breaking news
Tirupati
-
‘సొంతపార్టీ అధికార ప్రతినిధి ఆవేదనపై చంద్రబాబు స్పందించాలి’
తిరుపతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రివర్యులు చేస్తున్న చీకటి బాగోతాలపై తెలుగదేశం అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్రెడ్డి బయటపెట్టిన సంచలన నిజాలపై సీఎం స్పందించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్ లోని ఖరీదైన హోటళ్ళలో వారితో రాసలీలలకు పాల్పడుతున్న సదరు మంత్రిపై చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే, వారిపై చర్య తీసుకునేందుకు చంద్రబాబు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ చానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. పెద్దపెద్ద హోటళ్ళలో బస చేసే సదరు మంత్రి, తన పక్క రూంలను బుక్ చేసుకుంటూ, ఆ గదుల్లో మద్యం సేవించి, మహిళలతో రాసలీలలు సాగిస్తున్నారని సంచలన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశాలపై తెలుగుదేశం, జనసేన పార్టీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్న అంశంను సుధాకర్ రెడ్డి బహిరంగ పరిచారు. ఎమ్మెల్యేలు చేసే పొరపాట్లను సరిచేయాలంటూ మంత్రులకు ఒకవైపు సీఎం చంద్రబాబు చెబుతుంటే, మరోవైపు ఆయన సహచర మంత్రులే హైదరాబాద్లో రాసలీలలకు పాల్పడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి వంతపాడే ఒక పత్రికలోనే దీనిపై పెద్ద ఎత్తున కథనం కూడా ప్రచురితం అయ్యింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి తిరుపతికి తరచుగా వస్తుంటారు. వచ్చిన ప్రతిసారీ వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం, నైతిక అంశాలను మాట్లాడి వెడుతుంటాడు. అలాంటి మంత్రి గురించే టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ రెడ్డి మాట్లాడారు. తిరుపతిలో అత్యంత ప్రముఖమైన పోస్ట్ ఇప్పిస్తానని, తనను నమ్ముకుంటే కీలకమైన పదవులు ఇప్పిస్తామంటూ మహిళలను నమ్మించి మోసం చేస్తున్నాడని కూడా ఆయనపై ఆరోపణలు చేశారు. ఆయన టీడీపీ, జనసేనకు చెందిన వారందరికీ తెలుసునని ఎన్బీ సుధాకర్రెడ్డి మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా ఇటువంటి అరాచకానికి సదరు మంత్రివర్యులు ఒడిగట్టడం దారుణం. అదే మంత్రి తిరుపతి పవిత్రతను కాపాడతానంటూ మాట్లాడుతుంటారు. అటువంటి మచ్చపడిన మంత్రివర్యులపైన సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
న్యాయం కోసం కలెక్టరేట్కు వచ్చా
మూగ, చెవుడుతో బాధపడుతున్నాను. ప్రతి నెల రూ.6వేలు దివ్యాంగుల పింఛన్ ఇస్తున్నారు. 80 శాతం వికలత్వం ఉన్నట్లు గతంలో సర్టిఫికెట్ ఇచ్చారు. తాజా సర్వేలో 75శాతం వికలత్వం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో పింఛన్ తొలగించడంతో తండ్రితో కలసి న్యాయం కోసం కలెక్టరేట్లో జరిగిన ధర్నాలో పాల్గొన్నాను. – భువనశ్రీ, తిరుచానూరువైకల్యశాతం తగ్గించి..పింఛన్ తొలగించారునాకు పింఛన్ ఎంతో ఆధారంగా ఉండేది. దాన్ని తొలగించారు. డాక్టర్లు 51 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. డాక్టర్లు అడ్డదిడ్డంగా సదరం సర్టిఫికెట్లను జారీ చేశారు. దాంతో రూ.6 వేలు పింఛన్ తొలగించారు. ఏళ్ల తరబడి పింఛన్ తీసుకుంటున్నాను. ప్రస్తుతం తొలగిస్తే ఎలా బతకాలి. ప్రభుత్వం దివ్యాంగులకు అన్యాయం చేస్తోంది. –జ్యోతీశ్వర్బాబు, పాకాల -
ప్రభుత్వం సహకరిస్తే ఎన్సీసీ మరింత విస్తరణ
తిరుపతి సిటీ : రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్సీసీని మరింత విస్తరిస్తామని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలానీ తెలిపారు. ఆయన గురువారం ఎన్సీసీ నగర్లో మీడియాతో మాట్లాడారు. ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతి ఎన్సీసీ గ్రూపును తొలిసారి సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి లక్ష్యంగా ఎన్సీసీలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తిరుపతి ఎన్సీసీ గ్రూపు ఆధ్వర్యంలో క్యాడెట్లకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్సీసీ క్యాడెట్లను సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వైపు నడిపిస్తూ ఉత్తమ పౌరులుగా సమాజానికి అందిస్తుండడం అభినందనీయమన్నారు. గణతంత్ర దినోత్సవాల్లో తిరుపతి గ్రూపు నుంచి పెద్ద సంఖ్య లో పాల్గొనేందుకు కఠోర శిక్షణ ఇవ్వడంతో పాటు పోటీతత్వాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నింపే ప్రయ త్నం చేయడం శుభపరిణామనన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఎన్సీసీ కమాండ్ కంట్రోల్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపా రు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఎన్సీసీ సేవలు మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అవసరమన్నారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఎన్సీసీ వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ఎన్సీసీ ధ్రువీకరణ పత్రాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. సమావేశంలో తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ దాహియా పాల్గొన్నారు. -
రోసనూరు కేంద్రానికి ఆయనే రేరాజు
మండలంలోని రోసనూరు గ్రామం కేంద్రంగా గత ఐదు దశాబ్దాలుగా ఓ రేరాజు చీకటి రాజ్యాన్ని ఏలుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ కండువా కప్పుకుని సామాన్య జనాన్ని మభ్యపెట్టి గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగిస్తూ ధనార్జనే లక్ష్యంగా దూసుకెళుతున్నారు. గ్రామానికి సమీపంలోని అటవీ భూములు, చెరువులు, తెలుగుగంగ పొర్లుకట్టలపై మట్టిని యంత్రాలతో తవ్వి, లారీలు, టిప్పర్లతో దొరవారిసత్రం, నాయుడుపేటలో లేఅవుట్లకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజుపాళెం, రోసనూరు, కృష్టప్పకండ్రిగ గ్రామాల్లో ఒక షాడో ప్రజాప్రతినిధిగా వ్యవహ రిస్తూ గ్రావెల్, మట్టి తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. అయినా అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. రాజుపాళెం చెరువుకట్ట అభివృద్ధి, జంగిల్ క్లియరెన్స్ పేరుతో కట్టపై ఉన్న రూ.లక్షలు విలువ చేసే చెట్లను నరికి, విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తెలుగుగంగ కాలువ గట్టు, గ్రామ సమీపంలో ఉన్న ఫారెస్ట్ భూములు, గిరిజన కాలనీ సమీపంలోని చెరువు, దళిత కాలనీ దిగువ ప్రాంతంలో ఉన్న చెరువు, గ్రామ సమీపంలోని భూపతీశ్వర కొండ తదితర ప్రాంతాల్లో భారీ యంత్రాలతో మట్టి, గ్రావెల్ అక్రమంగా తవ్వి, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. -
ఏడుకొండలవాడా.. దివ్యాంగులను కాపాడు
వేంకటేశ్వరస్వామి దివ్యాంగులను కాపాడాలని వేడుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం మాకొద్దు. ఓట్లు వేసి గెలిపిస్తే.. దివ్యాంగులను రోడ్లపై కుర్చోబెట్టారు. 4 గంటల పాటు ఎండలో ధర్నా చేసి పలువురు రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. అయినా అధికారులకు కనికరం లేదు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్షకట్టినట్లు భావిస్తున్నాం. న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. – చంద్రశేఖర్, దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు దివ్యాంగుల జీవితాలు అంధకారం అనేక ఆరోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్న దివ్యాంగుల జీవితాలను కూటమి ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేస్తోంది. అయినా కనికరం లేకుండా ఫించన్లు తొలగించారు. మేమంతా ఏ పార్టీకి చెందినవాళ్లం కాదు. మా జీవనమే కష్టంగా ఉంది. ఏ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ఇలా దివ్యాంగుల పింఛన్లు తొలగించలేదు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇలా చేయడం న్యాయం కాదు. – మధులత, దివ్యాంగుల సేవా సమితి జిల్లా మహిళా అధ్యక్షురాలు -
గుప్తనిధులు తవ్వకాల కేసులో ఏడుగురి అరెస్టు
బుచ్చినాయుడుకండ్రిగ: పొలంలో గుప్తునిధుల కోసం తవ్వకాలు జరిపిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి, జేసీబీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తిమ్మయ్య, ఎస్ఐ విశ్వనాథనాయుడు తెలిపారు. గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో వారు విలేకరులతో మాట్లాడారు. ఆలత్తూరు గ్రా మానికి చెందిన చిల్లకూరి ఉమామహేశ్వర్రెడ్డి బావమరిది ధనంజయరెడ్డికి 30 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో పురాతన తులసీకోట ఉండ డంతో, తులసీకోట కింద నిధులున్నాయనే అను మానంతో ఈ నెల 18వ తేదీన కొందరు రాత్రి జేసీబీతో తవ్వకాలు జరిపారు. దీంతో స్థానిక పో లీసు స్టేషన్లో తవ్వకాలపై ఉమామహేశ్వర్రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రెడ్డిగుంటబాడవ గ్రామానికి చెందిన ఎ.గురవయ్య, బీ.గురవయ్య, ఓజిలి మండలం హరివరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్, హరీష్, ఆశోక్, అనిల్, శేఖర్ను నిందితులుగా గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. తవ్వకానికి ఉపయోగించిన జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఐ సుధీర్రెడ్డి పాల్గొన్నారు. శ్రీరామలో ఘనంగా ఓరియెంటేషన్ డేతిరుపతి సిటీ:స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీరా మ ఇంజినీరింగ్ కాలేజ్లో గురువారం మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు తీ సుకున్న విద్యార్థుల కోసం ఓరియెంటేషన్ డే ఘ నంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ మన్నెం రా మిరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులున్నాయని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు అధ్యాపకులు సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. ఆధునాతన టెక్నాలజీని అందుపుచ్చుకుని ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫె సర్ వాసుదేవరావు, డైరెక్టర్ మన్నెం అరవింద్కుమార్రెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు సాంఘిక సంక్షేమశాఖ ప్రాంతీయ సదస్సు తిరుపతి అర్బన్: రాయలసీమ జిల్లాల సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో శుక్రవారం ప్రాంతీ య సదస్సు తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమావేశం జరపనున్నారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించే రీజినల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డో లా శ్రీబాల వీరంజనేయస్వామి పాల్గొననున్నా రు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన బైరాగిపట్టెడలోని నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష ఉచిత శిక్షణ ప్రారంభించనున్నారు. -
ఉద్యోగ అవకాశాలు పుష్కలం
చిల్లకూరు:భవిష్యత్తు తరాల వారికి జిల్లాలో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గూడూరు ప ట్టణంలోని దువ్వూరు రమణమ్మ మ హిళా కళాశాలలో గురువారం రా ష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 బహుళ సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ మేళాకు 414 మంది అభ్యర్థులు హాజరు కాగా 278 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి, నియామక పత్రాలు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనన్, గూడూరు డీఎస్పీ గీతాకుమారి, నైపుణాభివృద్ధి అధికారి లోకనాథం, కళాశాల కరస్పాండెండెంట్ మోహర్మణి, కళాశా ల కార్యదర్శి విద్యాసాగర్, ఎంపీడీఓ మధుసూదన్రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రూ.7 కోట్లతో బ్యారేజ్ మరమ్మతుకు ప్రతిపాదనలు వాకాడు: స్వర్ణముఖి బ్యారేజ్ మరమ్మతులకు రూ.7 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇరిగేషన్ అధికారులతో కలసి వాకాడు–స్వర్ణముఖి బ్యారేజ్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై ఏటా బ్యారేజ్ పరికరాల నిర్వాహణకు జిల్లా నుంచి రూ.12 లక్షలు కేటాయించడం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ వాకాడులోని ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్ఈ రాధాకృష్ణ, ఈఈ బాబు, డీఈలు, ఎంపీడీఓ శ్రీనివాసులు ఉన్నారు. సాగరమాల సర్వీసు రోడ్ల సమస్యలపై పరిశీలన నాయడుపేటటౌన్: సాగరమాల సర్వీసు రోడ్ల సమస్యలపై గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్, ఆర్డీఓ కిరణ్మ యి, ఎన్హెచ్ అధికారులు, తహసీల్దార్ రాజేంద్ర పరిశీలించారు. మండలంలోని నరసారెడ్డికండ్రిగ సమీపంలో సాగరమాల రహదారి వద్ద కలెక్టర్ రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సాగరమాల రహదారి నిర్మాణ పనులతో పొలాలకు ఇరువైపుల సర్వీసు రోడ్లు లేకుండా చేస్తున్న విషయం రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానూకులంగా స్పందించారు. రైతుల సంఘం నాయకులు జలదంకి వెంకటకృష్ణారెడ్డి, సన్నారెడ్డి హ రినాఽథ్రెడ్డి, కామిరెడ్డి మధుసూదన్ రెడ్డి, విజయసా రథి రెడ్డి, మచ్చా భాస్కర్, శిరిష్ రెడ్డి పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ మేరిగను పరామర్శించిన సజ్జల
రాపూరు/సైదాపురం: ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తండ్రి మేరిగ ఆనందరావు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో గురువారం వైఎస్సార్ సీపీకి చెందిన అగ్రనేతలు రాపూరులోని లక్ష్మీపురంలోని మేరిగ నివాసంలో మురళీధర్ తండ్రి ఆనందరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మురళీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అక్రమ కేసులు, దౌర్జన్యాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరా తీశారు. అనంతరం మాజీ ఉప ముఖ్య మంత్రి నారాయణస్వామి, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి తదితరులు ఆనందరావు చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. మాజీ మంత్రి, జిల్లా కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరావు, ఎమ్మెల్సీపర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, జిల్లా నేత లు ఆనం విజయ్కుమార్రెడ్డి కలిసి రాపూరుకు చేరుకు ని మురళీధర్ను పరామర్శించారు. కార్యక్రమంలో రాపూరు,సైదాపురం, బాలాయపల్లి, డక్కిలి మండలా లకు చెందిన పార్టీ కన్వీనర్లు మధుసూధన్రెడ్డి, ఎం.రవికుమార్యాదవ్, వెందోటి కార్తీక్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తి న పట్టాభిరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాపకన్ను మధుసూదన్రెడ్డి,మండల కన్వీనర్ బోడ్డు మధు సూదన్రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దందోలు లక్ష్మీనారాయణరెడ్డి,వలంటరీ విగ్ అధ్యక్షులు దుగ్గిరెడ్డి నరసింహరెడ్డి, నలమారు రామ్గోపాల్రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు మోహన్రావు తదితరులున్నారు. -
గఘన విజయం
షార్లో ఒకేసారి పది రాకెట్లను ట్రాకింగ్ చేయగలిగిన సామర్థ్యంతో నిర్మించిన మల్టీ అబ్జెక్టి ట్రాకింగ్ రాడార్ కేంద్రంసూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలు సాధించింది. నాటి ఆర్యభట్ట నుంచి నేటి గగన్యాన్ వరకు అంతరిక్షయాత్ర నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఇస్రో సొంతంగా 102 ప్రయోగాలను చేసి ఎన్నో మైలురాళ్లును అధిగమించింది. 2008లో చంద్రయాన్–1, 2013లో మంగళ్యాన్– 1, 2019లో చంద్రయాన్–3, 2023లో చంద్రయాన్–3, సూర్యయాన్–1 పేర్లతో ఐదు గ్రహాంతర ప్రయోగాలు, ఈ ఏడాది గగన్యాన్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. 1963 నవంబర్ 21 తేదీన ఇస్రో మొట్టమొదటిసారి రెండు దశలతో కూడిన సౌండింగ్ రాకెట్ను కేరళలోని తుంబా ఈక్విటోరియల్ రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించి విజయం సాధించారు. అమెరికా, రష్యా, జపాన్, పశ్చిమ జర్మనీ, ప్రాన్స్ దేశాలు సహాయ సహకారాలతో నైక్ ఆపాచీ రాకెట్ను ప్రయోగించారు. ఆ తరువాత డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో తుంబాలో సౌండింగ్ రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని, 1967 నవంబర్ 20న రోహిణి–75 అనే సౌండింగ్ రాకెట్ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయం సాధించారు. ఆ తరువాత ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చి సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా పేరు మార్చారు. 1970లో డిపార్ట్మెంట్ స్పేస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. 1963లో తుంబా నుంచి వాతావరణ పరిశీలన కోసం సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో మన అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది. తూర్పు తీర ప్రాంతంలో.. తుంబా రాకెట్ కేంద్రం పెద్ద ప్రయోగాలకు అనువుగా లేదని భారతదేశానికి మంచి రాకెట్ కేంద్రాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలనే కృత నిశ్చయంతో డాక్టర్ విక్రమ్ సారాభాయ్, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969లో తొలుత పడమటి తీరం అంటే అరేబియా సముద్ర తీరప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ముందుగా గుజరాత్లో ఏర్పాటు చేయాలని అనుకుని, అక్కడ గ్రావిటీ పవర్ ఎక్కువగా ఉండడంతో తూర్పు తీరం అంటే బంగాళాఖాతం తీరప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. తూర్పు తీరాన పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చదరపు కిలో మీటర్లు విస్తరించిన శ్రీహరికోట దీవి ప్రాంతం గుర్తించారు. ఈ దీవి భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడం, గ్రావిటీ పవర్ తక్కువగా ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉందని శ్రీహరికోటను ఎంపిక చేశారు. భవిష్యత్తు రాకెట్ ప్రయోగాలను దృష్టిలో పెట్టుకుని వాతావరణ పరిశోధనకు సుమారు 1,161 సౌండింగ్ రాకెట్లు ప్రయోగించిన తరువాత పెద్ద ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఇప్పటివరకు 102 ప్రయోగాలు చేయగా 92 విజయవంతం అయ్యాయి. ఆరు రకాల రాకెట్ల ద్వారా 132 స్వదేశీ ఉపగ్రహాలు, 18 విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహాలు, 433 విదేశీ ఉపగ్రహాలు, 9 రీ ఎంట్రీ మిషన్లు, రెండు ప్రైవేట్ అంతరిక్ష సంస్థలకు చెంది ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలోనే రెండోస్థానంలోకి చేరడం విశేషం. ఆర్యభట్టతో తొలి అడుగు బెంగళూరులో శాటిలైట్ తయారీ కేంద్రంలో 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని తయారు చేసుకుని రష్యా నుంచి ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల వేటను ఆరంభించారు. అనంతరం శ్రీహరికోట రాకెట్ కేంద్రం పూర్తిస్థాయిలో నిర్మించిన తరువాత మొదటి ప్రయోగవేదిక నుంచి 1979 ఆగస్టు 10 ఎస్ఎల్వీ–3 ఇ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. దురదృష్ట వశాత్తూ ఆ ప్రయోగం విఫలం కావడంతో నాటి శాస్త్రవేత్తలు కుంగిపోయారు. ఒక అపజయం మున్ముందు విజయాలకు నాంది అన్నట్టుగా నాటి శాస్త్రవేత్తలు మొక్కవోని ధైర్యంతో 1980 జులై 18న చేసిన ఎస్ఎల్వీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీంతో మన శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేసి ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3, ఎస్ఎస్ఎల్వీ, హెచ్ఆర్ఎల్వీ లాంటి భారీ ప్రయోగాలు చేసేస్థాయికి ఎదిగారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూరపరిశీలన ఉపగ్రహాలు), ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (భారత క్షేత్రియ దిక్చూచి ఉపగ్రహాలు), వాతావరణ పరిశోధనా ఉపగ్రహాలు, గ్రహంతర ఉపగ్రహాలు (చంద్రయాన్–1, మంగళ్యాన్–1, చంద్రయాన్–2, చంద్రయాన్–3, సూర్యయాన్–1) లాంటి భారీ ఉపగ్రహాలను అత్యంత తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో విజయాలు సాధించారు. 2023 జులై 14న ప్రయోగించిన చంద్రయాన్–3 గత ఏడాది ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలం దక్షిణ ధృవంపై ల్యాండర్ దించి రోవర్తో చంద్రుడిపై పరిశోధనలు చేశారు. ఆరోజును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ సైన్స్ దినోత్సవం (నేషనల్ స్పేస్ డే)గా ప్రకటించి, ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించుకోనున్నారు.ఆర్యభట్ట ఉపగ్రహంతో తొలి అడుగు శ్రీహరికోటలో అత్యాధునిక సౌకర్యాలు -
వికలత్వం తగ్గించడం భవితకే ప్రమాదకరం
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం వికలత్వాన్ని తగ్గించడం చాలా ప్రమాదం. పింఛను పోవడమే కాదు. భవిష్యత్తులో యువకులైన దివ్యాంగులకు కళాశాలల్లో ఉన్నత చదువులకు సీట్లు దక్కవు. ఉద్యోగాలు రావు. ప్రభుత్వ పథకాలు అన్నింటికి అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దివ్యాంగుల జీవితాలు అంధకారం చేయనున్నారు. న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. – మురళీగౌడ్, దివ్యాంగుల సేవా సమితి వ్యవస్థాపకుడు ప్రాణాలు పోయేవరకు పోరాడుతాం ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో దివ్యాంగుల పింఛన్లు తొలగించారు. మా జీవనం ప్రశ్నార్థకంగా మారింది. దివ్యాంగులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. తొలగించిన అందరి పింఛన్లు తిరిగి ఇవ్వాలి. లేదంటే ప్రాణాలు పోయోవరకు పోరాటాలు చేస్తాం. – శ్రీనివాసులు, దివ్యాంగుల సేవా సమతి జిల్లా అధ్యక్షుడు -
కలిమిలి కుటుంబానికి సజ్జల పరామర్శ
డక్కిలి: వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు కలిమిలి రాజేశ్వరి కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గురువారం పరామర్శించారు. ఇటీవల జెడ్పీటీసీ రాజేశ్వరి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గురువారం డక్కిలి మండలం చాపలపల్లి గ్రామంలో ఆమె ఉత్తర క్రియలు జరిగాయి. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చాపలపల్లికి వచ్చారు. అనంతరం రాజేశ్వరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తరువాత రాజేశ్వరి భర్త, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కలిమిలి రామ్ప్రసాద్రెడ్డి, కుమార్తెలను పలకరించి కొంతసేపు వారితో మాట్లాడారు. ఆయన వెంట నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ నెల్లూరు రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు కొడవలూరు ధనుంజయరెడ్డి, పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి, బొలిగర్ల మస్తాన్ యాదవ్, ఎంపీపీలు తనూజరెడ్డి, గోను రాజశేఖర్, గూడూరు భాస్కర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దొంతు శారద, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెసు్ట
తిరుపతి మంగళం : ప్రకాశం జిల్లా గిద్దలూరు ఫారెస్ట్ డివిజన్లో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 26 ఎరచ్రందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ను గురువారం తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీఎస్పీ ఎండీ షరీఫ్ ఆధ్వర్యంలో కడప సబ్ కంట్రోల్ ఆర్ఎస్ఐ పీ.నరేష్ బృందం బుధవారం రాత్రి నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఫారెస్ట్ రేంజ్లోని బెస్తవారిపేట అటవీ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. వీరు గుంతపల్లి బీటుకు చేరుకునేసరికి అక్కడ ఒక మోటారు సైకిల్ వద్ద కొంతమంది వ్యక్తులు గుమికూడి కనిపించారు. వారిని సమీపించడంతో, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించిన టాస్క్ఫోర్స్ సిబ్బంది ముగ్గురిని పట్టుకున్నారు. వారిని విచారించి, అక్కడే కల్వర్టు కింద దాచి ఉంచిన 26 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించారు. వారిని దుంగలతోపాటు మోటారు సైకిల్ను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంఈఏ 2025 అసోసియేషన్ ప్రారంభం తిరుపతి రూరల్: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ (ఎంఈఏ) ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ చీఫ్ వర్క్షాప్ మేనేజర్ అకాసి దేవసహాయం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.మల్లికార్జున, అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పి.స్నేహలత, ఉపాధ్యక్షురాలు పి.వింధ్య, కార్యదర్శి పి.హర్షిత, సహాయ కార్యదర్శులు ఎస్.రమ్యశ్రీ, ఇ.కీర్తి పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చిల్లకూరు: మండలంలోని కమ్మవారిపాళెం సమీపంలోని చీమల తిప్ప వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గురువారం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహం కాలి పోయి గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో పోలీసులు పలు కోణాలలో విచారణ చేపట్టగా మృతుడు కోట పట్టణంలోని నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి కాలనీకి చెందిన చర్లగుంట హరిప్రసాద్(43)గా గుర్తించారు. అతడు ఎందుకు ఈ ప్రాంతంలోకి వచ్చి మృతి చెందాడనే విషయం తెలియడం లేదని, మృతదేహం కాలిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడా?, ఎవరైనా చంపి ఇక్కడకు తీసుకుని వచ్చి కాల్చి వేశారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం తమ పెన్షన్లను తొలగించడంతో దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో దివ్యాంగుల ఆందోళనలకు వైఎస్సార్సీపీ తిరుపతి ఇన్చార్జ్ భూమన అభినయ రెడ్డి మద్దతు పలికారు. దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. -
దోమలు లేని నగర నిర్మాణానికి కృషి
తిరుపతి తుడా : ప్రపంచ దోమల నివారణ దినోత్సవంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బుధవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో డాక్టర్ శైలజ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ జీకే రూప్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దోమలు లేని గ్రామం, దోమలు లేని నగర నిర్మాణానికి ప్రతి వ్యక్తి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ రెడ్డి ప్రసాద్, డాక్టర్ మధు, ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్తమ పౌరులను తీర్చిదిద్దుటలో ఎన్సీసీ కీలకం
తిరుపతి సిటీ:తిరుపతి ఎన్సీసీ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలానీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్సీసీ క్యాడెట్లు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. గౌరవ వందనం అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దేశభక్తి ప్రధానాంశాలుగా బాధ్యతాయుతమైన పౌరులను దేశానికి అందించుటలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఎన్సీసీ క్యాడెట్ల కు నాణ్యమైన శిక్షణ, నైపుణ్యాల బలోపేతం, సాహస కార్యక్రమాలలో పాల్గొనేలా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. తిరుపతి గ్రూప్ క్యాడెట్లు జాతీయ శిబిరాలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ దాహియా, ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు. -
రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
రేణిగుంట : రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య అప్పారావు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, ఆర్డీవో భానుప్రకాష్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులు పాల్గొన్నారు. అయితే టాటా ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఓ ఉద్యోగికి ఫిట్స్ రావడంతో అధికారులు ఆందోళన చెందారు. అతడిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. -
దివ్యాంగుల పింఛన్ల తొలగింపు దారుణం
● నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా ● న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ● దివ్యాంగుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తిరుపతి అర్బన్: దివ్యాంగుల పింఛన్ల తొలగింపు దారుణమని దివ్యాంగుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఏ పనీ చేయలేక పింఛనుపైనే ఆధారపడి జీవిస్తున్న వారిపై కూటమి ప్రభుత్వం కన్నెర్ర చేయడం దారుణమన్నారు. ప్రతి జిల్లాలోనూ 7 వేల నుంచి 10 వేల మంది పింఛన్లు తొలగించారని ఆవేదన చెందారు. ఏ రాష్ట్రంలోనూ దివ్యాంగుల పింఛన్లను ఈ స్థాయిలో తొలగించలేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన చెందారు. దివ్యాంగులు శారీరక, మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారని, అలాంటి వారి పింఛన్లను తొలగించడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. పింఛన్లు ఇవ్వకుంటే వారి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఆ గోడు కూటమి సర్కార్కు తగులుతుందని గుర్తుచేశారు. రీవెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వం ఇలా దివ్యాంగులను టార్గెట్ చేయడం దురదృష్టకరంగా భావించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ క్రమంలో జిల్లా దివ్యాంగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. తొలగించిన అన్ని పింఛన్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. -
వైద్యులు కాదన్నారు..
