Tirupati
-
శృతి మించుతున్న కూటమి
● వైఎస్సార్సీపీ మహిళా నేతపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు ● టీడీపీ నేతల తీరును నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద ధర్నా ● వైఎస్సార్ సీపీ ధర్నాకు వ్యతిరేకంగా కూటమి నిరసన పేరుతో రచ్చ సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో టీడీపీ, జనసేన నేతల తీరు శృతిమించుతోంది. టీడీపీ రౌడీ మూకల తీరుని నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్సీపీ మహిళల చేపట్టిన శాంతియుత ధర్నా భగ్నం చేసేందుకు కూటమి శ్రేణులు వ్యవహరించిన తీరుతో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో ఏమి జరగబోతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తిరుపతి నగరంలో ఆకు రౌడీల ముందు పెట్టి భూ ఆక్రమణలకు తెగబడుతున్న టీడీపీ, జనసేన తీరుని తప్పుబడుతూ వైఎస్సార్సీపీ మహిళా నేత విజయలక్ష్మి సోషల్ మీడియా వేదికగా వారిని ప్రశ్నించారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేత జేబీ శ్రీనివాసులు అనుచరుడు మాచర్ల రఘురాం వైఎస్సార్సీపీ మహిళ నాయకురాలు విజయలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రఘురాం పెట్టిన పోస్టును తప్పుబడుతూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీసీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, మహిళ విభాగం నగర అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, అంగన్వాడీ విభాగం నగర అధ్యక్షురాలు పద్మజ, మహిళ నాయకురాళ్లు విజయ రాయల్, హేమలత, మునీశ్వరీ, ప్రమీల, మంజుల, కృష్ణవేణి, ఉష. జ్యోతి, లక్ష్మి, మమత, సాయి కుమారి తదితరలతో పాటు పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నేతలను వారిస్తున్న పోలీసులుశాంతియుత ధర్నాను భగ్నం చేసేందుకు కూటమి కుట్రలువైఎస్సార్సీపీ మహిళల ధర్నాను భగ్నం చేసేందుకు కూటమి నేతలు పన్నిన కుట్రను అమలు చేసేందుకు టీడీపీ మహిళలు అద్దె జనంతో రంగంలోకి దిగారు. అద్దె మహిళలతో టీడీపీ, జనసేన మహిళా నాయకులు గాంధీ విగ్రహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని చెప్పి డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలు దేరారు. ఆ పక్కనే గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ మహిళలను చూస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు దిగారు. వేళ్లు చూపిస్తూ హెచ్చరిస్తూ కేకలు వేశారు. వైఎస్సార్సీపీ మహిళలపై దాడికి యత్నించారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే.. తమపై దాడికి యత్నిస్తారా? అంటూ వారిని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ మహిళలు యత్నించారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వైఎస్సార్సీపీ మహిళలను అడ్డుకునేందుకు యత్నించారే తప్ప.. కూటమి మహిళలను నిలువరించలేదు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరం నడిబొడ్డులో ఉద్రిక్తత ఆధ్యాత్మిక నగరంలో కూటమి నేతల కవ్వింపు చర్యలతో ఈస్ట్ పోలీస్టేషన్ ఎదుటే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న టీడీపీ, జనసేన మహిళలు అద్దె జనంతో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో కొంత సమయం తిరుపతి నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కూటమి నేతలపై వైఎస్సార్సీపీ ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. శాంతియుతం ధర్నా చేసిన వైఎస్సార్సీపీ మహిళలు, నాయకులపై టీడీపీ, జనసేన మహిళలు కూడా ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. -
తిరుపతి ఐఐటీలో ‘యువ సంఘం–6’ ప్రారంభం
ఏర్పేడు: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లో 6 రోజుల పాటు ఏక్ భారత్ –శ్రేష్ట భారత్ యువ సంఘం–6 కార్యక్రమాన్ని తిరుపతి ఐఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. శనివారం ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఏక్ భారత్ –శ్రేష్ట భారత్ యువ సంఘం–6 కార్యక్రమాన్ని ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సంపూర్ణ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఏక్ భారత్ శ్రేష్ట భారత్లో భాగంగా యువ సంఘం ఆరు రోజుల కార్యక్రమాన్ని తిరుపతి ఐఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన సుమారు యాభై మంది గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నారన్నారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ రెండేళ్ల కిందట తిరుపతి ఐఐటీ ఆధ్వర్యంలో యూత్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ నిర్వహించామని, ఆ సమయంలో అరుణాచల్ప్రదేశ్ ఐఐటీ నుంచి విద్యార్థులు వచ్చారన్నారు. -
మూడేళ్ల బాలుడి మృతి
దొరవారిసత్రం: తోటి పిల్లలతో ఆడుతున్న మూడేళ్ల బాలుడు నీటి అండాలో (నీళ్ల డ్రమ్ము) ప్రమాదశాత్తు పడి మృతి చెందిన ఘటన గొల్లపాళెం పరిధిలోని ఎస్టీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గొల్లపాళెం ఎస్టీ కాలనీకి చెందిన తిరుమలశెట్టి శివ, మారెమ్మ దంపతులకు కుమార్తె హరిత, కుమారుడు శివయ్య ఉన్నారు. సోమవారం ఉదయం బాలుడు శివయ్య అందరి పిల్లలతో అడుతూ ఉన్నాడు. ఎంతసేపటికి బాలుడు ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు వీధుల్లో, పలువురి ఇంటి వద్ద వెతికి వాకబు చేశారు. తీర ఇంటి అవరణలో ఉన్న నీరు ఉన్న అండాలో తల భాగం మునిగిపోయి కాళ్లు పైకి ఉండిపోయి విగత జీవిగా కనింపచడంతో ఆ దృశ్యం చూసిన తల్లిదండ్రులు అల్లాడిపోయి కన్నీమున్నీరుగా విలపించసాగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఏర్పేడు: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. శనివారం ఉదయం ఏర్పేడు బస్టాండ్ కూడలిలో మండలంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర– స్వ ర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు, ఒకసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగం పర్యావరణానికి తీవ్ర హానికరమని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎంపీడీఓ సౌభాగ్యం, తహసీల్దార్ రాజశేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ రమణకుమార్, వెలుగు ఏపీఎం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో గంజాయి బాచ్ హల్చల్ తిరుపతి కల్చరల్: నగరంలోని గోవిందరాజస్వామి ఆలయం ఎదుట ముగ్గురు యువకులు గంజాయి మత్తులో కర్రలతో హహల్చల్ చేయడంతో దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆందోళనకు గురైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్న యువకుల ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిపై మత్తులో ఉన్న యువకులు ఎదురు తిరగడం కనిపించింది. గోవిందరాజస్వామి ఆలయం ఎదుట గంజాయి బ్యాచ్ ఆగడాలపై స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. పంటలపై ఏనుగుల దాడులు భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలంలోని బొగలవారిపల్లిలో శుక్రవారం రాత్రి ఏనుగులు పంటలపై దాడులు చేసి, తీవ్ర నష్టం కలిగించాయి. మామిడి తోటలు, నేపియర్ గడ్డి, నీటి పైపులను ఏనుగులు ధ్వంసం చేశాయని గ్రామానికి చెందిన రైతులు అమరేంద్ర, చంద్రశేఖర్, చెల్లమ్మ, మునిచంద్ర, విశ్వనాథం ఆవేదన వ్యక్తం చేశారు. -
పంటలపై ఏనుగుల దాడులు
చిన్నగొట్టిగల్లు మండలంలోని బోగలవారిపల్లె లో పంటలపై ఏనుగులు దాడులు చేశాయి. దీంతో పంట నష్టం జరిగింది.ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు పటిష్ట భద్రత తిరుపతి అర్బన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాత పరీక్షలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు డీఆర్వో నరసింహులు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో ఆయన పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లు ఫ్లయింగ్ స్క్వాడ్గా పనిచేస్తారని చెప్పారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,688 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,264 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు!
తిరుపతి సిటీ: జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్టికెట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ మేరకు విద్యార్థులు శనివారం తమ హాల్టికెట్లను బీఐఈ వెబ్సైట్ ద్వారా లేదా 9552300009 వాట్సప్ నంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పాత హాల్టికెట్ నంబర్ను ఎంటర్ చేసి హాల్టికెట్ పొందవచ్చని, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ సెకండ్ ఇయర్ హాల్టికెట్ నంబర్లతో హాల్టికెట్లు పొందవచ్చని తెలిపారు. విద్యార్థి ఫొటో, సంతకంలో తేడా ఉన్నా సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శనివారం టవర్ల నిర్మాణ కాంట్రాక్టర్లతో సీఎండీ శివశంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు, సాంకేతికంగా అవసరం ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ టవర్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించి, టెండర్లను ఖరారు చేశామన్నారు. అయితే టవర్ల నిర్మాణంలో నాణ్యతను మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా ఆ పనులను చేపట్టే ముందు సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్షను నిర్వహిస్తున్నామని తెలిపారు. టవర్ల నిర్మాణానికి వినియోగించే పరికరాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, టవర్ డిజైన్, టవర్ల మధ్య నిర్దేశిత దూరం కచ్చితంగా ఉండేలా పనులను చేపట్టాలని కోరారు. ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమీక్షలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ఖాన్, కె.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ జె. రమణాదేవి, జనరల్ మేనేజర్లు శ్రీనివాసులు, జగదీష్, కాంట్రాక్టర్లు అభిషేక్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
తిరుపతి సిటీ: జిల్లాలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం జరగనుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కోసం జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 100 మంది విద్యార్థులు, జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్లో 650 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 750 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, పరీక్ష సమయానికి ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని హెచ్చరించారు. ఎట్టకేలకు ప్రీ పీహెచ్డీ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఎస్వీయూలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన ప్రీ పీహెచ్డీ–2025 పరీక్షల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు పలుసార్లు వర్సిటీ అధికారులకు విన్నవించారు. దీంతో శనివారం ఫలితాలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ డీన్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. -
చేతిచమురు వదులుతోంది!
బండి బయటకు తీయాలంటే భయపడే కాలం వచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా రూ.3 పెరిగి మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన పెట్రో ధరలతో వాహనచోదకులకు పెనుభారం తప్పడం లేదు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రో ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఇంధన భారం పడి ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతి అర్బన్: చంద్రబాబు సర్కార్ సామాన్యుల నడ్డి విరుస్తోంది. పన్నుల మినహాయింపు లేకపోవడంతో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో ఇంధనం ధరలు అధికంగా ఉండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.3 పెంచడం చర్చినీయాంశంగా మారింది. సాధారణంగా లీటర్పై 25 పైసలు పెంచితేనే ప్రైవేటు వాహనాలు, ఆటోలు పెద్ద మొత్తంలో చార్జీలు పెంచడం తెలిసిందే. అలాంటిది ఏకంగా రూ.3 పెంచడంతో ఇష్టారాజ్యంగా ప్రైవేటు వాహనాలు, ఆటోల యజమానులు రవాణా చార్జీలు పెంచుకుంటున్నారు. మరోవైపు ఇంధనం ధరలు పెరగడంతో కూరగాయలు, పప్పులు, ఇతర సరుకుల ధరలు సైతం పెంచే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 189 పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. రోజుకు 7.4 లక్షల లీటర్ల పెట్రోల్, 5.6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోంది. ఈ లెక్క ప్రకారం రోజుకు రూ.12 కోట్లు జిల్లా వ్యాప్తంగా ఇంధనం విక్రయాలు సాగుతున్నాయి. లీటర్పై రూ.3 పెంచడంతో 12 లక్షల లీటర్లపై రోజుకు రూ.36 లక్షల అదనపు భారం వాహనచోదకులపై పడుతుంది. లబోదిబోమంటున్న రైతులు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతులు తమ పొలాలను దుక్కులు చేస్తున్నారు. అయితే డీజిల్ ధరలు పెరగడంతో నిన్నటి వరకు ట్రాక్టర్ గంట దుక్కి దున్నితే రూ.1200 అద్దె తీసుకునేవారు. అయితే శనివారం నుంచి ఈ అద్దె రూ.1450 చేశారు. దీంతో రైతులకు అదనపు భారం పడుతోంది. డీజిల్ ధరలు పెరగడంతో ఐదు ఎకరాలు ఉన్న రైతుకు ఒక్కో సీజన్కు రూ.10 వేలు వరకు అదనంగా పెట్టుబడి పెరుగుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇంధనం లీటర్పై రూ.3 పెంపు -
నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయండి
తిరుపతి అన్నమయ్యసర్కిల్:తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్రానికి తెలిపారు. శనివారం ఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఎంపీ గురుమూర్తి భేటీ అయ్యారు. తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు తిరు పతి విమానాశ్రయం సమీపంలోని ప్రతిపాదిత భూమి ని త్వరగా స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాలు, హాస్టళ్లు, ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రేణిగుంట రైల్వే స్టేషన్ను ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రధా న టెర్మినల్గా అభివృద్ధి చేయాలని, ఇందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. శ్రీకాళహస్తి, నడికుడి రైల్వేలైన్ తుది దశ పనులను వేగవంతం చేయాల న్నారు. సింహపురి ఎక్స్ప్రెస్ను తిరుపతి వరకు పొడిగించాలన్నారు. గూడూరులోని అంబేడ్కర్నగర్ అండర్పాస్ విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని, వెందోడు రైల్వేస్టేషన్లో కృష్ణ, పూరి ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్లు ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి వెస్ట్ రైల్వేస్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అత్యవసరమన్నారు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ప్రతిపాదించిన ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పాలసీ, లా అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్ సైబ ర్ స్పేస్’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందించాలని ఎంపీ, కేంద్రమంత్రిని కోరారు. -
ఐసెట్లో తిరుపతి విద్యార్థికి 4వ ర్యాంకు
తిరుపతి సిటీ:రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీన జరిగిన ఏపీ ఐసెట్–2026 ఫలితాలను ఉన్నత విద్యామండలి శనివారం విడుదల చేసింది. ఎస్వీయూ పరిధిలో 9,405 మంది విద్యార్థులు ఐసెట్కు దరఖాస్తు చేసుకోగా 8,537మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 7,483 మంది ఉత్తీర్ణత సాధించడంతో 87.65 శాతం నమోదైంది. ఎస్వీయూ పరిధిలో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరచి టాప్ టెన్లో చోటు దక్కించుకున్నారు. నెల్లూరుకు చెందిన విద్యార్థి షేక్ ఖజాలియాఖాత్ 161.74 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించగా, 160.80 మార్కులతో తిరుపతికి చెందిన రామచంద్రారెడ్డి 4వ ర్యాంకు సాధించారు. అలాగే 155.20 మార్కులతో అన్నమయ్య జిల్లాకు చెందిన మల్లికార్జున 10వ ర్యాంకు సాధించారు. వీరితో పాటు వినోద్ వెంకటసాయి 14వ ర్యాంకు, మనోనిత్య 15, రంజిత్ 18, టి మాధురి 20, చంద్రగిరి లలిత 24, ఆశిష్ కుమార్ 31, కిరణ్ కుమార్ 34 ర్యాంకులను సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. తిరుపతి జిల్లాలో 91.56 శాతం ఉత్తీర్ణత జిల్లా వ్యాప్తంగా 4 పరీక్ష కేంద్రాలలో జరిగిన ఏపీ ఐసెట్–2026కు 1,598 మంది దరఖాస్తు చేసుకోగా 1,435 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 91.56 శాతంతో 1,314మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది సైతం ఐసెట్ ఫలితాలలో మహిళా అభ్యర్థులే పైచేయి సాధించారు. జిల్లాలో 770 మంది మహిళా అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా ఇందులో 92.33 శాతంతో 711 మంది ఉత్తీర్ణత సాధించారు. -
వైఎస్సార్సీపీ నేత కారుపై దాడి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: నగరంలోని హరేకృష్ణ రోడ్డులో వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల ఉపాధ్యక్షుడు రాజేష్రెడ్డి కారుపై శుక్రవారం గుర్తు తెలియని దుండగులు చేసిన దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో కారు వెనుక వైపు అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న రాజేష్రెడ్డి తన కార్యాలయం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి, అలిపిరి పోలీసుసేష్టన్లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఆకతాయిలు మద్యం మత్తులో బీరు బాటిళ్లతో అద్దాలను పగులగొట్టారనే అనుమానాలకు తావిస్తోంది. అయితే విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి శనివారం సంఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన కారును పరిశీలించి రాజేష్రెడ్డితో మాట్లాడారు. ఎలా జరిగిందని, దీని వెనుక ఎవరైన కుట్ర చేశారా? లేదా అనే విషయాలను ఆరా తీశారు. పోలీసుల విచారణలో ఎవరనేది తెలుస్తుందనే విషయాన్ని రాజేష్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు ఉదయ్ వంశీ, దినేష్రాయల్, మల్లం రవి, ఇమ్రాన్, వాసూ యాదవ్, పసుపులేటి సురేష్, రమణారెడ్డి, అనిల్రెడ్డి, అరుణ్యాద్ తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బకు వ్యవసాయ కూలీ మృతి
ఏర్పేడు: మండలంలోని మడిబాక అరుంధతీవాడకు చెందిన మోటుపల్లి కృష్ణయ్య(47) అనే వ్యవసాయ కూలీ శనివారం వడదెబ్బకు గురై మృతి చెందినట్లు మృతుని కుటుంబసభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మడిబాక అరుంధతీవాడకు చెందిన కృష్ణయ్య శనివారం గ్రామంలోని ఓ రైతు పొలంలో కూలి పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడ నుంచి ఇంటికి చేరుకోగానే నీరసించి కళ్లు తిరిగి కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం తిరుపతిలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. -
ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షల ఫీజు తుది గడువు 19
తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పలు సెమిస్టర్లకు సంబంధించి పరీక్షల ఫీజు గడువు ఈనెల 19వ తేదీతో ముగియనుందని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ స్టడీ సర్కిల్ కోఆర్డిరేటర్ డాక్టర్ జి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలు జూన్ 14 నుంచి 19వ తేదీ వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 21 నుంచి 28వ తేదీ వరకు, రెండో సెమిస్టర్ పరీక్షలు జూన్ 30 నుంచి జూలై 6వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈనెల 19వ తేదీలోపు చెల్లించాలని సూచించారు. అలాగే పలు పీజీ కోర్సులకు సంబంధించి సెకండ్ ఇయర్ పరీక్షలు జూలై 10 నుంచి 15వ తేదీ వరకు, ఫస్ట్ ఇయర్ పరీక్షలు జూలై 17 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ కోర్సులకు సంబంధించి పరీక్ష ఫీజుతో పాటు మరిన్ని వివరాలకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఇంధన పొదుపు సామాజిక బాధ్యత తిరుపతి అన్నమయ్యసర్కిల్: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వాహన వినియోగదారులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొరప్రాటి మురళీమోహన్ మాట్లాడుతూ ప్ర పంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన వినియోగం, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, పర్యావరణ, వాయు కాలుష్యం, భవిష్యత్లో ఏర్పడే ఇంధన కొరత వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును సామాజిక బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మోటారు వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, అతికా నాజ్ పాల్గొన్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి తిరుపతి తుడా: మదనపల్లి డి అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చేపట్టిన వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఇంటర్వ్యూల ప్రక్రియ తిరుపతి రుయా ఆస్పత్రిలో రెండు రోజులపాటు నిర్వహించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఫైవ్ మెన్ కమిటీని నియమించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, రుయా ఏడీ రమేష్ బాబు, మదనపల్లె ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించారు. ఇంటర్వ్యూ అనంతరం మెరిట్ లిస్టును జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
ట్రాక్టర్ అద్దె పెంచేస్తున్నారు
డీజిల్ పెంచారని ట్రాక్టర్ అద్దెను పెంచేస్తున్నారు. దీంతో పెట్టుబడి పెరుగుతుంది. అయితే తీర ఒబ్బిళ్ల సమయంలో వరి పంటతోపాటు ఇతర పంటలకు సరైన గిట్టుబాటు ధర ఉండడం లేదు. సాధారణంగా డీజిల్పై 20 నుంచి 30 పైసలు పెంచితేనే రైతులకు భారం. అయితే ఒక్కసారిగా లీటర్పై రూ.3 పెంచడంతో రైతులకు పెద్ద దెబ్బ. ధరలు పెరగడంతో రైతుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. – బి. శ్రీనివాసులు, రైతు, గొల్లపాళెం, వాకాడు మండలం పెట్రోల్ ధరలు ఇంత ఎప్పుడూ పెంచలేదుసాధారణంగా లీటర్ పెట్రోల్పై 50 లేదా 60 పైసలు పెంచడం చూస్తున్నాం. ఇలా లీటర్పై రూ.3 పెంచడం దారుణం. చిన్నపాటి ఉద్యోగి బడ్జెట్ పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించి, పేదోడికి ఇంధనం భారం పడకుండా చూడాల్సి ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువ ధరలు ఉన్నట్లు తెలుస్తుంది. సామాన్య జనాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతున్నాం. – వినోద్కుమార్, తిరుపతి -
ఇసుక తోడేళ్లు
సోమశిలలో కూటమి నేతలు అధికారం అండతో అక్రమ వ్యాపారాలు జోరుగా సాగిస్తున్నారు. ఇసుక, గ్రావెల్, మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమశిల ప్రాజెక్టులో ఇసుకను తవ్వి చిత్తూరు మీదుగా తమిళనాడు, కర్ణాటకకు రవాణా చేస్తున్నారు. పూతలపట్టు, చిత్తూరు నగర శివార్లలో డంప్ చేసి రాత్రిళ్లు టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. పూతలపట్టు పోలీసులు కాపుకాచి టిప్పర్లను పట్టుకోవడంతో అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో తిరుపతికి చెందిన ఓ ప్రధాన ఆలయ చైర్మన్ బంధువులే ప్రధాన భూమిక పోషిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. సాక్షి టాస్క్ఫోర్స్ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని గుడిపాల మీదుగా తమిళనాడులోని కాట్పాడి, బంగారుపాళెం, పలమనేరు మీదుగా కర్ణాటకకు తరలుతోంది. పూతలపట్టు, చిత్తూరు నగర శివార్లలో డంప్లు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి రాత్రిళ్లు టిప్పర్లతో సరిహద్దు రాష్ట్రాలకు తరలించడం ఈ మాఫియా స్టైల్ ఆపరేషన్గా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మాఫియాకు ముందస్తు సమాచారం, రూట్ క్లియరెన్స్ ఇచ్చే వ్యవస్థీకృత నెట్వర్క్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో తిరుపతిలోని ఓ ప్రధాన ఆలయ చైర్మన్ బంధువుల పాత్ర ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే పేరుతో ఇసుక వ్యాపారం నడిపిస్తూ, మధ్యవర్తులు, ట్రాన్స్పోర్ట్ యజమానుల ద్వారా భారీగా డబ్బు చేతులు మారుతోందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని ధర్మపురికి చెందిన మరో కీలక వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. కూటమి నేతల ఆదాయ వనరుగా సోమశిల కాపు కాచి పట్టేశారు పోలీసులు శనివారం తెల్లవారుజామున పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ వద్ద టిప్పర్ను పట్టుకున్నారు. పరిశీలనలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తేలింది. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్, క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఇసుకను నెల్లూరు వైపు నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారులు ఇంకా వెలుగులోకి రాకపోవడంతో విచారణ మరింత వేగవంతమైంది. ఇప్పటికే కొందరి పేర్లు అనుమానితుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగించే ఈ అక్రమ ఇసుక రవాణా వెనుక ఉన్న ‘‘పెద్ద తలలు’’ బయటపడతాయా? లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
‘శ్రీవాణి టికెట్ల జారీలో అడ్డంగా దొరికిన టీటీడీ’
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవాణి టికెట్ల జారీలో టీటీడీ అడ్డంగా దొరికిపోయిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి టికెట్ల జారీ విధానంలో దోపిడి కొనసాగుతోందని ఆరోపించారు. సెక్యూరిటీ అడిట్ లేని పాత సాఫ్ట్వేర్నే టీటీడీ కొనసాగిస్తోందని మండిపడ్డారు. టీటీడీ పెద్దలు బరితెగించి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను స్వయంగా శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే లభించలేదు. ఉదయం 9 గంటలు ఒక నిమిషానికే 800 టికెట్ల జారీ పూర్తి అయినట్లు చూపిస్తోంది. ఉదయం 8.50 నుంచి టికెట్ల కోసం సిద్ధంగా ఉంటే 9.01 నిమిషాలకే టికెట్ల అమ్మకాలు పూర్తి అయినట్లు ఆన్లైన్లో చూపించింది. ఆటో ఫిల్లింగ్ ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిపై ఏమాత్రం లెక్కలేని తనంతో టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తున్నారు.ఎస్ఈడీ టికెట్ల జారీకి ఆటో ఫిల్లింగ్ విధానం లేదు. చంద్రబాబు అనుమతితో ఈ దోపిడి జరుగుతోందని అనుకోవాలి. టీటీడీ పెద్దలు బరితెగించారు, దోపిడి చేస్తున్నారు. టీటీడీ దృష్టికి తీసుకు వచ్చిన తర్వాత కూడా సరిదిద్దుకోలేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజుకు 40 లక్షలు రూపాయలు అవినీతి శ్రీవాణి టికెట్ల ద్వారా జరుగుతోంది. బ్లాక్లో టికెట్లను అమ్మే వారి ద్వారా దర్శనాలు జరుగుతున్నాయి. సామాన్యులకు దర్శనం టికెట్లు లభించడం లేదు. రూ.300 టికెట్లను మూడు వేలకు బ్లాక్లో అమ్ముతున్నారు.రోజుకు ఐదువేల బ్రేక్ దర్శనం టికెట్లను ఇస్తున్నారు. వీటిలో రెండు వేల టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్నారు. ఒక్కోటి 5 నుంచి 8వేల వరకు అమ్ముతున్నారు. త్వరలో ఆధారాలతో నిరూపిస్తాం. టీటీడీలో శ్రీవాణి టికెట్ల స్కాం ద్వారా 48 కోట్ల అవినీతి జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో ఈ దోపిడీ జరుగుతోంది. ట్రావెల్ ఏజెంట్లు ద్వారా అమ్ముతున్నారా అనే దానిపై సమగ్ర విచారణ జరపాలి. హైందవ పెద్దలు దీనిపై వెంటనే స్పందించాలి కోరుకుంటున్నా అని కోరారు. -
మీ బిడ్డను బడికి పంపే వరకు ఇక్కడే ఉంటా
తిరుపతి జిల్లా: మీ బిడ్డను బడికి పంపే వరకు మీ ఇంటి వద్దనే ఉంటానని ఎంఈఓ రవీంద్రనాథ్ విద్యార్థుల తల్లిదండ్రుల తెలిపారు. మండలంలోని పల్లమాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు రాయడానికి ప్రత్యేక తరగతుల జరుగుతున్నాయి. 32 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా ఐదుగురు మాత్రమే సప్లమెంటరీ తరగతులకు హాజరవుతున్నారు. ఇది తెలుసుకున్న ఎంఈఓ రవీంద్రనాథ్ శుక్రవారం పల్లమాల, పార్లపల్లి, పచ్ఛాలమ్మ కాలనీలో పదో తరగతి ఫెయిల్ విద్యార్థులను సప్లమెంటరీ ప్రత్యేక తరగతులకు పంపించాలని ఇళ్లకు వెళ్లారు. విద్యార్థులను సప్లమెంటరీ ప్రత్యేక తరగతులకు పంపాలని ఇళ్లకు వెళ్లిన ఎంఈఓ తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. మా బిడ్డను మేము తీసుకుని వస్తాం మీరు వెళ్లండి సార్ అని తల్లిదండ్రులు తెలిపారు. ఎంఈఓ మీ బిడ్డను బడికి పంపే వరకు మీ ఇంటి వద్దనే కుర్చి వేసుకుని కూర్చుంటానన్నారు. ఇంటి వద్ద నుంచి ఎంఈఓ కదలకపోవడంతో చివరకు తల్లిదండ్రులకు బడికి పంపారు. 12 మంది విద్యార్థులను ఎంఈఓ పాఠశాలకు తీసుకొచ్చారు. అయితే ప్రధానోపాధ్యాయురాలు చేయాల్సిన పనిని ఎంఈఓ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు విధులకు రావడం లేదని, ఆమె పట్టించుకోక పోవడంతోనే విద్యార్థులకు సప్లమెంటరీ ప్రత్యేక తరగతులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. -
కష్టేఫలి.. ర్యాంకులే మరి
పేట్రేగిపోతున్న భూ మాఫియా భూమాఫియా పేట్రేగిపోతోందని వైఎస్సార్ సీసీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి ఆరోపించారు. ఒక్కొక్కరిది ఒక్కొ కష్టం.. ఒక్కొక్కరి ఒక్కొ సమస్య.. అయితేనేం వారి లక్ష్యం ముందు కష్టాలు చిన్నబోయాయి. చదువుకోవాలన్న వారి జిజ్ఞాస ఎదుట పేదరికం తలవంచింది. వారి అకుంఠిత దీక్ష, దృఢ చిత్తానికి సమస్యలు సలాం చేశాయి. ఫలితంగా పేదింటి బిడ్డలు ఏపీపీజీఈసెట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి అబ్బుర పరిచారు. నాగలాపురం: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్ 2026– పరీక్షలో నాగలాపురం మండలం, ఎస్.ఎస్.పురం గ్రామానికి చెందిన దాసరి సుధాకర్, లోకమ్మ దంపతుల కుమార్తె కీర్తన ప్రతిభ చాటింది. బయోటెక్నాలజీపై ఆసక్తితో విజయవాడలో బీటెక్ బయో టెక్నాలజీ పూర్తి చేసింది. ఎంటెక్ బయోటెక్నాలజీలో ప్రవేశం పొందేందుకు ఇంటి వద్దే స్వీయ శిక్షణ పొందిన కీర్తన 61 మార్కులతో రాష్ట్రస్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించింది. ఆమె ప్రాథమిక విధ్యను నాగలాపురంలో పూర్తి చేసింది. అనంతరం పుత్తూరులో ఉన్నత విద్య అభ్యసించింది. తండ్రి కష్టాన్ని గుర్తించిన తనయ కీర్తన పట్టుదలతో చదివి బయోటెక్నాలజీలో డాక్టరేట్ చేసి సేవ చేయాలన్న తపనతో ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొంది. గ్రామీణ ప్రాంత విధ్యార్థిని తొమ్మిదో ర్యాంకు సాధించడంపై గ్రామస్తులు, కుటుంబసభ్యులు, స్నేహితులు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన కష్టాలు కూతురు పడకూడదని.. చదువుల ‘కోట’ తొట్టంబేడు: రైతు కుటుంబంలో పుట్టిన కోట గురువర్ధన్ చదువుల కోట అని పలువురు ప్రశంసిస్తున్నాడు. కోట గురువర్థన్ ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా ఇంటి వద్దే కూర్చుని చదివి, మెకానికల్ ఇంజినీరింగ్ ఎంటెక్ ప్రవేశపరీక్షలో రాష్ట్రస్థాయి 37వ ర్యాంకు, నానో టెక్నాలజీలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. ఇతడు ఒకటి నుంచి పదో తరగతి వరకు తొట్టంబేడు మండలం చియ్యవరం జెడ్పీ హైస్కూల్లో తెలుగు మీడియం చదివాడు. అనంతరం ఇంటర్ తిరుపతిలోని భాష్యం కాలేజీ పూర్తి చేశాడు. పుత్తూరు సిద్ధార్థ కాలేజీ బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదవి, 91 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఆరు నెలల పాటు చైన్నెలో మెకానికల్ డిజైనర్ వర్క్ చేశారు. ఇంతటితో ఈ చదువు ఆగకుండా ఉన్నత విద్య ప్రవేశం కోసం ఏపీపీజీఈసెట్ రాసి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. తాను పడిన కష్టాలు తన పిల్లలు పడకూడదన్న ఆలోచనతో తన కుమార్తె కీర్తనను కష్ట పడి చదివించారు ఎస్ఎస్పురానికి చెందిన దాసరి సుధాకర్ తలిచారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో లైన్మన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన తన కూతురి చదువు విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. తన కూతురు చదువులో ప్రతిభ కనబరుస్తుండడంతో, ఆమెను డాక్టర్ చేయాలనే ఆశయాన్ని గుండెల్లో పెట్టుకుని చదివించారు. -
నవ్విపోదురుగాక.. నాకేంటి!
