breaking news
Tirupati
-
ఎస్వీ వెటర్నరీలో జాతీయ సదస్సు ప్రారంభం
చంద్రగిరి: పశుపక్ష్యాదులకు అందించాల్సి మెరుగైన వైద్య సేవలు, శస్త్రచికిత్సల కోసం తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ తిలగర్ హాజరవ్వగా, ప్రత్యేక అతిథిగా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ జేవీ రమణ, ప్రొఫెసర్ ప్రతాబన్ పాల్గొన్నారు. ఎస్వీ వెటర్నరీ చికిత్స, టీచింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి 14 రాష్ట్రాల నుంచి 25 పశువైద్య కళాశాలలకు చెందిన 250 పశువైద్య విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ తిలగర్ మాట్లాడుతూ.. పశువైద్యంలో స్పెషలిలైజేషన్ చాలా అవసరమన్నారు. పశువైద్య విద్యార్థులు స్కిల్తో పాటు ఆధునిక టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వీసీ జేవీ రమణ మాట్లాడుతూ.. పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ పాత్ర చాలా ఉందని తెలిపారు. ప్రొఫెసర్ ప్రతాబన్ మాట్లాడుతూ.. శస్త్ర చికిత్స విభాగం, డయాగ్నోసిస్ విభాగం ప్రాముఖ్యత, వ్యాధి నిర్ధారణ విభాగాల పాత్ర చాలా అవసరమన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ వి. వైకుంఠరావు, పశు వైద్య కళాశాల, తిరుపతి అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ పి.జగపతి రామయ్య తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ప్రొఫెసర్ వీరబ్రహ్మయ్య వ్యవహరించారు. అనంతరం పశువైద్య, శస్త్రచికిత్సలకు సంబంధించిన బుక్లెట్లను ఆవిష్కరించారు. -
వాణిజ్యాభివృద్ధి దిశగా తిరుపతి రైల్వేస్టేషన్
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి రైల్వేస్టేషన్ ఇకపై వాణిజ్య అభివృద్ధి దిశగా రూపాంతరం చెందుతుందని రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) అధికారులు వెల్లడించారు. బుధవారం తిరుచానూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే స్టేషనన్లో కొత్తగా ఆధునీకరించనున్న భవనంపై దక్షిణ వైపున 36,640 చ.మీ స్థలాన్ని వాణిజ్య అభివృద్ధి కోసం 60 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా సరికొత్త విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్న్లో కొత్తగా వాణిజ్య అభివృద్ధిని సులభతరం చేయడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఇది బ్రాండెడ్ అవుట్లెట్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, రిటైల్ దుకాణాలు, షోరూమ్ల ఏర్పాటుకు వీలు కల్పిస్తుందని వివరించారు. రైల్వే భూమిని ఎలా లీజుకు ఇస్తున్నారో, రైల్వే స్టేషన్న్పై వాణిజ్య ప్రభావం, ఈ టెండర్ విధానం వంటి అంశాలపై ఉదహరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు. సమావేశంలో ఆర్ఎల్డీఏ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ విష్ణువర్ధన్రావు, జేజీఎం శ్రీనివాసరావు, ప్రాజెక్టు మేనేజరు షకీల్ అహ్మద్ పాల్గొన్నారు. -
జనసేన కార్యకర్త ఆత్మహత్య
కోట : విచారణ పేరుతో పోలీసులు వేధించారని బంధువులకు చెప్పి కోట మండలంలో ఓ జనసేన కార్యకర్త మంగళవారం ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని చిట్టేడుకు చెందిన జనసేన కార్యకర్త అనిల్ (35) కొంత కాలంగా స్కీమ్ల పేరుతో పలువురు నుంచి సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. కాలపరిమితి దాటినా తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో వారం క్రితం గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళ తాను చెల్లించిన రూ.10 వేలు తిరిగి ఇవ్వాలని కోరింది. దిక్కున్న చోట చెప్పుకోమని అనిల్ బెదిరించడంతో ఆమె నిద్ర మాత్రలు మింగి ఆస్పత్రి పాలైంది. అనంతరం కోట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పవన్కుమార్కు ఫిర్యాదు చేసింది. దీంతో అనిల్ను ఎస్ఐ పిలిపించి మంగళవారం విచారణ చేపట్టారు. ఆ సమయంలో ఆమె వద్ద తాను నగదు తీసుకున్న మాట వాస్తవమేనని అనిల్ ఒప్పుకున్నాడు. దీంతో ఎవరి దగ్గర ఎంత మొత్తంలో నగదు వసూలు చేశావు అనే పూర్తి వివరాలు తీసుకుని రావాలని చెప్పి అనిల్ను ఇంటికి పంపి వేశారు. ఇంటికి వచ్చిన అనిల్ తన స్నేహితులు, బంధువుల వద్ద కోట ఎస్ఐ తనను వేధించాడని వాపోయాడు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు తిరుపతిలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందాడు. అయితే మృతుడికి గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికి ఆమెను వదలి వేసి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని , జీవనం కోసం ఇలాంటి స్కీమ్లతో నగదు వసూలుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అనిల్ కుటుంబ సభ్యులు కోట ఎస్ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ విషయమై వాకాడు సీఐ హుసేన్ బాషాను వివరణ కోరగా ఈ కేసును తాను విచారణ చేసి నివేదికలను ఉన్నతాధికారులు అందిస్తామని వెల్లడించారు. -
పెయిన్ కిల్లర్స్తో కిడ్నీలకు ముప్పు
దొరవారిసత్రం: మండలంలోని పాళెంపాడులో బుధవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వైద్యులు పర్యటించారు. నెఫ్రాలజిస్ట్ రవికుమార్, పాథాలజిస్ట్ మల్లికార్జున్, జనరల్ మెడిసిన్ రమేష్ క్షేత్రస్థాయిలో బాధితులతో మాట్లాడారు. వారి మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో పలువురు కొన్నేళ్ల నుంచి అధిక మోతాదులో పెయిన్ కిల్లర్స్ వాడినట్లు గుర్తించారు. అందుకే క్రియాటిన్ లెవెల్స్ పెరిగి కిడ్నీలు దెబ్బతిన్నట్లు బృందం సభ్యులు వెల్లడించారు. మరి కొందరికి 60 ఏళ్లు దాటడంతో వయసు రీత్యా కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చినట్లు వివరించారు. పాళెంపాడు గ్రామంలో ఇప్పటి వరకు 25 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. వీరిలో వైద్య బృందం 16మందిని కలిసి మాట్లాడింది. ఆరుగురికి మరో సారి కిడ్నీ సంబంధిత వైద్య పరీక్షలను స్విమ్స్లో చేయించాలని నిర్ణయించింది. గ్రామంలో ఓవర్హెడ్ ట్యాంకు నీళ్లు, చేతి బోర్లు నీటిని తాగడం వల్ల ఎముల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్లేదని నీటి పరీక్షల్లో తేలినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంలోని సిబ్బందితో మాట్లాడి రోగుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైద్యం అందించే విధివిధానాలపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ వీరకుమార్, పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, అరుణరుత్విక్, సూర్యకిరణ్ పాల్గొన్నారు. -
వంచనకు కేరాఫ్ చంద్రబాబు
వెంకటగిరి రూరల్ : వంచనకు కేరాఫ్ చంద్రబాబు అని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ప్రజలను మోసం చేయడం ఆయన నైజమని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు సీ్త్రనిధి కింద ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జమ చేయలేదని విమర్శించారు. అలాగే నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని యువతను మోసం చేశారని ఆరోపించారు. విద్యావ్యవస్థనుమంత్రి లోకేష్ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేస్తున్నారని స్పష్టం చేశారు. జగన్ 2.0 ఓ వరం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు భరోసా కల్పించే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన జగన్ 2.0 ఒక వరమని నేదురుమల్లి తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు పార్టీలో కార్యకర్తలకు పదవులు కేటాయించారని వెల్లడించారు. వెంకటగిరి నియోజకవర్గానికి ఎస్ఈసీ (స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులుగా ముగ్గురికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎస్ఈసీ మెంబర్ బొలిగర్ల మస్తాన్యాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశౠరు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్రెడ్డి, పద్మశాలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ నక్కా వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మున్సిపల్ విప్ పూజారి లక్ష్మి, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, కౌన్సిలర్లు ధనియాల రాధ, కందాటి కల్యాణి, ఎంఏ నారాయణ, ఆరి శంకరయ్య, నేతలు ఎం.వెంకటేశ్వర్లు, మస్తాన్రెడ్డి, కందాటి రాజారెడ్డి, పూజారి శ్రీనివాసులు, కల్లు సతీష్, మల్లిరెడ్డి, రొంటాల చిన్నా, కూనా మల్లికార్జున్, సీహెచ్ మురళి పాల్గొన్నారు. -
కుంటుపడిన సేవలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య సేవలు కుంటుపడ్డాయి. పల్లె వైద్యం పూర్తిగా పడకేసింది. పీహెచ్సీల్లో వైద్యం ఆమడదూరంలో నిలిచిపోయింది. మందులు, మాత్రలు కరువయ్యాయి. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రస్తుతం పీహెచ్సీ వైద్యులు సమ్మె బాట పట్టారు. దీంతో పీహెచ్సీల్లో వైద్యం చేసేవారు లేక వెలవెలబోతున్నాయి. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంఓనే ఆర్ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించేవారు పెరిగిపోయారు. ఇదే అదునుగా పీహెచ్సీ సిబ్బంది సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తూతూమంత్రంగా వచ్చి వెళ్లిపోతున్నారు. సమ్మె ప్రభావంతో 104 సేవలు సైతం స్తంభించాయి. -
ఎస్వీయూలో కాగ్ నివేదికపై సమీక్ష
తిరుపతి సిటీ : ఎస్వీయూలో కాగ్ నివేదికపై ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్షించింది. బుధవారం వర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో ఎస్వీయూ అధికారులతో అకౌంట్స్ కమిటీ సమావేశమైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడు పి.రామాంజనేయులు ఆధ్వర్యంలో వర్సిటీలోని పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించింది. ప్రధానంగా మొత్తం 24 అంశాలతో కూడిన నివేదికను విశ్లేషించింది. ఉద్యోగ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిని మెరుగు పరిచే ఉద్యోగ మేళాలు, నూతన విద్యా విధానం–2020 అమలు, కొత్త యూజీ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశాలు కల్పించడం, విద్యార్థుల ఫీల్డ్ ప్రాజెక్టులపై దృష్టి, నాణ్యమైన బోధనా సిబ్బంది నియామకంపై ఆరా తీసింది. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో మౌలిక సదుపాయాల, పరీక్ష ఫలితాల జాప్యం, అనుబంధ కళాశాలల్లో ఐక్యూఏసీ , ఆట స్థలాలు, ప్రయోగశాలల ఏర్పాటు, వర్సిటీకి వచ్చిన నిధుల వినియోగం, రూసా 2.0 ప్రకారం మౌలిక వసతుల కల్పనలో ప్రగతి వంటి విషయాలను సుదీర్ఘంగా చర్చించింది. ఈసందర్భంగా వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు వర్సిటీలో చేపట్టిన అభివృద్ధి పనులపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ఆనందబాబు, రాధాకృష్ణ, అశోక్ కుమార్ రెడ్డి, జయనాగేశ్వర రెడ్డి, లలిత కుమారి, శ్రీరామ్ రాజగోపాల్, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. -
ఎస్వీయూ వీసీగా నర్సింగరావు
తిరుపతి సిటీ : ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ నర్సింగరావు బెనారస్ వర్సిటీలో పీజీ పూర్తి చేసి పలు ఐఐటీ కళాశాలల్లో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తించారు. మంత్రి లోకేష్ వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన ఎస్వీయూ వీసీగా నియమితులయ్యే అవకాశముందని రెండు నెలల ముందే సాక్షి పత్రిక పసిగట్టంది. ఈ మేరకు కథనాలు ప్రచురించడం గమనార్హం. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీని తమ ఆధీనంలో ఉంచుకోవడం కోసమే మంత్రి లోకేష్ తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తికి వైస్ చాన్సలర్ పదవిని కట్టబెట్టినట్లు జిల్లాలో విస్తృతంగా చర్చసాగుతోంది. -
షాక్ తప్పదు
సర్కారుకుతిరుపతి రూరల్ : విద్యుత్ శాఖలో సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు రోడ్డెక్కారు. బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టారు. తిరుపతి డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు కూటమి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయాస్ సంఘాల సమాఖ్య (జేఏసీ) తిరుపతి డిస్కమ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్ఎం గ్రేడ్–2 కింద నియమితులైన కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. డిస్కమ్ కో–చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ యాజమాన్యం అనుసరించే అశాసీ్త్రయ విధానాల కారణంగా విద్యుత్ సంస్థలకు నష్టం వస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి యాజమాన్యాలు తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. డిస్కమ్ కన్వీనర్ మురళీధర్ మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తూ దూర విద్య కళాశాలల్లో ఉన్నత చదువులు చదివి అర్హత సాధించిన వారికి ఉద్యోగోన్నతులు కల్పించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్లడించారు. డిస్కమ్ వైస్ చైర్మన్ జయరాం మాట్లాడుతూ ఉద్యోగులపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. డిస్కమ్ వైస్ చైర్మన్ జయమణి మాట్లాడుతూ జేఎల్ఎం గ్రేడ్ 2 కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు వారికి విధించిన కొత్త సర్వీసు రెగ్యులేషన్స్ను రద్దు చేసి శాశ్వత ఉద్యోగులతో సమానంగా సర్వీసు రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశార9ఉ. తిరుపతి సర్కిల్ జేఏసీ చైర్మన్ వెలకటూరి గోపి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యుత్ ఉప కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.తిరుపతిలో రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు మోసానికి నిరసనగానే.. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఉద్యోగులను మోసం చేసినందుకు నిరసనగానే ఈనెల 13న చలో విజయవాడ చేపడుతున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి కూడా ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు స్పందించకుంటే ఈనెల 15 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు ఎల్.చలపతి, వై.వెంకట సునీల్, వి.సతీష్, టి.రవికుమార్, సురేష్,రియాజ్ అహ్మద్, రామలింగారెడ్డి, సంజీవరావు, కృష్ణయ్య , తిరుపాల్ రెడ్డి ,రంగయ్య ,హుస్సేనయ్య , శంకర్, బాలకాశి, నాగార్జున, సుధాకర్, ఏలుమలై పాల్గొన్నారు. -
● రాష్ట్రంలో విచ్చలవిడిగా లిక్కర్ దందా ● ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ మహిళల ఆగ్రహం ● ఎకై ్సజ్శాఖ కార్యాలయం వద్ద ధర్నా
తిరుపతి మంగళం : రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కాసుల కక్కుర్తితో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీతాయాదవ్, తిరుపతి నగర బూత్కమిటీ ఇన్చార్జి ఉప్పాల సాయికుమారి మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు తిరుపతిలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయం వద్ద మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. మద్యం సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు. కల్తీ మద్యం అరికట్టాలి, బెల్ట్ షాపులను తొలగించాలి, నకిలీ లిక్కర్ తయారుచేస్తున్న టీడీపీ, జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. టీడీపీ నేతలే విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప నకిలీ లిక్కర్ కారణంగా మహిళల పుస్తెలు తెగిపోతున్నా పట్టదని ఆరోపించారు. ఈ ఏడాదిన్నరలోనే కల్తీ మద్యం తాగి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా లిక్కర్ దందాను నిలిపివేయకుంటే ఇదే మద్యం ఒంటిపై పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మద్యం విక్రయాలను అరికడతాం, మహిళల మానప్రాణాలకు అండగా ఉంటామని ఊదరగొట్టిన పవన్కల్యాణ్కు ఇప్పడు కల్తీ లిక్కర్ కనిపించం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుణీత, పార్టీ నేతలు నైనారు మధుబాల, విజయలక్ష్మీ రాయల్, పద్మజ, పుష్పలత, మహిత, రాజేశ్వరి, రాధ, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏంటి?.. మంచు విష్ణు ఆగ్రహం
సాక్షి,తిరుపతి: మోహన్బాబు వర్సిటీపై వస్తున్న వార్తలను హీరో, మోహన్ బాబు యూనివర్శిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం (అక్టోబర్8న) ఓ నోట్ను విడుదల చేశారు.అందులో.. యూనిర్సిటీకి అనుకూలంగా హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉండగా.. వాటిని ధిక్కరించి ఉన్నత విద్యామండలి పోర్టల్లో పెట్టడమేంటి? అని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి సిఫార్సులు సరికాదు. మా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు సోషల్ దుష్ప్రచారం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. -
తిరుమలలో మరో అపచారం.. వెకిలి చేష్టలతో అసభ్యకర రీల్స్
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు వెలసిన పవిత్రక్షేత్రం తిరుమలలో(tirumala) రీల్స్ తీసి వాటికి పాటలు జోడించి వెకిలి చేష్టలతో సోషల్ మీడియాలో(Social Media Reels) హల్చల్ చేస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్న కొందరు యువతీ యువకులు రీల్స్ పేరుతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం మాడవీధుల్లో, ఆలయ గోపురాలు కనిపించే విధంగా కొన్ని అసభ్యకరమైన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.తాజాగా శ్రీవారి ఆలయం ముందు ఓ యువతి రీల్స్ చేశారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు యువకులు మాడవీధుల్లో రీల్స్ చేయడం కూడా వైరల్గా మారింది. టీటీడీకి సంబంధించిన కొందరు వ్యక్తుల ద్వారా వీరు మాడవీధుల్లోకి ప్రవేశించారని, భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామి సేవలో నిత్యం పాల్గొనేవారే ఇలా సోషల్ మీడియా వారితో కలిసి రీల్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేయడమే కాదు, తిరువీధుల్లోకి ఎలా వచ్చామో కూడా వారు తమ రీల్స్లో చెప్పుకొచ్చారు.చూశారా తమ్ముళ్లు మన మంచి ప్రభుత్వంలో తిరుమలలో కూడ రీల్స్ చేసుకునే సదుపాయం కల్పించాం pic.twitter.com/ZHj0oJyGq8— Ꮩᴀʀsʜᴀ Ꭱᴇᴅᴅʏ 🐬 (@YSvarshareddy) October 6, 2025గతంలో తిరుపతిలోని అలిపిరిలో డ్యాన్స్ చేస్తున్న యువతి వీడియో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా కొండపైనే సోషల్ మీడియా వ్యక్తులు వెర్రిపోకడలు పోతున్నారు. తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. తిరుమలలో అసభ్యకరమైన రీల్స్ తీయడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గుడిముందు ఇంత జరుగుతున్నా టీటీడీ మొద్దునిద్ర పోతోందా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో వెంగమాంబ అన్నదాన సత్రంలో సోషల్ మీడియా రీల్స్ చేయించడం పై శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/8bUxzZ8W62— TOVINO𓃵 (@Vamos_Rafa23) October 7, 2025 -
ఎర్రచందనం పట్టివేత
భాకరాపేట : తలకోన మార్గంలోని పూలకుంటపల్లె వద్ద కారులో తరలిస్తున్న ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట అటవీ క్షేత్రాధికారి ఎన్ వెంకటరమణ తెలిపారు. ఆదివా రం అర్ధరాత్రి వాహనాల తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం పట్టుబడినట్టు వెల్లడించారు. పరారవుతున్న నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిందితులను తమిళనాడుకు చెందిన చందిరాజన్ ఇజ్మలై, తరుమన్ సామికన్నుగా గుర్తించామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా 11 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వరదయ్యపాళెం : తడ–శ్రీకాళహస్తి రహదారిపై బత్తలవల్లం సమీపంలోని ఇనమాలగుంట అటవీప్రాంతం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. సత్యవేడు మండలం జడేరి పంచాయతీ కేవీకండ్రిగ గ్రామానికి చెందిన ఎం.వెంకటేశులు (35) శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ తడలో నివాసమున్నాడు.ఈ క్రమంలో పరిశ్రమలో తనతో పనిచేస్తున్న మిత్రుడిని కలిసేందుకు వరదయ్యపాళెం వెళ్లాడు. ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశులును సూళ్లూరుపేటలోని ఓ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. అక్కడి చికిత్స అందిస్తుండగా మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ సాయిబాబా తెలిపారు. -
ఆక్రమించి.. బోరు వేసి..!
తొట్టంబేడు : స్థానిక ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో రిలయన్స్ పెట్రోల్బంకు వెనుక వైపు సర్వే నంబరు 152లో 1.22ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆ భూమిని జేసీబీతో చదును చేయడం, అందులో బోరు వేయిస్తున్న దృశ్యాలు మంగళవారం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై తొట్టంబేడు తహసీల్దారు భారతి మాట్లాడుతూ ఆక్రమిత భూమిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అత్యంత ఖరీదైన ఈ భూమిని కబ్జాకోరల్లో నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 10న రెండో విడత సీట్ల కేటాయింపు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో రెండవ విడత అడ్మిషన్ల వెబ్ ఆప్షన్ల మార్పులకు సంబంధించిన ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. దీంతో ఉన్నత విద్యామండలి ఓఏఎండీసీ ద్వారా రెండవ విడతలో సీట్లు సాధించిన విద్యార్థులకు 10వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులకు వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు పంపనున్నారు. ఆయా కళాశాలల్లో ఈ నెల 11 నుంచి 13వ తేదీలోపు ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి జాతీయ స్థాయి వర్క్షాప్ తిరుపతి అర్బన్ : తిరుపతిలోని తాజ్హోటల్లో బుధవారం నుంచి రెండు రోజులపాటు జాతీయ సహకార మంత్రిత్వశాఖ వర్క్షాప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సహకారం రంగం బలోపేతం, వివిధ పథకాల అమలుపై సమీక్షించేందుకు త్రైమాసిక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. జాతీయ సహకార మంత్రిత్వశాఖ సెక్రటరీ ఆశిష్ కుమార్ భుటానీ, ఏపీ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ జైన్ పాల్గొననున్నట్లు వివరించారు. -
ఏఐ టెక్నాలజీతో బోధన
తిరుపతి సిటీ: ఏఐ టెక్నాలజీతో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలని డీఎస్సీలో ఇటీవల ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ సూచించారు. తిరుపతిలోని విశ్వం స్కూల్లో ఐదు రోజులుగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలని, డ్రాపవుట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, వర్క్షీట్లు, స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్స్ అనుసంధానంగా బోధించాలన్నారు. పాఠశాలలో నిర్వహించాల్సిన రిజిస్టర్లపై సమగ్ర అవగాహనతో శిక్షణ పొందాలని స్పష్టం చేశారు. జిల్లా నోడల్ అధికారి నరసింహులు, స్టేట్ అబ్జర్వర్తో పాటు డీవైఇఓ మహేశ్వర రావు, ఎంఈఓలు బాలాజీ, జనార్ధన్ రాజు, ప్రేమలత, అసిస్టెంట్ అలెస్కో మీనాక్షి, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి కేడీ సారథి పాల్గొన్నారు. -
ముక్కంటీ.. కనవేంటి!
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారుల వైఖరి సరికాదని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన శ్రీకాళహస్తీశ్వరాలయ కమిటీ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులుతో కలిసి ఆలయ సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముక్కంటీశుని సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా నాలుగో గేట్ నుంచి వచ్చే భక్తులు ఎండలో ఇబ్బంది పడుతున్నారని కార్పెట్ వేశారని, తర్వాత రోడ్డుపై కూల్ పెయింట్ వేయించారని, అనంతరం కొబ్బరి మట్టలతో పందిరి వేశారని చివరకు రేకుల షెడ్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ పని ముందుగానే చేసి ఉండవచ్చని, కానీ కేవలం కాంట్రాక్టర్లకు నగదు దోచిపెట్టేందుకే మొత్తం వ్యవహారం నడిపించారని విమర్శించారు. అయితే భక్తుల కోసం వేసిన షెడ్లలో వాహనాలు పార్క్ చేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన షెడ్లు కేవలం వాహనాల పార్కింగ్కే ఉపయోగపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికై నా ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి ఎండలో భక్తులు పడుతున్న ఇక్కట్లను గమనించాలని సూచించారు. షెడ్లలో ఎవరూ వాహనాలు పార్క్ చేయకుండా చర్యలు చేపట్టాలని కోరారు. -
పూడిక తీత..
● కట్టమంచి చెరువులో నిబంధనలకు విరుద్ధంగా పూడికతీత పనులు ● అడ్డగోలుగా చెరువు మట్టిని అమ్ముకున్న టీడీపీ నాయకులు ● చెరువు అక్రమాలపై ఆర్టీఐకి ఫిర్యాదు చేసిన స్థానికులు ● అనుమతులతోనే పనులు చేశామంటున్న కూటమి నేతలు ● తమ వద్ద అనుమతులే పొందలేదని తేల్చేసిన ఇరిగేషన్ అధికారులు ● బయటపడ్డ కూటమి నేతల బాగోతం నిజాలు ఇవే కూటమి నేతలు అంతా మాయ చేశారు. చిత్తూరు నగరానికే తలమానికమైన కట్టమంచి చెరువును కుళ్లబొచేశారు. పూడిక తీత పేరుతో నాలుగు నెలలపాటు ఇష్టారాజ్యంగా తవ్వేశారు. వందల ట్రిప్పుల మట్టిని ఇష్టారాజ్యంగా విక్రయించి జేబులు నింపుకున్నారు. అధికార మదంతో ఏ ఒక్కర్నీ అటువైపు రానీయకుండా అడ్డుకట్ట వేశారు. తీరా స్థానికులు ఆర్టీఐకి విన్నవించడంతో టీడీపీ నాయకుల బాగోతం బయటపడింది. అసలు ఇరిగేషన్ అనుమతులే లేవని.. నిబంధనలు అస్సలే పాటించలేదని సంబంధిత అధికారులు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఔరా..! అంటూ పలువురు కూటమి నేతల తీరును ఎండగడుతున్నారు. కట్టమంచి చెరువులో అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్న దృశ్యం (ఫైల్). సాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఎంతో చరిత్ర కలిగిన కట్టమంచి చెరువును టీడీపీ నాయకులు గుల్లచేశారు. అధికారుల అనుమతులతో పూడికతీత పనులు చేపడుతున్నామంటూ యథేచ్ఛగా మట్టి తవ్వకాలకు పూనుకున్నారు. భారీ ప్రొక్లైనర్లు, జేసీబీలు పెట్టి కొన్ని నెలలపాటు కట్టమంచి చెరువులోని మట్టిని తవ్వి తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. అలాగే టీడీపీ ప్రజాప్రతినిధి, ఓ కార్పొరేటర్ వేసిన వెంచర్లకు మట్టిని అక్రమంగా తరలించారు. దీనిపై ఏ ఒక్కరూ నోరుమెదపకుండా జాగ్రత్తపడ్డారు. అధికారులు, స్థానికులు కొందరిని లంచాలతో మేనేజ్ చేసి తమ పనికానిచ్చేశారు. ఇన్నాళ్లూ కళ్లు మూసుకున్నారా? కట్టమంచి చెరువులో కొన్ని నెలలపాటు జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. చిత్తూరు నడిబొడ్డున ఉన్న చెరువులో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతుంటే అధికారులకు చీమకుట్టినట్టూ లేదు. కళ్లెదుటే మట్టి తరలిపోతున్నా పట్టించుకోలేదు. ఇటీవల వరుసగా ‘సాక్షి’లో కథనాలు వచ్చినా పెద్దగా స్పందించలేదు. అంటే అధికార పార్టీకి అమ్ముడుపోయారా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. లేదా లంచాల మత్తులో కళ్లుమూసుకుని కూర్చున్నారా..? అని నిలదీస్తున్నారు. ఇప్పుడు సాఫీగా మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పడంపై రగిలిపోతున్నారు. అత్యవసరమయ్యి.. ఎవరైనా ఒక లోడ్డు మట్టి ఎత్తితే ఆగమేఘాల మీదొచ్చి అరెస్టులు చేయించే అధికారులు నెలల తరబడి కళ్లెదుటే మట్టి తరలుతున్నా ఎందుకు పట్టించుకోలేదని గళం ఇప్పుతున్నారు. మరి వీటికి సమాధానం ఎవరు చెబుతారో వేచి చూడాలి మరి..! కట్టమంచి చెరువులో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన లిఖిత పూర్వకమైన సమాధానం కట్టమంచి చెరువులో మట్టితవ్వకాలకు సంబంధించి చిత్తూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా సమాచారం రాబట్టారు. అందులో ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ఇరిగేషన్శాఖ చిత్తూరు సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జయచంద్రబాబు లిఖిత పూర్వకంగా కొన్ని విషయాలు వెల్లడించారు. అందులో కొన్ని..! కట్టమంచి చెరువు పై గత ఐదేళ్లుగా తమ శాఖ తరఫున ఎలాంటి తనిఖీల నివేదికలు లేవు. గత రెండేళ్లుగా కట్టమంచి చెరువులో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్ట లేదు. కట్టమంచి చెరువుకు సంబంధించి ఇరిగేషన్శాఖ తరఫున మట్టి తవ్వకాలపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఆక్రమణలను తొలగించే అధికారం రెవెన్యూ శాఖకు మాత్రమే ఉంది. కట్టమంచి చెరువులో గత రెండేళ్లుగా ఎలాంటి ఆదాయం రాలేదు. నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు ఇరిగేషన్ శాఖ ఎవ్వరికీ ఎలాంటి అనుమతులు, ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. కట్టమంచి చెరువులో మట్టి తవ్వకాలపై ఎలాంటి ఫిర్యాదులు అంద లేదు. -
అది న్యాయవ్యవస్థపై దాడి
● సీజేఐపై దాడికి యత్నం దుర్మార్గం ● దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది ● ఎంపీ గురుమూర్తి తిరుపతి కల్చరల్: భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడికి యత్నించడాన్ని భారత న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా చూడాలని ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఒక ప్రక టనలో తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తు న్నాని పేర్కొన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిందని, న్యాయం, రాజ్యాంగ విలువలను గౌరవించే ప్రతి భారతీయుడి మనస్సాక్షిని కదిలించిందని అన్నారు. భారత న్యాయవ్యవస్థ మన రాజ్యాంగాన్ని ప్రజలకు హక్కులను కాపాడాడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన గుర్తుచేశారు. ఈ క్లిష్ట సమయంలో తాను ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయితో పాటు మొత్తం న్యాయవ్యవస్థకు మద్దతు ప్రకటిస్తున్నాని తెలిపారు. బీఆర్ గవాయి సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటూ న్యాయస్ఫూర్తిని నిలబెట్టేందుకు దేవుడు ఆయనకు మరింత శక్తి, ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. -
గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
తడ : పులికాట్ సరస్సులో ఇరకం దీవి వద్ద సోమవారం ప్రమాద వశాత్తు పడవలో నుంచి జారిపడి గల్లంతైన బాలుడు హేమరాజ్ (17) మృత దేహం మంగళవారం లభ్యమైంది. వివరాలు.. చైన్నెలోని ఎన్నూరు జార్ల కుప్పానికి చెందిన హేమరాజ్ శనివారం ఇరకంలో జరుగుతున్న తిరునాళ్ల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. సోమవారం తాత ఆర్ముగంతో కలిసి పడవలో వెళుతుండగా జారి సరస్సులో పడి పోయాడు. గ్రామంలోని జాలర్లు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం బాలుడి మృతదేహం పైకి తేలడంతో ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్కు కసరత్తు చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీలో అర్హత సాధించిన నూతన టీచర్లకు వెబ్కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్లో సూచించిన ఖాళీల మేరకు వెబ్కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాల్లోనే వెబ్ఆప్షన్లు నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. చిత్తూరు విద్యాశాఖలో పనిచేస్తున్న ఏడీ–2తో పాటు మరికొంత సిబ్బంది విజయవాడలోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో గత రెండు రోజులుగా వెబ్కౌన్సెలింగ్ కసరత్తు చేపడుతున్నారు. బుధవారం వెబ్కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 9, 10 తేదీల్లో వెబ్కౌన్సెలింగ్ పూర్తి చేసి ఈ నెల 13న కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా కసరత్తు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి దివ్యాంగులకు వైద్య పరిశీలన తిరుపతి అర్బన్: దివ్యాంగులు, వ్యాధిగ్రస్తుల పింఛన్లపై బుధవారం నుంచి వైద్యులు పరిశీలన చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీఓలు, డీఎంహెచ్ఓ, పీసీహెచ్ఎస్, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్లు, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్, శ్రీకాళహస్తి, గూడూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్లు, డీఆర్డీఏ పీడీతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్ల తొలగింపు నోటీసు అందుకున్న వారిలో 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకున్నవారిని మరోసారి వైద్యులు పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చేవారికి తాగునీటితోపాటు భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. అలాగే ఆస్పత్రికి రాలేని వ్యాధిగ్రస్తుల కోసం104, 108 వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు అధికారులతో సచివాలయ ఉద్యోగులు సమన్వయం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
చంద్రబాబుకు దశితులంటే చిన్నచూపు
తిరుపతి మంగళం : ‘చంద్రబాబుకు దళితుంటే చిన్నచూపు, అందుకే దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని వ్యాఖ్యానించారు. అందుకే అంబేడ్కర్ విగ్రహాలకు నిప్పు పెట్టినా పట్టించుకోరు.. దళితులపై దాడులు జరిగినా స్పందించరు’’ అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంల దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహ దహనంపై కక్షపూరిత రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. విగ్రహం కాల్చిన దుండగులను వదిలేసి, ఫిర్యాదు చేసిన సర్పంచ్ గోవిందయ్యపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం రెడ్బుక్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ విషయంలో చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ అది స్వల్ప విషయమంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పోలీసులు కేవలం పచ్చనేతల మెప్పుకోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ బుక్లో దళితులకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి పేర్లను నమోదు చేస్తామని, చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన నారాయణస్వామిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని అనేక కుట్రలు చేశారన్నారు. ఇప్పుడు దేవళంపేటలో సర్పంచ్ గోవిందయ్యపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత సతీష్నాయుడే అంబేడ్కర్ విగ్రహాన్ని తగులబెట్టించాడని తెలిసినా పచ్చనేతల మెప్పు కోసం చిత్తూరు ఎస్పీ కుట్రపూరితంగా గోవిందయ్యపై కేసులు పెట్టారని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టనీయకుండా టీడీపీ నేత సతీష్నాయుడు అడ్డుకున్నారన్నారు. ఎమ్మెల్యే థామస్ ఏనాడైనా దళితుల కోసం పోరాటాలు చేశారా? ఎక్కడైనా ఒక్క అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు కోసం దళితుడని అని చెప్పుకునే థామస్ తిరుమలకు వెళ్లినప్పుడు క్రిస్టియన్గా డిక్లరేషన్ ఇవ్వడంలోనే నిజ స్వరూపం తెలుస్తోందన్నారు. అలాంటి వ్యక్తి తాను రూ. వేల కోట్లు అవినీతి చేశానంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దళితులను చంద్రబాబు, పవన్కల్యాణ్ అంటరానివారిగానే చూస్తున్నారన్నారు. ఈ మేరకు దళితులంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్కుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర, నల్లాని బాబు, రామయ్య, కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, ఎస్పీ విభాగం నగర అధ్యక్షుడు చేజర్ల మురళి పాల్గొన్నారు. -
గుడి ఎనక నా సామి!
సాక్షి, టాస్క్ఫోర్స్: గురివిందకు కింద నలుపు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు ఓ పాలక మండలి సభ్యుడు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని అంటూనే ప్రతిదీ రాజకీయం చేస్తున్నాడు. దేవుడు సన్నిధిలో గోవిందా...! నారాయణ..! అంటూనే ఇతరులపై విషం చిమ్ముతున్నాడు. ఆఖరుకి రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన వరివట్టం వ్యవహా రం కూడా ఆయన తన రాజకీయ వేదిక కింద మలిచేశారు. టీటీడీలో ఏ వివాదం తలెత్తినా తగుదునమ్మా అంటూ వకాల్తా పుచ్చుకుంటున్నాడు. పోనీ వాస్తవాలు చెబుతాడా..! అంటే అదీ లేదు. అన్నీ అసత్యాలే. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. వారికి సంబంధించిన అంశాలు అయితే మాత్రం తిరుమలను వేదికగా చేసుకొని ప్రసంగాలు దంచేస్తాడు. ఇక రోజు మార్చి రోజు దర్శనానికి వచ్చే ఆయన అయితే.. టీటీడీ చైర్మన్ ప్రాపకం కోసం ఆయన చానల్లో కనిపించడం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు. సత్యాలను వక్రీకరిస్తూ అసత్యాలను వల్లిస్తున్నాడు. చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేది మాత్రం..! -
నారావారి నకిలీ సారా!