● 108 సిబ్బంది ప్రాణం పోశారు తొట్టంబేడు : శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. అయితే 108 సిబ్బంది చిన్నారికి ప్రాణం పోశారు. వివరాలు ఇలా.. మంగళవారం రాత్రి పెళ్లకూరు మండలం అర్ధమాల గ్రామం నుంచి వెంకటరమణమ్మ ప్రసవ నొప్పులతో బాధపడుతుండటంతో భర్త వేణు రాత్రి 10.30 గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు పరిస్థితి క్లిష్టంగా ఉందని తిరుపతికి రెఫర్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో 108 వాహనం ద్వారా తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యలో ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద ప్రసవ నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది ప్రసవం చేసి పండటి బిడ్డకు ప్రాణం పోశారు. ఇక పుత్తూరు నుంచి చైతన్య అనే మహిళ ప్రసవ నొప్పులతో బాధపడుతూ శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి భర్త గోవర్థన్తో కలిసి సోమవారం వచ్చారు. మంగళవారం శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు పరీక్షించి తెలిపారు. అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఏమైందో ఏమో కాని తిరుపతికి రెఫర్ చేశారు. తాము వెళ్లలేమని చెబుతున్నా బలవంతంగా తిరుపతికి రెఫర్ చేశారు. గతంలో ఈ ఆస్పత్రిలో నెలకు సుమారు 150 నుంచి 200 ప్రసవాలు జరిగేవి. అయితే ఏడాది కాలంగా ఆసుపత్రి వైద్యసేవలు నానాటికి తీసికట్టు మారుతున్నాయి. ప్రస్తుతం నెలకు 30 కాన్పులు జరిగేవి కూడా కష్టంగా ఉంది. జిల్లా వైద్యాధికారులు స్పందించి ఆస్పత్రి వైద్యుల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. -
విద్యార్థులకు పోస్టల్ స్కాలర్షిప్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : తపాలా బిళ్లలు సేకరించేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం దీన్దయాళ్ స్పర్స్ యోజన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తిరుపతి డివిజన్ పోస్టాఫీసుల సీనియర్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ పథకం విద్యార్థులు తమ హాబీని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా చరిత్ర, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, భూగోళ శాస్త్రం వంటి విభాగాలపై అవగాహన పెంచుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఏడాది వరకు రూ.6 వేలు నగదును స్కాలర్షిప్గా వారి పోస్టల్ ఖాతాలో జమచేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబరు 16వ తేదీలోపు దరఖాస్తులను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, తిరుపతి డివిజన్, తిరుపతి – 517501 చిరునామాకు స్పీడు పోస్ట్ ద్వారా పంపించాలని, స్పీడ్ పోస్టు రుసుమును ఫిలాటెలి స్టాంపుల రూపంలో కవరకు అంటించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించాలని తెలిపారు. ఎంపిక ఇలా.. అర్హతలు ఇవే.. -
నూతన విద్యా విధానంతో దేశాభివృద్ధి
తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంతో సత్వర దేశాభివృద్ధి చెందుతుందని ఎస్వీయూ వీసీ అప్పారావు తెలిపారు. ఏబీఆర్ఎస్ఎం, వాయిస్ ఆఫ్ తిరుపతి అకడమీషియన్స్ సంయుక్తంగా ఎన్ఈపీ–2020 విధానాన్ని ప్రవేశపెట్టి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఎస్వీయూ సెనేట్ హాల్లో బుధవారం ఎన్ఈపీ – 2020 ఎట్ ది రేట్ ఫైవ్ ఇయర్స్, పాలసీ, ప్రాక్టీస్ అండ్ ప్రోగ్రెస్ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం 2020లో నూతన విద్యావిధానాన్ని ప్రారంభించిందని తెలిపారు. గత ఐదేళ్లుగా కేజీ టూ పీజీ వరకు ఎన్ఈపీని అమలు చేస్తున్నారని తెలిపారు. ఏబీఆర్ఎస్ఎం జాతీయ సహ సంఘటనా కార్యదర్శి గుంతా లక్ష్మణ్ మాట్లాడుతూ చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అక్కడ ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అంతా మాతృభాషలోనే జరుగుతుందని తెలిపారు. భారతదేశంలో విద్యార్థి అభిరుచికి అనుగుణంగా మాతృభాషలోనే విద్యను బోధించే అవకాశాన్ని నూతన జాతీయ విద్యా విధానం కల్పిస్తుందని తెలిపారు. దేశంలో వున్న అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం బడ్జెట్లో కేటాయిస్తున్న జీడీపీ కనీసం 6 శాతం పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయాలని, తరగతి గదులను ఆధునీకరించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎం రాష్ట్ర అధ్యక్షులు వైవీ రామిరెడ్డి, ఉపాధ్యక్షురాలు ప్రొఫెసర్ సి.వాణి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎం రాజశేఖర్, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి రాజశేఖర్ , డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ ఎన్ బాలసుబ్రమణ్యం, ప్రొఫెసర్ రంజని, డాక్టర్ శ్రీలత, డాక్టర్ సంధ్య, హైదరాబాద్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు, వాయిస్ ఆఫ్ తిరుపతి అకడమిషియన్స్, పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, 300 మంది విద్యావేత్తలు పాల్గొన్నారు. -
రెండు చేతులూ పనిచేయవు
దొరవారి సత్రం మండలంలోని కుప్పరెడ్డిపాలెం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నా. నాకు పక్షవాతంతో రెండు చేతులు పనిచేయడం లేదు. నాకు రూ.6 వేలు పింఛన్ ప్రతి నెలా వస్తోంది. పేద కుటుంబానికి చెందిన వాళ్లం. అయితే ప్రస్తుతం నా పింఛన్ తొలగించారు. నా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. నాకు న్యాయం చేయండి. అధికారులు మరోసారి వచ్చి పరిశీలన చేయండి. – తిరుమల్లి పాపయ్య, దొరవారిసత్రం మండలం●తిరుపతి అర్బన్ : వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, వృద్ధులు తీసుకుంటున్న పింఛన్లను తనిఖీ పేరుతో తొలగిస్తున్నారు. సెప్టెంబర్లో వృద్ధుల పింఛన్ రీవెరిఫికేషన్కు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పింఛన్దారుడిది ఒక్కో ఆవేదన, ముందే పింఛన్ల డబ్బులు వైద్యం ఖర్చులకు సరిపోకపోవడంతో తిప్పలు పడుతుంటే...ఆ బాధలు చాలవంటూ పింఛన్ల తొలగింపు, మార్పుపై ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతుంటే ఇలా ఆఫీసుల చుట్టూ తిరగమని చెప్పడం ఎంత వరకు న్యాయం అంటూ పింఛన్దారులు వాపోతున్నారు. ప్రస్తుతం రూ.15 వేలు పింఛన్ తీసుకునే రోగులు జిల్లాలో 1199 మంది కిడ్నీ, గుండె, లివర్ తదితర తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో వారికి రూ.10 వేల నుంచి రూ.15 వేల పింఛన్లు ఇస్తున్నారు. అయితే ఇటీవల పింఛన్ల రీ వెరిఫికేషన్ చేసిన సంగతి తెలిసిందే. రూ.15 వేలు తీసుకుంటున్న వారిలో 477 మందిని రూ.6 వేలు పింఛన్లకు , అలాగే 28 మందిని రూ. 4 వేలు పింఛన్కు మార్పు చేశారు. 592 మందిని మాత్రమే రూ.15 వేలకు అలానే ఉంచారు.102 మంది పింఛన్లను పూర్తిగా రద్దు చేశారు. రూ.6 వేలు పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగులు ప్రస్తుతం రూ.6 వేలు తీసుకునే దివ్యాంగులు 21,570 మంది మిగిలారు. రూ. 6 వేలు పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగులు జిల్లాలో 31,069 మంది ఉన్నారు. వారిలో 21,570 మందిని అలానే ఉంచారు. 1708 మందిని రూ.4 వేలకు మార్పు చేశారు. మిగిలిన 7,791 మంది పింఛన్లు తొలగించారు. మూగ, చెవుడు ఉన్నా పింఛన్ కోత పెట్టారు.. నాకు మూగ, చముడు ఉండడంతో దివ్యాంగుల పింఛన్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు పింఛన్ తొలగించినట్లు నోటీసులు ఇచ్చారు. ఎందుకు తొలగించారో తెలియడం లేదు. పింఛన్ డబ్బు ప్రతి నెలా రూ.6 వేలు వస్తుంది. దాంతో మా కుటుంబం సభ్యులు నన్ను బాగా చూసుకునే వారు. సెప్టెంబర్ నుంచి నా జీవనం నాకే అర్థం కావడం లేదు. నాకు పింఛన్ ఇప్పించి , న్యాయం చేయండి. – సోడవరం చంద్రశేఖర్, బాలాయపల్లి మండలం పరిశీలన కోసం మరో నోటీసు ఇస్తాం దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులు పింఛన్లు తొలగిస్తున్నట్లు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రూరల్ ప్రాంతంలోని వారు ఎంపీడీవో ఆఫీస్, అర్బన్ ప్రాంతంలోని వారు మున్సిపల్ ఆఫీస్లో సంప్రదించాలి. ఓ అర్జీని అధికారులకు ఇవ్వండి. పింఛన్లు తొలగించిన వారికి మరో నోటీసు ఇస్తాం. ఆ నోటీసులో తిరిగీ మళ్లీ ఆస్పత్రిలో తనిఖీ కోసం రావాల్సి ఉంటుంది. ఏ ఆస్పత్రికి రావాల్సి ఉంటుందని అనే వివరాలను త్వరలో తెలియజేస్తాం. లేదా సచివాలయంలో తెలుసుకోవచ్చు. – వెంకటేశ్వర్, జిల్లా కలెక్టర్, తిరుపతి రెండేళ్ల నుంచి దివ్యాంగుల పింఛన్ వస్తోంది మాది వరదయ్యపాళెం మండలం, సిద్దాపురం గ్రామం. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దాంతో దివ్యాంగుడయ్యాను. అప్పటి నుంచి దివ్యాంగుల పింఛన్ ఇస్తున్నారు. నాకు 65 శాతం వికలత్వం ఉంది. అయితే తాజాగా చేసిన సర్వేలో నాకు 40 శాతమే వికలత్వం ఉందని సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో పింఛన్ తొలగించారు. నాకు న్యాయం చేయా లని కోరుతున్నా. – హెచ్.లోకయ్య, వరదయ్యపాళెం మండలంఒక చెయ్యి పూర్తిగా పనిచేయదు మాది బాలాయపల్లి మండలం కడగుంట గ్రామం. పదేళ్లుగా నాకు ఒక చెయ్యి పనిచేయడం లేదు. దీంతో దివ్యాంగుల పింఛన్ ఇస్తున్నారు. ఇప్పటికీ ఒక చెయ్యి పనిచేయదు. అయితే నాకు పింఛన్ తొలగించా రు. వచ్చే నెల నుంచి నేను ఎలా జీవనం సాగించాలో తెలియడం లేదు. ఇలా చేయడం ఎంత వరకు న్యాయమో ప్రభుత్వం ఆలోచన చేయాలి. తిరిగి నా పింఛన్ ఇప్పించాలని వేడుకుంటున్నా. – కంచి పార్వతమ్మ, బాలాయపల్లి మండలం వృద్ధుల పింఛన్లు 12,211 తగ్గింపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల కోత కొనసాగుతూనే ఉంది. గత ఏడాది జూన్లో 2,71,183 మందికి పింఛన్లు అందించారు. ఈ ఏడాది ఆగస్టులో 2,58,972 మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు 12,211 పింఛన్లు తగ్గించారు. పింఛన్ల సంఖ్య ఎందుకు తగ్గుతున్నాయని డీఆర్డీఏ అధికారులను ప్రశ్నిస్తే వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలల్లో పింఛన్లు తీసుకుంటున్న వారు 12,211 మంది మృతి చెందారా..? అంటూ అంతా చర్చించుకుంటున్నారు.రూ.6 వేలు పింఛన్ రద్దయింది.. నేను ప్రతి నెలా రూ.6 వేలు పింఛన్ తీసుకుంటున్నా. అయితే నా పింఛన్ తొలగించారు. నాకు చెవుడు ఉంది. చిల్లకూరు మండలంలోని పొన్నవోలు గ్రామంలో ఉంటున్నాం. నా వయస్సు 65 ఏళ్లు, దివ్యాంగులకు ఇస్తు న్న రూ.6 వేలు పింఛన్ తొలగిస్తే కనీసం రూ.4 వేలు వృద్ధులకు ఇచ్చే పింఛన్ కూడా ఇవ్వలేదు. ఇది ఎంత వరకు న్యాయం. – తమ్మిశెట్టి వెంకటరమణయ్య, చిల్లకూరు మండలం పింఛన్తోనే జీవనం సాగిస్తున్నా.. మాది తిరుపతి రూరల్లోని వడ్డ్పిల్లి గ్రామం. ఏళ్ల తరబడి దివ్యాంగుల పింఛను తీసుకుంటున్నా. అయితే ఇటీవల సచివాలయ ఉద్యోగులు నోటీసు ఇచ్చారు. వచ్చే నెల నుంచి పింఛన్లు ఇవ్వడం లేదని చెప్పారు. కలెక్టరేట్ కార్యాలయంలోనూ న్యాయం కోసం అర్జీ ఇచ్చా. కేవలం పింఛన్తో జీవనం సాగిస్తున్నా. పింఛన్ నాకు తిరిగి ఇప్పించండి. – ఆర్ముగం, తిరుపతి రూరల్ -
ఐఐటీలో ఫ్యాకల్టీ సెన్సిటైజేషన్
ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో బుధవారం ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సహకారంతో హాఫ్–డే ఫ్యాకల్టీ సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అధ్యాపకులు, పరిశోధనా పండితులు, విద్యార్థులలో ప్రామాణీకరణ కీలక పాత్ర, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సహకార అవకాశాల గురించి అవగాహన కల్పించారు. ఐఐటీ డైరెక్టర్ మాట్లాడుతూ.. సివిల్ ఇంజినీరింగ్ అధ్యయనాల సమయంలో భారతీయ ప్రమాణాలను ఉపయోగించడంలో తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అధ్యాపకులు, విద్యార్థులు ప్రామాణీకరణ పర్యావరణ వ్యవస్థకు తోడ్పడాలన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్తో ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, శాస్త్రవేత్త, డైరెక్టర్ చిన్మయ్ ద్వివేదితో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ చిమలకొండ, నేహా యాదవ్, ధరమ్సోత్ సంతోష్ పాల్గొన్నారు. -
ఇండియాకు ఆడాలన్నదే లక్ష్యం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి క్రికెటర్లు ఇండియాకు ఆడాలన్నదే లక్ష్యమని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్కుమార్ తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో క్రికెట్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్ని కేటగిరిల్లో క్రికెటర్లకు మ్యాచులు నిర్వహించి వారి ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇటీవల కడపలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఛాంపియన్స్గా నిలిచిన అండర్–16 బాయ్స్ జట్టు, అలాగే అనంతపురంలో నిర్వహించిన సౌత్ జోన్ ఛాంపియన్స్ పోటీల్లో ఛాంపియన్స్గా నిలిచిన అండర్–23 సీనియర్స్ ఉమెన్స్ జట్టు సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో సీడీసీఏ కార్యదర్శి రవి, కోశాధికారి గిరి ప్రకాష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, శ్రీధర్, జాయింట్ సెక్రటరీ సతీష్ యాదవ్, సభ్యులు, క్రికెటర్లు పాల్గొన్నారు. -
రూ.15 వేల పింఛన్ను రూ.4 వేలకు మార్పు చేశారు
నాయుడుపేట పట్టణంలోని మూకాంబిక ఆలయం వీధిలో నివా సం ఉంటున్నాం. పిల్లలకు వివాహాలు చేశాం. భార్యతో కలిసి ఇద్దరమే ఉంటున్నాం. నాకు బ్రెయిన్ స్టోక్ రావడంతో మంచానికే పరిమితం అయ్యాను. దాంతో సదరం సర్టిఫికెట్ 95 శాతం వికలత్వం ఇచ్చారు. రూ.15 వేలు పింఛన్ తీసుకుంటున్నాను. అయితే రెండు రోజుల క్రితం నా ఫించన్ రూ.4 వేలకు తగ్గించామని చెప్పారు. రూ.15 వేలు వైద్య ఖర్చులకు చాలడం లేదు. అప్పులు చేస్తున్నాం. అయితే ప్రస్తుతం పింఛన్ రూ.4 వేలు చేస్తే ఎలా బతకాలి. – తుమ్మూరు శ్రీరాములు, నాయుడుపేట -
రోడ్డెక్కిన వింగ్టెక్ కార్మికులు
రేణిగుంట : రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఈఎంసీ–2 క్లస్టర్కు చెందిన వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్ కంపెనీకి చెందిన 250 మంది కార్మికులు బుధవారం సాయంత్రం కంపెనీ ప్రధాన ద్వారానికి ఎదురుగా బైఠాయించి నిరసన తెలిపారు. 2017–18లో స్థాపించిన కంపెనీలో 1000 మంది కంపెనీ ఉద్యోగులు కాగా, 1400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో 750 మంది పర్మినెంట్ ఉద్యోగులను తీసివేశారు. అలాగే 1400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. మిగిలిన 250 మంది పరిస్థితి ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఉన్నఫలంగా కంపెనీ యాజమాన్యం అందుబాటులో లేకుండా వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా అవాకై ్కన కార్మికులు ఇప్పుడొచ్చిన కొత్త కంపెనీ లెక్ షేర్ యాజమాన్యం మీరు మా ఉద్యోగులు కారని అంటున్నారని పలువురు కార్మికులు వాపోయారు. కార్మికులు చేస్తున్న నిరసనకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపి వారితో పాటు బైఠాయించారు. ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కార్మికులతో చర్చించారు. పూర్తి సమాచారాన్ని తెలుసుకొని కార్మికులకు న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. -
వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీపై అవగాహన
తిరుపతి సిటీ : నగరంలోని సీకామ్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీపై ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ ఇనేష్ సిద్ధార్థ అవగాహన కల్పించారు. బుధవారం ఈ మేరకు ఆయన మాట్లాడుతూ బేసిక్స్, మాక్రో ఫొటోగ్రఫీ, ప్రొడక్ట్ ఫొటో గ్రఫీ, ఫుడ్ ఫొటోగ్రఫీ, న్యూబార్న్ ఫొటోగ్రఫీ తదితర అంశాల్లో మెలకువలను నేర్పించారు. దివ్యాంగులకు ఉచిత శిక్షణ తిరుపతి అర్బన్ : జిల్లాలోని నిరుద్యోగ దివ్యాంగ యువతకు ఉచితంగా కంప్యూటర్ , కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఇస్తామని యూత్ 4 జాబ్స్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు మీరా షైనీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వరకు అవకాశం ఉందని ఆసక్తి ఉన్నవారు హాజరు కావాలని కోరారు. ప్రధానంగా శారీరక దివ్యాంగులు, మూగ, చెవుడు లోపాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా చేసిన వారు 19–34 ఏళ్ల వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 9347411952, 93929 23884 నంబర్ను సంప్రదించాలని సూచించారు. పది మంది ఆటో డ్రైవర్లకు జైలు తిరుపతి లీగల్ : అధిక మోతాదులో మద్యం తాగి తిరుపతిలో నిర్లక్ష్యంగా ఆటోలు నడుపుతున్న పది మంది డ్రైవర్లకు ఒక్కొక్కరికి మూడు రోజులు చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ గ్రంధి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి ట్రాఫిక్ పోలీసులు నగరంలో తనిఖీలు నిర్వహించారు. అలాగే స్వల్ప మోతాదులో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 11 మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రేపు జర్మన్ భాషపై శిక్షణ ప్రారంభంతిరుపతి అర్బన్ : జర్మన్ భాషపై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం తిరుపతిలోని శ్రీబాబు జగ్జీవన్ భవనంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తున్నట్లు బుధవారం ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి విక్రమకుమార్రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలావీరాంజనేయస్వామి, సాంఘికశాఖ సంచాలకులు లావణ్య వేణి హాజరు కానున్నారని చెప్పారు. ఎస్సీలు 25 మంది, ఎస్టీలు 25 మంది మహిళలకు ఉచిత వసతితో పాటు జర్మన్ భాషపై శిక్షణ ఉంటుందని చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖతో పాటు గిరిజన సంక్షేమశాఖ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వివరించారు. ఆటో చోరీ కేసులో జైలు తిరుపతి లీగల్: ఆటో చోరీ కేసులో వైఎస్సార్ కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం, తుమ్మలూరుకు చెందిన అనిల్కుమార్కు రెండు నెలల జైలు శిక్ష, వంద రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు బుధవారం తీర్పు చెప్పారు. ఈ ఏడాది మే 22వ తేదీ తిరుపతి, గాంధీపురం, జగ్జీవన్ రావు పాఠశాల వద్ద కిషోర్ కుమార్ తన ఆటోను నిలిపాడు. మరుసటి రోజు వెళ్లి చూడగా ఆటో కనపడలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడు అనిల్ కుమార్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసు పరిశీలించిన న్యాయమూర్తి అనిల్ కుమార్కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా నాగలాపురం: మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది కూట మి నేతలు అధికారం అండతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నాగలాపురం మండలంలోని చిన్నాపట్టు వద్దనున్న అరణియార్ నదిలో మంగళవారం అర్ధరాత్రి ఇసుక తవ్వకాలు చేసి ట్రాక్టర్లతో తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే అక్కడికి చేరుకుని దాడి చేశారు. మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. తర్వాత ఏమి జరిగిందో కాని కేసులు నమోదు చేయకుండా యజమానులకు నామమాత్రంగా జరిమానా విధించి ట్రాక్టర్లను వదిలేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే ట్రాక్టర్లను వదిలేశారని, జిల్లా ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
నిరీక్షణకు తెర
జిల్లాలోని డిగ్రీ కళాశాలల సమాచారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 17 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 104 టీటీడీ డిగ్రీ కళాశాలు 5 విభాగాలు 21 అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 26,755జిల్లాలో 126 కళాశాలలో అడ్మిషన్లు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో ఎట్టకేలకు ప్రవేశాలకు ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సుమా రు 126 డిగ్రీ కళాశాలల్లో 21 విభాగాలలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్తో దాదాపు 26,755 సీట్లు భర్తీకి ఉన్నత విద్యామండలి అనుమతించింది. అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు నాలుగు నెలలు పాటు ఆలస్యం కావడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కనీసం 50శాతం ప్రవేశాల మార్కు దాటేనా అంటూ అంటూ ఆలోచనలో పడ్డాయి. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత ఏడాది 50 శాతం అడ్మిషన్లు సైతం కాకపోవడం ఈ ఏడాది 30శాతం ప్రవేశాలు జరిగేనా అంటూ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. తిరుపతి సిటీ : గత నాలుగు నెలలుగా డిగ్రీ ప్రవేశాల కోసం జిల్లాలో సుమారు 30 వేల మంది విద్యార్థుల నిరీక్షణకు ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మాసంలో విడుదలైనా సింగిల్, డబుల్ మేజర్ అంటూ కమిటీని నియమించి కాలయాపన చేసి ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ మేజర్ సబ్జెక్ట్నే యూజీలో కొనసాగిస్తూ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా పీజీసెట్, లాసెట్, ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందకపోవడంతో అడ్మిషన్లు ఎప్పుడు జరుగుతాయో అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం డిగ్రీ ప్రవేశాలకు ఈనెల 26వ తేదీలోపు విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్స్ మోడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎమ్డీసీ) వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో తమకు అనుకూలమైన కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 24వ తేదీ నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చిన ఉన్నత విద్యామండలి 29వ తేదీన వెబ్ ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించింది. 31వ తేదీన మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు చేయనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆయా కళాశాలలో సీట్లు సాధించిన విద్యార్థులు రిపోర్టు చేసి అదే రోజు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. హెల్ప్డెస్క్లు ఏర్పాటు డిగ్రీలో ప్రవేశాల కోసం ఇప్పటికే ఆప్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అప్లికేషన్లను ప్రత్యేక హెల్ప్లైన్ డెస్క్లను ఏర్పాటు చేసి ఆయా కళాశాలల అధ్యాపకులు ఆన్లైన్ చేయనున్నట్లు తెలిసింది. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో సమస్యలు ఎదురైనా, తెలియకపోయినా సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని హెల్ప్డెస్క్ను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోనే అవకాశం కల్పించారు. చంద్రగిరి : ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టడంతో ఆయనకు త్వరగా బెయిల్ రావాలంటూ ఆయన అభిమానులు తిరుమల వెంకన్నకు మొక్కుకున్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు నుంచి తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం వారిని పోలీసులు అక్రమంగా అడ్డుకుని, స్టేషన్లో నిర్భందించారు. రాత్రి వరకు స్టేషన్లోనే ఉంచుకుని ఆపై సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం బుధవారం ఉదయం హరిప్రసాద్ రెడ్డితో పాటు అభిమానులు శ్రీవారిమెట్టుకు చేరుకున్నారు. ముందుగా అక్కడి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు పాదయాత్రను కొనసాగించారు. తిరుమలకు చేరుకున్న వారు శ్రీవారిని దర్శించుకుని, తమ అభిమాన నేత ఎంపీ మిఽథున్ రెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందన్నారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అక్రమంగా అడ్డుకుని, నిర్భదించడం దీనికి ఉదాహరణ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.కాలినడకన తిరుమలకు చేరుకున్న హరిప్రసాద్ రెడ్డి బృందంప్రవేశాలకు గ్రీన్సిగ్నల్ టీటీడీ డిగ్రీ కళాశాలల వివరాలు కళాశాల కళాశాల కోడ్ విభాగాలు మొత్తం సీట్లు పద్మావతి డిగ్రీ కళాశాల 18195 21 1550 ఎస్వీ ఆర్ట్స్ కళాశాల 20132 20 1417 ఎస్జీఎస్ కళాశాల 17656 19 1068 ఎస్వీ ఓరియెంటల్ కళాశాల 20185 6 300 సికింద్రాబాద్ ఎస్వీవీవీఎస్ 25519 3 60అటానమస్ హోదాలో రెండవ ఏడాది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్ల్యూ, ఎస్జీఎస్, ఎస్వీ ఆర్ట్స్, ఓరియంటల్ డిగ్రీ కళాశాలల్లో బుధవారం నుంచి అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో పాటు సికింద్రాబాద్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీవీవీఎస్ డిగ్రీ కళాశాలల్లో సైతం అడ్మిషన్లుకు రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఎస్పీడబ్ల్యూ, ఎస్వీ ఆర్ట్స్, ఎస్జీఎస్ కళాశాలలు గత ఏడాది అటానమస్ హోదా పొందాయి. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రస్తుతం అడ్మిషన్లు జరగనున్నాయి. టీటీడీ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉచిత భోజన వసతి కల్పించనున్నారు. -
రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రణాళిక
చిల్లకూరు:రైల్వేస్టేషన్లను అత్యాధునికంగా అభివృద్ధి చేసేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రైల్వే డీఆర్ఎం మోహిత్ తెలిపారు. బుధవారం గూడూరు రైల్వేస్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. డీఆర్ఎం మాట్లాడుతూ ప్రయాణికులకు పకడ్బందీగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గూడూరు రైల్వేజంక్షన్ ఆధునికీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ప్లాట్ఫామ్పై క్యాంటిన్లతోపాటు రైల్వే ట్రాక్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. రెండో పట్టణం వైపు సైతం టికెట్ కౌంటర్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే రైల్వే మార్గం తనిఖీ చేశారు. స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గాయపడ్డ లారీ డ్రైవర్ మృతి నాయుడుపేట టౌన్ : పట్టణ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ మస్తానయ్య(56) బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. కసుమూరు గ్రామానికి చెందిన మస్తానయ్య లారీలో ధాన్యం లోడింగ్ కోసం నాయుడుపేటకు వచ్చాడు. మంగళవారం రాత్రి మరో ఇద్దరు డ్రైవర్లతో కలిసి అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని రహదారిపై నడిచి వస్తున్నారు. ఈ క్రమంలో ఓజిలి మండలం కర్రబల్లవోలు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అంకయ్య ఆటోను వేగంగా ముగ్గురిని ఢీకొన్నాడు. దీంతో ఆటో అంకయ్యపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆకాష్లో స్కాలర్షిప్ పరీక్ష
తిరుపతి సిటీ : స్థానిక ఎయిర్ పాస్ రోడ్డులోని ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆంథే–2025 పేరుతో విద్యార్థులకు స్కాలర్ షిప్ పరీక్ష నిర్వహించనున్నట్లు స్టేట్ అకడమిక్ ఆపరేషన్ హెడ్ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. బుధవారం ఆకాష్ సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుని రూ.కోట్లలో స్కాలర్ షిప్లు పొందుతూ సంస్థలో ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షలకు ఉచిత కోచింగ్ పొందేందుకు సంస్థ అవకాశం కల్పించిందన్నారు. ఆన్లైన్లో అక్టోబర్ 4వతేదీ నుంచి 12 వరకు, ఆఫ్లైన్ ద్వారా అక్టోబర్ 5వ, 12వ తేదీలలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు కేవలం రూ.150తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి విద్యార్థికి రూ.5వేల విలువగల ఆన్లైన్ స్టడీమెటీరియల్ అందిస్తామని తెలిపారు. సమావేశంలో రీజనల్ సేల్స్ హెడ్ నిశాంత్ మిశ్రా, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ విజయ్ కుమార్, రీజినల్ మార్కెటింగ్ హెడ్ నరసింహులు, బ్రాంచ్ మేనేజర్ సుబ్రమణ్యం పాల్గొని ఆంథే స్కాలర్ షిప్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.రైలు ఢీకొని టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి మృతిపుత్తూరు: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి రైలు ఢీకొని ఎం.శ్రావణ్కుమార్(31) అనే యువకుడు మృతి చెందాడు. స్థానిక లక్ష్మీనగర్ కాలనీలో నివాసము న్న శ్రావణ్కుమార్ నాగలాపురంలోని వేదనారా యణస్వామి ఆలయంలో నాదస్వర విద్వాన్గా కాంట్రాక్ట్ బేసిక్పై పనిచేస్తున్నాడు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రైల్వే పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
నేడు పింఛన్ల తొలగింపుపై కలెక్టరేట్ వద్ద ధర్నా
చంద్రగిరి : కూటమి ప్రభుత్వం సదరం రీ అసైన్మెంట్ పేరుతో అర్హులైన దివ్యాంగుల పింఛన్ల ఏరివేత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వికలాంగుల జేఏసీ నేతలు తెలిపారు. ఈ మేరకు ధర్నాకు అనుమతి కోరుతూ బుధవారం తిరుచానూరు సీఐ సునీల్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతి కలెక్టరేట్ ఎదుట జిల్లా వికలాంగుల ఐకాస (జేఏసీ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అర్హులైన పింఛనుదారులను తొలగించడం దారుణమన్నారు. వచ్చే నెల నుంచి పింఛన్లను నిలిపివేస్తున్నట్లుగా ఇప్పటికే అర్హులకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.శ్రీవారి సేవలో రైల్వే జీఎం తిరుమల: రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.శ్రీవారి దర్శనానికి 12 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 30 కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ సేవా సదన్ వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 76,033 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.30 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. -
టీవీ5 అబద్ధాలకు పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందన్నారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. బీఆర్ నాయుడును చూసి వైఎస్సార్సీపీ భయపడదు అంటూ హెచ్చరించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘బొల్లినేని రాజగోపాల్ నాయుడు(బీఆర్ నాయుడు) ఆధ్వర్యంలో టీటీడీ ప్రతిష్ట దిగజారుతోంది. బీఆర్ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోంది. భక్తుల అవస్థలను బీఆర్ నాయుడు పట్టించుకోవడం లేదు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు. టీవీ-5 ప్రసారం చేసే అబద్ధాలకు వేల సంఖ్యలో పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి. బీఆర్ నాయుడు రూ.10వేల కోట్ల పరువు నష్టం ఇవ్వాల్సి ఉంటుంది.బీఆర్ నాయుడు, చంద్రబాబు ప్రజస్వామ్య ద్రోహం చేస్తున్నారు. తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారు. ఆయన అరాచకాలు ప్రజలందరికీ తెలుసు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను వైకుంఠం పంపించారు. టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన నిర్లక్ష్య వైఖరి కారణంగా తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని అంటే మీకు అహం అడ్డు వచ్చింది. బాలాజీ నగర్ కాలనీలో బెల్ట్ షాప్ ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాలు చేయలేదా?. ఢిల్లీలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్ఠలపై విజిలెన్స్ విచారణ జరగలేదా?. ఏ నీళ్లతో చేస్తే పాప పరిహారం అవుతుంది అనుకుంటామో.. పాప వినాశనంలో బోట్లు షికారు చేయించారు. మీ హయంలో వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టీవీ5 చానల్ ద్వారా ఈ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వైఎస్సార్సీపీ నాయకులపై మీ చానెల్లో చూపిస్తున్నారు. దీనికి మీపై పదికోట్ల రూపాయలు పరువు నష్టం వేయాలి. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నది మీరు కాదా?. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా?. మీ చానెల్ ప్రతినిధిని పెట్టుకుని మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఎవరు బిల్లులు ఇవ్వాలో మీరే చెప్తున్నారు. టీటీడీ చైర్మన్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. రెండు గంటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనం అన్నారు.. అది ఏమైంది?. మీ సిఫార్సులతో అడిషనల్ ఈవో కార్యాలయంలో టికెట్స్ పొందడం లేదా?. వీఐపీ తగ్గిస్తామని చెప్పి అత్యధికంగా టికెట్లు ఇస్తూ ఉన్నారు. శ్రీవాణి రద్దు చేస్తాము అని చెప్పి, ఈరోజు ఎక్కువ టిక్కెట్లు ఇస్తున్నారు. రద్దు చేసే దమ్ము మీకు ఉందా?. మాపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఒక సాధారణ వ్యక్తి బీఆర్ నాయుడు.. ఇన్ని లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు?. టీవీ5 చానెల్ ఎలా పెట్టాడు’ అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడరు. బీఆర్ నాయుడును చూసి వైఎస్సార్సీపీ భయపడదు. హిందూ ధర్మాన్ని రక్షించడంలో సాక్షి మీడియా ముందుంది’ అని చెప్పారు. -
ఉడత ఊపులకు భయపడేది లేదు.. పోరాటం ఆగదు: సాక్షి మీడియా
సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం కథనాలల వ్యహారంలో లీగల్ నోటీసుల అంశంపై సాక్షి మీడియా సంస్థ స్పందించింది. టీవీ5 లీగల్ నోటీసుల ఉడత ఊపులకు భయపడేది లేదని, పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై పోరాటం ఆగదని స్పష్టం చేసింది. మీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు.. అది నిజంకాదా?. క్షమాపణ చెప్తే చనిపోయిన వారు బతికొస్తారా? అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నది నిజం కాదా?. బీఆర్నాయుడి హయాంలో.. తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిన మాట వాస్తవం కాదా?. మీ చేతకానితనంలో సామాన్యులకు ఇబ్బందులు వాస్తవం కాదా?. రోజుల తరబడి క్యూలైన్లో ఇబ్బంది పడుతోంది నిజం కాదా?. ఏఐ టెక్నాలజీతో దర్శనాలు సాధ్యం కాదని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వెంకన్న సాక్షిగా చెప్పింది నిజం కాదా?. డిప్యూటీ సీఎం పవన్ దర్శనానికి వెళ్లారనే అక్కసుతో పూజారికే మోమో ఇచ్చింది నిజం కాదా?.. అని సాక్షి మీడియా సంస్థ నిలదీసింది.భక్తులకు సరైన సదుపాయలు కల్పించాలన్నదే మా తాపత్రయం. టీడీపీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే సాక్షి ఆకాంక్ష. సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్. శ్రీవారిని కేవలం వీఐపీలకు పరిమితం చేయడంపై ప్రశ్నించడం ఆగదు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై మా పోరాటం ఆగదు అని సాక్షి మీడియా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. -
ధర్నాతో దద్దరిల్లిన ఎస్వీయూ
తిరుపతి సిటీ : ఎస్వీయూలో తొలగించబడిన తాత్కాలిక అధ్యాపకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి వర్సిటీ అధికారుల తీరును ఎండగట్టారు. అధ్యాపకులు నిరసన కార్యక్రమానికి విద్యార్థి సంఘాల నాయకులు హాజరై మద్దతు పలికారు. ఈ సందర్భంగా తొలగించిన అధ్యాపకులు మాట్లాడుతూ.. అన్ని అర్హతులు ఉన్నా కక్ష సాధింపు చర్యలో భాగంగా వర్సిటీ అధికారులు 43 మంది అకడమిక్ కన్సల్టెంట్లను తొలగించి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకమండలిని మభ్యపెట్టి.... పాలక మండలికి అకడమిక్ కన్సల్టెంట్ల తొలగింపుపై పూర్తి సమాచారం ఇవ్వకుండా చర్చించకుండా ఇంటర్వ్యూలు నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఓ పాలకమండలి సభ్యురాలు తనకు అవగాహన లేకపోవడంతో ఆమోదం తెలిపానని బహిరంగంగా వీసీకి లేఖ రాశారంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. అనంతరం వీసీ అప్పారావును కలసి వారు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అకడమిక్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కల్లూరి కిషోర్కుమార్రెడ్డి, సభ్యులు, వైఎస్సాఆర్సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవి, వినోద్, ఉపాధ్యాక్షులు అశోక్, బీడీవీఎస్ నాయకులు యుగంధర్, సుకుమార్, విద్యార్థి సంఘాల నాయకులు ముని హేమంత్, భరత్, తాత్కాలిక అధ్యాపకులు పాల్గొన్నారు. న్యాయపోరాటానికి సన్నద్ధం వర్సిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక అధ్యాపకులను తొలగించడంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాం. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేశాం. న్యాయవాదుల సలహాలు తీసుకున్నాం. ఈ విషయంపై వెనకడుగు వేసేదేలేదు. డిప్యూటీ సీఎం దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. – తొలగించిన తాత్కాలిక అధ్యాపకులు, ఎస్వీయూ -
వాహనాలు ఢీ : ఏడుగురికి గాయాలు
నాయుడుపేటటౌన్ : మండల పరిధిలోని అయ్యప్పరెడ్డి పాళెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం నాలుగు వాహనాలు ఒకదానికి ఒకటి అదుపు తప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. రెండు కార్లలో ఉన్న ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. ఒడిస్సా నుంచి బెంగళూరు వెళుతున్న లారీ మార్గ మధ్యలో అయ్యప్పరెడ్డి పాళెం జాతీయ రహదారి కూడలి సమీపంలో అదుపు తప్పి ముందు వెళుతున్న కారును ఢీకొంది. ఆ కారు ముందు వెళుతున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. ఓజిలి ప్రాంతానికి చెందిన ఫ్రాంక్లీన్, మల్లికార్జున రెడ్డి, షేక్ రఫీ, బన్నీ , మరో కారులో ఉన్న మద్ది వీరయ్య, సునీత, సాయిలకు గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం డక్కిలి : విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమయింది. ఈ ఘటన మండలంలోని ఆల్తూరుపాడులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. అగ్నిమాపకశాఖ అధికారి ఆదినారాయణ కథనం మేరకు ఆల్తూరుపాడు గ్రామానికి చెందిన కటకం రమణయ్య పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇంట్లో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వారు చేరుకొని మంటలను అదుపు చేశారు. బాధితుడికి రూ.లక్ష ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ దేవపస్రాదరాజుకు పత్రిష్టాత్మక పురస్కారం తిరుపతి సిటీ: ఎస్వీయూ ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ బి దేవప్రసాద రాజు ప్రతిష్టాత్మక పురస్కారం పొందారు. రేర్ ఎర్త్ రంగంలో చేసిన పరిశోధనా కృషికి గుర్తింపుగా రేర్ ఎర్త్ అసోసియేషన్ ఈ పురస్కారాన్ని అందజేసింది. గురువారం భువనేశ్వర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్ చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. 16 ఏళ్లుగా ఎస్వీయూలో ఎన్నో పేరొందిన పరిశోధనలు చేపట్టిన ఆయన 5 జాతీయ, 3 అంతర్జాతీయ సదస్సులు, పరిశోధనా ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి జర్నల్స్లో ఆయన రూపొందించిన 125 పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 13 పీహెచ్డీ డిగ్రీలు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రేర్ ఎర్త్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎంఎల్పీ రెడ్డి, ఎస్వీయూ రిటైర్డు ప్రొఫెసర్ సీకే జయశంకర్, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి పురస్కారం పొందిన ఆయనను అభినందించారు. -
ఉపాధి పనులపై విచారణ
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024 – 2025 ఏడాదిలో పూర్తి చేసిన పనులపై మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం 19వ విడత బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణకు డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ విచారణ అధికారిగా హాజరయ్యారు. సామాజిక తనిఖీల్లో భాగంగా పేరూరు చెరువుకు సంబంధించి రూ.1.50 కోట్లు మేరకు గుంతలు తీసినట్టుగా బిల్లులు చేసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దానిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఎంపీపీ మూలం చంద్రమోహన్రెడ్డి డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్కు వినతి పత్రం అందించారు. సమగ్ర విచారణ చేసి పది రోజుల్లో నివేదికను సమర్పించాలని ఎంపీడీఓ రామచంద్ర, ఏపీడీ రెడ్డెప్ప విజిలెన్స్ అధికారులను పీడీ ఆదేశించారు. అలాగే దుర్గసముద్రం పరిధిలో ఒక్క కూలీ కూడా పనులు చేయకుండానే 57 మంది పనులకు హాజరైనట్టుగా నమోదు చేయడం జరిగిందని, దానిపై కూడా విచారణ చేయాలని ఎంపీపీ మూలం చంద్రమోహన్రెడ్డి కోరగా దానిపై శాఖా పరమైన విచారణ చేయాలని ఎపీఓ జ్యోతిశ్రీని ఆదేశించారు. పలువురు ఫీల్డు అసిస్టెంట్లు చేసిన తప్పిదాలు బయటకు రావడంతో వారి నుంచి రూ.48 వేలు వరకు రికవరీ చేయాలని ఆదేశించారు. పెరుమాళ్లపల్లికి చెందిన ఫీల్డు అసిస్టెంట్ పుష్పవల్లి పని చేయలేకుంటే ఆమె చేత రాజీనామా తీసుకుని వేరొకరికి అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ విడుదల మాదవరెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, ఏపీడీ రెడ్డెప్ప, డీఆర్డీఓ ప్రభావతి, ఎస్ఆర్పీ లోకేష్, ఎపీఓలు జ్యోతిశ్రీ, మమత, టెక్నికల్ అసిస్టెంట్ హరి పాల్గొన్నారు. -
పాదయాత్రకు పోలీసు నిర్భందం
చంద్రగిరి : శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై చంద్రగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు నుంచి త్వరగా బయటకు రావాలని, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసులు మంగళవారం శ్రీవారిమెట్టు వద్ద అడ్డుకున్నారు. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు వెళ్తున్న వారిని అక్రమంగా అడ్డుకోవడంతో పాటు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అభిమానులను ఈడ్చుకొంటూ స్టేషన్కు తరలించారు. దీంతో తిరుమలకు వెళ్తున్న భక్తులు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు 4 గంటల పాటు స్టేషన్లో.. పాదయాత్ర చేస్తున్న హరిప్రసాద్ రెడ్డితో పాటు సుమారు 17 మందిని చంద్రగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు స్టేషన్కు తరలించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు పోలీసు స్టేషన్లోనే అక్రమంగా నిర్భంధించారు. హరిప్రసాద్ రెడ్డిను అరెస్టు చేశారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీగా పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. చంద్రగిరి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు అరాచక పాలన సుమారు 4 గంటల పాటు పోలీసు స్టేషన్లో నిర్భంధించిన నేతలను పోలీసులు సొంత పూచీకత్తుపై రాత్రి విడుదల చేశారు. తిరుమల పాదయాత్రలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేసి, విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. టీటీడీ చైర్మన్ ఆదేశాలతోనే అక్రమంగా అరెస్టు చేశారంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ ఆరోపించారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ఏమిటంటూ మండిపడ్డారు. తిరుమలకు వెళ్లాలంటే కూటమి ప్రభుత్వంలో పాస్పోర్టు, వీసా కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రగిరిలో ఉద్రిక్తత..! మీడియాపై డీఎస్పీ చిందులు వైఎస్సార్సీపీ శ్రేణుల అక్రమ అరెస్టు తెలుసుకున్న జర్నలిస్టులు పోలీసు స్టేషన్కు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు స్టేషన్లోకి ఎలా వస్తారంటూ చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ చిందులు వేశారు. జర్నలిస్టుగా వచ్చామని, అరెస్టుకు సంబంధించి వివరాలు తెలపాలని కోరడంతో ఆయన ఆంక్షల పేరుతో చిందులు వేయడంపై పాత్రికేయులు మండిపడ్డారు. -
రక్షణ కరువు
ఎన్ఆర్ఐల భూములకేసాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి ప్రభుత్వంలో ఎన్ఆర్ఐలకు చెందిన భూములు, స్థలాలకు రక్షణ కరువైందని డాక్టర్ సునీత ఆరోపించారు. ఆక్రమించిన భూముల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆధారాలతో బయటపెట్టారు. తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఆర్ఐకి చెందిన డాక్టర్ సునీత మాట్లాడుతూ.. 2003లో తిరుపతి నగర పరిధిలోని కై కాల చెరువు వద్ద వేసిన ప్రగతి నగర్ వెంచర్లో సర్వే నంబర్1లో కోట్ల రూపాయలు విలువ చేసే ఏడు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు అందుకు సంబంధించిన పత్రాలను విలేకరుల ముందు బయటపెట్టారు. తాము కొనుగోలు చేసిన కొంత కాలం తరువాత ఈ ప్లాట్లు తమవే నంటూ టీడీపీ నేత, బాలాజీ టింబర్ డిపో అధినేత కంచి రాము ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారని వెల్లడించారు. ప్లాట్లకు దారి లేకుండా ప్రహరీ గోడ, తాత్కాలిక షెడ్లు నిర్మించాడని వివరించారు. ఆ తరువాత సర్వే నంబర్ 1/1బి పేరుతో రికార్డులు సృష్టించుకున్నట్లు ఆరోపించారు. ఆ సర్వే నంబర్లను రద్దు చేశారని, ఆ తరువాత రోడ్ల కోసం వదిలిన స్థలాల పేరుతో రూ.60 కోట్లు విలువచేసే టీడీఆర్ బాండ్లు తీసుకున్నట్లు తెలిపారు. టీడీపీ నేత రాము సృష్టించిన సర్వే నంబర్ బోగస్ అని రెవెన్యూ అధికారులే చెబుతున్నారన్నారు. గతంలో జేసీగా పనిచేసిన బాలాజీ సైతం ఆ భూమి తమకు చెందినదేనని జడ్జిమెంట్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. తమ ప్లాట్లు ఆక్రమించాడని గత ఏడాది తిరుపతి ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమలను బెదిరిస్తూ భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియాకు చెందిన సునీతకు అన్యాయం జరిగిందని సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పినా ఇంత వరకు న్యాయం జరగలేదని ఆమె ఆరోపించారు. ఎన్ఆర్ఐలకు చెందిన భూములకు రక్షణ కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగల్బాలు పలికినా.. ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన స్థలంతో పాటు పరిసర ప్రాంతంలోని అనేక మంది టీడీపీ నేతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. అయినా ప్రభుత్వం అతడిపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
AP: మాకు ఉచితం లేదా
తిరుపతి అర్బన్: తిరుపతి బస్టాండ్ నుంచి ఉచిత బస్సులు సరిపడా లేకపోడంతో ప్రయాణికులు గంట నుంచి రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. పల్లెవెలుగు, ఆల్ట్రాపల్లె వెలుగు, సాధారణ ఎక్స్ప్రెస్ల్లో ఉచిత ప్రయాణానికి అవకాశముండడంతో మహిళలు వీటికే మొగ్గుచూపుతున్నారు. 54 నుంచి 56 సీట్లు ఉన్న ఆ మూడు సర్వీసుల్లో 70 మందికి పైగానే ఎక్కేస్తున్నారు. దీంతో సీట్ల కోసం పలువురు పోటీ పడుతున్నారు. కిటికీల్లో నుంచి సీట్ల కోసం బస్సులోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు అత్యవసరం అయితే తప్ప రెండు వారాలు పాటు సెలవులు పెట్టడానికి వీలు లేదని జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అలాగే సెలవుల్లో ఉన్న ఉద్యోగులు సైతం డ్యూటీలకు రావాలని స్పష్టం చేశారు. మొత్తంగా ఆర్టీసీ అధికారులు ఉచిత బస్సులపైనే ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తుంది.మాకు ఉచితం లేదా ఆధార్ కార్డులు లేకపోతే ఉచిత ప్రయాణం కుదరదని మా ముగ్గురి వద్ద రూ.100 చొప్పున కండక్టర్ రూ.300 రూపాయలు టికెట్ కొట్టారు. స్మార్ట్ ఫోన్లులో ఉన్న ఆధార్ కార్డులను చూపినప్పటికీ ఇవి చెల్లవంటూ బస్ కండక్టర్ టికెట్ కొట్టి చేతిలో పెట్టారు. – సరయు, తన్మయి, లహరి, ఇంజినీరింగ్ విద్యార్థులు విద్యార్థినులకు చేదు అనుభవందొరవారిసత్రం : సీ్త్రశక్తి పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఆ వెసులుబాటును కొన్ని సర్వీసులకు మాత్రమే పరిమితం చేసింది. అలాగే పలు నిబంధనలను సైతం విధించింది. ఈ క్రమంలోనే సోమవారం నాయుడుపేట నుంచి తిరుపతికి వెళ్లే గూడూరు డిపోకు చెందిన (ఏపీ40జెడ్0479) ఎక్స్ప్రెస్ బస్సులో విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. ఇంజినీరింగ్ చదివే విద్యార్థినులు బస్సు ఎక్కిన తర్వాత స్మార్ట్ ఫోన్లలో ఆధార్ కార్డులను చూపినప్పటికీ కండక్టర్ ససేమిరా అన్నారు. ఒరిజినల్ ఆధార్ చూపిస్తేనే ఉచితమని కండక్టర్ చెప్పడంతో ఆ విద్యార్థులు విధిలేని పరిస్థితిలో టికెట్లు తీసుకోకతప్పలేదు.ఫోన్లో చూపినా చాలురాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఉత్తర్వులు వచ్చేవరకు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే మహిళా ప్రయాణికులు చేతిలో ఆధార్ ఉన్నా లేకపోయి సెల్ఫోన్లో చూపి ప్రయాణం చేయొచ్చు. అన్ని డిపోల్లోని కండక్టర్లకు దీనిపై అవగాహన కల్పించాం.– జగదీష్, ఆర్టీసీ ఆర్ఎం, తిరుపతి -
నన్ను గౌరవించండి.. నేను సత్యవేడు ఎమ్మెల్యేని
తిరుపతి అర్బన్: ‘నేను ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఎన్నికైన సత్యవేడు ఎమ్మెల్యేని. నన్ను అధికారులు గౌరవించాలి. ముందుగా ప్రొటోకాల్ పాటించడం నేర్చుకోవాలి’ అంటూ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లో సాధారణ అర్జీదారుడిలా ఓ అర్జీలో తన సమస్యలను రాసి కలెక్టర్కు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఏదైనా ఓ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత.. మళ్లీ తమ పార్టీకి చెందిన నాయకులే ప్రారంభోత్సవం చేయడం బాధగా ఉందని వాపోయారు. అలాగే ప్రైవేటు కార్యక్రమాలకు మండలానికి చెందిన నేతలు వెళితే.. వారికి అధికారులు ప్రొటోకాల్ పాటించడం సరికాదన్నారు. తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని వాపోయారు. వర్గాలుగా చీలిపోయి పనిచేయడం ద్వారా నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. -
తొలగింపుపై తిరుగుబాటు!