తిరుపతి సిటీ: నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి. 2023లో వర్సిటీల్లో అధ్యాపక పోస్టులకు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు సైతం చేసుకున్నారు. నియామక ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. దీంతో గత ప్రభుత్వం ఇచ్చిన అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది. కానీ మళ్లీ అదే నోటిఫికేషన్ను మసిబూసి మారేడు కాయచేసి బాబు సర్కార్ శుక్రవారం విడుదల చేయడంపై ఇదేమి విడ్డూరమని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యావేత్తలు అంటున్నారు. క్రెడిట్ చోరీలో వారికి వారే సాటి గత ప్రభుత్వం చేసిన మంచిని చెడుగా చూపించడం, అదే మంచిని తాము చేస్తున్నామంటూ క్రెడిట్ చోరీ చేసి మళ్లీ ప్రజల ముందుంచడం బాబు అండ్ కోకు వెన్నతో పెట్టిన విద్య. ఎస్వీయూ, ద్రవిడ, పద్మావతి మహిళా యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడమే ఇందుకు నిదర్శనమని వర్సిటీల్లో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లనే మళ్లీ విడుదల చేశారు తప్ప ఇందులో కొత్తదనం కానీ, పోస్టులు పెరగడం కానీ ఏమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రోస్టర్ విధానం గందరగోళంగా ఉందని, నోటిఫికేషన్ విడుదల కాకముందే రోస్టర్ విధానాన్ని అమలు చేయడంపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నూతన నోటిఫికేషన్ వివరాలు ఉన్నత విద్యామండలి ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీల్లో పలు అధ్యాపకపోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎస్వీయూలో రెగ్యులర్, బ్యాక్ లాగ్ కలిపి 125 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో రిజర్వేషన్ల కేటగిరీలతో కలిపి 86 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. అలాగే పద్మావతి మహిళా వర్సిటీలో రెగ్యులర్, బ్యాక్ లాగ్ కలిపి 48 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 18వ తేదీ నుంచి వచ్చేనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు. అర్హత, దరఖాస్తు వివరాలకు ఆయా వర్సిటీల అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. -
ఇదే ఆఖరి నోటీసు
తిరుపతి అర్బన్: ఇదే ఆఖరి నోటీసు.. పాఠశాలకు ఉపాధ్యాయులు హజరుకాకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈఓ కేవీఎన్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొందరు ఉపాధ్యాయులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా దీర్ఘకాలంగా పాఠశాలకు రావడం లేదని తెలిపారు. ప్రధానంగా ఓజిలి మండలంలోని ఓజిలి జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఎం.సుమనకుమారికి 2024 డిసెంబర్ 1 నుంచి పలుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆమె ఇప్పటి వరకు విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. అలాగే దొరవారిసత్రం మండలంలోని కల్లూరు జెడ్పీ హైస్కూలులో గణితం(స్కూల్ అసిస్టెంట్)ఏ. విశ్వనాథానికి 2024 మార్చి 29 నుంచి పలుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఇప్పటి వరకు విధులకు హాజరుకాలేదని స్పష్టం చేశారు. ఇకపై పాఠశాల విధులకు హాజరుకావాలని కోరుతున్నామని, లేకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 5 నుంచి ‘సర్’ తిరుపతి అర్బన్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 5 నుంచి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు ఎస్ఐఆర్పై ఓటర్ల జాబితాకు సంబంధించి సన్నాహాలు, శిక్షణతోపాటు ముద్రణ ఉంటుందని చెప్పారు. అలాగే జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బూత్లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) ఇంటింటా పర్యటిస్తారని చెప్పారు. మరోవైపు జూలై 14వ తేదీన పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జూలై 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తామని పేర్కొన్నారు. అలాగే జూలై 21 నుంచి ఆగస్టు 20 తేదీ వరకు దావాలు, అభ్యంతరాల కాలం జరుగుతుందన్నారు. మరోవైపు జూలై 21 నుంచి సె ప్టెంబర్ 18వ తేదీ వరకు నోటీసు దశ, పరిష్కారానికి సంబంధించిన దావాలు, అభ్యంతరాలు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. చివరిగా సెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామన్నారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం తిరుమల: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన తిరుమలశెట్టి భవిష్ కృష్ణ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళం ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. వచ్చే నెల 5న ఎస్వీయూ స్నాతకోత్సవం తిరుపతి సిటీ: ఎస్వీయూ 63 నుంచి 68వ స్నాతకోత్సవాలను వచ్చేనెల 5వ తేదీన నిర్వహించనున్నారు. కాగా ఇప్పటి వరకు కాన్వొకేషన్కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ఇన్అడ్వాన్స్డ్ డిగ్రీకి దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు పూర్తి అయిన తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించకూడదని పరీక్ష విభాగాధికారులకు ఆయన సూచించారు. సాధారణ రోజుల్లోనూ తిరుచానూరులో భక్తుల రద్దీ తిరుపతి అర్బన్: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్ఓ మురళీకృష్ణతో కలసి మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రోడ్డు విస్తరణతోపాటు వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన అంశాలపై చర్చించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అడిషనల్ ఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి ఆర్టీఓ రామ్మోహన్, ఏడీ సర్వేయర్ అరుణ్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఆర్అండ్బీ ఎస్ఈ సుధాకర్ నాయక్, తుడా ఎస్ఈ రవీంద్ర, తుడా సీపీఓ దేవి పాల్గొన్నారు. -
గరుడ వారధి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
తిరుపతి క్రైం : నగరంలోని గరుడ వారధి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కరకంబాడి వైపు నుంచి లీలామహల్ సర్కిల్ దిశగా వస్తున్న ఫ్లై ఓవర్పై శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నంద్యాల జిల్లాలోని జూపాడు బంగ్లా మండలం పాయమంచాలకు చెందిన ఆదిలక్ష్మి (24) కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి కోసం తిరుపతికి వలస వచ్చింది. ఆమె, తన అన్నతో కలిసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం ఉదయం అనూహ్యంగా గరుడ వారధిపై నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి రాపూరు: పెంచలకోన –ఏర్పేడు రహదారిలోని రాపూరు మండలం సిద్ధవరం బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాళహిస్తి మండలం వీ.ఎం. పల్లి గ్రామానికి చెందిన ఐదుగురు ఆటోలో పెంచలకోనకు బయలుదేరారు. రాపూరు నుంచి వెంకటగిరి వైపు వెళుతున్న బోలెరో వాహనం సిద్ధవరం బ్రిడ్జి వద్ద ఆటోను ఢీ కొంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచా రం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని రాపూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పసల పద్మమ్మ (50)మృతి చెందారు. గురవమ్మ, లక్ష్మినసింహ, శ్రావణి, చంద్రకి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇరువర్గాల ఘర్షణ.. కేసు నమోదు వరదయ్యపాళెం: మండలంలోని బత్తలవల్లంలో భూ వివాదమై ఇరువర్గాలు ఘర్షణ పడ్డా యి. ఈ విషయమై రెండు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జున్ తెలిపారు. మండలంలోని బత్తలవల్లంలో తమ అధీనంలోని భూమిలో అక్రమంగా ప్రవేశించిన చెల్లయ్యను ప్రశ్నించినందుకు చెల్లయ్యతో పాటు అతనికి మద్దతుగా బంధువులైన వంశీ, వనమ్మ, రాజేశ్వరి, నిర్మల అనే వ్యక్తులు తనతో పాటు తనకు అండగా అడ్డు వచ్చిన మునెమ్మను కరల్రతో దాడి చేసి గాయపరిచారని రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే తమ భూమిలో భూ అభివృద్ధి పనులు చేసుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన రమణయ్య, దినేష్, భాస్కర్, అభిషేక్ మూకుమ్మడిగా తనపై దాడి చేయగా తనకు మద్దతుగా అడ్డు వచ్చిన చాన్వి, వనమ్మపై కర్రలతో దాడి చేశారని చెల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం రైల్వేకోడూరు అర్బన్: పట్టణంలోని రైల్వేస్టేషన్లో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి ఇంటర్సిటీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు జీన్స్ప్యాంటు, తెల్లచొక్కా ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఉచిత ఫుట్బాల్ శిక్షణ ప్రారంభం రేణిగుంట: మండలంలోని గాజులమండ్యం పంచాయతీ, పీ,ఎం,హైస్కూల్ మైదానంలో జే, ఎఫ్,ఏ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఫుట్బాల్ కోచింగ్ ను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పాస్టర్ డాక్టర్ కేపీ లూథర్ బాబు, ఎస్ఐ హరీష, చైర్మన్ కె.పి జయకర్, యేసురత్నం పాల్గొన్నారు. అతిధుల చేతుల మీదుగా అమ్మగుంట ఫౌండేషన్ వారు 150 జెర్సీలను పిల్లలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఉదయం 5.30 నుంచి 7. 30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు కోచింగ్ ఇస్తారని తెలిపారు. కోచింగ్లో పాల్గొన్న పిల్లలకు ప్రతి రోజు పాలు , గుడ్డు, అరటిపండు అందిస్తామన్నారు. కార్యక్రమంలో రెవరెండ్ సతీష్, రెవరెండ్ దీపక్, రెవరెండ్ నోవా, డాక్టర్ సుధాకర్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ ఉమా, తిరుపతి కోచ్ రమేష్, ఎక్స్ఆర్మీ రాజకుమార్, రమేష్, సీనియర్ కోచ్ దీన దయాకర్, సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ శేఖర్ పరమానందం, కెపి దివాకర్, శ్రీరాజ్, శ్రీపతి పాల్గొన్నారు. వరదయ్యపాళెం: శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి గురువారం రాత్రి సత్యవేడు గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ ధర్మకర్త గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. -
ఉపాధికి.. సరికొత్త పాలిటెక్నిక్
పాలిటెక్నిక్..ఇది పేదలకు ఇంజినీరింగ్ వంటిది. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆసక్తి చూపే విద్య.. 19 ఏళ్లకే ఉపాధి చూపే కోర్సు.. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కోర్సు ఈ ఏడాది నుంచి కొత్తరూపు సంతరించుకోనుంది. సిలబస్ మారనుండంతో విద్యార్థులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. తిరుపతి సిటీ: పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులు ఈ ఏడాది నుంచి రూపురేఖలు మారుతున్నాయి. సాంకేతిక విద్యామండలి నూతన సిలబస్తో టెక్నికల్ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు పాలిటెక్నిక్ డిప్లొమో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి నూతన సిలబస్ ‘సీ–26 కరిక్యూలమ్’ అమలు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పారిశ్రామిక వేత్తలు, ఐఐటీ నిపుణులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో పలుసార్లు వర్క్షాపులు నిర్వహించి కసరత్తు పూర్తి చేశారు. జిల్లాలోని ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి సరికొత్త పాలిటెక్నిక్ విద్యను విద్యార్థులు అభ్యసించనున్నారు. ప్రతి కోర్సులోనూ ఏఐ తప్పనిసరి నూతన సీ–26 కరిక్యులమ్లో భాగంగా ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్ డిప్లొమోలోని అన్ని బ్రాంచీల్లో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ సిలబస్ను రూపొందించారు. ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ టెక్నాలజీని ప్రతి విద్యార్థీ డిప్లొమో స్థాయిలోనే పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలనే ఉద్ధేశంతో అన్ని కోర్సుల్లోనూ ప్రవేశ పెట్టనున్నారు. అలాగే కంప్యూటర్ డిప్లొమో బ్రాంచ్లకు ప్రత్యేకంగా ఏఐతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ సబ్జెక్టును ప్రవేశపెట్టనున్నారు. పారిశ్రామిక అవసరాలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా పాలిటెక్నిక్ కోర్సుల రూపురేఖలను మార్చినట్లు అధికారులు వెల్లడించారు. అన్ని కోర్సులకు 3 ఏళ్ల కాలవ్యవధి పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల కాలవ్యవధి సాధారణంగా మూడు ఏళ్ల వరకు ఉంది. కానీ స్పెషల్ డిప్లొమో ఇన్ బయోమెడికల్ ఇంజినీరింగ్ వంటి పలు కోర్సులకు మాత్రమే మూడు సంవత్సరాల ఆరు నెలల కాలవ్యవధి ఉండేది. కానీ ప్రస్తుత నూతన సిలబస్ ప్రకారం అన్ని పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులకు ఈ ఏడాది నుంచి మూడు ఏళ్ల కాలవ్యవధి మాత్రమే ఉండనుంది. అలాగే సబ్జెక్ట్ ఎంపికలోనూ మార్పులు చేయనున్నారు. మూడో సెమిస్టర్ నుంచి ఐదో సెమిస్టర్ వరకు ఎంచుకున్న పాఠ్యాంశాలు ఉండగా దీంతో పాటు ఓపెన్ ఎలక్టివ్ సెబ్జెక్ట్ను ఏ బ్రాంచి వారైనా ఎంచుకునేందుకు వీలుకల్పించనున్నారు. ఆరో సెమిస్టర్లో పూర్తిస్థాయిలో యథావిధిగా ఇండస్ట్రీయల్ ట్రైనింగ్, ప్రాజెక్టు వర్క్ ఉండనుంది. దీంతో పాటు సెమిస్టర్, మిడ్ పరీక్షల నిర్వహణలోనూ పలు మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. మిడ్ పరీక్షలకు గతంలో 20 శాతం వెయిటేజి మార్కులు ఉండగా ఈ ఏడాది నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మిడ్ పరీక్షలకు 30 శాతం కేటాయించనున్నారు. -
వెంకటగిరిలో పేట్రేగిపోతున్న భూ మాఫియా
వెంకటగిరి(సైదాపురం): పట్టణంలో రోజు రోజుకు భూ మాఫియా పెట్రేగిపోతుందని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతల ప్రమేయం లేకుండా వెంకటగిరిలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ఈ విషయమై అధికార పార్టీకి కొమ్ము కాసే పత్రికల్లోలోనే వెంకటగిరిలో భూ మాఫియాపై కథనాలు ప్రచురితమవుతున్నా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. పట్టణంలో అసైన్డ్ భూముల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బఫర్జోన్ కూడా వదలకుండా లేఅవుట్లు వేసి రూ. కోట్లు దండుకుంటున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రికార్డుల మారుస్తూ భూ కబ్జాల్లో అధికారుల పాత్రపై ప్రముఖ దినపత్రికల్లో వరస కథనాలతో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని విమర్శించారు.అధికారులు అక్రమాలకు సహకరిస్తే భవిష్యత్తులో అవస్థలు తప్పవని హెచ్చరించారు. వెంకటగిరిలో ఆక్రమణలపై ఢిల్లీలో ఉన్న గ్రీన్ ట్రిబునల్కి కూడా ఫిర్యాదు చేశామన్నారు. కాగ వెంకటగిరి పట్టణంలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు రికార్డులు మార్చి లే అవుట్లు వేసినా వారిపై చర్యలు తీసుకునేలా పోరాటం సాగిస్తామన్నారు. త్వరలోనే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆక్రమణలపై భూ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. అక్రమాలు, ఆక్రమణలు, భూ దందాలు , భూ మాఫియా జరుగుతుడడంతో అధికారపార్టీ అనుకూల పత్రికల్లో కథనాలు రాయడం విస్మయానికి గురిచేస్తుందన్నారు. ఈ వ్యవహారశైలి అంతా ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదని మరోసారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మండల అధ్యక్షుడు పులి ప్రసాద్రెడ్డి, కాల్తిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వెందోటి కార్తీక్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తీపి కబురు
సరికొత్త పాలి‘టెక్నిక్’ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఈ ఏడాది నుంచి రూపురేఖలు మారనున్నాయి. నూతన సిలబస్ అమలు చేయనున్నారు.రైతులకు శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026శ్రీవేంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం జిల్లా రైతులకు తీపి కబురందింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషితో శ్రీవేంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫ్యాక్టరీ ఆస్తుల పరిరక్షణతోపాటు షేర్హోల్డర్లు అయిన రైతులకు మేలు జరగనుంది. ఉద్యోగులకు జీవనోపాధి కలగనుంది. దీనిపై ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి అర్బన్: రేణిగుంట మండలంలోని గాజులమండ్యం శ్రీవేంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. మూతపడిన ఫ్యాక్టరీని తిరిగి చెరుకు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్ లభించింది. రెండేళ్లుగా రైతుల పక్షాన పోరాటం చేస్తున్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలించింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ వార్తతో షెర్హోల్టర్లు అయిన 13 వేల మంది రైతులు, 850 మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.2,150 కోట్లు ఆస్తికి భద్రత శ్రీవేంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని 165 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీకి వచ్చిన ఆదాయంతో పుత్తూరు మార్గంలోని అంజేరమ్మకనం వద్ద 20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మొత్తం 185 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 2,150 కోట్లు పలుకుతుందని రైతులు అంటున్నారు. ప్రధానంగా ఆ భూములను కొందరు బడా నేతలు కబ్జాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రభుత్వ ఆస్తులకు భద్రత లభించిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.బాబు పాలనలో రెండు సార్లు మూత శ్రీవేంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ 1972లో రోజుకు 1,250 టన్నులు చెరుకు క్రషింగ్ సామర్థ్యంలో అప్పటి ప్రభుత్వం 165 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. అయితే 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చెరుకు సాగు తగ్గిందంటూ ఫ్యాక్టరీని మూత వేశారు. ఆ తర్వాత రైతులు అభ్యర్థన మేరకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్యాక్టరీని 2004–05 సీజన్లో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా రోజుకు 1,650 టన్నులు క్రషింగ్ చేసే సామర్థ్యం పెంచారు. ఫ్యాక్టరీ ఎండీగా జాయింట్ కలెక్టర్ హోదా ఉన్న వ్యక్తిని నియమించారు. అయితే 2015లో చంద్రబాబు పాలనలో జాయింట్ కలెక్టర్ హోదా ఉన్న అధికారికి కాకుండా సాధారణ ఉద్యోగికి ఎండీ పగ్గాలు కట్టపెట్టారు. ఈ క్రమంలో వారు ఫ్యాక్టరీ పరిధిలో కేవలం 25 వేల టన్నులు మాత్రమే చెరుకు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలోనే 2015లో మరోసారి మూతవేశారు. రైతులు తిరిగి ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకురావాలని తమకు చెరుకు పంట సాగు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ఓ సంఘంగా ఏర్పడి పోరాటాలు చేస్తున్నారు. చివరిగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సహకారంతో సమస్యను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఎంపీ పదే పదే కేంద్రానికి తెలియజేయడంతో తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీకి మోక్షం కేంద్ర సహకార మంత్రిత్వశాఖ సానుకూలం శ్రీవేంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం పునరుద్ధరణ, ఆధునీకరణ అంశంపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు కేంద్ర సహకార శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం నేను ఈ చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంతోపాటు ఆధునీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి పలుసార్లు తీసుకెళ్లాను. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. –మద్దిల గురుమూర్తి, పార్లమెంట్ సభ్యుడు, తిరుపతి -
విద్యార్థి.. వలస పథం
●గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం పట్టణాలకు వలసబాట పడుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నా లెక్క చేయక చేర్చుతున్నారు. ఏటా ప్రభుత్వ కళాశాల్లో అడ్మిషన్ల సంఖ్య పడిపోతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో సర్కారు జూనియర్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. తిరుపతి సిటీ: రెండేళ్ల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల పరిస్థితి దారుణంగా దిగజారిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో సీట్ల కోసం విద్యార్థులు పోటీపడేవారు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి స్థాయిలో సిఫార్సు లేఖలు, ఫోన్కాల్స్ తో సీట్ల కోసం విద్యార్థులు కళాశాల వెంటపడేవా రు. అలాంటి పరిస్థితి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల అంటేనే అటు వైపు కన్నెత్తి చూడని స్థితికి చేరింది. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, పర్యవేక్షణ లోపం, ఇంటర్ ఫలితాల సరళి, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఆశించిన స్థాయిలో విద్య అందకపోవడమే నని విద్యావేత్తలు చెబుతున్నారు. దీనికితోడు ప్రభు త్వ కాలేజీల్లో మౌలిక సదుపాయాలపై పది పాసైన విద్యార్థులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే వాదన వినిపిస్తోంది ప్రైవేటు వైపు పరుగులు గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు తమ పి ల్లలను పట్టణంలోని పేరొందిన ప్రైవేటు కాలేజీలో చేర్పించాలనే తపనతో రూ.లక్షల ఫీజు ఉన్నా.. లె క్క చేయకుండా పట్టణ ప్రాంతాలవైపు చూస్తున్నా రు. అందులోనూ ప్రైవేటు యాజమాన్యాలు గ్రా మీణ ప్రాంతాల్లో పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను నేరుగా కలిసి తమ కళాశాలల్లో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామంటూ మభ్యపెట్టే ప్రయత్నా లు చేస్తున్నాయి. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు విజయవాడ, తిరుపతి, నెల్లూరు, వైజాగ్ వంటి ప్రాంతాల్లో పేరొందిన కళాశాలలకు వలస వెళుతున్నారు. గత ఏడాది జిల్లాలో పదో తరగతి 21,298 మంది ఉత్తీర్ణులు కాగా ఇందులో సుమారు 14 వేల మంది విద్యార్థులు పట్టణాల్లో ఇంటర్ చేరేందుకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 22,235 మంది ఉత్తీర్ణులు కాగా సర్కారు కాలేజీల్లో ఎంతమంది చేరుతారు చూడాల్సి ఉంది. రెండేళ్లుగా పరిస్థితి ఇదీ... జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా గత ఏడాది ప్రవేశాలు కేవలం 1500 దాటకపోవడం ఆశ్చర్యకరం. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తు న్న ఒక ఎయిడెడ్, ఒక ఏపీఆర్జేసీ, పది ఏపీఎస్డబ్ల్యూఆర్, 3 ఏపీటీడబ్ల్యూఆర్, రెండు బీసీ రెసిడెన్షియల్, 23 హైస్కూల్ ప్లస్, నాలుగు కేజీబీవీ, ఐదు ఏపీఎంఎస్ కళాశాలల్లో 60 శాతం సీట్లు భర్తీ కాకపోవడం విశేషం. కేవలం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ, ఎస్పీడబ్ల్యూ కళాశాలలో మాత్రమే కాస్త మెరుగ్గా సీట్లు భర్తీ అవుతున్నాయి.పట్నం వైపు పరుగులు ఈ ఏడాది మెరుగైన ప్రవేశాలే లక్ష్యం జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది మెరుగైన ప్రవేశాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులకు కొదవలేదు. మధ్యాహ్న భోజన వసతి, ఉచితంగా పుస్తకాలు, తల్లికి వందనం, స్టడీమెటీరియల్, జేఈఈ, నీట్ పోటీ పరీక్షలకు సైతం ప్రత్యేక మెటీరియల్స్ విద్యార్థులకు అందజేస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణాలపై మోజు పెంచుకోకకుండా తమకు సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు పొందాలి. –జి రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి -
ఎకరానికి రూ. కోటిస్తేనే భూములు ఇస్తాం
సత్యవేడు: ఇరుగుళం, కొల్లడం పంచాయతీల్లో ఏపీఐఐసీకి భూసేకరణకు ప్రభుత్వం రైతులు భూములు తీ సుకునేందుకు ఎకరం భూమికి రూ.కోటి విలువ ప్రకటిస్తేనే పట్టా భూములు ఇస్తామని, లేకుంటే ఇవ్వబో మని రైతులు భీషించారు. శుక్రవారం సత్యవేడు రెవె న్యూ కార్యాలయంలో కొల్లడం, ఇరుగుళం రైతులతో జేసీ గోవిందరావు, ఆర్డీఓ దేవేంద్రరెడ్డి, తహసీల్దారు శివప్రసాద్ రైతులతో చర్చలు జరిపారు. జేసీ మాట్లాడుతూ ఏపీఐఐసీకి రైతులు భూములు ఇవ్వాలన్నారు. ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. ఎక రం భూమి రూ.23.80 లక్షలు నుంచి రూ. 26 లక్షలు వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామసభలు జరపకుండా, రైతులు సమస్యలు తెలుసుకోకుండా ప్రభు త్వం వరుసగా ఫారం నెం.6(ఏ) నోటిఫికేషన్, పారం–7 డిక్లరేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. 2013 భూసేకరణ చట్టం అనుసరించకుండా ఇంత తొందర గా ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటిపాకం, రాచపాళెంలో భూములను బలవంతంగా తీసుకుని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వాల్సి ఎమర్జెన్సీ అవసరం ఏముందన్నా రు. ప్రస్తుతం భూముల రేట్లు మార్కెట్ ధర ఎకరం రూ. కోటి నుంచి రూ.2.50 కోట్లు వరకు ఉందన్నారు. సోషల్ ఇంఫాక్ అసెస్మెంట్ జరిపి, రైతుల సమస్యలు తెలుసుకుని భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని జేసి గోవిందరావు, ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. -
ఫైల్ కదలాలంటే ముడుపులివ్వాల్సిందే?
పెళ్లకూరు: ఆ రెవెన్యూ కార్యాలయంలో ఫైలు కదలాలంటే ముడుపులు ముట్టజెప్పుకోవాల్సిందేనని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులను అధికారులు, సిబ్బంది కలిసి తారుమారు చేయడం, వన్బీ, అడంగల్ మార్చేడం..వాటిని సరిదిద్దే క్రమంలో దిద్దుబాటు ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తూ ఒక్కో స్థాయికి ఒక్కో రేటు చెప్పి బాధితులను నానా ఇబ్బంది పెట్టడం ఇక్కడి రెవెన్యూ అధికారులకు పరిపాటిగా మారింది. పెళ్లకూరు మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన జంగాలపల్లి గురవారెడ్డి అనే రైతుకు సర్వే నంబర్ 81–1బీ1లో 20సెంట్లు, 81–1బీలో 34సెంట్లు మొత్తం 54సెంట్లు పట్టాభూమి ఉంది. అందులో 20సెంట్లు భూమిని తన కుమారుడు పేరుతో 2021లో రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు పొంది ఉన్నాడు. అయితే కుమారుడు తన అవసరాలు నిమిత్తం తనకు సంబంధించిన 20 సెంట్లు భూమిని విక్రయించుకోవడానికి ప్రయత్నించగా సంబంధిత భూమి పంటకాలువగా నమోదు అయ్యిందని, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరదని అధికారులు ద్వారా తెలుసుకున్న బాధితుడు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించాడు. కలెక్టర్ ఆదేశాలతో భూమికి సంబంధించి మ్యుటేషన్కు స్థానిక సచివాలయంలో చలానా కట్టిన బాధితుడు గత ఆరు నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. వీఆర్వో, సర్వేయర్ తదితర అధికారులు ఫైల్ ముందుకు కదిలేందుకు ఒక్కో స్థాయికి ఒక్కో రేటు డిమాండ్ చేస్తూ బాధితుడిని కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరికి బాధితుడు తన పని పూర్తి చేస్తారనే ఆశతో కొంత నగదు రూపంలోనూ, మరి కొంత ఫోన్పే ద్వారా చెల్లించినప్పటికీ కొందరు అధికారులు పని చేయకుండా కాలయాపన చేస్తున్నట్లు బాధిత రైతు వాపోయాడు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ హరికృష్ణను సాక్షి వివరణ కోరగా భూసమస్యకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, పూర్తి స్థాయిలో పరిశీలించి బాధిత రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
శ్రీవారి సన్నిధిలో రాజకీయ ఛాయలు
తిరుమల: తిరుమలలో రాజకీయ ప్రచారానికి పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ శుక్రవారం శ్రీవారి ఆలయం ఎదుట రాజకీయ ఛాయలు కనిపించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి ఆలయం సమీపంలో ఓ ఎమ్మెల్యేకి చెందిన వాహనంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫొటో కారులో కనిపించడంతో అక్కడున్న భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు రాజకీయ జెండాలు, పార్టీ గుర్తులు, నాయకుల చిత్రాలు పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో ఇలాంటి వాహనం ఆలయ పరిసరాలకు ఎలా చేరిందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య భక్తులపై కఠిన నిబంధనలు అమలు చేసే అధికారులు ప్రజాప్రతినిధుల వాహనాల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. టిటిడి విజిలెనన్స్ సిబ్బంది తనిఖీల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెక్పోస్టుల వద్ద తనిఖీలు కేవలం పేరుకే జరుగుతున్నాయా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
11 కేంద్రాల్లో ‘యువికా–2026’
సూళ్లూరుపేట: యువతను ఇస్రో వైపు ఆకర్షించేలా ని ర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా– 2026) అనే కార్యక్రమాన్ని 11 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఇస్రో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం గత ఆ రేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఈనెల 11 నుంచి 22వ తేదీ వరకు దేశంలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట, ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహమ్మదాబాద్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ స్పేస్ సెంటర్ హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డెహరాడూన్, ఇస్రో ప్రపొల్షన్ రీసెర్చి కాంఫ్లెక్స్ మహేంద్రగిరి, నార్త్ ఈస్టరన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ షిల్లాంగ్, రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ జోధ్పూర్లో నిర్వహిస్తున్నారు. దే శంలోని తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెండు వారాలపాటు నిర్వహించే రెసిడెన్సియల్ కార్యక్రమంగా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వివిధ ఇస్రో కేంద్రాల్లో 1,320 మంది విద్యార్థులకు శిక్షణనిచ్చారు. ఈ ఏడాది యువికా–2026 కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1,06,530 మంది విద్యార్థులు అన్లైన్లో దరఖాస్తు చేసుకోగా ఇందులో 456 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వి ద్యార్థులకు శాసీ్త్రయ థృక్ఫథాన్ని పెంపొందించడం, సీనియర్ శాస్త్రవేత్తలు, గగన్యాత్రికులతో సంభాషణలు, ఉపన్యాసాలు, రోహిణి–200 రాకెట్ ప్రయోగా న్ని ప్రత్యక్షంగా వీక్షించడం, చంద్రయాన్–3 డైకిట్ అసెంబ్లీ, మోడల్రాకెట్ అసెంబ్లీ అండ్ ప్రయోగం, మరిన్ని హ్యాండ్స్–ఆన్ కార్యకలాపాల వంటి అనుభవ పూర్వక అభ్యాసం, అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత, అనువర్తనాలపై అవగాహన కల్పిస్తారు. ఈనెల 11న ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో 57 మంది విద్యార్థులు శిక్షణలో ఉన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ ల క్ష్యాన్ని సాధించడంలో భారత్ యువ విద్యార్థులు కీలకమైన పాత్ర పోషించనున్నారని ఇస్రో పేర్కొంది. -
ఈఎస్ఐలో తనిఖీలు
తిరుపతి తుడా: స్థానిక ఆర్సీ రోడ్డులోని ఈఎస్ఐ ఆస్పత్రిని ఇన్సూరెనన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ రాయలసీమ రీజియన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆమె డాక్టర్లతో మాట్లాడుతూ డిస్పెన్సరీల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు డిస్పెన్సరీలకు వచ్చే అవుట్ పేషెంట్ల సంఖ్యను పెంచేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈఎస్ఐ వైద్య సేవలను లబ్ధిదారులకు చేరువచేసేందుకు సంస్థలు పనిచేసే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పెట్టాలని చెప్పారు. అనంతరం సిబ్బంది హాజరు, ఫార్మసీ రిజిస్టర్లను, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, వేలూరు జిల్లా, ఆర్కాట్ తాలూకా, మస్సురుపాళేనికి చెందిన సి.నాగరాజన్కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2017లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం తిరుపతి, చైన్నె రోడ్డు, గాజుల మండ్యం జంక్షన్ సమీపంలో తనిఖీ చేసింది. నిందితుడు నాగరాజన్ లారీలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుపడ్డాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
టీటీడీలో బోర్డు నిర్ణయాలపై గోప్యత ఎందుకు?
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీలో పాలనాపర మైన అంశాలపై పాలకమండలి సమావేశాల్లో చర్చించి తీసుకున్న నిర్ణయాలను గోప్యంగా ఉంచడంపై అనుమానాలకు తావిస్తోందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుయాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. టీటీడీలో పరిపాలన అంతా అయోమయంగా మారిందన్నారు. పాలకమండలిలో తీసుకునే నిర్ణయాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరచడంలో అధికార యంత్రాంగానికి భయమెందుకని ప్రశ్నించారు. లోగుట్టు వెనుక మర్మమేమిటో చెప్పండి మహాశయా అని నిలదీశారు. పాలకవర్గం సమావేశంలో తీసుకునే ప్రతి నిర్ణయం, తీర్మానం టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఉంచడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ వెబ్సైట్లో 1993 నుంచి 2025 వరకు జరిగిన బోర్డు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలన్నీ అందుబాటు ఉండడంతోపాటు అందరూ పరిశీలించుకునే అవకాశం దక్కిందన్నారు. అయితే 2025 డిసెంబర్ నాటికి బీఆర్ నాయుడు చైర్మన్గా ఏర్పడిన పాలకవర్గం నిర్వహించిన బోర్డు సమావేశాల నిర్ణయాలను అదే నెలాఖరు వరకు మాత్రమే వెబ్సైట్లో పెట్టారన్నారు. ఆ తరువాత 2026 మే వరకు జరిగిన సమావేశాల నిర్ణయాలను ఇంతవరకు వెబ్సైట్లో పొందుపరచలేదన్నారు. ఏక పక్షంగా తీసుకున్న ఆ నిర్ణయాలు ఎక్కడ అందరికి తెలిసిపోతాయనే భయంతో పెట్టడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు.గత ఐదు నెలల్లో జరిగిన బోర్డు సమా వేశాల్లో తీసుకున్న నిర్ణయాలను అధికారిక వెబ్సైట్లో అందరూ చూసుకునే విధంగా పెట్టాలన్నారు. లేని పక్షంలో వైఎస్సార్సీపీ తరుఫున పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర యువజన విభా గం కార్యదర్శి మల్లం రవికుమార్, సోషల్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి షణ్ముగం రాయల్, నగర పార్టీ నేతలు కోటి, రమణారెడ్డి పాల్గొన్నారు. -
ఎంపీ గురుమూర్తి వినతి.. రైతులకు కేంద్రం తీపి కబురు
సాక్షి, తిరుపతి: తిరుపతి ఎంపీ గురుమూర్తి వినతిపై రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం సానుకూల స్పందించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంతో పాటు ఆధునీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎంపీ గురుమూర్తి తీసుకెళ్లారు.ఈ అంశంపై స్పందించిన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ), షుగర్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) సహకారంతో ఈ కర్మాగార పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా మూతపడిన సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లేఖలో పేర్కొన్నారు. -
ఒక్క అంగుళం భూమిని ఆక్రమించనివ్వను!
●సాక్షి ప్రతినిధి, తిరుపతి: తాము ఉండగా తిరుపతిలో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికానివ్వమని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని ఎర్రమిట్టలోని అక్కారంపల్లి సర్వే నంబర్ 101/3లో విలువైన భూమిని మూడు రోజుల కిందట కూటమి గూండాలు కొందరు ఆక్రమించుకునేందుకు నానా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన వైఎస్సార్సీపీ పచ్చ మూకల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించింది. ఆ భూమి తమదేనంటున్న బాధితులు తులసమ్మ, మరి కొందరిని భూమన అభినయరెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు బుధవారం పరామర్శించారు. బాధితురాలు తులసమ్మకు వైఎస్సార్ సీపీ తరపున తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఆకు రౌడీలు పెరిగిపోయారని, విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రెండేళ్ల కాలంలో దౌర్జన్యాలు, ఆక్రమణలు పెరిగిపోయాయన్నారు. ఎర్రమిట్టలో వివాదంలో ఉన్న భూమి వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కొందరు టీడీపీ నాయకులు కూడా ఎర్రమిట్టలోని ఆక్రమిత భూమిని పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. లాగేసి కొట్టారు.. మా భూమిలోకి మొన్న హఠాత్తుగా 50 మంది ఆడవాళ్లు, మరో 30 మంది మగవారు వచ్చారు. మా ఆధీనంలో ఉన్న భూమిలోకి జేసీబీలు తీసుకొచ్చారు. మా భూమిలోకి ఎందుకు వచ్చారని అడ్డుకున్నాం. వాళ్లు ఏమాత్రం మా మాట వినలేదు. వృద్ధురాలు అని కూడా చూడలేదు. నా మనుమరాలు గర్భవతి ఐనా వినలేదు. లాగి లాగి కొట్టారు. ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. మేము వేసుకున్న రేకుల షెడ్డును కూడా కూల్చివేశారు. – తులసమ్మ, బాధితురాలు -
ముగిసిన గంగ జాతర
● ఆలయంలో కిక్కిరిసిన జనం ● బంకమట్టికి ఎగబడిన భక్తులుతిరుపతి కల్చరల్: తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి విశ్వరూప దర్శనంతో భక్తులు పులకించిపోయారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా సాగింది. ఏడు రోజుల గంగమ్మ జాతరతో లక్షలాది మంది భక్తజనం అత్యంత భక్తి శ్రద్ధలతో గంగమ్మతల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రోజువారీ వేషధారణలతో భక్తులు సందడితో నగర వీధులు హోరెత్తాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..గంగమ్మతల్లికి పొంగళ్లు పెట్టి, నైవేద్యం సమర్పించి, కుటుంబ సమేతంగా ప్రణమిల్లి, మొక్కులు చెల్లించుకున్నారు. ఏడు రోజుల పాటు గంగమ్మ నామస్మరణలు, జాతర వేషాల సందడి, డప్పుల ధరవుల మోతతో తిరుపతి హోరెత్తింది. గంగజాతర చివరి రోజైన మంగళవారం అర్ధరాత్రి తర్వాత తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేకంగా కొలువుతీరిన గంగమ్మ విశ్వరూప ప్రతిమ దర్శనంతో భక్తులు పులకించారు. భక్తులు భక్తి పారవశ్యంతో గంగమ్మ తల్లీ.. కరుణించి కాపాడు తల్లీ అంటూ అమ్మవారి విశ్వరూపానికి చేతులెత్తి మొక్కి, వేడుకున్నారు. ఈనెల 5వ తేదీన అర్ధరాత్రి చాటింపుతో ఆరంభమైన తిరుపతి గంగజాతర భక్తకోటి మొక్కులతో ప్రతి రోజూ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల సహకారంతో భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో పోలీసుల సమక్షంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీల్లో భక్తులు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం ఎదురు చూశారు. అర్ధరాత్రి తర్వాత సంపూర్ణంగా అమ్మవారి విశ్వరూపం కొలువు కాగా అమ్మా... గంగమ్మా... చల్లంగా చూసి కాపాడవమ్మా అంటూ భక్తులు చేతులు జోడించి అమ్మవారిని వేడుకున్నారు. జాతర చివరి రోజు రాత్రి పేరంటాల వేషధారుడు కైకాల కులస్తుడు నగర వీధులు విహరిస్తూ భక్తుల పూజలందుకున్నారు. బుధవారం వేకువ జామున తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్న పేరంటాలు గంగమ్మతల్లి విశ్వరూప ప్రతిమ చెంప నరకడంతో జాతర సమాప్తమైంది. దీంతో అత్యంత పవిత్రంగా భావించే గంగమ్మ విశ్వరూప ప్రతిమ బంకమట్టి కోసం భక్తులు ఎగబడ్డారు. అనంతరం పేరంటాలు తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ కొలువైన పెద్ద గంగమ్మ విశ్వరూప ప్రతిమ చెంపనరకడంతో జాతర ఘట్టం ముగిసింది. గంగమ్మ విశ్వరూప దర్శనం కోసం వేచివున్న భక్తజనంభక్తులను పక్కకు నెడుతున్న పోలీసులు విశ్వరూప ఘట్టంలో మళ్లీ పునరావృతమైన పేరంటాలు గొడవ -
బాబూ...ఏదీ జాబు..!