తిరుపతి కల్చరల్: ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో తక్కువ ధరకు మద్యం అనే హామీని మాత్రం చంద్రబాబు నెరవేర్చారని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్రెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో నకిలీ మద్యం, బెల్టు షాపులకు అవకా శం లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిందన్నారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తక్కువ ధరకు మద్యం సరఫరా చేస్తామంటూ విచ్చిలవిడిగా కూటమి నేతలు నకిలీ మద్యం తయారీ కేంద్రాలు నెలకొల్పారన్నారు. కొన్ని నెలల క్రితం తిరుపతి దామినేడు వద్ద నకిలీ మద్యం తయారీ ముఠా బయటపడితే, మొన్న అన్నమయ్య జిల్లాలో టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి తయారుచేయిస్తున్న నకిలీ మద్యం కేంద్రం ములకల చెరువులో వెలుగుచూసిందన్నారు. తాజాగా నిన్న ఇబ్రహీంపట్నంలో మరో కేంద్రం బయటపడిందన్నారు. బెల్టు షాపులకు, మద్యం దుకాణాలకు సరఫరా గతంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను ప్రయివేటు పరం చేసి నేడు కూటమి నేతలు తయారుచేసిన నకిలీ మద్యాన్ని బెల్టు షాపులకు, వైన్షాపులకు రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారని మధుసూదన్ రెడ్డి విమర్శించారు. అసలు మద్యం వ్యాపారాన్ని ప్రయివేటు పరంచేసిందే నారావారి నకిలీ మద్యం సరఫరా కోసమే అని ఆరోపించారు. ఇంత జరిగినా ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గానీ, హోంమంత్రి అనిత గానీ కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హోంమంత్రి నేడు నారావారి నకిలీ మద్యంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. ‘పచ్చ’ పత్రికలో నీచమైన రాతలు నకిలీ మద్యం సూత్రధారి, టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి కోవర్టని పచ్చ పత్రికలో రాయడం విడ్డూరమని చిందేపల్లి మండిపడ్డారు. నకిలీ మద్యం తయారుచేస్తూ అడ్డంగా దొరికిన తర్వాత పెద్దిరెడ్డి అనుచరుడు అంటూ నీచమైన రాతలు రాయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. యువగళం హామీ ఏమైంది? రాష్ట్రంలోని 13 లక్షల మంది ఆటో కార్మికులకు, టిప్పర్ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన వారికి సైతం రూ.15 వేలు రూపాయలు ఇస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ బాహాటంగా ప్రకటించారని గుర్తుచేశారు. నేడు గత ప్రభుత్వం అమలు చేసిన వాహన మిత్ర పేరు మార్చి ఆటో డైవర్ల సేవలో పథకం ద్వారా వారికి నగదు బదిలీ పూర్తిస్థాయిలో అమలుచేయక మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో నేడు బహిర్గతమైన కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ జగన్ సంకల్పం – జిల్లాకో నకిలీ మద్యం తయారీ కేంద్రమే బాబు లక్ష్యం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టించి అనుబంధంగా ఓ ఆస్పత్రి నెలకొల్పాలని సంకల్పించారని చిందేపల్లి చెప్పారు. అయితే నేడు చంద్రబాబు మాత్రం ప్రతి జిల్లాకు ఓ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటుచేసి రాష్ట్రంతా సరఫరా చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కార్పొరేట్లకు పీపీపీ పద్ధతిలో కట్టబెట్డడం దుర్మార్గమన్నారు. సీజేఐపై దాడికి యత్నంపై ఖండన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై న్యాయవాది దాడికి ప్రయత్నించడాన్ని వైఎస్ఆర్సీపీ ఖండిస్తోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు గోపాల్రెడ్డి, వెంకటాచలపతి పాల్గొన్నారు. -
నదిలో మునిగి వ్యక్తి మృతి
నాయుడుపేటటౌన్ : పట్టణంలోని ఏల్ఏ సాగరం బీడీ కాలనీ సమీపంలో ఓ వ్యక్తి స్వర్ణముఖి నదిలో మునిగిపోయి మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది.వివరాలు.. కాలనీకి చెందిన కుదిరి ఉదయ్కుమార్ (35) సోమవారం సాయంత్రం స్నానం చేసేందుకు నదికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నది ఒడ్డున ఉదయ్కుమార్ దుస్తులను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపకశాఖ అధికారుల సాయంతో నదిలోని గుంతలో కూరుకుపోయిన ఉదయ్కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పచ్చమూక దర్జా.. ప్రభుత్వ భూముల కబ్జా! బాలాయపల్లి(సైదాపురం) : బాలాయపల్లె మండలంలోని గొల్లగుంట చెరువు పొరంబోకు, చిలమనూరు పంచాయతీ గల్లగుంట వద్ద అటవీశాఖ భూములను టీడీపీ నేతలు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న ఆక్రమణకు అటవీశాఖ అధికారులే సాయం చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. వెంకటగిరి– నాయుడుపేట రహదారి సమీపంలోని ఈ భూములపై పచ్చమూక కన్ను పడింది. వెంటనే ఆ భూములను చదును చేసేసింది. దీనిపై గ్రామస్తులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.సుమారు 20 ఎకరాల అటవీ భూమిని కబళించినా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ క్రమలంఓనే ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకునే ఓ వ్యక్తి ఆక్రమిత భూమికి పట్టాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. -
కలెక్టర్కు అభినందన
చంద్రగిరి: స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు విజయవంతం చేసినందుకు మంగళవారం నారావారిపలెల్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా కలెక్టర్ వెంకటేశ్వర్ స్కోచ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.నేడు పాళెంపాడులో రాష్ట్ర బృందం పర్యటన దొరవారిసత్రం : మండలంలోని పాళెంపాడు గ్రామంలో బుధవారం రాష్ట్ర బృందం పర్యటించనుంది. సాక్షి పత్రికలో ‘ప్రాణాపాయంలో పాళెంపాడు’ అనే శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. మంగళవారం ఈ మేరకు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ పాళెంపాడులో రాష్ట్ర బృందం పర్యటించనున్నట్లు వెల్లడించారు. కిడ్నీ వ్యాధి బారిన ప్రజలు ఎందుకు పడుతున్నారో క్షేత్రస్థాయిలో కారణాలను పరిశీలించనున్నట్లు వివరించారు.నవోదయలో ప్రవేశ దరఖాస్తుకు గడువు పెంపుతిరుపతి సిటీ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హతలతో పాటు ఇతర వివరాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం సైనిక్–నవోదయ కోచింగ్ ఇన్స్టిట్యూ ట్, లేదా 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.ఎస్వీయూలో 10న జాబ్ మేళాతిరుపతి సిటీ : ఎస్వీయూలోని ఎంప్లాయిమెంట్ ఆఫీస్లో ఈనెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పలు కంపెనీలు ఇంటర్వ్యూలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగలవారు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఉపాధిలో అవినీతిపై పునర్విచారణకలువాయి(సైదాపురం) : కలువాయి మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతిపై పునర్విచారణకు ఆదేశిస్తూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్హుశుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. ఉపాధి పనుల్లో అవినీతిపై ఇటీవల చిన్నగోపవరం పంచాయతీలో చీఫ్ విజిలెన్స్ అధికారి సమగ్ర విచారణ చేశారు. 8 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే డ్వామా అధికారులు మాత్రం ఆరుగురు సిబ్బందిపై కేసులు పెట్టి ఇద్దరు ఏపీఓలను తప్పించారు. ఈ వ్యవహారంలో అధికారులకు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు కొప్పాల రఘు నేరుగా నేషనల్ ఎస్సీ కమిషనకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని 20 పంచాయతీల్లో జరిగిన అవినీతిపై పునర్విచారణ చేపట్టాలని ఎస్సీ కమిషనర్ ఆదేశించారు. దీంతో కలెక్టర్ సైతం పూర్తిస్థాయిలో పునర్విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో డ్వామా అధికారులు, ఉపాధి సిబ్బందిలో గుబులు మొదలైంది. -
అడ్డగోలుగా తవ్వకాలు
కట్టమంచి చెరువులో ఇరిగేషన్ అధికారుల సూచనలు, స్పష్టమైన అనుమతులతో పూడి కతీత పనులు చేపట్టినట్లు గతంలో కూటమి ప్రజాప్రతినిధి వెల్లడించారు. తాజాగా ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన సమాచారంతో అంతా అవాక్కయ్యా రు. కట్టమంచి చెరువులో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్పష్టంగా తెలియజేశారు. గత రెండేళ్లుగా తమ శాఖ తరఫున ఎటువంటి తనిఖీలు చేయలేదని ఇరిగేషన్ అధికారులు వివరణ ఇచ్చారు. నెలలతరబడి సాగిన పూడికతీత పనులకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చేశారు. కట్టమంచి సుందరీకరణ పేరుతో టీడీపీ నాయకులు మట్టిని అక్రమంగా తరలించి దోచుకున్నట్టు స్పష్టం చేశారు. -
వీక్లీ ఎక్స్ప్రెస్ తిరుచానూరు వరకే
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతికి రాకపోకలు సాగిస్తున్న 10 వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్ల టెర్మినల్ను గురువారం నుంచి తిరుచానూరు రైల్వేస్టేషన్కు మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రైళ్ల టైమింగ్స్లోనూ మార్పులు చేసింది. ఈ నెల 13 నుంచి జల్నా – తిరుచానూరు రైలు (నెంబర్ 07609) ఉదయం రేణిగుంటలో 9.28 గంటకు, తిరుచానూరుకు 10.45 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 13 నుంచి తిరుచానూరు – జల్నా రైలు (నెంబర్ 07610) తిరుచానూరులో మధ్యాహ్నం 3.20 గంటలకి బయలుదేరుతుంది. రేణిగుంటలో 3.35కు చేరుకుంటుంది. ఈ నెల 15నుంచి చర్లపల్లి – తిరుచానూరు రైలు (నెంబర్ 07251) రేణిగుంటకు ఉదయం 5.58 గంటలకి, తిరుచానూరుకు 8 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 15 నుంచి తిరుచానూరు – చర్లపల్లికి వెళ్లే రైలు (నెంబర్ 07252) తిరుచానూరులో సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరుతుంది. రేణిగుంటలో 5.14 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 11 నుంచి నాందేడ్ – తిరుచానూరు రైలు (నెంబర్ 07015) రేణిగుంటకు ఉదయం 10.28 గంటలకు, తిరుచానూరుకు 11.30 గంటలకు చేరుకుంటుంది. తిరుచానూరు – నాందేడ్ రైలు (నెంబర్ 07016) రాత్రి 7.50కి తిరుచానూరులో బయల్దేరి రాత్రి 8.05 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. ఈ నెల 9 నుంచి సికింద్రాబాద్ – తిరుచానూరు రైలు (నెంబర్ 07009) ఉదయం 8.58 గంటలకి రేణిగుంటకు వచ్చి 10.30కి తిరుచానూరుకు చేరుకుంటుంది. తిరుచానూరు – సికింద్రాబాద్ రైలు (నెంబర్ 07010) సాయంత్రం 4.40గంటలకి తిరుచానూరులో బయల్దేరి 4.55 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. ఈ నెల 12 నుంచి చర్లపల్లి–తిరుచానూరు రైలు (నెంబర్ 07017) ఉదయం 8.58 గంటలకు రేణిగుంటకు చేరుకుని, 11.15గంటలకు తిరుచానూరు వెళ్తుంది. తిరుచానూరు – చర్లపల్లి రైలు (నంబర్ 07018) సాయంత్రం 4.40 గంటలకి తిరుచానూరులో బయలుదేరి 4.55గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. ఇతర స్టేషన్లలో మాత్రం ఈ రైళ్ల సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవు. -
మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ షాక్
తిరుపతి జిల్లా: సినీ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ విచారణ చేపట్టింది. పేరెంట్స్ అసోసియేషన్ పిర్యాదుతో ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరిపారు.గత మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ వర్తించే విద్యార్థుల నుంచి ఫీజులు రూపేణా 26 కోట్లు అదనంగా వసూలు చేశారని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ 15 లక్షలు రూపాయలు ఫైన్ విధించింది.ఆ మొత్తాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) తిరుపతిలో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం, 2022లో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. -
మాపై ఎందుకీ నిర్దయ..!
తిరుపతి అర్బన్: ‘‘రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాం అయ్యా.. మా సమస్యకు పరిష్కారం చూపండి’’ అంటూ పలువురు ప్రజలు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు అధికారుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకుని పరిష్కారం చూపాలంటూ కంటతడి పెట్టుకున్నారు. అధికారులను ప్రాధేయపడ్డారు. తమ సమస్యలను సీరియస్గా తీసుకుని పరిష్కారం చూపాలంటూ కొందరు పదేపదే విజ్ఞప్తి చేశారు. అధికారుల తీరేమో ఇలా.. అధికారులు మాత్రం ఎప్పటిలాగానే ఒకేవిధంగా మాట్లాడుతున్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలన చేయండి.. సమస్యలకు పరిష్కారం చూపండి.. సమ స్య పరిష్కారం కాకుంటే అందుకు గల కారణాలను వివరించండి.. కలెక్టరేట్కు పదేపదే తిప్పకండి అంటూ చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. సోమవారం కలెక్టరేట్కు 276 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలే 157 అర్జీలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తోపాటు పలువురు జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కరుణించండీ సామీ.. ఏడుకొండల స్వామి కరుణించూ అంటూ పింఛన్ కోసం ఓ దివ్యాంగుడు కలెక్టరేట్కు సోమవారం స్ట్రెచర్పై వచ్చాడు. పింఛన్ ఇవ్వాలంటూ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వికలాంగుడి తల్లి రేణుక మాట్లాడుతూ నారాయణవనం మండలం సుబ్బానాయుడు కండ్రిగకు చెందిన తమ కుమారుడు లక్ష్మయ్య(25)భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం అయ్యాడని వాపోయింది. పేద కుటంబం కావడంతో బతుకు భారంగా మారిందని..పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని ఆమె జేసీ వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. -
ఆటోలు బోల్తా పడి..
చిల్లకూరు : ఆటోలు బోల్తా పడి పలువురు ప్రయాణికులు గాయపడిన ఘటనలు సోమవారం చిల్లకూరు, కోట మండలాల్లో వెలుగుచూశాయి. ఇందులో సైదాపురం మండలం కృష్ణారెడ్డిపల్లె గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆటోలో గూడూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో తిప్పవరప్పాడు సమీపంలోకి వచ్చే సరికే ఆటో ముందు టైర్ పగలడంతో డ్రైవర్ ఆటోను అదుపు చేయలేకపోవడంతో బోల్తా పడింది. అయితే ఆటోలో ఉన్న ఇద్దరు, డ్రైవర్ ఆటోలో ఇరుక్కు పోవడంతో అటుగా వెళ్లే వారు వారిని బయటకు తీసి మరో ఆటోలో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం అందలేదని గూడూరురూరల్ పోలీసులు తెలిపారు. కోటలో.. కోట: మండలంలోని ఉత్తమ నెల్లూరు గ్రామం మలుపు వద్ద సోమవారం ఆటో బోల్తాపడిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గోవిందపల్లి నుంచి కోటకు ప్రయాణికులతో వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది వారిని గూడూరు ఏరియా హాస్పిటల్కు తరలించారు. వారిలో సుప్రియ అనే మహిళకు తీవ్రగాయాలైనట్లు తెలిపారు. -
కత్తితో హల్చల్
తిరుపతి క్రైమ్: తిరుపతి నగరంలోని విక్టరీ వైన్స్ వద్ద ఆదివారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నగరంలోని టీవీఎస్ సర్కిల్ వద్ద ఉన్న ఓ వైన్ షాప్ ముందు కత్తి బయటకు ప్రదర్శిస్తూ వీరంగం సృష్టించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు.. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తన బృందంతో ఆ యువకుడిని, అతనితో పాటు ఉన్న మరో యువకుడిని వీడియో ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ కత్తితో హల్చల్ చేసిన వ్యక్తి రౌడీషీటర్ ఫిరోజ్, పక్కన ఉన్న వ్యక్తి సయ్యద్ బాషాగా గుర్తించామన్నారు. ప్రధాన నిందితుడు ఫిరోజ్ గతంలో కేసుల్లో నేరస్తుడనీ, అతను చాలా కాలంగా పరారీలో ఉన్నాడని తెలిపారు. వారిద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారించామని..వారిపై ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నాయని.. తెలిపారు. నగరంలో నడిపించుకుంటూ కోర్టుకు.. రెండు రోజుల క్రితం చిత్తూరులో లైంగిక దాడి కేసులో నిందితులను పోలీసులు కోర్టు వరకు నడిపించుకుని తీసుకెళ్లారు. అదే తరహాలో తిరుపతిలో కత్తితో హల్చల్ చేసిన నిందితులు ఫిరోజ్, సయ్యద్ బాషాలను తిరుపతి పోలీసులు సోమవారం రాత్రి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండ్కు తరలించామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం.. ప్రజలకు ఇబ్బంది కలిగించడం లాంటివి చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. నగరంలో రౌడీషీటర్ల కదలికలపై మరింత నిఘా పెంచుతామని తెలిపారు. -
తల్లికి వందనం పథకం ఇప్పించండి
నా పేరు నాగమణి, మాది తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ. అయితే తల్లికి వందనం పథకానికి అర్హులమైనా మాకు పథకం రాలేదు. మా బిడ్డకు తల్లికి వందనం మూడో దశలో అయినా ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. మేము పేద కుటుంబం. మాకు న్యాయం చేయండి. – నాగమణి, తిరుపతి దివ్యాంగుల పింఛన్ ఇప్పించండి నా పేరు కేజీ సుబ్రమణ్యం, మాది నారాయణవనం. దివ్యాంగుల పింఛన్ పొందడానికి నాకు అర్హత ఉంది. బోదకాలు కావడంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నా. మాది పేద కుటుంబం. అధికారులు మా పేదరికాన్ని గుర్తించి పింఛన్ ఇప్పించాలి – కేజీ సుబ్రమణ్యం, నారాయణవనం -
పులికాట్ సరస్సులో బాలుడు గల్లంతు
తడ : పులికాట్ సరస్సులో సోమవారం తమిళనాడుకు చెందిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం జాలర్లు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఇరకం దీవికి చెందిన ఎల్లయ్య పిల్లల చదువు నిమిత్తం తమిళనాడులోని ఎన్నూరు కుప్పానికి వెళ్లిపోయాడు. గ్రామంలో శనివారం జరిగిన తిరునాళ్ల నిమిత్తం కుమారుడు రామరాజు (17)తో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. తిరునాళ్లు ముగిసిన అనంతరం సోమవారం తిరుగు పయనమయ్యారు. తాత ఆర్ముగం పడవలో హుషారుగా ఆడుకుంటూ బయలుదేరిన రామరాజు కొంతసేపటి తరువాత పడవలో కనిపించలేదు. తండ్రి, తాత ఇది గమమనించి చుట్టూ గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామ జాలర్లు తమ పడవల్లో పులికాట్ సరస్సులో గాలింపు చేపట్టారు. పొద్దుపోయి, చీకట్లు కమ్ముతున్నా గల్లంతైన బాలుడి ఆచూకీ లభించలేదు. గ్రామం మొత్తం పులికాట్ సరస్సు వద్దకు చేరుకుని బాలుడి ఆచూకీ కోసం సరస్సు వైపు ఆందోళనగా చూస్తున్నారు.ఉరేసుకుని వ్యాపారి మృతి కోట: కోట బజారువీధిలో టీదుకాణం నడుపుతున్న రాము(45) అనే వ్యక్తి సోమవారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఇతను గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ విషయమై తమకు ఎటువంటి సమాచారం లేదని ఎస్ఐ పవన్కుమార్ తెలిపారు. -
మామిడి రైతుల పరిష్కారానికి పోరాడుదాం
చంద్రగిరి: మామిడి దిగుబడిలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు రైతు నేత యారాశి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం యారాశి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో చంద్రగిరిలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని మామిడి రైతుల సమస్యలను కేంద్రంగా తీసుకుని ఒక ప్రత్యేక చర్చా వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలు, ప్రభుత్వ సహాయాలు రాలేకపోవడం, గుజ్జు పరిశ్రమల సమస్యలు, మామిడి ఉత్పత్తుల సరైన ధరల కోసం వారి హక్కుల పరిరక్షణ వంటి అంశాలు చర్చించడం జరుగుతుందన్నారు. రూ.196 కోట్ల సబ్సిడీ నిధులు విడుదల చేయాలి ప్రభుత్వం కిలో మామిడికి రూ.4 సబ్సిడీ నగదు జిల్లావ్యాప్తంగా రూ.196 కోట్ల మేర రైతులకు అందజేయాల్సి ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు సబ్సిడీ నగదును మామిడి రైతులకు అందించడం జరిగిందన్నారని, అయితే ఇప్పటి వరకు నగదు జమ చేయలేదని, వెంటనే రైతులకు అందజేయాలని కోరారు. సిండికేట్తో మరింత నష్టాల్లో రైతులు.. మామిడి కాయల మండీల్లో దళారులు అంతా కలిసి సిండికేట్గా మారడం ద్వారా మరింతగా మామిడి రైతులు నష్టపోతున్నారన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డీటీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎద్దల చంద్రశేఖర్ రెడ్డి, ఔరంగజేబు, ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీపీ కుసుమ, ప్రతాప్ రెడ్డి, మురగయ్య యాదవ్, కృష్ణారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, గురవారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేవాభావంతో రెడ్క్రాస్ పని చేయాలి
తిరుపతి అర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వార్షిక సాధారణ సమావేశాన్ని కలెక్టర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీని దాదాపు వందమంది సభ్యుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని 11 మంది సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తరువాత చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్ను ఎన్నుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ఎనిమిది మంది సభ్యులు ఈ కొత్త కమిటీలో ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారు ‘‘కరుణ, నిబద్ధతతో మానవ సేవ’’ అనే రెడ్ క్రాస్ ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అధ్యక్షుడిగా డాక్టర్ దగ్గుబాటి శ్రీహరి రావు, ఉపాధ్యక్షుడిగా మయూర్ గుడ్లూరు, కార్యదర్శిగా డాక్టర్ ప్రతీత్, ట్రెజరర్గా జీవీ సుబ్బారావు, కృష్ణకుమార్, సభ్యులుగా డాక్టర్ భారతి, గుణశేఖర్, శ్రీనివాసులు రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, శివకుమార్, శ్రీనివాస్, ఎన్ఎస్ రవిని సభ్యులుగా ఎనుకున్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ ఉపాధ్యక్షులు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు సమావేశానికి అధ్యక్షత వహించగా, ట్రెజరర్ రామచంద్రరాజు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా హాజరై ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇద్దాం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం స్వచ్ఛాంధ్రా–స్వర్ణాంధ్రలో భాగంగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలలో మూడవ శనివారం వినూత్న థీమ్తో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ నాటికి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిర్మూలించే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. తిరుపతి జిల్లాకు మొత్తం 18 కేటగిరిలలో 51 అవార్డులు దక్కాయని, ఇందులో రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ మున్సిపాలిటీలలో తిరుపతికి ఒక అవార్డు వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటీషియన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, డీపీఓ సుశీలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుపతి క్రైమ్: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 24 మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. తిరుమల ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణికులతో వెళ్తున్న ఓ లోకల్ జీపు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి 24 మలుపు వద్ద పిట్టగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అనంతరం జీపును పక్కకు తొలగించి టీటీడీ సిబ్బంది ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఎర్రచందనం కేసులో ఒకరికి జైలు తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నించిన కేసులో నారాయణవనం మండలం, ఎరికంబట్టుకు చెందిన తిరుమల సురేష్కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, 20వేల రూపాయ ల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథ నం మేరకు.. 2015 మార్చి 4వ తేదీ పిచ్చాటూరు మండలం, రెప్పలపట్టు గ్రామం సమీపంలోని అరణియారు డ్యాం వద్ద పిచ్చాటూరు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులను చూసి నిందితుడు సురేష్తో పాటు మరి కొంతమంది పోలీసులపై రాళ్లతో దాడిచేసి పరారయ్యారు. అయితే పోలీసులు సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. సురేష్పై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టివేస్తూ తీర్పులో పేర్కొన్నారు. -
మాటల్లోనే పారదర్శకత.. సిఫార్సులకే ప్రాధాన్యత
చిట్టమూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నాలుగు నెలలక్రితం ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టింది. ఈ ప్రక్రియలో ఎక్కడా అవకతవకలకు చోటు లేకుండా పారదర్శకంగా చేపట్టామని అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ మంత్రి చెప్పిన మాటలు క్షేత్రస్థాయిలో వచ్చేసరికి నీటి మూటలుగా మారాయి. ఉపాధ్యాయులు ఒక పాఠశాలలో పని చేసేందుకు బదిలీపై వస్తే కనీసం రెండేళ్ల పాటు అక్కడే పని చేయాలన్న నిబంధన (జీఓ) ఉంది. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం బదిలీల్లో భాగంగా నెల్లూరు నుంచి చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయిని బదిలీపై వచ్చారు. ఇక్కడ పని చేస్తే హెచ్ఆర్ఏ తక్కువగా వస్తుందని గతంలో పని చేసిన ప్రాంతంలో హెచ్ఆర్ఏ ఎక్కువగా వస్తుందనే కారణంతో భారీ స్థాయిలో ముడుపులు చెల్లించుకుని సీఎంఓ కార్యాలయం నుంచే సిఫారసు చేయించుకుని సదరు ఉపాధ్యాయిని మళ్లీ తాను పని చేస్తున్న నెల్లూరుకు బదిలీ చేయించుకున్నారు. ఇదే కొవలో మరి కొంతమంది బదిలీలు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియను చేపడుతుండడంపై పలువురు ఉపాధ్యాయులు ఇదెక్కడి పారదర్శకత అని ప్రశ్నిస్తున్నారు. సీపీఓగా రాజశేఖర్ తిరుపతి అర్బన్: చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ)గా రాజశేఖర్ సోమవారం కలెక్టరేట్లోని తమ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి తిరుపతి జిల్లాకు బదిలీపై విచ్చేశారు. సీపీఓ ప్రేమ్చంద్రారెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం అసిస్టెంట్ సీపీఓగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఆరు నెలలుగా ఇన్చార్జ్ సీపీఓగా పనిచేశారు. తాజాగా సీపీఓ పోస్టును భర్తీ చేశారు. బాధ్యత లు స్వీకరించిన అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిశారు. వస్తువుల విక్రయాలకు టెండర్లు ఆహ్వానం తిరుపతి అర్బన్: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో వినియోగంలో లేని వస్తువులను విక్రయించడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ఆ విభాగానికి చెందిన జిల్లా అధికారి విక్రమ్కుమార్రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను అందించడానికి అవకాశం ఉందని స్పష్టం చేశారు. దరఖాస్తులను తమ కార్యాలయంలోనే ఇస్తామన్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లు తెరుస్తామన్నారు. -
నేడు నారావారిపల్లికి సీఎం చంద్రబాబు
చంద్రగిరి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం స్వగ్రామం నారావారిపల్లికి రానున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్తో కలిసి ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం 11.10 గంటలకు ఏ.రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారని, అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి నారావారిపల్లి చేరుకుంటారన్నారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని, అనంతరం తిరిగి 1.40 గంటలకు ఏ.రంగంపేట వద్ద ఉన్న హెలిప్యాడ్ చేరుకుని విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, హెలిప్యాడ్ వద్ద బారికేడ్ల ఏర్పాటు, నిరంతర విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. -
మగవారి ఫీట్లు
మహిళల పాట్లు..తిరుపతి అర్బన్ : ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి సెంట్రల్ బస్టాండ్ నుంచి ప్రతి రోజు 1.50 లక్షల నుంచి 1.60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా సర్వీసులను ఏర్పాటు చేయడం లేదని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీ్త్రశక్తి పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించిన తర్వాత పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కొన్ని మార్గాల్లో ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి వేళ ఒకటి.. అంటే మూడే సర్వీసులను ఏర్పాటు చేశారు. సోమవారం తిరుపతి బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కాదు. బస్సు ఆగిన వెంటనే సీట్ల కోసం ప్రయాణికులు పీట్లు చేశారు. బస్సు కిటికీల్లో నుంచి దూరేస్తున్నారు. కొందరు కిటికీల్లో నుంచి లగేజీలు పెట్టేస్తున్నారు. ఆ తర్వాత బస్సెక్కి సీట్ల కోసం ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. డ్రైవర్ డోర్ నుంచి కొందరు ప్రయాణికులు సీట్ల కోసం లోపలకు దూరుతున్నారు. అయితే బస్సుల కొరత తీవ్రంగా ఉందని తాము చేసేదేమీ లేదని ఆర్టీసీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 83,412మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,058 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. పశు వైద్య కళాశాలలో రెండు రోజుల పాటు జాతీయ సదస్సు చంద్రగిరి: తిరుపతిలోని ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఈనెల 8, 9వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. ఎస్వీ పశు వైద్యకళాశాలలోని పశువైద్య చికిత్స, బోధన విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 250 మంది పశువైద్య విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పశువుల్లో వచ్చే వ్యాధుల నిర్ధారణ, చికిత్స, నివారణ, శస్త్ర చికిత్సలు, గర్భకోశ వ్యాధులపై శాసీ్త్రయపరమైన చర్చలు నిర్వహిస్తారన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తమిళనాడు పశువైద్య విశ్వవిద్యాలయం రిటైర్డ్ వీసీ ప్రొఫెసర్ ఎస్.తిలగర్ హాజరవుతారని చెప్పారు. -
కౌలు రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
వాకాడు : దేవదాయ శాఖ అధికారులు నిబంధనలకు వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి హెచ్చరించారు. సోమవారం వాకాడుకు చెందిన పలువురు కౌలు రైతులు ఆయనను కలిసి వాకాడు నాగేశ్వరస్వామి, అలఘనాథస్వామి, కోదండరామస్వామి ఆలయ భూముల కౌలు వేలాన్ని అధికారులు ఇష్టానుసారం నిర్వహిస్తున్నారని మొర పెట్టుకున్నారు. ఈ విషయమై రామ్కుమార్రెడ్డి స్పందిస్తూ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆలయ భూముల కౌలు వేలం నిర్వహించే తీరు అధికారులకు తెలియకపోతే నెల్లూరుకు చెందిన ఆ శాఖ మంత్రిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. మూడు ఆలయాలకు సంబంధించి 96 ఎకరాలు ఉండగా అందులో కేవలం 25 ఎకరాలకు మాత్రమే కౌలు వేలంపాట నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మండలంలోని పంట్రంగం గ్రామంలో వెలసిన శ్రీ పాండురంగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి రూ.17 లక్షలు గోల్మాల్ జరిగితే వారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కౌలురైతులు, పాల్గొన్నారు. -
12న కురబ సంఘం వార్షికోత్సవ సభ
తిరుపతి కల్చరల్: విజయవాడలో ఈనెల 12వ తేదీన జరిగే ఏపీ కురుబ, కురుమ, కురువ సంఘం 10వ వార్షికోత్సవ సభకు రాష్ట్రంలోని కుల సంఘ నేతలు, కురబ కులబాంధవులంతా పాల్గొనాలని ఏపీ కురబ, కురుమ, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సంఘ నేతలతో కలిసి సంఘ వార్షికోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో కురబ భవనానికి అవసరమైన స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో ఈనెల 12న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంఘ సభ జరుగుతుందని, అనంతరం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సౌత్ ఇండియా ఓబీసీ సదస్సు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో దేశంలోనీ బీసీలు, అన్ని రాష్ట్రాల బీసీ ప్రతినిధులు, దక్షిణ, ఉత్తర భారతదేశం రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతారన్నారు. -
కోర్టు ఆర్డర్లను బూచిగా చూపి..
తమకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయని చెబుతూ ఆక్రమణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. రెవె న్యూ అధికారులు సైతం వారికి కోర్టు ఆర్డర్లు ఉన్నా యని తాము వెళ్తే కోర్టు ఉల్లంఘన కింద తమపై చర్యలు తీసుకుంటారని దాటవేత ధోరణి ప్రదర్శించారు. అయితే సోమవారం సాక్షి ప్రతినిధులు ఆక్ర మణ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడంతో రెవెన్యూ అధికారులు ఉలిక్కిపడి రాత్రి సమయంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కూల్చేందుకు సిద్ధమవుతున్న రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించకపోవడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
శ్రాద్ధకర్మల రోజు వేద ఆశీర్వచనమా?: టీటీడీ చైర్మన్పై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: శ్రీవేంకటేశ్వర స్వామికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తీరని ద్రోహం చేస్తున్నారని.. ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ అదనపు జేఈవో వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య పెద్దకర్మకు వెళ్లి బీఆర్ నాయుడు పరామర్శించిన తీరు.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామంపై సోమవారం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీఆర్ నాయుడి మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. కానీ, ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకంగా ఉంటోంది. పవిత్ర భాగవత వస్త్రాన్ని కర్మ రోజు వెంకయ్య చౌదరికి కప్పారు. పరివట్టం కట్టి, లడ్డూ శ్రాద్ధకర్మల రోజు వెంకయ్య చౌదరికి అందించారు. శ్రార్దకర్మల రోజు వేద ఆశీర్వచనం ఇవ్వడమేంటీ?. ఎప్పుడు ఎలా ఉండాలో.. ఏ వస్త్రం కప్పాలో కూడా బీఆర్ నాయుడికి తెలియదు. వధువు, విదవకు తేడా తెలియని వ్యక్తి బీఆర్ నాయుడు’’ అని భూమన అభ్యంతరాలు వ్యక్తం చేశారు... ప్రసాదాల దిట్టం పెంచడం లేదని ఎల్లో మీడియాలోనే వార్త వచ్చింది. రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి స్వామివారిని వాడుకుంటున్నారు. జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రభస చేశారు. మరి ఆ సంస్థలో బీఆర్ నాయుడు భాగస్వామిగా ఉన్నారా? శ్రీ వెంకటేశ్వర స్వామికి బీఆర్ నాయుడు ద్రోహం చేస్తున్నాడు. ఆలయ పవిత్రతతను ధ్వంసం చేస్తున్నారు. అర్హత లేనివారికి అధికారమిస్తే అర్థరాత్రి గొడుగు పట్టకోమన్నాడట.. అలా ఉంది బీఆర్ నాయుడి తీరు అని భూమన ఎద్దేవా చేశారు.వైసీపీ పోరాటం వల్లే..ఏపీలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తీ మద్యమే(AP Liquor Mafia). కూటమి పాలనలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన నేతలు ఈ దందాను నడిపిస్తున్నారు. నకిలీ మద్యాన్ని టీడీపీ నేతలు పల్లెపల్లెకూ పంపించారు. ప్రతిచోటా ఏదో కుటీర పరిశ్రమలా.. నకిలీ మద్యం కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. పైగా లిక్కర్ కేసు అంటూ మాపై అసత్య ప్రచారం చేశారు. మా నేతలను జైల్లో పెట్టారు. చివరకు మా పోరాటం వల్లే ములకలచెరువు మద్యం ఇష్యూ బయటపడింది అని భూమన అన్నారు. -
మమ్మల్ని ఆపేదెవడ్రా?
