Tirupati
-
తిరుమలలో మహిళ అదృశ్యం
సాక్షి, తిరుమల: తిరుమలలో ఓ మహిళ అదృశ్యం ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సదరు మహిళను గుంటూరుకు చెందిన లక్ష్మీ తిరుపతమ్మగా గుర్తించారు. కాగా, ఆమెకు ఇటీవలే పెద్దలు వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వివరాల మేరకు.. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ (27) కుటుంబం సోమవారం తిరుమల దర్శనానికి వెళ్లారు. వీరంతా తిరుమలలో HVC 694-A గదిలో ఉన్నారు. అనంతరం, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో లక్ష్మీ తిరుపతమ్మ గది నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంతసేపటికీ ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఉదయం 7 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే ఆమెకు పెద్దలు వివాహం నిశ్చయించారు. అయితే, వివాహం ఇష్టం లేక తిరుపతమ్మ వెళ్లినట్లు అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇక, స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సదరు మహిళను గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆమె ఫొటోను విడుదల చేశారు. -
రోడ్డు సగం వేసి వదిలేశారు!
● ఓ యువకుడు వినూత్నశైలిలో నిరసన సైదాపురం: సైదాపురం –పొదలకూరు రహదారి సగం వేసి వదిలేశారని ఎస్పీఎఫ్ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో సోమవారం కలిచేడు బస్టాండ్ వద్ద నులక మంచం వేసుకుని ఆ సంస్థ వ్యవస్థాపకుడు షఫీహరన్ వినూత్నశైలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన సైదాపురం మండలం కలిచేడులో చోటు చేసుకుంది. ఈ విషయం సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తోంది. అయినా సంబంధిత ఆర్అండ్ బీ శాఖ అధికారులు పట్టించుకునే పాపాన పోలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుమ్మడి వీరాస్వామి పాల్గొన్నారు. కల్యాణి డ్యామ్లో రెండో రోజు గాలింపు చంద్రగిరి: కల్యాణి డ్యామ్లోకి దూకి గల్లంతైన పుంగనూరుకు చెందిన మురళి ఆచూకీ కోసం పోలీసులు సోమవారం కూడా ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక రెస్క్యూ టీమ్ డ్యామ్లో జల్లెడ పట్టింది. ఎస్ఐ అరుణాచలం ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్ బృందం ద్వారా గాలించడంతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా మురళీ ఆచూకీ కోసం ముమ్మరం గాలించినా ఫలితం దక్కలేదు. మంగళవారం కూడా గాలింపు చర్యలను చేపట్టనున్నట్లు ఎస్ఐ అరుణాచలం తెలిపారు. లారీని ఢీకొని స్కూటరిస్ట్ మృతి పాకాల: ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి స్కూటరిస్ట్ ఢీ కొనడంతో స్కూటరిస్ట్ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి పాకాల మండలంలో సోమవా రం చోటు చేసుకుంది. పోలీసు ల కథనం మేరకు.. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిలోని నేండ్రగుంట వద్ద చిత్తూ రు నుంచి తిరుపతి వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి స్కూటర్పై వెళుతున్న ఎం.హరీష్(30) ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అన్నమయ్య జిల్లా కలికిరి మండలం తుమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప కుమారుడిగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగమంజుల తెలిపారు. -
వైఎస్సార్ సీపీలో టీడీపీ నాయకుల చేరిక
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కొత్తపాళెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు సుధాకర్రెడ్డి, మనోహర్రెడ్డి, రాజా సోమవారం సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారితోపాటు వారి అనుచరులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి పాలన నచ్చక వైఎస్సార్సీపీలో చేరుతున్నామని పార్టీలో చేరిన నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మణినాయుడు, ప్రధాన కార్యదర్శి గోపాల్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గురునాథం, వైస్ ఎంపీపీ మునికృష్ణారెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, హరి, తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటిన జిల్లా విద్యార్థులు
తిరుపతి సిటీ: ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాలు సోమ వారం రాత్రి ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సుమారు 345 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్లు సమాచారం. ప్రైవేటు కళాశాలల హవా జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాల్లో జిల్లాలోని ప్రైవేటు కళాశాలల హవా కొనసాగింది. తిరుపతి ఎంఆర్ పల్లిలోని నారాయణ ఐఐటీ అకాడమీ విద్యా ర్థి ఎన్.మహిత్ జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరిలో 21వ ర్యాంక్ సాధించారు. వెల్దుర్థి హర్షిత్ 64, అన్వి వసంత్ 117 ర్యాంకులు సాధించారు. అలాగే ఆ సంస్థ నుంచి వందలోపు రెండు, వెయ్యి లోపు నాలుగు, రెండు వేలలోపు ఆరు, ఐదువేల లోపు పదకొండు ర్యాంకులు, పది వేలలోపు 16 ర్యాంకులు ఒక్క ఓపెన్ కేటగిరీలోనే సాధించడం గర్వకారణమని డీజీఎం కొండలరావు హర్షం వ్యక్తంచేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ చైతన్య విద్యార్థి జాతీయ స్థాయిలో టీవీఎస్ శర్మ ఈడబ్ల్యూసీ కేటగిరీలో 34వ ర్యాంక్ సాధించాడు. వీరితో పాటు శ్రీ చైతన్య విద్యార్థులు వెయ్యిలోపు నాలుగు, రెండు వేల లోపు 8, ఐదు వేల లోపు 15 ర్యాంకులు కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు సుష్మశ్రీ, నాగేంద్ర, ఏజీఎం బీవీ ప్రసాద్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. -
ప్రైవేటు బస్సు ఢీకొని వ్యక్తి మృతి
తిరుపతి రూరల్: పూతలపట్టు–నాయుడుపేట ఆరు వరుసల జాతీయ రహదారిపై తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవేపై వకుళమాత గుడి సమీపంలోని సర్కిల్ వద్ద తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామానికి చెందిన యుగంధర్ చౌదరి (53), తన హోండా యాక్టివాపై కొత్త చెర్లోపల్లి బైపాస్ రోడ్డు నుంచి ప్రయాణిస్తూ వకుళమాత గుడి వైపునకు మలుపు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అతని వెనుకనే చిత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న భారతి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. బస్సు ముందు భాగంలో స్కూటర్ చిక్కుకుని కొంత దూరం ఈడ్చుకురావడంతో స్కూటర్ నడుపుతున్న యుగంధర్ చౌదరి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా మృతుని బంధువులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇసుక ట్రాక్టర్ల సీజ్తొట్టంబేడు: శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం పోలీసులు రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. వారికి అందిన రహస్య సమాచారంతో దాడులు చేసి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఆధ్యాత్మికతతో సమాజంలో మార్పు తిరుపతి కల్చరల్: ఆధ్యాత్మికతతో సమాజ మార్పుకు శ్రీకారం చుట్టిన మహనీయులు శ్రీరామానుజాచార్యులు అని తిరుమల చిన్నజీయర్ స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం శ్రీరామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ప్రారంభించిన చిన్నజీయర్ స్వామి అనుగ్రహభాషణం చేశారు. భగవంతుడు అందరివాడని, సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వ భావనతో జీవించాలనే సందేశాన్ని శ్రీరామానుజాచార్యులు ఇచ్చారన్నారు.ఆయన ప్రచారం చేసిన విశిష్టాద్వైత తత్వం భక్తి, జ్ఞానం, సేవ మార్గాలను కలిపి సమాజానికి దిశానిర్దేశం చేసిందన్నారు. అనంతరం హైదరాబాద్కు చెందిన పరకాలన్ ‘శ్రీరామానుజాచార్యులు– వైభవం అనే అంశంపై ప్రసంగించారు. ఆ తర్వాత తిరుపతికి చెందిన సరస్వతి ప్రసాద్ బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులకు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ పురుషోత్తం, భక్తులు పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 76,406 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,463 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.45 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. పోలీస్ గ్రీవెన్స్కు 94 అర్జీలు తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే అర్జీలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. టీటీడీకి రూ.కోటి విరాళం తిరుమల: హైదరాబాద్కు చెందిన వైకేబీ మల్లికార్జునరావు అనే భక్తుడు టీటీడీకి రూ.కోటి విరాళమిచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సోమవారం శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, ప్రాణదాన ట్రస్టుకు రూ.25 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు, విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షల చొప్పున విడివిడిగా విరాళం డీడీలను అందించారు. 24 నుంచి జూనియర్ కళాశాలలకు సెలవులు తిరుపతి సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలకు ఈనెల 24 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జూన్ ఒకటో తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులలో ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. -
చెవి కమ్మల కోసం వృద్ధురాలి హత్య
తిరుపతి క్రైం : ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలు హత్యకు గురైన ఘటన తిరుపతి రూరల్ మండలంలో వెలుగు చూసింది. చెవి కమ్మల కోసమే ఇద్దరు నిందితులు కలిసి వృద్ధురాలిని హతమార్చినట్లు తేలింది. ఈ వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సోమవారం పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు వెల్లడించారు. అవిలాల పంచాయతీ అంబేడ్కర్ కాలనీలో నివసిస్తున్న 78 ఏళ్ల వృద్ధురాలు ఎన్.పాపమ్మను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి హత్య చేసి ఆమె చెవులకు ఉన్న సుమారు రూ.60 వేలు విలువైన బంగారు కమ్మలను అపహరించారు. ఆదివారం ఉదయం హత్య ఘటన వెలుగులోకి రావడంతో చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తిరుపతి రూరల్ సీఐ కె.మద్దయ్యాచారి ఆధ్వర్యంలో ఎస్ఐ లోకేష్ కుమార్, సిబ్బంది అనుమానితులు జి.శ్రీనివాసులు (40), జి.శోభ (30)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పాపమ్మ ఒంటరిగా ఉండడాన్ని గమనించి కమ్మల కోసం హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. హత్య అనంతరం కమ్మలను రూ.31 వేలుకు పచ్చికాపల్లం గ్రామంలోని ఒక దుకాణంలో కుదువ పెట్టారని, దొంగ వస్తువులు అని తెలిసినా వాటిని తీసుకున్న దుకాణ యజమాని భూపేంద్ర పటేల్ను కూడా అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వివరించారు. కేవలం 24 గంటల్లో వృద్ధురాలి హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన తిరుపతి రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. -
దోపిడీపై విచారణ జరిపించాలి
రాహు–కేతు పూజల్లో ఉచిత సేవ వ్యక్తుల దోపిడీపై విచారణ జరిపి, ఆ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. భక్తులను నిలువుదోపిడీకి గురిచేయడం సరికాదు. ఆలయంలోని వెండి నిల్వలపై పాలకమండలి, ఆలయాధికారులు శేతపత్రం విడుదల చేయాలి. భక్తులకు పసుపు దారాలు అంటగడుతున్న దళారుల మోసం అరికట్టాలి. – చిట్టివేలు జయగోపాల్, ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు వెండి నాగపడగలతో పూజలు చేయాలి స్థానికుల కోసం రూ.వంద కు రాహు కేతు పూజలు చేయడం అనేది మంచి పరిణామమే. కానీ నాగ పడగలు లేకుండా సర్పదోష నివారణ పూజలు చేయడం మంచిది కాదు. అయితే దీనిని ఆలయంలో ఉండే వేద పండితులు సూచించకపోవడం బాధాకరం. నాగ పడగలు లేకుండా చేసే పూజ మంచిది కాదు. వెండి నిల్వపై శ్వేత పత్రం విడుదల చేయాలి. – మున్నా రాయల్, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు -
మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ శాతం పెంచండి
తిరుపతి అర్బన్: మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ శాతా న్ని పెంచాలని డీఆర్వో నరసింహులు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్నాయక్, రోజ్మాండ్తో కలసి వీడియో కాన్ఫరెన్స్లో ఏడు నియోజకవర్గంలో ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రంలో అధికారులు, బూత్ లెవల్ అధికారులు మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ శాతాన్ని పెంచాలని స్పష్టం చేశారు. అయితే 10 శాతం కన్నా తక్కువ చేసిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అయినప్పటికి తక్కువ శాతం ఉంటే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
చిన్నారి మృతితో చీపినాపిలో విషాదం
కలువాయి(సైదాపురం): గుండెవ్యాధితో బాధపడుతున్న చిన్నారి మృతితో చీపినాపిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కలువాయి మండలం చీపినాపి అరుంధతివాడకు చెందిన గార్లపాటి మహేంద్ర, నాగమ్మల కుమార్తె చరీష్మ (7) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఈ బాలిక గత కొంత కాలంగా గుండె వ్యాధితో బాధపడుతూ సోమవారం ఉదయం నెల్లూరులోని ఆస్పత్రిలో మృతి చెందింది. అభం, శుభం తెలియని చిన్నారి మృతితో గ్రామంలో విషాధం నెలకొంది. విషయం తెలుసుకున్న కలువాయి ఎంఈఓ–2 జనార్దన్రెడ్డి పాఠశాల సిబ్బంది చీపినాపిలో విద్యార్థి అంత్యక్రియలకు హాజరై వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
విద్యార్థులకు గుక్కెడు నీళ్లివ్వలేరా?
తిరుపతి రూరల్: ‘ప్రభుత్వ పాఠశాలల్లో గుక్కెడు మంచినీళ్లు దొరక్క విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు బాటిళ్లలో తెచ్చుకుని, మరికొందరు కొళాయి నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నారు. ఇదేనా మీరు అందించే మంచి పాలన? సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేయడమే విద్యాశాఖా మంత్రి లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు. పిల్లలకు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో పరిపాలన సాగిస్తున్నారంటేనే అర్థమవుతోంది.. పేద పిల్లలపై వారికి ఎంత ప్రేమ ఉందోనని, ఏసీ గదులు, కార్లలో నుంచి బయటకు వెచ్చి కళ్లు తెరచి చూస్తే నీటి కోసం పిల్లలు పడుతున్న బాధలు కనిపిస్తాయి.’ అని రాష్ట్ర వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు ఓబుల్రెడ్డి విమర్శించారు. తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి విభాగం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తాగునీటి కష్టాలు తీర్చాలని, నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి విభాగం చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు చంగల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో గుక్కెడు నీళ్ల కోసం పిల్లలు ఇబ్బంది పడుతుంటే నీరు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. -
ఈఎస్ఐకి అంబులెన్స్ వితరణ
తిరుపతి సిటీ: రాయలసీమ, నెల్లూరు జిల్లాల కార్మికులకు వైద్యసేవలు అందిస్తున్న వంద పడకల తిరుపతి కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ)ఆస్పత్రికి సోమవారం అత్యాధునిక అంబులెన్స్ను విజయవాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు మాట్లాడుతూ ఎస్బీఐ సంస్థ సుమారు రూ.30 లక్షల విలువచేసే అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అందించడం అభినందనీయమన్నారు. అంబులెన్స్ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర కార్మిక మంత్రి సుభాష్, కార్మిక శాఖ కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు, డైరెక్టర్ ఆంజినేయులు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్ఎంఓ డాక్టర్ సీహెచ్ జయంతి, వైద్యులు, ఎస్బీఐ అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చిట్వేలి: స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కే సుధాకర్ రాజు (56) సోమవారం మధ్యాహ్నం రాజంపేట నుంచి చిట్వేలికి వస్తూ చెరువుకట్టపై మోటారు బైక్ డివైడర్ను ఢీ కొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కానిస్టేబుల్ సుధాకర్ రాజు మృతికి రైల్వేకోడూరు సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ వినోద్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే.. నోరు అదుపులో పెట్టుకోవాలి – చంద్రగిరి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు పాకాల: అధికారంలో ఉన్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోవాలని, ప్రతిపక్షంలో ఉన్న వారిని అమర్యాదగా మాట్లాడడం సరి కాదని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు హితవు పలికారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్రెడ్డిపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో జయదేవనాయుడుతోపాటు మండల కన్వీనర్ నంగా నరేష్రెడ్డి, ఎంపీపీ పి.లోకనాథం తదితరులు మాట్లాడారు. మోహిత్రెడ్డిపై పులివర్తి నాని ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఆయన విజ్ఞతకే వదలి వేస్తున్నామన్నారు. మోహిత్రెడ్డికి ఉన్న ఆదరణ చూసి ఎన్నికల ముందు పులివర్తి విషం చేత పట్టుకుని ప్రతీ ఇంటికీ వెళ్లి తనను గెలిపించకపోతే విషం తాగి చస్తా! అని ప్రచారం చేయడం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన తనయుడు మోహిత్రెడ్డి మండలాన్ని, నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసునన్నారు. ప్రత్యేకించి కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పార్టీలకతీతంగా ఇంటింటికీ పౌష్టికాహారం, మందులు, నిత్యావసర సరుకులు అందజేశారని, మరి ఆనాడు ఎక్కడ దాక్కున్నావు నానీ? అని నిలదీశారు. ప్రతి పంచాయతీని కోట్లాది రూపాయలతో చెవిరెడ్డి అభివృద్ధి చేశారని ఆ పనుల గురించి వివరించారు. సాక్షాత్తు పులివర్తి నాని సొంత పంచాయతీ ఆదినపల్లెలో కూడా రూ. కోటీ ముప్పై లక్షలతో అభివృద్ధి చేశారని, అధికారంలోకి వచ్చాక బెంచీలు పగల గొట్టడం, శిలాఫలకాలు ధ్వంసం చేయడం కాకుండా పేదలకు మంచి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రహీం, నంగా కపిలేశ్వర్రెడ్డి, జయచంద్రరెడ్డి, బాబురెడ్డి, గిరిధర్రెడ్డి, అన్నాబాబు, మునిరత్నంరెడ్డి, వనజ, మాధవనాయుడు, అర్జునయ్య, రుకేష్, చంటి, సుధాకర్, యశ్వంత్రెడ్డి, బంగారు గోపి, నాని, అశోక్, ఆంథోని, నిత్యానంద, కుమార్ పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కి వినతుల వెల్లువ
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. తిరుపతి కలెక్టరేట్కు సోమవారం కూడా అర్జీదారులు క్యూకట్టారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 301 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపైనే 176, పోలీస్శాఖకు 23, పింఛన్ల కోసం 20, విద్యా సంస్థల సమస్యలపై 15, మున్సిపల్ శాఖకు 10. పంచాయతీ రాజ్కు 9, హెల్త్ డిపార్ట్మెంట్కు 5 చొప్పున విభాగాల వారీగా అర్జీలను డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, శివశంకర్నాయక్, అనురాధ, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి అర్జీలను స్వీకరించారు. వెంకటాపురంలో పశువుల మేత భూమి ఆక్రమణ రేణిగుంట మండలంలోని వెంకటాపురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 270–1లో 94 సెంట్లు, 270–7లో 19 సెంట్లు పశువుల మేతకు చెందిన భూమిని ఆర్.అన్నపూర్ణ అనే మహిళ తన పేరున ఆన్లైన్ చేయించుకోవాలని చూస్తున్నారని స్థానికులు సోమవారం కలెక్టరేట్లో డీఆర్వో నరసింహులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపడతామని, ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకుంటామని డీఆర్వో వారికి వివరించారు. 99 శాతం వైకల్యం తమ బిడ్డ ఆదిత్య(13)కు 99శాతం వైకల్యం ఉందని, రెండేళ్లుగా పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చట్టు తిరుగుతున్నా పింఛన్ అందలేదని దివ్య, ధర్మయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పీజీఆర్ఎస్లో అధికారులకు అర్జీ అందజేశారు. కాగా తమ బిడ్డ యశస్వినీ మంచానికే పరిమితం అయ్యిందని ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నందున వైద్యం ఖర్చులు నెలకు రూ.16 వేలకు పైగా అవుతుందన్నారు. తమ బిడ్డకు రూ.15వేలు పింఛన్ ఇప్పిస్తే వైద్యం చేయించుకుంటామని వేడుకున్నారు. మా బడిని మా ఊరిలోనే ఉంచండి మా ఊరిలోని బడిని మా గ్రామంలోనే ఉంచాలని ఓజిలి మండలం ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో వాసులు కోరారు. 200 కుటుంబాలున్న తమ గ్రామంలో అధిక శాతం మంది కూలి పనులు చేసుకుంటున్నామన్నారు. తమ గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 30 మంది పిల్లలు ఉన్నారన్నారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మా పాఠశాలలోని 3,4,5 తరగతులను రెండు కిలోమీటర్ల దూరంలోని ఓజిలిలో కలుపుతున్నట్లు తెలిపారన్నారు. రెండు కిలోమీటర్లు చిన్న పిల్లలు వెళ్లిరావడం కష్టమని, మా బడిని మా గ్రామంలోనే ఉంచాలని ఆ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు అర్జీని అందించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును వెనుక్కి తీసుకోవాలని లేదంటే దాడి చేస్తామని బెదిరిస్తున్నారంటూ గిరిజన నవ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివశంకర్నాయక్ వెల్లడించారు. ఆ మేరకు సోమవారం కలెక్టరేట్లో అధికారులకు ఓ వినతిపత్రం అందజేశారు. -
పల్లె తడబడి
తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు నిర్మాణమవుతుందనేది పెద్దల మాట. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన సర్కారు విద్యావ్యవస్థ బాబు పాలనలో నిర్వీర్యమవుతోంది. బాబు ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలలకు సవాలుగా మారుతున్నాయి. సర్కారు స్కూళ్లను బలోపేతం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న విద్యామంత్రి మాటలకు క్షేత్రస్థాయిలో పాఠశాలల పరిస్థితికి పొంతన కుదరడం లేదు. ఏది ఏమైనప్పటికీ కూటమి చర్యలతో విద్యారంగం కునారిల్లుతోంది.వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరు పిల్లలతో ఉపాధ్యాయులు కాలయాపన చేస్తున్నారు. ఆ దిశగా సత్యవేడు మండలంలో చిన్నఈటిపాకం ఈస్ట్, రంగనాథపురం, గొల్లపాళెం, పీవీపురం ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికే ఆంబాకం ప్రాథమిక తమిళ పాఠశాల పిల్లలు లేక మూతపడింది. అలాగే వరదయ్యపాళెం మండలంలో రామలింగాపురం, సీఎల్ఎన్పల్లి (హెచ్డబ్ల్యూ), తొండూరు (హెచ్డబ్ల్యూ), విఠయ్యపాళెం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో సైతం ఒకరిద్దరు పిల్లలతో నెట్టుకొస్తున్నారు. తగ్గుతున్న ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయనేందుకు పై పరిస్థితులే నిదర్శనం. ఇందుకు ప్రధాన కారణం విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే. అంతేకాక గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపి, నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. నేడు ఆ పథకానికి స్వస్తి పలికి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీని కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు పిల్లలు వెనకడుగు వేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ప్రైవేటు స్కూళ్లకు తమ పిల్లలను పంపేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా ప్రభుత్వ పాఠశాలల మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా రానున్న విద్యా సంవత్సరానికి ఒకరిద్దరు పిల్లలతో కొనసాగుతున్న పాఠశాలలు పదుల సంఖ్యలో మూతపడే పరిస్థితులు దాపరించనున్నాయి. -
సాక్షి పత్రికలో వచ్చిన కథనం అందజేత
ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను సాక్షి దినపత్రికలో ‘శుద్ధజలం.. అందని ఫలం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని కలర్ ప్రింట్లు తీసుకుని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. పీజీఆర్ఎస్లో ఈ మేరకు డీఆర్వో నరసింహులుకు వినతి పత్రం అందజేశారు. అక్కడే ఉన్న డీఈఓ కేవీఎన్ కుమార్ను పిలిచి తక్షణం సమస్యను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నట్టు ఆయన చెప్పడంతో జిల్లాలో సమస్యను పరిష్కరించుకోలేమా? విద్యార్థి సంఘం నేతలు చెప్పేంత వరకు మనం వేచి చూడాలా? అని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్రెడ్డి, జిల్లా కార్యదర్శి దినేష్కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మునిశేఖర్, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు గూడూరు రఫీ, చంద్రగిరి మండల అధ్యక్షులు వినోద్కుమార్, రామచంద్రాపురం మండల అధ్యక్షుడు యశ్వంత్రెడ్డి పాల్గొన్నారు. -
తిరుమల పదవుల్లో అనర్హులు.. శ్రీవాణి టికెట్ 15000: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక అపచారాలు పరాకాష్టకు చేరుకున్నాయి. 300 రూపాయల టికెట్ను మూడు వేలకు అమ్ముకుంటున్నారని అన్నారు. విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి ఒడిగడుతున్నారు అంటూ మండిపడ్డారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమలను ప్రళాక్షన చేస్తాం అనేవి కూటమి నేతల మాయమాటలు మాత్రమే. తాపేదారులతో అడ్డూ అదుపు లేకుండా అపచారాలు చేస్తున్నారు. 2008లో నేను పాలకమండలి అధ్యక్షునిగా ఉన్న సమయంలో బాలమురళి కృష్ణను ఆస్థాన విద్వాంసుడిగా నియమించాం. ఆయన చేత ఆలయం ముందు సంగీత కార్యక్రమం నిర్వహించాం. ఇది శాశ్వతంగా ఉండాలని నాదనీరాజన ప్రాంగణం వెలసింది. ఆ వేదికలో సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా కార్యక్రమం జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆ వేదికపై అవినీతి కంపు కొడుతోంది. దీని కోసం భాస్కర్ అనే అధికారిని నియమించారు. ఆయనకు అర్హత అసలు లేదు. సీఎం, చైర్మన్ అండదండలతో భాస్కర్ పేట్రేగి పోతున్నారు.ప్రోగ్రాం ఇచ్చేందుకే కమీషన్లు, పారితోషికంలో కమీషన్లు తీసుకుంటున్నారు. వీఐపీ, బ్రేక్, 300 రూపాయల దర్శనం టికెట్లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. 300 టికెట్లను మూడు వేలకు అమ్మేస్తున్నారు. విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి ఒడిగడుతున్నారు. శ్రీవాణి టికెట్లను 15 వేలకు అమ్మేస్తున్నారు. ఎస్వీబీసీలో అనర్హులకు పదవి ఇచ్చి నాశనం చేశారు. రూ.50 కోట్లతో ఎస్వీబీసీని స్వయం ప్రతిపత్తి సంస్థగా తీర్చి దిద్దే ప్రయత్నం వైఎస్సార్సీపీ హయాంలో జరిగింది. కరోనా సమయంలో ఎస్వీబీసీ ద్వారా ప్రేరణ పొందేలా చేశాం, ధైర్యం పెంచాం. ఈ కూటమి ప్రభుత్వం కుప్ప విశ్వనాథ శర్మను ఎస్వీబీసీ నుంచి పంపేశారు. చతుర్వేద యాగాలు పూర్తిగా నిలిపివేశారు. 700 మంది వేద పారాయణదారుల నియామకం కాలేదు. కన్వీనర్ కోట్ల రూపాయలు అభ్యర్థుల వద్ద నుంచి కాజేసినా చర్యలు లేవు.నృత్య, సంగీత కళాశాలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. అర్హత లేని వ్యక్తిని హిందూ ధర్మ ప్రచార పరిషత్కు నియమించారు. ఆన్లైన్ పెట్టిన అనంతరం 800 టికెట్లు ఎలా పూర్తి అవుతాయి. ఒక్కో టికెట్ కొట్టడానికి ఎంత సమయం పడుతుంది. కొండపై బ్రోకర్లు ఉన్నారు. రూ.15 వేలు ఇస్తే టికెట్లను బ్రోకర్లు అమ్మేస్తున్నారు. 400 నుంచి 600 టికెట్లు అమ్మేస్తున్నారు. రోజుకు శ్రీవాణి టికెట్ల ముసుగులో 15 లక్షలకు పైగా అవినీతికి పాల్పడుతున్నారు అంటూ ఆరోపించారు. -
ఇళ్లు కూల్చేందుకు యత్నం
● అడ్డుకున్న స్థానికులు ● వెనుదిరిగిన మున్సిపల్, పోలీసు అధికారులు వెంకటగిరి రూరల్: తాము కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బాధితులకు ముందస్తుగా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా మున్సిపల్, పోలీసు అధికారులు పట్టణంలోని 9వ వార్డులోకి ప్రవేశించి ఇళ్లు కూల్చివేతకు ఆదివారం యత్నించారు. ఈ మేరక స్ధానిక తాజా మాజీ వార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి, రాజారెడ్డితోపాటు స్థానికులు కలసి అధికారులను అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు మున్సిపల్, పోలీసులతో స్థానికులకు వాగ్వివాదం జరిగింది. ఈ సందదర్భంగా స్ధానికులు మాట్లాడుతూ గత ఒకటిన్నర సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు విస్తీర్ణం పేరుతో ఇళ్లు కూల్చివేశారని ఆ సమయంలో కొంతమంది మృతికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కారకులయ్యారని ఆరోపించారు. పదేళ్ల క్రితం స్థలాలను కొనుగోలు చేసి కష్టపడి ఇళ్లు నిర్మించుకుంటే రాజకీయ కుట్రలో భాగంగా కూల్చివేతకు పాల్పడుతున్నట్లు విమర్శించారు. పేదోళ్లపై అధికారులు పెత్తనం చెలాయిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇళ్లు కూల్చివేతకు స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో అధికారులు చేసేదేమిలేక వెనుతిరిగి వెళ్లిపోయారు. -
కీర్తి పతాక.. అన్షుమాలిక
నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక అమెరికాలో కీర్తిపతాక ఎగురవేసింది. తన ప్రతిభతో అరుదైన గుర్తింపు పొందింది. అమెరికాలో ‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్’ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఖ్యాతి గడించింది. అమెరికాలోని బ్లూమింగ్ టన్ ఇండియానా యూనివర్సిటీలో అన్షుమాలిక కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఈ యూనివర్సిటీ ఐదేళ్లకు ఒక్కసారి ప్రెసిడెంట్ హెర్మన్ బి వెల్స్ గౌరవార్థం ప్రతిష్టాత్మకమైన ‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్’ అవార్డు అందిస్తుంది. అలాంటి అత్యున్నత పురస్కారాన్ని శనివారం తల్లిదండ్రులు ఆర్కే రోజా, ఆరేకే సెల్వమణి సమక్షంలో అన్షుమాలిక అందుకుంది. అమెరికాలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థి అన్షుమాలిక కావడం విశేషం. యూనివర్సిటీలో గౌరవ ప్రదర్శనగా ఉంచే బోర్డులో ఉత్తమ విద్యార్థిగా ఈమె పేరు లిఖించిన బంగారు ఫలకం జీవితకాలం ఉండిపోతుంది. అవార్డులు.. పురస్కారాలు అంతర్జాతీయ స్థాయిలో విశిష్టమైన అవార్డులు అందుకుంటూ అన్షుమాలిక తన ప్రతిభను చాటుతోంది. ఇప్పటికే ‘యూనివర్సిటీ అవుట్స్టాండింగ్ లీడర్షిప్ అవార్డు’ అందుకుంది. ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ నవలను రచించి దక్షిణ భారతదేశంలో ఉత్తమ రచయిత్రిగా గుర్తింపు పొందింది. నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో ‘గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ అవార్డు’ను, అలాగే ‘మౌరిన్ బిగ్గర్స్ అవార్డు’ను కూడా అందుకుంది. ప్రస్తుతం అందుకున్న అవార్డుతో మరో మైలురాయిని చేరుకుంది. -
అంతరిక్ష ఇంజినీరింగ్తో గొప్ప ఆవిష్కరణలు
ఏర్పేడు: అంతరిక్ష ఇంజినీరింగ్తో దేశంలో ప్రపంచం గర్వించే ఆవిష్కరణల రూపకల్పనే లక్ష్యంగా పని చేస్తామని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ సహకారంతో ‘భారతదేశ అంతరిక్ష కార్మిక శక్తిని నిర్మించడం’ అనే అంశంపై 2 రోజులపాటు జరిగిన రౌండ్టేబుల్ సమావేశం ముగిసింది. ఆయన మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో మానవ వనరుల నుండి పరిశోధన, వ్యవస్థాపకతకు భారతదేశానికి సాంకేతిక నిపుణుల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. వ్యూహాత్మక భౌగోళిక స్థానం, పలు రంగాలలో బలమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండడం వంటివి, అంతరిక్ష విద్యారంగంలోకి తిరుపతి ఐఐటీ సకాలంలో ప్రవేశించడానికి దోహదపడుతున్నాయని వివరించారు. భవిష్యత్ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చే కీలక కేంద్రంగా పనిచేయడానికి తిరుపతి ఐఐటీకి ప్రత్యేకమైన స్థానం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. మద్రాస్, కాన్పూర్, గౌహతి, రూర్కీ, పాలక్కాడ్, ఇండోర్ ఐఐటీలలో ఎనిమిది అకడమిక్ స్కూల్స్, సెంటర్లను స్థాపించి, 3,000 మంది విద్యార్థులకు అంతరిక్ష ఇంజినీరింగ్ విద్యను అందుబాటులోకి తెచ్చారని, 2030 నాటికి 10,000 మందికి పైగా పట్టభద్రులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ఐఐఎస్టీ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.ఎన్.సురేష్ మాట్లాడుతూ భారతదేశ అంతరిక్ష విద్యా రంగంలో ప్రస్తుతం ఉన్న లోపాలను గుర్తించి, ఆచరణాత్మక ఫలితాలపై లోతుగా ఆధారపడిన పాఠ్యప్రణాళిక ఉండాలని కోరారు. మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాహుల్ మెహతా మాట్లాడుతూ భారతదేశం సరైన దిశలో గొప్ప ముందడుగు వేయడానికి తిరుపతి ఐఐటీ అంతరిక్ష ఇంజినీరింగ్ కార్యక్రమం సమయోచితమన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాసీ్త్రయ కార్యదర్శి గణేష్ పిళ్లై మాట్లాడుతూ భారతదేశంలోని ప్రముఖ సంస్థలలో అంతరిక్ష కార్యక్రమాలను బలోపేతం చేయడంలో ఇస్రో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో షార్ డైరెక్టర్ పద్మకుమార్, స్కైరూట్ ఏరోస్పేస్ సహ–వ్యవస్థాపకుడు నాగభరత్ డాకా తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల హక్కుల పరిరక్షణే లక్ష్యం
తిరుపతి అర్బన్: ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. గత దశాబ్ద కాలంగా నిలిచిపోయిన తిరుపతి పట్టణ ఎన్జీజీఓ భవన పునర్నిర్మాణానికి తిరుపతిలోని నరసింహ తీర్థం రోడ్డులో ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి జిల్లా ఎన్జీజీఓ భవన పునర్నిర్మాణానికి రాష్ట్ర అసోసియేషన్ తరఫున ఐదు లక్షల విరాళం ప్రకటించారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా వేతన సవరణ కమిటీని ఆలస్యం చేయకుండా వెంటనే నియమించి ఉద్యోగుల వేతనాలను సవరించాలని, డీఏ, సీపీఎస్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో పురోగతి చూపాలని డిమాండ్ చేశారు. సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు సరెండర్ లీవ్ బకాయిల మీద ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు గురుకుల సొసైటీ ఉద్యోగులకు విరమణ వయసు 62 పెంచే విషయమై, ఉద్యోగులను సీపీఎస్లో నుంచి ఓపీఎస్లోకి తీసుకొచ్చే అంశం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ అంశం, పెన్షనర్లకు ఎడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించే అంశం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ పెంపు, ప్రభుత్వ పథకాల వర్తింపు తదితర అంశాలలో తమ అసోసియేషన్ నిరంతరం తన ప్రయత్నాలు చేస్తుందన్నారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు ఎస్.సురేష్ బాబు, కార్యదర్శి సురేంద్ర, కోశాధికారి కోటేశ్వరరావు, సహాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ రెడ్డి, తిరుపతి నగర అధ్యక్షుడు బొప్పన లలిత కుమార్, జేఏసీ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం
చంద్రగిరి: కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆదివారం తెల్లవారుజామున పోలీ సు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. దామినేడు లెక్కదాఖల సర్వే నంబర్ 181/5లోని 2.56 ఎకరాలు, 207, 208లోని సు మారు 4 ఎకరాల్లోని ప్రభుత్వ భూములను కూటమి నేతల అండతో కబ్జాదారులు ఆక్రమించారు. కొంతకాలంగా ఎలాంటి పత్రాలు లేకుండా ఇక్కడ స్థలాలు విక్రయించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా అ క్రమ నిర్మాణాలకు పూనుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తు న ప్రజలు, వామపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న సాక్షి దినపత్రికలో ‘కబ్జా కోరల్లో దామినేడు భూమి’ శీర్షికతో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణల పాలవడం వాస్తవమేనని విచారణలో రెవెన్యూ అధికారులు అధికారులు తేల్చారు. ఈ క్రమంలో తిరుచానూరు పోలీసుల బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు ఆదివారం జేసీబీ సాయంతో సుమారు 7 ఇళ్లను నేలమట్టం చేశారు. దామినేడులో అధికారుల చర్యలపై ఓ వైపు హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ..ఏడు అక్రమ నిర్మాణాలను తొలగించిననూ వాటి పక్కనే ఉన్న మరో ఐదు ఇళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్రమంగా నిర్మించిన ఇళ్లలో నివాసం ఉన్నారని, వారికి సైతం నోటీసులు ఇచ్చామని, వాటిని కూడా త్వరలోనే తొలగిస్తామని రెవెన్యూ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
నేటి నుంచి రామానుజుల అవతారోత్సవాలు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు శ్రీభగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు రోజులపాటు ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాహితీ సదస్సులు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం శ్రీరామానుజాచార్యుల వైభవంపై ఉపన్యాసం, తరువాత భక్తి సంగీత కార్యక్రమం జరుగుతుంది. మంగళవారం శ్రీ రామానుజాచార్యులు–తిరుమల కై ంకర్యం ప్రసంగం, తరువాత హరికథ కార్యక్రమం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం పెళ్లకూరు: మండలంలోని నందిమాల గిరిజన కాలనీకి చెందిన సాగి అనీల్కుమార్ ఇల్లు ఆదివారం విద్యుత్ సర్క్యూట్తో దగ్ధమైంది. బాధితుని కథనం.. అనీల్కుమార్, అతని భార్య వరలక్ష్మి ఇంటి వద్ద ఉన్నారు. ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ వైర్లు షాట్ సర్క్యూట్కు గురయ్యాయి. ఇంటి పైకప్పుపై మంటలు చెలరేగాయి. దంపతులిద్దరూ కేకలు వేయగా స్థానికులు వచ్చే లోపు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని దుస్తులు, వస్తు సామగ్రి, గేదెలు కొనుగోలు కోసం పొలం అమ్మి తెచ్చిపెట్టుకున్న రూ.2లక్షల నగదు, రెండు సవర్ల బంగారు ఆభరణాలు కాలిబూడిదయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. లోయలోకి దూసుకెళ్లిన లారీ చంద్రగిరి: ప్రమాదవశాత్తు లారీ లోయలోకి దూసుకెళ్లిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆదివారం పీలేరు నుంచి తిరుపతి వైపు ఓ లారీ వస్తోంది. భాకరాపేట కనుమలోనికి ప్రవేశించగానే పెద్ద మలుపు వద్ద లారీ అతివేగం కారణంగా అదుప్పు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జుకాగా డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సురేష్కుమార్ తెలిపారు. వృద్ధురాలిపై దాడి తిరుపతి క్రైమ్: తన ఇంట్లోనే నిద్రిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాతయ్యగుంట సమీపంలోని మల్లంగుంటలో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమైపె దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆమైపె లైంగిక దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వెల్లడించారు. పైఅంతస్తులో నివశిస్తున్న ఆమె కుమారుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. గాయాలతో ఉన్న వృద్ధురాలిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించినట్లు సీఐ పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో అనుమానితుని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లైంగిక దాడి జరిగిన అంశంపై వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఘటన స్థలాన్ని ఏఎస్పీలు శ్రీనివాసులు, రవి మనోహరాచారి, తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం, క్లూస్ టీం సందర్శించారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య పాకాల: మనస్తాపంతో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం.. చిత్తూరు రోడ్డుకు సమీపంలోని కృష్ణారెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్న వై.వెంకన్న(40) తిరుమలలో డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. అనారోగ్య కారణంగా మనస్తాపానికి గురయ్యాడు. సూసైడ్ నోట్ రాసి ఉదయం 4 గంటల ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. హెచ్సీ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్ఓ ప్లాంట్కు ముసుగు తొలగేనా?