తిరుపతి సిటీ : ఎస్వీయూలో అధికారుల అత్యుత్సాహంతో వీధినపడిన 43 మంది తాత్కాలిక అధ్యాపకుల విషయంలో ఈసీ మెంబర్లు పునరాలోచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పాలకమండలి సభ్యులు ఒక్కొక్కరూ తమ తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. సుమారు 15ఏళ్ల నుంచి 20ఏళ్ల పాటు వర్సిటీకి సేవలందించిన అకడమిక్ కన్సల్టెంట్లను ఫెర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించిన వర్సిటీ అధికారులు ఒక్కో ఈసీ మెంబర్పై ఒత్తిడి తెచ్చి ఆమోదపు పత్రాలను తెప్పించుకున్నారు. నిబంధనల ప్రకారం ఈసీ మీటింగ్ నిర్వహించి తాత్కాలిక అధ్యాపకుల ఇంటర్వ్యూల నిర్వహణపైన, తొలగింపు ప్రక్రియపైనా ఈసీ ఆమోదం పొందాల్సి ఉంది. వర్సిటీ అధికారులు చాకచక్యంగా వారిని మభ్యపెట్టి తొలగింపు ప్రక్రియపై పూర్తి వివరాలను అందించకుండా ఈసీ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా అర్హులైన అధ్యాపకులను సైతం రోడ్డున పడేశారు. అవగాహన లేకనే...ఆమోదం తెలిపా... ఎస్వీయూలో 43 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించడం బాధాకరమని, ఈ మేరకు తాను సమ్మతి తెలుపుతూ పంపిన లేఖను ఉపసంహరించుకుంటున్నానని పాలకమండలి సభ్యులు వి.జ్యోతి తెలిపారు. సోమవారం ఈ మేరకు వీసీ అప్పారావుకు వినతిప్రతం సమర్పించారు. తాను అవగాహన లోపంతో ఆమోదం తెలపానని పేర్కొన్నారు. అధికారులు తక్షణం పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
అక్రమ అరెస్ట్లతో అణగదొక్కలేరు
భాకరాపేట : అక్రమంగా అరెస్ట్ చేసి వైఎస్సార్సీపీ నేతలను అణగదొక్కలేరని, పెద్దిరెడ్డి కుటుంబీకులను భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్కు నిరసనగా, పెద్దిరెడ్డి కుటుంబానికి సంఘీభావంగా సోమవారం పీలేరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన ఆత్మసంతృప్తి కోసమే మిథున్రెడ్డిని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సహదేవ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. దశాబ్దాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోలేక ఆయన కుమారుడిని అరెస్ట్ చేసి కుంగదీయాలనుకోవడం హాస్యాస్పదమని తెలిపారు. ఈ వేధింపులకు పెద్దిరెడ్డి ఏమాత్రం భయపడరని, మరింత ఉత్సాహంగా పనిచేస్తారని వెల్లడించారు. మందుల విక్రయానికి ప్రత్యేక రిజిస్టర్ చిల్లకూరు : మెడికల్ షాపు యజమానులు మందుల విక్రయానికి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని, ప్రధానంగా వైద్యులు సూచించిన మత్తు ఇచ్చే మెడిసిన్ల వివరాలను నమోదు చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ శాంతి ఆదేశించారు. సోమవారం గూడూరులోని సీఆర్రెడ్డి కల్యాణ మండపంలో మందుల షాపుల యజమానులు, ఏరియా ఆస్పత్రి వైద్యులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మందు షాపుల యజమానులు మత్తు కలిగించే వాటిని కొనుగోలు చేసే సమయంలో పక్కాగా రశీదులు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైద్యులు రమేష్, ఎస్ఐ షాజహాన్, మందుల షాపు యజమానుల సంఘం అధ్యక్షుడు బత్తిన సుధాకర్, కార్యదర్శి సుభాన్ పాల్గొన్నారు. దాడి కేసులో ఒకరి అరెస్ట్ చిల్లకూరు : మండలంలోని మోమిడిలో ఈ నెల 7వ తేదీన జరిగిన దాడి కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో మత్స్యకారులకు , ఓ ముస్లిం కుటుంబానికి బోట్ల విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో 8 మంది తమపై దాడి చేశారని ముస్లింలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏడో నిందితుడు వేమారెడ్డి కుమారస్వామిరెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. జర్మనీ భాషపై ఉచిత శిక్షణ తిరుపతి అర్బన్ : ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీ భాషపై ఉచితంగా ఆఫ్లైన్లో శిక్షణ ఇస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర కులాల వారికి ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 6 నెలల క్లినికల్ అనుభవం, జీఎన్ఎం నర్సింగ్ పూర్తి చేసి 2 ఏళ్ల క్లినికల్ అనుభవం గల 35ఏళ్లలోపువారు అర్హులని చెప్పారు.ఆసక్తిగలవారు ఈ నెల 21వ తేదీలోపు పేర్లునమోదు చేయించుకోవాలని కోరారు. ఈనెల 22 నుంచి తొలి బ్యాచ్ ప్రారంభిస్తారని పేర్కొన్నా రు. బైరాగిపట్టెడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో శిక్షణ ఉంటుందన్నారు. వివరాలకు 9160912690 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
● మా పొట్టలు కొట్టొద్దు
‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ మా పొట్టలు కొట్టడం న్యాయమేనా’ అంటూ చిట్టమూరు మండలంలో సోమవారం ఆటోడ్రైవర్లు నిరసన తెలిపారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో సోమవారం ఆటోడ్రైవర్లు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ పల్లె వెలుగు బస్సులను ప్రవేశ పెట్టారని, దీనివల్ల పల్లెల్లో ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే ఆటోవాలాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. గత ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లకు ఏడాది రూ.10 వేలు ఇచ్చేవారని, ప్రస్తుతం అది కూడా లేకపోవడంతో తమ బతుకులు దుర్భరంగా మారాయని వాపోయారు. ప్రభుత్వం ఆటో వాలాలపై దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. – చిట్టమూరు -
కలెక్టర్ గారూ.. పద్మగిరిని కాపాడండి!
తిరుపతి రూరల్: మండలంలోని తనపల్లెకు ఆనుకుని ఉన్న పద్మగిరి కొండను కాపాడండి సార్.. కలెక్టర్ గారూ.. అంటూ ఆలయ కమిటీ సభ్యులు విజయసింహారెడ్డి కుమారుడు హేమంత్కుమార్రెడ్డి వినతిపత్రం అందించారు. సోమవారం కలెక్టర్ను కలసిన ఆయన ఈ నెల 16వ తేదీన శ్ఙ్రీగుట్టుగా గుట్టమీద పాగా!శ్రీశ్రీఅన్న శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. పద్మగిరిని చెరబట్టారని పలు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణల వల్ల కోట్లు ఖర్చు పెట్టి కొండపైకి నిర్మించిన రహదారి కుంగిపోయే ప్రమాదముందని వివరించారు. ఆ మేరకు స్పందించిన కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి రూరల్ తహసీల్దారుకు రెండు సార్లు ఫోన్ చేయగా ఆయన ఫోన్ పనిచేయలేదు.. దీంతో వీళ్లు పనిచేయరు.. వీళ్ల ఫోను పనిచేయదు.. అంటూ అసహనం వ్యక్తం చేస్తూ సదరు అర్జీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సంతకం చేశారు. ఆ కాపీని తహసీల్దారును కలసి అందజేయాలని అర్జీదారు హేమంత్కుమార్రెడ్డికి కలెక్టర్ సూచించడంతో ఆయన తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కార్యాలయంలో తహసీల్దారు రామాంజులు నాయక్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. -
పింఛన్ తొలగించారు
తిరుపతిలోని కర్నాల వీధిలో నివాసిస్తున్నా. పూర్తిగా దివ్యాంగురాలిని. ఒక్క అడుగు కూడా పెట్టలేను. గతంలో 75శాతం వైకల్యంతో సదరం సర్టిఫికెట్ ఇచ్చా రు. ఇప్పుడు 40శాతానికి కుదించారు. దీంతో సచివాలయ సిబ్బంది నన్ను పింఛన్ జాబితా నుంచి తొలగించారు. నాకు తల్లిదండ్రులు లేరు. కేవలం పింఛన్ సొమ్ముతోనే జీవిస్తున్నా. మళ్లీ నాకు పింఛన్ ఇప్పించాలని కోరుతున్నా. – కుప్పచ్చి అరుణ, తిరుపతి పొట్టకొడుతున్నారు నాకు చెవుడు, మరుగుజ్జుని కావడంతో వివాహం కాలేదు. ఒంటరి మహిళను. సుమారు పదేళ్లుగా పింఛన్ డబ్బులతోనే బతుకుతున్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నా పొట్టకొడుతున్నారు. సెప్టెంబర్ నుంచి పింఛన్ ఇవ్వమని సచివాలయ ఉద్యోగులు నోటీసు ఇచ్చారు. ఏం చేయాలో తెలియడం లేదు. మాలాంటి వారితో ప్రభుత్వం ఆడుకోవడం సరికాదు. మాకు న్యాయం చేయండి. – సుబ్బమ్మ, వేముగుంటపాళెం, నాయుడుపేట మండలం కనికరం చూపండి నాకు ఒక కన్ను పూర్తిగా పోయింది. ఇంకోటి సరి గా కనపడదు. అంధురాలిగా అష్టకష్టాలు పడుతు న్నా.2010 నుంచి దివ్యాంగ పింఛన్ ఇస్తున్నారు. ఆ డబ్బులతోనే బతుకుతున్నా. ఇప్పుడు నా పింఛన తొలగిస్తున్నట్లు సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. నా భర్త కస్తూరయ్య ఆరోగ్యం సరిగా లేదు. ఈ పరిస్థితుల్లో పింఛన్ తొలగిస్తే మేం బతికేదెట్టాగో కూడా తెలియడం లేదు. కనికరం చూపండి అని అధికారులను వేడుకున్నా. – సాని కోటమ్మ, మడిపల్లం, నాయుడుపేట -
అంధకారంలో విద్యారంగం
తిరుపతి రూరల్:కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం అంధకారంలోకి వెళ్లిపోయిందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆరోపించారు. విద్యార్థి సంఘాల అణచివేతకు ప్రభుత్వం జారీ చేసిన జీఓలకు వ్యతిరేకంగా సోమవారం ఎస్వీయూ ప్రధాన ద్వారం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. హర్షిత్రెడ్డి మాట్లాడుతూ అక్రమ జీఓలను ఉపసంహరించుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి సంఘాలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందన్నారు. విద్య రంగంపై ఏ మాత్రం అవగాహనలేని నారా లోకేష్కు ఆ శాఖ అప్పగించడంతోనే ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థి సంఘాలపై నిషేధం విధించిన మంత్రి నారా లోకేష్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీఓ ప్రతులను చించివేసి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి వల్లం రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి, నేతలు చెంగల్రెడ్డి, యశ్వంత్రెడ్డి, రఫీ, ప్రదీప్, భానుప్రకాష్రెడ్డి, వినోద్, రాజేంద్ర, నరేష్, మునిరాజ, ప్రేమ్కుమార్, హరినాథ్, పార్థసారధి, యుగంధర్, సుధాకర్, ముని, ప్రభు, శేషరెడ్డి, వెంకట్ రమణ నాయక్, వీర నాగేంద్ర, హరిబాబు, నవీన్రెడ్డి, దినేష్కుమార్ పాల్గొన్నారు. -
జంతు పరిరక్షణ అందరి బాధ్యత
తిరుపతి మంగళం : శేషాచల జీవవైవిధ్య అభయారణ్యంలో అంతరించిపోతున్న మూషిక జింక, బంగారు బల్లి, దేవాంగ పిల్లి, రంగుల ఉడుత, పసుపు గొంతు పిగిలి పిట్ట వంటి అరుదైన జంతు జాతుల పరిరక్షణ అందరి బాధ్యతని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో తెలిపాలని ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించారు. సోమవారం ఆయన పార్లమెంటులో మాట్లాడారు. వన్యప్రాణుల రక్షణ, వేటగాళ్ల నిరోధం, ప్రజల భాగస్వామ్యం వంటి చర్యల కోసం నిధులు కేటాయిస్తున్నారా? అని ప్రశ్నించారు.కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానమిస్తూ ‘వన్యప్రాణుల నివాసాల అభివృద్ధి’ పథకం కింద రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. రూ.121.63 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలం సింహాచలకండ్రిగలో 125 ఎకరాల రక్షిత అటవీ భూమిని టీడీపీ ప్రజాప్రతినిధి స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షిత అటవీ భూములను కాపాడడం సంబంధిత అధికారుల బాధ్యతని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
ఎస్వీయూ జోనల్ స్థాయి పోటీలు ప్రారంభం
తిరుపతి సిటీ: నేషనల్ స్పోర్ట్స్ డేని పురస్కరించుకుని సోమవారం ఎస్వీయూ తారకరామా స్టేడియంలో జోనల్ స్థాయి పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. సుమారు 8 జిల్లాల నుంచి విచ్చేసిన 1700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు ఈ నెల 29న జరిగే స్పోర్ట్స్ డే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నగదు, ప్రశంసాపత్రాలు, పతకాలు అందించనున్నట్లు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి పాఠశాలలో ఆటస్థలాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.30 వేల నిధులు పాఠశాలలకు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, డీఎస్డీఓలు శశిధర్, బాలాజీ, ఉదయ్, రాజు, జగన్, పెద్ద సంఖ్యలో కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.టీటీడీ ఉద్యోగి ఇంట్లో చోరీ తిరుపతి క్రైమ్ : తిరుపతిలోని బైరాగిపట్టెడలో పద్మావతి పార్క్ ఎదురుగా టీటీడీ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగిన ఘటన సోమవారం వెలుగుచూసింది. క్రైమ్ సీఐ ప్రకాష్ కథనం మేరకు.. టీటీడీలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఈనెల 14వ తేదీన సొంత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. సోమవారం వేకువజామున తిరిగి ఇంటికి వచ్చారు. మెయిన్ గేటు, తలుపులు పగులగొట్టి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో 207 గ్రాముల బంగారం, 460 గ్రాముల వెండి అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. పాత నేరస్తులే చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని, దర్యాప్తు కొనసాగుతోందని సీఐ వెల్లడించారు.క్రీడల్లో విద్యార్థుల ప్రతిభగూడూరురూరల్ : సౌత్జోన్ ఆర్చరీ పోటీల్లో లిటిల్ ఏంజెల్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి కె.చరిత్ ప్రతిభను కనబరచినట్లు కరస్పాండెంట్ బి.శ్రీకాంత్రెడ్డి సోమవారం తెలిపారు. అలాగే ఆదివారం ఒంగోలులో నిర్వహించిన ఆలిండియా కరాటే ఓపెన్ చాంపియన్ షిప్లో గూడూరులోని సాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు మోక్షిత్, గృశ్నేశ్వర్ ద్వితీయ పొందినట్లు హెచ్ఎం దయాకర్ తెలిపారు. -
ఆలస్యంగా వస్తూ!
అలసత్వం వహిస్తూ..● కలెక్టరేట్లో 10గంటలకు గ్రీవెన్స్ ● 12 గంటలకు వచ్చిన అధికారులు ● అర్జీదారులను పట్టించుకోని సిబ్బంది తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. కలెక్టర్ హాజరైతే ఒక లెక్క.. ఆయన లేకుంటే ఒక లెక్క అన్నట్లు వ్యహరిస్తున్నారు. తలకోన సిద్ధేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు ఆలస్యంగా వచ్చారు. ఇదే అదునుగా ఉన్నతాధికారులు సైతం వినతుల స్వీకరణకు నింపాదిగా తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు గ్రీవెన్స్ మొదలైతే మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అయితే 12.15 గంటలకు కలెక్టర్ వచ్చేసరికి మాత్రం జిల్లా అధికారులందరూ హాజరుకావడం గమనార్హం. కలెక్టర్ లేరని అధికారులు ఆలస్యంగా రావడంపై అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా కనీస వసతులు సైతం కల్పించకుండా కలెక్టరేట్ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని వాపోయారు. దాహంతో అలమటిస్తున్నప్పటికీ తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినతుల వెల్లువ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 238 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రతి వినతిని నిశితంగా పరిశీలించి, పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్ పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 72 అర్జీలు తిరుపతి క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 72 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్న్రాజు తెలిపారు. ఆయా అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
కానిస్టేబుల్కు రివార్డు
తిరుపతి క్రైమ్ : తిరుమలలో ఈ నెల 15వ తేదీన గుండెపోటుకు గురైన శ్రీనివాస్(60) అనే భక్తుడికి సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ గుర్రప్పకు ఎస్పీ హర్షవర్ధన్రాజు సోమవారం రివార్డు అందించారు. గుర్రప్ప స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవాభావంతో నడుచుకోవాలని ఎస్పీ సూచించారు.పింఛన్ల తొలగింపుపై ఆందోళన కలువాయి(సైదాపురం) : పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసుల అందిన నేపథ్యంలో పలువురు దివ్యాంగులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలో దాదాపు 92 మందికి పింఛన్ల నిలిపివేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పక్షవాతంతో మంచాన పడిన వారికి సైతం పెన్షన్ తీసివేయడంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మాత్రం కనికరం కూడా లేకుండా దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు తగు న్యాయం చేయాలని కోరారు.మీసేవ నిర్వాహకుడిపై విచారణకలువాయి(సైదాపురం): అక్రమంగా నగదు వసూళ్లకు పాల్పడుతున్న కలువాయి మీసేవ కేంద్రం నిర్వాహకుడు వెంకటరత్నంపై డీఎల్పీఓ రమణయ్య సోమవారం విచారణ చేపట్టారు. 1బీ అండగల్, పాస్బుక్ అప్లై చేసేందుకు అధిక మొత్తంలో నగదు తీసుకున్నాడని విశ్రాంత ఉపాధ్యాయుడు కాకివాయి గోపాల్రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు డీఎల్పీఓ రమణయ్య వెల్లడించారు.270 ఆటోలకు జరిమానాతిరుపతి క్రైమ్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ నెల 12వ తేదీ నుంచి చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో 270 ఆటోలకు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ ఆచారి తెలిపారు. సోమవారం సైతం తనిఖీలు నిర్వహించామని, ఇప్పటి వరకు 27 ఆటోలను సీజ్ చేశామని వెల్లడించారు. డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
21న గూడూరులో జాబ్మేళా
తిరుపతి అర్బన్ : జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన గూడూరు డీఆర్డబ్ల్యూ డిగ్రీ కళాశాలలోజాబ్ మేళా నిర్వహించనున్నారు. సోమవారం కలెక్టరేట్లో ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ పోస్టర్ ఆవిష్కరించారు. 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సుల పూర్తి చేసిన మేళాకు అర్హులుగా పేర్కొన్నారు. 20వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అదనపు సమాచారం కోసం 9985056929, 8639835953,9988853335 నంబర్లను సంప్రదించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 20న ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. -
వేద సదృశ్యం.. ఆగమశాస్త్రం
తిరుపతి సిటీ : సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవి వేదాలని, వాటి సదృశ్యాలే ఆగమ శాస్త్రాలని మైలాపురం సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.అరుణసుందరం తెలిపారు. సంస్కృత వర్సిటీలో నిర్వహిస్తున్న చతురాగమ జాతీయ సదస్సుకు సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అరుణసుందరం మాట్లాడుతూ వేదాలు భారతీయ సంస్కృతికి దర్పణాలని చెప్పారు. వైఖానస, పాంచారాత్ర, శైవ, తంత్రసార ఆగమాలు వేద సదృశ్యాలేనని వివరించారు. ఆగమోక్త అంశాలపై పరిశోధనలు చేపట్టాలని కోరారు. అనంతరం వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆగమశాస్త్ర సంరక్షణ,, గ్రంథాల ముద్రణకు వర్సిటీ కృషి చేస్తోందన్నారు. త్వరలోనే ఆగమ ప్రదర్శనశాల ఏర్పాటు చేయనున్నట్లు, ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. టీటీడీ ఎస్వీ వేదపాఠశాల ప్రిన్సిపల్ కుప్పా శివ సుబ్రమణ్య అవధాని, ఆగమ విభాగ అధ్యక్షుడు విష్ణుభట్టాచార్యులు, డీన్ రజనీకాంత్ శుక్లా పాల్గొన్నారు. ఘాట్లో టీటీడీ ఈఓ తనిఖీలుతిరుమల:తిరుమల రెండో ఘాట్ రోడ్డులో టీటీడీ ఈఓ శ్యామలారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అవసరమైన చోట మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్డులో తగినంత సిబ్బందిని నియమించి తరచూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని హెల్త్ విభాగం అధికారులకు సూచించారు. పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం తిరుపతి క్రైమ్ : విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు సంబంధించి వారి కుటుంబాలకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. అందులో హెడ్ కానిస్టేబుల్ కామరాజు సతీమణి లక్ష్మి, కానిస్టేబుల్ అశోక్ తండ్రి గోపాల్కు చెక్కులను పంపిణీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హెడ్కానిస్టేబుల్ రోశయ్యకు వెల్ఫేర్ ఫండ్ కింద రూ.లక్ష వడ్డీ లేని రుణం మంజూరు చేశారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ కాంప్లెక్స్లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. వర్షం పడుతున్నా భక్తులు లెక్కచేయకుండా శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. శ్రీవారి దర్శనాన్ని ముగించుకొని బయటకు వస్తున్న భక్తులు పరుగులు తీస్తూ చలవ పందిళ్ల కిందకు చేరుకున్నారు. వర్షం కారణంగా తిరుమలలోని కొన్ని దుకాణాలు మూతపడ్డాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 87,759 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా 42,043 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి హుండీ రూపంలో రూ.4.16 కోట్ల ఆదాయం వచి్చంది. -
తిరుపతిలో చిక్కిన మరో చిరుత.. మూడు నెలలకు ప్లాన్ సక్సెస్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో మరో చిరుత బోనులో చిక్కింది. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. ఈరోజు ఉదయం చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అనంతరం, చిరుతను సమీపంలోని ఎస్వీ జూ పార్కుకు తరలించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే, చిరుతలు సంచారం ఎక్కువగా ఉండటంతో ఫారెస్ట్ అధికారులు ఎస్వీ యూనివర్సీటీ వద్ద మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఇక, మూడు నెలలుగా చిరత.. అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. బోనలో చిక్కకుండా తరచుగా అక్కడ కనిపించడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. మరోవైపు.. అక్కడ మరిన్ని చిరుతలు ఉన్నాయన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి.. సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు. -
జూనియర్ ఎన్టీఆర్పై వ్యాఖ్యలు అనుచితం
నగరి/చిల్లకూరు : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ చిన్నచూపే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను ఆపాలనుకోవడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపినట్టే అవుతుందని రోజా వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని, ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. సినిమా బాగుంటే ఎవరూ అడ్డుకోలేరని, బాగోలేకపోతే ఎవరూ దాన్ని ఆడించలేరని స్పష్టం చేశారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాతో నిరూపితమైందన్నారు. టీడీపీ–జనసేన ఎమ్మెల్యేలు తలకిందులుగా తపస్సు చేసి, టికెట్లు ఫ్రీగా ఇచ్చినా కూడా హరిహర వీరమల్లు సినిమాను ఆడించలేకపోయారని గుర్తుచేశారు. సినిమా ఫంక్షన్లల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, సవాళ్లు చేయడం వంటివి జరిగితే గేమ్ ఛేంజర్ గానీ, హరిహరవీరమల్లు లాంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్లారా చూశామన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడని, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడని, ఆయన అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంటున్న విషయం మనం చూస్తున్నామన్నారు. -
కాళంగి కన్నీరు!
● నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ● నిర్మాణంలోని ఇళ్ల ముందు డంపింగ్ ● ట్రాక్టర్లతో తమిళనాడుకు తరలింపు సూళ్లూరుపేట రూరల్ : కూటమి నేతల అధికారం అండతో రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా ఇసుక స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. ఇందుకోసం కాళంగి నదిని కన్నీరు పెట్టిస్తున్నారు. యంత్రాల సాయంతో ఇష్టారాజ్యంగా తవ్వేసి ఇసుకను సమీప గ్రామాల్లో నిర్మిస్తున్న ఇళ్ల ముందు డంప్ చేసుకుంటున్నారు. రాత్రివేళల్లో ట్రాక్ట ర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. డిమాండ్ అధికం తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల్లో విస్తరించిన కాళంగి నదిలో నాణ్యమైన ఇసుక ఉంది. దీనికి ఇతర ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉంది. ఇది గుర్తించిన ఇసుకాసురులు నదిని తోడేస్తున్నారు. ప్రధానంగా ఇలుపూరు గ్రామం వద్ద నది పొర్లు కట్టను తవ్వి దారి ఏర్పాటు చేసుకుని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రోజూ వందలాది ట్రాక్టర్లతో.. ఇలుపూరు గ్రామం నుంచి రోజూ వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా సరిహద్దులు దాటించి తమిళనాడుకు చేరుస్తున్నారు. దర్జాగా ఇసుక ట్రాక్టర్లును హైవేపైనే వెళుతుండడం గమనార్హం. కళ్ల ఎదుటే ఇసుక ట్రాక్టర్లు వెళుతున్నా హైవే పెట్రోలింగ్ సిబ్బంది సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం కొసమెరుపు. -
తక్షణమే రోడ్డు నిర్మించాలి
నాగలాపురం–చిన్న పాండూరు రోడ్డు దుస్థితిని మాటల్లో చెప్పలేం. రాకపోకలకు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. తక్షణమే రోడ్డు నిర్మించాలి. ఈ మేరకు ప్రభుత్వం చొరవ చూపాలి. – దానివేలు, బీరకుప్పం నిధులు మంజూరు చేయాలి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకోసం అధికారులు కృషి చేయాలి. – ఈశ్వర్, కడివేడు లారీల తాకిడికి ధ్వంసం చిన్నపాండూరుకు వెళ్లే రోడ్డు పొడవునా బావులను తలపించే గుంతలు ఉన్నాయి. ప్రధానంగా చమర్తకండ్రిగ వరకు కంకర లారీల తాకిడికి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – మురళీరెడ్డి, సిద్ధాపురం ●వరదయ్యపాళెం : సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం నుంచి టీపీకోట మీదుగా చిన్న పాండూరుకు వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వానంగా మారింది. కఈ మార్గంలో పలుచోట్ల మట్టి రోడ్డుగా దర్శనమిస్తోంది. ఒకప్పుడు తారురోడ్డుగా ఉన్న ఈ ప్రాంతం పూర్తిగా రూపురేఖలు కోల్పోయింది. దీంతో ప్రజలు రాకపోకలకు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమే. రోడ్డు పొడవునా బావులను తలపించేలా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో బస్సులు, కార్లు, లారీలు సైతం ఆ మార్గంలో వెళ్లడం కష్టతరంగా మారింది. ఇక ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి దుస్థితిలో సుమారు 20 గ్రామాలకు పైగా ప్రజల రాకపోకలకు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. రూ. 71కోట్లతో ప్రతిపాదనలు నాగలాపురం–చిన్న పాండూరు రోడ్డుఅభివద్ధి కోసం రూ. 71కోట్లతో ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలను భుత్వానికి నివేదించారు. అయితే నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం గమనార్హం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 19 కిలోమీటర్ల మేర రోడ్డు అభివద్ధి కోసం రూ. 49కోట్లు మంజూరు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంచాన వ్యయం పెంచి రూ. 71కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పాదిరికుప్పం వద్ద .. మట్టి రోడ్డును తలపిస్తూ.. -
అయోమయం
దయనీయం.. తిరుపతి సిటీ : విశ్వవిద్యాలయాల్లోని తాత్కాలిక అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉద్యోగ భద్రతలేని అయోమయంలో కొట్టుమిట్టాడే దుస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే వర్సిటీ అధికారుల నిరంకుశ ధోరణపై నోరు మెదపలేని పరిస్థితి. వాస్తవానికి విద్యార్థులు, పరిశోధకులకు తోడ్పాటు అందిస్తోంది తాత్కాలిక అధ్యాపకులే. అయినా వారిని ఉన్నత విద్యామండలి, వర్సిటీల అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. డిసిగ్నేషన్ ఏదీ..? తాత్కాలిక అధ్యాపకులకు డెసిగ్నేషన్ కూడా లేదు. పక్క రాష్ట్రాల్లో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తాత్కాలిక అధ్యాపకులకు ‘అసిస్టెంట్ ప్రొఫెసర్‘ హోదా కల్పించారు. మన రాష్ట్రంలో మాత్రం వారిని మూడు నెలలకు ఒకసారి కాంట్రాక్టులు రెన్యువల్ చేస్తూ, వేతనాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. వర్సిటీలలోఅన్యాయాలపై ఎవరు గళం విప్పినా వేతనాలు నిలిపివేస్తారు. ప్రతి మూడు నెలలకు ఉద్యోగం ఉంటుందో లేదో అనే ఆందోళన వల్ల బోధన, పరిశోధన సక్రమంగా చేయలేక అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. శాశ్వత అధ్యాపకుల నియామకాలు లేనట్టేనా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి నిరుద్యోగులకు శఠగోపం పెట్టేసింది. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి, రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం వందల సంఖ్యలో వర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల నియామకాలు చేపట్టేందుకు కూటమి ప్రయత్నం మొగ్గు చూపకపోవడం దారుణమని విద్యార్థులు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి చొరవ చూపాలి తాత్కాలిక అధ్యాపకులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా హోదా కల్పించాలి. ఈ విషయంపై ఉన్నత విద్యామండలి చొరవ చూపాలి. వర్సిటీ అధికారులతో చర్చించి వారికి డిసిగ్నేషన్ కల్పించే ప్రయత్నం చేయాలి. శాశ్వత అధ్యాపకుల నియామకాలకు ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. తొలగించిన అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. – విద్యార్థి సంఘాల నేతలు, ఎస్వీయూ వీధిన పడేయడం దారుణం తాత్కాలిక అధ్యాపకుల పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తాయారవుతోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగం ఉంటుందో.. పోతుందో అనే భయంతో జీవిస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పెర్ఫార్మెన్స్ రివ్యూ‘ పేరుతో అనేకమందిని తొలగించారు. ఏళ్ల తరబడి సేవలందించిన అధ్యాపకులను సైతం వీధుల్లో పడేశారు. -
నేటి నుంచి విద్యారంగ సమస్యలపై నిరసనలు
తిరుపతి సిటీ : జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు విద్యారంగ సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తీర్మానించింది. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, భగత్ రవి మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల లేకపోవడం సిగ్గుచేటన్నారు. వసతి గృహాల్లో పిల్లలు వసతులులేక ఇబ్బందిపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యారంగంలో విప్లవం తీసుకువస్తామని మంత్రి లోకేష్ చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.6,400కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచేలా విద్యార్థులు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, వినోద్, తేజ, సభ్యులు శ్రీనివాస్, రవీంద్ర పాల్గొన్నారు. -
లోకేష్ మెప్పు పొందేందుకే ..
అహంకారతో ఎమ్మెల్యేలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం వల్ల లోకేష్ మెప్పు పొందవచ్చని అనుకుంటున్నారు. గతంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావును అనరాని మాటలు అన్న రోజులు నేటికీ కూడా ప్రతి ఒక్కరికీ గుర్తున్నాయి. ఇప్పుడు కూడా అదే బాటలో టీడీపీ ఎమ్మెల్యేలు పయనిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ను రాయలేని భాషలో తిట్టడం శోచనీయం. కూటమి ప్రభుత్వం అధికారం చేట్టిన తర్వాత అహంకారంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ను ఇలా అనరాని మాటలు అనడం సరైన పద్ధతి కాదు. – మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ -
ఆధ్యాత్మికత దిశగా పల్లెసీమలు
పుంగనూరు: ప్రతి గ్రామంలోనూ రామాలయాలు, గంగమ్మ ఆలయాలు నిర్మించి, ఆధ్యాత్మికత వైపు పల్లెలు పయనిస్తుండడం అభినందనీయమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం మండలంలోని బాగేపల్లె గ్రామంలో గ్రామస్తులు నిర్మిస్తున్న నూతన గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్దిరెడ్డికి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో సరదాగా గడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భక్తిమార్గంలో పయనిస్తున్నారని కొనియాడారు. గంగమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు పండి ప్రజలంతా అభివృద్ధి చెందాలని కోరారు. ఎంపీపీ అక్కిసాని భాస్క ర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామమోహన్రెడ్డి, రాజారెడ్డి, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పచ్చమూక ఆక్రమణల పర్వంలో మచ్చుకు కొన్ని..
సాక్షి టాస్క్ఫోర్స్ : గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, స్థలాలపై టీడీపీ నేతలు కన్నేశారు. ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమించుకుంటున్నారు. అనంతరం సదరు భూములు పదేళ్లుగా తమ అనుభవంలో ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి రెగ్యులరైజ్ చేయించుకుంటున్నారు. నివాస స్థలాలకు అనువుగా ఉండే భూములే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. అందులో ఏర్పేడు మండల శ్రీనివాసపురం రెవెన్యూ పరిధిలో ఆక్రమణకు గురైన గ్రామ కంఠం భూమి ఒకటి. సర్వే నంబర్ 327లో 10.30 ఎకరాల గ్రామం కంఠం భూములు ఉన్నాయి. ఏర్పేడు– వెంకటగిరి రహదారికి సమీపంలో ఉండడం, గ్రామం పక్కనే ఐజర్ వంటి కేంద్రీయ విద్యా సంస్థలు ఉండడంతో ఆ భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్పుకుని తిరిగే వ్యక్తి ఒకరు శ్రీనివాసపురం పరిధిలోని గ్రామం కంఠం భూములపై కన్నేశాడు. ముందస్తుగా జంగాలపల్లె–శ్రీకాళహస్తికి వెళ్లే మార్గంలోని శివగిరిపల్లె వద్ద ఉన్న విలువైన రెండెకరాల భూమిని ఆక్రమించుకున్నాడు. గ్రామస్తులు నోరెత్తకుండా ఉండేందుకు కొందరితో రాయబారాలు గ్రామానికి రూ.2 కోట్లు ముట్టజెబుతామని ప్రలోభపెట్టాడు. అధికారం ప్రయోగంతో గ్రామస్తులను ఒప్పించాడు. గ్రామ కంఠం భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని, ఎవరూ అడ్డుకోకూడదని, అభ్యంతరం చెప్పకూడదని అల్టిమేటం జారీ చేశాడు. ముందుగా రెండెకరాలను ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టేశాడు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రెండెకరాల విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పద్మగిరి వద్ద తన స్థలంలోకి దారి కోసం టీడీపీ నేత ధ్వంసం చేసిన ప్రహరీ గోడఅడిగేదెవరు? ఆపేదెవరు? -
డీఎస్సీ ఆశలు ఢమాల్!
