Tirupati
-
కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్నవి ఊస్టింగా?
తిరుపతి మంగళం/తణుకు అర్బన్/బీచ్రోడ్డు (విశాఖ): టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ ప్రగల్భాలు పలికారని.. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనే తీసేసేందుకు కుట్రలు చేస్తున్నారని మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు మండిపడ్డారు.ఈ ఎండీయూ వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల ఎండీయూ ఆపరేటర్లు ఉద్యమబాట పట్టారు. తిరుపతిలో అర్ధనగ్న ప్రదర్శన చేయగా.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. విశాఖలో పెద్దఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి పేదవాడి ముంగిటకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతోగత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ విధానాన్ని తీసుకొస్తే ఇప్పుడు చంద్రబాబు ఆపరేటర్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎండీయూ ఆపరేటర్లు జేసీకి, తణుకులో తహసీల్దార్ డి. అశోక్వర్మకు వినతిపత్రం అందించారు. -
తిరుమలలో ఘోర అపచారం, ఇంకెన్ని దారుణాలు చూడాలో?
తిరుమల: తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ దృశ్యాలు చూసిన భక్తులు షాక్కు గురయ్యారు. సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్(Namaz) చేస్తుంటే టీటీడీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో కొత్త పాలక మండలి ఏర్పాటైన తర్వాత వరుసగా అపచారాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.మద్యం సేవించడం, ఎగ్ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలను మర్చిపోకముందే.. ఇప్పుడు ఏకంగా కల్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నమాజ్ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 80,964 మంది స్వామివారిని దర్శించుకోగా 32,125 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లు సమర్పించారు.టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. నేడు హనుమాన్ జయంతిటిటిడిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా ఆలయాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఎదురు ఆంజనేయ స్వామి ఆలయం, జీటీ ఆలయం ఎదురుగా, మఠం ఆంజనేయ స్వామి ఆలయం, గాంధీ రోడ్ , అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ఓల్డ్ హుజూర్ ఆఫీస్ వద్ద, శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయం, అలిపిరి శ్రీపాదాల మండపం వద్ద. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం పరిధిలో శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. -
దుకాణాల కూల్చివేతపై ధర్నా
తిరుపతి తుడా : పేదలపై కార్పొరేషన్ అధికారులు ప్రతాపం చూపించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మండిపడ్డారు. బొంతాలమ్మగుడి వద్ద చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించినందుకు బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యలో ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె.రాధాకృష్ణతో కలసి మురళి మాట్లాడుతూ ప్రత్నామ్నాయ స్థలం చూపించకుండా వీధి వ్యాపారుల పొట్టకొట్టడం దారుణమన్నారు. నగరంలో కూటమి నేతలు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా మామూళ్ల వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రధానంగా జనసేన నేతల దందాలు పెరిగిపోయాయని విమర్శించారు. అన్నీ తెలిసినా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ప్లానింగ్ అధికారులు బాలాజీ, మూర్తి కుట్రపూరితంగా వీధి వ్యాపారుల షాపులు తొలగించారని, ఇప్పుడు అదే స్థంలో జనసేన నేతల ఆధ్వర్యంలో దుకాణాలు పెట్టించారని మండిపడ్డారు. నేతలు సుబ్రమణ్యం, బుజ్జి, వేణు గోపాల్, కేవై రాజా, ఎమ్డీ రవి, సీహెచ్ శివకుమార్, మణి, ఎన్.శివ, వెంకటేష్, సురేష్, మహేంద్ర, రైల్వే బాల, ప్రమీల, శ్రీనివాసులు, బాలాజీ, సుధాకర్, రమేష్, దీపక్ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
చంద్రగిరి : మండలంలోని ముండ్లపూడి వద్ద బుధవారం ఉదయం ఓ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచారూరు పోలీస్స్టేషన్లో డీఎస్పీ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కుమార్రాజా అనే వ్యక్తి ఇంట్లో ఈ నెల 1వ తేదీన చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన నాగరాజ అలియాస్ వాసును అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవం వెల్లడైంది. నిందితుడి నుంచి 168.55 గ్రాముల బంగారు, 192.5 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కర్ణాటకలోని పలు పోలీస్స్టేషన్లలో దోపిడీ, చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. కేసును ఛేదించిన సీఐ సునీల్కుమార్, ఎస్ఐలు అరుణ, సాయినాథ్ చౌదరి, జగన్నాఽథరెడ్డి, సిబ్బంది ప్రసాద్, ప్రభాకర్ను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం తిరుపతి సిటీ : దైనందిన జీవితంలో యోగాను భాగంగా మార్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో యోగా మాసోత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలసి ఆయన యోగాసనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ మట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా కర్టన్ రైజర్ యోగాంధ్రా–2025కు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.ఈ క్రమంలోనే ఈ నెల 21 నుంచి జూన్ 21వ వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే ఆరణి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి రోజుకు కనీసం గంటపాటు యోగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. యోగాడేలో ప్రజలు భాగస్వాములై విజయవంత చేయాలని పిలుపునిచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ సామూహిక యోగాలో పెద్దసంఖ్యలో జనం పాల్గొని రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ రజని, డీఆర్ఓ నరసింహులు , ఆర్డీఓ రామ్మోహన్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● నల్లబెల్లం పేరిట అన్నదాతల అరెస్టులు ● సారా తయారీకి బెల్లం విక్రయిస్తున్నారని సంకెళ్లు ● అక్రమంగా రైతుల అరెస్టులు.. నోటీసులు ● అన్నదాతలకు ‘కూటమి సర్కారు’ ఝలక్ ● ట్రేడర్లకే విక్రయించాలంటున్న ఎకై ్సజ్ పోలీసులు
చిత్తూరు అర్బన్ : ఉమ్మడి చిత్తూరుజిల్లాలో రైతులు పండించే ప్రధాన పంటల్లో చెరకు ఒకటి. ఇక్కడి నల్లరేగడి భూముల కారణంగా చాలా వరకు బెల్లం నలుపు రంగులో తయారవుతుంది. కొన్ని రకాల రసాయనాలు, ప్రాసెసింగ్ చేస్తే బెల్లం రంగు మారుతుంది. కానీ గిట్టుబాటు ధర దక్కదు. దీంతో చాలా మంది నల్లబెల్లాన్ని తయారు చేసి మండీలు, అవసరం ఉన్న వాళ్లకు, ట్రేడర్లకు అమ్ముతున్నారు. ఇదే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. నల్లబెల్లం తయారీ, విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆంక్షలు అతిక్రమిస్తున్న అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. ప్రభుత్వ చర్యలపై రైతులు, రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. నవోదయంలో చీకట్లు నాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నవోదయం 2.0ను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా సారా తయారు చేస్తున్న కుటుంబాలను ఆ ఊబి నుంచి బయటపడేసి, వాళ్ల జీవన ప్రమాణాలు మార్చడానికి రుణాలు, ఇతర ప్రత్యామ్నాయ పనులను కల్పించాల్సిన ప్రభుత్వం రైతులపై పడింది. నాటు సారా తయారీకి నల్లబెల్లం తప్పనిసరిగా వాడతారని, నల్లబెల్లం తయారు చేస్తున్న రైతులపై నిఘా ఉంచాలని, ఎవరెవరికి నల్లబెల్లం విక్రయిస్తున్నారు..? కొనుక్కునే వ్యక్తి ఆధార్ తీసుకున్నారా..? కిలో ఎంతకు అమ్ముతున్నారు..? అయిదు కిలోలకు పైబడి ఎవరికి అమ్ముతున్నారు..? అని వివరాల సేకరిస్తున్నారు. వాస్తవానికి బెల్లం తయారు చేసిన రైతులు దాన్ని మార్కెట్కు తరలించాలంటే తన రవాణాకు కిలో కు రూ.3, మార్కెట్లో కమిషన్ రూ.3 అదనపు సుంకంగా చెల్లించాలి. తీరా బెల్లాన్ని విక్రయించిన తరువాత తన పెట్టుబడి దక్కని పరిస్థితి. దీంతో కొందరు రైతులు బెల్లాన్ని మార్కెఫెడ్లో విక్రయించడంతో పాటు గ్రామాల్లో అమ్ముతుంటారు. రైతు ల నుంచి బెల్లాన్ని కొన్నవాళ్లు దాన్ని ఫ్యాక్టరీలకు వాడతారో.. పశువులకు దాణాగా ఉపయోగిస్తారో అన్నదాతలకు తెలియదు. కానీ ఎవరైనా సారా తయారు చేస్తూ పట్టుబడితే, నిందితులు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని బెల్లం విక్రయించారనే నెపంతో రైతులను అరెస్టు చేయడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. బెల్లం తయారీలో రైతులు‘ఈ చిత్రంలో భార్య, బిడ్డలతో తన చెరకు తోట, ట్రాక్టర్తో కలిసి ఉన్న రైతు పేరు పెరుమాల్. గతేడాది ఆయుధపూజ నేపథ్యంలో చెరకు పంట ఓ మోస్తరుగా వస్తుండడంతో ఇలా ఫొటో తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పెరుమాల్ చిత్తూరు జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.. కారణం.. పెరుమాల్ రైతు కావడం, తన వద్ద నల్లబెల్లం కొన్న వ్యక్తులు సారా తయారు చేశారంట.’ సారాకు బెల్లం విక్రయిస్తే అరెస్టు తప్పదు సారా తయారీకి నల్లబెల్లాన్ని విక్రయిస్తే చట్టపరంగా ముందుకు వెళతాం. సారా తయారీ వాళ్లకు బెల్లం అమ్మారని తెలిసాకే అరెస్టు చేశాం. నవోదయంలో భాగంగా నాటు సారా తయారీ అరికట్టడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, బెల్లం వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించాం. ఫ్యాక్టరీలు, పశువుల కోసం నల్లబెల్లం అమ్మితే పర్లేదు. సారా కోసం అమ్మితే మాత్రం అరెస్టు తప్పదు. – శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, చిత్తూరు గిట్టుబాటు ధర ఎక్కడ ? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 5 వేల హెక్టార్లలో చెరకు పంట సాగువుతోంది. ఇందులో చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల, రూరల్, నగరి, నిండ్ర, విజయపురం, గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, పెనుమూరు, పుంగనూరు, పులిచెర్ల, ఎస్.పురం, వెదురుకుప్పం మండలాల్లో చెరకు పంట ఎక్కువగా పండిస్తున్నారు. వీటిల్లో 4500 హెక్టార్లలో పండే పంటను ఫ్యాక్టరీలకు విక్రయిస్తుండగా మిగిలిన 500 హెక్టార్ల నుంచి బెల్లం తయారీ చేస్తున్నారు. ఒక హెక్టారుకు 70 టన్నుల వరకు బెల్లం తయారు చేస్తున్నారు. ఇందులో దాదాపు 5 వేల టన్నుల వరకు నల్లబెల్లం ఉత్పత్తి అవుతోంది. కిలో నల్లబెల్లాన్ని మార్కెట్లో ట్రేడర్లకు విక్రయిస్తే రూ.24–27 మధ్య ధర వస్తుంది. ఇందులోనే రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు పోనూ చేతికి రూ.15 దక్కడం గగనంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. మార్కెఫెడ్ ద్వారా బెల్లాన్ని కొనుగోలు చేయిస్తూ రైతులను ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. అరెస్టులపై ఉద్యమిస్తాం ఎక్కడైనా సారా తయారు చేసే వాళ్లను అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ బెల్లం తయారు చేసే రైతులను అరెస్టు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.? నాటుసారా పేరిట రైతులను అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. పొలాన్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఆపకపోతే ఉద్యమం తప్పదు. – నాగరాజన్, సీపీఐ, చిత్తూరు జిల్లా కార్యదర్శి ప్రభుత్వానికి దమ్ముంటే పంటను కొనుగోలు చేయాలి వైఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు మార్క్ఫెడ్ ద్వారా నల్లబెల్లాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. సారాను నివారించడానికి పీడీ యాక్టులు పెట్టాం. కానీ టీడీపీ అధికారంలోకి వస్తేనే బెల్లం రైతులపై పడుతారు. గతంలోనూ అంతే, ఇప్పుడూ అదే కొనసాగుతోంది. మా నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులను అరెస్టు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే జిల్లాలో బెల్లం రైతులకు ఇబ్బందులు తప్పవు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించి, పంటను కొనుగోలు చేయాలి. – ఎంిసీ.విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త -
ప్రభుత్వ భూమి కబ్జా
ఏర్పేడు : మండలంలోని పెనుమల్లం సమీపంలో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ స్థానిక నేతలు కబ్జా చేసేశారు. వివరాలు.. గ్రామంలోని ఇరగలప్పచలం ఆలయానికి వెళ్లే మార్గంలో సర్వే నంబర్ 183లో 3.92 ఎకరాలు, సర్వే నంబర్ 182–1లో 4.40 ఎకరాల చిట్టేటి గుంట పోరంబోకు భూమి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన బొజ్జ శంకరయ్య, పెరుమాళ్ అనే వ్యక్తులు సదరు భూమిని ఆక్రమించేశారు. బొజ్జా శంకరయ్య ఏకంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. మిగిలిన స్థలాన్ని జేసీబీతో చదును చేయించేశాడు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.50 లక్షలు వరకు ధర పలుకుతోంది. ఆక్రమణపై స్థానికులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పాలమంగళం విద్యార్థికి అవార్డు నారాయణవనం: పాలమంగళం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి ఆశిష్కు షైనింగ్ స్టార్ అవార్డు దక్కింది. విభిన్న ప్రతిభావంతుడైన ఆశిష్ 500 మార్కులకు గాను 481 సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానం, జిల్లా టాపర్గా నిలిచాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మంగళగిరిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా అవార్డు అందుకున్నాడు. బుధవారం ఈ మేరకు పాఠశాల హెచ్ఎం మనోహరి మాట్లాడుతూ ఆశిష్ మనోధైర్యంతో అంగ వైకల్యం జయించాడని ప్రశంసించారు. రోడ్డు ప్రమాదంలో జింక మృతి తిరుమల: తిరుమలలోని రింగ్ రోడ్డులో ప్రమాద వశాత్తు జింక మృతి చెందింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తిరుమలలోని గ్యాస్ గోడౌన్ సమీపం రింగ్ రోడ్లో రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో జింక అక్కడికక్కడే మృతిచెందింది. ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని జింక కళేబరాన్ని తిరుపతిలోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. మసూర బియ్యం పేరుతో టోకరా రేణిగుంట: మండలంలోని గాజులమండ్యం దళితవాడలో బుధవారం ఇద్దరు వ్యక్తులు మసూర బియ్యం పేరుతో స్థానికులకు టోకరా పెట్టారు. ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి స్కూటర్లపై బియ్యం బస్తాలను వేసుకొచ్చారు. ఒక్కో బస్తా రూ.వెయ్యి చొప్పున విక్రయించి వెళ్లారు. తీరా మూట విప్పి చూస్తే అవి రేషన్ బియ్యం కావడంతో స్థానికులు అవాక్కయ్యారు. రెండు నెలల క్రితం కూడా వెంకటాపురం పంచాయతీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. అయితే దీనిపై స్థానిక పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
కొత్త ట్రస్ట్ ఏర్పాటుపై పరిశీలించాలి
తిరుపతి తుడా: శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవల దృష్ట్యా టీటీడీలో కొత్తగా ఓ ట్రస్ట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం చిన్నపిల్లల హృదయాలయాన్ని పరిశీలించారు. చిన్న పిల్లల ఐసీయూ బ్లాక్, జనరల్ వార్డు, ఓపి బ్లాక్ లోని పిల్లలకు అందుతున్న వైద్యసేవలపై వైద్యులను, పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఇప్పటికే శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయం స్కీం ఉందని తెలిపారు. దీని కింద దాత రూ.లక్ష విరాళం ఇస్తే నిరాదరణకు గురైన పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేసే సదుపాయం ఉందన్నారు. టీటీడీలో ఇప్పటికే ఉన్న పలు ట్రస్టుల తరహాలో నూతనంగా చిన్నపిల్లల వైద్య సేవల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుకు నియమ నిబంధనలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే పసి బిడ్డలకు చక్కటి వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల సంఖ్యను పెంచేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయన నూతన భవన నిర్మాణంపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ భరత్, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం పాల్గొన్నారు. -
● టీచర్ల ట్రాన్స్ఫర్లకు ఉత్తర్వులు ● కసరత్తు వేగవంతం చేసిన జిల్లా విద్యాశాఖ ● ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రక్రియ ● ఎస్జీటీలకు మాన్యువల్గా చేపట్టనున్న వైనం ● ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ బుధవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బదిలీల ప్రక్రియపై విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు ఈనెల 21న డీఈఓలకు వెబెక్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ వెబెక్స్లో జిల్లా నుంచి డీఈఓ వరలక్ష్మి, ఏడీలు సుకుమార్, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన చేపట్టే ఈ బదిలీలకు బుధవారం ట్రానన్స్ఫర్ పోర్టల్ ప్రారంభం అయింది. ఈ ప్రక్రియ జూన్ 5 నాటికి పూర్తి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఎస్ఏలకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనుండగా, ఎస్జీటీలకు మాన్యువల్గా బదిలీల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో.. టీచర్ల బదిలీల కసరత్తు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధి లో నిర్వహిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4916 పాఠశాలలున్నాయి. వీటిలో 3766 ప్రాథమిక, 445 ప్రాథమికోన్నత, 705 ఉన్నత పాఠశాలలు.17,372 మంది టీచర్లకు గాను 15,454 పనిచేస్తున్నారు. 37 విభాగాల్లో 1918 పోస్టులను క్లియర్ వేకెన్సీలుగా చూపించగా, మరో 5082 ఖాళీలుగా చూపించారు. ఒకే పాఠశాలలో ఐదేళ్లు పూర్తి చేసిన హెచ్ఎంలు, 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కానున్న నేపథ్యంలో 5/8 ఏళ్లు ఒకే చోట పనిచేసిన టీచర్ల ఖాళీలు 3 వేలు చూపగా, మిగులు కింద 500, స్కూల్ కొత్త పోస్టు లు (రీఅపోర్షన్), ఒక యాజమాన్య పాఠశాల నుంచి మరో యాజమాన్య పాఠశాలల్లో నెలకొన్న(షిఫ్టెడ్) ఖాళీలు 1582 చూపుతున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీల వివరాలు యాజమాన్యం ఖాళీలు ప్రభుత్వ 125 ఎంపీపీ/జెడ్పీ 1583 మున్సిపల్ కార్పొరేషన్ 135 మున్సిపల్ 75 5/8 ఏళ్లు ఒకేచోట పనిచేసిన టీచర్లు 3000 మిగులు పోస్టులు 500 రీ అపోర్షన్/ షిఫ్టెడ్ 1582 మొత్తం 7000 హడావుడిగా దరఖాస్తు చేసుకోవాలని.. బదిలీ ఉత్తర్వులు విడుదలయ్యాయో లేదో అప్పుడే హడావుడిగా పలు కేడర్ల టీచర్లు ఆన్లైన్లో దరఖా స్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పలు కేడర్ల టీచర్ల గందరగోళానికి లోనయ్యారు. కూటమి సర్కారు చేపడుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరుకు 5 సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన హెచ్ఎంలు గురువారం సాయంత్రం 5గంటల్లోపు బదిలీ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరెన్షియల్ కేటగిరిలోని టీచర్లు మెడికల్ బోర్డు వెరిఫికేషన్కు బుధవారంతో గడువు పూర్తి కానుంది. బదిలీల్లోని సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపడుతున్నారు. బదిలీల షెడ్యూల్ ఇలా.. ప్రక్రియ హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ బదిలీలకు దరఖాస్తులు ఈనెల 21, 22 ఈనెల 21 నుంచి 24 ఈ నెల 21 నుంచి 27 పరిశీలన ఈనెల 21,22 ఈ నెల 21 నుంచి 25 ఈనెల 21 నుంచి 28 ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా 24 26,27 31 గ్రీవెన్సెస్ 25 28 28 నుంచి జూన్ 1 గ్రీవెన్సెస్ పరిష్కారం 26 28, 29 28 నుంచి జూన్ 2 తుది సీనియారిటీ జాబితా 27 31 జూన్ 6 వెబ్ ఆప్షన్స్ 28 జూన్ 1, 2 జూన్ 7 నుంచి 10 బదిలీ ఉత్తర్వులు 30 జూన్ 4 జూన్ 11 ఉద్యోగోన్నతులు మే 30 (ఎస్ఏ నుంచి హెచ్ఎం) జూన్ 5 (ఎస్జీటీ నుంచి ఎస్ఏ) ఉద్యోగోన్నతులు ఉత్తర్వులు మే 31 జూన్ 6 పకడ్బందీగా చేపడతాం బదిలీల కసరత్తు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. బదిలీలు నిబంధనల మేరకు చేపడుతాం. ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదు. టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. తప్పులు లేకుండా దరఖాస్తు చేసుకోవాలి. బదిలీల విషయంలో దళారుల మాటలు నమ్మకూడదు. ఎవరైనా మోసాలకు పాల్పడితే శాఖాపరంగా చర్యలు కఠినంగా ఉంటాయి. – కేవీఎన్ కుమార్, డీఈఓ -
● కలగానే బాలాజీ రైల్వే డివిజన్ ● ఏళ్ల తరబడి ప్రజల నిరీక్షణ ● కార్యరూపం దాల్చని ప్రతిపాదన
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతున్నా మరోవైపు బాలాజీ డివిజన్ అంశం తెరపైకి వచ్చింది. సీమ ప్రజాప్రతినిధుల నుంచి నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు సైతం వెళ్లాయి. అధికారులు సానుకూలమే.. గుంతకల్ డివిజన్ కేంద్రానికి తరచూ సమావేశాలకు వెళ్లి రావాలంటే రైల్వే అధికారులు, కార్మికులకు ప్రయాణం కష్టతంగా మారింది. ఈ క్రమంలో గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేసి విశాఖజోన్లో కలిపితే సౌకర్యంగా ఉంటుందని రైల్వే నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ దిశగా ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖపై ఒత్తిడి తీసుకురావాలని రాయలసీమ వాసులు సైతం కోరుతున్నారు. డివిజన్ ఏర్పాటైతే.. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96కిమీ), తిరుపతి–కాట్పాడి (104.39కిమీ), పాకాల–మదనపల్లె (83కిమీ), రేణిగుంట–కడప (125కిమీ)లైను కలిపే అంశాలను ఇదివరకే రైల్వే అధికారులు పరిశీలించారు. నంద్యాల–పెండేకల్లు (102కిమీ)లైను గుంటూరు డివిజన్లోకి విలీనం చేయాలని సూచించారు. అలాగే జిల్లా మీదుగా వెలుగొండ అడవుల నుంచి వెళ్లే కృష్ణపట్నం రైల్వేలైన్ కూడా విజయవాడ డివిజన్లోకి వెళ్లింది. కొత్త డివిజన్ ఏర్పడితే తిరుపతి రైల్వే కేంద్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే అవకాశముంది. బాలాజీ డివిజన్ కేంద్రానికి దగ్గరలోని రేణిగుంట జంక్షన్కు ప్రాముఖ్యత ఉంది. విశాఖ జోన్ ఏర్పడుతున్న నేపథ్యంలో గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా వరకు బాలాజీ డివిజన్గా ఏర్పాటుచేసే ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని నిపుణులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. విశాఖ జోన్ ఏర్పాటు క్రమంలో బాలాజీ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత వివరించాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలల్లో పరిశ్రమల స్థాపనకు మార్గం మరింత సుగమం అవుతుందని వివరిస్తున్నారు. -
రెండో విడతలో అందని గ్యాస్ సబ్సిడీ
● ఆందోళనలో దీపం–2 పథకం లబ్ధిదారులు ● సిలిండర్కు చెల్లించిన నగదు రీఫండ్ కాకపోవడంతో ఆగ్రహం ● రోజుకో మాట చెబుతున్న అధికారులు 20 రోజులు గడిచాయి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ అని లెక్కవేశారు. అప్పటి వరకు ఒక్క సిలిండర్ సరిపోదు. సరే ఏదో ఇస్తామని చెప్పారు. సక్రమంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మొదటి సిలిండర్ బుక్ చేసుకుంటే నగదు వేశారు. రెండో సిలిండర్కి ఇవ్వలేదు. 20 రోజులు గడుస్తోంది. మా డీలర్ను అడిగితే పడుతుందిలే అంటున్నారు. ఎప్పుడు పడుతుందో ఏమో తెలియడం లేదు. – రత్నమ్మ, శ్రీకాళహస్తి మండలం చేసింది ఒక్కటే.. అదీ ఇలా.. సూరప్సిక్స్ పథకాల్లో కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఒక్కటే. అదీ ఇలా సక్రమంగా ఇవ్వకుంటే ఏం చేయాలి. తల్లికివందనం లేదు...అన్నదాత సుఖీభవ లేదు...నిరుద్యోగభృతి లేదు. ఉచిత బస్సు ప్రయాణం లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్మాలి. గ్యాస్ సిలిండర్ తీసుకుని 18 రోజులు గడుస్తోంది. అయినా రాయితీ జమ కాలేదు. – రాణెమ్మ, తిరుపతి తిరుపతి అర్బన్ :జిల్లాలో దీపం– 2 పథకం అప్పుడే కొడిగట్టుతోంది. నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని కూటమి ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండో విడత సిలెండర్ బుక్ చేసిన వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాకపోవడంతో పలువురు మండిపడుతున్నారు. మొదటి విడతలో 4.92 లక్షలకు కాను 2.40లక్షలకు మాత్రమే నగదు రీఫండ్ చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. సగం మందికి సొమ్ము చెల్లించలేదని విమర్శిస్తున్నారు. అయితే 50 శాతం మంది మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారని, వారికి మాత్రమే నగదు జమ చేశామని అధికారులు వివరిస్తున్నారు. రెండో విడత విషయంలో 90శాతం మందికి రీఫండ్ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులేమో సర్వర్, ఆధార్ లింకేజీ సమస్యల కారణంగా ఉచిత గ్యాస్ నగదు జమ కావడంలేదని చేతులు దులిపేసుకుంటున్నారు. తొలి ఏడాదే రెండో విడతకే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే కాలంలో ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల్లో నగదు జమ చేస్తాం దీపం–2 పథకం ద్వారా రెండో సిలిండర్ బుకింగ్ చేసుకున్న వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ అంశంపై మీటింగ్ నిర్వహించారు. ఆ మేరకు రాష్ట్రస్థాయి అధికారులతోను మాట్లాడారు. అయితే నాలుగు రోజుల్లో వేస్తామని చెప్పారు. ఈ విషయంలో లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదు. – శేషాచలం రాజు, పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారిడబ్బులు జమ కాలేదు ఉచిత గ్యాస్ పథకం కింద సిలిండర్ బుక్ చేసుకున్నాం. సిలిండర్ ఇంటికి వచ్చింది. నగదు చెల్లించాం. అయితే మేము కట్టిన డబ్బులు మాత్రం మా బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. మొదటి సారి వచ్చింది. ఈసారి ఎందుకు రాలేదో తెలియడం లేదు. అధికారులను అడిగితే వస్తుందని చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే రెండు వారాలవుతోంది. – లక్ష్మి, ఏర్పేడు మండలం● -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
తిరుపతి అర్బన్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అన్నిశాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలిసి రహదారి భద్రతా కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ హైవేపై ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే డ్రైవింగ్ చేయాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలపై సమగ్ర సమాచారం కోసం ఆడిట్ నిర్వహించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ఇప్పటి వరకు100 బ్లాక్స్పాట్లు గుర్తించినట్లు తెలిసిందని, దీనినై అధికారులు స్పష్టంగా నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే తిరుమల ఘాట్ రోడ్డులోకి ఫిట్నెస్ ఉండే వాహనాలను మాత్రమే అనుమతించాలన్నారు. అఆగే ఘాట్రోడ్డును నాన్స్టాప్ జోన్గా గుర్తించాలని ఆదేశించారు. మద్యం తాగి, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు చేసి రూ.2వేల జరిమానా విధించాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే 1033 టోల్ ఫ్రీ నంబర్కు ప్రజలు కాల్ చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. హిట్ అండ్ రన్పై స్పష్టమైన నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని కోరారు. ఈ మేరకు బాధిత కుటుంబాలు ఇన్సూరెన్స్ పొందే వెసులుబాటు ఉంటుందని వివరించారు. ఎస్పీ హర్షవర్ధన్రాజు మాట్లాడుతూ జాతీయ రహదారులపై వెళుతున్న ద్విచక్రవాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను తెలియజేయాలన్నారు. ప్రస్కూల్స్ బస్సులను ఆర్టీఓ అధికారులు తరచూ తనిఖీ చేయాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో కచ్చితంగా రూల్స్ పాటించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రవాణాశాఖ అధికారి మురళీమోహన్, ఆర్అండ్బీ ఎస్ఐ మధుసూదన్, తిరుపతి, నెల్లూరు, చైన్నె జాతీయ రహదారుల పీడీలు వెంకటేశ్వర్లు, ఎంకే చౌదరి, విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, తుడా ఏఈ రవీంద్ర పాల్గొన్నారు. -
దుకాణాల కూల్చివేతపై ధర్నా
బొంతాలమ్మ గుడి వద్ద వీధి వ్యాపారుల షాపుల7 కూల్చివేతపై బుధవారం ఏఐటీయూసీ నేతలు ధర్నాకు దిగారు.‘అమృత్’ స్టేషన్.. అభినందనీయం సూళ్లూరుపేట : అమృత్ స్టేషన్ పథకం కింద సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయడం అభినందనీయమని ఎంపీ గురుమూర్తి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అద్భుతంగా తీర్చిదిద్దిన రైల్వేస్టేషన్ను గురువారం రాత్రి వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కలిసి సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాలని విన్నవించినట్లు వెల్లడించారు. షార్తోపాటు శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు సెజ్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది పనిచేస్తున్నారని, సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని కోరినట్లు వివరించారు. తమ విన్నపాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి అమృత్ స్టేషన్ పథకం కింద ఆధునికీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశానికి వెళేఓల ఎక్స్ప్రెస్ రైళ్లకు సైతం సూళ్లూరుపేటలో స్టాపింగ్ ఇవ్వాలని ఎంపీ గురుమూర్తి కోరారు. – 8లో -
సనాతన ధర్మ ప్రచారానికి ప్రాధాన్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : యువతను భక్తిమార్గం దిశగా నడిపించేందుకు సనాతన ధర్మ ప్రచారానికి ఎస్వీబీసీలో ప్రాధాన్యమిచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలని టీటీడీ ఈఓ శ్యామలరావు ఆదేశించారు. బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఎస్వీబీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ తిరుమల ప్రాముఖ్యత, వైష్ణవ సాంప్రదాయాలు, పచ్చదనం, దాస సాహిత్యం, భక్తులకు అందిస్తున్న సేవలు, హైందవ ధర్మ మూలాలను పిల్లలక సైతం తెలియజేయాలన్నారు. భజన సంప్రదాయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సృజనాత్మక కార్యక్రమాలను ప్రసారం చేయాలని స్పష్టం చేశారు. వర్చువల్గా అడిషనల్ ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉండాలని ఆదేశం
వరదయ్యపాళెం : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ బుధవారం తాడేపల్లె కేంద్ర కార్యాలయంలో కలిశారు. కూటమి నేతల ఆగడాలపై రాతపూర్వకంగా వినతిపత్రం అందించారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని ఆదేశించారు. కూటమి నేతల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్ర వర్మ, సత్యవేడు మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, నేతలు చంద్రశేఖర్ రెడ్డి, బెల్టు రమేష్, ఎంపీపీలు దివాకర్ రెడ్డి, ప్రతిమారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆన్కాల్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు తిరుపతి అర్బన్ : మంగళం ఆర్టీసీ డిపోలో ఆన్కాల్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎం కేసీడీ భాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొంది 18 నెలలు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులని వెల్లడించారు. ఆసక్తిగలవారు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంగళం డిపోలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. ప్రతి రోజూ డ్యూటీ దిగిన తర్వాత వేతనం చెల్లించేస్తామని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు 9177150347 నంబర్లో సంప్రదించాలని సూచించారు. పద్మావతి ఆస్పత్రిలో ఓబెస్ట్రిక్స్ మెడిసిన్ ప్రత్యేక ఓపీ తిరుపతి తుడా : స్విమ్స్ పరిధిలోని పద్మావతి ఆస్పత్రిలో ప్రతి గురువారం ఓబెస్ట్రిక్స్ మెడిసిన్ ప్రత్యేక ఓపీ నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గర్భిణుల్లో బీపీ, షుగర్, థైరాయిడ్, ఇతర సమస్యలు ఉన్నవారిని ముందస్తుగా గుర్తించి, సకాలంలో వైద్యం అందించేందుకు ఈ ప్రత్యేక ఓపీని ప్రారంభిస్తున్నామని వివరించారు. పద్మావతి ఆస్పత్రిలో మధ్యాహ్నం 12గంటలకు రూమ్ నంబర్ 22లో ఓబెస్ట్రిక్స్ మెడిసిన్ ఓపీ ఉంటుందని తెలిపారు. ఏపీ ఈఏపీసెట్ కేంద్రం పరిశీలన తిరుపతి సిటీ : ఏపీ ఈఏపీ సెట్ నిర్వహిస్తున్న తిరుపతి జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ కేంద్రాన్ని ఎస్వీయూ వీసీ అప్పారావు బుధవారం పరిశీలించారు. వీసీ మాట్లాడుతూ ప్రశాంతవాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులకు పక్కాగా మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. దశాబ్దాలుగా సీమవాసుల కల.. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల ఆకాంక్ష.. ఏళ్ల తరబడి నిరీక్షణ.. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాయలసీమ వాసుల్లో ఆశలు చిగురించాయి. ప్రత్యేక డివిజన్ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నిపుణుల నుంచి సైతం సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
జూన్ 21 వరకు యోగా మాసోత్సవాలు