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం దామినేడులో కోట్ల విలువచేసే భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగించారు.●సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026బాటిల్ నీళ్లతో సరిపెట్టుకుంటున్నారు ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు కె.కృష్ణతేజ. పాకాల ఎన్వీఎన్.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఎనిమిది నెలలుగా ఆ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంటు పనిచేయక పోవడంతో ఆ బాలుడు ఇంటి నుంచి నీటిని తెచ్చుకుంటున్నాడు. ఒక బాటిల్ నీళ్లు తెచ్చుకోగా అవి సరిపోవడం లేదు. తరువాత నీళ్లు కావాలంటే అక్కడ దొరకవు. ఉపాధ్యాయులు సొంత నిధులతో పంచాయతీ మినరల్ వాటర్ ప్లాంటు నుంచి నీటిని తీసుకువచ్చి పెట్టినా ఆ నీరు తాగడానికి సరిగా లేదని పిల్లలు తాగడం లేదు. కొళాయి నీరు తాగాలి ఈ ఫొటోలో కొళాయి నీళ్లు తాగుతూ కనిపించే విద్యార్థి పేరు తరుణ్. రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ జెడ్పీ హైస్కూలులో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంటు ఒక ఏడాది కాలంగా పనిచేయడం లేదు. అప్పటి నుంచి బోరు నుంచి వచ్చే నీటిని కొళాయిలో పట్టుకుని తాగుతున్నాడు. నీళ్లు తాగడానికి చిలుము వాసన వస్తున్నప్పటికీ గొంతు తడుపుకోవాలంటే గుక్కెడు నీళ్లు తాగాలని తాగుతున్నట్టు చెబుతున్నాడు. హెచ్ ఎం పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోకుండా మూలనపడేశారు. పీజీఆర్ఎస్కు ప్రత్యేక ప్రాధాన్యత తిరుపతి అర్బన్: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలకు ప్రతి అధికారి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ వెల్లడించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లోనే కాకుండా మండల, డివిజన్ స్థాయిలోను పీజీఆర్ఎస్ను తప్పకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. నామమాత్రంగా కాకుండా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీదారులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. నాలుగు గంటల సమయంలో వచ్చే ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, పరిష్కారం చూపించాలని వివరించారు. ప్రతి వారం జరుగుతున్న పీజీఆర్ఎస్ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీ రాయడం తెలియకపోతే కలెక్టరేట్లోనే గ్రీవెన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులతో అర్జీలను రాయించుకోవాలని వివరించారు. ముఖ్యంగా మొబైల్ నెంబర్ను అర్జీలో నమోదు చేయాలని చెప్పారు. సమస్య పరిష్కారం కాకుంటే మళ్లీ అర్జీ ఇవ్వాల్సిన పనిలేదని, గతంలో ఇచ్చిన అర్జీకి ఆన్లైన్ చేసిన తర్వాత ఇచ్చిన స్లిప్ను చూపిస్తే సరిపోతుందని తెలియజేశారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 78,586 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,232 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.27 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. నిమ్మ @150సైదాపురం: ఏప్రిల్ నెలలో నిమ్మకాయల ధరలు ప్రతి రోజు పెరుగుతుంటాయి. రెండు రోజులుగా రోజురోజుకు ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ.150 నుంచి రూ.165 ధర పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన కాయలు ధర రూ.165 వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సైదాపురం మండలంలో విస్తారంగా ఉన్న రైతులు నిమ్మ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రబీ సీజన్లో వరి పంటను సాగు చేసే రైతులు తర్వాత నిమ్మ, బొప్పాయి, మినుము, పెసర పంటలపై ఆధారపడుతున్నారు. గత ఏడాదిలోపాటు ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే నెలల్లో కాయలు దిగుబడి కూడా తోటల్లో ఆశించిన స్థాయిలో ఉన్న కారణంగా ఆర్థికంగా బలపడ్డారు. రెండు రోజులుగా గూడూరు నిమ్మ మార్కెట్లో లూజు(50 కేజీల బస్తా)రూ.7,500 నుంచి రూ.8,250 వరకు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత కలిగిన నిమ్మకాయలకు మరింతఽ ధర లభిస్తోంది. నిమ్మకాయలకు అధిక ధరలు లభిస్తుండడంతో రైతులు ఆనందంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. శుద్ధ జలం విద్యార్థులకు దూరం విద్యార్థులకు శుద్ధ జలం.. అందని ఫలంగా మారింది. పాఠశాలల్లోని శుద్ధజల పరికరాలు(ఆర్వో ప్లాంట్లు) రెండేళ్లుగా గోడలకే పరిమితమయ్యాయి. విద్యార్థులు బోరు నీరు లేదా ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్నే తాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మినరల్ వాటర్ అందించేందుకు గత వైఎస్సార్ సీపీ సర్కారు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూలన పడ్డాయి. మరమ్మతులకు నోచుకోకుండా.. ఎటూ పనికిరాకుండా.. విద్యార్థులు అందుబాటులో లేకుండా పోయాయి. ఆర్వోప్లాంట్ల పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. రైల్వేకోడూరు అర్బన్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు శుద్ధ జలం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో వాటి పర్యవేక్షణ బాగుండి విద్యార్థులకు సురక్షిత మంచినీరు అందించేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటి గురించి పట్టించుకోక పోవడంతో అవి చెడిపోయి మూలన పడ్డాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇదే పరిస్థితి. తిరుపతి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువు అవుతున్నాయి. నిధులు మంజూరు కాలేదని కనీస సౌకర్యాలు పట్టించుకునే నాథుడు కరువయ్యారు. దీంతో విద్యార్థులు తాగునీటికీ అవస్థలు పడాల్సి వస్తోంది. ఇంటి నుంచే తెచ్చుకున్న వాటర్బాటిళ్ల నీళ్లు అత్యధిక ఉప్ణోగ్రత నేపథ్యంలో గంటలోనే అయిపోతున్నాయి. దీంతో దాహార్తితో విద్యార్థులు తల్లడిల్లుతున్నా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. మరమ్మతులో ఉన్న ఆర్వో ప్లాంట్లను బాగు చేయించడానికి పైసా నిధులు ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ తప్పుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి యంత్రాలు(ఆర్వో ప్లాంట్లు)శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో విద్యార్థుల తాగునీటి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. 70 శాతం అటకెక్కిన ఆర్వోప్లాంట్లు జిల్లాలో గత వైఎస్సార్ సీపీ పాలనలో 1,138 స్కూళ్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తే, అందులో 811 ప్లాంట్లు పనిచేయడం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి ఎస్వీయూలో నిర్వహించిన హెచ్ఎం సమావేశంలో ఆర్వో ప్లాంట్ల సంగతి ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. వేసవి సెలవుల్లో మరమ్మతులు చేయిస్తామని విద్యాశాఖాధికారులు నచ్చచెప్పే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటున్న మంత్రి నారా లోకేష్ కనీసం ఆర్వో ప్లాంట్ల మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. చోద్యం చూస్తున్న విద్యాశాఖ విద్యాశాఖాధికారులు నిధులు లేవంటూ చోద్యం చోస్తు న్నారు. కొత్తగా ఒక్క ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయకపోగా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల నిర్వహణను గాలికి వదిలివేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా పలు పాఠశాలలో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. ఉదాహరణకు తిరుపతి నగరంలోని రాజీవ్గాంధీ కాలనీలో ఒకేచోట అంగన్వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 550 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో నాలుగు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అయితే అందులో రెండు పాడైపోయాయి. ఇప్పటికీ అలానే నడుస్తున్నాయి. మిగిలిన రెండు ప్లాంట్లలో వచ్చే నీరు చాలక నానా ఇక్కట్లు పడుతున్నారు. తాగునీటికీ ఇబ్బంది ఇది వరకు మా పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంటు ఉండేది. నీళ్లు చాలా రుచిగా ఉండేవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు తాగేవాళ్లం. అయితే కొంతకాలంగా అది పనిచేయడం లేదు. దీంతో ఇంట్లో నుంచి వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాను. అయితే నీళ్లు మధ్యాహ్న నికే అయిపోతున్నాయి. దీంతో సాయంత్రం వరకు దాహంతో ఇబ్బంది పడుతున్నా. – వి.రమేష్, విద్యార్థి, ఆర్ఎస్ మాడవీధి హైస్కూల్, తిరుపతి దాహం.. దాహం మా పాఠశాలలో వాటర్ ప్లాంటు పాడై చాలా రోజులు కావస్తోంది. దీంతో ఇంట్లో నుంచి నీళ్ల బాటిల్ తెచ్చుకున్నప్పటికీ మధ్యాహ్నం భోజన సమయానికి ఖాళీ అయిపోతుంది. ఇక అప్పటి నుంచి దాహంతోనే ఉండాల్సిన పరిస్థితి. పాడైన వాటర్ ప్లాంట్ను రిపేరు చేయించి మా దాహార్తిని తీర్చాలి. – కె.సోమశేఖర్, విద్యార్థి,ఆర్ఎస్ మాడవీధి హైస్కూల్, తిరుపతి వరదయ్యపాళెం: మండల కేంద్రమైన వరదయ్యపాళెం హైస్కూల్లో విద్యార్థులకు శుద్ధజలం పంపిణీకి గత ప్రభుత్వంలో రూ.4లక్షల వ్యయంతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో నాడు–నేడు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వరదయ్యపాళెం హైస్కూల్లో నూతన ఆర్వో ప్లాంట్ మిషనరీ సైతం అలానే వదిలేశారు. దీంతో 900 మంది విద్యార్థులు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు.మూలన పడేశారు గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో వాటర్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం విద్యాశాఖ వాటిని మరమ్మతులు చేపట్టి వాడుకోవాలన్న ఆలోచన చేయకపోవడంతో విద్యార్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ యంత్ర సామగ్రి నిరుపయోగంగా మూలన పడేసి ఉన్నారు. వాటిని బాగు చేయించి వాడుకలోకి తీసుకురావాలి. – సునీల్, విద్యార్థిని తండ్రి, ఏర్పేడు ఉన్నత పాఠశాలఆర్వో ప్లాంట్ ఉపయోగకరం మా పాప వినయ శ్రీకాళహస్తి జెడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ మా పిల్లలకు చాలా ఉపయోగకరం. శుద్ధి చేసిన నీటిని తాగడంతో మా పిల్లలు రోగాల బారిన పడకుండా ఉన్నారు. ఇప్పటికీ హైస్కూల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ పని చేస్తోంది. ఆ నీళ్లనే మా పాప తాగుతూ ఉంది. – కె. కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి సురక్షితమైన నీరు అందించాలి మా పాఠశాలలో ఆర్వోప్లాంట్లు పనిచేయడంలేదు. దీంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. తోటి విద్యార్థులు కొందరు ఇంటి నుంచి బాటిళ్లు తెచ్చుకుని నీరు తాగుతున్నారు. కొళాయిలో నీరు అంత శుభ్రంగా ఉండడంలేదు. పాలకులు స్పందించి సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి. – లక్ష్మినరసింహారావు, విద్యార్థి, వెంకటగిరికుళాయినీరే తాగుతున్నాం మా పాఠశాలలో ఆర్వో ప్లాంటు పనిచేయకపోవడంలో గత చాలా కాలం నుంచి కొళాయినీరే తాగుతున్నాం. మధ్యాహ్నం భోజన సమయంలో తప్పని పరిస్థితిలో గరలం పట్టిన నీరును తాగుతున్నాం. – మునికుమార్, విద్యార్ధి, వెంకటగిరిగొంతెండుతోంది! ఆర్ఓ ప్లాంట్ పని చేయడంలేదు మా పాఠశాలలో విద్యార్థులకు సురక్షిత మంచినీరు అందించే ఆర్వో ప్లాంట్ చాలా రోజుల నుంచి పని చేయడంలేదు. కొళాయిల్లో వచ్చే నీరే తాగుతున్నాం. వాటర్ ప్లాంట్కు ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. అది ఎప్పుడు బాగుపడుతుందో తెలీయడం లేదు. –ఎం వినోద్, 8వతరగతి, తల్లెంవారిపల్లి, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ఓబులవారిపల్లి మండలం -
స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ నూతన కార్యవర్గం
తిరుపతి తుడా: చెర్లోపల్లిలోని కెన్ బూ కై షిటోరియూ కరాటే స్కూల్ ఆఫ్ ఇండియా వేదికగా ఆదివారం ఏపీ క్రీడలు, విద్యాభివృద్ధి కోసం నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా మదనపల్లికి చెందిన బి.మురళి, వైస్ ప్రెసిడెంట్లుగా తిరుపతి జిల్లాకు చెందిన పల్లం రత్నాకర్, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన తేజేంద్ర, అన్నమయ్య జిల్లాకు చెందిన సెక్రటరీగా మనోహర్రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా రమేష్, కృష్ణయ్య, ట్రెజరర్గా అనంతపురం జిల్లాకు చెందిన రాహుల్ బాబు ఎంపికయ్యారు. వీరితో పాటు పలు జిల్లాల నుంచి సుమారు ఏడుగురు ఈసీ మెంబర్లుగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఏపీలో క్రీడలు, విద్యారంగాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థులలో క్రీడలపై ఆసక్తిని పెంచడం, ప్రతిభావంతులైన యువతను ప్రొత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అవిలాలలో వృద్ధురాలి హత్య! తిరుపతి రూరల్: అవిలాల గ్రామంలో 80ఏళ్ల వయస్సున్న వృద్ధురాలు శనివారం రాత్రి దారుణహత్యకు గురైంది. పోలీసుల సమాచారం మేరకు... అవిలాల పంచాయతీ సుబ్బయ్యకాలనీలో నివాసముంటున్న పాపమ్మ(80)కు భర్త ఐదేళ్ల క్రితం చనిపోగా పిల్లలు లేక పోవడంతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ ఆధారంగా జీవనం సాగిస్తోంది. ఆ క్రమంలో శనివారం రాత్రి తన ఇంటి ముందు మంచంపై నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడకు టవల్తో ఉరి వేసి చంపేసి మృతురాలి చెవిలోని కమ్మలను తీసుకు వెళ్లినట్టు సమాచారం. ఆదివారం ఉదయం 11.30 గంటలు అవుతున్నా పాపమ్మ మంచంపై నుంచి నిద్ర లేవకపోవడం, ముఖంపై దుప్పటి తీయకుండా ఉండడంతో ఇరుగుపొరుగు వారు అనుమానంగా ఆమె దుప్పటిని తొలగించారు. అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతురాలికి శవ పరీక్ష నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆమె చెవిలో కమ్మల కోసమే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని అంచనా వేస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. సీఐ మద్దయ్య ఆచారి తన సిబ్బందిని అప్రమత్తం చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
వకుళామాత సేవలో పెద్దిరెడ్డి దంపతులు
తిరుపతి రూరల్: మండలంలోని పాతకాలువలో ఉన్న వకుళామాత అమ్మవారిని శనివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం ఆలయం వద్ద తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల తిరుపతి సిటీ: పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సాంకేతిక విద్యామండలి శుక్రవారం నుంచి హాల్ టికెట్లను విడుదల చేసిందని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, ప్రాంతీయ పాలీసెట్ ఇన్చార్జి డాక్టర్ వై ద్వారకనాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు https:/polycettap.ap.gov.in వెబ్సైట్ ద్వారా లేదా మనమిత్ర వాట్సప్ నంబర్ 95523 00009 నంబర్కు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. తిరుపతి రీజియన్లో 10 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 25వ తేదీ శనివారం పాలిసెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో శ్రీకాళహిస్తి, తిరుపతి, రేణిగుంట పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి అర్బన్: భవన నిర్మాణ కార్మికులతోపాటు ఇతర కార్మికులకు సంక్షేమ పథకాల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శనివారం కలెక్టరేట్ నుంచి సమాచారశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా వివాహ కానుక పథకం(ఇద్దరు ఆడ పిల్లలకు) రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజన పథకం రూ.20 వేలు(రెండు కాన్పులకు), సహజ మరణం సాయం పథకం కింద రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చుల పథకానికి రూ.20 వేలు చొప్పున అందిస్తారని వెల్లడించారు. ఆ ప్రకారం అన్ని విభాగాలకు చెందిన కార్మికులు 2026 మార్చి ఒకటో తేదీ తర్వాత నుంచి వివాహ కానుక, ప్రసూతి ప్రయోజనం, సహజ మరణం పథకాలకు దరఖాస్తులను మీ సమీపంలోని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయంలో అందజేయవచ్చని స్పష్టం చేశారు. మే 21 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు తిరుపతి సిటీ: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సువర్ణావకాశాన్ని కల్పించింది. మే 21వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లోనూ సబ్జెక్టులు తప్పిన విద్యార్థులతోపాటు తక్కువ మార్కులు వచ్చిన వారు ఇంప్రూమెంట్ రాసుకునే అవకాశం కల్పించింది. ప్రతి పేపర్లో విద్యార్థులు సాధించిన మార్కుల్లో ఉత్తమ మార్కులు పరిగణలోనికి తీసుకోనున్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూమెంట్ కోసం పరీక్ష ఫీజు రూ.600తో పాటు ప్రతి పాసైన సబ్జెక్టుకు రూ.160 చెల్లించాల్సి ఉంటుంది. సెకండ్, ఫస్ట్ ఇయర్ రెండింటీకి కలిపి పరీక్ష ఫీజు రూ.1200తో పాటు ప్రతి ఇంప్రూమెంట్ సబ్జెక్టుకు రూ.160 చెల్లించాల్సి ఉంటుంది. మే నెల 21వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఈనెల 20 నుంచి 27వ తేదీలోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. స్విమ్స్లో సంక్లిష్టమైన చికిత్స విజయవంతం తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన మధ్య వయస్సు మహిళ తలనొప్పి, కుడి కంట్లో చూపు మందగించడంతోపాటు కుడి కంటి రెప్ప వాలిపోవడంతో స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిపారు. టీటీడీ ప్రాణదానం పథకం కింద ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి మెదడులో ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆమెకు రెండు వారాల పాటు అత్యంత ఖరీదైన మాత్రలు అందించి, క్లిష్టమైన, ఖరీదైన చికిత్సను విజయవంతగా అందించామని తెలిపారు. ఈ సందర్భంగా రోగి మాట్లాడుతూ రూ. 5 లక్షలకు పైగా ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని ఉచితంగా అందించిన టీటీడీ యాజమాన్యానికి, స్విమ్స్ వైద్యులకు ఎంతో రుణపడి ఉంటామని చెప్పారు. -
టీచర్ల సమస్యలను పట్టించుకోరా?
తిరుపతి అర్బన్: ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్. వెంకటముని మండిపడ్డారు. దశల వారీగా నిరనసలు, ధర్నాలు చేస్తున్నా ఉపాధ్యాయుల వైపు సర్కార్ చూడడం లేదని పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద శనివారం ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మధ్యంతరభృతి 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేసి, ఓపీఎస్ విధానం పునరుద్ధరించాలని వెల్లడించారు. నాలుగు విడతల్లో ఉన్న పెండింగ్ డీఏలను ఇవ్వాలని తెలిపారు. ప్రధాన కార్యదర్శి బి. మురళీకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు యాప్ల భారాన్ని తగ్గించాలని, బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్జీటీలకు హెచ్ఎంల ఉద్యోగోన్నతులు కల్పించాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో రెండో ఉపాధ్యాయుడిని తప్పకుండా నియమించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్ పోస్టులు ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రతం అందజేశారు. ఉపాధ్యాయులకు ఏపీ జేఏసీ చైర్మన్ సురేష్బాబు, సీనియర్ కామ్రేడ్ సుధాకర్, ఏపీ ఎన్జీవో సెక్రటరీ సుబ్రమణ్యం మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ చెంచురాజు, రాజేష్ ఆనంద్, భువనేశ్వరి, వాసుకి,ఆర్ గోపాల్, జానా హరి ,శ్రీనివాసులు, హేమ కుమార్, రామదాసు, మదన్మోహన్, పీడీ చంద్రశేఖర్, ఎల్లయ్య ,ఖైరుద్దీన్, రాజేంద్రన్ ,మంజుష, హేమ కుమార్, రమణయ్య.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్
కేవీబీపురం: ఉపాధి హామీ పథకం కింద హౌసింగ్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు ఉపాధి సిబ్బందిని డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ సస్పెండ్ చేశారు. 2024–2025 సంవత్సరానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహణ ఎంపీడీఓ మాలతి ఆధ్వర్యంలో శనివారం కేవీబీపురం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. కళత్తూరు, కండ్లూరు, కేవీబీపురంలో హౌసింగ్ నిర్మాణంలో ప్రభుత్వ నిధులు లబ్ధిదారులకు చేరకుండానే, నిధులను పక్కదారి పట్టించిన విషయం ప్రజావేదికలో బట్టబయలు కావడంతో ఏపీఓ కుమారస్వామి, జేఈ చెంగల్ రాయులు, టీఏ వెంకటయ్యను సస్పెండ్ చేశారు. 831 పనులకు గాను రూ. 1.40 కోట్ల వరకు ఉపాధి హామీలో ఖర్చుపెట్టినట్లు నివేదికలు చూపిస్తున్నప్పటికీ తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించి రూ.1.50 లక్షల రికవరీకి పీడీ శ్రీనివాస ప్రసాద్ ఆదేశించారు. సస్పెండ్కు గురైన ఏపీఓ కుమారస్వామి ఒక దశలో అధికారులపై చిందులు వేశారు. ఒక్కసారిగా 22 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక తొలగించారని, ఆరే మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఢిల్లీ బాబు, పీడీ శ్రీనివాస ప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా పనిచేసినప్పటికీ అకారణంగా తప్పులు లేనప్పటికీ 22 మందిని తొలగించడం ఎంతవరకు న్యాయమని ఢిల్లీ బాబు తన ఆవేదనను అధికారుల ముందు వెళ్లగక్కాడు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మునస్వామి యాదవ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కనపర్తి గోపీనాథ్ రెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు థామస్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బాబు యాదవ్, ఏపీడీ సరిత, ఎస్ఆర్పీ లోకేష్, ఏవీఓ గణేష్, ఏపీఓ భాస్కరయ్య పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే నాని ఉండే బ్యానర్లు కోసేసిన జనసేన నేత
● జనసేన నేత మురళీరెడ్డి బ్యానర్లు కోసేయడంపై విస్మయానికి గురైన టీడీపీ నేతలు ● ఎమ్మెల్యే అక్రమాలు, కబ్జాలతో విసిగిన కూటమి నేతలు ● ఎమ్మెల్యే నానిపై తిరుగుబావుట సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకే ఆ పార్టీకి ముసలం పుట్టింది. ఇన్నాళ్లు చాపకింద నీరులా సాగిన కోల్డ్వార్ ఇప్పుడు రోడ్డెక్కింది. గత ఎన్నికల సమయం నుంచి మొన్నటి వరకు చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామానికి చెందిన తపసి మురళీ రెడ్డి జనసేన నాయకుడు. ఎమ్మెల్యే నానికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచాడు. అయితే ఏమైందో ఏమో కానీ శనివారం ఒక్కసారిగా జనసేన నేత ఎమ్మెల్యే నాని ఉంటే బ్యానర్లను చించేయడం మండల వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గత ఎన్నికల సమయంలో మురళీ రెడ్డి కూటమి పొత్తులో భాగంగా ఎమ్మెల్యే నాని గెలుపు కోసం అహర్నిశలు కష్టపడినట్లు జనసేన నేతలు చెబుతున్నారు. అయితే కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీ నేతలను ఎమ్మెల్యే దూరం పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మురళీరెడ్టిపై కూడా ఎమ్మెల్యే నాని అదే తరహాలో ప్రవర్తించినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఎమ్మెల్యే నాని, మురళీ రెడ్డిని హెచ్చరించాడని ఆ పార్టీ నేతలే గుసగులాడుకుంటున్నారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదనే ఆవేదనతో శనివారం సాయంత్రం జనసేన మురళీరెడ్డి కత్తి తీసుకుని, తిరుపతి–చంద్రగిరి రహదారి తొండవాడ కూడలి వద్ద ఎమ్మెల్యే నాని ఫొటోలతో కూడిన పార్టీ బ్యానర్లను కోసేసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే నానిపై పెల్లుబుకుతున్న వ్యతిరేకత చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై వ్యతిరేకత నియోజకవర్గంలో పెల్లుబుకుతోంది. గత కొన్ని రోజుల కిందట పనపాకం పంచాయతీలోని జనసేన బ్యానర్లను టీడీపీ నేతలు చించివేయడంతో ఆ పార్టీ నేతలు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలే తమ బ్యానర్లను చించేశారంటూ మీడియా సాక్షిగా ఆరోపణలు గుప్పించారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి దేవర మనోహర్ సైతం ఎమ్మెల్యే నాని అక్రమాలు, అవినీతిపై 15 పేజీల ఫిర్యాదును జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొండవాడకు చెందిన జనసేన నేత మురళీరెడ్డి బహిరంగంగా కత్తితో బ్యానర్లను చించేసి, ఈ వీడియోను ఆయనే సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో, ఎమ్మెల్యే నానిపై ఉన్న అక్కసు తెలుస్తోంది. అటు బీజేపీ నేతలు సైతం ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం, అధికారుల్లో ఎలాంటి గుర్తింపు లేకుండా చేయడంతో కూటమి నేతలు రగిలి పోతున్నారు. ఎమ్మెల్యే నాని ఇసుక, గ్రావెల్ దందాలు, భూ కబ్జాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై విసుగెత్తిన కూటమి నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారని చర్చ జోరుగా సాగుతోంది. -
రూ.45.82 కోట్లతో అండర్ పాస్ నిర్మాణం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: చిల్లకూరు మండలం పోటుపాళెం రోడ్డు వద్ద అండర్ పాస్ నిర్మాణానికి రూ.45.82 కోట్ల అంచనాతో ఆమోదం లభించినట్లు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి వెల్లడించారు. ఇందులోనే పాదచారుల రహదారిని సురక్షితంగా దాటేందుకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయని, పనులు ప్రారంభమైన తర్వాత సుమారు 15 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం భూ సేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని, సంబంధిత జాతీయ రహదారుల శాఖాధికారుల నుంచి సమాచారం అందినట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై చిల్లకూరు క్రాస్ రోడ్ (పోటుపాళెం రోడ్డు) వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై తొలిసారిగా 14 జూన్ 2022న కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ ద్వారా తెలియజేసినట్లు గుర్తు చేశారు. ఆ లేఖలో కృష్ణపట్నం పోర్టు ట్రాఫిక్, జాతీయ రహదారిపై రాకపోకల కారణంగా చిల్లకూరు జంక్షన్ వద్ద ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆ లేఖలో వివరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం లేదా రహదారి పునర్నిర్మాణం అత్యవసరమని కోరామన్నారు. అనంతరం పలు పర్యాయాలు ఆయనతో బేటీ అయినప్పుడు ఈ అంశం పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ అంశాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు 2025 ఫిబ్రవరి 6న లోక్సభలో ప్రశ్న సంఖ్య 498 రూపంలో లేవనెత్తినట్లు గుర్తు చేశారు. చిల్లకూరు క్రాస్ రోడ్ వద్ద వాహనదారులు, పాదచారుల కోసం వంతెన (వీయూపీ/ఎఫ్ఓబీ) నిర్మాణంపై ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించిందా, వాటిని ఆమోదిస్తుందా, పూర్తి చేసే కాలపరిమితి ఎంత అనే అంశాల గురించి ప్రశ్నించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర జాతీయ రహదారుల శాఖా మంత్రి నుంచి స్పష్టత వచ్చిందని వివరించారు. -
ఘనంగా శ్రీవాణి ఉగాది పురస్కారాల వేడుక
శ్రీసిటీ (వరదయ్యపాళెం):తెలుగుసంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఏటా శ్రీసిటీలో నిర్వహించే ఉగాది పురస్కారాల కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీసిటీ శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక బిజినెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక, సాహిత్య రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చేతుల మీదుగా ప్రముఖ పద్య నాటక కళాకారులు డాక్టర్ మీగడ రామలింగస్వామి, హరికథా భాగవతార్ డాక్టర్ ముప్పవరపు సింహాచలశాస్త్రి, ఆధ్యాత్మికవేత్త కందాడై సెల్వన్, జానపద కవి గాయకులు పోల్లూరు జగన్నాథం పురస్కారాలను అందుకున్నారు. పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సన్నారెడ్డి, ప్రముఖులను సత్కరించడం సంతోషకరమని అన్నారు. శ్రీసి టీ, మంచి నివాసయోగ్య ప్రాంతంగా రూపుదిద్దుకునే క్రమంలో కళలను ప్రోత్సహిస్తూ శ్రీవాణి ఆధ్యాత్మిక సాహిత్య వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
పోలీసు సేవల్లో నాణ్యత పెంచాలి
తిరుపతి క్రైం: పోలీసులు ప్రజాసేవల్లో నాణ్యత పెంచాలని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆధ్వర్యంలో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. న్యాయ సంబంధిత అంశాలు, ఈ–సాక్షి, మీ సేవ, పీజీఆర్ఎస్, సిటిజన్ 112, సీసీ కెమెరాల వినియోగం తదితర కీలక అంశాలపై ఎస్పీ సమగ్రంగా సమీక్షించారు. ఆధునిక సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించి నేర నియంత్రణలో ముందుండాలని ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలనరు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంతో స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. దర్యాప్తును వేగవంతం చేసి, సాక్ష్యాధారాలను సమయానికి సేకరించి చార్జ్షీట్లు దాఖలు చేయడంలో ఆలస్యం చేయరాదని ఆదేశించారు. పాత కేసులు పేరుకుపోకుండా ప్రతి కేసును నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసి బాధితులకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో వెరిటాస్ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి రూరల్: రామచంద్రాపురం మండలం సి.రామాపురంలోని వెరిటాస్ పాఠశాల విద్యార్థులు సీబీఎస్ఈ – 2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో కె. హితేష్ రెడ్డి 485 మార్కులతో పాఠశాలకు టాపర్గా నిలవగా, బీఎం సాయి చందన్ 479, టి. తమిళ్ 478, కుర్షిద్ ఆలం 477, వి. మాధవ్ 474 మార్కులు సాధించి ప్రథమ స్థానాల్లో నిలిచారు. మొత్తం 138 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఫలితాల సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో పాఠశాల చైర్మన్ బి.శేషారెడ్డి, డైరెక్టర్ బి. శ్రీకర్రెడ్డి విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీన్ సీజీహెచ్ ఖాన్, ప్రిన్సిపల్ పీఆర్ఎస్ చక్రవర్తి, వైస్ ప్రిన్సిపల్ ఎస్.నాగార్జున, అకడమిక్ కోఆర్డినేటర్ రాధిక పాల్గొన్నారు. ఎర్రచందనం కేసులో ఇద్దరికీ ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. 2018 డిసెంబర్ 28వ తేదీ ప్రొద్దుటూరు రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది కాజీపేట సెక్షన్, లంకమల రిజర్వ్ ఫారెస్ట్, జండాలవరం బీట్, దబ్బలమెట్ట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలం, జెండాలవరం వీఆర్వో కాలనీకి చెందిన ఎస్. జానయ్య, వైఎస్సార్ కడప జిల్లా, కాజీపేట మండలం, నాగసానిపల్లికి చెందిన కె. మల్లికార్జున ఇద్దరు ద్విచక్ర వాహనంలో 84 కిలోల ఏడు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుబడ్డారు. ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
● ఆక్రమణ
తిరుమల బైపాస్ రోడ్డులో ఓ భవన యజమాని సెట్ బ్యాక్ స్థలం ఆక్రమించి శాశ్వత నిర్మాణం చేపడుతున్నారు. కపిలతీర్థం నుంచి వచ్చే వాహనాలు గరుడ వారధి పైకి, అలానే ఫ్రీ లెఫ్ట్కు వెళ్లే ఇరుకై న ప్రాంతంలో ఈ భవనం ఉంది. నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో ఉంటుంది. బస్సు స్టాప్ కూడా ఇక్కడే ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఉన్న కాస్త సెట్ బ్యాక్ స్థలం ఆక్రమణకు గురవడంతో ఇబ్బందులు తప్పవు. పార్కింగ్ సమస్య తలెత్తే అవకాశముంది. గతంలో ఈ సెట్ బ్యాక్ స్థలంలో నిర్మించిన రేకుల షెడ్ను సైతం అధికారులు అడ్డుకున్నారు. ఇప్పుడు అక్కడే కూటమి నేతల అండతో శాశ్వత నిర్మాణం చేపడుతున్నా అడిగేవారు కరువయ్యారు. టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. – తిరుపతి తుడా -
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
సత్యవేడు: కుటుంబవిబేధాల కారణంగా జరిగిన హత్యామత్నం కేసులో ముద్దాయి నాగరాజు(39) ఓ టీవీ రిపోర్టర్ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు. శుక్రవారం సత్యవేడులో పోలీస్ స్టేషన్లో నిందితుని అరెస్టు వివరాలు ఎస్ఐ వెల్లడించారు. సత్యవేడు పంచాయతీ అత్తికాయల వీధిలో అద్దె ఇంట్లో జీ.నాగరాజు నివాసం ఉంటున్నాడు. అత్తామామలతో ఆర్థిక విషయాలపై కొంత కాలంగా విభేదాలు ఉండేవి. మార్చి 27న తన కుమార్తె అనారోగ్యానికి గురికావడంతో కుమార్తెను చూసేందుకు అల్లుడి ఇంటికి అత్త చిత్ర వచ్చింది. అత్త, అల్లుడిని దూషించింది దీంతో ఆగ్రహించిన అల్లుడు అత్తను కట్టెతో తలపై పలుమార్లు కొట్టి గాయపరిచాడు. అమె స్పృహ కోల్పోడంతో చనిపోయిందని భావించి పరారయ్యాడు. ఈ విషయమై మామ ఏ. మురుగున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఐలు టి.సాయినాద్, బి.లావణ్య దర్యాప్తు చేపట్టారు. వెంకటగిరి కుమ్మరవీధిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేసి, శుక్రవారం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కు తరలించారు. -
రుయా ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
తిరుపతి తుడా: రుయా ఆస్పత్రిలో ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన సుబ్బారావు (45) రెండేళ్లుగా కడుపునొప్పి, కడుపులో గడ్డ, రక్తహీనతతో బాధపడుతూ రాష్ట్రంలో అనేక ఆస్పత్రులు తిరిగినా వైద్యులు పరిస్థితి క్లిష్టంగా ఉందని, ఆపరేషన్ చేయడానికి వీలుపడదని తెలిపారు. దీంతో ఆయన కుటుంబ సభ్యుల సహాయంతో రుయాస్పత్రిని సంప్రదించారు. దీంతో రుయా ఆస్పత్రిలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ సి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య బృందం ఆయనను అడ్మిట్ చేసుకుని రక్త పరీక్షలు నిర్వహించి, కడుపులో ప్లీహం అనే అవయవం చాలా పెద్దదిగా ఉందని, అందువలన రక్తహీనత వచ్చిందని గుర్తించారు. రుయా వైద్యులు క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి, రోగిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులకు రోగి ధన్యవాదాలు తెలిపారు. -
రూ.10లక్షల రికవరీకి ఆదేశం
కలువాయి(సైదాపురం): ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతికి సంబంధించి రూ.10లక్షలు రికవరీ చేయాలని నెల్లూరు జిల్లా డ్వామా పీడీ గంగాభవాని ఆదేశించారు. కలువాయి మండలంలోని 20 పంచాయతీల్లో జరిగిన 17వ విడత సామాజిక తనిఖీలకు సంబంధించి కలువాయి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. మండలంలో 1,279 పనులగాను 1201 పనుల్లో రూ.తొమ్మిది కోట్ల విలువైన కూలీల పనులు, రూ. 2.77 కోట్ల మెటిరీయల్ పనులు జరిగాయని నెల్లూరు జిల్లా డ్వామా పీడీ గంగాభవాని తెలిపారు. మండలంలో ఉపాధి పనులు అవినీతి పంచాయతీల వారీగా పెన్నబద్వేలు రూ.19,392, బాలాజీరావుపేట రూ. 14,315, చీపినాపిలో రూ.3,600, చినగోపవరం రూ.1,61,756 , చింతలపాళెం రూ.1,84,153, చింతలాత్మకూరు రూ.86,229, దాచూరు రూ.47,722, కలువాయి రూ. 2 వేలు, కనుపూరుపల్లి రూ.2,500, కేశమనేనిపల్లి రూ. 27,087, కుల్లూరు రూ.3,700, ఆదన్నగారిపల్లి రూ.400, నూకనపల్లి రూ.1,502, పల్లకొండ 2,04,028, పెరంకొండ రూ.4,500, తెలుగురాయపురం రూ. 25,398, తోపుగుంట రూ.600, ఉయ్యాలపల్లి 1,83,653 చొప్పున మొత్తం రూ.10 లక్షల మేరకు ఉపాధిలో అవినీతి జరిగినట్లు పీడీ నిర్ధారించారు. ఉపాధిహామీలో జరిగిన అవకతవకలు సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని కారణంతోనే కార్యాలయంలో కూర్చొని ఎంబుక్లు నమోదు చేస్తూ కాలయాపన చేస్తున్నారని పీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బాలాజీరావుపేటలో సింగిల్ జాబ్కార్డు వ్యవహారంపై పీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుబానికి ఆరు జాబ్ కార్డులు ఎలా ఇస్తారని సిబ్బందిని ప్రశ్నించారు. -
అరవకొత్తూరులో విషాదఛాయలు
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని అరవకొత్తూరు గ్రామ శివారులోని బావిలో గురువారం సాయంత్రం ఇద్దరు మరణించారు. వీరి మ రణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు అరవ కొత్తూరు గ్రామానికి చెందిన త్రిహాల్ (12), బీపీ అగ్రహారానికి చెందిన తరుణ్ రెడ్డిగా గుర్తించారు. గురువారం సాయంత్రం త్రిహాల్ ఈత కోసం బావికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీట మునగడంతో అతడిన్ని కాపాడేందుకు సమీప బంధు వైన తరుణ్ రెడ్డి నీటిలోకి దూకాడు. ఇద్దరూ బావి లోతులో చిక్కుకొని చనిపోయారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. అరవ కొత్తూరు గ్రామానికి చెందిన బాలకృష్ణ, సుకన్య దంపతుల ఏకై క కుమారుడు త్రిహాల్ చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. త్రిహాల్ తండ్రి బాలకృష్ణ గతంలో మరణించాడు. ఇప్పుడు కొడుకు కూడా చనిపోవడంతో ఆ తల్లి రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెంకటగిరి రూరల్: రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉండడాన్ని శుక్రవారం రైల్వేపోలీసులు గుర్తించారు. గూడూరు రైల్వేపోలీసుల కథనం మేరకు.. ఎల్లకారు–గూడూరు మార్గం మధ్యలోని ఎల్లకారు వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని సుమారు 35 ఏళ్ల వ్యక్తి మృతదేహం ఉన్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పరిశీలించగా మృతిడి వద్ద ఎటువంటి ఆచూకీ లభించలేదు. మృతుడు బ్లూ కలర్ టీషర్ట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు తిరుపతి నుంచి గూడూరు వైపు వెళ్లే రైల్లో ప్రయాణిస్తున్న జారి పడి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీఏఓ బదిలీ తిరుపతి లీగల్: స్థానిక మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్వీ రాఘవ సాయి కుమార్ను కర్నూలు జిల్లా కోర్టు పరిపాలన అధికారిగా బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 31 మంది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కలెక్టరేట్లో స్వీయగణన తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో 2026–27 జనగణనలో భాగంగా శుక్రవారం తమ మొబైల్ ద్వారా స్వీయగణన కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్ ఏఓ రామాంజుల నాయక్తోపాటు పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ తమ మొబైల్స్ ద్వారా చేసుకున్నారు. అలాగే కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సెల్ప్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని ప్రోత్సహించారు. మామూళ్లు ఇవ్వనందుకే కేసులు కార్వేటినగరం: మామూళ్లు ఇవ్వకపోతే ఎకై ్సజ్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని శ్రీరంగరాజపురం మండలం మంగుంట గ్రామానికి చెందిన బెల్టుషాపు యజమాని చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాను మూడు నెలలుగా ముడుపులు చెల్లించలేదని కక్షగట్టి కేసులు పెట్టారని ఆరోపించారు. కార్వేటినగరం ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని మండలాల్లో బెల్టుషాపులు లెక్కలేనన్ని ఉన్నాయన్నారు. అందులో ఒక్కో షాపునకు నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఎకై ్సజ్ అధికారులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఒక నెల మామూళ్లు చెల్లించకపోయినా అక్రమ మద్యం విక్రయిస్తున్నట్టు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని వాపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో బెల్టుషాపులు వెలిశాయని, ఒక్కో గ్రామంలో రెండు నుంచి 4 వరకు కూడా ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 120 నుంచి 160 వరకు బెల్టుషాపులు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 63,454 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,882 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
తిరుపతి తుడా: స్మార్ట్ సిటీలో ప్రతిష్టాత్మకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం కచ్చపి ఆడిటోరియంలో తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను శుక్రవారం ఆయన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్పీ సుబ్బరాయుడు, కమిషనర్ ఎన్ మౌర్యతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీలైన వైజాగ్, కాకినాడ తరహాలో తిరుపతిలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి ట్రాఫిక్, శానిటేషన్, ఎమర్జెన్సీ వంటి సేవలకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఒక చోట నుంచే నగరంలోని అన్ని ప్రాంతాల్లో జరిగే వాటిని ఆపరేట్ చేయడానికి వీలుంటుందని చెప్పారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 360 డిగ్రీల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 120 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 80 శాతం పనులు పూర్తయ్యాయని, రెండు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తిరుపతి నగర ప్రజలకే కాకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయేలా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘన, ఎమర్జెన్సీ, మున్సిపల్ సేవలు, వాహనాల చోరీలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలు గుర్తించడం వంటి వాటి కోసం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంత ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసిన కెమెరాలతో ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రైమ్ మేనేజ్మెంట్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారికి పోలీస్ లేకున్నా ఆన్లైన్ ద్వారా జరిమానాలు విధించడం జరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని కోరారు. -
మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి
పుల్లంపేట: మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని అప్పయ్యరాజుపేట గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియవరం గ్రామానికి చెందిన ఎద్దల మల్లికార్జున అనే వ్యక్తి గురువారం అందరూ చూస్తుండగానే గ్రామంలో ప్రతిష్టించిన గ్రామదేవత గంగమ్మ రాతి విగ్రహాన్ని బండరాయితో పగలగొట్టారు. ఎందుకిలా చేశావని గ్రామస్తులు ప్రశ్నించగా భాకరపేట, పుల్లంపేట చర్చి పాస్టర్లు హిందూ దేవతా విగ్రహాలను పూజిస్తే నరకానికి పోతారు, హిందూ విగ్రహాలను ధ్వంసం చేస్తే ప్రభువు దగ్గరకు చేరుకుంటారని తెలపడంతో గంగమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపాడని గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిత్యం హిందూ దేవతలను దూషిస్తూ కేకలు వేస్తుంటాడని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు. -
ప్రతి భక్తుడికీ సంతృప్తికర దర్శనం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో ఈ నెల 27 నుంచి మే 3 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడూ సంతృప్తిగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేలా ఆలయాధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. రాపూరు మండలం పెంచలకోనలో శుక్రవారం అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆర్డీఓ అనూషతో కలసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో పెంచలకోనకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నారు. హనుమంత సేవ ,గరుడసేవ, కల్యాణం రోజుల్లో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూ అందించాలని ఆదేశించారు. ఆ మూడు రోజులు టైం స్లాట్ విఽధిస్తామని, విఐపీలు ముందుగా ఆలయాఽధికారులకు తెలపాలన్నారు. విఐపీలకు ఉదయం 8 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. పెంచలకోన బ్రహోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించేలా చర్యలు తీసుకుంటుంటామన్నారు. ఆర్డీఓ అనూషా మాట్లాడుతూ బ్రహోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం పెంచలకోన బ్రహోత్సవాల పోస్టర్ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల, ఆర్డీఓ అనూషా ఆవిష్కరించారు. -
ఆర్డీఓ చొరవతో భూ నిర్వాసితుల సమస్యకు తెర
డక్కిలి: దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ నిర్వాసితుల సమస్యకు ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి చొరవతో శుక్రవారం ఒ కొలిక్కి వచ్చింది. డక్కిలి మండల ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన రైతులకు 45 రోజుల్లో ప్రత్యామ్నాయ భూములు కేటాయిస్తామని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆల్తూరుపాడులో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని రైతులతో ప్రత్యక్షంగా చర్చించారు. ఆల్తూరుపాడు, వెల్లంపల్లి గ్రామాలకు చెందిన సుమారు 80 మంది రైతులు గత నాలుగు దశాబ్దాలుగా సుమారు 180 ఎకరాల అటవీ భూములను సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే రిజర్వాయిర్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకోవడంతో వారు జీవనధారం కోల్పోయారు. ఫారెస్టు భూములు సాగు చేసినందున నష్టపరిహారం చెల్లించడం సాధ్యం కాదని, గతంలో అధికారులు స్పష్టం చేస్తూ వచ్చారు. దీనిపై గతంలో రెండు దఫాలుగా జరిగిన చర్చలు ఫలితం ఇవ్వలేదు. రైతులు నష్టపరిహారం కోసం పట్టుబడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు. అర్హులైన ప్రతి రైతుకూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరో చోట సాగుకు అనువైన భూమలు కేటాయిస్తామని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ హామీపై రైతులు సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపారు. భూములు గుర్తింపు, అర్హుల ఎంపిక, కేటాయింపు ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేస్తామని భానుప్రకాష్రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఎన్నోఎళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
4 టన్నుల గంజాయి కాల్చివేత
రూ.10లక్షల రికవరీకి ఆదేశం ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతికి సంబంధించి రూ.10లక్షలు రికవరీ చేయాలని డ్వామా పీడీ ఆదేశించారు.కలెక్టరేట్లో స్వీయగణన జనగణనలో భాగంగా కలెక్టరేట్లో ఉద్యోగు లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా స్వీయగణన కార్యక్రమం చేపట్టారు.శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026దొరికితేనే దొంగ..లేకపోతే దొర అన్న చందంగా తిరుపతి, చిత్తూరు జిలాల్లో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మన్యంలో పండిస్తున్న గంజాయి ఘాటు జిల్లాను కుదిపేస్తోంది. ఒడిశా సరిహద్దుల్లో సాగు చేస్తున్న గంజాయి విశాఖ నుంచి రేణిగుంటకు చేరవేస్తున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనికితోడు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కళాశాలల్లో విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఈ దందాలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. ఇదీ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గంజాయి గుట్టు. రేణిగుంట: జిల్లాలో పట్టుబడిన సుమారు 4,100 కిలోల గంజాయిని కోర్టు అనుమతితో డిస్పోజ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రేణిగుంట మండలంలోని తూకివాకం వద్ద ఉన్న సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సమక్షంలో చట్టపరమైన విధానాల ద్వారా కరెంట్ యంత్రం ద్వారా కాల్చివేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయి పండించడం, రవాణా, వినియోగంపై చాలా కఠినంగా వ్యవహరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇందులో భాగంగానే ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి, ఐజీ ర్యాంక్ అధికారిని నియమించి ప్రతి జిల్లాలో అనుబంధంగా అధికారులను ఏర్పాటు చేసి గంజాయి, ఇతర డ్రగ్స్పై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో గత రెండు నుంచి మూడు సంవత్సరాల్లో సీజ్ అయిన గంజాయిని తూకివాకంలో ఇన్సినరేషన్ పద్ధతి ద్వారా డిస్పోజ్ చేస్తున్నామని, సుమారు 208 కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని కోర్టు నుంచి అనుమతి తీసుకుని డిస్పోజ్ చేస్తున్నామన్నారు. దీని ద్వారా గంజాయి రవాణా, వినియోగించే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లవుతుందన్నారు. తిరుపతి పట్టణం బెంగళూరు, చైన్నెకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా గంజాయి రవాణాలో గుర్తించడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లాకు ఎక్కువగా ఏఎస్ఆర్ జిల్లా నుంచి వైజాగ్, కాకినాడ మీదుగా బస్సుల్లో, ఇతర ప్రైవేట్ వాహనాల్లో తిరుపతికి వచ్చి, ఇక్కడి నుంచి చైన్నె, బెంగళూరు, కేరళకు వెళ్లడం గమనించామన్నారు. వాటిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్ పార్టీలను పెట్టి రైళ్లు, బస్సులు, లగేజీలను పరిశీలించి చేసి సీజ్ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాలో సుమారు 15 పీడీ కేసులు పెట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్: ‘‘తిరుపతి జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో ఉన్న 35 పోలీస్ స్టేషన్లలో 208 కేసుల్లో గడచిన రెండు, మూడేళ్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలు అక్షరాలా 4,098 కిలోలు. విస్తుగొలిపే ఈ అధికారిక గణాంకాల ఆధారంగా చూస్తే తిరుపతి జిల్లాలో యువత భవితను చిత్తు చేస్తున్న మత్తుపదార్థం గంజాయికి ఇది తార్కాణం. ఓ వైపు రాష్ట్ర పాలకులు గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని గుక్కతిప్పుకోకుండా శపథాలు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.’’ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం తిరుపతి, రేణిగుంటలకు వచ్చే గంజాయిలో సింహభాగం పక్క రాష్ట్రాలకు తరలించి, జిల్లాకు అవసరమైన సరుకును వేరు చేసి, ఇక్కడ నియమించుకున్న టీములు ద్వారా పట్టణంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. కళాశాలలతోపాటు హాస్టళ్లు, పీజీల వద్దకు చేరుకుని చిన్నపాటి కవర్లలో నింపిన గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. అలాగే హోటళ్లలో బస చేసే యాత్రికులకు సైతం గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలలోనూ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. లెక్కకు మించి ఎల్లలు దాటుతున్న గంజాయి తిరుపతికి చేరే గంజాయిపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకుంటేనే కేవలం నాలుగు డివిజన్లలోనే నాలు గు టన్నుల గంజాయి పట్టుబడి కోర్టు అనుమతితో గంజాయిని కాల్చివేశారు. అయితే పోలీసులకు, ఇతర నిఘా వ్యవస్థకు చిక్కకుండా ఎల్లలు దాటుతున్న గంజాయి ఏ మేరకు అక్రమ రవాణా జరుగుతుందో ఊహాతీతం. పుణ్యక్షేత్ర జిల్లాగా పేరుగాంచిన తిరుపతి జిల్లాను దాటాకే దక్షిణాది రాష్ట్రాలకు గంజాయి సరఫరా అయ్యేది. గంజాయి మత్తులో పెరుగుతున్న అకృత్యాలు, దాడులు గంజాయి మత్తుకు అలవాటుపడిన ఆకతాయిల అకృత్యాలు జిల్లాలో నిత్యకృతమయ్యాయి. ఇటీవల రేణిగుంటలో ఓ యువకుడు గంజాయి మత్తులో మటన్ కత్తితో పట్టపగలు నడిబజార్లో తన గొంతు తానే కోసుకుంటూ భయాందోళన రేకెత్తించాడు. రేణిగుంట పట్టణంలో స్థానిక యువకులు కూడా కొందరు గంజాయి మత్తుకు బానిసై జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం గంజాయి అక్రమ రవాణా చేసే ప్రధాన ముఠాను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే గానీ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చటం కష్టసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేడు రైతు సమ్మేళనం తిరుపతి అర్బన్: రెండు రాష్ట్రాల రైతులతో శని వారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో రైతు సమ్మేళనం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మేళం కొనసాగించనున్నారు. ఆ దిశగా ఇప్పటికే వారం రోజుల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు సమ్మేళనానికి హాజరుకావాలని ఆహ్వా నం పంపించారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఏపీ ప్రకృతి వ్యవసాయ ప్రథమ ప్రోత్సహకులు కోటపాటి గంగాధరం, గో ఆధారిత వ్యవసాయ నిపుణులు బసంపల్లి టి.నాగరాజు సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. డ్వామా పీడీగా ఎంసీ మద్దిలేటి తిరుపతి అర్బన్: జిల్లా డ్వామా పీడీగా ఎంసీ మద్దిలేటిని నియమించారు. ఈయన విజయవాడ హెడ్ ఆఫీస్లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్(డీడీఓ)పనిచేస్తూ.. తిరుపతికి బదిలీపై రానున్నారు. జిల్లాలో డ్వామా పీడీగా పనిచేస్తున్న శ్రీనివాస ప్రసాద్ను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. 2022 ఆగస్టు నుంచి జిల్లా పీడీగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల డీడీఓల బదిలీల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి జిల్లా కార్యాలయానికి శుక్రవారం ఉత్తర్వులు అందాయని అధికారులు వెల్లడించారు. రెండు రోజుల్లో బదిలీ అయిన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. రేపటి నుంచి ఉచిత తైక్వాండో వేసవి శిక్షణ తిరుపతి ఎడ్యుకేషన్ : వేసవి సెలవుల నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి మార్షల్ ఆర్ట్స్ అయిన తైక్వాండో క్రీడలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు పి.గీత ఒక ప్రకటనలో తెలిపారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు అలాగే వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు వేసవి శిక్షణ శిబిరాన్ని శ్రీదేవి కాంప్లెక్స్ లోని తైక్వాండో అకాడమీ, అలాగే దేవేంద్ర థి యేటర్కు సమీపంలోని శ్రీవారి నిలయంలో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ తైక్వాండో కోచ్ మాస్టర్ డాక్టర్ కె. గోపి నాయుడు ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్న ట్లు తెలిపారు. వివరాలకు 70135 91635, 95731 44231 సంప్రదించాలన్నారు.తిరుపతి కేంద్రంగా గంజాయి సరఫరా అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాగవుతున్న గంజాయిని రైళ్లు, బస్సులు, లారీలు, వస్తు రవాణా మార్గాల మీదుగా తిరుపతికి నిత్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని ప్రధాన పట్టణాల్లోని కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం ఓ పక్క నిఘా వ్యవస్థను పెంచి, గంజాయి అక్రమ రవాణా ఆనవాళ్లను గుర్తించి కేసులు పెడుతున్నా గంజాయి సరఫరా మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా రైళ్లలో గంజాయి రేణిగుంటకు సరఫరా అవుతోంది. ఇక్కడ నుంచి చైన్నె, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. -
చంద్రగిరికి రౌడీ సంస్కృతి తేవద్దు..!