తనపల్లి మార్గంలో నదీ పరీవాహక ప్రాంతాన్ని పూడ్చివేస్తున్న దృశ్యంసాక్షి ప్రతినిధి, తిరుపతి:తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. అందిన కాడికి అడ్డంగా దోచేస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడ్డ అధికారులను బుట్టలో వేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలను పిండి చేస్తున్నారు. రాత్రీపగలు తేడాలేకుండా టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి మట్టి, గ్రావెల్, ఇసుక, సిలికా, క్వార్ట్జ్ను సరిహద్దులు దాటిస్తున్నారు. దగ్గర్లోని వెంచర్లకు తోలుతూ జేబులు నింపుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. అడ్డుచెప్పిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని తప్పుడు రికార్డులు సృష్టించి స్వాధీనం ప్రభుత్వ భూములు చేసుకుంటున్నారు. అటు కుప్పం నుంచి ఇటు గూడూరు వరకు వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. చిత్తూరు కేంద్రంగా భారీగా గ్రానైట్ దందా సాగుతోంది. చిత్తూరు, బంగారుపాళెం, యాదమర్రి, పాలసముద్రం, వెదురుకుప్పం, శ్రీరంగరాజపురం, గంగాధరనెల్లూరు, కుప్పంలో కొండల్లోని గ్రానైట్ సంపదను కొల్లగొడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ పరిధిలోని కుంట్రపాకం సర్వే నం.599 ఎగువ చెరువులోని బంక మట్టిని భారీ యంత్రాలతో తోడి ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులోని నీటిని కూడా ఇటుక బట్టీలకు వాడుకుంటున్నారు. రైతులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుమరుగవుతున్న స్వర్ణముఖి తిరుపతి రూరల్ మండలం, అవిలాల రెవెన్యూ వేదాంతపురం పంచాయతీ పరిధిలోని స్వర్ణముఖి నదిని యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. 2012 నుంచి 2019 వరకు సర్వే నం.504/7 నదీ పోరంబోకు భూమిలో ఇసుకను తోడి విక్రయించి ఆపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా స్వర్ణముఖి నది పూర్తిగా కనుమరుగైంది. ప్రస్తుతం ఉన్న కొద్ది పాటి నదిని సైతం పూడ్చివేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కరిగిపోతున్న కొండలు.. గుంతలమయంగా స్వర్ణముఖి కరిగిపోతున్న అంజేరమ్మ కనం.. వడమాలపేట మండల పరిధిలోని అంజేరమ్మ ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ కరిగిపోతోంది. ఇప్పటికే ఆలయం వెనుక ఉన్న కొండను యంత్రాలతో తొలిచి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భూమిని చదునుచేసుకున్నారు. ప్రస్తుతం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సిద్ధం చేశారు. అదే విధంగా ఆలయం వెనుక ఉన్న కొండను తవ్వి గ్రావెల్ను తరలించకపోవడంతో పాటు.. ఆక్రమించి మామిడి చెట్లు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ అక్రమాలు స్థానిక అధికారులకు తెలిసినా మామూళ్ల పుచ్చుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
దాడి చేసి దోపిడీ
నాగలాపురం : మండలంలోని బంగారునాయుడు కండ్రిగ వద్ద శనివారం రాత్రి ఓ వ్యక్తిపై ఇద్దరు దుండగులు దాడి చేసి రెండు గ్రాముల బంగారు ఉంగరం, రూ.25వేల విలువైన సెల్ఫోన్ను దోచుకున్నారు. వివరాలు.. పిచ్చాటూరు మండలం అప్పలరాజు కండ్రిగకు చెందిన వెంకటేశులు తమిళనాడులోని ఊత్తుకోటలో ఉన్న హోటల్లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకుని ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి వస్తుండగా మాస్క్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. వెంకటేశులు సొత్తును దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితుడు ప్రస్తుతం సత్యవేడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
దర్జాగా దోషులు.. నిర్దోషులకు వేధింపులు
కార్వేటినగరం : అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో దోషులను దర్జాగా వదిలేసి, నిర్దోషులను వేధిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. ఆదివారం పుత్తూరులోని తన నివాసంతో మీడియాతో మాట్లాడారు. దళితులపై కక్షగట్టి అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితుడిని ప్రభుత్వం వదిలేసిందని ఆరోపించారు. దేవళంపేటలో రాజ్యాంగ నిర్మాత విగ్రహం నెలకొల్పిన సర్పంచ్ గోవిందయ్యను మాత్రం అరెస్ట్ చేయించిందని విమర్శించారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఎలా కస్టడీలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టినప్పటి నుంచి గొడవ చేస్తున్న టీడీపీ నేత సతీష్నాయుడుని వదిలిపెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీష్నాయుడు పలుమార్లు విగ్రహం తొలగించేందుకు యత్నించాడని ఆరోపించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను వెలికితీయాల్సిన పోలీసులు సైతం కూటమి ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులను సైతం దోషులుగా నిలబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. విగ్రహానికి నిప్పు పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయని, అయితే పోలీసులు అలాంటివి లేవని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈక్రమంలోనే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిర్దోషికి శిక్ష పడకూడదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి తానే నిప్పు పెట్టానని ఒప్పుకోవాలని ఓ మహిళను బలవంతం చేస్తున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. అభం శుభం తెలియని అమాయకులపై కేసులు పెట్టడం సరికాదని, నిజమైన దోషిని గుర్తించి రాజకీయాలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేఽశారు. వైఎస్సార్సీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, పార్టీ లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్ పాల్గొన్నారు. -
4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
కేవీబీపురం : మండలంలోని సూరమాల వద్ద మామిడితోటలో అక్రమంగా నిల్వ చేసిన 4.4 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు శనివారం రాత్రి సీజ్ చేశారు. ఎస్ఐ నరేష్ కథనం మేరకు.. రేషన్ దందాపై పక్కా సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు దాడి చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టబడిన బియ్యం విలువ సుమారు రూ.50వేల వరకు ఉండవచ్చని తెలిపారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో బియ్యం బస్తాను గోడౌన్కు తరలించినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చోరీ కేసులో నిందితుడికి రిమాండ్ రేణిగుంట : మండలంలోని కొత్తపాళెంలో ఇత్తడి బిందెలను చోరీ చేసిన కేసులో నిందితుడు జయచంద్రారెడ్డి(30)కి కోర్టు రిమాండ్ విధించింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారించి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. జయచంద్రారెడ్డిపై గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు రెండు ఉన్నట్లు వెల్లడించారు. యువకుడిపై పోక్సో కేసు చంద్రగిరి : బాలికపై లైంగికదాడికి యత్నించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు.. చంద్రగిరి బీడీ కాలనీకు చెందిన బాలిక(14) శనివారం ఇంటి వద్ద పాత్రలు కడుగుతుండగా, పాకాల అలీ అనే యువకుడు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. వెంటనే అలీ అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుదాఘాతంతో లైన్మన్ మృతి సత్యవేడు: మండలంలోని బాలకృష్ణాపురం పంచాయతీలో ఏ.సుబ్రమణ్యం (49) అనే లైన్మన్ విద్యుదాఘాతంతో శనివారం సాయంత్రం మృతి చెందాడు. వివరాలు.. ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేస్తుండగా సుబ్రమణ్యానికి కరెంట్ షాక్ తగలండంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య రేవతి ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేసింది. భర్త మృతిపై అనుమానం ఉందని పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామస్వామి తెలిపారు. తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు తిరుపతి అర్బన్: తమిళనాడులోని తిరువణ్ణామలైకి పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ భాస్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 4 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు ఓ బస్సును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే తిరిగి రావడానికి అవసరమైన బస్సులను సమకూర్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
దేవుడికే శఠగోపం!
సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రగిరి మండలం, మామండూరు పరిధిలోని దేవుడు మాన్యాన్ని కాజేసేందుకు స్కెచ్ వేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఈ భూమికి విపరీతమైన ధర పలుకుతోంది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.10 కోట్ల పైమాటే. సీఎం చంద్రబాబు సమీప బంధువు కావడంతో అధికారులు మౌనం వహిస్తున్నారు. గ్రామస్తులు వివరాల మేరకు.. మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారికి అనుకుని మామండూరు గ్రామ సమీపంలో సర్వే నం.91/1లో సుమారు 0.83 సెంట్ల గుడిమాన్యం పోరంబోకు ఉంది. రహదారి విస్తరణ చెందడంతో ప్రస్తుతం ఆ భూమి ధర రూ.10 కోట్లకు పైమాటేనని స్థానికులు చెబుతున్నారు. కబ్జాకు స్కెచ్ వేసిన సీఎం సమీప బంధువు ఆ దేవుడు మాన్యం భూమిపై అదే గ్రామానికి చెందిన సీఎ చంద్రబాబు సమీప బంధువు కన్నుపడింది. ఎలాగైనా కబ్జా చేయాలని పథకం పన్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ భూమిలో చిన్నపాటి రేకుల షెడ్ ఏర్పాటు చేశారు. ఆపై దుకాణం వెనుక వైపు ఉన్న భూమిని చదును చేయడం ప్రారంభించాడు. తరతరాలుగా దేవు డు మాన్యాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడు కుంటూ వస్తున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దేవుడు మాన్యాన్ని హస్తగతం చేసుకోవడానికి యత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చర్యలెక్కడ దేవుడు మాన్యాన్ని కాపాడాలని గ్రామస్తులు దేవదాఖ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఆ భూమిలో అనధికారికంగా దుకాణాన్ని ఏర్పాటు చేసి, ఆపై ప్లాట్లను ఏర్పాటు చేసి విక్రయించేందుకు యత్నిస్తున్నట్లుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దేవదాయ శాఖ అధికారులు కబ్జారాయుళ్లపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని ఆరోపిస్తునానరు. ఇప్పటికై నా అధికారులు స్పందించాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
చిల్లకూరు: గూడూరు మండలం చెన్నూరు సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వానదారుడికి తీవ్రగాయాలయ్యాయి. రూరల్ పోలీసుల కథనం మేరకు తిప్పవరప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి చెన్నూరుకు వచ్చి పని ముగించుకుని ఇంటికి తిరిగి బయల్దేరారు. గూడూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు మలుపు వద్ద ఎదురుగా ఢీ కొనడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు అతనిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా విక్రయిస్తున్న బాణసంచా సీజ్ నాగలాపురం : స్థానిక బ్రాహ్మణవీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఈ మేరకు ఎస్ఐ సునీల్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి రూ.లక్ష విలువైన బాణసంచా సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా అమ్ముతున్న ఇక్బాల్(65)పై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా బాణసంచా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడితో కానిస్టేబుళ్లు సాయికిరణ్, భూపతి, కృష్ణ, దివాకర్ పాల్గొన్నారు. -
వీసీ..పేచీ!
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తోంది. అవగాహన లేకనో.. విద్యారంగాన్ని ప్రైవేటు పరం చేయాలనే కుట్రతోనో వర్సిటీలపై దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని వర్సిటీలకు పూర్తి స్థాయి వీసీల నియామకాలను చేపట్టకుండా శోద్యం చూస్తోంది. వర్సిటీలలో పాలన స్తంభించి పోతోంది. నియామకాలు, బదిలీల విషయంలో తాత్కాలిక వీసీలు తమ అనుచరులకు పేద్దపీట వేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడితో వర్సిటీలను నడిపిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. దీంతో వర్సిటీల భవితవ్యం ఆగమ్య గోచరంగా మారింది. చేతులెత్తేసిన కూటమి జిల్లాలోని ఎస్వీయూనివర్సిటీ, ద్రావిడ వర్సిటీ, ఎస్వీ వెటర్నరీ వర్సిటీలకు సంబంధించి వీసీల నియామకంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడి ఇంతా అంతా కాదు. గత ప్రభుత్వంలో నియమితులైన వీసీలను బలవంతంగా ఒత్తిడి తెచ్చి రాజీనామలను చేయించారు. ఆ తర్వాత మంత్రి లోకేష్ ఇప్పటి వరకు జిల్లాలోని పలు వర్సిటీలకు వీసీలను నియమించలేకపోయారు. నిగ్గుతేల్చని వైనం జిల్లాలోని ఎస్వీయూ, ద్రావిడ వర్సిటీలకు వీసీల నియామకాలకు సంబంధించి మంత్రి లోకేష్ ఇప్పటికే సుమారు మూడు సార్లు సెర్చ్ కమిటీలను నియమించి విఫలమయ్యారు. గత 20 నెలల నుంచి జిల్లాలోని పలు వర్సిటీలకు ఇన్చార్జిలను నియమించి కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇందులో ప్రధానంగా జనసేన, టీడీపీకి చెందిన సామాజిక వర్గాల అధ్యాపకులు పెద్ద ఎత్తున ఆయా పార్టీల అధినేతలో మంత్రి లోకేష్కు ఒత్తిడి తేవడంతో సెర్చ్ కమిటీలు సైతం చేతులెత్తేశాయి. ఇప్పటికీ మూడు సార్లు జిల్లాలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు తమ వల్ల కాదంటూ చేతులేత్తేశాయి. దీంతో ఇప్పటి వరకు ఆ దిశగా మంత్రితో పాటు ఉన్నత విద్యామండలి అధికారులు అడుగులు వేయాలంటే భయపడుతున్నారు. మొగ్గు చూపని ఎన్ఐటీ, ఐఐటీ నిపుణులు జిల్లాలోని ఎస్వీయూ, వెటర్నరీ, ద్రావిడ వర్సిటీలకు సంబంధించి వీసీ నియామకాలను సంబంధించి కూటమి ప్రభుత్వం ఎన్ఐటీ, ఐఐటీ అధికారులను నియమించాలని ప్రయత్నం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు వర్సిటీలకు ఆ దిశగా నియామకాలు చేపట్టింది. కానీ ఆ యూనివర్సిటీలలో నియమితులైన ఐఐటీ, ఎన్ఐటీ నిపుణులకు వర్సిటీలపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో తమను ఆ విధుల నుంచి తప్పించాలని వారు విద్యాశాఖా మంత్రిని, ఉన్నత విద్యామండలికి విన్నవించారు. దీంతో ఎస్వీయూ వంటి ప్రతిష్టాత్మకవర్సిటీలకు వీసీ నియామకం విషయంలో ఎటూ తేల్చుకోలిని స్థితిలో కాలక్షేపం చేస్తోంది. ఎస్వీయూలో పరిస్థితి దారుణం ఎస్వీయూలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. పూర్తి స్థాయి వీసీని నియమించకపోవడంతో పాటు ప్రస్తుత ఇన్చార్జి వీసీకి రిజిస్ట్రార్కు పలు విషయాలలో విభేదాలు నెలకొనడంతో పాలన గాడితప్పింది. పాలన పూర్తిగా ఉన్నత విద్యామండలి చేతులోకి వెల్లింది. ప్రతి చిన్న విషయానికి ఉన్నత విద్యామండలి జోక్యం చేసుకుంటోంది. 2025 పీజీ సెట్ అడ్మిషన్ల విషయంలో కనీసం ఇప్పటి వరకు అన్ని విభాగాలలో 30శాతం అడ్మిషన్లు కాకపోవడం ఆలోచించాల్సి విషయం. ఉన్నత విద్య నిర్వీర్యం నిర్వీర్యం చేసే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఇంటర్, డిగ్రీ, పీజీ అడ్మిషన్లు కనీ సం 30శాతం సైతం ప్రభుత్వ సంస్థలలో ప్రవేశాలు కావడం లేదు. దీనికి తోడు వర్సిటీలలో పాలన పూర్తిగా స్తంభించింది. ఇప్పటి వరకు ఎస్వీయూకు పూర్తి స్థాయి అధికారులు లేరు. ఇన్చార్జి పాలనతో కాలయాపన చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు వర్సిటీలను అప్పజెప్పే ప్రయత్నం చేస్తే ఊరుకోం. –బండి చలపతి, ఏఐఎస్ఎఫ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, తిరుపతి -
ఉత్తుత్తి విద్యుత్
నేతన్నకు●నేత కార్మికులకు ఉచిత విద్యుత్ జీఓ ఇచ్చి ఆరు నెలలు గడిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవర్లూమ్స్కు మంచి రోజులు వస్తాయని నేతన్నలు ఆశించారు. సర్కారు కొలువు దీరి ఏడాదిన్నర కావస్తున్నా విద్యుత్ బాదుడు కొనసాగుతూనే ఉంది. కంటి తుడుపుగా జీఓ ఇచ్చి చేతులు దులుపుకోవడంతో నేత కార్మికులు మండిపడుతున్నారు. హామీ అమలు చేయాలంటూ ఆందోళనబాట పడుతున్నారు. పుత్తూరు : ఉచిత విద్యుత్ జీఓతో తమ కుటుంబాలకు కొంతైనా ఆర్థిక భారం తగ్గుతుందనుకున్న నేతన్న జీవితాల్లో నిరాశే మిగిలింది. వ్యవసాయం తర్వాత చేనేత రంగం అతిపెద్ద ఉపాధి రంగం. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. లయబద్దంగా వినబడే పవర్లూమ్స్ ధ్వని వినిపించడం తగ్గిపోతోంది. ఇందుకు వివిధ సుంకాల పేరిట పెరిగిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణం. చాలీ చాలని కూలీలతో జీవితాలు అప్పుల పాలవుతున్నాయని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దాదాపు అన్ని పవర్లూమ్ కేంద్రాలు మూతపడే పరిస్థితిలోకి వెళ్తున్నాయి. గత మార్చి 26వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత విద్యుత్ జీవో నంబర్ 44 ఆరు నెలలు పూర్తయినా అమలు కాకపోవడంతో నేతన్నలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నేతన్న నేస్తంతో ఆదుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. అంతే కాకుండా విద్యుత్ చార్జీల నుంచి 96 పైసల యూజర్స్ చార్జీలను తగ్గించి వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది జరిగిన రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో నారా చంద్రబాబు నాయుడు పుత్తూరులో పర్యటించారు. ఆ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. చేనేత, పవర్లూమ్స్ కార్మికులకు 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తానంటూ హామీ ఇచ్చారు. గుడ్డిగా నమ్మిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం నాటి ఎన్నికల హామీకి ఎగనామం పెట్టడంతో పాటు వివిధ సుంకాల పేరిట విద్యుత్ చార్జీలను పెంచి నేత కార్మికుల నడ్డి విరిచారు. జీవో అమలులో నిర్లక్ష్యం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో దిగివచ్చిన బాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 26వ తేదీన జీవో 44ను విడుదల చేసింది. ఇందులోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల వాస్తవ సంఖ్య, పవర్లూమ్ యూనిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపిస్తూ జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నూలు, పట్టు చేనేత కుటుంబాలు 2,79,000 వేల మంది ఉండగా కేవలం 93 వేల మందిగా చూపించారు. అలాగే మరమగ్గాలు 81 వేలు ఉండగా కేవలం 10,534 ఉన్నట్టుగా చూపించారు. ఈ లెక్కల ప్రకారం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు జీవోలో స్పష్టం చేశారు. ఇందుకు ఏడాదికి సుమారు రూ.125 కోట్ల ఆర్థిక భారం పడనున్నదని పేర్కొన్నారు. జీవో అమలుకు డిస్కమ్ సంస్థలు ఇంధన శాఖకు తగిన బడ్జెట్ మంజూరు చేయాలని ప్రతిపాదించారు. అయితే జీవో విడుదలై 6 నెలలు కావస్తున్నా బడ్జెట్ విడుదల కాకపోవడంతో నేటికీ జీవో అమలుకు నోచుకోలేదు. నేతన్నల డిమాండ్లు జీవో నంబర్ 44ను వెంటనే అమలు చేయాలి మొత్తం రాష్ట్ర బడ్జెట్ నుంచి 10 శాతం 3,000 కోట్లు కేటాయించాలి నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలి చేనేత వస్త్ర ఉత్పత్తులకు జీరో జీఎస్టీని వర్తింపచేయాలి నూలు, సిల్క్లకు 50 శాతం రాయితీ ఇవ్వాలి చేనేత కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి గృహం, వర్క్ షెడ్ పథకాన్ని అమలు చేయాలి జీవిత బీమా సంస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసిన బీమా పథకాన్ని కొనసాగించాలి సహకార సంఘాలను బలోపేతం చేయాలి -
నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అర్జీదారుల సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు సమస్యలను అర్జీరూపంలో అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్వీయూ అధికారుల అత్యుత్సాహం తిరుపతి సిటీ : ఎస్వీయూలో అధికారుల అత్యుత్సాహం మితిమీరుతోంది. నిబంధలకు విరుద్ధంగా నోటిఫికేషన్ సైతం విడుదల చేయకుండా ఇష్టానుసారంగా నియామకాలు చేపడుతున్నారు. అందులో భాగంగా వర్సిటీలోని గ్రంథాలయం, ఎస్వీ క్యాంపస్ స్కూల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో కాంట్రాక్ట్ బేసిస్ అంటూ నియామకాలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు రూ. 22వేలు మాత్రమే చెల్లించాల్సి ఉండగా, నూతనంగా నియమించిన వారికి రూ. 25వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే పలు విభాగాలల్లో నాన్ టీచింగ్ నియామకాలపై దృష్టి సారించి ఒక్కో పోస్టుకు రూ.లక్షలు దండుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు కూటమి నేతల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరు అధ్యాపకులపై వేటు వర్సిటీలోని ఎంబీఏ, ఎంసీఏ విభాగాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులను విధుల నుంచి తప్పించారు. సక్రమంగా పనిచేయకపోవడం, విధులకు రెగ్యులర్గా హాజరుకాకపోవడంతో వేటు వేసినట్లు తెలిసింది. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు గోగర్భం డ్యామ్ వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 83,380 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,275 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు ఏర్పేడు : మండలంలోని గుడిమల్లంలో వెలసిన ఆనందవళ్లీ సమేత పరశురామేశ్వరాలయంలో ఆదివారం సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు ఆకుల సతీష్, గౌతమి, తీర్థప్రసాద్ ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈఓ రామచంద్రారెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గిరినాయుడు, అర్చకులు వంశీకృష్ణ, పవన్కుమార్ శర్మ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంతోనే బలోపేతం
తిరుపతి రూరల్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారంతోనే యూనియన్ బలోపేతమవుతుందని జనశక్తి విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు తోకల అశోక్కుమార్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాల వద్ద ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అతిథిగృహంలో యూనియర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అశోక్కుమార్ మాట్లాడుతూ కాంట్రాక్టు, రెగ్యులర్ కార్మికుల సమస్యల పరిష్కారానికి జనశక్తి విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ అండగా నిలబడుతుందన్నారు. సంఘం గౌరవ అధ్యక్షుడు అళహరి సుధాకర్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. ముఖ్య సలహాదారు టి.సాయి సుధాకర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో నేతలు ఎస్.పవన్ కుమార్, ఇరివిశెట్టి వెంకటాద్రి, శ్రీరామ్ మల్లికార్జున, పి.సోమశేఖర్, కేవీ ప్రసాద్, వి.మునిరామకృష్ణ, జి.రమేష్ బాబు, బంగారు వెంకటేష్, రామానాయుడు, ధర్మేంద్ర, పీజీ రాజు, బి.కిరణ్, ఎం.భానుచంద్ర పాల్గొన్నారు. -
ప్రాణాపాయంలో
దొరవారిసత్రం మండలం పాళెంపాడు వాసులు ప్రాణాపాయంలో ఉన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం 25 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. గత రెండేళ్లలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వయసుతో నిమిత్తం లేకుండా రోగుల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మహమ్మారి వ్యాప్తికి కారణం కనిపెట్టేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి బ్లడ్ టెస్ట్లు చేయించారు. గ్రామంలో రక్షిత పథకం.. చేతి బోర్లలో నీటిని పరీక్షించారు. అయినప్పటికీ అసలు సమస్యను గుర్తించలేకపోయారు. భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురక్షిత తాగునీటిని అందిస్తే ఇబ్బందులను అధిగమించే అవకాశముంటుందని సూచిస్తున్నారు. పాళెంపాడు గ్రామందొరవారిసత్రం : మండలంలోని ఏకొల్లు పంచాయతీ పాళెంపాడుకు కిడ్నీ వ్యాధి శాపంగా మారింది. గ్రామంలోని ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. ఈ వ్యాధి బారిన ఎలా పడుతున్నారనే విషయం అధికారులకు అంతుపట్టడంలేదు. గడిచిన రెండేళ్లలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఐదుగురు మృతి చెందగా, ఇరవై రోజుల కింట సగిలాల వెంకటేష్ (35) అనే యువకుడు రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో మృత్యవాత పడ్డాడు. దీంతో కిడ్నీ వ్యాధి మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కిడ్నీ వ్యాధి గ్రస్తులు పెరగడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్రామంలో సుమారు 15 రోజులుగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి రక్త పరీక్షలు చేస్తున్నారు. మరో వైపు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో రక్షిత పథకం నీటితోపాటు, చేతి బోర్లలోనే జలాలను పరీక్షలు చేయించారు. అయితే ఇప్పటికీ కిడ్నీ వ్యాధి విజృంభణకు కారణాలను కనిపెట్టలేకపోతున్నారు. అంతుబట్టని కారణాలు పాళెంపాడులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల వరకు పర్యటించారు. వైద్యశిబిరం ఏర్పాటు చేసి వివిధ పరీక్షలు చేయిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ అసలు కారణాలు అంతుపట్టడం లేదని చెబుతున్నారు. ర్డబ్ల్యూఎస్ ఈఈ ఎస్డీఎం సత్తార్ 12 రోజుల కిందట గ్రామంలో పర్యటించి నాలుగు చేతి బోర్లను రీఫుల్లింగ్ చేయించారు. రక్షిత నీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకును పూర్తిస్థాయిలో క్లోరినేషన్ చేయించారు. మళ్లీ గ్రామంలో నీటిని పరీక్షలకు పంపించి, నివేదికలు వచ్చిన తర్వాతే గ్రామస్తులు వాడుకునేలా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా గ్రామానికి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. కిడ్నీ వ్యాధితో విలవిల్లాడుతున్న 25 మంది బాధితులు అంతటా ఆందోళన గ్రామంలో సుమారు 170 కుటుంబాలున్నాయి. 750 నివసిస్తున్నారు. వైద్యాధికారులు లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కిడ్నీ రోగులు 25 మంది ఉన్నట్లు గుర్తించారు. అందులో ప్రస్తుతం ఇద్దరు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారురు. పాళెంపాడులో గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పలుమార్లు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకువచ్చినా స్పందించలేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఎవరి తోచిన కారణాలను వారు వెల్లడిస్తున్నారు. చేతి బోర్లతో నీరు తాగి కిడ్నీలు దెబ్బతిన్నాయని కొందరు, స్థానికంగా వైద్యం అందించే ఆర్ఎంపీల మందుల వాడడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని మరికొందరు చెబుతున్నారు. ఆర్ఎంపీలు రాసిన పెయిన్ కిల్లర్ మందులను ఇబ్బడి ముబ్బడిగా వాడడంతో కిడ్నీ సమస్యలు తలెత్తినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మృతి చెందిన వెంకటేష్ కూడా ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన మందులు వేసుకోవడంతో కిడ్నీలు దెబ్బతిన్నట్లు బాధిత కుటుంబీకులు వివరిస్తున్నారు. ఏది ఏమైనా ఒకే గ్రామంలో ఇంతమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండడమంటే చిన్న విషయం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అసలు కారణం తెలుసుకుంటేనే సమస్యను పరిష్కరించవచ్చని వెల్లడిస్తున్నారు. పారిశుద్ధ్యలోపమూ ఓ కారణమే.. పాళెంపాడులో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగేందుకు గ్రామంలోని పారిశుద్ధ్యలోపమూ ఓ కారణమని స్థానిక వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి, విశాఖపట్నంలోని ల్యాబ్లలో ఇటీవల పాళెంపాడు గ్రామంలోని నీటి శ్యాంపిళ్లను పరీక్షించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాలు కలుషితమైనట్లు తెలిసిందని అధికారులు వెల్లడిస్తున్నారు. చేతిబోర్లలో సైతం బ్యాక్టీరియా ఉందని తెలియజేస్తున్నారు. -
నీడలో వాహనాలు.. ఎండలో భక్తులు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారుల తీరు మారలేదు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్ల కింద వాహనాలు పార్కింగ్ చేస్తుంటే పట్టించుకోవడం లేదు. దీంతో భక్తులు ఎండలో రోడ్లపై నడవాల్సి వస్తోంది. రూ.లక్షల వ్యయంతో షెడ్లు ఏర్పాటు చేస్తే, అందులో వాహనాలు పార్క్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. దీనిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అప్పటికీ ఎవరైనా వాహనాలను పార్క్ చేస్తే జరిమానా విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కారు పార్కింగ్ కాంట్రాక్టర్లు సైతం చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు. -
ఆందోళనగా ఉంది
రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్లు మూడేళ్ల క్రితం తెలిసింది. ఇక అప్పటి నుంచి చికిత్సపొందుతున్నా. అయినప్పటికీ అనారోగ్యంతో ఏ పనీ చేసుకోలేని స్థితిలో ఉన్నా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆందోళనగా ఉంది. గతంలో చేతిబోరులోని నీటినే తాగేవాడిని. ఆ నీటి కారణంగానే కిడ్నీ వ్యాధి వచ్చిందని ఇప్పుడు కొందరు చెబుతున్నారు. నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. సమస్యలను కనిపెట్టి పరిష్కరిస్తే గ్రామానికి మంచి జరుగుతుంది. – దేవళ్ల పెద్ద చెంగయ్య(65), కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, పాళెంపాడు చెడు అలవాట్లు లేవు నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అయినప్పటికీ రెండేళ్ల క్రిందట రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పుడు ఏం తినాలన్నా.. కనీసం నీరు తాగాలన్నా భయమేస్తోంది. ఏ పని చేయలేక, ఇంటి వద్దనే ఉంటున్నా. గ్రామంలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – దేవళ్ల చిన్నచెంగయ్య(62), కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, పాళెపాడు నీటి కారణంగానే.. గ్రామంలో చేతి బోరులో నీరు తాగడం వల్లే కిడ్నీలు పాడయ్యాయయి. ఇందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. అయితే కొందరు బయటి ప్రాంతాల నుంచి క్యాన్ వాటర్ తెచ్చుకుని వాడుకుంటున్నప్పటికీ కిడ్నీ సమస్యలు తలెత్తాయి. నేను రెండేళ్ల నుంచి కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతున్నా. నరకం అనుభవిస్తున్నా. – సమ్మన పరదేశయ్య(60) కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, పాళెంపాడు కలుషిత నీటితోనే.. పాళెంపాడులో కలుషిత నీటిని తాగడం వల్లే పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడ్డారు. అక్కడి చేతిబోర్లలోని నీటిని తిరుపతిలోని మైక్రోబయాలజీ ల్యాబ్కు పంపాం. ఆ నీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అలాగే బోరు నీటిలో ఖనిజ లవణాలు పెరగడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతిని ఉండవచ్చు. ఊరిలోని పేడ దిబ్బల కారణంగా కూడా నీరు కలుషితమవుతోంది. – వి.చైతన్య, వైద్యాధికారి, డీవీ సత్రం పీహెచ్సీ -
7 నుంచి జాతీయ సహకార సదస్సు
తిరుపతి అర్బన్: తిరుపతి వేదికగా మూడు రోజుల పాటు జాతీయ సహకార సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఆయన శనివారం సదస్సు నిర్వహణపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి లక్ష్మితో పాటు జూమ్ మీటింగ్లోనూ పలువురు అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 7 నుంచి 9 వరకు తిరుపతిలోని తాజ్ హోటల్లో జాతీయ సహకార మంత్రిత్వశాఖ వర్క్ షాపు ఉంటుందని వెల్లడించారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న వివిధ కార్యక్రమాల అమలుపై సమీక్షించడానికి త్రైమాసిక సమావేశం జరగనుందని తెలిపారు. సమావేశానికి జాతీయ సహకార మంత్రిత్వశాఖ సెక్రటరీ ఆశిష్ కుమార్ భుటాని, ఏపీ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ జైన్, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్, సెరికల్చర్ కో–ఆపరేషన్స్, మార్కెటింగ్ తదితరులు రానున్నారని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జూమ్ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ కో– ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఎండీ శ్రీనాథ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, ఆర్డీఓలు తిరుపతి, శ్రీకాళహస్తి రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి, పలువురు తహసీల్దార్లు, ఆర్టీసీ, టూరిజం అధికారులు హాజరయ్యారు. -
గంగమ్మ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుకండి
తిరుపతి కల్చరల్ : తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి అవసరాల నిమిత్తం ప్రైవేటు స్థలం కొనుగోలు కోసం మేయర్ డాక్టర్ శిరీష కుటుంబ సభ్యులు రూ.5 లక్షల విరాళాన్ని శనివారం టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి చేతుల మీదుగా ఆలయ ఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ.. గంగమ్మ ఆలయ అవసరాల కోసం ఆలయానికి ఆనుకుని ఉన్న ప్రవేటు స్థలాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో గంగమ్మ భక్తులుగా తమ కుటుంబం భాగస్వామ్యం కావాలని భావించి రూ.5 లక్షలు విరాళంగా అందించామని తెలిపారు. గంగమ్మ ఆలయ అభివృద్ధి , గంగమ్మ జాతర విశిష్టతను దశ దిశలా వ్యాప్తి చేసి, గంగ జాతరకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి భూమన కరుణాకరరెడ్డి కావడంతో ఆయన చేతులగా మీదుగా ఈ విరాళాన్ని ఇవ్వడం సముచితంగా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దాతల సహకారంతో అమ్మవారికి వజ్ర కిరీటం చేయించడం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి తిరుపతి గంగ జాతరకు అధికారిక గుర్తింపు ఇవ్వడం, ఆలయ జీర్ణోద్ధరణ, విస్తరణ పనులు, ప్రహరీ నిర్మాణం పూర్తి చేయడం వంటి అనేక కార్యక్రమాలు భూమన కరుణాకరరెడ్డి చేయించారని తెలిపారు. తిరుమల వెంకన్న చెల్లెగా పూజలందుకుంటున్న గంగమ్మను తొలుత దర్శించుకున్న తర్వాతే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే ప్రాచీన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహహన్రెడ్డి తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు మొదటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా గంగమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, డాక్టర్ హేమకుమార్రెడ్డ, డాక్టర్ హరిబాబు, డాక్టర్ రమేష్, మునయ్య, సురేష్ యాదవ్ ,చింతా రమేష్, అంకయ్య, వెంకటేష్, బత్తయ్య, పురుషోత్తం, సూరి, ఆదినారాయణ పాల్గొన్నారు. -
డబ్బులొస్తే.. డ్రైనేజ్ పనులు
తిరుపతి అర్బన్ : డబ్బులొస్తే తిరుపతిలో డ్రైనేజ్ పనులు చేద్దామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. తుడా ఆఫీస్లో ఆయన శనివారం రాత్రి 9.30 గంటలకు మీడియా సమావేశంలో తెలిపారు. డిసెంబర్లో రూ.45 కోట్ల మేరకు లే అవుట్లు వేసుకున్న వారు తుడాకు చెల్లించాల్సిన డబ్బులు వస్తాయని చెప్పారు. దాంతో డ్రైనేజ్ పనులు, తాగునీరు, రోడ్లు ఏర్పాటు చేద్దామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసిన అనంతరం వీధిలైట్లు ఇతర అభివృద్ధి పనులు చేద్దామని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు తిరుపతి నగరంలో ముంపు ప్రాంతాలు, వర్షానికి పై భాగంలోని మార్వాడి గుంట నుంచి వచ్చే వరద నీటి ఇబ్బందుల నేపథ్యంలో చెక్ డ్యామ్లు ఏర్పాటు చేయాలని ప్రశ్నించారు. ఆ పనులు కూడా చేద్దాం నిధులు మంజూరైన తర్వాత అంటూ సమాధానం ఇచ్చారు. మున్సిపాలిటి, కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు తదితర పనులను చేపట్టడానికి మూడు దశల్లో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఆయనతో పాటు తుడా వీసీ, జేసీ శుభం బన్సల్, తిరుపతి కమిషనర్ మౌర్య , యాదవ సంఘం చైర్మన్ నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఉన్నారు. -
దంచికొట్టిన వాన