తిరుపతి సిటీ: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర–2025 ప్రచారానికి మద్దతుగా ఎస్వీయూలో గురువారం నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు తెలిపారు. వారు బుధవారం ప్రత్యేక ప్రచార బ్రోచర్ను విడుదల చేశారు. వారు మట్లాడుతూ యోగా వల్ల మనిషిలో అంతర్గత సమతుల్యత, మానసిక దృఢత్వం, సమగ్ర శ్రేయస్సుకు కలుగుతాయన్నారు. ఆరోగ్యకరమైన, మేధోసమాజాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ దార్శనికతకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ మానసిక, శారీరక ఆరోగ్యం అవసరమని, సమాజంలో ఇటువంటి పద్ధతులను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే యోగా మాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఉదయం 8:20 నుంచి 9 గంటల వరకు అడ్మినిస్ట్రేటివ్ భవనం ఎదుట యోగా సెషన్లు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రూసా సీఈవో వంశీ రాయల్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య టి.దామోదరం, పరీక్షల డీన్ ఆచార్య ఎస్.కిషోర్, అసిస్టెంట్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ హరికృష్ణ యాదవ్, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.వివేక్ పాల్గొన్నారు. ఎస్వీయూ వీసీ, రిజిస్ట్రార్ యోగాంధ్ర–2025 ప్రచార బ్రోచర్ ఆవిష్కరణ -
చీటింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
బుచ్చినాయుడుకండ్రిగ : కార్లను అద్దెకు తీసుకుని నగదు చెల్లించకుండా, వాహనాలను తిరిగి అప్పగించకుండా మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. శ్రీకాళహస్తికి చెందిన జావీద్, శివ వద్ద ఐదు కార్లను నెల బాడుగకు సత్యవేడు మండలం మాదనపాళెం గ్రామానికి చెందిన చెంగయ్య అలియాస్ ప్రవీణ్ తీసుకున్నాడు. ఒక్కో కారుకు రూ.45వేల చొప్పున అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఒక్క నెల మాత్రం బాడుగ సొమ్ము చెల్లించాడు. తర్వాత అద్దె నగదు ఇవ్వకుండా, కార్లను సైతం అప్పగించకుండా మోసం చేశాడు. దీంతో బాధితులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు చెంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తిమ్మయ్య, ఎస్ఐ విశ్వనాథనాయుడు తెలిపారు. -
కారాగారాలు.. కదలని పనులు
పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందనే విమర్శలొస్తున్నాయి. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా జిల్లా కారాగారంతో పాటు మొత్తం 10 జైళ్లు ఉండేవి. ప్రస్తుతం అవి ఆరుకే పరిమితమయ్యాయి. పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు, వాల్మీకిపురంలోని జైళ్లు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామని శిలాఫలకాలు వేసిన పాలకులు నిర్మాణ పనులను దశాబ్దాలుగా గాలికి వదిలేశారు. పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 10 జైళ్లు ఉండగా ఇందులో తిరుపతి, మదనపల్లె, పీలేరులోని సబ్జైళ్లు మాత్రం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్మించినవి. మిగిలినవన్నీ బ్రిటీష్ కాలంలో నిర్మించినవే. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుతుండడంతో వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని భావించిన జైళ్లశాఖ అధికారులు పుత్తూరు, పలమనేరు, వాల్మీకిపురం, చంద్రగిరి సబ్జైళ్లను మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జైళ్ల సంఖ్య ఆరుకే పరిమితమయ్యాయి. మూసివేసిన పుత్తూరులో సబ్జైల్ స్థానంలో నూతన భవన నిర్మాణానికి నందిమంగళం రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 242/22లో 2 ఎకరాల భూమిని రాష్ట్ర జైళ్ల శాఖకు స్థానిక రెవెన్యూ శాఖ కేటాయించింది. ఈ మేరకు 2010 జూన్ 18న అప్పటి జైళ్ల శాఖ ఐజీ గోపీనాఽథ్రెడ్డి నూతన జైలు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. పలమనేరులోని జైలును సైతం మూసివేసిన అధికారులు ఆ స్థలంలో పెట్రోల్ బంకు నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే వాల్మీకిపురంలోని జైలును మూసివేసి తిరుపతి–మదనపల్లె మార్గంలో రూ.4 కోట్ల అంచనాతో జైలు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఈ భవన నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయిన తర్వాత అర్థాంతరంగా ఆగిపోయి ఏళ్లు గడుస్తుండడంతో కొత్త భవనం సైతం శిథిలావస్థకు చేరుతోంది. అలాగే చంద్రగిరిలోని కారాగారం శిథిలావస్థకు చేరడంతో దానినీ మూసివేశారు. ఇలా ఉన్న జైళ్లను తొలగించడంతో పుత్తూరు సబ్కోర్టు ద్వారా శిక్షలు పడిన ఖైదీలను 70 కిలోమీటర్ల దూరంలోని సత్యవేడు సబ్జైలుకు, అలాగే పలమనేరు, వాల్మీకిపురం కోర్టుల్లో శిక్షలు పడిన ఖైదీలను పీలేరులోని సబ్జైలుకు తరలిస్తున్నారు. ఇది పోలీసులతో పాటు ఖైదీలకు, వారి కుటుంబీకులకు వ్యయ ప్రయాసలతో కూడుకుంటోంది. అలాగే జైళ్లలోని గదులు చాలక ఖైదీలను ఎక్కువ మందిని ఒకే సెల్లో నిర్బంధించాల్సిన పరిస్థితి. ఈ దుస్థితి 15 ఏళ్లుగా ఉంటున్నా పాలకులు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. ఖైదీలకు మెరుగైన సేవలు ఖైదీలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని జిల్లా జైలు అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఉన్న జైళ్లలో 306 మంది ఖైదీలున్నారనీ, చిత్తూరు జిల్లా కారాగారంలోనే 130 మంది ఉన్నారని తెలిపారు. ఇక్కడ ఓపెన్ స్కూల్ నడుపుతున్నామనీ, గత ఏడాది 11 మంది, ఈ ఏడాది ఐదుగురు పదో తరగతి పరీక్షలు రాసి ఫస్ట్క్లాస్లో పాసయ్యారని చెప్పారు. అన్ని జైళ్లలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ పొందిన వారికి కలెక్టర్ ద్వారా సర్టిఫికెట్లు అందజేశామన్నారు. వారు జైలు నుంచి విడుదలయ్యాక బ్యాంకు రుణాలు పొంది కొత్త జీవితం ప్రారంభించవచ్చని చెప్పారు. ఖైదీలతో యోగా, వ్యాయా మం చేయిస్తున్నారని, మహిళా ఖైదీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు వివరించారు. వాల్మీకిపురంలో నూతన జైలు భవనం దుస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జైళ్ల కేంద్రాలు చిత్తూరు (జిల్లా కారాగారం) తిరుపతి మదనపల్లె పీలేరు శ్రీకాళహస్తి సత్యవేడు మూసివేసిన కేంద్రాలు పుత్తూరు పలమనేరు చంద్రగిరి వాల్మీకిపురం పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు, వాల్మీకిపురం జైళ్లు మూసివేత దశాబ్దాలు గడుస్తున్నా ఊసేలేని కొత్త కారాగారాల నిర్మాణం పట్టించుకోని ప్రభుత్వంప్రతిపాదనలు పంపించాం వాల్మీకిపురంలో జైలు నిర్మాణానికి 2012లో రూ.4 కోట్లు మంజూరైంది. తొలిదశలో రూ.2 కోట్లు విడుదల కాగా అంతవరకు పనులు జరిగి ఆగిపోయాయి. ఇటీవలే కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. పలమనేరులో జైలును 15 ఏళ్ల క్రితమే మూసివేశారు. 40 సెంట్లు మాత్రమే ఉన్న ఆ స్థలంలో నూతన జైలు నిర్మాణానికి అవకాశం లేదు. ఇక్కడ స్థలాన్ని ఐఓసీ పెట్రోల్ బంకుకు కేటాయించాం. పలమనేరులో మరోచోట జైలు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కావాలని జిల్లా కలెక్టర్ను నివేదిక సమర్పించాం. అది పరిశీలనలో ఉంది. పుత్తూరులో జైలు నిర్మాణానికి నిధులు మంజూరు కావల్సి ఉంది. – ఎం.వేణుగోపాల్రెడ్డి, జిల్లా జైలు అధికారి, చిత్తూరు -
పకడ్బందీ వసతికి ప్రత్యేక శ్రద్ధ
తిరుపతి అర్బన్ : జిల్లాలోని హాస్టళ్లలో పకడ్బందీగా వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వసతిగృహాల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పలు హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని చెప్పారు. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపుతామని తెలిపారు. సమావేశంలో ఎస్సీ హాస్టళ్ల అధికారి విక్రమకుమార్రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజేంద్రనాథ్రెడ్డి, అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల డీసీఓ గీత, ఇంజినీరింగ్ అధికారి బాలసుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు. గ్రీవెన్స్ అర్జీలకు ప్రాధాన్యం గ్రీవెన్స్లో వచ్చే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్, డీఆర్ఓ నరసింహులతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి సోమవారం వచ్చే అర్జీలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రీ ఓపెన్కు ఆస్కారం లేకుండా వినతులను పరిష్కరించాలన్నారు. మండల, డివిజన్ స్థాయిలోను తప్పకుండా ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలను మండల, డివిజన్ స్థాయిలోనే పరిష్కరించాలని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే దీపం పథకం ద్వారా అందిస్తున్న గ్యాస్ సిలిండర్లకు గడువులోపు రాయితీ నగదును వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సరుకులను కార్డుదారులకు పంపిణీ చేయాలని కోరారు. బియ్యంతోపాటు అన్ని రకాల సరుకులు అందించాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్టాండ్లను మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు తరచూ తనిఖీ చేయాలని సూచించారు. పంచాయతీల్లో ప్రతి రోజూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా డోర్ టూ డోర్ సేకరించాలని తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోస్మాండ్ పాల్గొన్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న తనిఖీలు
తిరుమల : తిరుమలలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ సీవీఎస్ఓ హర్షవర్ధన్రాజు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మూడోరోజు మంగళవారం సైతం పోలీసులు, విజిలెన్స్, ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్శాఖల అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తిరుమలలోని పార్కులు, నిర్మానుష్య ప్రాంతాలు, భవన నిర్మాణాలను పరిశీలించారు. ఆయా చోట్ల కూలీలను ఆరా తీశారు. అనంతరం ఫొటో స్టూడియోలు, దుకాణాలను తనిఖీ చేశారు. అనధికార వ్యక్తులు కొండ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.టీటీడీ సీవీఎస్ఓగా మురళీకృష్ణతిరుమల : టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్ఓ)గా కేవీ మురళీకష్ణను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం, 16వ బెటాలియన్ కమాండెంట్గా మురళీకృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు.గతంలో ఆయన తిరుపతిలోని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా, అదనపు ఎస్పీగా, తిరుమల అదనపు ఎస్పీగా అనంతరం అనంతపురం ఎస్పీగా, అనకాపల్లె ఎస్పీగా పనిచేయడం గమనార్హం.అగ్ని ప్రమాదంలో దంపతులకు గాయాలురేణిగుంట : మండలంలోని వెదుళ్లచెరువు ఎస్టీ కాలనీలో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదంలో భార్యాభర్తలు గాయపడ్డారు. వివరా లు.. కాలనీలో నివసిస్తున్న సుబ్బయ్య భార్య రాణి ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. ఆమె కేకలు వేయడంతో కాపాడేందుకు సుబయ్య యత్నించగా ఆయనకు సైతం మంటలు తగిలాయి. ఈ ప్రమాదంలో రాణికి 60శాతం, సుబ్బయ్యకు 20శాతం శరీరం కాలిపోయింది. బాధితులను వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్సైదాపురం : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు పంచాయతీ కార్యదర్శి యజ్దానీబాషాను సస్పెండ్ చేస్తూ పీఆర్ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. యజ్దానీబాషా గతంలో సైదాపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేసేప్పుడు రూ.20,33,646 ఉపాధి నిధులను నేరుగా విత్డ్రా చేసినందుకు సస్పెండ్ చేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాడు–నేడు పథకం కింద సచివాలయ భవనాల నిర్మాణం కోసం వెచ్చించిన ఉపాధి నిధులు పక్కదారి పట్టాయని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై కమిషనర్ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
ఐసెట్లో తిరుపతి విద్యార్థుల హవా
● టాప్ టెన్లో 7, 10 ర్యాంకులు కై వసం ● 2,759 మంది పరీక్షకు హాజరుకాగా 2,627మంది ఉత్తీర్ణత తిరుపతి సిటీ: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు నిర్వహించిన ఐసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్కు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2,759 మంది విద్యార్థులు హాజరుకాగా 2,627 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పురుషులు 1296 మంది, 1331 మంది మహిళలు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది జిల్లాలో మహిళలదేపైచేయిగా నిలిచింది. 7, 10 ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు ఐసెట్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా టాప్టెన్లో 7వ, 10వ ర్యాంకులను తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు కై వసం చేసుకున్నారు. ఇందులో తిరుపతి నగరం సమీపంలోని వేదాంతపురానికి చెందిన వి అజయ్కుమార్ 7వ ర్యాంకు సాధించారు. ఈయన శ్రీసిటీ ఐఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. అజయ్కుమార్ తండ్రి వి మదనమోహన్ గాజులమండ్యం పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. సూళ్లూరు పేట, మన్నూర్పోలూరుకు చెందిన మహిళా రైతు లక్ష్మీ కుమారుడు మహేంద్ర సాయి 10వ ర్యాంక్ సాధించాడు. ఈ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు. -
రిజిస్ట్రేషన్కు స్లాట్ తప్పనిసరి
తిరుపతి అర్బన్ : ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలని ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ అరుణ్కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు చేపట్టారు. అరుణ్కుమార్ మాట్లాడుతూ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 మధ్యలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని చెప్పారు. ఆ మేరకు నిర్ణీత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఒక సబ్ రిజిస్టార్ ఉన్న కార్యాలయంలో గరిష్టంగా 39 స్లాట్లు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నచోట గరిష్టంగా 78 స్లాట్లను రోజూ కేటాయిస్తామని వివరించారు. పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్.ఏపీ.జీవోవీ.ఇన్లోని స్టాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అలాగే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి స్లాట్ పొందవచ్చని తెలిపారు. -
రెచ్చిపోతున్న ఇసుకాసురులు
వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా పెన్నా నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో సై‘ఖతం’ చేసేస్తున్నారు. వందలాది వాహనాల్లో పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అక్రమార్కులను నిలువరించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధి మాత్రం ముడుపులు తీసుకుని అక్రమ రీచ్లను ప్రోత్సహిస్తున్నారు. రాత్రింబవళ్లు ఇసుకను దోచేస్తున్నప్పటికీ కాసుల కోసం పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను విస్మరించి మామూళ్ల మత్తులో జోగుతున్నారు.వాటా ఇచ్చి తరలింపురాజాపాళెం, తెలుగురాయపురంలోని అక్రమ రీచ్ల నుంచి ఇసుక తరలించేందుకు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి యూనిట్కు రూ.వెయ్యి చొప్పున వాటాను ఇసుకాసురులు ముట్టజెపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం సగటు న వంద వాహనాల్లో ఇసుక తరలిపోతున్నట్లు సమాచారం. ప్రతి వాహనానికి రూ. 8 యూనిట్లు లెక్కన నిత్యం 800 యూనిట్ల ఇసుకను ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి అండతో ఇసుక మాఫియా బరితెగించి రాత్రి పగలు తేడాలేకుండా తవ్వకాలు సాగిస్తోంది. భారీ వాహనాల్లో ఇసుక వెళ్లిపోతోంది. ఆయా మార్గాల్లో నివసించేవారికి ఈ వాహనాల రణగొని ధ్వనులతో నిద్ర కరువవుతోంది. ఇళ్లు దుమ్మకొట్టుకుపోతున్నాయి. రహదారులు సైతం ఛిద్రమవుతున్నాయి. పోలీసు, రెవెన్యూ , మైనింగ్ అధికారులు ఈ అక్రమర్జనలో భాగస్వాములైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సరికొత్త దారిలో..ఇసుక మాఫియా రోజుకో మార్గం ఎంచుకుని అక్రమ రవాణా సాగిస్తోంది. రాజుపాళెం, తెలుగురాయపురం మీదుగా కాకుండా ఇప్పుడు తాజాగా వెంకటరెడ్డిపల్లె వంతెన సమీపంలోని అటవీ ప్రాంతం గుండా ఇసుకను రవాణా చేస్తోంది. ఇందుకోసం స్థానిక రైతుకు కొంత నగదు ఇచ్చి ఆయన పొలంలో బాట వేసుకుంది. ఈకొత్త రూట్ ద్వారా రాత్రి పూటహైవే మీదుగా భారీ వాహనాల్లో ఇసుకను తరలించేస్తోంది.సాక్షి టాస్క్ఫోర్స్ : వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక తోడేళ్లు పేట్రేగిపోతున్నాయి. టీడీపీకి చెందిన ఓ నేత కనుసన్నల్లో దందా సాగిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.కోట్ల విలువైన ఇసుకను యథేచ్ఛగా దోచుకున్నాయి. కలువాయి మండలం రాజుపాళెం, తెలుగురాయపురం సమీపంలోని పెన్నానదిలో ఇసుక తవ్వకాలకు ప్రధానంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఉండాలి. అయితే ఎన్జీటీ అనుమతి లేకుండానే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇసుక రేవుల్లో పడి దోచేస్తున్నారు.స్పందించని అధికార యంత్రాంగంపర్యావరణానికి తూట్లు పొడుస్తూ పెన్నానదిలోకి ఇసుకాసురులు దారి వేసుకున్నారు. నదీ గర్భంలోకి రోడ్డు వేసినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. ఇటీవల దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో రహదారిని మూసివేసినట్లుగా హడావుడిగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చేతులుదులిపేసుకున్నారు. అయితే గంటల వ్యవధిలోనే ఆ ఫ్లెక్సీల వించివేసి ఇసుకాసురులు వాహనాల రాకపోకలను ప్రారంభించేశారు. టీడీపీ నేతల సహకారంతో అక్రమార్కులు ఇసుక దోపిడీ చేస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన పరీక్షల నిర్వహణపై డీఆర్వోతో కలసి మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న జిల్లాలో 13 కేంద్రాల్లో 5,261 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్స్లో పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోను విద్యుత్ అంతరాయం ఉండరాదని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా తాగునీరు వసతి, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలియజేశారు. ఈ సమావేశంలో తిరుపతి ఆర్డీవో రామమోహన్, తిరుపతి అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్కుమార్ మేనకూరు సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు..!
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు.. మా కళ్లెదుటే అమ్మ చనిపోయింది’ అంటూ ఆ చిన్నారి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని తన తల్లిని చంపిన వైనాన్ని పోలీసులకు వివరించిన తీరు స్థానికులను కలచివేసింది. కన్న బిడ్డల ఎదుటే అతి కిరాతకంగా భార్యను కడతేర్చిన ఘటనపై పోలీసులు సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శనివారం రాత్రి మద్యం మత్తులో భార్య వీణమ్మ(28)ను భర్త రాపూరు శ్రీనివాసులు హత్య చేసిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి తుపాకులు పెంచలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలికి అఖిల(7), బత్తెయ్య(4), ఆదెయ్య(3) చిన్నారులున్నారు. శనివారం రాత్రి భర్త శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి భార్య వీణమ్మతో గొడవపడ్డాడు. ఆపై బండరాయితో తలపై మోది చంపేశాడు. తర్వాత పాము కాటు వేయడంతో వీణమ్మ మృతి చెందిందని నమ్మబలికాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పెంచలమ్మ ఆదివారం ఉదయం బిక్కుబిక్కుమంటూ ఏడ్చుతున్న వీణమ్మ పిల్లల్ని అక్కున చేర్చుకుంది.పోలీసుల ఔదార్యం విచారణ అనంతరం వీణమ్మ మృతదేహానికి సోమవారం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుటంబ సభ్యులు నిరుపేద గిరిజనులు కావండతో వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. వీణమ్మ మృతదేహాన్ని సైతం తీసుకెళ్లందుకు వారి వద్ద నగదు లేక పోవడంతో పోలీసులే నాయుడుపేటలో వీణమ్మకు అంత్యక్రియలు జరిపించారు. పరారీలో ఉన్న ఆమె భర్త శ్రీనివాసులును త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 67 వినతులు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్దన్రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. పది సప్లిమెంటరీకి 466 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సోమవారం తెలుగు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,647 మంది హాజరుకావాల్సి ఉండగా వారిలో 466 మంది గైర్హాజరవ్వడంతో 1,181 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 167 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. వారిలో 25 మంది గైర్హాజరవ్వడంతో 142 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు డీఈఓ పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వెంకటగిరి రూరల్ : పట్టణంలోని ఎస్పీకేఎం ఐఐహెచ్టీ (శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ)లో డిప్లొమా కోర్సులు చేయడానికి ఈనెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఓఎస్డీ ఎస్.గిరిధర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల డిహెచ్టీటీ కోర్సుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కోర్సులో మొత్తం 53 సీట్లు ఉన్నాయని, తమిళనాడులోని సేలం 12, కర్ణాటకలోని గడక్లో 4 సీట్లుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పదోవ తరగతి ఉత్తీర్హులైన వారు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. లేదా ఇంటర్మీడియెట్లో ఎంపీసీ, ఒకేషనల్ (టెక్స్టైల్స్, ఐటీఐ రెండేళ్లు) కోర్సులు పూర్తిచేసుకున్న వారు నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందచ్చని తెలిపారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా చేనేత, జౌళిశాఖలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఆసక్తిగల వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఐఐహెచ్టీవీజీఆర్.కమ్, 9866169908, 9010243054 నంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు. మృత్యుంజయుడికి విశేష పూజలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామికి సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, కలశ స్థాపన పూజలు చేశారు. అనంతరం స్వామివారికి చందనం, నారికేళ్లం, పసుపు, కుంకుమ, విభూధి వంటి వాటితో అభిషేకాలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. -
గౌరవమూ లేదు.. వేతనమూ రాదు
● ఎంపీటీసీలకు రెండేళ్లుగా అందని గౌరవ వేతనాలు ● ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పక్కన పెట్టేశారు ● టీడీపీ మద్దతుదారులకే ప్రాధాన్యం ● తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వరదయ్యపాళెం: కూటమి ప్రభుత్వం అధికారులోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు గౌరవంతోపాటు వేతనాలు లేకుండా పోయాయి. ఎంపీటీసీ సభ్యునికి నెలకు రూ.3వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రెండు విడతల్లో ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా గత ప్రభుత్వం ఎంపీటీసీలకు వేతనాలు చెల్లించలేకపోయింది. జూన్ 30న కొత్తగా కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అంతకుముందు పెండింగ్లో ఉన్న వేతనాలతో పాటు దాదాపు రెండేళ్లకు పైగా వేతనాలు రావాల్సి ఉంది. కానీ నేటికీ తమకు రావాల్సిన వేతనాలపై దృష్టి సారించడంలేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. ప్రజలచేత ఎన్నికై న ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేం, అభివృద్ధి పథకాల్లో టీడీపీ నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత తమకు అధికారులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. సర్వసభ్య సమావేశాలకే పరిమితం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్వసభ్య సమావేశాలకు హాజరుకావడమే తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించాలని మండల అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సైతం తమను ఆహ్వానించడం లేదని చెబుతున్నారు. నిధులు మంజూరుపైనా తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటున్నారు. ఇలా తమను వివక్షతకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. -
మీ కోసమే ‘స్విమ్స్ సేవ’
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు త్వరితగతిన సేవలందించాలనే ఉద్దేశంతో ‘స్విమ్స్ సేవ’ను ప్రారంభించినట్లు డైరెక్టర్, వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. రోగుల సౌకర్యర్థం స్విమ్స్లో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులను ఒక బ్యాచ్కు 20 మందిని నియమించి సోమవారం నుంచి స్విమ్స్ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ టీటీడీలో కొనసాగుతున్న శ్రీవారి సేవ మాదిరిగానే స్విమ్స్లో కూడా స్విమ్స్ సేవ ప్రారంభించాలని స్విమ్స్ ఎక్స్పర్ట్ కమిటీ సూచించినట్టు పేర్కొన్నారు. ఆస్పత్రిలో దాదాపు 42 విభాగలకు చెందిన వైద్య సేవలకు గాను వివిధ ప్రాంతాల నుంచి రోజుకు దాదా పు 1,500 మంది రోగులు వస్తున్నారని, వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాల వారు కావడంతో వీరికి ఎక్కడ ఏయే వైద్య సేవలందుతున్నాయో తెలియడం లేదన్నారు. అందుకోసం వారిని స్విమ్స్ ఓపీడీ బ్లాక్, శ్రీ పద్మావతి ఏపీడీ బ్లాక్ వద్ద రోగులు ఏపీ రిజిస్ట్రేషన్, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షల కోసం ఈ సేవను ప్రారంభించినట్టు తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, కాలేజ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, చీఫ్ మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్ వివేకానంద్, మురళి, శిరీషా పాల్గొన్నారు -
● అన్నదాత సుఖీభవకు పంగనామాలు ● ఖరీఫ్ సీజన్ మొదలైనా ఇంతవరకు అందని వైనం ● సవాలక్ష ఆంక్షలతో రైతులు సతమతం ● అర్హుల జాబితాలో మళ్లీ జల్లెడ పడుతున్న యంత్రాంగం
పెట్టుబడి సాయం లేదు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత పెట్టుబడి సాయం ఊసెత్త లేదు. సాగు ఖర్చులకు అప్పుల చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఖరీప్ సీజన్ మొదలైంది. ఈ సీజన్కు అయినా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తారో.. లేదోమరి. –జనార్దన్రెడ్డి, రైతు సీజన్లు ముగిసినా..! అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20 వేలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే గత ఏడాది ఖరీప్, రబీ సీజన్లు ముగిశాయి. తాజాగా మళ్లీ ఖరీఫ్ వచ్చింది. పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ అందించాలి. –నరేంద్ర యాదవ్, రైతు గతంలో రైతుకు ప్రాధాన్యం ఖరీప్ సీజన్ మొదలైంది. జోరుగా వరినాట్లు వేస్తున్నారు. పెట్టుబడికి అవసరమైన మేరకు డబ్బులు అందక అప్పులు చేయాల్సి వస్తోంది. పేద రైతులను ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ప్రభుత్వం అన్నదాత సుభీభవ పథకం ద్వారా చిన్న సాయం చేసినా రైతులకు అదే పెద్ద వరంగా మారుతుంది. మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతు సుభిక్షంగా.. సంతోషంగా ఉండేవాడు. – రాజశేఖర్, రైతుకూటమి ప్రభుత్వంలో రైతులు నట్టేట మునిగిపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక.. పెట్టుబడి సాయం అందక అప్పుల పాలవుతున్నారు. ఎన్నికల సందర్భంగా అలవిగాని హామీలు గుప్పించిన కూటమి నాయకులు వాటిని అమలు చేయకపోవడంతో గందరగోళానికి లోనవుతున్నారు. ప్రతి పంటకూ అప్పులు చేసి.. వడ్డీలు కడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ ఖరీఫ్లోనైనా అన్నదాత సుఖీభవ డబ్బులు అందుతాయో లేదోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. నారు పెరుకుతున్న కూలీలుగత ప్రభుత్వంలో రైతు భరోసా లబ్ధి ఇలా.. సంవత్సరం రైతులు నగదు (రూ.కోట్లలో) 2019–20 1,55,207 119.97 2020–21 1,79,030 134.81 2021–22 1,81,7100 136.55 2022–23 1,76,435 134.73 2023–24 1,80,763 137.01తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడో పంట సీజన్ మొదలైంది. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ ఊసేలేదు. రైతులు వెయ్యి కళ్లతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కో రైతుకు రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిధులు విడుదల చేయకపోగా.. సర్వేల పేరుతో సవాలక్ష ఆంక్షలు విధించడంపై రైతులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకూ క్రమం తప్పకుండా రైతు భరోసా అందించిందని గుర్తుచేస్తున్నారు. అర్హులను తగ్గించే కుట్ర ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పదికి పైగా సర్వేలు చేపట్టారు. అందులో ఇన్కం ట్యాక్స్ కట్టేవారు.. అద్దె తీసుకునేవారు, ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నవారు, వెబ్ల్యాండ్లో పేర్లు లేనివారు, పేర్లుతోపాటు వివరాలు తప్పులు తడకగా ఉన్నవారు అంటూ వివరాలు సేకరించారు. దీని ఆధారంగా అర్హుల జాబితా నుంచి తమను తొలగిస్తారేమోనని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదోఒక విధంగా అర్హుత జాబితాను తగ్గించడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని చర్చించుకుంటున్నారు. పరిశీలిస్తూ..సహనాన్ని పరీక్షిస్తూ! జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు 442 ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేశారు. 442 రైతు సేవా కేంద్రాల్లో 310 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు అగ్రికల్చర్ అసిసెంట్లకు రెండు రైతు సేవా కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు వారు అన్నదాత సుఖీభవకు అర్హులు ఎవరో తేల్చడానికి జోరుగా కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2.8 లక్షల మంది రైతులు జిల్లాలో 2.8 లక్షల మంది రైతులు ఉన్నారు. భూములు ఉన్న ధనవంతులు లక్ష మంది దాకా ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా లక్ష మంది ధనికులు మినహా మిగిలిన 1.8 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించింది. గత ఏడాదిగా కుటుంబాల విభజన నేపథ్యంలో భూములున్న రైతులు ప్రస్తుతం 3.2 వేల మంది ఉన్నారు. అన్నదాత సుభీభవ పథకానికి 2.2 లక్షల మంది దాకా అర్హులు ఉన్నట్టు లెక్కలు ఉన్నాయి. అయితే ఇటీవల సచివాలయ ఉద్యోగులు చేపట్టిన సర్వేల ఆధారంగా వాటి సంఖ్యను మరింత తగ్గించనున్న ట్టు చర్చసాగుతోంది. పథకం అమలయ్యే నాటికి ఎంతమంది తగ్గిపోతారో వేచి చూడాల్సిందే.గతంలో ప్రతి రైతుకూ రూ.13,500 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా రైతు భరోసా కింద ప్రతి రైతుకూ రూ.13,500 ఇచ్చేవారు. ఏడాదిలో మూడు సార్లుగా కేంద్రం రూ.6,500, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 చొప్పున మంజూరు చేసేవారు. కులం, మతం, పార్టీలు, ప్రాంతాలు చూడకుండా అర్హుతే ప్రామాణికంగా పథకాన్ని అమలు చేశారు. పరిశీలిస్తున్నాం అన్నదాత సుఖీవన పథకానికి అర్హులు ఎవరు.. అనర్హులు ఎవరు..? అనే అంశాలపై జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు జోరుగా పరిశీలిస్తున్నారు. మరో పది రోజుల్లో పరిశీలన పూర్తి చేయనున్నారు. కుటుంబాల విభజన నేపథ్యంలో రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భూము లన్న రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తుది జాబితాను సిద్ధం చేస్తున్నాం. అర్హులందరికీ అందిస్తాం. –ప్రసాద్రావు, డీఏఓ -
● గిట్టుబాటు ధరల్లేక అప్పుల పాలు ● లబోదిబోమంటున్న అన్నదాతలు ● పట్టించుకోని కూటమి నేతలు
సైదాపురం: జిల్లాలో ద్యానపంటలు సుమారు 30 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిలో మామిడి 24 హెక్టార్లు, నిమ్మ 4 వేల హెక్టార్లు, రెండు వేల హెక్టార్లలో అరటి, పూలు, జామ తదితర పంటలు సాగుచేస్తున్నారు. అలాగే వరి దాదాపు లక్ష ఎకరాల్లో సాగైంది. ప్రధానంగా నిమ్మ, మామిడి రైతుకు ఈ ఏడాది నష్టాలు తప్పలేదు. వేసవిలోనూ కిలో నిమ్మ కాయలు రూ.50 నుంచి రూ.70 లోపే పకాయి. అదే కిలో నిమ్మకాయలు గత ఏడాది రూ.150కి పైగా పలికాయి. మిరప, టమాట, చినీ, అరటి రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అన్నదాత సుఖీభవ ఏదీ? గత ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు పూర్తవుతున్నా నేటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం లభించ లేదు. కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. గత ప్రభుత్వం రైతు భరోసా అందించి ఆదుకుంది. ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడిస్తుందో తెలియడం లేదు. – శ్రీనివాసులురాజు, రైతు -
బీర్ బాటిల్తో దాడి
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఆటో స్టాండులో మద్యం తాగిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి బీరు బాటిల్తో దాడి చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఉత్తనూరు గ్రామానికి చెందిన హరికి మద్యం తాగే అలవాటు ఉంది. గత మూడు రోజులుగా తిరుపతిలో కొత్తగా పరిచయమైన వ్యక్తితో కలసి మద్యం సేవించాడు. ఈ క్రమంలో ఆదివారం హరికి పరిచయమైన వ్యక్తితో ఆదివారం మాటామాటా పెరిగి గొడవ కావడంతో హరి చేయి చేసుకున్నాడు. సోమవారం ఉదయం మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఆటో స్టాండులో ఒంటరిగా ఉన్న హరిపై సదరు గుర్తు తెలియని వ్యక్తి బీరు బాటిల్తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గట్టిగా అరవడంతో దాడి చేసిన వ్యక్తి పరారవగా రక్తగాయాలతో పడి ఉన్న హరిని రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు ఆస్పత్రిలో బాధితున్ని కలసి గొడవకు గల కారణాలను తెలుసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
అర్జీదారుల కోసం ఎదురు చూపు!