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గానికి రౌడీ సంస్కృతిని తీసుకు రావద్దని వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానికి సూచించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి మోహిత్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే నాని మాటలు హద్దులు దాటాయని, గతంలో తమ ఆస్తులు కాపాడుకునేందుకు లాలూచీ రాజకీయాలకు పాల్పడిన వారు, ఇప్పుడు నీతి, నిజాయతీ గురించి మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నాని మాటలు నమ్మి మంత్రి నారా లోకేష్ అవాస్తవాలు, అసత్యాలను తన తండ్రికి ఆపాదించి వ్యక్తిగతంగా మాట్లాడడంతోనే తాను ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తాను హుందాతనంతో మాట్లాడినప్పటికీ ఎమ్మెల్యే నాని ‘‘పిల్లబచ్చా, అరేయ్.. ఒరేయ్.. తాటతీస్తా.. ఉచ్చ పోయిస్తా.. ఒక్కొక్కరికీ బడిత పూజ చేయిస్తా’’ వంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. రౌడీయిజం, దౌర్జన్యాలు, అసభ్య పద జాలం మాట్లాడే ఏ వ్యక్తిని చంద్రగిరి ప్రజలు అంగీకరించరని, అలా వ్యవహరించే వాళ్లని సరైన సమయంలో గట్టిగా సమాధానం చెబుతారని హెచ్చరించారు. దాడులు ఆపేందుకు నాడు చెవిరెడ్డికి ఫోన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పులివర్తి నాని తన క్వారీల్లో జరిగే విజిలెన్స్ దాడులను ఆపేందుకు ఆయన బంధువు ఆర్టీవీ ప్రసాద్ ద్వారా కాన్ఫరెన్స్తో తన తండ్రి చెవిరెడ్డికి ఫోన్ చేయించారని మోహిత్ రెడ్డి తెలిపారు. చంద్రగిరి మండలానికి చెందిన నాని బంధువు గిరినాయుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పాకాల మండలం మద్దినాయునిపల్లి వద్ద 10 ఎకరాలు కొత్త క్వారీని కూడా మంజూరు చేయించుకున్నారని చెప్పారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూనే నాని అన్ని పనులు చేసుకున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. వంద మంది కార్యకర్తలను కొట్టించారు చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పులివర్తి నాని వైఎస్సార్ సీపీకి చెందిన వంద మంది కార్యకర్తలను కొట్టించారని, వారి ఆస్తులు, వాహనాలు ధ్వంసం చేయించారని, ఇళ్లకు నిప్పు పెట్టి ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టించారని చెవిరెడ్డి మోహిత్రెడ్డి వెల్లడించారు. అయితే జగనన్న ప్రభుత్వంలో 2023 చివరి వరకు నానితో పాటు వారి కుటుంబ సభ్యులపై ఒక కేసు కూడా పెట్టించలేదనడానికి 2024 ఎన్నికల్లో ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ఒక్కటే ఆధారమన్నారు. చెవిరెడ్డిని ప్రలోభ పెట్టిన మాట వాస్తవం తిరుపతి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచిన తన తండ్రి చెవిరెడ్డిని 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడించి వారి పార్టీ లోకి తీసుకెళ్లడానికి అప్పటి మంత్రి డాక్టర్ ఎన్.శివప్రసాద్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పుత్తూరు ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్రెడ్డి ఉన్నారన్నారు. ఆ ప్రలోభాలపై వైఎస్ రాజశేఖరరెడ్డి, అప్పటి సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే ప్రకంపనలు సృష్టించాయన్నారు. ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధం తుడాలో అభివృద్ధి జరిగిందా, అవినీతి జరిగిందా? అన్న విషయం చంద్రగిరి ప్రజలకు తెలుసునన్నారు. అధికారం ఉందని లిక్కర్ అక్రమ కేసులో జైలుకు పంపినట్టు తుడాలో కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామంటే ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి తనతో పాటు తన తండ్రి చెవిరెడ్డి కూడా సిద్ధంగానే ఉన్నామని చెవిరెడ్డి మోహిత్రెడ్డి స్పష్టం చేశారు. -
పుస్తకాఘాతం
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువులకు గంట మోగింది. విద్యార్థులతో టీటీడీ కళాశాలలు కళకళలాడుతున్నాయి. కానీ విద్యార్థుల చేతులే వెలవెలబోతున్నాయి. పాఠ్యపుస్తకాల్లేకుండా..ఉత్తి చేతులతోనే వస్తున్నారు. ఎన్నో ఆశలు..ఆకాంక్షలతో టీటీడీ విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. ఉచిత విద్య, వసతి కల్పిస్తున్న తిరుమల, తిరుపతి దేవస్థానం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడంలో విఫలమవుతోంది. ఫలితంగా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఇక్కట్ల పాలవుతున్నారు. తిరుపతి సిటీ: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని ఏకై క నగరం తిరుపతి మాత్రమే. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్వీ డఫ్ అండ్ డమ్ జూనియర్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ కళాశాలలనే విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలుగా భావించి ప్రవేశాలు పొందుతున్నారు. నగరంలో ప్రభుత్వ కళాశాలలు లేకపోవడంతో ప్రభుత్వం ఏటా ఇంటర్ విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పుస్తకాల కిట్కు టీటీడీ జూనియర్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సైతం ఉచిత పుస్తకాల కిట్ పంపిణీ చేయాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు అధికారులకు విన్నవిస్తున్నారు. కానీ టీటీడీ యాజమాన్యం, ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మిగిలిన పుస్తకాలే దిక్కు జిల్లాలోని 72 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించిన తర్వాత మిగిలిన పుస్తకాలను మాత్రమే టీటీడీ విద్యాసంస్థలకు అధికారులు అందిస్తున్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులకు ఏటా టీటీడీ జూనియర్ కళాశాలలకు చెందిన అధికారులు తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని రిక్వెస్ట్ లెటర్లు పంపుతున్నారు. దీంతో మిగిలిన పుస్తకాలను జిల్లా అధికారులు టీటీడీ కళాశాలలకు చేరవేస్తున్నారు. టీటీడీ యాజమాన్యం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేయడంలో విఫలమవడంతో ఏమీ చేయలేని స్థితిలో పేద విద్యార్థుల తల్లిదండ్రులు సొంత నిధులతో అప్పులు చేసి మార్కెట్లో పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థగా పేరొందిన టీటీడీ తన ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నప్పటికీ కేవలం పుస్తకాలు అందించడంలో విఫలమైంది. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కోర్సుల్లో సుమారు 5 వేల మంది వరకు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో ప్రధానంగా 75 శాతం రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే చదువుతున్నారు. ఈ ఏడాది కేవలం విద్యారంగ అభివృద్ధికి రూ.180 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ మెరుగైన విద్యకోసం విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు అందించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీటీడీ పేద విద్యార్థులకు పుస్తకాల కిట్ను అందించడంలో విఫలం కావడం దారుణమని విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు.ఎస్వీ జూనియర్ కళాశాల అక్కడ మిగిలితేనే... ఇక్కడ పుస్తకాలు! శ్రీపద్మావతి జూనియర్ కళాశాల అందుబాటులో ఉన్న గ్రూప్లు – 5 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 860సెకండ్ ఇయర్ విద్యార్థులు 860ఎస్వీ జూనియర్ కళాశాల అందుబాటులో ఉన్న గ్రూప్లు – 5 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 550సెకండ్ ఇయర్ విద్యార్థులు 550ఎస్వీ డెఫ్ అండ్ డమ్ జూనియర్ కళాశాల అందుబాటులో ఉన్న గ్రూప్లు – 2ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 88సెకండ్ ఇయర్ విద్యార్థులు 88 -
డ్రాపౌట్లు లేకుండా చూడండి
తిరుపతి అర్బన్: బడిఈడు పిల్లలను తప్పకుండా పాఠశాలల్లో చేర్పించాలని, జిల్లాలో డ్రాపౌట్లు లే కుండా చూడాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం తిరుపతి ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో జిల్లాలోని 2,500 మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,500 మంది డ్రాపౌట్లు ఉన్నట్లు తెలుస్తుంద న్నారు. వేసవి సెలవుల్లో వారి తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చే విద్యా సంవత్సరానికి బడిలో చేర్పించాలని సూచించారు. మరోవైపు ప్రతి పాఠశాలలో ఆర్వో ప్లాంట్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాడైన వాటిని బాగు చేయించాలన్నా రు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడు తూ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికే విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందించడానికి ఇప్ప టి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎస్ఎస్ఏ సీఎంఓ సురేష్బాబు పాల్గొన్నారు. కొత్తగా తిరుపతి– నరసాపురం వీక్లీ ఎక్స్ప్రెస్ తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి – నరసాపురం మధ్య కొత్తగా వారానికోసారి ఎక్స్ప్రెస్ రై లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నంబర్ 17428 నరసాపురం నుంచి తిరుపతికి ప్రతి సోమవారం అందుబాటు లో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3.50కి నరసాపురంలో బయలుదేరి పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రే ణిగుంట మీదుగా మంగళవారం తెల్లవారు జా మున 3.40కి తిరుపతికి చేరుకుంటుంది. ఈ నెల 27వ తేదీన రైలు ప్రారంభించేందుకు చర్యలు చే పట్టారు. అలాగే తిరుపతి నుంచి వీక్లీ ఎక్స్ప్రెస్ నంబర్ 17427 ఆదివారం రాత్రి 10.20కి నరసాపురానికి బయలుదేరుతుంది. రేణిగుంట, నెల్లూ రు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు మీదుగా నరసాపురం సోమవారం ఉదయం 9.30కి చేరుకుంటుంది. ఈ రైలు మే నెల 3న ప్రారంభం కానుంది. ఈ రెండు రైళ్లలోనూ సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయి. స్విమ్స్లో కంటి పరీక్షలు తిరుపతి తుడా:స్విమ్స్ ఆస్పత్రిలో ఆప్తమాలజీ వి భాగం ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయని విభాగాధి పతి డాక్టర్ రమ్య దీప్తి వెల్లడించారు. గురువారం ఆమె మాట్లాడుతూ సామాన్యులకు సైతం అత్యున్నత ప్రమాణాలతో కూడిన కంటి వైద్యం అందించడమే లక్ష్యంగా స్విమ్స్లో వైద్య సేవలు అందజేస్తున్నామని చెప్పారు. కంటి శుక్లం, ఫాకో, మూ న్యువల్ ఎస్ఐసీఎస్, కెరాటోమెట్రీ, గ్లాకోమా, విజువల్ ఫీల్డ్స్, గ్లాకోమా, టొనోమెట్రీ, గ్లకోమా లో లేజర్ చికిత్సలు రెటినా, డయాబెటిక్ రెటినోప తి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ విద్యార్థుల ప్రతిభ తిరుపతి సిటీ: జిల్లాలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లోని ఆరు బాలికల, నాలుగు బాలుర విద్యాలయాలల్లో విద్యార్థులు బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించారు. 593 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 531 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 89 శాతం ఉత్తీర్ణత సాధించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో కోట పాఠశాలలో 72 శాతం, నాయుడుపేట 87 శాతం, వాకాడు 68 శాతం, డక్కిలి 100 శాతం, చిల్లకూరు 82 శాతం, సూళ్లూరుపేట 96 శాతం, పుదూరు 99 శాతం, శ్రీకాళహస్తి 96 శాతం, సత్యవేడు 90 శాతం, పుత్తూరు 98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. 25 నుంచి తిరుమలలో పద్మావతీ పరిణయోత్సవాలు తిరుమల: తిరుమలలో శ్రీపద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మలయప్పస్వామి వారు తొలి రోజు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడవాహనంపై ఊరేగుతారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిలో పరిణయోత్సవ మండపానికి వేంచేస్తారు. ఆ తర్వాత కల్యాణ మహోత్సవం కనులపండువగా నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దుచేసింది. -
ఉపాధి కూలీల ట్రాక్టర్ బోల్తా
● ఒకరు మృతి, 53 మందికి గాయాలు ● ఎనిమిది మంది పరిస్థితి విషమం పెనగలూరు: పెనగలూరు మండలం వెలగచర్ల గ్రామసమీపంలో ఉపాధి పనికి వెళ్తున్న కూలీల ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. ఎస్ఐ రఘురాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెలగచర్ల గ్రామం నుంచి రేగుంటవారిపల్లి సమీపంలోని పెద్దవంక వద్ద ఉపాధి పనులు చేసేందుకు ట్రాక్టర్లో డ్రైవర్ కాకుండా 53 మంది ఉపాధి కూలీలు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఉపాధి కూలీ కోనేరు వెంకటయ్య (60) అక్కడికక్కడే మృతి చెందాడు. 53 మంది గాయపడ్డారు.వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండడడంతో నలుగురిని తిరుపతి ఆస్పత్రికి, మరో నలుగురిని కడప రిమ్స్కు తరలించారు. 36 మందిని డిశ్చార్జ్ చేశారు. మరో ఎనిమిదిమంది రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మృతి చెందిన వెంకటయ్య కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రూ. రెండు లక్షల పరిహారం అందించనున్నట్లు ఎంపీడీవో విజయారావు తెలిపారు. -
లోకేష్ నాయకత్వంపై టీడీపీలో ఒకరికై నా నమ్మకం ఉందా..?
సాక్షి, టాస్క్ఫోర్స్: ‘పాతికేళ్ల కిందటే చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు 27 ఏళ్లకే తిరుపతి జెడ్పీటీసీగా గెలిచిన చెవిరెడ్డిని టీడీపీలోకి వస్తే రెండు కోట్లు డబ్బు..జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు..రూ.20 కోట్లు ఇచ్చినా సరే వైఎస్సార్ కుటుంబంతోనే ఉంటానని చెవిరెడ్డి తిరస్కరించారు.. ఆ వాస్తవాన్ని ఇప్పుడున్న సీనియర్ తెలుగుదేశం నాయకులను అడిగితే చెబుతారు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా చెవిరెడ్డి ఏమాత్రం లొంగని వ్యక్తిత్వాన్ని 2001 సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా ప్రస్తావించారు.. ఆ మాటలు అసెంబ్లీ రికార్డుల్లో పదిలమై ఉంటాయి.. అదీ చెవిరెడ్డికి వైఎస్సార్ కుటుంబంతో ఉన్న లాయల్టీ.’’ అని మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఖండించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూతురినిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అతని పా ర్టీని, పదవిని లాక్కుంటే, నారా లోకేష్ కుటుంబ సభ్యు ల సహకారంతో చంద్రబాబును టార్చర్ పెట్టి ఆయన పదవిని, పార్టీని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నారా లోకేష్ నాయకత్వంపైన చంద్రబాబుకే కాదు ఆ పార్టీలో ఎవరికీ నమ్మకం లేదన్నారు. తన పదవి ఎప్పుడు లాక్కుంటారోనన్న ఆందోళనతో చంద్రబాబు అనారోగ్యం పాలవుతున్నట్టున్నారని ఆరోపించారు. టీడీపీలో కార్యదర్శిగా కూడా సరిపోని నారా లోకేష్ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పదవిని బలవంతంగా లాక్కున్నట్టు ఆ పార్టీలో ఉన్న సీనియర్లు చెబుతున్నారన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది చంద్రబాబు విద్యార్థిగా ఉన్నపుడే తన తాత సుబ్రమణ్యంరెడ్డి ఆ విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఉన్నారని, ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అవినీతి గురించి నారా లోకేష్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని అన్నారు. చంద్రగిరి అభివృద్ధి గురించి మాట్లాడాలంటే నారా లోకేష్ సొంత ఊరు నారావారిపల్లికి వెళ్లాలని, ఆ గ్రామాన్ని చెవిరెడ్డి రూ.2 కోట్లతో అభివృద్ధి చేసేంత వరకు వాళ్లు ఏమీ చేయలేదన్న వాస్తవాన్ని గ్రామస్తుల్లో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. భగవంతుడు అంటే వారికి భయం, భక్తి రెండూ లేవు కనుకనే దేవుడు లడ్డూ, వస్త్రాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి లిక్కర్ స్కామ్లో రూ.600 కోట్లు సంపాదించారని నారా లోకేష్ చేసిన అసత్యపు ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణం చేయగలరా? అని మోహిత్రెడ్డి ప్రశ్నిచారు. నారా లోకేష్ చేసిన ఆరోపణలు అబద్ధాలు, అసత్యాలని ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం, నిజాయతీ తమకు ఉందన్నారు. చంద్రగిరిని వదిలి ఎందుకు పారిపోయారు ? చంద్రగిరితో తమ కుటుంబానికి సెంటిమెంట్ ఉందన్న నారా లోకేష్ మాటలపై స్పందించిన మోహిత్రెడ్డి నిజంగా అంత సెంటిమెంట్ ఉంటే చంద్రబాబు చంద్రగిరిని వదిలేసి కుప్పం నియోజకవర్గానికి ఎందుకు వెళ్లారని, నారా లోకేష్ మంగళగిరికి ఎందుకు పారి పోయారో చెప్పాలన్నారు. ఇప్పటికై నా సమయం మించిపోలేదని, చంద్రగిరితో సెంటిమెంట్ ఉందంటున్న నారా లోకేష్ అక్కడెక్కడో ఎందుకు పోటీ చేయడం, ఇక్కడ నుంచే పోటీ చేయచ్చుకదా..? ఆ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్తో జరిగితే నారా లోకేష్పై అఖండ మెజారిటీతో గెలుస్తానని, అలా గెలవని పక్షంలో తనతో పాటు తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. నారా లోకేష్ చంద్రగిరిలో ఓడిపోతే వాళ్ల నాన్నతో పాటు ఆయన కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ విసిరారు. -
మనోవేదనతో వైఎస్సార్సీపీ నేత మృతి
ఏర్పేడు : మండలంలోని పల్లం గొల్లపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు అక్కుపల్లి వెంకట్రామయ్య (70) తన కుటుంబంపై అధికార పార్టీ నాయకులు కక్షగట్టి అక్రమ కేసులు బనాయించి, జైలుపాలు చేయడంతో తీవ్ర మనోవేదనకు గురై గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. పల్లం గొల్లపల్లికి చెందిన అక్కుపల్లి వెంకట్రామయ్య మనుమడు నవీన్ను అధికార పార్టీ నాయకులు ఓ గొడవలో ఇరికించి కేసు పెట్టారు. దీంతో నవీన్ను అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. నెలరోజుల పాటు తన మనుమడు జైలులో ఉండడంతో తీవ్ర మనోవేదనకు గురైన వెంకట్రామయ్య ఆరోగ్యం క్షీణించింది. మూడ్రోజుల కిందట నవీన్ బెయిల్పై రావడంతో మనువడిని హత్తుకుని భోరున విలపించాడు. గురువారం ఉదయం అకస్మాత్తుగా మరణించాడు. నా కార్యకర్తల జోలికొచ్చిన వారిని విడిచిపెట్టను నా కార్యకర్తల జోలికొచ్చిన వారిని విడిచి పెట్టనని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి హెచ్చరించారు. ఏర్పేడు మండలంలోని పల్లం గొల్లపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు వెంకట్రామయ్య(70) మృత్యువాత పడిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే తెలుసుకున్నారు. దీంతో ఆయన పల్లంగొల్లపల్లికి చేరుకుని, వెంకట్రామయ్య మృతదేహానికి పూలమాల వేసి, నివాళుర్పించారు. మృతుని కుటుంబసభ్యులతో కలసి పాడె మోశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు వాపోయారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, ఏర్పేడు సింగిల్ విండో మాజీ చైర్మన్ కూకటి జనార్దన్యాదవ్, వెంకటేశ్వరరావు, గంగయ్యయాదవ్, భానుమూర్తియాదవ్, నవీన్, కన్నయ్య, మునెయ్య, జల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఐఐటీలో ‘అంతరిక్ష విజ్ఞానం
ఏర్పేడు: దేశంలో అంతరిక్ష విద్య భవిష్యత్తును నిర్వచించే లక్ష్యంతో ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో రెండు రోజుల పాటు ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ అధ్యక్షతన జరగనున్నట్లు పీఆర్వో చమన్ మెహతా తెలిపారు. తిరుపతి ఐఐటీ, మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోందన్నారు. ఇందులో కొత్తతరం అంతరిక్ష విజ్ఞానం, ఇంజినీరింగ్ పాఠశాల కోసం విద్యాపరమైన, నిర్మాణాత్మక చట్రంపై మేధోమథనం చేయడానికి విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ ప్రయోగశాలలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ నుంచి నిపుణుల బృందం ఒకచోట చేరి, అంతరిక్ష రంగంలో సైద్ధాంతిక పరిశోధన, పారిశ్రామిక అనువర్తనం మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడంలో ప్రధాన ఘట్టంగా మారబోతుందన్నారు. ఇస్రో మాజీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎన్. సురేష్ విఫలమైన మిషన్ల నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా రాకెట్ సైన్స్లో ప్రావీణ్యం సాధించడం అనే అంశంపై విశిష్ట ఉపన్యాసం ఇవ్వనున్నారని తెలిపారు. ఈ వర్క్షాప్లో ఇస్రో, రక్షణ అంతరిక్ష సంస్థ, త్రివిధ దళాల ప్రతినిధులు, త్రివేండ్రం ఐఐఎస్టీ, బెంగుళూరు ఐఐఎస్సీ, ఐఐటీ మద్రాస్, బాంబే, ఇండోర్ ప్రతినిధులు, ఎల్ అండ్ టి ఏరోస్పేస్, గోద్రెజ్ ఏరోస్పేస్, ఇన్–స్పేస్, ఎన్ఎస్ఐఎల్ వంటి ఏరోస్పేస్ సంస్థల సీఈవోలు, వ్యోమిక్, ఎక్స్డిలింక్స్, సన్యా ర్క్ వంటి అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ రంగాలకు చెందిన సీఈవోలు పాల్గొంటారని వివరించారు. రెండవ రోజు, ఎంఎఫ్ఎఫ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రాహుల్ మెహతా, ఎం. గణేష్ పిళ్ళై, పద్మకుమార్, ఎం. శంకరన్, శుభాంశు శుక్లా, నాగ భారత్ డాకా వంటి ప్రముఖులు పాల్గొంటారన్నారు. -
చౌక బియ్యం..
పేదల బియ్యం సరిహద్దులు దాటుతోంది. నెల మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం జోగుతోంది. ఫలితంగా రేషన్ బియ్యం వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. స్మగ్లర్లకు అధికారులు సహకరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలనెలా రూ.కోట్లలో సాగుతున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.జాతీయ రహదారిపై చావలి గ్రామం వద్ద టైర్ పంక్చర్ కావడంతో గ్రామస్తులకు పట్టుబడిన రేషన్బియ్యం(పైల్)పెళ్లకూరు: రేషన్ బియ్యం స్మగ్లర్లుకు వరంగా మారింది. ప్రతి నెలా రూ.4 లక్షలకు పైగా మామూళ్లు పు చ్చుకుని అధికారులు నియోజకవర్గంలో రేషన్ మాఫి యాను ప్రోత్సహిస్తున్నారు. దీంతో రేషన్ బియ్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. పెళ్లకూరు మండలంలోని పునబాక రైస్మిల్లు ప్రాంతం రేషన్ బియ్యం సేకరణ కేంద్రంగా(డంపింగ్ పాయింట్) మారింది. ఇదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రేషన్షాపుల నుంచి ప్రతి నెలా ఒకటి నుంచి 10వ తేదీలోపు కిలో బియ్యం రూ.10 చొప్పున కొనుగోలు చేసి పునబాక రైస్మిల్లు ప్రాంతంలో ఉన్న రహస్య ప్రదేశాల్లో డంప్ చేస్తున్నా రు. అక్కడ నుంచి సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, అక్కంపేట ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లకు కిలో రూ.25 చొ ప్పున విక్రయిస్తున్నారు. రేషన్ షాపుల నుంచి కొనుగో లు, పునబాక రైస్మిల్లు ప్రాంతంలో రహస్యంగా డంపింగ్ కేంద్రం, వాహనాలను మండల సరిహద్దులు దాటిస్తున్నందుకు వివిధ శాఖల అధికారులకు నెలనెలా భారీగా మామూళ్లు అందుతున్నట్లు తెలుస్తోంది. నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మీ దుగా బియ్యం యానాం పోర్టుకు తరలించేందుకు ఆ యా మండల కేంద్రాల్లోని పోలీసులు, కొందరు ప్రజా ప్రతినిధులకు రూ.లక్షల్లో నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం అక్రమ నిల్వలు, తరలింపుపై స్థానికులు మండల స్థాయి అధికారులకు సమాచారం అందించినప్పటికీ స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. రేషన్బి య్యం స్మగ్లింగ్ విషయమై పలుసార్లు స్థానికులు ఫి ర్యాదు చేస్తుండడంపై అధికారులే స్మగ్లర్లకు సమాచా రం చేర వేసి, డంపింగ్ పాయింట్లో ఉన్న రేషన్ బి య్యం మరో ప్రాంతానికి తరలించేలా స్మగ్లర్లుకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు తనిఖీల పేరుతో దగ్గరుండి రేషన్ వాహనాలను సరిహద్దులు దాటిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రేషన్ రైట్ రైట్ విజిలెన్స్ అధికారులు స్పందించాలి సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండల స్థాయి అధికారులతో రేషన్బియ్యం స్మగ్లర్లు నేరుగా కార్యాలయాలకు వెళ్లడం, రహస్య ఫోన్ నంబర్లుతో మంతనాలు చేసుకోవడం గుట్టు చప్పడు కాకుండా రేషన్బియ్యం సరిహద్దులు దాటించడం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, రేషన్ బియ్యం స్మగ్లర్లుకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
మరీ ఇంత అవమానమా!
తిరుపతి కల్చరల్: టీడీపీలో దళిత ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు కోనేటి సుమన్ కుమార్ చెప్పారు. ఆయన గురువారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఎమ్మెల్యేగా గెలిచాక కనీస గౌరవం కూడా టీడీపీలో దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో తప్పులు చేసిన వారెవరినీ పట్టించుకోకుండా కేవలం ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతోనే తన తండ్రిపై వివక్ష చూపారని వాపోయారు. కూటమి పార్టీల్లో ఎవరూ తప్పు చేయలేదా? వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సత్యవేడు సీఐ ఉద్యోగ బాధ్యతను పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారని, తమిళనాడుకు రోజుకు 50 నుంచి 60 లోడ్ల ఇసుకను దగ్గరుండి మరీ పంపుతున్నారని ఆరోపించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై నారాయణవనం జెడ్పీటీసీగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం, గౌరవం ఇవ్వడంలేదన్నారు. ఇక తాము పార్టీలో ఉండేది లేదని, ఎమ్మెల్యే పదవి కోసం ఖర్చు చేసిన డబ్బులు తమకు ఇచ్చేస్తే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తామని చెప్పారు. -
ఇంకా పోలీసుల నిర్బంధంలోనే పూడి శ్రీహరి
తిరుపతి: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించి కుప్పం పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడమే కాకుండా, ఇంకా కోర్టులో హాజరు పరచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పూడి శ్రీహరిని అరెస్టు చేసి 30 గంటలకు పైగా దాటినా ఇంకా పోలీసుల నిర్బంధంలోనే ఉంచారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 16వ తేదీ) ఉదయమే పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు చేసినా కోర్టులో మాత్రం హాజరుపరచలేదు పోలీసులు. పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించిన పోలీసులు,.. ఇంకా తప్పుడు కేసులు బనాయించడానికి కుట్ర చేస్తున్నట్లు తాజా పరిణమాలను బట్టి తెలుస్తోంది. పూడి శ్రీహరిని ఇంకా కోర్టులో హాజరుపరచకపోవడంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ ఇంకా ఆ పని చేయలేదు పోలీసులు. -
చంద్రబాబుపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుటుంబం ఆగ్రహం
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రబాబు, నారా లోకేష్పై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మేము ఖర్చు చేసింది వెనక్కి ఇస్తే మా నాన్న రాజీనామా చేస్తారన్న సుమన్.. రాష్ట్రంలో దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా? అంటూ నిలదీశారు. సత్యవేడు నియోజకవర్గానికి గంగా ప్రసాద్ను ఇన్ఛార్జ్గా నియమించాలి. మేము ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును గంగా ప్రసాద్ దగ్గర జమ చేస్తే ఎమ్మెల్యే పదవికి మా నాన్న రాజీనామా చేస్తారు. గౌరవం లేని ఈ పదవి మాకు ఎందుకు..?’’ అంటూ సుమన్ ధ్వజమెత్తారు.‘‘చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను సూటిగా అడుగుతున్నాం. మా డబ్బులు మాకు ఇచ్చేస్తే వెంటనే పదవికి రాజీనామా చేస్తాం. తిరుపతిలో ఎమ్మెల్యే ఎన్నికలకు కూటమి ప్రభుత్వం అభ్యర్థి రూ.100 కోట్లు ఖర్చు చేశారు. సత్యవేడు నియోజకవర్గం నుంచి అక్రమంగా ప్రతిరోజు గ్రావెల్, సాండ్ లారీల్లో తమిళనాడు తరలిపోతోంది. పిచ్చాటూరు నుంచి రోజుకి 50 నుంచి 60 ఇసుక ట్రాక్టర్లలో తమిళనాడు తరలిపోతోంది. స్థానిక సీఐ ఒక రాజకీయ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారు...ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంబేద్కర్ జయంతి రోజు మంత్రి నారా లోకేష్ తిరుపతికి వచ్చినప్పుడు ఒక్క బ్యానర్లో కూడా అంబేద్కర్ ఫోటో కనిపించలేదు. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా పెట్టడానికి ఒక దళితుడు మీకు కనిపించలేదా? దళితులు అంటే మీకు అంత చులకన. రాజ్యాంగం మీరు ఎక్కడ అమలు చేస్తున్నారు అంటూ కోనేటి సుమన్ సూటిగా ప్రశ్నించారు. -
ప్రయత్నించినా.. ఫలితం దక్కలే!
