బాబు చేతుల మీదుగా కాంట్రాక్టర్ రమణయ్య సర్పంచులకు వీధిలైట్లను అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ మాట్లాడుతూ.. పంచాయతీల్లో విద్యుత్ దీపాల పంపిణీకి చొరవ చూపిన ఎంపీ గురుమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ దుడ్డు వేణు, నియోజకవర్గ యూత్ కన్వీనర్ వినోద్యాదవ్, మండల సేవాదళ్ కన్వీనర్ నానిరెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ సునీల్, నాయకులు రమేష్, మురళీరెడ్డి, రిపువర్థన్ పాల్గొన్నారు. భర్తపై కేసు కేవీబీపురం: భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నరేష్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కాళంగి పంచాయతీ హనుమయ్య కండ్రిగ గ్రామానికి చెందిన ఎం.సుబ్రమణ్యం, స్వాతి భార్యాభర్తలు. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుబ్రమణ్యం తాగుడుకు బానిసై కొంతకాలంగా భార్యను చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఈనెల 28వ తేదీన తాగి వచ్చి భార్య స్వాతిని తీవ్రంగా కొట్టి మెడమీద కాలుపెట్టి తొక్కి చంపేందుకు ప్రయత్నించాడు. ఆమెను హుటహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్వాతి శుక్రవారం ఫిర్యాదు చేయడంతో భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
చిరుతల సంచారంపై మరోసారి అధ్యయనం
● గతంలో తీసుకున్న నిర్ణయాలే ఆధారం ● తిరుమల అటవీ ప్రాంతంలో అధ్యయనం చేయనున్న సైంటిస్ట్ రమేష్ తిరుమల: చిరుతల సంచారంపై టీటీడీ మరోసారి అధ్యయనం చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత టీటీడీ అధికారులు తిరిగి అమలు చేయనున్నారు. గతంలో ఘాట్ రోడ్లో, నడక మార్గంలో వన్యమృగాలను కట్టడి చేసేందుకు అప్పటి ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకరరెడ్డి సైంటిస్ట్ రమేష్ కమిటీని పిలిపించి అధ్యయనం చేయించారు. ప్రభుత్వం మారడంతో ఆ కమిటీ అధ్యయనం మూలన పడింది. అయితే తిరిగి చిరుతల సంచారం పెరగడంతో గతంలో తీసుకున్న నిర్ణయాలను పునఃపరిశీలించనుంది. ఎట్టకేలకు నిద్ర లేచింది నడక మార్గంలో భక్తుల భద్రతపై టీటీడీ అటవీశాఖ దృష్టి సారించింది. డెహ్రడూన్కు చెందిన వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ రమేష్ సూచనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. కాకపోతే ఇది కూడా తమ హయాంలోనే జరిగిందని కలరింగ్ ఇచ్చుకోవడానికి రమేష్ను మరోసారి వర్క్షాప్ నిర్వహించి నివేదికను టీటీడీకి అందజేసేందుకు పథకం వేసింది. గతంలోనే పకడ్బందీ చర్యలు అలిపిరి నడక మార్గంలో 2023 జూన్ 24న ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేయగా అదే ఏడాది ఆగస్టు ఎనిమిదో తేదీన నరసింహస్వామి ఆలయం వద్ద ఆరేళ్ల బాలికపై దాడి చేసి చంపేసింది. దీంతో టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. భక్తుల భద్రతపై దృష్టి సారించిన అప్పటి ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకరరెడ్డి సూచనలతో అటవీశాఖ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అలిపిరి నడక మార్గంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులను అనుమతించకుండా నిలిపివేయడం, సాయంత్రం ఆరు నుంచి ఏడో మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతా సిబ్బంది గస్తీ మధ్య భక్తులను గుంపులుగా అనుమతించడం వంటి చర్యలు చేపట్టారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో 250 ట్రాప్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. వాటి ఆధారంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆరు చిరుతలను గుర్తించారు. వన్యప్రాణుల సంచారం పై నిఘా ఉంచడానికి ఏడో మైలు వద్ద అటవీశాఖ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సంయుక్తంగా బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. అటువైపు ఉన్న జింకలను ఇతర ప్రాంతాలకు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. నడకదారి భక్తులకు మనోధైర్యం కల్పించేందుకు ఊతకర్రలను అందించారు. డెహ్రాడూన్కు చెందిన వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ రమేష్ నేతృత్వంలో చిరుతల సంచారానికి గల కారణాలపై చర్చించారు. వారి నివేదిక సమర్పించే సమయానికి ప్రభుత్వం మారింది. మరోవైపు అప్పటి అధికారులు తీసుకున్న చర్యలతో చిరుతల సంచారం కూడా తగ్గి పోవడంతో సైంటిస్ట్ నివేదికను టీటీడీ లైట్ తీసుకుంది. మళ్లీ కలకలం ఈనెల 25వ తేదీన అలిపిరి నడక