తిరుపతి అర్బన్: అర్జీదారుల కోసం అధికారులు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు లేక కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. మొత్తం 257 వినతులు రాగా అందులో 155 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతోపాటు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ దేవేంద్రరెడ్డి, రోస్మాండ్ తదితరులు అర్జీలు స్వీకరించారు. -
మీకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటాం!
● ఎంపీ నిధులతో ఆదరంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం ● ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి, సమన్వయకర్త నూకతోటి రాజేష్ కేవీబీపురం: ‘రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా కూటమి ప్రభుత్వ ఆగడాలు మీతిమీరుతున్నాయి. వీటన్నింటినీ వైఎస్సార్సీపీ శ్రేణులు దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలుస్తాం’ అని ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పిలుపునిచ్చారు. మండలంలోని ఆదరం గ్రామంలో ఎంపీ నిధులు రూ.11.64 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను సోమవారం వారు ప్రారంభించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో స్థానిక గ్రామస్తులు తాగునీటి ఇబ్బంది గురించి ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తన నిధుల ద్వారా సమస్యను పరిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు తెలుగుగంగ నీటిని కాళంగి రిజర్వాయర్కు రప్పిస్తే 17వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీ నిధుల ద్వారా ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాలకు వీధిలైట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మునిలక్ష్మీ నందకుమార్, జెడ్పీటీసీ మూర్తి మునెమ్మ, మండల పార్టీ కన్వీనర్ గవర్లకృష్ణయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు ధనంజయులురెడ్డి, పార్టీ కార్యదర్శి లాల్బాబుయాదవ్, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షుడు వేనాటి చంద్రశేఖర్రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు శాస్త్రిరాజు, వైస్ ఎంపీపీ శ్రీనివాసయాదవ్, నాయకులు దశరథరామిరెడ్డి, మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో 5, పుత్తూరులో 2, గూడూరులో 4, మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. రెండు సెషన్స్లో కలిపి 2,458 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 181 మంది గైర్హాజరవ్వడంతో 2,277 (92.64 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐఐటీలో కార్యశిబిరం ప్రారంభం ఏర్పేడు: పరిశోధన పద్ధతులు– మల్టీ వేరియేట్ డేటా విశ్లేషణపై సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఐదు రోజల పాటు జరగనున్న కార్యశిబిరం అట్టహాసంగా ప్రారంభమైంది. ఐఐటీలోని హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ బహినిపతి సారథ్యంలో డీన్ ప్రొఫెసర్ ముత్తుకుమార్ పళనిస్వామి పరిశోధన పద్ధతులపై ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా పీహెచ్డీ పరిశోధన విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు యాభై మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్, నిర్వహణ, లైఫ్ సైన్సెస్, హ్యుమానిటీస్తో సహా విభిన్న నేపథ్యాలకు చెందిన వారు హాజరు కావటంతో వారికి వివిధ సెషన్లలో విభాగ అధ్యాపక సభ్యులు డాక్టర్ వనీత్ కశ్యప్, డాక్టర్ విష్ణు, సీ.రాజన్ పరిశోధన పద్ధతులపై అవగాహన కల్పించారు. కాగా ఈ నెల 23వ తేదీ వరకు ఈ వర్క్షాపు జరగనుంది. ఒత్తిడి చేయొద్దు తిరుపతి అర్బన్: ‘మ్యాంగో పల్స్(జ్యూస్) ప్రాసెసింగ్ సంస్థల వద్ద పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నాయి. వాటిని విక్రయించడానికి సమయం పడుతుంది. అప్పుడు వరకు వడ్డీలు కట్టలేరు. బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేయొద్దు’ అని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సోమవారం ఉద్యానశాఖ, బ్యాంక్ అధికారులతో వర్చువల్ పద్ధతిలో సమీక్షించారు. ఇటీవల మామిడి ఫ్యాక్టరీ యజమానుల పల్స్ పెద్ద మొత్తంలో స్టాక్ ఉన్నట్లు వెల్లడించిన అంశాలను గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయానని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు బ్యాంక్ అధికారులు ఆరు నెలలు తర్వాత ఫ్యాక్టరీ యజమానులు వడ్డీలు చెల్లించడానికి అంగీకరం తెలపాలని సూచించారు. ఉద్యానశాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ పాల్గొన్నారు. మృతుడు తిరుపతి వాసి చిత్తూరు అర్బన్: చిత్తూరులో గత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు తిరుపతికి చెందిన మహాలింగం (63) అని తేలింది. అతు చిత్తూరులో రోడ్డు దాటుతుండగా ఓ స్కూటరిస్టు ఢీ కొన్నాడు. చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహాలింగం మృతి చెందాడు. తొలుత ఇతని వివరాలు తెలియలేదు. పోలీసుల విచారణలో మృతుడు తిరుపతిలోని శ్రీనివాసనగర్కు చెందిన వాడని గుర్తించారు. ట్రాఫిక్ సీఐ నిత్యబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనధికార వ్యక్తులు తిరుమల ఖాళీ చేయాల్సిందే
తిరుమల : తిరుమల భద్రతలో భాగంగా టీటీడీ సీవీఎస్వో వీ.హర్షవర్ధన్రాజు ఆదేశాలతో పోలీసులతోపాటు విజిలెన్స్, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా శ్రీవారి మెట్టు, ఆదిశేషు అతిథిగృహం, ఎంబీసీ–34 ప్రాంతంతోపాటు ఎస్ఎంసీ, ఏటీటీ పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు కూలి పనులపై వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించారు. అదేవిధంగా తిరుమలలో అనధికారికంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించి వారిని అక్కడి నుంచి పంపిచేశారు. తిరుమలలో నిర్మాణాలను పరిశీలించి ఆయా ప్రాంతాలను బాంబ్, డాగ్స్వ్కాడ్తో తనిఖీ చేశారు. అనంతరం తిరుమలలోని ఫొటోగ్రాఫర్స్, పండ్ల దుకాణాలు, బడ్డీ కొట్టులను పరిశీలించారు. అనధికార వ్యక్తులు వెంటనే తిరుమల ఖాళీ చేయాలని హెచ్చరించారు. -
మహిళా రక్షణకు మిషన్శక్తి వన్ స్టాప్ సెంటర్
తిరుపతి అర్బన్: మిషన్శక్తి వన్స్టాప్ సెంటర్ను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతో కలసి పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళల లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, అక్రమ రవాణా, గృహ హింస, బాల్య వివాహాలు, కిడ్నాపింగ్, సైబర్ నేరాలు తదితర అంశాల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి మిషన్ శక్తి వన్స్టాప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉచిత న్యాయ రక్షణ, వైద్యం, కౌన్సెలింగ్, వసతి సాయం చేయాలని సూచించారు. ఆ మేరకు మహిళలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181పై అవగాహన కల్పించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ వసంత బాయి, డీఎంహెచ్వో బాలకృష్ణనాయక్, డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు. నేడు జాబ్మేళా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గూడూరులోని డీఆర్డబ్ల్యూ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నిర్వహించనున్న జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జాబ్మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. అదనపు సమాచారం కోసం 918639835953 ,9700561225, 9988853335లో సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, ఉపాధికల్పనాధికారి వెంకటరమణ, డీఎల్డీఓ నారాయణరెడ్డి, గణేష్ పాల్గొన్నారు. వాట్సాప్ మనమిత్ర సేవలు ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ మనమిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతో కలసి వాట్సాప్ మనమిత్రను ఆవిష్కరించారు. జిల్లా సచివాలయ అధికారి నారాయణరెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్ జగదీష్ పాల్గొన్నారు. -
నా కుమారుడిది సహజ మరణం కాదు
● అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి నాయుడుపేట టౌన్: ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్కుమార్ మేనకూరు సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
ఉపాధ్యాయ బదిలీ నిబంధనలు సవరించాలి
● రేపు చిత్తూరు డీఈఓ కార్యాలయం ముట్టడి ● జయప్రదం చేయాలని పిలుపు ● ఒక్కటైన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ తిరుపతి ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి చేసిన చట్టంలోని అసంబద్ధ నియమాలు, పాఠశాల పునర్వ్యవస్థకు సంబంధించిన వాటిని తక్షణమే సవరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని యూటీఎఫ్ భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుపై వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ముత్యాలరెడ్డి, జగన్నాథం, సాంబిరెడ్డి మాట్లాడుతూ 117జీఓను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. పైగా 117జీఓ రద్దు పేరుతో గతంలో ఆరు రకాలుగా ఉన్న పాఠశాలలను తొమ్మిది రకాలుగా విభజించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పాఠశాల స్థాయిలో ఉన్న భౌతిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా పాఠశాలలను పునర్వ్యవస్థీకరించడం, తద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా వచ్చాయని విమర్శించారు. దీంతో పాటుగా 3, 4, 5 తరగతులను మోడల్ స్కూల్ పేరుతో తరలించడం వల్ల అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోవడంతో పాటు చిన్న పిల్లలు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లడం భారంగా ఉంటుందన్నారు. ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలతో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నారని విమర్శించారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న చేపట్టే చిత్తూరు డీఈఓ కార్యాలయ ముట్టడిని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. జేఏసీ నాయకులు సురేష్, దండు రామచంద్రయ్య, బండి మధుసూదనరెడ్డి, వయ్యాల మధు, సుభాష్ చంద్రదాస్, వెంకటరమణ, రెడ్డిశేఖర్, మోహన్రెడ్డి, మహేష్ పాల్గొన్నారు. -
ఉద్యానం.. అధ్వాన్నం!
ఈ ఫొటోలోని రైతు పేరు వరప్రసాద్రాజు, సైదాపురం మండలం, లింగసముద్రం గ్రామం. పదెకరాల్లో సుమారు 1,100 నిమ్మచెట్లు సాగు చేశాడు. ప్రతి ఏటా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు గిట్టుబాటయ్యేది. కానీ ఈ యేడు కనీసం పెట్టుబడి కూడా రాలేదని వాపోతున్నాడు. సీజన్లోనూ నిమ్మకాలు అడిగే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం పెట్టబడి సాయం అందించి ఉంటే కొంతవరకై నా అప్పులు తీరేవని చెబుతున్నాడు. ఈ ఫొటోలోని రైతు పేరు కుంచం సుబ్బయ్య. ఊరు సైదాపురం. గ్రామంలో ఐదెకరాల వరకు కౌలుకు తీసుకుని ప్రతి ఏటా వ్యవసాయం చేస్తున్నాడు. అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నాడు. ఈ ఐదెకరాల్లో ఈ ఏడాది 20 పుట్ల ధాన్యాన్ని పండించాడు. సరైన గిట్టుబాటు ధరలేక.. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గిడ్డంగి సౌకర్యం లేక రోడ్డుపైనే పోసి నిరీక్షించాడు. చివరకు విధిలేని పరిస్థితుల్లో పుట్టి రూ.17 వేలకు తెగనమ్ముకున్నాడు. అదే పుట్టి గత ఏడాది రూ.24 వేల వరకు విక్రయించినట్టు పేర్కొంటున్నాడు. ఈ యేడు పెట్టుబడి ఎక్కువ.. గిట్టుబాటు తక్కువని లబోదిబోమంటున్నాడు. .. జిల్లాలో ఈ ఇద్దరి రైతుల పరిస్థితే కాదు.. ప్రతి రైతుదీ ఇదే దుస్థితి. సరైన దిగుబడి లేక.. పెట్టిన పెట్టుబడి చేతికందక.. ప్రభుత్వం ఆదుకోక అప్పుల పాలవ్వాల్సి వచ్చింది. -
స్వచ్ఛాంధ్రలో భాగస్వాములవ్వాలి
నాయుడుపేటటౌన్ : స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం నాయుడు పేట పట్టణంలో కలెక్టర్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, , ఆర్డీఓ కిరణ్మయి, మున్సిపల్ చైర్పర్సన్ దీపికతో కలిసి స్వచ్ఛాంధ్రలో భాగంగా విభిన్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గోమతి సెంటర్ వద్ద కలెక్టర్ మొక్కలు నాటారు. అక్కడ నుంచి పట్టణంలోని గాంధీపార్కు వద్దకు చేరుకొని పార్కులోని చెట్ల వద్ద వేసవి కాలంలో పక్షులకు ఆహార ధాన్యాలు, మంచి నీటి వసతిని కల్పించేలా మట్టి పాత్రలను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని పడమటి వీధి తదితర చోట్ల చలువ పందిళ్లను కలెక్టర్ పరిశీలించి అక్కడికి వచ్చిన వారికి మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం పలు సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో తహసీల్దారు రాజేంద్ర, కమిషనర్ షేక్ ఫజులుల్లా, ఎంపీడీఓ సురేష్బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు రాజేష్, గంగా ప్రసాద్, చెంగయ్య, ధనుంజయ పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయమా.. పార్టీ భవనమా!
నాగలాపురం: ప్రభుత్వ కార్యాలయాన్ని.. పార్టీ ఆఫీసుగా మార్చేశారు స్థానిక తెలుగు తమ్ముళ్లు.. నాగలాపురం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి పసుపు రంగు పులిమేశారు. ప్రభుత్వ కార్యాలయానికి టీడీపీ రంగు వేయడంపై ఇది పభ్రుత్వ కార్యాలయమా? పార్టీ ఆఫీసా అని విమర్శలు గుప్పిస్తున్నారు. రంగులు మార్చడానికి చేసే ఖర్చుతో అభివృద్ధి పనులు చేస్తే బాగుండేదని ప్రజలు హితవు పలుకుతున్నారు. అధిక రక్తపోటుపై అవగాహన తిరుపతి తుడా : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్ ర్యాలీ ప్రారంభించి ప్రసంగిస్తూ ఏటా సుమా రు 10 లక్షల మరణాలకు అధిక రక్తపోటు కారణం అవుతోందన్నారు. ప్రధానంగా జీవన శైలి గాడి తప్పడమే దీనికి ప్రధాన కారణమన్నారు. శారీరక వ్యాయామం, మంచి పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో కారం, ఉప్పు తగ్గించి తీసుకోవడం చేయాలని సూచించారు. అధిక రక్తపోటుపై అవగాహన పెంచేందుకు వైద్య నిపుణలతో సదస్సులు నిర్వహించడం ద్వారా నియంత్రించ వచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాసుల రెడ్డి, డిప్యూటి డీఎమ్హెచ్ఓ డాక్టర్ మురళి కృష్ణ, డిఐఓ ఇంచార్జ్ డాక్టర్ ఛత్ర ప్రకాష్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రెడ్డి ప్రసాద్, డాక్టర్ రూప్ కుమార్, కిరణ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
రోజుకు రూ.8 కోట్లపైనే వ్యాపారం
జిల్లా సమాచారం ప్రైవేటు ఆసుపత్రులు 1245 మెడికల్ షాపులు 2089 ప్రభుత్వాసుపత్రుల్లో రోజుకు మందుల ఖర్చు రూ.4 కోట్లు ప్రైవేటు మెడికల్ షాపుల్లో రోజుకు జరుగుతున్న వ్యాపారం రూ.8 కోట్లు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోని ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలోనూ ఇబ్బడి ముబ్బడిగా మెడికల్ షాపులు ఏర్పాటు చేశారు. ప్రజల అనారోగ్య పరిస్థితులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ అనుమతి లేని కంపెనీలకు చెందిన మందులు, మాత్రలను విక్రయిస్తూ రోజుకు సుమారు రూ. 8 కోట్లకు పైగా దండుకుంటున్నారు. మెడికల్ షాపులో పనిచేసే ఫార్మసీ ఉద్యోగులే డాక్టర్లుగా పలానా జబ్బుకు ఈ మందులు వాడితే సరిపోతుందంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. డాక్టర్ను సంప్రదించే శక్తిలేక మందులషాపుల వారు ఇచ్చే మాత్రలు విచ్చలవిడిగా తీసుకుంటూ అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. -
ముక్కంటి సేవలో రక్షణశాఖ మంత్రి సలహాదారుడు
శ్రీకాళహస్తి : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని శనివారం భారత రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారుడు, డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈఓ బాపిరెడ్డి, వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీలకు ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్ : బయోలాజికల్ డైవర్సిటీ–2025 అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన పోటీలకు జిల్లాలోని పలు జెడ్పీ హైస్కూల్, ఎస్పీడబ్య్లూ డీఫార్మసీ విద్యార్థినులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి డ్రాయింగ్ , పెయింటింగ్ పోటీలకు ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని కె.తేజస్విని ఎంపికయ్యారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.పద్మావతమ్మ, బయోడైవర్సిటీ బోర్డు రాష్ట్ర సమన్వయకర్త నీలకంఠయ్య అభినందించారు. విష్ణు నివాసంలో స్కానర్ తిరుపతి క్రైమ్ : విష్ణు వివాసంలో దొంగలను అరికట్టేందుకు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు శనివా రం ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ను ఏర్పాటు చేశారు. విష్ణు నివాసం కొచ్చే భక్తులను మోసగించే దొంగలను గుర్తించేందుకు ఇది ఎంతగానో దోహపడుతుందన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వారిని పిలిపించి ఫింగర్ ప్రింట్ సేకరించడం ద్వారా వారికి నేర చరిత్ర ఉంటే బయట పడుతుందన్నారు. -
మార్కెట్లోకి ‘కియా కారెన్స్’
చంద్రగిరి : తిరుచానూరు సమీపంలోని హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూమ్లో శనివారం కియా కారెన్స్ నూతన కారును ఆవిష్కరించారు. ఎండీ సి.జగన్నాథరెడ్డి, డైరెక్టర్ చెరకు నిరంజన్, సి.భారతి, సి.హోషిమారెడ్డితోపాటు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఎండీ మాట్లాడుతూ.. కియా నుంచి విడుదలైన కియా క్లావిస్ కారులో అత్యాధునిక సదుపాయాలు ఉన్నట్లు వెల్లడించారు. రోబస్ట్ 18 హై సేఫ్టీ స్టాండర్డ్, బెస్ట్ ఇన్సెగ్మెంట్ 26.62 ఇంచస్ డ్యూయల్ పానోరమిక్ డిస్ప్లే పానెల్, డ్యూయల్ పానె పానోరమిక్ సన్రూఫ్, బాస్ ప్రీమియం సౌండ్ సిస్టెహవిత్ 8 స్పీకర్ అడాస్ లెవల్ 2 విత్ 20 ఆటానమస్ ప్యూచర్ ఉన్నట్లు వివరించారు. 8 రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉందన్నారు. కారు బుకింగ్ కోసం 86888 29739 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో షోరూమ్ సీనియర్ మేనేజర్ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
● జిల్లాలో విచ్చల విడిగా మందుల వినియోగం ● సొంత వైద్యంతోనే అనారోగ్య సమస్యలు ● అతి ప్రమాదమంటున్న వైద్య నిపుణులు ● జోరుగా ఫార్మసీల వ్యాపారం.. రోజుకు కోట్లలో ఆదాయం
తిరుపతి తుడా : కడుపు మంట.. కీళ్ల నొప్పులు.. జ్వరం వచ్చినా మెడికల్ షాపును ఆశ్రయించడం అలవాటుగా మారింది. జిల్లాలో సుమారు 80 శాతం మంది ప్రజలు ప్రతి రోజూ చేస్తున్న పని ఇదే. వాట్సాప్ గ్రూప్లలోనూ ప్రసార మాధ్యమాలలో సెకన్లలో రోగాన్ని నయం చేసే మాత్రలు ఇవే అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలకు ప్రజలు నమ్మి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీంతో ప్రజల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా మెడికల్ షాపులు వెలిశాయి. ఇష్టానుసారంగా వైద్యుడి సలహాలు లేకుండా మార్కెట్లోని మెడికల్ షాపులలో విక్రయిస్తున్న మాత్రలను వినియోగిస్తే ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే మింగేస్తున్నారు. పొద్దున లేవగానే బ్రష్ చేయడం ఆలస్యం వైద్యులు సలహా లేకుండా మెడికల్ షాపు వారు ఇచ్చే మాత్రలను ప్రజలు మింగేస్తున్నారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అల్సర్, గ్యాస్ట్రిక్, కీళ్ల నొప్పులు, శ్వాసకోస సమస్యలు, గుండె జబ్బులు, తలనొప్పి, వాంతులు, జ్వరం వంటి ప్రధాన సమస్యలతో బాధపడే రోగులు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నారు. దీంతో జిల్లాలో వృద్ధులు, సాధారణ మధ్యవయస్కులు ప్రతి రోజు ఉదయం రెండు నుంచి ఐదు మాత్రలను తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వాసుపత్రులలో ప్రధాన జబ్బులకు రోజుకు రూ. 4 కోట్లకు పైగా మందుల కోసం వెచ్చిస్తున్నా, ప్రైవేటు మందుల షాపులలో రెండు రెట్లు అధికంగా వ్యాపారం జరుగుతోంది. యాంటీ బయాటిక్స్తో పొంచి ఉన్న ప్రమాదం నొప్పి త్వరగా తగ్గాలని తపనతో పెయిన్క్లిలర్స్, యాంటి బయాటిక్స్ను ప్రైవేటు మెడికల్ షాపు సిబ్బంది ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో మెడికల్ షాపు సిబ్బంది చెప్పిన ప్రకారం నొప్పి నుంచి శీఘ్ర ఉపశమనం కోసం అధిక మోతాదులో యాంటిబయాటిక్, పెయిన్కిల్లర్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ మాత్రల వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలిగిపోతోంది. వాడిన మందులనే మళ్లీ వాడడం ప్రమాదం జ్వరం, తలనొప్పి, గ్యాస్ట్రిక్ తదితర సమస్యలకు 90 శాతం మంది సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. గతంలో అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఇచ్చిన మందులను మరోసారి వైద్యులతో సంబంధం లేకుండా అదే మందులను వాడుతున్నారు. ఎక్కువ శాతం మంది చేస్తున్న పొరపాటు ఇదే. అలా వాడడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. – డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ఆర్ఎంవో, రుయా, తిరుపతి రిసిప్ట్ లేకుండా మందులు విక్రయించే వారిపై చర్యలు వైద్యులు సిఫార్సు లేకుండా ఎవరైనా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవు. మందులు విక్రయించాలంటే తప్పనిసరిగా వైద్యుల నుంచి రిసిప్ట్ ఉండి తీరాల్సిందే. అలా నిబంధనలు అతిక్రమించి మందులు విక్రయించే వారిపై ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యకు బాధ్యులవుతారు. ముఖ్యంగా అనస్తీసియా సంబంధిత మత్తు కలిగించే మందులు, సిరప్లు అమ్మే వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయి. – సీహెచ్ హరిప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ కేంద్రం, తిరుపతి జిల్లా సొంత వైద్యంతో సైడ్ ఎఫెక్ట్ వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యంతో ఇష్టానుసారం మందులను వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఎదుర్కోక తప్పదు. మందులను అధికంగా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లివర్, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. వైద్యుల సిఫార్సు లేకుండా మందులు కొనుగోలు చేయడం , అమ్మడం నేరం. ప్రైవేటు మందుల దుకాణాలలో వైద్యుల సలహా లేకుండా మందులు కొనుగోలు చేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. స్వతహాగా మెడికల్ షాపునకు వెళ్లి కొనుగోలు చేసే మందులు వాడితే ఉపయోగం ఉండకపోగా ఇతర సమస్యలు తప్పవు. – డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్ఓ, తిరుపతి జిల్లా -
వ్యక్తి దారుణ హత్య
రాపూరు : రాపూరు పట్టణానికి చెందిన వ్యక్తి మండలంలోని తాతిపల్లి వద్ద దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. రాపూరుకు చెందిన షషీ (52) స్థానిక మూడు రోడ్ల కూడలిలో కూల్ డ్రింక్ షాపు నడుపుతున్నాడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో షాపు మూసి వేసి ఇంటికి బయలుదేరాడు. కానీ ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం రాపూరు మండలం తాతిపల్లి సమీపంలో ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు కండలేరు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గురైన వ్యక్తి షషీగా నిర్ధారించారు. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ గంగాధర్ , సీఐ సత్యనారాయణ , కండలేరు ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్టీంను రప్పించి పరిశీలించారు. షషీ ముఖం, మెడపైన కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భర్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. -
చిత్తూరు కమిషనర్కు ప్రమాదం
● టైర్ పంక్చర్ కావడంతో పల్టీలు కొట్టిన కారు ● తీవ్రంగా గాయపడ్డ కమిషనర్ నరసింహ ప్రసాద్, సీసీ అమర్నాథ్రెడ్డిపాకాల:ప్రయాణిస్తున్న కారు వెనుకటైరు పంక్చర్ కావడంతో చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ కారు పల్టీలు కొట్టింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతుండగా పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై మండల పరిధిలోని గాదంకి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కమిషనర్తో పాటు సీసీ అమర్నాథ్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. వేగంగా వెళుతున్న కారు టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో కారు పల్టీలు కొట్టి మెయిన్ రోడ్డు నుంచి సర్వీసు రోడ్డుకు కారు చేరుకుంది. అదే మార్గంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళి కారులో ప్రయాణిస్తున్న ఆయన పీఏ భాను ప్రమాదాన్ని గమనించి చికిత్స నిమిత్తం ఇద్దరిని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం పాఠశాలలో శనివారం సైనిక్, నవోదయ పోటీ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ ఎంవీ.రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర అడకమిక్ కోఆర్డినేటర్ వీఆర్.రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సైనిక్, నవోదయ, మిలటరీ స్కూల్స్ తదతర పోటీ పరీక్షల్లో విశ్వం విద్యార్థులు సీట్లు సాధిస్తుండడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న విశ్వం విద్యాసంస్థను అభినందించారు. విశ్వం విద్యాసంస్థ అధినేత ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత 34 ఏళ్లుగా అనుభజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత సమాచారానికి 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో విశ్వం విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వీయూలోని హాస్టళ్ల తనిఖీ తిరుపతి సిటీ: ఎస్వీయూలో విద్యార్థుల హాస్టల్ గదులు, బ్లాక్లను శనివారం రాత్రి వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, వార్డెన్లు, ప్రిన్సిపాల్ తనిఖీ చేశారు. వర్సిటీ హాస్టళ్లలో కొంతమంది అనధికారికంగా తిష్టవేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై గత వారం సాక్షి దినపత్రికలో శ్రీఅనధికార వసతిశ్రీ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని నెలలుగా అనధికారికంగా, విశ్వవిద్యాలయానికి డబ్బు చెల్లించకుండా విద్యార్థులు వుంటున్న గదులకు తాళం వేశారు. బయట వ్యక్తులు, రాజకీయ పార్టీలకు అనుబంధంగా చెలామణి అవుతున్న వారు ఐ బ్లాక్, ఎఫ్ బ్లాక్లో కొన్నేళ్లుగా వుంటున్నారు. వారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఆ రెండు బ్లాక్లను తాత్కాలికంగా మూసివేయాలని వార్డెన్లను ఆదేశించారు. 31 వరకు బీఆర్ఏఓయూ డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని ఆ వర్సిటీ అధ్యయన కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి గడువులోపు ఫీజు చెల్లించాలని కోరారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు 933 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రథమ సంవత్సర పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 11,196 మందికిగాను 840 మంది విద్యార్థులు గైర్హాజరవ్వడంతో 10,356 మంది పరీక్ష రాశారు.అలాగే ద్వితీయ సంవత్సర పరీక్షకు 23 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 1,473 మందికిగాను 93మంది గైర్హాజరవ్వడంతో 1,380 మంది పరీక్షను రాశారు. సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా సోమవారం ఉదయం, మధ్యాహ్నం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బీపీసీ విద్యార్థులకు) పరీక్షను నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ జీవి.ప్రభాకర్రెడ్డి తెలిపారు. -
● 194.వెంకటాపురం, ఎగువమాసాపల్లిలో భూకుంభకోణం ● 40 ఎకరాల మేర మేత బీడు, వంక భూముల ఆక్రమణ ● బినామీ పేర్లతో కాజేసిన కూటమి నేత ● బాస్ వెనకున్నారని బరితెగింపు ● చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
సాక్షిటాస్క్ఫోర్స్: చిత్తూరు మండలం, అనుపల్లి నుంచి బండపల్లి, 194.వెంకటాపురం, ఎగువమాసాపల్లి ప్రాంతం మీదుగా తచ్చూరు నేషనల్ హైవే రోడ్డు ఉంది. దీనిపక్కనే భూములకు రెక్కలొచ్చాయి. ఎకరా భూమి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది. ఇదే అదునుగా భూకుబేరులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ముడుపులకు ఆశపడిన కొందరు సర్వేయర్లను రంగంలోకి దింపారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయోనని గాలించారు. మేత బీడు, వంక భూములు, డీకేటీ భూములు, అటవీశాఖ భూములను వరుసగా దోచుకునేందుకు పక్కా స్కెచ్చేశారు. సర్వేయర్తో స్కెచ్ గీయించుకుని వీర్వోలను బుట్టలో వేసుకున్నారు. భూకుబేరుల కుటుంబీకులు, వాళ్లకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను బినామీగా మలుచుకున్నారు. వాళ్లకే తెలియకుండా 25 నుంచి 30 మంది వరకు ఎకరా నుంచి రెండు ఎకరాల మేర పలు సర్వే నంబర్లలో భూములు కేటాయించారు. ఎగువమాసాపల్లి వద్ద ఏం చేశారంటే.. 194. వెంకటాపురానికి చెందిన కూటమి నేత, భూకుబేరుడు ఒక పార్టీకి చెందిన వారే. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. దూరపు బంధువులు కూడా. ఈ నేపథ్యంలో 194 వెంకటాపురం వద్ద ఎందుకు భూ సమస్య అంటూ వదలిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రూట్ మార్చుకుని ఎగువమాసాపల్లి ప్రాంతంలో 20 ఎకరాల భూములున్నాయని తెలుసుకున్నారు. అక్కడి అటవీశాఖ, డీకేటీ భూములను ఆక్రమించే పనిలో పడ్డారు. అనుచరులను రంగంలోకి దింపి జేసీబీలతో చదును చేయించారు. మూడో రోజు ముచ్చటగా ఎగువమాసాపల్లికి చెందిన కూటమి నేత, గ్రామస్తులు కలిసి అటవీశాఖ అఽధికారులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తే అది అటవీ భూమి అని తేలింది. బాస్ ఉన్నారనే.. అధికారం ఉంది.. బాస్(తిరుపతి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే) అండ ఉంది.. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భూకుబేరులు ప్రభుత్వ భూములను ఆక్రమించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఆక్రమిత భూముల జోలికి ఎవరు అడ్డొచ్చినా బాస్ పేరుతో బెదిరిస్తున్నారు. ‘భూములు నావి కావు.. మా బాస్వే... మీ వల్లయ్యింది చేసుకోండి’ అంటూ భూకుబేరులు బహిరంగంగా చెబుతున్నారు. మేమంతా బినామీలే.. .. టచ్ చేస్తే ఎలికాప్టర్లోనే దిగుతారని భయపెడుతున్నారు. కాగా ఈ భూమి పక్కాగా చేతుల్లోకి వస్తే బినామీలు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చేలా డీల్ సెట్ చేశారని సమాచారం. అందుకే ఆ బినామీలు కూడా భూ కుబేరుల వెనుక బ్రహ్మస్తంలా పనిచేస్తున్నారు. సర్వేలో అటవీ భూమిగానే గుర్తించాం ఎగువమాసాపల్లిలో ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించాం. రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నాం. జేసీబీలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. వారు ఇచ్చిన సమాచారం మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్నాం. వీటిని సోమవారం డీఎఫ్కు అందిస్తాం. ఆక్రమణదారులపై తదిపరి చర్యలు ఉంటాయి. రెవెన్యూ అధికారులతో సర్వే చేయగా ఆక్రమిత భూమి అటవీ భూములని తేలింది. –థామస్, ఎఫ్ఆర్ఓ, చిత్తూరు ఈస్ట్ కబ్జా చేశారనేది వాస్తవం భూ ఆక్రమణపై ఫిర్యాదులొచ్చాయి. ఇప్పుడు చదును చేసిన భూమి అటవీశాఖ భూమి అని తేలింది. రెవెన్యూ భూముల విషయానికి సంబంధించి తహసీల్దార్ కూడా నోటీసులు ఇచ్చారు. తప్పు అని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, ఆర్డీఓ, చిత్తూరుఆక్రమణలపై చర్యలేవి? ఇక అటవీశాఖ అధికారులు ఆక్రమణదారులపై కేసు పెట్టేందుకు జంకుతున్నారు. కూటమి నేతల ఒత్తిడి ఉండడంతో అటవీశాఖ అధికారులు నోరువిప్పలేక పోతున్నారు. భూ ఆక్రమణదారులు పరారీలో ఉన్నారని సాకుచూపుతున్నారు. దీనికితోడు రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల కనుసన్నల్లో మునిగి తేలుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే భూ ఆక్రమణల జోలికి రెవెన్యూ అధికారులు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలపై గ్రామస్తులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
చచ్చేలా కొట్టి.. మూత్రం తాగించి..