జిల్లా సమాచారం బయాలజీ, సోషియల్లో డీఎస్సీ రాసిన అభ్యర్థులు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టుల సంఖ్య 63 స్కూల్ అసిస్టెంట్ సోషియల్ సబ్జెక్ట్ పోస్టుల సంఖ్య 130 బయాలజీ సబ్జెక్ట్తో పరీక్షలకు హాజరైన అభ్యర్థులు 3,450 సోషియల్ సబ్జెక్ట్తో పరీక్షలకు హాజరైన అభ్యర్థులు 6,955డీఎస్పీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ నిరాశనే మిగులుస్తోంది. రాత్రింబవళ్లు చదివినా రిక్త హస్తమే ఎదురవుతోంది. కష్టపడి పరీక్ష రాసినా ఫలితం శూన్యంగానే మారుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన నార్మలైజేషన్ విధానం అభ్యర్థుల ఆశలను తారుమారు చేస్తోంది. ప్రధానంగా బయాలజీ.. సోషియల్ సబ్జెక్టులను ఎంచుకున్నవారికే అధికంగా నష్టం జరుగుతోంది. అందులోనూ ఆన్లైన్ ఎగ్జామ్ తొలి సెషన్కు హాజరైన వారే బాధితులుగా మారే దుస్థితి దాపురించింది. అందరికీ సమన్యాయం చేయాలి రెండవ షిఫ్ట్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీషు, ఉర్దూ, తమిళ, ఒడిశా, కన్నడ మీడియం అభ్యర్థులు కలిసి పరీక్షలకు హాజరయ్యారని, వారందరినీ కలిపి నార్మలైజేషన్ చేయడం వలన ఉదయం షిఫ్ట్లో పరీక్షలు రాసిన వారికి తీవ్ర అన్యాయం జరుగిందన్నారు. జిల్లాలో పదుల సంఖ్యలో మాత్రమే బయాలజీ పోస్టులు ఉన్నందున్న ప్రతిభ గల అభ్యర్థులు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషియల్ విభాగంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు సైతం ఇదే సమస్య ఎదుర్కొంటున్నట్లు సమాచారం. వెంటనే ప్రభుత్వం నార్మలైజేషన్ విషయంలో రెండు షిఫ్ట్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితాలను సవరిస్తే ప్రతిభ గల అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవుతారని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. -
డీఎస్సీ అభ్యర్థులకు శాపం
డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు నార్మలైజేషన్ రూపంలో పెద్ద గండం ఎదురైంది. నార్మలైజేషన్తో ఉదయం షిఫ్ట్లో పరీక్ష రాసిన వారికి ప్రశ్నపత్రం సులువుగా, రెండవ షిఫ్ట్లో పరీక్షలు రాసిన వారికి కష్టంగాను రావడంతో ప్రతిభను కొలవలేం. – సుధాకర్రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు, తిరుపతి ఆన్లైన్ విధానంతోనే తిప్పలు ఆఫ్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణ జరిపి ఉండాల్సింది. ప్రస్తుతం నార్మలైజేషన్ ప్రక్రియలో విద్యార్థుల మార్కల గణనలో తేడాలు రావడంతో అయోమయం నెలకొంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పరిగణలోనికి తీసుకోవాలి. – సావిత్రమ్మ, ప్రైవేటు విద్యాసంస్థ అధ్యాపకురాలు, తిరుపతి అందరికీ న్యాయం చేయాలి డీఎస్సీ అభ్యర్థులు ఎన్నో ఏళ్లు గా కష్టపడి పరీక్షలు రాశా రు. మార్కుల గణనలో నార్మలైజేషన్ ప్రక్రియతో చాలా మంది ప్రతిభగల అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక షిఫ్ట్లో పరీక్షలు రాసినవారే ఎక్కువ మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. పరిశీలించి అందరికీ న్యాయం చేయాలి. – సుదర్శన్ రావు, విశ్రాంత అధ్యాపకులు, తిరుపతి -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ కాంప్లెక్స్లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. వర్షం పడుతున్నా భక్తులు లెక్కచేయకుండా శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు ఎప్పకప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది.శ్రీవారి దర్శనాన్ని ముగించుకొని బయటకు వస్తున్న భక్తులు పరుగులు తీస్తూ చలవ పందిళ్లకు కిందకు చేరుకుంటున్నారు. వర్షం కారణంగా తిరుమలలోని కొన్ని దుకాణాలు మూతపడ్డాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 87,759 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా 42,043 మంది తలనీలాలు సమరి్పంచారు. స్వామి వారికి హుండీ రూపంలో రూ.4.16 కోట్ల ఆదాయం వచ్చింది. -
తిరుమల వెళ్లే భక్తుడి బ్యాగులో తాబేలు..ఆరా తీస్తే..!
తిరుమల: తరుమల కొండపైకి వెళ్లే భక్తులను తనిఖీలు చేయడమనేది సర్వసాధారణం. ఇలా ఒక భక్తుడ్ని తనిఖీ చేస్తే అతని బ్యాగులో తాబేలు కనిపించింది. ఇది అక్కడ తనిఖీ చేసే సిబ్బందికి కూడా కొత్తగానే అనిపించింది. తాబేలు ఏంటి.. బ్యాగులో ఎందుకు తీసుకెళుతున్నావ్ అని సదరు భక్తుడిని అడిగితే దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది. తనకు దారిలో దొరికిందని, బ్యాగులో వేసుకున్నానని బదులిచ్చాడు. ఏమైనా విలువైన వస్తువులు దొరికితే దాన్ని దాచుకుంటారు.మరి మనోడు తాబేలను బ్యాగులో వేసుకున్నానంటూ చెప్పిన సమాధానంతో అక్కడ సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. సర్లే అనుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. ఆ తాబేలును ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. అసలు తాబేలు కనిపిస్తే బ్యాగులో వేసుకున్నానంటూ అతను చెప్పిన సమాధానం చూస్తే నవ్వొస్తుంది కదూ.. ఇది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద చోటు చేసుకున్న ఘటన. తనిఖీలు చేస్తున్న క్రమంలో తాబేలు వ్యవహారం వెలుగుచూసింది. తాబేళును స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు -
AP: ఇలా ఉంటే పింఛన్ వెరిఫికేషన్ అవసరమా..?
కాణిపాకం: పుట్టుకతోనే పక్షవాతం. మంచానికే పరిమితం. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఆ యువకుడిపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. జాలి, దయ లేకుండా పింఛన్ తొలగించేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు.. బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన సమ్మద్, సాహిన్ దంపతులు దినసరి కూలీలు. వీళ్లకు సొంత ఇల్లు లేదు. సెంటు జాగా లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ దంపతులకు ఇంటి స్థలం మంజూరు చేశారు. వీరి పెద్ద కుమారుడు హర్షద్ పుట్టుకతోనే పక్షవాతానికి గురయ్యాడు. పక్షవాతం నుంచి రక్షించేందుకు 19 సవరాల బంగారాన్ని అమ్మేశారు. అయినా కుమారున్ని పక్షవాతం నుంచి కాపాడలేకపోయారు. మందులు, మాత్రలతోనే ప్రాణంతో నిలబెడుతున్నారు. నెలవారీగా రూ.7,500 ఖర్చువుతోంది. 20 ఏళ్లు దాటినా అతని ఆలనాపాలన మొత్తం తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. ఇప్పుడు అతనికి చూపు కూడా మందగించింది. ఈ దుస్థితిని గుర్తించి వైద్యులు 2013లో సదరన్ సర్టిఫికెట్ జారీచేశారు. అప్పటినుంచి పింఛన్ మంజూరవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్ల పరిశీలన చేపట్టారు. ఈ పరిశీలనలో భాగంగా ఐదుగురు అధికారులు బృందంగా ఇంటివద్దకు వచ్చి వికలత్వం 40శాతం కంటే తక్కువగా ఉందని నోటీసు ఇచ్చారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు బోరుమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మనిషి ఎముకల గూడు మాదిరి ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది. అతని పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనక మానరు ఎవరైనా.. మరి ఇలా ఉన్న మనిషికి సర్టిఫికేట్.. దానికి వెరిఫికేషన్ అంటూ పింఛన్ పెండింగ్లో పెట్టడం ఎంతవరకూ కరెక్ట్ అనేది సదరు అధికారులకే తెలియాలని విమర్శకులు అంటున్నారు. తనను చూస్తే జాలేయడం లేదా?అనేది మాత్రమే అతని చూపుల్లో కనిపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
జూ.ఎన్టీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. ఆర్కే రోజా రియాక్షన్
సాక్షి, తిరుపతి: జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమా, రాజకీయాలు మిక్స్ చేయెద్దంటూ ఆమె హితవు పలికారు. అరచేతితో సూర్యుడ్ని ఆపలేరన్నారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొన్నా.. అభిమానులు పవన్ సినిమాకు రాలేదంటూ రోజా వ్యాఖ్యానించారు.ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్త్రీశక్తి పేరుతో మహిళలను దగా చేశారని ఆమె మండిపడ్డారు. 16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారంటూ రోజా దుయ్యబట్టారు. 14 నెలలు తర్వాత స్తీశక్తి బస్సు ప్రారంభించారు. లోకల్గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సులకు అమలు చేశారు’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.‘‘రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి.. ఇవాళ ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కోతలు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. తిరుమల, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం పుణ్య క్షేత్రాలకు ఉచిత దర్శనం లేదు. భగవంతుడు పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. మహిళల్ని మోసం చేశారు. పల్లె వెలుగు బస్సుల్లోనే పంపిస్తామని ఎన్నికలు ముందు మీరు చెప్పారు. మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు...కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. సూపర్ సిక్స్.. హిట్ కాదు.. సూపర్ ప్లాప్. తిరుపతి నుంచి తిరుమలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు. శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ గుడి, సింహాచలానికి ఉచిత ప్రయాణం లేదు. ఆడబిడ్డ నిధి.. 18 ఏళ్లు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డ లేరు కాబట్టి.. చంద్రబాబుకు ఆడవాళ్లను గౌరవించడం తెలీదు. కానీ, పవన్ కళ్యాణ్కు ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్నించాలి.జగనన్న ఆడబిడ్డలకు చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసమే.. అబద్ధాలు చెప్పారు. మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలో బాగుపడింది లేదు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటూ చెప్పి చంద్రబాబు మోసం చేశాడు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆర్ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
తిరుపతి సిటీ : రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్లో 2026 విద్యా సంవత్సరానికి గాను 8వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాద్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో 7వ తేదీ డిసెంబర్లో ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు 2వతేదీ జూలై 2013 నుంచి 01 జనవరి 2015 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులు అని, ప్రవేశ పరీక్ష విధానం, దరఖాస్తులు వంటి సమాచారం కోసం 9399976999/ 8688888802/03 ఫోన్ నంబర్లలో గాని వరదరాజనగర్ లోని విశ్వం సైనిక్ అండ్ మిలిటరీ పోటీ పరీక్షల సమాచార కేంద్రంను సంప్రదించాలని సూచించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శిగా గంగాధర్ యాదవ్ తిరుపతి అన్నమయ్య సర్కిల్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన నల్లబోయిన గంగాధర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదల చేశారు. తిరుమల ఘాట్లో ప్రమాదం తిరుమల : తిరుమల డౌన్ ఘట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. స్కూటర్పై వస్తున్న ఇద్దరు మహిళల్లో, ఒకరికి ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి వాహనదారులు స్పందించి వారిని తిరుపతి స్విమ్స్కు తరలించారు. గాయపడిన మహిళ టీటిడీ ఉద్యోగి సతీమణిగా గుర్తించారు. బంగారు కమ్మల మేళా – తిరుపతి ఎగ్జిబిషన్ సేల్ నేటితో ముగింపు తిరుపతి అర్బన్ : తిరుపతి నగరం రామానుజు సర్కిల్ సమీపంలోని ఏకాంత బ్లిస్లో శనివారం బంగారు కమ్మల మేళాను శ్రీకాళహస్తికి చెందిన మాధురీ గోల్డ్ షాపు వారు నిర్వహించారు. ఆదివారంతో ఈ మేళా కార్యక్రమాన్ని ముగించనున్నారు. బంగారు కమ్మల మేళాలో వందకుపైగా మోడల్స్ను ప్రదర్శించారు. అందర్నీ ఆకట్టుకునేలా మేళాలో వివిధ మోడల్స్ను చూపడంతో పలువురు ఆకర్షితులయ్యారు. ప్రతి గ్రామంపై 501 తగ్గింపు ప్రకటించడంతో ఆదరణ లభించిందని మాధురీ గోల్డ్ ప్రొపరైటర్ సునీల్కుమార్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పోరాటయోధుడు గౌతు లచ్చన్న
తిరుపతి అర్బన్ : పోరాట యోధుడు గౌతు లచ్చన్నగా కలెక్టర్ వెంకటేశ్వర్ కీర్తించారు. శనివారం కలెక్టరేట్లో విప్లవ నాయకుడు ‘ డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పనిచేశారని కొనియాడారు. స్ఫూర్తిదాయక జీవితం, అందరికి ఆదర్శమని, వారి త్యాగాలను మరవకుండా తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల చంగయ్య, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోత్స్న, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి గురుస్వామి శెట్టి, కలెక్టరేట్ కార్యాలయ ఏవో రమేష్ బాబు, తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నాగరాజు, సంఘం నాయకులు కిరణ్, వెంకట మణిబాబు, మనుశేఖర్,మల్లికార్జున, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో వేడుకలు తిరుపతి క్రైం : నిస్వార్థ రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా నిర్వహించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గౌతు లచ్చన్న తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. నిజాయతీ పరుడైన రాజకీయ నాయకుడని అందుకే పలుమార్లు లోకసభకు ఎన్నికయ్యారన్నారు. -
నాల్గోసారీ!
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాట్లాడుతున్న జెడ్పీ ౖచైర్మన్ శ్రీనివాసులు, జేసీ విద్యాదరి పక్కన సీఈఓ రవికుమార్నాయుడు చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా సాగింది. శనివారం జెడ్పీ 4వ సర్వసభ్య సమావేశం చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన, సీఈఓ రవికుమార్నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. జేసీ విద్యాదరి హాజరయ్యారు. ఇక సత్యవేడు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆదిమూలం, మురళీమోహన్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మినహా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కాలేదు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభించగా మధ్యాహ్నం 1.30కు ముగించేశారు. అజెండాలో 11 అంశాలపై చర్చ జరపాల్సి ఉండగా.. తూతూమంత్రంగా కానిచ్చేశారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి పలు శాఖల అధికారులు హాజరు కాలేదు. సభ్యుడు కానీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాజన్ సమావేశానికి హాజరవ్వడం గమనార్హం. 50 ఏళ్లుగా ఇలాంటి పాలన చూడలేదు ప్రజాప్రతినిధులంటే దిష్టిబొమ్మల్లా అధికారులకు కనపడుతున్నట్టు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి పిచ్చి తుగ్లక్ పాలన చూడలేదని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో తన చేతులమీదుగా ఇచ్చిన చెక్ను మరోసారి కార్యక్రమం పెట్టి ఇంకొకరి చేతుల మీదుగా వ్యవసాయశాఖాధికారులు ఇప్పించారన్నారు. ప్రొటోకాల్ పాటించని అధికారుల పై స్పీకర్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. గత పాలనలో రోడ్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో బాగా జరిగాయన్నారు. ప్రస్తుతం 36 రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వాపోయారు. ఆర్అండ్బీ బైపాస్ రోడ్డు మంజూరైనా పనులు చేయలేదని, సీకేపొడి, నాగలాపురం– శ్రీసిటీ, నాగలాపురం–టీపీకోట రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. చాలా రోడ్లపై కనీసం ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కేవీపురం మండలం, ఎగవ పూడిబ్రిడ్జి, నారాయణవనంలోని తంబూరు, పాలమంగళం బ్రిడ్జిలు దెబ్బతిన్నాయన్నారు. నాగలాపురం–సురటపల్లెకు వెళ్లే మార్గంలో మూడు కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉందన్నారు. జెడ్పీ గెస్ట్హౌస్లో కనీసం ఫర్నిచర్ కూడా లేదన్నారు. 108 వాహనాలు లేవు పలు ప్రభుత్వాస్పత్రుల్లో 102, 104, 108 వాహనాలు అందుబాటులో లేవని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఆరోపించారు. అత్యవసర కేసులను సమీపంలో ఉండే నెట్వర్క్ ఆస్పత్రులకు పంపాలన్నారు. సమస్యలు ఏకరువు -
మద్యం అక్రమ కేసులో వ్యక్తి అరెస్టు
శ్రీకాళహస్తి : అక్రమంగా మద్యం విక్రయిస్తున్న తులకనం హిమకిషోర్ (30)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ లావణ్య తెలిపారు. పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధికి చెందిన హిమకిషోర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే మార్గంలోని అయ్యలనాడు చెరువు కట్టపై అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ లావణ్య చెప్పారు. పెట్రోల్ బంకులో తనిఖీలు తిరుపతి క్రైమ్ : తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరిముల్లా ఆదేశాల మేరకు శనివారం తిరుపతి నగరంలోని అక్కారంపల్లి సర్కిల్ సమీపంలోని వెంకటసాయి ఫిల్లింగ్ స్టేషన్ను తనిఖీ చేశారు. వారితో పాటు సివిల్ సప్లయి డీటీ గంగయ్య, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఉన్నారు. అయితే ఫిల్లింగ్ స్టేషన్లోని 7 పంపుల్లో రెండు నాజల్స్లో కొలతల అంశంలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ మేరకు రెండు నాజల్స్ను సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. డిస్టెన్స్లో ఆ కోర్సులకు మంగళం! తిరుపతి సిటీ : ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న దూరవిద్య, సార్వత్రిక విద్యా కేంద్రాలలో పలు కోర్సులకు ప్రవేశాలు చేపట్టరాదని యూజీసీ ఆదేశించినట్లు తెలుస్తోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో సిఫార్సుల మేరకు త్వరలో ఆయా వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేయనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే సంబంధిత కోర్సులపై నిషేధం విధించనుంది. ఇందులో ప్రధానంగా సైకాలజీ, మైక్రో బయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ సైన్స్, బయో టెక్నాలజీ, క్లినికల్ న్యూట్రీషియన్ వంటి ఆరోగ్య సంరక్షణ కోర్సులను దూర విద్య ద్వారా అందించరాదని నిషేధం విధించనుంది. -
గోకులాష్టమి ఆస్థానం
నారాయణవనం: స్థానిక పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో నిత్యపూజా కార్యక్రమాలు పూర్తి చేసి, దూప, దీప నైవేద్యాలను సమర్పించారు. సాయంత్రం ఆస్థాన మండపంలో బాలగోలుడిని పీఠంపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ బాలగోపాలుడికి ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్థాన మండపాన్ని నేతి దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్యులు మాట్లాడుతూ ఆదివారం ఆలయంలో గోకులాష్టమి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం శ్రీకృష్ణుడి మాడవీధి ఊరేగింపు, సాయంత్రం సన్నిధి వీధిలో ఊట్లోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను!
రేణిగుంట : విమానాశ్రయం సమీపంలోని ప్రైవేట్ కార్పొరేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేల మంది కార్మికులు కార్పొరేట్ సంస్థ చేతుల్లో కీలుబొమ్మలుగా మారి విలవిలలాడుతున్నారు. చదువుకొని ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులు పరిశ్రమలు పెట్టే నిబంధనలను గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పుకుంటూ అగ్రిమెంట్లపై సంతకాలు చేసి ఉద్యోగాల్లో చేరుతున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న పరిశ్రమలు ఏజెన్సీలతో కుమ్మకై ్క తాము ఇచ్చిందే జీతం, పెట్టిందే భోజనం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ బాధలు పడలేక రెండు రోజుల క్రితం రెండు పరిశ్రమలోని సుమారు 1500 మంది పైగా రెండు విడుతలుగా పరిశ్రమ ముందు కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. వారికి రెండు రోజుల్లో సమస్యలను పరిష్కారం చూపుతామని నచ్చజెప్పారు. కానీ అక్కడే పరిశ్రమ వారి ఈగో హర్ట్ అయింది.. కార్మికులకు కొత్త నిబంధనలు పెట్టి వేధింపులు మొదలుపెట్టారు. పోలీస్ క్లియరెన్స్ కావాలంటూ మెలిక ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రస్తుతం నూతనంగా చేరుతున్నట్లు అప్లికేషన్ రాసి పోలీస్ క్లియరెనన్స్ , హెల్త్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు జత చేసి ఇవ్వాలంటూ పరిశ్రమల యాజమాన్యం మెలిక పెట్టింది. ఇప్పటికే పనిచేస్తున్నా మళ్లీ ఇవన్నీ ఎందుకని ప్రశ్నించిన కార్మికులను ఇలా ఇస్తే ఇవ్వండి లేదా మీ ఇష్టం అంటూ పరిశ్రమ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఏజెన్సీల శ్రమ దోపిడీ బాగా చదువుకొని ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న యువతీ, యువకులు ఏజెన్సీల మత్తులో పడుతున్నారు. ఏజెన్సీల ద్వారా ప్రైవేట్ పరిశ్రమల్లో చేరుతున్న కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 30 రోజులపాటు శ్రమించి జీతం నాటికి ఎంత వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియక కార్మికులు మదన పడుతున్నారు. పరిశ్రమ వారిని అడిగితే ఏజెన్సీని అడగమని ఏజెన్సీ వారిని అడిగితే పరిశ్రమ వారిని అడగమని చెబుతూ కాలయాపన చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. లేబర్ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఏజెన్సీల ద్వారా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. కార్మికుల సమస్యలపై సీఐటీయూ నాయకులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టర్ల నుంచి కార్మికులకు రక్షణ కల్పించండి అంటూ కరపత్రాలను ప్రచురించి కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఆడికృత్తిక ఉత్సవాలకు సారె
● ఆనందగిరి, పద్మగిరి క్షేత్రాలకు పట్టువస్త్రాలు ● చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి సమర్పణ తిరుపతి రూరల్ : ఆడికృత్తిక మహోత్సవాలను పురస్కరించుకుని పాకాల, తిరుపతి రూరల్ మండలాల్లో సుబ్రమణ్యస్వామి ఆలయాలకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుటుంబీకులు సారెను సమర్పించారు. ఏటా ఆడికృత్తిక ఉత్సవాలకు సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమలతో సారెను తీసుకువెళ్లి సమర్పించారు. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి సారెను తీసుకువెళ్లగా వారి వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు. ముందుగా పాకాల మండలం ఊట్లవారిపల్లి వద్దనున్న ఆనందగిరి శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలను అందించారు. పద్మగిరి కొండపై పూర్ణకుంభ స్వాగతం పద్మగిరిపై వెలసిన బాలజ్ఞాన దండాయుధపాణి ఆలయానికి పట్టు వస్త్రాలను తుడా మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజక వర్గం ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్రెడ్డి అందజేశారు. ఆలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శనానంతరం వేద పండితుల ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తిరుపతి రూరల్ మండలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
టెండర్లో బెదిరింపులు
తిరుపతిలోని హథీరాంజీ మఠం అధికారికి టీడీపీకి చెందిన పెద్దబ్బగా పిలుచుకునే నాయకుడు వార్నింగ్ ఇచ్చాబడు. తమ అనుమతి లేకుండా గుత్తేదారులు భవనం కూల్చడానికి వీల్లేదంటూ తీవ్ర స్ధాయిలో హెచ్చరించినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● మఠం అధికారికి టీడీపీ నేత వార్నింగ్ ● హథీరాంజీ మఠం భవనం కూల్చివేతకు ముగిసిన టెండర్ ప్రక్రియ ● టెండర్ దక్కించుకున్న పుత్తూరు పైనీర్ స్టిల్స్ తిరుపతి అన్నమయ్య సర్కిల్ :తిరుపతి గాంధీ రోడ్డులో శిథిలావస్థకు చేరిన హథీరాం బావాజీకి చెందిన మఠం భవనం కూల్చివేతకు సంబంధించిన టెండర్ల స్వీకరణ ప్రక్రియ శనివారం నిర్వహించారు. ఎండోమెంట్ కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్ నోటీసులతో మఠం పరిపాలనాధికారి బాపిరెడ్డి కూల్చివేత ప్రక్రియకు సంబంధించి టెండర్ల ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, పుత్తూరు, తిరుపతి వివిధ ప్రాంతాలకు సంబంధించి ఆన్లైన్లో బిడ్ దాఖలు చేసిన ఐదుగురితో పాటుగా 27 మంది ఆఫ్లైన్లో మొత్తం కలిపి 32 మంది ఈ టెండర్ నిర్వహణలో పాల్గొన్నారు. మఠం భవనం కూల్చివేసే సమయంలో అక్కడి మెటీరియల్కు సంబంధించి నిర్వహించిన టెండర్ ప్రక్రియలో మొదటగా ఆన్లైన్లో రూ.37 లక్షల రూపాయలకు బిడ్ దాఖలు కావడంతో, మఠం అధికారులు రూ.37 లక్షల నుంచి వేలం పాటను ప్రారంభించగా పుత్తూరుకు సంబంధించిన పైనీర్ స్టిల్స్ వారు రూ.97 లక్షలా20 వేల రూపాయలకు హెచ్చు పాటను నమోదు చేశారు. అలాగే భవనం కూల్చివేతకు సంబంధించి నిర్వహించిన వేలం పాటలో రూ.లక్షా 50 వేల రూపాయలను హెచ్చు పాటగా నమోదు చేయడంతో వీరికి రెండు టెండర్లను ఇస్తున్నట్లుగా మఠం అధికారులు ప్రకటించారు. రీటెండర్ నిర్వహించాలి శ్రీ స్వామి హథీరాంజీ మఠం మండువా భవనం కూల్చివేతకు సంబంధించి శనివారం జరిగిన టెండర్ ప్రక్రియ వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా జరిగిందని రాజమండ్రికి చెందిన గుత్తేదారు నూర్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐఐటీ నివేదిక ప్రకారం మఠం మండువా భవనం ప్రాంతంలో ఎక్కడ నుంచి ఎక్కడి వరకు కూల్చివేతలు నిర్వహిస్తారనే అంశంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా టెండర్లు నిర్వహించడం సమంజసం కాదన్నారు. జిల్లా కలెక్టర్ ఈ టెండర్ ప్రక్రియలో జోక్యం చేసుకొని రిటెండరింగ్ నిర్వహిస్తే మరింతగా వేలంపాట నగదు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపించారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని కలెక్టర్ మఠం భవనం కూల్చివేతకు సంబంధించి రీటెండరింగ్కు చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసన నినాదాలు.. దుకాణదారులు మఠం ప్రారంభ ద్వారం వద్ద మఠం అధికారుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కాగా దుకాదారులకు మద్దతుగా నిలిచిన టీడీపీ నాయకుడు మఠం అధికారిని ఉద్దేశించి తమ మాటను కాదని భవనం కూల్చివేతకు అడుగేస్తే ఎదురయ్యే శాంతి భద్రతలకు సమస్య కారణం అవుతారంటూ పరోక్షంగా చేసిన హెచ్చరికలు భయోందోళనలకు దారితీసినట్లయింది. -
టీడీపీ నేత జోక్యం
టెండర్ నిర్వహిస్తున్న సమయంలో మఠం ముందున్న దుకాణదారులు టీడీపీ నేతను రంగంలోకి దించారు. మరికొందరు రాజకీయ నాయకులతో కలిసి పరిపాలన అధికారి బాపిరెడ్డితో వాదించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దుకాణదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి టెండరు ప్రక్రియ నిర్వహించాలంటూ చేసిన హెచ్చరికలు టెండర్ ప్రక్రియకు హాజరైన వారిని ఆలోచనలో పడేశాయి. దీంతో తాము కట్టిన డబ్బులను మాకు తిరిగి ఇవ్వాలని అడిగారు. ఒకవేళ టెండర్ దక్కించుకున్న తర్వాత పనులు జరగనివ్వకుండా అడ్డుపడితే తాము కట్టిన డబ్బుకు, అప్పుడు ఎదురయ్యే పరిస్థితికి ఎవరు సమాధానం చెబుతారని భయాందోళన టెండర్ దారుల్లో వ్యక్తమైంది. పరిపాలన అధికారి బాపిరెడ్డి కలగజేసుకొని వారికి నచ్చజెప్పి టెండర్ ప్రక్రియను సజావుగా సాగేలా కృషి చేశారు. -
ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !
పరిశ్రమల్లో పనిచేస్తున్న వేల మంది కార్మికులు యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఒప్పుకొని విలవిల్లాడుతున్నారు.●ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025అమ్మా.. ఆగండి పసుపు రంగు ఉండే బస్సులనే చూసి ఎక్కండి.. అంటూ ఆర్టీసీ అధికారులు మహిళలకు సూచిస్తున్నారు. అదేంది..ఎన్నికల్లో ఏ బస్సు అయినా ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఉచితం అని చెప్పారు.. మరి ఈ కండీషన్లు ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొన్ని రూట్లలో బస్సులు లేకపోవడంతో తిరుపతి బస్టాండ్తో పాటు అన్ని మార్గాల్లోనూ ప్రయాణికులు అవస్థలు పడ్డారు. గంటల కొద్దీ బస్టాండ్లలో నిరీక్షించారు. జిరాక్స్ కాపీలు బస్సుల్లో అనుమతించకపోవడంతో మహిళలు పలుచోట్ల కండక్టర్లతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఉచిత ప్రయాణంపై అధికారులకే స్పష్టత లేకపోవడంపై కొంత సందిగ్ధం నెలకొంది. కొత్తగా 136 రూట్లలో ఆర్టీసీ అంటూ సిస్టమ్ పెట్టడంతో బస్సుల కొరతతో తిరుపతి బస్టాండ్లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులుఅధికారుల లెక్కలు ఇలా.. ఆర్టీసీ బస్సులు జిల్లా వ్యాప్తంగా నడుపుతున్న రూట్ల అంశంలో అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 11 డిపోల పరిధిలో 855 బస్సులు 177 రూట్లలో(మార్గాల్లో) నడుస్తున్నాయి. రోజుకు సుమారుగా 3.39 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. దీంతో రోజు వారీగా 2.70 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేయడంతో రూ.1.70 కోట్ల రాబడి వస్తుంది. అయితే 177 రూట్లలో 136 మార్గాల్లో ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. దీంతో ఇతర మార్గాల్లో బస్సులు లేకపోవడంతో తిరుపతి బస్టాండ్తో పాటు అన్ని మార్గాల్లోనూ ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. గంటల కొద్ది బస్టాండ్లలో వేచి ఉంటున్నారు. పడిగాపుల70 శాతం సీట్లు మహిళలకే చెప్పడం సరికాదు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సాధారణ ఎక్స్ప్రెస్ల్లో 70 శాతం సీట్లు మహిళలకు వదిలిపెట్టాలని చెప్పడం సరికాదు. మహిళలకు అయితే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పురుషులు అయితే టిక్కెట్ తీసుకుంటారు. అక్కడి వరకు ఓకే. అంతేతప్ప 70 శాతం సీట్లు వదిలిపెట్టాలని చెప్పడం మంచి పద్ధతి కాదని భావిస్తున్నాం. – అత్తిరాల సురేష్, వరదయ్యపాళెం అన్ని బస్సుల్లో అవకాశం ఇవ్వాలి ఆర్టీసీకి చెందిన అన్నీ బస్సుల్లో అవకాశం ఇవ్వా లని కోరుతున్నాం. ఎన్నికల సమయంలో ఇలా మూడు బస్సుల్లోనే ఉంటుందని చెప్పలేదు. అలా గే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అవకాశం కల్పించాలి. విజయవాడకు తిరుపతి మహిళలు వెళ్లాలంటే పల్లె వెలుగులో 10 బస్సులు మారాల్సి ఉంటుంది. నాలుగు రోజులు సమయం పడుతుంది. – యశోధ, తిరుపతి కొర్లగుంట ఒరిజనల్ కార్డులు చూపించాలి గుర్తింపు కార్డు విషయంలో ఒరిజనల్స్ కార్డులను కండక్టర్లకు చూపాల్సి ఉంది. శనివారం శ్రీకాళహస్తి, కాణిపాకం, రాయచోటి తదితర కొన్ని మార్గాల్లోనే ప్రయాణికులు బస్సుల కోసం కొంత సమయం వేచి ఉన్నారు. బస్సుల కొరత లేకుండా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. 33 శాతం సీట్లు మాత్రం పురుషులు కూర్చోడానికి వీలులేదు. కూర్చున్నా మహిళలు వస్తే లేయాల్సిందే. వాటికి మాత్రమే పసువు రంగు వేశాం. – జగదీష్, జిల్లా ప్రజా రవాణా అధికారితిరుపతి అర్బన్ : పసువు రంగు ఉండే సర్వీసుల్లోనే మహిళలకు ఉచితమంటున్నారు ఆర్టీసీ పెద్దలు. కాస్త చూసి ఎక్కండి అంటూ సలహాలు ఇచ్చేస్తున్నారు. కూటమి సర్కారు ప్రకటించిన పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సాధారణ ఎక్స్ప్రెస్లకు పసుపు రంగులు వేయించారు. మరోవైపు అనుమతి లేని సర్వీసులకు బస్సుపైన సీ్త్రశక్తి పథకం వర్తించదు అంటూ స్టిక్కర్లు వేయిస్తున్నారు. ఆ మేరకు స్టిక్కర్లు రెండు రోజుల్లో...ఉచిత బస్సుకు అనుమతులు లేని అన్నీ సర్వీసుల్లోపైన ఉండాలంటూ జిల్లా ఆర్టీసీ ఆధికారులు జిల్లాలలోని 11 డిపోల మేనేజర్లుకు ఆదేశాలు ఇచ్చేశారు. ఇంకోవైపు ఉచితం కోసం కేటాయించిన బస్సుల్లో 70 శాతం మహిళలకే అవకాశం ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పురుషులు మండిపడుతున్నారు. ఉచిత బస్సు స్కీమ్ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకు 2,826 మంది ఉచిత బస్సు పథకాన్ని మహిళలు వినియోగించుకున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు 1,70,894 మంది ప్రయాణికులు ఆర్టీసీలో జర్నీ చేసినట్లు ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఒక్కో రోజు ఒక్కో రూల్స్ పెడుతున్నారు. జిల్లా స్థాయిలోని ఆర్టీసీ అధికారులకు సీ్త్రశక్తి స్కీమ్పై స్పష్టత రావడం లేదు. ఒరిజనల్ గుర్తింపు కార్డులు చూపాలి.. ఆధార్, రేషన్, ఓటరు కార్డు ఇలా ఏదై నా ఒరిజనల్ కార్డును మహిళలు చూపిస్తేనే ఉచితంగా ప్రయాణం చేయడానికి అనుమతి ఇస్తామని కండక్టర్లు చెబుతున్నారు. దీంతో శనివారం పలు మార్గా ల్లో వివాదాలు చోటు చేసుకున్నాయి. బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణబస్టాండ్లలో ప్రయాణికుల నిరీక్షణ పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయండి ఏళ్ల తరబడి తిరుమలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. మాకు వచ్చే జీతాల్లో 50 శాతం బస్సు చార్జీలకే సరిపోతుంది. అయితే ఎన్నికల సమయంలో మహిళలకు ఉచితం అంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు తిరుమలకు లేదంటే...మేము చార్జీలు చెల్లించి తిరుమలకు వెళుతున్నాం. ఇది ఎక్కడ న్యాయమో చెప్పాలి. – సులోచన, పారిశుద్ధ్య కార్మికురాలు, తిరుపతి ప్రయాణికురాలు జిరాక్స్ పత్రాలకు అనుమతి ఇవ్వాలి ఆర్టీసీ అధికారులు పసుపు రంగు చూసి..బస్సు ఎక్క మని చెబుతున్నారు. గుర్తింపు కార్డులు ఒరిజనల్ కార్డు లు ఇవ్వాలని అడుగుతున్నా రు. మొబైల్స్ చూపినా, జిరా క్స్ ఇచ్చినా చెల్లవని చెప్పడం సరికాదు. ఒకసారి ప్రయాణానికే ఆధార్ కార్డును పోగొట్టుకుంటున్నారు. తర్వాత మళ్లీ ఆధార్కార్డు కోసం రూ.100 చెల్లించి తీసుకుంటున్నాం. పోన్లులో చూపించినా, జిరాక్స్లు చూపించినా అవకాశం కల్పించాలని కోరుతున్నాం. –చెంగయ్య, వాకాడు -
శ్రీవాణి టికెట్ల కేంద్రం వద్ద భక్తుల నిరసన
తిరుమల: తిరుమలో శ్రీవాణి టికెట్ల కోసం వచ్చిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆ ప్రభావం శ్రీవాణి టికెట్ల జారీపైనా పడింది. శనివారం తెల్లవారుజామున శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు భారీగా భక్తులు చేరుకోవడం.. టికెట్లను ముందుగానే జారీ చేయడంతో టికెట్లు దొరకని భక్తులు ఆందోళన చేపట్టారు. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు శుక్రవారం భారీగా భక్తులు చేరుకోవడంతో రాత్రి 11 గంటల నుంచి ముందుగా టోకెన్లను జారీ చేశారు.అప్పటికే భక్తుల రద్దీ మరింత పెరగడంతో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు శ్రీవాణి టికెట్లను భక్తులకు జారీచేశారు. అనంతరం శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు చేరుకున్న మిగిలిన భక్తులకు టికెట్లు లేవని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా తెల్లవారుజాము నుంచి ముందుగా వచ్చిన భక్తులకు టోకెన్లు జారీచేసి ఉదయం 10 గంటల నుంచి టికెట్లను జారీ చేస్తారు. భక్తుల రద్దీ నియంత్రించలేనంతగా ఉండటంతో ముందుగానే టికెట్లను జారీ చేశారు.అయితే శ్రీవాణి టికెట్ల కేంద్రం వద్ద టికెట్లు లేవని సిబ్బంది చెప్పడంతో కొందరు భక్తులు రోడ్డుపై కూర్చుని ఆందోళన చేపట్టారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు తిరుమలలో ఆందోళన చేయడం తగదని సూచించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ముందుగా టికెట్ల జారీ చేశామని తెలిపారు. భక్తుల సమస్యలపై ఫిర్యాదుచేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. దీంతో భక్తులు రద్దీ సమయంలో శ్రీవాణి దర్శన టికెట్లు కోటా పెంచి ఇవ్వాలని తిరుమల టూటౌన్ సీఐ శ్రీరాముడుకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భక్తులు ఆందోళనను విరమించారు. -
ఉచిత బస్సు.. అంతా తుస్సు.. జనసేన నేత ఆడియో సంభాషణ వైరల్
సాక్షి, ఏలూరు జిల్లా: ఉచిత బస్సు పథకంపై ప్రయాణికులు, కూటమి నేతల్లో అయోమయం నెలకొంది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాలలో నడిచే బస్సులలో ఏ బస్సులో ఫ్రీ టికెట్ ఉంటుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు ఫ్రీ టికెట్ లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.బోర్డర్ కొంచెం ఏపీలో, కొంచెం తెలంగాణలో ఉండడంతో అవి అంత ర్రాష్ట్ర సర్వీసులుగా గుర్తించారు. దాంతో వాటిలో ఫ్రీ లేదని అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు, మండలాలకు వెళ్లే సర్వీసులన్నీ.. తెలంగాణ నుంచే వెళ్లడంతో స్థానికల్లో అయోమయం ఏర్పడింది. జంగారెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదని జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎం తెలిపారు. జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎంతో జనసేన నాయకుడి ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అదే విధంగా అశ్వరావుపేట షటిల్ సర్వీస్ ఫ్రీ టికెట్ వర్తించదని డీఎం చెబుతున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం, తాడువాయి, దర్భ గూడెం జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం నెలకొంది. మరోవైపు, రాష్ట్ర వాప్తంగా మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీలు ఇచ్చిన కూటమి సర్కార్.. ఆచరణలో మాత్రం ఆంక్షలు పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి-తిరుమలకు వెళ్లే బస్సులో యాత్రికులకు షరతులు పెట్టారు. ఉచిత పథకం అమలు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. -
ఎమ్మెల్సీ మేరిగకు పరామర్శ
రాపూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ను పలువురు పరామర్శించారు. మురళీధర్ తండ్రి మేరిగ ఆనందరావు (89) గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాపూరులోని లక్ష్మీపురంలోని ఆయన నివాసంలో ఆనందరావు భౌతిక కాయాన్ని సందర్శించిన పలువురు నాయకులు మేరిగ మురళీధర్ను పలకరించి, సంతాపం తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ జోన్–4 వర్కింగ్ ప్రెసిడెండెంట్ కాకాణి పూజితమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు బత్తిన పట్టాభిరామిరెడ్డి, పాపకన్ను మధుసూదన్రెడ్డి, మండల కన్వీనర్ బోడ్డు మధుసూదన్రెడ్డి, దందోలు నారాయణరెడ్డి, మస్తాన్యాదవ్, వైఎస్సార్సీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్రెడ్డి తదితరులు శుక్రవారం ఆనందరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మేరిగ మురళీధర్ను పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. -
హరోంహర నామ స్మరణతో మార్మోగిన రామగిరి
నాగలాపురం : ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని పిచ్చాటూరు మండలం రామగిరి సుబ్రమణ్యస్వామి ఆలయ ప్రాంగణం హరోంహర నామస్మరణలతో మారుమోగింది. శ్రీవళ్లి,దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో భరణి తెప్పోత్సవాలు శుక్రవారం వేడుకగా ప్రారంభమయ్యాయి. స్వామివారి మూలవర్లకు అర్ఛకులు భరణి అభిషేకం చేసి, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని పుష్కరణిలో కావళ్లు చెల్లించి, స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం శ్రీ వళ్లి,దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం చేసి, విశేషాలంకరణ చేసి తిరుచ్చిపై కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లను ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేసి, తెప్పోత్సవం నిర్వహించారు. ఈ తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తజనం రాత్రంతా ఆలయ ప్రాంగణలో జాగారం చేశారు. భక్తుల కాలక్షేపం కోసం భక్త మార్కండేయ హరికథగానం చేశారు. భరణి అభిషేక ఉభయదారులుగా పళ్లికొండేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఏవీఎం బాలాజీరెడ్డి, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ ఈఓ ముత్తం శెట్టి రామచంద్రరావు ఏర్పాట్లు పర్యావేక్షించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పుత్తూరు డీఎస్పీ రవి కుమార్ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 130 మంది పోలీసు బందోబస్తులో పాల్గొన్నట్లు పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి నుంచి రాజనాలబండ జాతరచౌడేపల్లె : సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ లక్ష్మినరసింహస్వామి ,శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నేటి నుంచి రెండు రోజులపాటు వైభవంగా జాతర జరగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో సంప్రదాయ రీతిలో తిరుణాల జరగనుందన్నారు. ఏటా పూర్వీకుల నుంచి శ్రావణమాస చివరి శనివా రం రోజున రాజనాలబండపై వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు పక్కనే ఉన్న ఎత్తైన శ్రీలక్ష్మినరసింహస్వామి కొండపై భక్తులు తరలివెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. అదే రోజు రాత్రి కొండపై గల రాతి స్తంభంపై దీపం వెలిగించి అఖండ దీపారాధన చేస్తారు. స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను గ్రామాల్లో ఊరేగింపు చేపడుతారు. -
అదుపుతప్పి లారీ బోల్తా
నాయుడుపేటటౌన్: మండలంలోని తన్నమాల సమీపంలో రహదారిపై శుక్రవారం ధాన్యం లోడ్తో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు.. తన్నమాల గ్రామ పరిసర ప్రాంతాల్లో ధాన్యం సేకరించుకుని బస్తాలు నింపుకున్న లారీ నాయుడుపేటకు బయలు దేరింది. తన్నమాల సమీపంలో ఓ మలుపు వద్ద వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు .ధాన్యం బస్తాలను మరో వాహనంలో తరలించారు. -
ఏడాదిలోనే 99 శాతం సూపర్ సిక్స్ హామీలు పూర్తి
తిరుపతి అర్బన్: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ పథకాలను 99 శాతం అమలు చేసిందని దేవాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతి బస్టాండ్ వద్ద సీ్త్రశక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు జిల్లా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మొదటి టికెట్ను తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యకు కండక్టర్ నుంచి ఇప్పించారు. ఆ తర్వాత రెండో టికెట్ కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా మరో మహిళకు అందించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తోపాటు తుడా చైర్మన్ దివాకర్రెడ్డి పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రఘు, ఆర్టీసీ డీపీటీఓ జగదీష్, డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, డిప్యూటీ మెకానిక్ ఇంజినీర్ బాలాజీ తదితరులు తదితరులు పాల్గొన్నారు. వివాహ పరిచయ వేదిక రేపు తిరుపతి కల్చరల్: రాయల్ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ ఉదయం 8 గంటలకు గాంధీరోడ్డులోని ఏజీకే బిల్డింగ్లో పద్మావతి వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు సుబ్రమణ్యం తెలిపారు. శుక్రవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలిజ కులానికి చెందిన అమ్మాయిలు, అబ్బాయిలు వారి తల్లిదండ్రులు పాల్గొని, తమ పిల్లలకు తగిన సంబంధాలను కుదుర్చుకునేందుకు ఈ వివాహ పరిచయ వేదిక చక్కటి వేదికగా దోహదపడుతుందని తెలిపారు. ఇందులో పాల్గొనే వారి తల్లిదండ్రులు పెళ్లి కుమారుడు, కుమార్తె పోస్ట్ కార్డు సైజు ఫొటోలు, బయోడేటాను తీసుకుని రావాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన బలిజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8712233082లో సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో బలిజ సంఘ నేతలు గుట్టా నాగరాజ రాయల్, సుబ్బరామయ్య, ఏవీ.ప్రతాప్, మనోజ్, దిలీప్, సాయిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మూడు హోటళ్లు సీజ్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ నిబంధనలు ఉల్లంఘించి మాంసాహార భోజనాలు విక్రయిస్తున్న హోటల్ను అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం నగరంలోని పలమనేర్ రోడ్డు లోని హోటల్ తో పాటు మరో రెండు హోటళ్లలో మాంసాహారం విక్రయిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్కు ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఆదేశాలతో ప్రజారోగ్య శాఖ అధికారులు నగరంలోని మూడు హోటళ్లను సీజ్ చేశారు. -
మూగబోయిన ఆటల గంట!