తిరుపతి తుడా : భారీ వర్షం తిరుపతిని ముంచెత్తింది. తెల్లవారుజామున 2 గంటల తర్వాత ప్రారంభమైన వర్షం ఉదయం 8 గంటల వరకు అదే జోరు కొనసాగించింది. నగరంలోని కాలువలు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. నగరంలో ఎక్కడ చూసినా మోకాళ్లోతు నీళ్లు కనిపించాయి. పొంగి ప్రవహించిన కాలువలు జోరు వానతో ఎగువ ప్రాంతాలైన కపిలతీర్థం, మాల్వాడి గుండం, ఎస్వీ యూనివర్సిటీ తదితర ప్రాంతాల నుంచి వర్షపు నీరు జోరుగా ప్రవహించింది. ఈ క్రమంలో కాలువలు పొంగి రోడ్లపై పెద్ద ఎత్తున నీరు పారింది. కాలనీలు జలమయం భారీ వర్షానికి లక్ష్మీపురం కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, లీలామహల్ కూడలి, కరకంబాడి రోడ్డు, కొర్లగుంట పెద్ద కాలువ ప్రాంతాల్లో వర్షపు నీరు పోటెత్తింది. ఇక్కడ వర్షపు నీరు ప్రమాదకర స్థాయిలో ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలానే రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు ప్రమాదకర స్థాయికి చేరింది. నిమిషాల వ్యవధిలోనే అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయాయి . దీంతో నో ఎంట్రీ బోర్డులను ఏర్పాటు చేశారు. మధురానగర్, మాధవనగర్, కొర్లగుంట, మారుతి నగర్, సుబ్బారెడ్డి నగర్, చంద్రశేఖర రెడ్డి కాలనీ, కట్టకిందపల్లి, కొరమీనుగుంట, ఆటోనగర్, లక్ష్మీపురం, ఎస్టీవీ నగర్, గాంధీపురం పరిసర ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు వీలుపడనంతగా ఆ వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో జన జీవనానికి ఆటంకం ఏర్పడింది. ఉరుములు... మెరుపులు భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో పిడుగులు పడినట్లు సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేశారు. చిరు వ్యాపారులకు దెబ్బ తిరుమల మూడో శనివారం ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చిరు వ్యాపారులు విక్రయాల కోసం శుక్రవారం సాయంత్రం నుంచి నగరంలో వ్యాపారాలను ప్రారంభించారు. ఊహించని భారీ వర్షం వ్యాపారులను దెబ్బతీసింది. భారీ వర్షానికి కూరగాయల మార్కెట్లోకి మోకాళ్లలోతులో నీళ్లు చేరడంతో కూరగాయలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. వేగంగా సహాయక చర్యలు భారీ వర్షం నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య ఆదేశాలతో ప్రజా ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ శాఖ అధికారులు సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున వ్యర్థాలు చేరుకోవడంతో వర్షపు నీటిని పంపింగ్ ద్వారా తోడారు. సిబ్బంది చేతులు మీదుగా టన్నుల కొద్ది వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా తరలించారు. చంద్రగిరిలో భారీ వర్షం చంద్రగిరి : చంద్రగిరి మండల వ్యాప్తంగా శనివారం తెల్లవారిజామున 2 గంటల నుంచి ఉదయం 10.30గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో మండల పరిధిలోని ఏ.రంగంపేట కృష్ణాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటరమణ పూరి గుడిసె వెనుక భాగం నేలకూలడంతో ఆందోళనకు లోనయ్యాడు. -
దౌర్జన్యంగా ప్రహరీ కూల్చివేత
ఏర్పేడు : మండలంలోని మాధవమాలలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడి ఇంటి ప్రహరీని శనివారం జేసీబీ సాయంతో కూల్చి వేశారు. అడ్డు వచ్చిన బాధితులపై దాడికి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు... మాధవమాలకు చెందిన పెరుమాల్ ఆచారి ఇంటి వద్ద వీధి సందుకు ఆనుకుని పట్టా భూమిలో ప్రహరీ నిర్మించారు. అయితే ఈ గోడను తొలగించాలని చూడగా గ్రామానికి చెందిన కొందరు అడ్డు చెప్పడంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం గ్రామానికి చెందిన టీడీపీ నేత భాస్కర్ ఆచారి, కిషోర్, ధనంజయులఆచారి, ధనరాజ్ ఆచారి, రవి ఆచారి, రాజ్కుమార్ తమ ఇంటి వద్దకు జేసీబీ తీసుకొచ్చి గోడను కూల్చేశారని బాధితుడు వాపోయాడు. గోడ కూల్చుతుండగా అడ్డుకున్న పెరుమాల్ ఆచారి, అతడి భార్య పద్మ, కుమారుడు మోహన్పై దాడి చేసి గాయపరిచారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పింఛన్ సొమ్ము స్వాహా గూడూరు రూరల్ : గూడూరు మండలం కొమ్మనేటూరు పంచాయతీ సచివాలయ పరిధిలోని 64 మంది పింఛన్దారులకు సంబంధించిన రూ.2.85 లక్షల నగదును వెల్ఫేర్ అసిస్టెంట్ రాకేష్ స్వాహా చేసినట్లు సమాచారం. 160 పెన్షన్లకు సంబంధించిన నగదును తీసుకెళ్లి ఈనెల 1, 3 తేదీలలో మధ్యాహ్నం వరకు 96 పింఛన్లకు సంబంధించి నగదును అందించారు. మిగిలిన 64 పింఛన్లకు సంబంధించి రూ.2.85 లక్షల నగదును పంపిణీ చేయకుండా సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ చెంచు ప్రసాద్ ఉన్నతాధికారులతో పాటు ఇన్చార్జి ఎంపీడీఓ కౌసల్యకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం వెల్ఫేర్ అసిస్టెంట్ రాకేష్ను కార్యాలయానికి పిలిపించి మెమోను జారీ చేసినట్లు ఇన్ఛార్జి ఎంపీడీఓ తెలిపారు. సోమవారం లోగా పింఛన్ల నగదును అందించకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వాహన డ్రైవర్ల సంక్షేమానికి కృషి
తిరుపతి కల్చరల్: రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపు నిచ్చారు. కచ్చిపి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో అర్హులైన 14,375 మంది ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహన యజమానులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు రూ.21.56 కోట్ల మెగా చెక్కును అందజేశారు. కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు ఘనంగా ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నాయీబ్రాహ్మణ చైర్మన్ సదాశివం, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, రీజనల్ టాన్స్పోర్టు కమిషనర్ క్రిష్ణవేణి, హస్తకళ అభివృద్ధి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య , యూనియన్ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
స్విమ్స్లో ‘నిరంతర వైద్య విద్య’
తిరుపతి తుడా : స్విమ్స్ ఆస్పత్రిలోని అనస్తీషియా, కార్డియాలజీ, సిటీ సర్జరీ విభాగాల ఆధ్వర్యంలో నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్న్ఙి శనివారం నిర్వహించారు. పద్మావతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతో ప్రత్యేక సదస్సుకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కార్డియాలజీ, సీటీ స్కాన్, సర్జరీ, ఆనస్తీషియా తదితర విభాగాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వనజాక్షమ్మ, అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ అలో సమంతరే, డాక్టర్ రోహిత్ కుమార్, డాక్టర్ వహీద్ ఖాన్, డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. తెలుగు గంగ కాలువలో దూకి వ్యక్తి మృతికలువాయి (సైదాపురం) : మండలంలోని చింతలాత్మకూరు గ్రామానికి చెందిన నాగిళ్ల రవి(30) పర్లకొండ సమీపంలోని తెలుగు గంగ కాలువలోకి దూకేశాడని స్థానికులు తెలిపారు. శనివారం దాచూరు సమీపంలోని కండలేరు డ్యామ్ నందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్ఐ కోటయ్య వెళ్లి సమగ్ర విచారణ చేపట్టారు. గంగ కాలువలోకి దూకిన రవికి మతిస్థిమితం సరిగా లేదని మృతుడు రవి తల్లిదండ్రులు వివరించారని పోలీసులు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి పాకాల : మండలంలోని దామలచెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. వివరాలు.. మ్యాంగోనగర్ క్రాస్ నుంచి రైల్వేస్టేషన్ వెళ్లే దారిలోని మద్యం దుకాణం సమీపంలో సుమారు 60 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం
చిత్తూరు రూరల్/తిరుపతి తుడా/చిత్తూరు రూరల్ (కాణిపాకం)/తిరుమల: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8గంటల వరకు వాన పడుతూనే ఉంది. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు పంటలు సైతం దెబ్బతిన్నాయి.⇒ చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి వద్ద సీతమ్మ చెరువు నుంచి గార్గేయ నదికి వెళ్లే మార్గంలో వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పది గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టమాటా, వరి, పూలతోటలు, కూరగాయల పంటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు.⇒ చిత్తూరు జిల్లా తవణంపల్లిలోని మాధవరం వంక పొంగిపొర్లుతోంది. తొడతర బ్రిడ్జిపై వర్షపునీరు ఉధృతంగా పారుతోంది. ఈకారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.తిరుపతిలో భారీ వర్షం భారీ వర్షం తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రెండు గంటల సమయంలో మొదలైన వర్షం ఉదయం 8 గంటల వరకు పడుతూనే ఉంది. కుండపోత కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది. లక్ష్మీపురం కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, లీలామహల్ కూడలి, కరకంబాడి రోడ్డు, కొర్లగుంట పెద్ద కాలువ ప్రాంతాల్లో వర్షం నీరు ఏరులై పారింది. ప్రమాదకరస్థాయిలో దాటడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలానే రైల్వే అండర్ బ్రిడ్జ్ల వద్ద వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరింది. తిరుమలలో కూడా..తిరుమలలో కూడా శనివారం భారీగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరపి లేని వర్షం కురవడంతో చలి తీవ్రత పెరిగింది. నాలుగు మాడవీధులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, దర్శనం అనంతరం ఆలయం బయటకు వచి్చనపుడు తడిసి ముద్దయ్యారు. వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.వరి, టమాటా పంటలకు నష్టం అన్నమయ్య జిల్లాలో శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. పీలేరులో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. పీలేరు–మదనపల్లె మార్గంలో నాలుగులేన్ల రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం కోసం కొత్తచెరువును తవ్వి వదిలేశారు. అయితే భారీ వర్షం కారణంగా చెరువు కట్ట తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న పొలాల్లో వరి, టమాటా పంటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి గార్గేయ ప్రాజెక్టు నిండి పింఛా నది పరవళ్లు తొక్కుతోంది. -
పేరుకే కన్వినర్ కోటా.. లక్షల్లో ఫీజులు
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరులోని అన్నాగౌరీ మెడికల్ కళాశాల యాజమాన్యం ఫీజుల బాదుడుకు విద్యార్థులు, తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పైవేటు వైద్య కళాశాలలు కన్వినర్ కోటా కింద ఒక్కో సీటుకు ఫీజు రూ.1.70 లక్షల వరకు వసూలుచేస్తుండగా అన్నాగౌరీ కళాశాల యాజమాన్యం మాత్రం హాస్టల్ విత్ ఏసీ అయితే రూ.5.36 లక్షలు, నాన్ ఏసీ అయితే రూ.4.56 లక్షలు కట్టాల్సిందేనంటున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల కమిటీ నిర్ణయం ఇదేనని.. మీకు ఇష్టముంటే చేరండి లేదంటే వెళ్లండంటూ సీఈఓ నిర్లక్ష్యంగా చెబుతున్నారంటూ కన్వినర్ కోటా కింద సీట్లు పొందిన 50 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. మానసికంగా కుంగిపోయా.. అన్నాగౌరీ కళాశాలలో ఫీజులు వినగానే మానసికంగా కుంగిపోయాను. మాది వైట్కార్డ్ హోల్డర్కు చెందిన పేద కుటుంబం. మా అబ్బాయిని కష్టపడి చదివించుకున్నాం. అన్ని కళాశాలల్లాగే అన్ని ఫీజులు కలిపి రూ.1.70 లక్షలు ఉంటుందనుకున్నాం. కానీ, ఈ అన్నాగౌరీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కిట్ రూ.1.10 లక్షలు పెట్టి తీసుకోవాలన్నారు. మా వద్ద కిట్ ఉంది కనుక మాకు అది అవసరం లేదు. స్పోర్ట్స్, కల్చర్ ఫీజు కింద రూ.55 వేలు చెల్లించాలన్నారు. హాస్టల్లో విధిగా ఉండాలన్నారు. హాస్టల్ రూమ్ ఫీజు రూ.1.10 లక్షలు, ఏసీ అయితే రూ.1.90 లక్షలతో పాటు, ఎక్కడాలేని విధంగా విద్యుత్ చార్జీలకు మరో రూ.40 వేలు కట్టాలన్నారు. ఎమినిటీస్ రూ.20 వేలు అంటున్నారు. ఇలా మొత్తం ఫీజు రూ.5.36 లక్షలు. – లత, నంద్యాలరూ.5 లక్షలు కడితే అది కన్వినర్ కోటా ఎలా అవుతుంది?.. రూ.నాలుగు నుంచి ఐదు లక్షల వరకు కడితే అది కన్వీనర్ కోటా ఎలా అవుతుంది? మా పాపకు కన్వినర్ కోటా కింద సీటొచి్చంది. గాయత్రి కళాశాలలో రూ.1.50 లక్షలు ఫీజు అయితే ఇక్కడ దాదాపు రూ.5 లక్షలు వరకు చెబుతున్నారు. ఇంత ఎక్కువ ఏమిటి సార్.. అని అడిగితే కమిటీ నిర్ణయం తీసుకుంది.. ఇష్టం ఉంటే చేరండి లేదంటే వెళ్లిపొండి అంటున్నారు. – ప్రియ, అనంతపురం -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,188 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,640 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది.దర్శన టిక్కెట్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో తిరుమలేశుని దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
పడకేసిన పల్లె వైద్యం
తిరుపతి తుడా : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసింది. కొన్ని రోజుల నుంచి పీహెచ్సీలో పనిచేస్తున వైద్యుల సమస్యలను పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి వైద్యులు సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో వైద్య సేవలు స్తంభించిపోయాయి. దీంతో జిల్లాలోని పలు పీహెచ్సీలు సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలు మాత్రం అక్కడక్కడా కొనసాగాయి. నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఆన్లైన్ సేవలు, రిపోర్టుల సమర్పణకు బంద్ పాటించారు. దీంతో పలు సేవలు స్తంభించాయి. పలుచోట్ల ప్రజలు చికిత్స అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా సేవలకు మంగళం ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ వైద్యుల సంఘం (ఏపీపీహె చ్పీడీఏ) పిలుపు మేరకు వైద్యులు సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో వైద్య సేవలు స్థంభించి పోయాయి. గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి రూరల్ ప్రాంతాలలోని పీహెచ్సీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పీహెచ్సీలకు విచ్చేసిన రోగులు తమకు ఇదివరకు ట్రీట్మెంట్ ఇచ్చిన వైద్యులు లేకపోవడంతో వెనుదిరిగారు. దీంతో పీహెచ్సీలలో పనిచేస్తున్న నర్సులు సైతం డాక్టర్లు లేరని తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఎస్వీ మెడికల్ కళాశాల నుంచి 53 మంది వైద్యులు జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీలలో వైద్యులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. ఎస్వీ మెడికల్ కళాశాల నుంచి 53 మంది వైద్యులను, డీసీహెచ్ విభాగం నుంచి సుమారు 36 మంది వైద్యులను జిల్లాలోని అన్ని పీహెచ్సీ ఆసుపత్రులకు తాత్కాలికంగా విధులు నిర్వహించాలని పంపారు. కానీ కనీసం 3 0శాతం మంది వైద్యులు తమకు విధులు కేటాయించిన ఆసుపత్రులకు వెళ్లలేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో వైద్యశాఖాధికారులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమకు సుదూర ప్రాంతాలలో విధులు కేటాయించి ఎటువంటి మౌలిక సదుపాయాలు కేటాయించలేదని వారు వాపోతున్నారు. 104 పై ప్రభావం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మె బాట పట్టడంతో 104 వైద్య సేవలపై ప్రభావం కనిపించింది. పీహెచ్ సీల్లో ఇద్దరు వైద్యులు ఉండగా ఒకరు ఆరోగ్య కేంద్రంలో, మరొకరు 104 సంచార వైద్య సేవలు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. సమ్మె కారణంగా వైద్యులు విధులకు రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని అప్పట్లో కూటమి నేతలు, అధికారులు చెప్పారు. తీరా నిరసన విరమించాక ఏమాత్రం పట్టించుకోలేదు. చంద్రన్న సంచార చికిత్స వాహనంలో తిరిగీ సేవలందిస్తున్నందుకు ప్రతి నెలా అదనంగా రూ.5 వేలు చెల్లించాలని కోరుతున్నారు. అందించకపోవడంతో 104 వైద్య సేవలు ఆగిపోయాయి. ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని పీహెచ్సీల పరిధిలో 104 వైద్య సేవలకు ఆటంకం కలిగింది. ప్రభుత్వం స్పందించి వైద్యుల డిమాండ్లు పరిష్కరిస్తే గానీ పేదలకు వైద్య సేవలు అందే అవకాశం కానరావడంలేదు. సీజన్ వ్యాధులు వ్యాపించే పరిస్థితుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల డిమాండ్లు ఇవీ.... సర్వీస్లో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు గతంలో 30 శాతం క్లినికల్ 50 శాతం నాన్ క్లినికల్ రిజర్వేషన్ ఉప డేది. ప్రస్తుం ఈ కోటాను 15.30 శాతానికి కుదించారు. ఈ ఏడాది జీఓ నంబర్ 89 ద్వారా ఆరు బ్రాంచ్ల నిబంధన తెర మీదకు తెచ్చారు. దీని ప్రకారం 15 శాతానికి కుదించిన క్లినికల్ సీట్ల రిజర్వేషన్ రేడియాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, అనస్థీషియా బ్రాంచీలకు మాత్రమే వర్తింపజేసింది. ఈ అన్యాయాన్ని వైద్యులు ఏడాది కాలంగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. ఎంబీబీఎస్ చదివి వైద్యాధికారిగా నియమితులైన వారు పీజీ చదువుకోవడానికి ప్రభుత్వం అనేక షరతులు పెట్టింది. రూ.50 లక్షల ష్యూరిటీ ఇవ్వాలని, కనీసం పదేళ్లు ప్రభుత్వ సర్వీసులో అదే హోదాలో పని చేస్తామంటూ బాండ్ రాయాలని చెబుతోంది. మెడిసిన్ చదివినా ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ప్రభుత్వం తన వద్ద హామీగా పెట్టుకుంటోంది.దీనిపై వైద్యవృత్తిలో ఎదుగుదల లేదంటే పీజీ చదవడం దేనికని పీహెచ్సీల వైద్యులు ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న ఎంతో మంది వైద్యాధికారులకు 20 ఏళ్లుగా పదోన్నతులు లేవు. వారికి పదోన్నతులు కల్పిస్తామని ఎన్నికల వేళ అసోసియేషన్ నాయకులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని వైద్యులు ఆరోపిస్తున్నారు. -
జీఎస్టీ తగ్గింపుతో కుటుంబాలకు ఆదా
శ్రీసిటీ (వరదయ్యపాళెం): రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ‘సూపర్ జీఎస్టీ –సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, కళాకారులు, వ్యాపారులకు వివరించేందుకు శ్రీసిటీలో శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీసిటీకి చెందిన వివిధ పరిశ్రమల ప్రతినిధులు, కమ్యూనిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ సంయుక్త డైరెక్టర్ చంద్ర శేఖర్ సమావేశ ఉద్దేశాన్ని వివరించారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు సుబ్బారావు, ప్రవీణ్కుమార్ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భారత్ రెడ్డి హాజరై, ఈ కార్యక్రమం దృక్పథాన్ని వివరించారు. సభను ఉద్దేశించి మాట్లాడిన సుబ్బారావు, సూపర్ జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 15,000 వరకు ఆదా సాధ్యమవుతోందని, వ్యాపార వృద్ధికి ఇది బలాన్ని ఇస్తుందని తెలిపారు. నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు, ఆరోగ్య సేవలు వంటి 99 శాతం వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో ఈ ప్రయోజనాలు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జీఎస్టీ 2.0 ప్రజా కేంద్రిత విధానాన్ని వివరించారు. -
లీజు ఒకచోట.. తవ్వింది మరోచోట
శ్రీకాళహస్తి : లీజుకిచ్చిన క్వారీ భూమిలో కాకుండా ఏపీఐఐసీ భూమిలో తవ్వకాలు చేపట్టి మెటల్ కొల్లగొట్టిన క్వారీ యజమానిపై అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. తొట్టంబేడు మండలంలోని తాటిపర్తి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 129లో మహేశ్వర నాయుడు అనే వ్యక్తికి మహేశ్వర స్టోన్ క్రషర్స్ పేరిట క్వారీ తవ్వకాలకు ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. అయితే లీజు భూమిలో కాకుండా పక్కనే ఉన్న ఏపీఐఐసీ (సర్వే నంబర్ 212) భూముల్లో తవ్వకాలు చేపట్టాడు. సుమారు 1.10 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ను పది మీటర్ల లోతుకు తవ్వి తరలించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయంపై ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ (తిరుపతి) ఫిర్యాదు చేయగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, క్వారీని తనిఖీ చేసి యజమాని మహేశ్వర నాయుడుపై కేసు నమోదు చేశారు. -
తిరుచానూరులో అత్యాధునిక హోటల్
చంద్రగిరి : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు తిరుచానూరులో అత్యాధునిక హంగులతో హోటల్ ఏర్పాటైంది. తిరుచానూరు సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని లెమన్ ట్రీ హోటల్స్ ప్రీమియర్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి, నగిరి ఎమ్మెల్యే గాలి భాను, తిరుపతికి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం హోటల్లో ప్రత్యేక పూజలను నిర్వహించి, ముఖ్య అతిథిలు హోటల్ను ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ... డబుల్ హైట్, గ్రాండ్ డ్రాప్ ఆఫ్, మార్బుల్ ఫినిష్, స్టెయిన్ గ్లాస్ అలంకరణతో రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 సీట్ల సిగ్నేచర్ రెస్టారెంట్, లైవ్ కిచెన్, బఫేతో పాటు 30 సీట్ల సామర్థ్యం గల అల్ఫ్రెస్కో డైనింగ్ను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాంప్రదాయ రీతిలో వినియోగదారులను ఆకట్టుకునేలా మండపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పోర్ట్స్ బార్, స్పా, మల్టీపర్పస్ హాల్, 500 సీట్ల బ్యాంక్వెట్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. వేడుకలను జరుపుకునేందుకు ప్రత్యేకంగా స్థలం, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్తో పాటు పవిత్ర తిరుమల దృశ్యాల మధ్య ఆహ్లాదకరమైన వసతులు అందిస్తున్నట్లు తెలిపారు. -
కమనీయం.. కల్యాణం
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం కమనీయంగా సాగింది. శ్రీవారి జన్మ నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని వేదపండితులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. వేకువ జాము స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. అనంతరం పద్మావతీ, ఆండాల్ సమేత ప్రసన్న వేంకటేశ్వరుడ్ని పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ భరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి నూతన వధూవరులుగా తీర్చిదిద్దారు. ఆలయ పండిత బృందం ముందుగా గణపతి హోమం నిర్వహించింది. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మాంగల్యధారణను కమనీయంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
మొక్కుబడిగా తాత్కాలిక వైద్య సేవలు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలలో వైద్య సేవలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో జిల్లా వైద్యశాఖాధికారులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ● శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలల్లోని పీహెచ్సీలలో డాక్టర్ల సమ్మె ఉధృతం కావడంతో ప్రత్యామ్నాయంగా జిల్లా అధికారులు తాత్కాలిక వైద్యులను నియమించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులను నియమించినప్పటికీ రోగులు తమకు ఇప్పటికే పరిచయమై వైద్య సేవలు అందించిన వైద్యులు లేకపోవడంతో వెనుదిరగడం కనిపించింది. ● సూళ్లూరు పేట నియోజకవర్గంలో సైతం డాక్టర్ల సమ్మె కారణంగా పీహెచ్సీలలో జిల్లా వైద్య శాఖాధికారులు ప్రత్యేకంగా డాక్టర్లు నియమించారు. నియోజకవర్గంలోని 13 నియోజకవర్గాలల్లో వైద్యులను నియమించినప్పటికీ రోగులు రాకపోవడం విశేషం. నాయుడుపేట, దొరవారిసత్రం, ఓజిలి, తడ పీహెచ్సీ కేంద్రాలల్లో యథావిధిగా కొనసాగినప్పటికీ గతంలో వచ్చిన విధంగా రోగులు ఆ స్థాయిలో రాలేదు. –చంద్రగిరి నియోజవర్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. భాకరాపేట పీహెచ్సీలో వైద్యులు లేకపోవడంతో రోగులు గంటల తరబడి నిరీక్షించి ఇంటికి వెనుదిరిగారు. తాత్కాలిక వైద్యులు సైతం పీహెచ్సీకి సమయానికి రాకపోవడంతో పేద రోగులు స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలలను సంప్రదించారు. నియోజకవర్గంలోని రామచంద్రాపురం, కుప్పం బాదూరు ప్రాథమిక కేంద్రాలను డీఎంహెచ్ఓ సందర్శించి పరిస్థితి సమీక్షించారు ● సత్యవేడు, గూడూరులో దారుణం గూడూరు మండలం పీహెచ్సీలో రోగులు లేక పీహెచ్సీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సాధారణంగా ఒక్కో పీహెచ్సీకి రోజుకు సుమారు 100 మందికి పైగా రోగులు వచ్చేవారు. సమ్మెతో కనీసం పదులు సంఖ్యలో కూడా రాలేదు. అలాగే చిల్లకూరు , వల్లిపేడు, చింతవరం, వరగలి పీహెచ్సీలో తిరుపతి నుంచి వైద్యులను తాత్కాలికంగా వేసినప్పటికీ ఎక్కడ కూడా వారు బాధ్యతలు చేపట్టలేదు. ఈ ఆసుపత్రిలో సుమారు 80 నుంచి 100 మంది వరకు వైద్య సేవలు పొందుతారు. అలాంటిది పదుల సంఖ్యలో వైద్య సేవలు పొందారు. కోట మండలంలో చిట్టేడు, వాకాడు మండలంలో బాలిరెడ్డి పాలెం చింతోట, వాకాడు మండలంలోని బాలిరెడ్డి పాలెం, చింతోట, నిడుగుర్తిలలో పీహెచ్సీలు ఉండగా ఇక్కడ వైద్యులు సమ్మెలో ఉన్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులు వెనుదిరగాల్సి వచ్చింది. చిట్టమూరు, మల్లం, గుణపాటి పాలెం, ఈశ్వరవాక పీహెచ్సీలు ఉండగా అక్కడా వైద్యులు సమ్మెలో ఉన్నారు. వీరి స్థానంలోకి వైద్య ఆరోగ్య శాఖ తాత్కాలికంగా వైద్యులను పంపి వైద్యం అందిస్తున్నారు. సత్యవేడులోని అన్ని పీహెచ్సీ కేంద్రాలలోనూ వైద్యసేవలు స్తంభించి పోయాయి. తూతూ మంత్రంగా కొన్ని కేంద్రాల్లో వైద్యులను నియమించినప్పటికీ రోగులు ఆసుపత్రికి ఆ స్థాయిలో వచ్చిన దాఖలాలు కనిపించలేదు. -
దయాదాక్షిణ్యం లేని టీటీడీ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: మానవసేవే మాధవసేవ అంటూ ప్రతినిత్యం ప్రచారం చేసే టీటీడీ యాజమాన్యం శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలపై కనీసం దయాదాక్షిణ్యం లేకుండా వ్యవహరిస్తోందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. టీటీడీ పరిపాలన భవనం వద్ద చేపట్టిన శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారుల ఉపాధిని టీటీడీ దెబ్బతీయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. శేషాచలం అడవులను అక్రమంగా నరికి వేస్తున్న స్మగ్లర్లని వందల మందిని పట్టించిన వారి ఔదార్యాన్ని గుర్తించాలన్నారు. టీటీడీ అధికారులు చిరువ్యాపారుల కడుపు కొట్టడం దారుణమని విమర్శించారు. టీటీడీ పాలకమండలి, యాజమాన్యం తక్షణం స్పందించి శ్రీవారి మెట్టు వ్యాపారుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర, యూనియన్ నాయకులు మధు, చిట్టిబాబు, చిరంజీవి, గణేషు, యుగంధర్, రాంబాబు, మల్లికార్జున్, ప్రకాష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నైలెట్తో ఉపాధి
తిరుపతి సిటీ : నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( నైలెట్)తో స్థానిక యువతకు ఉన్నత స్థాయి ఉపాధి, ఉద్యోగాలు లభించే సువర్ణావకాశం ఉందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఎస్వీయూ ప్రాంగణంలో తాత్కాలిక భవనంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించగా ఎంపీ గురుమూర్తి, అధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ .. నైలెట్ శిక్షణ కేంద్ర ఎస్వీయూలో ప్రారంభించడంతో ఇందులో శిక్షణ పొందిన యువతకు ఆధునిక ఐటీ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ పొందనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఎస్వీయూ వీసీ అప్పారావు, నైలట్ సెంటర్ ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నైలెట్ సాధనలో ఎంపీ పాత్ర కీలకం కేంద్ర శిక్షణ సంస్థ నైలెట్ సాధనలో తిరుపతి ఎంపీ పాత్ర కీలకమని అధికారులు, అధ్యాపకులు పేర్కొన్నారు. ఏడాదికి కనీసం 1000 మంది యువతకు పూర్తి స్థాయి అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఉన్నత ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ఐటీ శిక్షణతో పాటు షార్ట్ టర్మ్ కోర్సులు నైలెట్ ఆవిర్భావం తిరుపతిలో సాంకేతిక శిక్షణకు సరికొత్త అడుగుపడింది. నైలెట్లో ఐటీ సంబంధిత శిక్షణతో పాటు వెబ్ డిజైనింగ్, పీసీ హార్డ్వేర్ నెట్వర్కింగ్, ఆఫీస్ ఆటోమేషన్, అకౌంటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి షార్ట్టర్మ్ కోర్సులు అందించనున్నారు. అదనంగా, ఎంబీడెడ్ సిస్టమ్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సెమికండక్టర్ డిజైన్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లోనూ యువతకు శిక్షణ లభించనుంది. -
కలెక్టర్ ఆరా..
దేవళంపేట ఘటనపై జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఆరా తీశారు. విషయం తెలిసిన వెంటనే ఘట నా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీసీ ఫుటేజీలు, పోన్ సంభాషణలు, అర్ధరాత్రి ఎవరు తిరిగారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు థామస్, మురళీ మోహన్ కూడా స్పందించారు. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. కాలిపోయిన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆది నుంచీ అరాచకమే
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ వారు చేస్తున్న అరాచకాలకు హద్దుల్లేవు. ఇది అన్యా యం అని ప్రశ్ని స్తే అడిగిన వాళ్లపైనే కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. అంబేడ్కర్ విగ్రహాలను కూల్చి వేయడం, చెప్పుల మాలలు వేసి అవమానించడం, నిప్పు పెట్టడం వంటి ఘటనలు నిత్యం జరుగుతూనే లున్నాయి. మహిళలు, వృద్ధులు, బాలికలు ఇలా అందరూ కూటమి పాలనలో దాడులకు గురవుతున్నారు. అంబేడ్కర్ ఎస్సీ, ఎస్టీలకే కాదు అందరికీ దారి చూపించాడు. ప్రతిక్కరికీ దైవ స్వరూపమైన అంబేడ్కర్కి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఇలాంటి దారుణాలు చేసిన వారిని కఠి నంగా శిక్షించాలి. అలా జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – కే.కృపాలక్ష్మి, నియోజకవర్గ ఇన్చార్జి -
యుద్ధం గెలిచిన వీరుడు మిథున్
తిరుపతి మంగళం: సంగ్రామంలో నుంచి బయటకు వచ్చిన యుద్ధవీరుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. బెయిల్పై వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని గురువారం తిరుపతి మారుతీనగర్లోని ఆయన నివాసంలో భూమన కరుణాకరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు పార్టీ కేడర్కి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ అభ్యున్నతికి, జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి పడిన కష్టంపై ఎంపీ మిథున్రెడ్డిని అభినందించారు. లిక్కర్స్కామ్ అంటూ ఎంపీ మిథున్రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్రెడ్డితోపాటు మరి కొందరిపై అక్రమ కేసులు బనాయించి, జైళ్లకు పంపారన్నారు. చంద్రబాబు పైశాచిక ఆనందం కోసం ఎంపీ మిథున్రెడ్డిని 71రోజుల పాటు ఓ టెర్రరిస్టులా జైల్లో నిర్బంధించారన్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపుల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు బయపడే వారెవ్వరూ వైఎస్ఆర్ సీపీలో లేరని స్పష్టం చేశారు. -
దళితులకు అండగా వైఎస్సార్సీపీ
వెదురుకుప్పం: మండలంలోని దేవళంపేటలో స్థానిక సర్పంచ్ గోవిందయ్య 2023లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేవళంపేట–తిరుపతి ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థలంలో విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ స్థలాన్ని స్థానికంగా కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్ప ట్లోనే పరోక్షంగా సర్పంచ్ గోవిందయ్యపై కొందరు టీడీపీ నేతలు భగ్గుమన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని టీడీపీ నేత సతీష్ నాయుడు కులం పేరుతో దూషించారు. అధికారం రావడంతో సర్పంచ్పై జిల్లా అధికారులకు ఫిర్యా దు చేసి చెక్ పవర్ను రద్దు చేయించారు. అంతటితో ఆగకుండా సర్పంచ్పై పలు కేసులు పెట్టించి వేధించారు. వాటన్నిటికీ వెరవకుండా వైఎస్సార్సీపీలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన సతీష్ నాయుడు, అతని అనుచరులు కలిసి అంబేడ్కర్ విగ్రహాన్ని తగలబెట్టేందుకు పూనుకున్నారు. ఉలిక్కపడ్డ దళితులు గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అంబేడ్కర్ విగ్రహంపై పెట్రోలు పోసి తగలబెట్టారు. దీంతో ఒక్కసారిగా దళితులు ఉలిక్కిపడ్డారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఏకమై దుశ్చర్యను ఖండించాయి. ఈ రోజు విగ్రహానికి నిప్పు పెట్టారు.. రేపు మమ్మల్ని ఏం చేస్తారోనని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కాళ్లు పట్టుకుంటాం.. న్యాయం చేయండి మీ కాళ్లు పట్టుకుంటాం.. ఇక మమ్మల్ని బతకనివ్వరు.. మాకు న్యాయం చేయండంటూ సర్పంచ్ గోవిందయ్య ఏకంగా నగరి డీఎస్పీ మహ్మద్అజీజ్ కాళ్లు పట్టుకున్నారు. ఇదిలా ఉండగా చిత్తూరు ఎస్పీ తుషార్డూడిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్చార్జి కృపాలక్ష్మి వెదురుకుప్పం పోలీసు స్టేషన్లో కలిసి.. పోలీసుల వైఫల్యం, వారి తీరును ఎండగట్టారు. వారి నిర్లక్ష్యంతోనే నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరుగుతన్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బందార్లపల్లె ఘటనను గుర్తుచేశారు. బొమ్మయ్యపల్లె ఎంపీటీసీ భాస్కర్కు జరిగిన అవమానాన్ని గుర్తుచేసి న్యాయం చేయాలని కోరారు. ఈనెల 25లోపు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు. దేవళంపేటలో జరిగిన ఘటనతో బడుగు బలహీనవర్గాలకు అండగా వైఎస్సార్సీపీ నిలిచింది. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి కృపాలక్ష్మితో పాటు కార్వేటినగరం, పెనుమూరు, శ్రీరంగరాజపురం మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పెద్దు ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎంతటి వారినైనా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించాయి. -
ముగిసిన డిగ్రీ రెండవ విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ
తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో రెండవ విడత డిగ్రీ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఓఏఎమ్డీసీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శుక్రవారంతో ముగిసినట్లు తెలిపింది. విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి సాధించిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈనెల 6వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 7, 8వ తేదీలలో ఆయా కళాశాలల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించి అడ్మిషన్లు పొందాలని సూచించారు. రెండవ విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. నేటితో ముగియనున్న పీజీ ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో పీజీసెట్–2025 రెండవ విడత (ఫైనల్ ఫేజ్) అడ్మిషన్ల ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఈ మేరకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ, చివరి విడత అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఆయా కోర్సులకు సంబంధించి ఈనెల 6వ తేదీన వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించారు. అనంతరం పీజీ సెట్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రిజర్వేషన్లు, సాధించిన మార్కుల ఆధారంగా 8వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఈనెల 11వ తేదీలోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లకు త్వరలో స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. జాతిపిత అడుగు జాడల్లో పయనిద్దాం తిరుపతి అన్నమయ్యసర్కిల్ : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను రెండు వారాలు పాటు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారని తెలిపారు. ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛత అంశాలలో ఒక కొత్త అంశం తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాలు, నగరాలను స్వచ్ఛ ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనేది కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. అంతక ముందు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) నరసింహులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్యతో పాటు మున్సిపల్ అధికారులు, ఏవో రమేష్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు తిరుపతి సిటీ : వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. 23న ఫస్ట్ ఇయర్ పరీక్షలు, 24న ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. సాధారణ, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి టైం టేబుల్ విడుదల చేశారని ఆయన తెలిపారు. గజలక్ష్మి నమో నమామి చంద్రగిరి : విజయదశమి సందర్భంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు గురువారం గజ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. విజయదశమి పర్వదినం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. విద్యుత్ దీపాల కాంతుల నడుమ అమ్మవారికి ఊంజల్సేవను కనుల పండువగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనంపై ఆశీనులై నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. -
తిరుపతికి ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. ‘హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్’ పేరిట మెయిల్స్ వచ్చాయి. ఉగ్రవాదుల బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేపట్టాయి. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్, విష్ణు నివాసం ప్రాంతాల వద్ద ప్రత్యేక బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు.వివిధ రాష్ట్రాలలో బాంబులు పెట్టినట్లు కొన్ని ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయి. తిరుపతి జిల్లాకి కూడా ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో, జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికావొద్దని ఎస్పీ తెలిపారు.తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, గవర్నర్ ఆర్ఎన్ రవి భవనం, సినీనటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. తమిళనాడులోని పలు రాజకీయ, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో.. తిరుపతిలోని పోలీసు ప్రత్యేక విభాగం అలర్ట్ అయ్యింది. -
తిరుమలలో భక్తుల రద్దీ ఇలా.. దర్శనం కోసం ఎన్ని గంటలంటే..