సాక్షి, టాస్క్ ఫోర్స్: దళితుడిగా పుట్టడమే ఓ బీటెక్ విద్యార్థికి శాపంగా పరిణమించింది. సీనియర్ అన్న గౌరవం కూడా లేకుండా తరచూ కులం పేరుతో దూషిస్తున్న జూనియర్కు అది తగదని చెప్పడమే పాపమై పోయింది. ఆ జూనియర్ రౌడీషీటర్లతో కలిసి దళిత విద్యార్థిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కారులో కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. కత్తులతో తలపై కోశారు. అరవకుండా నోట్లో డ్రాయర్ (అండర్ వేర్) కుక్కారు. హాకీ స్టిక్లు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మూత్రం తాగించారు. ఇంత తీవ్ర అవమానంతో న్యాయం కోసం వెళ్తే పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి మిన్నకుండిపోయారు.ఈ అమానవీయ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థి విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఓ కళాశాలలో జేమ్స్ అనే విద్యార్థి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని తన జూనియర్ యశ్వంత్ నాయుడు తరచూ కులం పేరుతో దూషిస్తూ, జేమ్స్ను తీవ్రంగా అవమానిస్తున్నాడు. ఇటీవల యశ్వంత్ మరోసారి తీవ్రంగా అవమానించడంతో అలా మాట్లాడటం తగదని జేమ్స్ బదులిచ్చాడు. దీంతో అతనిపై యశ్వంత్ నాయుడు కక్ష పెంచుకున్నాడు.‘మంగళవారం’ మంగళం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న తన బావను కలిసేందుకు జేమ్స్ వెళ్లాడు. ఆ విషయం తెలుసుకున్న యశ్వంత్ నాయుడు.. రౌడీషిటర్ రూపేష్, మరో రౌడీషిటర్ చోటా బ్లేడ్, కిరణ్, జగ్గ, నానిలతో కారులో అక్కడికి వెళ్లాడు. జేమ్స్ను బలవంతంగా కారులో ఎక్కించుకొని బూతులు తిడుతూ.. కులం పేరుతో దూషించాడు. ఆపై కారులో అందరూ పిడిగుద్దులు గుద్దుతూ హాకీ స్టిక్స్, రాడ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కత్తితో తలపై గాయ పరిచారు. మూత్రం పోసి తాగించారు. బాధితుడు అరవకుండా నోట్లో డ్రాయర్ కుక్కారు. లాడ్జిలో బంధించి మరోమారు దాడి జేమ్స్ను తిరుచానూరు సమీపంలోని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి ఓ గదిలో బంధించారు. ఒకటిన్నర రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు. హోటల్ యజమానితో పాటు అందరూ మరోమారు దాడి చేశారు. ముఖంపై మూత్రం పోశారు. కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తుండగా కొంత మంది అక్కడికి రావడంతో వారంతా అక్కడ నుంచి వెళ్లిపోయారు. జేమ్స్ అపస్మారక స్థితిలో ఉండగా.. అక్కడికి వచి్చన వారు (ఎవరో తెలియదు) కట్లు విప్పి ఆస్పత్రికి తరలించారు. కొంచెం కోలుకున్న తర్వాత తిరుచానూరు పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయం పోలీసులకు వివరించాడు.ఆ మేరకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు స్వీకరించ లేదు. వారిపై కేసు కట్టేంత ధైర్యం తమకు లేదని నిస్సిగ్గుగా స్పష్టం చేశారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే ఉండి బతిమాలినా పట్టించుకోలేదు. మరుసటి రోజు పోలీసుస్టేషన్కు వెళితే ఫిర్యాదులో కొంత మంది పేర్లు తొలగించి మరో ఫిర్యాదు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని జేమ్స్ చెప్పడంతో పోలీసు సిబ్బందే తూతూ మంత్రంగా ఫిర్యాదు రాసి బాధితుడి వద్ద సంతకం తీసుకున్నారు.ఇదేమిటని ప్రశ్నిస్తే తీవ్రంగా బెదిరించారని బాధితుడు వాపోయాడు. కాగా, జేమ్స్ కుడి కన్నుకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితులకు అధికార టీడీపీ అండ ఉండటంతో కేసు తీసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నట్లు సమాచారం. -
ISRO: ఆకాశంలో నిఘా నేత్రం
సూళ్లూరుపేట: పహల్గాం ఉగ్ర దాడి, అందుకు ప్రతీకారంగా పాక్ పీచమణచిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేస్తోంది. అత్యంత అధునాతనమైన నిఘా ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను ప్రయోగించనుంది. పీఎస్ఎల్వీ–సీ61 రాకెట్ ద్వారా దాన్ని కక్ష్యలోకి చేర్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్ప్యాడ్ నుంచి ప్రయోగం జరగనుంది. 17 నిమిషాలకు ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ (ఎస్ఎస్పీఓ)లో ప్రవేశపెడతారు. ఇది ఐదేళ్లపాటు సేవలందిస్తుందని ఇస్రో తెలియజేసింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) శ్రేణిలో ఇది 63వ ప్రయోగం. కాగా ఇస్రో చరిత్రలో 101వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా టెస్ట్ వెహికల్–డీ2 (టీవీ–డీ2) మిషన్ను కూడా రోదసిలోకి పంపుతున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ శనివారం చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేయించారు. సరిహద్దులపై డేగకళ్లు మేఘాలు, దట్టమైన చీకటి కమ్ముకున్నా, తుఫాన్ల వంటివి చెలరేగినా చాలా ఉపగ్రహాలు మూగవోతాయి. కానీ ఈఓఎస్–09 అలా కాదు. అన్ని రకాల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, రేయింబవళ్లూ బ్రహా్మండంగా పని చేస్తుంది. సాధారణ ఆప్టికల్ శాటిలైట్లకు అడ్డుగోడలుగా నిలిచే మేఘాలు, వర్షాలు, దుమ్మూధూళి, పొగమంచు వంటివాటి గుండా కూడా భూమిని అత్యంత స్పష్టంగా చూడగలుగుతుంది. అత్యాధునిక సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో ఒక మీటర్ పరిధిలోని వస్తువులను కూడా కచి్చతత్వంతో ఫొటోలు తీస్తుంది. → రెండు దశాబ్దాల క్రితం రూపొందించిన పూర్తి దేశీయ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)–1కు ఈఓఎస్–09 నిఘా ఉపగ్రహం కొనసాగింపు. → చట్టవ్యతిరేక కార్యకలాపాలను, తీవ్రవాదుల ఉనికిని గుర్తించగలదు. వాహనాల కదలికలను కూడా అత్యంత స్పష్టంగా, కచ్చితంగా చిత్రించడం దీని ప్రత్యేకత. → ఇందుకోసం దీనికి హెచ్ఆర్ఎస్ (హై రిజల్యూషన్ స్పాట్లైట్), మీడియం రిజల్యూషన్ స్కాన్ (ఎస్ఏఆర్) వంటి అత్యాధునిక హంగులు అమర్చారు. → వ్యవసాయం, అడవుల పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, జాతీయ భద్రత వంటి అంశాల్లో ఇది కీలకమైన సేవలు అందించనుంది. → దీని డేగకళ్లు పాక్ నుంచి చైనా దాకా మన 15 వేల కి.మీ. విస్తారమైన సరిహద్దులను, 7,500 కి.మీ. పొడవైన సముద్రతీరాన్ని అణువణువూ కాపు కాస్తాయి. ఎలాంటి అనుమానాస్పద కదలికలనైనా ఇట్టే పట్టేస్తాయి. → వరదల వంటి ప్రాకృతిక విపత్తుల వేళ మేఘాలను చీల్చుకుంటూ ఈఓఎస్–09 అందించే రియల్ టైం చిత్రాలు, డేటా నష్ట తీవ్రతను తక్షణం అంచనా వేయడంలో దోహదపడతాయి. -
చంద్రబాబు కుట్ర ఇదే: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్లను ఖండిస్తూ తిరుపతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీని నాశనం చేయాలని, వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్సార్సీపీపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్ను బలహీనపరచాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వేధింపులకు గురి చేయడమే కాకుండా చివరికి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు...గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కక్షతో తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి సర్వీస్ కాలంలో చిత్తశుద్దితో, నిజాయితీతో పనిచేసిన సమర్థులైన అధికారులుగా వీరు పేరు సంపాదించుకున్నారు...తప్పుడు ఆరోపణలతో వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బతీయడానికే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేయకుండా, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటకాగారనే నెపంతో సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ఇలా చేస్తుంటే ఏ ప్రభుత్వ అధికారి చిత్తశుద్దితో పనిచేస్తారు? ఎక్కడా జరగని మద్యం కుంభకోణంను సృష్టించి, దీనిలో వైఎస్ జగన్ను ఇరికించి, అరెస్ట్ చేయాలనే కుట్రతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు...ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి, ఇదే తరహాలో పాలన సాగించాలని అనుకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ది చెబుతారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు చేస్తున్న తప్పులను కృష్ణుడి మాదిరిగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ను ప్రయోగిస్తూ, గత వైయస్ఆర్సీపీపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలను చూసి రేపు మన భవిష్యత్తు ఏమిటీ అనే ఆత్మ మథనం అధికారుల్లో ప్రారంభమైంది’’ అని భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొని..
● తమిళనాడు యువకుడు మృతిచంద్రగిరి : సర్వీసు రోడ్డుపై ఆగి ఉన్న లారీను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి రాయలపురం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తమిళనాడులోని కాడ్పాడికి చెందిన ప్రసన్న(26) వ్యక్తిగత పనుల నిమిత్తం తన బుల్లెట్ వాహనంపై తిరుపతికి పయనమయ్యాడు. రాయలపురం సమీపంలో వస్తున్న క్రమంలో దాబా వద్ద ఆగి ఉన్న లారీను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసన్న మృత్యువాత పడ్డాడు. వెంటనే తేరుకున్న లారీ డ్రైవరు లారీతో సహా అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల నిర్లక్ష్యంగానే ప్రమాదాలుజాతీయ రహదారిపై ఉన్న దాబాల వద్ద అనధికారికంగా భారీ వాహనాలను పార్కింగ్ చేయడం వలనే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలను నిలువరించేందుక సరైన చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ దాబాల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీను ఢీకొనడం ద్వారా ఇద్దరు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు. రహదారికి ఆనుకుని ఉన్న దాబాల యజమానులు ప్రతి నెలా పోలీసు శాఖలోని కొంత మందికి మామూళ్లు అందించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
చంద్రబాబువి కక్ష రాజకీయాలు
● ఈ అరెస్టులు అప్రజాస్వామికం ● హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం ● వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ ● తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ధ్వజం తిరుపతి మంగళం: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసేవన్నీ కక్ష రాజకీయాలని తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ అరెస్టులు అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ప్రభుత్వం పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందన్నారు. విపక్ష పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. కూటి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. -
జులై 9న అంగన్వాడీల సమ్మె
తిరుపతి కల్చరల్ : రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా జులై 9వ తేదీన ఒక రోజు సమ్మె చేపడుతున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తెలిపారు. వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీల రాష్ట్ర శిక్షణ తరగతులను శుక్రవారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు. వేతనాల పెంపుపై ఏడాది పాటు పెద్ద ఎత్తున సమ్మె చేసినా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వేతనాల పెంపుపై ఇప్పటి వరకు జీఓ విడుదల చేయకపోవడం దారుణమన్నారు. జులై 9వతేదీ లోపు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కేఎన్ఎన్.ప్రసాదరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.బాలసుబ్రమణ్యం ‘యుద్ధం తదనంతర పరిణామాలు, శాసీ్త్రయ ఆలోచనా విధానం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నేతలు లక్ష్మీదేవమ్మ, రాజేశ్వరి, ఇంద్రాణి, హైమావతి, సౌజన్య, రేవతి, నాగరాజమ్మ, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
పట్టుబట్టారు.. సాధించారు
ఏపీ ఈసెట్ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ర్యాంకుల పంట పండించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన విద్యార్థులు వారి మోములో చిరునవ్వులు చూడాలని కష్టాలకు ఎదురీది అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులతో సాక్షి ముచ్చటించింది.. వారి అభిప్రాయాలు ఇలా.. – తిరుపతి ఎడ్యుకేషన్ వ్యవసాయం చేసి చదివించారు.. డ్రగ్ ఇన్స్పెక్టర్ కావడమే తన ముందున్న లక్ష్యం. ఏపీఈసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించా. మాది కడప సమీపంలోని ఖాజీపేట. మానాన్న శ్రీనివాసు వ్యవసాయం చేస్తూ కష్టపడి చదివించారు. నేను తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో ఇన్ ఫార్మసీ చదివా. – వీవీఎస్ఎస్ తరుణ్, రాష్ట్ర స్థాయి 6వ ర్యాంకు, ఫార్మసీ విభాగంసివిల్స్ సాధించడమే లక్ష్యం మా నాన్న నారాయణ తిరుపతిలో ఆటో డ్రైవరు. ఇంటర్ తరువాత ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండేళ్ల ఫార్మసీ ఇన్ డిప్లొమో కోర్సును పూర్తి చేశా. ఏపీఈసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించా. నాలుగేళ్ల కోర్సు అయిన బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందనుండడం ఆనందంగా ఉంది. బీఫార్మసీ తరువాత సివిల్స్ సాధిస్తా. – ఎ.కీర్తి, రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు, ఫార్మసీ విభాగం డ్రగ్ ఇన్స్పెక్టర్ కావాలని.. ఏపీఈసెట్ ఫలితాల్లో 7వ ర్యాంకు సాధించా. మానాన్న రమేష్బాబు చిన్న కిరాణం నడిపిస్తూ చదివిస్తున్నారు. ఇంటర్ తరువాత పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో ఇన్ ఫార్మసీ పూర్తి చేశా. ఈసెట్ ఫలితాల్లో బీఫార్మసీకి అర్హత సాధించా. బీఫార్మసీ అనంతరం డ్రగ్ ఇన్స్పెక్టరుగా రాణించడమే తన లక్ష్యం. – ఎస్.సుప్రజ, 7వ ర్యాంకు, ఫార్మసీ విభాగంసాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని.. ఏపీఈసెట్ సిరామిక్ టెక్నాలజీ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించా.మాది శ్రీకాళహస్తి మండలం, ఎనగలూరు. మానాన్న వెంకటసుబ్బయ్య వ్యవసాయం కుటుంబం. గూడూరులోని సిరామిక్ టెక్నాలజీ కళాశాలలో డిప్లొమో పూర్తి చేశా. బీటెక్ సీఎస్సీ విభాగంలో సీటు సాధించి సాఫ్ట్వేర్గా రాణించాలన్నదే తన ఆశయం. – ముచ్చేలి కార్తిక్, స్టేట్ ఫస్ట్, సిరామిక్ టెక్నాలజీ సివిల్ ఇంజినీర్గా ఏపీఈసెట్లో 4వ ర్యాంకు సాధించా. మానాన్న కృష్ణమూర్తి తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో చెఫ్గా పనిచేస్తూ చదివించారు. తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ బ్రాంచ్ను సాధించా. బీటెక్లో చేరి మంచి సివిల్ ఇంజినీరుగా రాణించడమే తన లక్ష్యం. –ఎ. శ్రీవెంకట్, 4వ ర్యాంకు, సివిల్ విభాగం -
ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకం
తిరుపతి ఆర్టీసీ బస్టాండుల్లో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారింది. ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రికులు వస్తుంటారు. రాత్రిపూట ప్రయాణికులు బస్టాండులో ఉన్నంత సేపు భయ భయంగా గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఎటు వైపు నుంచి దొంగలు వచ్చి మీద పడతారో.. ఏ వైపు నుంచి గంజాయి మత్తులో ఏం చేస్తారోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.. మరుగుదొడ్లకు వెళ్లాలంటేనే ఇక నరకానికి పోయినంత పని అవుతోంది.. ముక్కుపుటాలు అదిరేలా దుర్వాసన వెదజల్లుతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా లేనట్లే.. తిరుపతి బస్టాండుల్లో సమస్యలు తాండవిస్తుండంతోప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం.తిరుపతి అర్బన్ : ఆధ్యాత్మిక నగరంలోని ఆర్టీసీ బస్టాండుల్లో భద్రత కొరవడింది. రాత్రీ పగలు తేడా లేకుండా చోరీలు జరుగుతున్నాయి. ప్రధానంగా రాత్రి సమయంలో గంజాయి బ్యాచ్ ఏడుకొండల బస్టాండ్తో పాటు శ్రీహరి, శ్రీనివాస, పల్లెవెలుగు బస్టాండ్లలలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఎవరు మీరు ఎందుకు బస్టాండుల్లో ఉన్నారు..ఏ ఊరికి వెళ్లాలి అని ప్రశ్నించడానికి ఆర్టీసీ కంట్రోలర్స్కు ధైర్యం చాలడం లేదు. దీంతో ప్రయాణికులు తమ బస్సు వచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన దుస్థితి దాపురించింది. కొందరు బిచ్చగాళ్ల వలే ఉంటూ ఒక్కసారిగా ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. బస్టాండ్లోని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో చోరీల సమాచారం పోలీసులకు తెలియజేసినా ప్రయోజనం ఉండడం లేదు.కంపుకొడుతున్న మరుగుదొడ్లుతిరుపతి బస్టాండ్లో వసతులు అధ్వాన్నంగా ఉన్నాయి. ఓ వైపు పలు మరుగుదొడ్లు మూతవేశారు. ఉన్న మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. తాగునీటి సమస్యలు తప్పడం లేదు. పలు కొళాయిలు పనిచేయడం లేదు. పలు ఫ్యాన్లు తిరగడం లేదు. కుర్చీలు అంతంతమాత్రమే ఏర్పాటు చేశారు. మరోవైపు శ్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈ సమస్యలు చాలదంటూ చోరీలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ తమ బస్సు వచ్చే వరకు భయభయంగా ఉంటున్నారు.ప్రయాణికులకు భద్రత కల్పించాలిప్రధానంగా తిరుపతి బస్టాండ్లో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాల్సి ఉంది. గంజాయి తాగి పలువురు వ్యక్తులు బస్టాండల్లో ఉంటున్నారు. ప్రధానంగా రాత్రి సమయంలో భయం భయంగా బస్టాండ్లులో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి భద్రత కల్పించాలని కోరుతున్నాం.–మణి, ప్రయాణికుడు, తిరుపతిఆందోళనతో గడుపుతున్నాంజిల్లా కేంద్రమైన తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు సరైన భద్రత లేదు. దీంతో ఆందోళన తప్పడం లేదు. ప్రధానంగా సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారుతోంది. ప్రతి ప్లాట్ఫాం వద్ద ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.– రెడ్డప్ప, ప్రయాణికుడు, తిరుపతికనీస వసతులు లేవుతిరుపతి బస్టాండ్లో దుకాణదారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి వస్తువులను విక్రయిస్తున్నారు. వాటిని అదుపు చేయడం లేదు. తమకు కేటాయించిన స్థలంలో కాకుండా అదనపు స్థలాన్ని ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారు. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. తాగునీటి కొళాయిలు సక్రమంగా లేవు.– వినోద్, ప్రయాణికుడు, తిరుపతి -
అనిల్పై దాడి చేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలి
తిరుపతి మంగళం : లోకేష్ రెడ్బుక్ పాలనలో కూటమి నేతలు చేస్తున్న అరాచకాలకు ప్రజలే చరమగీతం పాడుతారని, కార్పొరేటర్ బోకం అనిల్కుమార్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. తిరుపతి–కరకంబాడి మార్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిల్కుమార్ను శుక్రవారం భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబానికి మీకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పోలీస్ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవం, నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే కార్పొరేటర్ అనిల్పై దాడి చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని భూమన అన్నారు. న్యాయం జరగకపోతే ఉద్యమమే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన భూమన -
డీఎస్సీకి 26,501 మంది దరఖాస్తు
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ పరీక్షకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 26,501 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 16వ తేదీతో దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ముగిసింది. జిల్లాలో 1,478 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే దరఖాస్తులకు గడువు ముగిసేనాటికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 26,501 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గత నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మహిళలే అత్యధికం జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో మహిళలే అత్యధికంగా ఉండడం విశేషం. 26,501 మంది దరఖాస్తు చేసుకోగా అందులో మహిళలు 16,348 మంది, పురుషులు 10,153 మంది ఉన్నారు. అయితే కొందరు అభ్యర్థులు తమ అర్హతలను బట్టి పలు సబ్జెక్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ విధంగా జిల్లాలో 45,221 దరఖాస్తులు నమోదయ్యాయి. ఒక్క పోస్టుకు 31 మంది వరకు పోటీ అందిన దరఖాస్తుల ప్రకారం ఒక్కో పోస్టుకు 31 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఈ డీఎస్సీకి అత్యధికంగా పోటీ ఉండడంతో అభ్యర్థులు పుస్తకాలకు అతుక్కుపోయారు. కొందరు కోచింగ్ సెంటర్లలో, మరికొందరు ఇళ్లల్లో పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మెలికలతో పలువురికి నష్టం కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్లో ఊహించని విధంగా మెలికలు విధించింది. ఈ మెలికల వల్ల జిల్లాలో దాదాపు 6 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. రిజర్వుడు అభ్యర్థుల అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించి, టెట్లో వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డీఎస్సీకి అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది. అయితే, ఇదే టెట్లో జనరల్ అభ్యర్థులకు 45 శాతం మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్సీటీఈ గెజిట్కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో దాదాపు 3 లక్షల మంది డీఈడీ, బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కులాల వారీగా దరఖాస్తులు ఇలా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో కులాల వారీగా పరిశీలిస్తే ఎస్సీ గ్రేడ్–3 అభ్యర్థులు అత్యధికంగా 7,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓసీలో 2,856, బీసీ–ఏలో 4 వేలు, బీసీ–బీలో 3,790, బీసీ–సీలో 101, బీసీ–డీలో 2,570, బీసీ–ఈలో 1,661, ఎస్సీ గ్రేడ్–1లో 4, ఎస్సీ గ్రేడ్–2లో 1,872, ఎస్సీ గ్రేడ్–3లో 7,997, ఎస్టీలో 1,650, ఈడబ్ల్యూఎస్లో 1,664, పీహెచ్ పరిధిలో వీహెచ్ 134, హెచ్హెచ్ 57, ఓహెచ్ 595, ఎంఐ 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
డెంగ్యూపై అవగాహన
తిరుపతి తుడా : జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ అవగాహన దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మెడికల్ కళాశాల నుంచి స్విమ్స్ ఆసుపత్రి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 59 డెంగ్యూ కేసులు జిల్లాలో నమోదు అయ్యాయని తెలిపారు. వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరగడం వల్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ డెంగ్యూ దినంను ఏటా జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమలో జిల్లా అధికారులు డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, మలేరియా అధికారి డాక్టర్ రూప్ కుమార్, డీపీఎంఓ శ్రీనివాసులు, డాక్టర్ మురళీ కృష్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు 760 గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యా హ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రథమ సంవత్సర పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 10,281 మందికి 658 మంది విద్యార్థులు గైర్హాజరవ్వడంతో 9,623 మంది పరీక్షను రాశారు. అలాగే ద్వితీయ సంవత్సర పరీక్షకు 24 పరీక్షా కేంద్రా ల్లో నిర్వహించిన పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 1,570 మందికి 102 మంది గైర్హాజరవ్వడంతో 1,468 మంది విద్యార్థులు పరీక్షను రాసి నట్లు ఆర్ఐఓ జీవి ప్రభాకర్రెడ్డి తెలిపారు. టీడీపీ గుండాలపై ఎస్పీ చర్యలు తీసుకోవాలి తిరుపతి మంగళం : తిరుపతి 50వ డివిజన్కు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బోకం అనిల్కుమార్పై దాడి చేసిన టీడీపీ గూండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లాని బాబు, కార్పొరేటర్ కోటూరు ఆంజినేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్రాజును వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు కలిసి ఫిర్యాదు చేశారు. తమ కార్పొరేటర్ అనిల్ను చంపడానికి ప్రయత్నించారని, అందుకు తగిన విధంగా 307 కేసు నమోదు చేయాలని పార్టీ నాయకులు ఎస్పీని కోరారు. మరోసారి ఇలా జరగకుండా అనిల్కు రక్షణ కల్పించాలని పార్టీ నాయకులు కోరారు. ఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, పార్టీ నాయకులు మద్దాలి శేఖర్, అనిల్రెడ్డి, కుప్పయ్య, న్యాయవాది చంద్ర, కార్పొరేటర్ అనిల్కుమార్ తల్లి కుప్పమ్మ, అక్క కాటమ్మ ఉన్నారు. ముగిసిన వీసీఐ బృందం పర్యటన తిరుపతి సిటీ : ఎస్వీ వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) బృందం పర్యటన శుక్రవారం ముగిసింది. మూడు రోజులుగా వీసీఐ బృందం కళాశాలలోని పలు విభాగాలు, క్లినిక్లను, ల్యాబ్లను, కళాశాలలోని మౌలిక సదుపాయాలను పరిశీలించింది. సమస్యలు, వసతుల కల్పనపై అధ్యాపకులు, విద్యార్థులతో చర్చించారు. బృందం పరిశీలించిన అంశాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు. -
అలంకారప్రాయంగా నిఘా నేత్రాలు
తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ఆవరణంలోని శ్రీహరి బస్టాండ్లో 17 సీసీ కెమెరాలు, శ్రీనివాస బస్టాండ్లో 11 సీసీ కెమెరాలు, ఏడుకొండల బస్టాండ్లో 5 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 33 సీసీ కెమెరాలు ఉన్నాయి. అందులో 50 శాతం మేరకు పనిచేయడం లేదని, పలు సీసీ కెమెరాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ అధికారులు దాతల వద్దకు పది రోజులుగా తిరుగుతున్నట్లు సమాచారం. రెండేళ్ల కిందట కార్గో పార్శిల్ విభాగానికి కడప నుంచి రూ.2 లక్షల విలువ చేసే పట్టుచీరలు వచ్చాయి. వాటిని చోరీ చేశారు. వెంటనే సీసీ కెమెరాల ద్వారా పట్టుకున్నారు. ఎంతో కీలకమైన సీసీ కెమెరాలను ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఇటీవల విశాఖపట్నం నుంచి 30 కిలోల గంజాయిని తిరుపతి బస్టాండ్ నుంచి తమిళనాడుకు తరలించే క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి బస్టాండ్ ఆధారంగా గంజాయి వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని పోలీసులు కట్టడి చేయాల్సి ఉంది. -
మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తాం
తిరుపతి అర్బన్ : మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్తో పాటు అధికారులు, వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న మామిడి దిగుబడిని ఒక్కసారిగా కోతలు చేయకుండా దశల వారీగా చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డిని ఆదేశించారు. ఓ వైపు రైతులు, మరోవైపు వ్యాపారులు ఇంకో వైపు ఫ్యాక్టరీలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు వెల్లడించారు. ఆ మేరకు ఓ నివేదిక తయారు చేసి తమకు సమర్పించాలని ఉద్యానశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యాపారులు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి విరివిగా జిల్లాకు మామిడి పండ్లు వస్తున్నాయని చెప్పారు. దాంతో తాము నష్టపోతున్నామని, వాటిని రాకుండా అడ్డుకట్ట వేయాలని కోరారు. అన్ని అంశాలను పరిశీలించి అందరికీ న్యాయం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులతో పాటు మైక్రో ఇరిగేషన్ అధికారి సతీష్ పాల్గొన్నారు. -
రేపే పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగం
సూళ్లూరుపేట/తిరుమల: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం 7:59 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమవనుంది. పీఎస్ఎల్వీ సీ61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–1బీ) అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.ఈ ఉపగ్రహంలో అమర్చిన సీ–బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ పగలు, రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను సంగ్రహిస్తుంది. ఇప్పటి దాకా వున్న ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్ను అమర్చి పంపిస్తున్నారు.భారత సైన్యానికి కావాల్సిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్తో ఛాయాచిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్నీ అందిస్తుంది. ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్లో ఇది తొమ్మిదో ఉపగ్రహం. కాగా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్, శాస్త్రవేత్తలు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ61 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నారాయణన్, శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
తిరుమల శ్రీవారికి సంజీవ్ గోయెంక భారీ విరాళం..
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంక భారీ విరాళం అందించారు. ఏడు కోట్ల రూపాయల విలువైన కటి హస్తం, వరద హస్తాలను శ్రీవారికి విరాళం ఇచ్చారు. ఆలయ అధికారులకు సంజీవ్ గోయెంక వీటిని అందజేశారు. ఇక, సంజీవ్ గోయెంక.. ఐపీఎల్లో లక్నో జట్టు ఓనర్గా ఉన్నారు. -
తిరుమల భక్తులకు ట్రావెల్స్ సంస్థ కుచ్చుటోపీ.. భక్తుల ఆవేదన
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు బెంగళూరుకు చెందిన ట్రావెల్స్ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని నమ్మించిన భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో 35 మంది కన్నడ భక్తులు తిరుమలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరుమల కొండను టార్గెట్ చేసుకొని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని బెంగళూరుకు చెందిన వర్షా ట్రావెల్స్ భక్తులను మోసం చేసింది. సర్వదర్శనం పేరుతో నకిలీ దర్శన టిక్కెట్లను వారికి ఇచ్చింది. ఒక్కొక్క భక్తుడి నుండి రూ.3,350 నగదు వసూలు చేసింది. టికెట్ ఉందని ధీమాతో భక్తులు తిరుమలకు వచ్చారు.తిరుమలకు వచ్చాక.. తీరా నకిలీ టికెట్లని తెలడంతో శ్రీవారి భక్తులు బోరుమంటున్నారు. 35 మంది కన్నడ భక్తులు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం, భక్తులు.. పోలీసులను ఆశ్రయించారు. వర్షా ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, భక్తులకు విక్రయించిన టికెట్లపై తిరుమల శ్రీవారి ఫొటో ఉండటం గమనార్హం.ఇదిలా ఉండగా.. తిరుమలలోని విష్ణు నివాసం అతిథి గృహంలో భారీ దొంగతనం జరిగింది. 32 గ్రాముల బంగారం, 40వేల నగదు, ఓ సెల్ ఫోన్ అపహరణకు గురైంది. ఈనెల 7న శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు జిల్లా, మర్రిపాడుకు చెందిన విజయభాస్కర్ కుటుంబం తిరుమలకు వచ్చింది. వీరంతా.. రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం రూమ్ నెంబర్ 461లో బస చేశారు. రూమ్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వీరి వస్తువులను దొంగతనం చేశాడు. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఈస్ట్ ఎస్సై మహేష్ తెలిపారు. -
అయ్యా.. మాబిడ్డను సౌదీ నుంచి రప్పించండి
– తహసీల్దార్కు ఓతండ్రి విన్నపం కలువాయి(సైదాపురం):అయ్యా.. మా బిడ్డను సౌదీ నుంచి రప్పించి కాపాడాలని కలువాయి తహసీల్దార్ శ్యాంసుందర్కు మండలంలోని కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషా, బీబీ దంపతులు వేడుకున్నారు. వివరాలు ఇలా.. కలువాయి మండ లంలోని కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషా, బీబీలకు షేక్ నజీర్ అనే కుమారుడున్నారు. అతను 7వ తరగతి వరకు చదువుకున్నాడు. 2024 డిసెంబర్ నెలలో ఓ ఏజెంటు మాటలు విని రూ.2 లక్షలు పెట్టి కుమారుడు నజీర్ను సౌదీ అరేబియా దేశానికి పంపారు. అక్కడ యజమాని పెట్టే చిత్ర హింసలు భరించలేకపోవడంతో ఫోన్ ద్వారా తమకు జరుగుతున్న సంఘటనపై చెప్పుకునే వాడన్నారు. దీంతో తమ బిడ్డను ఎలాగైనా ఇండియాకు రప్పించి ఆదుకోవాలని కన్నీరుమున్నీరయ్యారు. -
విష్ణు నివాసంలో చోరీ
తిరుపతి క్రైమ్ : తిరుమల దర్శనానికి వచ్చిన భక్తుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన విజయ్ భాస్కర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఈ క్రమంలో గురువారం విష్ణు నివాసానికి చేరుకుని సేద తీరుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతని బ్యాగులోని వస్తువులను దొంగతనానికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా 32 గ్రాములు విలువ చేసే నల్లపూసల దండ, రూ.1,20,000 నగదు, 40 వేల రూపాయలు విలువచేసే మొబైల్ ఫోను చోరీకి పాల్పడినట్లుగా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేరుకే తిరుపతి జిల్లా..