విశ్వవేదికలపై మన క్రీడాకారులు గెలిచిన వేళ..పిడికిలి బిగించి విజయ చిహ్నంగా మన జాతీయజెండా ఎగురవేసిన వేళ.. మన క్రీడాకారులను చూసిన సమయంలో నా బిడ్డా అంతటిస్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు.. నేనూ అలాంటి స్థాయికి చేరుకోవాలని విద్యార్థులు కలలు కంటారు. ఆ దిశగా అడుగులు పడాలంటే నిరంతర క్రీడా సాధన అవసరం. అందుకు కాలు మోపే మైదానాలుండాలి. క్రీడా పునాదికి పాఠశాలల్లో తప్పనిసరిగా ఆట స్థలాలు ఉండాలి. జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. బాల్యం తరగతి గదిలో బందీ అవుతున్నా..పాలకులు, అధికారులు మిన్నకుంటున్నారు. తిరుపతి సిటీ: నేటితరం విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలను ప్రోత్సహించాల్సిన పాఠశాలలు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలలోనూ క్రీడా మైదానాలే కానరావడం లేదు. ఆ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు గల్లీ క్రికెట్ తప్ప తమకు ఏ క్రీడలు తెలియవని చెబుతుండడం ఆశ్చర్యకరం. జిల్లాలో అధికారులకు ముడుపులు చెల్లించి మౌలిక వసతులు లేకపోయినా ధనార్జనే ధ్యేయంగా అధికార, ధన బలంతో ఇప్పడిముబ్బడిగా వీధికి ఒక ప్రైవేటు పాఠశాలు ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఒక్కోక్క పాఠశాలలకు అనుమతులు లేకపోయినా రెండు, మూడు బ్రాంచ్లను నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ రూ.కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలో చదివే విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో అధిక సంఖ్యలో పాల్గొనకపోవడంపై ఓ ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో పలు కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. భవనాలు.. అపార్ట్మెంట్లలో విద్యాసంస్థలు జిల్లాలోని సుమారు 90 శాతం ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో కనీస వసతులు లేవు. ఆట స్థలాలు ఊసే లేదు. కుటుంబాలు అద్దెకు ఉండే భవనాలు, అపార్ట్మెంట్లలో విద్యాసంస్థలను నడుపుతూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించే ప్రక్రియ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావించి, అధికారులతో యాజమాన్యాలు చేతులు కలిపి అనుమతులు పొందుతున్నారు. క్రీడా మైదానం లేకపోయినా యాజమాన్యాలు అధికారుల చేయితడిపి అన్ని సౌకర్యాలున్నట్లు అనుమతులు పొంది పక్కా రికార్డులు తయారు చేసుకుని తమ పనికానిచ్చేస్తున్నారు. అడిగే నాథుడు లేకపోవడంతో ప్రైవేటు యాజయాన్యాలు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నాయి. పీఈటీలు, పీడీల నియామకాలు నిల్ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మైదానాల మాట దేవుడెరుగు. కనీసం పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల నియామకాల ఊసే లేదు. 10 శాతం పాఠశాలల్లో పీఈటీలున్నా తగిన అర్హతలు, సమర్థులైన వ్యాయామ ఉపాధ్యాయులు ఉండడం లేదు. ఇంటర్, డిగ్రీ చదివిన వారిని నియమించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అలాగే మరికొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు పీడీ పోస్టు నియామకం జరిపినట్లు ఇతరుల ఫేక్ ధ్రువపత్రాలతో అనుమతులు పొందిన విద్యాసంస్థలు కోకొల్లలు. అధికారులకు రూ.లక్షలలో ముడుపులు చెల్లించి, విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే కాస్తో కూస్తో మైదానాలు, పీఈటీలు ఉన్నారు. దీంతో అడపదడపా జిల్లా స్థాయికి పాఠశాలల నుంచి కొందరు ఎంపిక అవుతున్నారు. స్వతహాగా తల్లిదండ్రులే శిక్షణ ఇప్పిస్తున్నారు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉన్నా యాజమాన్యాలు అవకాశం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు స్వతహాగా ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడలను ఎంపిక చేసుకునుని, నెలకు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ప్రవేశాల సమయంలో ఏవేవో కథలు చెప్పి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తామని ప్రగల్భాలు పలికి రూ.లక్షల్లో ఫీజలు వసూలు చేసి, ఆ తర్వాత కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తామే ఉదయం, సాయంత్రం ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నామని చెబుతున్నారు.త్వరలో యాజమాన్యాలతో చర్చిస్తాం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను యాజమాన్యాలు క్రీడల వైపు ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాలకు ప్రత్యేక క్రీడా మైదానం తప్పకుండా ఉండాల్సిందే. అందులోనూ అర్హులైన పీఈటీలను నియమించుకోవాలి. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. త్వరలో అన్ని ప్రైవేటు యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, క్రీడల ప్రాధాన్యతను తెలియజేస్తాం. –కేవీఎన్ కుమార్, డీఈఓ, తిరుపతి జిల్లా ప్రతి కళాశాలకూ ఆట స్థలం ఉండాల్సిందే! జిల్లాలోని అన్ని ప్రైవేటు కళాశాలలో క్రీడా మైదనాలు ఉండాల్సిందే. లేని పక్షంలో చర్యలు తప్పవు. అలాగే ప్రతి కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఫిజికల్ డైరెక్టర్ల నియామకం జరపాలి. అందులోనూ సమర్థులైన పూర్తి స్థాయి అర్హతగలిగిన అభ్యర్థులనే ఎంపిక చేయాలి. ప్రతి రోజూ క్రీడలకు సంబంధించి ప్రత్యేక పీరియడ్ను టైంటేబుల్లో ఉంచి తీరాలి. –రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి సొంతంగా కోచింగ్ ఇప్పిస్తున్నాం మా అమ్మాయి నగరంలోని ఓ పేరొందిన ప్రైవేటు విద్యాసంస్థలో ఆరో తరగతి చదువుతోంది. క్రీడల ఊసే ఉండదు. కానీ మా అమ్మాయికి బ్యాడ్మింటన్పై ఆసక్తి ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ కోచ్ వద్ద నెలకు రూ. 6 వేలు చెల్లించి సొంతంగా కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఇప్పటివరకు నాకు తెలిసి తిరుపతి జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాలలోనూ క్రీడలను ప్రోత్సహించే యాజమాన్యాలు లేవు. ఇది మరి దారుణం. –పద్మావతి, విద్యార్థిని తల్లి, తిరుపతి అధికారుల ఉదాశీనతతోనే.. విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడంతోనే ప్రైవే టు విద్యాసంస్థలు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నా యి. అధికారులకు ముడుపు లు చెల్లించి క్రీడా మైదానాలున్నట్లు అనుమతులు పొందుతున్నాయి. మా అబ్బాయి ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. అతడి రోజువారీ టైంటేబుల్ చూస్తే పీఈటీ కోసం పీరియడ్ ఉండదు. ఎందుకంటే ఆ పాఠశాలల్లో పీఈటీ లేరు. పిల్లలకు వ్యాయమం తగ్గి, అనారోగ్యం పాలు కావడానికి ఇదో కారణం. –స్వర్ణలత, విద్యార్థిని తల్లి, తిరుపతి -
అరాచకం రాజ్యమేలుతోంది
తిరుపతి మంగళం: స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతోందని, అయితే రాష్ట్రం స్వాతంత్య్రం కోల్పోయి ఏడాదిన్నర అవుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ శుక్రవారం తిరుపతి పద్మావతిపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల హక్కులను పూర్తిగా హరించివేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు వాక్ స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నామని, ప్రశ్నించే పరిస్థితులు లేకుండా పోతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి రాజ్యమేలుతోందని, ప్రశ్నించే వారిపై నిందారోపణలు మోపి, హింసలకు పాల్పడే వారిగా చిత్రీకరించి, కేసులు బనాయించి జైళ్లల్లోకి కుక్కి ప్రజస్వామ్యమనేది లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఏడాదిన్నర కిందట జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొత్తం ఈవీఎంలన్నీ ట్యాపరింగ్ చేశారన్న విషయం దేశమే కోడై కూస్తోందన్నారు. ప్రజాస్వామ్యంగా పరిపాలించి రాష్ట్రంలోని పేదల ప్రజలకు సంక్షేమ రూపంలో రూ. 2.50 లక్షల కోట్లను పేద ప్రజలకు అందించిన గొప్ప నాయకుడైన వైఎస్. జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిని జైళ్లల్లోకి కుక్కే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో హక్కులు లేవు, భావప్రకటన స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే మనుషులకు సంకెళ్లు పడుతున్నాయని ఆరోపించారు. ఈ కూటమి అరాచకాలపై ప్రజలంతా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామే తప్ప రాష్ట్రంలో మాత్రం స్వాతంత్య్రం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తిరుపతి మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
అప్పుల జీవనం!
అందని జీతం..●తిరుమల శ్రీవారి సేవా పరివారంలో స్థానం.. టీటీడీ విద్యాసంస్థల్లో ఉద్యోగం.. తాత్కాలిక ప్రాతిపదికనే అయినా అపురూపమైన వరం.. వేలాది మంది పేద విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే అద్భుత అవకాశం.. దేవదేవుని పాదాల చెంత గురువులుగా విధులు నిర్వర్తించే మహద్భాగ్యం.. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా తయారైంది కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి. వేతనం కోసం పడిగాపులు కాయల్సిన దుస్థితి దాపురించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు నెలలుగా జీతాలు అందక.. అప్పులు చేసి జీవనం సాగించాల్సి వస్తోంది. తిరుపతి సిటీ : తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కొన్నేళ్లుగా 330 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేస్తున్నారు. అధికారుల తీరుతో ఉద్యోగ భద్రత దేవుడెరుగు కనీసం జీతాలకు నోచుకోక అలమటిస్తున్నారు. జూన్ నుంచి వేతనాల ఊసేలేక పోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఒక వైపు పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక, మరో వైపు కుటుంబావసరాలను తీర్చుకోలేక దయనీయస్థితిలో బతుకీడుస్తున్నారు. కొందరు ఈఎంఐలు కట్టలేక అపరాధ రుసుంతో అప్పు చేసి చెల్లిస్తుండగా, మరికొందరు ఇంట్లోని బంగారు వస్తువులను తాకట్టు పెట్టి జీవనం సాగిస్తున్నారు. జీతాలు ఎప్పుడు జమ చేస్తారో తెలియని అయోమయంలో అధ్యాపకులు నలిగిపోతున్నారు. పెరుమాళ్లకే ఎరుక! టీటీడీ ఆధ్వర్యంలో మూడు జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 51మందికి రెన్యువల్ ఉత్తర్వులు అందినా వేతనాలు పడలేదు. డిగ్రీ కళాశాలలోని 161 మంది తాత్కాలిక అధ్యాపకులకు ఇప్పటి వరకు రెన్యువల్ ఉత్తర్వులే అందలేదు. ఈ పరిస్థితుల్లో ఇక జీతాలు ఎప్పుడు వేస్తారో పెరుమాళ్లకే ఎరుకని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల్లో సుమారు 110 మందికి పైగా తాత్కాలిక ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా కుంగిపోయి మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వేతనాల ఫైల్ను సంబంధిత అధికారులకు పంపించడంలో కిందిస్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు సైతం వేతనాల ఫైల్ను తమ వద్దకు తెప్పించుకుని పరిశీలించడంలో మనకేందుకులే...అంటూ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలను అందుకుంటూ కుటుంబాలను సాఫీగా నడుపుకుంటున్నారు. తాత్కాలిక ఉద్యోగులపై ఎందుకీ వివక్ష అంటూ అధ్యాపకులు మండిపడుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్లో అయినా వేతనాలు చేతికందేనా అంటూ ఏడుకొండలవైపు చూస్తున్నారు. కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది గత మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది. నిత్యావసరాలకు సమీపంలోని షాపులలో అప్పులు పెడుతున్నాం. జీతాలు జమ కాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పండుగలు, ఫంక్షన్లకు దూరంగా ఉంటున్నామంటే అతిశయోక్తి కాదు. పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎమ్ఐలు కట్టేందుకు అవస్థలు పడుతున్నాం. టీటీడీ అధికారులు మా దయనీయ స్థితిని అర్థం చేసుకుని త్వరగా వేతనాలు అందించాలని వేడుకుంటున్నాం. – టీటీడీ విద్యాసంస్థల్లోని తాత్కాలిక అధ్యాపకులు -
బోసిపోయిన కళాశాలలు
తిరుపతి సిటీ: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్వాతంత్య్ర దిన వే డుకలు చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకున్నట్లు కనిపించలేదని అధ్యాపకులు చర్చించుకోవడం గమనార్హం. వరుసగా మూడు రోజుల సెలవు లు రావడంతో హాస్టల్ విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతోపాటు డిగ్రీ, పీజీ మొదటి ఏడాది కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టకపోవడం మరో కారణమని తెలుస్తోంది. అన్ని కళాశాలలోనూ కేవలం ఎన్సీసీ క్యాడెట్లతోనే స్వాతంత్య్ర వేడుకలు తూతూ మంత్రంగా జరుపుకోవడం విశేషం. అవయవదానం నాగలాపురం: మండలంలోని వినోభానగర్ గ్రామానికి చెందిన గంగన్(55) శుక్రవారం బ్రైయిన్ డెడ్ అయినట్లు చైన్నె ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతుని అవయవాలను దానం చేయడానికి అతని భార్య మంజుల అంగీకారం తెలిపింది. దీంతో వైద్యులు రెండు కిడ్నీలు, ఓ ఎముకను ఆపరేషన్ చేసి, తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 15వ జాతీయ హాకీ పోటీలకు గూడూరు విద్యార్థి చిల్లకూరు: గూడూరు పట్టణం చర్చివీధికి చెందిన దేవతా య శ్వంత్ అనే ఇంటర్ విద్యార్థి 15వ జాతీ య స్థాయి జూనియర్ హాకీ పోటీలకు ఎంపికై నట్లు హాకీ కోచ్ ఆకాష్దీపక్ శుక్రవారం తెలిపారు. ఈ క్రీడాకారుడు పంజాబ్ రాష్ట్రంలోని జలందర్లో ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు జరిగే జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో రాష్ట్ర జట్టులో సభ్యుడిగా పాల్గొంటారని కోచ్ తెలిపారు. ఈ నెల 18న జరిగే పోటీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో శ్రీలక్ష్మి చారిబుల్ట్రస్టు నిర్వాహకులు శ్రీలక్ష్మి, పీఎంరావు తమవంతు ఆర్థిక సహకారం అందించారు. ఇతడి ఎంపికపై హాకీ అసోసియేషన్ తిరుపతి అధ్యక్షుడు టీ స్పర్జన్రాజు తదితరులు అభినందనలు తెలిపారు. విచ్చలవిడిగా మద్యం.. మాంసం విక్రయాలు రేణిగుంట: మండలంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం, మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగాయి. మందు బాటిల్పై రూ.50 అధికంగా వసూలు చేస్తూ తమ వ్యా పారం కొనసాగించారు. కరకంబాడిలో ప్రధా న రహదారిపైనే చికెన్ దుకాణాలు తెరిచి అధిక ధరతో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అరికట్టాల్సిన ఎకై ్సజ్ శాఖ, పంచాయతీ, పోలీస్శాఖ అధికారులు మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదనేలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది. గురువారం అర్ధరాత్రి వరకు 66,530 మంది స్వామివారిని దర్శించుకోగా 32,478 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
వివాహ పరిచయ వేదిక రేపు
తిరుపతిలో ఈ నెల 17వ తేదీన వివాహ పరిచయ వేదిక జరగనున్నట్టు ఆ సంఘం అధ్యక్షుడు సుబ్రమణ్యం తెలిపారు.సాంకేతిక పరంగా భారత్ గ్లోబల్ మ్యాప్లోకి.. సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేస్తున్న ప్రయోగాల పరంపరతో దేశంలో ప్రతి ఒక్కరికీ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి నేడు గ్లోబల్ మ్యాప్లో భారత్కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చామని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ పేర్కొన్నారు. షార్లోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో 79వ స్వాతంత్య్ర దిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ మన జాతీయజెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్బంగా సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సందీప్కుమార్ ఆధ్వర్యంలో భద్రతా దళాలు గౌరవ వందనం సమర్పించారు. షార్లో మువ్వన్నెల జాతీయజెండాను ఎగురవేస్తున్న షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ -
ఉచిత బస్సుకు ఆదరణ కరువు
కేవీబీపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శుక్రవారం నుంచి అమలు చేసిన ఉచిత బస్సు పథకానికి ఆదరణ కరువైంది. కనీసం కార్యక్రమం ప్రారంభానికి కూడా మహిళలు బస్సుల దగ్గరకు చేరడం లేదు. కండక్టర్లు గొంతులు పోయేలా ఉచిత బస్సు , ఫ్రీ బస్సు అని అరుస్తున్నా మహిళలు పట్టించుకోవడం లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం కేవీబీపురం మండల కేంద్రంలోనిది. ఈ బస్సులో ఉన్నవారు కూడా స్థానికులే అక్కడే ఎక్కించుకుని, పోలీస్ స్టేషన్ దాటి దింపేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళల నుంచి విభిన్న మాటలు వినిపిస్తున్నాయి. -
జెండా ఎగరేస్తే.. నిన్ను ఇక్కడే పాతేస్తా నా...!
చంద్రగిరి: స్వాతంత్య్ర దినోత్సవంనాడు తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. జాతీయ పతాకం ఆవిష్కరణకు వచ్చిన పంచాయతీ సర్పంచ్పై ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ‘‘జెండా ఎగరేస్తే నిన్ను ఇక్కడే పాతేస్తా నా.. ’’ అంటూ దాడికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు, రెడ్బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ జెండా ఎగురవేయనీయకుండా అడ్డుకుని సర్పంచ్నే బలవంతంగా స్టేషన్కు తరలించడంతో, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వైఎస్సార్సీపీ నేత అక్కడికక్కడే కుప్పకూలారు. వివరాల్లోకి వెళితే, 2024 ఎన్నికల అనంతరం టీడీపీ నాయకుల తీవ్ర హింసాకాండ నేపథ్యంలో మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్రెడ్డి గ్రామం విడిచి వెళ్లిపోయి, ప్రస్తుతం చంద్రగిరిలో ఉంటున్నారు. హైకోర్టు రూలింగ్ నేపథ్యంలో ఆయన గ్రామంలోకి అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నా.. పూర్తిగా గ్రామంలో ఉండలేని దారుణ పరిస్థితి. ఈ నేపథ్యంలో పంచాయతీ ప్రథమ పౌరునిగా ఆగస్టు 15న గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణకు చంద్రశేఖర్రెడ్డి రామిరెడ్డిపల్లికి వెళ్లారు.ఈ సందర్భంలో పంచాయతీ పరిధిలోని కూచువారిపల్లికి చెందిన మురళీనాయుడు కొంత మంది అల్లరి మూకలను తీసుకొచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకున్నాడు. ‘‘ఈ ఊర్లోకి వచ్చేందుకు నీకు ఎంత ధైర్యం రా.. జెండా ఎగరేస్తే నిన్ను ఇక్కడే పాతేస్తా నా...’’ అంటూ బూతుపురాణం ఎత్తుకుని సర్పంచ్పై దాడికి యత్నించాడు. స్టేషన్లో తీవ్ర అవమానం సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసాద్ తన సిబ్బందితో కలసి సచివాలయం వద్దకు చేరుకున్నాడు. సర్పంచ్ జెండా ఆవిష్కరణలో పాల్గొనకుండా బలవంతంగా స్టేషన్కు తరలించాడు. 12.15 గంటల వరకూ రెండు గంటలకుపైగా స్టేషన్లోనే నిర్బంధించాడు. ఈ సందర్భంగా డీఎస్పీ టీడీపీ కార్యకర్త మురళీనాయుడు ఎదుటే సర్పంచ్ని అగౌరవపరుస్తూ మాట్లాడాడు. దీనితో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న చంద్రశేఖర్రెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనై అక్కడే కుప్పకూలి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. వెంటనే సీఐ ఇమ్రాన్ బాషా తన సిబ్బందితో కలసి పోలీసు వాహనంలో ఆయనను తిరుపతి రుయాకు తరలించారు. ఈ సమాచారంతో చంద్రశేఖర్రెడ్డి కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రుయాకు చేరుకున్నాయి. ఆయనను మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అత్యవసర వైద్య సేవలు అందించడంతో చంద్రశేఖర్రెడ్డి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ రెడ్డిని వైఎస్సార్సీపీ చంద్రగిరి ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తదితర పార్టీ నాయకులు పరామర్శించారు. టీడీపీ రెడ్బుక్, ప్రజావ్యతిరేక చర్యలపై పోరులో వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. -
అగ్రకులాల దౌర్జన్యాలపై చర్యలు తీసుకోండి
చంద్రగిరి : వెటర్నరీ యూనివర్శిటీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే బీసీ విద్యార్థులపై అగ్ర కులాలకు చెందిన కొంత మంది దౌర్జన్యాలు చేయడంపై బీసీ సంఘం విద్యార్థులు మండిపడ్డారు. వెటర్నరీ యూనివర్సిటీలోని నకుల హాస్టల్లో విద్యార్థులకు అందించే అల్పాహారంలో పురుగులు రావడంతో ఓబీసీ విద్యార్థి సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్రావు వార్డెన్ తిరుపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. అయితే వార్డెన్తో మాట్లాడుతున్న క్రమంలో కొంత మంది విద్యార్థులు నాగేశ్వర్రావుపై దౌర్జన్యానికి యత్నించడంతో బీసీ విద్యార్థులు మండిపడ్డారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలు యూనివర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులతో కొంత మంది అగ్ర కులాలకు చెందిన వారు బెదిరింపులకు పాల్పడటం, గొడవలకు రావడం దారుణమన్నారు. వార్డెన్కు చెందిన కొంత మంది విద్యార్థి సంఘం నేత నాగేశ్వర్రావుపై దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున బీసీ విద్యార్థి సంఘాలతో నిరసనకు దిగుతామని వీసీ ఎదుట స్పష్టం చేశారు. వీసీ కేవీ.రమణ మాట్లాడుతూ.. సోమవారం ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థి సంఘ నేతలకు వివరించారు. -
ఎస్వీ వైద్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాలలో నీట్–2025 తొలి విడత ఎంబీబీఎస్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గురువారం ఉత్తమ ర్యాంక్ సాధించిన తిరుపతికి చెందిన గుణ భూషణ్కు ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తొలి అడ్మిషన్ ధ్రువపత్రాన్ని అందించారు. ఉత్తమ టీచర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు తిరుపతి సిటీ : జిల్లాలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించారు. సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్డే సందర్భంగా విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా నుంచి 41 మంది ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు అందాయి. డీఈఓ కేవీఎన్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఇద్దరు ప్రధానోపాధ్యాయులు, నలుగురు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లను మొత్తం ఎనిమిది మందిని ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇందులో నుంచి నలుగురుని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసి సెప్టెంబర్ 5న అవార్డులను అందించనుంది. రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో విద్యార్థినికి పతకం ఏర్పేడు : ఈనెల 8, 9వ తేదీలలో గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జూడో జట్టుకు ప్రతినిధ్యం వహించిన ఏర్పేడు మండలం పాపానాయుడుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని యామిని 40 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు హెచ్ఎం మారయ్య తెలిపారు. జూడో పోటీలలో ప్రతిభ కనబరిచిన ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
పులివెందుల ఉపఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ
వాకాడు : పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన గురువారం వాకాడులో పర్యటించి మాట్లాడుతూ.. అధికార కూటమి ప్రభుత్వం తన గూండాల చేత ఎన్నికలను ఏక పక్షంగా రిగ్గింగ్ చేసుకుందని ఆరోపించారు. ప్రజాబలం లేకున్నా తన అధికారం అండతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం సాగించిన దౌర్జన్యం, దుర్మార్గాన్ని ప్రజలంతా గమనించారని, తప్పకుండా వారికి బుద్ధి చెప్పి తీరుతారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జాన్యాలకు చంద్రబాబు, వారి నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడవడంలో.. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడంలోనూ.. తాను బ్రాండ్ అంబాసిడర్నని చంద్రబాబు మరోమారు నిరూపించారన్నారు. కూటమి ప్రభుత్వానికి ముగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారని రామ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ మేరిగకు పితృవియోగం
చిల్లకూరు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్కు పితృవియోగం కలిగింది. రాపూర్నకు చెందిన మేరిగ ఆనందరావు (89) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఆయన అకస్మాత్తుగా చివరి శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని రాపూరులోని ఆయన స్వగృహానికి నెల్లూరు నుంచి తరలించారు. అంతిమ యాత్ర శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటి వద్ద నుంచి బయలుదేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆనందరావు వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ కొంత రాజకీయ పరిణితి ఉన్నవాడు కావడంతో చదువుతోనే దానిని సాధిచగమని గుర్తించి తన ఐదుగురి సంతానంలో ముగ్గురు కుమారులను వైద్యవృత్తిని చేయించారు. ఈ క్రమంలోనే మేరిగ మురళీధర్ను ఉన్నత చదువులు చదివించిన తరువాత ఆయనకు ఇష్టమైన రాజకీయాలలోకి పంపి నేడు ఉన్నతమైన స్థానంలో ఉండేలా ప్రోత్సహించారు. ఆనందరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు మేరిగ మురళీధర్కు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. -
సంగమేశ్వర స్వామి హుండీ చోరీ
కోట : గూడలిలోని కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల అనంతరం సంగమేశ్వరుని సన్నిధిలోని హుండీ చోరీకి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామపెద్దలు ఈ విషయమై చర్చించేందుకు గురువారం ఆలయం వద్ద సమావేశమయ్యారు. దేవాదాయశాఖ ఈఓ శశాంక్, ఆలయ అర్చకుడు కార్తీక్పై వారు ఆరోపణలు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు స్వామి వారి హుండీలో నగదు, కానుకలు వేశారని, మే 3వ తేదీ రాత్రి ప్రధాన ద్వారం తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నట్లు వాచ్మెన్ గుర్తించి పూజారి, ఈఓకు ఫిర్యాదు చేశారని, అయితే వారు చోరీ విషయాన్ని బయటపెట్టకుండా దాచి ఉంచారని గ్రామస్తులు తెలిపారు. స్వామి వారి హుండీలో ఉన్న రూ.లక్షల రూపాయలు మాయం అయ్యాయన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపాలన్నారు. పీఠం కదిలిందా..కదిలించారా.. కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి పీఠం కదిలిందని ఈనెల 10 నుంచి మూడు రోజులు ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు. దీనిపై గ్రామపెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధి కోసం పీఠాన్ని కదిలించారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్ విజయసారఽథిరెడ్డి, షనీల్రెడ్డి, సత్యనారాయణ, వెంకటక్రిష్ణారెడ్డి, దేవేంద్రరెడ్డి, రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
గజదాడుల కట్టడిలో విఫలం
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజాసమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చక్కటి వేదిక. ఇందులో అనేక సమస్యలు పరిష్కరించడమే కాకుండా అభివృద్ధి పనులు, కొత్త నిర్ణయాల అమలు పట్ల చర్చించవచ్చు. అయితే ప్రతి సారీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న ఈ సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా సాగుతోంది. ఈ సమావేశం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా పరిధిలో నిర్వహిస్తారు. ఈ మూడు జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు హాజరైతే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే ఇప్పటి వరకు తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు హాజరు కాలేదు. ఆయా జిల్లాల అధికారులు సైతం గైర్హాజరవుతున్నారు. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని జెడ్పీటీసీలు సమావేశానికి హాజరై సమస్యలు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రతిసారీ అజెండాలో తప్పిదాలే జిల్లా పరిషత్ సర్వసమావేశానికి అందజేసే అజెండాలో అన్ని శాఖల పరిధిలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల సమాచారం పొందుపరచాలి. అయితే అనేక శాఖల అధికారులు అజెండాలో తమ శాఖకు చెందిన సమాచారమే ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 29న నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి అందజేసిన అజెండాలో కేవలం 11 శాఖల సమాచారమే పొందుపరిచారు. ఆ సమాచారంలోనూ అనేక తప్పిదాలున్నాయి. చివరి నిమిషంలో పలు శాఖలు సమాచారం అందజేస్తుండడంతో చాలా తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. జాడలేని ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా వేధిస్తోంది. జెడ్పీ, పంచాయతీలకు కలిపి రూ.85 కోట్లు ఇవ్వగా వాటిని పల్లె పాలనకు కేటాయించాల్సి ఉంది. ఆ డబ్బులు మంజూరు చేయకుండా సతాయిస్తోందని సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె పండుగ కింద పంచాయతీరాజ్ పరిధిలో రూ3.కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. సెస్ బకాయిలు రూ.36.4 కోట్లు జిల్లాలోని గ్రంథాలయాలకు నగరపాలక, పంచాయతీల నుంచి వచ్చే సెస్ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, నిర్వహణ కలిపి మొత్తం రూ.80 లక్షలు అవుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సెస్ బకాయిలు రూ.36.40 కోట్లు రావాల్సి ఉంది. నూతన విద్యుత్ సర్వీసులకు మీనమేషాలు ఉమ్మడి జిల్లాలో డబ్బులు కట్టించుకొని విద్యుత్ ఇవ్వాల్సిన సర్వీసులు 4 వేలకు పైగా ఉన్నాయి. శాఖా పరంగా కట్టిన డబ్బులకంటే పలుకుబడి, అధికారులకు మామూళ్లు ఇచ్చుకున్నవారికే సర్వీసులు జిల్లా స్టోర్స్ నుంచి త్వరగా విడుదలవుతున్నాయి. అత్యవసర కోటా కింద పరికరాలు తీసుకునే వెసులుబాటు ఉన్నా అవి ఇచ్చిన దాఖలాలు లేవు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.260 కోట్లు ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు రూ.260 కోట్లకుపైగా ప్రయివేటు ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ బకాయిలు రూ.500 కోట్లు పలు ప్రభుత్వ శాఖలు, పంచాయతీల పరంగా రూ.500 కోట్ల మేర విద్యుత్ శాఖకు రావాల్సి ఉంది. ఇలాంటి మొండి బకాయిలపై అసలు దృష్టి పెట్టడం లేదు. వీటికి తోడు ఓ వైపు ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు జోరుగా సాగుతోంది. కాలనీల్లో మౌలిక వసతులు కరువు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా జగనన్న కాలనీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ కాలనీల్లో మౌలిక వసతులను కల్పించడంలో అలసత్వం వహిస్తోంది. ఆ కాలనీల వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితులున్నాయి. వేతనాల కోసం ధర్నా చేస్తున్న గ్రీన్అంబాసిడర్లు(ఫైల్) పరిష్కారం కాని అన్నదాత కష్టాలు జిల్లాలో అన్నదాతలు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాకు 40,338 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం కాగా 26,350 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. వ్యవసాయ రుణాలు రెన్యూవల్ చేసుకోవాలంటే అప్పటి వరకు ఉన్న మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని కొత్తగా మెలిక పెట్టారు. జిల్లాలో వేలాది మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రూ.3,341 కోట్ల రుణం తీసుకుని అవస్థలు ఎదుర్కొంటున్నారు. మొక్కుబడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రజాప్రతినిధుల జీతాలకే దిక్కులేదు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో జెడ్పీటీసీ, సర్పంచ్ల జీతాలకు దిక్కులేదు. ఉమ్మడి జిల్లాలోని 65 మండలా జెడ్పీటీసీలకు నెలకు రూ.6వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ అనేక నెలలుగా ఇవి పెండింగ్లో ఉండగా ఇప్పటికి రూ.1.7 కోట్లు రావాల్సి ఉంది. అలాగే సర్పంచ్లకు ఇవ్వాల్సిన రూ.3వేల గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదు. వారికి రూ.1.72 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మామూళ్ల మత్తులో ఇంజినీరింగ్ శాఖ ఇంజినీరింగ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. జిల్లా ఆర్అండ్బీ పరిధిలో 15 ఏఈలకుగాను ముగ్గురే ఉన్నారు. వీరే అన్ని నియోజకవర్గాలను పర్యవేక్షించాల్సి ఉంది. ప్రతి పనికీ పైసలు ఇవ్వనిదే చేయడం లేదని కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్నారు. సంవత్సరాల కాలంగా ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ శాఖలకు ఇన్చార్జి ఎస్ఈలే దిక్కుగా మారారు. ఆర్డబ్ల్యూఎస్లో 50 మంది ఏఈలకు 34 మందే ఉన్నారు. ఇక పంచాయతీరాజ్లోనూ ఇన్చార్జ్ల పాలన సాగుతోంది. ఇక్కడ డీఈలు 15 మందికి గాను ఐదుగురు, 62 మంది ఏఈలకు గాను 37 మంది, ఇంజినీర్ సహాయకులు 504కు గాను 90 మంది కొరత ఉన్నారు. ట్రాన్స్కోలోనూ 40 మంది ఏఈలకు గాను దాదాపు 12 మంది తక్కువగా ఉన్నారు. ఫలితం శూన్యం జెడ్పీ సమావేశాలంటే పలు శాఖల అధికారులకు లెక్క లేకుండా పోయింది. దీనిపై జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు హెచ్చరించినా ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా ఎన్హెచ్ఎఐ, అటవీశాఖ, విద్యుత్శాఖ, డ్వామా, డీఆర్డీఎ, డీఎంఅండ్హెచ్, విద్యశాఖ అధికారులు రావడం లేదు. సోషల్ మీడియా కోసం రీల్స్ పెట్టడానికి కొందరు వీడియోలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. -
ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం
తిరుపతి తుడా: స్విమ్స్ వర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. నీట్–2025 ఆల్ ఇండియా కోటాలో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా గురువారం తొలివిడత ప్రవేశాలకు పూనుకున్నారు. కర్నూలుకు చెందిన సాయి శ్రీనిత్య జాతీ య స్థాయిలో 14,255 ర్యాంకు సాధించి తొలి అడ్మిషన్ పొందారు. వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ అడ్మిషన్ ధృవ పత్రాన్ని విద్యార్థినికి అందజేశారు. జాలర్లకు ఇళ్ల స్థలాలు తడ : మండలంలోని దీవి గ్రామం ఇరకంలో నివసిస్తున్న జాలర్లకు పూడి గ్రామం వద్ద ఏడాది క్రితం తయారు చేసిన జగనన్న లే అవుట్లో 172 మందికి కేటాయించిన ఇళ్ల స్థలాలను కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా గురువారం ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. తడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్కీడిప్ ద్వారా పట్టాల నంబర్లు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరకం దీవిలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి పట్టాలు త్వరితగతిన మంజూరు చేశామన్నారు. గ్రామంలో మిగిలిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫొటో లేకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పట్టాల పంపిణీ నిలిచిపోయింది. దానిని ఇప్పుడు టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం నాయకులు పాల్గొన్నారు. -
భలే కేటుగాళ్లు..!