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 75,188 మంది భక్తులు దర్శించుకున్నారు. పండుగల వేళ భక్తుల సంఖ్య పెరగడంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంట సమయం పడుతోంది.ఇక, తిరుమలలో నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,640 మందిగా ఉంది. గురువారం స్వామివారి హుండీ ఆదాయం 2.66 కోట్లుగా టీటీడీ తెలిపింది. మరోవైపు.. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంట సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 6 గంటలు.. ఇక, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. -
శ్మశాన వాటిక పరిరక్షణే లక్ష్యం
తిరుపతి తుడా: దశాబ్దాల నాటి శ్మశాన వాటికను కబ్జాకోరుల నుంచి కాపాడుకుంటామని వైఎస్సార్సీపీ నాయకులు ప్రకటించారు. శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతున్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంపై నిరసిస్తూ బుధవారం మారుతినగర్ శ్మశానవాటిక వద్ద వైఎస్సార్ సీపీ తిరుపతి యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. యువజన విభాగం నగర అధ్యక్షుడు దినేష్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుయాదవ్, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు మద్దాలి శేఖర్ తదితరులు మాట్లాడారు. దొడ్డిదారిని డిప్యూటీ మేయర్ అయిన ఆర్సీ మునికృష్ణ అధికారం అడ్డు పెట్టుకుని శ్మశానవాటిక కబ్జాకు యత్నించడం శోచనీయమన్నారు. శ్రీనివాసులు నాయుడు అతని భార్య పేరుతో రెండు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, శ్మశాన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఎంఆర్ పల్లె, మారుతి నగర్ పరిసర ప్రాంత ప్రజలను ఏకం చేసి శ్మశాన స్థలం పరిరక్షణకు కార్పొరేషన్ కార్యాలయాన్ని, డిప్యూటీ మేయర్ ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు. అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్ వంశీ, నాయకులు మల్లం రవి, కిషోర్ రెడ్డి, కోటి, పద్మ, అఖిల్, దామా షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్!
తిరుపతి రూరల్ : తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడిన ఏడుగురు దొంగలను తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.24లక్షల విలువైన 240గ్రాముల బంగారం, ఒకటిన్నర కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చంద్రగిరి డీఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వివరాలు వెల్లడించారు. తుడా క్వార్టర్స్ ఎంఐజీ ప్లాట్ నంబరు 87లో సెప్లెంబర్ 10వ తేదీన చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వేట ప్రారంభించారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో తిరుచానూరు సీఐ సునీల్కుమార్, ఎస్ఐలు ఎం.అరుణ, జగన్నాథరెడ్డి, సాయినాథ్ చౌదరి దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటి వద్ద దొరికిన వేలిముద్రల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైమ్ బ్రాంచి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం తలుపులు మూసి తాళం వేసియున్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడే ఈ ముఠా ఆచూకీని కనిపెట్టారు. ఆ ముఠాలో 7మంది సభ్యులను తిరుచానూరు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన తోట శివకుమార్, అతడి భార్య తోట వరలక్ష్మి, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మాదవరంపోడుకు చెందిన సూరేపల్లి వెంకటేష్, కడపటౌన్ రాజీవ్గాంధీనగర్కు చెందిన గొడుగు అజీజ్, రైల్వేకోడూరు మండలం, మాధవరం పోడుకు చెందిన చిన్నమేకల దేవి, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ నగర్కు చెందిన మర్లోతు గాయత్రి, తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కంట్లం గ్రామానికి చెందిన కొవ్వాసి రాధాకృష్ణ ఉన్నారు. వీరిలో తోట శివకుమార్ మీద 150కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు ఛేదనకు కృషి చేసిన సీఐ, ఎస్ఐలతో పాటు క్రైమ్ పార్టీ సిబ్బంది టి.ప్రభాకర్, వీఎల్ఎన్ ప్రసాద్, ఎం.ప్రసాద్, ఆర్.షఫీని ఎస్పీ సుబ్బ రాయుడు, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి అభినందించారు. నగదు రివార్డులను ప్రకటించారు. -
కక్ష సాధిస్తే.. ఉధృత ఉద్యమం
తిరుపతి తుడా : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ మేరకు పీహెచ్సీ వైద్యులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి సేవలందించామని గుర్తు చేశారు. గ్రామీణులకు విశేషంగా వైద్యం అందిస్తున్న తమను వేధించడం సరికాదని మండిపడ్డారు. చిత్తశుద్ధితో విధులు నిర్వరిస్తున్న తమకు మరిన్ని వసతులు, అలవెన్సులు కల్పించకుండా, ఉన్న వాటిపై కోత పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్సీ వైద్యుల ఆందోళనకు రుయా మెడికల్ ఆఫీసర్లు మద్దతు ప్రకటించారు. -
వైభవం.. వెంకన్న రథోత్సవం
బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి అశ్వవాహనంపై శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి కల్కి అవతారంలో భక్తులను కటాక్షించారు. అంతకు ముందు స్వామి, అమ్మవార్ల ఊంజల సేవ జరిపించారు. తిరుపతి రూరల్ : మండలంలోని తుమ్మలగుంటలో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఎనిమిదవ రోజైన బుధవారం ఉదయం రథోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా అలంకార మండపం వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చారు. భక్తిశ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు. బ్రహ్మరథంపై ఊరేగుతున్న బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. రథంపై భక్తులు ఉప్పు, మిరియాలు చల్లి కర్పూర హారతులు సమర్పించారు. చెవిరెడ్డి లక్ష్మి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. రథోత్సవం ముగిసిన తర్వాత ఆలయంలోని కల్యాణ మండపంలో దేవదేవేరులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అలరించిన కోలాటం, భజనలు రథోత్సవంతో పాటు అశ్వవాహన సేవల్లో కళాకారులు, భజన బృందాలు అలరించాయి. వృషభాలు ముందు నడుస్తుండగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
అమ్మో.. మృగాళ్లు
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు నగరంలో బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో నిందితులు చేసిన పాపానికి ఉచ్చు బిగుస్తోంది. నేరం చేస్తే ఎవరూ నోరు విప్పరనే ధైర్యంతో ఉన్న ఆ ముగ్గురూ.. చేసిన నేరాన్ని సాక్ష్యాలతో సహా న్యాయస్థానం ఎదుట నిరూపించడానికి ఆధారాలు సేకరిస్తున్నారు. బుధవారం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్తో పాటు, తాలూక ఎస్ఐ మల్లికార్జున, ఫింగర్ప్రింట్ ఇన్స్పెక్టర్ సతీష్, తిరుపతిలోని ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) కేంద్రానికి చెందిన మహిళా అధికారి గ్యాంగ్రేప్ జరిగిన ఘటనా స్థలంలో పలు సాక్ష్యాలను సేకరించారు. దాదాపు రెండు గంటల పాటు పోలీసులు ఘటనా స్థలాన్ని జల్లెడ పట్టి, కీలకమైన ఆధారాలను సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం నిందితులను పట్టుకునేప్పుడు స్థానికులపై తిరగబడటానికి ప్రయత్నిస్తే దేహశుద్ధి చేశారు. ఆపై నిందితులు తీసిన వీడియోలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నిందితులు కిషోర్, మహేష్, హేమంత్ అఘాయిత్యం జరిగిన తీరును వివరిస్తున్నట్లుగా ఆ వీడియోల్లో తెలుస్తోంది. వీళ్లను పోలీసులకు అప్పగించే క్రమంలో నిందితులు ముగ్గురూ పారిపోగా.. తాజాగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇక నిందితుల మొబైల్ ఫోన్లలో వీడియోల విషయం తేల్చడానికి వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. నిందితులను గురువారం అరెస్టు చూపించే అవకాశం ఉంది. పార్కులో అటవీశాఖ భద్రత డొల్ల ఈ ఘటనలో చిత్తూరు పశ్చిమ రేంజ్ అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కులో ఎంట్రీ కోసం రూ.10 డిజిటల్ చెల్లింపుల ద్వారా వసూలు చేస్తున్న అధికారులు, ఇక్కడ సందర్శకుల భద్రత కోసం ఏ ఒక్క చర్య పాటించడంలేదు. దాదాపు 6 కి.మీ విస్తీర్ణం ఉన్న నగర వనంలో ఒక్కటంటే ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా పార్కులో దట్టమైన రిజర్వు ఫారెస్టు (ఆర్ఎఫ్) కలిసి ఉంది. ఈ రెండింటినీ వేరుచేసే కంచె కూడా లేదు. దీనివల్ల వన్య మృగాలు సందర్శకులపై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సందర్శకులు సైతం పార్కును దాటుకుని ఆర్ఎఫ్లోకి వెళితే, వాళ్లు బయటకు వచ్చారా..? లేదా కూడా తెలియదు. ఇక వాచర్లు, బీట్ అధికారులు పూర్తి సమయం ఇక్కడ ఉండటం లేదు. సందర్శకులకు కనీస భద్రత లేకుండా ఆఘమేఘాలపై నగరవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం అధికారుల అత్యుత్సాహమే అవుతుంది. దీనిపై వెస్ట్ రేంజ్ ఎఫ్ఆర్వో పట్టాభి వివరణ ఇస్తూ.. ఆర్ఎఫ్ చుట్టూ కంచె ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, హెచ్చరిక బోర్డులు పెట్టామని, వాచర్లను కూడా పెట్టామంటూ చేతుల కాలాక ఆకులు పట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. మాటువేసి..కాటువేసి గత నెల 25వ తేదీన బాలిక, ఆమె స్నేహితుడు కలిసి చిత్తూరు–తిరుపతి రోడ్డులో ఉన్న అటవీశాఖకు చెందిన నీవా నగరవనికి వెళ్లడం.. అక్కడ కిషోర్, మహేష్, హేమంత్ ముగ్గురూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటం అయిదు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. అయితే నిందితులు ముగ్గురికీ నీవా నగరవనంపై పూర్తి పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బాలిక, ఆమె స్నేహితుడు లోపలికి వెళ్లగానే వాళ్లను వెనక నుంచి నిందితులు ముగ్గురూ వెంబడించారు. ఓ చోట ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటుండగా అప్పటికే మాటు వేసిన నిందితులు చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నారు. తొలుత తమను అటవీశాఖ సిబ్బందిగా చెప్పుకున్న నిందితులు, బాధితులు ఇద్దరినీ ఓ గుట్టపై ఉన్న నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పటికే తమ వద్ద ఉన్న కత్తులు చూపించి బాలికపై ఒకరి తరువాత ఒకరు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ సమయంలో బాలికతో వచ్చిన యువకుడు ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తే అతడిపై విచక్షణారహితంగా దాడిచేసి, నోరుమూసి పెట్టి చంపడానికి ప్రయత్నించారు. చివరగా వెళ్లేప్పుడు యువకుడి బంగారు చైనును లాక్కెళ్లారు. ఈ మొత్తం ఘటనలో కొన్ని నిముషాల వీడియో నిందితుల మొబైల్ ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల తరువాత గాయపడ్డ యువకుడు జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆపై వారు నిందితుల కోసం గాలించి, గత నెల 29వ తేదీన వాళ్లను పట్టుకుని దేహశుద్ధి చేశారు. -
నీటి గుంతలో పడి యువకుడి మృతి
చిల్లకూరు : గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో బుధవారం ఓ యువకుడు నీటి గుంతలో పడి మృతి చెందాడు. వివరాలు.. స్థానిక రాణీ పేటకు చెందిన అత్తివరం, రవీంద్ర (23) కొంత మంది స్నేహితులతో కలసి అండర్ బ్రిడ్జి వద్ద గుంతలో ఈతకొట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మనోజ్కుమార్ తెలిపారు. బస్సు ఢీకొని వృద్ధుడి మృతి పాకాల : మండలంలోని దామలచెరువులో బుధవారం బస్సు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. వివరాలు.. మొగరాల పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన రఘు(63) రోడ్డు దాటుతుండగా పీలేరు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో రఘు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు బోల్తా పడి ఒకరి మృతి తిరుపతి రూరల్ : మండలంలోని చిగురువాడ వద్ద స్వర్ణముఖినదిలో కారు బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, కిచ్చమనాయుడుపల్లెకు చెందిన కంకలపాటి మురళి (42) తిరుపతిలో నివసిస్తున్నాడు. అయితే వ్యాపారం రీత్యా కార్వేటినగరంలో ప్రొవిజన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. నిత్యం తిరుపతి నుంచి కార్వేటినగరానికి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కారులో తిరుపతికి వస్తుండగా చిగురువాడ బ్రిడ్జి వద్ద టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి స్వర్ణముఖి నదిలోకి దూసుకు వెళ్లింది. అదే సమయంలో అటుగా వచ్చిన కేసీపేట సర్పంచ్ పినాకపాణి మరికొందరి సాయంతో మురళిని బయటకు తీసి 108లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్విమ్స్లో మెడికల్ మాఫియా!
సాక్షి టాస్క్ ఫోర్స్: టీటీడీ పరిధిలోని స్విమ్స్ ఆస్పత్రిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఇక్కడి మందుల షాపులో నాణ్యమైన మందులు లేవని, జనరిక్ స్థానంలో ఖరీదైన మందులను రోగులకు అంటగడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వీటి ఆధారంగానే ఇటీవల సదరు మందుల దుకాణం నిర్వహిస్తున్న ఇన్నొవేటివ్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీకి టీటీడీ నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కంపెనీ యజమాని తన రాజకీయ పలుకుబడితో నోటీసులను లెక్కచేయలేదు. టెండర్ రూల్స్కు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి అండదండలతో కంపెనీ యజమాని రెచ్చిపోతున్నాడు. సిమ్స్ ఓపీ , డాక్టర్స్ క్యాంటీన్ పక్కన గతంలో ఉన్న జనరిక్ మందుల షాపులు రోగులకు సౌకర్యంగా ఉండేవి. అత్యవసర విభాగం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి కుడి పక్కన ఉన్న ఇన్నొవేటివ్లీ ఫార్మా కంపెనీకి చెందిన మెడికల్ షాప్ మేలు కోసం ఆ రెండు జెనరిక్ షాపులను తొలగించారు. ఈ మందుల దుకాణం నిర్వహణ తీరు స్విమ్స్ అధికారులకు సైతం తలనొప్పిగా మారింది. ఇది చాలదన్నట్టు పద్మావతి ఆస్పత్రి సమీపంలోని మరో మెడికల్ షాపును సైతం ఇన్నొవేటివ్లీ ఫార్మా యజమాని దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. రాజకీయ నేతలను రంగంలోకి దింపి టీటీడీ చైర్మన్ను సైతం మెప్పించి, ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు మెడికల్ ఏజెన్సీకి టెండర్ ఫైనల్ చేయాలని టీటీడీకి అనధికారిక ఆదేశాలు అందినట్లు సమాచారం.డిపాల్టర్గా ముద్ర స్విమ్స్ అత్యవసర విభాగం సమీపంలోని మెడికల్ షాపును ఈ ఏడాది జనవరి నుంచి ఇన్నొవేటివ్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీ చేజిక్కించుకుని పలు ఆరోపణల నడుమ నడుపుతోంది. స్విమ్స్ పరిధిలో కొంత కాలం వరకు మరో మెడికల్ షాపు లేకుండా చక్రం తిప్పి పుష్కలంగా ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలకు అడిగింది ఇచ్చుకుని పద్మావతి ఆస్పత్రిలోని పద్మావతి మెడికల్ షాపును కూడా దక్కించుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మందుల దుకాణానికి రెండు నెలల క్రితం టీటీడీ టెండర్ పిలిచింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవాళ్లు కేవలం ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 25వ తేదీన టెండర్ ఓపెన్ చేశారు. సదరు ఫార్మా కంపెనీ అత్యధిక కోడ్ తో మొదటి వరుసలో నిలిచి టెక్నికల్గా అర్హతను కోల్పోయింది. టీటీడీలో ఇప్పటివరకు నిధులను ఎగ్గొట్టిన వారు టెండర్ తగ్గించుకునేందుకు అనర్హులు. ఇప్పటికే నడుపుతున్న మెడికల్ షాపునకు సంబంధించి టీటీడీకి రూ. 57 లక్షలకు పైగా సకాలంలో చెల్లించకుండా ఇన్నొవేటివ్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్గొట్టింది. అలాగే టీటీడీకి ఇవ్వాల్సిన రూ.5కోట్ల బ్యాంకు గ్యారంటీని పాత మెడికల్ షాపునకు సంబంధించిన గ్యారెంటీనే కొత్త అటెండర్లోనూ చూపించింది. టెండర్ ఓపెన్ చేయకముందే మోసం చేసిన కంపెనీని పక్కన పెట్టాల్సిన టీటీడీ అధికారులు ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పై రెండు అంశాల తో ఆ సంస్థ డిఫాల్టర్గా ముద్రపడింది. రాజకీయ నేతల ఒత్తిడికి తలొగ్గిన టీటీడీ అధికారులు అనర్హత కలిగిన కంపెనీకే మెడికల్ షాపును అప్పగించేందుకు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు టీటీడీ చైర్మన్ సైతం డిఫాల్ట్ కంపెనీకే కేటాయించేలా అధికారులకు సూచనలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. సదరు కంపెనీ ఎక్కువ కోట్ చేసిందనే సాకును చూపి, డిఫాల్టర్ అనే విషయాన్ని పక్కన పెట్టడంపై కొందరు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. -
మనోరథం తీరేలా.. కల్కి కటాక్షం
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025బ్రహ్మోత్సవ వేళ.. బ్రహ్మాండనాయకుని దర్శించిన వారిది కదా భాగ్యము.. భువి వైకుంఠంలో అడుగిడిన వారిది కదా పుణ్యము.. ఆనందనిలయంలో దేవదేవుని కనులారా కాంచిన వారి జన్మము కదా ధన్యము.. మహిమాన్విత రథంపై మాడవీధుల్లో ఊరేగుతున్న శ్రీమలయప్పస్వామివారిని సేవించిన వారు కదా పునీతము.. గోవింద నామస్మరణతో పులకించిన వారిది కదా ముక్తిమార్గము.. అశ్వవాహనంపై కల్కి అవతారంలో విహరిస్తున్న అలంకారప్రియుని కటాక్షం పొందిన వారి జీవితము కదా చరితార్థము. తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం శ్రీమలయప్పస్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో కూడిన వైకుంఠనాథుడు చతుర్మాడ వీధుల్లో రథంపై ఊరేగారు. శ్రీనివాసుని దివ్యదర్శనంతో భక్తులు పులకించారు. రథోత్సవంలో దేవదేవుడిని సేవించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అశేష భక్తజనులు గోవిందనామస్మరణల నడుమ మహారథం లాగుతూ తన్మయత్వం చెందారు. రాత్రి అశ్వవాహనంపై మలయప్పస్వామివారు కల్కి అవతారంలో విహరించారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు. -
కూటమి ‘కోతలు’!
తిరుపతి అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అందించే పథకాల్లో యథేచ్ఛగా కోత పెడుతోంది. ముందుగా సామాజిక పింఛన్లను ప్రతి నెలా తగ్గించేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు మొత్తం 12,566 పింఛన్లు తొలగించింది. ఈ నెలలో 355 మందికి లబ్ధిదారులకు రిక్తహస్తం చూపింది. 8 వేల మంది వితంతువులకు కొత్తగా పింఛన్ మంజూరు చేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటోంది. అర్హులైన 10వేల మందికిపైగా దివ్యాంగులను ఆశనిరాశల నడుమ వేధిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై శీతకన్ను వేసి ఉసురుపోసుకుంటోంది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని దాదాపు 17 నెలలుగా రోడ్ల పాలు చేసేసింది. కందిపప్పు ఊసేలేదు... రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కందిపప్పు పూర్తిగా ఇవ్వడంలేదు. చక్కెరను కూడా అంతంతమాత్రంగానే అందిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో సక్రమంగా రేషన్ అందక పేదలు నానా అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణాల్లో బియ్యంతోపాటు చక్కెర, గోధమపిండి, రాగిపిండి, రాగులు ,కందిపప్పు తదితర వస్తువులను పంపిణి చేశారు. చిరుధాన్యాలు సైతం కార్డుదారులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్డుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. -
ప్లకార్డులు చేతపట్టి.. పింఛన్లు పంచిపెట్టి!
మహోన్నత లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకారణంగా కక్షగట్టి వేధింపులకు గురిచేస్తోందని మండిపడుతున్నారు. సర్కారు వైఖరికి నిరసనగా బుధవారం నుంచి సమ్మె బాట పట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు నోటీసులు సైతం అధికారులకు అందించారు. అయితే పేదలను ఇబ్బంది పెట్టకూడదనే సదుద్దేశంతో సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈక్రమంలోనే ప్లకార్డులను చేతపట్టి తమ ఆందోళనను వెలిబుచ్చారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. పాలకులు పెడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేశారు. తిరుపతి అర్బన్ : సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కొంతకాలంగా పోరాటం సాగిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా అధికారులకు సమ్మె నోటీసులు అందించారు. అయితే పింఛన్ల ప్రక్రియ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బుధవారం నల్లబాడ్జీలను ధరించి ప్లకార్డులను చేతపట్టుకుని నినాదాలు చేస్తూ విధులు నిర్వర్తించారు. ఈవిషయం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నినాదాలు చేస్తూనే.. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సచివాలయ ఉద్యోగులు నినాదాలు చేస్తూనే పింఛన్లు పంపిణి చేశారు. ఈ క్రమంలో డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లె మండలాల్లో బుధవారం ఉదయం 10గంటల తర్వాత పింఛన్ల ప్రక్రియ మొదలుపెట్టారు. అలాగే పుత్తూరు, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటి పరిధిలోను 10 గంటలపైన పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. సాధారణంగా ఉదయం 7గంటల నుంచి పెన్షన్ల పంపిణి మొదలుపెట్టాల్సి ఉంది. అయితే సచివాలయ ఉద్యోగులు పోరుబాట వైపు అడుగులు వేస్తున్న క్రమంలో ఆలస్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ల కోసం గంటల కొద్ది పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీనిపై డీఆర్డీఏ అధికారులతోపాటు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లుకు సమాచారం అందడంతో వారు సచివాలయ ఉద్యోగులను బుజ్జగించి పెన్షన్ల పంపిణీకి పంపినట్లు తెలిసింది. పనిభారం తగ్గించాలి పనిభారం తగ్గించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వలంటీర్ల పనులు అప్పగించడంపై మండిపడుతున్నారు. సర్వేలతో సతమతమవుతుంటే జీఎస్టీపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్లకార్డులను చేతపట్టుకుని నిరసన తెలియజేశారు. మూడో స్థానానికి.. సెప్టెబర్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే సచివాలయ ఉద్యోగుల నిరసన కారణంగా ఈ నెల తొలిరోజు 94.81శాతం మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేశారు.దీంతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలోకి జారింది. -
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా సచ్చిదానందమూర్తి
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్చార్జిగా ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తిని నియమిస్తూ వీసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పరీక్షల నియంత్రణ అధికారిగా పనిచేసిన డాక్టర్ కంభంపాటి సాంబశివమూర్తి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సాంబశివమూర్తి సేవలను కొనియాడారు. అనంతరం సచిదానందమూర్తికి అభినందనలు తెలిపారు. నౌకా మరమ్మతు కేంద్రానికి భూ పరిశీలన వాకాడు : మండలంలోని తూపిలిపాళెం వద్ద సముద్ర తీరంలో నిర్మించనున్న షిప్ బిల్డింగ్ రిపేర్ సెంటర్కు అవసరమైన భూములను బుధవారం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనన్, కేంద్ర బృందం, పోర్టు అథారిటీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనన్ మాట్లాడుతూ మ్యాప్ల ఆధారంగా భూముల వివరాలను తెలిపారు. నౌకా మరమ్మతు కేంద్రానికి తూపిలిపాళెం తీరం అనువైన ప్రదేశంగా కేంద్ర బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు స్విమ్స్ జట్టు తిరుపతి తుడా: కర్ణాటకలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో ఈనెల 4 నుంచి 7వ తేదీవరకు నిర్వహించనున్న సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీలకు స్విమ్స్ జట్లును బుధవారం ఎంపిక చేశారు. ఎస్.మనోజ్ కుమార్ ఎం.సునీల్ కుమార్, నాగార్జున, శివరంగా, నవీన్ సింగ్, వెంకట గణేష్, ఉదయ్ కుమార్, మల్లిఖార్జున, భరత్ కుమార్ (స్విమ్స్ నర్సింగ్ కాలేజీ), శ్రవణ్ కుమార్, లోకేష్, అమీర్, వెంకటేష్, తేజేశ్వర్ (హెల్త్ సైన్సెస్)కు జట్టులో స్థానం కల్పించారు. పోటీలలో తమ జట్టు విజయం సాధించాలని స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్.బిట్లా, స్పోర్ట్స్ బోర్డ్ చైర్మన్ కేఆర్ శుభాష్, సభ్యులు పి.విశ్వనాథ్రెడ్డి, పీడీ బీఏ మధుబాబు కోరారు. పక్షుల కేంద్రంలో టికెట్ కౌంటర్ దొరవారిసత్రం : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ప్రవేశ టికెట్లకు బుధవారం కౌంటర్ ప్రారంభించారు. వన్యప్రాణి విభాగం అధికారులు మాట్లాడుతూ వలస విహంగాల సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే కేంద్రంలోని మూడు చెరువుల్లో చుక్కనీరు లేకపోవడంతో విహంగాలు రాలేదని, ఈ క్రమంలో టికెట్ కౌంటర్ ప్రారంభించి ప్రయోజనం ఏంటని పక్షి ప్రేమికులు అభిప్రాయపడడం గమనార్హం శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో బుదవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 14 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,275 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,973 మంది తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
జైలులో నన్ను టెర్రరిస్టులా ట్రీట్ చేశారు: మిథున్ రెడ్డి
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులతో తాను భయపడే ప్రసక్తే లేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy). కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు(YS Jagan) ధన్యవాదాలు తెలిపారు. జైలులో తనను టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్ చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా తిరుపతిలో(Tirupati) మీడియాతో మాట్లాడుతూ..‘అక్రమ కేసులతో నేను అధైర్యపడను. టీడీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టింది. వేధించడానికే నాపై కేసులు పెట్టారు. ఇలా అక్రమ కేసులు పెట్టి సాధించింది ఏంటి?.. పైశాచిక ఆనందం తప్ప మరేమీ లేదు. నన్ను అరెస్ట్ చేసి నా తల్లిదండ్రులను మానసిన వేదనకు గురి చేశారు. 73 రోజులు.. దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారు. గౌరవ కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్లో కోర్టు చెప్పినవన్నీ నిజాలే. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. చివరిగా ఒకటే చెబుతున్నా.. నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టీ డైవర్షన్ చేస్తున్నారు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.ఎప్పుడు తెలుగుదేశం(TDP) పార్టీ అధికారం ఉన్నా.. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్లు చేస్తున్నారు. 2014-2019 మధ్య కూడా నాపై తప్పుడు కేసులు పెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతీసారి.. ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. రకరకాల అక్రమ కేసులు పెట్టి.. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. నన్ను జైలులో దారుణంగా చూశారు. ఏదో టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్ చేశారు. ఎవరితో నన్ను మాట్లాడనివ్వలేదు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. విజయవాడ నుంచి మానిటరింగ్ చేశారు, అధికారులు కూడా భయపడే పరిస్థితి ఉండేది. నాతో ఒక్క అధికారి కూడా మాట్లాడలేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు జైలు అధికారులు వసతులు కల్పించలేదు. నన్ను కలిసే వారిపై కూడా నిఘా పెట్టారు. వ్యక్తికి ఉండాల్సిన ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించారు’ అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: మహిళలకు బాబు మోసం -
ఽఏడాది పొడవునా ధరలు పెరగడం లేదు
నిమ్మ వ్యాపారులు ఎగు మతి చేసే ఢిల్లీ మార్కె ట్లో ధరలు ఉండడం లేదని ఇక్కడ వ్యాపారు లు ధరలు తగ్గించేస్తున్నా రు. మూడు డిక్కీలు (150 కేజీలు) నిమ్మ కాయలు కోసుకుని మార్కె ట్కు వస్తే ఇద్దరు కూలీలకు రూ 600, ఆటో బాడుగ రూ.100, మొత్తంగా ఖర్చు రూ.700 అయ్యింది. వ్యాపారులకు కాయలు విక్రయిస్తే రూ 4,500 లెక్క కట్టారు. దీనికి సుమారు రూ. 2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా ఉంటే సాగు ఎలా చేయగలం. – వేమయ్య, చిల్లకూరుకాయలు వదిలేస్తున్నాం పదెకరాలలో నిమ్మ సాగు చేస్తుండగా ప్రస్తు తం కాపు బాగానే వస్తోంది. అయితే మా ర్కెట్లో ధరలు రోజుకొకరకంగా మారిపోతు న్నాయి. ఒక రోజు కిలో రూ.40 అంటారు, మరో రోజు రూ. 30 అంటారు. ఇలా వారంలోనే పలు వ్యత్యాసాలు ఉండడంతో అలాగే వదిలేస్తున్నాం. గతేడాది దసరా మార్కెట్లో రూ.60,70 పలికింది. ఇప్పు డు అందులో సగం కూడా లేదు. – దామోదర్రాజు, రాజుల ఎరుగుంటపాళెం, సైదాపురం మండలం -
జిల్లా క్రికెటర్లకు రంజీ, స్టేట్లో స్థానం
తిరుపతి ఎడ్యుకేషన్: రంజి ట్రోఫి ప్రాబబుల్స్ క్యాంపు, స్టేట్ సీనియర్ ఉమెన్ టీ–20 ప్రిపరేటరీ క్యాంపునకు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెటర్లు స్థానం సాధించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) విడుదల చేసిన రంజీ ట్రోఫీ 2025–26 ప్రాబబుల్స్ క్యాంపునకు బ్యాటింగ్ విభాగంలో అభిషేక్రెడ్డి, సీఆర్ జ్ఞానేశ్వర్, బౌలింగ్ విభాగంలో దీపన్ సాయినాథ్ చోటు దక్కించుకున్నారు. అలాగే ఏసీఏ సీనియర్ ఉమెన్స్ టీ–20 రాష్ట్ర ప్రిపరేటరీ క్యాంపునకు ఎం.గ్రీష్మ, ఈ.పద్మజ ఎంపికయ్యారు. వీరు విశాఖపట్నంలో నిర్వహించే జాతీ య స్థాయి టీ–20 మ్యాచ్లో మన రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఈ సందర్భంగా ఏసీఏ సంయుక్త కార్యదర్శి విజయ్కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెటర్లు అన్ని ఫార్మాట్లలో ప్రతిభ చూపుతున్నారని, రానున్న రోజుల్లో ఏపీఎల్, ఐపీఎల్లోనూ స్థానం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నష్టాలనిమ్మ
చిల్లకూరు : నిమ్మ ధరలు పతనం అవుతుండడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడేమో వేసవిని తలపించేలా ఎండలు మండిపోతుండడం, ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తుండడంతో ఢిల్లీ మార్కెట్లో వ్యాపారులు నిమ్మ కాయలు వద్దంటున్నారని ఇక్కడ వ్యాపారులు రైతుల నుంచి కిలో నిమ్మ కాయలు రూ. 40 లోపే కొనుగోలు చేస్తున్నారు. సహజంగానే చలికాలం నిమ్మ కాయలకు కొంత డిమాండ్ ఉండదు. అయితే దీన్నే ఆసరాగా చేసుకొని వ్యాపారులు సిండికేట్గా మారి నిమ్మ రైతుల పొట్టుకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో.. ఈ ప్రాంతంలో ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ చిన్నపాటి వర్షాలు కొంత మేర పడడంతో నిమ్మ చెట్టుకు బలం వచ్చింది. దీంతో పూత పూసి కాపునకు వచ్చాయి. దిగుబడి బాగా పెరిగింది. అయితే మార్కెట్లో ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో రైతులు కొంత మంది కూలీలను పెట్టి కోయించే పరిస్థితి లేక అలాగే వదిలేస్తున్నారు. నరికేస్తున్న రైతులు నిమ్మ ఒక్కసారి నాటితే కనీసం 30 ఏళ్ల వరకు కాపు కాస్తూనే ఉంటాయి. వయస్సు పడ్డ చెట్లు దిగుబడి ఎక్కువగా ఇవ్వకపోవడంతో రైతులు వాటిని నరికి వేస్తున్నారు. ఎక్కువ శాతం మంది సైదాపురం ప్రాంతాలలో నిమ్మ చెట్లు నరికేసి సరుగుడు మొక్కల సాగుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఏడాది సుమారు 200 ఎకరాల వరకు రైతులు చెట్లు నరికేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం రాపూరు, సైదాపురం, డక్కిలి , బాలాయపల్లి మండలాల్లో చెట్లు నరికేసినట్లు తెలుస్తోంది. జ్యూస్ పరిశ్రమలు లేకపోవడంతో.. నిమ్మ రసంతో తయారు చేసే వివిధ రకాల ఉత్పత్తులకు ముడి సరుకును అందించేలా రసం నిల్వ చేసే సిట్రస్ పరిశ్రమలు అందుబాటులో లేకపోవడంతో పూర్తి స్థాయిలో నిమ్మ పంట మొత్తంగా ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాల కొనుగోళ్లపైనే ఆధార పడాల్సి వస్తోంది. అదే జ్యూస్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే వారికి నిమ్మ కాయలను ఏడాది పొడవునా రైతులు సరఫరా చేసి మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది. ఎగుమతులు జరిగే ప్రాంతాలు నిమ్మ మార్కెట్ బాగా ఉండే సమయంలో గుజరాత్, పూణే, ముంబయి, బెంగుళూరు, చైన్నె, కోలకత్తా, సూరత్, ఢిల్లీ మార్కెట్కు ప్రతి రోజు కనీసం రెండు లారీలు (ఒక లారీ 22 టన్నులు) ఎగుమతులు జరిగేవి. నేడు ధరలు లేకపోవడంతో రైతులు మార్కెట్కు కాయలు తీసుకొచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదు. -
విద్యార్థిపై హత్యాయత్నంలో 11 మంది అరెస్టు
చంద్రగిరి : ఇద్దరి విద్యార్థులు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో మరొక విద్యార్థి జీర్ణించుకోలేక మరో విద్యార్థిపై తన స్నేహితులతో కలసి హత్యాయత్నానికి పాల్పడ్డారని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 2న తిరుచానూరులోని నేతాజీ నగర్లో నివాసం ఉంటున్న దినేష్పై హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు హత్యాయత్నానికి పాల్పడిన వారిని గుర్తించి, తిరుచానూరు పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న దినేష్, వీవీ నగర్కు చెందిన కుహల్ ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించడంతో సెప్టెంబర్ 24న ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయన్నారు. ఈ క్రమంలో కుహల్ ఫోన్ ద్వారా దినేష్ను తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసిందన్నారు. అనంతరం అదే రోజు రాత్రి కుహల్ మరి కొంత మంది మిత్రులను పిలిపించుకుని సింధూ సర్కిల్ సమీపంలో మద్యం సేవించారని, ఆపై దినేష్ నివాసానికి వెళ్లారన్నారు. ఇంట్లో ఉన్న దినేష్పై దాడికి పాల్పడి బయటకు తీసుకొచ్చి కత్తితో దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినేష్ అక్కడే కుప్పకూలి పడిపోవడంతో, స్థానికులు తిరుపతి రుయాకు తరలించినట్లు చెప్పారు. బాధితుడు దినేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. వీరిలో కుహల్, గుణసాగర్, అజిత్ నాయక్, మహేష్, తేజ సాయి, చాణక్య, అనిల్, పూర్ణ చంద్, వినయ్, విష్ణును అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి హత్యాయత్నానికి ఉపయోగించిన బటన్ కత్తి, సురకత్తి, మచ్తు కత్తితో పాటు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు చెప్పారు. అనంతరం నిందితులను తిరుపతి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించడంతో ప్రతిభ కనబరిచిన సీఐ సునీల్ కుమార్, ఎస్ఐలు జగన్నాథ రెడ్డి, అరుణ, క్రైం పార్టీ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. -
స్టూడెంట్.. ‘నంబర్ 1’