తిరుపతి అర్బన్ : పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జిల్లాల పునర్విభజన 2022 ఏప్రిల్ 4న చేపట్టారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా నుంచి కొన్ని మండలాలు, నెల్లూరు జిల్లా నుంచి కొన్ని మండలాలను విభజించి 34 మండలాలతో కొత్తగా తిరుపతి జిల్లా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటై మూడేళ్లు పూర్తయింది. ఇప్పటికీ అనేక కార్యాలయాలు చిత్తూరు కేంద్రంగానే నడిపిస్తున్నారు. పలు కార్యాలయాలకు కలెక్టరేట్లో చాంబర్లు కేటాయింపు చేశారు. కానీ ఉద్యోగులను కేటాయించలేదు. దీంతో పలు కార్యాలయాల చాంబర్లకు తాళాలే దర్శనమిస్తున్నాయి. తిరుపతి జిల్లా ఏర్పాటు చేసినా ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న కార్యాలయాలు ఎస్సీ కార్పొరేషన్ అధికారం ఈడీ చెన్నయ్య చేతుల్లో ఉంది. అయితే ఆయన చిత్తూరు ప్రధాన కార్యాలయంలోనే ఉంటున్నారు. తిరుపతి జిల్లాకు కలెక్టరేట్లో ఓ చాంబర్ను అయితే కేటాయింపు చేశారు. అయితే అక్కడ ఎవరూ ఉండడం లేదు. అలాగే ఇటీవల బీసీ కార్పొరేషన్ , మైనారిటీలకు సంబంధించి రాయితీ రుణాలు మంజూరు చేశారు. వాటి కోసం దరఖాస్తు చేసుకునే వారు పలువురు కలెక్టరేట్కు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చిత్తూరు వెళ్లక తప్పని పరిస్థితి దాపురిస్తోంది. పరిష్కారం కాని విభజన సమస్యలు ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు చిత్తూరుకే పరిమితం మూడేళ్లు దాటిన జిల్లా పునర్విభజన ఖాళీగా కలెక్టరేట్లో కార్పొరేషన్ చాంబర్లు కూటమి సర్కార్లో పట్టించుకోని కార్పొరేషన్ల విభజన ఎస్సీ కార్పొరేషన్ తిరుపతి నుంచే చేపట్టాలి ఎస్సీ కార్పొరేషన్ కార్యకలాపాలు తిరుపతి నుంచే చేపట్టాలి. తిరుపతిలో కార్యాలయం ఉంటే పదే పదే వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే చిత్తూరులోనే రెండు జిల్లాలకు చెందిన ఈడీ కార్యాలయం ఉండడంతో అక్కడికి ప్రతిసారి వెళ్లలేకపోతున్నాం. తిరుపతి జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్కు ప్రత్యేక ఈడీని నియమించాలి. – అజయ్కుమార్, ఎస్సీ నేత తిరుపతి బీసీ కార్పొరేషన్ ఈడీని నియమించాలి బీసీ కార్పొరేషన్కు సంబంధించి తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా ఈడీని నియమించాలి. ఈడీ కార్యాలయం రెండు జిల్లాలకు చిత్తూరులో ఉండడంతో పలువురికి అన్యాయం జరుగుతోంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తయి 3 ఏళ్లు గడుస్తున్నా బీసీ కార్పొరేషన్ తిరుపతికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోవడం సరికాదు. – కట్టా గోపి యాదవ్, బీసీ నేత తిరుపతి వృథాగా విభిన్న ప్రతిభావంతుల కార్యాలయం విభిన్న ప్రతిభావంతులు జిల్లాలో ఎందరో ఉన్నా రు. కలెక్టరేట్లో ప్రత్యేక చాంబర్ ఉన్నప్పటికీ చిత్తూరులోనే ప్రధాన కా ర్యాలయం ఉందని చెబుతున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యాలయాన్ని తిరుపతికి మార్పు చేయాలి. – దుడ్డు వేణు, ఎస్సీ సెల్ నేత, సత్యవేడు అన్ని కార్యాలయాలు తిరుపతిలోనే పెట్టాలి జిల్లాల పునర్విభజనకు మూడేళ్లు పూర్తయింది. అయినా చిత్తూరు నుంచి పలు విభాగాలను పూర్తిగా తిరుపతి జిల్లాకు మార్పు చేయకపోవడం సరికాదు. చిత్తూరు నుంచే అధికారులు రెండు జిల్లాలను పరిపాలించడం ద్వారా తిరుపతి జిల్లా వాసులకు అన్యాయం జరుగుతోంది. కూటమి నేతలు స్పందించి చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్, బీసీ నేత పలు విభాగాల పరిస్థితి అంతే.. ఎస్సీ, బీసీ, మెనారిటీ కార్పొరేషన్ల అధికారం చిత్తూరులో కొనసాగుతోంది. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి సంబంధించి రెండు జిల్లాల అధికారి చిత్తూరులోనే ఉంటున్నారు. కలెక్టరేట్లో నామమాత్రంగా ఓ చాంబర్ను కేటాయింపు చేశారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి జిల్లా కోఆర్డినేటర్ అధికారి (డీసీవో) చిత్తూరులోనే ప్రధాన కార్యాలయం ఉంది. కలెక్టరేట్లో నామమాత్రంగా ఓ చాంబర్ను కేటాయింపు చేశారు. సివిల్ సప్లయ్కు సంబంధించి రేషన్ డీలర్లుకు ఇటీవల పెద్ద మొత్తంలో తమకు రావాల్సిన కమిషన్లు జారీ ప్రక్రియ మొత్తం చిత్తూరులోని సివిల్ సప్లయ్ అధికారి వద్దకే తిరుగుతున్నారు. రెవెన్యూ విభాగంలోనూ బదిలీలు, పదోన్నతులు చిత్తూరు కలెక్టర్ తిరుపతి జిల్లాకు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఆ తర్వాత తిరుపతి జిల్లా కలెక్టర్ వారి మండలాల వారీగా కేటాయింపులు చేస్తున్నారు. జిల్లా పరిషత్ అధికారం ఇప్పటికీ చిత్తూరు నుంచే కొనసాగుతోంది. తిరుపతి జిల్లాకు ఏ ఒక్క అధికారి లేరు. ఉన్నతాధికారులు అంతా చిత్తూరులోనే ఉంటున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా వాటి జోలికి వెళ్లకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. -
సైనికులకు సంఘీభావం
తిరుపతి, అన్నమయ్య సర్కిల్ : తిరుపతి రైల్వేస్టేషన్లో గురువారం రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వేపోలీసు (జీఆర్పీ), ఇతర అధికారులు, రైల్వే మిత్ర బృందంతో కలసి సైనికులకు సంఘీభావంగా జాతీయ జెండాతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో సందీప్కుమార్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఆశీర్వాదం, జీఆర్పీ ఎస్ఐలు రాంబాబు, రామకృష్ణ, రత్నమాల, స్టేషన్ మాస్టర్, కమర్షియల్ ఇన్స్పెక్టర్, ఇతర అధికార సిబ్బంది పాల్గొన్నారు. బాలికపై హత్యాచార ఘటనలో నిందితుడు అరెస్టు చంద్రగిరి : బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆపై బాలికను హతమార్చిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజే ష్నాయక్ తన భార్య, ఆరేళ్ల పాపతో కలసి మండల పరిధిలోని ఎం.కొంగరవారిపల్లి వద్ద ఉన్న ఓ ఇటుక బట్టీ వద్ద దినసరి కూలీగా పనిచేస్తుండగా, సమీప గ్రామానికి చెందిన నిందితుడు బాల కిషోర్ అక్కడే కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది జనవరి 3వ తేదిన బాలిక కనిపించకపోవడంతో రాజేష్ నాయక్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు బాలిక శవమై కనిపించడంతో పోస్టుమార్టం నిర్వహించారు. బాలికపై లైంగిక దాడి చేసి ఆపై హత్య చేసినట్లుగా రిపోర్టు రావడంతో పోలీసులు పోక్సో కేసుగా మార్చారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న నిందితుడు బాల కిషోర్ పోలీసుల కళ్లు కప్పి పారిపోవడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీఐ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిందితుడిని తిరుపతిలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో బాలికకు తినుబండారాల ఆశ చూపి, ఇటుక బట్టీ నుంచి కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపారన్నారు. ఈ మేరకు నిందితుడి వాంగ్మూలం రికార్డు చేసి, రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించినందుకు చురుగ్గా వ్యవహరించిన సిబ్బందికి ఎస్పీ ఆదేశాల మేరకు నగదు ప్రోత్సాహ బహుమతిని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనితతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
పాధిని ప్రాథమిక హక్కుగా ఉద్యమించండి
తిరుపతి కల్చరల్: రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్న నరేంద్రమోదీని సాగనంపేందుకు యువత, విద్యార్థులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య 17వ జాతీయ మహాసభలు గురువారం సాయంత్రం తిరుపతి ఇందిరామైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా డి.రాజా పాల్గొని ప్రసంగించారు. మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీని అమలుచేసి ఉంటే 20 కోట్ల ఉద్యోగాలు దేశంలో ఇచ్చి ఉండాలని, అధికారంలోకి రాగానే హామీని తుంగలో తొక్కి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉపాధి హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను అలవంబిస్తున్న మోదీని సాగనంపేందుకు యువత నడు బిగించాలని కోరారు. సేవ్ ప్రభుత్వం రంగ స్థలను మోదీ, ఆదానీ, అంబానీలాంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థగా నడవాలని, రాజకీయాలకు అతీతంగా ఉండాలని స్పష్టం చేశారు. నాడు ఇంద్రగుప్త అధ్యక్షతన నియమించిన కమిటీ ఎన్నికల సంస్కరణలను సిఫార్సుచేసిందని అయితే ఆ కమిటీ సిఫార్సులను పాలకులు తుంగలో తొక్కారన్నారు. భారత్ పాక్ మధ్య చెలరేగుతున్న వివాదంలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిరంతర సంక్షోభాన్ని సృష్టించారని పేర్కొన్నారు. మతాల మధ్య ఘర్షణలు సృష్టించి, మతోన్మాద ఉద్వేషాన్ని రెచ్చగొడుతూ లబ్ధి పొందాలని బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ? మోదీని సాగనంపేందుకు యువత నడుం బిగించాలి సీపీఐ జాతీయ నేత డి.రాజా పిలుపు -
వేసవిలో తరగతుల నిర్వహణపై ఫిర్యాదు
తిరుపతి అర్బన్ : ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చినా జిల్లాలోని సగం ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవడం లేదని భారత విద్యార్థి ఫెడరేషన్ నేతలు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో గురువారం విద్యార్థి సంఘం నేతలు జేసీని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు నిర్వహిస్తున్న వేసవి తరగతులతో పాటు వసతులు లేని కళాశాలల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు భగత్ రవి, వినోద్, తేజ, శివ పాల్గొన్నారు. -
మార్కెట్లోకి ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో కారు
తిరుపతి కల్చరల్: కెశ్విన్ ఆటో మోటార్స్ షోరూం వారి ఆధ్వర్యంలో గురువారం ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంజీ కంపెనీ వారి సరికొత్త విండ్సర్ ఎలక్ట్రికల్ ప్రో కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎంజీ సౌత్ ఇండియా జోనల్ సేల్స్ మేనేజర్ సౌరవ్ ప్రకాష్, ఏఎస్ఎం అన్ని విల్సన్, కెశ్విన్ ఆటో మోటార్స్ అధినేత ఉదయ్కుమార్రెడ్డి ఎంజీ విండర్ ఈవీ ప్రో కారు ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీ విండర్ ఈవీ వాహనం 52.9 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ సౌలభ్యం కలిగి ఒకసారి చార్జింగ్ చేస్తే 449 కిలోమీటర్లు ప్రయాణం చేసే సౌకర్యం ఉందన్నారు. రాయలసీమలోని తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో తమ షోరూముల్లో విండ్సర్ ఈవీ ప్రో కారు లభింస్తుదన్నారు. యువకుడిపై కత్తితో దాడి తిరుపతి క్రైమ్ : జాతర రోజు అర్ధరాత్రి ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు పాత కక్షలతో దాడి చేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలో నివాసం ఉంటున్న చందు (22) 13వ తేదీ జాతరలోని అన్నదానంలో పాల్గొని రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో సంకల్ప హాస్పిటల్ వద్ద కొంత మంది గొడవ పడుతుండగా చూస్తూ నిలబడ్డాడు. ఈ క్రమంలో చందు ప్రత్యర్థి సురేష్ అనే వ్యక్తి చందును గమనించాడు. సురేష్ కత్తి ఇచ్చి చందుపై దాడి చేయమని చెప్పాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడవగా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్టీఆర్ వర్సిటీ వీసీతో ఎస్వీ ప్రిన్సిపల్ బేటి
తిరుపతి తుడా : ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్తో ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతికి విచ్చేసిన ఆయనను గురువారం ఓ అతిథి గృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి సందర్శనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. జులైలో రుయా, వైద్య కళాశాలల్లో పర్యటిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్లు ప్రిన్సిపల్ రవిప్రభు తెలిపారు. కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, పీఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు. గరుడ వారధిపై తాత్కాలికంగా రాకపోకలు నిషేధం తిరుపతి తుడా: తిరుపతి నగరంలో నిర్మించిన గరుడ వారధిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నగరపాలక కమిషనర్ మౌర్య తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఏటా పనుల తనిఖీల్లో భాగంగా స్పాన్ లోడ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు రామాను జ సర్కిల్ నుంచి శ్రీనివాసం కాంప్లెక్స్ వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని వాహనదారులు, ఆర్టీసీ అధికారులు, నగర ప్రజలు మున్సిపల్ అధికారు లు, ట్రాఫిక్ పోలీసులకు సహరించాలని కోరారు. వ్యక్తిపై హత్యాయత్నం : అయిదుగురు అరెస్టు కేవీబీపురం:ఒక వ్యక్తిపై అయిదుగురు కలిసి హత్యాయత్నానికి పాల్పడటంతో పోలీసులు రంగ ప్రవే శం చేసి అరెస్టు చేసిన ఘటన కేవీబీపురం మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ సమాచారం మేరకు ఎంఎ రాజుల కండ్రిగ ఎస్సీ కా లనీలో గ్రామ కంఠం భూమి విషయంలో వచ్చిన తగాదా కారణంతో మునయ్య అనే వ్యక్తిపై అదే కాలనీకిచెందిన బోసు,గిరి, దొరైరాజు, సెల్వ, గోపి అయిదుగురు కలిసి మారణాయుధాలతో దాడి చేయడంతో గాయపడ్డారన్నారు. ఈ మేరకు బాధితుడు శ్రీకాళహస్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడ్డ అయిదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం తిరుపతి కల్చరల్ : తిరుమల గుబ్బా చౌల్ట్రీ ట్రస్టీ ఒంటేరు శ్రీనివాసులురెడ్డి ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధికి గురువారం కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విరాళం చెక్కును విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి చేతులు మీదుగా అందించారు. కార్యక్రమంలో గుబ్బా చౌల్ట్రీ ట్రస్టీలు చెక్కా నాగకుమార్, ఆర్.శ్రీరి, దారా సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
విదేశీ యూనివర్శిటీతో ఎంబీయూ ఒప్పందం
– అమెరికా యూనివర్శిటీతో ఎంఓయూ చంద్రగిరి : దేశంలోనే మొట్ట మొదటి సారిగా విద్యార్థుల సౌలభ్యం కోసం విదేశాలకు చెందిన ప్రముఖ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకున్నట్లు ఎంబీయూ ప్రో చాన్సలర్ మంచు విష్ణు తెలిపారు. గురువారం ఎంబీ యూనివర్శిటీలోని దాసరి ఆడిటోరియం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఈ మేరకు అమెరికాకు చెందిన పెన్ స్టేట్ విశ్వవిద్యాలయం చాన్సలర్ డాక్టర్ డేవిడ్ ఎం కాల్లెజో, వీసీ డాక్టర్ వాహిద్ మోటేపల్లిలతో ఎంబీయూ చాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు ఎంఓఏ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రొ ఛాన్సలర్ మంచు విష్ణు అమెరికాకు చెందిన యూనివర్శిటీ చాన్సలర్, వీసీలతో కలసి ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు విశ్వవిద్యాలయం అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం చేసుకోవడం చారిత్రకమన్నారు. ఇదొక నూతన ఆవిష్కరణకు నాంది పలుకుతుందని, విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. అమెరికాకు చెందిన యూనివర్శిటీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పలు కోర్సులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. కోర్సును బట్టి ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఇక్కడ విద్యనభ్యసించి, మిగిలిన విద్యను అమెరికాకు చెందిన పెన్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకునేలా ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. రెండు దేశాల్లోని యూనివర్శిటీల్లో ఒకటే సిలబస్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, ఉత్తమ విద్యను అభ్యసించే వారికి స్కాలర్షిప్లను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంబీయూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, ప్రో వోస్ట్ నాగరాజ రామారావ్, వీసీ కరుణాకరన్ ఇతర అధికారులు, అధ్యాపకుల బృందం పాల్గొన్నారు. -
తిరుపతి ఐఐటీకి మహర్ధశ
● ఫేజ్–బీ నిధులు రూ.2,313 కోట్లతో తిరుపతి ఐఐటీకి దీటైన వసతులు ● నూతన ఆవిష్కరణలకు కేంద్ర బింధువు కానున్న తిరుపతి ఐఐటీ ● 12 వేల మంది విద్యార్థులతో క్యాంపస్ మాస్టర్ ప్లాన్ ● ఐజర్తో కలిసి మరిన్ని సైన్స్ పరిశోధనలు ● తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఏర్పేడు (రేణిగుంట) : తిరుపతి ఐఐటీకి కేంద్రం ఫేజ్–బీ అభివృద్ధి పనుల కింద రూ.2,313 కోట్లు నిధులు కేటాయించడంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన క్యాంపస్ రూపకల్పన చేస్తామని ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్లోని పరిపాలన భవనంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం దేశంలోని ఐదు ఐఐటీలైన తిరుపతి ఐఐటీ, కేరళ రాష్ట్రం పాలక్కాడ్ ఐఐటీ, ఛత్తీస్ఘడ్లోని భిలాయ్ ఐఐటీ, జమ్మూ ఐఐటీ, కర్ణాటక రాష్ట్రం దార్వాడ్ ఐఐటీలకు 2025–26 నుంచి 2028–29 నాలుగేళ్లకు రూ.11,828.79 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. అందులో భాగంగా తిరుపతి ఐఐటీకి రూ.2,313 కోట్లు కేటాయించిందని తెలిపారు. పదేళ్ల స్వల్పకాలిక ప్రస్థానంలో తిరుపతి ఐఐటీ ఎన్నో అద్భుత విజయాలను అందుకుందన్నారు. అతి తక్కువ కాలవ్యవధిలోనే ఫేజ్–ఏలో రూ.1,444 కోట్లు ఖర్చు చేసి 1,200 మంది విద్యార్థులకు సరిపడా పూర్తిస్థాయి క్యాంపస్ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రస్తుతం 1,600 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని, రానున్న ఐదేళ్లలో మరో 1,300 సీట్లు పెరగనున్నట్లు ఆయన వివరించారు. బీటెక్తోపాటు ఎంటెక్, పీహెచ్డీ కోర్సులను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా తిరుపతి ఐఐటీని 12 వేల మంది విద్యార్థులు అభ్యసించే స్థాయికి తీసుకెళ్లటమే ధ్యేయమన్నారు. ఆవిష్కరణలకు 230 సంస్థలతో ఒప్పందాలుశాస్త్ర, సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలను తీసుకొచ్చే లక్ష్యంతో ఇప్పటికే 230 సంస్థలతో కలసి భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుని విద్యార్థులకు సమృద్ధిగా అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. తాజాగా కియా మోటార్ ఇండియా కంపెనీతో అయిదేళ్ల కాలానికి రూ.35కోట్లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఐఐటీ విద్యార్థులే కాకుండా బయట కళాశాలల విద్యార్థులను ఇన్నోవేషన్ హబ్లో భాగస్వామ్యమయ్యే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను తీసుకొస్తున్నారని, అందులో భాగంగా తిరుపతి, అనంతపురం, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నంలో శాఖలను ఏర్పాటు చేసి కొత్త ఆవిష్కరణల రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తిరుపతిలో ఏర్పాటు కానున్న రతన్టాటా హబ్కు తిరుపతి ఐఐటీ క్యాంపస్లో 19 ఎకరాలు స్థలాన్ని కేటాయించి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు తాము సంసిద్దత వ్యక్తం చేస్తూ ఇటీవల కలెక్టర్తో చర్చలు జరిపామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం పైకప్పు లీకేజీ మరమ్మతు పనులను డిజైన్ చేసి పూర్తి చేయించామన్నారు. డిఫెన్స్కు సంబంధించి 11 ప్రాజెక్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఏర్పేడు మండలంలో ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నామన్నారు. సమావేశంలో ఐఐటీ విభాగాల డీన్లు శశిధర్ గుమ్మా, అనిల్ కుమార్, మురళీ కృష్ణ పాల్గొన్నారు. -
గురుదక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు
న్యూస్రీల్శుక్రవారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2025శ్రీకాళహస్తీశ్వరాలయంలో మేథోగురుదక్షిణామూర్తికి గురువారం గురుపేచిని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన చేశారు. అనంతరం వినాయక పూజ, కలశ పూజ చేశారు. తరువాత స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతం, చందనం, నారికేళ జలాలతో అభిషేక పూజలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, విజయకుమార్ నాయుడు, ప్రధానార్చకులు కరుణాకరన్ గురుకుల్ తదితరులు పాల్గొన్నారు. – శ్రీకాళహస్తి -
అభివృద్ధికి ఆర్థిక సంఘం నిధులే ఆధారం
తిరుపతి రూరల్ : గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆర్థిక సంఘం నిధులే ఆధారమైనందున పంచాయతీల్లో ప్రస్తుత జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు 16వ ఆర్థిక సంఘం సభ్యులకు విన్నవించారు. తిరుపతి రూరల్ మండలం తవణపల్లి రోడ్డులోని తాజ్ హోటల్లో గురువారం గ్రామీణ , పట్టణాల్లో ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సౌమ్య కంటి ఘోష్, ఆర్థిక సంఘం జాయింట్ సెక్రటరీ ఎస్.గౌతమ్ అల్లాడ సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పారిశుద్ధ్యం, రోడ్లు , తాగునీరు, డ్రైనేజీ మొదలగు అంశాలపై ఆర్థిక సంఘం సభ్యులు సుధీర్ఘంగా చర్చించారు. నిధులు పక్కదారి పట్టకుండా ప్రతి గ్రామంలో ఖర్చుచేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని వారు ప్రజా ప్రతినిధులకు సూచించారు. అనంతరం మౌలిక సదు పాయాల కల్పనకు సరిపడా నిధులను కేంద్రం నుంచి విడుదల చేయించాలని ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. టైడ్ , ఆన్టైడ్ నిధులు వేరుగా కాకుండా ఒకే మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పి. సంపత్ కుమార్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అడిషనల్ కమిషనర్ ఎం. సుధాకర్రావు, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, జడ్పీ సీఈవో రవికుమార్నాయుడు, డిప్యూటీ సీఈవో జుబేదా, డీపీఓ సుశీలాదేవి, శ్రీసిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, ఆర్థిక సంఘం విభాగం అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి 16వ ఆర్థిక సంఘం సభ్యులకు వినతి -
వందేళ్ల నాటి శ్మశానాన్ని ఆక్రమించుకున్న టీడీపీ నేతలు
● పదేళ్లుగా ఆక్రమణలను అడ్డుకుంటున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అనిల్కుమార్ ● ఆ కక్షతోనే అనిల్పై టీడీపీ నేత వెంకటరత్నం అనుచరులతో దాడి ● రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది ● టీడీపీ గూండాల నుంచి రక్షణ కల్పించాలంటున్న హరిజనవాడ గ్రామస్తులు ● ఇరువర్గీయులపై కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు కార్పొరేటర్ అనిల్ తల్లి కుప్పమ్మను ఓదార్చి భరోసా ఇస్తున్న భూమన కరుణాకరరెడ్డి తిమ్మినాయుడుపాళెం హరిజనవాడలోని శ్మశాన స్థలంలో రెండు రోజులుగా జేసీబీతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న టీడీపీ నాయకులు తిరుపతి మంగళం : తిరుపతి 50వ డివిజన్ తిమ్మినాయుడుపాళెం హరిజనవాడలో టీడీపీ నాయకులు చేస్తున్న కబ్జాలను ప్రశ్నిస్తున్నందుకే కార్పొరేటర్ బోకం అనిల్ కుమార్పై గురువారం దాడులకు తెగబడ్డారు. తిమ్మినాయుడుపాళెం హరిజనవాడలో గత టీడీపీ ప్రభుత్వంలో స్థానిక టీడీపీ నేత కాయం వెంకటరత్నం తన అనుచరులతో పాటు గ్రామస్తులు కొంత మంది తిమ్మినాయుడుపాళెంలోని సర్వే నంబర్ 199లో కాలువ పొరంబోకు స్థలం 1.45 ఎకరాలు గత వందేళ్లుగా తాతల ముత్తాతల నాటి శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకుని రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. దీని పై అప్పటి నుంచి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు అనిల్ ఫిర్యాదులు చేస్తూ శ్మశాన స్థల ఆక్రమణను అడ్డుకుంటూ వస్తున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో శ్మశానం ఆక్రమణకు గురికాకుండా అడ్డుకున్నారు. 50 మందికి పైగా అనుచరులతో దాడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరిగీ శ్మశాన స్థలాన్ని పూర్తిగా ఆక్రమించుకుని నిర్మాణాలను రెండు రోజులుగా చేపట్టారు. దీనిపై ఎక్కడ మళ్లీ అధికారులకు ఫిర్యాదు చేస్తాడోననే భయంతో కార్పొరేటర్ అనిల్ ఇంటి నుంచి గ్రామంలోని అమ్మవారి ఆలయానికి వెళుతుండగా కాయం వెంకటరత్నం 50 మందికి పైగా తన అనుచరులతో వచ్చి దాడి చేశాడని కార్పొరేటర్ బోకం అనిల్కుమార్, అతని తల్లి కుప్పమ్మ, సోదరి కాటమ్మలతో పాటు గ్రామస్తులు తెలిపారు. ఇంత దౌర్జన్యమేమిటని ప్రశ్నించినందుకు తమపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అనిల్ తల్లి కుప్పమ్మ, సోదరి కాటమ్మ బోరున విలపిస్తూ చెప్పారు. ఇంకొకసారి తమకు అడ్డు వస్తే చంపేస్తామంటూ బెదిరించారని అనిల్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు చెబుతున్నారు. అధికార గర్వంతో ఇంతటి రౌడీయిజం మంచిది కాదని స్థానికులు చెబుతున్నా పట్టించుకోకుండా టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు అనిల్ను కొట్టారని స్థానికులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తీసుకుపోండి లేకుంటే ఇక్కడే చంపేస్తామని బెదిరించినట్లు చెప్పారు. దాంతో ఒక్క సారిగా హరిజనవాడ గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కార్పొరేటర్ అనిల్తో పాటు సోదరి కాటమ్మను రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. టీడీపీ నేతల దౌర్జన్యం.. దెబ్బలు తిన్నవారిపైనే కేసులుతిరుపతి 50వ డివిజన్ హరిజన వాడలో జరిగిన దాడుల నేపథ్యంలో కార్పొరేటర్ అనిల్పై తీవ్రంగా దాడి చేసిన టీడీపీ నాయకులే ముందుగా రుయా ఆసుపత్రికి వచ్చి తమను అనిల్ బైక్తో గుద్దేశాడని, దాంతో కాలుకు తీవ్రంగా గాయం అయిందంటూ టీడీపీ నాయకుడు వెంకటరత్నం ఆసుపత్రిలో చేరాడు. ఇదంతా అనిల్పై చేసిన దాడి నుంచి తప్పించుకునేందుకు ఆడుతున్న నాటకాలని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇరు వర్గాలు దాడు చేసుకుని గాయాలపాలైనట్లుగా తూతూమంత్రంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలిపిరి పోలీసులు మాత్రం ఇరువురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని చెబుతున్నారు. కానీ తనకు చెప్పకుండా బయటకు ఎక్కడికీ వెళ్లకూడదని టీడీపీ నాయకుడు వెంకటరత్నంను అలిపిరి సీఐ రాంకిషోర్ హెచ్చరించారు. రెడ్బుక్ పాలనతో ఆరాచకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రాసుకున్న రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డితో పాటు తిరుపతి నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులకు ఓట్లు వేసి గెలిపించినందుకు సంక్షేమాన్ని పక్కనపెట్టి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారని మండి పడుతున్నారు. ఇలాగే కూటమి నాయకులు రెచ్చిపోతే స్వచ్ఛందంగా తామే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతామని నగర ప్రజలు చెబుతున్నారు. -
ఉచిత ఫుట్బాల్ వేసవి శిబిరం
తిరుపతి సిటీ :స్థానిక ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని టీటీడీ వినాయకనగర్ క్వార్టర్స్ గ్రౌండ్లో 8 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సుగల బాల, బాలికలకు ఉచితంగా ఫుట్బాల్ శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ లోకేష్ తెలిపారు. విద్యార్థులకు సెలవుల నేపథ్యంలో క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు ప్రతి రోజు ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఆసక్తి గల విద్యార్థులు ఉచిత శిక్షణలో పాల్గొనవచ్చునన్నారు. ఈ శిబిరం వచ్చేనెల 3వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 99664 31378 నంబర్ నందు సంప్రదించవచ్చునని తెలిపారు. విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్న కోచ్ లోకేష్ -
TTD: తిరుమలలో సిఫారసు లేఖల పునరుద్ధరణ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 14 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 74,020 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,190 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం వచ్చింది. టికెట్లు లేని వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తాత్కాలిక నిర్ణయం: టిటిడితిరుమల, 2025, మే 13: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టిటిడి నిర్ణయం తీసుకుంది.ఈ నెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టిటిడి అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖల పై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది . నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. -
మహిళా వర్సిటీలో రోడ్డు పనులు ప్రారంభం
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 21 అడుగుల రోడ్డు నిర్మాణ పనులను వీసీ ప్రొఫెసర్ వి.ఉమ బుధవారం ప్రారంభించారు. తుడా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సుమారు రూ. 38 లక్షల వ్యయంతో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి హ్యుమానిటీస్ బ్లాక్– 2 వరకు రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజనిపాల్గొన్నారు.ఇంటర్ సప్లిమెంటరీకి 835 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో భాగంగా బుధవారం నిర్వహించిన మ్యాథ్స్–1ఏ, 2ఏ, బోటనీ, సివిక్స్ పరీక్షలకు 835 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జీవీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షకు 16,256మంది, ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్కు 1,981మంది హాజరైనట్లు వివరించారు.పంట కోత ప్రయోగం విజయవంతంపాకాల : మండలంలోని ఈ–పాలగుట్టపల్లెలో ఎస్.బాలరాజునాయుడు అనే రైతు పొలంలో చేపట్టిన వరి కోత ప్రయోగం విజయవంతమైనట్లు ఎంసీఆర్పీ రాధాకృష్ణ తెలిపారు. బుధవారం ఈ మేరకు ప్రకృతి వ్యసాయంలో పండించిన వరి పంటను ఐదుకు ఐదుకు పరిధిలో పంట కోత చేపట్టారు. ఈ క్రమంలో పంట 14 కేజీల 516 గ్రాముల దిగుబడి వచ్చిందని అధకారులు వెల్లడించారు. ప్రకృతి వ్యసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఐడీఆర్ఏపీ ఇన్వెస్టిగేటర్ గిరి పాల్గొన్నారు.ఖేలో ఇండియాలో సత్తా చాటిన లక్ష్మీసిరిగూడూరురూరల్ : బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా పోటీల్లో గూడూరుకు చెందిన లక్ష్మీసిరి సత్తా చాటింది. మంగళవారం జరిగిన టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం కై వసం చేసుకుంది. అలాగే డబుల్స్ విభాగంలో రజత పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా బుధవారం లక్ష్మీసిరి తండ్రి దండు మహేష్రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. -
తుడా సెక్రటరీగా శ్రీకాంత్ బాబు
తిరుపతి తుడా : తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ (తుడా) సెక్రటరీగా డాక్టర్ ఎన్వీ శ్రీకాంత్ బాబును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీకాళహస్తి ప్రాంతీయ పశువుల ఆస్పత్రిలో సహాయ సంచాలకుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ బాబుని డిప్యుటేషన్పై తుడా సెక్రటరీగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.శ్రీవారి దర్శనానికి 3 గంటలుతిరుమల:తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 74,477 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 2 గంటల్లో దర్శనమవుతోంది. -
గురుకులం విద్యార్థికి అవార్డు
వెంకటగిరి రూరల్ : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానం దక్కించుకున్న గురుకుల బాలికల పాఠశాలకు విద్యార్థిని కలపాటి ఇంద్రజ షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికై ంది. బుధవారం ఈ సందర్భంగా కలెక్టరేట్లో విద్యార్థినికి కలెక్టర్ వెంకటేశ్వర్ ల్యాప్టాప్ అందించారు. అలాగే డీఈఓ కేవీఎన్ కుమార్, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, బాబయ్య, ప్రిన్సిపల్ రజని అభినందనలు తెలిపారు. అర్హులందరికీ రుణాలు తిరుపతి అర్బన్ : అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్గా రవికుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్కు అవార్డు తిరుపతి సిటీ : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గంగా భవానీకి ఉత్తమ నర్సింగ్ పరిశోధకులు అవార్డు ప్రదానం చేశారు. ఆగ్యోగశాఖ మంత్రి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. బుధవారం ఈ మేరకు వర్సిటీలో వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ రజని అభినందనలు తెలిపారు. -
నిధుల సేకరణకు యాక్షన్ప్లాన్
● స్విమ్స్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో టీటీడీ చైర్మన్తిరుపతి తుడా : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల నిర్వహణ కోసం నిధులు సేకరణకు యాక్షన్ప్లాన్ రూపొందిస్తున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బుధవారం స్విమ్స్ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్విమ్స్ అభివృద్ధి, మెరుగైన వైద్యసేవలు అందించే విషయంపై టీటీడీ మాజీ ఈఓ ఐవీ సుబ్బారావు అధ్యక్షతన వేసిన ప్రత్యేక ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను సమర్పించిందన్నారు. ఆ మేరకు ఖాళీగా ఉన్న 597 వైద్య సిబ్బంది, 434 నర్సులను భర్తీ చేయాల్సి ఉందని వెల్లడించారు. దీంతో స్విమ్స్కు ప్రస్తుతం అందిస్తున్న రూ.100 కోట్లకు తోడు అదనంగా రూ.70కోట్ల భారం టీటీడీపై పడుతుందని వివరించారు. టీటీడీ ఈఓ శ్యామలరావు మాట్లాడుతూ నిధుల సేకరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికపై జనరల్ కౌన్సిల్లో చర్చించామన్నారు. అనంతరం స్విమ్స్ ఆవరణలో నిర్మిస్తున్న క్యాన్సర్ సెంటర్ భవనం పరిశీలించారు. సమావేశంలో ఎక్స్పర్ కమిటీ చైర్మన్ ఐవీ సుబ్బారావు, సభ్యులు జేఎస్ఎన్ మూర్తి, తేజోమూర్తుల రామోజీ, డాక్టర్ విజయ్ కుమార్, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్, టీటీడీ బోర్డు మెంబర్లు సుచిత్ర ఎల్లా, సదాశివరావు, జేఈఓ వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు. వర్చువల్గా హెల్త్ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఎండోమెంట్ సెక్రటరీ వినయ్ చంద్ హాజరయ్యారు. -
కల్కి భూములపై విచారణ
వరదయ్యపాళెం: ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రం సమీపంలోని వివాదాస్పద కల్కి ట్రస్టు భూములకు సంబంధించి బుధవారం రెవెన్యూ , అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. గతంలో ఈ భూములకు సంబంధించి కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు కల్కి ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక రైతులతో సర్వే డీఐ ప్రసాదరావు, అటవీశాఖ అధికారులు సమావేశమయ్యారు. సంబంధిత భూములు కల్కి ట్రస్టుకు ఎలా చెందాయో వివరాలను పరిశీలించారు. అలాగే స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయి రికార్డులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని సర్వే అధికారులు తెలిపారు. -
‘ష్యూర్ సక్సెస్’ నీట్ లాంగ్ టర్మ్