● సెల్ ఫోన్లు చోరీ చేసి బ్యాంకు ఖాతాల్లో నగదు హాంఫట్ ● ముగ్గురు నిందితుల అరెస్ట్ ● 46 సెల్ఫోన్లు, రూ.2.8లక్షలు స్వాధీనం ● నిందితులు హైదరాబాద్, అన్నమయ్య జిల్లా, నెల్లూరు వాసులు తిరుపతి క్రైమ్: సెల్ ఫోన్లు చోరీ చేసి ఆ సెల్ ఫోన్ ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాలోని నగదు హాంఫట్ చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఈస్ట్ పోలీస్ స్టేషన్ విలేకరులకు తెలిపిన వివరాలు..హైదరాబాద్కు చెందిన హరికృష్ణ, అన్నమయ్య జిల్లాకు చెందిన అశోక్, నెల్లూరు జిల్లాకు చెందిన గడ్డం కసిరెడ్డి ఓ ముఠాగా ఏర్పడి నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడేవారు. అలా చోరీ చేసిన మొబైల్ ఫోన్లలో ఆ వ్యక్తుల ఫోన్ పే, గూగుల్ పేను పరిశీలించి అందులో నగదును సరికొత్త ఎత్తుగడలతో కొట్టేసేశారు. ఏటీఎం సెంటర్ వద్ద కాపు కాసి, అక్కడ వచ్చే వారికి తమ వారు హాస్పిటల్లో ఉన్నారని, డబ్బులు చాలా అవసరమని ఫోన్ పే చేస్తామని, కావాలంటే కమిషన్ కూడా ఇస్తామని వారిని నమ్మిస్తారు. ఇలా కహానీలు చెప్పి వీరంతా 49 సెల్ ఫోన్లు దొంగతనం చేసి 3.6లక్షలు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హరికృష్ణ నుంచి రూ.లక్ష, 40 సెల్ ఫోన్లు, అశోక్ నుంచి రూ.90 వేలు, 6 సెల్ ఫోన్లు, కసిరెడ్డి నుంచి రూ.90 వేలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ హేమాద్రి, సిబ్బంది కృషి చేశారని డీఎస్పీ వారిని అభినందించారు. -
జెండా రెపరెపలు
చంద్రగిరి : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రగిరిలోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాల విద్యార్థులు ఎంఈఓ లలిత ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో గురువారం ర్యాలీ నిర్వహించారు. సుమా రు 1500 అడుగుల భారీ జాతీ య జెండాతో చంద్రగిరి పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. కార్యకమ్రంలో పాఠశాల చైర్మన్ హితేంద్రనాథ్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ వేణుగోపాల్ పాల్గొన్నారు. 20న రుణమేళాపై అవగాహన తిరుపతి కల్చరల్ : జిల్లా పరిశ్రమల కేంద్రం, ఎంఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన రామానుజ సర్కిల్లోనున్న రెగాలియా హోటల్లో రుణమేళా, కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరువుతారని, అర్హత కలిగిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను గుర్తించి వారికి తక్షణమే రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ రుణ మేళాలకు హాజరయ్యే వారు ఈనెల 19వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9490190498, 7995915450 నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు. తిరుమలలో దొంగల చేతివాటంతిరుమల : పార్కింగ్ లో ఉంచిన కారు అద్దాలు పగులకొట్టి గుర్తుతెలియని దండగులు చోరీకి పాల్పడిన సంఘటన గురువారం వెలుగు చూసింది. తిరుమల టూ టౌన్ పీఎస్ సీఐ శ్రీరాముడు తెలిపిన వివరాల మేరకు తమిళనాడు రాష్ట్రం, వేలూరుకు చెందిన నిత్యవేలు కుటుంబ సభ్యులతో కలిసి కారులో బుధవారం తిరుమలకు చేరుకున్నారు. స్థానిక నారాయణగిరి పార్కింగ్లో కారును ఉంచి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరిగీ గురువారం ఉదయం వచ్చి చూడగా కారు వెనుక అద్దాలు పగులకొట్టి ఉన్నాయి. కారులోని బ్యాగులో ఉంచిన రెండు జతల కమ్మలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. చోరీపై భక్తుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. స్కూళ్లను తనిఖీ చేయండి : కలెక్టర్ తిరుపతి అర్బన్: కార్యాలయాలకే పరిమితం కాకుండా స్కూళ్లను తనిఖీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఉప విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఇందిరాదేవి గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు కలెక్టర్ మార్గదర్శనంచేశారు. మెనూ ప్రకారం స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం పెట్టేలా చూడాలని, నాణ్యమైన విద్య అందేలా చూడాలని ఆదేశించారు. -
పనితీరుకు ర్యాంకింగ్లు
తిరుపతి అర్బన్ : ప్రభుత్వ లక్ష్యం మేరకు కార్యక్రమాలను అమలు చేయడంలో పురోగతి చూపాలని ఇన్చార్జి జోనల్ ఆఫీసర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమశాఖ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. కలెక్టరేట్లో ఆయన గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, డీఆర్వో నరసింహులతో కలసి ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర..స్వచ్ఛాంధ్ర, పీ4 కార్యక్రమాల పనితీరును తెలుసుకున్నారు. జిల్లాల వారీగా ర్యాంకింగ్ ఉంటుందని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ, ఉద్యానశాఖ అభివృద్ధికి పనిచేయాలని చెప్పారు. కొత్త ఆలోచనలతో జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించి పురోగతిని చూపుతామని చెప్పారు. అలాగే వ్యవసాయ, ఉద్యానశాఖల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. -
దుర్గమ్మ గుడికి వెళ్లాలంటే ఎన్ని రోజులు
ఉచిత బస్సు ప్రయాణం బాగానే ఉంది. నేను విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లి రావాలంటే పల్లె వెలు గు బస్సులో వెళ్లి ఎప్పుడు రావాలి? ఆ పల్లె వెలుగు బస్సులు ఎన్ని మారాలి? ఇది అయ్యే పనేనా నాయనా? కాణిపాకం వెళ్లి రావాలన్నా పల్లె వెలుగు బస్సులో ఎప్పుడు వెళ్లి రావాలి? – సరోజమ్మ, తిరుపతి ఉపాధి అవకాశాలు కల్పించండి మా తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివించలేకపోయారు. చదివిన చదువుతో ఉద్యోగాలు దొరకడం లేదు. అప్పు చేసి ఆటో కొనుగోలు చేశా. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఇస్తే ఇవ్వండి.. కానీ మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి. ఉపాధి లేకపోతే మా పరిస్థితేంటి.? – జ్ఞానశేఖర్, ఆటోడ్రైవర్ , చిత్తూరు -
18న నవంబర్ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నవంబర్ కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఆగస్ట్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపింది.ఆర్జిత సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్ట్ 25న ఉదయం 10 గంటలకు..తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
ఓటీపీ లేకుంటే భూ వివరాలు రావంతే..
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా సజావుగా రైతులకు ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్న మీ భూమి, భూ నక్షత్ర పోర్టల్లో కూటమి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. గత నెల రోజులుగా కూటమి ప్రభుత్వం మీ భూమి పోర్టల్ లో తెచ్చిన కొత్త మార్పులతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సజావుగా సాగుతున్న మీ భూమి పోర్టల్కు ఓటీపీ లాగిన్ను ఏర్పాటు చేయడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు అధికమవుతున్నాయి. రైతులు, ప్రజలు తమ భూముల వివరాలను మీ భూమి పోర్టల్ లో తెలుసుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నప్పటికీ తమ చేతుల్లో ఏమీ లేదంటూ చేతులెత్తేస్తున్నారు. నెట్ స్పీడు లేకున్నా మొరాయింపే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న మండలాల్లో నెట్ వేగం అంతంత మాత్రమే. నగరాల్లో మాత్రమే 5 జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లో నెట్వర్క్ సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ఇంటర్నెట్ సౌకర్యం అంతంత మాత్రంగానే ఉండే పరిస్థితి. ఈ క్రమంలో గ్రామాల్లో మీ భూమి వెబ్సైట్ లో వివరాలు పొందేందుకు రైతులు ఓటీపీ నమోదు చేశాకే వెబ్ల్యాండ్ ఓపెన్ అవుతోంది. నెట్ స్పీడు లేకపోయినా మీ భూమి పోర్టల్ ఓపెన్ అవ్వని పరిస్థితి క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. గ్రామాల్లో మీ భూమి పోర్టల్ లో భూ వివరాలు పొందేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం మీ భూమి పోర్టల్కు లాగిన్ ఆప్షన్ పెట్టడంతోనే ఈ కొత్త కష్టాలు రైతులకు మొదలయ్యాయి. పోర్టల్లో సమస్యలు కూటమి ప్రభుత్వం మార్పులు చేసిన మీ భూమి పోర్టల్ లో వింత సమస్యలు ఎదురవుతున్నాయి. గత మీ భూమి పోర్టల్ ను పూర్తిగా తొలగించడంతో అందులోని సమగ్ర వివరాలు మాయమయ్యాయి. ప్రస్తుతం చాలా వరకు భూముల వివరాలు మీ భూమి పోర్టల్ లో కనిపించడం లేదు. ఈ సమస్యలు చిత్తూరు, తిరుపతి జిల్లాలు మొత్తం ఉన్నాయి. ఇదే సమయంలో పోర్టల్ మొరాయింపుతో రైతులకు అవసరమైన భూ పత్రాలు పొందలేక పోతున్నారు. రైతులు తమకు అవసరమైన పత్రాలు సకాలంలో బ్యాంకులలో ఇవ్వలేకపోతుండటంతో రుణాలు పొందలేక నష్టపోతున్నారు. రైతులు నెట్ సెంటర్ల వద్ద రోజంతా నిరీక్షిస్తున్నప్పటికీ తమకు అవసరమైన భూ పత్రాలను పొందలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపుతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మీ భూమి పోర్టల్ ను పాత పద్ధతిలోనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైన పత్రాలు పొందలేకపోతున్నా నాకు 1బీ, ఎఫ్ఎంబీ పత్రాలు అవసరం పడ్డాయి. ఈ పత్రాల కోసం 20 రోజులుగా తిరుగుతున్నా. ప్రతి రోజు నెట్ సెంటర్ల వద్దకు వెళ్తున్నా. ప్రస్తుత ప్రభుత్వం మీ భూమి పోర్టల్కు ఓటీపీ విధానం అని కొత్తగా పెట్టిందంట. మొదట్లో ఆ ఓటీపీ చెప్పాలంటే భయమేసింది. తర్వాత చేసేదేమిలేక ఆ ఓటీపీ ని కూడా చెప్పాను. అయినప్పటికీ నాకు అవసరమైన భూ పత్రాలను పొందలేకపోయాను. సజావుగా సాగుతున్న మీ భూమి పోర్టల్ లో ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. పూర్వపు విధానమే అమలు చేయాలి. – నాగభూషణం, రైతు, చిత్తూరు జిల్లా పాత పద్ధతినే అమలు చేయాలి అసలే భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. అంతే కాని రైతులపై కక్ష సాధింపునకు పాల్పడే విధంగా కొత్త నిర్ణయాలు అమలు చేయడం సబబు కాదు. మీ భూమి పోర్టల్ లో తెచ్చిన మార్పులపై క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో అవసరమైన భూ పత్రాలు పొందలేకపోతున్నారు. ఎందుకు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు అమలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. పాత పద్ధతిలోనే మీ భూమి పోర్టల్ ను కొనసాగించాలి. – గోవర్ధన్, రైతు, చిత్తూరు జిల్లా గతంలో భూములకు సంబంధించి 1బీ తీయాలన్నా.. అడంగల్ కావాలన్నా...ఎఫ్ఎంబీ అవసరం ఉన్నా ఆన్లైన్ సెంటర్కు వెళ్లి నిమిషాల్లో మీ భూమి పోర్టల్ లో పొందేందుకు అవకాశం ఉండేది. కూటమి ప్రభుత్వం పుణ్యాన ప్రస్తుతం వాటిని పొందడం అంత సులభం కాదు. మీ భూమి పోర్టల్ను ఓపెన్ చేయాలంటే ముందుగా ఫోన్ నంబర్ నమో దు చేయాలి. ఆ తరువాత క్యాప్చా వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే వివరాలు ఓపెన్ అవుతా యి. ఈ తతంగం అంతా చేసేందుకు గంటల సమ యం పడుతుంది. ఓటీపీ నమోదు చేసి వివరాలన్ని నమోదు చేశాక ఓకే నొక్కితే సర్వర్ మొరాయిస్తూ సైట్ ఓపెన్ కాకుండా పోతోంది. ఇలా మూడు సార్లు ఓటీపీ నమోదు చేశాక ఆ తర్వాత ఆ రోజుకి ఇక పై అవకాశం లేనట్టే. ఒకవేళ లాగిన్ అయిన కాసేపటికే సర్వర్ బిజీ వస్తుంది. ఈ సమస్యలతో రైతులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
యథేచ్ఛగా శ్రమదోపిడీ
కర్మాగారం ముందు బైఠాయించిన ఽ నైట్ షిఫ్టు కార్మికులు ‘‘నాలుగు పరిశ్రమలు మా ప్రాంతంలో నెలకొల్పితే ఉద్యోగం, ఉపాధి దొరుకుతుందని సంబరపడ్డాం. అయితే కంపెనీల యాజమాన్యం నిరంకుశ వైఖరిని చూస్తే దిక్కుతోచక నివ్వెరబోతున్నాం. రోజూ 12 గంటల పాటు శ్రమదోపిడీకి పాల్పడుతుంటే మౌనంగా భరిస్తున్నాం. కనీస వసతులు కల్పించకపోయినా నోరెత్తకుండా పనిచేశాం. ఇక తట్టుకోలేక ఇన్నేళ్లకి తిరగబడ్డాం. వెట్టిచాకిరీ చేస్తున్నా వేతనంలో కోత విధించడం దారుణం. ప్రశ్నించినందుకు సెక్యూరిటీ సిబ్బందితో దాడి చేయించడం దుర్మార్గం’’ అంటూ రేణిగుంటలోని కార్బన్, నియో లింక్ పరిశ్రమ కార్మికులు మండిపడ్డారు. కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణిగుంట : తిరుపతిని ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ హబ్గా గుర్తించి రేణిగుంట విమానాశ్రయ రహదారిలో ఈఎంసీ1, సీఎంసీ–2లో పదుల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. ఆయా పరిశ్రమల యాజమాన్యాలు స్థానిక యువతను అన్స్కిల్డ్ కింద కూలీలుగా పనిలో పెట్టుకుని శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేసిన యువత జీతంలో కూడా కోత పెట్టడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డెక్కి కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక సంక్షేమ చట్టాలు, కనీస వేతన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పొట్ట పోషణకు వస్తే రేణిగుంటలోని కార్బన్, నియో లింక్ పరిశ్రమలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ పోషణ కొరకు పొట్ట చేత పట్టుకొని చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో చిరు ఉద్యోగులుగా స్థానిక యువత వారి జీవితాలను దగా చేస్తున్నాయి. అయితే బుధవారం నియో లింక్ పరిశ్రమలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వందల మంది కార్మికులు రోడ్డెక్కారు. విధులను బహిష్కరించి నిరసన గళం వినిపించారు. లేబర్ చట్టాల ప్రకారం రూ.23 వేల కనీస వేతనం చెల్లించాల్సి ఉండగా ఆ సంస్థ 8 గంటల పని కాకుండా అదనంగా 12 గంటలు పని చేయించుకుంటూ కేవలం రూ.10వేల నుంచి రూ.13 వేలు మాత్రమే చెల్లింస్తోందని కార్మికులు వాపోయారు. మహిళలకి సైతం మౌలిక వసతులు కూడా కల్పించడంలో కంపెనీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయించి, ఐడీ కార్డు బలవంతంగా తీసుకొని విధుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎదురు తిరిగితే సెక్యూరిటీ దారుణంగా దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం, రాత్రి రెండు విడతలగా కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఐ జయ చంద్ర, ఎస్ఐ సుధాకర్ హుటాహుటిన కంపెనీ వద్దకు చేరుకుని కార్మికులతో మాట్లాడారు. అనంతరం కార్బన్ యాజమాన్యం రంగంలోకి దిగి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. లేబర్ కమిషన్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. కంపెనీ ఎదుట డే షిఫ్ట్ కార్మికులు కార్బన్–నియోన్ కంపెనీ శ్రమ దోపిడీపై ఆందోళన సెక్యూరిటీ సిబ్బందితో దాడి చేయించడంపై ఆగ్రహం 12 గంటలు పనిచేయించుకోవడంపై ఆవేదన -
ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సందర్శన
తిరుపతి రూరల్ : మండలంలోని వేమూరులో రైతు అయ్యప్ప నాయుడుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం రాయలసీమ రీజియన్ బయో ఇన్పుట్స్ రిసోర్స్ సెంటర్ (బీఆర్సీ) ప్రతినిధులు 40 మంది సందర్శించారు. తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్ర రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షణ్ముగం ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఏటీఎం మోడల్లో విత్తనాలు, దేశీయ పద్దతుల్లో నారు నాటారు. అనంతరం బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రం, దశపర్ని కషాయాలతో పాటు పంచగవ్య తయారీ విధానాలను అధ్యయనం చేశారు. చెరుకు సాగులో వినూత్నంగా ఆకుకూరలు, కూరగాయలు విత్తనాలు నాటారు. బీడు భూముల్లో పీఎండీఎస్ విత్తనాలను చల్లారు. పూర్తిస్థాయిలో కషాయాల తయారీ విధానాలను రైతు అయ్యప్ప నాయుడు క్షుణ్ణంగా వివరించారు. ప్రాజెక్టు అడిషనల్ డీపీఎం పట్టాభిరెడ్డి, ఏపీఎం సత్యనారాయణ, జిల్లా రిసోర్స్ పర్సన్లు నాగరాజు, నరేంద్ర పాల్గొన్నారు. -
డ్రోన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి కృషి
తిరుపతి సిటీ : ఎస్వీయూలో డ్రోన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని వీసీ సీహెచ్ అప్పారావు తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీలో రిమోట్ ఫైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ మంజూరు కోసం పలు సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు స్పేస్ టెక్నాలజీ, డ్రోన్న్– స్పేస్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, వర్చువల్ ప్రొడక్షన్, సెమీ కండక్టర్స్ వంటి సాంకేతికతలకు టెక్నాలజీ లెర్నింగ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ శిక్షణ వసతులను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు డ్రోన్ సిమ్యులేటర్ సాఫ్ట్వేర్తో ప్రాక్టీస్, క్లాస్ రూమ్ సౌకర్యాల కోసం గ్రౌండ్ను తనిఖీ చేసినట్లు వివరించారు. రిజిస్ట్రార్ భూపతినాయుడు, డ్రోన్ డైరెక్టరేట్ ప్రణవ్, ఏరోస్పేస్ లిమిటెడ్ డైరెక్టర్ అంజలి, డిప్యూటీ డైరెక్టర్ ఆపరేషన్స్ కుంజలత, చేతల్ సింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ కో–ఆర్డినేటర్ ఆచార్య ధర్మారెడ్డి, రుసా సీఈఓ వంశీకృష్ణ పాల్గొన్నారు. -
గంగరంగ వైభవం
రేణిగుంట : నడివీధి గంగమ్మ దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం ఉదయం నుంచే ఆలయం వద్ద బారులు తీరారు. అమ్మవారిని సేవించుకుని పరవశించారు. ఈ క్రమంలో వేకువనే పసుపుతో చేసిన అమ్మవారి ప్రతిమను ఊరేగింపు తీసుకువచ్చి వేపాకు పందిరి కింద కొలువుదీర్చారు. ప్రత్యేక క్యూల ద్వారా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంగమ్మను దర్శించుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. భారీగా కుంభం సాయంత్రం అమ్మవారికి కుంభం పెట్టి మొక్కు లు తీర్చుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. భైరాగి వేషాలతో దిష్టి కుండలను నెత్తి న పెట్టుకుని మహిళలు, చిన్నారులు సమూహాలు గా నడివీధి గంగమ్మను సేవించుకున్నారు. ఆల య కమిటీ చైర్మన్ సోలా మల్లికార్జునరెడ్డి నేతృత్వంలో భక్తులకు వసతులు కల్పించారు. అర్ధరాత్రి తర్వాత అమ్మవారి ప్రతిమను ఊరేగించారు. అనంతరం నిమజ్జనంతో జాతరను పరిపూర్ణం చేశారు. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు ముగిసిన రేణిగుంట నడివీధి గంగమ్మ జాతర -
‘పరిశోధక’.. వేదన తీరక!
తిరుపతి సిటీ : ఎస్వీయూ అర్థశాస్త్ర విభాగంలో ఒక పరిశోధక విద్యార్థి అవమానకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. పీహెచ్డీ చేసేందుకు విభాగానికి వచ్చిన ఆ విద్యార్థి కూర్చోవడానికి గది లేక కాలేజీ వరండాలో నేలపై కూర్చొని నోట్సు రాసుకుంటున్నారు. ఇది గమనించిన ఎస్ఎఫ్ఐ ఎస్వీయూ కార్యదర్శి వినోద్కుమార్ తక్షణమే ఈ విషయాన్ని కాలేజీ వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి శాసీ్త్రయ, మేధోపర అభివృద్ధికి ఆయువుపట్టుగా ఉన్న పరిశోధక విద్యార్థులకు గదులు కేటాయించకపోవడం అత్యంత దారుణమన్నారు. నేటికీ కొంతమంది ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందినా వారి చాంబర్లను వీడకపోవడం విచారకమని మండిపడ్డారు. పలు విభాగాలలో అనేక గదులు ఖాళీగా ఉన్నప్పటికీ పరిశోధకులకు గదులు కేటాయించకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొంతమంది అధ్యాపకులు పరిశోధకులను అకడమిక్ పనుల కంటే తమ వ్యక్తిగత, ఇంటి పనులకు వాడుకోవడం, వెట్టిచాకిరి చేయించడం దుర్మార్గమన్నారు. దీనిపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులతో కలిసి సంబంధిత విభాగాల ఎదుట నిరసనకు దిగనున్నట్లు హెచ్చరించారు. ఈ క్రమంలో వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. -
బాధ్యతగా అటవీ సంరక్షణ
తిరుపతి రూరల్ : అడవులు, వన్యప్రాణుల సంరక్షణను బాధ్యతగా తీసుకుని ఫారెస్ట్ సిబ్బంది విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం ఎర్రావారిపాళెం మండలం తలకోనలోని అటవీశాఖ అతిథిగృహంలో జిల్లా అటవీ, వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అడవుల సంరక్షణకు ప్రత్యేకంగా మియావకీ ప్లాంట్లను అభివృద్ధి చేయాలన్నారు. వన్యప్రాణులను ఎవరైనా వేటాడితే నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపాలని స్పష్టం చేశారు. ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందించాలని సూచించారు. అటవీ భూముల ఆక్రమణకు యత్నిస్తే కేసులు నమోదు చేయాలని కోరారు. అనంతరం అటవీ అధికారులు తయారు చేసిన అజెండాలోని అంశాల వారీగా సమీక్షించారు. ప్రధాన అంశాలు ఇవీ... ● ఏనుగులు, చిరుతల వివరములను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ● ఎలిఫెంట్ అటాక్ ఫోర్స్ను మరింత అప్రమత్తం చేయాలి. ● ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన వారికి పరిహారం కింద సుమారు రూ. 60లక్షల చెల్లింపులకు ఆమోదం తెలిపారు. ● పెండింగ్లోని రెవెన్యూ, అటవీ భూ వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలి. ● అటవీ, వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్లో సత్యవేడు రేంజ్ పరిధిలోని ఉబ్బలమడుగు కమ్యూనిటీ బేస్ట్ ఎకో టూరిజం సెంటర్లో నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో అటవీ సంరక్షణాధికారి సెల్వం, జిల్లా అటవీశాఖ అధికారి వివేక్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్కలెక్టర్ రాఘవేంద్రమీనా, డీఆర్ఓ నరసింహులు, ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్రెడ్డి, కిరణ్మయి, డివిజనల్ అటవీ అధికారి శ్రీనివాసులు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అరుణ్కుమార్, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు. -
చెంచురెడ్డికి కన్నీటి వీడ్కోలు
● రాజకీయ గురువు పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి శ్రీకాళహస్తి: మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం ఈమేరకు అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. తన రాజకీయ గురువు పాడే మోశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాల కమిటీ మాజీ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, నేతలు పగడాల రాజు, కొత్తపాటి శ్రీనివాసులురెడ్డి, ఉత్తరాజి శరవణ కుమార్, శ్రీవారి సురేష్, మున్నా రాయల్, జయశ్యామ్ రాయల్, పులి రామచంద్ర, కంఠా ఉదయ్ కుమార్, యుగంధర్ రెడ్డి, నాగరాజు రెడ్డి, చెంచయ్య నాయుడు, చిందేపల్లి మధుసూదన్రెడ్డి, మధు రెడ్డి, దిలీప్, రంగయ్య, జీవీకే రెడ్డి, జై కష్ణారెడ్డి, అట్ల రమేష్, యాకూబ్, సురేష్, దినేష్ పాల్గొన్నారు. -
కలెక్టర్కు ‘స్కోచ్’ అవార్డు
తిరుపతి అర్బన్ : స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంలో కలెక్టర్ వెంకటేశ్వర్, బృందం కృషికి స్కోచ్ పురస్కారం దక్కనుంది. బుధవారం ఈ మేరకు స్కోచ్ గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ అవార్డును ప్రకటించారు. సెప్టెంబర్ 20వ తేదీన న్యూఢిల్లీలో కలెక్టర్ వెంకటేశ్వర్ అవార్డును అందుకోనున్నారు. ‘సీకామ్’కు అటానమస్ హోదా తిరుపతి సిటీ:తిరుపతి అన్నమయ్య సర్కిల్లోని సీకామ్ డిగ్రీ కళాశాలకు యూజీసీ అటానమస్ హోదా కల్పించిందని ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతినాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యానికి అధికారిక ఉత్తర్వులు అందించారు. కళాశాలకు ఐదేళ్ల పాటు అటానమస్ హోదా వర్తిస్తుందని పేర్కొన్నారు. 8 టిప్పర్ల సీజ్ తడ: తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 8 టిప్పర్లను బీవీపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు బుధవారం సీజ్ చేశారు. మట్టి స్మగ్లింగ్కు కూటమి నేతల అండదండలున్నట్లు తెలిసింది. వారిలో విభేదాల కారణంగానే టిప్పర్లలో గ్రావెల్ తరలుతున్న విషయం అధికారులకు గుట్టుగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య తిరుపతి క్రైమ్ : తిరుపతి రైల్వేస్టేషన్ 3వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద కదులుతున్న రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. వివరాలు.. ఉదయం 11:30 గంటల సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా పరిగెత్తుకెళ్లి బయలుదేరుతున్న రైలు కింద పడిపోయాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని రైల్వేపోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించాలని వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9440352765 నంబర్కు తెలియజేయాలని కోరారు. -
బాలిక అదృశ్యంపై ఫిర్యాదు
కలువాయి(సైదాపురం) : కలువాయి మండలం చిన్నగోపరం గ్రామానికి చెందిన బాలిక (17) ఈనెల 5వ తేదీన అదృశ్యమైనట్లు బాలిక తండ్రి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి చిన్న కుమార్తె కనపడలేదని, స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కోటయ్య తెలిపారు. కాలువలో పడి వ్యక్తి మృతి వెంకటగిరి రూరల్ : తెలుగు గంగ కాలువలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. బంగారుపేటలోని పల్లెవీధికి చెందిన వేలూరు పెంచలయ్య(45) మంగళవారం మధ్యాహ్నం బహిర్భూమి కోసం తెలుగుగంగ కాలువ వద్దకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలింపు చర్యలు చేపట్టారు. కాలువ గట్టు మీద పెంచలయ్య మోటార్సైకిల్, చెప్పులను గుర్తించారు. అప్పటికే చీకటి పడిపోవడంతో బుధవారం ఉదయం కాలువలో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెక్బౌన్స్ కేసులో నిందితుడికి జైలు తిరుపతి లీగల్ : చెక్బౌన్స్ కేసులో తిరుపతి పద్మావతిపురానికి చెందిన మహేష్ నాయుడు అనే నిందితుడికి 6 నెలల జైలు శిక్ష , రూ.5వేల జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు బుధవారం తీర్పు చెప్పారు. రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సుల సీజ్ – రూ.6లక్షల జరిమానా తిరుపతి మంగళం : జిల్లా రవాణాశాఖ అధికారులు బుధవారం చేపట్టిన వాహన తనిఖీల్లో పర్మిట్ లేకుండా తిరుగుతున్న రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు. రెండు బస్సులకు రూ.6లక్షల జరిమానా విధించారు. సకాలంలో ట్యాక్స్ చెల్లించకుండా వాహనాలను తిప్పితే సీజ్ చేస్తామని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. -
శ్రీసిటీ–వీఆర్వీ పరిశ్రమ వితరణ
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీ ఫౌండేషన్ సహకారంతో శ్రీసిటీలోని చార్ట్–వీఆర్వీ పరిశ్రమ సామాజిక బాధ్యతలో భాగంగా వరదయ్యపాళెం మండలం నాగానందపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యా వసతులు సమకూర్చింది. సుమారు రూ.31 లక్షల వ్యయంతో తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గది నిర్మాణాలను పూర్తిచేసింది. స్కూల్ ఆవరణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించింది. మొక్కలు నాటి, స్కూల్ మొత్తానికి రంగులు వేయించింది. ఈ మేరకు బుధవారం శ్రీసిటీ డైరెక్టర్ నిరీషా సన్నారెడ్డి సమక్షంలో చార్ట్ ఇండస్ట్రీస్ ఎండీ పర్వేశ్ మిట్టల్, డైరెక్టర్ యామిని సిన్హా చేతులమీదుగా నూతన వసతులను ప్రారంభించారు. వీఆర్ హెచ్ఆర్ మేనేజర్ కందస్వామి, ఎంఈఓ–2 గున్నయ్య పాల్గొన్నారు. -
27 వరకు నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు అవకాశం
తిరుపతి సిటీ:జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 27 వరకు పొడిగించారు. వరదరాజ నగర్ లోని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రంలో దరఖాస్తుల సమాచారం పొందవచ్చని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఇతర వివరాలకు 8688888802, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రేపు స్విమ్స్లో ఓపీ, ఓటీలకు సెలవు తిరుపతి తుడా : స్విమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. తారకరామా స్టేడియంలో ’జెండా పండుగ’ తిరుపతి అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీన జిల్లాస్థాయి వేడుకలను తిరుపతిలోని తారకరామా స్టేడియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏటా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జెండా పండుగ జరిగేదని, అయితే వర్షాల నేపథ్యంలో మార్పు చేసినట్లు పేర్కొన్నారు. డీవైఈఓగా ఇందిరాదేవి తిరుపతి అర్బన్ : తిరుపతి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి (డీవైఈఓ)గా ఇందిరా దేవి బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రేణిగుంట ఎంఈఓగా పనిచేస్తున్న ఆమెకు ఇన్చార్జి డీవైఈఓ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఇన్చార్జిగా విధులు నిర్వర్తించిన బాలాజీని తిరుపతి అర్బన్ ఎంఈఓ విధులు కేటాయించారు. జ్ఞానానికి సంస్కృతమే గమ్యం తిరుపతి సిటీ : జ్ఞాన సంపదకు, సంస్కృతికి గమ్యస్థానం సంస్కృతమేనని కేరళలోని చిన్మయ్ విశ్వ విద్యాపీఠం ప్రో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గీర్వాణి తెలిపారు. బుధవారం జాతీయ సంస్కృత వర్సిటీలో నిర్వహించిన సంస్కృత వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గీర్వాణి మాట్లాడుతూ దైవభాషగా వెలుగొందుతున్న సంస్కృతాన్ని నేటి యువత అభ్యసించాల్సిన అవసరముందన్నారు. అనంతరం వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృతంతోనే భారతీయ సంస్కృతి రక్షింపబడుతోందన్నారు. భాష ప్రాముఖ్యతను ఆధునిక సమాజానికి మరింత చేరువ చేయాలని సూచించారు. రిజిస్ట్రార్ కేవీ నారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ ఎస్.దక్షిణామూర్తి శర్మ, ప్రొఫెసర్ రంగనాథన్, డాక్టర్ భరత్ భూషన్ రథ్, డాక్టర్ ప్రదీప్కుమార్ బాగ్ పాల్గొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తులు తిరుపతి తుడా: స్విమ్స్ వైరాలజీ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ బిట్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీన స్విమ్స్లోని పాత డైరెక్టర్ కార్యాలయంలోని కమిటీ హాల్లో వాక్ ఇన్ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు స్విమ్స్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. పోక్సో చట్టంపై అవగాహన తిరుపతి రూరల్: బాలికలపై జరుగుతున్న లైంగికదాడులు, అఘాయిత్యాలను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా తీసుకొచ్చిన పొక్సో చట్టం గురించి శ్రీ పద్మావతీ మహిళా వర్సిటీ న్యాయ శాస్త్ర విభాగం తరఫున అవగాహన సదస్సు నిర్వహించారు. పేరూరులోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు, వారి తల్లిదండ్రులకు చట్టం గురించి వివరించారు. విశ్వవిద్యాలయ పీఎం ఉష, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కె. అనురాధ, న్యాయశాస్త్ర విభాగాధిపతి డా. సీతాకుమారి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. మాధురి పరదేశి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సునీత కాణిపాకం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు. -
సచివాలయ సెక్రటరీలకు వేధింపులు
తిరుపతి తుడా : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డు సచివాలయ సెక్రటరీలకు వేధింపులు తప్పడం లేదు. అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సర్వేలు, టెలి కాన్ఫరెన్స్లతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నగరంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీకి హాజరు కాలేదంటూ 281 మంది సచివాలయ సెక్రటరీలకు మెమోలు జారీ చేశారు. దీనిపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. సర్కులర్ లేకుండానే.. తిరుపతి నగరంలో మంగళవారం ఉదయం 6 గంటలకే హర్ గర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సెక్రటరీలు హాజరుకావాలని ఎలాంటి సర్కులర్ జారీ చేయలేదు. కనీసం వాట్సాప్ గ్రూప్ల్లో సైతం మెసేజ్ కూడా పెట్టలేదు. కేవలం సోమవారం రాత్రి నిర్వహించిన పీ4 సర్వే టెలీ కాన్ఫరెన్స్తో కార్యదర్శులందరూ ర్యాలీకి రావాలని ఓ మాట చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అయినప్పటికీ కొంతమంది హాజరయ్యారు. అయితే అధికారులు తమ తప్పిదం మరచి సెక్రటరీలకు మెమోలు జారీ చేసేశారు. ఎక్కువమంది మహిళలే ఉదయం ఆరు గంటలకు నిర్వహించిన హర్ గర్ తిరంగా ర్యాలీకి ఎక్కువమంది మహిళా సెక్రటరీలు హాజరు కాలేకపోయారు . మెమోలు జారీ చేసిన 281 మందిలో దాదాపు 190 మంది మహిళ సెక్రటరీలే ఉండడం గమనార్హం. ఇంట్లో పనులు పూర్తి చేసుకుని ఉదయం 6 గంటలకే ర్యాలీకి హాజరు కావాలంటే మహిళలకు ఎంత ఇబ్బందో కూడా అధికారులు గమనించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా పీ4 సర్వే సచివాలయ కార్యదర్శుల పాలిట శాపంగా మారింది. ప్రతి ఒక్కరూ ఐదు కుటుంబాలను పీ4లో చేర్పించాలని అధికారులు ఒత్తిడి చేస్తుండడం ఇబ్బందిగా తయారైంది. వేళాపాళా లేకుండా టెలీకాన్ఫరెన్స్లు పెడుతుండడం సరికాదని కార్యదర్శులు వాపోతున్నా రు. అధికారులు చేయాల్సిన పనులు కూడా తమపై రద్దుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 16 గంటలపాటు పనిచేయిస్తున్నారని, పైగా తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సెక్రటరీలకు జారీ చేసిన మెమో తిరంగా ర్యాలీకి రాలేదంటూ 281 మందికి మెమోలు -
రాజకీయ 'వైకుంఠ'పాళి
సాక్షి టాస్క్ ఫోర్స్: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, దేవదేవుడు, భక్తవత్సలుడు శ్రీ వేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం తిరుమల ప్రస్తుతం రాజకీయ వైకుంఠపాళికి నిలయమైంది. వివాదాలకు కేంద్రబిందువైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలి దివ్యక్షేత్ర ప్రతిష్టను మసకబారుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిననాటి నుంచి అక్రమాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. దీనికి నిదర్శనాలెన్నో.. ఎన్నెన్నో..ఆరుగురిని బలిగొన్న నిర్లక్ష్యం ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనిలో టీటీడీ చైర్మన్, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏకాదశికి భారీగా ప్రజలు తరలివస్తారన్న సమాచారం ఉందని, అయితే అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల తొక్కిసలాట జరిగిందని ఆనక తాపీగా ప్రకటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయంలో తమ వైఫల్యం ఉందనే విషయం చెప్పకనే చెప్పేశారు. నిందను అధికారులపై నెట్టబోయి తాను తీసిన గోతిలో తానే పడ్డారు. అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత తనదేనని మరిచిపోయారు. కనీసం తన వల్ల తప్పు జరిగిందని, క్షమాపణలు చెప్పడానికీ ఆయనకు నోరు రాలేదు. పైగా క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ ఆయన దురుసుగా వ్యాఖ్యానించిన తీరు అప్పట్లో వివాదాస్పదమైంది.శ్రీవాణి ట్రస్టు రద్దుకు కుటిలయత్నాలు దేశవిదేశాల్లోని శ్రీవారి ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టు ద్వారా గొప్ప కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే గత ఎన్నికల్లో దీనిపై టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కళ్యాణ్లు తీవ్ర ఆరోపణలు చేశారు. అబద్ధాలు వల్లెవేశారు. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే టివీ5 చైర్మన్ బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టడానికి ముందే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తానని ప్రకటించాడు.. చంద్రబాబు మనసులోని మాటను తన నోటితో పలికారు. శ్రీవాణి ట్రస్ట్ పై విజిలెన్స్ విచారణ కూడా జరిపించారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలు లేవని తేలడంతో తోకముడిచారు. కొంతకాలం శ్రీవాణి ట్రస్ట్ పేరు మారుస్తామని ప్రగల్భాలు పలికి అదీ చేయలేకపోయారు. శ్రీవాణి ట్రస్ట్ తక్కువ సమయంలో భక్తుల మన్ననలు, ఆదరణ పొందడమే దీనికి కారణం. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభమైంది కాబట్టే శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలనే బీఆర్నాయుడు, కూటమి పాలకులు కుటిలయత్నాలకు పాల్పడి చతికిలపడ్డారు.దళారులకు నిలయంగా చైర్మన్ కార్యాలయంటీటీడీ చైర్మన్ కార్యాలయం దళారులకు నిలయంగా మారింది. నిత్యం ఇక్కడ దర్శన టికెట్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వేలసంఖ్యలో వీఐపీ దర్శనాల మంజూరే దీనికి నిదర్శనం. గతంలో 3 వేల వరకు మాత్రమే వీఐపీ దర్శనాలు కేటాయించేవారు. ఇప్పుడు 7 వేల వరకు మంజూరు చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు తాజాగా ఉదయం, సాయంత్రం రెండుపూటలా వీఐపీ దర్శనాలు కొనసాగించాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయంతో సామాన్య భక్తుల పాలిట అశనిపాతంగా మారింది. ఈ నిర్ణయం వల్ల రోజూ పదివేల మంది సామాన్య భక్తులు దర్శనానికి దూరమవుతారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ అసంబద్ధ నిర్ణయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే సొంత చానల్లో చెత్త రాతలు రాయించి ప్రత్యర్థులపై బురదచల్లి బెదిరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు ఎలా చైర్మన్ను చేశారని, అతని వ్యవహారశైలి వల్ల టీటీడీ ప్రతిష్ట మసకబారుతోందని సామాన్య భక్తులూ ఆవేదన చెందుతున్నారు.దోపిడీకి కొత్తగా ఏఐ జపం సామాన్య భక్తులకు గంటలో దర్శనం చేయిస్తానని చైర్మన్ అయిన కొత్తలో ప్రగల్భాలు పలికిన బీఆర్నాయుడు ఆ తర్వాత ఆ హామీని గాలికొదిలేశారు. సంపన్నుల సేవలో తరించారు. ఇప్పుడు టీటీడీ ధనాన్ని దోచుకోవడానికి ఏఐ టెక్నాలజీ జపం చేస్తున్నారు. దీనివల్ల మూడు గంటల్లో సామాన్య భక్తులు దర్శనం చేయించుకోవచ్చని కోతలు కోస్తున్నారు. ఇది ఆచరణలో సాధ్యం కాదని తెలిసినా అదే జపం చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ పేరుతో ఐటీ కంపెనీలకు టీటీడీ సొమ్మును దోచి పెట్టడానికే ఈ ఎత్తుగడ అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో, చైర్మన్ మధ్య విభేదాలు ఏఐ టెక్నాలజీ విషయంలో ఈవో శ్యామలరావు, చైర్మన్ బీఆర్ నాయుడు మధ్య విభేదాలు తలెత్తాయి. ఆచరణలో ఏఐ టెక్నాలజీ సాధ్యం కాదని శ్యామలరావు దానిని అడ్డుకోవడంతో చైర్మన్ తన ఎల్లో చానెల్ ద్వారా ఈఓపై బురద జల్లే యత్నం చేశారు. వీరి మధ్య వివాదం చిలికిచిలికిగాలివానలా మారి పంచాయితీ సీఎం వద్దకు చేరింది.బీఆర్ నాయుడు తీరు సీఎం చంద్రబాబుకూ తలనొప్పిగా మారింది. బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత టీటీడీ ప్రతిష్ట పాతాళానికి పడిపోయిందనే నివేదికలు సీఎం వద్ద అప్పటికే ఉండడంతో అతడిని ఎందుకు టీటీడీ చైర్మన్గా చేశానా అని చంద్రబాబు తల పట్టుకుంటున్నారని సమాచారం. -
చాయ్ పే చర్చ
తిరుపతి గాంధీరోడ్డు: తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మంగళవారం ఉదయం చాయ్ పే చర్చ కార్యక్రమం ఉదయం 7.30 గంటలకు బాబు జగ్జీవన్ రావు పార్క్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు, ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఉదయం 9 గంటలకు శంకరంబాడికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం లీలామహల్ కూడలి నుంచి శోభాయాత్రగా కచ్ఛపి ఆడిటోరియానికి చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. తరువాత సాయత్రం 5 గంటలకు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులతో సమావేశమయ్యారు. -
విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరచడమే లక్ష్యం
తిరుపతి సిటీ: విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే లక్ష్యంగా నులిపురుగుల మాత్రలు ప్రభుత్వం అందిస్తోందని కలెక్ట వెంకటేశ్వర్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం తిరుపతి అర్బన్ కొర్లగుంటలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన 4,97, 511 మంది విద్యార్థులకు ఈ మాత్రలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ పిల్లలకు ఆల్బెండజోల్ మందు బిళ్లలను మింగించడమే లక్ష్యంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. డీఈఓ కేవీఎన్ కుమార్, ప్రోగ్రాం స్టేట్ నోడల్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీనివాస వర్మ, డాక్టర్ సౌజన్య లక్ష్మీ, డీపీఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రెడ్డి ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సింధు పాల్గొన్నారు. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తిరుపతి రూరల్: ర్యాగింగ్ వల్ల ఎంతోమంది అమాయకులు మానసిక వేదన అనుభవిస్తారని యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.ఉమ తెలిపారు. మంగళవారం శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేషనల్ యాంటీ ర్యాగింగ్ డే సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీనియర్ విద్యార్థినులకు యాంటీ ర్యాగింగ్పై అవగాహన కల్పించారు. అంతేకాక ర్యాగింగ్కు పాల్పడిన వారిపై తీసుకునే కఠిన చర్యలు ఉంటాయన్నారు. డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఉషారాణి, హాస్టల్ వార్డెన్ ప్రొఫెసర్ జి.సావిత్రి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఐవీ లలితకుమారి ర్యాగింగ్ నియంత్రణకు నిత్యం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. లీగల్ ఆఫీసర్ ప్రొఫెసర్ టి.సీతాకుమారి మాట్లాడుతూ జూనియర్ విద్యార్థినులకు స్నేహాన్ని పంచి ప్రశాంతమైన వాతావరణంలో వారు చదువుకునేలా అవకాశం కల్పించాలని సీనియర్ విద్యార్థినులను కోరారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ టి.మల్లికార్జున రావు, విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థిని భార్గవికి అభినందనలుతిరుపతి రూరల్ : శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలోని న్యాయశాస్త్ర విభాగంలో చదువుతున్న విద్యార్థిని భార్గవి నూకతోటి అమెరికాలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఐదు వారాల శిక్షణతో పాటు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సదస్సుకు హాజరై భారత దేశంలోని చట్టాలు, న్యాయ వ్యవస్థ గురించి సమగ్రంగా వివరించారు. ఈ సదస్సుకు భారతదేశంతో పాటు దక్షిణ కొరియా, శ్రీలంక, మలేషియా, బోస్నియా, హెర్జెగోవినా, జాంబియా, కజకిస్తాన్ నుంచి 19 మంది న్యాయశాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు. తిరిగి యూనివర్సిటీకి చేరుకున్న విద్యార్థిని భార్గవిని వీసీ ఆచార్య ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య రజినితో పాటు సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషనన్స్ డీన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి అభినందించారు. న్యాయశాస్త్ర విభాగాధిపతి, ఫ్యాకల్టీ సభ్యుల ప్రోత్సాహానికి భార్గవి నూకతోటి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
కరుణించమ్మా..