ఏర్పేడు : ఓ హత్య కేసులో జీవితఖైదీగా జైలులో ఉంటూనే చదువుపై మక్కువతో ఉన్నత విద్యాభ్యాసం చేసి గోల్డ్ మెడల్ సాధించాడో యువకుడు.. మంగళవారం హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్య యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ అందుకుని స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. వివరాలు. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన గునకల బోయశెట్టి, గునకల చెంగమ్మ దంపతుల కుమారుడు యుగంధర్(35) రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలో జరిగిన ఓ హత్య కేసులో 2011, జూలై 18న జీవితఖైదు పడి కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 15ఏళ్లుగా జైలులో గడుపుతున్న యుగంధర్ చదువుపై ఉన్న మక్కువను గుర్తించి జైలు అధికారులు ప్రోత్సహించటంతో జైలులోనే ఉంటూ దూరవిద్య ద్వారా విద్యాభ్యాసం చేశాడు. బీఏలో 8.2 జీపీఏ పాయింట్లు సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిస్థానాన్ని సాధించాడు. దీంతో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ అధికారులు ఇటీవల అతడికి గోల్డ్ మెడల్ను ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ను అందుకున్నాడు. ఓల్డ్ ప్యాటర్న్లో రెండు బీఏ డిగ్రీలు, న్యూ ప్యాటర్న్లో రెండు డిగ్రీలు, 3ఎంఏ డిగ్రీలు పూర్తి చేసి అందరిని అబ్బురపరిచాడు. యుగంధర్ తండ్రి ఏడాది కిందట మృతి చెందగా, జంగాలపల్లిలో అతడి తల్లి చెంగమ్మ నివసిస్తోంది. తన బిడ్డ సత్ప్రవర్తన కింద తప్పును మన్నించి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టి విడిచిపెట్టాలని యుగంధర్ తల్లి చెంగమ్మ, గ్రామ సర్పంచ్ నారాయణ కోరుతున్నారు. అచ్చం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తరహాలో జైలులో ఉంటూ చదువుకుని ప్రతిభను కనబరిచిన యుగంధర్ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడని సర్పంచ్ కొనియాడారు. -
దేవదేవుడి అభయం
తిరుపతి రూరల్ : తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు మంగళవారం ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు అనంత తేజోమయుడుగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రునిపై చల్లనయ్య దీవెనలు సమస్త భూ మండలానికి ప్రత్యక్ష దేవతలుగా కనిపించే సూర్య, చంద్రులను వాహనాలుగా చేసుకున్న దేవదేవుడు భక్తులకు అభయహస్తంతో ఆశీస్సులు అందించారు. ఉదయం సూర్యునిపై అత్యంత తేజస్సుతో దర్శనమిచ్చిన స్వామి వారు రాత్రికి చంద్రునిపై కొలువుదీరి చల్లనయ్యగా భక్తులు అందరికీ చల్లని దీవెనలను అందించారు. చంద్రునిపై ఊరేగుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి చిరుజల్లుల నడుమ సూర్యప్రభ వాహన సేవ సూర్య ప్రభ వాహన సేవ ఆరంభం నుంచే చిరుజల్లులు కురవడంతో ఆ చల్లని వాతావరణంలోనే స్వామి వారి వాహన సేవ ముందుకు సాగింది. ఆలయం నుంచి సూర్యునిపై కొలువుదీరిన స్వామి వారి వాహనం బయలు దేరినప్పటి నుంచే వర్షం కురవడంతో ఛత్రం నీడలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి, చెవిరెడ్డి మంజుల దంపతులు వాహన సేవలో పాలు పంచుకున్నారు. వాహన సేవల్లో కళాబృందాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రధాన ఆలయంతో పాటు పరిసరాలు అన్నీ విద్యుత్తు వెలుగులతో ఆకట్టుకుంటున్నాయి. -
పొలంలో కారు బోల్తా
నాగలాపురం: మండలంలోని సుబ్బానాయుడు కండ్రిగ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు పక్కన ఉన్న పొలంలో కారు బోల్తా పడింది. పోలీసులు కథనం మేరకు.. తమిళనాడులోని మాధావరానికి చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి చైన్నెకు వెళుతుండగా మార్గం మధ్యలోని సుబ్బనాయుడు కండ్రిగ వద్ద కుక్క అడ్డంగా రావడంతో కారు అదుపు తప్పి బోల్తా పడినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. అదృష్టవశాత్తు ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని కలగలేదని చెప్పారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. నగల చోరీ పాకాల: ఇంట్లోకి చొరబడి నగలు అపహరించిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి విచ్చింది. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని ఓబులశెట్టివారిపల్లికి చెందిన అప్పాజీనాయుడు ఈ నెల 27వ తేదీన కుటుంబ సమేతంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. తిరుమల యాత్ర ముగించుకుని సోమవారం ఇంటికి తిరిగి వచ్చిన అప్పాజీ నాయుడు కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని 35 గ్రాముల బంగారు నగలు, 200 గ్రాముల వెండి వస్తువులు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్తో పెయింటర్ దుర్మరణం చంద్రగిరి: విద్యుత్ షాక్కు గురై పెయింటర్ మృతి చెందిన ఘటన తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి భవానీ నగర్కు చెందిన లోకేష్(36) పెయింటింగ్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రోజూవారీ పనుల్లో భాగంగా మంగళం సమీపంలోని కోళ్లఫారం వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో పనుల్లో నిమగ్నమయ్యాడు. పెయింటింగ్ పని చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై కింద పడి కుప్పకూలిపడిపోయాడు. వెంటనే తోటి కూలీలు గమనించి లోకేష్ను హుటాహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శిక్షణకు హాజరుకావాల్సిందే
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెగా డీఎస్సీకి ఎంపికైన నూతన టీచర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాల్సిందేనని డీఈవో వరలక్ష్మి చెప్పారు. ఈ మేరకు సోమ వారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో డీఎస్సీలో ఎంపికై న నూతన టీచర్లకు అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు అక్టోబర్ 3 ఉదయం 7 గంటలకు తమకు కేటాయించిన శిక్షణ కేందాల్లో హాజరుకావాలన్నారు. ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. శిక్షణ రోజుల్లో వంద శాతం హాజరు తప్పనిసరి అని చెప్పారు. ప్రతి అభ్యర్థి లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్, అపాయింట్మెంట్ ఆర్డర్లను తీసుకురావాలని తెలిపారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్వీ ఫార్మసీ (ఆర్వీఎస్ నగర్, చిత్తూరు), ఆర్కే పాఠశాల (కట్టమంచి, చిత్తూరు), ఢిల్లీ పబ్లిక్స్కూల్ (చిగురువాడ, తిరుపతి), విశ్వం స్కూల్ (జీవకోన, తిరుపతి), మెడ్జీ స్కూల్ (తిరుపతి), ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల (బైపాస్రోడ్డు, గూడూరు)లో శిక్షణ ఉంటుందని డీఈఓ వెల్లడించారు. -
ఫైనాన్స్ వేధింపులు తాళలేక యువకుడు బలవన్మరణం
డక్కిలి: మండలంలోని నరసనాయుడుపల్లికి చెందిన యలకచర్ల అనిల్ (24) అనే యువకుడు ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం మేరకు.. మృతుడు అనిల్ గూడూరులోని సీఎఫ్ఎల్అనే ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఆ యువకుడు గూడూరులో పనిచేస్తూ తరుచూ ఇంటికి వచ్చేవాడు. అయితే మృతుడు అనిల్ ఆ ఫైనాన్స్ సంస్థలో కలెక్షన్ ఏజెంట్గా వసూళ్లు చేసిన నగదు కంపెనీకి చెల్లించలేదని, ఆ కంపెనీ మేనేజర్ కిరణ్, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున వేధించేవారు. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీన వారిద్దరూ కలిసి అనిల్ స్వగ్రామం అయిన నరసనాయుడుపల్లికి వచ్చి మందలించారు. కంపెనీకి తాను ఎటువంటి బాకీ లేనని, అనిల్ వారికి చెప్పిన కుటుంబ సభ్యుల సమక్షంలో అవమానించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువకుడు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు చికిత్స నిమిత్తం తొలత రాపూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చికిత్స పొందుతూ సోమ వారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తండ్రి యలకచర్ల రమణయ్య ఫిర్యా దు మేరకు డక్కిలి పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ శంకర్ తెలిపారు. -
ఆటో విరాళం
తిరుపతి అర్బన్: రేణిగుంట మండలంలోని కరకంబాడీ పంచాయితీలోని చైతన్యపురానికి చెందిన పి.సతీష్కు కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆటోను విరాళంగా సోమవారం అందజేశారు. ఆటో డ్రైవర్ సతీష్ పక్షవాతంతో ఇటీవల ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నారు. తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న అనంతరం ఇటీవల ఆయన కలెక్టర్ను కలిశారు. తమకు సాయం చేయాలని కోరారు. దీంతో కలెక్టర్ సూచనల మేరకు డీఆర్డీఏ పీడీ శోభనబాబు రాస్ సంస్థ వారి ఆర్థిక సౌజన్యంతో కొత్త ఆటోను సతీష్కు ఇప్పించారు. ఆ మేరకు కలెక్టర్ చేతుల మీదుగా ఆటోను అందజేశారు. రాస్ సంస్థ జనరల్ సెక్రటరీ వెంకటరత్నంను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శోభనబాబు, పొదుపు సంఘాల సంచాలకులు వి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
సూళ్లూరుపేట: మున్సిపాలిటీ పరిధిలోని నూకలపాళేనికి ఉత్తరం వైపుగా పొలాల్లో తాటిచెట్టు బరకకు ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం పొలాల్లోకి వ్యవసాయం చేసుకోవడానికి వెళ్లిన రైతులు చెట్టుకు వేలాడుతున్న శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి 45–50 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని, మృతుడి వద్ద ఎలాంటి అనవాళ్లు దొరకలేదని తెలిపారు. ఆకుపచ్చ టవల్తో ఉరివేసుకుని మృతి చెందాడని తెలిపారు. బ్లూకలర్ గళ్లు కలిగిన షార్ట్ వేసుకుని ఉన్నాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. కుటుంబ కలహాలతో..దొరవారిసత్రం: కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఇట్టగుట్ట ధనంజయ(35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం వెలుగు చూసింది. ఈ ఘటన కల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కల్లూరు గ్రామానికి చెందిన ధనుంజయ ఆదివారం స్నేహితులతో కలిసి మద్యం సేవించడంతో తన భార్య మందలించింది. దీన్ని మనస్సులో పెట్టుకుని క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేసేలోపు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, పలువురు నాయకులు సోమవారం ధనుంజయ మృతదేహాన్ని సందర్శించి నివాళ్లలర్పించారు. -
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ వసంతబాయి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 7 అంగన్వాడీ కార్యకర్తలు, 66 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి అక్టోబర్ ఒకటి నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. వారి పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పారు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీకి 21 ఏళ్లు నిండి ఉండాలని, 35 ఏళ్ల లోపు ఉండాలని స్పష్టం చేశారు. స్థానికంగా ఉంటూ వివాహిత అయి ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో పదో తరగతి పాస్ అయిన వారు లేకుంటే 8వ తరగతి వారు అర్హులుగా ఉంటారని చెప్పారు. అయితే ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 ఏళ్లు నిండిన వారు లేని ఎడల 18 ఏళ్ల నిండిన వారు అర్హులుగా ఉంటారని తెలిపారు. -
శ్రీహరి ఇలను చేరి!
శుభ‘కరి’ శరణు కోరగా..గజవాహనంపై విహరిస్తున్న కల్యాణ వేంకటేశ్వరస్వామి వారుతిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం హనుమంత వాహనంపైన, రాత్రి గజవాహనంపైన స్వామివారు పురవీధుల్లో ఊరేగారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సారె సమర్పణ చంద్రగిరి మండలం ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం, రామిరెడ్డిపల్లి, కొటాల, ఐతేపల్లి, అగరాల, ఎం.కొంగరవారిపల్లి, కల్రోడ్డుపల్లి, పనబాకం పంచాయతీలకు చెందిన భక్తులు శ్రీవారిపై అపారమైన భక్తితో సారెను తీసుకువచ్చారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి మోహిత్రెడ్డి సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేయించారు. అలాగే గజవాహనానికి తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లి, మల్లంగుంట, సి.మల్లవరం, గాంధీపురం పంచాయతీలకు చెందిన భక్తులు స్వామివారికి సారె సమర్పించారు. వారికి మోహిత్రెడ్డి దగ్గరుండి అల్పాహారం వడ్డించి ప్రతి ఒక్కరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హనుమంత, గజ వాహనాల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవతా మూర్తుల కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హనుమంత, గజవాహనాలపై శ్రీహరి వైభవం -
అర్జీదారుల మొర వినండి!
తిరుపతి అర్బన్: ‘ముందుగా అర్జీదారులు ఏం చెబుతున్నారో పూర్తిగా వినడం నేర్చుకోండి.ఆ తర్వాత సమస్యను ఎలా పరిష్కారించడానికి వీలుపడుతుందో వారికి వివరించండి. ఒక వేళ సమస్య పరిష్కారం చేయడానికి వీలులేకుంటే అందుకు కారణాలను స్పష్టంగా వారికి అర్థం అయ్యేరితీలో తెలియజేయండి. ప్రతి శాఖకు చెందిన అధికారులు ఈ అంశాన్ని పరిగణలో ఉంచుకోవాలి.’ అని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 283 అర్జీలు అధికారులు అందుకున్నారు. అందులో రెవెన్యూ సమస్యలపై 172 అర్జీలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘవాన్సీ, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, సుధారాణి పాల్గొన్నారు. ఆశతో వచ్చాం తన భర్త నవీన్ ఓ పరిశ్రమలో కూలీ పనులకు వెళుతుంటారని, పేద కుటుంబానికి చెందిన తమ కుమారుడు ఆరాధ్య(6) దివ్యాంగుడని, పింఛన్ కోసం వచ్చామని బాలయపల్లె మండలం పెరిమిడి గ్రామానికి చెందిన శారద వాపోయింది. పింఛన్ కోసం తాము సచివాలయంతోపాటు మండల కేంద్రంలోనూ అర్జీలు అందజేసినా పింఛన్ మంజూరు చేయకపోవడంతో కలెక్టర్ ఏమైనా సాయం చేస్తారని ఆశతో వచ్చామని పేర్కొంది. 100శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉంది ఆర్థిక కష్టాలతో బతకడం కష్టంగా మారుతుందని, తమ బిడ్డ నిఖిలేశ్వర్కు వందశాతం వైకల్యం సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ మంజూరు చేయలేదని రేణిగుంట మండలానికి చెందిన ఏ. స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యం కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పేద స్థితిలో ఉన్నామన్నారు. తన కుమారుడికి పింఛన్ ఇప్పిస్తే, ఆ డబ్బులతో వైద్యం చేయిస్తామని చెప్పింది. లేదంటే తమ బతుకు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో ఉందని విలపించింది. 90 శాతం వికలత్వం ఉంది పేద కుటుంబానికి చెందిన వాళ్లం. తన బిడ్డ ఆరాధ్యకు మానసిక స్థితి సక్రమంగా లేదని, 90శాతం వైకల్యం ఉందని, ఆ మేరకు సర్టిఫికెట్ ఇచ్చారని, అయినా పింఛన్ ఇవ్వలేదని తిరుపతి అర్బన్ మండలానికి చెందిన మాధవీలత పేర్కొంది. సచివాలయంలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకపోవడంతో కలెక్టరేట్కు వచ్చామని తెలిపింది. వితంతు పింఛన్ ఇవ్వండి తన భర్త 8 నెలల కిందట మృతి చెందినా తనకు వితంతు పింఛన్ మంజూరు కాక ఇక్కట్టు పడుతున్నాని తిరుపతి అర్బన్ మండలం అబ్బన్నకాలనీకి చెందిన షేక్ అమినాబీ వాపోయింది. తనకు ఏ ఆధారం లేదని, తన భర్త పింఛన్ తీసుకుంటూ మృతి చెందితే ఆ పింఛన్ భార్యకు ఇస్తామని చెప్పారని పేర్కొంది. దాంతో ఆరు వారాలుగా గ్రీవెన్స్కు వస్తున్నా ఫలితం లేదని పేర్కొంది. కలెక్టర్ ఆవరణలో ధర్నా చేస్తున్న సచివాలయ ఉద్యోగులు న్యాయం చేయకుంటే సమ్మెబాట పడుతాం సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయకుంటే సమ్మెబాట పడుతామని సచివాలయ ఉద్యోగసంఘం తిరుపతి నగర అధ్యక్షుడు విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలో సోమవారం నగర కమిషనర్ మౌర్యకు సమ్మెకు చెందిన వినతిపత్రంతోపాటు తమ డిమాండ్లను తెలియజేశారు. ఇంటింటా సర్వేలు చెప్పకండి ఇంటింటా వెళ్లి పదేపదే సర్వేలు చేయమని చెప్పకండి. ప్రతి సర్వేకు ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఇంటి యజమాని ఓటీపీలు చెప్పడం లేదు. మాతో వాదిస్తున్నారు. మీకు ఓటీపీలు ఎందుకు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో వలంటీర్లు చేస్తున్న అన్ని పనులు సచివాలయ ఉద్యోగులకు అప్పగించడం ఏ మాత్రం న్యాయబద్ధంగా లేదని సచివాలయ ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. గ్రామ,వార్డు సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి నగర అధ్యక్షుడు విద్యాసాగర్, మహిళా అధ్యక్షురాలు గీత, ఉద్యోగ సంఘం నేతలు అమరావతి, సిద్దార్థ, ఈశ్వర్, మురళి, పుండ రీకాక్ష, పూర్ణ, నవీన్,నాగమోహన్, సుధారాణి, లక్ష్మి ప్రియ, రత్నమాలిని, రజని పాల్గొన్నారు. కలెక్టరేట్కు తిరగడం నావల్ల కాదు ఇక కలెక్టరేట్ ఆఫీస్కు తిరగడం తన వల్ల కాదని, ఆరు నెలలుగా తన భూమి సమస్య కోసం తిరుగుతూనే ఉన్నానని తొట్టంబేడు మండలం కృష్ణాపురానికి చెందిన సద్దికూటి వీరాస్వామి(79) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఓ పూలమాల మెడలో వేసుకుని దీక్షకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దాయనకు సర్ది చెప్పారు. గేటు వద్ద నుంచి లోనికి వెళ్లి అధికారులను కలవాలని సూచించారు. అనంతరం ఆయన నేరుగా కలెక్టర్ వెంకటేశ్వర్ వద్దకు చేరుకున్నారు. కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. -
బుచ్చినాయుడు కండ్రిగలో వైద్య సేవలు బంద్
బుచ్చినాయుడుకండ్రిగ: స్థానిక పీహెచ్సీలో సోమ వారం ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రభుత్వ వైద్యులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేశారు. వైద్యులు మురళీధర్రెడ్డి, ఉదయ్కుమార్ సమ్మెలో కి వెళ్లడంతో ఓపీ సేవలు బంద్ అయ్యాయి. దీంతో రోగులు ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ సర్వీసు కోటాను పునరుద్ధరించాలని, టైమ్–బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రైబర్ అలవెన్స్ ఇవ్వాలని, చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రామ్ కింద వైద్యులకు రూ.5 వేలు అలవెన్స్ ఇవ్వాలని, నేటివిటీ, అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీహెచ్సీ వైద్యులకు కచ్చితమైన పని గంటలు, స్థిరమైన వారాంతపు సెలవులు ఇవ్వాలని, వైద్యులకు జాబ్ చార్ట్ ఇవ్వాలని తెలిపారు. వైద్యులకు పదోన్నతులు కల్పించాలన్నారు. వైద్యల సమస్యలను పరిష్కరించకుంటు దశల వారీగా అత్యవసర సేవలను కూడా ఆపేస్తామని హెచ్చిరించారు. వైద్యం అందలేదు గాజులపెళ్లూరు గ్రామానికి చెందిన నేను అనారోగ్య సమస్యతో వైద్యం కోసం బుచ్చినాయుడుకండ్రిగలోని ప్రాథమిక కేంద్రానికి సోమవారం వచ్చాను. అయితే వైద్యులు సమ్మెలో ఉన్న కారణంగా వారు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో నాకు వైద్యం అందలేదు. ఉన్న నర్సులతో నామమాత్రపు వైద్యం చేయించుకుని ప్రైవేటు వైద్యం కోసం బయటకు వెళ్లాను. పేద ప్రజలకు వైద్యం అందించే వైద్యుల సమస్యలపై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్టు కాదు. –రమణయ్య, గాజులపెళ్లూరు -
తప్పుడు కేసులతో శునకానందం పొందుతున్నారు!
వెంకటగిరి (సైదాపురం): కూటమి నేతలు, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, ఇబ్బందులు పెడుతూ శునకానందం పొందుతున్నార ని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికా రం చేపట్టినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో కొందరి ఆస్తులు అక్రమంగా తీసేసుకోవడంతోపాటు వాహనాలపై సైతం అక్రమ కేసులో బానాయిస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టేది లేదని అన్నారు. కార్యకర్తలు, నాయకులకు అండగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ 2.0 డిజిటల్ బుక్ను పద్ధతికి శ్రీకారం చు ట్టారని, ఈ మేరకు ఇబ్బందులు పడినా ప్రతి కార్యకర్త ఆ బుక్లో వివరాలు నమోదు చేస్తే వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన అనంతరం వారిపై క్రమశిక్షణ చర్య లు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసుల వ్య వహార శైలి బాగా లేదని విమర్శించారు. టీడీపీ ప్ర భుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వివక్షత చూపుతున్నట్లు ఆరోపించారు. -
వైభవోత్సవం
గజవాహనంపై శ్రీవారుపవన సుతుడిపై పరంధాముడుస్వర్ణరథంలో మలయప్ప స్వామిబ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా సాగుతున్నాయి. సోమవారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. వాహన సేవల్లో కళాకారుల నృత్యాలు, కోలాటాలు, భజన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. – తిరుమలగజవాహన సేవలో కళాకారుల నృత్య ప్రదర్శనహనుమంత వాహన సేవలో వేదపారాయణం -
ఏడో రోజు బ్రహ్మోత్సవాలు: తిరుమల రద్దీ ఎలా ఉందంటే..
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 81,626 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.14 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలునేడు ఏడవరోజుఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారుమారికాసెపట్లో తిరు వీధుల్లో చంద్రప్రభ వహనంలో ఊరేగింపు... -
భక్తులకు బస్సులేవీ గోవిందా?
ప్రయాణికుల సిగపట్లు తిరుపతి అర్బన్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం గరుడోత్సవానికి బస్సులు లేక భక్తులు ఇక్కట్లు పడాల్సి వచ్చింది. ఎక్కడికక్కడ భక్తులు రోడ్లపైన, బస్టాండ్లల్లో నిరీక్షించాల్సి వచ్చింది. ఉత్సవాలకు 425 బస్సులు ఏర్పాటు చేశామని, మూడు వేలకు పైగా ట్రిప్పులు తిప్పనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. కానీ ఆ బస్సులు ఏమైనాయో కానీ భక్తులు మాత్రం అవస్థల్లో మునిగిపోయారు. ఏడు కొండల బస్టాండ్ తిరుమలకు భక్తులు వెళ్లడానికి తిరుపతి సెంట్రల్ బస్టాండ్ పరిధిలోని ఏడుకొండల బస్టాండ్ కీలకం. ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ద్వితీయ, తృతీయ స్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండిపోయారు. ప్లాట్ఫాంలో బస్సులను పెట్టకుండా ముందు భాగంలో ఖాళీ స్థలంలో ఎక్కడి పడితే అక్కడ ఉంచేశారు. ఈ క్రమంలో భక్తులు ఓ వైపు బస్సు కోసం పరుగులు పెట్టడం.. ఆ బస్సు ఫుల్ కావడంతో.. మరో బస్సు కోసం పరుగులు పెట్టడం కనిపించింది. దివ్యాంగులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు నాలుగు వైపులా బస్సు కోసం పరుగులు పెట్టలేక తిప్పలు పడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఏడు కొండల బస్టాండ్ సమీపంలోనే చెత్త కుప్పలను తొలగించకుండా అలానే వదిలేశారు. దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడ్డారు. ఏడుకొండల బస్టాండ్, పల్లెవెలుగు బస్టాండ్లో మరుగుదొడ్లు లేవు. శ్రీహరి బస్టాండ్లోని ఒక మరుగుదొడ్డి ఇటీవల తొలగించారు. మిగిలిందే ఒక్కటే ఉండగా.. అది శుభ్రం చేయకపోవడంతో భక్తులు దుర్వాసన భరించక తప్పలేదు. ఇతర ప్రాంతాలకూ బస్సులు లేవు ఏడుకొండల బస్టాండ్లోనే కాకుండా అదే ప్రాంగణంలోని పల్లెవెలుగు, శ్రీహరి, శ్రీనివాసం బస్టాండ్ల వద్ద బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. శ్రీకాళహస్తి– తిరుపతి మధ్యలో 20కిపైగా సప్తగిరి ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి. వాటిని శ్రీకాళహస్తికి రద్దు చేసి తిరుపతి–తిరుమలకు తిప్పుతున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తి, కాణిపాకం, పుత్తూరు, పీలేరు తదితర ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కొరతతో పల్లె వెలుగు వద్ద ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. ఇదేం తీరు సాధారణంగా తిరుమలకెళ్లే భక్తులను మెయిన్ బస్టాండ్కు తీసుకొచ్చి దింపాల్సి ఉంది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో తిరుమల నుంచి వచ్చే భక్తులను కపిలతీర్థం వద్దే దింపేశారు. భక్తులు మళ్లీ అక్కడి నుంచి ఆటో పట్టుకుని మెయిన్ బస్టాండ్కు రావాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తికమకపడ్డారు. నిరీక్షించలేక శ్రీవారి గరుడ సేవ సాయంత్రం ఆరు గంటలకే ప్రారంభమైంది. ఆపై వర్షం రావడంతో స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఎప్పటికప్పుడు గ్యాలరీల నుంచి బయటకొచ్చేశారు. ఆపై ఇళ్లకు వెళ్లేందుకు బస్టాండుకు చేరుకున్నారు. అక్కడ సరిపడా బస్సులు లేకపోవడంతో.. రాంభగీచా వద్దకు వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. వచ్చే ఒకటీ రెండు బస్సుల్లో ఎక్కేందుకు కుస్తీలు పడాల్సి వచ్చింది. తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన గరుడోత్సవానికి భక్తులు పోటెత్తారు. వారికి తగిన ప్రయాణ సేవలు అందించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమైంది. తిరుమలకు సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారనే ప్రాథమిక అంచనా వేసిన ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా చివరకు చేతులెత్తేశారు. ఆదివారం ఉదయం నుంచే ప్రయాణికులు తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండు, రైల్వేస్టేషన్, అలిపిరి బస్టాండ్కు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బస్సుల కోసం పడిగాపులు పడ్డారు. బస్సులో ఎక్కేందుకు తోపులాటలో ప్రయాణికులు సిగపట్లకు దిగారు. కొందరు ముష్టి యుద్ధానికి పాల్పడడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి చేరుకునేందుకు పడ్డకష్టాలు అన్నీ ఇన్నీ కావు. -
స్విమ్స్లో ఘనంగా వరల్డ్ హార్ట్ డే
తిరుపతి తుడా : స్విమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్డే ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ.. బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల స్ట్రోక్, పక్షవాతం లాంటివి తగ్గించుకోవచ్చన్నారు. ప్రతి రోజు ఉదయం 20 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల బీపిని అదుపులో ఉంచుకోవచ్చునని తెలిపారు. అధికంగా మందులు వాడటం వల్ల కిడ్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, సోడియం తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. అధిక బరువును నియంత్రించుకోకపోతే అధిక రక్తపోటుకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అనిల్, డాక్టర్వాహిద్ ఖాన్, డాక్టర్ రోహిత్, డాక్టర్ ఉపేంద్ర, హరీష్ చౌదరి, వైద్యులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నేడుతిరుపతి తుడా: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసేవారు 0877–2227208కి కాల్ చేయాలని తెలిపారు. నేరుగా కార్యాలయంలో అధికారులకు వినతులు అందజేయవచ్చని వెల్లడించారు. లారీని ఢీకొన్న బైక్ నాయుడుపేటటౌన్:మండల పరిధిలోని అయ్యప్పరెడ్డి పాళెం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం లారీని బైక్ వేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ప్రమాదంలో మండల పరిధిలో ని పండ్లూరు గ్రామానికి చెందిన బైక్ నడుపుతున్న వెంకట చందు(26) అనే యువకుడు మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన తిరుమల అనే యువకుడు తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. పండ్లూరు గ్రామానికి చెందిన వెంకట చందు, తిరుమల, కృష్ణతేజ అనే ముగ్గురు యువకులు అయ్యప్పరెడ్డి పాళెం గ్రామ సమీపంలో నది లో చేపలు పట్టేందుకు వెళ్లారు. తిరిగి సాయంత్రం బైక్ పై పండ్లూరు గ్రామానికి వస్తూ అయ్యప్పరెడ్డిపాళెం వద్ద ముందు వెళుతున్న లారీను వీరి బైక్ ఢీకొంది. బైక్ నడుపుతూ తీవ్రంగా గాయపడిన వెంకట చందు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. వెనుక కూర్చుని ఉన్న తిరుమల తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరి వెనుక కూర్చున్న కృష్ణతేజ మాత్రం ప్రమాదం నుంచి బయట పడ్డాడు. సీఐ బాబి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
తిరుపతి కల్చరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న ఉద్యోగుల కు 12 నెలల జీతాలు తక్షణమే విడుదల చేయాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.శ్రీధర్, ఎం. రమేష్ కోరారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం యూనియన్ నాయకుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 12 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. ఈ విషయాన్ని పలుమార్లు రాష్ట్ర స్థాయి అధికారులకు విన్నవించి నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం స్పందించి జీతాలు విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామ ని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నేతలు రాధాకృష్ణ, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. రేబిస్ అవగాహన ర్యాలీ తిరుపతి తుడా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం వరల్డ్ రేబిస్ అవేర్నెస్ డేను ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వి.బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ చేశారు. ఆయన మాట్లాడుతూ పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు. కుక్క కరిచినప్పుడు వెంటనే ప్రథమ చికిత్స చేసి వైద్యులను సంప్రదించాలని, రేబిస్ వ్యాక్సిన్ను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు మురళీకృష్ణ, శ్రీనివాస్రెడ్డి, స్వరూప్, లావణ్య, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరుబాట తిరుపతి కల్చరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.చంద్రశేఖర్రెడ్డి, రాధాకృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని గంధమనేని శివ య్య భవన్లో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కౌన్సి ల్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలులో దూకుడు పెంచిందన్నారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పని విధానా న్ని అమలుచేయాలని క్యాబినెట్, అసెంబ్లీలో తీర్మా నం చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు ఎన్డీ.రవి, శివ, కేవై.రాజా, వైఎస్.మణి, గోవిందస్వామి, కత్తిరవి, మల్లికార్జున, నాగరాజమ్మ, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. -
మోహినీ అవతారంలో దేవదేవుడు
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజైన ఆదివారం ఉదయం స్వామి వారు పల్లకీపై మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గరుడోత్సవానికి ముందుగా స్వామి వారు మోహినీ అవతారం ధరించి భక్తులను కటాక్షించారు. పల్లకీపై ఊరేగుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంకణభట్టార్ శ్రీనివాసాచార్యులు ఆలయం వద్దనున్న అలంకార మండపంలో స్వామి వారిని మోహినిగా ముస్తాబు చేసి పల్లకీపై కొలువుదీర్చారు. అనంతరం పల్లకీ ఉత్సవం వైభవంగా సాగింది. అట్టహాసంగా ఊరేగింపు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడోత్సవానికి ఉపయోగించే నూతన గొడుగులు, మేల్చాట్ వస్త్రాలను తుమ్మలగుంట గ్రామానికి చెందిన చెంచురెడ్డి ఇంటి నుంచి సంప్రదాయంగా తీసుకొచ్చారు. వాయిద్యాలు, వేద మంత్రాలు నడుమ నూతన గొడుగులను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో అందజేశారు. గరుడోత్సవానికి ఉపయోగించే ఆ గొడుగులకు గ్రామస్తులు కర్పూర హారతులు పట్టారు. నూతన గొడుగులను చెంచురెడ్డి కుటుంబీకుల నుంచి చెవిరెడ్డి మోహిత్రెడ్డి స్వీకరించారు. భక్తులచే సారె సమర్పణ పల్లకీపై ఊరేగుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామికి తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం, కేసీపుట, చిగురువాడ, వేదాంతపురం, పైడిపల్లి, పాతకాల్వ, రామానుజపల్లికి చెందిన భక్తులు తీసుకొచ్చిన సారెను ఆలయంలోని మూలమూర్తి ముందు పెట్టి పూజ చేశారు. సారె తీసుకొచ్చిన భక్తులు అందరికీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి సాదర స్వాగతం పలికి దైవ దర్శనం చేయించారు. పేరూరు నుంచి పట్టువస్త్రాల సమర్పణ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా పేరూరు వాసులు అందించే పట్టువస్త్రాలను ఈ ఏటా సమర్పించారు. ఎంపీపీ మూలం చంద్రమోహన్రెడ్డి, పి.కేశవులురెడ్డి, జి.భాస్కర్రెడ్డి, సి.మునికుమార్రెడ్డి, వి.బాలక్రిష్ణ, దామోదరం అయ్యవార్లతో పాటు గ్రామస్తులతో కలసి స్వామి వారికి సమర్పించే పట్టువస్త్రాలకు చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఎదురేగి స్వాగతం పలికారు. పట్టువస్త్రాలతో పాటు గజమాల, వివిధ రకాల పండ్లు సమర్పించారు. -
గరుడునిపై గోవిందుడు
తిరుపతి రూరల్ : కోలాటాలు, చెక్క భజనలు, దేవతా మూర్తుల కళా రూపాలతో తుమ్మలగుంట గ్రామం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం వైభవంగా సాగింది. తిరుమలకు వెళ్లి శ్రీవారి గరుడోత్సవాన్ని తిలకించలేని సుమారు 75 వేల మంది భక్తులు తుమ్మలగుంటకు చేరుకుని గరుడోత్సవాన్ని తిలకించారు. రాత్రి 7.30 గంటలకు బయలుదేరిన గరుడ వాహనం అర్ధరాత్రి 12.30 గంటల వరకు సాగింది. కల్యాణ వేంకటేశ్వరుడు గరుడునిపై మలయప్ప స్వామిగా కొలువుదీరి భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గరుడ వాహనం ముందు కాగడాలు భక్తులను ఆకర్షించాయి. గరుడోత్సవం ప్రారంభానికి మూడు గంటల ముందు చిరుజల్లులతో స్వాగతం పలికాయి. వర్షం కురిసిన కొద్ది సేపటికే స్వామి వారికి సమర్పించే గరుడ మాల, మేల్చాట్ వస్త్రాలు ఆలయం వద్దకు చేరుకున్నాయి. శ్రీవారికి సారె సమర్పణ శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ ప్రారంభానికి ముందు ఇస్కాన్ ఆలయం నుంచి ఇస్కాన్ మందిరం ఉపాధ్యక్షులు రూపేశ్వర చైతన్య ప్రభుదాస్, కార్యదర్శి బలబద్ర ప్రభుల ఆద్వర్యంలో పట్టువస్త్రాలను సమర్పించారు. ఇస్కాన్ ప్రతినిధులకు చెవిరెడ్డి మోహిత్రెడ్డి సాదరంగా స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి మండలాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీవారికి సారె సమర్పించారు. -
సమాజాన్ని మార్చింది జాషువా సాహిత్యమే
తిరుపతి సిటీ: తెలుగు కవిత్వంతో సమాజంలో మార్పు తెచ్చి, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చిన మహాకవి, సంఘ సంస్కర్త గుర్రం జాషువా అని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు రాపూర్ప్రసాద్బాబు కొనియాడారు. స్థానిక గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతిని జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాదిగ జనసై న్యం వ్యవస్థాపక అధ్యక్షుడు సుధాకర్ మాదిగ, జో రేపల్లి కాటయ్య, ప్రభు, అర్జున్, నరేష్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ ప్రారంభం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి అధ్యక్షతన ఆదివారం తిరుపతిలో డిజిటల్ బుక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి పాలనలో పార్టీలోని ఎవరైతే అన్యాయంగా నష్టపోతున్నారో, తప్పుడు కేసులకు బలవుతున్నారో, అలాంటి నాయకులకు, కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాలను డిజిటల్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయాలన్నారు. తద్వారా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవడానికి మన కోసం ఏర్పాటు చేసిందే ఈ డిజిటల్ బుక్ అన్నారు. అన్యాయానికి గురవుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కోసం రూపొందించినదే ఈ డిజిటల్ బుక్ అంటూ మరోసారి గుర్తు చేశారు. కార్యక్రమంలో తిరుపతి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన కొండ