● జిల్లాలో నిరాశపరచిన ఇంటర్మీడియట్ ఫలితాలు ● రాష్ట్ర స్థాయిలో 8, 11 స్థానాలతో సరిపెట్టుకున్న తిరుపతి జిల్లా ● మే 21 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ● సప్లిమెంటరీ, రీవెరిఫికేషన్కు ఈనెల 20 నుంచి 27వరకు గడువుఒకింత ఉత్సాహం..తిరుపతి సిటీ: రాష్ట్రంలో బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తిరుపతి జిల్లా నిరాశపరిచింది. ఎలాగైనా జిల్లాను తొలి ఐదు స్థానాలకు చేర్చాలని ప్రత్యేక తరగతులు, ప్రణాళికలు అమలు చేసినా జిల్లా యంత్రాంగానికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. శాశ్వత అధ్యాపకుల కొరత, నూతన సిలబస్, సరికొత్త ప్రశ్నపత్రం, ప్రధాన సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని ప్రత్యేకంగా గుర్తించడంలో విఫలం కావడమే ఈ ఫలితాలకు ప్రధాన కారణంగా విద్యావేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంటర్ తొలి సంవత్సరం ఫలితాల్లో గత ఏడాది కంటే కాస్త మెరుగైన ఫలితాలు రావడం కాస్త ఊరట నిచ్చినా, సెకండ్ ఇయర్ ఫలితాలు గత ఏడాది కంటే దిగజారిపోవడంపై ఇటు అధికారులు, అటు తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దిగజారిన ద్వితీయ ఫలితం ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 80 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 27,790 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 22,344 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 86 శాతంతో 8వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది ఏకంగా 3 స్థానాలు దిగజారి 11వ స్థానం దక్కించుకుంది. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు మాత్రం కాస్త ఊరటనిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 28,383 మంది పరీక్షలు రాయగా 22,016 మంది ఉత్తీర్ణులయ్యా రు. గత ఏడాది 71 శాతంతో 9వ స్థానంలో నిలిచిన తిరుపతి జిల్లా ఈ ఏడాది 78 శాతం ఉత్తీర్ణతతో 8వ స్థానానికి చేరుకోవడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ కోర్సుల్లో 56 శాతం, ద్వితీయ సంవత్సరంలో 68 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల హవా మాత్రం యఽథావిధిగా కొనసాగగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలో మాత్రం ఫస్ట్ ఇయర్ 54 శాతం, సెకండ్ ఇయర్ 68 శాతం ఫలితాలు నమోదయ్యాయి. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి జూనియర్ కళాశాలలో 95 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఎస్వీ జూనియర్ కళాశాలలో 85 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆ సబ్జెక్టులే కొంపముంచాయా! నూతన సిలబస్తో తొలిసారి ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ చాలా తికమకపెట్టినట్లు తెలుస్తోంది. అందులో 8 మార్కుల ప్రశ్నలు చాలా వరకు ప్రాబ్లమెటిక్ ఇవ్వడంతో ఆ సబ్జెక్టులో విద్యార్థులు అధిక సంఖ్యలో తప్పినట్లు సమాచారం. అలాగే కెమిస్ట్రీ పేపర్ సైతం మోడల్ పేపర్లో ప్రస్థావించిన ప్రశ్నల సరళికి కాస్తా తేడాగా ప్రశ్నలు సందించడంతో ఆ సబ్జెక్టులోనూ విద్యార్థులు వెనుకబడ్డారు. నూతన సీబీఎస్ఈ సిలబస్ స్థాయిలో నాణ్యమైన బోధన అందించే అధ్యాపకులు పలు కళాశాలలో లేకపోవడం ఒక కారణంగా తల్లిదండ్రులు, విద్యావేత్తలు అంచనా వేస్తున్నారు. జిల్లాలో అధిక శాతం మంది ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో తప్పినట్లు తెలుస్తోంది. మే 21 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుఇంటర్ పరీక్షలు తప్పిన విద్యార్థుల కోసం, తక్కువ మార్కుల వచ్చి ఇంప్రూమెంట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు. అలాగే ఆసక్తిగల విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు ఈనెల 20 నుంచి 27వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఆయా కళాశాల ద్వారా ఈనెల 20 నుంచి 27వ తేదీలోపు విద్యార్థులు చెల్లిచాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇంటర్ ఫలితాల సరళి సంవత్సరం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ (శాతంలో) (శాతంలో) 2023–24 70 81 2024–25 71 86 2025–26 78 80జిల్లాలో ఉత్తీర్ణత సాధించిన కళాశాలల వివరాలు కళాశాలల సంఖ్య హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం ఏపీఆర్జేసీ 1 107 100 93.46 ఎయిడెడ్ 1 336 155 46.13 ఏపీఎస్డబ్ల్యూఆర్ 10 629 512 81.40 ఏపీటీడబ్ల్యూఆర్ 3 239 195 81.59 బీసీ రెసిడెన్షియల్ 2 209 178 85.17 ప్రభుత్వ కళాశాలలు 21 1677 765 45,62 హైస్కూల్ ప్లస్ 23 601 229 38.10 కేజీబీవీ 4 151 101 66.89 ఏపీఎమ్ఎస్ 5 365 250 68.49 ప్రైవేట్ కళాశాలలు 105 24,703 19,531 79.06ఫస్ట్ ఇయర్లో మెరుగైన ఫలితాలు సాధించాం ఇంటర్లో ఫెయిల్ అయ్యామనో, తక్కువ మార్కులు వచ్చాయనో విద్యార్థులు అధైర్య పడాల్సిన పనిలేదు. మే 21 నుంచి జరిగే ఇంటర్ అడ్వాన్స్డ్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం కాస్త శ్రమిస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కాస్త వెనుకబడినా, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లాకు గత ఏడాది కంటే మెరుగైన స్థానం దక్కింది. వచ్చే ఏడాది టాప్ 5లో జిల్లాను నిలిపేందుకు సమష్టి కృషి చేస్తాం. – జి రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి -
ఏపీఎస్పీడీసీఎల్ డిప్యూటీ ఈఈ సస్పెన్షన్
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని శ్రీసత్యసాయి సర్కిల్, మడకశిర సబ్–డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.రఘును సస్పెండ్ చేస్తూ ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు, విద్యుత్ పరికరాల దుర్వినియోగం, పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్ల రవాణాకు డిపార్ట్మెంటల్ వ్యాన్ను ఉపయోగించకపోవడం, రైతు లతో దురుసుగా ప్రవర్తించడం, ఎస్ఏపీలో 262 వ్యవసాయ సర్వీసు దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించడం, వివిధ ప్రదే శాల్లో విద్యుత్ లైన్లను అంచనాల అనుమతి లేకుండా మార్చడం, తదితర అంశాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇస్రో పరిశోధనకు చిట్వేలి విద్యార్థి ఎంపిక చిట్వేలి: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న జిల్లావాండ్లపల్లికి చెందిన రామిశెట్టి కుషాల్ జాతీయ స్థాయి ఇస్రో పరిశోధనకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు తెలిపారు. జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి 456 మంది విద్యార్థులు ఎంపిక కాగా ఏపీ నుంచి 13 మంది ఎంపికయ్యారని, వారిలో చిట్వేలి నుంచి ఒక విద్యార్థి ఎంపికయ్యారన్నారు. మే నెలలో 14 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్లి అక్కడ సైన్స్ సంబంధించిన వింతలు, విశేషాలు, సప్తగ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారన్నారు. ఇస్రోకు ఎంపికై న విద్యార్థి కుషాల్ను ఉపాధ్యాయ బృందం అభినందించారు. టీటీడీకి బ్యాటరీ బగ్గీ విరాళం తిరుమల: కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన హైడ్రోకార్ట్ టెక్నో సొల్యూషన్స్ సంస్థ ఎండీ గణేష్ జయవేల్ రూ.10 లక్షల విలువైన బ్యాటరీ బగ్గీ వాహనాన్ని బుధవారం విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. -
పదవుల రాజకీయం
అయినా వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో చందంగా నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు.. ఆది నుంచి పార్టీ జెండా మోసిన వారికి ఒట్టి చేతులు చూపారని పచ్చనేతలు మండిపడుతున్నారు. తమని కరివేపాకు చందంగా వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పదవుల పందేరంలో చంద్రబాబు కుఠిల రాజకీయం ప్రదర్శించారని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ అధిష్టానం ప్రకటించిన పదవుల పందేరంపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర దుమారం రేగుతోంది. పార్టీ పుట్టినప్పటి నుంచి జెండా మోసిన వారికి కాకుండా నిన్న, మొన్న పార్టీలోకి జంప్ అయిన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పటైన సుమారు రెండేళ్ల తరువాత టీడీపీ అధిష్టానం బుధవారం పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీలను ప్రకటించింది. ఈ జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్ విజయకుమార్ (తిరుపతి), ఎన్ అమర్నాథ్రెడ్డి (పలమనేరు), జీ నరసింహయాదవ్ (తిరుపతి), చిట్టిబాబు (జీడీ నెల్లూరు), రవినాయుడు (తిరుపతి), అన్నా అనిత (తిరుపతి), పురిమిట్ల కుమారి (తిరుపతి), జి. దశరథాచారి (శ్రీకాళహస్తి), ఎం సుబ్బయ్య (శ్రీకాళహస్తి), పి చందన స్రవంతి (సత్యవేడు), లక్ష్మీప్రసన్న (నగరి), ఆర్ మీరా నేతాజీ (నగరి), కర్జాల అరుణ (జీడీ నెల్లూరు)కి పదవులు లభించాయి. ఇందులో నలుగురు, ఐదుగురు మాత్రమే సీనియర్ నాయకులు ఉన్నారు. మిగిలిన వారిలో కొందరు ఎన్నికల తరువాత పార్టీలో చేరిన వారు కూడా ఉండడంతో మొదటి నుంచి జెండా మోసిన సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పదవులు ఉన్న వారికి ప్రాధాన్యత లేనివి ఇచ్చారనే అసంతృప్తి అనేక మందిలో ఉంది. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి గుర్తింపు టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉన్నత పదవులు లభించని అనేక మంది నాయకులను అధిష్టానం ఎన్నికలప్పుడు మాత్రమే వాడుకుని వదిలేస్తుందనే ప్రచారం ఉంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, ఆస్తులు పోగొట్టుకున్న నాయకులు ప్రస్తుతం పదవుల పందేరంలో తమకు చోటు దక్కకపోవడంతో తన అనుచరుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో మాత్రమే ముఖ్య నేతలు వచ్చి భుజాన చేయివేసి క్షేమ సమాచారాలు గురించి అడగడంతో గాల్లో తేలిపోయి పనిచేశామని చర్చించుకుంటున్నారు. ఓట్ల రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండాలని సీనియర్ నాయకులు కొందరు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓట్ల కోసమే.. పదవుల కోసం కాదు అందరికీ అన్యాయమే.. తిరుపతి బీసీ సామాజిక వర్గంలో యాదవులకు తప్ప మరొకరికి పదవులు దక్కడం లేదన్న అసంతృప్తి ఉంది. అది కూడా ఒకరిద్దరికి మాత్రమే. మిగిలిన మెజారిటీ సబ్ క్యాస్ట్లో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో సూరా సుధాకర్ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి, బుల్లెట్ రమణ, కోడూరు బాలసుబ్రమణ్యం కమిటీల్లో పదవులు కోల్పోయారు. వీళ్లంతా సీనియర్లు..రాష్ట్ర పదవులు వస్తాయని ఆశించిన దంపూరి భాస్కర్ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, పులుగోరు మురళి, పుష్పలతను కరివేపాకులా వాడుకుంటున్నారని వారి అనుచరులు మండిపడుతున్నారు. సూళ్లూరుపేటకు చెందిన తిరుమూరు సుధాకర్రెడ్డి, వేనాటి సతీష్రెడ్డి, శంకరయ్యయాదవ్ సీనియర్లు అయినా పార్టీలో గుర్తింపు లభించలేదు. చంద్రగిరి పరిదిలో సీఎం చంద్రబాబు పేరు పెట్టి పిలిచే నాయకులు అనేక మంది ఉన్నా.. ఒక్కరికి కూడా చోటు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో కూడా సీనియర్ నాయకులున్నా వారెవరికీ చోటు దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, దొరబాబు, చంద్రప్రకాష్, సుభాష్ చంద్రబోస్, చిట్టిబాబు నాయుడు, విజయబాబు, జయప్రకాష్ నాయుడు, గౌనివారి శ్రీనివాసులు, రామకుప్పానికి చెందిన ఆంజనేయరెడ్డి, దేయరాజులు నాయుడు జెండా మోయటానికే పరిమితం అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. -
బ్రహ్మోత్సవాల విజయవంతానికి సమష్టి కృషి
నాగలాపురం: టీటీడీ అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలని జేఈఓ వీరభద్రం అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలన్నారు. బ్రహ్మోత్సవాలు సమయంలో మాడ వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనంగా అవసరమైనంత సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారికి చల్లటి తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. విద్యుత్ విభాగంలో సమస్యలు తలెత్తకుండా సీఫ్టీ ఆడిటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. గరుడ వాహనం, రథోత్సవ సేవలను భక్తులు వీక్షించేందుకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా హెచ్డీ క్వాలిటీ ప్రసారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ శంకరయ్య, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, పీఆర్వో రవి, ప్రధాన అర్చకులు నాగరాజు భట్టాచార్యులు, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఉదయ్కుమార్, పాల్గొన్నారు. -
భగవన్నామ స్మరణ మోక్షానికి మార్గం
తిరుపతి కల్చరల్: నిత్యం భగవన్నామ స్మరణతోనే మానవ జీవితానికి మోక్షం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, తిరుపతి ఫిలిం సొసైటీ, కేజీకే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మహతి కళాక్షేత్రంలో ‘భగవన్నామ వైభవము’ అనే అంశంపై చాగంటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. చాగంటి మాట్లాడుతూ, భగవంతుని నామస్మరణ అన్ని పాపాలను హరిస్తుందన్నారు. భగవంతుడు సర్వాంతరామి అని, ఆయన అనునిత్యం మన వెన్నంటే ఉంటారన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా మనిషి ప్రశాంతత పొందలేకున్నాడని, దీనికి కారణం అత్యాశ, ఇతరుల గురించి ఆలోచించకపోవడమేనన్నారు. మనం ఏ నామం స్మరించినా, ఏ పూజ చేసినా ఉపాసన సాధన, శ్రమ అవసరమని, నామస్మరణకు నియమాలు లేవని, ఏ రీతిలో భగన్నామ స్మరణ చేసినా ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని వివరించారు. అనంతరం చాగంటిని తిరుపతి ఫిలిం సొసైటీ ప్రతినిధులు ‘ప్రవచన ప్రశాస్త’ బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఆధ్యాత్మికం.. శివస్తుతి నృత్య రూపకం మహతిలో తొలుత భారత నృత్య కళాక్షేత్రం నిర్వాహకులు, ప్రముఖ నాట్యాచార్యులు ధనుశ్రీ, శ్రీనివా స్ ప్రదర్శించిన శివ స్తుతి నృత్య రూపకం ఆద్యంతం ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. పార్వతీ పరమేశ్వరుల నృత్య తాండవాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. టీటీడీ విశ్రాంత ఆస్థాన గాయకుడు బొమ్మిశెట్టి రఘునాథ్ అన్నమయ్య కీర్తనలతో రంజింపజేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి, తి రుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం. వేణుగోపాల్రెడ్డి, అధ్యక్షుడు వైఎస్.బాబు పాల్గొన్నారు. -
ఘొల్లుమంటున్న పల్లెలు..!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల్లో అభివృద్ధి అటకెక్కింది. సమస్యలు పేరుకుపోయాయి. అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు, పింఛన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కూటమి నేతలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు, భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. ప్రకృతి వనరులను స్వాహా చేస్తున్నారు. రాజకీయ దాడులు పెరిగాయి. విచ్ఛలవిడిగా బెల్టుషాపుల నిర్వహణలో మద్యం ఏరులై పారుతోంది. ఇన్ని తెలిసినా పాలకులు, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్వేటినగరం: ఐదేళ్ల కిందట పల్లెల్లో విప్లవం మొదలైంది. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ప్రజలకు స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందాయి. ఊరు అంటే గుడి, బడి, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ అన్న నానుడి వచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందాయి. ముఖ్యంగా కరోనా కాలంలో వలంటీర్లు చేసిన సేవలు ఘనమైనవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను పూర్తిగా నీరు గార్చేశారు. రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పి గ్రామ వలంటీర్లను నిలువునా మోసం చేశారు. ప్రస్తుతం వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేశారు. రైతు భరోసా కేంద్రాలకు తాళాలు పడుతున్నాయి. విలేజ్ హెల్త్ క్లినిక్లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. పాఠఽశాలల్లో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. పింఛన్లు తప్ప మరే లబ్ధి లేకుండా జనం అవస్థలు పడుతున్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించాల్సి ఉండగా తమ అనుచరులకు మాత్రమే అందుతున్నాయి. గత ఐదేళ్లలో కనిపించని బెల్టు షాపులు ఊరు ఉసురు తీస్తున్నాయి. రాజకీయ కుట్రలు పేట్రేగిపోయి హత్యలకు దారితీస్తున్నాయి. దీంతో ప్రశాంతంగా ఉండే పల్లెలు నువురుగప్పిన నిప్పులా మారుతున్నాయి. ఈ రెండేళ్లలో 90 శాతం దాడులు, దౌర్జన్యాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అనంతరం వివిధ కారణాలతో వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల సభ్యులపై భౌతిక దాడులు చేశారు. కళ తప్పిన సచివాలయాలు రూరల్ గవర్నెన్స్ ద్వారా ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలనే ధ్యేయంతో గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం పంచాయతీలు 697 ఉండగా 822 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో 612 గ్రామ, వార్డు సచివాలయలను ఏర్పాటు చేశారు. 4477 మంది రెగ్యులర్ ఉద్యోగులను నియమించారు. సుమారు 516 సేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిచివాలయాలు కళ తప్పాయి. వైఎస్ జగన్పై ఉన్న కక్షతో సచివాలయాల్లో ఉచిత సేవలకు మంగళం పాడారు. ప్రజలు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులను సర్వేల పేరిట బయటకు పంపేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలదీ అదే పరిస్థితి. రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు అందడంలేదు. ఇక వైద్యం సంగతి సరేసరి. జిల్లాలోని జనాభా 18.73 లక్షలు జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు 822 గ్రామ పంచాయతీలు 697 గ్రామ వార్డు సచివాలయాలు 612 సచివాలయాల ఉద్యోగులు 4477 మంది ప్రస్తుతమున్న ఉద్యోగులు 4040 మంది డిప్యుటేషన్పై వెళ్లిన వారు 437 మంది జిల్లా సమాచారం -
ఘనంగా 11వ ఇన్స్టిట్యూట్ డే
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో బుధవారం 11వ ఇన్స్టిట్యూట్ డేని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొంబాయి ఐఐటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదురి విచ్చేశారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ 11ఏళ్ల ప్రస్థానంలో విద్య, పరిశోధన, మౌలిక సదుపాయాలు, విస్తరణ రంగాల్లో ఇన్స్టిట్యూట్ పురోగతి సాధించిందన్నారు. ముఖ్యఅతిథి ప్రొఫెసర్ సుభాసిస్ చౌదురి మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ 11వ ఇనన్స్టిట్యూట్డేకు తాను హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి ఐఐటీలో జరుగుతున్న కార్యకలాపాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ ప్రతిభ చూపిన విద్యార్థులకు విద్యా ప్రతిభ పురస్కారాలు అందజేశారు. అలాగే సిబ్బంది చేసిన విశేష సేవలకు గుర్తింపునిచ్చి వారికి పురస్కారాలను అందజేశారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఇన్స్టిట్యూట్ డే వేడుకలు ముగిశాయి. -
కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట మోహిత్రెడ్డి నిరసన
సాక్షి, టాస్క్ఫోర్స్: సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి బుధవారం రాత్రి అక్కడకు వెళ్లి శ్రీహరిని చూపించాలని పోలీసులను అడిగారు.. వారు చూడటానికి వీలు లేదని, కోర్టులో చూపిస్తామని చెప్పడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఎందుకు చూపించరని డీఎస్పీ పార్థసారథిని నిలదీశారు. ఇలాగే పోలీసులు అక్రమ కేసులు, అడ్డగోలుగా వ్యవహరిస్తే కోర్టులోనే తేల్చుకుంటామని, రెండు రోజుల క్రితం తిరుచానూరు ఘటనలో తిరుపతి కోర్టులో పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఎస్ఐని సస్పెండ్ చేయడానికి, సీఐకు మేమో జారీకి ఆదేశాలు ఇస్తామని చెప్పడాన్ని గుర్తు చేశారు. కోర్టుల్లో పోలీసులకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు శ్రీహరిని సోషల్ మీడియా కేసులో అక్రమంగా అరెస్టు చేసి, రహస్యంగా దాచి పెట్టాల్సిన అవసరం ఏముందని పోలీసులను ప్రశ్నించారు. పారదర్శకంగా పోలీసులు వ్యవహరించి ఉంటే ఆయన్ని దాచి పెట్టాల్సిన అవసరం ఉండేదికాదని, తప్పుడు కేసులు పెట్టినట్టు వారికి ముందే తెలుసు కాబట్టి ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టరన్నారు. పోలీసుల్లో నిజాయితీ కనిపించడం లేదని, కుప్పం నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు దీనికి సమాధానం చెప్పాలన్నారు. మానవ హక్కుల గురించి ఎప్పుడూ మాట్లాడే చంద్రబాబు కుప్పం పోలీసులకు ఆ హక్కుల గురించి ఎందుకు నేర్పలేదో ప్రజల ముందు చెప్పాలన్నారు. పోలీసులు అక్రమంగా ఎంత మందిని అరెస్టులు చేసినా జైలుకు వెళ్లివచ్చిన ప్రతి ఒక్కరు జగనన్నకు సైనికులుగా మారుతారే తప్ప పారిపోయే పరిస్థితి లేదన్నారు. -
టిప్పర్ ఢీకొని 32 గొర్రెలు మృతి
కలువాయి(సైదాపురం): టిప్పర్ ఢీ కొని 32 గొర్రెలు మృతి చెందిన ఘటన కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన రెండ్ల చిన్న పుల్లయ్య, ఆలి సుధాకర్, మనుబోటి చిన్నయ్యకు చెందిన 37 గొర్రెలను పెనబద్వేల్లో మేతకు తీసుకెళ్లి అక్కడ నుంచి పపలపాడు గ్రామానికి తీసుకుని వెళుతుండగా బుధవారం తెల్లవారుజామున వెంకటరెడ్డిపల్లి జాతీయరహదారిపై టిప్పర్ వేగంగా వచ్చి గొర్రెల మందను ఢీకొనడంతో 32 గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందగా 5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెలను ఢీకొన్న టిప్పర్ ఆపకుండా వెళ్లి కుల్లూరు గ్రామంలో టిప్పర్ను దాచగా గొర్రెల యజమానులు టిప్పర్ను కనుగొని కలువాయి పోలీసులకు సమాచారం అందజేశారు. మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించాలి తిరుపతి రూరల్: దేశ రాజకీయాల్లో మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించాలని, దీనికి మహి ళా రిజర్వేషన్ బిల్లు ఒక సోపానంగా చేసుకోవా లని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ అన్నారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 2023పై శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో మహిళా అధ్యయన విభాగం బుధవారం చర్చావేదిక నిర్వహించింది. సాధినేని మాట్లాడు తూ, ఆర్థిక అసమానతలను నిరోధించి ఇంటిని, వ్యాపారాలను చక్కదిద్దే మహిళలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకమవడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘నారీ శక్తి వందన్ అధినీయం’ మహిళాభ్యున్నతికి దోహద పడుతుందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉష మాట్లాడుతూ, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల భాగస్వామ్యం పెరగడం ద్వారా రాజకీయ సాధికారత సాధ్యం అవుతుందన్నారు. లీడింగ్ అడ్వకేట్ కేసీ.సరళ మాట్లాడుతూ, మహిళా నాయకురాళ్లు ధైర్యంగా, స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే ఆ బిల్లు లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. మహిళా అధ్యయన విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.పద్మావతి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ‘నారీశక్తి వందన్..’ఆశయానికి కట్టుబడి ఉన్నామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ చర్చావేదికకు స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హ్యూమానిటీస్ అండ్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ వి.వాణి సమన్వయకర్తగా వ్యవహరించారు. -
ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఎర్రావారిపాళెం మండలం కే తిప్పిరెడ్డి గారిపల్లికి చెందిన వి.హరినాథరెడ్డికి ఐదేళ్లు జైలుశిక్ష, రూ.3 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరినాథ్, ఎర్రావారిపాళెం సీఐ లోకేష్, కోర్టు కానిస్టేబుల్ శివ కథనం మేరకు.. 2016 సెప్టెంబర్ 30వ తేదీ ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎర్రావారిపాళెం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఎర్రావారిపాళెం మండలం, మర్రిపాటివారిపల్లి, గానుగచింత రోడ్డు, గాజులేరు వద్ద తనిఖీలు చేపట్టారు. నిందితుడు హరినాథరెడ్డితోపాటు మరో ఇద్దరు కలిసి వాహనంలో 63 కిలోల బరువున్న 5 ఎర్రచందనం దుంగలను ఆక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. హరినాథరెడ్డిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. -
కూటమి విభేదాలు బట్టబయలు
చంద్రగిరి: మంత్రి నారా లోకేష్ పర్యటనలో కూటమిలోని విబేధాలు బట్టబయలయ్యాయి. గత కొంత కాలంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూటమిలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. నారా లోకేష్ పర్యటనలో కూటమి పార్టీకు చెందిన ముఖ్య నేతలు ఎవరూ కనిపించకపోవడంతో మరోసారి వారిలోని విబేధాలపై ప్రజలు చర్చింకుంటున్నారు. అర్జీలకు నో ఎంట్రీ..! తమ సమస్యలను మంత్రి నారా లోకేష్ పరిష్కారని ఎంతో ఆశతో కార్యక్రమం వద్దకు వచ్చిన అర్జీదారులకు నిరాశ ఎదురైంది. టీడీపీ నేతలకు గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే అనుమతించారు. పోలీసులు ఎవరినీ అనుమతించకుండా ఎలాంటి అర్జీలను ఇచ్చేందుకు అనుమతులు లేవంటూ వెనుక్కు పంపారు. ఎవరైనా బయట ఉండాల్సిందే.. మంత్రి నారా లోకేష్ పర్యటనపై ఆ పార్టీ నేతల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పార్టీ అధికారం కోసం పనిచేస్తే, మమల్ని అడ్డుకోవడం ఏమిటంటూ ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో రాజకీయ బ్యానర్లు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బుధవారం చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రారంభించారు. మంత్రి రాకతో టీడీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో టీడీపీ నేతలు పసుపు జెండాలు, బ్యానర్లతో స్వాగత ఫొటోలను ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాభివృద్ధికి 90 రోజుల ప్రణాళిక: లోకేశ్ తిరుపతి తుడా: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం పేర్కొన్నారు. తిరుపతిలోని గొల్లవానిగుంట స్పోర్ట్స్ స్టేడియంను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతిలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో శాప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ మైదానం నిర్వహణకు కార్పొరేట్ సహకారం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కమిషనర్ ప్రజాప్రతినిధులతోపాటు అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, షట్లర్ పీవీ సింధు, అర్జున అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు. -
శ్రీహరి అక్రమ అరెస్టు దారుణం
వెంకటగిరి(సైదాపురం): వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు దారుణమని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఖండించారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేయడంతో డైవర్షన్ రాజకీయాలు చేసేందుకు శ్రీహరిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఇటువంటి హేయమైన చర్యలను ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. అరెస్టు దుర్మార్గం తిరుపతి రూరల్: సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని తుడా మాజీ చైర్మన్, చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, సలహాదారుడు, గత ప్రభుత్వంలో సీపీఆర్ఓగా పనిచేసిన ఆయనపై ప్రభుత్వం కక్షకట్టిందన్నారు. సోషల్ మీడియాలో ఎవరు ప్రశ్నించినా తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబు ప్రభుత్వం జైలుకు పంపుతోందని, న్యాయస్థానాలు మందలించినా ప్రభుత్వం, పోలీసుల తీరు మారడం లేదని నిరసించారు. అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రతి పోలీసు అధికారి భవిష్యత్తులో ఇంతకు రెండింతలు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 79,426 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,889 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య హవా
తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో శ్రీచైతన్య హవా కొనసాగించింది. సెకండ్ ఇయర్ ఎంపీసీలో జ యశ్రీ 992 మార్కులు సాధించగా, శ్రీకర్ 991 మార్కులు సాధించి రికా ర్డు సృష్టించారు. అలాగే జూనియర్ ఇంటర్ ఎంపీసీలో రిషిత 467, మ నోజ్ కుమార్ 466, వర్షి ణి 466, కార్తిక్ 466 మార్కులు సాధించి విజయదుదింభి మోగించారు. సీనియర్, జూనియర్ ఎంపీసీ విద్యార్థులు సుమారు 2,694 మంది 465కి పైగా మార్కులు సాధించారు. అలాగే జూనియర్ బైపీసీలో శ్రీజ, పావని, జయశ్రీ 451 మార్కులు, సీనియర్ బైపీసీలో సాయి సింగ్ 989 మార్కులు, ఎస్కే నజియా 988 మార్కులు సాధించారని, అలాగే ఫస్ట్ ఇయర్ బైపీసీలో సుమారు 300 మంది విద్యార్థులు 450 మార్కులపైగా వచ్చాయిని ఏజీఎం బీవీ ప్రసాద్ తెలిపారు. డీన్లు కేఎల్జీ ప్రసాద్, రామమోహన్రావు, మురళీరావు, భాస్కర్లతో పాటు ప్రిన్సిపాళ్లు ప్రతిభ చూపిన విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో మెడ్జీ విద్యార్థుల ప్రతిభ తిరుపతి రూరల్: కేసీపేటలోని మెడ్జీ జూనియర్ కళాశాల అన్ అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బి.సాత్విమక్ రెడ్డి ఎంపీసీ గ్రూపులో 465 మార్కులు సాధించగా బైపీసీలో సి.గీతామాధురి 451 మార్కులు సాధించారు. అలాగే ఎంపీసీలో 460 మార్కులు పైగా సాధించిన వారిలో 20మంది విద్యార్థులు ఉండగా బైపీసీలో 440కిపైగా మార్కులు సాధించిన వారు 15మంది ఉన్నారు. రెండో సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ నుంచి వాళ్ల చైతన్య, జి.రమణసాయి 985మార్కులు సాధించగా బైపీసీలో వి.సి.రూతిక యాదవ్ ఎ.క్రిష్ణమోహన్రెడ్డి 982 మార్కులు సాధించారు. ఎంపీసీ, బైపీసీలో 975 మార్కులకుపైగా 27మంది విద్యార్థులు సాధించినట్టు కాలేజీ ప్రిన్సిపల్ గంగాధర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
లోకేష్.. హామీలు హుష్!
మాటలు చెప్పడం సులభం.. నిలబెట్టుకోవడమే కష్టం. హామీలు గుప్పించడం సులువే.. కానీ అమలు చేసేందుకు చిత్తశుద్ధి అవసరం. గతంలో యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేశారు. భారీగా భరోసాలు ఇచ్చి యువతను మాయ చేశారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టారు. నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రలోభపెట్టారు. స్కిల్స్ పెంచి ఉపాధి అవకాశాలను ముంగిటకు తీసుకువస్తామని బీరాలు పలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అన్నింటినీ గాలికి వదిలేశారు. ఈక్రమంలోనే చినబాబు గారడీలపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. మోసపూరిత వైఖరిపై రగిలిపోతున్నారు. బకాయిలతో పాటు చెల్లించాలి యువగళంలో లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చెల్లించాలి. రెండేళ్లుగా ఒక్కో నిరుద్యోగికి ఎలాంటి బకాయిలు లేకుండా మొత్తం ఇవ్వాలి. ఏడాదికి 4లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతకు ప్రామిస్ చేశారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. – రవి యాదవ్, ఏఐఎస్ఎఫ్ ఎస్వీయూ అధ్యక్షుడు హామీలన్నీ గాలికే.. ఎన్నికల హామీలలో భాగంగా లోకేష్ ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించారు. ఒక్కటీ అమలు చేయలేదు. చివరకు జాబ్ క్యాలెండర్ పేరుతో మరోసారి దగా చేసేందుకు యత్నిస్తున్నారు. యువతను పూర్తిగా వంచించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. – అక్బర్, ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి తిరుపతి సిటీ : యువతకు ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచి జనవరి ఒకటో తారీఖునే జాబ్క్యాలెండర్ విడుదల చేస్తాం. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3వేల భృతి అందిస్తాం. పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించి యువతకు ఉపాధి కల్పించి తీరుతాం అంటూ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా హామీలు అమలు చేయకుండా కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. ఉద్యోగాల కల్పన మాట దేవుడెరుగు ఉన్నవాటిని తొలగించి చిరుద్యోగులను రోడ్డుపాలు చేస్తున్నారు. గాలం వేసి.. నామం పెట్టేశారు! యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ ఊరు వాడా తిరుగుతూ యువతతో ముఖాముఖి పేరుతో సభలు నిర్వహించి గాలం వేశారు. అధికారం చేపట్టి విద్యాశాఖమంత్రిగా తనకు మాత్రమే ఉపాధి కల్పించుకుని నిరుద్యోగులకు శఠగోపం పెట్టేశారు. రెండేళ్లుగా యువతను వంచిస్తూనే ఉన్నారు. హామీలు ఇవి.. నెరవేర్చిన తీరు నిరుద్యోగ భృతి ఊసేలేదు ఫీజు రీయింబర్స్మెంట్ చేతులెత్తేసేశారు జాబ్ క్యాలెండర్ తూతూ మంత్రం ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు అంతా మాయ స్కిల్డెవలప్మెంట్ హబ్స్ మూలన పడేశారు యువతకు హామీలేని రుణాలు ఊసే లేదు యువగళం మాటలు.. నీటి మూటలు -
మందలింపు కాదు..
పరీక్షా కాలం ముగిసింది. ఇక ఫలితాల సమయం ఆసన్నమైంది. ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుధవారం ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ పరీక్షల ఫలితాలు వెలువడనున్నట్లు సమాచారం. పరీక్షల ఫలితాలు వెలువడుతున్నాయంటే విద్యార్థులు ఒకింత మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. పరీక్షలలో తప్పడం, అనుకున్న దానికంటే తక్కువ మార్కులు రావడం, తల్లిదండ్రులు మందలిస్తారని, బంధుమిత్రులు హేళన చేస్తారని మానసిక క్షోభ అనుభవిస్తూ కుంగిపోతుంటారు. వాటి ఫలితంగా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. జిల్లాలో ప్రతి ఏడాది పరీక్షా ఫలితాలు వెల్లడైన సందర్భంగా తల్లిదండ్రుల కడుపుకోత మిగిల్చిన ఘటనలు కోకొల్లలు.తిరుపతి సిటీ: విద్యార్థులు పరీక్ష తప్పినంత మాత్రాన ఎందుకూ పనికిరారని తల్లిదండ్రులు, బంధువులు ముద్ర వేస్తూ వారిని మానసికంగా హింసించే సంస్కృతి మారాలి. పరీక్షలలో సాధించిన మార్కులు జీవితానికి కొలమానం కాదు. ఇవి కేవలం జ్ఞాపకశక్తికి సంబంధించిన అంకెలు మాత్రమే. విద్యార్థుల భవిష్యత్తును మార్కులు శాసించలేవు. పరీక్షలలో తప్పిన విద్యార్థులను తల్లిదండ్రులు మందలించడం మాని, వారికి ధైర్యం చెప్పి, ప్రోత్సహించాలి. అప్పుడే వారు మరింత దృఢంగా తయారై ఏ పరీక్షలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. పరీక్ష తప్పిన విద్యార్థుల కోసం, తక్కువ మార్కుల వచ్చిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ, ఇన్స్టెంట్, ఇంప్రూవ్మెంట్ రూపంలో ప్రతి ఏడాది ఫలితాలు విడుదలైన కేవలం నెల రోజులలోనే పరీక్షల మళ్లీ నిర్వహిస్తారు. అందులో విజయం సాధించేందుకు కృషి చేయాలి తల్లిదండ్రులూ.. ఇవి పాటించండి! పరీక్ష ఫలితం విద్యార్థులకు కొలమానం కాదు సమాజంలో మార్పు రావాలి ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు విద్యార్థులను ర్యాంకులు, మార్కుల పేరుతో ఒత్తిడిని చేయడం దారుణం. గతంలో ఉమ్మడి కుటుంబాలలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అవ్వాతాతలు, రక్త సంబంధీకులు ఉండటంతో విద్యార్థులు వారి సలహాలు సూచనలు పాటిస్తూ ఒత్తిడికి దూరంగా ఉండే వారు. ప్రస్తుతం చిన్న కుటుంబాలలో భార్యాభర్త, పిల్లలు వేరుగా నివశిస్తూ పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఆఫీసర్లుగా చూడాలని ఏదో సాధించాలనే విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు సైతం తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు విద్యార్థులపై ఒత్తిడి తేవడంతో విద్యార్థులు మానసికంగా కుంగిపోయి తక్కువ మార్కులు వస్తే ఇక జీవితం లేదనే ఆలోచనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువే జీవితం కాదు ప్రపంచంలో ఎన్నో రంగాలలో రాణివంచవచ్చనే విషయాన్ని విద్యార్థి దశలో తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు, విద్యాసంస్థలకు ఉంది. – డాక్టర్ నాగేశ్వరరావు, మానసిక వైద్య నిపుణుడు, తిరుపతి -
పేరులోనూ వివాదమే..!
క్రికెట్ స్టేడియానికి దిగ్గజ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, కపిల్దేవ్ పేరు పెట్టాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సూచించారు. ఈ క్రమంలోనే అపట్లో నిర్మించిన మాస్టర్ప్లాన్ రోడ్లకు సైతం రాజకీయాలకు అతీతంగా మహనీయుల పేర్లు పెట్టారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం క్రికెట్ స్టేడియానికి ఎన్టీఆర్ పేరు పెట్టింది. దీనిపై తిరుపతి వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రతిష్టకు సంబంధించి విషయాల్లో రాజకీయాలను తీసుకురావడంపై మండిపడుతున్నారు. ఇప్పటికై నా తప్పు సరిదిద్దుకుని క్రీడాకారుల పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఢిల్లీ సీఎంకు సాదర స్వాగతం
రేణిగుంట: తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖగుప్తాకు విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బీడీ బాలాజీ తదితర నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన ఆమె తిరుమలకు వెళ్లారు. గంజాయి రవాణా బట్టబయలు తిరుపతి క్రైం: తిరుపతి నగరంలో గంజాయిమ రవాణాపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపురం సర్కిల్ వద్ద జరిగిన ఈ ఘటనకు కేసు నమోదు చేశారు. తిరుపతి అర్బన్ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వి.సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పడాల రోహిత్ జగ్గిరెడ్డి (24), ఆర్.ఆదిత్య కుమార్ అమ్మన్ (21), బి.విల్వన్ (23)లను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు రోహిత్, ఆదిత్యతో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 10 కిలోల గంజాయి కొనుగోలు చేసి ట్రైన్లో తిరుపతికి తీసుకొచ్చారు. అందులో 6 కిలోలను ఇప్పటికే విక్రయించి, మిగిలిన 4 కిలోలను అమ్మేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముద్దాయిల వద్ద నుంచి రూ.80,000 విలువ చేసే 4 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్పై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. -
ప్రయత్నిస్తే విజయం తథ్యం
పరీక్ష తప్పిన విద్యార్థి మళ్లీ ప్రయత్నిస్తే అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంది. ఒకసారి దెబ్బతింటే చేసిన తప్పును సరిద్దిదుకుని మరింత ఉత్సాహంతో ముందుకెళ్లే శక్తి విద్యార్థులలో ఉంటుంది. వారిని తల్లిదండ్రులు ధైర్యం చెప్పి ప్రోత్సహించాలి. నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తే సూటిపోటి మాటలు ప్రమాదకరం. దేశంలో 50 శాతం మంది అధికారులు పలు పరీక్షలలో తప్పి మళ్లీ పుంజుకుని నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. – ప్రమీలమ్మ, విశ్రాంత అధ్యాపకురాలు, తిరుపతి సానుకూల దృక్పథంతో స్వీకరించాలి విద్యార్థులు పరీక్షల ఫలితాల్లో తప్పితే ఏదో కోల్పోయినట్లు భావించడం దారుణం. మార్కులు అనేవి కేవలం విద్యార్థి రాసిన సమాధానాలను మూల్యాంకనం చేసినవి మాత్ర మే. ఇవి విద్యార్థుల జీవితాలకు కొలమానం కాదు. అలాగే భవిష్యత్తును నిర్ణయించే గీటురాయి కాదు. వీటిని విద్యార్థులు, తల్లదండ్రులు సానుకూల దృక్పథంతో స్వీకరించాలి. మరో ప్రయత్నం కోసం మరింత కృషి చేసేందుకు అవకాశం ఇవ్వాలి. ఇతరుల మార్కులతో తమ పిల్లల మార్కులను పోల్చడం హేయమైన చర్య. ఇది పిల్లల ప్రాణాలకే ప్రమాదం. – ఎ.గోపాలకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు, తిరుపతి జిల్లా ఎంతో మంది దిశానిర్దేశం చేస్తున్నారు విద్యార్థి దశలో పలు పరీక్షలలో తప్పిన ఎంతో మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇంజినీర్లు, డాక్టర్లుగా రాణిస్తున్నారు. దేశ రాజకీయాలలో సైతం ఉన్నత పదవులలో ఉన్నవారు. పరీక్ష తప్పితే ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని గమనించి ఆ తప్పు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడితే విజయం తథ్యం. అంతేకానీ పరీక్ష తప్పితే జీవితం అంతం చేసుకోవడం, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చడం పిరికిపందల చర్య. విఫలమైతే మరింత కృషి చేసి విజయాన్ని బంధువులకు, సమాజానికి చూపించే ప్రయత్నం చేయాలి. అది విద్యార్థికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. – కేఆర్ శేఖర్రెడ్డి, అధ్యాపకులు, తిరుపతి -
అంతా భ్రాంతే..!
ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు ఇస్తామని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. అంతా భ్రాంతిగానే మిగిలిపోయింది. 2014లో కూడా ఇలాగే మోసం చేశారు. చంద్రబాబు మాదిరిగానే లోకేష్కు కూడా ఇది అలవాటుగా మారిపోయింది. – శకుంతల, ఎమ్మెస్సీ పీహెచ్డీ మూగబోయింది యువగళం పాదయాత్ర అంటూ హంగామా చేసిన మంత్రి లోకేష్ అధికారం వచ్చిన తర్వాత ఆ గళం మూగబోయింది. భృతి అందిస్తూ ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తామని, ఇప్పుడు ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. యువతను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే. – శివ శంకర్ నాయక్, జీఎన్ఎస్ రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు ఇప్పటికై నా నెరవేర్చాలి రెండు ఏళ్లుగా జిల్లాలో సుమారు 15వేల మంది విద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్ అందలేదు. దీంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను టార్ఛర్ పెట్టి ఫీజులు కట్టించుకున్నాయి. ఫీజు కట్టిన వారికే హాల్టికెట్లు, సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఇప్పటికై నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. – భార్గవ్, జై భారత్ విద్యార్థి విభాగం అధ్యక్షులుగాలికి వదిలేశారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నారా లోకేష్ గాలికి వదిలేశారు. నిరుద్యోగ యువతను వంచించారు. ఒక్క మాటను కూడా నిలబెట్టేకునే ప్రయత్నం కూడా చేయకపోవడం దారుణం. ఇలాంటి నేతలను ఎక్కడా చూడలేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. – ఆషా, పీడీఎస్ఓ, జిల్లా కార్యదర్శి -
చిల్లకూరులో తాగునీటికి ఇక్కట్లు
పెళ్లకూరు: మండలంలోని చిల్లకూరు గ్రామంలో తాగునీటి వాటర్ప్లాంట్కు వేసిన తాళం తీయకపోవడంతో గత మూడు రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఉన్న తాగునీటి వాటర్ప్లాంట్కు ఈనెల 12న తాళాలు వేసుకొని ఇంటికి వెళుతున్న నిర్వాహకుడు కాటూరు లక్ష్మయ్యపై అదే గ్రామానికి చెందిన దువ్వూరు రాకేష్రెడ్డి, చింతంరెడ్డి కృష్ణారెడ్డి, మరో ఇద్దరు దాడి చేశారు. వాటర్ప్లాంట్ తాళాలను దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయారు. దీంతో మూడు రోజులుగా వాటర్ప్లాంట్ తాళాలు తీయకపోవడంతో గ్రామంలో తాగునీటికి స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ ప్రత్యేకాధికారి, స్థానిక తహశీల్దార్ హరికృష్ణను వివరణ కోరగా వాటర్ప్లాంట్ తాళాలు తమ వద్ద ఉన్నాయని, త్వరలో ఓ వ్యక్తిని ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున వాటర్ ప్లాంట్ నుంచి మంచినీరు గ్రామస్తులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
కబ్జా కోరల్లోకి దామినేడు భూమి
సాక్షి టాస్క్ఫోర్స్: దామినేడు ప్రభుత్వ భూములను భూకబ్జాదారుల నుండి కాపాడాలని సీపీఐ నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథ్ డిమాండ్. మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో దామినేడులో వంక పొరంపోగు భూమి ఆక్రమణకు గురవుతూ పక్కా భవనాలు నిర్మిస్తున్న భూమిని పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయం ఆనుకొని ఉన్న దామినేడు గ్రామ లెక్క దాఖల సర్వేనెంబర్ 185/1లోని 2.56 ఎకరాలు వంక పోరంబోకు భూమిలో భూ కబ్జాదారులు విచ్చలవిడిగా భవనాలు నిర్మిస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులకు, భూ కబ్జాదారులకు అమ్ముడుపోయి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలిపారన్నారు. రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పేదలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతి, తిరుపతి రూరల్ ప్రాంతాలలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు భూ కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయన్నారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు వాటిని గుర్తించి పేదలకు పంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తక్షణమే జోక్యం చేసుకొని దామినేడులో జరుగుతున్న భూకబ్జాలపై విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని కాపాడి పేదలకు పంచాలని కోరారు. నారా లోకేష్కు ఫిర్యాదు చేస్తాం దామినేడులో అధికార పార్టీ నేతలు, అధికారులు కలసి చేస్తున్న భూ కబ్జాలపై మంగళవారం తిరుపతి నగరానికి వస్తున్న మంత్రి నారా లోకేష్ను సీపీఐ నాయకత్వంలో కలవనున్నట్లు తెలిపారు. దామినేడులో జరుగుతున్న భా కబ్జాలపై ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నదియా, నగర కార్యవర్గ సభ్యులు పద్మనాభరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, మునీశ్వర్, రాము, విజయ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓటేరు గ్రామ పంచాయతీ వద్ద దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓటేరు చెరువుకు పడమర వైపున ఉన్న ముళ్ల పొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం మంగళవారం బయటపడింది. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళ వారం నుంచి పది రోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటకు కనిపించే స్థితిలో ఉండడంతో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. స్థానిక వీఆర్ఓ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతి వెనుక అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తుండడంతో అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్న పోలీసులు ముందుగా మృతురాలు ఎవ్వరు అన్న విషయం తెలుసుకునే పనిలో పడ్డారు. ఎక్కడైనా మహిళ అదృశ్యమైనట్టు సమాచారం ఉంటే వారి వివరాలతో తిరుపతి రూరల్ పోలీసులను సంప్రదించాలని సీఐ మద్దయ్య ఆచారి కోరుతున్నారు. ఆర్టీసీ బస్టాండు వద్ద యువకుడి మృతి నాగలాపురం: మండలంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండు వెనుక ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బస్టాండ్ వెనుక చెత్తాచెదారం మధ్య ఓ యువకుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి యువకుడు స్థానిక బీసీ కాలనీకి చెందిన విజయ్(30)గా గుర్తించారు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారని, విజయ్ గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై చనిపోయినట్లు విచారణలో తెలిపారు. అతని బంధువుల వద్ద నుండి ఎటువంటి ఫిర్యాదు అందలేదు. మృతదేహాన్ని యువకుడి బంధువులైన ముత్తుకు అప్పగించారు. స్ఫూర్తిప్రదాతకు ఘన నివాళి తిరుపతి కల్చరల్: సమాన హక్కులు, బడుగు బలహీనవర్గాలకు అవకాశాలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన జాయింట్ కలెక్టర్ గోవిందరావు, కూటమి నేతలు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ భరత్కుమార్తో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కువ శాతం ఎస్సీ గ్రామాలు ఉన్నాయని, అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి తిరుపతిలో 1.15 ఎకరాలను మంగళంలో స్థలం గుర్తించామన్నారు. త్వరలో అంబేడ్కర్ భవన్ నిర్మించడానికి ప్రతిపాదన సిద్ధం చేస్తామని తెలిపారు. మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పరసా రత్నం పాల్గొన్నారు. -
టీడీపీ నేతల కబ్జా నుంచి కాపాడండి
తిరుపతి కల్చరల్: ఎంతో కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో కూతుళ్ల పేరుపై కొనుగోలు చేసిన పక్కా రిజిస్ట్రేషన్ భూమిని కొందరు టీడీపీ నేతలు దౌర్జన్యంగా కబ్జా చేశారని, కాపాడాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. వారు మంగళవారం తిరుపతి ప్రెస్క్లబ్లో పుదిపట్లకు చెందిన బాధితుడు ఏసీ.వెంకటప్ప తమ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ రెవెన్యూ లెక్క దాఖలాలోని 41 అంకణాల స్థలాన్ని గత ఏడాది మార్చి 17వ తేదీన రూ.57 లక్షలు వెచ్చించి తన కుమార్తెలు రేణుక, తనూజ పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. సదరు భూమి కొనుగోలు చేసినప్పటి నుంచి పెరుమాళ్లపల్లి పంచాయతీకి చెందిన కత్తి సుధాకర్ తమ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే దురుద్దేశంతో దళితులమైన తమ కులం పేరును ప్రస్తావిస్తూ దూషణలకు పాల్పడేవాడని తెలిపారు. దీనిపై గత మార్చి ఒకటో తేదీన తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీస్స్టేషన్లో న్యాయం జరగక, కబ్జాదారులకు వత్తాసు పలకడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. దీంతో గత మార్చి 9న కోర్టు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసిందన్నారు. అయినా ఆక్రమణలు ఆగలేదని, ఈ అన్యాయంపై జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. రమణమ్మ, రాజేశ్వరి, పొన్నయ్య పాల్గొన్నారు. -
వరవకాలువలపై భూబకాసురులు
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోనీ మంగళపురి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను, పాఠశాల భూములను, చెరువులకు నీళ్లు వచ్చే వరవ కాలువలను మట్టితోలి చదును చేసి అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. పలువురు ఆక్రమణదారులు ఎ.వెంకటేష్, ఎస్. కాలేషా ప్రభుత్వ భూమి, ఎం.వెంకటేష్ పాఠశాల భూమి ఆక్రమించుకుని చదును చేశారు. పైభూములు శ్రీకాళహస్తి, ముచ్చివోలు, పల్లంపేట, వెంకటగిరి ఆర్అండ్బీ రోడ్డుకు పక్కన ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, వెంటనే స్పందించి సర్వే నిర్వహించి, భూ బకాసురుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలని మంగళపురి గ్రామస్తులు కోరుతున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయ స్టిక్కర్ – టీడీపీ స్టిక్కర్తో తిరుమలకు ద్విచక్ర వాహనం తిరుమల: అధికార టీడీపీ స్టిక్కర్ ఉన్న ఓ ద్విచక్ర వాహనం మంగళవారం తిరుమలలో దర్శనమివ్వడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పవిత్రక్షేత్రం తిరుమలలో రాజకీయాలకు ఎలాంటి స్థానం ఉండకూడదని, రాజకీయ పార్టీల బ్యానర్లు, స్టిక్కర్లతో రాకూడదని నిబంధన ఉంది. అయితే మంగళవారం ఓ ద్విచక్ర వాహనం తెలుగుదేశం పార్టీ స్టిక్కర్లతో తిరుమలకు చేరుకుంది. ఈ సంఘటనతో తిరుమలలో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ విజిలెన్స్ విభాగం పనితీరుపై భక్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
అలసత్వం వహిస్తే సహించం
తిరుపతి క్రైమ్ : కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది అలసత్వం లేకుండా పనిచేయాలని ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. మంగళవారం న్యూ డీపీఓ కార్యాలయంలో జిల్లావ్యాప్తంగా కోర్టు విధులు నిర్వర్తించే పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2024, 2025, 2026 సంవత్సరాలకు సంబంధించిన కోర్టు కేసుల డిస్పోజల్, పెండింగ్ నాన్–బెయిలబుల్ వారెంట్స్, పీఆర్సీ కేసులు, అలాగే సీసీ, ఎస్సీ కేసుల పురోగతిపై సమగ్ర సమీక్ష చేపట్టారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల స్థితిని పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ కోర్టు విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం కూడా సహించబోదని స్పష్టం చేశారు. ప్రతి కేసును సమయానికి కోర్టుకు హాజరు పరచడం, ఎన్బీడబ్ల్యూఎస్ను త్వరితగతిన అమలు చేయడం, కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం అత్యంత అవసరమని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం కూడా కేసుల ఆలస్యానికి దారితీస్తుందని, దీంతో న్యాయ ప్రక్రియకు ఆటంకం కలగవచ్చని హెచ్చరించారు. మౌంటెడ్ సిస్టమ్ను సమర్థవంతంగా ఉపయోగించి కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దష్టి సారించి, పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ద్వారా డిస్పోజల్ శాతాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. కోర్టు సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కోర్టు విధుల్లో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బంది చట్టపరమైన అవగాహన పెంపొందించుకుని, న్యాయవ్యవస్థతో సమన్వయంగా పనిచేయడం ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా కృషి చేయాలని కోరారు. బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేసే సిబ్బందిని ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదనపు ఎస్పీ వెంకటరావు , డీఎస్పీ రమణ పాల్గొన్నారు. -
మహనీయుని సేవలు మరువలేం
తిరుపతి కల్చరల్ : సామాజిక న్యాయం, సమానత్వమే అంబేడ్కర్ ఆశయమని, ఆ మహనీయుని సేవలు మరువలేమని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి కొనియాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ దేశంలోని అన్నివర్గాలకు సమన్యాయం చేయాలనే ఆకాంక్షతో రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. అయితే ప్రస్తుం రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎస్సీలను భయభ్రాంతులకు గురిచేసి తక్కువ ధరకే భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా పాలన సాగిస్తేనే ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. సమ సమాజ మార్గదర్శి అంబేడ్కర్ సమ సమాజ మార్గదర్శి అంబేడ్కర్ అనిని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. మంగళవారం మహతి కళాక్షేత్రంలో అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రణాళికతో దేశ ప్రజలకు దిశానిర్దేశం చేసిన నేత అంబేడ్కర్ అని కొనియాడారు. జర్నలిస్టు ఎం.సతీష్చందర్ మాట్లాడుతూ దేశ భవిషత్తును మలిచిన మహానుభావుడు అంబేడ్కర్ అని వెల్లడించారు. అనంతరం 60 మంది ఉద్యోగులకు అంబేడ్కర్ కమ్యూనల్ అవార్డులు ప్రదానం చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది ఖాసిం, డిప్యూటీ ఈఓ ఆనందరాజు, టీటీడీ సీపీఆర్ఓ డాక్టర్ రవి పాల్గొన్నారు. -
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
– సీపీఎం జిల్లా కమిటి సభ్యుడు జయంద్ర డిమాండ్ చంద్రగిరి: దామినేడులోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న ఆక్రమణదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జయచంద్ర డిమాండ్ చేశారు. తిరుచానూరు పంచాయతీ దామినేడులోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న భూ ఆక్రమణలపై ఆయన మంగళవారం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. దామినేడులో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించి ప్లాట్లు వేసి, అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో దర్జాగా కబ్జా జరుగుతుంటే అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఎక్కడపడితే అక్కడ వాగు పోరంబోకులు, ఇనాం భూములు, డీకేటీలు ఇలా అన్ని రకాల ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తుంటే చూస్తూ ఉండడం దారుణం అన్నారు. తక్షణమే కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని జిల్లా కలెక్టర్కు సీపీఎం తరఫున విజ్ఞప్తి చేసున్నట్లు తెలిపారు. -
తిరుపతి జిల్లాలో అధికార పార్టీ నాయకుల అండ ఉంటే చాలు..ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా జెండా పాతేయొచ్చు. అధికారులున్నారనే కదా.. అని మీ అనుమానం. ఇదంతా షరా‘మామూలే’ అంటూ యంత్రాంగం కళ్లప్పగించి చూస్తుండడంతో అక్రమార్కుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. దీంతో రూ.కోట్ల విలు
దామినేడులో ఆరు ఎకరాల భూమి ఆక్రమణ ఇనాం భూమిలో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలు సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కూత వేటు దూరం.. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన వాగు పోరంబోకు, ఇనాం భూమి ఆక్రమణకు గురవుతోంది. టీడీపీ నేత ముఖ్య అనుచరుడు దర్జాగా కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నాడు. రూ.కోట్లు విలువచేసే భూములు యథేచ్ఛగా ఆక్రమించి, సొమ్ము చేసుకుంటున్నా ఉన్నతాధికారులు కానీ, స్థానిక రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రగిరి నియోజక వర్గం తిరుపతి రూరల్ మండలం దామినేడు పరిధిలో సర్వే నంబర్ 185/1లో 2.56 ఎకరాలు, సర్వే నంబర్ 207, 208లోని సుమారు 4 ఎకరాల ఇనాం భూమి ఉంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూమి పది రోజులుగా ఆక్రమణలకు గురవుతోంది. ఇటీవలే ఆ భూములకు ఆనుకుని కోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. న్యాయస్థాన భవన నిర్మాణాలు చేపట్టనుండడంతో రహదారి ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారికి, కొత్తగా ఏర్పాటు చేస్తున్న రోడ్డుకి ఆనుకుని వాగు పోరంబోకు, ఇనాం భూములు ఉండడంతో స్థానిక టీడీపీ నాయకుని కన్నుపడింది. జిల్లాకు చెందిన ముఖ్య నాయకుని అండదండలతో ఇద్దరు రెవెన్యూ అధికారుల సహకారంతో రంగంలోకి దిగిన టీడీపీ నాయకుడు ప్లాట్లు వేసి బేరం పెట్టారు. అధికారం మాదే.. మీకేం కాదని చెప్పి.. వాగు పోరంబోకు భూమి, ఇనాం భూముల్లో ఒక్కో ప్లాటు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల చొప్పున విక్రయించటం ప్రారంభించారు. తిరుపతికి అతి సమీపంలో.. జాతీయ రహదారికి ఆనుకున్న తక్కువ ధరకు ఇంటి ప్లాటు విక్రయిస్తున్నారని తెలుసుకున్న కొందరు కూడబెట్టుకున్న సొమ్ము, అప్పులు చేసి కొనుగోలు చేసుకుంటున్నారు. కొనుగోలు చేసుకున్న ప్లాటుకు సంబంధించి రికార్డులు అడిగితే.. ‘అధికారం మాదే.. మీకేం కాదు.. ఇల్లు కట్టేసుకోండి, నేను చూసుకుంటాను’ అని వారికి మాయ మాటలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక పేపర్లో నంబర్లు వేసి, సంతకాలు చేసి ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. వాటిని నమ్మి అమాయకులైన జనం ఆ ప్లాట్లను కొనుగోలు చేసుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. వాగు పోరంబోకు భూమిలో జరుగుతున్న నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు చేపడితే ఎప్పటికై నా కొట్టేయాల్సిందే అధికార పార్టీ వారి మాయమాటలు నమ్మి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్న వారికి ఆ భూమి వాగు పోరంబోకు, ఇనాం భూములని తెలియకపోవచ్చని స్థానికులు చెబుతున్నారు. కొనుగోలు చేసే వారంతా స్థానికేతరులు కావడంతో టీడీపీ నాయకుని ఆటలు సాగుతున్నాయంటున్నారు. కలెక్టరేట్కి కూత వేటు దూరంలో ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణ జరుగుతుంటే అధికారులకు తెలియకుండా ఉండదని స్థానికులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలు ఎప్పటికై నా కూలదోయాల్సిందేనని రెవెన్యూ అధికారి ఒకరు స్పష్టం చేశారు. -
రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాధికారులకు చోటు
తిరుపతి మంగళం : రాష్ట్ర రవాణాశాఖ సాంకేతిక అధికారుల సంఘం ఎన్నికలను ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో తిరుపతి జిల్లా రవాణాశాఖకు చెందిన నలుగురు అధికారులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. పుత్తూరుకు చెందిన వాహనాల తనిఖీ అధికారి చంద్రశేఖర్ రాష్ట్ర అసో సియేట్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే రాయలసీమ జోనల్ ప్రెసిడెంట్గా మోటారు వాహనాల తనిఖీ అధికారి వెంకటరమణా నాయక్, జోనల్ సెక్రటరీగా అతికానాజ్, జిల్లా రెప్రజెంటీవ్గా స్వర్ణలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా రవాణాశాఖలో పనిచేస్తున్న నలుగురు మోటారు వాహనాల తనిఖీల అధికారులు రాష్ట్ర రవాణాశాఖ సాంకేతిక అధికారుల సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమని జిల్లా రవాణాశాఖాధికారి అన్నారు. వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
చదువు దాసోహం
కార్పొరేట్లకుకార్పొరేట్ క్లాసులు షురూ! తిరుపతి సిటీ: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ముగిసి కనీసం పది రోజులు గడవలేదు.. ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చేందుకు మరో 20 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు దాదాపు పూర్తి చేశారు. ఇంటర్తోపాటు జేఈఈ, నీట్ కోచింగ్ల పేరుతో తమదైన శైలిలో తల్లిదండ్రులకు వల వేసి, రూ.లక్షల్లో ఫీజులు సైతం కట్టించుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో పది ఫలితాలు రాకముందే తరగతులు ప్రారంభించారు. ఒత్తిడి నుంచి కోలుకోక ముందే తరగతులా! పది పరీక్షలు రాసిన విద్యార్థులకు కనీసం పది రోజుల విరామం కూడా లేకుండా మళ్లీ ఇంటర్ తరగతులకు హాజరు కావాలంటే ఎలా? అని విద్యార్థులు మనోవేదన చెందుతున్నారు. కనీసం పరీక్షల ఒత్తిడి నుంచి కోలుక ముందే ఇంత దారుణంగా మళ్లీ తరగతులకు హాజరుకావాలని, తమ ప్రాణాలు తీస్తున్నారని విద్యార్థులు బహిరంగంగా కార్పొరేట్ సంస్థలపై విరుచుకుపడుతున్నారు. కానీ తల్లిదండ్రులకు లేనిపోనివి చెప్పి, ఇంటర్ సిలబస్ను బ్రిడ్జ్ కోర్సు రూపంలో అందిస్తున్నామని, విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వల వేస్తున్నాయి. విద్యార్థులు తల్లిదండ్రుల ఒత్తిడితో ఏమీ చేయలేని పరిస్థితిలో తరగతులకు హాజరువుతున్నారు. భావిభారతం తరగతి గదుల్లో నిర్మితమవుతుందని ఎందరో మహానుభావులు వెల్లడించారు. అలా దేశవ్యవస్థను మార్చే విద్యారంగం నేడు ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లింది. చదువులతల్లి సరస్వతి కొందరికి లక్ష్మీదేవిగా మారింది. ప్రమాణాలు, నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు పది పరీక్షల ఫలితాలు రాకనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు చేసుకుని, బ్రిడ్జ్ కోర్సు పేరున తరగతులు ప్రారంభించేశాయి. పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం తమ జేబులు నింపుకుని చోద్యం చూస్తూ విధి నిర్వహణ మరిచిపోయింది. ఫలితంగా విద్యారంగం దోపిడీగా మారింది. -
ఎర్రచందనం కేసులో ముగ్గురికి జైలు
తిరుపతి లీగల్: ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో ముగ్గురికి రెండేళ్లు వంతున జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి శ్రీకాంత్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2011 ఏప్రిల్ 22వ తేదీ బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు బుచ్చిరెడ్డిపాలెం, జొన్నవాడ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో ఓ టిప్పర్లో 78 ఎరచ్రందనం దుంగలు తరలిస్తుండగా గుర్తించారు. పిచ్చాటూరు మండలం, కీలపూడికి చెందిన బి వెంకటాచలం, అదే మండలం రామగిరికి చెందిన గోపాల్ రెడ్డి శంకర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెం మండలం, ఖాజానగర్కు చెందిన షేక్ షాకీర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ముగ్గురిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రేంజ్, సంగం సెక్షన్ ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్ సిబ్బంది ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముగ్గురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ముగ్గురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం
తిరుపతి అర్బన్: మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి సోమవారం మధ్యాహ్నం కలెక్టర్తోపాటు ఎస్పీ సుబ్బరాయుడు, అటవీశాఖాధికారి సాయిబాబతో కలసి తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. 800 హెచ్పీ సామర్థ్యం కలిగిన స్టీల్ బోట్ను ఏర్పాటు చేసి, ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మన ప్రాంతానికి వచ్చే బోట్లకు అడ్డుకట్టవేయడంతోపాటు వారిపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు 24 గంటల గస్తీ విధానం అమలు చేస్తామన్నారు. మైరెన్ పోలీసులతో సమన్వయం చేసుకుని లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, బైనాక్యులర్స్ వంటి అవసరమైన సామగ్రి అందజేస్తామని చెప్పారు. మైరెన్ పోలీసులకు సుమారు రూ.25 లక్షల నిధులు మంజూరు చేసి, అవసరమైన పరికరాలు కొనుగోలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జువ్వలదిన్నె ప్రాంతంలో చిన్న జెట్టీ ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, త్వరితగతిన చర్యలు చేపడతామని తెలిపారు. భద్రత బలోపేతానికి కమిటీలు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మత్స్యకారుల భద్రత మరింత బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామం నుంచి ప్రతినిధులను తీసుకుని, మత్స్యకారులు, ఫిషరీస్ శాఖ, మైరెన్ పోలీస్తో సమన్వయ వ్యవస్థగా పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే స్పందించేలా ఈ కమిటీలు పనిచేస్తాయని చెప్పారు. అవసరమైతే సాగర మిత్రలు లేదా ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా వినియోగిస్తామన్నారు. ప్రస్తుతం కృష్ణపట్నం నుంచి కార్యకలాపాలు నిర్వహించడంతో సమయం ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో, సమీప ప్రాంతంలో కొత్త జెట్టీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డి, మత్స్యశాఖ అధికారి రాజేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
భార్యపై భర్త దాడి
సైదాపురం: చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి, భార్యపై భర్త దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన సైదాపురం మండలం ఆదూరుపల్లి గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. ఆదూరుపల్లి గిరిజన కాలనీకి చెందిన బండి సురేష్ ,భార్య పోలమ్మలు కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వారు. ఈ క్రమంలో ఆదివారం వారి మధ్య వివాదం జరిగింది. వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అగ్రహించిన భర్త సురేష్ తాగిన మత్తులో అక్కడే ఉన్న కొడలితో భార్య పోలమ్మపై దాడి చేశాడు. దీంతో పోలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సోమవారం హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఆత్మహత్య సూళ్లూరుపేట: పట్టణంలోని సీపీఎం కార్యాలయానికి పక్కనే నివాసం ఉంటున్న అల్లూరు సరళారెడ్డి (59) సోమవారం మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆర్థిక పరమైన లావాదేవీల కారణంగా ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. సంఘటన జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ అజయ్కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడే ముందు ఓ లేఖ రాసి ఉండగా దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దానిపై విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీర్థంపాడులో అగ్నిప్రమాదం డక్కిలి: మండలంలోని తీర్థంపాడులో గురువా రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమణయ్య చిల్లర దుకాణం, బలం రమణయ్య, వెంకటాద్రి, సుగుణమ్మలకు చెందిన ఐదు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంకటగిరి, రాపూరు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 4 లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు. -
ఏపీసీ సరెండర్
– డీఈఓకు ఏపీసీగా అదనపు బాధ్యతలు తిరుపతి అర్బన్: విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న సమగ్రశిక్షా ఏపీసీ గౌరీశంకర్రావును సరెండర్ చేశారు. సాక్షి దినపత్రికలో ఆదివారం ‘సమగ్రశిక్షలో లైంగిక వేధింపులు’ అనే శీర్షికతో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమగ్రశిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ)గౌరీశంకర్రావుపై అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ అనంతరం డీఈఓ కేవీఎన్ కుమార్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్కు వివరాలను నివేదించారు. దీంతో సీరియస్గా తీసుకున్న కలెక్టర్ అలాంటి ఉద్యోగులు మనకు అవసరం లేదంటూ ఆయన్ని సరెండర్ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే సమగ్రశిక్ష ఏపీసీగా డీఈఓకు అదనపు బాధ్యతగా అప్పగించారు. అయితే ఈ అంశంపై పూర్తి నివేదిక కోసం ఏపీసీ గౌరీశంకర్రావును త్వరలోనే సమగ్రంగా విచారణ చేపట్టనున్నారు. నిజనిర్థారణ అనంతరం శాఖాపరమైన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్చండి తిరుపతి అర్బన్: బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్చాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ డీఈఓని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా ‘మన సంకల్పం–విద్యా ప్రగతి’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని ఆదేశించారు. బడిఈడు పిల్లలు ఇతర పనులు చేస్తుంటే వారి తల్లిదండ్రులకు చదువుతోనే అభివృద్ధి సాధ్యమనే అంశంపై అవగాహన కల్పించి, వారి పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యను అందిస్తున్న విషయాలను విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు వివరించాలని వెల్లడించారు. ఏప్రిల్ 23 తర్వాత జూన్ 11 వరకు పెద్ద ఎత్తున ప్రచారం చేసి, విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డీపీఓ సుశీలాదేవి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్కుమార్రెడ్డి, సీపీఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హమ్మయ్యా.. పుస్తకాలు వచ్చాయోచ్! తిరుపతి సిటీ: ఎట్టకేలకు ఇంటర్మీడియట్ పుస్తకాలు వచ్చాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమై 15 రోజులు గడిచాయి. తరగతలు ప్రారంభమైన రోజునే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ పేరుతో విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం సమయానికి పుస్తకాలు అందించడంలో విఫలమైంది. దీంతో విద్యార్థులు గత 15 రోజులుగా ఉత్తి చేతులతో తరగతులకు హాజరై కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి నూతన సిలబస్తో కూడిన పుస్తకాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సహకారంతో జిల్లాలోని ఆర్ఐఓ కార్యాలయానికి చేరవేశారు. కార్యాలయ సిబ్బంది జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలకు చేరవేసే ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో బుధవారం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు నూతన పుస్తకాలను అందించనున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలు తెలియజేయాలి చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ 2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతులు కల్పించనున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగోన్నతుల ప్రక్రి య పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జెడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ మేనేజ్మెంట్ పరిధిలోని స్కూల్ అసిస్టెంట్ల సాధారణ ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేశామన్నారు. ఈ సీనియారిటీ జాబితాను ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని డీవైఈవో, ఎంఈవోలకు పంపినట్లు చెప్పారు. ఉద్యోగోన్నతులకు అర్హులైన టీచర్లు జాబితాలను పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 16వ తేదీలోపు తగు ఆధారాలతో చిత్తూరు డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు. గడువు తేదీ ముగిసిన తర్వాత అందే అభ్యంతరాలను స్వీకరించేది లేదని డీఈవో వెల్లడించారు. -
మంచం పట్టిన కూచివాడపాళెం దళితవాడ
నాయుడుపేట టౌన్: మండలంలోని కూచివాడపాళెంలో పలువురు విషజ్వరాల బారిన పడి, అల్లాడిపోతున్నారు. కూచివాడపాళెం దళితవాడలో 130కి పైగా ఇళ్లు ఉన్నప్పటికీ ప్రతి ఇంట్లో జ్వరపీడితులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నా రు. జ్వరాలతో జనం మంచం పట్టి, నానా అవస్థలు పడుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. నాలుగు రోజు ల క్రితం గ్రామంలో పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించారని, అయితే ప్రతి ఇంటికీ వచ్చి చికిత్సలు అందించలేదని గ్రామస్తులు వాపోయారు. దళిత కాలనీలో పలువురు జ్వరపీడితులు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, నాయుడుపేట, గూడూరు తదితర పట్టణాల్లోని ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు. దళిత కాలనీలోని నిరుపేదలమైన తాము రూ.వేలు వైద్యం కోసం వెచ్చాల్సి వస్తోందని పలువురు బాధితులు వాపోయారు. గ్రామానికి స్వర్ణ ముఖి నది నుంచే వచ్చే తాగునీటిని సైతం ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇచ్చి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. గ్రామంలో రోజురోజుకు జ్వరాలు అధికం అవుతున్నాయని, గ్రామంలోనే రెండు మూడు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిభిరం నిర్వహించి పరీక్షలు చేయాలని కోరుతున్నారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తాం కూచివాడపాళెంతోపాటు దళితవాడలో పలువురు జ్వరాల బారిన పడిన విషయం వాస్తవమేనని గొట్టిప్రొలు పీహెచ్సీ వైద్యులు డాక్టర్ శంకర్రావు అన్నారు. గ్రామంలో నాలుగు రోజులు కిందట వైద్య శిబిరం ఏర్పాటు చేసి, జ్వరపీడితు లకు చికిత్సలు చేశామన్నారు. ఇంకా పలువురికి జర్వాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. -
మండలస్థాయిలోనే పరిష్కరించండి
తిరుపతి అర్బన్: చిన్న చిన్న సమస్యలను మండల, డివిజన్ స్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్కు వచ్చి అర్జీలు ఇవ్వడంలో తప్పులేదని, అయితే క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపడం ద్వారా కలెక్టరేట్కు రావాల్సిన పనిలేకుండా ఉంటుందన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 380 అర్జీలు వచ్చాయి. అందులో 226 అర్జీలు రెవెన్యూ సమస్యలపై ఇచ్చారు. కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, రోజ్మాండ్, అనురాధ, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి తదితరులు అర్జీలను స్వీకరించారు. కాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పీజీఆర్ఎస్కు తాగునీరు వసతులు కల్పించడంతోపాటు అర్జీదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పీజీఆర్ఎస్లో అర్జీ ఇవ్వడానికి వచ్చిన తిరుపతి శెట్టిపల్లికు చెందిన పీడీ మునిరాజా అనే వ్యక్తి ఎండ తీవ్రత నేపథ్యంలో ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ పోలీసులు సమీపంలో ఉన్న మెడికల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి వైద్యం చేయడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలు మధ్యాహ్నం వరకు మాత్రమే కళాశాల నిర్వహించాల్సి ఉన్న సాయంత్రం వరకు చేపడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు శివబాలాజీ డిమాండ్ చేశారు. ఆ మేరకు కలెక్టరేట్లో అధికారులకు సోమవారం అర్జీ అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ కళాశాలలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవిత్ర, అక్చర్ డిమాండ్ చేశారు.ఆ మేరకు సోమవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. న్యాయం చేయండి సార్! మా ఇంటిని తొలగిస్తున్నారని పుత్తూరు మండలం మెట్టగానిసత్రం గ్రామానికి చెందిన ఏ.భారతి ఆవేదన వ్యక్తం చేశారు. పరమేశ్వర మంగళం లెక్కదాఖలలోని 126–1లో 2.5 సెంట్ల స్థలంలో చిన్న ఇంట్లో 45 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, తన భర్త రాజు అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చూపించుకుంటూ మూడు నెలలుగా తిరుపతిలో ఉంటున్నామన్నారు. ఈ క్రమంలో స్థానిక రెవెన్యూ ఉద్యోగి తాము స్థానికంగా లేమంటూ తహసీల్దార్కు చెప్పడంతో ఆ ఇంటిని తొలగిస్తున్నారని చెప్పారు. ఇంటిని కూల్చి వేస్తే నివాసం ఉండడానికి ఏ ఆధారం లేదని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆమేరకు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. ట్రైసైకిల్ ఇప్పించండి తనకు 90 శాతం వికలత్వం ఉండడంతో రెండు కాళ్లు పనిచేయడం లేదని, తనకు ట్రై సైకిల్ను ఇప్పించాలని రామచంద్రాపురం నడవలూరు గ్రామానికి చెందిన ఎం. వేణుగోపాల్ కోరారు. పేద కుటుంబానికి చెందిన తాను ట్రై సైకిల్ కొనుగోలు చేయడానికి ఆర్థికశక్తి లేదన్నారు. విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి తిరుపతి నగరం ఎంఆర్పల్లి పోలీస్స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆర్బీఎస్ రాము కలెక్టర్ వెంకటేశ్వర్, డీఎంఅండ్హెచ్ఓ బాలకృష్ణ నాయక్కు సోమవారం ఫిర్యాదు చేశారు. మంగళంలో నివాసం ఉంటున్న తాను కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళితే అన్నీ పరీక్షలు చేసి, పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని చెప్పారన్నారు. ఈ క్రమంలో సక్రమంగా ఆపరేషన్ చేయకపోవడంతో మళ్లీ సమస్య రావడంతో ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే చైన్నెలోని ఓ ఆస్పత్రికి పంపించారని చెప్పారు. అయితే చైన్నెలో ఆస్పత్రి వారు తిరుపతిలో ఆపరేషన్ సక్రమంగా చేయలేదని స్పష్టం చేశారని వెల్లడించారు. ఆపరేషన్ నిమిత్తం రూ.లక్షలు తన వద్ద నుంచి లాక్కున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆర్బీఎస్ రాముతోపాటు తమ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. పీజీఆర్ఎస్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ చేయండి తాము తిరుపతి కొర్లగుంటలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో చదువుకుంటున్నామని, రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు రాకపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన నర్సింగ్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ సందర్భంగా అర్జీలు అందజేశారు. -
ఐఐఎమ్లో తిరుపతి విద్యార్థినికి ప్రవేశం
తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అహ్మదాబాద్లో ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న ఐఐ ఎమ్ సంస్థలో తిరుపతి కౌటిల్య ఇన్స్టిట్యూట్కు చెందిన జి గీతిశ్రేయ ఎంబీఏ కోర్సులో సీటు సాధించింది. ఆమె తల్లి రజిని గృహిణిగా తండ్రి చెంచుబాబు నాయుడుపేట డీఎస్పీగా విధు లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కౌటిల్య సంస్థ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ క్యాట్లో గీతిశ్రేయ 99.62 శాతం మార్కులు సాధించి అత్యుత్తమ స్కోర్తో ప్రతిష్టాత్మకమైన అహ్మదాబాద్ ఐఐఎమ్ సంస్థలో సీటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. తమ సంస్థలో గత 15ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులు పలు ఉన్నత సంస్థల కళాశాలల్లో సీట్లు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థి గీతిశ్రేయ మాట్లాడుతూ ఐఐఎమ్ అహ్మాదాబాద్లో సీటు సాధించడం గర్వంగా ఉందని, కౌటిల్య సంస్థ డైరెక్టర్, ఫ్యాకల్టీ సలహాలు, సూచనలు, శిక్షణ ఎంతో ఉపయోగపడిందని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నిధులు రికవరీ చేయాలని ధర్నా కేవీబీపురం: వగత్తూరు పంచాయతీలోని డ్వాక్రా సంఘాల నిధులు రూ.40 లక్షలు స్వాహా చేసిన వెలుగు సిబ్బందిని విచారణ జరిపి, రికవరీ చేసి, బాధ్యులను విధుల నుంచి తొలగించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి జనార్దన్, ప్రాంతీయ కార్యదర్శి నాగలాపురం నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం కేవీబీపురం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద వగత్తూరు పరిధిలోని డ్వాక్రా మహిళలతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా దాసరి జనార్దన్, నాగరాజు మాట్లాడుతూ 2023 సంవత్సరం నుంచి 10 ఎస్హెచ్జీలు బ్యాంకు లింకేజీ రుణాలు, పొదుపు, అంతర్గత అప్పులను ప్రతినెల సభ్యులు వసూలు చేసి బ్యాంకులకు చెల్లించే క్రమంలో సంఘమిత్ర జోక్యం చేసుకుని బ్యాంకులో సిబ్బందిని తప్పుదోవ పట్టించి, తన ఖాతాకు వేసుకోవడం, తన బంధువుల ఖాతాకు, వేసుకోవడం, బ్యాంకు కరస్పాండెంట్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చేతివాటంతో సంఘమిత్ర మునెమ్మ రూ. 40 లక్షలకు పైగా స్వాహా చేసిందని, సీసీ చంద్రకళ రూ. 3.70 లక్షలు, బదిలీ అయిన సీసీ వీరజిన్నా రూ. 6 లక్షల స్వాహా చేసినట్లు విచారణ అధికారులు తేల్చినప్పటికీ, మూడు నెలలకు పైగా విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు కూలీనాలి చేసి బ్యాంకు అప్పులు, పొదుపులు చెల్లిస్తున్న నిధులను అక్రమాలు చేసి సొంతానికి వాడుకోవడం దారుణమన్నారు. బ్యాంకు సిబ్బందిపై కూడా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ మాలతికి వినతి పత్రం అందజేశారు. -
శ్రీవారి జూలై దర్శన కోటా విడుదల
తిరుమల: శ్రీవారి జూలై నెల దర్శన కోటాను టీటీడీ విడుదల చేసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈడిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా 21న, అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు 23న, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, గదుల కోటాను 24న టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. https://ttdevarthanamr.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. -
మాట వింటేనే అందలం!