● ఉత్తుత్తి జాబ్మేళాలతో బాబు సర్కార్ డ్రామా ● నెలలు గడిచినా అభ్యర్థులకు అందని అపాయింట్మెంట్ లెటర్స్ ● జాబ్మేళాలు కాదు.. ప్రభుత్వ ప్రచార సభలంటున్న యువత ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు నిరుద్యోగుల జీవితాలతో ఆటలా.. బాబు సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. జిల్లాలో గత రెండేళ్లుగా ప్రతి నియోజక వర్గంలో ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో మెగా జాబ్మేళా నిర్వహించింది. ఈ మేళాలో ఒక్కో నియోజకవర్గంలో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్బాటంగా యువతను జాబ్మేళాలకు తరలించారు. ఎంతో ఆశతో ధృవపత్రాలు చేతపట్టుకుని జాబ్మేళాలకు హాజరైన యువతకు నిరాశే మిగిలింది. హాజరైన వారిలో కేవలం 50 శాతం మందికి సైతం ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగానికి ఎంపికై న వారికి సరైన నియామకపత్రాలు ఇవ్వలేదు. అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న వారికి పదుల సంఖ్యలో షరుతులు పెట్టారు. మూడు నెలల ట్రైనింగ్ ఉంటుందని, ట్రైనింగ్లో ప్రతిభ చూపితేనే ఉద్యోగం ఉంటుందని లేనిపక్షంలో తొలగించడం జరుగుతుందని షరతులు పెట్టడంతో నియామకపత్రాలు పొందిన వారు సైతం ఉద్యోగంలో చేరడం లేదు. జాబ్మేళాలో ఉద్యోగాలు పొందిన 80శాతం మందికి నెలలు గడుస్తున్నా అపాయింట్మెంట్ లెటర్లు అందకపోవడం గమనార్హం తిరుపతి సిటీ: ఆర్భాటాలు..ప్రగల్భాలు..గారడీ మాటలు వీటికి అంబాసిడర్గా గుర్తింపు పొందిన బాబు సర్కార్ యువతను మరోసారి మభ్యపెట్టి చేతులేత్తేసింది. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు ఎర వేసేందుకు చంద్రబాబు అండ్ కో తాము అధికారంలోకి వస్తానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చినంత వరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీలు గుప్పించింది. షరామమూలే..అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోగా మరో డ్రామాకు తెరలేపింది. జాబ్మేళాల పేరుతో ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ తూతూ మంత్రంగా పబ్లిసిటీ కోసం మేళాలు నిర్వహించి, ఉద్యోగాలు ఇచ్చేశామంటూ చేతులుదులుపుకుంది. ఉద్యోగాలు పొందిన 50 శాతం మందికి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అపాయింట్మెంట్ లెటర్లు రాకపోవడం గమనార్హం. సర్కార్ వ్యవహార శైలిపై నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాబ్మేళాలు కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. పబ్లిసిటీ కోసమే..జాబ్మేళాలు మంత్రి, సీఎం సొంత జిల్లా తిరుపతిలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జరిగిన జాబ్ మేళాల్లో పాల్గొన్న యువతకు ఇప్పటి వరకు 60 శాతం మందికి ఉద్యోగాలు లభించలేదు. ఉద్యోగాలు పొందిన యువతకు నియామకపత్రాలు చాలా వరకు అందలేదు. యువతను మభ్యపెట్టేందుకు ప్రతి నియోజకవర్గంలో జాబ్మేళాలు ఏర్పాటు చేసి రూ.10 లక్షలు, రూ.15 లక్షల ప్యాకేజ్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. కానీ జాబ్మేళాలలో పాల్గొన్న కంపెనీలు కేవలం అటెండర్, సెక్యూరిటీ, డెటాఎంట్రీ ఆపరేటర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ కీపర్ వంటి పోస్టులకు తూతూ మంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో నిర్వహించిన జాబ్మేళాల్లో నెలకు రూ.25వేల జీతంతో ఉద్యోగం పొందిన యువత లేకపోవడం గమనార్హం. ప్రశంసాపత్రాలతో ఆర్బాటాలు.. జాబ్మేళా వేదికలపై ఆడంబరంగా ఇచ్చే ప్రశంసాపత్రాలు ఫొటోలకు పరిమితమైన నియామక లేఖలు నిరుద్యోగి ఇంటికి చేరేసరికి ఆవిరి అవుతున్నాయి. వేదికపై ఎంపిక అయినట్లు ప్రకటించి, నియామకపత్రాలు అందజేసిన తర్వాత కంపెనీల నుంచి ఎలాంటి తదుపరి సమాచారం ఉండడం లేదు. జాబ్మేళాలో ఒక జీతం చెప్పి, తీరా విధుల్లో చేరే సమయానికి సగం జీతానికి ఒప్పందాలు మార్చడం సర్వసాధారణమైంది. కేవలం ప్రైవేట్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను పిలిపించి, వాటిని ప్రభుత్వ విజయాలుగా చూపించుకోవడం యువతను మోసం చేయడమేనని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాలో జాబ్మేళా వివరాలు నియోజకవర్గం జాబ్మేళాలు హాజరైనవారు ఎంపికై నవారు నియామకపత్రాలు అందుకున్నవారు తిరుపతి 18 2304 1686 43 చంద్రగిరి 12 4244 3270 51 శ్రీకాళహస్తి 12 3493 2204 48 సత్యవేడు 12 2269 1441 42 కోడూరు 1 277 128 32 శాతం (జిల్లాలో కలిసిన తర్వాత) వెంకటగిరి 11 1341 726 36 శాతం సూళ్లూరుపేట 12 2151 1474 41 శాతం -
జాబ్మేళాలతో బురిడీ
యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ జాబ్మేళాలో యువతను బురిడీ కొట్టిస్తే సహించం. జాబ్మేళాలో చిన్న చిన్న ఉద్యోగాలు ప్రైవేటు సంస్థల్లో కల్పించి, అవి మేమే ఇచ్చామని లెక్కలు చెప్పడం దారుణం. హామీలు గుప్పించిన ప్రకారం 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాల్సిందే. జాబ్మేళాలో ఉద్యోగాలు పొందిన వారు సైతం తక్కువ జీతం కావడంతో వెనుతిరుగుతున్నారు. కొందరికి ఇప్పటకీ నియామకపత్రాలు అందకపోవడం శోచనీయం. – శివశంకర్ నాయక్, జీఎన్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తిరుపతి కుచ్చుటోపీ పెడితే సహించం చంద్రబాబు అండ్ కో ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిందే. నిరుద్యోగ భృతి మాటే ఎత్తడం లేదు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి జాబ్ మేళాలు నిర్వహించి ఇవే ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టడం దారుణం. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ద్వారా 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి తీరాలి. లేని పక్షంలో నిరుద్యోగ యువతతో కలసి పోరాడుతాం. – గార్లపాటి శ్రీధర్, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ జిల్లా అధ్యక్షులు, తిరుపతి ఇదిగో అదిగో అంటున్నారు నేను ఎంకాం చేశాను. గత ఏడాది తిరుపతిలో ప్రభుత్వ ఆద్వర్యంలో తిరుపతిలో జరిగిన జాబ్మేళాకు హాజరయ్యాను. అకౌంటెంట్గా ప్రముఖ కంపెనీ ప్రతినిధులు సెలక్ట్ చేశారు. ప్రశంసాపత్రాలు అందించారు. ఇంకా ఉద్యోగ నియామకపత్రం అధికారికంగా ఇవ్వలేదు. ఇదిగో అదిగో అంటూ చెబుతున్నారు. జాబ్మేళాలో ఇచ్చే ఉద్యోగాలు కేవలం రూ.15వేల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయాలి. – ప్రదీప్, ఎంకామ్, తిరుపతి -
రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తి
రేణిగుంట: పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ మరమ్మతు పనులు పూర్తి అయ్యాయి. దీంతో బుధవారం మధ్యాహ్నం రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలను రేణిగుంట తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, ఎంపీడీఓ రవిచంద్ర, రైల్వే అధికారులు, పట్టణ సీఐ జయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవిచంద్ర మాట్లాడుతూ సకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి చేసినందుకు రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అండర్ బ్రిడ్జ్ అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేసినందుకు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రేణిగుంట మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్చార్జి పుష్పనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి వార్షిక ప్రణాళిక
తిరుపతి రూరల్ : మహిళల ఆర్థికాభివృద్ధికి వార్షిక ప్రణాళిక ఎంతో అవసరమని డీఆర్డీఏ పీడీ టీఎన్.శోభన్బాబు తెలిపారు. తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి వార్షిక కార్యాచరణ ప్రణాళికపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విజన్ బిల్డింగ్లో భాగంగా ప్రతి సంఘం, పంచాయితీ స్థాయిలో మహిళలు తమ లక్ష్యాలను సాధించేందుకు ముఖ్యమైన 9 అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పశుసంపద, చెడు అలవాట్ల నిర్మూలన, వీధి విద్యుత్ దీపాలు, డ్రైనేజీ, బాల్య వివాహాల నివారణ, సామాజిక భద్రత వంటి అంశాలపై వివరించారు. అనంతరం వార్షిక రుణాలు, జీవనోపాధి ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం వెంకటేష్, ఏపీఎంలు నాగేశ్వరరావు, మునయ్య, నరసింహులు, సీసీలు, ఎల్సీసీలు, అకౌంటెంట్లు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
తొట్టంబేడు : తొట్టంబేడు మండలం గుమ్మడిగుంట ఎస్టీకాలనీ సమీపంలోని తెలుగు గంగ కాలువలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణ శివారు జైహింద్పురానికి చెందిన శశికుమార్(20) సెప్టిక్ ట్యాంకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను మూడు రోజుల క్రితం శ్రీకాళహస్తి వచ్చాడు. జీతంలోని కొంత సొమ్ము తీసుకునేందుకు నాయుడుపేట వద్ద ఉన్న తుమ్మూరులోని తన యజమానిని కలిసి వస్తానని ఆదివారం ఇంట్లో చెప్పాడు. అదే రోజునాయుడుపేటలో జాతర కావడంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. గుమ్మడిగుంట ఎస్టీకాలనీ వద్ద ఉన్న తెలుగుగంగ కాలువలో గుర్తు తెలియని శవం ఉన్నట్లు స్థానికులు బుధవారం రాత్రి తొట్టంబేడు పోలీసులకు సమాచారం అందించారు. వారు గురువారం ఉదయం అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శశికుమార్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేటు కంపెనీ బస్సు బోల్తా సూళ్లూరుపేట : శ్రీసిటీ సెజ్లోని టీవీఎస్ కంపెనీకి కార్మికులను తరలిస్తున్న బస్సు గురువారం తడ సమీపంలోని బోడిలింగాలపాడు శివాలయం వద్ద కల్వర్టును ఢీకొని బోల్తా కొట్టింది. దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కంపెనీ బస్సు దొరవారిసత్రం నుంచి సుమారు 20 మంది కార్మికులను ఎక్కించుకుని బయలుదేరింది. బోడిలింగాలపాడు శివాలయం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. బస్సులో ఉన్న కార్మికులు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అక్కడికిచేరుకుని వారిని సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తడ ఎస్ఐ కొండపనాయుడు బస్సును పక్కకు తొలగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడికి తీవ్ర గాయాలు రాపూరు: మండలంలోని గోనుపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు రాపూరు నుంచి పెంచలకోనకు వెళుతోందని పేర్కొన్నారు. అదేసమయంలో కలువాయి మండలం ఊయలపల్లికి చెందిన సురేష్ పెంచలకోన నుంచి రాపూరుకు బైక్లో వస్తున్నాడని తెలిపారు. గోనుపల్లి మలుపు వద్ద బైక్ను బస్సు ఢీకొందని, దీంతో సురేష్కు తీవ్రగాయాలైనట్టు పేర్కొన్నారు. అతన్ని 108 సిబ్బంది రాపూరు ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈఏపీసెట్కు 94.64 శాతం హాజరు తిరుపతి సిటీ: జిల్లాలో మూడు రోజులుగా ఏపీ ఈఏపీసెట్–2026 (ఎంసెట్) ప్రశాంతంగా జరుగుతోందని కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడవ రోజు గురువారం జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్షా కేంద్రాల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షకు 94.64 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు తొలి సెషన్ పరీక్షకు 981 మందికి గాను 922 మంది, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగిన పరీక్షకు 1,331 మందికి గాను 1,266 మంది హాజరయ్యారని వెల్లడించారు. శుక్రవారం జరగనున్న పరీక్షకు సుమారు 2 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు తెలిపారు. -
ముక్కంటి సేవలో సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ
శ్రీకాళహస్తి : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ఆరోమాసింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వదించి స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్వో మహేష్, రాజగోపాల్నాయుడు, రైల్వే అధికారులు మాబు సుభాని, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. పీజీఈసెట్ ఫలితాల్లో 93.48 శాతం ఉత్తీర్ణత – మహిళా అభ్యర్థులదే పైచేయి తిరుపతి సిటీ: ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో గత నెల 28 నుంచి మూడు రోజులు ఎస్వీయూ పరిధిలో నిర్వహించిన ఏపీ పీజీఈసెట్–2026 ఫలితాలను గురువారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎస్వీయూ పరిధిలో 2,898 మంది పరీక్షలు రాయగా 93.48 శాతంతో 2,709 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే తిరుపతి జిల్లాలో 804 మంది దరఖాస్తు చేసుకోగా 667 మంది పరీక్ష రాశారు. వారిలో 94 శాతంతో 627 మంది ఉత్తీర్ణులైనట్లు కన్వీనర్ తెలిపారు. ఏపీపీజీఈసెట్ ఫలితాల్లో ఎస్వీయూ పరిధిలో పురుషుల కంటే మహిళా అభ్యర్థులు పైచేయి సాధించారు. వర్సిటీ పరిధిలో 1,582 మంది పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,308 మంది పరీక్ష రాశారు. 93.35 శాతంతో 1,221 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే 1,831 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,590 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 93.58 శాతంతో 1,488 మంది ఉత్తీర్ణత సాధించారు. -
ఊరు బాగు కోసం పనిచేశాం
వరసిద్ధి వినాయకుడి కటాక్షంతో మా గ్రామం ఈ రోజు సుభిక్షంగా ఉంది. కరోనా కష్టకాలంలో కూడా ఊరును బాగు చేయాలని పనిచేశాం. అప్పుడు కూడా పంచాయతీ ఆదాయ వనరులను పెంచాం. వచ్చే ఆదాయంతో పంచాయతీని అన్ని హంగులతో తీర్చిదిద్దాలని ప్రణాళికతో ముందుకు వెళ్లాం. కరోనా సమయంలో టోల్గేట్, సంత, కాంప్లెక్స్ తదితరాల ద్వారా ఆదాయం పెరిగింది. దీంతో అన్ని రకాలుగా పంచాయతీని అభివృద్ధి చేశాం. మా పంచాయతీకి కేంద్ర స్థాయిలో గుర్తింపు లభించి అవార్డు రావడం సంతోషంగా ఉంది. –శాంతిసాగర్రెడ్డి, మాజీ సర్పంచ్, కాణిపాకం ఇంకా అభివృద్ధి చేస్తాం పంచాయతీని పక్కా ప్రణాళికతో ముందుకు నడిపిస్తాం. ఇంకా అభివృద్ధి చేస్తాం. ప్రధానంగా కాంప్లెక్స్, కల్యాణ మండపం నిర్మాణం చేపట్టాలనే ప్రణాళిక ఉంది. ఆ రకంగా పనులు చేపట్టి.. పంచాయతీకి మరింత ఆదాయం పెంచేలా చూస్తాం. కేంద్ర బృందం చేసిన సూచనలు కూడా పాటించి.. పంచాయతీలో మరిన్ని మార్పులు చేస్తాం. – ప్రమీల, పంచాయతీ కార్యదర్శి, కాణిపాకం -
అక్రమాలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు
సూళ్లూరుపేట: కూటమి ప్రభుత్వం అవినీతి, అక్ర మాలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, పర్వతరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. వారు గురువారం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని పరామర్శించారు. అనంతరం కాకాణి విలేకరులతో మాట్లాడారు. సత్యనారాయణరెడ్డిని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన ప్రభు త్వం బెయిల్ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పాత కేసులో నేరాంగీకార వాంగ్మూలం సృష్టించి పీటీ వారెంట్ వేసిందని విమర్శించారు. ప్రభుత్వ వేధింపులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ఇప్పు డు కూటమి ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు తప్పులు చేస్తున్న వారు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా..? వైఎస్సార్ సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ నమన్వయకర్త కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో నొక్కేస్తున్నారని ఆరోపించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందన్నారు. చివరకు రేషన్ బియ్యాన్ని కూడా రవాణా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక రీచ్లో ఎమ్మెల్యే అనుచరులు బినామీల పేరుతో ఇసుక తరలిస్తుంటే అడ్డుకున్న తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని వివరించారు. చంద్రబాబు, లోకేష్ తమ పార్టీ ఎమ్మెల్యేలపై నియంత్రణ కోల్పోయారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాల్లో వాటాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆగడాలు, అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే అన్నీ తిరిగి ఇచ్చేస్తామని హెచ్చరించారు. -
ఇసుక దోపిడీపై చర్యలేవీ..?
పెళ్లకూరు: స్వర్ణముఖినదిలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి ఇసుకను లారీలు, ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటాయని, సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురువారం కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో చేపట్టిన ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నదీ ఉపరితలం పైపొరను మూడు అడుగులు మేరకు ఇసుకను కూలీలతో తవ్వకాలు చేపట్టి స్థానిక అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి నేతలతో కలిసి కాంట్రాక్టర్ స్వర్ణముఖినదిలోని ఇసుకను సొంత ఆదాయ వనరులుగా మార్చేసుకున్నట్లు ఆరోపించారు. స్వర్ణముఖినదిలో ఇచ్చిన డీసిల్టింగ్ అనుమతుల మాటున 20 అడుగులకు పైగా తవ్వకాలు చేపట్టారని విమర్శించారు. దీంతో తాగు, సాగునీటికి కష్టాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. కూటమి నేతల ఇసుక దోపిడీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితోపాటు 26 మందిపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. సత్యనారాయణరెడ్డికి బెయిల్ మంజూరు కాకుండా రెండు నెలలకు పైగా జైలులో నిర్భందించి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్, కొందరు నాయకులు కాంట్రాక్టర్తో కలిసి స్వర్ణముఖి నదిలో ఇసుకను దోపిడీ చేస్తున్నా అధికారులు మౌనం వహించడం సిగ్గు చేటన్నారు. 2029లో జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే దోపిడీ దారులకు వడ్డీతో సహా తిరిగి చెల్లించడమే కాకుండా ఇసుక సొమ్మును పూర్తిస్థాయిలో రికవరీ చేయించేలా చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ప్రమాదకరంగా మారిన స్వర్ణముఖినది దీనస్థితిపై వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆయన వెంట నాయకులు మణినాయుడు, సునీల్, హేమంత్నాయుడు, ఆనంద్, వెంకటేష్, రమణయ్య, శివ తదితరులు ఉన్నారు. -
ఎన్ఎస్యూలో కొత్త కోర్సులు
–ఈ ఏడాదిలో ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ అండ్ మోడలింగ్ కోర్సు తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ అండ్ మోడలింగ్ నూతన కోర్సు ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం ఎన్ఎస్యూ గణిత విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ కార్యాలయంలో నూతన కోర్సు సిలబస్ రూపకల్పనపై కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో తిరుపతి ఐఐటీ, హైదరాబాద్ జేఎన్టీయూ, వరంగల్ నిట్, తిరుపతి ఎస్వీయూకు చెందిన విద్యావేత్తలు పాల్గొన్నారు. నూతన కోర్సు పాఠ్యాంశాల ప్రణాళిక, సిలబస్ రూపకల్పనపై చర్చించి ఆమోదం తెలిపారు. వారు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో, వైదిక విజ్ఞాన శాస్త్రాల స్ఫూర్తితో రూపొందిన ఎంఎస్సీ ప్రోగ్రామ్ భారతీయ విజ్ఞాన వ్యవస్థను (ఐకేఎస్) ప్రస్తుత విజ్ఞాన వ్యవస్థతో (సీకేఎస్) అనుసంధానం చేస్తుందని తెలిపారు. ప్రధాని ఆకాంక్షించిన వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా వినూత్న కోర్సును తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. మానవాళి అభివృద్ధికి అవసరమైన ఏఐ ఆధారిత మోడలింగ్లో విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవాన్ని అందించడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమన్నారు. 26న ఖాళీ గోనె సంచుల ఈ–వేలం తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026–27 సంవత్సరానికి ఈ నెల 26న ఈ–వేలం ద్వారా విక్రయించనున్నట్టు టీటీడీ తెలిపింది. వేలంలో పాల్గొనదలచిన వారు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నంలోపు ఆన్లైన్లో రూ.75 వేలు ఈఎండీ చెల్లించాలని పేర్కొంది. వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించవచ్చని, అలాగే ఫోన్ 0877–2264429, అలాగే టీటీడీ వెబ్సైట్ను చూడాలని టీటీడీ వెల్లడించింది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి తిరుపతి క్రైం : తిరుచానూరు –రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 84 సమీపంలో రేణిగుంట వైపు వెళ్తున్న డెమో ప్యాసింజర్ రైలు కింద పడి వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతనికి 48 ఏళ్లు ఉంటాయని, తల వెనుక భాగంలో తీవ్ర గాయం ఉన్నట్లు పేర్కొన్నారు. అతని వద్ద గుర్తింపు కార్డులు, ఆధారాలు లభించలేదని తెలిపారు. బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నశిం కలర్ అడ్డుగీతల గళ్ల లుంగీ, బ్లూ కలర్ ఫుల్ ట్రౌజర్ ధరించి ఉన్నాడని తెలిపారు. నాలుగు పేటల మొలతాడు ఉందన్నారు. మృతదేహాన్ని తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించామని వెల్లడించారు. మృతుడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే తిరుపతి రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎన్.వరప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమలలో జనసేన నేతల అక్రమ తట్టలు
తిరుమల: తిరుమల కొండపై ఆక్రమణల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తిరుపతికి చెందిన జనసేన పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు రాజేష్తో పాటు అతని అనుచరులు అనధికారికంగా మూడు తట్టలు (హ్యాకర్లు) ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులను బెదిరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకులు, తిరుపతి ఎమ్మెల్యే అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాం అంటూ అధికారుల ముందే బహిరంగంగా చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు దాల్చింది. అధికార పార్టీ మద్దతుతోనే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలోని పలు శాఖలు రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు చర్యలకు దిగినా, విజిలెన్స్ అధికారులు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. అలాగే గతంలో వివాదాస్పదంగా మారిన 151 తటాల లైసెన్సుల అంశాన్ని కూడా స్థానికులు ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు తిరుమలలో అక్రమ తట్టల వ్యవహారం మరింత పెరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, టీటీడీ అధికారులు స్పష్టమైన విధానం ప్రకటించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన ఉద్రిక్తంగా మారడంతో చివరకు అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. అనధికారికంగా ఏర్పాటు చేసిన తట్టలను తొలగించినట్లు తెలిసింది. అయినప్పటికీ పవిత్ర తిరుమల కొండపై రాజకీయ జోక్యాలు, అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘తిరుమల పవిత్రతను కాపాడాలి.. రాజకీయాలకు వేదిక చేయొద్దు’’ అంటూ భక్తులు ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను కోరుతున్నారు. -
భూ ఆక్రమణలపై పోరుబాట
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతిలో కూటమి నేతలు చేస్తున్న భూ ఆక్రమణలు, దౌర్జన్యాలపై వైఎస్సార్ సీపీ ఉద్యమాలకు సిద్ధమైంది. నగరంలోని శివజ్యోతినగర్ పరిధిలోని ఎర్రమిట్టలో గురువారం వైఎస్సార్ సీపీ మెరుపు ధర్నా చేపట్టింది. వారం రోజుల క్రితం పచ్చ గుండాలు రూ.కోట్ల విలువైన వివాదాస్పద భూమిలోకి ప్రవేశించి ఆక్రమించుకునేందుకు యత్నించిన విషయం తెలిసిందే. కూటమి గుండాల దౌర్జన్యంపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతటితో వదిలేయకుండా గురువారం ఉదయం శివజ్యోతినగర్లోని ఎర్రమిట్టలో భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన నగరంలోని కూటమి బాధితులు, మహిళలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా బైఠాయించారు. భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ శాప్ చైర్మన్ రవినాయుడు, జేబీ శ్రీనివాసులు సహకారంతో గుండాలు రెచ్చిపోయి తులసమ్మ, మరికొందరిని పక్కకు ఈడ్చేసి భూ ఆక్రమణకు యత్నించారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలకు అనుకూలంగా ఉన్న కొందరు జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి, వారి ముసుగులో మొత్తం భూమిని కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను కొట్టడంతోపాటు కేసులు పెడుతున్నా తాము పట్టించుకోలేదన్నారు. పేదల జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. తులసమ్మ అనే వృద్ధురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. సగటు పేదవారికి అండగా నిలబడతామని తెలిపారు. కూటమి నేతల బాధితులు ఎవరైనా ఉంటే మమ్మల్ని కలవాలని, అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో కూటమి నేతలు ఎక్కడెక్కడ భూములు స్థలాలు ఆక్రమించారంటే.. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు -
శ్రీవారి భక్తులకు తిరుపతిలో టీటీడీ వసతి సౌకర్యాలు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, ఎస్వీ గెస్ట్ హౌస్, పద్మావతి గెస్ట్ హౌస్, తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్ తదితరాల్లో వసతి సముదాయాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే డార్మిటరీలు, ఉచిత లాకర్లు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏసీ గదులను ఆన్లైన్, రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. విష్ణునివాసంలో 408 గదులు, 9 హాళ్లు, 706 లాకర్లు ఉన్నాయని తెలి పారు. శ్రీనివాసం కాంప్లెక్స్లో 552 గదులు, 9 డార్మిటరీలు, 1038 లాకర్లు ఉన్నాయని, మాధవం గెస్ట్ హౌస్ లో 164 ఏసీ గదులు, డీలక్స్ సూట్లు ఉన్నాయని తెలిపారు. ఎస్వీ గెస్ట్ హౌస్లో ఏసీ, నాన్ ఏసీ కలిపి 31 గదులు ఉన్నట్టు వివరించారు. ఆయా కాంప్లెక్స్లలో అన్నప్రసాదం పెడుతున్నట్టు తెలిపారు. శ్రీగోవిందరాజ స్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న భవనాలు పూర్తయితే మరిన్ని వసతి గదులు, లాకర్లు, డార్మిటరీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గదుల కేటాయింపు విధానం... తిరుపతిలోని విష్ణునివాసంలో పరిమిత సంఖ్యలో గదుల కేటాయింపు కరెంట్ బుకింగ్, తిరుపతిలోని మిగిలిన అన్ని చోట్ల నిబంధనల ప్రకారం వెబ్సైట్లో భక్తులు ముందస్తుగా బుక్ చేసుకోవాలి. ఒంటరి, అవివాహిత సీ్త్ర, పురుష జంటలకు గదులు కేటాయించరు. -
రైల్వే అండర్ బ్రిడ్జి పనులు
అసంపూర్తిగారేణిగుంట: రేణిగుంట పాత చెక్ పోస్టు వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి మరమ్మతు పనులు పూర్తిస్థాయిలో పూర్తి కాలేదు. అధికారపార్టీ నాయకులు పనులు మొత్తం పూర్తయ్యాయని పేర్కొంటూ సన్మానాలు చేసుకుని వాహనాల రాకపోకలను ప్రారంభించారు. పనులు అసంపూర్తిగా ఉండడాన్ని చూసిన వాహనదారులు ఇదేందిరా స్వామి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అదనపు రైల్వే ట్రాక్ కోసం ఏర్పాటు చేసిన స్లాబ్ ఇంకా అసంపూర్తిగా ఉంది. బ్రిడ్జి రెండు కన్నాల్లోని నాలుగు వైపులా పైన పెట్టిన సిమెంట్ రాళ్లు అలాగే వదిలేశారు. అవి ఎప్పుడైనా వాహనాలపై పడే ప్రమాదం ఉంది. అంతేగాక మధ్యలో గ్యాప్ ఉండడంతో పైనుంచి వస్తువులు పడే పరిస్థితి. అధికారులు హడావిడిగా బ్రిడ్జికి రంగులు వేసి వాహనాల రాకపోకలను ప్రారంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వెళ్లే మార్గమేదీ..? బ్రిటీష్ కాలం నాటి రైల్వే అండర్ బ్రిడ్జికి మరమ్మతులు చేసిన అధికారులు అండర్ డ్రైనేజ్ గురించి పట్టించుకోలేదు. చిన్నపాటి వర్షం కురిసినా మోకాలి లోతు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరా యం ఏర్పడుతోంది. నెల రోజులు బ్రిడ్జిని మూసివేసిన అధికారులు వర్షపు నీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. వదిలేసిన రోడ్డు మరమ్మతు పనులు రైల్వే అధికారులు బ్రిడ్జి మరమ్మతు పనులు చేసి చేతులు దులుపుకున్నారు. రోడ్డు పనుల గురించి పట్టించుకోలేదు. నెల రోజులు బ్రిడ్జిన మూసివేసిన అధికారులు అన్ని పనులను ఒకేసారి పూర్తి చేసి ఉంటే బాగుండేదని, ఆర్ అండ్ బీ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయం లోపించడం వల్లే పనులు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం ప్రమాదాలు జరిగే ప్రదేశం... అండర్ బ్రిడ్జ్ సమీపాన ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న సర్కిల్ మధ్యలో బారికేడ్లు ఏర్పాటుచేయకపోవడంతో వాహనదారులు రాంగ్ రూట్లో వస్తున్నారు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రిడ్జి మరమ్మతులు చేసే సమయంలోనే ఆర్అండ్బీ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. -
పన్ను వసూళ్లలో అగ్రగామి
కాణిపాకం: కాణిపాకం పంచాయతీలో ఏడు గ్రామాలుండగా 982 కుటుంబాలున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి బీజం పడింది. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ భవనాలు, రోడ్ల విస్తరణ, వీధి దీపాలు, తాగునీటి ట్యాంకులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామ రూపురేఖలను మార్చింది. స్థానికుల అవసరాలను గుర్తించి, సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం నేర్చుకుంది. ఆ ఆదాయాన్ని తిరిగి ప్రజాసేవలకే వినియోగించడం మొదలు పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాణిపాక ప్రధాన ఆలయ జీర్ణోద్ధరణతో కాణిపాకం పంచాయతీ కొత్త కళను సంతరించుకుంది. దీంతోపాటు ఆదాయ వనరుల పెంపునకు దోహదపడింది. టోల్ ఆదాయం దండి పంచాయతీకి ప్రధాన ఆదాయ వనరు టోల్ వసూళ్లు. ఏడాదిలో టోల్ వ్యవస్థ ద్వారా ఏకంగా రూ.2.3 కోట్ల మేర ఆదాయం సమారుకుతోంది. అలాగే ప్రతి ఏటా స్థానిక మార్కెట్ (వారపు సంత) ద్వారా రూ.5 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. గ్రామానికి వచ్చే వ్యాపారులు, రైతులు, కొనుగోలుదారులతో సంత సాగుతుండడం వల్ల ఆదాయం పెరిగింది. గ్రామ ఆర్థిక వ్యవస్థలో ఈ సంత కీలకపాత్ర పోషిస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ పంచాయతీ సమీకరించిన ఆదాయాన్ని ప్రజాసదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తోంది. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. తాగునీటి ట్యాంకుల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లు, వీధి దీపాలు, రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణం వంటి పనులతో గ్రామానికి కొత్త రూపు వచ్చింది. పంచాయతీ ఆదాయ వసూళ్లలో డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలను ప్రవేశపెట్టింది. నగదు పుస్తకాలు, రసీదులు, డిమాండ్–వసూలు రిజిస్టర్లు, వోచర్లు, మస్టర్ రోల్స్ అన్నీ క్రమబద్ధంగా నిర్వహిస్తోంది. పన్ను వసూలు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. అధికారులు క్రమం తప్పకుండా సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ మరింత బలోపేతమైంది. తగిన గుర్తింపు నెల రోజుల క్రితం కేంద్ర బృందం కాణిపాకం గ్రామాన్ని సందర్శించి పంచాయతీ పనితీరును పరిశీలించింది. ఆర్థిక రికార్డులు, ఆదాయ వసూళ్లు, అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్య నిర్వహణ, డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలను పరిశీలించి ప్రశంసల వర్షం కురిపించింది. సొంత వనరుల ఆదాయం పెంపు, పారదర్శక పరిపాలన, సమర్థవంతమైన సేవల ఆధారంగా ‘ఆత్మనిర్భర్ పంచాయతీ’ ప్రత్యేక పురస్కారానికి కాణిపాకం ఎంపికై ంది. కమ్యూనిటీ భవనం వైఎస్సార్ సీపీ హయాంలో అభివృద్ధికి బీజం పారిశుద్ధ్యం..అధిక ప్రాధాన్యం గ్రామ పారిశుద్ధ్య నిర్వహణలో కాణి పాకం ప్రత్యేక గుర్తింపు పొందింది. డంపింగ్యార్డు ద్వారా చెత్తను వేరుచేసి ఎరువుల తయారీ చేపడుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేస్తోంది. చెత్త పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి పారిశుద్ధ్య సేవల మెరుగుకు వినియోగిస్తోంది. ప్రతి వీధిలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, చెత్త సేకరణకు ప్రత్యేక సిబ్బంది నియామకం, పారిశుద్ధ్య వాహనాల వినియోగం వంటి చర్యలు చేపడుతోంది. డంపింగ్, పారిశుద్ధ్య సంబంధిత కార్యక్రమాలకు కాణిపాకం పంచాయతీని ఆదర్శంగా తీసుకుంటూ జిల్లాలోని అధికారులందరికీ ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నారు. కాణిపాకం పంచాయతీ పన్ను వసూళ్లలో కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఆస్తి పన్ను రూపంలో ఈ ఏడాది రూ.13,68,640 వసూలు చేసింది. ఇంటింటి సర్వేలు నిర్వహించి ఆస్తుల మ్యాపింగ్ చేయడం, డిమాండ్–కలెక్షన్–బ్యాలెన్స్ రిజిస్టర్లను పటిష్టంగా నిర్వహించడం వల్ల వసూళ్లు గణనీయంగా పెరిగాయి. నీటి చార్జీల ద్వారా రూ.3 లక్షలు, పారిశుద్ధ్య పన్ను రూ.1.6 లక్షలు, లైటింగ్ పన్ను రూ.80 వేలు, చెత్త పన్ను రూ.88 వేలు వచ్చింది. వీటితో పాటు పలు వనరుల ద్వారా ఆదాయం వస్తోంది. మొత్తంగా పంచాయతీ పన్ను ఆదాయం రూ.2.6 కోట్లు దాటుతోంది. పన్నేతర ఆదాయం రూ.8 లక్షలకు పైగా వస్తోంది. -
వేసవి సెలవులు.. పిన్ని ఇంటికి వెళ్లడమే శాపమైంది..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు కూతురైన మైనర్పై బాబాయ్ అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడిని తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రామమూర్తిగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు తిరుపతి పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటోంది. వేసవి సెలవులు కావడంతో తిరుపతి లక్ష్మీపురంలో ఉంటున్న పిన్ని ఇంటికి ఆమె ఇటీవలే వచ్చింది. ఈ క్రమంలో మైనర్కు సంబంధించిన నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని రామమూర్తి బెదిరింపులకు దిగాడు. అనంతరం, మైనర్ను లొంగదీసుకున్నాడు. అనంతరం, ఇంటికి తిరిగి వచ్చిన మైనర్ ప్రవర్తనలో మార్పులను గుర్తించిన పేరెంట్స్.. అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు.దీంతో, మైనర్ పేరెంట్స్ వెంటనే జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 28వ తేదీన జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అనంతరం, తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఎఫ్ఐఆర్ను బదిలీ చేశారు. ఈ క్రమంలో తిరుపతి పోలీసులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ను గుర్తించడంతో ఈనెల 13వ తేదీన క్రైమ్ నెంబర్ 236/2026 పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం, విచారణ చేపట్టినట్టు తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
నీట్ రద్దుపై భగ్గుమన్న విద్యార్థి లోకం
తిరుపతి సిటీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ పాపం మోదీ ప్రభుత్వానిదేనని, అవినీతిలో కూరుకుపోయిన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఎమ్మార్ పల్లి సర్కిల్లో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి, ఎన్టీఏకి సంబంధించిన ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పడిన నాటి నుంచి పరీక్షల నిర్వహణలో తన అసమర్థతను నిరంతరం చాటుకుంటూనే ఉందని, పేపర్ లీకేజీలతో నీట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 720 మార్కుల్లో దాదాపు 600 మార్కుల ప్రశ్నలు లీక్ అయ్యాయని, పరీక్షలోని మొత్తం 180 ప్రశ్నల్లో 15 ప్రశ్నలు ముందుగానే బయటకు రాగా, కెమిస్ట్రీ విభాగంలోని సుమారు 120 ప్రశ్నలు యథాతథంగా లీక్ అవడం దారుణమన్నారు. రూ.కోట్లు చేతులు మారి, అర్హులైన పేద విద్యార్థులకు అన్యాయం చేసేలా ఈ కుంభకోణం సాగిందని మండిపడ్డారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో వైద్య విద్యలో యూజీ ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలను అస్తవ్యస్తం చేసిన మోదీ ప్రభుత్వమే ఈ వైఫల్యానికి బాధ్యత వహించాలన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల విద్యా ప్రమాణాలు, అవసరాలను విస్మరించి, పరీక్ష విధానాన్ని కావాలని కేంద్రీకరించడంతోనే ఇలాంటి భారీ అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు. కేంద్రీకరణ విధానం దేశవ్యాప్తంగా ’ఎగ్జామ్ మాఫియా’ పుట్టుకొచ్చేలా చేసిందని, ఒకవైపు సామాన్య మధ్యతరగతి విద్యార్థులను కోచింగ్ సెంటర్ల దోపిడీకి గురిచేస్తుండగా, మరోవైపు లీకుల ద్వారా విద్యార్థులను అభద్రతాభావంలోకి నెట్టేస్తుందన్నారు. ఈ పేపర్ లీక్ వెనుక ఉన్న సూత్రధారులపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి, కఠినంగా శిక్షించి, ఎన్టీఏ నిర్లక్ష్యంతో విద్యార్థులు పడిన మానసిక వేదనకు, వారు చేసిన ఖర్చులకు ఎన్టీఏ తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు పవిత్ర, అక్బర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్, సి ప్రవీణ్ కుమార్, నాయకులు వినయ్, తేజ, అనిత, ఓంరాజ్, చరణ్, రెడ్డికుమార్, మహేష్, నవీన్ పాల్గొన్నారు. -
ఉన్నత విద్య.. వద్దులే!