వైభవంగా రేణిగుంట గంగమ్మ జాతర ● పొంగళ్లు సమర్పించిన మహిళలు ● పోటెత్తిన భక్తజనం రేణిగుంట: కాపాడరావమ్మా.. గంగమ్మా అంటూ గ్రామదేవత గంగమ్మను భక్తజనం కొలిచారు. మంగళవారం రేణిగుంట గంగ జాతర సందర్భంగా సూర్యోదయానికి ముందు అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శోభాయమానంగా అలంకరించి భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ధర్మకర్త సోల మల్లికార్జున్ రెడ్డి తొలి హారతి పట్టి జాతరను ప్రారంభించారు. నూతనంగా అమ్మవారికి బహూకరించిన బంగారు పూత వెండి కవచాన్ని అలంకరించడంతో ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ఆవరణలో సింహ వాహనంపై అమ్మవారి ప్రతిమను అధిష్టింపజేసి చేపట్టిన విశేష పుష్పాలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నడివీధి గంగమ్మ త్రిశూలం వద్ద గంగమ్మ తల్లికి రాగి అంబలి పోసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహిళలు గంగమ్మ ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. గంగమ్మకు సారెగంగమ్మ జాతర సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మంగళవారం గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీకి ఆలయ మర్యాదలతో కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అర్చకులకు సారెను అందించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిపాయి మాట్లాడుతూ ముందుగా గత 20 ఏళ్లుగా గంగజాతరలో పాల్గొంటున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ నగేశం, ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ ఉల్లా, వీఆర్ రావణ, వన్నెకుల సంఘం నాయకులు దాము, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన
తిరుపతి అర్బన్: హెచ్ఐవీ పట్ల అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు వైద్యాధికారులతో కలసి హెచ్ఐవీని గురించి చర్చిద్దాం..హెచ్ఐవీని నివారిద్దాం అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి హెచ్ఐవీ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన అంశాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు.ఆ మేరకు అందరికి కరపత్రాలను అందించాలని సూచించారు. జీవితాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు తిరుపతి తుడా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారి వారి ఆధ్వర్యంలో మంగళవారం హెచ్ఐవీ ఎయిడ్స్, మాదకద్రవ్య వ్యసనాలపై యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అంనతరం క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కోటి రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాల ను విచ్ఛినం చేసుకోవద్దన్నారు. ర్యాలీలో మెడిక ల్, స్వచ్చంద సేవ సంస్థల సిబ్బంది, యువత, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డికి నివాళి
శ్రీకాళహస్తి: జిల్లాలో సీనియర్ పొలిటీషియన్, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి పార్థివదేహానికి పలువురు నేతలు నివాళులు అర్పించారు. మంగళవారం ఆయన స్వగృహంలో మృతదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. అన్ని పార్టీల నాయకులు, స్నేహితులు, బంధువులు, ప్రజలు, భారీగా తరలివచ్చి ఆయన పార్థి వ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, గుమ్మడి బాలకృష్ణయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ ఫరీద్, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీవారి సురేష్, దేవస్థానం మాజీ బోర్డు మెంబర్లు మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యామ్ రాయల్ తదితరులు ఉన్నారు. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కూడా మాజీ ఎమ్మె ల్యే చెంచురెడ్డి మృతదేహానికి నివాళి అర్పించారు. -
స్కూల్ గేమ్స్ సెక్రటరీ పోస్టుకు దరఖాస్తులు
తిరుపతి సిటీ: జిల్లాలో రెండేళ్ల కాలవ్యవధితో స్కూల్ గేమ్స్ సెక్రటరీ పోస్టు నియామకాలకు సంబంధించి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), పీఈటీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10 ఏళ్ల సర్వీసు కలిగి అర్హులైన ఉపాధ్యాయులు ఈనెల 20వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు. పోలీస్ గ్రీవెన్స్కు 85 అర్జీలు తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీ లు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 3 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,628 మంది స్వామివారిని దర్శించుకోగా 30,505 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. డీ–ఫార్మసీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గానూ డీఫార్మసీ రెండేళ్ల కాలవ్యవధి గల కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ రెగ్యులర్ లేదా ఓపెన్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులన్నారు. విద్యార్థులు httpr://apsbtet.in/pharmacy వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రతిని తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ఫార్మసీ విభాగంలో ఈనెల 19వ తేదీలోపు అందజేయాలని తెలిపారు. లేదా 9908857585, 9966761446, 9963541557, 9550690007,9059698747 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపవచ్చన్నారు. నేటి నుంచి ఉచిత విద్యకు దరఖాస్తులు తిరుపతి అర్బన్: ప్రైవేటు అండ్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద పిల్లలకు అందించాల్సిన 25 శాతం సీట్లకు సంబందించి ఉచిత విద్య కోసం మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సమగ్రశిక్ష కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి సురేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సచివాలయంలో లేదా డబ్యూడబ్యూడబ్యూ.సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అనంతరం ఈ నెల 25న ఎంపికై న విద్యార్థుల ఫలితాలను వెల్లడిస్తామని, 31 నుంచి పాఠశాలల్లో ప్రవేశాలు ఉంటాయని స్పష్టం చేశారు. హెల్ప్లైన్ కోసం 1800–4258599 నంబరుకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సంప్రదించవచ్చన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక ఉంటుందని వెల్లడించారు. దివ్యాంగులు, హెచ్ఐవీ బాధితుల పిల్లలు, అనాథలు, వీధి పిల్లలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. టాటా కేర్ ఫౌండేషన్తో ఎంఓయూ తిరుపతి తుడా: స్థానిక జూపార్క్ రోడ్డులోని ఎస్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్డ్స్ రీసెర్చ్ (స్వీకార్)లో సోమవారం టాటా కేర్ ఫౌండేషన్తో ఫెరడల్ బ్యాంక్ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా సంజీవినీ ప్రొగ్రాంలో భాగంగా క్యాన్సర్ డయాగ్నిస్టిక్ టెస్ట్లు, చికిత్స అవసరమైన అర్హులైన రోగులకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడమే ఎంఓయూ లక్ష్యమని బ్యాంక్ అధికారులు తెలిపారు. అలాగే అస్సాం రాష్ట్ర క్యాన్సర్ కేర్ ఫౌండేషన్తోనూ ఇదే అంశాలపై అవగాహన కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్ఓ ఎం.వెంకట్రామన్, టాటా క్యాన్సర్ సీఎఫ్ఓ కుమార్ నందుల, అస్సాం క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ సీఓఓ డాక్టర్ జైప్రకాష్ ప్రసాద్ పాల్గొన్నారు. -
కొన్నింటికే ఉచితం!
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం మహిళలకు ఈనెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమైంది. సీ్త్రశక్తి పేరుతో కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. అయితే పల్లెవెలుగు, ఆల్ట్రాపల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లు, మెట్రో సర్వీసులు, సిటీ సర్వీసులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక జిల్లాలో మెట్రో సర్వీసులు, సిటీ సర్వీసులు లేకపోవడంతో మూడు రకాల సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది.వీటిల్లో అనుమతి లేదుజిల్లాలో సప్తగిరి ఎక్స్ప్రెస్లే అధికం. వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. అంతేకాకుండా తిరుమలకు వెళ్లే సర్వీసుల్లోనూ, నాన్ స్టాప్ సర్వీసుల్లో, ఏసీ బస్సులతో పాటు ఇతర సర్వీసుల్లో అనుమతి లేదు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 855 సర్వీసులు ఉండగా.. వాటిల్లో 356 సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అందులో పల్లెవెలుగు 274, సాధారణ ఎక్స్ప్రెస్లు 77, అల్ట్రా పల్లెవెలుగు 5 సర్వీసులకు మాత్రమే అనుమతిచ్చారు.జిల్లాలో 16.5 లక్షల మంది మహిళలుజిల్లాలో 16.50 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరి కోసం 356 సర్వీసులకు అనుమతిచ్చారు. ఎన్నికల సమయంలో మాత్రం ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఊదరగొట్టారు. తీర 14 నెలలు తర్వాత పథకాన్ని అమలు చేసే క్రమంలో అనేక మెళికలు పెట్టారు. దీంతో మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.15 నుంచి అమలు చేస్తున్నాంమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సీ్త్రశక్తి పేరుతో అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ మేరకు డీఎంలతో సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చాం. జిల్లాలో 356 బస్సులకు మాత్రమే అనుమతి ఉంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సాధారణ ఎక్స్ప్రెస్లకు అవకాశం కల్పిస్తున్నాం. మరోవైపు పాఠశాలకు వెళ్లే బాలికలు ఇకపై బస్సు పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారికి పైన తెలిన మూడు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది.– జగదీష్, జిల్లా ప్రజారవాణా అధికారి -
ఖజానా ఖాళీ!
పంచాయతీల అభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రస్తుతం సర్పంచులుగా ఉన్న వారు పూర్తిగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు కావడంతో వివక్ష చూపుతోంది. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టిస్తోంది. దీంతో పంచాయతీల నిర్వహణ భారంగా మారుతోంది. కనీస అవసరాలైన తాగునీరు, వీధిలై ట్లు, పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు.వరదయ్యపాళెం : కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధుల్లో కోత పెడుతుండటంతో సర్పంచులు, అధికారులు ఏ పని చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీలు 15వ ఆర్థిక సంఘం, స్టాంప్ డ్యూటీ, వృత్తి పన్నుల పైనే ఆధారపడి ఉన్నాయి. పంచాయతీల్లో నిర్వహణ ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడంతో వచ్చిన నిధులు పారిశుద్ధ్య కార్మికుల వేతనం, మైనర్ రిపేర్ల ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. కొన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పంచాయతీలో ఏ పని చేయాలన్నా నిధుల కొరతతో ముందడుగు వేయలేకపోతున్నారు.పెరిగిన నిర్వహణ ఖర్చులుతిరుపతి జిల్లాలో 34 మండలాల్లో 774 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో 9,09,555 మంది జనాభా ఉన్నారు. పంచాయతీల్లో ట్రై సైకిళ్ల నిర్వహణ, విద్యుత్ బకాయిలు, పైపులైన్ సమస్యలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పారిశుద్ధ్య పనులు పెరిగిపోయాయి. దీంతో చేసిన పనులకే దిక్కులేకుండా పోగా, అధికారులు నిత్యం పంచాయతీలను తనిఖీ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తుండటంతో అదనపు ఖర్చులు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు.అసలే వర్షాకాలంవర్షాకాలం ప్రారంభ నేపథ్యంలో పంచాయతీల్లో ప్రధానంగా పారిశుద్ధ్య సమస్యలు పుట్టుకొస్తాయి. తద్వారా వివిధ రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. వ్యాధుల నియంత్రణకు క్లోరినేషన్ చేయాలి. ఈ పరిస్థితుల్లో పంచాయతీల ఖజానా ఖాళీగా ఉండడంతో సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో సర్పంచులు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆదాయ వనరులు ఉండే మేజర్ పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన 90శాతం గ్రామ పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతోంది.పది నెలలుగా నిధుల కొరత2024–25 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులను మొదటి విడత కింద సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేశారు. ఆ నిధులతోనే కాలం నెట్టుకొస్తున్నారు. రెండో విడత నిధులను కూడా కేంద్రం విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయలేదనే విమర్శలున్నాయి. ఒక్కో పంచాయతీలో దాదాపుగా పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.25 వేలు ఖర్చు వస్తోంది. ప్రస్తుతం కార్మికులు వేతనం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.స్వాతంత్య్ర వేడుకులకు ఉత్తి చేతులే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యం ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే వేడుకలకు నిధులు అందిస్తారని అందరూ భావించగా.. పంచాయతీల నుంచే వాడుకోవాలని జీఓ జారీ చేయడంపై సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేకుండా వేడుకలు ఎలా చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.రూ.60 కోట్ల నిధులు పెండింగ్గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘ నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఆ దిశగా తిరుపతి జిల్లాలోని 774 పంచాయతీలకు సంబంధించి ఒక విడతకు రూ. 45 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు 15వ ఆర్థిక సంఘ నిధులు జమ కావాల్సి ఉంది. అలాగే వైద్యఆరోగ్యశాఖ నుంచి ఏటా రెండు విడతల్లో పంచాయతీలకు రూ. 10 వేలు చొప్పున మొత్తంగా రూ. 20 వేలు జమ కావాలి. ఈ నిధులు కొన్ని సంవత్సరాలుగా పంచాయతీలకు జమ కావడం లేదు. ఈ విధంగా పంచాయతీలకు రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయకుండా పంచాయతీల అభివృద్ధిని కూటమి నీరుగారుస్తోంది.నిధులు కేటాయించకుండా కాలయాపనకూటమి ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులను పక్కదారి పట్టిస్తోందని గగ్గోలు పెట్టిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్నదేమిటి?. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించి పంచాయతీల అభివృద్ధిని గాలికొదిలేశారు. – దుడ్డు వేణు, సర్పంచ్, సీఎల్ఎన్పల్లివీధి దీపాల మరమ్మతులకు ఇబ్బందులే..కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులను పక్కదారి పట్టిస్తుండడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. కనీసం వీధి లైట్ల ఏర్పాటు, పంచాయతీ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నిధులు విడుదల కానిదే ఏ పనులు చేపట్టలేం. – చంద్రారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు, వరదయ్యపాళెం మండలం -
డీఎస్సీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు జరిగిన డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 1,478 పోస్టులకు సుమారు 50 వేల మందికిపైగా పోటీపడ్డారు. తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించిన డీఎస్సీ ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. టెట్ వివరాలకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే విధ్యాశాఖ అధికారిక వెబ్సైట్లో తమకు తామే టెట్ వివరాలను సరిచేసుకునేందుకు ఈనెల 13వ వరకు రెండు రోజుల పాటు వెసులుబాటు ఇచ్చారు. బ్యాడ్మింటన్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు రేపు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో 13వ తేదీ అండర్–19 బాలబాలికల బ్యాడ్మింటన్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ శశిధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 13వ తేదీ ఈ పోటీలకు హాజరు కావాలని ఆయన కోరారు. టీటీడీకి రూ.20 లక్షల విరాళం తిరుమల: బెంగళూరుకు చెందిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఎస్ఎన్వీఎల్ నరసింహరాజు అనే భక్తుడు సోమవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత ప్రతినిధి మోహన్ కుమార్ రెడ్డి తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ కార్యాలయంలో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. -
అనుబంధ విభాగాలు చురుగ్గా పనిచేయాలి
● కూటమి అరాచకాలు, దాడులపై నిరసనలు చేయండి ● తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు చురుగ్గా పని చేయాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి సూచించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలు, దాడులపై పార్టీ జిల్లా అనుబంధ విభాగాల నాయకులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ నిరసనలు చేపట్టాలన్నారు. కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా తాను ఉద్యమాల్లో ముందుంటానని తెలిపారు. కూటమి అరాచకాలను, దాడులను ఎప్పటికప్పుడు సోషల్మీడియా ద్వారా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కూటమి నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలపై విపరీతంగా దాడులకు పాల్పడుతున్నారని, వాటిని ఆయా వర్గాల నాయకులు ఖండించాలన్నారు. సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల ప్రోద్బలంతోనే మట్టి తవ్వకాలు
పెళ్లకూరు: మండలంలోని చిల్లకూరు మన్నేముత్తేరి చెరువులో యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపట్టి.. కోళ్లఫారం యాజమాన్యానికి పూర్తిగా సహకరించింది స్థానిక టీడీపీ నాయకులేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. కోళ్ల ఫారం నిర్మాణం తొలి దశ నుంచి యాజమాన్యం నుంచి ముడుపులు తీసుకుని టన్నుల కొద్దీ మట్టి తవ్వకాలు చేపట్టి జేబులు నింపుకున్నట్లు విమర్శించారు. మూడు నెలలుగా పౌల్ట్రీ నిర్మాణ పనులు జరుగుతుంటే అధికార పార్టీలో ఉంటూ అడ్డుకోకుండా.. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నార ని ప్రశ్నించారు. గతంలో మూడు పర్యాయాలు టీడీపీ నాయకులే వెళ్లి మట్టి తవ్వకాలను అడ్డుకున్నప్పుడు జిల్లా కలెక్టర్కు ఎందు కు ఫిర్యాదు చేయలేదన్నారు. ముడుపులు అందుకుంటే ఒక న్యాయం.. అడిగినంత ఇవ్వకపోతే మరో న్యా యమా? అని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల కోసం మాజీ సర్పంచ్ బసివిరెడ్డి వెంకటశేషారెడ్డి పదిహేనేళ్ల కిందట చెరువులో సిమెంట్ పైపులు వేసి తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం గ్రావెల్తో రోడ్డు అభివృద్ధి చేసి పౌల్ట్రీ వద్దకు వాహనాల రాకపోకలకు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. -
ఓటమిని లెక్క చేయని నాయకుడు తాటిపర్తి
● సుదీర్ఘకాలం రాజకీయ జీవితం గడిపిన నేత ● 1988లో జరిగిన ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపు ● కేవలం సంవత్సరమే ఎమ్మెల్యేగా పని చేసిన తాటిపర్తి చెంచురెడ్డి ● నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేతలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి(88) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన తాటిపర్తి.. పలు పర్యాయాలు వరుసగా ఓటమి పలకరించినా నిరుత్సాహ పడకుండా పోరాడారు. 1988లో జరిగిన ఉప ఎన్నికలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండుగారి శ్రీరామమూర్తిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు 1978లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ ఐ అభ్యర్థి ఉన్నం సుబ్రహ్మణ్యం నాయుడు చేతిలో ఓడిపోయారు. 1983లో కాంగ్రెస్ ఇండిపెండెంట్ మధ్య త్రిముఖ పోరు జరగడంతో కాంగ్రెస్ అభ్యర్థి కంటే కూడా అధిక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సత్రవాడ మునిరామయ్య చేతిలో కేవలం 80 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే సత్రవాడ మునిరామయ్య ఎంపిక చెల్లదని, ఆయన ఓ రైల్వే కాంట్రాక్టర్ అంటూ కోర్టు మెట్లు ఎక్కి విజయం సాధించారు. దీంతో కోర్టు సత్రవాడపై అనర్హత వేటు వేయడంతో 1988లో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ నుంచి కొండుగారి శ్రీరామమూర్తి ఉప ఎన్నిక బరిలో నిలబడగా, కాంగ్రెస్ నుంచి యథావిధిగా తాటిపర్తి పోటీపడ్డారు. టీడీపీ తరఫున ఎన్టీ రామారావుతో పాటు సినీ ప్రముఖులు శ్రీకాళహస్తిలో పెద్దఎత్తున ప్రచారం చేయగా, కాంగ్రెస్ తరఫున సూపర్స్టార్ కృష్ణ, జమున లాంటి వాళ్లు ప్రచారం చేశారు. టీడీపీ, ఎన్టీఆర్ హవా కొనసాగుతున్న సమయంలోనే ఉప ఎన్నిక రావడం.. చెంచురెడ్డి గెలవడం జరిగిపోయింది. 1989లో మళ్లీ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. చెంచురెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూద్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉన్నం వాసుదేవ నాయుడు, మాజీ ఎంపీ చింతామోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెంచురెడ్డి మృతికి ఎంపీ గురుమూర్తి సంతాపం తిరుపతి మంగళం:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియో జకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి మర ణం పట్ల తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి విచా రం వ్యక్తం చేశారు. ఆయన మృతి శ్రీకాళహస్తికి తీర ని లోటని గురుమూర్తి అన్నారు. సామాన్య ప్రజల కు అండగా నిలిచి, నియోజకవర్గ అభివృద్ధికి చెంచు రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. అందుకే ప్రజల మనసుల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
వెంకటగిరిలో వైఎస్సార్సీపీ హవా
● కొత్త మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ను రద్దు చేసిన కౌన్సిలర్లు ● పాత మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్లే కొనసాగించాలని 16 మంది ఆమోదం ● టీడీపీకి చెంప పెట్టులాంటి తీర్పు ● మరోసారి విఫలమైన కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు వెంకటగిరి (సైదాపురం): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడంతో పాటు పదవులను సైతం తమ గుప్పెట్లో వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు సాగిస్తోంది. అయితే తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్లో మాత్రం వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి సారథ్యంలో టీడీపీకి వరుస పరాజయాలు చవి చూపిస్తున్నారు. తొలిసారి మున్సిపల్ చైర్పర్సన్ పదవికీ అవిశ్వాసం అంశం తెరపైకి తెచ్చి అభాసుపాలయ్యారు. ఈ విషయం మరువకముందే మరోసారి మున్సిపల్ లీగల్ అడ్వైజర్గా ఉన్న జయప్రకాష్ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నుంచి తొలగించి కొత్తవారికి నియమించాలని టీడీపీ నేతలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 24వ అంశంగా పొందుపరిచారు. ఇందుకు సముచితంగా కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు లేరు. ఈ క్రమంలో ఈనెల 31వ తేదీన అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా కౌన్సిలర్లు నెల్లూరుకు తరలివెళ్లారు. గతంలో ఈ సమావేశానికి ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడంతో సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ వెంకటరామిరెడ్డి వ్యక్తపరిచారు. అనంతరం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఏకతాటిపై ఉండి అభివృద్ధికి తాము ఎప్పుడూ అడ్డురామని బహిరంగంగానే ప్రకటన చేశారు. 16 మంది ఆమోదం వెంకటగిరి మున్సిపల్లో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియతో పాటు 24 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉండగా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ సమావేశానికి 19 మంది మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న తరుణంలో మున్సిపల్ అధికారి అంశం–24 చదువుతుండగా ఆ అంశాన్ని చదనవసరం లేదని ఆ అంశాన్ని అజెండాలో నుంచి తొలగించాలని కౌన్సిలర్లు ముక్తకంఠంతో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియకు వివరించారు. ఈ మేరకు ఈ అంశం తొలగించాలన్నా వారు చేతులు పైకి ఎత్తమనగా 16 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తమ మద్దతు వ్యక్తపరిచారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్ అజెండా నుంచి అంశం–24ను తొలగించారు. దీంతో ప్రత్యక్షంగానే వెంకటగిరి మున్సిపాలిటీలో మరో విజయం వైఎస్సార్సీపీ తమ ఖాతాల్లోకి వేసుకుంది. -
అన్నదాతకు తీరని నష్టం
● గాలీవాన బీభత్సానికి 270 ఎకరాల్లో నేలవాలిన వరి పైరు ● 148 మంది రైతన్నలకు రూ.3.5 కోట్ల మేర నష్టం వాకాడు : మరో నాలుగు రోజుల్లో కోత కోయాల్సిన వరి పంట నేలపాలైంది. నాలుగు రోజుల్లో పంట చేతికొస్తుందని సంబరపడిన అన్నదాతలకు ఆదివారం రాత్రి కురిసిన వర్షం రూపంలో తీరని నష్టం వాటిల్లింది. సుమారు 148 మంది రైతన్నలకు కంటతడిని మిగిల్చింది. దీంతో 270 ఎకరాల్లో పంట నేలవాలి మొలకెత్తి, పాచిపోతోంది. వర్షం అదును దాటి కురవడంతో రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. మండలవ్యాప్తంగా ఖరీఫ్లో 1500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో తొలిదశలో ఇప్పటివరకు 209 ఎకరాల్లో పంట కోత పూర్తయింది. ఈ నెల 15 నుంచి రెండో దశ పంట కోత ఉండగా.. మొత్తం 270 ఎకరా ల్లో వర్షానికి పంట నీట మునిగింది. దీంతో మండలంలో దాదాపు రూ.3.5 కోట్లు నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట నేలవాలడంతో కన్నీరే మిగిలిందని రైతులు వాపోతున్నారు. గతేడాది కనీసం పెట్టిన పెట్టుబడులు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోయామని.. ఇప్పుడు ఈ వర్షం మరింత అప్పుల్లోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
బియ్యం కూడా ఇవ్వలేరా సామీ..?
తిరుపతి అర్బన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రేషన్ సరుకులు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని సివిల్ సప్లయ్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1 నుంచి 15 వరకు రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అయితే 1 నుంచి 4 లేదా 5వ తేదీకే డీలర్లు దుకాణాలు మూసి వెళ్తున్నారని మండిపడ్డారు. గత నెలలో 65 వేల మంది కార్డుదారులు బియ్యం తీసుకోలేదన్నారు. డీలర్లు అదనంగా 10శాతం బియ్యం ఇచ్చేవారని.. దాంతో తమ రేషన్ పరిధిలోని వారు కాకుండా స్థానికేతరులు వచ్చిన డీలర్లకు బియ్యం ఇచ్చేవారని చెప్పారు. అయితే కూటమి సర్కార్లో డీలర్లు ఇస్తున్న 10శాతం అదనపు బియ్యాన్ని నిలుపుదల చేయడంతో స్థానికేతరులకు బియ్యం ఇవ్వడం లేదని వెల్లడించారు. -
రాష్ట్రంలో గంజాయి రాజ్యమేలుతోంది
వాకాడు: ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్యాయాలు, దౌర్జ న్యాలతో పాలన గాడి తప్పిందని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. సోమవా రం ఆయన వాకాడు ఎంపీపీ కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చాక గూడూరులో కొందరు విచ్ఛలవిడిగా ఇసుక తవ్వకాలు, మద్యం విక్రయాలు, గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారని, అయితే వారిని దండించాల్సిన స్థానిక ప్రజాప్రతినిఽధి వారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం దేనికి సంకేతమన్నారు. పులివెందులలో పోలింగ్ బూత్లను ఊరికి దూరంగా మార్చడం విచారకరమన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు కొడవలూరు దామోదర్రెడ్డి, సర్పంచులు భాస్కర్రెడ్డి, మధురెడ్డి, మాజీ ఎంపీపీ మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి
కార్వేటినగరం: గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మండలంలోని కుప్పానిగుంట సమీపంలో చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. కార్వేటినగరం బీసీ కాలనీకి చెందిన అయ్యప్ప(41) పుత్తూరు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఓ కేసు విచారణ కోసం పళ్లిపట్టుకు వెళ్తూ మార్గమధ్యంలోని సురేంద్రనగరం సమీపం, చిన్నకనుమ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయ్యప్ప మృతదేహానికి ఘన నివాళి మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అయ్యప్ప మృతదేహానికి తిరుపతి ఎస్సీ హర్షవర్ధన్రాజు ఘన నివాళి అర్పించారు. అలాగే పుత్తూరు డీఎస్పీ రవికుమార్, నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, స్థానిక సీఐ హనుమంతప్ప పూలమాల వేసి నివాళి అర్పించారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ అయ్యప్ప కుటుంబానికి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్రాజు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. అదే విధంగా ఏఆర్ కానిస్టేబుల్ యూనియన్ ఆధ్వర్యంలో అయ్యప్ప కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు ఏఆర్ కానిస్టేబుల్గా పుత్తూరులో విధులు నిర్వహిస్తున్న అయ్యప్ప మృతి చెందడంతో సోమవారం తన స్వగ్రామం కార్వేటినగరంలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ● నివాళి అర్పించిన ఎస్పీ, డీఎస్పీలు -
గంగమ్మకు వెండి కవచాల విరాళం
రేణిగుంట: గంగ జాతర సందర్భంగా సోమవారం స్థానిక పాంచాలి నగర్కు చెందిన సూర్య ప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి అమ్మవారి మూలవిరాట్కు స్వర్ణ పూత వెండి కవచాలను అందజేశారు. దాత ఇంట్లో అమ్మవారి కవచాలకు విశేష పూజలు నిర్వహించి మేళతాళాలు నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున్ రెడ్డి, సభ్యులు స్వర్ణ పూత వెండి కవచాలను స్వీకరించారు. కార్యక్రమంలో సాయి మనోహర్, ధీరజ్ రెడ్డి, భరద్వాజ్ రెడ్డి, దినేష్, శరత్ బాబు, శివరాంరెడ్డి, హరిహర నాథ్ రెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
హక్కులను కాలరాస్తే ప్రతిఘటిస్తాం
సమస్యలపై పోరాడాలన్న యువగళం పిలుపు ఏమైంది లోకేష్?–సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామన్న మీరు హామీ ఇవ్వలేదా?–తక్షణం ఆంక్షలు ఎత్తివేయకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తాం–తిరుపతిలో కూటమి ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల కన్నెర్ర–మంత్రి లోకేష్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం... ఉద్రిక్తత ● ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ● హామీలు నెరవేర్చలేదంటూ మంత్రి లోకేష్ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం ● విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు మరోసారి కన్నెర్ర చేశాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తే ఖబడ్దార్ అని హెచ్చరించాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) నుంచి తిరుపతి టౌన్ క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి లోకేష్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా వందల సంఖ్యలో పోలీసులు చేరుకుని వారిని ఈడ్చి పడేసి అడ్డుకున్నారు. ఓ దశలో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు, కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీపై పోరాడుతున్న వామపక్ష, ప్రజాతంత్ర విద్యార్థి సంఘాలను విద్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకునేలా ఉత్తర్వులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తక్షణమే వాటిని రద్దు చేయకుంటే పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని, స్కూళ్లు, కళాశాలల్లో మౌలిక వసతులు కొరవడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధిస్తూ బ్రిటీష్ పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మీదే బాధ్యత అన్నారు కదా లోకేష్? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, సంఘాలకు ఎన్నికలు నిర్వహించే బాధ్యత తనదే అని ప్రగల్బాలు పలికారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక సమస్యలకు పరిష్కారం చూపకపోగా, ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, రవి, వినోద్, అశోక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉదయ్కుమార్, ప్రవీణ్, విష్ణు, వినయ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, నల్సా రాష్ట్ర అధ్యక్షుడు సుందర్, పీడీఎస్ఓ నాయకురాలు స్రవంతి, ఏఐఎస్ఐ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిజాయితీ
తిరుపతి రూరల్ : బస్సులో దొరికిన బంగారు నగలను బాధితురాలికి అప్పగించి ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. వివరాలు.. పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ39జెడ్0092) తిరుపతి నుంచి భీమవరం, కొమ్మిరెడ్డిగారిపల్లి మీదుగా పుంగనూరుకు సర్వీసు నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 10 తేదీన ఆదివారం తిరుపతి స్టాఫ్ క్వార్టర్స్ వద్ద తన చంటిబిడ్డను ఎత్తుకుని బస్సు ఎక్కిన సోంప ల్లి భార్గవి వెంకటరామాపురం వద్ద దిగి వెళ్లిపో యింది. కాసేపటి తరువాత తన రెండేళ్ల కుమార్తె రిషితాచౌదరి మెడలోని బంగారం గొలుసుకు ఉన్న లాకెట్ కనిపించక పోవడంతో బస్సులోనే పడిపోయి ఉంటుందన్న అనుమానంతో ఆర్టీసీ డిపో మేనేజర్కు ఫోన్ చేసింది. ఆమె దగ్గర ఉన్న టికెట్ ఆధారంగా ఆయన బస్ డ్రైవర్ అల్తాఫ్కు సమాచారం చేరవేయడంతో అప్పటికే సదుం దగ్గర వెళ్తున్న ఆయన బస్సును ఆపి ఆమె కూర్చు న్న సీటు వద్దకు వెళ్లి చూడగా సీటు కింద పడి ఉంది. వెంటనే ఆయన బంగారం లాకెట్ను తీసుకు ని బాధితురాలికి సోమవారం ఉదయం ఆమెకు అప్పగించారు. అయితే నిజాయితీ చాటుకున్న బస్సు డ్రైవర్ అల్తాఫ్ను బాధితురాలి కుటుంబీకులతో పాటు గ్రామస్తులు అభినందించారు. వైభవంగా గెరిగ ఊరేగింపు రేణిగుంట: గంగ జాతర మహోత్సవాల సందర్భంగా సోమవారం అమ్మవారికి ప్రతిరూపమైన గెరిగ ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. పురవీధుల్లో అడుగడుగునా భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రేణిగుంటలో గ్రామ దేవతగా వెలసిన గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. సోమవారం అమ్మవారికి ప్రతిరూపమైన గెరిగను అలంకరించి, గ్రామ చాకలిలో విశేష అలంకరణలో తలపై గెరిగను పెట్టుకుని డప్పుల దరువులు, పంబ వాయిద్యాల నడుమ పట్టణంలోని వీధుల్లో దర్శనమిచ్చారు. మంగళవారం జరగనున్న గంగ జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేణిగుంట పోలీసుల సహకారంతో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కమిటీ సభ్యులు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున్ రెడ్డి, సదా శివ రెడ్డి, జ్యోతి నారాయణ, ఉమేష్,లక్ష్మణ్ రెడ్డి, వీఆర్ రావణ, చినబాబు,సూరి,రేణు,భాస్కర్,వార్డు సభ్యులు ఎంజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దళితుల భూముల్లో పెత్తనం చెలాయిస్తారా?