ప్రజాసేవ ప్రామాణికం కాదు.. నిజాయితీ ప్రాతిపదిక కాదు.. విధి నిర్వహణలో చిత్తశుద్ధి అవసరం లేదు.. సమస్యల పరిష్కారంలో సమర్థతను ఖాతరు చేయడం లేదు. తమ మాట వింటే చాలు.. చెప్పిన పని చేస్తే చాలు.. కోరిన చోట పోస్టింగ్ ఇప్పించేస్తారు. అర్హత లేకపోయినా అదనపు బాధ్యతలు అప్పగించేస్తారు. అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నా డిప్యుటేషన్ కింద కాసులు మూటగట్టుకునే అవకాశం కల్పించేస్తారు. ఇదీ జిల్లాలో అధికార పార్టీ నేతలు.. ప్రజాప్రతినిధుల వ్యవహారం. పరిపాలనలో కీలకమైన రెవెన్యూశాఖను తమ జేబులో పెట్టేసుకుంటున్నారు. ప్రధానంగా తహసీల్దార్ల నియామకాల్లో చక్రం తిప్పుతున్నారు. అనుకూలంగా లేని గ్రూప్–2 అధికారులను ప్రాధాన్యత లేని చోటుకు బదిలీ చేయించేస్తున్నారు. అడుగులకు మడుగులొత్తే వారిని అందలం ఎక్కిస్తున్నారు.అంతులేని అక్రమాలు తిరుపతి జిల్లాలో విలువైన ప్రభుత్వ, పోరంబోకు, మఠం భూములు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు అధికారుల సహకారంతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, తిరుపతి అర్బన్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, సత్యవేడు, వరదయ్యపాళెం, నాగలాపురం, నాయుడుపేట, వెంకటగిరి, బాలాయపల్లె మండలాల పరిధిలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయి. అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు రికార్డులను తారుమారు చేసి నిజమైన భూ యజమానులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న సంఘటనలు అనేకం వెలుగుచూశాయి. రెవెన్యూ అధికారుల నిర్వాకం కారణంగా అనేక మంది బాధితులు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కి వచ్చే ఫిర్యాదు దారుల్లో ఎక్కువ మంది భూ సమస్యల పరిష్కారం కోసం తిరిగేవారు ఉండడమే ఇందుకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలకమైన రెవెన్యూని అధికార పార్టీ నేతలు తమ జేబు శాఖగా మార్చేసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు చెప్పింది చేసేవారు, చెప్పింది వినేవారిని మాత్రమే కీలకమైన తహసీల్దార్లుగా నియమించుకుంటున్నారు. ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఎక్కువ మండలాల్లో గ్రూప్– 2 కేడర్ అధికారులు కాకుండా డీటీలు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు తహసీల్దార్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా, జిల్లాలో తహసీల్దార్ల నియామకాల్లో ఎక్కువ మంది డీటీలకే బాధ్యతలు అప్పగించారు. తిరుపతి జిల్లాలో శనివారం 13 మండలాలకు తహశీల్దార్ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ఆ 13 మందిలో గ్రూప్ 2 అర్హత ఉన్న వారిని స్థానిక ప్రజా ప్రతినిధుల తమ మాట వినడం లేదని కలెక్టరేట్కి బదిలీ చేయించారు. 13 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే గ్రూప్–2 కేడర్ అధికారులు. మిగిలిన వారంతా డీటీ, సీఎస్డీటీ, కారుణ్య నియమకాల ద్వారా వచ్చిన వారే ఉన్నారు. వారందరిని ఎఫ్ఏసీగా నియమించారు. ఇలా జిల్లాలో 36 మండలాల ఉంటే.. ఏడు మండలాల్లో మాత్రమే గ్రూప్ 2 అధికారులు తహసీల్దార్లుగా ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారంతా డీటీ, సీనియర్ అసిస్టెంట్లను తహసీల్దార్లుగా స్థానిక ప్రజా ప్రతినిధులు నియమించుకున్నట్లు రెవెన్యూలో ప్రచారం జరుగుతోంది. ఇక పోతే కలెక్టరేట్లో ఏ నుంచి హెచ్ సెక్షన్లో పనిచేస్తున్న తహసీల్దార్లలో గ్రూప్ 2 వారు 10 మంది ఉన్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. 28 మండలాలు ఉన్నాయి. ఈ 28 మండలాల్లో గ్రూప్ 2 వారు 10 మంది ఉన్నారు. ఇందులో ఒకరు కుప్పం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నారు. మిగిలిన మండలాల్లో పనిచేస్తున్న ఏడుగురు హెచ్డీటీలు, 11 మంది ఉద్యోగోన్నతిపై తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూశాఖపై ఎమ్మెల్యేల పెత్తనం నిబంధనలు పాటిస్తే నచ్చదు గ్రూప్ 2 ఆఫీసర్లు నిబంధనల మేరకు నడుచుకుంటారు. ఒకటీ అరా అతిక్రమించినా.. భవిష్యత్తులో ఎవ్వరికీ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువ శాతం మంది అక్రమాలకు దూరంగా ఉంటారు. అలాంటి వారిని కొందరు ప్రజా ప్రతినిధులు పక్కన ఉంచుకోరనే ప్రచారం జరుగుతోంది. అక్రమ లే అవుట్లు, కాలువ, చెరువు పోరంబోకు భూములను రెగ్యులరైజ్ చేయమని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీటీ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు డిప్యుటేషన్పై తహసీల్దార్లు (ఎఫ్ఏసీ) అయిన కొందరు నిబంధనలన్నీ పక్కన పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కారుణ్య నియామకం ద్వారా తహసీల్దార్ అయిన ఒకరు, డీటీగా పనిచేస్తూ తహసీల్దార్ బాధ్యతలు నిర్వహించిన మరొకరు జిల్లాలో అనేక కాలువ, చెరువు, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. మరి కొందరు ఏసీబీ అధికారులకు పట్టుబడి మళ్లీ అడ్డదారిలో పోస్టింగ్ తెచ్చుకున్న వారు లేకపోలేదు. ధనార్జనే ధ్యేయంగా.. ప్రజా ప్రతినిధి చెప్పింది కళ్లుమూసుకుని గుడ్డిగా పనిచేసిన కొందరు తహసీల్దార్ల కారణంగా అనేక మంది రైతులు, భూ యజమానులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
కారును ఢీకొన్న లారీ
– ముగ్గురికి గాయాలు దొరవారిసత్రం: జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును వెనుకనే వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు గాయపడిన ఘటన మావిళ్లపాడు గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు... కోట నుంచి సూళ్లూరుపేటకు వెళ్లుతున్న కారును మావిళ్లపాడు గ్రామం వచ్చే సరికి నెల్లూరు నుంచి చైన్నె వెళ్లే లారీ వెనుకనే వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించే ముగ్గురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందునే కారును ఢీకొన్నట్లు స్థానికులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ప్రమాదాన్ని పరిశీలించి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పండ్లూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్లెమల్లు నాగసాయి ప్రనూన్ కుమార్రెడ్డి(19) మృతిచెందాడు. పోలీసుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓజిలి మండలం వాకాటి వారికండ్రిగ గ్రామానికి చెందిన నాగసాయి ప్రనూన్ కుమార్రెడ్డి మైనింగ్శాఖలో కాంట్రాక్ట్ బేసిక్ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. శనివారం బైక్లో ఇంటి నుంచి నాయుడుపేటకు వస్తుండగా మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని రోడ్డుపక్కన గుంతలో పడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రమాదంలో మృతిచెందిన నాగసాయి ప్రనూన్ కుమార్రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మే 10న కురబ సంఘ సమావేశం తిరుపతి కల్చరల్:దక్షిణ భారత కురుబ, కురు మ, కురుంబన్, గురువాహన్, దంగర్ తదితర పేర్లతో పిలువబడే జాతీయ సంఘం ఆధ్వర్యంలో మే 10వ తేదీన తిరుపతిలోని రామ తులసి కల్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కురుబ, కురుమ సౌతిండియా రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రాతినిధ్యం కురుబలకు గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. తిరుపతిలో జరిగే సర్వసభ్య సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరు కానున్నారని తెలిపారు. రవిశంకర్రెడ్డి, రెడ్డి కుమార్ గౌడ్, రమణ, ఆనంద్, ఈశ్వరయ్య, ఇంద్రకుమార్, రామాంజనేయులు, కురుబ సంఘం యువ నేతలు శివ, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏడుగురు పందెం రాయుళ్ల అరెస్ట్ సూళ్లూరుపేట రూరల్:మండలంలోని దామానెల్లూరు గ్రామంలో కోడి పందేల స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. నాయుడుపేట డీఎస్పీ చెంబుబాబు, సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్టు ఎస్ఐ అజయ్కుమార్ తెలిపారు. దామానెల్లూరు గ్రామంలోని పారెస్టు ప్రాంతంలో ఏడుగురు వ్య క్తులు కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు సమాచా రం అందిందన్నారు. వారిని అదుపులోకి తీసుకు ని, వారి వద్ద నుంచి 4 కోళ్లు, 4 కత్తులు, 5 మోటా రు సైకిళ్లు, రూ.10,200 నగదును స్వాధీనం చేసు కున్నట్టు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు ఓజిలి: ఓజిలి క్రాస్ రోడ్డు పక్కన గ్యాస్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు నుంచి కుప్పానికి పెప్సి లోడ్డుతో లారీ బయలుదేరింది. డ్రైవర్ లారీని రోడ్డు పక్కన చెట్టు కింద నిలుపుదల చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో కురుగొండ నుంచి చిల్లకూరుకు వెళ్తున్న కారు అదుపుతప్పి లారీ ముందు భాగంలో ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదం నుంచి కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు కారును స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దయనీయం.. గ్రంథాలయం
తిరుపతి అర్బన్: గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు, విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్ నాలుగు నెలలుగా అందకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వం గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన నిధులను సక్రమంగా విడదల చేయకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చింది. మరోవైపు నిధులు లేకపోవడంతో 10 నెలలుగా దినపత్రికలకు ఇవ్వాల్సిన బిల్లులు, కరెంట్ చార్జీలు, స్వీపర్ చార్జీలు చెల్లించలేక నానా తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక నెలకు గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం, ఇతర ఖర్చులకు రూ.91 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. 71 గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. 34 మంది శాశ్వత ఉద్యోగులు, 15 మంది ఓట్సోర్సింగ్ ఉద్యోగులు, 121 మంది పెన్షనర్లు ఉన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ నుంచి 8 శాతం చొప్పున సెస్ మొత్తం రూ.36 కోట్లు పన్ను బకాయిలు రావాల్సి ఉంది. అందులో తిరుపతి నుంచే ప్రధానంగా రూ.24 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో గ్రంథాలయాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. గడ్డుకాలం నుంచి బయటపడడం ఎలా అంటూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రంథాలయాలకు గడ్డుకాలం ప్రభుత్వం సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టసాధ్యంగా మారడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సెస్సు చెల్లించేవారు. దీంతో జీతాలతోపాటు పెన్షన్లు, మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టుకోవడంతోపాటు కొత్త పుస్తకాల కొనుగోలు, పోటీ పరీక్షలకు చెందిన పుస్తకాలను అందుబాటులో ఉంచడంతోపాటు గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం జీతాలు చెల్లించడమే భారంగా మారడంతో నిర్వహణ గడ్డుకాలంగా తయారైంది. రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్కు సంబంధించి రూ.2 కోట్ల మేరకు చెల్లించకుండా పెండింగ్లో పెట్టేశారు. దీంతో వారంతా గ్రంథాలయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సర్కారు నిధులు విడుదల చేయలేదని నచ్చజెప్పి పంపుతున్నారు. ఈ క్రమంలో మే 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు ఉద్యమబాట పట్టడానికి సిద్ధమవుతున్నట్లు చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లా సమాచారం గ్రంథాలయాలు 71 మొత్తం పోస్టులు 118 రెగ్యులర్ 34 శాశ్వత ఉద్యోగులు ఔట్సోర్సింగ్ 15 మంది ఉద్యోగులు ఖాళీలు 69 ఉద్యోగాలు బకాయిలు రూ. 36 కోట్లు తిరుపతి రూ.24 కోట్లు చిత్తూరు రూ.12 కోట్లు 28 నుంచి వేసవి శిక్షణా శిబిరాలు మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా ముందే ఆర్థిక కష్టాలతో గ్రంథాలయాల నిర్వాహణ ఆందోళన పుట్టిస్తుంటే... తాజాగా ప్రతి గ్రంథాలయంలో ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏటా వేసవి శిబిరాలు నిర్వహించడం తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులకు ఆటపాటలు, పోటీలు, బహుమతులు, గ్రంథాలయాలపై అవగాహన కల్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు తిప్పలు పడుతున్న నేపథ్యంలో వేసవి శిక్షణా తరగతులు మరింత భారంగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఖర్చులు ఉద్యోగులే పెట్టుకోవాలని చెప్పడంతో దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. గత ఏడాది వేసవి శిబిరాలు సందర్భంగా పెట్టిన ఖర్చులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోగా మళ్లీ వేసవి శిబిరాలు నిర్వహించాలని చెప్పడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. -
నామ్కే వాస్తే కార్నర్లు
సూళ్లూరుపేట : నియోజకవర్గంలోని తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలిలో మొత్తం 13 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 62 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో ఓఆర్ఎస్ కార్నర్లను నామ్కే వాస్తే ఏర్పాటు చేశారు. పర్యవేక్షించే వారే కరువయ్యారు. దీంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసేవారే లేకుండాపోయారు. తిరుపతి తుడా : వేసవి నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వచ్చిన వారిలో అధికులు డీహైడ్రేషన్కు గురవుతున్నారు. అలాగే ప్రజా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులు సైతం ఎండ బారిన పడుతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో తల్లడిల్లి పోతున్నారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లే లోపు వడదెబ్బకు గురవుతున్నారు. అధిక ఎండలు, ఉక్క పోత కారణంగా కొత్త అనారోగ్య సమస్యలు కొన్ని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో రోగుల ఇక్కట్లును గుర్తించిన ప్రభుత్వం ప్రతి పీహెచ్సీలో ఓఆర్ఎస్ కార్నర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లా యంత్రాంగం ఓఆర్ఎస్ కార్నర్లను ఆర్భాటంగా ప్రారంభించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇది ఫోటో సెషన్స్ కే పరిమితమైంది. ఆస్పత్రుల్లో రోగులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను తూతూ మంత్రంగా అందిస్తున్నారు. ఎంత నిరసించిన రోగులకై నా ఓఆర్ఎస్ పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. నిత్యం లక్షలాది మంది యాత్రికులు రాకపోకలు సాగించే తిరుపతి నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోనూ ఓఆర్ఎస్ కార్నర్లు నామమాత్రంగానే ఏర్పాటు చేశారు. అడిగితే తప్ప రోగులకు అందించేవారు కరువయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యం ఏర్పేడు : శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా ఆస్పత్రితోపాటు, ఎంపేడు, ఏర్పేడు, పాపానాయుడుపేట, తొట్టంబేడు, కాసరం, రేణిగుంటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతి పీహెచ్సీలో సగటున రోజుకు 100 నుంచి 150మంది రోగులు నిత్యం వైద్య సేవలు పొందుతున్నారు. వేసవితాపం దృష్ట్యా ఓఆర్ఎస్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అయితే నామమాత్రంగానే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. రేణిగుంట పీహెచ్సీలో కౌంటర్ ఊసే లేదు. మందులతోపాటు అవసరమైన వారికి మాత్రమే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. మిగిలిన చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసినా, వాటిపై సరైన అవగాహన లేకపోవడంతో సక్రమంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం లేదు. లేని అవగాహన సాధారణంగా వేసవి ఆరంభం నుంచే అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వైద్యాధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసేవారు. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేవారు. ప్రధానంగా డీహైడ్రేషన్కు గురైనప్పుడు వెంటనే ఓఆర్ఎస్ సేవించాలని సూచించేవారు. అయితే ప్రస్తుతం అలాంటి అవగాహన కార్యక్రమాలను చేపట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారు. కేవలం ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. మొదటి రోజు మాత్రం కొందరు రోగులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి ఫొటోలు తీసుకుని మమ అనిపించేశారు. తర్వాత ఎండ తీవ్రతకు సొమ్మసిల్లిన పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వారికి సైతం ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం లేదు. డీహైడ్రేషన్ సమయంలో ఓఆర్ఎస్ సేవించాలని అవగాహన కల్పించడంలో సైతం నిర్లక్ష్యం వహించారు. పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నప్పటికీ రోగులకు మాత్రం సక్రమంగా అందకపోవడం గమనార్హం. భగభగమంటున్న ఎండలు మొక్కుబడిగానే.. వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలోని పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్లను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. రోగులకు కనీస మాత్రం అవగాహన కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పలుచోట్లు ఓఆర్ఎస్ పాయింట్లు నిరుపయోగంగా మారాయి. ఈ క్రమంలోనే నారాయణవనం పీహెచ్సీలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో లేవు. అలాగే చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ కార్నర్ పాయింట్ను ఏర్పాటు కాలేదు. -
ఒంటరి మహిళలే లక్ష్యం
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లాలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాల కోసం జరుగుతున్న వరుస హత్యల కేసులను జిల్లా పోలీసులు సంచలనాత్మకంగా ఛేదించారు. గత కొంతకాలంగా నమోదవుతున్న కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఛేదించామని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దర్యాప్తులో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 11, 2026న జరిగిన మహిళ హత్య కేసులో అరెస్టయిన పి.విశ్వనాథ్ అలియా ప్రశాంత్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. విచారణలో అతని అసలు పేరు ఎ.ఎం.అజీజ్ అలియాస్ అబ్దుల్ అజీజ్ అలియాస్ కర్ణాటక అజీజ్ (39) అని తేలింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సులియా తాలూకాకు చెందిన ఈ నిందితుడు 2018లో కేరళలో పోలీస్ కస్టడీ నుండి తప్పించుకుని పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో అతని ఆచూకీ తెలిపిన వారికి కేరళ పోలీసులు రూ.2 లక్షల బహుమతి కూడా ప్రకటించినట్లు పోలీసులు వెల్లడించారు. నాలుగు కీలక కేసుల పరిష్కారం నిందితుడి వాంగ్మూలంతో తిరుపతి జిల్లాలో జరిగిన నాలుగు సంచలన కేసులు ఛేదించబడ్డాయి. వీటిలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు, తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రాబరీ, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య కేసు ఉన్నాయి. మహిళ సహకారంతో నేరాలు ఈ క్రమంలో వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె సహకారంతో ఆటో రిక్షా కొనుగోలు చేసి నేరాలకు ఉపయోగించినట్లు తెలిసింది. ఈ కేసులో రాజమ్మను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.21.5 లక్షల ఆభరణాలు స్వాధీనం నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.21.5 లక్షల విలువైన 127.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 48 గ్రాముల వెండి ఆభరణాలు, అలాగే నేరాలకు ఉపయోగించిన ఆటో రిక్షాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు రాష్ట్రాల్లో 21 కేసులు ఈ నిందితుడిపై కర్ణాటకలో 4, కేరళలో 6, తిరుపతి జిల్లాలో 11 కేసులు నమోదై మొత్తం 21 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. తిరుపతికి చేరుకున్న తర్వాత తన అసలు గుర్తింపును దాచిపెట్టి పి.విశ్వనాథ్ పేరుతో ఆధార్ కార్డు ఉపయోగిస్తూ హోటళ్లలో పనిచేస్తూ స్థానికులతో పరిచయాలు పెంచుకున్నాడు. దర్యాప్తు బృందానికి ఎస్పీ ప్రశంసలు ఈ కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఎ.శ్రీనివాసులు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించారు. వారికి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. -
‘గరుడ హెల్త్ సిటీ’ ప్రారంభం
ఏర్పేడు : తిరుపతి ఐఐటీ ఎదురుగా ఆదివారం గరుడ హెల్త్ సిటీ నూతన వెంచర్ను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ప్రారంభించారు. 18 ఎకరాల సువిశాల స్థలంలో హెల్త్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం సురేష్, చరణ్, రాజశేఖర్తో కలిసి బ్రోచర్ ఆవిష్కరించారు. నేడు ‘డయల్ యువర్ సీఎండీ’ తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు అధికారులు ఆదివారం తెలిపారు. తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు తమ సమస్యలను 8977716661 నంబర్కు కాల్ చేసి తెలియజేయవచ్చని వెల్లడించారు. ఫోన్ చేసిన సమయంలో వినియోగదారులు తమ విద్యుత్ సర్వీసు నంబరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మే 12న తిరుపతి గంగ జాతర తిరుపతి కల్చరల్ : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను మే 12వ తేదీన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఈ మేరకు గంగమ్మ ఆలయంలో జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మే 5వ తేదీ రాత్రి చేపట్టే చాటింపుతో అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమవుతుందన్నారు. 13వ తేదీ తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూపంతో జాతర ముగుస్తుందని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాప్ చైర్మన్ రవినాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ మహేష్యాదవ్, నేతలు పనబాక లక్ష్మి, పసుపులేటి హరిప్రసాద్, సామంచి శ్రీనివాస్, ఈఓ జయకుమార్ పాల్గొన్నారు. -
బ్రాహ్మణులపై దాడులు హేయం
– బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ తిరుపతి కల్చరల్: రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ఉనికిని చాటుకునేందుకు కొందరు బ్రాహ్మణులపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ మండిపడ్డారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ రాజకీయ పబ్బం కోసం మందకృష్ణ మాదిగ బ్రాహ్మణ సమాజాన్ని టార్గెట్ చేసి విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. అన్ని రంగాల్లో కలిసిపోతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ప్రచారం కోసమేనని, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డు పెట్టుకుని ఒక సామాజిక వర్గంపై విద్వేషం చిమ్ముతున్న వ్యక్తులపై హీట్ స్పీచ్ చట్టాల కింద తక్షణమే చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో అర్చకులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధికార ప్రతినిధి కొత్తపల్లి విజయ్కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి ప్రకాష్, ముకుందపు మహేష్, జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ శర్మ, బాలాజీరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
అమ్మవారి సన్నిధిలో.. పోలీసుల అకృత్యం!
సాక్షి, టాస్క్ఫోర్స్: అమ్మవారి సన్నిధిలో.. పోలీసులు అకృత్యానికి పాల్పడ్డారు. జిల్లా ఎస్పీ ఆదేశించారు.. తిరుచానూరు పోలీసులు ఆచరించారు. నడి రోడ్డుపై ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన చిన్నపాటి గొడవకు రాజకీయ రంగు పులిమి వైఎస్ఆర్ సీపీకి చెందిన మాజీ సర్పంచ్ వర్గీయులపై అక్రమ కేసులు పెట్టారు. ఉద్దేశపూర్వకంగా నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి బలవంతంగా అరెస్టు చేశారు. వేలంపాట కోసమే ఇదంతా.. తిరుచానూరు పంచాయతీకి చెందిన ప్రైవేటు టూరిస్టు బస్టాండుకు పంచాయతీ అధికారులు సోమవారం వేలం పాటను నిర్వహించనున్నారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుచానూరు సీఐ సునీల్కుమార్ తిరుచానూరు తాజా మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డితో పాటు అతని సోదరుడు ఎంపీటీసీ నరేష్రెడ్డికి ముందుగానే టెండరు ప్రక్రియలో పాల్గొనరాదని హుకుం జారీ చేసినట్టు సమాచారం. అయితే అందుకు వారు అంగీకరించకపోవడం, శనివారం రాత్రి అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు మధ్యన జరిగిన చిన్నపాటి గొడవలో వీరందరినీ ఇరికించే పనులను చకచకా పూర్తి చేసేశారు. అక్రమంగా కేసులు పెట్టడమే కాక వారిని పోలీస్ స్టేషన్లో నిర్భందించి విచక్షణా రహితంగా కొట్టడంతో స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే తిరుచానూరు పోలీసులు లెక్క చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత ఏడాది కూడా ఇదే తంతు గత ఏడాది మార్చి 24వ తేదీన పంచాయతీ టూరిస్టు బస్టాండు వేలం ప్రక్రియ జరిగింది. అప్పుడు కూడా పోలీసులు, టీడీపీ నాయకులతో చేతులు కలిపి ఇలాగే ప్రత్యర్థులను లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తిరుచానూరు పంచాయతీతో సంబంధం లేని టీడీపీ నేతలంతా అక్కడకు చేరుకుని అప్పటి సర్పంచ్ రామచంద్రారెడ్డి వర్గీయులు ఎవ్వరినీ లోపలకు వెళ్లకుండా టెండరు ఫారాలను చించివేసి నానా హంగామా చేస్తున్నా పోలీసులు చూస్తుండి పోయారు. అప్పుడు సర్పంచ్గా పదవిలో వున్న రామచంద్రారెడ్డి తన వర్గీయులను వేలం ప్రక్రియలో పాల్గొనేలా చేశారు. దీంతో అంతకుముందు కంటే రూ.61.94 లక్షలు అధికంగా పాడి పంచాయతీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగి వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉన్న వారందరినీ అక్రమ కేసులో ఇరికించి తమ ఆధీనంలోకి తీసుకోవడం అమానుషం. ఆయన ఆదేశించారు.. వీరు ఆచరించారు తిరుచానూరు పోలీస్స్టేషన్లో జరుగుతున్న అక్రమ అరెస్టులు జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకే జరిగినట్టు సమాచారం. ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం తిరుచానూరు పోలీసులు ఆచరించారని, ఇదంతా స్థానిక ముఖ్యనేత సూచనల మేరకు అమలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ టూరిస్ట్ బస్టాండు పార్కింగ్కు జరిగే వేలంలో పోటీ రాకుండా చేయడానికే వారిని అరెస్టు చేశారని, అలా చేయడంతో తక్కువ ధరకు టెండరు దక్కించుకునే వ్యక్తి జిల్లా పోలీసు ఉన్నతాధికారితోపాటు స్థానిక ముఖ్యనేతకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టచెబుతారన్న విమర్శలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అందుకే పంచాయతీ పార్కింగ్ టెండరు ప్రక్రియలో పాల్గొనే వారిని టార్గెట్గా చేసుకుని అక్రమ కేసులు పెట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం పోలీసుల చట్ట వ్యతిరేకతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. తిరుచానూరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ చట్టవ్యతిరేకంగా లాఠీలతో కొట్టడంపై జాతీయ మావన హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత కుటుంబీకులు స్పష్టం చేశారు. వేలంపాట జరిగేనా? గత ఏడాది జరిగిన వేలం ప్రక్రియలో పోలీసులు, టీడీపీ నేతలు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎలాగోలా లోపలకు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు పోటాపోటీగా టెండరు ధరలను పెంచేశారు. ఆ సమయంలో కూటమి పార్టీలలో ఒకటైన జనసేనకు చెందిన వ్యక్తి రూ.3.51 కోట్లకు వేలం దక్కించుకున్నాడు. జీఎస్టీ, ఇతరత్రా పన్నులతో కలిపి రూ.4.24 కోట్లు చెల్లించేలా టెండరు ఖరారు చేశారు. అలా జరగకుండా ఉండడానికి టెండరు ప్రక్రియకు ముందురోజున ప్రధాన పోటీదారులు అందరినీ బలవంతంగా పోలీసులు అరెస్టు చేయడంతో వేలం ప్రక్రియలో పోటీ జరుగుతుందా, గత ఏడాది పంచాయతీకి చెల్లించిన రూ.4.24 కోట్లు కంటే అదనంగా వేలం పాట నిర్వహిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రజాభిమానమే మన బలం
పెనగలూరు : ప్రజాభిమానమే వైఎస్సార్సీపీ బలమని, ఇదే స్ఫూర్తితో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పెనగలూరు మండలం ఎన్ఆర్పురం, పల్లంపాడు గ్రామాల్లో పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ సమన్వయకర్త కొరముట్ల శ్రీనివాసులు, కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అజయ్రెడ్డితో కలిసి పర్యటించారు. వందల సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. మిథున్రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలకంటే అధికంగా అమలు చేసిన ఘనత ఒక్క జగనన్నకే దక్కుతుందని కొనియాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం.. అభివృద్ధిని సమపాళ్లలో అందించామని వెల్లడించారు. చంద్రబాబు సర్కారు కేవలం మాటలకే పరిమితమవుతోందని, ఊకదంపుడు ఉపన్యాసాలతో నెట్టుకొస్తోందని విమర్శించారు. ఇకపై ప్రజలు చంద్రబాబు మాయమాటలను నమ్మే ప్రసక్తే ఉందని, వైఎస్సార్సీపీకే పట్టం కడతారని స్పష్టం చేశారు. అనంతరం పల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: హెయిర్ కటింగ్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్లు స్వీకరించు తేదీలు: ఈనెల 8 నుంచి 13 వరకు సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫీజు : రూ.2,500 వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈనెల 14 నుంచి వచ్చే నెల 12 వరకు సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రిజిస్ట్రేషన్లు, శిక్షణా స్థలం: అనంగా బ్యూటీ స్టూడియో మరియు ఇన్స్టిట్యూషన్, బైరాగిపట్టెడ ఆర్చ్ రోడ్డు, కెనరా బ్యాంక్ పైన, తిరుపతిపూర్తి వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు: 95534 54335, 96666 97219 -
మహనీయుడు పూలే
సమాజంలో అసమానతల తొలగింపునకు విద్యాజ్యోతి వెలిగించిన మహనీయుడు పూలే అని వక్తలు కొనియాడారు.వేదనారాయణుడికి ఊంజల్ సేవ నాగలాపురంలోని వేదనారాయణస్వామివారి ఆలయంలో శనివారం స్వామివారికి ఘనంగా ఊంజల్ సేవ చేశారు.ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పేదలకు విలువలతో కూడిన విద్య.. అత్యుత్తమ సంస్కారం అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.. వారి ఉజ్వల భవితకు సోపానం వేయాలి.. ఇదీ ఎన్టీఆర్ ఉన్నతాశయం.. ఆ ఆశయంతోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఏర్పాటు.. అయితే చంద్రబాబు సర్కారు కార్పొరేట్లకు కొమ్ముకాస్తోంది.. అందుకోసం చీకటి జీఓలు విడుదల చేసింది. వీటితో ఉన్నత విద్యామండలి నిర్వీర్యం కానుంది. ఫలితంగా పేదలకు ఉన్నతవిద్య మిథ్యగా మారనుంది.ఆప్సీ స్వయం ప్రతిపత్తికి చరమగీతం ఆప్సీ స్వయం ప్రతిపత్తికి చరమగీతం పాడేందుకు ప్రభుత్వం చీకటి జీఓలను తీసుకువస్తోంది. 40 ఏళ్ల కిందట ఎన్టీఆర్ తీసుకువచ్చిన విద్యావ్యవస్థను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోంది. పరీక్షలు, ప్రవేశాలను విడదీయడంతో విద్యావ్యవస్థ పారదర్శకత కోల్పోతుంది. పేద విద్యార్థులను ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోంది. జీఓను రద్దు చేయాలని లేకుంటే తిరుగుబాటు తప్పదు. – చిన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు, తిరుపతి పునరాలోచన చేయాలి ఉన్నత విద్యను పేదల కు అందాలనే ఉన్నతాశయంతో రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆప్సీని స్థాపించారు. కొన్ని దశాబ్ధాలుగా ఉన్నత విద్యామండలి యూనివర్సిటీలను అభివృద్ధి చేసి, లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసించేందుకు తోడ్పాటును అందించింది. కానీ ప్రస్తుతం ఆప్సీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోంది. జీఓ నంబర్ 3 విద్యారంగానికి గొడ్డలి పెట్టువంటిది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ రమణ, విశ్రాంత ఆచార్యులు, ఎస్వీయూ నిర్ణయాన్ని మార్చుకోవాలి ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లను ఆప్సీ నుంచి వేరు చేసి, మరో వ్యవస్థకు అప్పగించడం ప్రమాదకరం. ఉన్నత విద్యామండలి మనుగడకు ప్రమాదకరమే. వర్సిటీల అభివృద్ధి, పలు పీజీ కోర్సులకు సంబంధించిన ప్రవేశాలపైన తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. జీఓను వెనక్కి తీసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం మంచిది. – ప్రొఫెసర్ రాజశేఖర్, విశ్రాంత ఆచార్యులు, ఎస్వీయూజీఓను రద్దు చేయాలని ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలుతిరుపతి సిటీ: చంద్రబాబు సర్కార్ చీకటి జీఓలతో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహించడంతో ఇప్పటికే ప్రభుత్వ విద్యావ్యవస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే యూనివర్సిటీల్లో పలు కోర్సులను ఎత్తివేయడంతో భారీ స్థాయిలో అడ్మిషన్లు పడిపోయి, వర్సిటీల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. ఈ దశలో చంద్రబాబు సర్కార్ గుట్టు చప్పుడు కాకుండా ఉన్నత విద్యామండలిపై మరో దెబ్బ వేసింది. 1988లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన ఆప్సీని నిర్వీరం చేసేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యామండలి ఇక డమ్మీనే! ధనార్జనే ధ్యేయంగా విద్యారంగాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలనే దురుద్దేశంతో చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యామండలి డమ్మీ చేసేందుకు ఇటీవల జీఓ నంబర్–3ని విడుదల చేసింది. ఇందులో కీలక విధుల నుంచి ఉన్నత విద్యామండలిని తప్పించి, కమిషనరేట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్(సీహెచ్ఈ) పేరుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేసింది. ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని ప్రవేశ పరీక్షలు (ఏపీ సెట్లు) ఇక సీహెచ్ఈ కిందకు రానున్నాయి. ఏపీ పీజీసెట్, ఏపీఈఏపీసెట్, ఓఏఎమ్డీసీ, పీజీఈసెట్, ఎడ్సెట్, లాసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణ, కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ ఇక పూర్తిగా సీహెచ్ఈ చేతుల్లోకి వెళ్లనుంది. 40ఏళ్లుగా ఉన్నత విద్యలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఆప్సీ) ఇక డమ్మీగా మిగిలిపోనుంది. ఉన్నత విద్య మనుగడకే ప్రమాదం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు ఉన్నత విద్య మనుగడకే ప్రమాదం. ఉన్నత విద్యామండలిని డమ్మీ చేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేందుకే ప్రభుత్వం చీకటి జీఓలను తెస్తోంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థ గందరగోళంగా తయారైంది. పాలకు లు చేస్తున్న వికృత చేష్టలకు భవిష్యత్తులో పేద విద్యార్థులు బలికావల్సి వస్తోంది. తక్షణం జీవో నంబర్ 3 ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. – టి వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వర్సిటీల కోకన్వీనర్ వ్యవస్థలకు చరమగీతం విద్యా రంగాన్ని ప్రోత్సహించి తెలుగు విద్యార్థులు ఉన్నత చదువులు చదివి జాతీయ, అంతర్జాతీయ స్థా యిలో రాణించాలని రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేశారు. అటువంటి వ్యవస్థకు అనాలోచిత నిర్ణయాలతో చరమగీతం పాడటం దారుణం. ఆప్సీని మరింత అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ మాయలో పడి నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేయడం బాధాకరం. –జ్ఞానేశ్వరి, ప్రైవేటు కాలేజీ అధ్యాపకురాలు, తిరుపతివిద్యారంగం..నిర్వీర్యం! ఎస్వీయూలో జీఓ ప్రతుల దగ్ధం ఆప్సీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 3 ప్రతులను ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద శనివారం ఏఐఎస్ఎఫ్ నేతలు దగ్ధం చేసి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రభుత్వ నిర్ణయాలను దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, వర్సిటీ అధ్యక్షులు రవియాదవ్, నాయకులు ఓం రాజ్, చరణ్, మోహన్, సురేష్, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
కన్నప్ప కొండపై తొలి అభిషేకం జరగాలి
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో భక్త కన్నప్పకు కొండ పైనే తొలి అభిషేకం నిర్వహించాలన్న డిమాండ్ మరోసారి ముందుకు వచ్చింది. వాయులింగేశ్వరుని ఆలయంలో కన్నప్ప విగ్రహం ఉందని, అక్కడ పూజలు చేసిన తర్వాత స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ ఈఓ ఇచ్చిన వివరణను కాకినాడ స్వయంభు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు శనివారం తీవ్రంగా ఖండించారు. శ్రీకాళహస్తి కై లాసగిరిపై ఉన్న కన్నప్ప స్వామికి మొదట అభిషేకం చేసి, అనంతరం గర్భాలయంలో వాయులింగేశ్వరునికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఆచారాలను విస్మరించి, కన్నప్పను ఉప ఆలయంగా మార్చి గర్భాలయంలోనే తంతు నిర్వహించడం అపచారం అని విమర్శించారు. కొండపై నిత్యపూజలు, ఆలయ నిర్వహణ, యాత్రికులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ఆలయ సిబ్బంది ప్రవర్తనపై కూడా చర్యలు తీసుకోవాలని, నాలుగు వైపులా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టికి ,ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని రమణరాజు స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి ప్రాచీన వైభవ పునరుద్ధరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, రౌండ్టేబుల్ సమావేశాలు, కరపత్రిక ముద్రించి ప్రచారం చేస్తానని తెలిపారు. -
ప్రైవేట్ ప్రలాభాలు
మా పాఠశాలలో అన్ని సౌకర్యాలుంటాయి.. మెరుగైన విద్యనందిస్తాం.. ఫీజుల్లో రాయితీ ఇస్తాం.. మంచి భవిష్యత్తు ఉంటుంది.. మా పాఠశాలలో చేరండి..ఓ ప్రైవేటు విద్యాసంస్థ ప్రతినిధి విద్యార్థితోపాటు అతడి తల్లిదండ్రులకు చెప్పిన మాటలివి. పలు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాసంవత్సరం ముగియకముందే వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బందికి టార్గెట్లు విధించడంతో ఉద్యోగ పరిరక్షణకు వారు ఎనలేని పాట్లు పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు వల వేస్తున్నారు. ఇలా ప్రైవేటు విద్యాసంస్థలు చిన్నారుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తిరుపతి అర్బన్: ప్రైవేటు పాఠశాలలకు చెందిన టీచర్లు విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఇంటింటా గాలింపు చర్యలు చేపడుతున్నారు. విద్యా సంవత్సరం ఈ నెల 23తో ముగుస్తుంది. అయితే ముందే అడ్మిషన్ల కోసం ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు టార్గెట్ ఇవ్వడంతో విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించడానికి నానా తిప్పలు తప్పడం లేదు. అడ్మిషన్ ఫీజు అంటూ రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు వసూలు చేసే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, పట్టణాలు, నగరాల్లో పోటీ ఎక్కువగా చోటుచేసుకుంటుంది. ఒంటిపూట బడులు మార్చి 16వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రైవేటు స్కూళ్లు మాత్రమే అడ్మిషన్ల కోసం సాయంత్రం వరకు పాఠశాలలు కొనసాగిస్తునే ఉన్నాయి. తిరుపతిలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించక ముందే అడ్మిషన్ల కోసం వేట మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. పాఠశాలకు గుర్తింపు పొందకముందే అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టేస్తున్నారు. కొన్నిచోట్ల కుటుంబాలు నివాసానికి చెందిన భవనాలను అద్దెకు తీసుకుని..అందులోనే పాఠశాలలు నిర్వహంచడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటస్థలం, ఖాళీ స్థలం, విశాలమైన గదులు తదితర రూల్స్తో పనిలేకుండా పాఠశాల ఏర్పాటుకు జోరుగా కసరత్తు చేస్తున్నారు. అధికారపార్టీకి చెందిన నేతల అండదండలు ఉంటే రూల్స్తో పనిలేదంటూ దీమాగా లాగిచేస్తున్నారు. మమ్మల్ని అడ్డుకునేవారు ఎవరంటూ పాఠశాలల ఏర్పాటుకు సిద్ధమైపోతున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖాధికారులు సైతం చూసీచూడనట్లు ఉండిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి ఇంటింటా వెళ్లి అడ్మిషన్లు చేర్పించాలని ఆలోచనతో ఉన్నప్పటికీ ఓ వైపు పదో తరగతి మూల్యాంకనం, మరోవైపు 1 నుంచి 8వ తరగతి వరకు వార్షిక పరీక్షలు, 9వ తరగతి విద్యార్థులకు పదో తరగతి సిలబస్ బోధన బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ నెల 23 అకడమిక్ గడువు ముగిసిన తర్వాత అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 20 రోజులుగా ప్రైవేటు స్కూళ్ల అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ముందంజలో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడిపోతారనే ప్రచారం సాగుతుంది. -
15న శ్రీకాళహస్తిలో జాబ్మేళా
తిరుపతి అర్బన్: శ్రీకాళహస్తిలోని జేఎన్టీయూ–స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 15వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టరేట్లో జాబ్మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు పలు బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, పీజీ తదితర చదువులు చదువుకున్న వారు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. అభ్యర్థుల విద్యార్హత ఉద్యోగ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,534 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,560 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. టీటీడీకి రూ.20 లక్షల విరాళం తిరుమల: శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన సిద్ధిసాయి రైస్మిల్ యజమాని కె.వెంకటేష్ శనివారం టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడికి విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. తిరుచ్చిపై వెంకన్న విహారం చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు శనివారం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా వేకువనే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు సమర్పించారు. ఈ క్రమంలోనే దేవదేవేరులకు కనులపండువగా కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేడుకగా ఊంజల్ సేవ జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ఆలయ ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ పాల్గొన్నారు. ‘ఆటిజం’పై అవగాహన తిరుపతి రూరల్ : పద్మావతి మహిళా వర్సిటీలో శనివారం ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఆశ్రిత చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకులు కవిత, భారతి, దుర్గ జ్యోతి మాట్లాడుతూ ఆటిజం అనేది చిన్నతనంలో కనిపించే నరాల అభివృద్ధి సమస్యగా తెలిపారు. ఆటిజం గల పిల్లల్లో సామాజిక పరస్పర చర్యల లోపం, కమ్యూనికేషన్ సమస్యలు, ప్రవర్తనా మార్పులు ఉంటాయని వెల్లడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ బేబీ ప్రసూన, రాష్ట్రీయ సేవా సమితి ప్రిన్సిపల్ నందిని మాట్లాడుతూ ఆటిజం గల పిల్లలకు ప్రభుత్వం చేయూతనందించాలని కోరారు. -
సమగ్రశిక్షలో లైంగిక వేధింపులు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లోని ఏ బ్లాక్లో ఉన్న సమగ్రశిక్ష విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి.. అదే విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ ఉద్యోగి వేధింపులు భరించలేక. నేరుగా ఆ అధికారి ఇంటి వద్దకే వెళ్లి తమ జోలికి రావద్దని మరోసారి వేధిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఆ అధికారి తీరులో ఏ మాత్రం మార్పురాకపోగా వేధింపుల స్థాయిని పెంచడం మొదలుపెట్టినట్లు చర్చసాగుతోంది. దీంతో ఇటీవల కలెక్టరేట్కు విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్కు ఫిర్యాదు చేయాలని ఆ ఉద్యోగి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే తోటి మహిళా ఉద్యోగులు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తే...వెంటనే చర్యలు ఉంటాయని, దాంతో ఆ అధికారి ఉద్యోగం పోతుందని ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుందనే ఓ మానవత్వ ఆలోచన... ఆ మహిళా ఉద్యోగికి నచ్చచెప్పారని తెలిసింది. అయినా ఆ అధికారి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో ఆ మహిళా ఉద్యోగి ఆ అధికారి కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న మరో అధికారికి శుక్రవారం ఫిర్యాదు చేశారని విశ్వసనీయ సమాచారం. దీంతో ఆ ఉన్నతాధికారి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు మహిళా ఉద్యోగితోపాటు తోటి ఉద్యోగులను, అటు ఆ అధికారిని విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో వేధింపులకు గురైన మహిళా ఉద్యోగి వద్ద అధికారి పెట్టిన మెసెజ్లు, ఫొటోలు, వీడియోలు విచారణ సందర్భంగా చూపినట్లు తెలిసింది. తాను ఏ విధంగా వేధింపులకు గురికావడం జరిగిందన్న విషయం పూర్తిగా వివరించారని, అలాగే విచారణ సందర్భంగా ఆ అధికారి మాత్రం తమకు ఏ పాపం తెలియదని బుకాయిస్తున్నట్లు చర్చసాగుతోంది. అలాగే సమగ్రశిక్ష విభాగంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను సైతం ఆ అధికారి ఇబ్బంది పెట్టినట్లు సెక్టోరియల్ అధికారులు సైతం చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఉన్నతాధికారి ఇచ్చే నివేదిక మేరకు లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారికి వేటు తప్పదని అంతా మాట్లాడుకుంటున్నారు. -
పూలే ఆశయాలు మార్గదర్శకం
తిరుపతి క్రైమ్: జ్యోతిరావ్ పూలే ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కొనియాడారు. జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నివాళులర్పించింది. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మహిళల విద్యాభివృద్ధి, సమానత్వం కోసం పూలే చేసిన సేవలు అపారమని, ఆయన ఆశయాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. సమాజంలో అసమానతలను నిర్మూలించేందుకు ఆయన చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని పూలే స్ఫూర్తితో ప్రజా సేవలో మరింత నిబద్ధతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మహిళా విద్యను ప్రోత్సహించిన మహనీయుడు తిరుపతి అర్బన్: మహిళా విద్యను ప్రోత్సహించిన మహానీయుడు జ్యోతిరావ్ పూలే అని జాయింట్ కలెక్టర్ గోవిందరావు అన్నారు. శనివారం పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ పూలే వంటి మహోన్నత వ్యక్తుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ దివాకర్రెడ్డి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్కుమార్రెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు జ్యోత్స్న, మునేంద్ర పాల్గొన్నారు. -
తిరుమలలో సాంకేతిక లోపం.. భక్తుల అవస్థలు
ఏపీ వ్యాప్తంగా పలు ప్రముఖ ఆలయాల వైబ్సైట్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. తిరుమల, శ్రీశైలంకు సంబంధించిన దేవస్థానాల వైబ్సైట్ సర్వర్లు సాంకేతిక సమస్యతో స్తంభించిపోయాయి. దీంతో ఆన్లైన్ టికెట్ల జారీ నిలిచిపోయింది.తిరుమలలో ఆఫ్లైన్లో టికెట్ల జారీ చేపడుతున్నారు. సర్వర్ల సమస్యతో టికెట్ల జారీ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఆ పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డా
సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రగిరి సబ్డివిజన్ పరిధిలోని ఓ సీఐ తన పోలీస్ స్టేషన్లో సివిల్ కేసులు సెటిల్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూ వివాదాలు, వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న బాకీలు తీర్చకపోవడం వంటి అంశాల్లో పోలీసులు తలదూర్చకూడదని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ సదరు సీఐ ఏమాత్రం లెక్క చేయడం లేదని ఆ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందే చెబుతున్నారు. సెటిల్ మెంట్ల కోసం స్టేషన్ పరిధిలోనే నివాసం ఉంటున్న అధికార పార్టీ నేతలను అనధికారికంగా ఆ సీఐ నియమించుకున్నట్టు చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఆ నేతలు సివిల్ కేసులను గుర్తించి సీఐ వద్దకు తీసుకువస్తే.. అవతలి పార్టీ వారికి తమ ద్వారా ఫోన్ చేయించి స్టేషన్కు పిలిపించి సెటిల్ మెంట్లు చేస్తున్నారని అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. ఒప్పుకుంటే రాచమర్యాదలు.. భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదు చేతపట్టుకుని ఆ స్టేషన్కు ఎవరు వెళ్లినా సరే.. అవతలి వారితో సెటిల్మెంట్కు ఒప్పుకుంటే రాచమర్యాదలు జరుగుతాయనీ.. లేదంటే రకరకాల సెక్షన్ల కింద కేసులు తప్పవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సివిల్ కేసుల్లో సెటిల్ చేసుకోండి.. లేదంటే ఇబ్బంది పడతారన్న మాటలు సీఐ నోటి నుంచి తరచూ వినిపిస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మఠం భూములు అధికంగా ఉండడం, ఆ భూముల్లో తరచుగా వివాదాలు చోటుచేసుకోవడంతో ఇరువర్గాల మధ్య సెటిల్మెంట్లు చేయడమే పనిగా పెట్టుకున్నారని సమాచారం. అందులోనూ ఆక్రమణ దారులకు మద్దతుగా అధికార పార్టీ కీలక నేత నుంచి ఒక్క ఫోన్ వస్తే చాలు ఆయన తన వృత్తి ధర్మాన్ని కూడా మరచి, ప్రవర్తిస్తారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కోసారి రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు లేకున్నా సరే ఎంతటివారినైనా సమయంతో సంబంధం లేకుండా పోలీస్ స్టేషన్కు ఎత్తుకొచ్చేస్తారని చెబుతున్నారు. తమను ఎందుకు తీసుకువచ్చారు.. ఏం తప్పు చేశామంటే ఆయన నుంచి సమాధానం ఉండదని, చివరకు పోలీసు ఉన్నతాధికారులే చెప్పినా వారిని విడిచిపెట్టడానికి ఆయన ఆలోచిస్తారని ఆరోపిస్తున్నారంటే ఏ స్థాయిలో సెటిల్ చేస్తారో ఆలోచించాలి. అధికార పార్టీ నేతలే మధ్యవర్తులు అధికార పార్టీకి చెందిన నాయకులే అక్కడ మధ్యవర్తులుగా వున్నారన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. మఠం భూములు, ప్రభుత్వ భూముల్లో భారీగా భూ ఆక్రమణలు జరుగుతుండడం, రెవెన్యూ, మఠం అధికారులు పట్టించుకోకుండా వదిలేయడంతో తరచు వివాదాలు జరుగుతున్నాయి. ఆ పరిస్థితిల్లో భూ వివాదానికి కారణమైన వారిని పోలీస్ స్టేషన్కు తీసుకురాకుండా ఆక్రమణలకు అడ్డుపడే వారిని, నిరుపేదలకు అండగా వెళ్లిన వారిని పట్టుకురావడం, ఆపై అక్రమ నిర్మాణ పనులను దగ్గరుండి కట్టించడం వంటి చర్యలకు ఆ సీఐ పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చట్టప్రకారం నడచుకోవాల్సిన ఆ సీఐ చట్టవ్యతిరేకతకు పాల్పడుతుండడంపై కొందరు బాధితులు తమ వద్దనున్న ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. -
మా ఊరిని వల్లకాడు చేయొద్దు
సైదాపురం: మైనింగ్ పరిశ్రమకు అనుమతులు మంజూరు చేస్తే తమ ఊరు వల్లకాడు అయి పోతుంది.. ఎట్టి పరిస్థితిలో అనుమతులు మంజూరు చేయకండి.. అంటూ ఓ గ్రామస్తులంతా వేడుకున్నారు. మైనింగ్కు అనుమతులు మంజూరు చేయాలని మరో గ్రామస్తులు చెప్పారు. ఇలా రెండు గ్రామాల ప్రజల మధ్య ప్రజాభిప్రాయ సేకరణలో విభిన్న స్వరం విన్పించడంతో సమావేశంలో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. ఈసంఘటన సైదాపురం మండలంలోని తుమ్మలతలుపూరు మైకామైన్ పాఠశాల ఆవరణలో శుక్రవారం జరిగిన పర్యావరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో చోటు చేసుకుంది. మండలంలోని తుమ్మలతలుపూరు సీవీసీ మైనింగ్ కంపెనీ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన పర్యావరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ తుమ్మలతలుపూరు రెవెన్యూ పరిఽధిలోని సర్వే 101పీలో 10.117 హెక్టార్లులో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు పర్యావరణ అనుమతి కోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చెర్లోపల్లి వాసుల ఆందోళన మైనింగ్ అనుమతులకు వ్యతిరేకంగా చెర్లోపల్లి వాసులు ఆందోళన చేశారు. చెరువులో మైనింగ్ ఏర్పాటుకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. చెర్లోపల్లి వాసులతోపాటు నాలుగు కాలనీలకు చెందిన జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమకు జరిగే నష్టాలపై గళం వినిపించారు. ఎట్టి పరిస్థితిలో మైనింగ్ అనుమతులు మంజూరు చేస్తే తమ గ్రామంలో పాటు నాలుగు కాలనీలు వల్లకాడు అవుతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్తో జీవనోపాధి తమకు మైనింగ్ ఏర్పాటుతో జీవనోపాధి లభిస్తుందని, అనుమతులు మంజూరు చేయాలని తుమ్మలతలుపూరు గ్రామస్తులు తెలిపారు. మరికొందరు మైనింగ్ వద్దంటూ తీవ్ర స్వరంతో విన్పించారు. కొంత సేపు మాటల యుద్ధమే నడిచింది. దీంతో పోలీసులు రెండు గ్రామాల వారిని సర్దుబాటు చేయడంతో సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ప్రజల మనోభావాలను పరిగణంలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నామని జేసీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు సీఐ చినసత్యనారాయణ, ఎన్విరాల్మెంట్ అధికారి అశోక్ కుమార్, తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీఓ ఎంవీ రామ్మోహన్రెడ్డి, ఆర్ఐ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
ఏర్పేడు మండలం చెన్నంపల్లి సమీపంలోని నక్కల వాగు నుంచి అక్రమార్కులు ఇసుక యథేచ్ఛగా తరలిస్తున్నారు.రియల్ ఎస్టేట్ వెంచరే కారణమా? మొన్నటి వరకు తిరుపతి జిల్లాలోని ఆ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చిన ఆ ఇద్దరు తహసీల్దార్లు రియల్ ఎస్టేట్ వెంచర్లో ఆక్రమణలు చోటుచేసుకున్న విషయాన్ని ప్రశ్నించడమే వారి పాలిట శాపంగా మారింది. ఆ ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్న చోటామోటా నాయకుడు 25 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. అందులో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ విషయాన్ని ఆ చోటా నాయకుడికి తెలియజేయడంతో పాటు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమచారం. దీన్ని జీర్ణించుకోలేని ఆ చోటామోటా నేత సదరు ప్రజాప్రతినిధి చెవిన వేశారు. వెంటనే వారికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఉన్నతాధికారి వద్దకు వచ్చి కూర్చొని ఆ ఇద్దరినీ బదిలీ చేయమని ఒత్తిడి చేయడం జరిగినట్లు తెలిసింది. చేసేది లేక ఉన్నతాధికారి వారికి విషయం తెలియజేశారు. అయితే రాత పూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిసింది. దీంతో రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్ కార్యా లయాలు మూడు రోజులుగా వెలవెల బోతున్నాయి. వివిధ రెవెన్యూ సమస్యలపై వచ్చేవారు, సర్టిఫికెట్ల కోసం వచ్చే వారు తహసీల్దార్లు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. -
పరీక్ష కేంద్రాల తనిఖీ
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో జరుగుతున్న ఎల్ఎల్బీ మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షల తీరును రెక్టార్ అప్పారావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంజిమేడులోని ఈశ్వరరెడ్డి లా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరు, పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను వర్సిటీ సిటింగ్ అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస నాయక్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, సమయపాలన పాటిస్తూ మాల్ప్రాక్టీస్కు అవకాశం లేకుండా నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపల్, సిబ్బందికి సూచించారు. హాకీ జూనియర్ మహిళల జిల్లాజట్టు ఎంపిక రేపు తిరుపతి ఎడ్యుకేషన్ : ఎస్వీ యూనివర్సిటీ క్రీడా మైదానంలో ఈ నెల 12వ తేదీ ఉదయం హాకీ జూనియర్ మహిళల జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి బి.ఆదిత్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలకు 2007 జనవరి ఒకటో తేదీ తరువాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియకు హాజరయ్యే క్రీడాకారిణులు ఒరిజినల్ ఆధార్కార్డు, బర్త్ సర్టిఫికెట్, పదో తరగతి మార్క్స్ కార్డుతో ఆదివారం ఉదయం 7 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఎంపికై నా జిల్లా జట్టు ఈ నెల 16నుంచి 18వ తేదీ వరకు చిత్తూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ చాంపియన్ షిప్లో పాల్గొంటుందని ఆయన తెలిపారు. పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు తిరుపతి అర్బన్: యూపీఎస్సీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టామని జిల్లా రెవెన్యూ అధి కారి నరసింహులు వెల్లడించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై స్టేట్ అబ్జర్వర్ జితేంద్రకుమార్, లైజనింగ్ అధికారులతో సమీక్షించారు. ఆదివారం యూపీఎస్సీ సంయుక్త రక్షణ సేవల పరీక్ష, జాతీయ రక్షణ అకాడమీ అండ్ నావల్ అకాడమీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో 1,535 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ వస్తువులు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని చెప్పారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల వింగ్–ఏ, వింగ్–బీ సెంటర్లతోపాటు ఎస్వీ ఆర్ట్ కళాశాల(టీటీడీ) బాలాజీ కాలనీలోని వింగ్–ఏ వింగ్–బీ సెంటర్లలో పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. సీనియారిటీ జాబితా విడుదల చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో రాజేంద్రప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఎస్జీటీ కేడర్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించే ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన టీచర్ల ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను www.chittoordeo.com వెబ్సైట్లో పొందుపరిచారన్నారు. ఈ జాబితాను ఆయా మండలాల ఎంఈవో, డీవైఈవో మెయిల్స్కు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో ఏవైనా అభ్యంతరాలున్నట్లైతే ఈ నెల 11 నుంచి 16వ తేదీలోపు డీఈవో కార్యాలయంలో సరైన ఆధారాలతో అందజేయాలన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించేది లేదని డీఈఓ స్పష్టం చేశారు. 25 నుంచి పీజీ పరీక్షలు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈనెల 25వ తేదీ నుంచి పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా క్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎమ్ఎస్ డేటాసైన్స్, ఎంఈడీ, ఎమ్ఎల్ఐఎస్సీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు నాలుగో సెమిస్టర్ పరీక్షల కోసం ఈనెల 13వ తేదీలోపు ఫీజులు చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
సంస్కృతం.. ‘పట్టా’భిషేకం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సం వైభవంగా సాగింది. తిరుపతి మహతి ఆడిటోరియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి చెన్నె ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీజీనాథన్ కామకోటి, వర్సిటీ చాన్సలర్, మాజీ భారత ఎన్నికల అధికారి, పద్మవిభూషణ్ నీడా మంగళం గోపాలస్వామి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. స్నాతకోత్సవంలో సంస్కృత వర్సిటీలో యూజీ, పీజీ, పీహెచ్డీ, డిప్లొమో, పీజీ డిప్లొమో కోర్సులు పూర్తి చేసిన 524 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అకడమిక్ విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 31మంది విద్యార్థులను బంగారు పతకాలు, నగదు బహుమతులు వరించాయి. నూతన పరిశోధనల వైపు అడుగులు స్నాతకోత్సవానికి అతిథులుగా విచ్చేసిన ఐఐటీ డైరెక్టర్ వీజీనాథ్ కామకోటి, ఎన్ఎస్యూ చాన్సలర్, పద్మవిభూషణ్ నీడా మంగళం గోపాలస్వామి మాట్లాడుతూ సంస్కృత వర్సిటీలో ఆధునిక టెక్నాలజీని విరివిగా వినియోగిస్తూ నూతన పరిశోధనల వైపు అడుగులు పడాలని సూచించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయలకు దిక్సూచిగా సంస్కృత భాష నిలుస్తోందన్నారు. సంస్కృత జ్ఞానాన్ని భావి తరాలకు అందించేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. పలు గ్రంథాల ఆవిష్కరణ స్నాతకోత్సవంలో భాగంగా వర్సిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన మహస్వినీ అనే యూనివర్సిటీ రీసెర్చ్ జర్నల్ ప్రథమ, ద్వితీయ భాగాలను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే సేమూషి అనే యూనివర్సిటీ న్యూస్ లెటర్, శివబలరామ పంచాంగం, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ క్యాలెండర్ను ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. అనంతరం అతిథులను వర్సిటీ అధికారులు జ్ఞాపికలను అందించి దుశ్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత శుక్ల, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు సభాసంచాలకులు పరమాచార్య గురుకుల కేంద్ర డైరెక్టర్ గణపతి భట్, విభాగాధిపతులు, ఈసీ మెంబర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ‘ఏ’ గ్రేడ్
సూళ్లూరుపేట : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)కు అకాడమిక్ ఆడిట్లో ‘ఏ’ గ్రేడ్ సర్టిఫికెట్ లభించింది. వార్షిక ఆడిట్లో భాగంగా గురు, శుక్రవారాల్లో ఆకాడమిక్ అడ్వయిజర్లు డాక్టర్ శ్రీరంజని, డాక్టర్ సీహెచ్ కృష్ణమూర్తి, ఎస్కే తమన్నా కళాశాలను సదర్శించి బోధనా విధానం, విద్యాపరమైన కార్యక్రమాలు, కళాశాలలోని రికార్డులు, ఆవరణలో వనరులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఏ గ్రేడ్కు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ఎల్వీ శంకరశర్మ మాట్లాడుతూ ఈ విజయానికి అధ్యాపకులు, అధ్యాపకేత సిబ్బంది సమష్టి కృషే కారణమన్నారు. గాయపడిన యువకుడి మృతి చంద్రగిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరి పంచాయతీ ఇందిరమ్మ కాలనీకు చెందిన నవీన్ కుమార్(25) గురువారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై మల్లయ్యపల్లి మార్గం నుంచి చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ వైపుగా వెళుతుండగా మరో ద్విచక్ర వాహనం చంద్రగిరి నుంచి వస్తూ రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నవీన్ కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ కుమార్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెలుగు వీఏఓపై దాడి దొరవారిసత్రం: కొన్ని రోజుల నుంచి కొడుకు చేసే నిర్వాకం అతని భార్య, తల్లిదండ్రులకు చెబుతున్న నేపథ్యంలో తండ్రీకుమారులు వీఓఏ బద్దేలి సునీతను కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఈ ఘటన దొరవారిసత్రం మండలం నెల్లూరుపల్లిలో మూడు రోజుల కిందట చోటు చేసుకోగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు కథనం మేరకు.. నాయుడుపేట మండలం రామారెడ్డికండ్రిగకు చెందిన సునీత వెలుగులో వీఓఏగా కొన్నేళ్ల నుంచి పని చేస్తోంది. ఈమె కొంత కాలంగా నాయుడుపేటలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో దొరవారి సత్రం మండల నెల్లూరుపల్లి గ్రామానికి చెందిన వంకా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వీఓఏ వద్ద అసభ్యకరంగా ప్రవర్తించడం తన కోరిక తీర్చాలంటూ ఇబ్బందులు పెడుతూ వచ్చాడు. విసిగిపోయిన ఆమె మూడు రోజుల కిందట నెల్లూరుపల్లి గ్రామంలోని వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి అతని భార్య కవితతో పాటు తల్లిదండ్రులు రమణయ్య, వెంకమ్మకు ఈ విషయం చెబుతున్న సమయంలో ఆవేశానికి లోనైన వెంకటేశ్వర్లు వీఓఏను కులం పేరుతో దూషించి దాడికి దిగాడు. ఇదే క్రమంలో అతడి తండ్రి కూడా నోటికి వచ్చినట్లు దూషించి, ఆమైపె దాడి చేశాడు. కాగా తాను ఇంటి వద్ద ఉండగా సునీత వచ్చి గొడవ చేసినట్లు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాల ఫిర్యాదులపై స్థానిక పోలీసులు విచారిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం గుర్తింపు కలువాయి(సైదాపురం): గేదెలు వెతకడానికి వెళ్లి కండలేరు వాగులో గురువారం గల్లంతైన కలువాయి మండలం పెరమకొండ గ్రామానికి చెందిన బక్కమంతల వివేక్ (35) శుక్రవారం మృతదేహమై కనిపించాడు. వివేక్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వివేక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తప్పిపోయిన తల్లిని కుమారుడికి అప్పగింత సూళ్లూరుపేట: తప్పిపోయిన తల్లిని సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఆమె కుమారుడికి శుక్రవారం అప్పగించారు. బతుకు తెరువు కోసం ఒడిశా నుంచి త్రిపుర సాహూ, భరత్సాహూ కుటుంబం పనుల కోసం తమిళనాడులోని కవర్పేట్కు వచ్చింది. ఈ క్రమంలో గురువారం త్రిపుర సాహూ తల్లి తప్పి పోయి, సూళ్లూరుపేటకు వచ్చింది. ఆమెకు భాష రాక ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని చూసి పోలీసులు ఆమెను విచారించారు. మాంబట్టు దాల్మియా కంపెనీ జీఎం మదన్మాలిక్ సహకారం తీసుకుని ఆమెతో మాట్లాడి తమిళనాడులోని కవర్పేట్లో ఇటుకల బట్టీలో పనిచేస్తున్న ఆమె కుమారుడి వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. -
ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల అరుదైన ఘనత
తిరుపతి సిటీ: నగరంలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ సైకాలజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థు లు కిరణ్మయి, సాయితేజ, చేతన తమ నూతన పరిశోధనలతో అబ్బురపరచి అరుదైన ఘనత సాధించారు. సైకాలజీ విభాగాధిపతి ఉమారాణి, అధ్యాపకురాలు డాక్టర్ సుధారాణి మార్గదర్శకంలో విద్యార్థులు డిజిటల్ డెటాక్స్ అండ్ సైకలాజికల్ వెల్ బీయింగ్ ఆమాంగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఏ సిస్టమేటిక్ రివ్యూ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ఇంప్లికేషన్ అనే అంశంపై పరిశోధనలు చేశారు. వీరు అధ్యయనం చేసి పరిశోధించిన అంశాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్డ్ అండ్ ఫ్యూచర్ రీసెర్చ్లో ప్రచురితమైంది. విద్యార్థులపై డిజిటల్ ప్రభావం, మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు, ఆందోళన, నిద్ర లోపాలు వంటి పలు అంశాలపై విద్యార్థులు సుదీర్ఘంగా పరిశోధనలు చేశారు. విద్యార్థుల సాధించిన ఘనతను ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, అధ్యాపకులు శుక్రవారం కళాశాలలో ఘనంగా అభినందించారు. -
ఏ.రంగంపేటలో అర్ధరాత్రి దుండగుల వీరంగం
చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేటలో గురువారం అర్ధరాత్రి దుండగులు వీరంగం సృష్టించారు. ఓ ఇంటి ముందు ఉంచిన ఆటోకు నిప్పుపెట్టడంతో ఆటో పూర్తిగా కాలిపోయింది. మరో ట్రాక్టర్కు నిప్పు పెట్టడంతో పాక్షికంగా దెబ్బతినింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. ఏ.రంగంపేట గ్రామానికి చెందిన చైతన్య కొబ్బరికాయలు వ్యాపారం చేస్తుంటాడు. అతని ఇంటికి సమీపంలో మరో వ్యక్తి రాజశేఖర్ ఉన్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో టయోట ఇతియోస్ కారులో ముఖాలకు మాస్కులు వేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోకి చేరుకున్నారు. ఆపై చైతన్య ఇంటి ముందు ఉంచిన ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సమీపంలోని రాజశేఖర్ ట్రాక్టర్కు సైతం నిప్పంటించగా, మంటలను గుర్తించిన కుటుంబ సభ్యు లు ఆర్పివేశారు. ఇంతలో కారులో వచ్చిన దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కాలిపోయిన ఆటోను పరిశీలించారు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 64,136 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,255 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. రుయాలో ఓపీ సమయాల్లో మార్పు తిరుపతి తుడా: రుయాస్పత్రి ఓపీ సమయాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఎండలు మండుతుండడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా రుయా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఓపీలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఓపీలు కొనసాగేవి. ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చడంతో ఉదయం 8:30 నుంచి ఓపీ సేవలు ప్రారంభం కానున్నాయి. -
శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తిరుపతి తుడా: శెట్టిపల్లి భూ సమస్య కు గత ప్రభుత్వ హయాంలో శాశ్వత పరిష్కారం చూపుతూ లబ్ధిదారులకు ప్రొసెసింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ భూమ న అభినయ రెడ్డి ఆ భూ సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమస్యను పరిష్కరించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ అందుకున్న లబ్ధిదారులకు వెంచర్ల ద్వారా ప్లాట్లు కేటాయించింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభించారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 50 మందికి చొప్పున రిజిస్ట్రేషన్లను చేపట్టారు. తొలిరోజు 80 శాతం మందికి సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి అ య్యాయి. కొన్ని రికార్డుల్లో మార్పు చేర్పుల కారణంగా కొందరికి రిజిస్ట్రేషన్ ఆలస్యమైంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా చైర్మన్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గోవిందరావు, సెక్రటరీ శ్రీకాంత్ బాబు, ఎస్ఈ రవీంద్రయ్య పరిశీలించారు. రైలు కింద పడి యువకుడి మృతి రేణిగుంట: సీఆర్ఎస్ ఎదురుగా ఉన్న రైల్వే పట్టాల పైన యువకుడు రైలు కింద పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనంమేరకు.. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీలోని ఎర్రమరెడ్డిపాళేం గ్రామానికి చెందిన శివ(21) అనే యువకుడి మృతదేహం రైలు పట్టాల పక్కన పడి ఉండడం గమనించిన స్థానికులు వారి కుటుంబ సభ్యులు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తున్న కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ఆర్.రామరాజన్కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.ఆ రు లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2017లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం సిబ్బంది శేషాచలం అటవీ ప్రాంతం, నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్ వద్ద తనిఖీలు చేశారు. నిందితుడు రామరాజన్ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తుండగా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రామరాజన్కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
గాయపడిన వ్యక్తి మృతి
రేణిగుంట: మామండూరులో వివాహితపై కత్తితో దాడి చేసి, తనకు తాను గాయపరచుకున్న వ్యక్తి తిరుపతి రుయాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. తొట్టంబేడు మండలానికి చెందిన పాపేరి కృష్ణమూర్తి (44) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న మామండూరు గ్రామానికి చెందిన టి. మునెమ్మపై వ్యక్తిగత విభేదాలతో గత నెల 21వ తేదీన రాత్రి మామండూరు సమీపంలోని గంగమ్మ గుడి వద్ద కత్తితో దాడి చేశాడు. దాడిలో మునెమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు పాపేరి కృష్ణమూర్తి తనను తానే కత్తితో గాయపరుచుకున్నాడు. గాయపడిన నిందితుడిని వెంటనే తిరుపతిలోని రుయాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి నిరసన.. అధికారుల నిలదీత!
తిరుపతి సిటీ: ఎస్వీయూ మహిళా వసతి గృహాల్లో గ్యాస్ కొరత సాకు చూపుతూ మెనూ రద్దు చేయడం దారుణమని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వర్సిటీ మహిళా హాస్టల్–2 వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్సిటీలో అధికారుల తీరు దారుణంగా ఉందని, పురుషుల హాస్టల్లో లేని గ్యాస్ కొరత మహిళల హాస్టల్లో ఉందని చూపుతూ మెనూ రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. మెనూలో ఉన్న ఐటమ్స్ను వడ్డించంకుండా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, భోజనం సైతం నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఈడీ చదువుతున్న విద్యార్థినులు ప్రాక్టిక ల్స్లో భాగంగా ఉద యం క్లాసుకు వెళ్లాల్సి ఉండడంతో వారికి సమయానికి భోజనం అందించకపోవడంతో విద్యార్థినులు ఖాళీ కడుపుతో వెళుతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో సమస్యలు, హాస్టల్ ఉద్యోగుల దురుసు ప్రవర్తనపై వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ అప్పారావును విద్యార్థులు నిలదీశారు. సోమవారం నుంచి పాత మెనూను కొనసాగిస్తామని, హాస్టల్లో సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు విద్యార్థులకు నచ్చచెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కో కన్వీనర్ వెంకటలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు పవిత్ర, ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, యూనివర్సిటీ కార్యదర్శి అనిత, నాయకులు శ్రవంతి, నవ్య పాల్గొన్నారు. -
సంస్కృతం.. ‘పట్టా’భిషేకం
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఐదో స్నాతకోత్సవం గురువారం తిరుపతి ఎన్ఎస్యూలో ఘనంగా జరిగింది.శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వ అధి కారులు హడలిపోతున్నారు. కూటమి నే తల బెదిరింపులు, వేధింపులతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇప్పటిదాకా అవినీతి మరక అంటని వారు తెలిసితెలి సి తప్పులు చేయలేక.. అధికార పార్టీ నేత ల బూతు పురాణం వినలేక.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక కుమిలిపోతున్నారు. తీరా కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్టలు పోగా.. ఉద్యో గమూ లేకుండా పక్కన బెట్టేయడం చూసి ఆవేదనకు లోనవుతున్నారు. ఇంతబతుకు బతికీ.. తీరా ఇలా చేస్తారని అనుకోలేదని తమ సన్నిహితుల వద్ద చెప్పుకుని కన్నీళ్లు పెడుతున్నారు. ఇంతకీ ఏమిటా కథా.. ఎందుకంత ఆవేదన.. మీరే చదవండి! కాదు..కూడదంటే.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నిబంధనలతో మీకు పనిలేదు. మేం చెప్పింది చెయ్యి.. అంతా మేం చూసుకుంటాం..’ అంటూ కూటమి నేతలు అధికారులను ఉసిగొల్పుతున్నారు. తమకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. మాట వినని వారిపై ని ఘా పెడుతున్నారు. పైఅధికారులపై ఒత్తిడి తెచ్చి వారి విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. కాదు.. కూడదంటే ఉద్యోగమే లేకుండా చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో తమ పలుకబడి ఉపయోగించి సంబంధిత అధికారుల నుంచి ఒత్తిడి చేయిస్తున్నారు. ఆపై ఉద్యోగమే లేకుండా.. ఎక్కడా పోస్టింగే ఇవ్వకుండా పక్కన బెట్టేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. తాము చెప్పిన పనులు చేయడం లేదని తిరుపతి జిల్లాలోని రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్లను పక్కనబెట్టేశారు. మూడు రోజులవుతున్నా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించకుండా చోద్యం చూస్తున్నారు. అదే నియోజకవర్గంలో మండల నాయకుడి మాట వినడం లేదని తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు రెవెన్యూ అధికారులను కేవీబీ పురం మండలానికి బదిలీ చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పలమనేరులోనూ ఇలాంటిదే చోటు చేసుకుంది. మూడు రోజులైనా..? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో మూడు రోజులుగా రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్లు కార్యాలయానికి రావడం లేదు. వారిని బదిలీ చేశారా? లేదా? కూడా తెలియడం లేదు. పోనీ ఆ స్థానంలోకి వేరొక అధికారి వచ్చారా? అంటే అదీ లేదు. జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యమైన మండలాల్లో రేణిగుంట, ఏర్పేడు ప్రధానమైనవి. రెవెన్యూతో పాటు.. ప్రొటోకాల్ వ్యవహరాలు అధికంగా ఉంటాయి. అటువంటి మండలాల్లో మూడు రోజులుగా తహసీల్దార్లు లేరు. ఉన్న ఇద్దరు అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఆగ్రహానికి లోనైనట్టు సమాచారం. ఆ ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేయమని ఉన్నతాధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఆ ప్రజాప్రతినిధి చెప్పినట్టు వినకపోతే ఎక్కడ అమరావతి నుంచి ‘ముఖ్య’ నేతల నుంచి తిట్టిస్తారోనని భయపడి ఉన్నతాధికారి ఆ ఇద్దరు తహసీల్దార్లకు సమచారం ఇచ్చారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూటమి నేతల కర్ర పెత్తనం ఇన్చార్జ్ కనుసన్నల్లోనే అధికారులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు నడుచుకోకపోతే ఏ అధికారి ఉద్యోగం చేయలేని దుస్థితి. పలమనేరు నియోజకవర్గంలో ప్రతి మండలాని కి ఒకరు టీడీపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఆ ఇన్చార్జ్కి తెలియకుండా ఏ ఒక్క ఫైలు కదలడానికి వీల్లేదు. రెవెన్యూ అప్పీళ్లపైనా ఆ ఇన్చార్జ్ చెప్పినట్లు అధికారులు నడుచుకోవాలి. లేదంటే, ఆ అధికారి అక్కడ పనిచేయలేరు. నెల క్రితం తవణంపల్లె తహసీల్దార్ను నిర్ధాక్షి ణ్యంగా బదిలీ చేయడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. తొట్టంబేడులో ముగ్గురు బదిలీ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల పరిధిలో ముగ్గురు రెవెన్యూ అధికారులను శుక్రవారం బదిలీ చేశారు. స్థానిక టీడీపీ నాయకుడు చెప్పిన పనులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ చోటామోటా నాయకుడు జిల్లా లోని ఆ ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేశారు. వెంటనే రెవెన్యూ డివిజనల్ అధికారికి ఫోన్ చేసి ఆ ముగ్గురిని బదిలీ చేయమని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చేసేది లేక ఆ ముగ్గురిని కేవీబీ పురం మండలానికి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే గతంలో అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటు సస్పెండ్కి గురైన ఓ రెవెన్యూ అధికారి టీడీపీ నాయకులకు ముడుపులు సమర్పించుకుని పోస్టింగ్ తెచ్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వ్యక్తి ఆత్మహత్య
తిరుపతి క్రైమ్: తిరుపతి అర్బన్ పరిధిలోని కుమ్మరిమిట్టకు చెందిన బుద్దారెడ్డి అయ్యప్ప ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. కుమ్మరిమిట్టకు చెందిన బుద్దారెడ్డి అయ్యప్ప (38)కు మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ నెల 8వ తేదీ ఉదయం పనికి వెళ్లిన అయ్యప్ప, సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 9.45 గంటల సమయంలో భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో గొడవకు దిగాడు. అనంతరం, ఇంట్లో ఉన్న చీరతో పైకప్పు హుక్కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన భార్య తులసి, చుట్టుపక్కల వారి సహాయంతో అతడిని ఆటోలో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై తులసి (30) గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
రూ.8 లక్షల నగదు, 8 సవర్ల బంగారం చోరీ
సూళ్లూరుపేట:మండలంలోని మన్నేముత్తేరిలో బాల సుందర్రాజ్ అనే పాస్టర్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.8 లక్షల నగదు, 8 సవర్లు బంగారు నగలు చోరీ చేశారు. బాధితుడు బాలసుందర్ రాజ్ కథనం మేరకు.. చైన్నెలోని బాలసుందర్ రాజ్ మనవడి పుట్టిన రోజు పండుగకు కుటుంబ సభ్యులందరూ బుధవారం ఇంటికి తాళాలు వేసుకుని చైన్నెకి వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించి దండగులు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బెడ్రూమ్లోని బీరువాలు పగులగొట్టి అందులో ఉన్న రూ. 8 లక్షల నగదు, 8 సవర్లు బంగారు నగలు చోరీ చేశారు. గురువారం ఉదయాన్నే చర్చి తాళాలు తీసేందుకు వచ్చిన వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి బాలసుందర్రాజ్కు సమాచారం అందించారు. ఆయన వెంటనే చైన్నె నుంచి వచ్చి చూసుకుని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మురళీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సంఘటన స్థలంలో వేలిముద్రలను సేకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జిగా మహిళా యూనివర్సిటీ విద్యార్థిని తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం న్యాయ విభాగానికి చెందిన విద్యార్థిని స్వర్ణ సుష్మా జూనియర్ సివిల్ జడ్జిగా (న్యాయమూర్తిగా) ఎంపిక కావడంపై వర్సిటీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయమూర్తి స్వర్ణసుష్మాను న్యాయ విభాగం, వర్సిటీ అధికారులు గురువారం ఘనంగా సన్మానించారు. ఆమె సాధించిన విజయంతో విశ్వవిద్యాలయం ప్రతిష్ట మరింత పెరిగిందని వీసీ ఆచార్య ఉమ కొనియాడారు. స్వర్ణ సుష్మా 2019–2022 బ్యాచ్లో మూడేళ్ల లా కోర్సును పూర్తి చేసి, ప్రస్తుతం ఇక్కడే ఎల్ఎల్ఎం (పీజీ కోర్సు) ఫైనల్ ఇయర్ చదువుతోందని, ఇంతలో న్యాయమూర్తుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసి పరీక్షలు రాసిన తరువాత అన్ని రకాల ఇంటర్వూల్లో విజయం సాధించి ఆమె న్యాయమూర్తిగా ఎంపికయ్యారని వర్సిటీ అధికారులు తెలిపారు. మహిళ మృతిపై డీఎంహెచ్ఓ విచారణ కలువాయి(సైదాపురం):కలువాయి పీహచ్సీలో సిబ్బంది లేని కారణంగా మహిళ మృతి చెందడంపై డీఎంహెచ్ఓ విచారణ జరిపారు. ఈ నెల 8వ తేదీ తెల్లవారుజమున పెన్నబద్దెవోలు గ్రామానికి చెందిన మందాల పెంచలమ్మను 108 వాహనంలో కలువాయి పీహెచ్సీకి తీసుకుని వచ్చే సరికి ఆ సమయంలో ఆస్పత్రిలో ఎవరు లేకపోవడంతో అక్కడ నుంచి పొదలకూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళుతుండగా మార్గం మధ్యలో ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించగా గురువారం నెల్లూరు డీఎంహెచ్ఓ సుజాత చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన పెంచలమ్మ మృతిపై వైద్యులు విజయలక్ష్మి, వైద్యశాల సిబ్బంది, 108 వాహనం సిబ్బందిని విచారించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని హెచ్చరించారు. తీరు మారకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రైవేటు విద్యాసంస్థల్లో మితిమీరిన అకృత్యాలు
తిరుపతి రూరల్: ‘నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని ప్రైవేటు విద్యా సంస్థల్లో అరాచకం, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఫీజులు సకాలంలో కట్టలేదని విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.’ అని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలు ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చంద్రగిరి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థల అరాచకం అరికట్టడంపై భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించారు. అనంతరం వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం ముల్లంగుంట వద్ద ఉన్న ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న జస్వంత్ రెడ్డి కాలేజీ గోడ దూకి పరారై 30 రోజులు గడుస్తున్నప్పటికీ అతని ఆచూకీ కనిపెట్టలేదన్నారు. అలాగే మరో నర్సింగ్ కాలేజీలో ఫీజు చెల్లించని ఓ విద్యార్థితో మరుగుదొడ్లు కడిగించడం వంటి వికృత చేష్టలను చూస్తుంటే విద్యార్థుల భద్రత, భవిష్యత్తును గాలికి వదిలేసిట్టు అర్థమవుతోందన్నారు. యువకుని అదృశ్యానికి కారణమైన ఆ కాలేజీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ కాలేజీ యజమాని టీడీపీకి మద్దతుదారు కావడమేనా..? అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్రెడ్డి మాట్లాడుతూ పెరుమాళ్లపల్లి వద్దనున్న నర్సింగ్ కాలేజీ యజమాని ఒక విద్యార్థిని ఫీజు కట్టనందుకు మరుగుదొడ్లు కడిగించడం, తరగతి గదులు ఊడ్చడం, ప్లేట్లు కడిగించడం వంటి దుశ్చర్యలతో ఆమెకు నరకం చూపారన్నారు. కొన్ని రోజులుగా ఆ నర్సింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి అకతవకలపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.విద్యార్థి సంఘాలకు డబ్బులు ఎరకాలేజీల్లో జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలపై నిలదీసేందుకు వెళ్లే కొన్ని విద్యార్థి సంఘాల నాయకులకు యాజమాన్యాలు డబ్బును ఎరగా చూపించి తప్పులు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నా రు. అలాంటి కాలేజీల యాజమాన్యంతోపాటు డబ్బు లు వసూళ్లకు పాల్పడే విద్యార్థి సంఘాలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సా ర్ సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి, కార్యదర్శి నరేష్ కుమార్, చంద్రగిరి మండల అధ్యక్షుడు వినోద్ కుమార్, తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు గూడూరు రఫీ, రామచంద్రపురం మండల అధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి, చిన్నగొట్టిగల్లు అధ్యక్షుడు నక్క హరిబాబు, ఎర్రవారిపాళెం విద్యార్థి విభాగం నేత శేషారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీలపై దాడులు తగ్గుతున్నాయ్!
– ఎస్సీ కమిషన్ చైర్మన్ తిరుపతి అర్బన్: ఎస్సీలపై దాడులు జిల్లాలో తగ్గుతున్నాయని, అలాగే వివక్షపూరిత ఘటనలు తక్కువగానే ఉన్నాయని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహార్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్కు విచ్చేసిన ఆయన ఉదయం పీజీఆర్ఎస్ హాల్లో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 105 అర్జీలను అందుకున్నారు. మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాలకు చెందిన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులతో కలసి పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఎస్సీల పాలన సమర్థవంతంగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వివక్ష తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 68 కేసులు పెండింగ్లో ఉన్నాయని, అందులో 18 కేసులు అట్రాసిటీ కేసులు ఉన్నారని వెల్లడించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. అయితే భూ సమస్యలపై వచ్చే అర్జీల్లో కోర్టు కేసులు ఉండే అంశాలు మాత్రమే జాప్యం జరుగుతుందని చెప్పారు. జేసీ గోవిందరావు మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్నరాయుడు మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే అర్జీదారులతో మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. పోలీసులపై చర్యలు తీసుకోండి నా భర్త జడ వేమయ్యను వెంకటగిరి పోలీసులు అన్యాయంగా కొట్టారని ఆయన భార్య జడ నందిని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహార్కు గురువారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వెంకటగిరి మండలం పాలకొండసత్రం అరుంధతివాడ గ్రామానికి చెందిన జడ వేమయ్యను ఈ ఏడాది మార్చి 24వ తేదిన వెంకటగిరి పోలీస్స్టేషన్ నుంచి పోన్ చేసి స్టేషన్కు పిలిపించి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. స్విమ్స్ సమస్యలకు పరిష్కారం చూపండి స్విమ్స్లో దళిత, బడుగు బలహీనవర్గాల కార్మికులకు చెందిన సమస్యలకు పరిష్కారం చూపాలని సీఐటీయూ నగర ఉపాధ్యాక్షుడు వేణుగోపాల్, స్విమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మారి ముత్తు, నాయకులు గోపి, వెంకటేష్, మునేంద్ర, మునికృష్ణ ఎస్సీ కమీషన్కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఓ వినతిపత్రం అందజేశారు. రూ.లక్షలు చెల్లించాం..ప్లాట్లు చూపలేదు నెలవారీ కంతుల రూపంలో రూ.లక్షలు చెల్లించామని, అయినా ఇప్పటి వరకు ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయలేదని ఎరుకల దేవాంజనేయులుతోపాటు పలువురు బాధితులు ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహార్కు ఫిర్యాదు చేశారు. 1998–2000లో చరిష్మా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి వందలాది మంది పేదలు ఇంటి ప్లాట్ కోసం డబ్బులు చెల్లించామని పేర్కొన్నారు. అయితే ఆ భూములు 22ఏ కింద ఉన్నాయంటూ సంస్థ డైరెక్టర్లు కాలయాపన చేస్తున్నారని చెప్పారు. -
వేడుకగా లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం
తిరుపతి కల్చరల్: వీవీ మహల్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ను గురువారం వేడుకగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరై జ్యోతి ప్రజ్వల చేసి లక్కీ వస్త్ర షాపింగ్ మాల్ను ప్రారంభించారు. శ్రీలీల రాకతో ఆమె చూసేందుకు షాపింగ్ మాల్ వద్ద అభిమానులు హోరెత్తారు. అశేష అభిమానులకు అభివాదం చేస్తూ శ్రీలీల షోరూం వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ లక్కీ షాపింగ్ మాల్ను గతంలో ఒంగోలులో ప్రారంభించిన తాను ప్రస్తుతం తిరుపతిలో నూతన షాపింగ్ మాల్ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. సౌత్ ఇండియాలో ఉండడం ఓ లక్కీ ఫీలింగ్ ఆ ఫీలింగ్తో లక్కీ షాపింగ్ మాల్ ఆరంభించానన్నారు. లక్మీ షాపింగ్ మాల్ ఽఆధునాతన ట్రెండింగ్ మోడల్స్తో అందరూ మెచ్చే వరైటీ కలెక్షన్లు ఉన్నాయని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆదరించాలని కోరారు. శారీస్ కొనండి అందంగా రెడీ అవ్వండి... ఆనందంగా ఉండండని అన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెబుతూ తాను బాగా చదివి డాక్టర్ అవ్వాలన్నది లక్ష్యమని, అయితే అనుకోకుండా వచ్చిన ఆఫర్ సినిమాలని తెలిపారు. మెడిసిన్ చదివిన తాను ఎండీ పూర్తి చేసి డాక్టర్గా సేవలందించాలన్నది లక్ష్యమని తెలిపారు. ఇక సినిమాల విషయం గురించి ఆమె మాట్లాడుతూ సినిమాల్లో ఇప్పటి వరకు తాను చేసి పాత్రలు సంతృప్తిని ఇచ్చాయని, ప్రస్తుతం మరో ఐదు సినిమాలకు సైన్ చేశానని అవి త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. లక్కీ షాపింగ్ మాల్ అధినేతలు శ్రీనివాస్, స్వామి, రత్తయ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల అభిరుచుల మేరకు రిటైల్ మార్కెటింగ్ ట్రెండ్స్ విప్లవాత్మకమైన మార్పులకు లోనతున్నారన్నారు. రాష్ట్రంలో ఫ్యామిలీ కలెక్షన్స్లో తిరుగులేని ఆదరణ పొందిన లక్కీ షాపింగ్ మాల్ను తిరుమల శ్రీవారి పాదాల చెంత ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో తమ 16వ స్టోర్ను ప్రారంభించడం మహద్బాగ్యమన్నారు. నాణ్యతతో పాటు మీ బడ్జెట్ ధరల్లో వస్త్రాలను అందించడం తమ షాపింగ్ మాల్ ప్రత్యేకతన్నారు. సంపూర్ణ కుటుంబ సభ్యులు మెచ్చే వరైటీ వస్త్రాలను ఎత్నిక్ వేర్ నుంచి ఆధునిక వెస్ట్రన్ స్టైల్స్ వరకు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో అదిరిపోయే వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్టు
తిరుపతి రూరల్: ట్రాన్స్ఫార్మర్లు చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. ట్రాన్స్ఫార్మర్ల చోరీపై జిల్లావ్యాప్తంగా పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. గత బుధవారం రాత్రి 10.45 గంటలకు రామచంద్రాపురం మండలం రాయలచెరువు కట్టకు పడమర వైపున ముత్యాలమ్మ గుడి ఆర్చ్ సమీపంలో కొందరు అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో నిందితులుగా తేలడంతో వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2.72 లక్షలు విలువైన సుమారు 252 కిలోల రాగి వైర్లు, మూడు మోటార్ సైకిళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో చంద్రగిరి మండలం దోర్నకంబాలకు చెందిన పరమాల చంద్రయ్య అలియాస్ నాసోడు, గాలి బాలాజీ, తుపాకుల పవన్ కుమార్ అలియాస్ కళ్యాణ్, తిరుపతి అన్నారావు సర్కిల్ యానాది సెంటర్కు చెందిన అక్షల నాగరాజు ఉన్నారన్నారు. కాగా చోరీ సొత్తు కొనుగోలు చేసిన నాయుడుపేట గోరపల్లిగుంటకు చెందిన హేమంత్, తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లికి చెందిన శ్రీకాంత్రెడ్డి, చంద్రగిరి భవానీనగర్కు చెందిన వల్లెమ్మపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించి, రివార్డులు ప్రకటించారు. -
ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ల మెరుపు సమ్మె
తిరుపతి అన్నమయ్యసర్కిల్: వేతనాలు సక్రమంగా చెల్లించని కారణంగా ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల డ్రైవర్లు గురువారం మెరుపు సమ్మెకు దిగారు. వేకువజామున అలిపిరి డిపో నుంచి ఎలక్ట్రికల్ బస్సుల వెలుపలికి తీసుకురాకుండా మెరుపు సమ్మెకు దిగారు. దీంతో విష్ణునివాసం, శ్రీనివాసం సముదాయాల వద్ద శ్రీవారి భక్తులు ఎలక్ట్రికల్ బస్సుల కోసం గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడింది. నిరీక్షణ భరించలేని మరి కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి తిరుమలకు తరలివెళ్లారు. ఎంత సేపటికి బస్సులు రాకపోవడంతో విష్ణునివాసం ముందుభాగంలోని రహదారి పూర్తిగా శ్రీవారి భక్తులతో రద్దీగా మారింది. డ్రైవర్లూ రండయ్యా.. అలిపిరి డిపోకే పరిమితమైన ఎలక్ట్రికల్ బస్సుల విషయం తెలుసుకున్న సంబంధిత ఆర్టీసీ అధికారులు కాంట్రాక్ట్ డ్రైవర్లను రండయ్యా విధులకు అంటూ పిలిచినా తమ జీతాల చెల్లింపు సంగతి తేల్చాలని పట్టుపట్టారు. ఈ రోజు తప్పక జీతాలను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య కొలిక్కి వచ్చింది. దీంతో తిరుమలకు ఉదయం 10 గంటల తరువాత ఎలక్ట్రికల్ బస్సు సర్వీసులను నడిపినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఆర్టీసీ అధికార యంత్రాంగం కార్మికుల సమస్యల పరిష్కారంలో తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలే ప్రయాణీకుల పాలిట శాపాలుగా మారుతున్నాయని పలువురు ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. -
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల: బెంగళూరుకు చెందిన జి.విజయ్ హేమంత్ అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,104 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరికి విరాళ డీడీని అందజేశారు. పోషణ్ పక్షోత్సవాలు తప్పనిసరి తిరుపతి అర్బన్: ప్రతి అంగన్వాడీ సెంటర్లో పోషణ్ పక్షోత్సవాలను తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఉద్యోగులతో కలసి పోషణ్ పక్షోత్సవాల పోస్టర్తోపాటు హబ్ అంగ్వాడీ కేంద్రాలకు సంబంధించి పూర్వ ప్రాథమిక సంరక్షణ విద్య మెటీరియల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు జరుపుకోవాలన్నారు. ప్రధానంగా తల్లీబిడ్డల పోషణ్, మెదడు వికాసం, ఆటల ద్వారా విద్య, స్క్రీన్ టైమ్ తగ్గింపు, అంగన్వాడీల బలోపేతం, పిల్లల సంరక్షణతోపాటు వారి పోషణలో పురుషుల భాగస్వామ్యం అనే ఆరు అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ వసంతబాయి, నోడల్ ఆఫీసర్ వాసంతి, సీడీపీఓ ఉమామహేశ్వరి, జిల్లా కోఆర్డినేటర్ భువన్, ప్రథమ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేం నాయకులం.. ఫీజు కట్టం సాక్షి టాస్క్ఫోర్స్: పాకాల మండలంలోని టీడీపీ నాయకుడు తన అనుచరులతో కలసి ప్రైవేటు పాఠశాల వ్యానును ఆపి, దౌర్జన్యం చేసి, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు కథనం మేరకు.. నేండ్రగుంటకు చెందిన టీడీపీ ప్రధాన నాయకుడి కుమార్తె తిరుపతికి సమీపంలోని ఓ పాఠఽశాలలో చదువుతోంది. గత రెండేళ్లుగా ఫీజులు చెల్లించకపోవడంతో పాఠశాల యాజమాన్యం పలుసార్లు ఫీజు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. సదరు నాయకుడు ఫీజులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ రుబాబు చూపించాడు. దీంతో విసుగు చెందిన పాఠశాల యాజమాన్యం ఆ నాయకుడి కుమార్తెను వ్యానులో ఎక్కించుకోకూడదని, పాఠశాలకు రానివ్వకూడదని నిర్ణయించుకుంది. అయితే విషయం తెలుసుకున్న ఆ నాయకుడు రెండు రోజుల క్రితం నేండ్రగుంట మీదుగా విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతున్న వ్యానును ఆపి టీడీపీలోని చోటా, మోటా గ్యాంగ్తో హల్చల్ చేశాడు. ఫీజులు కట్టకపోతే ఎం చేస్తారంటూ నానా మాటలు మాట్లాడి వ్యాను డ్రైవరుతో పాటు విద్యార్థులు భయభ్రాంతులకు గురిచేశారు. విద్యార్థుల ముందు దౌర్జన్యంగా ప్రవర్తించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార పార్టీ పెద్దలు ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఎంఈఓ, హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు వెంకటగిరి(సైదాపురం): పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో డీఈఓ కార్యాలయం వెంకటగిరి ఎంఈఓ, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి రాధకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ ఆరోపణలకు సంబంధించి రెండు రోజుల్లో వివరాలు వెల్లడించాలని అధికారులు సూచించారు. 11న ‘మహతి’లో పూలే జయంతి తిరుపతి అన్నమయ్యసర్కిల్: సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు టీటీడీ అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీలో అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు హాజరు కావాలని కోరింది. -
గ్యాసో బాసో!