తిరుపతి రూరల్ : తిరుపతి సమీపంలోని తాటితోపు వద్ద సుమిత్ర టవర్స్లో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ప్రత్యేకంగా రూపొందించిన నీట్ ష్యూర్ సక్సెస్ ప్రోగ్రామ్ను బుధవారం ప్రకటించారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కరెస్పాండెంట్ శేషారెడ్డి తెలిపారు. ఈ పోస్టర్లను విడుదల చేశారు. అభ్యాసం, విద్యార్థులకు మెరుగైన గుణాత్మక శిక్షణను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 90 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు నీట్–2026లో 500మార్కులకు తక్కువ వస్తే 50శాతం ఫీజు రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు. వివరాలకు అకాడమీ సెంటర్, లేదా 9133380222 నంబరులో సంప్రదించాలని సూచించారు. తిరుమలలో సెక్యూరిటీ తనిఖీలు తిరుమల : తిరుమలలో బుధవారం సాయంత్రం సెక్యూరిటీ ఆడిటింగ్ కమిటీ మెంబర్లు సునిత్ గరుడ, అరిఫ్ హాఫ్జ్ , ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అలిపిరి చెకింగ్ పాయింట్, నడక మార్గం, శ్రీవారి పాదాలు ఘాట్ రోడ్డు, హథీరాంజీ మఠం, శ్రీవారి ఆలయంలో బూందీ పోటు, మాడ వీధులు, అన్నప్రసాద కేంద్రం, వైకుంఠం – 1, ఔటర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. గుర్తించిన అంశాలపై గురువారం సమీక్షించనున్నారు. మహిళ ఆత్మహత్య గూడూరురూరల్ : పట్టణ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద ఓ మహిళ బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. మనుబోలుకు చెందిన గునపాటి ఏడుకొండలు భార్య హేమలత (27) కొంతకాలంగా ఓజిలి మండలం కురుగొండ గ్రామానికి చెందిన రషీద్తో సహజీవనం చేస్తోంది.ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో హేమలత ఫ్యాన్కు ఉరి వేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆప్పత్రికి తరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీర జవాన్లకు రూ.లక్ష విరాళం తిరుపతి అర్బన్: వీర జవాన్లకు ముగ్గురు చిన్నారులు రూ.లక్ష విరాళం అందించారు. బుధవారం ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్కు తిరుపతి చెందిన అనిరుధ్, అశ్రీధ్, సుచిత్ర డీడీ అందజేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి ఏర్పేడు(రేణిగుంట) : ఏర్పేడు మండలం మేర్లపాక దళతవాడ వద్ద బుధవారం వేకువజామున జరగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా నల్లంబల్లి తాలూక, ఎర్రబైనహల్లి సమీపంలోని నెక్కుంది గ్రామానికి చెందిన కృష్ణన్ పెరుమాళ్, రామన్ మధు(46)నాటుకోళ్లను తీసుకుని బొలెరో వాహనంలో వస్తూ వెనుకనుంచి లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కృష్ణన్ పెరుమాళ్, రామన్ మరణించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ట్రెక్కింగ్పై విచారణకు ఆదేశం భాకరాపేట : అభయారణ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా ట్రెక్కింగ్ చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయనందుకు అటవీశాఖ జిల్లా అధికారి వివేక్ బుధవారం భాకరాపేట ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, తలకోన సెంట్రల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తలకోన సెక్షన్ ఫారెస్టు ఆఫీసర్కు మెమోలు జారీ చేశారు. దీనిపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. -
ఏపీఆర్జేసీ, పాలిసెట్లో ‘విశ్వం’ జయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఏపీఆర్జేసీ, పాలిసెట్ ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారని సంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. ఏపీఆర్జేసీలో వై.దేదీప్య రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, కె.మునిరూపేష్ 7వ ర్యాంకు, జె.అంజలి 9వ ర్యాంకు, మనీషా 10వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే రేవంత్, అబ్దుల్ ఖాదర్, యోగి, సమత, భవ్యశ్రీ గీతిక, రోషన్, ట్వింకిల్, సంతోష్, భువన, కార్తికేయ తదితరులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. పాలిసెట్ ఫలితాల్లో ఎం.కావ్య 120మార్కులకు 117మార్కులు సాధించి బాలికల విభాగంలో జిల్లా స్థాయి ఉత్తమ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. కిమ్యశ్రీ 116, కె.నిత్యశ్రీ 114, అబ్దుల్ ఖాదర్ 113, సుజినిరెడ్డి, చాతుర్య, రాజకుమారీ 112, ఎన్.రోషన్ 111, చేతన్రెడ్డి 110, జస్మిత 109మార్కులతో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు వివరించారు. రాణించిన విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, కరస్పాండెంట్ తులసీ విశ్వనాథరెడ్డి అభినందించారు. -
వెటర్నరీ కళాశాలలో వీసీఐ బృందం
తిరుపతి సిటీ : ఎస్వీ వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) బృందం బుధవారం పర్యటించింది. సుమారు 10విభాగాలను పరిశీలించింది. అధ్యాపకుల వివరాలు, తరగతి గదులు, పాఠ్యాంశాల బోధనపై వివరాలు సేకరించింది. భవితకు నైపుణ్యమే ప్రధానం తిరుపతి అర్బన్ : భవిష్యత్ ఉత్తమంగా ఉండాలంటే నైపుణ్యం పెంపొందించుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నాస్సాకామ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు, ఏపీఎస్ఎస్డీసీ కో–ఆర్డినేటర్లకు బుధవారం కలెక్టరేట్లో సర్టిఫికెట్లు, బ్యాడ్జెస్ పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచం డిజిటల్ వైపు నడుస్తుందని, సాంకేతిక అంశాలను జోడించి ప్రత్యేక నైపుణ్యత సాధించిన వారికి చక్కటి భవిష్యత్ ఉంటుందని వెల్లడించారు. నాస్సాకామ్ డైరెక్టర్ ఉదయశంకర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం పాల్గొన్నారు. నేడే డీఎస్సీ దరఖాస్తుకు ఆఖరు గడువు తిరుపతి సిటీ : టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వ విడుదల చేసిన డీఎస్సీ–2025కు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుంది. ఈనెల 30వ తేదీ నుంచి హాల్టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకును అవకాశం ఉంటుంది. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. -
ఉద్యోగం..లక్ష్యానికి ఆరంభం
చంద్రగిరి : ఉద్యోగం అనేది మీ జీవిత లక్ష్యానికి కేవలం ఆరంభం మాత్రమే అని, మీ ఉన్నతికి పడిన తొలిమెట్టుగా భావించి మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కృషి చేయాలని మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ప్రో చాన్సలర్ మంచు విష్ణు తెలిపారు. బుధవారం తిరుపతికి సమీపంలోని ఎంబీయూలో అచీవర్స్ డే–2025 కనిర్వహించారు. ఈ విద్యాసంవత్సరంలో ప్లేస్మెంట్లు సాధించిన సుమారు 1,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. విష్ణు మాట్లాడుతూ.. ఉద్యోగం ఇచ్చిన సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. జీతం కోసమే కాకుండా మీ లక్ష్యాన్ని అధిగమించేలా పనితీరు ఉండాలని కోరారు. అనంతరం ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు పలు కంపెనీల నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, ప్రో వోస్ట్ నాగరాజ రామారావ్, వీసీ కరుణాకరణ్, స్ట్రాటజిక్ అధికారి వికాస్ సింగ్, రిజిస్ట్రార్ సారథి పాల్గొన్నారు. నేడు పెన్ స్టేట్ వర్సిటీతో ఎంఓఏ అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీతో మెమోరాండం ఆఫ్ అసోసియేషన్(ఎంఓఏ) గురువారం చేసుకోనున్నట్లు ఎంబీయూ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి పెన్ స్టేట్ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ డేవిడ్ ఎం కాల్లెజో పెరెజ్, వీసీ డాక్టర్ వాహిద్ మోటేవల్లి హాజరుకానున్నారని వెల్లడించారు. ఎంబీయూలో ఘనంగా అచీవర్స్ డే -
ఉపగ్రహాల నిఘా వ్యవస్థ బలోపేతం దిశగా ఇస్రో
● 18న పీఎస్ఎల్వీ సీ61 ద్వారా కక్షలోకి ఈఓఎస్ ఉపగ్రహం సూళ్లూరుపేట: ఉపగ్రహాల నిఘా వ్యవస్థ బలోపతం, వాటి విస్తరణ వేగవంతం చేసేదిశగా ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈఓఎస్ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని సూర్య–సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈఓఎస్–09 (రీశాట్–1బీ) రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం బరువు 1710 కిలోలు. జాతీయ భద్రతను బలోపేతం చేయడం, కీలక మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో దోహదపడుతుందని ఇటీవల ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ తెలిపారు. ఈఓఎస్–09తో ఇస్రో పౌర,వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అంతరిక్ష ఆస్తులను ఉపయోగించడంలో దాని సౌంకేతిక నైపుణ్యం, నిబద్ధతను ప్రదర్శిస్తుంది. రాబోయే ఐదేళ్లలో 52 ప్రైవేటు ఉపగ్రహాలకు.. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు అంతరిక్షంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆదనంగా మరిన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా రాబో యే అయిదేళ్లలో ప్రైవేటు రంగం నుంచి బలమైన భాగస్వామ్యంతో 52 ఉపగ్రహాల సమూహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టే దిశగా ఇస్రో అడుగులు వేస్తుంది.ఈనెల జూన్, జులై నెలల్లో హై ప్రొఫైల్ మిషన్ల ప్రయోగాలకు సన్నాహాలు చేస్తున్నారు. -
అరకొరగా వసతి
● తిరుపతిలో లేని ప్రభుత్వ కళాశాలలు ● టీటీడీ ఆధ్వర్యంలోనే కాలేజీలే దిక్కంటున్న విద్యార్థులు ● ఒక్కో సీటుకు 200 మందికి పైగా పోటీ ● ప్రశ్నార్థకంగా అర్హులందరికీ హాస్టల్లో చోటు ● నేటి నుంచి టీటీడీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ తిరుపతి సిటీ : ప్రతిష్టాత్మక తిరుపతిలో పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో విద్య అందుబాటులో లేకుండా పోయింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు తిరునగరంలో లేవంటే ఆశ్చర్యమేస్తోంది. పది పూర్తి చేసి ఇంటర్లో చేరాలనుకునే విద్యార్థులకు కేవలం టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కాలేజీలే దిక్కు. రాయలసీమలో అన్ని జిల్లాల నుంచి టీటీడీ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు పెద్దసంఖ్యలో పోటీ పడుతుంటారు. దీంతో సామాన్య పేద విద్యార్థులకు సీటు దొరికే పరిస్థితిలేదు. గత ఏడాది పదోతరగతిలో 600 మార్కులకు 530 సాధించిన విద్యార్థికి ఇంటర్లో ఎంపీసీ సీటు దొరకలేదంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ కళాశాలలు లేకపోవడంతో ప్రతిభగల విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలను ఆశ్రయిస్తున్నారు. తీవ్రంగా పోటీ తిరుపతిలోని ఎస్పీడబ్లూ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ కోర్సులకు సంబంధించి ఒక్కో సీటుకు సుమారు 200 మందికి పైగా పోటీ పడుతున్నారు. సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ కోర్సులకు సైతం ఒక్కో సీటుకు 70మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎస్వీ జూనియర్ కళాశాలలోనూ ఇదే పరిస్థితి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న మరో ఓరియంట్ కళాశాలలో 5ఏళ్లు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో అందులో అడ్మిషన్లకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు. అలిపిరి డెఫ్ అండ్ డమ్ కళాశాలలో మాత్రం కొంత దివ్యాంగులకు ప్రవేశాలు సులువుగా లభిస్తున్నాయి. హాస్టల్లో సీటు దక్కేనా..? టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్ల్యూ, ఎస్వీ జూనియర్ కళాశాలలో మంచి మార్కులు సాధించినా హాస్టల్ సీటు దక్కకపోవడం విచారకరం. పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు సుమారు 968వరకు జరుగుతున్నా అందులో కేవలం 450మందికి మాత్రమే హాస్టల్ వసతి దక్కుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల సిఫార్సు లేఖలతో కొందరు విద్యార్థులు హాస్టల్ వసతి పొందుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పద్మావతి కళాశాలో సీటు పొందిన విద్యార్థినులు హాస్టల్ వసతి లేక రూ.వేలు వెచ్చించిప్రైవేటు హాస్టల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాదైనా అర్హులైన ప్రతి విద్యార్థికీ టీటీడీ యాజమాన్యం హాస్టల్ వసతి కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పెరగనున్న సీట్లు టీటీడీ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం ఎంపీసీకి 80సీట్లు ఉండగా ఈ ఏడాది పోటీని పరిగణలోకి తీసుకుని మరో 80సీట్లు పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే ఎస్వీ జూనియర్ కళాశాలలోనూ పోటీ ఎక్కువగా ఉన్న ఎంపీసీ, బైపీసీ వంటి కోర్సులకు మరిన్ని సీట్లు పెంచనున్నారు. దీంతో మరో 200మంది విద్యార్థులు గత ఏడాది కంటే అదనంగా ప్రవేశాలు పొందే అవకాశముంది. హాస్టల్ సీట్లు పెంచకుంటే ఉద్యమమే ఎస్వీ, ఎస్పీడబ్ల్యూ జూనియ ర్ కళాశాలలతో పాటు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొంది హాస్టల్ సీటు అందక విద్యార్థులు నరకం అనుభవి స్తున్నారు. ఈ ఏడాది అర్హులైన ప్రతి విద్యార్థికీ హా స్టల్ వసతి కల్పించాలి. లేకుంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. – శివశంకర్ నాయక్, జీఎన్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తిరుపతి దిక్కులేకనే తీవ్ర పోటీ ఆధ్యాత్మిక నగరంలో ప్రభు త్వ కళాశాలలు ఏర్పాటు చేయకపోవడం దారుణం. దీంతో పేద విద్యార్థులు ఉ న్నత విద్యకు దూరమవుతున్నారు.మంత్రుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా స్పందించడం లేదు. వేరే దిక్కులేకనే సీటు కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు.– హేమాద్రి యాదవ్, స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, తిరుపతి -
జాతరలో నిర్లక్ష్యం!
● భారీగా భక్తులు వస్తారని తెలిసినా శ్రద్ధపెట్టని అధికారులు ● వీఐపీలు, సామాన్య భక్తులకు ఒకే క్యూలైన్ ● తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో తోపులాట ● భయపడి అమ్మవారిని దర్శనం చేసుకోక వెనుదిరిగిన భక్తులు ● ముందస్తు జాగ్రత్తలు తీసుకోని అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలోనూ తోపులాట తప్పలేదు. నిర్వహణ లోపంతో వేల మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నారులతో వచ్చిన భక్తులు తోపులాటను చూసి అమ్మవారిని దర్శనం చేసుకోకనే వెనుదిరిగారు. తిరుపతిలో ఏటా మే నెల మొదటి వారంలో నిర్వహించే తాతయ్య గుంట గంగమ్మ జాతర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో విశిష్టమైనది. గంగమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి వైభవంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా వారం రోజుల పాటు జాతరను జరిపించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సారి నిర్వహించిన గంగమ్మ జాతరను తూతూ మంత్రంగా నిర్వహించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంగమ్మ జాతరలో అతి ముఖ్యమైన రోజైన మంగళవారం అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కూటమి ప్రభుత్వం గంగమ్మ జాతర నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని భక్తులు మండిపడుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన గుర్తుకొచ్చి భక్తులు అనేక మంది అమ్మవారి దర్శనం చేసుకోకనే వెనుదిరిగి వెళ్లిపోవటం కనిపించింది. ఆలయం వద్ద వీఐపీలు, సామాన్య భక్తులు రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అయితే అందరూ ఒకే క్యూలైన్లోకి ప్రవేశించడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎండ వేడిమికి ఊపిరి ఆడక చిన్నారులు, మహిళలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంగళవారం రాత్రి కూడా వీఐపీలు, సామాన్య భక్తులు ఒకే క్యూలైన్ ద్వారా లోనికి అనుమతించటంతో భక్తుల మధ్య మరోసారి తోపులాట చోటు చేసుకుంది. పలు ప్రాంతాల నుంచి మహిళలు పొంగళ్లు పెట్టేందుకు తరలిరాగా స్థలం లేక అనేక మంది మహిళలు వెనుదిరిగి వెళ్లిపోవటం కనిపించింది. మొత్తంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర నిర్వహణపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
భక్తులతో హోరెత్తిన ఆలయం
● భక్తి శ్రద్ధలతో పొంగళ్ల నివేదన ● జాతర చివరి రోజున పోటెత్తిన భక్తులు ● గంగజాతర వేషాలతో పులకించిన తిరునగరితాతయ్యగుంట గంగమ్మ జాతర వారంరోజుల పాటు కన్నులపండువగా సాగింది. ప్రతిరోజు విభిన్న వేషధారణలతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు. మంగళవారం పొంగళ్లు పెట్టెందుకు భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది.గంగమ్మ విశ్వరూప దర్శనంతో పులకించనున్న భక్తజనం శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవంలో చివరిరోజు బుధవారం తెల్లవారుజామున విశ్వరూపంతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంభం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంకమట్టితో సర్వాంగ సుందరంగా అమ్మవారి విశ్వరూప ప్రతిమ కొలువు తీరనుంది. అమ్మవారి విశ్వరూప ప్రతిమ చంపను పేరంటాల వేషధారుడు బుధవారం తెల్లవారుజామున నరకడంతో జాతర సమాప్తం అవుతుంది. తిరుపతి కల్చరల్ : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 6వ తేదీ రాత్రి చాటింపుతో మొదలైన గంగ జాతర వారం రోజుల పాటు అత్యంత కోలాహలంగా సాగింది. రోజువారీ విభిన్న వేషాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం జాతర చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో గంగమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం అర్ధరాత్రి అమ్మవారికి మహాశాంతి అభిషేకం తర్వాత అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మొక్కుబడిలో భాగంగా వేపాకు చీరలతో గంగమ్మను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. జాతర చివరిరోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు విశేష సంఖ్యలో భక్తులు వివిధ పౌరాణిక, జానపద, సీ్త్ర వేషాలు ధరించి తిరు నగరిలోని పురవీధుల్లో సందడి చేశారు. భక్తజనంతో గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలు సందడి నెలకొంది. ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. -
చెరువులనూ వదల్లేదుగా..
● ప్రకృతిని చెరబడుతున్న కూటమి నేతలు ● ఇటీవలి వరకు ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తరలింపు.. ● ఇప్పుడు చెరువులను తోడేస్తున్న వైనం ● మామూళ్ల మత్తులో అధికారులు దొరవారిసత్రం : మండల పరిధిలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భూముల్లో విలువైన గ్రావెల్ను అక్రమంగా తరలించి కూటమి నాయకులు రూ.లక్షలు వెనుకేసుకున్నారు. అంతటితో ఆగని వారి ధనదాహం ఇప్పుడు గ్రామాల్లోని చెరువుల వైపు మళ్లింది. రాత్రికి రాత్రే టిప్పర్లు, లారీల్లో విలువైన గ్రావెల్ను తరలించి రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా.. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసులు శాఖలు చోద్యం చూస్తుండడంతో గ్రామీణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడంటే.. నెలబల్లి, నెల్లూరుపల్లి, కల్లూరు తదితర గ్రామాల్లోని ఇరిగేషన్ పరిధిలో ఉన్న చెరువుల్లో ఇష్టారీతిన అక్రమంగా గ్రావెల్ తరలించడంతో భారీగా గోతులు ఏర్పడ్డాయి. గత మూడు రోజుల నుంచి నెలబల్లి గ్రామ పరిధిలోని సుమారు 350 ఎరాలకు సాగు నీరు అందించే నెలబల్లి పెద్దచెరువులో రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా స్థానికంగా ఉన్న కొందరు కూటమి నేతలు యంత్రాలతో తోడి ట్రాక్టర్లతో విలువైన గ్రావెల్ను బయట ప్రాంతాలకు తరలించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా ఎవరైనా అడ్డుకుంటే ఇళ్లకు గ్రావెల్ తరలిస్తున్నామని బుకాయిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుంటూ కూటమి నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కళ్లెదుటే గ్రావెల్ తరలిస్తున్నా..అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. -
తిరుపతి బస్టాండ్ నుంచే ప్రక్షాళన
● అధికారులతో డీపీటీఓ వెంకట్రావ్ తొలి సమావేశం తిరుపతి అర్బన్: తిరుపతి బస్టాండ్ నుంచే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తిరుపతి బస్టాండ్ను పరిశీలించారు. అనంతరం ఏటీఎం చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ శ్రీహరి బస్టాండ్లో కొంతభాగాన్ని త్వరలో తొలగించనున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్గో కార్యాలయాన్ని ఏ ప్రాంతానికి మార్పు చేస్తే బాగుంటుంది ? అలాగే ఈ ప్లాట్ఫాంల్లో ఆగుతున్న బస్సులను ఎక్కడ కేటాయిస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ నెల చివరికల్లా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏ ప్లాట్ఫాంలో బస్సు ఆగుతుందో అక్కడి నుంచే ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ ఇచ్చేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తిరుపతి బస్టాండ్ పరిశుభ్రత విషయంలో జిల్లాలోని అన్ని బస్టాండ్లకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ప్రతి దుకాణదారుడు డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎమ్మార్పీ ధరలకే వస్తువులు విక్రయించాలన్నారు. ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో తిరుపతి జిల్లాలోనే అత్యధికంగా 11 ఆర్టీసీ డిపోలో ఉన్నాయని, మన జిల్లాను రాష్ట్రానికే మార్గదర్శకంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డెప్యూటీ చీప్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథం, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ డీఆర్ నాయుడు, ఆర్టీసీ ఇంజినీరింగ్ అధికారులు చెన్నకేశవులు,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సిందూరంతో ‘మురళీ’ చిత్రం
తిరుపతి అర్బన్ : తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న మైక్రో ఆర్టిస్ట్ చిరంజీవి తాజాగా ఇటీవల యుద్ధంలో మృతి చెందిన వీరజవాన్ మురళీ నాయక్ చిత్రపటాన్ని శ్రీపద్మావతి అమ్మవారి సిందూరంతో తయారు చేసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు సమర్పించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ను కలిశారు. దేశభక్తి సృజనాత్మకతను చాటుకునేలా వీరజవాన్ చిత్రపటాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్టిస్ట్ చిరంజీవిని అభినందించారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య గూడూరురూరల్ : గూడూరు పట్టణ శివారు ప్రాంతంలోని టిడ్కో ఇళ్లలో నివాసం ఉండే ఓ వ్యక్తి కుటుంబం కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు టిడ్కో ఇళ్లలో నివాసం ఉండే కావలి సుబ్బారావు(43) నెల్లూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో సబార్డినేటర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి కుటుంబంలో ఏర్పడిన కలహాల కారణంగా మనస్తాపం చెందిన ఆయన ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చూసేసరికి అప్పటికే మృతి చెందిన్నట్లు గుర్తించారు. దీంతో వారు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
తడ : మండలంలోని తడకండ్రిగ పంచాయతీ బీఎల్పాడు గ్రామ సమీపంలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం కదులుతున్న రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. సూళ్లూరుపేట జీఆర్పీ ఎస్ఐ చెన్నకేశవ తెలిపిన సమాచారం మేరకు ..ఓ వ్యక్తి మృతదేహం పట్టాల మధ్య ఉన్నట్లు తడ రైల్వేస్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై అసభ్య ప్రవర్తన – వృద్ధుడికి గ్రామస్తుల దేహశుద్ధి గూడూరు రూరల్ : ఆడుకుంటున్న ఓ చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించిన ఓ వృద్ధుడికి స్థానికులు దేహశుద్ధి చేసిన సంఘటన మంగళవారం గూడూరు మండలం చెన్నూరులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామ సమీపంలో ఆడుకుంటున్న ఓ చిన్నారికి అదే ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వృద్ధుడు సిరాజ్ఖాన్ (మస్తాన్ ) మద్యం మత్తులో చాక్లెట్ ఇస్తానని మాయ మాటలు చెప్పి పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. చిన్నారితో అసభ్య ప్రవర్తనకు పాల్పడుతున్న సమయంలో గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేశారు. వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. ఆటోను ఢీకొన్న టిప్పర్ ● ఇద్దరికి తీవ్ర గాయాలు, 9 మందికి స్వల్పగాయాలు బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని పదవమైలు గ్రామం వద్ద కేటీరోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఆటోను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు, 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. సోమవారం తమిళనాడు రాష్ట్రం పెరంబదూర్కు చెందిన 11 మంది శ్రీకాళహస్తికి దైవ దర్శనానికి బస్సులో బయలుదేరి వరదయ్యపాళెంకు వచ్చారు. అక్కడి నుంచి ఆటోలో శ్రీకాళహస్తికి బయలుదేరారు. పదోమైలు గ్రామం వద్ద కేటీరోడ్డుపై ఆటోను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి తీవ్రంగా గాయపడిని ఇద్దరిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఎకై ్సజ్ స్టేషన్ను తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్ వాకాడు : మండల కేంద్రమైన వాకాడులోని ఎకై ్సజ్ అండ్ ప్రొహిభిషన్ స్టేషన్ని మంగళవారం చిత్తూరు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్లోని రికార్డులు పరిశీలన చేశారు. అలాగే బెల్టుషాపులు, కల్తీకల్లు అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ ప్రసాద్, సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక పెళ్లకూరు : మండలంలోని రోసనూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీల్లో 48 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. జిల్లా స్థాయిలో అండర్–17, అండర్–23 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి ఉదయ్కుమార్ తెలిపారు. రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ నాగూరయ్య, కోచ్ లోకేష్ ప్రసాద్ పాల్గొన్నారు. -
కనులపండువగా శ్రీవారి చక్రస్నానం
● ముగిసిన పెంచలకోన బ్రహ్మోత్సవాలు రాపూరు:పెంచలకోనలో బ్రహ్మోత్సవాల్లో చివరి రోజై న మంగళవారం ఉదయం శ్రీవారి చక్రస్నానం కను లపండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులు, సుదర్శన చక్రం విగ్రహాలను పల్లకిలో కొలువుదీర్చి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య పుష్కరిణిలో స్వామివారి చక్రతల్వార్ (సుదర్శన చక్రం)ను పుష్కరిణిలో చక్రస్నానం చేయించారు. వైభవంగా వసంతోత్సవాలు పెంచలకోనలో స్వామి వారికి వసంతోత్సవాలు నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లకు వసంతాలు చల్లి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెప్పపై నరసింహుని విహారం శోభాయమానంగా అలంకరించిన తెప్పపై పెనుశిల నరసింహస్వామి ఉభయనాంచారులతో కలసి కొలువుతీరి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చారు. పెంచలకోనలోని నరసింహస్వామి వారి ఆలయంలో ఆరు రోజులుగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి తెప్పోత్సవం నిర్వహించారు. రాత్రి 10 గంటలకు స్వామి వారిని అశ్వవాహనంపై ఉంచి కోన మాడ వీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. -
గంగమ్మకు మాజీ మంత్రుల సారె
తిరుపతి కల్చరల్ : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుకల్లో భాగంగా మంగళవారం మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా ఆలయ ప్రదర్శన చేసి అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారికి ఆనవాయితీగా సారె సమర్పించి దర్శించుకున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తాను పుట్టి పెరిగిన ఊరు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అమ్మవారి గుడికి వస్తుంటానని పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రులకు ఆలయ పండితులు అమ్మవారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గిరిధర్రెడ్డి
సూళ్లూరుపేట : నాయుడుపేటకు చెందిన ఓడూరు గిరిధర్రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉంటూ ఆయన పలు పదవుల్లో కొనసాగారు. శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో తన సేవలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. చెరువులో అంత్యక్రియలు చేయొద్దని నిరసన బాలాయపల్లి (సైదాపురం) : మండలంలోని నిండలి గ్రామానికి చెందిన వల్లెపు కోటమ్మ (110) మంగళవారం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని సమీపంలోనే కొత్త చెరువు వద్ద అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించగా స్థానిక దళితవాడ ప్రజలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ ఇళ్ల ముందే దహన సంస్కారాలు ఎలా చేస్తారంటూ దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి ఇక్కడే ఖననం చేస్తున్నామని మరో వర్గం వాదనలకు దిగారు. ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో తహసీల్దార్ విజయలక్ష్మి , పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల వాదనలు విన్నారు. చెరువు ప్రభుత్వ స్థలం ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించడంతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. దీంతో వివాదం సమసిపోయింది. -
ప్రాణం తీసిన ఈత సరదా
● ఒకరి మృతి.. ప్రాణాలతో బయటపడ్డ మరో ముగ్గురు తెప్పపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లు (ఇన్సెట్) తెప్పపై విశేషాలంకరణలో స్వామి అమ్మవార్లు శ్రీకాళహస్తి : ఈత సరదా ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొనగా.. మరో ముగ్గురు యువకులు ప్రాణాలతో బయటపడిన సంఘటన మంగళవారం తొట్టంబేడు మండలంలోని ఇలగనూరు తెలుగు గంగ కాలువ వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. తొట్టంబేడు మండలం దైనేడు గ్రామానికి చెందిన రాగిపాటి వేణుమాధవ్ తండ్రి మరణించడంతో తల్లితో కలిసి నాయుడుపేట సమీపంలోని విన్నమాలలో అమ్మమ్మ వద్దే పదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసైన వేణు మాధవ్(18) మంగళవారం స్నేహితులతో కలిసి ఏర్పేడు మండలంలోని మూలకండ్రిగకు బయలుదేరాడు. మార్గ మధ్యలో ఇలగనూరు వద్ద తెలుగు గంగ కాలువలో ఈత సరదా తీర్చుకునేందుకు స్నేహితులతో కలిసి దిగారు. ఈ క్రమంలో వేణుమాధవ్ నీటి ఉధృతికి కొట్టుకొని పోగా అతడి స్నేహితులు సుమన్, చందు, సుబ్బు ఎలాగోలా ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ఉధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన వేణుమాధవ్ మృతదేహాన్ని కొంతమంది జాలర్లు సమీపంలోనే ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడి బంధువులు వేణు మృతిపై అనుమానాలున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
లైసెన్స్ పట్టు..ఉద్యోగం కొట్టు
● హెవీ లైసెన్స్కు పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ● 32వ బ్యాచ్కు డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పూర్తి ● శిక్షణ ధ్రువపత్రాలు జారీ చేసిన డీఎంతిరుపతి అర్బన్ : జేబులో హెవీ లైసెన్స్ ఉంటే...చేతిలో డ్రైవర్ ఉద్యోగం ఉన్నట్లుగా భావించాలని అలిపిరి డీఎం, అలిపిరి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్ సింగం హరిబాబు పేర్కొన్నారు. అలిపిరి డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 32వ బ్యాచ్కు మంగళవారం డీఎం చేతుల మీదుగా హైవీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్రువపత్రాలను తిరుపతి ఆర్టీవో కార్యాలయంలో సమర్పిస్తే వెంటనే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్స్ అందిస్తారని స్పష్టం చేశారు. జిల్లాలో ఏకై క డ్రైవింగ్ స్కూల్ 2022 ఫిబ్రవరిలో తిరుపతిలోని అలిపిరి ఆర్టీసీ బస్టాండ్లో జిల్లాలోనే ఏకైక డ్రైవింగ్ స్కూల్ ఏర్పా టు చేశారని ప్రిన్సిపల్ వెల్లడించారు. ఒక్కో బ్యాచ్ లో 16 మంది చొప్పున ఇప్పటి వరకు 32 బ్యాచ్ల్లో 512 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్స్ ఇప్పించామని వెల్లడించారు. ఇందులో 50 శాతం మందికి స్థానికంగా విద్యుత్ బస్సులు, ఆర్టీసీ గ్యారేజ్లో, కాల్ డ్రైవర్స్గాను, స్కూల్ బస్సు డ్రైవర్లుగాను ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. సాధారణంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి శిక్షణ తీసుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు. నేటి నుంచి శిక్షణ ప్రారంభం 33వ బ్యాచ్కి బుధవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని ప్రిన్సిపల్ చెప్పారు. 34వ బ్యాచ్కు ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అలిపిరి డిపో అసిస్టెంట్ మేనేజర్ పుష్పలత, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు రాము పాల్గొన్నారు. 24 ఏళ్లు మిలటరీలో పనిచేశా మిలటరీలో 24 ఏళ్లు పనిచేశా. గతేడాది రిటైర్డ్ కావడంతో తిరుపతికి వచ్చా. అయితే అలిపిరి ఆర్టీసీ డిపోలో హెవీ లైసెన్స్ కోసం డ్రైవింగ్ స్కూల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హెవీ లైసెన్స్ ఉంటే చేతిలో ఉద్యోగం ఉన్నట్లు భావించి 32వ బ్యాచ్లో నామమాత్రపు ఖర్చులతో శిక్షణ పూర్తి చేసుకున్నా. – ధనంజయులు, మాజీ సైనికుడు, తిరుపతి నగరంవైఎస్సార్సీపీ సర్కార్ పునాదే... ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2022 మార్చిలో ఒక్కో జిల్లాకు ఒక్కో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ స్కూల్స్ను నామమాత్రపు ఫీజుతో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎంతో మంది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ను సులభంగా పొందుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతో గత సర్కార్ చేసిన మేలును గుర్తుచేసుకుంటున్నారు. -
భూములను సారవంతం చేద్దాం
● విత్తనాల కిట్ ప్రయోజనాలను తెలియజేయండి ● వ్యవసాయాధికారులతో కలెక్టర్ సమీక్ష తిరుపతి అర్బన్ : రసాయనిక ఎరువుల వాడకంతో భూములు నిస్సారంగా తయారు అవుతున్న నేపథ్యంలో పొలాలు సారవంతం చేయడానికి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అగ్రికల్చర్ అధికారులతో సమీక్షించారు. 30 రకాల పంట విత్తనాలతో కొత్తగా మార్కెట్లోకి వస్తున్న కిట్స్ను పంటలు సాగు చేయడానికి 50 రోజుల ముందు చల్లాల్సిన అవసరాన్ని రైతులకు తెలియజేయాలని చెప్పారు. ప్రధానంగా జీలుగ, జనుము , పిల్లిపెసర, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, జొన్నలు, అనప గింజలు, పెసలు, కందులు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, అరికలు, సాములు తదితర 30 రకాల పంట విత్తనాల కిట్స్ను తెప్పించాలని కోరారు. ఇప్పటికే పొదుపు సంఘం సభ్యులు ఇలాంటి కిట్స్ను తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని 774 పంచాయతీల్లో ఒక్కో పంచాయితీకి 25కి పైగా కిట్స్ విక్రయించేలా కృషి చేయాలన్నారు. 50 వేల కిట్స్ను రానున్న ఖరీఫ్ సీజన్కు సిద్ధం చేసుకోవాలని తెలియజేశారు. ఒక్కో కిట్ రూ.1000 చొప్పున రైతులకు విక్రయించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు, ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి, ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి షణ్ముగం కిట్స్తో కలిగే ప్రయోజనాలను వివరించారు. -
వీఐపీ సిఫారసు లేఖల స్వీకరణపై కీలక ప్రకటన: మే 15 నుంచి..