ఉన్నత విద్య వైపు యువత అడుగు పడడం లేదు. ఉపాధి కోర్సులైన ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులపై మొగ్గు చూపుతూ సంప్రదాయ కోర్సుల్లో చేరడానికి ఇష్టపడడం లేదు. ఫలితంగా ఏటా ప్రవేశాలు తగ్గుతున్నాయి. యూనివర్సిటీల్లో పలు కోర్సుల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇది పరిశోధనలపై ప్రభావం చూపుతోంది. సాధారణ కోర్సుల్లో ప్రవేశాలు ఇలాగే తగ్గితే విశ్వవిద్యాలయాల మనుగడ ప్రశ్నార్థకమేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 విశ్వవిద్యాలయాల్లో 30 పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీసెట్కు ఆదరణ కరువైంది. ఆశించిన స్థాయిలో అభ్యర్థులు పరీక్షకు హాజరు కాకపోవడంతో ఈ ఏడాది పలు వర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాలు దారుణంగా పడిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలలో 23 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఏపీ పీజీసెట్–2026కు హాజరైన అభ్యర్థుల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎస్వీయూ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు జరిగిన పీజీసెట్ పరీక్షకు 19,118 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 16,406 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో సుమారు 21 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉండగా 16 వేల మంది మాత్రమే పీజీసెట్కు హాజరుకావడంతో 6 వేలకు పైగా సీట్లు ఖాళీ ఏర్పడనున్నాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి.. రాష్ట్రంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్కాం వంటి పీజీ కోర్సులకు ఆదరణ క్రమంగా తగ్గుతోంది. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 24 వేలకు పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీసెట్–2025 పరీక్షకు 25,688 మంది దరఖాస్తు చేసుకోగా 21,995 మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో కేవలం 17 వేలు సీట్లు సైతం భర్తీ కాకపోవడం విశేషం. అలాగే ఈ ఏడాది 2026–27 విద్యా సంవత్సరంలో పీజీ ప్రవేశాల కోసం జరిగిన ప్రవేశ పరీక్షకు 19,118 మంది దరఖాస్తు చేసుకోగా 16,406 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ఈ ఏడాది ప్రవేశాలు భారీ స్థాయిలో పడిపోనున్నాయి. వర్సిటీల మనుగడ ప్రశ్నార్థకమేనా? పీజీ సెట్కు దరఖాస్తులతోపాటు హాజరయ్యే అభ్యర్థులు క్రమంగా తగ్గిపోవడంతో వర్సిటీల భవితవ్యంపై ప్రమాదకర సంకేతాలు వెలువడుతున్నాయని మేధావులు, విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పీజీ సెట్కు హాజరైన ప్రతి అభ్యర్థికి 1:1 ప్రాతిపదిక సీట్లు కేటాయించినా ఇంకా 6 వేలకు పైగా సీట్లు మిగిలిపోనున్నాయి. ప్రభుత్వం వర్సిటీలపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం, నూతన విద్యావిధానంతో పీజీ కోర్సులు నిర్వీర్యం అవుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య 21 వేలు ఉండగా పీజీ సెట్కు హాజరైన అభ్యర్థుల సంఖ్య 16 వేలకు మించకపోవడం గమనార్హం. 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీల్లో పీజీ అడ్మిషన్లు భారీ స్థాయిలో పడిపోనున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో వర్సిటీల భవితవ్యం ప్రశ్నార్థకమేనని మేధావి వర్గాలు, విద్యానిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు 21వేలు.. అభ్యర్థులు 16వేలు పరిశోధన రంగంపై తీవ్ర ప్రభావం పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పడిపోవడం పరిశోధన రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఆర్సెట్కు ఈ ఏడాది దరఖాస్తులు తగ్గే అవకాశం ఉంది. ఆధునిక యువత టెక్నికల్, మెడికల్ రంగం వైపు మొగ్గు చూపడం. యూజీ పూర్తి చేసిన వెంటనే అతిచిన్న వయస్సులోనే ఉపాధి, ఉద్యోగావకాశాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో యువత అడుగులు వేయడంతో పీజీల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. దీంతో రీసెర్చ్ రంగంపైనా యువత పెద్దగా మొగ్గు చూపలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉన్నత విద్యకు యువత దూరమయ్యే ప్రమాదం పొంచిఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండేళ్లుగా పీజీ సెట్ పరిస్థితి ఇదీ కోర్సుల వివరాలు 2025లో దరఖాస్తులు హాజరైన 2026లో దరఖాస్తులు హాజరైన వారి సంఖ్య వారి సంఖ్య కెమికల్ సైన్స్ 6,070 5,396 3,581 3,150 లైఫ్ సైన్స్ 4,027 3,641 3,260 2,947 కంప్యూటర్ 2,333 1,858 1,884 1,521 కామర్స్ 1,438 1,203 980 834 ఇంగ్లీష్ 898 721 746 607 హ్యుమానిటీస్ 883 736 634 510 జువాలజీ 1,548 1,347 1,221 1,055 గణితం 1,175 983 835 721 ఫిజిక్స్ 938 808 653 562 బోటనీ 1,295 1,146 1,012 873 మిగిలిన కోర్సులు 5,083 4,156 4,312 3,626 మొత్తం 25,688 21,995 19,118 16,406 -
ఉపాధి కూలీకి పాముకాటు
– నాగలాపురంలో ఘటన నాగలాపురం: ఉపాధి కూలీ పాముకాటుకు గురైన ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. నాగలాపురం నటరాజగుంటకు చెందిన ప్రేమ (42) ఉపాధి పనులకు వెళ్లింది. అక్కడ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పాము కాటేయడంతో తోటి కూలీలు వెంటనే ఆమెను స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి డాక్టర్లు నగరి ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. నగరిలో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్టు సమాచారం. -
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఆటో
బుచ్చినాయుడుకండ్రిగ: ద్విచక్ర వాహనంపై కర్మక్రియులకు వచ్చి తిరిగి వెళుతుండగా కేటీరోడ్డుపై ఆటోను ఢీ కొన్న సంఘటన కాటూరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. డక్కిలి మండలం మిట్టవడ్డిపాళెం గ్రామానికి చెందిన ఆశోక్ (18) తన తల్లి లక్ష్మమ్మ (30)తో కలసి బుధవారం మండలంలోని తహానగర్ గ్రామంలోని బంధువుల కర్మక్రియలకు వచ్చారు. కార్యక్రమం ముగిసిన తరువాత ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరారు. శ్రీకాళహస్తి వైపు వెళుతుండగా కాటూరు సమీపంలో ఆటో అదుపు తప్పి, అతి వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. దీంతో ద్విచక్ర వాహనంలోని లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందగా, ఆశోక్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
పంచాయతీ ఉద్యోగులకు కలెక్టర్ అభినందనలు
తిరుపతి అర్బన్: జాతీయ పురస్కారాన్ని అందుకోనున్న పంచాయఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ బుధవారం కలెక్టరేట్లో అభినందించారు. చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లె పంచాయలో సౌరశక్తి పర్యావరణ పరిక్షణలో క్లైమేట్ స్మార్ట్ గ్రామంగా తీర్చిదిద్దడంతో కేంద్ర అవార్డు వచ్చిన నేపథ్యంలో రూ. కోటి అవార్డుకు ఎంపిక చేశారు. దీంతో జూన్ 3న ఢిల్లీలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవితోపాటు పంచాయతీ ఉద్యోగులకు ఓ మొక్కను బహుకరించి, అభినందించారు. రైల్వేస్టేషన్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు సూళ్లూరుపేట: స్థానిక రైల్వేస్టేషన్లో బుధవారం చైన్నె సెంట్రల్ రైల్వేపోలీస్ ప్రత్యేక నిఘా విభాగం బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ అధికారులు, సిబ్బంది తనిఖీలు చేశారు. చైన్నె నుంచి సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ వరకు అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వారిని, వారి వద్ద లగేజీ బ్యాగ్లను పరిశీలించారు. విజయవాడ నుంచి చైన్నె వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్, చైన్నె నుంచి అహమ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్ప్రెస్లు రావడంతో వాటి నుంచి దిగిన ప్రయాణికుల్లో అనుమానాస్పదంగా ఉన్న వారిని ఆపి లగేజీలు పరిశీలించారు. తుడా సెక్రటరీగా శ్రీకాంత్ బాబు పదవీకాలం పొడిగింపు తిరుపతి తుడా: తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ సెక్రటరీగా డాక్టర్ శ్రీకాంత్ బాబు పదవి కాలాన్ని మరో ఏడాది కాలం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పశు సంవర్థక శాఖ అధికారిగా ఉన్న శ్రీకాంత్ బాబును డిప్యూటేషన్పై తుడా సెక్రటరీగా గత ఏడాది నియమితులయ్యారు. ఈ కాలం పూర్తవడంతో ఆయన్ని మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పేయదూడల అందాల పోటీలు కలువాయి(సైదాపురం): మండల కేంద్రంలోని పశువైద్యశాలలో పశుసంవర్థకశాఖ ఏడీ గురు జయంతి, ఎగ్జిక్యూటీవ్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం పేయి దూడలకు అందాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ దూడలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అనంతరం పాడిరైతులకు ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు. పాడి రైతులకు పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం నట్టల నివారణ మందులు, విటమిన్లు, లవణ ద్రావకాలను ఉచితంగా పంపిణీ చేశారు. చిన్నరామాపురంలో ఏనుగుల హల్చల్ చంద్రగిరి: మండలంలోని చిన్నరామాపురం సమీపంలో ఉన్న మొక్కలతోపు వద్ద బుధవారం రాత్రి ఏనుగుల గుంపు రోడ్డుదాటుతూ బీభత్సవం సృష్టించాయి. రోడ్డు దాటుతున్న క్రమంలో ఏనుగుల అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనాచోదకుడిపై దాడికి యత్నించాయి. దీంతో వాహనాచోదకులు బైక్ను వదిలి పరుగులు తీశారు. ఏనుగులు ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశాయి. ప్రాణభయంతో పరుగులు తీసిన యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. మొక్కలతోపు వద్ద ఏనుగుల గుంపు ఉన్నట్లు తెలుసుకున్న ప్రయాణికులు సుమారు గంటకు పైగా వాహనాలను దూరంగా ఉంచుకున్నారు. -
ఏపీఆర్జేసీలో ‘విశ్వం’ ఉత్తమ ఫలితాలు
తిరుపతి అర్బన్: ఏపీఆర్జేసీ 2026లో ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ సత్తా చాటింది. విశ్వం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రవేశాల కోసం ఏప్రిల్ 24న నిర్వహించిన ఏపీఆర్జేసీ ఎంట్రెన్స్న పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యా సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల్లో వి. మోక్షిత్ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించగా, టి. శ్రీదర్శిని రాష్ట్రస్థాయి 8వ ర్యాంకు, కే. పవ్యశ్రీ 9వ ర్యాంకు, కే. హర్షవర్ధన్ 11వ ర్యాంకు, కే. జ్యోత్స్న 12వ ర్యాంకు, ఎన్. హాసిని 13వ ర్యాంకు, ఈ. మునిశంకర్ 14వ ర్యాంకు, బి. హర్షిత్ 15వ ర్యాంకు, పి. తేజస్వి 16వ ర్యాంకు, కే. హర్ష 17వ ర్యాంకు, వి. పూజ 18వ ర్యాంకు, ఎం. చారుణ్య, కే. గీతిక 19వ ర్యాంకు, ఏ. రితీష్ కుమార్, కే. ధోనీష్ 20వ ర్యాంకులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారని విశ్వం విద్యా సంస్థల అధినేత ఎన్. విశ్వనాథ్ రెడ్డి బుధవారం వెల్లడించారు. ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులకు విశ్వనాఽథ్రెడ్డితోపాటు విశ్వం అకడమిక్ డైరెక్టర్ విశ్వచందన్రెడ్డి, విశ్వశ్రీ , కరస్పాండెంట్ తులసీ విశ్వనాథ్రెడ్డి అభినందనలు తెలిపారు. -
గుండెపోటుతో జూనియర్ లైన్మన్ మృతి
చంద్రగిరి: గుండెపోటుతో జూనియర్ లైన్మన్ మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. చంద్రగిరి రూరల్ సెక్షన్ రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో జూనియర్ లైన్మన్గా విధులు నిర్వహిస్తున్న రవీంద్ర(43) ఇటీవల శిక్షణ నిమిత్తం నెల్లూరుకు వెళ్లి, అక్కడ శిక్షణ పొందుతున్నాడు. బుధవారం ఉదయం గుండెనొప్పిగా ఉందనడంతో సహచరులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృత్యువాత పడ్డాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న చంద్రగిరి అధికారులు ఆయన మృతిపై దిగ్భ్రాంతికి లోనయ్యారు. బుధవారం ఆయన స్వగ్రామం మదనపల్లి సమీపంలోని ఉప్పరపల్లిలోని స్వగ్రామానికి తరలించి, అంత్యక్రియలను పూర్తి చేశారు. తయారీ రంగంలో తిరుపతికి ఉన్నత స్థానంతిరుపతి అర్బన్: తయారీ రంగంలో రాష్ట్రంలో తిరుపతి జిల్లా ఉన్నత స్థానంలో ఉందని పరిశ్రమల, వాణిజ్యశాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ శారదాదేవి, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో వ్యవసాయం, పరిశ్రమలు సేవారంగంలోకి మారాలని సూచించారు. సేవారంగాల వాటా ఎక్కువగా ఉంటేనే పెట్టుబడులు ఉపాధిగా మారి ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అలాంటి సామర్థ్యం తిరుపతి జిల్లాకు ఉండడం సంతోషంగా ఉందన్నారు. నిత్యం తిరుమల దర్శనానికి వేల సంఖ్యలో ప్రజలు తిరుపతి నగరానికి వస్తుంటారని..వారంతాసేద తీరేలా సమయం చేకూర్చే ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు. జిల్లాలోని పరిశ్రమలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పథంలో జిల్లాను నడపాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. -
సౌదీలో పునబాక మహిళ ఆత్మహత్య
పెళ్లకూరు: మండలంలోని పునబాక గ్రామానికి చెందిన ఉయ్యాల భాస్కరయ్య, తయారమ్మ దంపతుల కుమార్తె కోనేటి మమత(36) బుధవారం సౌదీలోని జుబేల్ ప్రాంతంలో ఉంటూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో తిరుపతికి చెందిన కోనేటి చెంగయ్య (విశ్రాంత ఎస్ఐ) చిన్న కుమారుడు కోనేటి కృష్ణకి మమతను ఇచ్చి వివాహం చేశారు. వీరు శ్రీకాళహస్తిలోని ఇందిరానగర్లో నివాసం ఉండేవారు. వీరికి కోనేటి రూపేష్, కోనేటి లోహిత్ కుమారులు ఉన్నారు. 2012లో కృష్ణకి సౌదీలోని సాట్రాప్ పెట్రో కెమికల్ కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం రావడంతో భార్యభర్తలిద్దరు సౌదీలో నివాసం ఉంటున్నారు. తిరుపతిలో ఉన్న కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి వివాదం నెలకొనడంతో మమత మనస్తాపానికి గురై భర్త ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అయితే మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చి తమకు అప్పగించేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం: భూమన
సాక్షి, తిరుపతి: టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం జరిగిందని, నాలుగు నెలలుగా ఒక్క రోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో ఐటీ, విజిలెన్స్, దళారులు, ట్రావెల్ ఏజెంట్స్ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టికెట్ రూ.15 వేలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.దీన్ని నెలన్నర క్రితమే తాము బయటపెట్టినా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆక్షేపించారు. పదే పదే తాము ప్రశ్నిస్తుంటే చివరికి ఏఐ, ఆటో ఫిల్లింగ్ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. శ్రీవాణి టికెట్ల స్కాంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. భూమన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిరంతరాయంగా శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ దోపిడీ:శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ దోపిడీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఉదయం 9 గం,కు మొత్తం 800 శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో ఓపెన్ చేస్తే కేవలం ఒకటిన్నర నిమిషంలో మొత్తం టికెట్లు అమ్ముడు పోయినట్లు వస్తోంది. ఇదెలా సాధ్యం! దీని వెనుక మతలబు ఉంది. పెద్ద అవినీతి దాగి ఉంది. ఇంకా కుట్ర కూడా ఉందని మేం చెబుతున్నాం. దీని మీద టీటీడీ ఓ ప్రకటన ఇచ్చింది. ఇందులో సాఫ్ట్వేర్ మీద నిరంతర నిఘా పెట్టామని, ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ లాంటి పద్దతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లు పొందే అనుమానాస్పద కార్యక్రమాల మీద డేగ కన్ను వేశామని చెబుతోంది. అలాగే అక్రమ పద్దతుల్లో బుక్ చేస్తున్న ఐడీల్ని నిరోధించి దళారుల ఎత్తుగడల్ని తిప్పికొట్టేలా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నట్లు చెబుతోంది. కాబట్టి మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవద్దని టీటీడీ కోరుతోంది.టీటీడీ ద్వంద్వ వైఖరి:ఇంకా 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించామని, బుకింగ్ సైట్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ చొరబడటం సాధ్యం కాదంటున్నారు. మరోవైపు మళ్లీ కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ, ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల్లో టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.నాలుగు నెలలుగా రోజుకు 8 టికెట్లూ ఇవ్వలేదు!:టీటీడీని నేను ఓ ప్రశ్న వేస్తున్నా. 2024లో అధికారంలోకి వచ్చాక శ్రీవాణి టికెట్ల విధానాన్ని అత్యంత పటిష్టం చేశామని చెబుతున్న మీరు.. ఆటో ఫిల్లింగ్ పద్దతుల ద్వారా దళారులు చొరబడుతున్నారని ఒప్పుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 9న ఆన్ లైన్ విధానం ప్రవేశపెడితే, అప్పటి నుంచి ఇవాళ్టి వరకూ ప్రతీ రోజూ ఇచ్చే 800 శ్రీవాణి టికెట్లలో ఒక్కటి కూడా అర్హులకు అందలేదు. నాలుగు నెలలుగా ఈ విషయం మీరు గుర్తించనే లేదా? లేక నిద్రపోయారా? లేక నిద్ర నటిస్తున్నారా? లేదా మా విమర్శలకు భయపడి ఈ వివరణ ఇచ్చారా? అనేది చెప్పాలి.దళారులు, ట్రావెల్ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్లైన్లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల చేతుల్లో టికెట్లు కనిపిస్తున్నాయి. దీనిపై మేం లోతైన పరిశీలన చేస్తే టీటీడీ ఐటీ జీఎంగా ఓ ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ అర్హత కూడా లేని వ్యక్తిని నియమించారని తేలింది. ఈ వ్యక్తిని గతంలో విదేశాల్లో కళ్యాణోత్సవాలు జరపమని పంపిస్తే దాదాపు రూ.30 లక్షలు తినేశాడని పట్టుకుని ఆ మొత్తం రికవరీ కూడా చేశాం. అలాంటి వ్యక్తిని జీఎంగా నియమించారు. పెద్దలు తమకు తాబేదారుగా ఉంటాడని అతన్ని ఈ పోస్టులో నియమించారు.నిజానికి టీసీఎస్ నుంచి కొత్త సాఫ్ట్వేర్ వచ్చాకే ఈ దోపిడీ మొదలైంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అతనికి అనుంగు శిష్యుడైన మరో బోర్డు సభ్యుడు, స్ధానికుడు కూడా అయిన వ్యక్తి కలిసి రోజుకు రూ.40 లక్షల ఆదాయం శ్రీవాణి టికెట్ల ద్వారా పంచుకుంటున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో దాదాపు రూ.48 కోట్లు అలా దండుకున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి చెందాల్సిన రూ.48 కోట్లను వీరు అక్రమంగా దోచుకున్నారు.సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్ల జారీ!:మేం కొత్త సాఫ్ట్ వేర్ తెచ్చినప్పుడు శ్రీవాణి టికెట్లను మూడు నెలలకోసారి సెక్యూరిటీ ఆడిట్ చేసి కేటాయించే వాళ్లం. కానీ ఇప్పుడు టీసీఎస్ ఎలాంటి సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్లను రిలీజ్ చేస్తోంది. ఆటో ఫిల్లింగ్ ద్వారా ఎవరో దళారులు, ట్రావెల్ ఏజెంట్లు దూరుతున్నారని చెప్తున్న టీటీడీ.. మేం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ సిస్టమ్ లో మూడు నెలలకోసారి ఇచ్చే రూ.300 ఎస్ఈడీ టికెట్ల ఫ్రీ బుకింగ్ కానీ, కళ్యాణోత్సవం టికెట్లు కానీ, సేవా టికెట్ల డిప్లు కానీ, వసతి టికెట్లు కానీ, మూడు నెలలకు ఇచ్చే శ్రీవాణి కోటాలో ఎందుకు ఆటోఫిల్లింగ్ జరగడం లేదో సమాధానం చెప్పాలి. కొత్తగా ఆ సాఫ్ట్వేర్ రూపొందించామని చెప్తున్న టీటీడీ.. ఈ 800 టికెట్లకే ఎందుకు ఆటోఫిల్లింగ్ జరుగుతోందో చెప్పాలి.అంటే అందరూ కూడబలుక్కుని దోపిడీ చేస్తున్నారు. విజిలెన్స్, ఐటీ రంగం పూర్తిగా నిర్వీర్యం కావడమే కాకుండా నిస్సత్తువతో మిలాఖత్ అయ్యాయి. అటు పెద్దలు, ఇటు దళారులు, ఐటీ, విజిలెన్స్ కలిసే ఈ తతంగం నడుపుతున్నారు. ఒక్క రోజులో కనుక్కోవాల్సిన విషయాన్ని మేం పదే పదే చెప్తుంటే, విమర్శల జడివాన పెరిగాక ఇలా జరుగుతోందని, డేగ కన్ను వేశామని కబుర్లు చెప్తున్నారు. కన్ను తెరిచారే తప్ప అది పని చేయడం లేదు.సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే:శ్రీవాణి టికెట్ల స్కామ్పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఏకంగా రూ.48 కోట్ల స్కామ్ జరిగింది. మేం శ్రీవాణి టికెట్లు ఆ‹ లైన్లో ఇచ్చినప్పుడు రోజుకు 1000 వరకు ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వం దాన్ని మూసేసి ఆన్ లైన్ విధానం తీసుకొచ్చింది. ఈ నాలుగు నెలల కాలంలో రోజుకు కనీసం 8 మందికి కూడా టికెట్లు దొరకలేదు. దళారులంతా టీటీడీ వెబ్ సైట్ ద్వారానే టికెట్లు కొంటున్నారు. ఎలా అంటే మీ ఐటీ, విజిలెన్స్ విభాగాలు, పాలక మండలి పెద్దలు కుమ్ముక్కు కావడం వల్లే. అలా అంతా ఒక్కౖటై ఒక్కో బ్రేక్ దర్శనం టికెట్ రూ.4 వేలకు అమ్ముతున్నారని భూమన కరుణాకర్రెడ్డి తేల్చి చెప్పారు. -
సౌదీలో పునబాక మహిళ ఆత్మహత్య
తిరుపతి: మండలంలోని పునబాక గ్రామానికి చెందిన ఉయ్యాల భాస్కరయ్య, తయారమ్మ దంపతుల కుమార్తె కోనేటి మమత(36) బుధవారం సౌదీలోని జుబేల్ ప్రాంతంలో ఉంటూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో తిరుపతికి చెందిన కోనేటి చెంగయ్య (విశ్రాంత ఎస్ఐ) చిన్న కుమారుడు కోనేటి కృష్ణకి మమతను ఇచ్చి వివాహం చేశారు. వీరు శ్రీకాళహస్తిలోని ఇందిరానగర్లో నివాసం ఉండేవారు.వీరికి కోనేటి రూపేష్ కోనేటి లోహిత్ కుమారులు ఉన్నారు. 2012లో కృష్ణకి సౌదీలోని సాట్రాప్ పెట్రో కెమికల్ కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం రావడంతో భార్యభర్తలిద్దరు సౌదీలో నివాసం ఉంటున్నారు. తిరుపతిలో ఉన్న కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి వివాదం నెలకొనడంతో మమత మనస్తాపానికి గురై భర్త ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అయితే మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చి తమకు అప్పగించేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
బాలు ఆత్మహత్యాయత్నం.. NHRCకి ఎంపీ గురుమూర్తి లేఖ
సాక్షి,తిరుపతి: కర్నూలు త్రీ టౌన్ పోలీసుల దారుణ వేధింపులు తాళలేక బాలు అనే యువకుడు ఆత్మహత్యా యత్నం చేశారని, ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకుని స్వతంత్య్ర విచారణ జరిపాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని (ఎన్హెచ్ఆర్సీ) కోరారు. ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాసిన ఎంపీ గురుమూర్తి, రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘణ యథేచ్ఛగా సాగుతోందని వెల్లడించారు.ఎన్హెచ్ఆర్సీకి రాసిన లేఖలో ఎంపీ గురుమూర్తి ఇంకా ఏం ప్రస్తావించారంటే..బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన బాలు, చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. అధికార పక్షానికి చెందిన కొందరు నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఆ విధంగా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా మద్యం, మాదకద్రవ్యాల కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు బాలు తెలిపారు. తన నిర్దోషిత్వం గురించి, ఎంత చెప్పినా పట్టించుకోని పోలీసులు, ఆయన్ను మానసికంగానే కాకుండా, శారీరకంగా కూడా వేధించడంతో, అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు.కర్నూలు త్రీ టౌన్ పోలీసుల తీరు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద కల్పించిన సమానత్వ హక్కు, జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవన హక్కులకు పూర్తి విరుద్ధంగా ఉంది. అలాగే, మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993లోని సెక్షన్ 12(ఎ), 12(సి), 12(జె) ప్రకారం కూడా ఉల్లంఘనే. కాబట్టి దీనిపై విచారించే హక్కు ఎన్హెచ్ఆర్సీకి ఉంది.అందువల్ల కర్నూలు త్రీటౌన్ పోలీసుల చర్యలపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, జిల్లా పోలీసు అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరాలని, బాధితుడు బాలుతో పాటు, అతడి కుటుంబానికి రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఆ లేఖలో ఎన్హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. అలాగే, చట్ట విరుద్ధంగా వ్యవహరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై శాఖాపరంగా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. -
15 నుంచి ఎస్వీయూ కళాశాలలకు సెలవులు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు ఈనెల 15 నుంచి జూన్ 28వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్డీ కోర్సుల చదువుతున్న విద్యార్థులకు జూన్ 29వ తేదీన యథాతధంగా తరగతులు ప్రారంభమవుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు. నేటితో ముగిసిన గడువు – తుది దశలో బ్రిడ్జి మరమ్మతు పనులు రేణిగుంట: పట్టణానికి ముఖద్వారంగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి మరమ్మతు పనులు చేసేందుకు గత నెల 13వ తేదీ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేశారు. మే 12వ తేదీలోపు పనులు పూర్తి చేసి యథావిధిగా బ్రిడ్జిలో రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు అప్పుట్లో వెల్ల డించారు. అధికారులు ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ప్రస్తుతం బ్రిడ్జి మరమ్మతు పను లు చివరి దశలో ఉన్నాయి. రెండు రోజుల్లో పనులు పూర్తి చేసి రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మరో అండర్ బ్రిడ్జ్ ద్వారా స్థానికులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రహదారిలో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా బ్రిడ్జి మరమ్మతు పనులను పూర్తి చేసి వాహనచోదకుల ఇక్కట్లు తొలగించాలని కోరుతున్నారు. ముక్కంటి సేవలో కర్ణాటక హైకోర్టు జడ్జి శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని మంగళవారం కర్ణాటక హైకో ర్టు జడ్జి శ్రీషానంద కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయాధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వామి అమ్మవార్ల జ్ఞాపిక అందజేశారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలా..!
●కేంద్రమంత్రి రాజీనామా చేయాలి ఇంటర్ రెండేళ్లు పుస్తకాల పురుగులుగా మారి శ్రమించి నీట్ రాసిన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏని రద్దు చేయాలి. పేపర్ను లీక్ చేసి, రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నీట్ లీకేజ్కి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ఉద్యమిస్తాం. – చిన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు, తిరుపతి ఎన్టీఏని రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను ఆట వస్తువులుగా చేసి చెలగాటమాడుతోంది. నీట్ పేపర్ లీక్ చేసి, రూ.కోట్లు దండుకుంటున్న ఎన్టీఏ అధికారులు, కేంద్ర విద్యామంత్రిత్వశాఖ పూర్తి బాధ్యత వహించాలి. తక్షణం ఎన్టీఏని రద్దు చేయాలి. రూ.లక్షలు వెచ్చించి కొన్ని ఏళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం దారుణం. – అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, తిరుపతి విద్యావ్యవస్థ నిర్వీర్యం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి.నీట్ పేపర్ లీక్ కు కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ప్రతిష్టాత్మక నీట్ను సక్రమంగా నిర్వహించలేని దు స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉండడం బాధాకరం. పరీ క్ష రద్దు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. తక్షణం ఎన్టీఏని రద్దు చేయాలి. – ప్రేమ్ కుమార్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఎస్వీయూ తిరుపతి సిటీ: దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు. గత మూడేళ్లుగా యూజీ నీట్ పరీక్ష వివాదాస్పదంగా మారుతున్నా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. మే 3వ తేదీన జరిగిన నీట్ దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది రాశారని, వారి జీవితాలతో ఎన్టీఏ ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా పేపర్ లీక్ చేస్తూ అవినీతి ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తిరుపతి జిల్లాలో ఈ ఏడాది 4,542 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో సుమారు 60 శాతం మంది విద్యార్థులు సుదూర ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకుని పరీక్ష కాస్త మెరుగుగా రాశారని, కానీ పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట్ రాసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు పరీక్ష రద్దుపై ఏమన్నారంటే.. ఏటా ఇదే తంతు మా అబ్బాయి రెండేళ్లుగా విజయవాడలో నీట్కు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. గత ఏడాది 5 మార్కుల తేడాతో సీటు దగ్గరకు వచ్చి చేజారింది. ఈ ఏడాది 590 వరకు వస్తాయని నమ్మకంతో ఉన్నాం. కానీ పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దు కావడం మానసికంగా కుంగిపోతున్నాం. మళ్లీ పరీక్ష రాయాలంటే పేపర్ ఎలా వస్తుందో భయంగా ఉంది. ప్రతి ఏడాది పేపర్ లీక్ తంతు కొనసాగుతోంది. – సుశీలమ్మ, నీట్ విద్యార్థి తల్లి, తిరుపతి విద్యార్థులపై మానసిక ఒత్తిడి నీట్ రద్దు దారుణం. ఎన్టీఏ పరీక్షను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైంది. మా అమ్మాయి ఈ ఏడాది నీట్ రాసింది. ఏడాది కోచింగ్కు రూ.4 లక్షలు వెచ్చించాం. మాకు రిజర్వేషన్ ఉంది. మంచి మార్కులతో సీటు వస్తుందని ధైర్యంగా ఉన్నాం. కానీ పరీక్ష రద్దుతో ప్రతి విద్యార్థీ మానసిక ఒత్తిడికి గురయ్యారు. – ప్రభాకర్రెడ్డి, నీట్ విద్యార్థి తండ్రి, తిరుపతి రూరల్ ఆశలన్నీ అడియాశలయ్యాయి ఈ ఏడాది నీట్ బాగా రాశా. రూ.లక్షలు వెచ్చించి హైదరాబాద్లో పేరొందిన కోచింగ్ సెంటర్లో లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నా. కానీ లీకేజ్ పేరుతో నీట్ రద్దు చేశారు. 585కు పైగా మార్కులు వస్తాయని సంతోషంగా ఉన్నా. ఆశలన్నీ అడియాశలయ్యాయి. మళ్లీ పరీక్ష రాయలంటే అన్ని మార్కులు సాధిస్తాననే నమ్మకం లేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దారుణం. – శ్రీలత, నీట్ విద్యార్థిని, తిరుపతి మళ్లీ రాయాలంటే భయంగా ఉంది మే 3వ తేదీ జరిగిన నీట్ బాగా రాశాను. పేపర్ లీక్ కావడంతో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో మళ్లీ పరీక్ష రాయాలంటే భయమేస్తోంది. పరీక్ష పేపర్ ఎలా వస్తుందోనని మనసులో భయంగా ఉంది. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నా. మళ్లీ ప్రిపరేషన్ ప్రారంభించాల్సిన పరిస్థితి. – శివ శంకర్, నీట్ విద్యార్థి, రేణిగుంట వైద్యవిద్యలో ప్రవేశం ప్రస్తుత తరుణంలో ఆషామాషీ కాదు.. అయినప్పటికీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లక్షలాది మంది సిద్ధమయ్యారు. తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలన్న ఆకాంక్షతో తల్లిదండ్రులు తమ తహతకు మించి రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ ఇప్పించారు. తమ బిడ్డలను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో విద్యార్థులు ‘నీట్’గా పరీక్ష రాశారు. అయితే కేంద్ర విద్యాశాఖ, ఎన్టీఏ నిర్లక్ష్యంతో పేపర్ లీక్.. ఫలితంగా లక్షలాది విద్యార్థులు షాక్కు గురయ్యారు. విద్యార్థుల జీవితాలతో ఆటలా? అని నిలదీస్తున్నారు.బిగ్ బాంబ్ -
పోటెత్తిన జనం
గంగ రంగ వైభవం..వైభవంగా గంగమ్మ జాతర సంబరాలు తాతయ్యగుంట గంగమ్మ విశ్వరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తిరునగరిలో గంగమ్మజాతర వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆలయ ఆవరణలోని కొడిస్తంభానికి బంకమట్టితో గంగమ్మ విశ్వరూప ప్రతిమను తీర్చిదిద్దే పనిలో పలు సామా జిక వర్గాల వారు నిమగ్నమయ్యారు. ఆ రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి వేచి ఉన్నారు. దీంతో గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీతిరుపతి కల్చరల్: శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర తిరుపతిలో వైభవంగా జరిగింది. ఈ నెల 5వ తేదీ రాత్రి చాటింపుతో మొదలైన జాతర వారం రోజుల పాటు అత్యంత కోలాహలంగా సాగింది. రోజువారీ విభిన్న వేషాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం జాతర చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో గంగమ్మ ఆలయం కిక్కిరిసింది. సోమవారం అర్ధరాత్రి అమ్మవారికి మహాశాంతి అభిషేకం తర్వాత అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో పొర్లుండాలతో ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుబడిలో భాగంగా వేపాకు చీరలతో గంగమ్మను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. జాతర చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు విశేష సంఖ్యలో భక్తులు వివిధ పౌరాణిక, జానపద, సీ్త్ర వేషాలు ధరించి తిరుపతి వీధుల్లో కేరింతలతో విహరిస్తూ సందడి చేశారు. డప్పుల దరువుల నడుమ చిందులు వేస్తూ గంగమ్మ ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించారు. భక్తజనంతో గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. గంగమ్మ దర్శనంలో భాగంగా ఆలయాధికారులు, పోలీసులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. జాతరను పురస్కరించుకుని గంగమ్మ ఆలయం వద్ద భక్తులు మజ్జిగ, అంబళ్లు పంపిణీ చేశారు. వివిధ వేషధారణలో భక్తులుబారులు తీరిన భక్తులు తాతయ్యగుంట గంగమ్మ జాతరలో చివరి రోజు మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమ్మవారు విశ్వరూపం దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంభం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంకమట్టితో సర్వాంగసుందరంగా అమ్మవారి విశ్వరూప ప్రతిమ కొలువు తీర్చే పనిలో పలువురు నిమగ్నమయ్యారు. అమ్మవారి విశ్వరూప ప్రతిమ తయారీలో కుమ్మరి, కంసాలి, విశ్వబ్రాహ్మణ, చాకలి, దళితులు తదితర సామాజిక వర్గాలవారు భక్తిప్రపత్తులతో అమ్మవారి విశ్వరూపాన్ని కొలువు తీర్చుతారు. అమ్మవారి విశ్వరూప ప్రతిమ చంపను పేరంటాల వేషధారుడు నరకడంతో జాతర సమాప్తం అవుతుంది. -
ఆకు రౌడీల ముసుగులో ఆక్రమణలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: నిజాయితీ వార్తలు రాసే సీనియర్ జర్నలిస్టులకే నిలువ నీడలేదు.. జర్నలిస్టుల ముసుగులో ఆకు రౌడీలు స్థలాలు ఆక్రమిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్, రాష్ట్ర మున్సిపల్ విభాగం ఉపాధ్యక్షులు రామస్వామి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నగరంలో ఆ పార్టీ శ్రేణులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారన్నారు. నగరంలోని ఎర్రమిట్టలో రూ.కోట్లు విలువైన భూమిని ఆక్రమించుకునేందుకు.. టీడీపీ నాయకులు జర్నలిస్టుల పరిరక్షకులం అన్న పేరుతో వాళ్ల ఆకతాయి సైన్యం అంతా ఆక్రమణలకు తెగబడ్డారన్నారు. ఎక్కడ ఆక్రమించాలో అక్కడ వీళ్లు వాలిపోయి ఓనరుల్లాగా చెలామణి అవుతారని మండిపడ్డారు. మొన్న జరిగిన ఘటనలో ఆ స్థల యజమానులపై ఎన్ని రకాలైన బీభత్స కార్యక్రమాలు చేయాలో అన్ని రకాలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల తీరుని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఎవరు నిజమైన జర్నలిస్టులో.. జర్నలిస్టు ముసుగేసుకుని ఎవరు నాటకాలాడుతున్నారో అందరికీ తెలుసనన్నారు. 30 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో అత్యంత నీతి నిజాయితీలతో వార్తలు రాసే వారు నిలువ నీడలేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకు రౌడీల అండతో పేట్రేగిపోతున్న వారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
గడువులోపు భూసేకరణ పూర్తి చేయాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: భూ సేకరణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ మిని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావుతో కలసి భూ సంబంధిత పెండింగ్ పనుల పురోగతిపై పర్చువల్గా రెవెన్యూతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానెల్లూరు, పాగలి, ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులు కూడా త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. వెబ్ ల్యాండ్పై ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, వైజాగ్– చైన్నె కారిడార్ పైపు లైను పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరు పేట ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, అనురాధ, రోజ్ మాండ్, ల్యాండ్ అండ్ సర్వే రికార్డు లు అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, ఏపీఐఐసీ తిరుపతి, నెల్లూరు జోనల్ మేనేజర్లు విజయ్ భరత్రెడ్డి, ఎల్. శివకుమార్, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్, తహసీల్దార్లు, డీటీలు, సెక్షన్ ఆధికారులు భాస్కర్, చంద్రశేఖర్, భార్గవి, శివప్రసాద్ పాల్గొన్నారు. -
గంగమ్మ దర్శనం ఆనందదాయకం
తిరుపతి కల్చరల్: తాతయ్య గుంట గంగమ్మను మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు శాస్త్రోక్తంగా పూజలు చేసి, మ్మవారి హారతి, తీర్థప్రసాదాలు జిల్లా కలెక్టర్కు అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం కలెక్టర్ ఆలయం వద్ద ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ను మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ శారదాదేవి, గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు మంచి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఏటా మున్సిపల్ కార్పొరేషన్, తుడా, టీటీడీ వారి సహకారంతో తిరుపతిలో గంగమ్మ జాతరను జరుపుకుంటున్నారన్నారు. జాతర ఏర్పాట్లపై నెల రోజుల నుంచి జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులతో సమీక్ష చేశామన్నారు. జాతర సందర్భంగా ప్రత్యేక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బందోబస్తు, కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండ తీవ్రత నేపథ్యంలో భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ తదితర సదుపాయాలను దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేశారని తెలిపారు. గంగమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఏ.జయకుమార్, దేవదాయ శాఖాధికారులు రామకృష్ణారెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు. -
గంగజాతర ఇంగ్లిషు గ్రంథం ఆవిష్కరణ
తిరుపతి కల్చరల్: సున్నపు కుండలు వేషంలో పెద్ద గంగమ్మ, చిన్నగంగమ్మలైన అక్కాచెల్లెళ్లు తిరుపతి ప్రజల కు కై కాల వారు వేసే ఈ వేషాల్లో దర్శనమిస్తారు. ఈ మేరకు మంగళవారం గంగమ్మల వేషధారణలో ఉన్న కై కాల వారు ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి ఇంగ్లిషులో రచించిన ‘ది ఫోక్ ఫెస్టివల్ ఆఫ్ గంగ జాతర ఇన్ తిరుపతి’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగమ్మలు ఆవహించిన కై కాల వారు మాట్లాడుతూ పేటశ్రీ 30 ఏళ్లకు ముందే తెలుగులో ‘తిరుపతి గంగజాతర ’ అనే పుస్తకాన్ని రెండు ఎడిషన్లు ప్రచురించారని, ద్రావిడ విశ్వవిద్యాలయం వారు ఇంగ్లిషులో ఆయన రాసిన 120 పేజీల పుస్తకాలను కూడా ప్రచురించి తిరుపతి గంగమ్మలకు ఎంతో సేవ చేశారన్నారు. ఆచార్య పేటశ్రీ మాట్లాడుతూ తాను తిరుపతిలో పుట్టి పెరిగానని, మన గంగమ్మ జాతరను ప్రపంచానికి తెలిజేసే ప్రయత్నం చేశానని తెలిపారు. ప్రస్తుతం తాను రచించిన ఈ ఇంగ్లిషు గ్రంథంలో వందేళ్లకు ముందు జాతర ఎలా ఉందో?, ఇప్పుడు ఎలా ఉందో? కొత్తగా రాసిన అధ్యాయంలో వివరించానన్నారు. భవిషత్తులో తమిళ, కన్నడ భాషల్లో కూడా ‘ తిరుపతి గంగజాతర ’ పుస్తకాన్ని ఆ గంగమ్మ తల్లి చలువతో వెలువరిస్తానని చెప్పారు. గంగమ్మల చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. -
గోడ దూకి గోవా వెళ్లాడు!
చంద్రగిరి: పరీక్షలు సరిగ్గా రాయలేదనే కారణంగా భయపడి ఎవరికీ చెప్పకుండా గోడ దూకి పారిపోయిన విద్యార్థి ఆచూకీని తిరుచానూరు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గోవాలోని వాస్కోలో బాలుడిని పోలీసులు సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గీతం జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువున్న జస్వంత్ రెడ్డి మార్చి 12వ తేదీన ఎవరికీ చెప్పకుండా కళాశాల నుంచి వెళ్లిపోయాడు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఈ విషయమై తిరుచానూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాల గాలింపు, సాంకేతిక ఆధారాలతో జస్వంత్ రెడ్డి గోవాలోని వాస్కో ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసు బృందం మంగళవారం వాస్కోకు చేరుకుని, అక్కడి పోలీసుల సహకారంతో బాలుడిని సురిక్షతంగా అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని విచారించగా ఇంటర్ ఫైనల్ పరీక్షలు సరిగ్గా రాయకపోవడంతో భయపడి ఎవరికీ చెప్పకుండా వచ్చేసినట్లు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం బాలుడిని పోలీసులు తిరుచానూరుకు తీసుకొచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ విద్యార్థులపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు వారి మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారిని ప్రోత్సహించాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో లేదా ఉపాధ్యాయులతో మాట్లాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. -
ఎవరూ లేని ఇళ్లే అతని టార్గెట్..!