మార్గంలో 350 మెట్టు వద్ద చిరుత సంచరించడం, అనంతరం మరుటి రోజు మొదటి ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం వద్ద వాహనదారులకు సమీపం నుంచి చిరుత వెళ్లడంతో టీటీడీ ఉలిక్కిపడింది. రెండేళ్ల క్రితం ఇదే సమయంలో చిరుత సంచారం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించింది. గతంలో సైంటిస్ట్ రమేష్ ఇచ్చిన నివేదికను మరోసారి టీటీడీకి అందజేయించేందుకు ఆయనతో వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఆయన తిరుమలకు చేరుకుని జూన్ 1, 2 తేదీలలో వర్క్షాప్ నిర్వహించి టీటీడీకి నివేదికను సమర్పించేలా అధికారులు ప్లాన్ చేశారు. భద్రతా ఏర్పాట్లను తిరిగి పునఃప్రారంభించేలా టీటీడీ చర్యలు తీసుకుంది. -
సేవాసదన్ సమీపంలో పాము
తిరుమల : తిరుమల సేవాసదన్ సమీపంలోని పార్కులో శుక్రవారం 7 అడుగుల జెర్రిపోతు కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అక్కడకు చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అభివృద్ధిపై టీటీడీ ఈఓ సమీక్ష తిరుమల : తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం, సీఆర్ఓ కార్యాలయం వద్ద అభివద్ధి పనులపై టీటీడీ ఈఓ జె.శ్యామలరావు శుక్రవారం అన్నమయ్య భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా నిపుణులు తాము రూపొందించిన ప్రణాళికలను వివరించారు. ఈఓ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల మేరకు అభివృద్ధి చేయాలని సూచించారు. సీఆర్ఓ కార్యాలయం వద్ద భక్తులకు ఆధునిక వసతులు కల్పించాలని కోరారు. అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, సీఈ సత్యనారాయణ, డిజైనింగ్ నిపుణుడు రాముడు పాల్గొన్నారు. బస్సును ఢీకొన్న కారు చంద్రగిరి : తిరుపతి– మదనపల్లె జాతీయ రహదారిపై భాకరాపేట కనుమ వద్ద శుక్రవారం బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా, డ్రైవర్ సుదర్శన్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును క్రేన్ సాయంతో తొలగించారు.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● నాయుడుపేట లాడ్జీలో వివాహితులైన ఇద్దరు ఆత్మహత్య నాయుడుపేట టౌన్: వివాహేతర సంబంధం రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఈ ఘటన గురువారం నాయుడుపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. పోలీసుల కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం, కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెంది జమ్మల సుబ్రహ్మణ్యం అలియాస్ మణి(38) అదే గ్రామంలో నివాసం ఉంటున్న దేవత శీరిష(35) మధ్య కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం ఉంది. మణికి వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాదాల కారణంగా భార్య కొన్ని నెలల కిందటే పిల్లలను తీసుకుని రేణిగుంటలోని పుట్టింటికి వెళ్లింది. నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరుకు చెందిన శీరిష కుప్పారెడ్డిపాళెం గ్రామంలోని తాత ఇంట్లో పుట్టి పెరిగి అదే గ్రామంలో నివాసముంటోంది. ఆమెకు వివాహం కాగా.. భర్త ఆమెను విడిచి పెట్టి వెళ్లిపోయాడు. కొన్ని నెలలుగా మణి, శీరిష మధ్య వివాహేతర సంబంధం కారణంగా ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. బుధవారం సాయంత్రం మణి, శీరిష నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో బసచేశారు. గురువారం ఉదయం లాడ్జీ నిర్వహకులు గదిని ఖాళీ చేయాలని కోరగా.. శిరీష అక్కడి సిబ్బందితో గొడవపడ్డారు. సాయంత్రం వరకు గదిని ఖాళీ చేయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా గదిలో ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబి, ఎస్ఐ ఆదిలక్ష్మి లాడ్జీ వద్దకు చేరుకుని తలుపులు పగులగొట్టి గదిలో పరిశీలించగా.. మణి గొంతు కోసుకుని రక్తపు మడుగులో పడి ఉండడం, శీరిష ఉరేసుకుని ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏమైనా వివాదాలు చోటు చేసుకుని శీరిష మణి గొంతు కోసి ఆపై ఆమె చున్నీతో ఉరేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తిరుపతి జిల్లాకు చెందిన క్లూస్ టీమ్ క్షణ్ణంగా పరిశీలించింది. ఇద్దరి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరు కుటుంబాలను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చెత్త కాల్చినందుకు రూ.50 వేల జరిమానా