వేసవి సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ ఎక్కువవుతున్న సమయంలో సిఫారసు లేఖల బ్రేక్ దర్శనాలు 2025 మే 1 నుంచి 15 వరకు రద్దు చేస్తూ.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా సిఫారసు లేఖలతో బ్రేక్ దర్శనాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇది ఎల్లుండి (మే 15) నుంచి అమలులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలపై.. మే 15 (గురువారం) నుంచి మళ్ళీ వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు దేవదాయశాఖ మంత్రి పేర్కొన్నారు. -
18న పీఎస్ఎల్వీ సీ–61 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–1బీ)ను ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన సీ–బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ పగలు, రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితలంపై అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను సంగ్రహిస్తుంది. ప్రస్తుతం భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉపగ్రహం భారత సైన్యానికి అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని అందించనుంది. ఇప్పటి దాకా ఉన్న ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్ను అమర్చి పంపిస్తున్నారు. పూర్తిస్థాయి సమాచారం అందిస్తుంది భారత సైన్యానికి కావాల్సిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్ కలిగిన చాయా చిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇందులోనే టెస్ట్ వెహికల్–డీ2 (టీవీ–డీ2) మిషన్ను రోదశిలొకి పంపిస్తున్నారు. అబార్ట్ దృశ్యాలను అనుకరించడానికి, గగన్యాన్ క్రూ ఎస్కేప్ సిస్టంను ప్రదర్శించడానికి దీన్ని రూపొందించారు.ప్రయోగానికి సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్వీ సీ61 ఉపగ్రహ వాహకనౌక -
కుట్టు మిషన్ల నిధుల స్వాహా
● బినామీ పేర్లతో అక్రమాలకు పాల్పడుతున్న కూటమి నేతలు ● మొత్తం 144 ట్రైనింగ్ సెంటర్లకు గాను 25 మాత్రమే ఏర్పాటు ● శిక్షణ ఇవ్వకుండానే మిషన్లు కొట్టేసే యత్నం ● ఒక్కో మహిళ పేరిట రూ.15,700 కాజేసేందుకు సన్నద్ధం ● మండిపడుతున్న బీసీ సంఘాలు ●మోసం చేసింది కూటమి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది. కుట్టు శిక్షణతోపాటు మిషన్కు ఒక్కో బీసీ మహిళకు రూ.23 వేలు కేటాయించాల్సి ఉంది. అయితే శిక్షణకు రూ.3వేలు, మిషన్కు రూ.4300 మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన మొత్తాన్ని కూటమి నేతలు నొక్కేస్తున్నారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. – గీతా యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర నేత తిరుపతి అర్బన్ : జిల్లాలో మొత్తం 144 కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. బీసీ కార్పొరేషన్ కింద ఒక్కో సెంటర్లో 42 మంది నిరుపేద బీసీ మహిళలకు శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తొలి ప్రాధాన్యతగా పొదుపు సంఘంలోని మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది, అయితే ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 25 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగిలిన 119 శిక్షణ కేంద్రాల సంగతి పూర్తిగా మరిచారు. శిక్షణ సమయంలో వసతులను తూతూమంత్రంగా కల్పించారు. నిబంధనలు తుంగలో తొక్కి... కుట్టు శిక్షణ, మిషన్ల పంపిణీలో నిబంధనలను తుంగలో తొక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిక్షణ ఉదయం 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలపాటు ఇవ్వాల్సి ఉంది. వారంలో 6 రోజులు శిక్షణ ఉంటుంది. అలా మొత్తం 45 రోజుల్లో 360 గంటలు శిక్షణ ఇవ్వాలి. తర్వాత కుట్టు మిషన్లు అందించాలి. అయితే కూటమి నేతలు పలువురు బినామీలను రంగంలోకి దించి, అసలు శిక్షణకు రాకుండానే మిషన్లు కాజేసేందుకు యత్నిస్తున్నారని తెలిసింది. కుట్టు శిక్షణతోపాటు మిషన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మూడు విడతల్లో నిధులు విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలోనూ నిబంధలను గాలికి వదిలేసినట్లు సమాచారం. -
● రథోత్సవం.. లక్ష్మీనారసింహం
● తిరుపతిలోని చింతల చేను సమీపంలో ఓ భారీ భవనం నిర్మిస్తున్నారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ నుంచి జీ ప్లస్ త్రీ అనుమతులు తీసుకుని ఏకంగా ఐదు అంతస్తుల భవంతికి శ్రీకారం చుట్టి.. శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇంతలో ప్లానింగ్ సెక్రటరీ పరిశీలనకు వచ్చారు. నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని అల్టిమేటం జారీ చేశారు. మిమ్మల్ని మా సార్ రమ్మంటున్నారు, ఒకసారి ఆఫీస్కి వెళ్లి కలవండి అంటూ సలహా ఇచ్చారు. చేసేది లేక సదరు భవన నిర్మాణదారుడు రెండు రోజుల తర్వాత ప్లానింగ్ ఆఫీసర్ని కలిసి ప్రసన్నం చేసుకున్నాడు. దీంతో అక్రమ నిర్మాణం.. వెంటనే సక్రమం అయిపోయింది. ● స్థానిక కరకంబాడి రోడ్డులోని డీమార్ట్కు ఎదురుగా అనుమతులకు విరుద్ధంగా ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఆ కట్టడానికి సెట్ బ్యాక్ వదలలేదు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఓ అధికారి ఈ అక్రమ నిర్మాణానికి అన్నీ తానై సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భవనానికి సమీపంలోనే ఓ ఇంటి వద్ద నాలుగు అడుగుల ముందుకు రేకులు వేసుకున్నారు. ఈ విషయం గమనించిన స్థానిక ప్లానింగ్ సెక్రటరీ కొంత నగదు డిమాండ్ చేశారు. ఆయన అడిగినంత సొమ్మునుఇవ్వకపోవడంతో కక్షగట్టినట్టు ఇంటి ముందు రేకులను తొలగించి తమ ప్రతాపం చూపించారు. -
ఐడీఎస్తో స్విమ్స్ ఒప్పందం
తిరుపతి తుడా: విశాఖపట్నంకు చెందిన ఐడీఎస్ డేటా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో స్విమ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సోమవారం స్విమ్స్ వీసీ, డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. హాస్పిటల్ పలు అంశాలపై సహాయ సహకారాలను అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ రామ్ తెలియజేశారు. ఎంఓయూ ద్వారా ఉచితంగా స్విమ్స్లో ల్యాబ్ సౌకర్యం, పరిశోధన, ఆవిష్కరణ, విస్తరణకు ఎంతో ఉపయోగకరమన్నారు. హెల్త్ కేర్ మెడికల్ సైన్స్ కోసం, స్విమ్స్ విద్యార్థులు, అధ్యాపకుల డేటాను సమీకరించడానికి, యూజీ, పీజీ పరిశోధన, ఆచరణాత్మక కోర్సుల్లో ల్యాబ్ సౌకర్యాలను వినియోగించడానికి పేషంట్ డేటాను నమోదు చేసే విషయంలో ఆ సంస్థ సహకారం కీలకంగా ఉంటుందన్నారు. అనంతరం ఐడీఎస్ సంస్థ ప్రతినిధులు, స్విమ్స్ అధికారులు ఒప్పందపు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఉపాధ్యక్షులు అరవింద్ ఓరుగంటి, ట్రాయ్ మాజీ కార్యదర్శి వి రఘునందన్, స్విమ్స్ నెట్వర్క్ ఇంజినీర్ ప్రణయ్ తేజ, స్విమ్స్ రిజిస్ట్రార్ అపర్ణ ఆర్ బిట్లా, న్యూక్లియర్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కళావత్, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమేష్ చంద్ర, వైద్యులు పాల్గొన్నారు. -
రగులుతున్న తమ్ముళ్లు!
నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీడీపీ సీనియర్ నేతలు తీవ్రమైన అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తే కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తే అసలు గుర్తింపే లేకుండా పోయిందని వాపోతున్నారు. ఎన్నికల ముందు కండువా కప్పుకున్న వారికే పదవులు కేటాయించడంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నాయకులు తమ స్థాయికి తగని పోస్టులు కట్టబెట్టడంపై కినుక వహిస్తున్నారు. ఇంతకాలం ఎదురుచూసినందుకు ఇంతగా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు గుర్తింపు, గౌరవం రెండూ లేవని కొందరు టీడీపీ నేతలు మధనపడుతున్నారు. మొదటి నుంచి పార్టీ విజయం కోసం పనిచేసిన తమను కాదని ఎన్నికల ముందు చేరిన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతి ముఖ్యమైన తుడా చైర్మన్ పదవిని డాలర్స్ దివాకర్రెడ్డికి, మొన్న డీసీసీబీ చైర్మన్ పోస్టును అమాస రాజశేఖరరెడ్డికి ఇవ్వడంతో నామినేటెడ్ పదవులన్నీ దాదాపు భర్తీ పూర్తయినట్లేనని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ రెండు పదవులు తమకే వస్తాయని ఆశగా ఎదురుచూసిన టీడీపీ సీనియర్ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక నామినేటెడ్ పదవుల్లో ఆశించేందుకు ఏమీ లేకుండా పోయినట్లేనని ఆగ్రహంగా ఉన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో టీడీపీలో అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు. అలాగే టీడీపీ కోసం తెరవెనుక నుంచి పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. వారంతా ముందుగా టీటీడీ పాలకమండలి సభ్యత్వం కోసం పోటీపడ్డారు. అలా ఆశించిన వారిలో జిల్లాకు చెందిన టీడీపీ నేతలెవరికీ టీటీడీ పాలకమండలిలో చోటు దక్కలేదు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ పోస్టును ఎగరేసుకుపోయారు. ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీనే నమ్ముకునిఏళ్లుగా ఎదురుచూస్తున్న వారందరికీ భంగపాటు తప్పలేదు. చిత్తూరు జిల్లాలోనూ.. చిత్తూరు జిల్లా పరిధిలోని కుప్పం, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో పదుల సంఖ్యలో ఉన్న టీడీపీ నాయకులందరికీ కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. డీసీసీబీ చైరర్మన్ పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చాలా నమ్మకంగా ఉన్నారు. జిల్లాలో సీనియర్ నాయకుల్లో ప్రథముడు. టీడీపీనే నమ్ముకుని ఉన్నారు. అయితే దొరబాబుని కాదని, అమాస రాజశేఖరరెడ్డికి చైర్మన్ గిరీ కట్టబెట్టారు. ఆయన గతంలో డీసీసీబీ చైర్మన్గా ఉన్న సమయంలో అడ్డగోలుగా కుప్పం నియోజక వర్గానికి నిధులు కేటాయించారే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు, లోకేష్ మళ్లీ అమాసకే డీసీసీబీని కట్టబెట్టారు. అమాస కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినట్లు కూడా పెద్దగా ప్రచారం లేదు. అదే విధంగా టీడీపీ కోసం పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో మిగిలింది కాణిపాకం, బోయకొండ పాలకమండళ్లు మాత్రమే. ఆయా బోర్డుల చైర్మన్, సభ్యత్వం కోసం అనేక మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అందులోనైనా న్యాయం జరుగుతుందా? లేదా? అని పలువురు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల పందేరంపై అసంతృప్తి గుర్తింపు.. గౌరవం లేదని సీనియర్ నేతల ఆవేదన ప్రాధాన్యం లేని పోస్టులు కట్టబెట్టడంపై మండిపాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలుసీనియర్లందరికీ అవమానం తిరుపతికి చెందిన ఎన్టీఆర్ రాజు కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఈ సారి కూడా ఆ కుటుంబానికి దక్కలేదు. తిరుపతిలో టీడీపీ అంటే గుర్తొచ్చే నాయకుల్లో ముందు వరుసలో ఉండేది నరసింహయాదవ్. టీడీపీ సీనియర్ నేతగా పచ్చ చొక్కా తప్ప మరొకటి ధరించని నరసింహయాదవ్ మరో పర్యాయం తుడా చైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఆయనకు ప్రాధాన్యం లేని పదవిని కట్టబెట్టి తీవ్రంగా అవమానించారు. టీడీపీలో మరో నేత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఆమె ఎమ్మెల్సీ లేదా టీటీడీ పాలకమండలి సభ్యత్వం, అది కూడా కాకుంటే తుడా చైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఈ మూడింటిలో ఏదీ దక్కలేదు. అస్సలు ఎలాంటి ప్రాధాన్యత లేని, ఆ పదవి ఒకటి ఉందనే విషయం తెలియని గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు, ఆమె అనుచరులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తిరుపతి జిల్లాలో అతిముఖ్యమైన తుడా చైర్మన్ పదవిని రియల్ ఎస్టేట్ వ్యాపారికి కట్టబెట్టడంపై టీడీపీలోని అనేక మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దివాకర్రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, అందుకు సంబంధించిన వివరాలతో అమరావతికి లేఖ పంపినట్లు తెలిసింది. పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తున్నా తమను గుర్తించలేదంటూ కొందరు నాయకులు అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అదే విధంగా శాప్ చైర్మన్ రవినాయుడుపైనా కొందరు టీడీపీ నేతలు అమరావతికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తిరుపతి జిల్లాలో మిగిలిన శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి కోసం పలువురు టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. -
అతీగతీ లేక తగ్గిన వినతులు
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఉన్నతాధికారులకు అందించిన వినతులకే అతీగతీ లేకుండా పోతోందని అర్జీదారుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకే కలెక్టరేట్ గ్రీవెన్స్కు వచ్చే అర్జీదారుల సంఖ్యల తగ్గిపోతోంది. వ్యయప్రయాసలకోర్చి వచ్చి వినతులు సమర్పిస్తే ఎలాంటి ఫలితం ఉండడం లేదనే భావన ప్రజల్లో రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కేవలం 238 అర్జీలే వచ్చాయి. ఇది వరకు కలెక్టర్తోపాటు ఇతర అధికారులను కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు అర్జీదారులు బారులు తీరేవారు. ఈ గ్రీవెన్స్లో ఆ పరిస్థితి కనిపించలేదు. కలెక్టర్తోపాటు జేసీ, డీఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు హాజరైనప్పటికీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉన్నప్పటికీ జనం పలుచగానే కనిపించారు. ఈ క్రమంలోనే ప్రజా సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులు చిత్తశుద్ధితో ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా వినతులను సత్వరం పరిష్కరించాలని సూచిస్తున్నారు. -
దివ్యాంగులకు ల్యాప్టాప్ల పంపిణీ
తిరుపతి అర్బన్: దివ్యాంగులకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు చేతుల మీదుగా నిర్వహించారు. జిల్లాలో వేలాదిమంది దివ్యాంగుల్లో డిగ్రీ చదువుతున్న 24 మందికి ల్యాప్టాప్లు ఇంటర్మీడియట్ చదువుకున్న 24 మందికి స్మార్ట్ ఫోన్లు అందించారు. దివ్యాంగుల వెల్ఫేర్ స్కీమ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వై.శ్రీనివాసులు, సీఆర్అండ్ఎమ్ ఓజీకే రాజశేఖర్ వెల్లడించారు. ఒక్కో ల్యాప్టాప్ విలువ రూ.42వేలు, ఒక్కో స్మార్ట్ ఫోన్ విలువ రూ.16వేలుగా పేర్కొన్నారు. విద్యుత్ పథకాలపై సమీక్ష తిరుపతి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ పథకాల అమలుపై కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించారు. సోమవారం కలెక్టరేట్లో విద్యుత్శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ వ్యవసాయం రంగంలో విద్యుత్ నష్టాలను తగ్గించడమే ఆర్డీఎస్ఎస్ పథకం లక్ష్యమన్నారు. జిల్లాలో 11 కేవీ అగ్రికల్చర్ ఫీడర్స్ ఉన్నాయని తెలిపారు. అందులో గృహ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన సర్వీసులను స్పష్టంగా విభజన చేయాలని సూచించారు. జిల్లాలో6213 వ్యవసాయ పంపు సెట్లకి 142 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పీఎం కుసుం ద్వారా 28 మెగా వాట్స్ సోలార్ ప్యానెన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రైతులకు పగటిపూట విద్యుత్ను సరఫరా చేయడం కోసం పీఎం కుసుం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. సమావేశంలో విద్యుత్శాఖ ఎస్ఈ సురేంద్రనాయుడు, ఈఈలు వాసవి, లత, బాలాజీ పాల్గొన్నారు. నర్సింగ్ వృత్తి మహోన్నతంతిరుపతి తుడా : వైద్యరంగంలో నర్సింగ్ వృత్తి మహోన్నతమైనదని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని సోమవారం స్విమ్స్ ఆస్పత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ స్వచ్ఛంద సేవకురాలిగా సమాజానికి నర్సింగ్ సేవలందించి వృత్తికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టారని కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని నర్సులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రోగులకు సేవలందించాలని సూచించారు. కరోనా కాలంలో స్విమ్స్లో నర్సులు అందించిన సేవలను వెలకట్టలేమని కొనియాడారు. కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, కాలేజీ అఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, ఫార్మా కాలేజీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావు, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రమ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ కాంతమ్మ, హెడ్ నర్స్ సునీత, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి శ్రీకాళహస్తి: ఫూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి సోమవారం శ్రీకాళహస్తీశ్వరాలయం సమీపంలో మృతి చెందాడు. సత్యవేడు మండలం పాలగుంట గ్రామానికి చెందిన రాధాకృష్ణ(41) శ్రీకాళహస్తీశ్వరాలయం వద్దకు వచ్చాడు. పూటుగా మద్యం తాగి మత్తులో నాలుగో గేటు సమీపంలో ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం వద్ద నిద్రించాడు. గొంతెండడంతో నిద్రలోనే మృతిచెందాడు. భక్తులు గుర్తించి వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేసిన సీఐ గోపి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,423 మంది స్వామివారిని దర్శించుకోగా 29,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.4 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.వైఎస్సార్సీపీ నేత ఇంట్లో చోరీ– 80 గ్రాముల బంగారు నగల అపహరణతిరుపతి రూరల్ (తిరుచానూరు) : తిరుపతి రూరల్ మండలం మల్లంగుంటలోని వైఎస్సార్సీపీ నేత చొక్కారెడ్డి జగదీశ్వరరెడ్డి ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు.. జగదీశ్వర్రెడ్డి హైదరాబాదులో నివాసముంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంతో పిల్లలను మల్లంగుంటలోని ఇంటిలో ఉంటున్న తన తల్లి నరేంద్రకుమారి వద్దకు పంపించారు. పైఅంతస్తులోని పడకగదిలో పిల్లలు పడుకోగా, కింద ఓ గదిలో నరేంద్రకుమారి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు గుట్టుచప్పుడు కాకుండా బీరువా తెరిచి బంగారు ఆభరణాలు అపహరించారు. సోమవారం ఉదయం నరేంద్రకుమారి నిద్రలేచి చూడగా బీరువా ముందు దుస్తులు చిందరవందరగా పడునానయి. లోపల దాచిన 80 గ్రాముల బంగారు నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి రూరల్ పోలీసులు, వేలిముద్రల నిపుణులు ఆ ఇంటికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బదిలీల కోసం టీచర్ల నిరసన
తిరుపతి అర్బన్ : ఉపాధ్యాయులకు బదిలీలతోపాటు ఉద్యోగోన్నతులు కల్పించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు డీజే రాజశేఖర్, ముత్యాల రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్ వద్ద టీచర్లతో కలిసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ 117 జీవోను రద్దు చేయాలని కోరారు. ప్రాధమిక పాఠశాలల్లో 1ః20 నిష్పత్తిలో ఉపాధ్యాయుల నియామకాలు ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణకు వినతిపత్రం సమర్పించారు. యూటీఎఫ్ నేతలు దండు రామచంద్రయ్య, కుమారస్వామి, గీతమ్మ, మోహన్ బాబు, సూర్య ప్రకాష్, బండి మధుసూదన్రెడ్డి, సురేష్, మస్తానయ్య, పద్మజ, హేమంబరధరరావు, ఆదినారాయణ, గోవర్ధన రెడ్డి పాల్గొన్నారు. -
అర్హులకు అవకాశం లేదు
నిజమైన పేదలకు అర్హులైన వారికి అవకాశం ఇవ్వలేదు. కుట్టుమిషన్ల ఇవ్వడం ద్వారా వారి కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని ఈ స్కీమ్ ఏర్పాటు చేశారు. అయితే కూటమి నేతలు ఎవరి పేరు సిఫార్సు చేస్తే వారి పేర్లు మాత్రమే నమోదు చేసుకున్నారు. మరోవైపు కుట్టుమిషన్లలోను అవినీతికి పాల్పడ్డారంటేనే తెలుస్తోంది కూటమి నేతల చిత్తశుద్ధి. – విజయలక్ష్మి, తిరుపతి ఫిర్యాదు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా కుట్టుమిషన్ల విషయంలో అవినీతి జరిగింది. 60శాతం నిధులు కొట్టేస్తున్నారు. దీనిపై డీఆర్ఓ నరసింహులుకు ఫిర్యాదు చేశాం. బీసీ మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కూటమి నేతలకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగంగానే ఈ అంశంపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. – పుల్లయ్య బీసీ సంఘం రాష్ట్ర నేత త్వరలోనే అన్ని సెంటర్లు కుట్టు శిక్షణకు సంబంధించి జిల్లావ్యాప్తంగా త్వరలోనే అన్ని సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తాం. 144 సెంటర్లకు ప్రస్తుతం 25 సెంటర్లలో శిక్షణ ఇస్తున్నాం. అర్హులైన వారినే ఎంపిక చేశాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాం. లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకుని అందరికీ న్యాయం చేస్తాం. – శ్రీదేవి, ఈడీ, బీసీ కార్పొరేషన్ -
బాల సదనం నిర్వహణకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : సూళ్లూరుపేటలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చెందిన బాలసదనం నిర్వహించేందుకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ వసంత బాయి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నిబందనల మేరకు సదనం నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు స్వచ్ఛంధ సేవా సంస్థలు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ప్రత్యేక అవసరాలు గల బాలల సంరక్షణలో అనుభవం ఉన్న స్వచ్ఛంధ సంస్థలు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో పాటు మూడేళ్ల ఆడిట్ నివేదికలను కలెక్టరేట్లోని బి–బ్లాక్ రూమ్ నెంబర్ 505, 506లో ఈ నెల 24 సాయంత్రం 5 గంటల లోపు అందించాలని సూచించారు. ఎస్వీయూ విద్యార్థికి అరుదైన అవకాశం తిరుపతి సిటీ : ఎస్వీయూ ఫిజిక్స్ విభాగంలో పీజీ పూర్తి చేసిన సీహెచ్ బ్రహ్మారెడ్డి అనే విద్యా ర్థికి విదేశాల్లో పరిశోధనలు చేసే అరుదైన అవకాశం లభించింది. ఇందుకోసం ప్రతి నెలా రూ.లక్ష స్కాలర్షిప్ సైతం అందించనున్నారు. ఈ మేరకు బ్రహ్మారెడ్డి సౌత్కొరియాలోని పూసన్ నేషనల్ యూనివర్సిటీలోని కెమికల్ మెటీరియల్స్ విభాగంలో పరిశోధనలు చేయనున్నారు. సోమవారం ఈ సందర్భంగా విద్యార్థిని ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు, ఫిజిక్స్ హెడ్ ప్రొఫెసర్ దేవప్రసాదరాజు అభినందించారు. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ పూసన్ వర్సిటీలో పీహెచ్డీ చేసేందుకు అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. ఫిజిక్స్ హెడ్ దేవప్రసాద్రాజు సహకారంతోనే పరిశోధనకు ఎంపికై నట్లు వెల్లడించారు. రూ.లక్ష ఉపకార వేతనంతో డివైజ్ ఫ్యాభ్రికేషన్స్లో ఓఎల్ఈడీ, ఆఫ్టో ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అనే అంశపై నాలుగేళ్ల పాటు పరిశోధనలు చేయనున్నట్లు వివరించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు. ప్రథమ సంవత్సర పరీక్షకు మొత్తం 7427మంది విద్యార్థులకు గాను 6,979 మంది హాజరయ్యారు. సెకండియర్ పరీక్షకు 848మందికి గాను 770 మంది హాజరైనట్లు ఆర్ఐఓ జీవీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చంద్రగిరి:పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై అగరాల సమీపంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. అగరాల పంచాయతీ వినాయక నగర్కు చెందిన కేశవులు(55) బహిర్భూమికి వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విశ్వంలో అవగాహన సదస్సు రేపుతిరుపతి ఎడ్యుకేషన్:తిరుపతి వరదరాజనగర్లో ని విశ్వం విద్యాసంస్థలో బుధవారం ఉద యం 10గంటలకు సైనిక్, నవోదయ, మిలిటరీ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సోమవారం ఈ మేరకు విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ అవగాహన సదస్సుకు 4 నుంచి 9వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనవచ్చని తెలిపారు. వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.విద్యుదాఘాతంతో వ్యక్తి మృతితిరుపతి : తిరుపతి నగరంలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. వీఆర్ఎల్ ట్రాన్స్పోర్టుకు చెందిన లారీ అన్లోడింగ్ పూర్తయిన తర్వాత పార్కింగ్ చేస్తుండగా వాహనం పై భాగంగా విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగిలి ఐరాల మండలం మద్దిపట్టవారిపల్లెకు చెందిన లారీ డ్రైవర్ ఈశ్వర్(50) అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి అర్బన్: వెంకటగిరిలో ఈ నెల 15న నిర్వహిస్తున్న జాబ్మేళా పోస్టర్ను కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్ఓ నరసింహులు సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. మేళాకు పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. 5వ తరగతి నుంచి పీజీ వరకు అర్హులన్నారు. అదనపు సమాచారం కోసం 7013509543, 9491458910, 9988853335 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం, జిల్లా సచివాలయాల అధికారి జగదీష్ పాల్గొన్నారు. -
తిరుపతిలో జోరుగా అక్రమ నిర్మాణాలు
● నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలు ● ఇదే అదునుగా రెచ్చిపోతున్న లంచావతారులు ● కాసులిస్తే ఇష్టారాజ్యంగా అనుమతులు ● చేయి తడపకుంటే తప్పని అడ్డగింతలు ● పర్యవేక్షణను గాలికి వదిలేసిన ఉన్నతాధికారులు తిరుపతి తుడా : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. నగరంలో గడిచిన మూడు నెలల్లోనే 600 మందికి పైగా భవన నిర్మాణదారులకు ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ భవనాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్లానింగ్ సెక్రటరీలు రంగలోకి దిగేశారు. నోటీసులు జారీచేసిన భవనాల వద్దకు వెళ్లి ఎక్కడికక్కడ పనులు నిలిపే వేయాలని హుకుం జారీ చేశారు. ఒకసారి ఆఫీసుకు వెళ్లి మా సార్ ను కలవండి .. మీరు ఏదైనా మాట్లాడుకోవాలి అంటే అక్కడే మాట్లాడుకోండి. అప్పటివరకు పనులు చేయొద్దు అంటూ భవన యజమానులను ఆదేశించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో భవన యజమానులు గడిచిన మూడు నెలలుగా ప్లానింగ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భవనాల డిమాండ్ మేరకు కాసులు ఇచ్చుకున్న వారికి అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వారి నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారు. కొంతమంది భవన యజమానులు రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకుని, అధికారులకు కూడా కాస్త మామూళ్లు చదివించుకుని పనులు సాగిస్తున్నారు. ఈ అవినీతి తంతు తెలియని మరి కొందరు యజమానులు ఇప్పటికీ పనులు చేసుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి పనికీ డబ్బులతో ముడిపెడుతుండడంతో భవన నిర్మాణాల చేపట్టాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అడిగినంత ఇవ్వకుంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపుతూ భవన యజమానులను ఇబ్బందులు పెడుతున్నారు. తమకు సహకరిస్తే ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు అని టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మొహమాటంగా చెబుతున్నారు.తిరుపతి నగరంలో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా వందలాది భవనాలు నిర్మిస్తూనే ఉన్నారు. రూ.లక్షలు ముట్టజెపుతున్న వారికి మాత్రం అధికారులు కొమ్ముకాస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారి నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల కట్టడాలను పడగొట్టేస్తున్నారు. అయితే కాసులిస్తే మాత్రం అక్రమ నిర్మాణాలను సైతం సక్రమమే అంటూ పచ్చజెండా ఊపేస్తున్నారు. స్వయంగా పర్యవేక్షిస్తూ భవనాల పనులు పూర్తి చేయించేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కార్పొరేషన్ ఉన్నతాధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా పైసల కోసం ప్లానింగ్ అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి 4 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,423 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.40 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వస్తే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
విలువలే వెంగమాంబ రచనలు
తిరుపతి కల్చరల్ : తరిగొండ వెంగమాంబ రచనల్లో భక్తి, నైతిక విలువలే కనిపిస్తాయని కడప యోగి వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు నల్లపరెడ్డి ఈశ్వర్రెడ్డి కొనియాడారు. కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతోత్సవాల సందర్భంగా ఆదివారం తిరుపతి అన్నమాచాచ్య కళామందిరంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ ధ్యానం చేసే వారికన్నా ధాన్యం తయారు చేసే వారే గొప్పని తెలిపారు. అనంతరం వెంగమాంబ రచించిన నృసింహ శతకం వైశిష్ట్యంపై ఉపన్యసించారు. . ప్రతి మనిషిలో దయ, శక్తి, నిజం మాట్లాడే స్వభావం ఉంటే, దేవుడు అందరిలో కనిపిస్తారనే భావన వెంగమాంబ రచనల్లో దర్శనమిస్తుందన్నారు. పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ వి.కృష్ణవేణి మాట్లాడుతూ తిరుమలలో జీవ సమాధి కేవలం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారికే ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు ప్రదర్శించిన సంగీత కచేరి, హరికథ గానం భక్తులను ఆకట్టుకుంది. అంతకు ముందు తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో శ్వేత ఇన్చార్జి సంచాలకుడు కె.రాజగోపాలరావు, తిరుపతి కేంద్రీయ విద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ మునిగోటి వేణుగోపాల్, డాక్టర్ సంగీతం కేశవులు, ఏఈఓ శ్రీదేవి పాల్గొన్నారు. -
● శ్రీహరి బస్టాండ్ను పడగొట్టాలని నివేదిక సమర్పించిన నిపుణులు ● అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం ● కూలగొట్టేందుకు రూ.18లక్షలు కేటాయింపు ● టెండర్లు ఆహ్వానించిన ఆర్టీసీ అధికారులు
తిరుపతి అర్బన్ : తిరుపతిలోని శ్రీహరి బస్టాండ్ను కూల్చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఇటీవల బస్టాండ్ స్థితిగతులను ఇంజినీరింగ్ నిపుణులు పరిశీలించి నివేదిక సైతం సమర్పించారు. ఈ క్రమంలో కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వం సైతం అనుమతులు మంజూరు చేసింది. ఇందుకోసం రూ.18లక్షలు వెచ్చించాలని ఆదేశించింది. దీంతో ఆర్టీసీ అధికారులు టెండర్లు సైతం ఆహ్వానించారు. ఆదివారం దీ మేరకు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్రనాయుడు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ వరకు టెండర్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. 31వ తేదీలోపు టెండర్లు ఖరారు చేస్తామని, జూన్ మొదటి వారానికి కూల్చివేత పనులు పూర్తి చేయనున్నట్లు వివరించారు. అనంతరం రూ.45లక్షలతో తాత్కాలికంగా రేకులతో నిర్మాణాలు చేపడతామని తెలిపారు. మల్టీ మోడల్కు కలేనా? తిరుపతి బస్టాండ్కు నిత్యం 1.10లక్షల నుంచి 1.20 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రెండేళ్ల క్రితం మల్టీ మోడల్ బస్టాండ్ పేరుతో రూ.500కోట్లు వెచ్చించి 11 అంతస్తులతో ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఆ మేరకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని అనుమతులు పొందారు. వాస్తవానికి గత ఏడాది ఆగస్టులో మల్టీ మోడల్ బస్టాండ్ పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఈ పనులను గాలికివదిలేశారు. ఏడు దశాబ్దాల చరిత్ర తిరుపతిలోని శ్రీహరి బస్టాండ్కు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది.ప్రస్తుతం ఈ బస్టాండ్ భవనం ఇప్పుడు పూర్తిగా దెబ్బతింది. వర్షం వస్తే శ్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఏ క్షణం అయినా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తొలగించాలని నిర్ణయించారు. సుమారు 70 ఏళ్ల కిత్రం 13 ఎకరాల స్థలంలో బస్టాండ్ ఏర్పాటు చేశారు. అందులో తొలిసారిగా శ్రీహరి పేరుతో 18 ప్లాట్ఫామ్లతో బస్టాండ్ నిర్మించారు. అనంతరం ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదే ప్రాంగణంలో శ్రీనివాస, ఏడుకొండలు, పల్లెవెలుగు పేరుతో మరో మూడు బస్టాండ్లు ఏర్పాటు చేశారు. దశలవారీగా పనులు తిరుపతి శ్రీహరి బస్టాండ్లో ప్రస్తుతం 18 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దశలవారీగా ఈ బస్టాండ్ను పడగొట్టనున్నారు. తొలి విడతలో అత్యంత ప్రమాదస్థితిలో ఉన్న మొదటి 6 ప్లాట్ఫామ్ను కూల్చివేయనున్నారు. రెండో దశలో 12వ ప్లాట్ఫామ్ వరకు, 3 దశలో 18వ ప్లాట్ఫామ్ వరకు కూల్చివేత పనులు చేపట్టనున్నారు. -
పట్టుదలతో శ్రమిస్తేనే భవిత
తిరుపతి ఎడ్యుకేషన్ : పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తేనే బంగారు భవిత సాధ్యమని సివిల్స్ విజేత పామూరి సురేష్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్లో గీతా గోవిందం సేవా సమితి ఆధ్వర్యంలో పది పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సురేష్ మాట్లాడుతూ ఆసక్తికి అనుగుణంగా లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో గీతాగోవిందం సేవా సమితి అధ్యక్షుడు దామోదర్రావు, కార్యదర్శి వరదరాజులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న కారు
– ఇద్దరికి తీవ్ర గాయాలు చంద్రగిరి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి పనపాకం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన సహదేవ్, అల్తాఫ్ పలమనేరు నుంచి తిరుపతి వైపుగా బుల్లెట్ వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన మురళి తిరుపతి నుంచి చిత్తూరు వైపుగా కారులో వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న వాహనాన్ని అదిగమించబోయి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సహదేవ్తో పాటు అల్తాఫ్ తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చికిత్సపొందుతూ మహిళ మృతి తిరుపతి రూరల్ : అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతున్న మహిళ ఆదివారం మృతి చెందింది. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం పైడిపల్లెకి చెందిన ఆనందమ్మ (65) ఈనెల 9వ తేదీన దీపం తగిలి చీరకు నిప్పు అంటుకోవడంతో గాయపడింది. రుయా ఆస్పత్రిలో రెండురోజులుగా చికిత్సపొందుతూ మరణించింది. మృతురాలి కుమారుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షేక్షావల్లీ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబీకులకు అప్పగించినట్లువ వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చిట్టమూరు : నాయుడుపేట– మల్లా రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. కోట మండలం జరుగుమల్లికి చెందిన ఉదయగిరి సుధీర్(24) నాయుడుపేట మండలం మేనకూరు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కోటలో తన స్నేహితుడి పెళ్లికి వెళ్లేందుకు మరో మిత్రుడు శివతో కలిసి బైక్పై బయదేరాడు. మార్గం మధ్యలో చిట్టమూరు మండలం కొత్తగుంట వద్ద ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో సుధీర్ అక్కడికక్కడే మరణించాడు. శివ తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ చిన్న బలరామయ్య వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని నాయుడుపేట ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుయుక్తులతో కూటమి కుమ్మక్కు!