● రాత్రుల్లో చోరీకి పాల్పడే దొంగను అరెస్టు చేసిన తిరుచానూరు పోలీసులు ● రూ.8లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం ● వివరాలను వెల్లడించిన సీఐ సునీల్ కుమార్ దొంగ అరెస్టు చంద్రగిరి: తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీల కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సునీల్ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తిరుపతి జీవకోన, నవజీవన కాలనీలో ఉంటున్న వరదరాజుల మణి జల్సాలకు అలవాటు పడి ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో మార్చి 27వ తేదీన మంగళం తుడా క్వార్టర్స్లోని ప్లాట్ నంబర్ 51లో కాపురమున్న వెంకటేష్ బంధువుల ఇంట్లో శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. ఈ విషయం గుర్తించిన వరదరాజుల మణి 29వ తేదీన పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి బీరులోని ఉంచి 57 గ్రాముల బంగారు ఆభరణాలు, 512 గ్రాముల వెండి ఆభరణాలను దోచుకెళ్లాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తుల కదలికల గురించి విచారణ చేపట్టడంతో పాటు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళం సమీపంలోని ఆశ కల్యాణ మండపం సమీపంలో వరదరాజుల మణిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించడంతో సుమారు 3 ఇళ్లలో చోరికి పాల్పడినట్లుగా తేలింది. గత ఏడాది నవంబర్లో జైలు నుంచి బెయిల్పై వచ్చిన మణి తిరిగి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అలిపిరి, తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో 3 ఇళ్లలో చోరీలు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై తిరుచానూరు, అలిపిరి, సీసీఎస్, తిరుపతి రూరల్ పోలీసు స్టేషన్లలో 19 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామన్నారు. చోరీ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ సునీల్ కుమార్, ఎస్లు, క్రైం సిబ్బంది ప్రభాకర్, ప్రసాద్, షఫీలను ఎస్పీ అభినందించి వారికి నగదు రివార్డులను అందజేశారు. -
ప్రశాంతంగా ఈఏపీసెట్
తిరుపతి సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2026 (ఎంసెట్) జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. తిరుపతి రేణిగుంట రోడ్డులోని చదలవాడ ఇంజినీరింగ్ కళాశాల, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల, అన్నమయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్, పుత్తూరు శ్రీవెంకటేశ పెరుమాల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని 5 పరీక్ష కేంద్రాల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్కు జరిగిన తొలిరోజు పరీక్షకు 96.50 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12గంటల వరకు నిర్వహించిన తొలి సెషన్లో 616 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 592 మంది పరీక్ష రాశారన్నారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 1,331 మందికి గాను 1,287 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. రెండో రోజు బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల్లో మరో 1,450 మంది వరకు పరీక్షకు హాజరవుతారని వెల్లడించారు. మృతదేహం కోసం నిరీక్షణ సైదాపురం: మనుబోలు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైదాపురం గ్రామానికి చెందిన కొత్తలూరు కళ్యాణ్(23) మృతదేహం కోసం బంధువులు మంగళవారం రాత్రి వరకు నిరీక్షించారు. పోస్టుమార్టం అలస్యం కావడంతో బుధవారం మృతదేహాన్ని అప్పగిస్తారనే సమాచారం అందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తిరుగుముఖం పట్టారు. మండలంలోని రాగనరామాపురం గ్రామానికి చెందిన కొత్తలూరు శేఖర్ పనులు చేసుకుని జీవించేవాడు. కొంత కాలం నుంచి రాగనరామాపురం నుంచి వచ్చి సైదాపురం ఎస్టీ కాలనీలో కాపురం ఉంటున్నారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్న కళ్యాణ్(23) డ్రైవర్గా పని చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో మనుబోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ మృతి చెందాడు. దీంతో కల్యాణ్ మృత దేహాన్ని పోస్టుమార్టానికి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా మంగళవారం రాత్రియినా మృతదేహం అప్పగించకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కళ్యాణ్ మృతదేహం కోసం నిరీక్షించారు. కాని మృతదేహం రాకపోవడంతో తిరుగుముఖం పట్టారు. బుధవారం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారని తెలిసింది. చిన్నవయస్సులోనే కళ్యాణ్ మృతి చెందడంతో ఆకుటుంబంలో పెను విషాదం నెలకొంది. -
టౌన్బ్యాంకుపై పచ్చపాతం
ఆ బ్యాంకుది శతాబ్ద చరిత్ర.. తిరునగరిలో ఎందరో ఉద్యోగులకు జీవనాధారం.. వేలాది మంది ఖాతాదారులకు ఆర్థికంగా అండ.. అయితే నేడు దానిపై ‘పచ్చ’పాతం. ఉద్దేశపూర్వకంగా బ్యాంకులో గోల.. అరుపులు.. దూషణలు.. వెరసి డిపాజిటర్లు, ఖాతాదారుల్లో ఆందోళన, భయం.. శతాబ్ద చరిత్ర ఎక్కడ దెబ్బతింటుందోనని ఆందోళన.. ఇదీ నేడు తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్ దుస్థితి. సాక్షి టాస్క్ఫోర్స్: 108 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగుల పేరుతో కొందరు వ్యక్తులు బ్యాంకు పరిపాలనను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు దిగారని షేర్ హోల్డర్లు, డిపాజిటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఎండీ చాంబర్లోకి అనుమతి లేకుండా దూసుకెళ్లిన కొందరు ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పాలకమండలిని అవమానించేలా అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారని సమాచారం. సాధారణంగా ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు రౌడీల్లా ప్రవర్తించడం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. బ్యాంకు హాలులో పెద్దఎత్తున గోల చేస్తూ ‘చేతకాని పాలకమండలి దిగిపోవాలి’ అంటూ అరుపులు, దూషణలతో హంగామా సృష్టించిన ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలిసింది. రూ.4 వేల జీతం కోసం పనిచేస్తున్నారా? బ్యాంకు డైరెక్టర్లు కేవలం రూ.4 వేల జీతం కోసం పనిచేస్తున్నారంటూ ఉద్యోగులే బహిరంగంగా దూషించారని షేర్ హోల్డర్లు మండిపడుతున్నారు. పరిపాలనపై విమర్శలు చేయడం వేరు కానీ, సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించడం వెనుక దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని వారు అంటున్నారు. ఉద్యోగం చేయకుండా జీతాలు? 46 రోజులుగా బ్యాంకు లోపల, బయట నిరసనల పేరుతో ఉద్యోగులు విధులను పక్కన బెట్టి ఆందోళనలు చేస్తున్నారని, అయినప్పటికీ రెండు నెలలుగా జీతాలు తీసుకుంటున్నారని పలువురు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. సాధారణ కస్టమర్లు సేవల కోసం బ్యాంకుకు వస్తే, గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. డిపాజిటర్లలో భయం బ్యాంకులో నిత్యం నిరసనల కారణంగా డిపాజిటర్లు కూడా వెనక్కి తగ్గే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కొనసాగితే బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుందని, ప్రజల నమ్మకం కోల్పోతుందని పలువురు షేర్ హోల్డర్లు ఆందోళన వ్యక్తం చేశారు.108 ఏళ్ల వారసత్వాన్ని కాపాడేదెవరు? స్వాతంత్య్రం రాక ముందే ప్రారంభమైన ఈ కో–ఆపరేటివ్ బ్యాంక్ వేలాది కుటుంబాలకు అండగా నిలిచింది. అలాంటి సంస్థను కొందరి రాజకీయ ఆశల కోసం బలి చేయాలని చూస్తున్నారని ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకును కాపాడాల్సిన ఉద్యోగులే బ్యాంకు ప్రతిష్టను వీధికీడ్చడం బాధాకరమని అంటున్నారు. రాజకీయ ప్రేరేపిత శక్తులు వెంటనే ఆగాలని డిపాజిటర్లు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్లో టీడీపీ దాష్టీకమా? టీడీపీ రాజకీయాల కోసం బ్యాంకు వేదిక? ఈ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు టీడీపీ నాయకుల ప్రోత్సాహంతోనే ఉద్యోగులు ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారని బ్యాంకు వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్యాంకు చైర్మన్ పదవిపై కన్నేసిన మాజీ చైర్మన్ వర్గమే ఈ ఉద్రిక్తతలకు తెరలేపిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొందరు ఉద్యోగులే బయట నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అనధికారికంగా చెప్పడం గమనార్హం. దీంతో బ్యాంకు పరిరక్షణ పేరుతో మొదలైన ఆందోళన ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపుగా మారిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
దొరవారిసత్రం: గుర్తు తెలియని సుమారు 35 ఏళ్లు వయస్సు కలిగిన ఓ వ్యక్తి రైలు నుంచి జారి పడిపోయిన మృతి చెందిన ఘటన పోలిరెడ్డిపాళెం రైల్వేస్టేషన్కు సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం వెలుగు చూసింది. స్థానిక రైల్వే గ్యాంగ్ సిబ్బంది, జీఆర్పీ పోలీసుల కథనం మేరకు.. చైన్నె వైపు వెళ్లే గుర్తుతెలియని రైలు నుంచి జారి పడిపోయి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు వద్ద ఎలాంటి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, జమునా మత్తూరు తాలూకాకు చెందిన పెరుమాళ్ గోపాల్కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తిరుపతి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (టాస్క్ఫోర్స్) 2019లో శేషాచలం, కరకంబాడి ఫారెస్ట్ బీట్, కృష్ణాపురం సెక్షన్, ఎస్వీఎన్పీ చామల రేంజ్ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. నిందితుడు గోపాల్ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా మార్చి తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో అతనికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిదొరవారిసత్రం: ప్రమాదశాత్తు ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో దాని కింద పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల, పోలీసుల కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాళెం ఎస్సీకాలనీ చెందిన కలింబాకం చెంగయ్య(29) ట్రాక్టర్లో నాయుడుపేటకు షామియానా, కుర్చీలు తీసుకువెళ్లి అక్కడ అన్లోడ్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో నెలబల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి జాతీయ రహదారి మధ్యలోని డివైడర్ను ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ను నడుపుతున్న చెంగయ్య ట్రాక్టర్ కిందనే పడి తీవ్ర గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు దొరవారిసత్రం: మండలంలో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని మంగళవారం పోలీసులు రక్షించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వేణుంబాకం గ్రామానికి చెందిన షేక్ సలాం(28)కు, అతని భార్యతో కొంత కాలంగా వివాదాలు తలెత్తాయి. దీంతో అతని భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటి రావాలని ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో సలాం మనస్తాపం చెందాడు. పంట పొలాలకు పిచికారి చేసే పురుగుల మందు, మద్యం సీసా తీసుకుని గ్రామానికి దూరంగా వెళ్లాడు. తొలుత ఎడమ చేయి కోసుకున్నాడు. తరువాత మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్యహత్యకు యత్నిస్తూ ఫొటోలను తీసుకుని చనిపోతున్నట్లు అతని బంధువులకు పంపాడు. అతను ఎక్కడ ఉన్నడో తెలియక సలాం పంపిన ఫొటోలను అతని బంధువులు దొరవారిసత్రం పోలీసులు పంపారు. అతని సెల్ఫోన్ లోకేషన్ను పోలీసులు గుర్తించారు. వెంటనే అతను ఉన్న స్థలానికి అంబులెన్స్ను తీసుకువెళ్లి అతనిని చికిత్స నిమిత్తం నాయుడుపేటలో ప్రైవేటు ఆస్పత్రి తరలించారు. సలాం ఆరోగ్యం పరిస్థితి కుదుట పడినట్లు పోలీసులు తెలిపారు. -
ఖేలో ఇండియా సంయుక్త కార్యదర్శి ఐసర్ సందర్శన
ఏర్పేడు:ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా సంయుక్త కార్యదర్శి వినీల్కృష్ణ మంగళవారం తిరుపతి ఐసర్ను సందర్శించారు. ఆయనకు ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతాను భట్టాచార్య, ఐసర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్సింగ్ కోహ్లీ జ్ఞాపిక అందజేసి, ఘనంగా సత్కరించారు. ఆయన పర్యటన సందర్భంగా ఐసర్ విద్యాసంస్థల్లో క్రీడలు, యువత సాధికారత, సంపూర్ణ అభివృద్ధి ప్రాముఖ్యతపై చర్చించారు. విద్యార్థుల్లో విద్య, పరిశోధన, ఫిట్నెస్, క్రీడా సంస్కృతిలో శ్రేష్టతను ప్రోత్సహించాలనే ఉమ్మడి దృక్పథాన్ని ఆయన పర్యటన ప్రతిబింబించిందని స్పష్టం చేశారు. -
రూ.10 కోట్లు విలువైన పార్క్ స్థలం కబ్జా..!
సాక్షి, టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గుడి, బడి, ప్రభుత్వ స్థలాలు.. ఇలా దేన్నీ వదలకుండా ఆక్రమించేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీకి కేటాయించిన రూ.10 కోట్ల విలువజేసే 1.57 ఎకరాల పార్క్ స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు ఆక్రమించి పట్టపగలే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్క్ స్థలం కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిస్తున్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకి సమీప బంధువునని చెబుతుండడం వల్ల సదరు ఎమ్మెల్యే స్పందించి నిర్మాణ పనులను నిలిపివేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పుదిపట్ల గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 558లో ఉన్న దరఖాస్తు పట్టా భూమిని గతంలో ఓ ప్రైవేట్ వెంచర్ సంస్థ అభివృద్ధి చేసి పార్క్కు కేటాయించినట్టు సమాచారం. ఆ స్థలంపై చాలాకాలం నుంచి కన్నేసిన స్థానిక టీడీపీ నేత ఇప్పుడు అధికార బలంతో స్వా«దీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు తిరుపతి కోర్టును ఆశ్రయించగా, అది పార్కు స్థలమేనని కోర్టు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా రికార్డులు మార్చి ఆక్రమణదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని, ఆ స్థలంపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తున్నందున కింది కోర్టు ఆదేశాలు ధిక్కరణ కింద చర్యలు కోరతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 55 అర్జీలు
తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 55 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెకేషన్ కోర్టు షెడ్యూల్ విడుదల తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యవసర సివిల్ కేసులు దాఖలు చేసుకోవడానికి ఏర్పాటైన వెకేషన్ కోర్టు ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ తేదీల్లో విధులు నిర్వహిస్తుందన్న షెడ్యూలను వెకేషన్ కోర్టు జడ్జి, మదనపల్లి రెండో అదనపు జిల్లా జడ్జి పీవీఎస్ సూర్యనారాయణమూర్తి సోమవారం విడుదల చేశారు. ఈనెల 13, 20 తేదీల్లో చిత్తూరులోనూ, ఈనెల 14, 25వ తేదీల్లో తిరుపతిలో, ఈనెల 12, 15, 19, 21, 26 తేదీలు మదనపల్లిలోను, ఈనెల 18వ తేదీ పీలేరులోనూ, ఈనెల 22వ తేదీ శ్రీకాళహస్తిలో విధులు నిర్వహించనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జడ్జి సూర్యనారాయణ మూర్తి వెకేషన్ కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు. ముగిసిన ఏపీపీజీసెట్ తిరుపతి సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్వీయూ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరిగిన ఏపీ పీజీసెట్–2026 సోమవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలో 23 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పీజీసెట్ ప్రశాంతంగా ముగిసిందని కన్వీనర్ ప్రొఫెసర్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మూడు సెషన్లలో 13 సబ్జెక్టులకు సంబంధించి ప్రవేశ పరీక్ష జరిగిందని, 88 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. నాలుగు రోజులుగా జరిగిన పరీక్షలకు 19,118 మంది హాజరు కావాల్సి ఉండగా 16,406 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. దీంతో పీజీసెట్–2026 పరీక్షకు మొత్తం 85.8 శాతం హాజరు నమోదైందని, ఫలితాలు ఈనెలాఖరులోపు వెల్లడించి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ముక్కంటి సేవలో హైకోర్టు జడ్జి శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని సోమవారం ఏపీహైకోర్టు జడ్జి కిరణ్మయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద బీకే వెంకటేశులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. స్థానిక న్యాయమూర్తి కృష్ణప్రియ పాల్గొన్నారు. ఎస్వీయూలో పదోన్నతులు తిరుపతి సిటీ: ఎస్వీయూలో నాన్టీచింగ్ ఉద్యోగులకు పదోన్నతులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం ముగ్గురు టెక్నికల్ ఉద్యోగులకు పదోన్నతి కల్పించారు. అలాగే బుధవారం మరో ఏడుగురు నాన్టీచింగ్ ఉద్యోగులకు వర్సిటీ అధికారులు పదోన్నతులు కల్పించనున్నట్లు సమాచారం. బి.మనోజ్ కుమార్ సింగ్కు సీనియర్ మెకానిక్ నుంచి ఫోర్మెన్గా పదోన్నతి లభించింది. ఆయనను నాన్టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్, సుబ్రమణ్యం, సభ్యులు ఘనంగా సన్మానించారు. భవిత సెంటర్ను సద్వినియోగం చేసుకోండి తిరుపతి కల్చరల్: బైరాగిపట్టెడలోని ఎంజీఎం హైస్కూల్ ఉన్న భవిత సెంటర్ను దివ్యాంగ పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సహిత విద్య సమన్వయకర్త చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ప్రత్యేక అవసరాలు ఉన్న బడి ఈడు పిల్లల కోసం ఐఈఆర్టీ బి.జ్ఞానమ్మ నెహ్రూ నగర్, చిన్నగుంట, కుమ్మరితోపు ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. ఆయన సర్వేను తనిఖీ చేశారు. -
ఎవరా 28 మంది?
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి అర్బన్ మండలం అక్కారంపల్లి రెవెన్యూ ఎర్రమిట్ట భూమిపై నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్టుల ముసుగులో రూ.కోట్లు విలువైన భూమి ఆక్రమణలో పాత్రదారులు, సూత్రదారుల్లో టీడీపీ, జనసేన, మరి కొందరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వివాదాస్పద భూమికి సంబంధించి మొత్తం 28 మందికి పట్టాలు సిద్ధం చేశారని జర్నలిస్టులు చెబుతున్న మాట. అందులో జర్నలిస్టుల ముసుగులో టీడీపీ, జనసేనకు చెందిన ముఖ్య నాయకులు బినామీ పేర్లతో పట్టాలు సిద్ధం చేసుకున్నారని చర్చ జరుగుతోంది. ఎర్రమిట్టలో ఆదివారం అంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అటువైపు తొంగి చూడకపోవటానికి కారణాల గురించి జర్నలిస్టులు ఆరా తీస్తున్నారు. తిరుపతి అర్బన్ మండలం అక్కారంపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 101/3లోని సుమారు ఎకరం భూమి విషయంలో సోమవారం తీవ్ర వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఓ జర్నలిస్ట్ సోమవారం రాత్రి చేసిన పోస్ట్పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 20 ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు సెంటు స్థలం కూడా లేదని, అటువంటి వారిని పక్కనపెట్టి టీడీపీ, జనసేనకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఏమిటని సీనియర్లంతా సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఎర్రమిట్టలోని విలువైన భూమి విషయంలో అధికారుల సహకారంతోనే ఆక్రమణకు యత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 28 మందిలో టీడీపీ, జనసేనకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు కొందరికి ఇచ్చి.. మిగిలిన స్థలాన్ని పార్టీ నాయకులు నివాసాలు నిర్మించుకునేందుకు పథకం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భూ వివాదం అమరావతికి చేరినట్లు సమాచారం. జిల్లా అధికారులు కూడా పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఏడాది కాలంగా రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. రూ.కోట్లు విలువ చేసే భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రమిట్టలో జరుగుతున్న దౌర్జన్యంపై స్థానికులు ఫొటోలు, వీడియోలు తీస్తుంటే రౌడీలు గుంపుగా వచ్చి బెదిరిస్తున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. దౌర్జన్యంగా ఇళ్లు కూల్చేస్తున్నా పోలీసులు ఎక్కడికి వెళ్లారో అర్థం కావడం లేదు. టీడీపీ నాయకులు చెబితేనే రక్షణ కల్పిస్తారా? భూములు కోల్పోయిన పేదల పక్షాన వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం చేయటం కోసం పోరాటం చేస్తాం. – భూమన అభినయరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త. -
● బరితెగిస్తున్న భూ మాఫియా ● నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోట్లు విలువైన స్థలాల కబ్జా ● అడ్డుపడుతున్న ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ● నిర్లక్ష్యధోరణిలో అధికార యంత్రాంగం
సాక్షి టాస్క్పోర్స్: వెంకటగిరిలో భూ మాఫియా బరితెగిస్తోంది. పట్టణ నడిబొడ్డున ఉన్న రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు భూ ఆక్రమణదారులు పావులు కదుపుతున్నారు. కొందరు అధికారులతో కుమ్మకై ఏకంగా దశాబ్దాల క్రితం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, క్రీడా ప్రాంగణాలు సైతం వదలడంలేదు. సుమారు 20 ఎకరాలు విలువైన భూమిని కాజేసేందుకు పాలువులు కదుపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు సైతం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పడి భూ ఆక్రమణలు జరగకుండా అడ్డుపడుతోంది. ఈ భూ వ్యవహారంపై గతంలో వెంకటగిరి తహసీల్దార్, శ్రీకాళహస్తి ఆర్డీఓ, తిరుపతి జిల్లా కలెక్టర్కు వేర్వేరు రూపాల్లో వినతి పత్రాలు సైతం సమర్పించారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఏ మాత్రం స్పందన రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఏస్లో స్థానిక ఎమ్మెల్యేకు సైతం వినతి పత్రం సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్లముందే రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని నడిబొడ్డులో ఉన్న మున్సిపల్ కార్యాలయం ఎదురుగా 1965వ సంవత్సరానికి పూర్వం సర్వే నంబర్ 199–3, 199–4,199–5,200–2లో తాలుకా సమితి కార్యాలయం కోసం ప్రభుత్వం 6.61 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో వసతి గృహానికి 3 ఎకరాలు పోను మిగిలిన 3 ఎకరాలను షేక్ అబ్దుల్ కరీం సాహెబ్, వెంకట సుబ్బయ్యల వారసులమంటూ దొంగ రికార్డులను సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు పలు వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 1974లో వెంకటగిరి రాజా నుంచి 18 ఎకరాలను ఆనాటి విశ్వోదయ కళాశాల యాజమాన్యం కొనుగోలు చేసినట్లు పలువురు పట్టణ వాసులు చెబుతున్నారు. ఇందులోనే భవనాలు కూడా నిర్మించారు. 1968వ సంవత్సరం నుంచి 2015వ సంవత్సరం వరకు ఆ భవనాలు, స్థలాన్ని విశ్వోదయ కళాశాల హాస్టల్ నిర్వహణకు ఉపయోగించారు. అయితే తాజాగా రెవెన్యూ శాఖలో లూప్లైన్స్ తెలుకుని అబ్దుల్ కరీం, వెంకటేశ్వరయ్య అనే పాత యజమానుల పేర్లతో ఆధారం చేసుకుని ఆ స్థలానికి సంబంధం లేని వ్య క్తులను వారసులుగా తెరపైకి తీసుకొస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఖాళీగా ఉన్న ఆ స్థలంలో గతంలో పనిచేసిన తహసీల్దార్ని ప్రలోభాలకు గురి చేసి నివాసాలు ఏర్పాటు చేసినట్లు అడంగల్లో తప్పు డు నివేదికను తయారు చేసినట్లు సమచారం. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ల్లో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువ చేస్తుందని పలువురు పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అమ్మవారిపేట చెరువు సర్వే నంబర్ 215 సర్వే నంబర్లోని 36 ఎకరాలు ఉండగా పదుల సంఖ్యలో చెరువు ఆక్రమణలకు గురైపోయింది. ఆ స్థలాల్లో భవనాలు సైతం నిర్మాణాలు చేపడినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ వారసులను సృష్టించి కబ్జాకు యత్నం -
21న జీఎస్ఎల్వీ ఎఫ్17 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 21న సాయంత్రం 3.15 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్17 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. అనివార్య కారణాలతో ప్రయోగం వాయిదా పడితే జూన్ 10వ తేదీన చేసే అవకాశం ఉంది. ఈ ప్రయోగం ద్వారా 1,117 కిలోలు బరువు కలిగిన ఈఓఎస్–05 (జీఐశాట్–1ఏ) అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. వరుసగా రెండు పీఎస్ఎల్వీ పరాజయాల తరువాత చేయబోయే ప్రయోగం అయినందున ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది సగం గడిచిపోయినప్పటికీ జనవరి నెలలో చేసిన పీఎస్ఎల్వీ సీ62 పరాజయం ఇస్రో శాస్త్రవేత్తలను కొంత ఆత్మరక్షణలో పడేసింది. అందుకే జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే జీఎస్ఎల్వీ ఎఫ్17 రాకెట్ శిఖరభాగాన అంటే క్రయోజనిక్ దశపై ఉపగ్రహాన్ని అమర్చే విషయంలో కొంత సాంకేతికలోపం తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాంకేతిక లోపాలన్నింటిని సవరించుకుని ఈనెల 21న లేదా జూన్ 10న ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపగ్రహంతో ఉపయోగాలు జీఎస్ఎల్వీ ఎఫ్17 రాకెట్ ద్వారా రోదశీలోకి పంపబోయే ఈఓఎస్–05 (జీఐశాట్–1ఏ) ఉపగ్రహం పూర్తిగా భూ పరిశీలన ఉపగ్రహం కావడం విశేషం. అయితే భూ పరిశీలనలో ఈఓఎస్–05 ఉపగ్రహం సెకెండ్ జనరేషన్ శాటిలైట్ కావడం విశేషం. ఈ ఉపగ్రహంలో మల్టీ స్పెక్ట్రల్, హైపర్ స్పెక్ట్రల్ బ్యాండ్స్ అనే రెండు రకాల బ్యాండ్స్ను అమర్చి పంపుతున్నారు. ఈ బ్యాండ్లలోలున్న ఉపకరణాలను ఉపయోగించి ఆకాశంలో మేఘాలు లేని పరిస్థితుల్లో, దేశంలోని విశాలమైన ప్రాంతాలను నిజమైన సమయ ఛాయాచిత్రాలను తరచుగా అందిస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఎంచుకున్న క్షేత్ర చిత్రాన్ని ప్రతి 30 నిమిషాలకు 42 మీటర్ల స్పేషియల్ రిజల్యూషన్తో భారత భూభాగాన్ని మొత్తంగా ఛాయాచిత్రాలను అందిస్తుంది. ఇది దేశంలోని వ్యవసాయం, భూమి, సముద్రాల మీద అధ్యయనం చేయడంతో పాటు దేశ రక్షణకు కూడా ఉపయోగపడనుంది. -
జూనియర్ జడ్జిల బదిలీలు
తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ సివిల్ జడ్జిలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కొంతమంది జూనియర్ సివిల్ జడ్జిలకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న ఎం.మాధవిని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎకై ్సజ్ న్యాయమూర్తిగా, చిత్తూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి షేక్ బాబాజాన్ను కడప జిల్లా మైదుకూరు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, పుత్తూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సి.జానకిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేసినట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే శ్రీకాళహస్తి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణప్రియను ప్రకాశం జిల్లా ఒంగోలు ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తిగా, తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ ఉమర్ ఫరూక్ను కడప జిల్లా జమ్మలమడుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి సీకేవీ సత్య కాంత్ కుమార్ను నెల్లూరు జిల్లా ఉదయగిరి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి. కోటేశ్వరరావును కడప ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా, తిరుపతి మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఎం సంధ్యారాణిని కర్నూలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. కాగా తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ను గుంటూరు జిల్లా తెనాలి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ శ్రీకాంత్ను కృష్ణాజిల్లా విజయవాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే గుంటూరు ప్రత్యేక రైల్వే కోర్టు జడ్జిగా ఉన్న పి. రమాదేవిని తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, కృష్ణాజిల్లా, విజయవాడ ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న జి. లెనిన్ బాబును తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న పి. పరేష్ కుమార్ను చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జడ్జి రమాదేవి తిరుపతి మూడో, ఐదో, రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా జీ లెనిన్ బాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుపతి రెండు, నాలుగు, చిత్తూరు ఎకై ్సజ్ కోర్టుల ఇన్చార్జి న్యాయమూర్తిగా వ్యవహరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 18వ తేదీ లోపు బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
‘యువికా–2026’ ప్రారంభం
సూళ్లూరుపేట: దేశంలోని యువతను ఇస్రోలో యువశాస్త్రవేత్తలుగా తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఏటా నిర్వహిస్తున్న యువత ప్రోగ్రామ్ యువికా–2026 కార్యక్రమాన్ని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి చైర్మన్ డాక్టర్ కే నారాయణన్ వర్చువల్ పద్ధతిలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. సోమ వారం నుంచి ఈనెల 22 వరకు ఇస్రోలోని సతీష్ధవన్ స్పేస్ సెంటర్తో సహా ఏడు కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా షార్లోని బ్రహ్మ ప్రకాష్హాలులో ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల నుద్దేశించి షార్ శాస్త్రవేత్తలు ప్రసంగించారు. షార్లో జరుగనున్న యువికా–2026 కార్యక్రమంలో 57 మంది విద్యార్థులు పాల్గొంటుండగా ఇందులో 30 మంది బాలురు, 27 మంది బాలికలను ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 మంది, మధ్యప్రదేశ్ నుంచి 14, చత్తీష్గడ్ నుంచి 14, ఒడిశా నుంచి 14 మంది పదిరోజుల పాటు షార్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పది రోజుల పాటు సీనియర్ శాస్త్రవేత్తల ఉపన్యాసాలు, షార్లోని వివిధ విభాగాలను సందర్శించడం, చిన్న రాకెట్ నమూనాలు, రోవర్ కిట్ల రూపకల్పన, నక్షత్రాలను వీక్షించడం, యోగా కార్యక్రమాలను కూడా పొందపరిచి నిర్వహించనున్నారు. ఈనెల 22న నిర్వహించబోయే ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు జ్ఞాపికలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చి యువికా కార్యక్రమాన్ని ముగిస్తారు. సోమవారం నాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కే నారాయణన్ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ దేశంలో యువత ఎక్కువ ఉందని, ఇందులో బాగా చదువుకుని ఇస్రోలోకి భావి శాస్త్రవేత్తలుగా రావాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలు అందించాలని తద్వారా గౌరవాన్ని పొందుతారన్నారు. భవిష్యత్తులో ఇస్రో నుంచి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా గగన్యాన్ ప్రాజెక్ట్ను చేపట్టామని మరీ చెప్పారు. ఈకార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్, కంట్రోలర్ రమేష్బాబు, ఎంఎస్ఎం గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ పాల్గొన్నారు. -
ఘనంగా సోమనాథ్ స్వాభిమాన పర్వం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వం జరిగింది. సోమనాథస్వామి ఆలయం పునర్నిర్మాణం చేసి 75 ఏళ్లు కావడంతో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అఖండ విశ్వాసం పేరుతో ముక్కంటి ఆలయంలో ఉత్సవం నిర్వహించారు. ఆలయంలో ఉదయం సోమనాథేశ్వరస్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథ సంకల్పం, సోమనాథ గీతాలాపన చేశారు. భక్తులకు ప్రసాద వితరణ, కళాకారుల భజన, కోలాటాలు, శివసేవకులు ఓం జెండాల ప్రదర్శన, మేళ తాళాల నడుమ సోమనాథేశ్వరస్వామి చిత్రపటంతో శోభాయాత్ర తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, హేమావతి పాల్గొన్నారు. -
టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
వరదయ్యపాళెం: రాష్ట్రంలో రోజురోజుకు మితిమీరుతున్న టీడీపీ నాయకుల ఆగడాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తెలిపారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకులు దశరథరామిరెడ్డిని ఆయన పరామర్శించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నూకతోటి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు రోజువారీ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి అఘాయిత్యాలను నియంత్రించాల్సిన పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. నీచ సంస్కృతిని వీడనాడి రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, నాయకులు భానుప్రకాష్ రెడ్డి, కోడూరు బాబురెడ్డిలు ఉన్నారు. -
నవోదయలో విశ్వం ఉత్తమ ఫలితాలు
తిరుపతి అర్బన్: జాతీయ స్థాయిలో 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదల చేసిన 11వ తరగతి ప్రవేశ పరీక్షలో విశ్వం విద్యార్థులు శ్రావ్య, రిచిత, ప్రవీణ్, గగన్ హర్ష, గణేశ్, హర్ష, హర్షిత, తనుష, కావ్య, అస్మా, లిఖిత, వరుణ్ సందేశ్, చరితార్థ, ప్రీతం, తేజస్వి, శ్రీదేవి తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను తిరుపతిలోని తమ విద్యాసంస్థలో సోమవారం విశ్వం విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్ రెడ్డి, సాయిగణేష్ స్కూల్ కరస్పాండెంట్ చెంచురెడ్డి అభినందించారు. అలాగే 6వ, 9వ తరగతి ప్రవేశ పరీక్షల్లో కే. గీతిక, సి.కార్తీక్, శ్రీహాన్రెడ్డి, పి.నిశాంత్, సి.హేమతేజ, హెచ్ అనన్య, ఎం.భావదీష్, ఆర్.నికోలస్ ఫ్రాంక్లిన్, కే.సిద్ధార్థ, బి.సాయి అభిరామ్, బి.హనీశ్రీ, ఎస్.ఎం.ఇలియాస్, కే. సాయికృష్ణ, లిఖిత, జోషిక తదితరులతో పాటు మొత్తం 56 మంది విశ్వం విద్యార్థులు నవోదయ విద్యాలయాలకు ఎంపికై నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్. విశ్వనాథ రెడ్డి తెలిపారు. గత 36 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్ స్కూల్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ పోటీ పరీక్షలకు విశ్వం విద్యా సంస్థలు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నవోదయ, సైనిక్, ఇతర రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షల శిక్షణ వివరాల కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
చదువుకుంటాం.. అవకాశం కల్పించండి సార్
తిరుపతి అర్బన్: చదువుకుంటాం.. తమకు గురుకులంలో సీటు ఇప్పించి అవకాశం కల్పించండి సారూ.. అని పేద విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కోరారు. సోమవారం కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డీఆర్వో నరసింహుల ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్లో 348 అర్జీలు వచ్చాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, భరత్ నాయక్, రోజ్మాండ్, అనురాధ పాల్గొన్నారు. తమ కుమార్తె మాధురి గురుకులం స్కూల్లో చదువుకోవాలని అంటోంది.. మాకు అవకాశం కల్పించండి ప్లీస్ అంటూ శ్రీకాళహస్తి మండలంలోని చల్లపాళెం అరుంథతి వాడకు చెందిన దివ్యాంగులు మందా సుబ్రమణ్యం, మహాలక్ష్మి దంపతులు కోరారు. అలాగే తమ బిడ్డ కామేశ్వరికీ బిరడవాడ సాంఘిక సంక్షేమం శాఖకు చెందిన గురుకుల కళాశాలలో ఎంపీసీ సీటు ఇప్పించాలని నాయుడుపేట మండలం అన్నమేడు ఎస్సీ కాలనీకి ఎం. కామేశ్వరి కోరారు. డేటా ఎంట్రీ కరెక్షన్ కోసం తిరుపతి అర్బన్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ రెండు నెలలుగా తిరుగుతూనే ఉన్నా, ఉద్యోగులు పట్టించుకోవడం లేదని తిరుపతి ఆటోనగర్కు చెందిన జీ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి కోసం తన కూమార్తెలు తనని వేధిస్తున్నారని పెళ్లకూరు మండలంలోని చెన్నప్పనాయుడుపేట గ్రామానికి చెందిన కడూరు మునెమ్మ(84) సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో అధికారులకు ఓ వినతిపత్రం అందజేశారు. -
అంతర్రాష్ట్ర మొబైల్ దొంగ అరెస్టు
తిరుపతి క్రైం : అంతర్రాష్ట్ర మొబైల్ దొంగను తిరుపతిలో అరెస్టు చేసినట్లు ఏఎస్పీ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన ఎనిమిది ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ కథనం మేరకు.. నేపాల్ దేశం బఝంగ్ జిల్లా, మయపటగాం గ్రామానికి మహేష్ బహదూర్ జటారా అలియాస్ సంతోష్ తాప అలియాస్ డాబా మహేష్ కుమార్ (29) రాత్రి వేళల్లో పెద్ద షాపింగ్ మాల్స్ను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో తిరుపతి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇస్కాన్ ఆలయం సమీపంలో నిందితుడిని అరెస్తు చేశారు. నిందితుడి వద్ద నుంచి శాంసంగ్, వీవో, ఒప్పో, వన్ప్లస్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
స్థలాపాపం.. తలాపిడికెడు
రేణిగుంట: మండలంలోని తూకివాకం పంచాయతీలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి పక్కనే 928, 929 సర్వే నంబర్లో కాలువ యథేచ్ఛగా ఆక్రమణ జరుగుతున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా కలెక్టరేట్కు కూత వేటు దూరంలో ఈ తంతు జరుగుతున్న అధికారులు మాత్రం తమకేమీ కనిపించడం లేదన్న చందంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో చిన్న ఇల్లు నిర్మించుకుంటేనే రెవెన్యూ అధికారులు నానా హంగామా చేస్తున్నారని, వారి కళ్లముందే ఇంత జరుగుతున్నా కనీస చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కాలువ ఆక్రమణ జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్యాం ప్రసాద్ను వివరణ కోరగా సిబ్బందిని పంపి, పరిశీలించి ఆక్రమణ జరుగుంటే చర్యలు చేపడతామన్నారు. సచివాలయ భవనమే గోడౌన్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని రూ.40 లక్షల వ్యయంతో సచివాలయ భవనాలను నిర్మించారు. సచివాలయ భవనం 90 శాతం పూర్తయినప్పుటికీ మిగిలిన పనులు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం వదిలేసింది. తూకివాకం సచివాలయ భవనానికి ప్రైవేట్ వ్యక్తులు తలుపు అమర్చుకుని గోడౌన్ వినియోగిస్తున్నారు. నివారించాల్సిన పంచాయతీ అధికారులు స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఉన్నారని గ్రామస్తులు అంటున్నారు. పత్తాలేని ఇరిగేషన్ అధికారులు పంట కాలువలను పరిరక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు అటువైపు చూడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కాలువ ఆక్రమణకు గురవుతుందని స్థానికులు తెలిపినా ఇరిగేషన్ అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. కాలువలో తోలిన మట్టిపెడచెవిన వీఆర్వో మాటలు వారం కిందట స్థానిక వీఆర్వో, సచివాలయ సర్వేయర్తో కలిసి కాలువను సర్వే చేశారు. సర్వే రిపోర్ట్ వచ్చేంతవరకు నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆదేశించారు. కానీ వీఆర్వో మాటను ఆక్రమణలు లెక్కచేయకుండా పనులు శరవేగంగా చేస్తున్నారు. వీఆర్వోకు తెలిసే పనులు చేస్తున్నారా? లేక ఆయన్ని లెక్కచేయకుండా చేస్తున్నారా? అన్నది శేష ప్రశ్నగా మిగిలింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పాగా వేస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే స్థలాలపై కన్నేస్తున్నారు. ఆక్రమణలకు కొంత మంది నాయకుల అండదండలుండడం.. అధికారులు ఉదాశీనంగా వ్యవహరించడంతో విలువైన స్థలాలు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంటున్నాయి. తూకివాకం పంచాయతీలో ఆక్రమణల పర్వం ఇదీ. -
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీకి 54 వినతులు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ ిసీఎండీ’ కార్యక్రమానికి 54 వినతులు అందినట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 9133331912కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి తొట్టంబేడు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. తొట్టంబేడు పోలీసుల కథనం మే రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన హషూబ్(25) డైరేడేలో సేల్స్ మార్కెటింగ్గా పనిచేస్తుంటాడు. ఇతడు వారంలో మూడు శ్రీకాళహస్తి, మూడు రోజులు సూళ్లూరుపేటలో విధులు నిర్వహిస్తూ సూళ్లూరుపేటలోని పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తడ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తొట్టంబేడు మండలం బీడీ కాలనీ వద్ద వాహనం అదుపు తప్పి గట్టును ఢీకొన్నాడు. స్థానికులు గుర్తించి 108లో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక డంపింగ్పై కేసు నమోదు నాయుడుపేట టౌన్: మండలంలోని పండ్లూరు వెంగమాంబపురం సమీపంలో స్టీల్ ప్లాంట్ వెనుక అటవీ ప్రాంతంలో ఇసుక డంపింగ్ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. స్టీల్ప్లాంట్ వెనుక ఇసుక నిల్వలు ఉండడంపై పోలీసుల విచారణలో ఓజిలి మండలం సగుటూరు గ్రామానికి చెందిన అనీల్ అనే వ్యక్తి ఇసుకను ట్రాక్టర్లతో తీసుకువచ్చి డంపింగ్ చేసి లారీల్లో తరలించేందుకు ప్రయత్నిస్తుట్లుగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఇసుక డంపింగ్పై రెవెన్యూ అధికారులతో పంచనామా నిర్వహించి ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకుని అనీల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాణం తీసిన పేకాట నాగలాపురం: పేకాట స్థావరంపై పోలీసుల దాడితో భయపడిన జూదరి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని కా లంజేరి పరిసరాల్లో నాలుగు రోజులుగా కొందరు వ్యక్తులు వ్యవసాయ పొలాల మధ్య పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఎస్ఐ సునీల్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు అర కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నారన్న విషయాన్ని గమనించిన పేకాటరాయుళ్లు అక్కడ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు పక్కనే ఉన్న అరణియార్ చెరువులో దూకగా, ఈశ్వర్ అనే వ్యక్తి చెరువులో చిక్కుకున్నాడు. పరిస్థితిని గమనించిన ఎస్ఐ సునీల్, కానిస్టేబుల్ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చెరువులోకి దిగి అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఈశ్వర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఈశ్వర్, నారాయణవనం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది పేకాటారాయుళ్లు పాల్గొన్నట్లు, వీరందరు పిచ్చాటూరు, ఊత్తుకోట, నారాయణవనం మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. సంఘటన స్థలానికి పుత్తూరు డీఎస్పీ రవి కుమార్, సత్యవేడు సీఐ మురళి నాయుడు చేరుకుని వివరాలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మినీ ట్రక్ బోల్తా రేణిగుంట: టైర్ పంక్చర్ కావడంతో టమాట లోడ్డుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తాపడిన ఘటన రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం చెరువు సమీపం, పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి వంతెన పై సోమవారం చోటు చేసుకుంది. టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి మినీ ట్రక్కు బోల్తాపడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రక్కులోని టమాటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కును తొలగిచి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
ఏడుగురు నిందితుల అరెస్టు
రేణిగుంట: మండలంలోని ఎర్రమరెడ్డిపాళెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కంపెనీలో జరిగిన రాగి వైర్లు, కాపర్ బస్బార్లు ఇతర కాపర్ సామగ్రి చోరీ కేసులో తమిళనాడుకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు... మండలంలోని ఎర్రమరెడ్డిపాళెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కంపెనీలో జరిగిన రాగి వైర్లు, కాపర్ బస్బార్లు ఇతర కాపర్ సామగ్రి చోరీ జరిగినట్లు పోలీసులకు ఏప్రిల్ మొదటి వారంలో ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూరల్ మంజునాథరెడ్డి, ఎస్ఐ హరీష తమ సిబ్బందితో ముమ్మర గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, టోల్ ప్లాజా వివరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కేసును ఛేదించిన పోలీసులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన అనిత (27), సరసు (55), హిందు, ఇల్లవారాసి, మణికండన్, ఆనందబాబు, కుమార్ శబరిని తిరుపతి బ్లిస్ హోటల్ సమీపంలోని గుజిరి షాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు చోరీ చేసిన సొత్తును విక్రయించి, ఖర్చు చేసి, మళ్లీ చోరీలకు పాల్పడేందుకు వచ్చినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమర్థవంతంగా పని చేసిన పోలీసులను అధికారులు అభినందించారు. -
తిరుచానూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన
చంద్రగిరి: భూములను కబ్జా చేసి అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్న కానిస్టేబుల్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలంటూ సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. ఆదివారం కూలి పనులు చేసిన భవన నిర్మాణ కార్మికులపై దాడికి పాల్పడడంతో సీపీఐ నేతలు తిరుచానూరు పోలీసు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ మాట్లాడుతూ.. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలోని సర్వే నం.246/2లో అవిలాలకు చెందిన నారాయణకు 2.60 ఎకరాలు ఉందన్నారు. ఇందులో 2023లో టీటీడీ విశ్రాంత ఉద్యోగి గుర్రప్ప 60 అంకణాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత కొంత కాలంగా తిరుపతిలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శేఖర్రెడ్డి కుమారుడు మోహన్రెడ్డి గుర్రప్పకు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం గుర్రప్పకు చెందిన స్థలంలో భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ పనులు చేస్తుంటే మోహన్రెడ్డి అక్కడికి వెళ్లి వారిపై దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపించారు. కొంత మంది యువకులకు మద్యం తాపించి దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పనులు ముగించుకుని వెళ్తున్న చిరంజీవి అనే భవన నిర్మాణ కార్మికుడిపై మోహన్రెడ్డి, తన అనుచరులతో కలసి మూకుమ్మడిగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో కార్మికులపై దాడులు జరిగాయని, పోలీసులు సైతం మోహన్రెడ్డికి పరోక్షంగా సహకారం అందిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. పోలీసుల ఎదుటే స్థల యజమానిపై దాడికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. పోలీసు పవర్ ఉందనే దురంహకారంతో దాడులు చేస్తున్న మోహన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట కార్మికులతో కలసి నినాదాలు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నారు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ధ్రువీకరణ’కు ఇదే సమయం
●తిరుపతి అర్బన్ : పదోతరగతి, ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. జూన్లో ఇంజినీరింగ్, పీజీ తదితర కోర్సులతోపాటు నీట్ ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలోనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతి విద్యార్థికీ నూతన కోర్సులో ప్రవేశం పొందేందుకు పలు సరిఫికెట్లు అవసరం. కోర్సులో చేరే సమయంలో ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు తీస్తుంటారు. వెంటనే తమకు సర్టిపికెట్లు మంజూరు చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తుంటారు. ఆలస్యమైతే ఆందోళనకు గురవుతుంటారు. అలాగే హడావుడి నేపథ్యంలో సర్టిఫికెట్లలో పలు తప్పులు సైతం దొర్లుతుంటాయి. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ముందస్తే మంచిది అకడమిక్ ఇయర్ ఆరంభమయ్యే వరకు వేచి ఉండకుండా, అవసరమయ్యే సర్టిఫికెట్లకు ఈ నెలలోనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా సకాలంలో సర్టిఫికెట్ జారీ అవుతుందని వెల్లడిస్తున్నారు. ఆఖరి క్షణం వరకు ఆందోళన చెందే ప్రమాదం తప్పుతుందని తెలియజేస్తున్నారు. ఏటా జూన్, జూలై, ఆగస్ట్లో ఒక్క తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికే వివిధ సర్టిఫికెట్ల కోసం లక్షకు పైగా దరఖాస్తులు వస్తుంటాయని వివరిస్తున్నారు. ఈ మేరకు ముందు జాగ్రత్తగా కుల, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నివాస, ఓబీసీ, ఆధార్, రేషన్ కార్డుల్లో తప్పుల సవరణ, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. దీంతో ప్రశాంతంగా ఎలాంటి తప్పులు లేకుండా ఇబ్బండి పడపత్రంతోపాటు ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నివాస, ఓబీసీ, ఆధార్, రేషన్కార్డుల్లో తప్పుల సవరణ, పలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను తీసుకోవడానికి దరఖాస్తులు చేసుకుంటే ప్రశాంతంగా తప్పులు లేకుండా, ఇబ్బందులు పడకుండా సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు ఉంటుందని వెల్లడిస్తున్నారు. -
సమ్మర్.. సంబరం
గతంలో వేసవి అంటేనే వినోదం తిరుపతి సిటీ: సమ్మర్ అంటేనే సంబరం...వేసవిలో ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా..పిల్లలకు సమ్మర్ సెలవులు ఎన్నో వినోదాలను, సంబరాలను తెచ్చిపెట్టేది. నేటి ఆధునిక సమాజంలో పెద్దలతో పాటు పిల్లల జీవితం ఉరుకులు పరుగులుగా మారింది. దీంతో నేటి పిల్లలు వేసవి సెలవులను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. మూడు తరాలు వెనక్కి వెళ్లి చూస్తే... అప్పటి పిల్లలు వేసవి మళ్లీ ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసేవాళ్లు.. వేసవి సెలవులపై కొందరు అధ్యాపకులు, అధికారులు, విశ్రాంత ఉద్యోగులను పలకరిస్తే తమ చిన్నతనంలో వేసవి సెలవులను ఎలా గడిపారో గుర్తుచేసుకుంటున్నారు. నీతి కథలు మనస్సును తాకేవి మాది తిరుపతి ఎస్ఆర్పురం. నేను పాఠశాల విద్యనభ్యసించే సమయంలో వేసవి సెలవులు వస్తే తెలియని ఆనందంలో మునిగిపోయేవారం. సెలవుల్లో మా తాతగారి ఊరు చిత్తూరుకు వెళ్లేది. తాత చెప్పే నీతికథలు మనస్సును తాకేవి వీటితో పాటు శతకం పద్యాలు బోధించే వారు. చుట్టుపక్కల స్నేహితులతో క్రికెట్, చెస్, క్యారమ్స్ ఆడుతూ సంతోషంగా గడిపేవారం. నేడు సెల్ఫోన్లు, ఉరుకులు పరుగుల జీవితంలో నేటి బాలలకు నిజమైన వినోదాన్ని కోల్పోతున్నారు. – గోపాల్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, తిరుపతి జిల్లా వినోదం ఉండేది.. మా ఊరు రొంపిచెర్ల దగ్గర చిన్న పల్లెటూరు. వేసవి సెలవులు అంటే మాకు వినోదాన్ని అందించే ప్రధాన ఘట్టంగా భావించేవారం. పల్లెలోని చెరువు, బావులల్లో ఊరిలోని స్నేహితులతో కలసి స్విమ్మింగ్ చేసేవారం. పశువులు ఎక్కువగా ఉండటంతో వాటితో రోజంతా గడుపుతూ మైదానాలలో మేత కోసం తీసుకెళ్లి ఊరిలోని పిల్లలతో గోళీల ఆటలు, అష్టాచెమ్మ, కబడ్డీ ఆటలు ఆడేవాళ్లం. పెద్దలంటే గౌరవంతో కూడిన భయం ఉండేది. తల్లిదండ్రులు, అవ్వా తాతల వద్ద ఎంజాయ్ చేసేవాళ్లం. ప్రస్తుతం పిల్లలది 24 గంటలు పలు కోచింగ్లతో మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. – రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతి ఆ రోజులు మరుపురానివి మాది తిరుపతి. చిన్నతనంలో వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఊరు విజయపురం వెళ్లే వాళ్లం. ఊరులోని బంధుమిత్రుల పిల్లలతో చెరువులో స్విమ్మింగ్ చేయడం, మామిడి తోటలో మామిడిపళ్లు తినడం, సాయంత్రం అందరం ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోవడం చేసేవాళ్లం. అమ్మమ్మతో పాటు ఇంటిలోని పెద్దలు నీతికథలు, మహాభారతంలోని కీలక ఘట్టాలను ఆకట్టుకునే విధంగా కథలుగా చెప్పి వినిపించేవారు. ఆ రోజులు మరువలేం. – డాక్టర్ సి భువనేశ్వరి, ప్రిన్సిపల్, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాల, తిరుపతి వేసవి సెలవుల కోసం ఎదురు చూసేవాళ్లం ప్రాథమిక విద్య నభ్యసించే రోజుల్లో వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయా అంటూ ఎదురుచూసే వాళ్లం. మాది తిరుపతి మా అమ్మమ్మ వాళ్లది నెల్లూరు దగ్గర ఓ పల్లెటూరు. అమ్మమ్మ రుచికరమైన వంటలు వండిపెట్టేది. అప్పుడు చైనీస్, జంక్ ఫుడ్స్ లేవు. ఆరోగ్యం ఎంతో బాగుండేది. గుడుమూతలు, అష్టాచెమ్మ, బారకట్ట, మేక పులి వంటి ఆటలతో సంతోషంగా గడిపేవాళ్లం. ప్రస్తుతం అంతా యాంత్రికంగా మారింది. – శకుంతలాదేవి, రిటైర్డ్ కేంద్రప్రభుత్వ అధికారి, తిరుపతి -
ఇసుక లారీ మాయం?