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం గాంధీపురం గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిపై ఉన్న రిలాక్స్ వెల్ మాట్రెసెస్ వారు నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ వ్యర్థాలను రోడ్డు పక్కన వేసి కాల్చడాన్ని కలెక్టరు వెంకటేశ్వర్ గురువారం ఉదయం గమనించారు. ఆ పరిశ్రమ యజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలార్పించి, జరిమానాకు పంచాయతీ అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ చట్టం కింద సెక్షన్లు 84, 94 మేరకు చెత్త కాల్చిన రిలాక్స్ వెల్ మాట్రెసెస్ వారికి రూ.50వేల జరిమానా విఽధిస్తూ జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి నోటీసులు జారీ చేశారు. భార్యపై కత్తితో దాడి రేణిగుంట: భార్యపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని సూరప్పకశం పంచాయతీ, అల్లికేశం గ్రామానికి చెందిన మల్లికార్జున (61), ముని లక్ష్మి (58) భార్యాభర్తలు. గురువారం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో భార్య మునిలక్ష్మి మెడపై కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. గాజులమండ్యం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో స్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి వంటి వస్తువులను శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను స్వామివారి సర్వదర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మునికృష్ణారెడ్డి, ప్రధాన అర్చకుడు ఏపీ శ్రీనివాస దీక్షతులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఇతర అధికారులు పాల్గొన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు తిరుపతి అర్బన్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31తో ముగుస్తున్న నేపథ్యంలో కార్డుల కాలపరిమితిని జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు సంబంధిత మీడియా యాజమాన్యం వారు వారి సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలను జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారికి సమర్పించాలని కోరారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి చంద్రగిరి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. మండల పరిధిలోని బందార్లపల్లి దళితవాడకు చెందిన లోకేష్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుపతి నుంచి బందార్లపల్లికి పయనమయ్యాడు. ఈ క్రమంలో పీలేరు నుంచి తిరుపతికి వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోకేష్ తలకు తీవ్ర గాయం కావడంతో పాటు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున లోకేష్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెర్లోపల్లిలో శతాధిక వృద్ధుడి మృతి
● 43 ఏళ్లు సర్పంచ్గా సేవలందించిన వైనం ● నివాళులర్పించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి గ్రామానికి చెందిన విప్పర్ల రెడ్డెప్ప నాయుడు (103) బుధవారం మృతి చెందారు. 1922లో జన్మించిన ఆయన 103 ఏళ్లు జీవనం సాగించారు. అది కూడా సాదాసీదా జీవితం కాదు.. ప్రజా జీవితం గడిపారు. చెర్లోపల్లి పంచాయతీకి 43 ఏళ్లు సర్పంచ్గా సేవలందించిన ఘనత ఆయనది. కొంతకాలం ఆంజినేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా కూడా సేవలందించారు. రెడ్డెప్పనాయుడు మరణవార్త తెలుసుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రెడ్డెప్ప నాయుడు కుమారుడు వాసుదేవనాయుడు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై కక్ష సాధింపు
కలువాయి(సైదాపురం): మండలంలోని తెలుగురాయపురం గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పబ్బు వెంకటసుబ్బయ్య పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులు వెంకటసుబ్బయ్య ఇంటి వద్ద గాడి తవ్వించారు. బాధితుడు మాట్లాడుతూ తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా గాడి తవ్వించి రాకపోకలకు అంతరాయం కలిగించినట్టు తెలిపారు. రెవెన్యూ, ఎంపీడీ అధికారుల సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు గాడి తీయించారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తన ను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు వాపోయారు. అందుబాటులోకి హైవే తిరుపతి అర్బన్: నాయుడుపేట–చిత్తూరు హైవే, తిరుపతి–చైన్నె హైవే రోడ్డు పనులు పూర్తికావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పాయి. నాయుడుపేట–చిత్తూరు హైవే మార్గంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేశారు. మరోవైపు రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. -