చిల్లకూరు : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంతమంది నాయకులు దళితులు సాగు చేసుకునే భూములను ఆక్రమించుకుంటూ పెత్తనం చెలాయిండం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం ఆయన తిరుపతి నుంచి విజయవాడ వెళ్తుండగా చిల్లకూరు మండలం నక్కలకాలువ కండ్రిగలోని మిగుల భూములను స్థానిక సీపీఐ నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నక్కలకాలువ కండ్రిగలో సర్వే 1 నుంచి 23 వరకు ఉన్న మిగుల భూములు సుమారు 126 ఎకరాలను 2003 నుంచి నెలబల్లిరెట్టపల్లికి చెందిన దళితులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. మధ్యలో ఆ భూములను ఏపీఐఐసీకి కేటాయించినట్లు అధికారులు చెప్పడంతో కొంతమంది దళితులు సాగు చేయలేదన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూములపై కన్నేసిన కూటమి నాయకులు తమకు అనుకూలంగా ఉన్న వారి పేరిట స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. రెండు రోజులుగా కూటమి నాయకులు ఈ భూములను దున్ని గట్లు తొలగించి దళితులపై దౌర్జన్యానికి పాల్పడడం దారుణమని, తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రతి దళిత కుటుంబానికి కనీసం అరెకరం చొప్పున భూములు కేటాయించాలని కోరారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్ ప్రభాకర్, నాయకులు ఉన్నారు. -
చిన్న సమస్యలను వాయిదా వేయొద్దు
● కలెక్టరేట్ గ్రీవెన్స్కు 188 అర్జీలు ● పరిష్కారం చూపాలన్న జేసీతిరుపతి అర్బన్: ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 188 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపై 108 అర్జీల ను అందుకున్నారు. జేసీతోపాటు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కొందరు చిన్న చిన్న సమస్యల కోసం దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వస్తున్నారని తెలిపారు. వాటిని స్థానికంగానే పరిష్కరించాలని వెల్లడించారు. కొందరు చిన్న సమస్యలను సైతం పరిష్కరించకుండా వాయిదాలు వేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మురుగుపై నిర్మాణాలు తిరుచానూరులోని 7వ వార్డు పరిధిలోని కొత్తవీధిలో ఉన్న పొన్న మురుగు కాలువపై స్థానికంగా ఏలుమలై రెడ్డి ఇంటిని నిర్మిస్తున్నారు. దాంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న అందరికీ ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని డీఆర్వో నరసింహులకు, డీపీఓ సుశీలాదేవికి వినతిపత్రాన్ని ఇచ్చాం. – మునిరత్నం రెడ్డి, తిరుచానూరు -
తల్లికి పిడికెడు అన్నం పెట్టలేక..!
● ఇంటి నుంచి గెంటేసిన ఓ ప్రబుద్ధుడు ● కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన ఓ తల్లి సాక్షి టాస్క్ఫోర్స్: నవమోసాలు మోసి కని పెంచిన తల్లికి పట్టెడన్నం పెట్టలేక ఓ కొడుకు ఇంటి నుంచి గెంటేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తిరుపతి జిల్లా బాలాయపల్లికి చెందిన పెంచలయ్య నాయుడు, రావి సులోచనమ్మకు రావి హరిప్రసాద్, రెండవ కుమారుడు రావి రవికుమార్ ఇద్దరు కొడుకులు. పెంచలనాయుడు చనిపోయిన తర్వాత ఆయన ద్వారా సంక్రమించిన స్థిరాస్తులను ఇద్దరు కుమారులు, తల్లి రావి సులోచనమ్మ పంచుకుని, ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఆ ప్రకారం ముగ్గురు వేర్వేరుగా కలిసి కాపురం ఉండాల్సి ఉంది. అయితే రెండో కొడుకు రావి రవికుమార్, అతని భార్య లక్ష్మికామాక్షి ఇద్దరూ కలిసి తాము చూసుకుంటామని చెప్పి తల్లి సులోచనమ్మను వారింటికి తీసుకెళ్లారు. కొద్దిరోజుల తర్వాత కుమారుడు రవికుమార్ భార్యతో కలిసి తల్లి దగ్గర ఉన్న రూ.10 లక్షల నగదు, 15 సవర్ల బంగారు నగలను నమ్మించి తీసుకున్నాడు. అంతేకాకుండా ఆమె స్థిరాస్తులను కూడా అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత ఆమెను కొట్టి ఇంటి నుంచి తరిమివేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె బాలయ్యపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కొడుకు, కోడలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమ మీదే కేసు పెడతావా.. నిన్ను చంపేస్తామని వారు ఆమెను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం కలెక్టరేట్లో అధికారులకు తన పరిస్థితిని వివరించడంతో తప్పకుండా న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
వచ్చే మూడ్రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/కర్నూలు (అగ్రికల్చర్)/అనంతపురం అగ్రికల్చర్: ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలుచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 13వ తేదీ నాటికి వాయవ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు ఆస్కారముందని తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశమున్నట్లు వెల్లడించింది.పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. దీంతో.. ఈనెల 12న ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్.. 13న నంద్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్.. 14న ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. 15న ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ ప్రకటించింది. సహాయక చర్యలకు టోల్ఫ్రీ నెంబర్లు.. వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు. సోమవారానికి కాకినాడ జిల్లా రౌతులపూడిలో 4.2, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో 4.1, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 4 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. -
ఇదేం న్యాయం రక్షకా?
తిరుపతిలో సంచలనం రేపిన పవన్పై దాడి ఘటన ● దాడి చేసిన వారిని అరెస్ట్ చూపించని పోలీసులు ● దాడి చేయని వారిపై కక్ష సాధింపు చర్యలు ● అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమా? తిరుపతి క్రైం: శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. తిరుపతిలో సంచలనం రేకెత్తించిన పవన్పై దాడి ఘటనలో జనసేన పార్టీకి చెందిన దినేష్ ప్రధాన ముద్దాయిగా ఉన్నా అతన్ని ఇంతవరకు అరెస్టు చూపించ లేదు. పవన్పై దాడి చేయకపోయినా ఏ2, ఏ3 నిందితులుగా చేర్చి అనిల్కుమార్రెడ్డి, జగ్గారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం చర్చనీయాంశంగా మారింది. ఇంత బరితెగింపా.. పవన్పై దాడి ఘటనతో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కుటుంబానికి ఏ మాత్రం సంబంధం లేదు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా ఉన్న అనిల్కుమార్రెడ్డిని టార్గెట్గా చేసుకుని ఆయన అనుచరులు బరితెగించారంటూ ఎల్లోమీడియా మూడు రోజులుగా విషం చిమ్ముతోంది. పచ్చి అబద్ధాలతో పైశాచిక ఆనందం పొందుతోంది. టీటీడీ చైర్మన్పై విమర్శలు చేసిన భూమన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎల్లో మీడియా కంకణం కట్టుకుంది. అధికార కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్త దినేష్ పవన్ను లాఠీతో చావగొట్టే వీడియో బయటకొచ్చినా అతనిపై చర్యల్లేవు. ఈ ఘటనలో ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్– 368/25 కింద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏ1గా దినేష్, ఏ2గా అనిల్కుమార్రెడ్డి, ఏ3 జగ్గారెడ్డి అండ్ అదర్స్ అంటూ కేసు కేసు నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏ2, ఏ3లుగా ఉన్న అనిల్కుమార్రెడ్డి, జగ్గారెడ్డితో పాటు, ఏ1గా ఉన్న దినేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై ఏ2, ఏ3లుగా ఉన్న వారిని మాత్రమే రిమాండ్కు తరలించారు. ఏ1గా ఉన్న దినేష్ను ఇంతవరకు అరెస్టు చూపించలేదు. ‘నాపై దాడి ఘటనలో ఎవరి ప్రమేయం లేదు.. మీరు ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు..’ అంటు భాదితుడు పవన్ వీడియోలు రిలీజ్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందనేది ఇప్పటి వరకు అర్ధంకాని ప్రశ్న. తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు 9 ప్రత్యేక బృందాలును రంగంలోకి దిగడంతో చిత్తూరులో ఉన్న పవన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రస్తుతం తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిచ్చిన సమాచారం మేరకు విచారణ మరింత వేగవంతం చేశారు. వీటికి సమాధానం ఏదీ? పవన్పై దాడి చేసిన దినేష్ను ఎందుకు రిమాండ్కు తరలించలేదు..? చట్టప్రకారం ముద్దాయిని 24 గంటల్లోపు జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. కానీ దినేష్ను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి 72 గంటలు దాటినా అరెస్టు చూపించకపోవడం వెనుక మతలబు ఏంటి? పవన్పై దాడి చేసే సమయంలో దినేష్కు పైబర్ లాఠీ అందించిన కానిస్టేబుల్ ఎవరు? వారితో పాటు ఉన్న మరొక కానిస్టేబుల్ కుమారుడు ఎవరు? పవన్ స్టేట్మెంట్లో ఏం సమాచారం ఇచ్చాడు? అతనితో సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయించింది ఎవరు? సెల్ఫీ వీడియోలు విడుదల చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది..? పవన్ గారడీ మాటలు ఎలా నమ్మాలి? .. వీటిపై పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంది. -
గూడు చెదిరె.. గోడు మిగిలె!
నాడు సక్రమం.. నేడు అక్రమం ● ఇష్టానుసారంగా పేదల ఇళ్లు కూల్చివేత ● ప్రజాప్రతినిధి ఆదేశాలు పాటిస్తూ రెచ్చిపోతున్న అధికారులు ● ఏడాదిలో వెయ్యి వరకు పేదల ఇళ్లు కూల్చివేత సాక్షి టాస్క్ఫోర్స్: సొంతింటి కల.. సగటు పేదవాని జీవితంలో తీరని స్వప్నం.. ఎంత రెక్కల కష్టం చేసినా నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లటానికి అపసోపాలు పడుతున్న బడుగు జీవులు రూపాయి, రూపాయి కూడబెట్టుకుని గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్మించుకున్న ఇళ్లను ముఖ్యనేత ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కనీసం కనికరం చూపకుండా పేదల ఆశల గూళ్లను నేలమట్టం చేస్తున్నారు. అప్పట్లో అదే రెవెన్యూ శాఖలోని అధికారులే ఇళ్లు నిర్మించుకుంటుంటే అవి అక్రమమని తెలిసి ఎందుకు అడ్డుకోకుండా ఎంజాయ్మెంట్ పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం అదే అధికారులు ఎవరి మెప్పు కోసం కూల్చుతున్నారోనని పేదల శాపనార్థాలు అరణ్యరోదనగా మిగిలాయి.’ నియోజకవర్గంలో శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో అక్రమ నిర్మాణాల పేరుతో సుమారు వెయ్యి ఇళ్లు నేలమట్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఓ వైపు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులపై భౌతిక దాడులను చేయడంతోపాటు అక్రమ కేసులు బనాయించి తీవ్ర భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. మునుపెన్నడూ లేని సంస్కృతికి భీజం వేశారు. తాజాగా మూడు రోజుల కిందట రేణిగుంట మండలం కుర్రకాల్వలో అక్రమ నిర్మాణాలని తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసు, రెవెన్యూ బలగాలతో 77 ఇళ్లు కూల్చివేశారు. గతంలో రెవెన్యూ అధికారులే...: గతంలో రేణిగుంట మండలంలోని పేదలకు ఏర్పేడు మండలం పాగాలి సమీపంలో జగనన్న కాలనీ వద్ద ఇళ్లను కేటాయించి, ఇంటి పట్టాలు మంజూరు చేశారు. అయితే రైతుల నుంచి తీసుకున్న భూముల పరిహారాన్ని కొంతమంది రైతులకు మాత్రమే వేసి, మిగిలిన రైతులకు పరిహారం ఇవ్వకుండా జాప్యం చేశారు. దీంతో రైతులు అడ్డుకోవడంతో అక్కడ స్థలాలు చూపే పరిస్థితి లేకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డికి స్థానికులు ఇంటిస్థలాల కోసం మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన సమస్యను పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారులను కోరడంతో కొంతమందికి మండలంలోని మిగులు భూముల్లో ఇంటిస్థలాలకు కేటాయించారు. లబ్ధిదారులకు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు, ఇంటి పన్నులు మంజూరు చేశారు. దీంతో పేదలు అప్పు చేసి చిన్నపాటి రేకుల షెడ్లను నిర్మించుకున్నారు. అప్పట్లో నిర్మించిన ఈ ఇళ్లన్నీ అక్రమం అయితే నిర్మాణ దశలో రెవెన్యూ అధికారులు కళ్లుమూసుకుని విధులు నిర్వహించారా..? అని పేదలు ప్రశ్నిస్తున్నారు.మా ఉసురు తగులుతుంది.. కూలీనాలీ చేసుకుని బతికేటోళ్లం.. సొంతిల్లు లేకుండా బాడుగ కట్టలేక ఎన్నో అవస్థలు పడ్డాం. గత ప్రభుత్వంలో మాకు ఇంటి స్థలం చూపారు. రూ.లక్ష అప్పు చేసి ఇళ్లు నిర్మించుకున్నాం. అప్పట్లో రెవెన్యూ అధికారులు మాకు అనుభవ పట్టాలు ఇచ్చారు. ఇంటిపన్ను వేశారు. కరెంటు మీటర్లు తీసుకున్నాం. అయినా అక్రమ నిర్మాణాలు అని చెప్పి ఉన్న పళంగా మా ఇళ్లన్నీ కూల్చేశారు. ప్రాధేయపడినా కనికరించలేదు. మా ఉసురు తగులుతుంది. – ఏసమ్మ, పద్మనగర్, కుర్రకాల్వ, రేణిగుంట మండలం పేదలపై ఎందుకు కక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నియోజకవర్గంలో అధికారులు ఎందుకో పేదలపై కక్ష కట్టారు. ఎవరి మెప్పు కోసమో పేదలను మరింత అప్పుల ఊబి లోకి నెట్టేస్తున్నారు. అవి అక్రమ నిర్మాణాలైతే ఇళ్లు కట్టుకుంటున్న సమయంలో రెవెన్యూ అధికారులకు కనిపించలేదా? నియోజకవర్గంలో వందల ఎకరా లు పెద్దలు ఆక్రమించుకుని దర్జాగా వెంచర్లు వేసుకు ని అమ్ముకుంటుంటే అవేమీ రెవెన్యూ అధికారులకు కనబడలేదా? – హరినాథ్, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు, రేణిగుంటఅధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.. నియోజకవర్గంలో అధికారు లు పూర్తిగా ఎమ్మెల్యేకు తొత్తు గా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు అన్ని చోట్ల దోచుకుంటూనే మరో పక్క పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు. బడా బాబులకు వందల ఎకరాలు భూములు ఉచితంగా కట్టబెడుతున్న ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గం. రూ.లక్షలు అప్పు చేసి ఇళ్లు కట్టుకుంటే కూల్చివేయించటం చాలా దుర్మా ర్గం. రాష్ట్రంలో ఎక్కడా లేని సంస్కృతి శ్రీకాళహస్తిలో నే జరుగుతోంది. మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తాం. – బియ్యపు మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి యంత్రాలతో ఇళ్లు కూల్చివేస్తున్న అధికారులుకూల్చివేయనందుకే తహసీల్దార్ బదిలీ అక్రమ నిర్మాణాల పేరుతో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఇళ్లను కూల్చివేయనందుకు రేణిగుంటకు చెందిన గత తహసీల్దార్ను బదిలీ చేశారు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆదేశాలే ప్రభుత్వ నిబంధనలు అన్నట్లుగా వ్యవహరిస్తూ పేదలపై ప్రతాపం చూపుతున్నారు. కొన్ని నెలల కిందట రేణిగుంట మండలంలోని చెంగారెడ్డిపల్లి ఎస్టీ కాలనీలో ఎస్టీలకు చెందిన ఇళ్లను పోలీసు బలగాలతో తలుపులు మూయించి అర్ధరాత్రి లైట్లు ఆపి, జేసీబీలతో ఇళ్లన్నీ నేలమట్టం చేశారు. పేదల ఇళ్లే లక్ష్యంగా దౌర్జన్యకాండ శ్రీకాళహస్తి పట్టణంలోని రాజవ్నగర్లో 300 ఇళ్లకు పైగా నేలమట్టం చేసి సుమారు రూ.5 కోట్లు మేరకు పేదల ఆస్తులకు నష్టం కలిగించారు. రేణిగుంట మండలంలో తూకివాకం పంచాయతీ వివేకానంద కాలనీలో 125 ఇళ్లు, సీబీఐడీ కాలనీ 28 ఇళ్లు, కుర్రకాల్వ పద్మానగర్ 150 ఇళ్లు, చెంగారెడ్డిపల్లిలో 135 ఇళ్లు, వెంకటాపురం పంచాయతీ పరిధిలో 40 ఇళ్లు కూల్చివేశారు. -
బైక్లు ఢీ : ఇద్దరు మృతి
చిట్టమూరు : మండల పరిధిలోని మొలకలపూడి బోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. వాకాడు గ్రామానికి చెందిన కావలి కిరణ్కుమార్ (40), నాయుడుపేటకు వెళ్లి తిరిగి స్వగ్రామం వాకాడుకు మోటారు సైకిల్పై వస్తున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లకూరు మండలం పున్నేపల్లి గ్రామానికి చెందిన కోవూరు వెంకటరమణ (42) నాయుడుపేట మండలం గొట్టిప్రోలు గ్రామానికి భార్యా, పిల్లలతో వెళ్లి తిరిగీ పున్నెపల్లికి బైక్పై బయలు దేరగా రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా మొలకలపూడి గ్రామ సమీపంలోని బోటు వద్ద ఢీ కొనడంతో వాకాడుకు చెందిన కిరణ్కుమార్, పున్నేపల్లికి చెందిన కోవూరు వెంకటరమణ మృతి చెందారన్నారు. అయితే మోటార్ సైకిల్ వెనుక కూర్చుని ఉన్న వెంకటరమణ భార్య, పిల్లలకు తీవ్ర గాయాలు కావడంతో 108లో నాయుడుపేట వైద్య శాలకు తరలించి చికిత్స చేస్తున్నారు. చిట్టమూరు ఎస్ఐ చిన్న బలరామయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృత దేహాలను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టంకు తరలించారు. వాకాడుకు చెందిన కిరణ్కు భార్య పిల్లలు ఉన్నారు. దీంతో రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.పెన్నేపల్లిలో విషాదంపెళ్లకూరు : మండలంలోని పెన్నేపల్లి గ్రామానికి చెందిన కోవూరు వెంకటరమణ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన వెంకటరమణ భార్య కామాక్షి పిల్లలు కలిసి గొట్టిప్రోలు గ్రామంలో చర్చ్లో ఆరాధన ముగించుకొని బైక్లో తిరిగి స్వగ్రామం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటరమణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
జీలపాటూరులో విషాదం
పెళ్లకూరు: మండలంలోని జీలపాటూరు దళితవాడలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కత్తి గురవయ్య(42) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం గురవయ్య ఓ ప్రయివేట్ పరిశ్రమలో విధులు ముగించుకొని నాయుడుపేట చంద్రబాబునాయుడు కాలనీ సమీపంలో రోడ్డు పక్కన నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో ట్రాక్టర్ ఢీకొంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. స్థానిక సర్పంచ్, గ్రామ పెద్దలు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతునికి భార్య ధనమ్మ, కుమారులు లోకేష్, ప్రవీణ్కుమార్ ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు లింగమనాయుడుపల్లెకు చెందిన కోగిల జయరాం వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఆయన బయలుదేరగా తొట్టంబేడు మండలం మల్లిగుంట వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం–కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కోగిల జయరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్యూటీకి వెళుతూ మృత్యుఒడికి..
ఏర్పేడు : ఏర్పేడు–వెంకటగిరి మార్గంలో ఏర్పేడు మండలం దుర్గిపేరి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై డ్యూటీకి వెళుతున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏర్పేడు ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి కథనం మేరకు... శ్రీకాళహస్తి మండలం కుంటిపూడి గ్రామానికి చెందిన కె.చంద్రయ్య కుమారుడు కోవూరు నవీన్ కుమార్(25) మూడు నెలల కిందట కాపుగున్నేరి సమీపంలోని కోకాకోలా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరాడు. ఆదివారం ఏ–షిఫ్ట్ కావడంతో కుంటిపూడి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై ఏర్పేడు మీదుగా కోకాకోలా కంపెనీకి వెళ్లేందుకు బయల్దేరాడు. క్రిష్ణంపల్లి క్రాస్ దాటి, దుర్గిపేరి సమీపంలో ఎదురుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన రక్తగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు ముగ్గురు కుమారులు కాగా, అందరికంటే చిన్నవాడు మృతుడు నవీన్కుమార్. మూడు నెలల కిందటనే డ్యూటీలో చేరి కుటుంబానికి కొంత ఆసరా ఉన్న కొడుకు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వాకర్స్ సేవలు మరింత విస్తృతం తిరుపతి కల్చరల్: వాకర్స్ ప్రతినిధులు తమ సేవలను మరింత విస్తృతం చేస్తూ సమాజ శ్రేయస్సులో భాగస్వాములు కావాలని వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు, గవర్నర్ రావిళ్ల మాధమ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం యూత్ హాస్టల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 302 క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారితోపాటు రీజినల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడారు. అనంతరం తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ వాకర్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం నారాయణాద్రి హాస్పిటల్ ప్రతినిధులు వాకర్స్ సంఘాలకు బీపీ పరీక్షల యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు రామచంద్రారెడ్డి, కోనేటి రవిరాజు, మనోహరన్, వినాయగం, వేణుగోపాల్రాజు, చంద్ర, శాంతి నాడార బాలాజీ నాయుడు, వాకర్స్ పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తిలో జరుగుతున్న గ్రీవెన్స్కు హజరుకానున్నారు. దీంతో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ నేతృత్వంలో కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ చేపట్టనున్నారు. ఐసీడీఎస్లో ఉద్యోగానికి దరఖాస్తులు తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్లో కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్గా పనిచేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ వసంతబాయి ఒక ప్రకటనలో ఆదివారం వెల్ల డించారు. ఈనెల 11 నుంచి 20 వరకు దరఖాస్తు ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. పోస్టు ద్వారా లేదా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖా స్తు ఇవ్వాలని తెలిపారు. 25–42 వరకు వయో పరిమితి ఉండాలని, ఓసీ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే రూ.200 నగ దు దరఖాస్తుతో పాటు చెల్లించాలని స్పష్టం చేశా రు. అదనపు సమాచారం కోసం తిరుపతి.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ చూడాలని సూచించారు. నేటితో ముగియనున్న ఇంటర్ ప్రవేశాలు తిరుపతి సిటీ:జిల్లాలోని ప్రభుత్వ,హైస్కూల్ ప్లస్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం ఆయా కళాశాల ప్రిన్సిపల్స్ను సంప్రదించాలని ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి సూచించారు. 21న రాగి రేకులకు టెండర్ కమ్ వేలం తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ సిల్వర్ కోటెడ్ రాగి రేకులు ఈ నెల 21వ తేదీన టెండర్ కమ్ వేలం (ఆఫ్లైనన్్ ) వేయనున్నారు. ఈ మేరకు ఆదివారం టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలం) 0877–2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో లేదా టీటీడీ వెబ్సైట్ ను సంప్రదించాలి. 18న చలో ఢిల్లీ తిరుపతి కల్చరల్: బీసీల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈనెల 18,19వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేయనున్న తరుణంలో ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీ సంఘాల ప్రతినిధులందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై.నాగేశ్వర యాదవ్, దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జ్ షణ్ముగం, జిల్లా అధ్యక్షుడు తురక అమరనాథ్ పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కరపత్రాలను జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్ చేతుల మీదుగా ఆవిష్కరించి మాట్లాడారు. బీసీల సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి కొండా రామారావు, జ్ఞానశేఖర్, రవి, శరవణ, సందీప్, వెంకటేష్, కిషోర్, బీసీ నేతలు పాల్గొన్నారు. 1న పెన్షన్ మార్చ్ జయప్రదం చేయండితిరుపతి కల్చరల్ : సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న విజయవాడ, గుంటూరు మధ్య భారీ స్థాయిలో చేపట్టే పెన్షన్ మార్చ్లో ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ఈఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ పిలుపు నిచ్చారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పెన్షన్ మార్చ్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి ప్రసంగించారు. 20 ఏళ్లుగా రాష్ట్రంలోని 4 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు పెన్షన్ రాకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అయినా సీపీఎస్ రద్దుపై కనీసం ఉద్యోగులతో చర్చలు జరపలేదన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ వెన్నుపోటు పొడిచిన రోజుగా భావిస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ మార్చ్ చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో ఏపీసీపీఎస్ఈఏ జిల్లా అద్యక్షుడు వంకీపురం పవన్, ఏపీ ప్రభుత్వం ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రయ్య, కోశాధికారి శ్రీనివాసులు, చలపతి పాల్గొన్నారు. -
12న ఆటో, టాక్సీ డ్రైవర్ల ఆందోళన
తిరుపతి కల్చరల్: ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆటో అండ్ టాక్సీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్.శివ డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ సర్కిల్లో నిరసన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. 12న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఉదయం 10 నుంచి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామన్నారు. ఆటో, టాక్సీ డ్రైవర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆటో, టాక్సీ యూనియన్ నేతలు సురేష్, పురుషోత్తంరెడ్డి, వెంకటేష్, రమేష్, ప్రమీల, పార్వతి, వాణిరెడ్డి, సతీష్, కాశి, భాస్కర నవీన్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
కూటమి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
తిరుపతి మంగళం:కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలతో ఎండగడుతున్నామనే కక్షతోనే వైఎస్సార్సీపీతో పాటు తమ కుటుంబంపై కూటమి నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎయి ర్ బైపాస్రోడ్డు, న్యూబాలాజీ కాలనీలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులకు క్రమశిక్షణ తరగతులు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిబద్దత, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవ్వరూ వ్యవహరించమంటూ పార్టీ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి న హామీలను అమలు చేయకుండా మోసం చేస్తు న్న కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిరుపతి నుంచి ఎండగడుతూ కూటమి నాయకుల గుండెల్లో దడ పుట్టిస్తున్నామన్నారు. అది కూటమి నాయకులు జీర్ణించుకోలేక ఎల్లో సోషయల్ మీడియాలో వైఎస్సార్సీపీతో పాటు భూమన కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు పోస్టింగ్లు పెడుతూ బురదజల్లే ప్రయ త్నం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి నగరంలో కూటమి దుష్ప్రచారాలను తిప్పికొట్టేలా వైఎస్సార్సీపీ సోషయ ల్ మీడియా చురుగ్గా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ లోపాలను ప్రజల కు వివరిస్తూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పనిచేయాలన్నారు. కూటమి చేస్తున్న దుష్ప్రచారాలకు భయపడే ప్రసక్తేలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డితో పాటు కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామనే కక్ష పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేసిన భూమన అభినయ్రెడ్డి -
అడ్మిషన్లు..
మన బండ్లే .. వదిలేయండి! కలువాయిలో రెవెన్యూ, పోలీసులు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నారు. కూటమి నేతల నుంచి ఫోన్లు రావడంతో వదిలేశారు.బురిడీ కొట్టించిన మహిళలు అరెస్టు బంగారం దుకాణంలో నగల కొనుగోలుకు వచ్చి బంగారు నగలు కాజేసిన మహిళలను పోలీసులు పట్టుకున్నారు.సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లోజిల్లా సమాచారం ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు 2 ప్రైవేటు కళాశాలలు 11 అటానమస్ కళాశాలలు 5 డీమ్డ్ యూనివర్సిటీలు 2 అన్ని కళాశాలలో సీట్ల సంఖ్య 31,750 తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు 12,218 రెండవ విడత కౌన్సెలింగ్కు వెబ్ ఆప్షన్లు పెట్టిన వారు 21,475‘శ్రీకాళహస్తికి చెందిన ఓ విద్యార్థిని ఏపీఈఏఎమ్సెట్–2025లో మంచి ర్యాంకు సాధించింది. గత నెలలో జరిగిన తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో చంద్రగిరి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సీఎస్ఈలో సీటు సాధించి అడ్మిషన్ పొందింది. కానీ రెండవ విడతలో మరో మెరుగైన కోర్సు కోసం వెబ్ ఆప్షన్ పెట్టుకుంది. స్థానికత రిజర్వేషన్ల విషయంలో ప్రవేశాలపై హైకోర్టు స్టే విధించడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది. కళాశాల యాజమాన్యం తరగతులకు హాజరు కావాలంటూ ఒత్తిడి చేస్తుండటం, మళ్లీ రీ కౌన్సెలింగ్ జరుగుతుందనే గందరగోళంలో సతమతమవుతున్నారు.’రీ కౌన్సెలింగ్ భయం ఉంది కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసింది. ఏ ఒక్క కోర్సులోనూ ప్రవేశాలు సక్రమంగా చేపట్టలేదు. సాంకేతిక విద్యామండలి అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. అనుభవరాహిత్యమా? లేక అధికార మదమో తెలియదు కానీ ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టిన తీరు దారుణంగా ఉంది. మా అబ్బాయికి ఎస్వీయూలో తొలి విడతలో ఈసీఈలో సీటు దక్కడంతో ప్రవేశం తీసుకున్నాం. కోర్టు స్టేతో పరి స్థితి అర్థం కావడం లేదు. తొలి విడత ఫలితాలను రద్దు చేసి మళ్లీ రీకౌన్సెలింగ్ నిర్వహిస్తారనే భయం ఉంది. – రత్నప్రభ, విద్యార్థి తల్లి, తిరుపతి తరగతులకు హాజరు కావాలా? వద్దా? తొలి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో మా అమ్మా యికి తిరుపతి శివారులోని ఓ ప్రముఖ కళాశాలలో సీఎస్ఈ ఏఐ బ్రాంచ్లో సీటు వచ్చింది. అడ్మిషన్ అయ్యాం. కానీ రెండవ విడత కౌన్సెలింగ్ పూర్తి కావస్తున్న సమయంలో స్థానికత రిజర్వేషన్ల సమస్యతో ప్రవేశాలపై కోర్టు స్టే విధించింది. స్థానికత సమస్య ఎప్పుడు పరి ష్కారమవుతుందో తెలియడంలేదు. కానీ కళాశాల నుంచి తరగతులకు హాజరు కావాలని ఫోన్లు, మెసేజ్లు వస్తున్నాయి. వెళ్లాలా? వద్దా ? అర్థం కాని పరిస్థితి నెలకొంది. – రామచంద్రయ్య, విద్యార్థి తండ్రి, రేణిగుంట ప్రవేశాలు గందరగోళంగా మారాయి నేను ఏపీఈఏఎమ్సెట్ లో మంచి ర్యాంక్ సాధించా. జిల్లాలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈలో జాయిన్ అయ్యాను. అడ్మిషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తరగతులకు హాజరు కావాలని కళాశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. రీ కౌన్సెలింగ్ జరిగితే మళ్లీ నాకు ఆ కళాశాలలో సీటు వస్తుందా... అనే అనుమానం ఉంది. – రవిశంకర్, విద్యార్థి, తిరుపతి ఇంజినీరింగ్ విద్యార్థుల భవితవ్యం అయోమయంగా మారింది. తొలి విడతలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇప్పటికే స్థానికతపై కోర్టుకు వెళ్లడంతో అడ్మిషన్ల ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. రిజర్వేషన్లు తేల్చకుండా ప్రవేశాలు నిర్వహించడంపై నిపుణులు మండిపడుతున్నారు. ఒకవైపు తరగతులకు హాజరు కావాలని కళాశాలలు ఒత్తిడి చేస్తున్నాయి..మరోవైపు న్యాయ స్థానం రీకౌన్సెలింగ్కు ఆదేశిస్తే పరిస్థితి ఏంటో ఊహించడం కష్టంగా మారింది. సాంకేతిక విద్యామండలి అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతోంది. తిరుపతి సిటీ : ఏపీఈఏఎమ్సెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ల విషయంలో కోర్టు మెట్లు ఎక్కడంతో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే తొలి విడత అడ్మిషన్లు పొందిన విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తొలి విడత కౌన్సెలింగ్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులను తరగతులకు హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. మళ్లీ రీ కౌన్సెలింగ్కు న్యాయస్థానం ఆదేశిస్తే పరిస్థితి ఏమిటి...అంటూ ఆవేదన చెందుతున్నారు. రిజర్వేషన్లు తేల్చకుండా ప్రవేశాలు ఎలా? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాటి నుంచి ఏ ఒక్క వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలేదని నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని విమర్శిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియను అస్తవ్యవస్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లను తేల్చకుండా కౌన్సెలింగ్ ప్రక్రియను ఎలా చేపడుతుందని ప్రశ్నిస్తున్నారు. అర్హతలేని వ్యక్తులు, కనీస పరిజ్ఞానం లేని వ్యక్తుల చేతుల్లోకి పాలన వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను చూస్తే అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడిందని ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్ని స్తున్నారు. – 8లో– 8లోన్యూస్రీల్ఇంజినీరింగ్ ప్రవేశాలపై తొలగని సందిగ్ధం ఆందోళనలో తొలి విడత ప్రవేశాలు పొందిన విద్యార్థులు కళాశాలకు హాజరు కావాలంటూ ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిళ్లు రీకౌన్సెలింగ్ జరిగితే పరిస్థితి ఏమిటో అర్థం కాలేదంటున్న తల్లిదండ్రులు కోర్టులో స్థానికత సమస్య తేలేదీ ఎప్పుడో అంటూ నిట్టూరుస్తున్న విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యం ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర సాంకేతిక విద్యామండలి నిర్లక్ష్యం, అసమర్థతే. కూటమి ప్రభుత్వం వి ద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ తొలి విడత పూర్తి అయ్యేంత వరకు స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ల విషయంపై అవగాహన లేకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనం. డిగ్రీ, పీజీ అడ్మిషన్లు ప్రక్రియపైనా అయోమయం నెలకొంది. – నారాయణరెడ్డి, విశ్రాంత అధ్యాపకులు, తిరుపతిమా పరిస్థితి వర్ణనాతీతం గతంలో ఏటా క్రమం తప్పకుండా ఆగష్టులో ఇంజినీరింగ్ అడ్మిషన్లు పూర్తి చేసి తరగతులు ప్రారంభించేవారు. కానీ ఈ ఏడాది పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రవేశాలు నిలిచిపోవడంతో ఏపీఏఎమ్సెట్లో సాధారణ ర్యాంక్ వచ్చిన మా లాంటి వారి పరిస్థితి అర్థం కావడంలేదు. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు త్వరగా పేమెంట్ సీటులో ప్రవేశాలు పొందాలంటూ మెసేజ్లు పెడుతున్నారు. కానీ రెండు, మూడవ విడతలలో ఫ్రీ సీటు వస్తుందనే ఆశతో ఉన్నాం. మా పరిస్థితి వర్ణనాతీతం. – శ్రావణి ప్రియ, విద్యార్థిని, తిరుపతి అడ్మిషన్లు నిలిచిపోవడంతో అర్థం కావడం లేదు.. మా అమ్మాయికి ఏపీఈఏఎమ్సెట్–2025లో ర్యాంక్ వచ్చింది. కానీ తొలి విడతలో సీటు రాలేదు. రెండవ విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో సీటు కోసం ఆప్షన్లు పెట్టుకున్నాం. పక్కా సీటు ప్రభుత్వ, డీమ్డ్ కళాశాలలో వస్తుందని ఆశించాం. కానీ అడ్మిషన్లు నిలిచిపోవడంతో ఏమి చేయాలో అర్థం కావడంలేదు. మళ్లీ రీ కౌన్సెలింగ్ చేపడితే సీటు వస్తుందని నమ్మకం లేదు. కానీ పేమెంట్ సీటు కోసం ఓ ప్రముఖ కళాశాలలో దరఖాస్తు చేశాం. కళాశాల యాజమాన్యం త్వరగా ప్రవేశం తీసుకోండి. సీట్లు ముగింపు స్థాయికి చేరుకున్నాయంటూ తొందర పెడుతున్నారు. – సరస్వతమ్మ, విద్యార్థి తల్లి, తిరుపతి