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పండ్లూరు వెంగమాంబపురం అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది నుంచి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక డంపింగ్ చేసి పొట్టులారీ బస్తాల మాటున ఇసుకను తరలింపు చేస్తుండడంపై గ్రామస్తులు ఐదు రోజుల కిందట పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకోవడంతో ఇసుక లోడింగ్కు సిద్ధమవుతున్న లారీ డ్రైవర్తో పాటు క్లీనర్లు లారీని వదిలి పరారయ్యారు. దీంతో పోలీసులు లారీ టైర్లకు గాలితీసివేసి లారీ యజమాని ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే అధికార పార్టీ నేతల అండదండలతో పొట్టు బస్తాల మాటున తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్తులు కనుగొని అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు పట్టుకున్న లారీని ఎందువల్లనో ఐదు రోజులుగా ఇసుక డంపింగ్ చేసి ఉన్న ప్రాంతంలోనే నిలిపి వేసి ఉంచారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ ఉన్న లారీ మాయం కావడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. పోలీసులు కేసు కట్టి తీసుకువెళ్లారా.. లేక అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి లారీని వదలేశారా అంటూ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయమై నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబును వివరణ కోరగా ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నించిన లారీపై కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడ లారీయే లేదని మాయమైన విషయం చెప్పడంతో డీఎస్పీ సైతం అవాక్కయ్యారు. ఈ విషయమై సీఐతో మాట్లాడి పరిశీలించి చర్యలు చేపడుతామని డీఎస్పీ వెల్లడించారు. -
చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు సాదర వీడ్కోలు
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం తిరుగు పయనమైన భారత ప్రధాన ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ వారి దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు,డీఆర్ ఓ జి. నరసింహులు, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి అందించి సాదరంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు.. ● తిరుపతి జిల్లా రెండురోజులు పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ కి రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డీఆర్ఓ నరసింహులు తదితర అధికారులు సాదరంగా వీడ్కోలు పలికారు. -
పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
వెంకటగిరి రూరల్ : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టర్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని విద్యుత్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ యూనియన్ జిల్లా ప్రథమ మహాసభ పట్టణంలోని పింజల వీరయ్య కల్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణంలోని క్రాస్రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దుగ్గిరాల సూరిబాబు, సుదర్శన్రెడ్డి, జేఎల్ఎం గ్రేడ్–2 రాష్ట్ర కన్వీనర్ పెంచల ప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హసరత్తయ్య, జాకీర్ హుస్సేన్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నూతన కమిటీ ఏర్పాటు చేశారు. నూతన కమిటీ సభ్యులు జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మస్తానయ్య, జిల్లా అధ్యక్షుడిగా కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా నాదమునిరెడ్డి, కోశాధికారిగా పురుషోత్తం, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీ, చీఫ్ అడ్వైజర్గా, ఆఫీసు బైరర్స్గా జ్యోతి, ఏడుకొండలు బాబు, సిహెచ్ నారాయణ, రవీంద్ర, వెంకటరమణ, జగదీశ్వర్రెడ్డి, ప్రసాద్, ఎల్ లక్ష్మణ రావు, నాగూరుబాబు, మునిశేఖర్, తేజ ఎంపికయ్యారు. కాంట్రాక్టర్ కార్మికుల నూతన కమిటీ అధ్యక్షులుగా సుబ్రమణ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ హేమకుమార్, ఉపాఽధ్యక్షులుగా సుబ్రమణ్యం, చిరంజీవి, ఎస్కే ఆసిఫ్ రవి, వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా కుమార్ , తదితర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ కార్మికుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్పీడీసీఏల్ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యంరాజు, జిల్లా నాయకులు నాగయ ఈటే కొండయ్య, గిరి, మజార్, సునీల్ పాల్గొన్నారు. టీడీపీ నేత పోస్టింగ్పై పోలీసులకు ఫిర్యాదు? కలువాయి(సైదాపురం): మండలంలోని కుల్లూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేపై టీడీపీ నేత ఒకరు సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టింగ్ పెట్టారు. దీనిపై వీఆర్వోలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం, కుల్లూరు గ్రామంలో రీ సర్వేలో రెవెన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పతున్నారని, పెద్ద పెద్ద రైతుల తోటల్లో లిక్కర్ పార్టీల్లో వీఆర్ఓ, సర్వేయర్ పాల్గొని, భూ మార్పిడి చేస్తున్నారని, 400 ఎకరాల వరకు గోల్మాల్ జరిగినట్లు ఈనెల 5న టీడీపీ నేత పోస్టింగ్ పెట్టారు. ఈ పోస్ట్పై కుల్లూరు, వెంకటరెడ్డిపల్లి, వీఆర్వోలు కలువాయి పోలీసు స్టేషన్ల్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,512 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,988 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. బర్డ్ ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళం తిరుమల: గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాసులు రెడ్డి ఆదివారం బర్డ్ ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డీని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు. గంగజాతరకు పటిష్ట భద్రత తిరుపతి క్రైం : తిరుపతి గంగమ్మ జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్టు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు తెలిపారు. జాతర ప్రాంగణంలో జేబుదొంగలు, గొలుసు దొంగలు సంచరించే అవకాశాలు ఉన్నందున భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు బంగారు ఆభరణాలు అధికంగా ధరించి రావద్దని, విలువైన వస్తువులను ఎల్లప్పుడూ తమ కంటికి కనిపించేలా జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. స్విమ్స్ కార్మికుడు రూకేష్ ఆరోగ్యం విషమం తిరుపతి తుడా: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి కార్మికుడు రూకేష్ ఆరోగ్యం విషమించిందని, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే.వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్విమ్స్ కార్మికులు గత 73 రోజుల నుంచి సమస్యల పరిష్కారం కోసం ఆస్పత్రి వద్ద నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆదివారం ఆయన దీక్షా శిబిరంలో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై రూకేష్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన రూకేష్ కోలుకున్న అనంతరం తన కుటుంబ పోషణ కోసం తిరిగి విధుల్లో చేరాడని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై స్విమ్స్ యాజమాన్యం, టీటీడీ అధికారులు పదేపదే హామీలు ఇస్తూ కాలయాపన చేస్తుండడం వల్ల కార్మికుల్లో తీవ్ర ఆందోళన, మానసిక ఒత్తిడి పెరిగిందన్నారు. కార్యక్రమంలో స్విమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జి రవి, నాయకులు గోపి, వెంకటేష్, మారిముత్తు, బృందా పాల్గొన్నారు. తేనెటీగల దాడి – 20 మందికి గాయాలు పెనగలూరు: మండలంలోని దామనచర్ల అటవీ ప్రాంతంలో ఆదివారం తేనెటీగలు దాడి చేయడంతో ఇరవై మందికి గాయాలయ్యాయి. మూడు 108 వాహనాలలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం గాయపడిన వారిని తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. చిట్వేలి మండలం, గరుగుపల్లి గ్రామానికి చెందిన దాదాపు నలభై మంది దామనచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న గుర్రప్పస్వామి ఆలయం వద్దకు పొంగుబాలు పెట్టుకునేందుకు వచ్చారు. ఆలయం సమీపంలో ప్రసాదాలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో ఇరవై మందికి గాయాలయ్యాయి. అక్కడున్న ప్రజలు 108కు సమాచారం ఇవ్వడంతో చిట్వేలి, పెనగలూరు, నందలూరు మండలాల నుంచి 108 వాహనాలు దామనచర్ల అటవీ ప్రాంతానికి వెళ్లి గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంత మందికి తీవ్ర గాయాలైనటుట సమాచారం. -
బియ్యమే దిక్కు!
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదోడి సూపర్ మార్కెట్గా పిలుచుకుంటున్న చౌక దుకాణాల్లో బియ్యమే దిక్కుగా మారింది. రేషన్ కార్డుదారులకు కందిపప్పు జాడే కరువైంది. కందిపప్పు ధరలు మార్కెట్లో ఎక్కువగా ఉండడంతో సామాన్య, పేద ప్రజలు కొనుగోలు చేయలేక చౌక దుకాణాల్లో అందుబాటులోకి అవస్థలు పడుతున్నారు. 23 నెలలుగా బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. అప్పుడప్పుడూ అరకొర చక్కెర మాత్రమే ఇస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణాల్లో బియ్యంతోపాటు చక్కెర, గోధమ పిండి, రాగిపిండి, రాగులు , కందిపప్పు తదితర వస్తువులను పంపిణీ చేశారు. చిరుధాన్యాలు సైతం కార్డుదారులకు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కార్డుదారులకు చౌకదుకాణాల్లో సరుకులు కరువయ్యాయని పలువురు కార్డుదారులు వాపోతున్నారు. పౌరసరఫరాలశాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చౌకదుకాణాల్లో అన్ని రకాల సరుకులు ఇవ్వడంలేదని.....తమ ప్రభుత్వంలో కార్డుదారులకు అవసరమైన అన్ని సరుకులను పంపిణీ చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ అమల్లోకి తీసుకురాకపోవడంతో పలువురు మండిపడుతున్నారు. దానికితోడు జిల్లాలోని 369 ఎండీయూ వాహనాలను రద్దు చేశారు. ఇంటింటికీ వెళ్లి సరుకులు ఇచ్చే సౌకర్యం లేకుండా పోయింది. గతంలో ప్రతి నెలా 1వ తేదీ నుంచి 18 వరకు సరుకులు ఇచ్చేవారు. ప్రస్తుతం 1 నుంచి 15 వరకు మాత్రమే ఇచ్చేలా కుదింపు చేశారు. మూడు రోజుల పాటు కుదింపు చేయడంతో కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. 266 మంది డీలర్ల కొరత జిల్లాలో 1457 చౌక దుకాణాలు ఉన్నాయి. అయితే పలువురు డీలర్లకు రాజకీయ రంగు పులమడంతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన డీలర్లు అంటూ పలువురిని ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. రాజీమానా చేయకుంటే కేసులు పెడుతామని చెప్పడంతో 266 మంది రేషన్ షాపులను వదిలిపెట్టేశారు. ఆ తర్వాత ఆ షాపులను కూటమి ప్రభుత్వానికి చెందిన వారికి ఇస్తామని చెప్పారు. అయితే మూడు పార్టీల్లో సమన్వయం లేకపోవడంతో 20 నెలలుగా వాటిని భర్తీ చేయకుండా కొందరు పొదుపు సంఘాలకు, పక్క డీలర్లకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్చార్జిలు సక్రమంగా బియ్యాన్ని ఇవ్వడం లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. చౌక దుకాణాల్లో 23 నెలలుగా అదే తంతు -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు
చంద్రగిరి: ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..తిరుపతి గిరిపురానికి చెందిన సంపత్ రాజు, సుగుణలత(52) బెంగళూరు నుంచి కారులో తిరుపతికి వస్తున్నారు. ఈ క్రమంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి, తొండవాడ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఆపై రోడ్డుకు అటువైపునకు దూసుకెళ్లి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో సుగుణలత అక్కడికక్కడే మృతి చెందగా, సంపత్రాజు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడు సంపత్రాజుకు ప్రథమ చికిత్సను అందజేశారు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రమాద వివరాలను తెలుసుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, సుగుణలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
ఇసుక లారీ మాయం?
నాయుడుపేట మండల పండ్లూరు వెంగమాంజపురంలో ఐదు రోజుల క్రితం పోలీసులు సీజ్ చేసిన లారీ మాయమైంది.సిండికేట్గా మారిన మామిడి మండీ యజమానులు సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026ఆశనిరాశల నడుమ మామిడి రైతులు ఊగిసలాడుతున్నారు. ఒక ఏడాది దిగుబడి బాగుంటే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. మరో ఏడాది రేటు అధికంగా ఉంటే సక్రమంగా పంట చేతికందక దెబ్బతింటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తోటలు కళకళలాడుతున్నప్పటికీ ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు మండీ యజమానుల మాయాజాలమే కారణంగా ఆరోపిస్తున్నారు. సిండికేట్గా మారి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో మార్కెటింగ్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దామలచెరువు, తిరుపతి, చిత్తూరు, బంగారుపాళెం, పాకాల, పుత్తూరు చందూర నిలువు దోపిడీపై ఆగ్రహం ఏడాది పాటు మామిడి చెట్లను సంరక్షించుకుంటూ, వివిధ రకాల వాతావరణ సమస్యలను ఎదుర్కొని, చీడపీడలకు రూ.లక్షలు ఖర్చుచేసి పండించిన పంటకు యజమానులైన తాము ధరను నిర్ణయించే స్థితిలో లేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్ యార్డ్ వ్యాపారులు నిలువునా దోచుకొంటున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆక్రోశిస్తున్నారు. అధికారులు సైతం మామూళ్లు దండుకుని తమను రోడ్డుపాలు చేస్తున్నారని వాపోతున్నారు. రైతుల పక్షాన నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కనీసం జ్యూస్ ఫ్యాక్టరీలను త్వరగా తెరిపిస్తే నేరుగా సరుకును అమ్ముకొనే అవకాశం కలుగుతుందని కోరతున్నారు. ఆదిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడింగ్ చేస్తున్న కూలీలుపుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. సుమారు 2.65 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 70శాతం నుంచి 75 శాతం వరకు పంట దిగుబడి రావడంతో రైతులు కొంత ధైర్యంగా కోతలకు ఉపక్రమించారు. అయితే 10 రోజుల వ్యవధిలో ఒక్కసారిగా మామిడి ధరలు పతనమవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మార్కెట్ యార్డుల నుంచి వివిధ రకాల మామిడిని తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, గుజరాజ్, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. దీంతో మామిడి సీజన్ ప్రారంభంలో ధర ఆశాజనకంగా ఉంటుంది. అందులో భాగంగానే సీజన్ ప్రారంభంలో బేనీషా టన్ను ధర రూ.70 వేలు పలకగా, ప్రస్తుతం రూ.25 వేలకి పడిపోయింది. జిల్లా మొత్తం మీద మామిడి దిగుబడిలో 75 శాతంతో అగ్రభాగాన నిలిచే తోతాపూరి తొలుత టన్ను ధర రూ.25 వేల నుంచి రూ.30 వేలు పలికింది. అయితే ప్రస్తుతం రూ.9 వేలకు తగ్గిపోవడంతో రైతులు నివ్వెరపోతున్నారు. అలాగే చందూర రూ.30 వేల నుంచి రూ.14 వేలకి పడిపోయింది. దీనిపై ప్రశ్నించిన రైతులకు నెల్లూరు, విజయవాడ మార్కెట్లలో డిమాండ్ తగ్గిందని వ్యాపారులు కుంటి సాకులు చెబుతున్నారు. సాధారణంగా పల్ప్ ఫ్యాక్టరీలు తెరవక ముందు తోతాపూరి ధరలు ఆశాజనకంగా ఉంటాయి. ఫ్యాక్టరీలు తెరిచాక అన్ని ప్రాంతాల నుంచి సరుకు ఎక్కువగా రావడం వల్ల కాస్త ధర తగ్గడానికి అవకాశముంటుంది. ఓ పక్క ఫ్యాక్టరీలు తెరవక ముందే తోతాపూరితో పాటు అన్ని రకాలకు ధరలను సగానికి సగం తగ్గించేశారు. దీంతో మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వ్యాపారులు, అధికారుల కుమ్మక్కు
మామిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలడానికి వ్యాపారులతో పాటు అధికారులు కుమ్మక్కు కావడమే ప్రధాన కారణం. ధరలను ఇష్టారాజ్యంగా ప్రకటిస్తున్న వ్యాపారులపై మార్కెటింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఆదిశగా తనిఖీలు చేయడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. – టి.కేశవులు, అధ్యక్షుడు, మామిడి రైతు సొసైటీ, పుత్తూరు కఠిన చర్యలు తప్పవు జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలను నియంత్రిస్తే కఠిన చర్యలు తప్పవు. మార్కెట్ యార్డుల్లోని సెక్రటరీలు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ధరలను నియంత్రించే వ్యాపారులను యార్డు నుంచి తొలగిస్తాం. వారి లైసెన్సులను సైతం రద్దు చేస్తాం. – టి.సురేంద్రబాబు, ఏడీ, మార్కెటింగ్, తిరుపతి -
తిరుపతిలో భూ వివాదం
సాక్షి టాస్క్ ఫోర్స్: తిరుపతి నగర నడిబొడ్డులోని ఎర్రమిట్టలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న భూమిలోకి టీడీపీ గూండాలు ప్రవేశించారు. దౌర్జన్యంగా జేసీబీలతో చదును చేసి గందరగోళం సృష్టించారు. మహిళలు, స్థానికుల కథనం మేరకు.. తిరుపతి అర్బన్ మండలం, అక్కారంపల్లి సర్వే నం.101/3లో రూ.కోట్ల విలువచేసే 1.05 ఎకరరాల భూమి ఉంది. ఈ భూమి తమదేనని వృద్ధురాలు తులశమ్మ, మరి కొందరు కొంత కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏడాది క్రితం కొందరు యత్నించి విఫలమయ్యారు. అసలే ఆదివారం, కోర్టులకూ సెలవులు ఉండడంతో పథకం ప్రకారం ఆ భూమిలో ఉదయం రెండు జేసీబీలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ వృద్ధురాలు తులశమ్మ నిరి్మంచుకున్న రేకుల షెడ్డును, దాని చుట్టూ ఉన్న చెట్లను తొలగించడం ప్రారంభించారు. దీంతో తులశమ్మ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత సమయానికి మరికొందరు మహిళలు అక్కడికి చేరుకుని జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందస్తు పథకం ప్రకారం అక్కడే ఉన్న టీడీపీ గూండాలు మహిళలను అడ్డుకోవడం ఇబ్బంది అవుతుందని భావించి.. టీడీపీ సానుభూతి పరులైన కొందరు మహిళలను పిలిపించారు. ఎంతకూ పనులు ఆపకపోవడంతో బాధిత మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మరి కొందరు జేసీబీలకు అడ్డుపడ్డారు. తిరుపతి ఎర్రమిట్టలో టీడీపీ దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టుల ముసుగులో టీడీపీ చేస్తున్న భూ కబ్జా అని మండిపడ్డారు. తిరుపతి నగరంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని బాధితులతో కలిసి సీపీఐ నేతలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. -
వేరుశనగ సాగుకు సమయం ఆసన్నం
● రాయితీ విత్తన కాయల కోసం ఎదురుచూపులు ● పచ్చిరొట్ట విత్తనాలు ఇవ్వని దుస్థితి ● విత్తన పంపిణీలో కాలయాపన తిరుపతి అర్బన్: రైతులకు ప్రతి సీజన్లో 50 శాతం రాయితీలో ప్రభుత్వం వేరుశనగ విత్తనాలను ఇస్తుంది. అయితే గత రబీ సీజన్లో చంద్రబాబు సర్కార్ వేరుశనగ విత్తనాల ధరలు ఎక్కువగా ఉన్నాయని రాయితీలో ఇవ్వలేమంటూ ఎగనామం పెట్టింది. ఈ ఖరీఫ్ సీజన్లో ఇస్తారా? లేదా తెలియడం లేదు. ఇప్పటి వరకు రైతులకు విత్తనాలు వస్తాయనే సమాచారాన్ని ఇవ్వకపోవడంతో వారంతా దిక్కులు చూస్తున్నారు. సాధారణంగా 30 కిలోల బస్తా రూ.2,500 పలుకుతుంది. ప్రభుత్వం 50 శాతం రాయితీలో ఇస్తే రూ.1,250కే వస్తుంది. ఎకరం సాగుకు 30 కిలోల బస్తాలు 4 కావాల్సి ఉంది. బస్తాపై రూ.1,250 చొప్పున నాలుగు బస్తాలకు రైతులకు రూ.5 వేలు ఆదా ఆవుతుంది. 5 ఎకరాలు ఉన్న రైతుకు అయితే రూ.25 వేలు ఆదా అవుతుంది. గత రబీ సీజన్లో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులు పంట సాగుకు మొగ్గు చూపలేదు. ఈ సీజన్లోనైనా సబ్సిడీ విత్తన కాయలు ఇస్తారో? లేదోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు పచ్చిరొట్ట విత్తనాలు ప్రశ్నార్థకం పచ్చరొట్ట విత్తనాలు(జీలగలు, జనుములు, పిల్లిపెసర)50 శాతం నుంచి 60 శాతం రాయితీలో ఇస్తుంటారు. అయితే రబీ సీజన్లో నామమాత్రంగా అందించారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు పచ్చిరొట్ట విత్తనాలు ఇస్తామని రైతులకు భరోసా కల్పించకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు.జూన్ మొదటి వారం నుంచే పంట సాగు సాధారణంగా మేలో భూములు దుక్కి చేసుకున్న రైతులు జూన్ మొదటి వారం నుంచి వేరుశనగ పంట సాగు చేస్తుంటారు. అయితే పచ్చిరొట్ట విత్తనాలు మే మొదటి వారంలో ఇచ్చి ఉంటే రైతులు వాటిని చల్లుకుని ఉండేవారు. అయితే మే నెల నాలుగో వారంలో విత్తనాలు వస్తాయని అధికారులు అంటున్నారు. ఆ తర్వాత విత్తనాలు జూన్ మొదటి వారంలో రైతులకు పంపిణీ చేస్తారు. వాటిని రైతులు చల్లుకుంటే జూన్ నాలుగో వారం లేదా జూలై మొదటి వారంలో దుక్కి చేయాల్సి ఉంది. తర్వాత జూలై మొదటి వారం తర్వాత వేరుశనగ పంట సాగుచేయాల్సి ఉంటుంది. అంటే ఒక నెల ఆలస్యంగా సాగుచేయడం ద్వారా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు వేరుశనగ ప్రధాన పంట ఒకప్పుడు వేరుశనగ పంట సాగుకు తిరుపతి జిల్లా పెట్టిన పేరుగా ఉండేది. జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాలకు పైగా పంటను సాగు చేసేవారు. గత ప్రభుత్వంలో ప్రతి మండలంలోనూ రబీ సీజన్తోపాటు ఖరీఫ్ సీజన్లోనూ వేరుశనగ సాగుచేసేవారు. రాయితీ విత్తనాలతోపాటు రైతుకు అవసరం అయిన పనిముట్లు, పురుగుమందులు సమకూర్చడంతోపాటు రైతులను ప్రోత్సహించేవారు. చంద్రబాబు సర్కార్లో రాయితీ విత్తనాలు ఇవ్వడం మానుకున్నారు. దీంతో సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. గత రబీ సీజన్లో వేరుశనగ విత్తనాల రేట్లు పెరిగాయని, సబ్సిడీ విత్తనాలను రైతులకు ఇవ్వడం మానుకున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వేరుశనగ విత్తనాలు ఇస్తామని, ప్రభుత్వం నుంచి అధికారుల ద్వారా రైతులకు ఇప్పటి వరకు భరోసా కల్పించలేదు. దీంతో రైతులు ఖరీఫ్ సీజన్కు సంబంధించి తమ పొలాన్ని దుక్కి చేసుకుందామా? వద్దా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రబీలో సబ్సిడీ విత్తన కాయల విషయంలో చేతులెత్తేసింది. ఇక మిగిలింది ఖరీఫ్ సాగే. జిల్లాలో అత్యధికంగా సాగు చేసే పంట వేరుశనగే. జూన్ మొదటి వారం నుంచి సాగుకు అనుకూలమైన సమయం. గత రెండు రోజుల నుంచి అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురవడంతో కర్షకులు సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం అందించే రాయితీ వేరుశనగ విత్తన కాయలు ఈ సీజన్లోనైనా ఇస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. -
లిడ్క్యాప్ భూముల కబ్జాకు యత్నం
తిరుపతి రూరల్: మండలంలోని దామినేడు వద్ద లిడ్క్యాప్ సంస్థకు చెందిన భూములను చదును చేస్తుండగా దళిత సంఘాల నేతలు శనివారం అడ్డుకున్నారు. దళిత సంఘం నేత సుధాకర్బాబు మాట్లాడుతూ దామినేడు లెక్క దాఖలా సర్వే నంబర్ 71/ఏ 2.80 సెంట్లు, 72/3ఎ 1.74 సెంట్లు, 72/2ఏ 1.11 సెంట్లు, 101/3ఏ 0.83 సెంట్లు, 101/2 ఏ 2.70 సెంట్లు మొత్తం 9.23 ఎకరాలు ఉండగా అందులో 6 ఎకరాల భూమిని 1973 – 74లో అప్పటి ప్రభుత్వం చర్మ కారులకు లిడ్ క్యాప్ సంస్థ పేరున కేటాయించిందన్నారు. మాదిగల అభ్యున్నతికి కోసం కేటాయించిన భూమిని తిరుపతికి చెందిన గిరిధర్, రామ్మూర్తి, గోవింద్ చదును చేస్తుండగా అడ్డుకున్నామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణ దారులకు లిడ్ క్యాప్ పరిరక్షణ కమిటీ సభ్యులు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. సదరు భూమిపై సమగ్ర సమాచారం అందేంత వరకు ఒక వారం రోజుల పాటు ఎవరూ ఆ భూమిలోకి ప్రవేశించకూడదని ఇరువర్గాల వారికి సూచించారు. అనంతరం కమిటీ చైర్మన్ పి.సుబ్బయ్య మాట్లాడుతూ చర్మకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను రక్షించాలని పోలీసులను కోరారు. ఇప్పటికే ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు వేర్వేరుగా ఫిర్యాదులు అందించామన్నారు. అడ్డుకున్న వారిలో లిడ్ క్యాప్ భూముల పరిరక్షణ కమిటీ సభ్యులు వాలముని, బి.కృష్ణ, కే.కాటయ్య, డి.రాంబాబులు ఉన్నారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
తిరుమల: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సుబేందు సమంతా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేష్ నాయక్ శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అలాగే సినీ దర్శకుడు సముద్రఖని, దర్శకుడు మొహర్ రమేష్ కూడా తిరుమలేశుని దర్శించుకున్నారు. ఈకేవైసీ చేయించుకోండి తిరుపతి అర్బన్: రేషన్కార్డు ఉన్న వారు తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా ఫౌరసరఫరాల శాఖాధికారి శేషాచలం రాజు శనివారం తెలిపారు. కార్డులో ఉన్న సభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. మీ రేషన్కార్డు, ఆధార్కార్డును రేషన్ డీలర్ లేదా సచివాలయం వద్దకు వెళితే మీ వేలిముద్రలు తీసుకుంటారని వెల్లడించారు. దీంతో ఈకేవైసీ పూర్తి అవుతుందన్నారు. జిల్లాలో 6 లక్షల రేషన్కార్డులున్నాయని, సుమారుగా 17 లక్షల మంది సభ్యులున్నారని పేర్కొన్నారు. అయితే 68 వేల మంది సభ్యుల ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లు చూపుతుందని చెప్పారు. వారు తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. అయితే 5ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు ఈకేవైసీ అవసరం లేదని స్పష్టం చేశారు. -
పెంచలకోన క్షేత్రం.. భక్త జన సంద్రం
రాపూరు:మండలంలోని పెంచలకోన క్షేత్రం శనివా రం భక్తులతో కిక్కిరిసింది. బ్రహ్మోత్సవాల అనంత రం వచ్చే మొదటి శనివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెనుశిల లక్ష్మీనరసింహాస్వా మి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామివారిని దర్శించు కుని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 4 అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు పూలంగిసేవ నిర్వహించారు. 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నిత్యకల్యాణ మండలంలో కొలు వు దీర్చి, విశేషాలంకరణ చేసి, శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ఊజంల్సేవ చేశారు. -
వసంతోత్సవం.. పరిసమాప్తం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన వసంతోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన చేశారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులు, సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామి, రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి, ఆస్థానం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.45 నుంచి 3.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రాజోపచారం చేశారు. చక్రధార, శంఖధార, సహస్రధార, మహాకలశాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో కురువేరు, వట్టివేరు, రోజా, మల్లె, సంపంగి, గులాబి, దవణం, తులసి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. కాగా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధన శేఖర్ పాల్గొన్నారు. -
ప్రతి నిర్మాణం అనుభవపాఠం!
ఏర్పేడు: తిరుపతి ‘భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ(ఐసర్)’ శాశ్వత ప్రాంగణంలో ప్రతి నిర్మాణం విజ్ఞానాన్ని అందించేలా అను భవ పాఠం నేర్పుతోంది. ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్లో కొలీజియం(ఆడిటోరియం) భవనానికి రసాయన ఫార్ములాలను అరలు లాగా అమర్చడంతో కొత్తగా ఐసర్ను చూసేందుకు వచ్చిన వారు వినూత్నంగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూసి అబ్బురపడుతున్నారు. దాని సమీపంలో ఉన్న సైన్స్ ప్రయోగ భవనాలను విభిన్న ఆకృతులు, దేశంలో పేరెన్నిక గల సైన్స్ నిపుణులు, శాస్త్రవేత్తల పేర్లు, వివిధ సైన్స్ ఫార్ములాలను రాయడం, భవనాల ఆకృతులు కూడా విభి న్నంగా కనిపిస్తున్నాయి. వ్యాసాశ్రమంలో అక్రమాలపై ఫిర్యాదు ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని శ్రీవ్యాసాశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆశ్రమ పూర్వ విద్యార్థుల సంఘం భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినట్లు వెల్లడించారు. ఆశ్రమంలో వ్యవస్థాపకులు సద్గు రు మలయాళ స్వామి ఆశయాలకు అనుగుణంగా పాలన జరగడం లేదని అందులో పేర్కొన్నా రు. చిత్తూరులోని వ్యాసాశ్రమానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారని ఆరోపించారు. ఆశ్రమంలో భక్తులను లో పలికి రానివ్వకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేశారని, ఆశ్రమంలో గతంలో ఉన్న వేదవిద్య, కంటి వైద్యశాల వంటివి మూతవేశారన్నారు. ఆశ్రమంలో నిధులను నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసి దుర్వినియోగం చేస్తున్నారని, వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖను పంపినట్లు తెలిపారు. శ్రీవారి సేవలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్తిరుమల: భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ దంపతులు శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వదించారు. అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి సేవలో కేంద్ర ఎన్నికల అధికారి చంద్రగిరి: కేంద్ర ఎన్నికల అధికారి గ్యానేష్ కుమార్ దంపతులు శనివారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని, అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
శాస్త్రోక్తంగా చక్రస్నానం
నాగలాపురం: మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం ఉదయం పద్మసరస్సులో చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు భట్టాచార్యులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, నిత్య కై ంకర్యాలు పూర్తి చేశారు. 6.30 గంటలకు స్వామివారిని పల్లకిలో కొలువుదీర్చి, గ్రామోత్సవం నిర్వహించారు. పల్లికి సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి వారికి స్నపన తిరుమంజనం చేశారు. 10.45 గంటలకు కోనేటిలో జలాలకు సంప్రోక్షణ చేసి, చక్రస్నానం నిర్వహించారు. అదే సమయంలో భక్తులు కోనేటిలో స్నాన మరిచారు. తరువాత ఉత్సవర్లకు ఆస్థానం జరిపారు. సాయంత్రం 7 గంటలకు విశ్వక్సేనుడితో కలిసి స్వామి వారిని మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్ రాయులు, ఉదయ్ కుమార్, అర్చకులు దేవరాజ్ భట్టాచార్యులు పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఏర్పేడు: మండలకేంద్రానికి సమీపంలో శనివారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్పేడుకు చెందిన వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి కథనం మేరకు.. మండల కేంద్రంలోని కమ్మవీధికి చెందిన వంకాయలపాటి కరుణాకర్నాయుడు(65) జాతీయ రహదారి పక్కన ఉన్న తన పొలానికి మట్టి తోలించడానికి వెళ్లి తిరిగి ఇంటికి బైక్పై వస్తుండగా, ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదాన్ని తప్పించబోయే క్రమంలో శ్రీకాళహస్తి వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి లారీలో ఉన్న పెద్ద గ్రానైట్రాయి మృతుని పక్కన పడింది. దీంతో కరుణాకర్నాయుడికి బలమైన గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బైక్ను ఢీకొన్న బైక్పై వెళుతున్న యువకుడి కాలు విరగగా, తలకు గాయమైంది. దీంతో క్షతగాత్రుడిని తిరుప తి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీకాంత్రెడ్డి, ఎస్ఐ రవిప్రకాష్ తెలిపారు. -
గంగమ్మకు తిరుమల వెంకన్న సారె
తిరుపతి కల్చరల్: తాతయ్యగుంట గంగమ్మకు శనివారం శ్రీవారి సారె సమర్పించారు. టీటీడీ తరఫున పోటు ఏఈఓ గుండ్లూరు మునిరత్నం తిరుమలలోని శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు సారెను గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలో శ్రీపుండరీకవల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల మధ్య శోభాయాత్రగా గంగమ్మ ఆలయానికి సారెను తీసుకెళ్లి ఆలయ అర్చకులకు శేషవస్త్రాలు, పసుపు, కుంకుమ వంటి సారెను అందజేశారు. గంగమ్మకు టీటీడీ ఉగ్యోగులు సారె తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా శనివారం టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీ పవన్, అసోసియేట్ ప్రెసిడెంట్ మణికంఠ, కోశాధికారి రేఖ, భరత్, శివ, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చీర్ల కిరణ్, టీటీడీ ఉద్యోగుల సంఘం నేతలు రమాదేవి, మదన్మోహన్, చిన్నంగారి సూరిబాబు, ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్కుమార్ కుటుంబ సమేతంగా శనివారం గంగమ్మ తల్లికి సారెను సమర్పించారు. అనంతరం జాతర ఏర్పాట్ల నిమిత్తం ఆయన రూ.25 వేలు నగదును ఆలయ చైర్మన్ నైనాన్ మహేష్యాదవ్కు అందజేశారు. తరువాత శాప్ చైర్మన్ రవి నాయుడు గంగమ్మ తల్లి జాతర నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు విరాళాన్ని ఆలయ చైర్మన్ మహేష్యాదవ్కు అందజేశారు. -
జనసేన నేతలపై తిరుగుబాటు బావుటా!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన నాయకులపై ఆ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు మాకొద్దంటూ డిమాండ్ చేశారు. నాయకులు సొంత వ్యాపారాలు, పనుల్లో బిజీగా ఉంటూ.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు తమకు వద్దంటూ సీనియర్ నాయకుల సమక్షంలోనే నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంపై ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మరి కొందరు ముఖ్య నాయకులు హాజరయ్యారు. కొద్ది సేపటికి జిల్లా అధ్యక్షుల నియామకంపై చర్చ ప్రారంభమైంది. వెంటనే వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాము ఫోన్చేసినా, ఏదైనా చెప్పుకునేందుకు వెళ్లినా స్పందించరని మండిపడ్డారు. ఆ వెంటనే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నాయకత్వం పైనా నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేని నాయకులు, స్పందించని జిల్లా అధ్యక్షులు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపాదిత పేర్లపైనా అభ్యంతరం ప్రస్తుతం సూచించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో డాక్టర్ హరిప్రసాద్, కిరణ్రాయల్, విజయ్ పేర్లు ప్రస్తావించడంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, విజయ్కి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తలు ఒకానొక సమయంలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా కార్యకర్తలంతా లేచి.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తామని తేల్చిచెప్పారు. అప్పటి వరకు జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగటానికి వీల్లేదని పట్టబట్టారు. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా వేయాల్సి వచ్చింది. -
విజయ్కు సీఎం చాన్స్ ఇవ్వాల్సిందే: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏమాత్రం మంచి చేయని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం తాతయ్య గుంట గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా తాజా తమిళ రాజకీయ సంక్షోభంపైనా ఆమె స్పందించారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. కాబట్టి విజయ్కు సీఎంగా ప్రమాణం చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అవకాశం ఇవ్వాలి. తద్వారా తమిళ ప్రజల నిర్ణయాన్ని ఆయన ఆమోదించాలి అని రోజా అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి, విజయ్కు దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారామె. ‘‘జగనన్నకు, విజయ్కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు. అలాగే హామీల అమలు విషయంలోనూ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు’’ అని అన్నారామె. జగనన్న పాలనలో తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈవీఎంల మోసంతో కూటమి ప్రభుత్వం ధికారంలోకి వచ్చిందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ల బండారం బయటపడుతుందని ఆర్కే రోజా అన్నారు. -
అల్లుడు గారు.. ఈ పెళ్లి మా అమ్మాయికి ఇష్టం లేదు..!