సాక్షి, టాస్క్ఫోర్స్: చిత్తూరు జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి కింద దీపం కనెక్షన్లు 2,45,786, ఉజ్వల కనెక్షన్లు 20,212, ఎల్పీజీ కనెక్షన్లు 5,09,116, కమర్షియల్ కనెక్షన్లు 2,930 వరకు ఉన్నాయి. రోజువారీగా వేలల్లో గ్యాస్ బండలు అమ్ముడవుతున్నాయి. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గ్యాస్ సరఫరాకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా హోటళ్లకు గ్యాస్ దొరకడం కష్టతరంగా మారుతోంది. అందరి చూపు వంట గ్యాస్పై పడింది. బ్లాక్లో విక్రయాలు పెరిగాయి. సిలిండర్ రూ.5 వేలు? గ్యాస్ కొరత కారణంగా బండ వ్యాపారం బహిరంగంగా జరుగుతోంది. బ్లాక్లో గ్యాస్ విక్రయాలు జోరందుకున్నాయి. రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హోటళ్ల నిర్వహణ కోసం నిర్వాహకులు బ్లాక్లో రూ.5 వేల వరకు వెచ్చిస్తున్నట్ట సమాచారం. పలు చోట్ల దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేకుంటే ఏజెన్సీ నిర్వాహకులు డెలివరీ బాయ్లపై నెట్టేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. బుకింగ్ కావడం లేదు భయ్యా? నెల రోజులుగా చాలా మంది వంటగ్యాస్ వినియోగ దారులు గ్యాస్ బుకింగ్ కావడం లేదని కార్యాలయాలను చుట్టుముడుతున్నారు. అక్కడికి వెళ్లిన వారికి చిత్తు పేపర్లో ఫోన్ నంబర్లు రాసి ఇచ్చి పంపిస్తున్నారు. ఆ టోల్ ఫ్రీ నంబర్లు కూడా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ కాకపోవడంతో కొందరు పొయ్యితోనే కుస్తీపడుతున్నారు. మరి కొంతమందికి బుకింగ్ చేసినా ఓటీపీ రావడం లేదు. దీంతో వారు ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈకేవైసీ బూచీ! ఓటీపీ, బుకింగ్ సమస్యలతో పాటు తాజాగా ఈకేవైసీ సమస్య కూడా తోడైంది. జిల్లాలో 1.30 లక్షల మంది ఈకేవైసీ చేయించుకోలేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఒకవైపు బుకింగ్ సమస్య, మరోవైపు ఈకేవైసీ సమస్యతో ఏజెన్సీలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. వినియోగదారులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏజెన్సీల వద్ద క్యూకడుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట అంటూ ఇన్నాళ్లు లేని ఈకేవైసీని ఇప్పుడు బూచీగా చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటీపీ లేకుండా జరిగిన గ్యాస్ బుకింగ్ను కప్పిపుచ్చేందుకే ఈకేవైసీని తెరపైకి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు తయారైంది జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితి. అమెరికా–ఇరాన్ యుద్ధం పేరుతో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఓటీపీలు లేకుండానే డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్లో అమ్మేస్తున్నారు. గ్యాస్ బుక్ చేద్దామన్నా వీలుకాకపోవడంతో వినియోగదారులు ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. అక్కడిచ్చే టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసినా గ్యాస్ బుక్గాక ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏజెన్సీ నిర్వాహకులు ఈకేవైసీనీ తెరపైకి తెచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇక విధిలేని పరిస్థితుల్లో వినియోగదారులు కట్టెల పొయ్యిపైనే కుస్తీ పడుతూ కాలం నెట్టుకొస్తున్నారు. ఓటీపీ దొంగలతో కుమ్మక్కు గుడిపాలలో వెలుగుచూసిన ఓటీపీ దోపిడీపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కళ్లు మూసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటీపీ లేకుండా ఒక ఏజెన్సీ నిర్వాహకుడు మార్చి 23న 270 గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో అమ్మినట్లు సమాచారం. ఈ సిలిండర్లను గుడిపాల, బంగారుపాళ్యం మండలాల్లో విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘సాక్షి’ కథనాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను రాతపూర్వకంగా నమోదు చేసి జిల్లా యంత్రాంగానికి నివేదికగా సమర్పించారు. అనంతరం ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. అయితే తర్వాత ఆ దందాను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జరినట్టు సమాచారం. ఆ శాఖ అధికారులకు కూడా మామూళ్లు అందాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గందరగోళంగా గ్యాస్ సరఫరా -
శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు అరుదైన గుర్తింపు
చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు గత 20 ఏళ్లుగా ఇండియన్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (ఐఏబీ) అనే స్వచ్ఛంద సంస్థకు విరాళాలు అందిస్తూ వస్తున్నారు. కంటి చూపు లేని ఎందరికో చేయూతను అందించడంలో సహకరిస్తున్న వ్యవసాయ కళాశాల ఉద్యోగులు, విద్యార్థుల సేవా గుణాన్ని గుర్తించి ఐఏబీ బ్లైండ్ ఎంపవర్మెంట్ చాంపియన్స్ –2025 గోల్డ్ జోన్ అవార్డును సంస్థ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా అవార్డును కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రెడ్డి శేఖర్కు అందజేశారు. ఈ గుర్తింపు దక్కడానికి సహకరించిన వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం అధికారులు, శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.రెడ్డిశేఖర్ అభినందించారు. రైతు సంక్షేమానికి సంబంధించిన విద్యను అభ్యసిస్తున్న కళాశాల విద్యార్థులు, జాతీయ సేవా పథకం వలంటీర్లు, జాతీయ సేవా పథకం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 2024లోనూ శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు ఐఏబీ బ్లైండ్ ఎంపవర్మెంట్ చాంపియన్స్ గోల్డ్ జోన్ అవార్డును దక్కిందని వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డాక్టర్ ఎం రెడ్డి శేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారులు మధుసూదన్ రెడ్డి, జ్యోత్స్న, ప్రదీప్ కుమార్, రాజేష్, సబిత తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
తిరుపతి అర్బన్: సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. హెయిర్ కటింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రై డల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్లతోపాటు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే నెల 12 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్షాపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం అదనంగా బ్యూటీ స్టూడియో, ఇన్స్టిట్యూషన్, బైరాగిపట్టెడ ఆర్చ్ రోడ్డు, కెనరా బ్యాంక్ పైన, తిరుపతి. శిక్షణ కూడా ఇక్కడే ఉంటుంది. ఇతర వివరాలకు 95534 54335, 96666 97219, నంబర్లను సంప్రదించగలరు. కరుణించి కాపాడు తల్లీ! శ్రీకాళహస్తి: కరుణించి కాపాడు తల్లీ అని భక్తులు జాతర సందర్భంగా ముత్యాలమ్మను భక్తిశ్రద్ధలతో కొలిచారు. ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో జాతర సందర్భంగా గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఎదుట ఉదయం పోతురాజు ముగ్గు, రేణుకాంబ ముగ్గులు వేశారు. పలువురు మహిళలు అమ్మవారికి సారెను సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి అమ్మవారికి విశేషాలంకరణ చేసి ఊరేగించారు. ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు అమ్మ వారికి సారె సమర్పించి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. -
రాధాకృష్ణ రోత రాతలపై వైఎస్సార్సీపీ నిరసన
● తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు ● పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ● నిబంధనలు పాటించని పోలీసులు ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు పెట్టేందుకు శ్రీకాళహస్తి పోలీసు స్టేషను వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు, పార్టీ నేతలుసాక్షి ప్రతినిధి, తిరుపతి: మహిళలను కించపరుస్తూ.. బ్రోకరిజాన్ని భుజాన వేసుకుని.. జర్నలిజాన్ని దిగజారుస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటించారు. బాధ్యతారాహిత్యంగా మహిళలను అవమానపరుస్తూ ప్రచురించిన కథనాలను ఖండించారు. కీచకంగా వ్యవహరిస్తున్న రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బూతు రాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదుల వెల్లువ రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలంటూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. తిరుపతిలో నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఏబీఎన్ రాధాకృష్ణపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్నట్లు పోలీసులు రసీదు ఇవ్వడానికి నిరాకరించారు. మీరు ఇచ్చిన ఫిర్యాదు పేపర్ని ఫొటో తీసుకుని వెళ్లండని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో ఒకటో పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పోలీస్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూక తోటి రాజేష్ ఆధ్వర్యంలో బుచ్చినాయుడుకండ్రి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంకటగిరి, రాపూ రు మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆదేశాల మేరకు మహిళా విభాగం నేతలు ఆయా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై రైల్వేకోడూరులో వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.విషపు రాతలపై విరుచుకుపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణపై దుమ్మెత్తి పోశారు. మహిళలను కించపరుస్తూ అల్లిన ‘చెత్త పలుకు’పై ఆందోళబాట పట్టారు. విలువలన్నీ విడిచేసి..బ్రోకరిజానికి జర్నలిజం ముసుగేసిన రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనలు చేపట్టారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మురికి వ్యాఖ్యలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఎండీని శిక్షించాలంటూ పోలీస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఇదిలావుండగా పలు పోలీస్టేషన్లలో ఖాకీలు స్వామి భక్తికి ప్రాధాన్యమిచ్చారు. నిబంధనలు మరిచి.. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదులను కూడా స్వీకరించకుండా మొండికేశారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పించారు.చిత్తూరు జిల్లా వ్యాప్తంగా.. ఏబీఎన్ రాధాకృష్ణ తీరుపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటించారు. అతన్ని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో, నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం, వడమాలపేట మండలాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఏబీఎన్ రాధాకృష్ణపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. గంగాధరనెల్లూరులో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఆధ్వర్యంలో ఆయా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్, వైఎస్సార్సీపీ శ్రేణులు ఐరాల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
తప్పు చేసిన రాధాకృష్ణకు ప్రభుత్వం అండ
● రాధాకృష్ణ రోత రాతలు, కారుకూతలపై వైఎస్సార్సీపీ శ్రేణుల కన్నెర్ర డీఎస్పీతో కాకాణి వాగ్వాదంపోలీసులతో ఘర్షణ పడుతున్న పూజిత, గౌరి తదితరులునెల్లూరు రూరల్: జర్నలిజం ముసుగులో అధికార పార్టీకి బ్రోకరిజం చేస్తూ ఆంధ్రబూతుజ్యోతి చెత్తపలుకులు పలుకుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన వంధిమాగాదులు చేస్తున్న అవినీతి, దోపిడీని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కళ్లకు కట్టినట్లు వివరించి, ప్రత్యామ్నాయంగా మావిగన్ రాజధాని ప్రతిపాదన చేస్తే టీడీపీతోపాటు అవినీతిపరుల కూసాలు కదులుతున్నాయన్నారు. మావిగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీకి చెందిన మహిళలను కించపరిచేలా ఆంధ్రజ్యోతి పత్రికలో, ఏబీఎన్ చానల్లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూతు రాతలు, రోత వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు బుధవారం కన్నెర్ర చేశాయి. పిచ్చిరాతలు రాసి, కారుకూతలు కూసిన రాధాకృష్ణ వైఖరికి నిరసనగా కాకాణి నేతృత్వంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, వైఎస్సార్సీపీ నేతలు, మహిళా నేతలతో కలిసి అయ్యప్పగుడి సమీపంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్ వద్ద నిరసన తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసు అధికారులు పత్రిక కార్యాలయానికి వెళ్లే అన్నీ మార్గాల్లో బారికేడ్లను, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. నిరసన తెలిపేందుకు వెళుతున్న నేతలను వైఎస్సార్సీపీ శ్రేణులను రోప్లతో అడ్డుకున్నారు. పోలీసుల అడ్డుకట్టలను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ముఖ్యనేతలతోపాటు మహిళలు, పార్టీ కార్యకర్తలను శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనీ వెంటనే వెళ్లిపోవాలని లేదంటే అరెస్ట్లు చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. దీనికి ముందు ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేసి రాధాకృష్ణ ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు.బారికేడ్లను ఏర్పాటు చేసి.. అడ్డుకొని..ఇనుప ముళ్ల కంచెలను పెట్టిన ఖాకీలు నాలుగు వైపులా బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు ఏర్పాటు రోప్ పార్టీలతో పార్టీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం ఖాకీల తీరుపై భగ్గుమన్న నేతలు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతుల దహనం -
అక్రమంగా జామాయిల్ చెట్ల నరికివేత
నాయుడుపేట టౌన్: మండలంలోని శ్రీనివాసపురం జగనన్న లేఅవుట్ సమీపంలో సోషల్ ఫారెస్ట్కు సంబంధించి భూమిలో ఉన్న వన సంరక్షణ సమితికి చెందిన జామాయిల్ చెట్లను బుధవారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులు నరికి వేశారు. ఉదయం నుంచి చెట్ల నరికివేతను స్థానిక వీఆర్వో అడ్డుకున్నారు. సాయంత్రం ఎవరూ లేని సమయంలో తమిళనాడుకు చెందిన కూలీలను తీసుకువచ్చి ఓం మురుగన్ ఉడ్ సప్లయిర్స్ వారు యంత్రాలతో చెట్లను నరికి వేసి ఏకంగా కర్రను లోడింగ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు లారీ వద్దకు వెళ్లి అడ్డుకున్నా వారిని అక్రమార్కులు బెదిరించారు. సమాచారం తెలుసుకుని నెల్లూరులో ఉన్న సోషల్ ఫారెస్ట్కు సంబంధించి డిప్యూటీ రేంజ్ అధికారి భాగ్యమ్మ హుటాహుటిన శ్రీనివాసపురం అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే లారీలో కర్రలను లోడింగ్ చేస్తుండటాన్ని ఆమె గుర్తించి అడ్డుకున్నారు. అక్కడ కర్ర లోడింగ్ చేయిస్తున్న వ్యక్తి ఇది అధికారపార్టీ నాయకులదని, దీనిని అడ్డుకుంటే బాగుండదని ఆమైపె బెదిరించాడు. మీపై కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తామని ఏకంగా ఆమెను బెదిరించడం విశేషం. ఈ విషయమై డిప్యూటీ రేంజ్ అధికారి విలేకరులతో మాట్లాడుతూ తమ శాఖ పరిధిలో ఉన్న జామాయిల్ చెట్లను అక్రమంగా నరికి వేస్తుండడాన్ని అడ్డుకున్నామన్నారు. దీంతో లారీలో లోడింగ్ చేసిన కర్రలను దించివేసి లారీ వెళ్లిపోయిందన్నారు. అంతేకాకుండా తనకు అధికారపార్టీ నాయకుల పేర్లు చెప్పి బెదిరించారని ఆమె వాపోయారు. చెట్లను అక్రమంగా నరికి వేయడమే కాకుండా అధికారపార్టీ నాయకుల పేర్లు ఎలా చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా నరికిన జామాయిల్ చెట్లను తమ శాఖ పరిధిలో ఉన్న కార్యాలయంలో భద్రత పరిచి వాటికి వేలంపాటలు నిర్వహించి విక్రయాలు జరుపుతామని తెలిపారు. -
గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు
రాపూరు:గంజాయిని విక్రయించినా, సాగు చేసినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్, ఎకై ్సజ్ చిత్తూరు, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ విజయశేఖర్ తెలిపారు. రాపూరు మండలం బొజ్జనపల్లి పంచాయతీలోని రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ కర్మాగారంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని 14 ఎకై ్సజ్ స్టేషన్లలో 122 కేసుల్లో పట్టుబడిన 625కిలోల 773 గ్రాముల గంజాయిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం కాల్చివేసినట్లు తెలిపారు. గంజాయిని సాగు, అక్రమ రవాణ చేసినా చట్టరీత్యా నేరమన్నారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, తిరుపతి ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్లు శ్రీనివాసాచారి, కడప చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి నాగమలేశ్వరరెడ్డి, నెల్లూరు జిల్లా పొల్యూషన్ బోర్డ్ అనలిస్ట్ శర్మ, కోస్టల్ వేస్టేమేనేజ్ మెంట్ మేనేజర్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నేతల విడుదల
పెళ్లకూరు: స్వర్ణముఖినదిలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నందుకు తప్పుడు కేసులు నమోదు చేసి, అరెస్టు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు బెయిల్పై బుధవారం విడుదలయ్యారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతల కుటుంబాలు సంబరాలు చేసుకున్నాయి. గత నెల 14వ తేదీన కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో ఇసుక అక్రమ తవ్వకాలను సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి వైఎస్సార్ సీపీ నేతలు, పలువురు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కూటమి నాయకుల ఒత్తిడి, పోలీసులు అత్యుత్సాహంతో 26 మందిపై అక్రమ కేసులు పెట్టారు. వీరిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, నాయకులు ఎద్దల నారాయణరెడ్డి, అన్నంరెడ్డి సురేష్రెడ్డి, సురేంద్రరెడ్డి, గోపాలయ్య, శ్రీనివాసులు మొత్తం 12మందిని 22రోజులుగా నెల్లూరు సబ్ జైల్లో రిమాండ్లో ఉంచారు. వీరిలో సత్యనారాయణరెడ్డి మినహా మిగిలిన 11మంది బెయిల్పై విడుదలయ్యారు. వారంతా ఇళ్లకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు అనందంతో పొంగిపోయారు. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య, యాదవ్ బాలప్రసాద్, గురవయ్య, వెంకటేశ్వర్లు తదితరులు శేఖర్రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనను పూలమాలలతో సత్కరించారు. కేజీబీవీ దరఖాస్తు గడువు పెంపు వెంకటగిరి రూరల్ : వెంకటగిరి మండలంలోని వల్లివేడు సమీపంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రవేశ దరఖాస్తు గడువు పొడగించినట్లు ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ షాహీనభాను బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి 6, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ గ్రూపులకు 40 చొప్పున సీట్లు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. బడిబయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడిమానివేసిన వారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల ద్వారా అడ్మిషన్కోసం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలియజేశారు. మరిన్ని వివరాలకు 96186 56138ను సంప్రదించాలని సూచించారు. -
భార్యకు, చెల్లికి తేడా తెలియని నికృష్టుడు రాధాకృష్ణ
చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వావివరుసలు లేని, భార్యకు, చెల్లికి తేడా తెలియని నికృష్టుడని కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తుంటే, సీబీఎన్ అడ్డుపడుతున్నాడని, ఏబీఎన్ కార్యాలయం ముందు నిరసన అంటే పోలీసులు సీబీఎన్ కార్యాలయం ముందు నిరసన లాగా భావిస్తున్నారన్నారు. ఏబీఎన్కు, సీబీఎన్కు ఉన్న బంధం నేడు నిర్ధారణ అయిందన్నారు. సీబీఎన్ ఆదేశిస్తే ఏబీఎన్ రాధాకృష్ణ ఆచరించడం ఆనవాయితీగా తయారైందని, మహిళలపై అసభ్యకరమైన భాషలో కొత్త పలుకు పేరుతో చెత్త రాతలు, హేయమైన కారుకూతలతో ప్రసారం చేశారంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి మరొక్కసారి మాట్లాడితే రాధాకృష్ణ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వ్యక్తిగతంగా మాపై ఎన్ని మాట్లాడిన పట్టించుకోమని, కుటుంబ సభ్యుల జోలికి వస్తే మాత్రం, విడిచి పెట్టమన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ రాజధాని ప్రతిపాదన విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ ప్రారంభమైందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మావిగన్ ప్రస్తావనతో చాలా మంది ఆకర్షితులవుతున్నారని, చంద్రబాబు కేవలం అమరావతిని బంగారు బాతు లాగా భావించి, తన ఆర్థిక స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని గురించి ఆలోచన చేస్తున్నది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. -
కిడ్నాప్పై ఫిర్యాదు
సైదాపురం: అప్పు చెల్లించలేదని గిరిజన కుటుంబ సభ్యులను యాజమాని కిడ్నాప్ చేశారని బుధవారం సైదాపురం పోలీసులకు బాఽధితులతో కలిసి సీపీఎం నేతల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. గిరిజనుల కథనం మేరకు.. సైదాపురంలోని ఎంఎస్ కాలనీలో నివాసం ఉంటున్న ఎం అంకయ్య, పద్మమ్మ బతుకుదెరువు కోసం రైల్వేకోడూరు సమీపంలో ఓ భూస్వామి వద్ద పనులకు వెళ్లారు. అనారోగ్యం కారణంగా ఇంటికి పోతామని బాధితులు యాజమానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఈనెల 6వ తేదీన కోడూరు నుంచి సొంతూరికి రాత్రికి రాత్రే వచ్చేశారు. దీంతో అగ్రహించిన ఇటుక బట్టీల యజమాని కుమారులు సైదాపురంలోని బస్టాండ్కు చేరుకుని అంకయ్య, పద్మమ్మల కుమారులను కిడ్నాప్ చేశాని పోలీసులకు ఫిర్యాదు చేశారని సీపీఎం ఇన్చార్జీ పీ శ్రీనివాసులు తెలిపారు. న్యాయం చేయండి రేణిగుంట: జన్మనిచ్చిన కన్నతల్లి కూతురితో కలిసి తనను ఇంట్లోకి రానివ్వకుండా ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారని కరకంబాడి పంచాయతీ బీసీ కాలనీకి చెందిన సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం కరకంబాడి బీసీ కాలనీలోని తమ ఇంటి ముందు నిలబడి మీడియాకి తన గోడును తెలిపాడు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ 2016 నుంచి కష్టపడి ఒక ఇంటిని నిర్మించుకోవడం ప్రారంభించామని అయితే 2021లో ఇంటికి సంబంధించిన మెటీరియల్ తీసుకురావడానికి వెళుతుండగా తిరుపతిలోని రమీ గెస్ట్లైన్ హోటల్ సమీపంలో తాను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానన్నాడు. దీంతో సుమారు ఆరు నెలల పాటు స్పృహ సరిగ్గా లేక ఎక్కడ ఉన్నానో కూడా తెలియని స్థితిలో గడిపానని తెలిపాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంటికి వచ్చేసరికి తాను నిర్మించుకున్న ఇంట్లోనే తనకు చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎవరు స్పందించలేదని ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు. ఆహారభద్రతా నియమాలు పాటించండి తిరుపతి అర్బన్: ఆహారభద్రతా నియమాలు పాటించకుండా కల్తీ పదార్థాలను విక్రయిస్తూ ఇష్టారాజ్యంగా ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడితో జరిమానాతోపాటు కేసులు తప్పవని జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ గోవిందరావు కలెక్టరేట్లో ఫుడ్సేఫ్టీ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పలు వ్యాపారుల షాపుల్లో తనిఖీల నేపథ్యంలో 15 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు వారికి రూ.3.88 లక్షలు జరిమానా విధించినట్లు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు జేసీకి తెలిపారు. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుపతిలో గోలీ సోడాలు తయారు చేస్తున్న వ్యాపారికి రూ.30 వేలు, సూళ్లూరుపేటలో రంగు కలిపిన చకోడీలు తయా రీ చేస్తున్న వ్యాపారికి రూ.25 వేలు, పలు రెస్టారెంట్లలో నాణ్యత లేని పెరు గు విక్రయించినందుకు ఒక్కో రెస్టారెంట్కు రూ.30 వేలు చొప్పున జరిమాన విధించినట్లు చెప్పారు. -
జలధార–జలహారతిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
తిరుపతి అర్బన్: జలధార–జలహారతిపై అధికారులు సమష్టిగా పనిచేసి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుంటూ నీటి భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ అంశం రానున్న 4–5 ఏళ్లకు అత్యంత కీలకం అని పేర్కొన్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. ఆదే మార్గంలో తిరుపతి జిల్లాను నడిపిద్దామని తెలిపారు. ప్రధానంగా ప్రతి చెరువు, కాలువ, వాగులను పరస్పరం అనుసంధానం చేసి వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడమే ప్రధానమన్నారు. ఇందుకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డీపీఓ సుశీలాదేవి, ,పంచాయతీరాజ్ ఎస్ఈ మధుసూదన్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి నరేంద్ర, ఇరిగేషన్ డీఈలు రాధాకృష్ణ, శివారెడ్డి, డీఏఓ ప్రసాద్రావు, పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రవికుమార్, సూక్ష్మసేద్య జిల్లా అధికారి చిన్నరెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయండి ఆయాశాఖల పరిధిలో కేటాయింపు చేసిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులతో కలసి మంజూరైన పనులు, వాటి పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పని, పెద్ద పని అనే తేడా లేకుండా గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబందించి భూసేకరణ, పనులు నాణ్యతతోపాటు వేగవంతానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సీ రవిమనోహరచ్చారీ, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, ఏపీఐఐసీ జోనల్ మేనేరజ్ విజయభరత్రెడ్డి, ఇరిగేషన్ అధికారి రాధకృష్ణ తదితతరులు పాల్గొన్నారు. -
లారీలో ఇరుక్కొని మూడు గంటలు నరకయాతన
రేణిగుంట: మండలంలోని మామండూరు సమీపంలోని రేణిగుంట కడప ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్ చోటు యాదవ్ లలాలారీలో ఇరుక్కుని మూడు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. పోలీసులు క్రైన్ సహాయంతో అతి కష్టం మీద లారీని తొలగించి డ్రైవర్ను హాస్పిటల్కు తరలించారు. పోలీసుల కథనం మేరకు.. అహ్మదాబాద్ నుంచి చైన్నె పోర్ట్కు మెడికల్ పరికరాలు తీసుకుని వెళ్లే లారీని శ్రీ సిటీ నుంచి కడపకు వెళుతున్న లారీ డ్రైవర్ చోటు యాదవ్ అతివేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అహ్మదాబాద్ నుంచి వచ్చే లారీలోని డ్రైవర్ విజయ్ బాలు కోకెర, క్లీనర్ శుభం కాకా సాహెబ్ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ సిటీ నుంచి వచ్చే లారీలో ఉన్న చోటు యాదవ్ కాలు లారీ క్యాబిన్లో ఇరుక్కొని పోవడంతో సుమారు మూడు గంటల సమయం నరకయాతన అనుభవించాడు. విషయం తెలుసుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీ క్యాబిన్ను తొలగించి చోటు యాదవ్ను బయటికి తీసి ముగ్గురిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతివేగంగా లారీ నడిపి ప్రమాదానికి కారణ కారణమైన చోటు యాదవ్పై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్పై తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రేణిగుంట పోలీసులు తెలిపారు. -
డిమాండ్ల సాధనే ధ్యేయంగా..
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వందలాది మంది పనిచేస్తున్నాం. ఏళ్ల తరబడి మా సర్వీసు లను క్రమబద్ధీకరిస్తారని ఎదురుచూస్తున్నాం. కానీ మా ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రధానంగా మాకు పీఆర్సీ కమిషన్ నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యో గుల సమస్యలను పరిష్కరించాలి. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. జిల్లాలో ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ఓటీ అసిస్టెంట్లు, ఫార్మాసిస్ట్ పోస్టులు వందల్లో ఖాళీలున్నాయి. వీటిని త్వరితగతిన భర్తీ చేయాలి. – జయచంద్రకుమార్, యూనియన్ జిల్లా అధ్యక్షులు, చిత్తూరు -
వైభవంగా ముత్యాలమ్మ జాతర
శ్రీకాళహస్తి: పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధిలో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో బుధవారం అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. రెండోరోజు బుధవారం కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. అమ్మవారి ఎదుట పోతురాజు ముగ్గు వేసి, శాంతి పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం గంగపెట్టెను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు అన్నదానం చేశారు. రాత్రి 7 గంటలకు రేణుకాదేవి ముగ్గు, కుంభం వేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ సారెను సమర్పించారు. ఆలయ పండితులు సారెను స్వీకరించి ఆయన్ని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. -
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఉద్యోగుల ఆందోళన
● నల్ల బ్యాడ్జీలతో నిరసన చిత్తూరు రూరల్ (కాణిపాకం): వైద్య విద్య–ఆరోగ్య శాఖల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఈఎస్ఐ ఆస్పత్రుల వద్ద నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం నుంచి జిల్లా వైద్య విధాన పరిషత్కు నిరసన సెగ తగిలింది. నల్లబ్యాడ్జీలు ధరించి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. వారి డిమాండ్ల సాధనకు పోరు బాటపడుతున్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారులకు యూనియన్ నాయకులు సోమవారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ మేరకు బుధవారం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటూ నిరసన తెలపాలని, 11వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆస్పత్రుల గేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించాలని యూనియన్ నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్లో 80 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 300మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరందరూ ఆందోళనల్లో పాల్గొంటారని యూనియన్ నాయకులు వెల్లడిస్తున్నారు. ఏళ్ల తరబడి పోరాటం వైద్య రంగంలో ఉద్యోగుల హక్కుల కోసం గత 73 ఏళ్లుగా పోరాడుతున్నామని యూనియన్ నేతలు తెలిపారు. 1999లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయించడం, కారుణ్య నియామకాలు సాధించడం, పెన్షన్, సేవా విషయాల్లో అనేక సమస్యలు పరిష్కరించడం తమ యూనియన్ సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. వివిధ విభాగాధిపతులతో జరిగిన సంయుక్త సమావేశాల ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు. అయి తే ప్రస్తుతం పలు కీలక సమస్యలు మళ్లీ పేరుకుపోయాయని, ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. 2001 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని, వేతనాల్లో కోతలు విధించడం అన్యాయమని మండిపడ్డారు. వైద్యసేవలపై నిరసనల ప్రభావం వీటితోపాటు పలు సాంకేతిక, పరిపాలనా సిబ్బంది సంబంధిత సమస్యల పరిష్కారాన్ని యూనియన్ కోరింది. ఈ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్చలకు రావాలని యూనియన్ హెచ్చరించింది. లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది. వైద్య సేవలపై ఈ నిరసనల ప్రభావం పడే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.ప్రధాన డిమాండ్లు ఇవే 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 36 శాతం ఐఆర్ మంజూరు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి అమలు పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ జీతాల చెల్లింపు నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి రిస్క్, నైట్ డ్యూటీ అలవెన్సులు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాల పెంపు ఖాళీ పోస్టుల భర్తీ, ప్రమోషన్లు ఎన్హెచ్ఎమ్ సిబ్బందికి సమయానికి జీతాలు, సెలవులు -
ఆందోళన తప్పదు
అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి చొరబడి అక్రమంగా పట్టుకెళ్లిన మా వాళ్ల అచూకీ తెలపకుంటే ఆందోళన తప్పదు. అమాయకులైన గిరిజనులపై పోలీసుల తీరు అత్యంత అమానుషం. ఏ తప్పు చేయని గిరిజనులను అక్రమంగా కేసుల్లో ఇరికిచేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఐదు రోజులు గడిచినా, తప్పు చేసి ఉంటే ఎందుకు అరెస్టు చూపలేదు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. – పరమేశం, గిరిజన నాయకుడు చేయని నేరం ఒప్పుకోవాలంట అర్ధరాత్రి సమయంలో పోలీసులు మఫ్టీలో వచ్చి నా భర్తలను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన నన్ను కొట్టి, నా మూడేళ్ల కుమార్తెను విసిరి పారేశారు. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా చేయని నేరం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని నా భర్త ఏడుస్తున్నాడు. – అఖిల, కల్యాణ్ భార్య, చవటకాల్వ పరుష పదజాలంతో దూషించారు నేను, నా భర్త ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు మా ఇంట్లోకి చొరబడ్డారు. ఒక్కసారిగా నా భర్తపై దాడికి చేశారు. ఎవరు సార్ మీరు, ఎందుకు కొడుతున్నారని ప్రశ్నిస్తే, పరుష పదజాలంతో దూషించారు. తిరుచానూరు పోలీసు స్టేషన్లో నా భర్త ప్రాణభయంతో వణికిపోతున్నారు. నాకు భయమేస్తోంది. – నాగమ్మ, బాలాజీ భార్య, చవటకాల్వ గిరిజనులంటే అంత చులకనా..? గిరిజనులంటే పోలీసులకు అంత చులకనా. మా గ్రామంలోకి అర్ధరాత్రి పోలీసులు రౌడీల్లా రావడం దారుణం. ప్రశ్నించిన నన్ను కూడా కేసు పెట్టి లోపలేస్తామంటూ బెదిరించారు. పోలీసులు దాడి చేయడం ఏమిటి.. తప్పు చేసి ఉంటే చట్టపరంగా కోర్టులో ప్రవేశపెట్టాలి. అలాంటిది ఏమి చేయకుండా, ఎందుకు వారిని పోలీసు స్టేషన్లో పెట్టినట్టు. – కవిత, ప్రత్యక్షసాక్షి, చవటకాల్వ -
భక్తులు మెచ్చేరీతిలో ఎస్వీబీసీ ప్రసారాలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా, వారు మెచ్చేలా శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ప్రసారాలను విస్తరించనున్నట్లు టీటీడీ జేఈఓ (వైద్యం, విద్య), ఎస్వీబీసీ ఇన్చార్జి సీఈఓ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం తొలిసారిగా కార్యాలయానికి వచ్చిన ఆయన వివిధ శాఖల ప్రతినిధులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమాల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందేలా కార్యక్రమాలను ఆకర్షణీయంగా రూపొందించాలని సూచించారు. శతమానంభవతి కార్యక్రమాన్ని క్రమబద్ధీకరించి ప్రతి భక్తునికీ శ్రీవారి ఆశీర్వచనం, అక్షింత లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాను భూతి కార్యక్రమాన్ని అందరికీ చేరువగా తీసుకువస్తా మని చెప్పారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఆకర్షణీయమైన భక్తి కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను, ఇతర కార్యక్రమాలను మరింత విస్తృతంగా భక్తులకు చేరవేయనున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలను మరింత నాణ్యంగా అందిస్తామని పేర్కొన్నారు. -
గిరిజనుల అక్రమ నిర్బంధం
చంద్రగిరి: గిరిజనులను అర్ధరాత్రి కిడ్నాపర్ల తరహాల్లో పోలీసులు ఎత్తుకెళ్లి, అక్రమంగా నిర్బంధించడంపై చవటకాల్వ ప్రజలు మండిపడుతున్నారు. ఐదు రోజులుగా పోలీసు స్టేషన్లో ఉంచుకుని చిత్రహింసలకు గురి చేస్తూ, చేయని నేరాన్ని అంగీకరించాలని వారిని కొడుతున్నారని మహిళలు కన్నీటి పర్యంతమవుతున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ చవటకాల్వకు చెందిన నాగరాజు, పవన్ కల్యాణ్, బాలాజీ, నరసయ్య కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ నెల 4వ తేదీ శనివారం రాత్రి చంద్రగిరి పోలీసులు మఫ్టీలో చవటకాల్వకు చేరుకున్నారు. గ్రామంలోని నాగరాజు, పవన్ కల్యాణ, బాలాజీ, నరసయ్య ఇళ్లలోకి చొరబడి వారిపై దాడికి పూనుకున్నారు. అసలు మీరు ఎవరు..ఎందుకు మా వాళ్లను తీసుకెళుతున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పలేదన్నారు. తమ వద్ద ఉన్న సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలను తీసుకెళ్లినట్లుగా తెలిపారు. ఆదివారం ఉదయం పోలీసు స్టేషన్కు వెళితే తమ వద్ద ఎవరూ లేరని పోలీసులు బుకాయించారని బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. తమ వారికి చెందిన వాహనాలను చూసి, ఆందోళనకు దిగుతామని చెప్పడంతో, ఓ చోరీ కేసులో అరెస్టు చేశామని, వారు తిరుచానూరు పోలీసు స్టేషన్లో ఉన్నట్లుగా పోలీసులు చెప్పారని గ్రామస్తులు చెప్పారు.ఆందోళనలో బాధిత కుటుంబాలు చిత్రహింసలకు గురి చేస్తూ..! తిరుచానూరు పోలీసు స్టేషన్లో ఉన్న తమ వారిని కలిసేందుకు వెళ్లగా వారిపై పోలీసులు విచక్షణరహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. చేయని తప్పును అంగీకరించాలంటూ పోలీసులు తమ వారిని కొడుతున్నారని కుటుంబ సభ్యులకు తెలియజేశారన్నారు. -
ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతికి చెందిన పి.సతీష్ కుమార్, పి.రోజా దంపతులు బుధవారం ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు దాత బుధవారం విరాళం డీడీని స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ ఎం.రవిచంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఈఓ అభినందించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళన కరపత్రాల ఆవిష్కరణ తిరుపతి సిటీ: ఎస్వీయూ గణితశాస్త్ర విభాగం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఈ ఏడాది జూలై 18వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం విభాగాధిపతి ప్రొఫెసర్ జయసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కరపత్రాలను వీసీ నరసింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు వర్సిటీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్వీయూలో పీజీ మాథమాటిక్స్, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొని, జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు సుగుణమ్మ, భారతి, సుధాకరయ్య పాల్గొన్నారు. పాలిసెట్కు వెల్లువెత్తిన దరఖాస్తులు తిరుపతి సిటీ: పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయని జిల్లా కోఆర్డినేటర్, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై ద్వారకనాథ్రెడ్డి తెలిపారు. పాలిసెట్ దరఖాస్తులు, కళాశాలలో కొనసాగుతున్న ఉచిత శిక్షణపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని బ్రాంచ్ల్లో కలిపి సుమారు 87 వేల సీట్లు ఉన్నాయని, ఇందుకోసం ఇప్పటి వరకు దాదాపు 1.52 లక్షల దరఖాస్తులు అందాయని తెలిపారు. చిన్న వయస్సులో ఉపాధి అవకాశాలను దక్కించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడంలో డిప్లొమో కోర్సులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. పాలిసెట్కు గురువారంతో దరఖాస్తుల గడువు ముగియనున్నందున ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అప్రమత్తం కావాలని సూచించారు. ఉచిత కోచింగ్కు విశేష స్పందన పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష కోసం పదో తరగతి పరీక్షలు రాసిన, పాసైన విద్యార్థులకు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఊహించని స్థాయిలో ఉచిత కోచింగ్కు స్పందన లభించిందని, ఇప్పటికే సుమారు 500 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరువుతున్నారని చెప్పారు. కళాశాలలో ఈనెల 2వ తేదీ నుంచి గర్ల్స్కు, బాయ్స్కు వేర్వేరుగా నిపుణులైన కళాశాల అధ్యాపకులతో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కోచింగ్తో పాటు ఉచితంగా మెటీరియల్స్ సైతం అందజేస్తున్నట్లు చెప్పారు. చిన్నపిల్లల హృదయాలయానికి రూ.10 లక్షల విరాళం తిరుపతి తుడా: నగరానికి చెందిన కే అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమార్తె శారద తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు విరాళ డీడీని తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆస్పత్రిలో డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డికి దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ కాలేజీలో దారుణం
తిరుపతి రూరల్: ఫీజు కట్టడం ఆలస్యం కావడంతో కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థినిని తీవ్రంగా అవమానించింది. మరుగుదొడ్లు కడిగించింది. తరగతి గదుల్లో చెత్త ఊడ్పించింది. విద్యార్థులు తిన్న ప్లేట్లు కడిగించింది. ఈ దారుణం వెలుగులోకి రావడంతో విద్యార్థిసంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ అమానవీయ ఘటన తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలోని శ్రీ వికాస్ నర్సింగ్ కాలేజీలో జరిగింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రేణుమాకులపల్లికి చెందిన పి.రవికుమార్, శ్రీదేవిల కుమార్తె పి.నినిత ఈ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ((యాజమాన్య కోటా సీటు )) రెండోసంవత్సరం చదువుతోంది. రెండో సంవత్సరం ఫీజు రూ.1.4 లక్షలు కట్టడంలో ఆలస్యం చేస్తున్నారని కాలేజీ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరించింది. ఆ విద్యార్థినితో మరుగుదొడ్లు కడిగించడం, తరగతి గదుల్ని ఊడ్పించి తుడిపించడం, విద్యార్థులు తిన్న ప్లేట్లు కడిగించడం వంటి పనులు చేయించి తీవ్ర అవమానాలకు గురిచేసింది. ఈ అవమానాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన విద్యార్థిని ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు కాలేజీకి వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థిసంఘాల నేతలకు మొరపెట్టుకున్నారు. బాధిత విద్యార్థిని, ఆమె బంధువులు, విద్యార్థిసంఘాల నేతలు బుధవారం సాయంత్రం కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఆ విద్యార్థినితో అలా పనులు చేయించలేదని బుకాయించేందుకు యాజమాన్యం ప్రయత్నించింది. దీంతో విద్యార్థిసంఘాల నేతలు రాత్రి 10 గంటల వరకు కాలేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయినా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కాలేజీ యాజమాన్యం మెట్టుదిగకపోగా.. విద్యార్థిసంఘాల నేతలు అక్కడ నుంచి వెళ్లబోమని తేల్చిచెప్పారు. రాత్రి 10 గంటల వరకు ఆ ప్రాంతం నినాదాలతో హోరెత్తింది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం ఇతర విద్యార్థినులను రెచ్చగొట్టి వీరికి వ్యతిరేకంగా కాలేజీ ప్రాంగణంలో ధర్నాకు కూర్చోబెట్టింది. దీంతో బాధిత విద్యార్థిని, విద్యార్థిసంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాత్రి 10.30 గంటల సమయంలో పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీ షియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: హెయిర్ కటింగ్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్.