దృఢత్వానికి ప్రతీక భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్
కేవీబీపురం: నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి తెలిపారు. గురువారం కేవీబీపురం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్టీల్ అండ్ సిమెంట్ అధినేత వెంకటరత్నం ఆధ్వర్యంలో తాపీ మేస్త్రిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంటును ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు. టెంపర్ ప్రూఫ్ బస్తాలతో మార్కెట్లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం కూడా ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. అనంతరం భారతి సిమెంటుకు సంబంధించిన నాణ్యత ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంటు తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్ ప్రతిచోట అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందించారు. -
జగనన్న పాలనలో గడపగడపలో ఆనందం
వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పల్లె ప్రగతిపై దృష్టి సారించారు. గడపగడపకూ సంక్షేమ పథకాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ను ఏర్పాటు చేశారు. ప్రతినెలా ఒకటో తేదీ తెల్లవారు జామునే ఇంటి తలుపు తట్టి పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రేషన్ కార్డుదారుల ఇంటి గుమ్మం ముందే రేషన్ అందించేందుకు ఎండీ యూ వ్యవస్థకు పురుడుపోశారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ఆరోగ్య శ్రీసేవలను విస్తరించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులు అవస్థలు పడకుండా ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ హెల్త్ క్లినిక్లను మెరుగుపరిచారు. వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. మహిళాభ్యున్నతికి రాయితీ రుణాలు అందించారు. పేదవారికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించారు. అమ్మ ఒడి, వసతిదీవెన, విద్యాదీవెన పథకాలను పకడ్బందీగా అమలు చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మండల కేంద్రాల్లో మెగా జాబ్ మేళాలను ఏర్పాటు చేశారు. ఒక్కటేమిటి గ్రామ స్థాయిలో ఏ అవసరం వచ్చినా వెంటనే పరిష్కారమయ్యేలా వ్యవస్థలను తీర్చిదిద్దారు. -
మళ్లీ రేషన్ కష్టాలు
గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ జరిగేది. సాఫీగా సాగుతున్న ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటమాడుతోంది. మా కడుపు కొట్టడమే కాకుండా కార్డుదారులు రేషన్ సరుకుల కోసం అవస్థలు పడేలా చేసింది. – ిపీ.సుబ్రమణ్యం, వెంకటగిరి, ఎండీయూ వాహన ఆపరేటర్ మానసికంగా వేధిస్తున్నారు మా ఆస్తిలో ఉన్న చింత చెట్టు కోసం ఎనిమిది నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. చివరికి ఆ చింత చెట్టు నరికేశారు. ఉమ్మడి ఆస్తికి చెందిన సర్వే నం.1276లో భూమిలోని చెట్టును ఎలా నరికేస్తారని నిలదీస్తే అక్రమ కేసుల్లో ఇరికించారు. రికార్డులు తారుమారు చేసి నన్ను మానసికంగా వేధిస్తున్నారు. – పురుషోత్తంరెడ్డి, మారసానివారిపల్లి, చిన్నగొట్టిగల్లు మండలం అర్హత ఉన్నా పింఛన్ లేదు భర్త మృతి చెంది ఏడాది దాటినా పింఛన్రాలేదు. ఒకవైపు వృద్ధాప్య పింఛను అందుకునే వయ సు వచ్చినప్పటికీ ప్రభు త్వం స్పందించ లేదు. దరఖాస్తు చేసుకునేందుకు కూడా వీలు లేదంటున్నారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛను లేకపోవడంతో జీవనం దుర్భరంగా ఉంది. – నీలం లక్ష్మమ్మ, రామలింగాపురం, గూడూరు మండలంనా భర్తకు పింఛన్ ఇప్పించండయ్యా నా భర్త పేరు శ్రీనివాసు లు. వయసు మీదపడి నా పింఛన్ ఇవ్వలేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. గతంలో వలంటీర్లే అన్నీ చూసేవారు. మా వీధిలోకి వచ్చి అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించారు. ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ అవస్థలే. – శ్యామలమ్మ, తిరుపతి గ్రామ స్థాయిలో వైద్యం దూరం గత ప్రభుత్వంలో 104 వాహనం ద్వారా గ్రామ స్థాయిలోనే వైద్యమందేది. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించి అవసరమైన మందులను అందజేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటన్నింటికీ స్వస్తి పలికింది. –మురళి, వరదయ్యపాళెం మండలం ●