తిరుపతి జిల్లా: పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడిని నమ్మించి...అవసరాల నిమిత్తం అతని రూ.11లక్షల 38వేలు తీసుకుని, తీరా పెళ్లి కోసం నిలదీస్తే ఇష్టం లేదని మోసం చేసిన ఓ కుటుంబంపై బాధితుడు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. బాపట్ల జిల్లా గూడపల్లి గ్రామానికి చెందిన సుజేంద్ర(35) ఏర్పేడు మండలం చింతలపాళెం డీఆర్డీవో ప్రాంగణంలో ఎస్ఎస్సీ ప్రాజెక్టు కింద డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్. సుజేంద్ర పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా, తొట్టంబేడు మండలం తాటిపర్తికి చెందిన కమలాకర్, తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి అతడి నుంచి పలుమార్లు రూ.11,38,756 నగదును ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకున్నారు. అలాగే, రూ.2లక్షలు విలువైన రెండు ఐఫోన్లు కూడా తీసుకున్నారు. మార్చి 6న యువతితో సుజేంద్రకు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 22న పెళ్లి జరిగే విధంగా లగ్న పత్రిక రాసుకున్నారు. అప్పటినుంచి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గట్టిగా నిలదీయడంతో యువతికి పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో తాను ఇచ్చిన నగదు, రెండు ఐఫోన్లు తిరిగి ఇచ్చేయాలని బాధితుడు డిమాండ్ చేశారు. నగదు తిరిగి ఇవ్వలేమని వారు ప్లేటు ఫిరాయించారు. తనను ఉద్దేశపూర్వకంగా పెళ్లి పేరుతో నమ్మించి అధిక మొత్తంలో నగదు తీసుకుని పక్కా ప్లాన్తో మోసగించారని బాధితుడు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యువతి, ఆమె తల్లిదండ్రులు, సోదరునిపై ఏర్పేడు ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఎవరికి వారు పంచుకున్నారు
తిరుపతిలోని కూటమి ముఖ్య నేతలు డివిజన్ల కోసం పట్టుపడుతున్నారు. ఎవరూ ఎవరి మాటను లెక్కచేయకపోవడంతో టీడీపీ, జనసేన ఎవరికి వారు డివిజన్లను పంపకాలు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మూడు నెలల కిందట సమావేశమైనప్పుడు ముఖ్యమైన నాయకుల్లో ఒక్కొక్కరు ఐదు డివిజన్ల చొప్పున బాధ్యతలు తీసుకోవాలని మాట్లాడుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 20 డివిజన్లు తనకే అప్పగించాలని పట్టుబట్టినట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు. ఇకపోతే నరసింహయాదవ్ 10 నుంచి 15 డివిజన్లు అడిగినట్లు చెబుతున్నారు. అన్నా రామచంద్రయాదవ్ ఐదు డివిజన్లు అడిగారని ప్రచారం జరిగింది. అయితే మబ్బు దేవనారాయణరెడ్డి నగరంలోని అన్ని డివిజన్ల బాధ్యత తనకు అప్పగిస్తే అభ్యర్థులందరినీ గెలిపించుకొస్తానని చెప్పినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. అలాగే జేబీ శ్రీనివాసులు అడిగినట్లు తెలిసింది. ఇందులో జనసేనకు ఎన్ని అనే ప్రస్తావన రాలేదని సమాచారం. ఎందుకంటే ఆ సమావేశంలో జనసేన ముఖ్యనేతలు లేరని తెలిసింది. -
వ్యాక్సినేషన్ కార్యక్రమం తనిఖీ
సూళ్లూరుపేట రూరల్: మండలంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మహిళలకు శుక్రవారం నిర్వహించిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీఎంచ్ఓ బాలకృష్ణానాయక్ తనిఖీ చేశారు. మండలంలోని కుదిరి, 104 వాహనం మందులు, షార్లోని గిరిజన కాలనీలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్లను వేసినట్లు అధికారులు తెలిపారు. వైద్యులు జయశ్రీదేవి, ఐ. రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం నాయుడుపేట టౌన్: మండలంలోని నరసారెడ్డికండ్రిగ వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. నరసారెడ్డికండ్రిగ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అ క్కడికక్కడే మృతిచెందినట్లుగా స్థానికులు గుర్తించారు. అయితే మృతదేహంపై అనేక వాహనాలు వెళ్లడంతో శరీర భాగాలు చిందరవందర కావడంతో ఆనవాళ్లు గుర్తుపట్టలేనంతగా మారాయి. సు మారు 35 ఏళ్ల వ్యక్తి శరీరంపై ఎలాంటి దుస్తులు లేవని, కేవలం డ్రాయిర్ మాత్రమే ఉందని ఏ ఎస్ఐ తెలిపారు. డేవిడ్ అనే అంబులెన్స్ డ్రైవర్ సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడి ఉన్న శరీర భాగాలను గోనెసంచిలో వేసి పోలీసులకు అప్పగించడంతో వారు ఆ మృతదేహాన్ని మార్చరీలో భద్రపరిచినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
మెరిసిన జిల్లా విద్యార్థులు
ఏపీఈసెట్ ఫలితాల్లో తిరుపతి సిటీ: పాలిటెక్నిక్ డిప్లొమో పూరైన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం గత నెల 23న నిర్వహించిన ఏపీ ఈసెట్–2026 పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తిరుపతి జిల్లాలో 92.62 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 1,522 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,463 మంది ఏపీఈసెట్ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,355 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మళ్లీ బాలికలదే పైచేయి.. ఉన్నత విద్యామండలి విడుదల చేసిన ఏపీఈసెట్–2026 ఫలితాల్లో జిల్లాలో బాలుర కంటే బాలికలే అత్యధిక శాతం మంది ఉత్తమ మార్కులు సాధించారు. ఏపీఈసెట్కు 980 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 902 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే 483 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా 453మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర స్థాయిలో మెరిసిన జిల్లా విద్యార్థులు జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. 20 విభాగాల్లో జరిగిన ఏపీ ఈసెట్ పరీక్షలో ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగంలో తిరుపతి శ్రీపురంకాలనీకి చెందిన సి వెంకట నిఖిత రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించింది. ఆమె తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ విభాగంలో డిప్లొమో పూర్తి చేసింది. అలాగే చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం, దామల చెరువుకు చెందిన విద్యార్థి సీ పునీత్ కుమార్ బీఎస్సీ(గణితం) స్ట్రీమ్లో ఈసెట్ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించారు. ఆయన చిత్తూరు విజ్ఞాన సుధ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి ఏపీఈసెట్ పరీక్షలో ర్యాంకు సాధించారు. ఏపీ ఈసెట్ ఫలితాల్లో పలు విభాగాల్లో రాష్ట్రస్థాయిలో ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలవిద్యార్థులు కుసుమ 9వ ర్యాంక్, ఎస్ గౌరి 19, భువనేశ్వరి 24, రమ్యకృష్ణ 30, కే నిఖిత 52, నందిని 47, శైలజ 64, శిరీష 74 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ వై ద్వారకనాథ్రెడ్డి, అధ్యాపక బృందం అభినందించారు. -
బుడిబడి నడకలేవీ..?
అద్భుతమైన పథకం.. మహాద్భుతమైన నిబంధనలు.. ఇంకేం పేద విద్యార్థులకు ఇబ్బందే ఉండదు. అక్షరాలు కదం తొక్కుతాయి. పేద పిల్లలందరూ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల తలుపులు తడతారు. పేదలందరికీ కార్పొరేట్ విద్య అందుతుంది. పేదింట అక్షరాల పూదోటలు విలసిల్లుతాయనుకున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి.. ప్రభుత్వం మారింది.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పేద విద్యార్థులు కార్పొరేట్ గడప తొక్కలేక మగ్గిపోతున్నారు. ఇదీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యా పథకం పరిస్థితి. సరైన అవగాహన కల్పించడంలో విఫలం విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు తమ ప్రాంతంలోనే ఉండే మంచి స్కూలును ఎంపిక చేసుకుంటే, ఉచిత విద్య పథకంలో అవకాశం కల్పిస్తామనే అవగాహన కల్పించలేదని విమర్శలున్నాయి. అలాగే కార్పొరేట్ పాఠశాలతోపాటు గుర్తింపు ఉన్న స్కూళ్లను ముందే సంప్రదించి...నామ్ అకడమిక్ పేరుతో రూ.30వేలు చెల్లించడం కుదరదని చెప్పడంలోను విద్యాశాఖ వెనుకబడి ఉందని చర్చసాగుతోంది. దీంతోనే అడ్మిషన్లు లేకుండా ఖాళీగా ఉన్న ప్రైవేటు స్కూళ్లను ఎక్కువగా ఎంపిక చేస్తున్నారని తెలుస్తుంది. తిరుపతి అర్బన్: పేద విద్యార్థులకు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో విద్యను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత విద్య పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థి తమ నివాసానికి సమీపంలోని ప్రైవేటు స్కూల్లో చేర్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ప్రతి కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలో 25శాతం అడ్మిషన్లు ఇవ్వాలనే నిబంధన పెట్టారు. ఆ విధానాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కచ్చితంగా అమలు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లుపొడుస్తుందనే విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ఏ గ్రేడ్లోనే కార్పొరేట్ స్కూళ్లలోనే కాకుండా బీ,సీ గ్రేడ్ల పరిధిలోని ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలను విద్యాశాఖాధికారులు చేర్పిస్తున్నారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో నాన్ అకడమిక్ ఫీజు రూ.30వేలు డిమాండ్ ఉచిత విద్య పథకానికి సంబంధించి కార్పొరేట్ స్కూళ్లను ఏ గ్రేడ్గా విభజించారు. అలాంటి స్కూళ్లలో పిల్లలను చేర్చుకుంటే విద్యాశాఖ ఒక విద్యా ర్థికి రూ.13 వేలు చొప్పన స్కూల్కు చెల్లించాలి (తల్లికి వందనంకు ఇచ్చే డబ్బులు), అలాగే మధ్యతరగతి ప్రైవేటు స్కూళ్లను బీ గ్రేడ్గా విభజన చేశారు. అలాంటి స్కూల్కు విద్యాశాఖ వారు ఒక్కో విద్యార్థికి రూ.11,500 చెల్లించాలి. మిగిలిన 1500 విద్యార్థి తల్లిఖాతాలో జమ చేస్తారు(తల్లికి వందనం రూ.13 వేలు నగదు విభజన), చిన్న ప్రైవేటు స్కూళ్లను సీ గ్రేడ్గా విభజన చేశారు. అలాంటి స్కూల్కు విద్యాశాఖ వారు ఒక్కో విద్యార్థికి రూ.10వేలు చెల్లిస్తారు. మిగిలిన రూ.3 వేలు నగదు విద్యార్థి తల్లి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు (ఏ గ్రేడ్)ఉచిత విద్య స్కీమ్ ద్వారా పిల్లలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. నాన్ అకడమిక్ పేరుతో అదనంగా రూ.30 వేలు ఒక్కో విద్యార్థి చెల్లించాలని మెలిక పెట్టేస్తున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు వారి జోలికి వెళ్లడం లేదు. ఇక బీ గ్రేడ్లో భాగంగా మీడియం స్కూళ్ల విషయానికి వస్తే ఒకటో తరగతిలో అడ్మిషన్లు తక్కువ శాతం ఉన్నవారు మాత్రమే పేద పిల్లలను చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. సీ గ్రేడ్లో భాగంగా చిన్న ప్రైవేటు స్కూళ్లు, ప్రధానంగా మండల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణంలో కొత్తగా పెడుతున్న చిన్న పాఠశాలల వారు మాత్రమే తమకు సరైన అడ్మిషన్లు లేకపోవడంతో పేద పిల్లలకు ఉచిత విద్య పథకం ద్వారా చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ సైతం అదే దారిలో అడుగులు వేస్తుంది. మొత్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలతో పనిలేకుండా అడ్మిషన్లు కోసం ఎదురుచూస్తున్న ప్రైవేటు స్కూళ్లలోనే ఉచిత విద్య పథకం ద్వారా చేర్చుతున్నారనే విమర్శలున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్యకు తగ్గుతున్న ఆదరణ నాలుగు విడతల్లో 25 శాతం విద్యార్థుల భర్తీ ఉచిత విద్య పథకంలో భాగంగా జూన్ 12 లోపు నాలుగు విడతల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను విద్యాశాఖ వారు ప్రైవేటు స్కూళ్లలో చేర్చించాల్సి ఉంది. అయితే మొదటి విడతలో 523 మంది పేద విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే అందులో 106 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్ తమకు నచ్చకపోవడంతో అడ్మిషన్లు తీసుకోలేదు. రెండో విడతలో 261 మందిని ఎంపిక చేశారు. వీరు ఈ నెల 16 లోపు అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరూ ఆడ్మిషన్లు తీసుకోలేదు. మూడో విడత ప్రక్రియ ఈ నెల 17 నుంచి 31వ తేదీ లోపు, నాలుగో విడత జూన్ 1 నుంచి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. -
టీడీపీ మూకలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
– మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరిక తిరుపతి తుడా: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ మూకలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని శుక్రవారం రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాయచోటిలో మంత్రి రామ్ప్రసాద్రెడ్డి భూ దందాలు, రౌడీయిజం, గంజాయి అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. రామ్ప్రసాద్రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వారికి ఇదే పరిస్థితి భవిష్యత్లో ఎదురవుతుందన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దాడి చేయడంపై ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. వంటగ్యాస్ లీక్.. ఐదుగురికి గాయాలు డక్కిలి: వంటగ్యాస్ లీక్ కావడంతో ఐదుగురు గాయపడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు కథనం మేరకు.. మండలంలోని దగ్గవోలు గ్రామానికి చెందిన బొడుగు జయమ్మ ఇంట్లో వంటగ్యాస్ లీకై ంది. వంట గ్యాస్ లీకై న సంఘటన గమనించిన జయమ్మ పక్కింటివారితోపాటు స్థానికులు, సమీప ప్రాంతంలో ఉన్న వారికి ఈ విషయం తెలియజేసింది. దీంతో పక్కింట్లో ఉన్న వీరపు వెంకటేశ్వర్లు భార్య మంజులతోపాటు బోడుబోయిన సుబ్రమణ్యం, పాడి ప్రసాద్ తదితరులు జయమ్మ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ గ్యాస్ లీకై ఉండడంతో గ్యాస్ను నివారించేందుకు ఆతృతగా గ్యాస్ రెగ్యులేటర్ను సరిచేశారు. తర్వాత గ్యాస్ను వెలిగించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని జయమ్మ, వెంకటేశ్వర్లు, మంజుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్, సుబ్రమణ్యం స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రిలో తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
దొరవారిసత్రం: మావిళ్లపాడు సమీపంలోని ఓ దాబా వద్ద జాతీయ రహదారికి పక్కనే గుర్తుతెలియని సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి డాబా వద్దకు బైక్పై వచ్చి మద్యం మత్తులో పడిపోయాడు. అక్కడ ఉన్న దాబాకు చెందిన వారు నీళ్లు తాగించి పంపారు. శుక్రవారం ఉదయం చూసేసరికి దాబాకు 100 మీటర్లు దూరంలో బైకు ఒక పక్క, ఒంటిపై దుస్తులు లేకుండా కేవలం డ్రాయిర్తో పడిపోయి మృతి చెందడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూటుగా మద్యం తాగిన అతను పడిపోవడంతో తాగేందుకు నీళ్లు లేక గొంతు ఎండిపోయి మృతి చెంది ఉండవచ్చని స్థానిక పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ చౌదరి ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృత దేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధి పనుల్లో పురోగతి చూపాలి
తిరుపతి అర్బన్: కేంద్రం చేపట్టిన అన్ని అభివృద్ధి పనుల్లో పురోగతి చూపాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అధ్యయన కమిటీ చైర్మన్ మాగంటి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తిరుపతికి విచ్చేసిన కమిటీ బృందం శుక్రవారం తాజ్ హోటల్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రానికి సంబంధించిన అమృత్, అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్)2.0, పీఎం స్వానిధి, అర్బన్ చాలెంజ్ ఫండ్, ఎన్యూడీఎం, పీఎం ఈ–బస్సు సేవా తదితర కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తిరుపతిలో మెరుగైన సౌకర్యాలకల్పన, పట్టణ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. మరోవైపు మెప్మా ఆధ్వర్యంలో మూడు విడతల్లో 3,752 మంది వీధి వ్యాపారులకు రూ.15.69 కోట్లు మంజూరుకు సంబంధించి పరిస్థితి ఏమిటని ఆరా తీశారు. పార్లమెంటరీ అధ్యయన కమిటీ సభ్యులు, అధికారులు సురేష్కుమార్, కరుణ, అనీల్కుమార్రెడ్డి, ప్రభాకర్, టీటీడీ ఈఓ రవిచంద్ర, జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శారదాదేవి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు లారీ దగ్ధం –తప్పిన పెను ప్రమాదం రేణిగుంట: కడప చైన్నె రహదారి రేణిగుంట సమీపంలోని రామకృష్ణాపురం సర్కిల్లో శుక్రవారం రాత్రి చైన్నె నుంచి రైల్వే కోడూరుకు వెళుతున్న లారీ మంటలకు ఆహుతైంది. స్థానికుల కథనం మేరకు.. రైల్వే కోడూరు చెందిన లారీ డ్రైవర్ ఖాజా హుసేన్ లారీలో రాయి లోడ్ చేసుకుని చైన్నెకి వెళ్లి అన్లోడ్ చేసి ఖాళీ లారీతో తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు టైర్లు వద్ద నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ లారీని పక్కకు ఆపి సురక్షితంగా బయటపడ్డాడు. రేణిగుంట అర్బన్ ఎస్ఐ ధర్మారెడ్డి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారు. ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే పూర్తిగా లారీ కాలిపోయింది. చోరీల కేసులో నిందితుడి అరెస్టు తిరుపతి క్రైం: తాళాలు వేసి ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని తిరుపతి జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.18.50 లక్షల నగదు, 126 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నెహ్రూ నగర్కు చెందిన ఉల్కేష్ (27) విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయాలను గమనిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూవచ్చాడు. తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో వరుసగా జరిగిన చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల దృశ్యాలు, అనుమానితుల కదలికలను విశ్లేషించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు 2024లో తిరుపతి నగర పరిధిలో మొత్తం ఆరు చోరీ కేసులకు పాల్పడినట్లు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి రూ.18.50 లక్షల నగదు, 126.135 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారు గొలుసులు, ఉంగరాలు, చైన్లు, లక్ష్మీ డాలర్ చైన్, చెవిపోగులు తదితర ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. కేసు ఛేదించిన పనిచేసిన సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
వైభవం..రథోత్సవం
నాగలాపురం: మండల కేంద్రంలోని వేదనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై విహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు భట్టాచార్యులు వేకువ జామున ఆలయ శుద్ధి, నిత్య కై ంకర్యాలు పూర్తి చేశారు. 6.30 గంటలకు స్వామివారిని రథంలో కొలువుదీర్చి గోవింద నామ స్మరణల నడుమ కోలాహలంగా రథోత్సవం జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకున్న వేదనారాయణుడికి ఆలయ ప్రాంగణలో స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం 4.30 గంటలకు రాములవారి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఆర్జిత కళ్యాణోత్సవం జరిపారు. రాత్రి 8 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను అశ్వ వాహనంపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు, పండరి భజనల నడుమ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ ఽశ్రీనివాసులు రెడ్డి, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్ రాయులు, ఉదయ్ కుమార్, అర్చకులు దేవరాజ్ భట్టాచార్యులు పాల్గొన్నారు. -
రక్తమోడిన రహదారులు
రాజంపేట: వైఎస్సార్ కడప జిల్లాలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణా లు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజంపేటలోని తిరుపతి, కడప బైపాస్ రోడ్డులో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓబులవారిపల్ల మండల గాడివారిపల్లెకుచెందిన కోటకొండ సుబ్బమ్మ (56), తిరుపతి ఆటోనగర్కు చెందిన పూర్ణచంద్రరాజు మృతి చెందారు. పోలీసులు స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నీళ్లు చల్లించేందుకు వచ్చి కాటికి.. తిరుపతి ఆటోనగర్కు చెందిన పూర్ణచంద్రరాజు, బత్తలబాలాజీ, కృష్ణమనేని శశిధర్ గురువారం రాత్రి కడపకు కారులో బయలుదేరారు. రాజంపేట బైపాస్లో ఉస్మాన్నగర్ వద్దకు రాగానే ప్రైవేటు బస్సు, కారు ఢీ కొన్నాయి. ముందుసీటులో ఉన్న పూర్ణచంద్రరాజు అక్కడక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న బత్తలబాలాజీ, వెనుక సీట్లో కూర్చున్న కృష్ణమనేని శశిథర్ గాయపడ్డారు. బత్తల బాలాజీ పెద్దనాన్న ఇటీవల మృతి చెందారు. పెద్దకర్మలో భాగంగా వీరు నీళ్లు చల్లించేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. విషాదం నింపింది. -
రూటు మార్చిన ఇసుకాసురులు
నాయుడుపేట టౌన్: స్వర్ణముఖి నది నుంచి ఇసుక పొట్టు మాటున తరలిపోతోంది. తరచూ తనిఖీలతో ఇసుకాసురులు రూటు మార్చి పొట్టు బస్తాల మాటున తరలిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో డంపింగ్ చేసి, అధికారులు, పోలీసుల కళ్లు గప్పి, పొట్టు మాటున లారీల్లో తమిళనాడుకు తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వెంగమాంబపురం సమీపంలో రహదారి పక్కనే ఉన్న ఓ స్టీల్ పరిశ్రమ వెనుకన ఉన్న అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది నుంచి ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలించి, డంపింగ్ చేసుకుని అర్ధరాత్రి సమయాల్లో లారీల్లో పొట్టుబస్తాల మాటున నిరంతరంగా తరలిస్తున్నారు. ఈ విషయమై అధికారులు, పోలీసులకు తెలిసినా పట్టించుకోక పోవడం ఆంతర్యం ఏమిటోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల కిందట వెంగమాంబపురం రహదారి పక్కనే ఉన్న స్టీల్ పరిశ్రమ వెనుక అటవీ ప్రాంతంలో ట్రాక్టర్లతో అక్రమంగా డంపింగ్ చేసిన ఇసుక నిల్వలను లారీలలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సమయానికే లారీ డ్రైవర్, క్లీనర్లు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అప్పటి నుంచి ఇసుక డంపింగ్ యార్డు వద్ద పొట్టుబస్తాలతో ఆపి ఉన్న లారీని పోలీసులు సీజ్ చేసి, తీసుకువెళ్లక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ సీజ్పై ఇంకా మంతనాలు జరుగుతున్నాయా? లేక అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోవడం లేదా? అని ప్రజలు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా తమిళనాడుకు ఇసుక అక్రమ రవాణా దందా సాగుతుందనడానికి ఈ సంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఏపీ పీజీసెట్ –2026 ప్రారంభం
తిరుపతి సిటీ: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ పీజీసెట్–2026 శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రం కోడ్ను ఎస్వీయూ వీసీ, పీజీసెట్ చైర్మన్ ప్రొఫెసర్ నర్సింగరావు వర్సిటీలోని పీజీ సెట్ కార్యాలయంలో విడుదల చేశారు. ఏపీ పీజీసెట్ – 2026లో భాగంగా తొలి రోజు శుక్రవారం మధ్యాహ్నం 4 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 397 మంది దరఖాస్తు చేసుకోగా 319 మంది హాజరుకాగా 78 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ ప్రొఫెసర్ పద్మావతి, కోకన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్రాజు తెలిపారు. తొలిరోజు 80శాతం హాజరు నమోదైందని పరీక్ష ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయన్నారు. ఈనెల 11వ తేదీ వరకు పీజీ సెట్ కొనసాగుతుందని తెలిపారు. అక్రమంగా చెరువు మట్టి తరలింపు ఏర్పేడు: మండలంలోని కోబాక పంచాయతీ కుప్పయ్యకండ్రిగ చెరువులో శుక్రవారం సమీపంలోని ప్రైవేటు వెంచర్కు అక్రమంగా మట్టి తరలిస్తుండడంతో పోలీసులు ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో మట్టి రాత్రింబవళ్లు తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వి తరలిస్తు న్నారు. చెరువును ఇప్పటికే పెద్ద పెద్ద గోతులుతో తవ్వేసి మట్టిని ప్రైవేటు వెంచర్లకు విక్రయిస్తూ కొందరు అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 70,001 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,085 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
స్వర్ణరథ రంగ వైభవం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు స్వర్ణరథోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్లు రమేష్ బాబు, రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్ పాల్గొన్నారు. -
‘మీరు చేసిన తప్పలకు శిక్ష అనుభవించాల్సిందే’
తిరుపతి: ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతూనే ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి రాజకీయం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై రాంప్రసాద్రెడ్డి వర్గీయులు దాడి చేయడం అత్యంత హేయమన్నారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో టీడీపీ గుండాలు దాడిలో గాయపడిన రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామి రెడ్డిను పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు.రౌడీయిజం చేస్తారు అనే రామ్ ప్రసాద్ రెడ్డికు మంత్రి పదవి ఇచ్చారు, రాయచోటిలో మంత్రి రాంప్రసాద్రెడ్డి భూ దందాలు, రౌడీ ఇజం, గంజాయి అక్రమాలు పెరిగిపోయాయి. ఖచ్చితంగా మీరు చేసిన శిక్షకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. దశరథ రామిరెడ్డి వైఎస్సార్సీపీలో ఉన్నారనీ మీరు దాడి చేశారు, దీనికి శిక్ష అనుభవించక తప్పదు. అన్యాయంగా మనుషుల్ని వేటాడి, కొట్టి, హత్య చేసేందుకు కుట్ర చేశారు. రామ్ప్రసాద్రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోరు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా దాడి చేశారు. ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదు, లా అండ్ ఆర్డర్ పూర్తి గా ఫెయిల్యూర్ అయ్యింది’ అని విమర్శించారు. -
స్విమ్స్పై బోర్డు సభ్యుడి పెత్తనం
సాక్షి టాస్క్ఫోర్స్: టీటీడీ ఆస్పత్రులు ఓ బోర్డు సభ్యుడుకి ఆదాయ వనరుగా మారింది. మెడికల్ షాపులు, ఇతర టెండర్లలో మితిమీరిన జోక్యం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఆ వ్యక్తి కారణంగా వివాదస్పదమవుతున్నాయి. ఆ వ్యక్తి మితిమీరిన జోక్యంతో స్విమ్స్, శ్రీ పద్మావతి ఆస్పత్రి రోగుల పాలిట శాపంగా మారాయి. మామూళ్ల పేరుతో టెండర్ దారులను లొంగదీసుకోవడం, మాట వినకపోతే వివిధ ఆరోపణలతో అడ్డుకోవడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. దీంతో ఆస్పత్రుల నిర్వహణ టీటీడీకి సవాల్గా మారింది. టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్, శ్రీ పద్మావతి, బర్డ్, చిన్నపిల్లల ఆస్పత్రులు నడుస్తున్నాయి. ఈ ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన మందులు సరఫరా, శానిటేషన్ నిర్వహణ, ఆహారం, ఇతర కొనుగోళ్లు టెండర్ల ద్వారా నిర్వహిస్తారు. ఈ క్రమంలో టీటీడీలోని ఓ బోర్డ్ సభ్యుడు టెండరుదారులను టార్గెట్ చేశారు. దాదాపు ఏడాదిన్నర పైగా ఆయన ఈ హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ తన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. తాను అడిగింది ఇవ్వాలని, చెప్పింది చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. అడిగింది ఇవ్వని పక్షంలో వారిపై వైఎస్సార్సీపీ ముద్ర వేయడం, అక్రమాలు జరుగుతున్నాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇదే విషయాలతో టీటీడీ పెద్దలను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ ఆయన మాఫియాను నడిపిస్తున్నారు. ఇప్పుడు స్విమ్స్ వంతు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తామని చెబుతున్న టీటీడీ పెద్దలు ఆస్పత్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్విమ్స్లో మూడు మెడికల్ షాపులకు గాను కేవలం ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మెడికల్ షాపు యజమానిని లొంగదీసుకునేందుకు ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తాను అన్నింటిలోనూ పక్కాగా ఉండానని, మీరు అడిగింది ఇస్తే రోగులకు సరసమైన ధరలకు మందులు అందించలేమని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఎన్నాళ్లు నిమ్మకుండి పోయారు. ఆ మెడికల్ షాప్నకు టెండర్ అయిపోవడంతో కొనసాగింపు లేకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. రూ.2 కోట్లు ఇస్తే రెండేళ్లు కొనసాగించేలా ఆర్డర్ తీయిస్తానని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ యజమాని ససేమిరా అనడంతో అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. టీటీడీకి ఈ మెడికల్ షాపు ద్వారానే దాదాపు రూ.31 లక్షలు ఆదాయం సమకూరుతోంది. టీటీడీ ప్రస్తుతం టెండర్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో ఆయననే కొనసాగించేందుకు బోర్డు తీర్మానం చేసింది. 20 రోజుల క్రితం ఆయన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చైర్మన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే స్విమ్స్ డైరెక్టర్ సైతం ఆ బోర్డు సభ్యుడి గుప్పెట్లో ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్ చెప్పిన ఉత్తర్వులు ఇవ్వకుండా డైరెక్టర్ తెలివిగా వ్యవహరిస్తున్నట్లు స్విమ్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం జరిగిన బోర్డు మీటింగ్లోనూ ఈ మెడికల్ షాప్ వ్యవహారాన్ని ఆ బోర్డు సభ్యుడు ప్రస్తావించగా చైర్మన్ గట్టిగా బదులిస్తూ ఏమి చేయాలో తనకు తెలుసు, కొనసాగించాలని డైరెక్టర్కి చెప్పాము కదా అంటూ గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది. మెడికల్ షాపులు, టెండర్లలో మితిమీరిన జోక్యం టీటీడీకి భారీ నష్టం పద్మావతి ఆస్పత్రిలో మెడికల్ షాపు అర్ధంతరంగా తొలగించడంతో టీటీడీకి భారీగా నష్టం చేకూరింది. రోగుల మందుల కష్టాలు పక్కన పెడితే నెలకు రూ. 21 లక్షలు టీటీడీ ఖజానాకు సమకూరేది. బోర్డు సభ్యుడు అడిగింది ఇవ్వకపోవడంతో నిర్ధాక్షణ్యంగా తొలగించేందుకు కుట్రపన్నారు. గతంలో ఆ బోర్డు సభ్యుడు మాటలను విశ్వసించిన చైర్మన్ ముందు వెనుక చూసుకోకుండా తల ఊపేశారు. మెడికల్ షాప్ టార్గెట్ వెనుక బోర్డు సభ్యుడు వ్యక్తిగత ఎజెండా ఉందని ఆయన గుర్తించలేకపోయారు. తద్వారా టీటీడీ ఆదాయానికి గండి పడడంతో పాటు రోగులు మందుల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. స్విమ్స్లోను ఇదే తరహా ఎత్తులు వేయడంతో బోర్డు సభ్యుడు వ్యవహారంపై చైర్మన్కు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న మెడికల్ షాపునే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. కొనసాగింపు ఆర్డర్ ఇవ్వాల్సిన స్విమ్స్, వీసీని ఆయన గుప్పెట్లో పెట్టుకుని ఉత్తర్వులు జారీ అవ్వకుండా అడ్డుపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చైర్మన్ ఆదేశాలని డైరెక్టర్ పెడచెవిన పెట్టినట్లు స్విమ్స్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. చైర్మన్ మాట నెగ్గుతుందా... లేదా బోర్డు సభ్యుడి టార్గెట్ ఫలిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. మందుల షాపు రానివ్వకుండా అడ్డు శ్రీపద్మావతి ఆస్పత్రిలో రోజుకు వెయ్యి మందికి పైగా రోగులు వస్తుంటారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో మెడికల్ షాపును నా అనుకున్న వాళ్లకు రాకపోవడంతో అడుగడుగునా ఆ బోర్డు సభ్యుడు అడ్డుపడుతున్నాడు. గతంలో ఉన్న మెడికల్ షాపును వివిధ ఆరోపణలతో ఆ యజమానికి వైఎస్సార్ సీపీ ముద్ర వేసి సాగనంపడంలో ఆయన విజయం సాధించారు. ఈ క్రమంలో సుమారు ఎనిమిది నెలల పాటు పద్మావతి ఆస్పత్రిలో మెడికల్ షాపు లేకుండా పోయింది. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నా మాత్రం మెడికల్ షాపును ఏర్పాటు చేయలేక టీటీడీ చేతులెత్తేసింది. తాను సిఫార్సు చేసిన ఏజెన్సీకి అర్హత లేకపోవడంతోనే మరో మెడికల్ షాపును రానివ్వకుండా ఆయన అడ్డుపడుతున్నారు. దీంతో రోగుల మందుల కష్టాలు తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో టీటీడీ విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. -
స్మార్ట్ అగ్రి ప్రాజెక్ట్కు ద్వితీయ బహుమతి
తిరుపతి సిటీ: ఏర్పేడు ఐసర్ విద్యాసంస్థలో ఇటీవల నిర్వహించిన ఏఐ ఫర్ లైఫ్ హాకథాన్ కార్యక్రమంలో ఎస్వీయూకు చెందిన ఎంసీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రూపొందించి స్మార్ట్ అగ్రి ఏఐ ప్రాజెక్ట్కు ద్వితీయ స్థానం లభించింది. విజేతలకు నిర్వాహకులు రూ.5 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆధునిక ఏఐ ఆధారిత అగ్రికల్చర్ ప్లాట్ ఫామ్ ప్రాజెక్టును ప్రొఫెసర్ కే విజయలక్ష్మి ఆధ్వర్యంలో రూపొందించిన విద్యార్థులు ఎస్ వంశీ, కే శ్రీనివాసులను గురువారం వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జి అంజిబాబు, ప్రొఫెసర్ శ్రీదేవి పాల్గొన్నారు. డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల అటానమస్ హోదాలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ గతనెల 16 నుంచి 29వ తేదీ వరకు జరిగిన నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కేవలం ఆరు రోజుల్లో విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాల్లో 97 శాతం విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారని, 13 విభాగాల్లో వంద శాతం ఫలితాలు సాధించామని చెప్పారు. ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు సహకరించిన ఎగ్జామినేషన్ సెక్షన్ బృందం, అధ్యాపకులను ఆమె ఈ సందర్భంగా అభినందిచారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్న్స్ డాక్టర్ ఎ విద్యుల్లత, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్న్స్ డాక్టర్ భద్రమణి, డాక్టర్ దివ్యవాణి, సూపరింటెండెంట్ శాంతి, నీలదాస్, సుధాకర్, చంద్రశేఖర్, లక్ష్మయ్య, సునీత, సరిత, శిరీష, శైలజ పాల్గొన్నారు. టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షల విరాళాలు తిరుమల : టీటీడీ ట్రస్టులకు దాతలు రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన నవ్య మార్కెటింగ్ యాజమాన్యం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. అలాగే గుంటూరుకు చెందిన వెంకటకృష్ణచైతన్య టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మరో రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. దాతల తరఫున విరాళాల డీడీలను టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు బుధవారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు. దాతలకు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలను అందజేసి సత్కరించారు. -
నేడు ఎడ్సెట్
తిరుపతి సిటీ: బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ ఎడ్సెట్–2026 శుక్రవారం జరగనుంది. కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు తిరుపతి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు తిరుపతి జాపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్లో 800 మంది, పుత్తూరు వెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 160 మంది పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఉండదని సూచించారు. తప్పని ఏనుగుల బెడద – కొండ్రెడ్డికండ్రిగ చెరువులో గజరాజుల హల్చల్ చంద్రగిరి: అటవీ సమీప గ్రామాల్లో ఏనుగుల బెడద తగ్గడం లేదు. రెండు నెలలుగా ఏనుగుల దాడులతో ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. మండలంలోని కొండ్రెడ్డికండ్రిగ చెరువులోకి గురువారం సాయంత్రం ఏనుగుల గుంపు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. చెరువులో సుమారు గంట పాటు తిష్టవేసిన ఏనుగులు అక్కడ నుంచి పంట పొలాలపై దాడులకు పూనుకున్నట్లు రైతులు వాపోతున్నారు. పక్వానికి వచ్చిన మమాడి కాయలను నాశనం చేస్తున్నాయని, వరి, జొన్న, అరటి తోటలను తొక్కేయడంతోపాటు వ్యవసాయ సామగ్రిని ధ్వంసం చేస్తున్నట్లు వాపోతున్నారు. -
శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల:తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ తిరుమల దేవి గురువారం తిరుమలలో శ్రీవారి ని దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు పలకగా, టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. ప్రభుత్వ భూమి కబ్జా కలువాయి(సైదాపురం): మండలంలోని వెంకటరెడ్డిపల్లి జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వ భూమిని కొందరు కూటమి నాయకులు కబ్జా చేసి, రెవెన్యూ అధికారులు పెట్టిన ప్రభుత్వ బోర్డును సైతం తొలగించి అక్రమ నిర్మాణాల కోసం రంగం సిద్ధం చేశారు. విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న, ప్రభుత్వ భూమి అని అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన లెక్క చేయకుండా నిర్మాణం చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బోర్డు తొలగించి, ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
అక్రమాలకు అధికారిక అనుమతులు
● ఇసుక, గ్రావెల్, మట్టి తరలింపునక ఇష్టారాజ్యంగా అనుమతులు ● ఒక్కో అనుమతికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మామూళ్లు ● ఓ మంత్రికి ప్రతి ట్రిప్నకు రూ.వెయ్యి మామూలు ● రోజూ వందల ట్రిప్పుల అక్రమ రవాణా అడ్డుకోవడం మరిచిన అధికారులుప్రకృతి సంపదను అక్రమంగా తవ్వి, తరలించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపేవారు. కేసులు పెట్టడం, అపరాధ రుసుములు వసూలు చేయడం చేసేవారు. అందుకే అక్రమార్కులు ఆ పనులకు వెళ్లాలంటే భయపడేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ప్రయత్నాలే చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలు, రవాణా గురించి అధికారులకు సమాచారం ఉన్నా.. స్థానికులు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారి కరువయ్యారు. అక్రమాలకు అధికారే అనధికారిక అనుమతులు ఇవ్వడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.సాక్షి టాస్క్ఫోర్స్: ప్రకృతి సంపదను అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆదేశాలతో అధికార బృందం అనుమతులు ఇచ్చింది. అధికారుల అండతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో మైనింగ్ దొంగలు చెలరేగిపోతున్నారు. అక్రమంగా తవ్వి విక్రయించే సొమ్ము నుంచి నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు వెళ్తున్నట్లు సమాచారం. అలాగే ఆ మంత్రికి కూడా అక్రమ సంపాదనలో నెలనెలా డబ్బుల పంపుతున్నట్టు కూటమికి చెందిన ఓ నాయకుడు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజక వర్గం నుంచి ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ సంపాదనలో మామూళ్లు తీసుకెళ్లి ఇవ్వాల్సిందేనని చెప్పడం విశేషం. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, చంద్రగిరి, నగరి, గంగాధనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజక వర్గాల పరిధిలో గత రెండేళ్లుగా విచ్చలవిడిగా ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ తవ్వకాలు జరిపి తమిళనాడుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ అక్రమాల విషయం ప్రతి రోజూ ఏదో ఒక పత్రిక, మీడియాలో ప్రసారం అవుతున్నా.. రెండు రోజులు ఆపి, మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. అలా కొనసాగించడానికి కారణం ఏమిటని కూటమి నేతలను ఆరా తీస్తే.. ‘మాదేం లేదు. నెలనెలా ఆ మంత్రికి తీసుకెళ్లి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమైంది, ఈ నెల రాలేదు’ అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అనుమతులు ఇలా.. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో భారీగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమంగా తవ్వి, తరలించాలంటే ముందుగా జిల్లా అధికారి ఒకరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు సమర్పించాలి. ఆ తరువాత స్థానికంగా ఉన్న నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇచ్చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయిలో పంపకాలు ఇలా ఉంటే.. మంత్రి గారికి ప్రతి వాహనానికి రూ.వెయ్యి ఇచ్చేయాలి. అలా రోజుకు ఎన్ని వాహనాల ద్వారా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలిస్తే అన్ని రూ.వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క సత్యవేడు నియోజక వర్గంలోనే 41 క్వారీలు ఉంటే.. రోజుకి 50 వాహనాలు, నెలకు 25 వేలు ట్రిప్పులు తరలిస్తున్నాయి. ఈ లెక్కన ఒక సత్యవేడు నియోజక వర్గం నుంచే నెలకు సుమారు రూ.3 కోట్లు మామూళ్లు వెళుతున్నట్లు అంచనా. ఒక్క సత్యవేడు నియోజక వర్గం నుంచే ఇలా ఉంటే.. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మిగిలిన ఏడు నియోజక వర్గాల నుంచి నెలకు ఎంత మొత్తంలో అక్రమ రవాణా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నియోజక వర్గాల్లో మాత్రం ఎక్కువ శాతం స్థానిక నాయకులే జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
వైభవం.. వసంతోత్సవం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ మూడు రోజుల ఉత్సవాలకు తొలి రోజున విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 8.30 గంటలకు మలయప్పస్వామివారు ఉభయ నాంచారులతో ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేయగా, గోవింద నామస్మరణలతో ఆలయ వీధులు మారుమోగాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి, ఊంజల్ సేవను జరిపారు. వసంతోత్సవాలను పురస్కరించుకుని నిత్య కల్యాణోత్సవం, తిరుప్పావడ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేశ్, ఆలయ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, పలువురు అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథోత్సవం జరగనుంది. -
ట్రై సైకిళ్లు మా కొద్దు బాబూ!