గరుడ వాహన సేవ కోసం భక్తులు పోటెత్తారు. తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు పడ్డారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులే ఎక్కడికక్కడ గరుడ వాహన సేవ కోసం నిరీక్షించారు. రెండు లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధం చేసిన గ్యాలరీలు మధ్యాహ్నం ఒంటి గంటకే నిండిపోయాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇలా రెండోసారి భర్తీ చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలో కళాకారులుతిరుమల : అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉదయం జగద్రక్షకుడైన శ్రీ వేంకటేశ్వరుడు మోహినీ రూపంలో దంత పల్లకీపై శృంగార రసాధి దేవతగా, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్ని కృష్ణుడితో కలసి హోయ లొలుకుతూ భక్తకోటిని సాక్షాత్కరించారు. కట్టుదిట్టమైన భద్రత తమిళనాడు ఘటన నేపథ్యంలో పోలీసులు, అధికారులు తిరుమల భద్రతను మరింత పెంచారు. గరుడ వాహన సేవలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ సుబ్బరాయుడు పటిష్ట భద్రతను కల్పించారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను గ్యాలరీల్లోకి అనుమతించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయ వీధుల్లోకి రాకుండా కట్టడి చేశారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ సిబ్బంది అప్రమత్తతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించారు. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల అనుమతి లేకపోవడంతో భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీల్లో తిరుమలకు రావాల్సి వచ్చింది. గరుడోత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనమురుగన్ వేషధారణభక్తులను నియంత్రిస్తున్న పోలీసులుబారులు తీరిన వాహనాలువైభవంగా శ్రీవారి గరుడ సేవ -
మట్టి.. కొల్లగొట్టి
సాక్షి టాస్క్ ఫోర్స్: జిల్లా కలెక్టర్ పరిపాలన భవనం వెనుక కూతవేటు దూరంలో ఉన్న కొట్ర మంగళం చెరువులో ఇష్టారాజ్యంగా మట్టి కొల్లగొడుతున్నారు. నేషనల్ హైవే పేరుతో అనుమతులు ఉన్నాయంటూ రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లతో అక్రమంగా మట్టి రవాణా చేసి దోచుకుంటున్నారు. చెరువులో సుమారు 20 నుంచి 30 అడుగుల లోతు వరకు గుంతలను తవ్వేశారు. కలెక్టర్ కార్యాలయానికి అతి చేరువలో ఇంత జరుగుతున్న అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. మట్టి రవాణా చేసేందుకు చెరువు కట్టను తొలగించి చెరువులో నుంచి హైవే మీదకు దారి ఏర్పాటు చేసుకొని మట్టి రవాణా చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులకు అధికారుల అండ మట్టి తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఎవరు వెళ్లి అడిగినా ఇరిగేషన్ అధికారుల అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. ఏ అనుమతులు ఉన్నాయి? ఎవరిచ్చారు అంటే సమాధానం చెప్పడం లేదు. రెవెన్యూ అధికారులు సైతం ఇరిగేషన్ అధికారుల అనుమతితోనే మట్టి తవ్వకాలు చేస్తున్నారని చెప్పడం గమనార్హం. దర్జాగా రవాణా రాత్రీ, పగలు తేడా లేకుండా టిప్పర్లతో రోజుకు వందల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. నిజంగానే ఇరిగేషన్ అధికారులు హైవే అవసరం కోసం అనుమతు లు ఇచ్చారా? ఇస్తే ఎంత వరకు అనుమతి ఇచ్చారనేది గందరగోళంగానే ఉంది. అధికారులు పర్యవేక్షిస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. హైవే పేరుతో ప్రైవేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక కూటమి నేతలకు మామూళ్లు స్థానిక అధికార పార్టీ కూటమి నాయకులకు మట్టి తరలించే వ్యక్తులు మామూళ్లు ముట్టజెబుతుండడంతో అధికారులు వారిని ఇబ్బంది పెట్టకుండా కూటమి నాయకులు చూసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. కూటమి నాయకుల ఒత్తిడి వల్లే చెరువుల్లో మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా నోరు మెదపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో పక్కనే ఉన్న తూకివాకం చెరువులో స్థానిక కూటమి నాయకుడికి మామూళ్లు ఇవ్వలేదని పనులు నిలిపేశారు. అందువల్లే ప్రస్తుతం కూటమి నాయకులకు మామూళ్లు ముట్టజెప్పి యథేచ్ఛగా మట్టిని దోపిడీ చేసి రూ.లక్షలు దోచుకుంటున్నారు. -
తిరుమలలో అప్రమత్తమైన పోలీసులు
తిరుమల : తమిళనాడులో తొక్కిసలాట జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అదనపు డీజీ మధుసూదన్రెడ్డిని తిరుమలకు పంపించారు. తిరుమల గరుడ సేవలో భద్రతపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుని ఆరా తీసి పలు ప్రాంతాల్లో పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్లో జాయింట్ స్క్రీన్ల ద్వారా పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ను అమలు చేస్తున్నామన్నారు. భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ , ఎమర్జెన్సీ సర్వీసులు వైద్య బృందాలు కదలికపై అధికారులు ప్రత్యేక సూచనలు తెలిపారు. జిల్లాకు ఉత్తమ ప్రకృతి విస్తరణ అవార్డు తిరుపతి అర్బన్:గుంటూ రు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ నెల 26, 27 తేదీల్లో ప్రకృతి వ్యవసాయంపై ఏరువాక ఫౌండేషన్ వారు కిసాన్ మహోత్సవం –2025 కార్యక్రమంలో భాగంగా ప్రతిభావంతులైన ప్రకృతి జిల్లా అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి షణ్ముగంకు ఉత్తమ అవార్డు అందుకున్నారు. -
శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్కు పురస్కారం
శ్రీసిటీ(సత్యవేడు) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక రంగం ఎంపిక చేసిన 2024–25 పర్యాటక ఎక్సలెన్సీ అవార్డులలో ‘ఉత్తమ థీమ్–బెస్ట్ రిసార్ట్’ అవార్డును శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్ అందుకుంది. ఇక్కడ అమలు చేస్తున్న స్థిరమైన ఆకర్షణీయమైన అతిథ్య సేవలకు గాను ఈ గుర్తింపు దక్కింది. శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం–25 సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ , సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరైన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. మ్యాంగో రిసార్ట్ తరఫున రిసార్ట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు ఈ అవార్డును స్వీకరించారు. శ్రీసిటీలోని సుందర సువిశాల ప్రాంతంలో ఉన్న మ్యాంగో రిసార్ట్ 20 లగ్జరీ కాటేజీలు, 10 సాధారణ గదులను కలిగి ఉంది. ఇక్కడ బస చేసే అతిథులు మంచి ప్రకృతిని వీక్షించడంతో పాటు కయాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ పక్షలను వీక్షించడం వంటి వివిధ రకాల కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్కు వరుసగా రెండవ సారి అవార్డు దక్కడం విశేషంగా చెప్పవచ్చు. రీసార్టును తీర్చిదిద్దిన విధానాన్ని ప్రశంసించారు. -
గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరగనున్న గరుడసేవకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే అవకాశముంది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి ఒంటి గంట వరకు వాహనసేవ సాగేలా ప్రణాళిక రూపొందించారు. నిరంతరాయంగా అన్న ప్రసాదాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం. గ్యాలరీల్లోనూ ఉదయం నుంచి రాత్రి వరకు పులిహోర, టమాట బాత్, బిసిబిల్లా బాత్ తదితర అన్నప్రసాదాల ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. పటిష్ట బందోబస్తు బ్రహ్మోత్సవాలకు దాదాపు 1,130 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందితోపాటు 3,600 మంది పోలీసులతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవకు ప్రత్యేకంగా 1200 మంది పోలీసులతో అదనపు భద్రత కలి్పంచారు. ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,770 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శనివారం సాయంత్రం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. -
ఎండగడుదాం
కూటమి అరాచకాలను కూటమి అరాచకాలను ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ నడుంబిగించింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల సైన్యాన్ని సిద్ధం చేసేందుకు ఉపక్రమించింది. శనివారం పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రెడ్బుక్ ఆగడాలను డిజిటల్ బుక్లో నమోదు చేయించి చట్టం ముందు నిలబెట్టే చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి, తిరిగి జగనన్న పాలనను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పుంగనూరు: వైఎస్సార్సీపీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసుకుంటూ కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాము ఖి నిర్వహించే కార్యక్రమాన్ని ఎంపీ మిథున్రెడ్డి జైలు నుంచి రాగానే పుంగనూరు నుంచి ప్రారంభిస్తారని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పార్టీకి 18 లక్షల మంది క్రియాశీలక సైన్యం ఉందని ధీమా వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, యర్రాతివారిపల్లెలో శనివారం వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన పుంగనూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఇంకా తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి నారాయణస్వామి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి, ఆకేపాటి అమరనాథ్రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నిసార్ అహ్మద్, వెంకటేగౌడ్, డాక్టర్ సునీల్కుమార్, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, బియ్యపు మధుసూదన్రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ‘పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. గ్రామ కమిటీలకే పూర్తి బాధ్యత. పుంగనూరు నియోజకవర్గంలోని 112 గ్రామాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడుతారు. ఎంపీ మిథున్రెడ్డి జైలు నుంచి వచ్చాక ఈ కార్యక్రమం ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్క్యాన్ చేస్తే డిజిటల్ నోట్బుక్లో అన్ని విషయాలు నమోదు చేసుకోవచ్చు’ అని అన్నారు. ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గతంలో జరిగిన పొరపాట్లు ఈ సారి జరగనివ్వను. ఈసారి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మీ ద్వారానే ప్రభుత్వం నడవనుంది’ అని చెప్పారు. మాజీ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. ‘ఈవీఎంల గాలిలో కూడా పుంగనూరు ప్రజలు పెద్దిరెడ్డిని గెలిపించారు. మీరు జగనన్న సైనికులు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యాన్ని నిర్వీర్యం చేసింది’ అని ధ్వజమెత్తారు. రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాకు ఆదర్శం. కార్యకర్తలను ఏ విధంగా చూసుకోవాలో పెద్దిరెడ్డే నిదర్శనం. మనం పుంగనూరుని రోల్మోడల్గా తీసుకుందాం. మా నియోజకవర్గంలో కూడా ఇదే ఫార్ములాను అమలు చేస్తాను’ అని పేర్కొన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, వెంకటేగౌడ, సునీల్, కురుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్రెడ్డితో పాటు అకేపాటి అమరనాథరెడ్డి, సమన్వయకర్తలు నేదురుమల్లి రామకుమార్రెడ్డి, రాజేష్, విజయానందరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, ఎంపీపీ భాస్కర్రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్ పాల్గొన్నారు. ప్రతి నెలా ‘జగనన్న’తో ముఖాముఖి’దోచుకుంటున్న కూటమి ముందుగా సజ్జల మాట్లాడుతూ..‘ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాం. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. కార్యకర్తల పాత్ర ప్రత్యక్షంగా ఉంటుంది. వైఎస్ జగన్ చేసే యజ్ఞంలో మనం క్రియాశీలక పాత్రదారులం కావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని దోచుకుంటోంది. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఉన్నాము అని చెప్తున్నారు’ అని అన్నారు. ఓట్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలి. ఎల్లో మీడియా, సోషల్ మీడియా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా దాడికి రెడ్ బుక్ ఉపయోగించారు. మనం డిజిటల్ బుక్ను లాంచ్ చేశాం’ అని చెప్పారు. -
కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!
ఓ పక్క రుక్ష్మిణ..మరో పక్క సత్యభామ.. మురళీలోలుడు బకాసురుడిని వధిస్తూ భక్తులకు కనువిందు చేశారు. స్వర్ణతేజోమయంగా కాంతులీనుతున్న సర్వభూపాలుడిని అధిరోహించిన స్వామి సకల భూపాలురకు తానే అధిపతినని.. తన భిక్షే రాజ్యాధికారమని సందేశమిచ్చారు. అంతకుముందు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై రాజమన్నార్ అవతారంలో వచ్చి భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం కల్పవృక్ష. సర్వభూపాల వాహనసేవలు నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో భక్తులు మలయప్పను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. వాహనసేవల ముందు కళాప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. – తిరుమల -
రూ.1,243 కోట్లతో తిరుపతి ఐఐటీ అభివృద్ధి
ఏర్పేడు: తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్లో రూ.1,243 కోట్లతో చేపట్టిన ఫేజ్–బి అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. మొత్తం రూ.60 వేల కోట్లతో ఎనిమిది ఐఐటీలతోపాటు, వివిధ రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడ నుంచి ఆయన వర్చువల్గా శ్రీకారం చుట్టారు. తిరుపతిలో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి హాజరై ఐఐటీ యాజమాన్యం, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఐఐటీల్లో తిరుపతి ఐఐటీ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సెమీకండక్టర్లు, శక్తి నిల్వ వంటి రంగాలలో జరుగుతున్న ముఖ్యమైన పరిశోధన కార్యకలాపాల గురించి వివరించారు. ఇక్కడ భవన నిర్మాణాలు మాత్రమే జరగటంలేదని, యువత ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం జరుగుతోందన్నారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఐఐటీ కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. రెండో దశలో 2,500 మందికి పైగా విద్యార్థులకు ఇక్కడ ఉన్నతస్థాయి వసతులు సమకూరుతాయన్నారు.ఈ ప్రాంత రైతుల పంట ఉత్పత్తులకు ప్రోత్సాహకంగా తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పడం సంతోషకరమన్నారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ దార్శనికతతో తిరుపతి ఐఐటీ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఫేజ్–బిలో కలి్పంచే సదుపాయాలివే..తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. రూ.1,243 కోట్ల ఫేజ్–బి నిధులతో ఈ ఐఐటీలో మూడు అకడమిక్ బ్లాక్స్, ఒక మెగా ఇండోర్ ఆడిటోరియం, ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ సదుపాయాలు రాబోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ క్యాంపస్లో 1,800 మందికి వసతి సదుపాయం ఉందని, ఈ ఫేజ్–బి పనులు 2029కల్లా పూర్తిచేయగలిగితే మరో 2,650 మంది విద్యార్థులకు వసతి కలగనుందని తెలిపారు. ఐఐటీ ఇన్చార్జి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీన్ ఎ. మురళీకృష్ణ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్మాణ ప్లానింగ్ను వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీడబ్ల్యూసీ ఈడీ, ప్రాజెక్టు ఇన్చార్జి బీఎస్ రెడ్డి, బ్రిగేడియర్ డాక్టర్ కృష్ణకుమార్, ఐఐటీ రిజి్రస్టార్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్లాట్లు వేసి..బేరం పెట్టి !
రేణిగుంట : రేణిగుంట–పాపానాయుడు పేట మార్గంలో రూ.కోట్ల విలువ చేసే మేత పోరంబోకు భూమి అక్రమార్కులపరం అవుతోంది. కూటమి నేతలు ప్లాట్లు వేసి బేరం పెట్టి ప్లాటు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల చొప్పున విక్రయించి అక్రమంగా దోచుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో నివాసాలు నిర్మించుకున్న సుమారు 500 ఇళ్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేలమట్టం చేశారు. కానీ ఇదే కూటమి నాయకుల అండతో కోట్ల రూపాయలు విలువ చేసే 6 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యనేత పీఏతో ఒప్పందం రేణిగుంట మండలంలోని జీపాల్యం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 213/2 లో 1.8 ఎకరాలు, 213/3 లో 4.3 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. రేణిగుంట– పాపా నాయుడుపేట ప్రధాన రహదారి పక్కన ఉండటంతో ఈ భూమికి మంచి డిమాండ్ ఉంది. ఈ భూమిపై కన్నేసిన కొందరు భూ ఆక్రమణదారులు గత ప్రభుత్వంలోనూ కబ్జాకు ప్రయత్నించారు. అయితే స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలు ఆక్రమణలను అడ్డుకున్నారు. కట్టడాలను నేలమట్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అదే అక్రమ దారులు ఆ భూములపై కన్నేశారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడి పీఏతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆ తరువాత రెవెన్యూ అధికారుల సహకారం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందరి సహకారంతో వారం రోజులుగా నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటికీ ప్రభుత్వ ‘మీ భూమి’ వెబ్సైట్లో ప్రభుత్వ భూమిగానే నమోదయి ఉంది. అయితే తమకు కోర్టు ఆర్డర్ ఉందంటూ వెళ్లిన ప్రతి ఒక్కరికీ చెబుతూ అక్రమ నిర్మాణాలు శరవేగంగా చేపడుతున్నారు. పేదల ఇళ్లు కూల్చేస్తూ.. పేద కుటుంబాలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గతంలో అధికారులు, స్థానిక ఎమ్మెల్యేని కలిసి విన్నవించుకున్నారు. అప్పటి ప్రభుత్వం వారికి అవకాశం కల్పించింది. అప్పులు చేసి నిర్మించుకున్న నివాసాలను కూటమి ప్రజాప్రతినిధి ఆదేశాలతో అధికారులు వాటిని నేలమట్టం చేశారు. మేత పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్న దృఽశ్యం.. గతంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు (ఫైల్) అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేశా జీపాల్యం రెవెన్యూ గ్రామంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చింది. వెంటనే సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పనులను నిలుపుదల చేశాను. కోర్టులో కేసు ఉన్నప్పుడు పనులు చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్, రేణిగుంట -
ఆయన కృషితోనే నైలెట్
తిరుపతి సిటీ: ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (నైలెట్) తిరుపతి కేంద్రాన్ని అక్టోబర్ 2న ప్రారంభించనున్న నేపథ్యంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం ఆ కేంద్రాన్ని సందర్శించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నైలెట్ ఏర్పాటుకు ఎంపీ పార్లమెంట్ వేదికగా పలుమార్లు గళం విప్పి సాధించారు. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ చేసిన ప్రయత్నాల ఫలితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ నైలెట్ కేంద్రం ఎస్వీయూలో ఏర్పాటు కానుంది. యువత ఉపాధే లక్ష్యంగా.. యువతకు పుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి నిరుద్యోగ అభ్యర్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎంపీ గురు మూర్తి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నైలెట్ సంస్థను ఎస్వీయూలో ఏర్పాటు చేసేందుకు నిరంతర కృషి చేశారు. దీంతో ఈ సంస్థ ద్వారా యువతకు విభిన్న కో ర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ కోర్సుల తో పాటు వెబ్ డిజైనింగ్, పీసీ హార్డ్వేర్ అండ్ నెట్ వర్కింగ్, ఆఫీస్ ఆటోమేషన్, అకౌంటింగ్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ వంటి తక్కువ వ్యవధి కోర్సులు అందించనున్నారు. తిరుపతి ప్రాంత యువతకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎంబీడెడ్ సిస్టమ్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్, సెమి కండక్టర్ డిజైన్, డేటా అనలిటిక్స్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. నైలెట్ని సందర్శించిన ఎంపీ ఎస్వీయూలో ఏర్పాటు చేసిన నైలెట్ సంస్థను సందర్శించిన ఎంపీకి నైలెట్ డైరెక్టర్ అధ్యాపక సిబ్బందిని పరిచయం చేశారు. అనంతరం ఆయన క్లాస్ రూమ్స్ని, ల్యాబ్స్ని పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతున్న విషయం గమనించిన ఎంపీ దాని గురించి ఆరా తీయగా మరుగుదొడ్ల ఇబ్బంది కారణంగా ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకునేందుకు ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. వెంటనే యూనివర్సిటీ వీసీతో మాట్లాడిన ఎంపీ సమస్య త్వరగా పరిష్కరించాలని కోరారు. ఫలితంగా నైలెట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా.. ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో పోరాటి నైలెట్ సంస్థను సాధించాం. యువతకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ అవసరాలకు తగినట్లు వారి నైపుణ్యాన్ని పెంపొందించి, ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు పొందేలా నైలెట్ కీలక పాత్ర పోషించనుంది. స్థానికంగానే ఆధునిక సాంకేతిక శిక్షణ పొందే అవకాశాలు లభించడం వల్ల యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయి. ఈ కేంద్రం ద్వారా ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ అందించనున్నారు. నైలెట్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాం. –ఎం గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
సజ్జల రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం
రేణిగుంట : చిత్తూరు ఉమ్మడి జిల్లా పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి వందేభారత్ రైల్లో రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించి, స్వాగతం పలికారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి నారాయణస్వామి వచ్చారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ మాజీ చైర్మన్ తారక శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి వయ్యాల కృష్ణారెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షుడు గంగారి రమేష్, జడ్పీటీసీ సంధ్యారాణి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, ఏర్పేడు మండల ఇన్చార్జి గున్నేరి కిషోర్ రెడ్డి, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనేటి రమణయ్య యాదవ్, ఎంపీపీ శ్రీనివాసులు యాదవ్, మైనార్టీ సెల్ స్టేట్ సెక్రటరీ మహమ్మద్ రసూల్, సర్పంచ్ మునిశేఖర్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ హాసన్ సాహెబ్, వైస్ సర్పంచ్ ఇర్ఫాన్, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మల్లం రవికుమార్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.సజ్జల రామకృష్ణారెడ్డికి స్వాగతం పలుకుతున్న ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి -
100 రోజులుగా చెవిరెడ్డి అక్రమ నిర్భంధం
– నేతలతో కిటకిటలాడిన విజయవాడ ఏసీబీ కోర్టు తిరుపతి రూరల్ : కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్రమంగా లిక్కర్ కేసులో అరెస్టు చేసి జైలులో నిర్భందించి శవంద రోజులు దాటింది. జూన్ 18న పార్టీ నేతలు చెవిరెడ్డిని చూసేందుకు విజయవాడకు తరలివెళ్లారు. చంద్రగిరి ప్రజలంతా ఆయన ఎప్పుడు బయటకు వస్తారా..? అని ఎదురుచూస్తుంటే పార్టీ నేతలు ఆయనను జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చిన ప్రతిసారీ విజయవాడకు వెళ్లి ఆయనతో మాట్లాడి వస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రగిరి ప్రజలు ఆయన కుటుంబానికి అండగా నిలబడతారని, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం చెవిరెడ్డి వెంట నడుస్తుందని స్పష్టం చేస్తున్నారు. చెవిరెడ్డి స్పందిస్తూ ‘‘వారు చేస్తున్న తప్పులు అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది... రాజకీయాల్లో తప్పుడు కేసులు పెట్టడం సరి కాదు.. వారు చేస్తున్నారు.. మనకు తప్పదు భరించాలి..’’ అంటూ క్యాడర్ లో ధైర్యం నింపారు. కూటమి ప్రభుత్వం చెవిరెడ్డిపై చూపించే కక్షను చంద్రగిరిలో ప్రతి ఇంటికీ తెలియజేస్తామని అభిమానులు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. రోజులు గడిచే కొద్దీ చెవిరెడ్డిని చూడటానికి ఏసీబీ కోర్టు వద్దకు వెళ్లే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అక్కడి కోర్టు హాలు చంద్రగిరి ప్రజలతో కిక్కిరిస్తోంది. దీనికితోడు రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి కూడా అదే కోర్టుకు వస్తుండటంతో ఆయనను చూడటానికి వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. -
అఖిల భారత ఎన్సీసీ ట్రెక్కింగ్ యాత్ర ప్రారంభం
తిరుపతి సిటీ: ఏపీ, తెలంగాణ ఎన్సీసీ ఆధ్వర్యంలో అఖిల భారత ఎన్సీసీ ట్రెక్కింగ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ దాహియా ట్రెక్కింగ్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శుక్రవారం నుంచి అక్టోబర్ 2వ తేదీవరకు 8 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్సీసీ క్యాడెట్లు ఈ యాత్రలో పాల్కొంటారని తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అండమాన్, పాండిచ్చేరి, కేరళ, లక్షద్వీప్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా నుంచి మొత్తం 509 ఎన్సీసీ క్యాడెట్లు, 15 అసోసియేట్ అధికారులు ఈ ట్రెక్కింగ్ యాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, పరిసర ప్రాంతాల్లో ఈ ట్రెక్కింగ్ సాగుతుందని తెలియజేశారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై నిరసన
తిరుపతి మంగళం : జేబులో మెంటల్ సర్టిఫికెట్ పెట్టుకుని అభిమానులు, పార్టీ వాళ్లు అన్న తేడా లేకుండా చెంపలు పగలగొట్టే బాలకృష్ణ ఒక పెద్ద సైకో అని వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటికి వచ్చిన చిరంజీవిని సత్కరించి సినీ పెద్దలను గౌరవించిన గొప్ప మనసున్న నేత మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం పార్టీ నాయకులు బాలకృష్ణ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో వందల మంది పోలీసులు మోహరించి నిరసనను అడ్డుకుని ఫ్లెక్సీలను లాగేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తన సెక్యూరిటీపై కాల్పులు జరిపిన బాలకృష్ణను నందమూరి తారక రామారావును చూసి కాపాడిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అని గుర్తు చేశారు. స్వయాన తన బావ బాలకృష్ణకు మతిస్థిమితం లేదని తాను రచించిన ఓ పుస్తకంలో చెప్పారన్నారు. అఖండ సినిమాపై జగనన్నను బాలకృష్ణ కలవాలంటే అంతపెద్ద మనిషి మన దగ్గరికి రావడం ఏమిటని, అతను ఏమి అడిగితే అది చేసేయండని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానికి చెప్పిన గొప్ప గుణం జగనన్నదన్నారు. అలాంటి నాయకుడిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం అతడి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తుడా వెంకటరెడ్డి, గోపాల్రెడ్డి, లవ్లీ వెంకటేష్, తలారి రాజేంద్ర, కార్పొరేటర్ అనీష్రాయల్, పార్టీ యువజన విభాగం నాయకులు ఉదయ్ వంశీ, మల్లం రవికుమార్, దినేష్రాయల్, మద్దాలిశేఖర్, పసుపులేటి సురేష్, రామకృష్ణారెడ్డి, శాంతారెడ్డి, పునీత, పుష్పలత పాల్గొన్నారు. -
పరిశ్రమల నుంచి విరాళాలు తీసుకోండి
తిరుపతి అర్బన్: అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో స్కూల్స్ శిథిలావస్థకు చేరుకుంటే, వాటి మరమ్మతులకు మీ పరిధిలోని పరిశ్రమల నుంచి విరాళాలు సేకరించాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సీడీపీవోలకు ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం నెలవారీ సప్లిమెంటరీ న్యూట్రీషన్ ఫుడ్ కమిటీ సమావేశం చేపట్టారు. జేసీ మాట్లాడుతూ పరిశ్రమలు ఇచ్చిన విరాళాల నుంచి అంగన్వాడీ స్కూల్స్ను బాగుచేయించుకోవాలని సూచించారు. బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, బాలామృతం, న్యూట్రీషన్ కిట్లు ఎలా ఉన్నాయో తరచూ పరిశీలన చేపట్టాలని ఐసీడీఎస్ పీడీ వసంతబాయిని ఆదేశించారు. గుడ్లు సకాలంలో అందించకుంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అంగన్వాడీ స్కూల్కు రేషన్ దుకాణం దూరంగా ఉంటే రీమ్యాపింగ్ చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో శేషాచలం రాజు హాజరయ్యారు. మద్యం మత్తులో బ్యారేజ్లో దిగి... వాకాడు : వాకాడుకు చెందిన పనబాక ప్రసన్న అనే యువకుడు శుక్రవారం మద్యం మత్తులో స్వర్ణముఖి బ్యారేజ్ గేట్ల రోప్లను పట్టుకుని లోపలికి దిగాడు. స్థానికుల వివరాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం బ్యారేజ్ గేట్ల బెడ్పై పడుకుని నిద్రించడం అందరిని కలవరానికి గురిచేసింది. అగ్నిమాప క శాఖ అధికారులు, సిబ్బంది నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం యువకుడిని స్థానిక పోలీసులకు అప్పజెప్పారు. -
ముత్యపు పందిరిపై మురిసె
సింహ వాహనంపై శ్రీవారు, వాహన సేవలో పాల్గొన్న చెవిరెడ్డి సోదరుడు రఘునాథరెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, ముత్యపు పందిరిలో స్వామితిరుపతి రూరల్ : తుమ్మలగుంటలో జరుగుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో భక్తులను కటాక్షించేందుకు వచ్చిన స్వామికి ముందు వృషభాలు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, వేద పాఠశాల పిల్లలు కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ సింహ వాహన సేవ ఉత్సాహంగా సాగింది. ఉదయం యోగ నరసింహునిగా దర్శనమిచ్చిన స్వామి వారు రాత్రి ముత్యపు పందిరిలో కొలువై భక్తులను మురిపించారు. సింహ వాహనం దర్శనంతోనే ధైర్యసిద్ధి కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో మూడో రోజు శుక్రవారం ఉదయం యోగ నరసింహునిగా స్వామి వారు సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి , మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో ధైర్యం, శక్తి, తేజస్సు వంటి శక్తులన్నీ భక్తులకు అందుతాయని విశ్వాసం. ముత్యపు పందిరిలో కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన శుక్రవారం రాత్రి ముత్యపు పందిరి వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు కొలువై భక్తులను మురిపించారు. ముత్యపు పందిరిలో కొలువుదీరి పురవీధుల్లో విహరిస్తున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్నపన తిరుమంజనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు నిర్వహించే తిరుమంజనం కమనీయంగా సాగింది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే తిరుమంజన సేవలో పాల్గొన్న భక్తులు భక్తితత్వంతో మైమరిచారు. ఆకట్టుకుంటున్న నాదస్వరం సింహ, ముత్యపు పందిరి వాహన సేవల్లో నాయీ బ్రహ్మణులు వినిపించే నాదస్వరం, ఆధ్యాత్మిక వాద్యం (డోలు వాయిద్యం) భక్తులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు కోలాటాలు, చెక్క భజనలు కలసి రావడంతో వాహన సేవలు చూడ ముచ్చటగా సాగుతున్నాయి. -
తిరుమల లడ్డూ కేసు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కేసులో సీబీఐ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. తిరుమల లడ్డు కేసులో సిట్ పనిచేయడం ఆపేసిందా? అంటూ సీజేఐ ప్రశ్నించారు. ‘‘సిట్ వేరొక అధికారికి అధికారాలు బదలాయించకూడదా?. చిన్నప్పన్నను ఇంటరాగేషన్లో వేధిస్తే ఫిర్యాదు చేయొచ్చు కదా’’ అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.చిన్నప్పన్నకు సిట్లో లేని అధికారి నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం.. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
మరణంలో కూడా వీడని స్నేహబంధం
కలువాయి(సైదాపురం): మట్టి మాఫియా దాహానికి ఇ ద్దరు చిన్నారులు బలయ్యారు. సరదాగా ఆడుతూ..పాడుతూ.. కలేకాయల కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. సమీపంలోనే గుంతల్లో ఇరుకున్న విషయం తెలుసుకున్న పోలీసుల బృందం బురద గుంతల్లో గురువారం మధ్యాహ్నం వరకు శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. వివరాలిలావున్నాయి. ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన నూతే టి ప్రసాద్, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు నూ తేటి విష్ణుకుమార్(11) స్థానిక నవభారత్ స్కూల్లో మూ డో తరగతి చదువుతున్నాడు. అలాగే అదే గ్రామానికి చెందిన మనబోటి నరసింహులు, సునీత దంపతుల కుమారుడు మనోబోటి నవశ్రావణ్ స్థానిక ఎంపీయూపీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదుపుతున్నా డు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు కావడంతో ఎక్కడికి వెళ్లినా ఇద్దరే వెళ్లి సరదాగా ఆడుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలో డ్రాగన్ప్రూట్ తోట ఉండడంతో ఇద్దరు స్నేహితులు కలసి డ్రాగన్ ప్రూట్స్, కలేకాయల కోసం బుధ వారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లారు. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబాల సభ్యు లు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో స్థాని క పోలీసులకు సమాచారం అందించడంతో నెల్లూరు జిల్లా ఎస్పీ వి.అజిత ఆదేశాల మేరకు సంగం సీఐ వే మారెడ్డి, రాపూరు, కలువాయి, మర్రిపాడు, చేజర్ల ఎస్ఐలు ఉయ్యాలపల్లి గ్రామానికి బుధవారం రాత్రి చేరుకున్నారు. అనంతరం పిల్లల ఆచూకీ కోసం గ్రామస్తులతో కలసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రంగంలోకి డాగ్స్కాడ్, డ్రోన్ కెమెరాలను ఘటన స్థలానికి తీసుకువచ్చి మరో కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యా హ్నం వరకు ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఆ సమయంలో ఉ య్యాలపల్లి సమీపంలోని చెరువు వద్ద మట్టి మాఫి యా తవ్విన గుంతల్లో మృతదేహాలు ఉన్నాయంటూ స్థానికులు పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచా రం అందించారు. దీంతో హుటాహుటిన సంగం సీఐ వేమారెడ్డి, రాపూరు, సైదాపురం, మర్రిపాడు, చేజర్ల ఎస్ఐలు వెంకటరాజేష్, క్రాంతికుమార్, శ్రీనివాసు, తిరుమలరావు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా బురదమయంగా ఉండడంతో యంత్రాల సహాయంతో నీటిని తోడారు. మృతదేహాలను బయటకు తీశారు. అక్కడే ఉన్న వారంతా విష్ణు, శ్రావణ్ మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా రోదించారు. మట్టి గుంతలు చిన్నారుల ప్రాణాలుతీశాయంటూ మృతుల కుటుంబాల సభ్యుల శాపనార్థాలు పెట్టారు. చిన్న వయసులోనే నిండి నూరేళ్లు నిండాయా? అంటూ రోదించారు.కుటుంబ నేపథ్యం..ఉయ్యాలపల్లికి చెందిన నూటేటి ప్రసాద్ లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారెలు ఉన్నా రు. అతను బతుకు దెరువుకోసం కువైట్కు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మృతి చెంది న విష్ణుకుమార్ చివరి వాడు కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించేందుకు ప్రసాద్ కువైట్కు వెళ్లి రూపా యి రూపాయి కూడపెట్టి పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో విష్ణుకుమార్ను కూడా ప్రైవేటు పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ప్రసాద్ కూడా ఇటీవల కువైట్ దేశం నుంచి స్వగ్రామానికి వచ్చారు. మళ్లీ కువైట్కు వెళ్లే సమయంలో ఈ విషాదం నెలకొనడంతో తమ ఆశలు ఆడియా శలు ఆయ్యాయాంటూ రోధించడం అందరిని కలచివేసింది. అలాగే మనుబోటి నరసింహులు టిప్పర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ భార్య సునీత ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. ఇద్దరు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చదువిస్తు న్నారు. రెండో కుమారుడు నవ శ్రావణ్ నీటి గుంతలో పడి మృతి చెదడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.విష్ణుకుమార్, నవశ్రావణ్ చదివేది వేర్వేరు పాఠశాలలు, వేర్వేరు తగతులైనా ఇద్దరు చిన్నతనం నుంచే ఆడుతూ,పాడుతూ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి మెలసి వెళుతూ గ్రామంలో సందడిగా ఉండేవారు. అంతటి స్నేహితులైన వారి మరణం కూడా వారిని విడతీయలేకుండా పోయింది. ఇద్దరూ చనిపోయారా? నాయనా అంటూ.. గ్రామస్తులు, బంధువులు బోరున విలపించారు. -