తిరుపతి అర్బన్: ‘మూడు చక్రాల మోటార్ వాహనం ఇస్తేనే తీసుకుంటాం. ట్రై సైకిళ్లు మా కొద్దు బాబూ’ అని దివ్యాంగులు భీష్మించారు. దీంతో నెల రోజులుగా ట్రైసైకిళ్లు కలెక్టరేట్ వద్ద ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. తమ అవసరాల నిమిత్తం లోకల్లో రవాణా చేయడానికి సౌకర్యంగా ఉంటుందని పలువురు దివ్యాంగులు మోటార్ వాహనాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. సాధారణ సమయంలోనే కాకుండా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లోనూ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సహాయ సంచాలకులు బి. వినోద్కు దాదాపుగా 300 మంది దివ్యాంగులు దరఖాస్తులు అందజేశారు. అయితే మూడు చక్రాల మోటార్ సైకిల్ ఒక్కొక్కటి రూ.1.20 లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని, మూడు చక్రాల సైకిల్ అయితే రూ.12 వేలు వస్తుందని, ట్రైసైకిళ్లను నెల రోజుల కిందట తెప్పించారు. ఆ మేరకు దరఖాస్తులు చేసుకున్నవారికి వచ్చి మూడు చక్రాల సైకిల్ను తీసుకుపోవాలని ఆహ్వానిస్తున్నారు. అయితే వాళ్లు మాత్రం తాము దరఖాస్తులు చేసుకున్నది మూడు చక్రాల మోటార్ వాహనం కోసమని, ట్రై సైకిల్ తమకు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ట్రైసైకిళ్లు తుప్పు పడుతున్నాయి. -
ముగిసిన డీమ్డ్ యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్లు
శ్రీకాళహస్తి: పట్టణంలో స్థానిక బ్రాహ్మణ సమాజ కమ్యూనిటీ హాల్ వేదికగా కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలోని పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ డీమ్డ్ యూనివర్సిటీ వారు నిర్వహించిన స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఆయుర్వేదం, సంస్కృతం తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ ప్రక్రియకు శ్రీకాళహస్తి పట్టణ, పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్చాన్సలర్ జి. శ్రీనివాసులు, డీన్ వెంకటరమణ పాల్గొని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలు, కోర్సుల ఎంపిక, భవిష్యత్తు అవకాశాలపై సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 25 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్తో పాటు ఆయుర్వేదం, ఎంబీఏ కోర్సులపై ఆసక్తి చూపినట్లు నిర్వాహకులు తెలిపారు. విలువల కూడిన విద్యాబోధన విద్యను వ్యాపార దక్పథంతో కాకుండా, భారతీయ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ అందించడమే తమ యూనివర్సిటీ ప్రత్యేకత అని వీసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ అధ్యక్షుడు సింగరాజు ప్రకాశం పాల్గొన్నారు. గుడిమల్లం ఆలయ ఈఓగా మునిశేఖర్ ఏర్పేడు: గుడిమల్లంలోని ఆనందవల్లీ సమేత పరశురామేశ్వరాలయం ఈఓగా మునిశేఖర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న రామచంద్రారెడ్డి గత నెలాఖరున ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో తిరుపతి దేవాదాయశాఖలో ఉన్న ఈఓ మునిశేఖర్ను ఇక్కడకు బదిలీ చేశారు. దీంతో ఆయన గురువారం విధుల్లో చేరారు. ఆలయ చైర్మన్ బత్తల గిరిబాబును కలసి సమన్వయంతో ఆలయాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మద్యం తరలిస్తున్న బొలేరో బోల్తా బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని నెరిణికండ్రిగ సమీపంలోని కేటీరోడ్డు చీటికాలువ వంతెన వద్ద గురువారం అదుపు తప్పి మద్యం తరలిస్తున్న బొలేరో బోల్తా పడింది. రేణిగుంటలోని మద్యం గోడౌన్ల నుంచి వరదయ్యపాళెంలోని మద్యం షాపులకు మద్యం బాటిళ్లు తీసుకెళ్లుతున్న బొలేరో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బొలేరోలోని మద్యం బాటిళ్లు పగిలిపోగా, సుమారు రూ. 10 లక్షలు నష్టం వాట్టిల్లినట్లు తెలిసింది. -
తప్పని ఏనుగుల బెడద
చంద్రగిరి మండలంలోని కొండ్రెడ్డికండ్రిగలో ఏనుగులు గురువారం సాయంత్రం హల్ చల్ చేశాయి. జనం భీతిల్లిపోయారు.రేయింబవళ్లు తరలింపు.. అక్రమ సంపాదన కోసం స్థానిక టీడీపీ నేతలు రేయింబవళ్లు ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారు. భారీ యంత్రాల ద్వారా తవ్వి పక్కనే ఉన్న తమిళనాడుకు తరలిస్తున్నారు. టిప్పర్ల ద్వారా తరలించి తమిళనాడులో అధిక ధరకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాల గురించి ఎవరైనా మాట్లాడితే వారిపై దాడులకు తెగబడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల వద్దకు గుర్తు తెలియన వ్యక్తులకు అనుమతులు ఉండవు. క్వారీల సరిహద్దుల్లోనే అనుచరులను కాపాలా ఉంచుతున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి క్వారీలోకి ప్రవేశిస్తుంటే.. వెంటనే అక్రమార్కులకు సమాచారం ఇస్తారు. కొత్త వ్యక్తిని ఫాలో అవుతారు. క్వారీ వివరాల కోసమే వెళ్లి ఉంటే వారిపై దాడులకు తెగబడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విలేకరులు ఎవరైనా వెళితే.. వారిపైనా దాడులకు యత్నిస్తున్నట్లు తెలిసింది. -
జిల్లాలో విద్యావ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు కాలేజీలు ఇష్టానుసారంగా విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్నాయి. నీట్, జేఈఈ కోచింగ్ పేరుతో తల్లిదండ్రులను ఆకర్షిస్తూ నిలువునా దోచేసేస్తున్నాయి.
ఇష్టారాజ్యంగా ఇంటర్ అడ్మిషన్లు ●కమీషన్ల ఆశ చూపి టీచర్లకు గాలం కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు కమీషన్ల ఎర వేసి గాలం వేస్తున్నాయి. పాఠశాలలో పది పాసైన విద్యార్థులను తమ కళాశాలలో చేర్పించేందుకు రెఫర్ చేయాలని ఒక్కో అడ్మిషన్కు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఉపాధ్యాయులు అదే ప్రవృత్తిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మభ్యమాటలు చెప్పి కమీషన్ ఇచ్చే కళాశాలలో ప్రవేశాల కల్పిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సిటీ: పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలలు నిబంధనలు తుంగలో తొక్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు తెరతీసి తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏకంగా తరగతులను ప్రారంభించాయి. ఎలాగైనా తమ కళాశాలలో ప్రవేశాలను పెంచుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కేవలం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలో మాత్రమే అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల కాకముందే ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రవేశాలు ముగింపు దశకు చేరుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు పదో తరగతి ఉత్తీర్ణులైన తమ పిల్లలను పట్టణాల్లో పేరొందిన కళాశాలలో ఇంటర్ చదివించాలని తల్లిదండ్రుల పరితపిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు యాజమాన్యాలు మీ పిల్లల ఫీజులో రాయితీ ఇస్తామని, నీట్, జేఈఈ కోచింగ్ ఇస్తూ ఇంటర్మీడిట్ టాప్ మార్కులతో పాస్ చేస్తామని మభ్యపెడుతున్నాయి. సాధారణ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థికి రూ.1.80 లక్షల నుంచి 2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. దీంతో పాటు హాస్టల్ ఫీజు నెలకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. బైపీసీ ప్లస్ నీట్ కోచింగ్కు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ల సమయంలో సగం ఫీజు కట్టాలని, మిగిలిన ఫీజు రెండు నెలలో చెల్లించాలని తల్లిదండ్రులను మభ్యపెడుతూ కోట్లు దోచుకుంటున్నాయి. దీంతో తల్లిదండ్రులు అప్పులు చేసి ప్రైవేటు యాజమాన్యాలు అడిగినంతా ముట్టజెబుతున్నారు. అనుమతులు లేని కళాశాలలతో జాగ్రత్త సుమా! తిరుపతి జిల్లాలో సుమారు 109 ప్రైవేటు కళాశాలలు ఉండగా అందులో కేవలం 75 కళాశాలలకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు సమాచారం. పలు కళాశాలలు అనుమతి ఒక చోట కళాశాలలు బ్రాంచీల పేరుతో మరో చోట నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కళాశాలలు తిరుపతి జిల్లాలో 33వరకు ఉన్నట్లు సమాచారం. కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు కళాశాలల నడుపుతున్న అధికారులు చోద్యం చూస్తుండటం గమనార్హం. జిల్లా సమాచారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 72 కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు 105 ఇంటర్ ఫస్ట్ ఇయర్కు అనుమతి ఉన్న సీట్ల సంఖ్య సుమారు 25 వేలు పూర్తి స్థాయి అనుమతులు ఉన్న ప్రైవేటు కళాశాలలు 63 అనుమతి ఒక చోట కళాశాల మరోచోట నడుపుతున్న కళాశాలలు 33 అపార్ట్మెంట్లు, నివాస గృహాల్లో నడుస్తున్న కళాశాలలు 54 ల్యాబ్లు, క్రీడామైదానాలు లేని కళాశాలలు సుమారు 80కి పైన నిబంధనలు పాటించకుంటే చర్యలు ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలు ఇంటర్ అడ్మిషన్లు చేపట్టినా, అధిక ఫీజు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు పిల్లలను ఇంటర్లో చేర్పించే క్రమంలో కళాశాల ఎంపికపై జాగ్రత్త వహించాలి. – జి రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి -
మూడు ప్రత్యేక రైళ్లు రెగ్యులరైజేషన్
10 నుంచి తిరుచానూరు–నాందేడ్ వీక్లీతిరుపతి అన్నమయ్యసర్కిల్: ప్రయాణికుల రద్దీని దృష్ట్యా తిరుపతి మార్గంలో నడిచే మరో మూడు రైళ్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ తెలిపారు. ఇందులో నాందేడ్ – తిరుచానూర్, తిరుపతి–పంఢరాపూర్, జాల్నా – తిరుచానూరు రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రైలు నెంబర్ 17637 జాల్నా– తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల 11 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు జాల్నాలో సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి రాత్రి 9.10 గంటలకు చర్లపల్లికి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుచానూరుకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 17638 తిరుచానూరు – జాల్నా వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుచానూరులో మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. జాల్నా, తిరుచానూర్ మధ్య నడిచే రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో వికారాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రైలు నెంబర్ 17636 నాందేడ్ – తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు నాందేడ్లో శనివారం మధ్యాహ్నం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు విజయవాడకు, మధ్యాహ్నం 12.20 గంటలకు తిరుచానూరుకు చేరుకుంటుంది. ప్రత్యేక రైలు రైలు నెంబర్ 17634 తిరుచానూరు – నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల 10 నుంచి ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుచానూరులో ఆదివారం రాత్రి 7.45 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు వేకువజామున 2.40 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. నాందేడ్, తిరుచానూర్ మధ్య నడిచే ఈ వీక్లీ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల్లో బాసర, నిజామాబాద్, కోరుట్ల, లింగంపేట్ జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుపతి, పంఢరాపూర్ మధ్య నడిచే రైళ్లు రేణిగుంట, రాజంపేట, కడప, యరగ్రుంట్ల, తాడిపత్రి, గుత్తి, ధోనే, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్నగర్, షాద్నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. -
దత్తత.. ఏదీ దక్షత..?
కల్లిపూడిలో ట్రాన్స్ఫార్మర్ ఎమ్మెల్యే సతీమణి తొట్టంబేడు మండలాన్ని దత్తత తీసుకోవడంతో తమ గ్రామం రూపురేఖలు మారిపోతాయని ప్రజలు సంబరపడ్డారు. అపరిష్కృత సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారు. గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని భావించారు. తీరా చూస్తే గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. కనీసం అవసరమైన విద్యుత్ సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొట్టంబేడు మండలంలోని కల్లిపూడి గ్రామాన్ని బొజ్జల రిషితమ్మ దత్తత తీసుకున్నారు. తమ గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కరించకపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. రెండు రోజులుగా విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్కో అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారే లేరని, పేరుకే దత్తత గ్రామం తప్పితే సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని మండిపడుతున్నారు. – తొట్టంబేడు -
ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
తిరుపతి ఎడ్యుకేషన్ : అన్నమయ్య సర్కిల్లో ప్రభుత్వ గ్రేడ్–1 గ్రంథాలయంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు ఏర్పాటు చేసిన ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తెలిపారు. వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో 5 నుంచి పదో తరగతి విద్యార్థులకు యోగ, ధ్యానం, డ్రాయింగ్, పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంగ్లిష్ గ్రామర్, కథలు చెప్పడం, చెప్పించడం, కంప్యూటర్ పరిచయం, ఇంటర్నెట్ వినియోగం, క్రాఫ్ట్ వర్క్స్, తెలుగు పద్యాలు, తెలుగు గ్రామర్, వ్యక్తిత్వ వికాసం, జనరల్ నాలెడ్జ్ లోఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయాధికారి జె.శివప్రసాద్ పాల్గొన్నారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: బాలాజీ రైల్వేడివిజన్ ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ అన్నారు. గురువారం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తిరుపతికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ను తిరుపతికి తరలించి పరిపాలన కేంద్రాన్ని బలోపేతం చేయాలన్నారు. తిరుపతి జిల్లా గుంతకల్లు, గుంటూరు, బెజవాడ, చైన్నె, డివిజన్లు నాలుగు రైల్వే డివిజన్లతో అనుసంధానం కలిగి ఉండడంతో పరిపాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వి చౌదరి, శ్రీధర్ బాబు, వైఎస్ బాబు, హేమంత్ కుమార్, చిట్టిబాబు, నీలేష్ కుమార్, నీలాద్రి, రమేష్,తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఆస్పత్రిగా స్విమ్స్ అభివృద్ధితిరుపతి తుడా: రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా స్విమ్స్ను అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. గురువారం స్విమ్స్ ఆస్పత్రిలో రూ.55 కోట్లతో ఏర్పాటు చేసిన పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్ లీనియర్ యాక్సిలరేటర్ తదితర ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ విశ్వవిద్యాలయం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్ డాలర్స్ దివాకర్రెడ్డి, బోర్డు సభ్యులు సదాశివరావు, పనబాకలక్ష్మీ, జారకీదేవి, భాను ప్రకాష్రెడ్డి, వైధ్యాధికారులు పాల్గొన్నారు. -
ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షల ఫీజు తేదీల ప్రకటన
తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పలు డిగ్రీ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు తేదీలు, పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ వర్సిటీ స్టడీసెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21 నుంచి, సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. పరీక్షలు హాజరుకానున్న అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఓపెన్ వర్సిటీ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ ఓల్డ్ ప్యాటర్న్) పరీక్షలు జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మొదటి, రెండు, మూడో సంవత్సరం డిగ్రీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఈనెల 25వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్వీ జూపార్క్ క్యూరేటర్గా అనురాగ్ మీనా తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 2020 బ్యాచ్ ఇండియన్ ఫా రెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి అనురాగ్ మీ నా బుధవారం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూపార్క్) క్యూరేటర్గా బాధ్యతలు స్వీకరించారు. అటవీ సంరక్షకుడిగా పదోన్నతి పొంది కర్నూలు సర్కిల్కు బదిలీ అయిన సెల్వం స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్కు చెందిన అనురాగ్ మీనా వన్యప్రాణుల నిర్వహణలో తనకున్న అపారమైన అనుభవంతో కొత్తగా బాధ్యతలను చేపట్టారు. ఇంతకుముందు రైల్వే కోడూరులో సబ్–డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (సబ్–డీఎఫ్ఓ)గా, ఆ తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని నంద్యాలలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించేందుకు విచ్చేసిన అనురాగ్ మీనాకు ఎస్వీ జంతు ప్రదర్శనశాల అధికారులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. రేపు ఎస్వీయూలో జాబ్మేళా తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాకు హాజరై సుమారు 1,800కు పైగా పలు రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ, డిప్లొమో అర్హతగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
విషమపరీక్ష
ఎస్వీయూ పరిపాలనా భవనం పీజీసెట్ అభ్యర్థులు సొంత జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు రాసుకునే పరిస్థితి లేదు. ఏపీపీజీసెట్–2026కు ఆతిథ్యమిస్తున్న ఎస్వీ యూనివర్సిటీలోనే పరీక్ష కేంద్రం లేకపోవడంతో అభ్యర్థులు పొరుగు జిల్లాల్లో పరీక్షలు రాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్యయప్రయాసల కోర్చి, పరీక్ష ముందు రోజే కేటాయించిన కేంద్రాలకు చేరుకుని అక్కడ బస చేయాల్సి వస్తోంది. దీంతో అభ్యర్థులు అవస్థలు పడాల్సి వస్తోంది. తిరుపతి సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా 17 యూనివర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీజీసెట్–2026కు ఆతిథ్యమిస్తున్న ఎస్వీ యూనివర్సిటీలో పీజీసెట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. తిరుపతి జిల్లాలో ఒక పరీక్ష కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో తిరుపతి జిల్లా నుంచి పీజీ సెట్ పరీక్షకు హాజరవుతున్న వేలాదిమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పడం లేదు. 3 వేల మంది దరఖాస్తు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీపీజీసెట్కు ఈ ఏడాది జిల్లా నుంచి సుమారు 3 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరు పరీక్ష రాసేందుకు తిరుపతి జిల్లాలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించలేదు. దీంతో వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో జిల్లా విద్యార్థులకు సెంటర్లను కేటాయించారు. శుక్రవారం నుంచి పీజీసెట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఒక రోజుముందే చేరుకుని వ్యయ ప్రయాసలకోర్చి సమీపంలోని హోటళ్లలో బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్కో అభ్యర్థికి కనీసం రూ.5 వేలు ఖర్చు అవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. అధికారులు చొరవ చూపాలి ఉన్నత విద్యామండలి అధికారులతోపాటు ఎస్వీయూ అధికారులు పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు. గత ఏడాది పీజీసెట్ ప్రవేశ పరీక్ష సెంటర్ల ఏర్పాటులో చొరవ చూపకపోవడం, జిల్లా విద్యార్థులకు సెంటర్లు సుదూర ప్రాంతాల్లో కేటాయించడంతో వందలాది మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. గత మూడేళ్లగా దరఖాస్తుల వివరాలివీ.. కోర్సుల వివరాలు 2024లో 2025లో 2026లో కెమికల్ సైన్స్ 8,551 6,070 3,581 లైఫ్ సైన్స్ 3,753 4,027 3,260 కంప్యూటర్ 2,975 2,333 1,884 కామర్స్ 2,215 1,438 980 ఇంగ్లిష్ 1,127 898 746 హ్యుమానిటీస్ 1,575 883 634 జువాలజీ 1,875 1,548 1,221 గణితం 2,200 1,175 835 ఫిజిక్స్ 1,495 938 653 బోటనీ 1,370 1,295 1,012 మిగిలిన అన్ని కోర్సులు 6,013 5,083 4,312 మొత్తం 30,934 25,688 19,118ప్రవేశ పరీక్ష..తప్పని తిప్పలు ఆదరణ కోల్పోతున్న ఏపీ పీజీసెట్ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు 23 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఏపీపీజీసెట్–2026కు ఆదరణ కరువవుతోంది. 17 యూనివర్సిటీల్లో 143 కోర్సులకు సంబంధించి 20 వేలకు పైగా సీట్లు ఉండగా కేవలం 19,118 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పీజీసెట్కు హాజరయ్యే విద్యార్థులకు 1:1 ప్రాతిపదికన సీట్లు కేటాయించినా పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోనున్నట్లు గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి పీజీ కోర్సుల్లో ప్రవేశాలు భారీ స్థాయిలో పడిపోతుండటం యూనివర్సిటీలపై ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు భూమి పూజ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ప్రపంచ ప్రఖ్యాత క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ శ్రీసిటీలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో నూతన తయారీ కేంద్ర నిర్మాణాన్ని బుధవారం ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలో తొలి తయారీ యూనిట్ కానుంది. మంత్రి లోకేశ్ దీనికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మోడ్రన్ ఎయిర్ కండిషనింగ్ను కనిపెట్టడం నుంచి 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ సంస్థగా ఎదగడం వరకు క్యారియర్ ఎప్పుడూ ఆవిష్కరణల్లో ముందంజలో ఉందన్నారు. శ్రీసిటీలో పరిశ్రమ ద్వారా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. క్యారియర్ గ్లోబల్ చైర్మన్, సీఈఓ డేవిడ్ ఎల్ గిట్లిన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ క్యారియర్ భారత ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి పెళ్లకూరు: మండలంలో గొర్రెల కాపరి బుధవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. వివరాలు.. పెళ్లకూరు మండలంలోని శిరసనంబేడు గ్రామానికి చెందిన సంచి సిద్ధార్థన(52) బుధవారం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి గొర్రెలు మందను తీసుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలో ఉన్న గొర్రెల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మామిడిపై బాంబు
ఈ ఏడాదీ గడ్డుకాలమే? ●సాధారణంగా రైతు ఏం కోరుకుంటాడు..అందరికంటే తనకు పంట దిగుబడులు బాగుండాలని..మంచి లాభాలు రావాలని ఆశిస్తాడు. అయితే మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు తయారైంది మామిడి రైతు పరిస్థితి. గత ఏడాది కాయలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు పాలుకాగా.. ఈ సీజన్లో కూడా అదే స్థితి నెలకొనే సూచనలు దాపురించాయి. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం మన మామిడిపై పడింది. యుద్ధం కారణంగా జిల్లాలోని మామిడి గుజ్జు ఎగుమతులు ఆగిపోయి, నిల్వలు పేరుకుపోయాయి. మామిడి సీజన్ ప్రారంభమైనా ఇంకా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 48,360 మెట్రిక్ టన్నుల పల్ప్ నిల్వలు జిల్లాలో 8 మామిడి ఫ్యాక్టరీలున్నాయి. ఈ ఫ్యాక్టరీల నుంచి తోతాపురి కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఫ్యాక్టరీల వద్ద 48,360 మెట్రిక్ టన్నుల మామిడి గుజ్జు నిల్వలున్నాయి. వాటిని విక్రయిస్తేనే మళ్లీ మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ఆసక్తి చూపుతుంటాయి. అయితే యద్ధం నేపథ్యంలో గుజ్జు ఎగుమతి లేదంటూ ఫ్యాక్టరీలు ఆవేదన చెందుతున్నాయి. ఈ తరుణంలోనే మే మొదటి వారం ముగుస్తున్నా ఫ్యాక్టరీలు మామిడి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదని చర్చసాగుతోంది. తిరుపతి అర్బన్: మామిడి రైతులకు ఈ ఏడాది గడ్డుకాలం తప్పేలాలేదు. గత ఏడాది ఓ వైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మరోవైపు ఫ్యాక్టరీలు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తోతాపురికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు రూ.8 చొప్పున, ప్రభుత్వం రూ.4 చొప్పున కిలో రూ.12 గిట్టుబాటు ధర వస్తుందని రైతులు గత ఏడాది భావించినప్పటికీ అంతంత మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులే పునరావృతం అవుతాయేమోనని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. 98,700 ఎకరాల్లో మామిడి సాగు ఈ ఏడాది 98,700 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. అందులో 70 వేల ఎకరాల్లో తోతాపురి రకం సాగులో ఉంది. నీలం రకం 18,500 ఎకరాలు, బేనీసా రకం 10,200 ఎకరాలు సాగులో ఉంది. సాధారణంగా దిగుబడి బాగా వస్తే ఎకరం 5 నుంచి 7 టన్నులు వస్తుంది. గత ఏడాది మంచి దిగుబడి వచ్చింది. అయితే ధరలు లేవంటూ రైతులు ఆందోళన చెందారు. ఈ ఏడాది ఎకరం 3 నుంచి 4 టన్నులకు మించి రావడం లేదు. దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రేట్లు లేకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. తగ్గిన రేట్లు మామిడి అంటే ప్రధానంగా సాగులో ఉండేది తోతాపురి రకం. అయితే ఏ గ్రేడ్ రకం కిలో రూ.15, బీ గ్రేడ్ రకం రూ.10 నుంచి రూ.12 వరకు రేట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఓ వైపు సరైన రేట్లు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సాధారణంగా ఫ్యాక్టరీలు మే మొదటి వారం నుంచి మామిడి కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఇంకా కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టకపోవడంతో రైతులకు టెన్షన్ తప్పడం లేదు. కోతకు మామిడి పంట సిద్ధంగా ఉంది. అయితే కొనుగోలు చేసేవారు కనిపించడం లేదు. మరోవైపు ఆకాల వర్షాలతో మామిడి రాలిపోతుందనే ఆందోళన రైతులను వేధిస్తోంది. త్వరలో కొనుగోలు ప్రక్రియ జిల్లాలోని ఫ్యాక్టరీలు మామిడి కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టనున్నాయి. అయితే వారి వద్ద 48 వేల మెట్రిక్ టన్నులు మామిడి గుజ్జు నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది. మామిడిలో అత్యధికంగా తోతాపురి రకం సాగులో ఉంది. ఈ ఏడాది మామిడి నాణ్యత ఆధారంగా తోతాపురి కేజీ రూ.10 నుంచి రూ.15 వరకు రేట్లు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గింది. జిల్లాలో గత ఏడాది 73,500 ఎకరాల్లో మామిడి సాగులో ఉండేది. ఈ ఏడాది రైల్వే కోడూరు నియోజకవర్గం జిల్లాలో చేర్చడంతో మామిడి సాగు పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 98,700 ఎకరాల్లో మామిడి సాగులో ఉన్నట్లు లెక్కలు ఉన్నాయి. మొత్తంగా రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో మామిడి కోనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. – ఎన్. చిన్న రెడ్డెయ్య, ఇన్చార్జి జిల్లా అధికారి, ఉద్యానశాఖ -
చైన్నెకి తాగునీరు విడుదల
రాపూరు: మండలంలోని కండలేరు జలాశయం నుంచి బుధవారం చైన్నె నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు, నెల్లూరు, తిరుపతి జిల్లాల రైతులకు తాగు, రెండో పంట సాగుకు నీరు విడుదల చేసినట్లు తెలుగుగంగ ఎస్ఈ సుబ్రమణ్యేశ్వరావు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్ప్లాంట్ యూనిట్ నుంచి నీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, నీటి స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కండలేరు జలాశయంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. చైన్నె నగర ప్రజలకు, పరిశ్రమలకు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీటి అవసరాల కోసం 130 రోజుల్లో 13 టీఎంసీల 78 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో 70 వేల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 54 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. చెన్న నగరానికి తాగు నీటి కోసం 5 టీఎంసీలు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలకు తాగు నీటి కోసం 2 టీఎంసీలు, స్వర్ణముఖి బ్యారేజ్కి 2 టీఎంసీలు, మేనకూరు పారిశ్రామిక వాడకు ఒక టీఎంసీని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నీటిని సెప్టెంబర్ 15వ తేదీ వరకు అంటే 130 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ అనిల్బాబు, ఏఈ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
17న విజయవాడలో బీసీల మేధోమథన సదస్సు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: బీసీల ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ నెల17న బీసీల మేధోమథన సదస్సును విజయవంతం చేయాలని బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ విజయవాడ బెంజి సర్కిల్ వద్దనున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు, వివిధ బీసీ కుల సంఘ నాయకులు, ఉద్యోగులు, మేధావులు హాజరు కానున్నట్లు చెప్పారు. కేంద్రం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ చట్టాలు చేయడానికి చేసిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభనపైన బీసీ నేతలు సుదీర్ఘంగా చర్చిస్తారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అధిగమించే అంశాల పైన చర్చ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.నాగమల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కంభం లోకయ్య, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి జ్యోతి, అధికార తెలుగు భాషా సంఘం మాజీ సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, ఐటీ విభాగం మండల అధ్యక్షుడు శివ కోటి యాదవ్, బీసీ నాయకులు ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ తీగలు పడి వ్యక్తి మృతి తిరుపతి రూరల్: విద్యుత్ తీగలు తెగిపడటంతో షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో బుధవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం కై లాసపురానికి చెందిన ఓబుల్ నాయుడు, ప్రభావతి దంపతులు పదేళ్ల క్రితం తిరుపతిలోని గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీకి వచ్చి నివాసముంటున్నారు. హమాలీగా పనిచేసే ఓబుల్ నాయుడు బుధవారం పనులు ముగించుకుని వర్షం ఆగిన తరువాత నడిచి వెళ్తుండగా తన ఇంటికి సమీపంలోని ఓ విద్యుత్ తీగ తెగి అతనిపై పడింది. షాక్కు గురైన ఓబుల్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తన భర్త మరణానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. -
పోరాటం ఉధృతం చేయాలి
చంద్రబాబు పుట్టిన ఊరినే కాదు..రాయలసీమను కరువుసీమగా మార్చి, రైతులను కన్నీళ్లు పెట్టించి పైశాచిక ఆనందాన్ని పొందే చంద్రబాబు ద్రోహాన్ని సీమ జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని చెప్పాలి. ఇది కేవలం నీటి సమస్యగా మాత్రమే చూడవద్దు. ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభం కావాలి.. లేదంటే పోరాటం ఉదృతం చేయాలి. –చెవిరెడ్డి మోహిత్రెడ్డి, వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతి రూరల్: ‘జగనన్న పాలనలో 90 శాతానికి పైగా పనులు పూర్తి అయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేసింది చంద్రబాబే అన్న నిజాన్ని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.. స్వప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించి ప్రజా ఉద్యమానికి ఊపిరిపోయాలి.’ అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. భాకరాపేట సమీపంలోని లేక్వ్యూ రిసార్ట్స్లో ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం – చంద్రబాబు మోసం’ అన్న అంశంపై వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థి విభాగం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మోసాలు బట్టబయలయ్యాయని అన్నారు. కరువుసీమగా మార్చేందుకే బాబు కుట్ర -
కంటి పరీక్షకు టార్చిలైటే వైద్య పరికరం!
సత్యవేడు: స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో కంటి పరీక్షకు టార్చిలైటు ఒక్కటే వైద్య పరికరంగా కంటి వైద్యుడు సేవలందిస్తున్నారు.ీ స్థానిక సీహెచ్సీలో కంటి పరీక్షలకు వైద్యపరికరాలు లేవు. డాక్టర్ టార్చిలైట్తో కంటిపొరలను పరీక్షించి, మందులు రాసి ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ‘ముఖ్యమంత్రి ఐ కేంద్రాన్ని’ సత్యవేడు సీహెచ్సీలో ఏర్పాటు చేశారు. అప్పట్లో అపోలోకు కాంట్రాక్టు ఇచ్చారు. కంటి పరీక్షలకు అవసరమైన పరికరాలన్నీ కాంట్రాక్టర్ స్థానిక వైద్యశాలలో కంటి పరీక్షలకు అవసరమైన అన్ని పరికరాలు సమకూర్చారు. గత ఐదేళ్లు పేదలకు కంటి పరీక్షలు సక్రమంగా నిర్వహించి, ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చేవారు. కాంట్రాక్టు ముగియడంతో కాంట్రాక్టర్ అన్ని పరికరాలు తీసుకెళ్లడంతో గదులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సత్యవేడు వైద్యశాల లో కంటి పరీక్షకు టార్చిలైట్ ఒక్కటే పరికరంగా డాక్టర్ వినియోగిస్తున్నారు. వైద్యశాలో 12 పోస్టులకు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనస్తీషియా, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసన్, గైనకాలజిస్టు ఇద్దరికి ఒకరే ఉన్నా రు. రోజు వారీ 300 నుంచి 350 వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నారు. వైద్యశాలకు పలు రకాల మాత్రలు, మందులు సరఫరా కావడంలేదు. వసతి నామమాత్రంగా ఉంది. డెలివరీలు నెలలో 10 చేస్తున్నారు. పెద్ద ఆపరేషన్ 1, కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వారంలో నాలుగు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అందినన్ని రకాల వైద్యసేవలు నేడు అందడంలేదు. ప్రస్తుతం పేదవాడకి మెరుగైన వైద్యం అందడంలేదు. -
పాలిసెట్లో ఉత్తమ ర్యాంకులు
– వందశాతం అర్హత సాధించిన విశ్వం విద్యార్థులు తిరుపతి అర్బన్:తమ సంస్థల్లో శిక్షణ పొందిన విద్యార్థులు పాలిసెట్ –2026లో ఉత్త మ ర్యాంకులు సాధించారని విశ్వం విద్యా సంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మా ట్లాడుతూ తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యా సంస్థల్లో 2026 సంవత్సరం పాలిటెక్నిక్ ఎంట్రెన్స్కు శిక్షణ పొంది న విద్యార్థులు 100 శాతం అర్హత సాధించారని చెప్పారు. తమ విద్యార్థి వెల్దుర్తి మోక్షిత్ 120కి 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఎస్వీయూ రీజియన్లో నూ, జిల్లాలో స్థాయిలోనూ మొదటి ర్యాంకు దక్కించుకున్నారని వెల్లడించారు. అలాగే జీ. భరణి 120కి 118 మార్కులు, మునిశంకర్, బి. హర్షిత్, కే. హర్షవర్ధన్, ఎన్.హాసిని, కే.పవ్యశ్రీ తదితరులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. అలాగే 2026 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశ్వం టాలెంట్ స్కూల్ విద్యార్థిని కే. గీతిక 300 మార్కులకు 285 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రథమ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వం విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి, కరస్పాండెంట్ తులసి విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. -
రూ.2 వేల కోట్ల సంపద దోచేశారు!
ప్రఖ్యాత శైవక్షేత్రం గుడిమల్లం పరశురామేశ్వరాలయం ప్రధాన గోపుర కలశాలను తొలగించి, అందులో నిక్షిప్తమై ఉన్న వజ్ర, వైఢ్యూరాలు, మణులు, మాణిక్యాలు, కెంపులు, విలువైన ఇతర నవరత్నాలను ఆలయాధికారులతో కలిసి మాయం చేశారు. ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. నియమాలను పాటించకుండా 2,600 ఏళ్ల నాటి ఆలయ కలశాలను మాయం చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ చేయించి, వాస్తవాలను నిగ్గుతేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి. – చిందేపల్లి మధుసూదన్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
ఆనందంగా ఉంది
పాలిసెట్లో 120కి 120 రావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంక్, జిల్లా, ఎస్వీయూ రీజియన్ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం ఐఐటీలో సీటు సాధించడమే. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. వారి ప్రోత్సాహంతో పాటు విశ్వం విద్యా సంస్థల డైరెక్టర్, టీచర్ల సహకారంతో నేను ఈ ర్యాంకు సాధించా. – వెల్దుర్తి మోక్షిత్, స్టేట్ 10వ ర్యాంకర్, తిరుపతి సంతోషానిచ్చింది పాలిసెట్లో జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. 120 మార్కులకు గాను 119 స్కోర్ చేయడం సంతృప్తి నిచ్చింది. జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 35 వ ర్యాంక్ రావడం సంతోషానిచ్చింది. శశి విద్యా సంస్థలకు ధన్యవాదాలు. ఇంటర్ పూర్తి చేసి జేఈఈలో రాణించి ఐఐటీలో చదవాలన్నది నాకోరిక. ఆ దిశ ప్రయత్నం చేస్తున్నాను. – ఎన్ గిరీష్, జిల్లాస్థాయి 3 ర్యాంకు, తిరుపతి ఇదే స్ఫూర్తితో ముందుకెళతా! పాలిసెట్లో 120కి 119 మార్కులు వచ్చాయి. జిల్లా స్థాయిలో 3వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 59వ ర్యాంక్ రావడం గర్వంగా ఉంది. నా లక్ష్యం ఐఐటీలో సీటు సాధించడమే. ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించాలన్నదే లక్ష్యం. శశి విద్యాసంస్థల ఉపాధ్యాయుల సహకారం మరులేనిది. ఇదే స్ఫూర్తితో ముందుకెళతా. – శ్యామ్నాథ్ శ్రీహర్ష, జిల్లాస్థాయి 3 ర్యాంకర్, తిరుపతి