స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ పేరిట గర్భిణులపై నిర్లక్ష్యం
చంద్రగిరి : అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి వైద్యాధికారులు అవలంబించిన తీరుతో గర్భిణులు అవస్థ పడిన ఘటన చంద్రగిరి ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చంద్రగిరి ఏరియా ఆస్పత్రిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆరుణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని 11 గంటలు దాటిన నిర్వహించలేదు. దీంతో అప్పటికే సమీకరించిన రోగులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రి లోపల ఉన్న రోగులకు అందుబాటులో వైదాధికారులు లేకుండా అందరూ కార్యక్రమానికి వెళ్లారు. దీంతో రోగులు ఆస్పత్రిలో వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులను పడాల్సి వచ్చింది. ప్రతి గురువారం గర్భిణులకు ప్రత్యే వైద్య సేవలను అందిస్తారు. ఈ క్రమంలో గురువారం మండల వ్యాప్తంగా గర్భిణులు ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. కనీసం నిండు చూలాలకు వైద్య సేవలను అందించకుండా అధికారులు ఇతర కార్యక్రమాలకు వెళ్లడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చంద్రగిరిలో అధికారుల అత్యుత్సాహం ప్రజలకు శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలాంటి ప్రొటోకాల్ లేని వారి కోసం రోగులను ఇబ్బందులు పెట్టడం సరికాదంటూ రోగుల సహాయకులు మండిపడ్డారు. -
ఉపరాష్ట్రపతికి సాదర వీడ్కోలు
రేణిగుంట: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనం అనంతరం గురువారం మధ్యా హ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకష్ణన్కు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవె న్యూ మాజీ సెక్రటరీ ఎం హరి జవహర్, డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తదిత రులు సాదరంగా వీడ్కోలు పలికారు. విద్యుదాఘాతంతో కౌలురైతు దుర్మరణం కేవీబీపురం: విద్యుత్ లైటు మరమ్మతు చేస్తూ, ప్రమాదవుశాత్తు విద్యుదాఘాతానికి గురై కౌలు రైతు మృత్యువాత పడిన ఘటన కేవీబీపురం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యు లు కథనం మేరకు.. మండంలోని అంజూరు పాళెం గ్రామానికి చెందిన శివ(33) స్థానికంగా ఉన్న సుమారు ఎకరా సొంత భూమితో పాటు, మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. ఈ క్రమంలో తమ పొలంలో ఉ న్న మోటారు వద్ద ఉన్న లైటు కాలిపోయింది. దాన్ని ఇంటికి తెచ్చి, మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని శ్రీకాళహస్త్రిలోని ఒక ఆస్ప త్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెం దినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, రితిక్ (4), సుదర్శిని (2) పిల్లలు ఉన్నారు. కార్పొరేటర్ సంధ్య ఇంట విషాదం తిరుపతి తుడా: స్థానిక 49వ డివిజన్ కార్పొరేటర్ అన్నా సంధ్య ఇంట విషాదం నెలకొంది. గుంటూరులో బంధువుల ఇంట ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బుధవారం రాత్రి భర్త, పిల్లలతో బయలు దేరిన కార్పొరేట్ సంధ్య వాహనం ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో చిలకలూరిపేట సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో అందులో ప్రయాణిస్తున్న కార్పొరేటర్ అన్నా సంధ్య భర్త, స్విమ్స్ ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న వెంకట కిషోర్, ఆమె కుమార్తె అశ్విత మరణించారు. దీంతో తిరుపతి కొర్లగుంటలో పెనువిషాదం నెలకొంది. అందులో ప్రయాణిస్తున్న కార్పొరేటర్ సంధ్య గాయాలతో బయటపడి చికిత్స పొందుతోంది. ఈ విషాదంపై స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు విచారం వ్యక్తం చేశారు. -
గంజాయి మత్తులో తిరుచానూరులో దారుణం
చంద్రగిరి: ఓ బృందం గంజాయి మత్తులో ఓ విద్యార్థిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం అర్ధరాత్రి తిరుచానూరులో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. తిరుచానూరుకు చెందిన తోటకూర కుహల్, దినేష్ మిత్రులు. వీరు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇద్ద రూ ఒకే యువతిని ప్రేమించారు. ఈ విషయం ఇద్దరికీ తెలియడంతో కొద్ది రోజులుగా గొడవలు పడుతున్నా రు. ఈ క్రమంలో బుధవారం కుహల్, దినేష్ మధ్య వాట్సాప్లో వివాదం చేసుకున్నారు. ఈ వివాదం మ రింత ముదిరింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన కుహల్ 20 మందితో కలిసి గంజాయి సేవించి, వారిని వెంటబె ట్టుకుని, తిరుచానూరు నేతాజీ రోడ్డులోని దినేష్ ఇంటికి బుధవారం అర్ధరాత్రి వెళ్లాడు. ఆపై ఇంట్లో ఉన్న దినేష్పై దాడికి చేశారు. తన బిడ్డపై దాడి జరగడంతో దినేష్ తల్లి అడ్డుగా రావడంతో ఆమెను సైతం చితక బాదారు. అనంతరం దినేష్ను బయటకు లాగి కత్తితో దాడి చేశా రు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినేష్ అక్కడే కుప్పకూలి పడిపోయాడు. కడుపులో ని పేగులు బయటకు రావడంతో ఆర్తనాదాలు చేశాడు. గంజాయి మత్తులో దినేష్పై దాడికి పాల్పడిన అల్లరి మూకలు, కాసేపు అ క్కడే నిలబడి వీర విహారం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కాసేపటికి స్థానికులు బయటకు వచ్చి రక్త పు మడుగులో పడి ఉన్న దినేష్ను హుటాహుటిన రు యా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దినేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు? గంజాయి మత్తులో దినేష్పై హత్యాయత్నానికి పాల్పడిన యువకుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన మిగిలిన వారు పరారీలో ఉండడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. కేవలం యువతి ప్రేమ వ్యవహారమే గొడవకు ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మిగిలిన నిందితుల కోసం గాలింపులను ముమ్మరం చేశారు. -
అక్రమ బదిలీల నిలుపుదల హర్షణీయం
తిరుపతి తుడా: విలేజ్ హెల్త్క్లినిక్ల సిబ్బంది అక్రమ బదిలీల నిలుపుదలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్ల్లో పనిచేస్తున్న మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ఆసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మెకు తెరపడింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి బదిలీల ప్రక్రియను ఆపివేసింది. దీంతో ఆ సంఘం నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. నిరవధిక నిరసన వ్యక్తం చేసిన ఆ సంఘం అధ్యక్షులు సుమన్బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జయచంద్ర, నాగవెంకటేష్, సమంత్, కృపావతి, జిల్లా నాయకులకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. మహిళా వర్సిటీలో నవరాత్రి వేడుకలు తిరుపతి రూరల్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో గురువారం నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంగీతం, నృత్యం , లలిత కళల విభాగంలో ఆచార్య ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి, డాక్టర్ హిమబిందుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినులు నవరాత్రికి సంబంధించిన అమ్మవారి భక్తి పాటల నృత్యాలతో అలరించాయి. కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ఉమ, రిజిస్ట్రార్ రజని, అధ్యాపకులు, ఇతర బోధనేతర సిబ్బంది కోలాటం ప్రదర్శించారు. -
దృఢత్వానికి ప్రతీక భారతీ ఆల్ట్రా సిమెంట్
కేవీబీపురం: నమ్మకానికి, దృఢత్వానికి భారతీ ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ప్రతీకగా నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ పీ.చాయాపతి తెలిపారు. గురువారం కేవీబీపురం మండల కేంద్రంలోని టీడీఆర్ స్టీల్ అండ్ సిమెంట్ అధినేత తాటిపర్తి దశరథరామిరెడ్డి ఆధ్వ ర్యంలో తాపీమేసీ్త్రలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చాయాపతి మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతీ అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. టెంపర్ ప్రూఫ్ బస్తాలతో మార్కెట్లోకి వస్తుండడంతో తూకంతో కూడా మార్పులు ఉండవన్నారు. సిమెంట్ రంగంలో భారతీ సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. అనంతరం భారతీ సిమెంట్కు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగా హన కల్పించారు. అనంతరం తాపీమేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాదబీమా పత్రాలను అందజేశారు. -
బాలకృష్ణ ఒక సర్టిఫైడ్ సైకో
● వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి చిన్నా ధ్వజం వరదయ్యపాళెం: శా సన సభ్యుడి హోదా లో ఉంటూ మానసిక పరిస్థితి బాగాలేక మెంటల్ సర్టిఫికెట్ ఉన్న సర్టిఫైడ్ సై కో సినీ నటుడు బా లకృష్ణ అని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జి ల్లాల అధికార ప్రతినిధి చిన్నా ధ్వజమెత్తారు. గురువారం చిన్నా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని బా లకృష్ణ దుర్భాషలాడడాన్ని చిన్నా తీవ్రంగా ఖండించారు. దేవాలయంగా భావించే అసెంబ్లీలో కళ్ల జో ళ్లను నెత్తిన పెట్టుకుని రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వీధి రౌడీలా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో దుర్భాషలాడడం హేయ మైన చర్య అని, తక్షణమే ఆయన్ని వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చి ఆయన మానసిక ఆరో గ్య పరిస్థితి గురించి వాకబు చేయాలని సూచించారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. గతంలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన కేసులో బాలకృష్ణ మానసిక స్థితి బాగాలేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నారన్నారు. వారి అంతర్గత గొడవల మధ్యకు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తక్షణమే మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రారంభ దశలో క్యాన్సర్ గుర్తిస్తే చికిత్సతో నయం తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ ఎస్ లక్ష్మీ సంధ్య మాట్లాడారు. ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ చికిత్సతో దాని నుంచి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ధూమపానం, మద్యానికి దూరంగా ఉండాలని, వ్యాయామం చేయాలని, సమతు ల ఆహారం తీసుకోవాలన్నారు. విభాగాధిపతి సుజాత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పీ.రాజమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
జ్ఞానానికి గమ్యస్థానం ఐకేఎస్ కేంద్రం
● ఎన్ఎస్యూలో ఐకేఎస్ కేంద్ర ప్రారంభం తిరుపతి సిటీ: ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే కేంద్రంగా ఇండియన్ నాలెడ్జ్ సెంటర్ (ఐకేఎస్) ప్రారంభించడం శుభపరిణామమని ఎన్ఎస్యూ చాన్సలర్ ప్రొఫెసర్ నీడా మంగళం గోపాలస్వామి పేర్కొన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీలో అతిథులు, వర్సిటీ అఽధికారులతో కలసి ఆయన ఐకేఎస్ కేంద్రాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి విజ్ఞాన, వైజ్ఞానికి అంశాలను అందించడమే ఐకేఎస్ లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. విదేశీయులకు సైతం వర్సిటీలోని ఐకేఎస్ కేంద్రం జ్ఞానానికి గమ్యస్థానం కావాలని ఆకాంక్షించారు. అనంతరం బ్రహ్మశ్రీ సహస్రావధాని, పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ మాట్లాడుతూ భారతీయ జ్ఞానపరంపరలో విశిష్ట పర్వం అవధానమని, అవధాన కళ విద్యార్థుల్లో స్మృతి శక్తిని, ప్రతిభాశక్తిని వర్ధింపజేస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ భారతీయ జ్ఞాన పరంపరంలోని అనేక వైజ్ఞానిక, మనోవైజ్ఞానిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, న్యూఢిల్లీ జాతీయ కోఆర్డినేటర్ గంటి సూర్యనారాయణమూర్తి, డీన్లు రజనీకాంత్, దక్షణమూర్తి శర్మ, ప్రొఫెసర్ శివ రామభట్, పీఆర్ఓ ప్రొఫెసర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
పడగల నీడన పరంథాముడు
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కళ్యాణ వేంకశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం కల్యాణ వేంకటేశ్వరస్వామి చిన్న శేష వాహనంపై శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నశేషునిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. విశేషాలంకార భూషితుడైన స్వామి వారు చిన్నశేషునిపై కొలువుదీరి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. చిన్న శేష వాహన సేవలో తరించిన భక్తుల గోవింద నామ స్మరణలతో తుమ్మలగుంట గ్రామం పులకించింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, ఆమె కుమారులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డితోపాటు చెవిరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి, మంజుల దంపతులు వాహన సేవల్లో పాల్గొన్నారు. హంస వాహనంపై మలయప్ప కల్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి హంస వాహనంపై స్వామివారు సరస్వతీ దేవిగా భక్తులను కటాక్షించారు. చెవిరెడ్డి కుమారులైన చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డిలు వాహనం మోసి తమ భక్తిని చాటుకున్నారు. గోవింద మాల ధరించిన ఆ ఇద్దరితో పాటు యువకులు గోవింద నామస్మరణలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ దేవతామూర్తుల వేషధారణలో కళాకారులు ఆకట్టుకున్నారు. అంతకు ముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఊంజల్ మండపంలో నిర్వహించిన ఊంజల్ సేవను భక్తులు వీక్షించి భక్తి సాగరంలో మైమరిచారు. ఆకట్టుకున్న కళా బృందాలు బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళా బృందాలు, భజన బృందాలు భక్తులను ఆకట్టుకున్నా యి. చిన్నశేష, హంస వాహన సేవలో పాల్గొన్న భక్తు లు స్వామిని దర్శించడంతో పాటు వాహనం ముందు వెళుతున్న కళాకారులు, భజన బృందాలను కళ్లా రా వీక్షించి భక్తి సాగరంలో మునిగారు. కోలాటాలు, చెక్కభజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
చూడతరమా అవస్థ
సభలు..సమావేశాలు..కూటమి డాంబికాలతో సామాన్య ప్రయాణికుడి అవస్థ చూడతరం కాలేదు. కూటమి సర్కారు తరచూ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను వాడుకుంటుండడంతో బస్సుల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా గమ్యస్థానాలకు చేరాల్సిన సగటు ప్రయాణికుడికి తిప్పలు తప్పడం లేదు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులతోపాటు రోజువారీ ప్రయాణికులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. తిరుపతి అర్బన్: ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలకు ఇష్టారాజ్యంగా ఆర్టీసీ బస్సులను వాడేస్తోంది. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు అడిగినన్ని ఆర్టీసీ బస్సులను పంపాల్సి వస్తుంది. దీంతో బస్సుల కొరతతో ప్రయాణికులు నానా తిప్పలు పడుతున్నారు. బుధవారం ఉదయం తిరుపతిలోని చదలవాడ కళాశాల సమీపం నుంచి 80కి పైగా ఆర్టీసీ బస్సులను డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులు విజయవాడలో సీఎం నుంచి నియామక పత్రాలు అందుకోవాలంటూ పంపించారు. దీంతో తిరుప తి బస్టాండ్తోపాటు జిల్లాలోని 11 డిపోల పరిధిలో బస్సుల కొరత తప్పడం లేదు. గంటల కొద్ది ప్రయాణికులు తమ ప్రాంతానికి చెందిన బస్సు ఎప్పుడు వస్తుందోనని వెయ్యికళ్లతో ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ముందే బస్సుల కొరత..దానికి తోడు తిరుమల బ్రహ్మోత్సవాలు అయినా ఆర్టీసీ బస్సులను విజయవాడకు పంపించేశారు. బస్సు ఆగిన వెంటనే ఫుల్.. బస్టాండ్లో బస్సు ఆగిన ఐదు నిమిషాల్లోనే ఫుల్ అయిపోతుంది. ఆయా ప్రాంతాలకు చెందిన ప్లాట్ఫామ్లకు బస్సు లు రాకముందే... బస్టాండ్ ప్రవేశ ద్వారం వద్దే ప్రయాణికులు ఎక్కేస్తున్నారు. ఫుల్ అయిన తర్వాతే ప్లాట్ఫామ్కు వస్తుంది. బస్సులో సీటు కథ దెవుడికెరుక..నిలబడడానికి కాస్త స్థలం ఉంటే చాలురా..బాబు అంటూ ప్రయాణికులు బస్సుల కోసం పరుగులు పెడుతున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి బస్టాండ్ నుంచి సాధారణ సమయంలోనే రోజుకు 1.50 లక్షల నుంచి 1.55 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీనికితోడు తిరుమల బ్రహ్మోత్సవాలు...మరోవైపు పల్లె వెలుగు బస్సులు ఉచిత బస్సు పథకానికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జిల్లాకు చెందిన బస్సులను ఇతర ప్రాంతాలకు పంపడం ద్వారా ప్రయాణికుల అగచాట్లు అన్నీఇన్నీకాదు....అయినా అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు మండిపడ్డారు. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆర్టీసీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
‘స్టూడెంట్ నెం–1’కు గోల్డ్ మెడల్!
కడప అర్బన్: జీవితఖైదు అనుభవిస్తున్న గునుకుల యుగంధర్ అనే ‘స్టూడెంట్ నెం–1’ డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చడంతో గోల్డ్మెడల్ వరించింది. ఈ సంఘటనపై కడప కేంద్ర కారాగారం అధికారులు, యుగంధర్తో ములాఖత్ అవడానికి వచ్చిన అతని తల్లి చెంగమ్మ, చెల్లెలు మేఘన తెలియజేశారు. కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న గునుకుల యుగంధర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ కనపరచడంతోపాటు మంచి ర్యాంకు సాధించడంతో అతనికి గోల్డ్ మెడల్కు ఎంపిక చేశారు. ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేషన్ బీఏ పొలిటికల్ సైనన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ వారిచే గోల్డ్ మెడల్, బుక్ ప్రైజ్ పొందారు. ఈనెల 30వ తేదీన హైదరాబాద్లో జరిగే 26వ స్నాతకోత్సవంలో పాల్గొని, మెడల్ పొందేందుకు అతనికి యూనివర్సిటీ నుంచి ఆహ్వానం లభించింది. ఇతనికి మొత్తం 8.02 జీజీపీఏ వచ్చింది. ప్రస్తుత తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం, జంగాలపల్లి నివాసి అయిన గునుకుల యుగంధర్ 2011 జూలై 18న హత్య కేసులో జీవిత ఖైదు విధించడంతో కేంద్ర కారాగారానికి వచ్చాడు. అప్పటి నుంచి ఓల్డ్ పాటర్న్లో రెండు బీఏలు, న్యూ పాటర్న్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబిఎస్సీ)లో రెండు బీఏలు, మూడు ఎంఏలు ఇంకా కంప్యూటర్ ట్రైనింగ్, కార్పెంటరీ ట్రైనింగ్, నాక్ స్కిల్ సర్టిఫికెట్లు పొందాడు. మూడేళ్లు పారా లీగల్ వలంటీర్గా పనిచేశారని కడప కారాగార అధికారులు తెలిపారు.నా బిడ్డకు క్షమాభిక్ష పెట్టండిహత్య కేసులో దాదాపు 20 సంవత్సరాల నుంచి జీవిత ఖైదును తన కుమారుడు యుగంధర్ అనుభవిస్తున్నాడని, అతని చెంగమ్మ, సోదరి మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల్లో గోల్డ్ మెడల్ సాధించాడని, కారాగారంలో సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని అధికారులు, ప్రభుత్వం తమ ఆవేదన గుర్తించి, తన బిడ్డను క్షమాభిక్ష పెట్టి, విడుదల చేయాలని కోరారు. కడప కారాగారానికి ములాఖత్కు వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. తమకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడని ఖైదీ తల్లి చెంగమ్మ తెలిపారు. కుమారుడైన యుగంధర్ తెలిసో తెలియక హత్య చేశాడని, ఆ నేరానికి 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారని, ఇప్పటికైనా క్షమాభిక్ష ప్రసాదించి, తన కుమారుడిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. -
విపంచి ధరించి.. విహరించి..
పాలకడలిపై తేలియాడే శేషుడు తిరువీధులకు తరలివచ్చాడు. ఆపద మొక్కుల వాడికి వాహనమయ్యాడు. శ్రీహరి చిద్విలాసంగా విహరించాడు. రాయంచ సింహసం కాగా శ్రితపరిపాలకుడు వీణాపాణి ధరించి, విహరించాడు. వివేచన బోధించాడు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం చిన్న శేష, హంస వాహనాలపై మలయప్పస్వామి విహరించారు. ఈ వాహనసేవల్లో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. – తిరుమలచిన్న శేష వాహనంపై మలయప్ప స్వామి -
జాబ్ మేళా రేపు
తిరుపతి అర్బన్: తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని డాక్టర్ ఆర్సీ రెడ్డి డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నా మని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందన్నారు. తిరుపతి నగరంతోపాటు ఈఎంసీ క్లస్టర్, శ్రీసిటీ, చైన్నెలోని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొంటారని చెప్పారు. ఇంటర్వ్యూలకు వచ్చే యువతీయువకులు శుక్రవారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నైపుణ్యం.ఏపీ.జీవోవీ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. అదనపు సమాచారం కోసం 7013509543, 9988853335 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. బీఎన్కండ్రిగ ఏఎంసీ చైర్మన్ రిజర్వేషన్ మార్పుపై స్టే వరదయ్యపాళెం: బీఎన్కండ్రిగ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సంబంధించి రిజర్వేషన్ మార్పు చేసిన ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ హైకోర్టు స్టే విధించింది. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించిన గిరిజన రైతు వై.సురేంద్ర ఈ వివరా లను వెల్లడించారు. బీఎన్కండ్రిగ మార్కెట్ కమి టీ చైర్మన్ పదవిని గిరిజన విభాగానికి రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయి తే ఆ రిజర్వేషన్ను కూటమి పెద్దల సహకారంతో మార్పు చేసి, జనరల్ మహిళకు కేటాయించారు. ఆ మేరకు బీఎన్కండ్రిగ మండలానికి చెందిన టీడీపీ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు సతీమణి మావిళ్లపల్లి జ్యోతిని చైర్మన్గా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కేవీబీపురం మండలం కోవనూరు గ్రామానికి చెందిన గిరిజన రైతు వై.సురేంద్ర హైకోర్టును ఆశ్రయించి గిరిజన రిజర్వేషన్ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీనిపై స్పందించిన హైకోర్టు రిజర్వేషన్ మార్పు విధానాన్ని తప్పుపడుతూ స్టే విధించినట్లు ఆయన తెలిపారు. సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోండి రేణిగుంట: పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా రూ.10 లక్షల సబ్సిడీతో ఏర్పాటు చేసిన అప్పడాల తయారీ ఫ్యాక్టరీని గురువారం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిన్న రెడ్డెయ్య ప్రారంభించారు. అలాగే రూ.30 లక్షల రుణం అందజేశారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ యువతీ,యువకులు ప్రభుత్వ సబ్సిడీ రుణాలను వినియోగించుకోవాలన్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించి, మరికొందరికి ఉపాధి కల్పించాలి అని సూచించారు. -
తప్పిపోయిన భక్తులు అప్పగింత
తిరుమల: తిరుమలలో తప్పిపోయిన ముగ్గురు భక్తులను పోలీసులు డిజిటల్ జియోటాక్ సహకారంతో సురక్షితంగా పట్టుకుని, బంధువులకు అప్పగించారు. వివరాలు.. తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నంద్యాలకు చెందిన పీ.మోహిత్రెడ్డి(14), ప్రకాశం జిల్లాకు చెందిన పీ.నరసింహరావు(52), తమిళనాడులోని ఈరోడ్కు చెందిన మారుతి(70) తప్పిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు డిజిటల్ జియోటాక్ టెక్నాలజీ సహాయంతో వారిని సురక్షితంగా పట్టు కున్నారు. ఆపై వారి తల్లిదండ్రులు వెంకటసుబ్బ మ్మ, ఎం.నారాయణ, మణికి అప్పగించారు. భక్తుల భద్రత మా బాధ్యత భక్తుల భద్రత మా బాధ్యతని, వారి భద్రత కోసం చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. భక్తులు ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో భక్తుల భద్రత మరింత బలోపేతం అవుతుందన్నారు. భవిష్యత్లో కూడా భక్తుల కోసం మరిన్ని సరికొత్త సదుపాయాలు అందించడానికి జిల్లా పోలీసులు కృషి చేస్తారని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 7 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 58,628 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,551 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.01 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో తిరుమలేశుని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలి గిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
జగన్పై కక్ష.. చిన్నారులకు శిక్ష
తిరుపతి తుడా : తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి చిన్నపిల్లలును కాపాడి ఆరోగ్యవంతమైన భావితరాన్ని ఆవిష్కరించేందుకు తిరుపతి లో శ్రీవారి పాదాల చెంత అలిపిరి సమీపంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పించారు. రాష్ట్రంలో చిన్న పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని అందించే ఆసుపత్రి ఇప్పటి వరకు లేదు. ఆ లోటును అధిగమిస్తూ మొత్తం 15 రకాల ప్రత్యేక విభాగాల సామర్థ్యంతో అత్యాధునిక వైద్య సేవలను అందించాలని భావించారు. ఈ ఆసుపత్రి తన మానస పుత్రికగా ప్రకటిస్తూ 2022 మే 5వ తేదీన శ్రీవారి పాదాల చెంత అలిపిరి సమీపంలో భూమి పూజ చేశారు. రెండేళ్ల లో భవన నిర్మాణాలు పనులు పూర్తి చేసుకుని, వైద్య పరికరాలు కొనుగోలు, సిబ్బంది నియామకం ప్రక్రియ పూర్తి కావాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఇందుకు తగ్గట్టే 2024 జూలైలో ఆసుపత్రిని ప్రారంభించేలా టీటీడీ సైతం యుద్ధ ప్రాతిపాదికన పనులను దాదాపుగా పూర్తి చేసింది. 15 విభాగాలతో ... చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 15 విభాగాలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలానే అవయవ మార్పిడి, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం భవనంపై హెలీప్యాడ్ను నిర్మించాలని, ఆ దిశగా డిజైన్ చేశారు. ఈ ఆసుపత్రిలో చిన్నపిల్లల కార్డియాలజీ, న్యూరాలజీ ,న్యూరో సర్జరీ, పల్మనాలజీ, ఆర్థో, ఆంకాలజీ వంటి మొత్తం 15 ప్రత్యేక విభాగాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. అత్యాధునిక ఐసీయూ, ఆర్ఐసీయూ, 8 ఆపరేషన్ థియేటర్లు, ఎంఆర్ఐ, సిటీ యంత్రాలు, ఆధునిక ల్యాబ్ ఉండేలా ప్రణాళికలు చేశారు. పాలక మండలిలో భిన్నాభిప్రాయాలు ఈ ఆస్పత్రి పూర్తి చేసే విషయంలో టీటీడీ పాలక మండలి వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పాలకవర్గ అధిపతిగా ఉన్న వ్యక్తితో పాటు మరో నలుగురు ఆస్పత్రి పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల భారం టీటీడీ ఎందుకు భరించాలంటూ ఆ ఐదుగురు ఆసుపత్రిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఆసుపత్రి నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ బురదజల్లి ఆసుపత్రిని అడ్డుకుందామంటూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ మంది బోర్డు సభ్యులు వైద్యం కోసం టీటీడీ ఎంత ఖర్చు పెట్టినా తప్పేమీ లేదని, ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన ఆసుపత్రి కాబట్టి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పునః ప్రారంభించేలా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ కుండలు బద్దలు కొడుతున్నారు. అయినా ఆ వ్యక్తి మనసు కరగకపోవడంపై బోర్డు సభ్యులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రిని పూర్తి చేయకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత తప్పదని, దేవుడితో సమానమైన చిన్న పిల్లల విషయంలో మీనమేషాలు లెక్కించడం మంచిది కాదని జిల్లాకు చెందిన కొంతమంది టీటీడీ బోర్డు సభ్యులు తెగేసి చెప్పినా ఆ వ్యక్తి మాత్రం వినీ విననట్లు వదిలేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్నపిల్లల ఆసుపత్రి విషయంలో ఇంతలా పట్టుబట్టడం మంచిది కాదని టీటీడీ అధికారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు కాకుండా అడ్డుపడి..ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభించారు. అంతే వేగంగా పనులు చకచకా సాగిపోయా యి. అంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నిధులతో 2024 చివర వరకు పనులు కొనసాగాయి. టీటీడీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది. టీటీడీలో నిర్మిస్తున్న పలు భవనాలను సందర్శించింది. ఈ క్రమంలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని సందర్శిస్తూ టీటీడీకి ఇంత భారం అవసరమా అంటూ పాలకవర్గంలోని ఓ ముఖ్యమైన వ్యక్తి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే కొంత మంది బోర్డు సభ్యులు కలగజేసుకొని చిన్న పిల్లల వైద్యం కోసం టీటీడీ ఖర్చు చేయడం ఏ మాత్రం తప్పు కాదని, పనులు పూర్తి చేయకపోతే చెడ్డపేరు వస్తుందని ఆ వ్యక్తికి సూచించారు. భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ సమయంలో ఆసుపత్రిని అర్ధాంతరంగా వదిలేస్తే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదని ఒకరిద్దరు బోర్డు సభ్యులు హెచ్చరించారు. ఆ ముఖ్యమైన వ్యక్తి అయిష్టంగానే అంగీకరించినా ఆపై తన వక్రబుద్ధిని ప్రదర్శించారు. ఆసుపత్రి నిర్మాణానికి ఎక్కువ నిధులు కేటాయించారంటూ నిధులు మంజూరు కాకుండా అడ్డు పడ్డారు. గడిచిన ఏడెనిమిది నెలలుగా నిధులు మంజూరు చేయకుండా చక్రం తిప్పారు. దీంతో పనులను అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆసుపత్రి పేరు : శ్రీ పద్మావతి చిన్నపిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ నిర్వహణ బాధ్యత : టీటీడీ వైద్య సేవలు : పూర్తిగా ఉచితం ఆసుపత్రి నిర్మాణ వ్యయం : రూ.320 కోట్లు ఆస్పత్రి విస్తీర్ణం : 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగులు అంతస్తులు : ఆరు బెడ్ల సామర్థ్యం : 350 ఆసుపత్రిలో విభాగాలు : మొత్తం 15 ఆసుపత్రి ప్రత్యేకత : అత్యవసర వైద్య సేవలు కోసం భవనంపైనే హెలిప్యాడ్ నిర్మాణంఇదీ అప్పటి సీఎం వైఎస్ జగన్ మాట ‘రాష్ట్రంలో చిన్న పిల్లలు ఎవరూ ఖరీదైన వైద్యం అందక మృతి చెందకూడదు. తన బిడ్డను అనారోగ్యం నుంచి కాపాడుకోలేకపోయాను అన్న బాధ ఏ తల్లి పడకూడదు. భావితరాల యువతను ఆరోగ్యంగా అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుంది. ఖరీదైన వైద్యం ఉచితంగా అందించే బాధ్యత తీసుకుంటున్నాం. ఎంత ఖర్చైనా , ఎలాంటి వ్యాధి అయినా సరే పిల్లలను రక్షించుకోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాధ్యత. అనారోగ్య సమస్యతో ఏ ఒక్కరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలతో చిన్నపిల్లల కోసం శ్రీ పద్మావతి చిన్నపిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. రెండేళ్లలో ఈ ఆసుపత్రి ప్రారంభించుకొని పిల్లలకు పునర్జన్మను ప్రసాదించే దేవాలయంగా కొనసాగుతుంది’ అని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్ఘాటించారు.కార్డియాక్ సెంటర్తోనే ప్రేరణఅభం శుభం తెలియని పసిపిల్లలు గుండె సమస్యతో బాధపడుతూ మృత్యువాత పడుతున్న విషయాన్ని గుర్తించిన నాటి సీఎం వైఎస్ జగన్ తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ కేర్ సెంటర్ను 2022లో ప్రారంభించారు. ఈ ఆసుపత్రి అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. వేల మందికి గుండె సంబంధిత సమస్యలను పరిష్కరించి పిల్లల పాలిట సంజీవినిగా మారింది. ఇప్పటి వరకు 20 మందికి గుండె మార్పిడి చికిత్సలను విజయవంతంగా అందించింది. పొరుగు రాష్ట్రాల నుంచి కాక బంగ్లాదేశ్ నుంచి సైతం వచ్చి ఇక్కడ గుండె సంబంధిత వైద్య సేవలను ఉచితంగా పొందారు. ఈ ఆసుపత్రి పురు డు పోసుకున్న అనతి కాలంలోనే సత్ఫలితాలు వచ్చాయి. ఇదే ప్రేరణతో చిన్న పిల్లలకు గుండె సంబంధిత వైద్యమే కాదు మొత్తం 15 రకాల ప్రత్యేక విభాగాలతో ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమని భావించారు. ఈ బాధ్యతను టీటీడీకి అప్పగించారు. చక చకా అనుమతులు పొంది 2022 మే 5వ తేదీన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. వైఎస్ జగన్కు పేరొస్తుందనే.. నాటి సీఎం వైఎస్ జగన్ తన మానస పుత్రికగా ప్రకటించి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పట్టాలెక్కించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విధంగా ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలతో ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తే వైఎస్ జగన్కు పేరొస్తుందనే అక్కసుతోనే పనులను కొనసాగించకుండా నేటి ప్రభుత్వంలోని కూటమి నేతలు అడ్డుకట్ట వేశారు. ఆసుపత్రిని పూర్తి చేయకుండా కాకమ్మ కథలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు.నిధులు మంజూరు చేయకుండా పనులను కొనసాగకుండా టీటీడీ బోర్డులోని ముఖ్యమైన వ్యక్తి అడుగడుగునా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితమే ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉండగా మరో రెండేళ్ల పాటు సాగదీసి ఆపై నిర్ణయం తీసుకునేందుకు కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.