● ఎట్టకేలకు ముక్కంటి ఆలయ పార్కింగ్ టెండర్ కై వసం ● ప్రశ్నార్థకంగానే శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి వాటా శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ పార్కింగ్ టెండర్ను కూటమి నేతలు కుమ్మకై ్క దక్కించుకున్నారు. దేవదాయశాఖ అంచనాల మేరకు బిడ్ రావడంతో కారు పార్కింగ్ టెండర్ ఖరారైంది. అయితే కూటమి నేతలు దౌర్జన్యంతో వేరే వారు ఎవరూ టెండర్ వేయకుండా భయబ్రాంతులకు గురిచేశారు. తక్కువగా కొట్టేయాలని.. గతంలో సుమారు కారు పార్కింగ్ టెండర్ రూ.కోటి వరకు ఉండేది. అప్పట్లో ఎన్నికల కోడ్ రావడంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన నేతలు ఎలాగైనా తక్కువకే టెండర్ కొట్టేయాలని యత్నించారు. టెండర్ వేయడానికి ఎవరూ వేయకూడదని హుకుం జారీ చేశారు. తక్కువకు కోట్ చేసి టెండర్ దక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆలయం ఏడాదిగా పార్కింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సుమారు రూ.2కోట్ల వరకు రాబడి వచ్చింది. ఇందుకోసం 30మంది ఆలయ ఉద్యోగులకు జీతభత్యాలు పోగా సుమారు రూ.1.50 కోట్ల వరకు ఆదాయం మిగిలింది. దీంతో రూ.1.5 కోట్లకు పైగా బిడ్ ఉంటేనే టెండర్ ఆమోదం తెలుపుతామని దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గత్యంతరం లేక కూటమి నేతలు యహిత అసోసియేట్స్, ఎస్టీ అసోసియేట్స్ అనే రెండు సంస్థల పేరుతో బిడ్లు వేశారు. చివరకు ఎస్టీ అసోసియేట్స్ రూ.1.59కోట్లకు టెండర్ దక్కించుకుంది. ఎక్కడ పడితే అక్కడే.. స్వర్ణముఖి నది, గాలిగోపురం, శివయ్యగోపురం ఇలా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్చేస్తున్నారు. అలాగే నాలుగో గేట్ నుంచి ఒకటో గేట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కార్పెట్పై సైతం వాహనాలు నిలిపేస్తున్నారు. దీనిపై పార్కింగ్ నిర్వాహకులు దృష్టి సారించాల్సిన అవసరముందని భక్తులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే వాహనాలకు సరైన పార్కింగ్ చూపకుండా డబ్బులు వసూలు చేయడం వంటి అక్రమాలకు చోటు ఇవ్వవద్దని సూచిస్తున్నారు. మున్సిపాలిటీకి మొండిచెయ్యేనా? శ్రీకాళహస్తి ఆలయానికి పార్కింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో మున్సిపాలిటీకి వాటా ఇవ్వాల్సి ఉంది. గతంలో సుమారు 30శాతం వాటాను పురపాలక సంఘానికి అందించేవారు. 201718లో ఆ వాటాను నిలిపివేశారు. దీంతో ఇప్పటి వరకు సుమారు రూ.2కోట్ల వరకు మున్సిపాలిటీకి రావాల్సి ఉంది. అలాగే స్కిట్ కళాశాలకు సంబంధించి మరో రూ.2కోట్ల బకాయి ఉంది. అసలే శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుత పరిస్థితిలో ముక్కంటి ఆలయం ద్వారా రూ.4కోట్లు బకాయిలు విడుదల చేస్తే పట్టణాభివృద్ధికి ఉపయోగపడుతుందని స్థానికులు కోరుతున్నారు. అయితే పాలకులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పురపాలక కమిషనర్ గిరికుమార్ మాట్లాడుతూ పార్కింగ్కు సంబంధించి ఆలయం ద్వారా రావాల్సిన బకాయిలను ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఆలయ, దేవదాయశాఖ అధికారులకు విన్నవించినట్లు వెల్లడించారు. లోపాయికారీ ఒప్పందం పార్కింగ్ టెండర్ ఎవరికి వచ్చినా ఇరు పార్టీలవారు పంచుకోవాలని టీడీపీ, జనసేన నేతలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జనసేన తరుఫున యహిత రూ.1.55 కోట్లకు టెండర్ దాఖలు చేసినట్లు తెలిసింది. అయితే మరో రూ.4లక్షలు అదనంగా ఎస్టీ అసోసియేట్స్ రూ.1.59 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ఇక పార్కింగ్ సొమ్మును ఇరు పార్టీ వారు పంచుకుంటారా.. లేక వివాదాలకు దిగుతారో వేచిచూడాల్సిందే. -
గోనుపల్లి వద్ద ఘోరం!
● బోల్తా పడిన ట్రక్కు ఆటో ● పలువురికి గాయాలు రాపూరు: మండలంలోని గోనుపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. పది మందికిపైగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల కథనం.. అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలం, పెరింపాడు గ్రామానికి చెందిన కుటుంబీకులు సుమారు 23 మంది రాపూరు మండలం, పెంచలకోనలో జరిగే బ్రహ్మోత్సవాలకు ట్రక్కు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి ట్రక్కు ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న పెరింపాడుకు చెందిన శివయ్య, రాధమ్మ, నారాయణమ్మకు తీవ్ర గాయాలు కాగా.. మరో పది మందికిపైగా స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది, పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. -
టీటీడీలో డెప్యూటీ ఈఓల బదిలీ
తిరుమల: టీటీడీ డెప్యూటీ ఈఓలను బదిలీ చేస్తూ సంబంధిత ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తిరుమల రిసెప్షన్–2 డిప్యూటీ ఈఓ హరేందర్నాథ్ను తిరుచానూరుకు బదిలీ చేయగా.. అక్కడ ఇన్చార్జిగా పనిచేస్తున్న గోవిందరాజను పూర్తి స్థాయిలో హెచ్ఆర్ డిప్యూటీ ఈఓగా కొనసాగనున్నారు. తిరుమల రిసెప్షన్ డిప్యూటీ ఈవో–1 గా ఉన్న భాస్కర్కు రిసెప్షన్ టూ డిప్యూటీ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం నుంచి తిరుమల ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్న మల్లికార్జునరావును తిరిగి మాతృ సంస్థకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సీనియారిటీ జాబితాను పరిశీలించుకోండిచిత్తూరు కలెక్టరేట్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్లు ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలను పరిశీలించుకోవాలని డీఈఓ వరలక్ష్మి తెలిపా రు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎస్జీటీ క్యాడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి గ్రేడ్– 2 హెచ్ఎం ఉద్యో గోన్నతులు త్వరలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా సీనియారిటీ జాబితాలు విడుదల చేశామన్నారు. టీచర్ల నుంచి అందిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ప్రస్తుతం మరో సారి సీనియారిటీ జాబితాను విడుదల చేశామన్నారు. ఈ జాబితాలను www.chittoordeo.com వెబ్సైట్లో పరిశీలించుకోవాలని డీఈఓ తెలిపారు. -
నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరించనున్నారు. గ్రీవెన్స్కు అన్నిశాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.వేదనారాయణుని సేవలో న్యాయమూర్తినాగలాపురం: వేదవళ్లీ సమేత శ్రీవేదనారాయణ స్వామి వారిని ఆదివారం తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి జి.అర్చన సేవించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారి చెంగల్రాయులు, ప్రధాన అర్చకుడు నాగరాజు భట్టాచార్యులు, ఎస్ఐ సునీల్ పాల్గొన్నారు.పీజీ కోర్సులకు దరఖాస్తుల వెల్లువతిరుపతి సిటీ : ఎస్వీయూ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ పీజీసెట్–2025 దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగిసింది. అపరాధ రుసుముతో ఈనెల 25వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 153 కోర్సులలో సుమారు 25వేల సీట్లు ఉండగా ఇప్పటి వరకు 24,900 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది పీజీ సెట్కు 32వేలకు పైగా దరఖాస్తులు రాగా ఈఏడాది 7వేలు తగ్గడం గమనార్హం. దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి పీజీ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.జూన్ 9 నుంచి పరీక్షలుజూన్ 9 నుంచి 13వ తేదీ వరకు ఏపీ పీజీసెట్– 2025 నిర్వహించనున్నట్లు ఎస్వీయూ వీసీ అప్పారావు, కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశర్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
తుడా చైర్మన్గా దివాకర్రెడ్డి
తిరుపతి తుడా: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్గా డాలర్స్ దివాకర్రెడ్డి పేరును ప్ర భుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 నా మినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా పరిధిలో నలుగురికి చోటు లభించింది. ఆశావహులకు భంగపాటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు మబ్బుదేవనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి శంకర్రెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆశీస్సులతో బడి సుధాయాదవ్, నగిరి నియోజకవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తుడా చైర్మన్ కోసం పోటీ పడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం చివరి వరకు పైరవీలు చేశారు. అనేక మంది ఆశావహులు పోటీపడి భంగపడ్డారు. చివరికి మంత్రి లోకేష్ ఆశీస్సులతో దివాకర్ రెడ్డికే తుడా చైర్మన్గిరి దక్కింది. నామినేటెడ్ పదవులు ప్రకటించడంతో తిరుపతిలోని టీడీపీ ముఖ్యనేతలంతా అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్తిలో సీనియర్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నాలుగు నామినేటెడ్ పదవులను ప్రకటించారు. ఇందులో తుడా చైర్మన్ సహా మిగిలిన పోస్టుల భర్తీ పై అసంతృప్తి సెగలు వ్యక్తమవుతున్నాయి. తమకు పనికిరాని పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు. ఈ పదవులు నాలుక మీద గీసుకునేందుకు కూడా పనికిరావని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పార్టీ అధిష్టానం పై రగిలిపోతున్నారు. నామినేటెడ్ పదవుల్లో పలువురికి చోటు చిత్తూరు అర్బన్: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కూటమి నాయకులకు పదవులు వరించాయి. ఇందులో రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా కుప్పంకు చెందిన రాజశేఖర్, రాష్ట్ర గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికి చెందిన సుగుణమ్మ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తిరుపతికి చెందిన దివాకర్ను, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికి చెందిన పసుపులేటి హరిప్రసాద్ను నియమించింది. -
ఇష్టారాజ్యంగా మింగేస్తున్నారు!
చెరువు చుట్టూ పదూళ్లకు ఆదరువు.. చెరువే మనుగడకు ఆధారం..తొలకరికి ఆవాసం.. సిరులకు ప్రాకారం.. చెరువే సమస్తం.. మన నేస్తం.. అలాంటి నీటి వనరులను అభివృద్ధి చేసి వినియోగించుకోవాలి. అయితే వాటికి రక్షణ లేకుండా పోతోంది. పైగా అవి అక్రమణలకు అడ్డాగా మారుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు కళ్లున్న ధృతరాష్ట్రుల్లా చేష్టలుడిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా వందలాది ఎకరాల విస్తీర్ణంతో అలరారే చెరువులు చిక్కి శల్యమై.. చివరకు కనుమరుగవుతున్నాయి. కబ్జాలకు కారణాలివే.. ● అధికార యంత్రాంగం ఉదాసీనత. ● చెరువుల సరిహద్దులు నిర్దేశించకపోవడం. ● చిత్తూరు, తిరుపతి నగరాల్లో భూములకు భారీ డిమాండ్ రావడం. ● తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లను అడ్డుకోలేక పోవడం. ● రెవెన్యూ, ఇరిగేషన్, పురపాలక, నగరపాలక అధికారుల మధ్య సమన్వయలోపం. ● చట్టంలోని లొసుగుల కారణంగా ఆక్రమణలు గుర్తించినా తొలగించే పరిస్థితి లేకపోవడం. ● చెరువును పూడ్చి అందులో అక్రమంగా నిర్మించి న నివాసాలకు విద్యుత్,నీటి వసతి కల్పించడం. ● అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులే పలుచోట్ల చెరువుల్లో వెంచర్లు వేయడం. ● వరదలొచ్చి మునిగినప్పుడే తప్ప మిగిలిన సమయాల్లో అధికారులు ఆక్రమణలపై దృష్టి పెట్టకపోవడం. చిత్తూరు కలెక్టరేట్ : చెరువు అంటేనే రైతాంగానికి, నీటి నిల్వలకు కల్పతరువు. కానీ అవే చెరువులు మరికొద్ది రోజుల్లో పుస్తకాల్లో మాత్రమే చదువుకునే స్థితికి చేరుకునేలా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కబ్జాలకు గురవుతున్నాయి. రెండు జిల్లాల్లో వేల సంఖ్యలో చెరువులు ఆక్రమణల చెరలో పడినట్లు చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు వెల్లడిస్తున్నారు. ఈ లెక్కన కనిపించకుండా పోవడానికి మరెంతో కాలం పట్టేట్టు లేదు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో చెరువుల పరిరక్షణకు తీసుకొచ్చిన హైడ్రా చట్టం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కారు చెరువులు కబ్జాకు గురవుతున్నా చూసీ చూడనట్టు మిన్నకుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణల పర్వం ఇలా.. ● చిత్తూరు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని గిరింపేట గంగినేని చెరువు నగరంలో ప్రధానమైనది. ఇది 45 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇప్పటికే 10 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.. చెరువు సమీపంలో 125–1 సర్వే నంబర్తో 1975లో డీకేటీ పట్టా ఇచ్చారు. దాన్ని మళ్లీ అధికారులే 1978లో రద్దు చేశారు. అలాగే నగర శివారులోని జడియం చెరువు, కట్టమంచి చెరువు, దుర్గానగర్ కాలనీలోని కుమ్మరివాని కుంట చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని చెరువుల్లో దాదాపు 75 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ● నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం చెరువు ఆక్రమణకు గురైంది. ఆ చెరువు మొత్తం విస్తీర్ణం 487 ఎకరాలు. అందులో 48 ఎకరాలు, 439 ఎకరాలకు మునక పట్టాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జీవో నంబర్ 188 ప్రకారం చెరువులో నీరు లేనప్పుడు మాత్రమే రైతులు సాగు చేయాలి. అయితే స్థానిక టీడీపీ నాయకుడు చెరువులో గ్రావెల్ పోసి లెవల్ చేసుకుని దాదాపు 2 ఎకరాలు ఆక్రమించుకున్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ● తిరుపతి నగరంలోనే 8 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా ఆక్రమించేస్తున్నారు. కొందరు నేతలు రెవెన్యూ అధికారులకు ముందే చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్న చెరువు స్థలాన్ని ఆక్రమిస్తున్నాం. దాని జోలికి రాకండి అంటూ ఆదేశిస్తున్నారు. దీంతో కొందరు రెవెన్యూ అధికారులు ఆక్రమణలపై తమకు సమాచారం ఉన్నప్పటికీవాటి జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నాచెరువు 77.46 ఎకరాలు, శెట్టిపల్లె చెరువు 55.25 ఎకరాలు, చెన్నాయగుంట 52.56 ఎకరాలు, పాన్ చెరువు 49.40 ఎకరాలు, కొరమీనుగుంట 32.20 ఎకరాలు, పూలవాని గుంట 23.82 ఎకరాలు, గొల్లవాని గుంట 29.04 ఎకరాలు, మంగళం చెరువు 75.98 ఎకరాలు ఉంది. మొత్తంగా 8 చెరువుల విస్తీర్ణం 395.71 ఎకరాలు అయితే ఇందులో 100 ఎకరాలకు పైగానే ఆక్రమణలకు గురైంది. ● తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం జంగాలపల్లెలోని సాగునీటి చెరువు 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆ చెరువు స్థలాన్ని నాయుడుపేటకు చెందిన వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ● తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు చెరువు విస్తీర్ణం సుమారు 156 ఎకరాలు. అందులో 50 ఎకరాల వరకు రైతులు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు. ● తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెంలోని చెరువు ఆక్రమణకు గురవుతోంది. సర్వే నంబర్ 839లోని 11 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది . అది రోడ్డుకు ఆనుకుని ఉండడంతో అక్రమంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అధికారులు ఈ విషయం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ● చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో మొత్తం 787 చెరువులున్నాయి. ఇందులో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు (100 ఎకరాల విస్తీర్ణం ఉన్నవి) 57 వరకు ఉన్నాయి. చిన్నపాటి కుంటలు 60 వరకు ఆక్రమణలకు గురై కనుమరుగయ్యాయి. మిగిలిన వంద చెరువులు 10 నుంచి 30 శాతం వరకు కబ్జాల బారిన పడ్డాయి. ఈ చెరువుల కింద ఆయకట్టు గతంలో 20 వేల హెక్టార్లుగా ఉండగా ఇప్పుడు 2 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేస్తున్నారు. ● సత్యవేడు మండలం మాదనపాళెం గ్రామంలోని చెరువు ఆక్రమణ చెరలో చిక్కుకుంది. కొందరు అక్రమార్కులు దర్జాగా ఇళ్ల నిర్మాణం చేపట్టేశారు. మాదనపాళెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 839లో 11 ఎకరాల విస్తీర్ణంలో ఇరిగేషన్ చెరువు ఉంది. దీని ఆయకట్టు భూములను శ్రీసిటీ సెజ్కు కేటాయించారు. ఇదే అదునుగా కబ్జాదారులు రెచ్చిపోయి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చిట్టమూరు మండలం జంగాలపల్లె చెరువులో ఆక్రమణలుఆక్రమణలో చిత్తూరులోని గంగినేనిచెరువు తిరుపతిలో ఆక్రమణకు గురైన చెన్నాయగుంట చెరువుకబ్జాకు గురైన సత్యవేడు మండలం మాదనపాళెం చెరువుఅడిగేదెవరు.. ఆపేదెవరు? చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెరిగిపోతున్న చెరువుల హద్దులు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు యథేచ్ఛగా ప్లాట్లు వేసి విక్రయాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులుచిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు. వందల సంఖ్యలో జల వనరులు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చిన వాటిలో కొన్ని ఆక్రమణల పాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారుతున్నాయి. గట్లు, కాలువతోపాటు చెరువుల భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నా రు. చెరువుల్లో ఏర్పాటు చేసిన వెంచర్లతో రూ.వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. 2వేల వరకు కబ్జా కోరల్లో..! చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మొత్తం 8,063 చెరువులు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో దాదాపు 2 వేల చెరువులు ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధికంగా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన కబ్జాలే ఎక్కువ. సామాన్యుడు చెరువు గట్టుపై చిన్న పాక వేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారు. ఆగమేఘాలపై వాటిని తొలగించేస్తారు. అదే ఆక్రమణలకు పాల్పడిన కూటమి ప్రజాప్రతినిధుల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!
‘తుమ్మలగుంట జోలికొస్తే.. ఐక్యంగా పోరాడతాం.. మా ఊరి అభివృద్ధిపై జరుగుతున్న కుట్రను ఎండగడతాం.. రాజకీయాలకు అతీతంగా గ్రామంలో జరిగిన అభివృద్ధిని ఎవరో వచ్చి చెరిపేస్తాం.. తుడిచేస్తాం.. ఎవరికో అప్పగించేస్తామంటే చూస్తూ ఊరుకోం.. ఎదురు తిరుగుతాం.. అవసరమైతే రోడ్డెక్కుతాం.. ప్రధానంగా కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ మా గ్రామానికి ఒక మణిహారం.. ఆ స్థలం మాది.. దానిపై హక్కు మాది.. ఇంతకుముందే గ్రామసభలో తీర్మానం చేశాం.. ఇప్పుడు గ్రామమంతా ఏకమై ఒకచోటకు వచ్చింది.. రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న ఏకై క క్రీడామైదానం అది. అలాంటి పార్క్ను వేరెవరికో అప్పగిస్తామంటే ఒప్పుకునేది లేదు.. చెవిరెడ్డి కష్టాన్ని వృథా కానీయం..’ అంటూ తుమ్మలగుంట గ్రామస్తులు ముక్త కంఠంతో గర్జించారు. తిరుపతి రూరల్: తుమ్మలగుంట గ్రామంలోని కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ నిర్వహణ బాధ్యతను పంచాయతీ నుంచి తిరిగి తుడా తీసుకునే ప్రయత్నాలను గ్రామస్తులు వ్యతిరేకించారు. పార్క్ను తమ గ్రామం నుంచి ఎందుకు దూరం చేయాలని అనుకుంటున్నారు..? దాని వెనుక కుట్ర ఏమిటి..? వాటిని ఎలా ఎదుర్కోవాలి..? అనే అంశాలపై చర్చించేందుకు గ్రామస్తులు ఆదివారం సాయంత్రం వేలాదిగా తరలివచ్చి ఒక చోట సమావేశమయ్యారు. ఆ సభకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ అభివృద్ధికి తాను పడిన కష్టం, ఎదుర్కొన్న విమర్శలను వివరించారు. తల్లివంటి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి నేటి వరకు చేసిన కృషిని క్షుణ్ణంగా తెలియజేశారు. చేయగలిగినంత అభివృద్ధి చేశానని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం గ్రామస్తులకే వదిలేస్తున్నానని చెప్పారు. గతంలో నాలుగేళ్లు కష్టపడి అభివృద్ధి చేసిన ఓ పార్క్ను తుడాకు అప్పగిస్తే నాలుగు నెలలకే నాశనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ చెవిరెడ్డి చేసిన అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పొలిమేర దాటనీయమని, అందుకోసం ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అందరూ ఒక్కటై అడ్డుకుంటామని వెల్లడించారు. ఈ అంశంపై ఎవ్వరు ఏమన్నారంటే... మా ఊరి జోలికి రావద్దు మా ఊరి జోలికి ఎవరూ రావద్దండి.. మా గ్రామంలోని కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ను ఎంతో మంది మెచ్చుకుంటున్నారు. ఇంత అ ద్భుతంగా తయారు చేయడం ఎవరికీ సాధ్యం కా దని చెప్పడం చూస్తుంటే మాకు ఆనందంగా ఉంటుంది. అంతలా కష్టపడిన చెవిరెడ్డిని మా గ్రా మం ఎన్నటికీ మరవదు. రాజకీయాలు మాకు అవసరం లేదు. ఎవరైనా సరే గ్రామంలో అభివృద్ధి చేయాలే తప్ప చేసిన పనులు దూరం చేస్తామంటే కుదరదు. – బుజ్జమ్మ, ఎంపీటీసీ సభ్యులు, తుమ్మలగుంట ఎంత దూరమైనా వెళతాం తుమ్మలగుంట గ్రామస్తుల ఐక్య త ఎలా ఉంటుందో చూపిస్తాం. అభివృద్ధిని కాపాడుకోవడంలో ఎంత దూరమైనా వెళతాం. మా గ్రామం జోలికి వస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు. మా గ్రామానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. అది మాకు గర్వకారణం. ఆయన చేసిన అభివృద్ధిని దూరం చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా గ్రామ చరిత్రలో చెవిరెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. – గోవిందరెడ్డి, మాజీ ఉపసర్పంచ్, తుమ్మలగుంట అభివృద్ధిని తుడిచేయాలంటే అడ్డుకుంటాం తిరుపతి నగరం కంటే తుమ్మలగుంటలో నివాసముండాలని ఎంతో మంది విశ్రాంత ఉద్యోగులు మా గ్రామానికి వస్తున్నారు. చెవిరెడ్డి అద్భుతంగా తయారు చేసిన అభివృద్ధి పనులతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. అలాంటి అభివృద్ధిని తుడిచేయాలని చూస్తే అడ్డుకుంటాం. చెవిరెడ్డి చేసిన అభివృద్ధిలో ప్రధానమైనది కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ ఒకటి. ఆ పార్క్ను మా పంచాయతీకి దూరం చేస్తామంటే ఎలా ఊరుకుంటాం.. – గీతమ్మ, తుమ్మలగుంట నివాసి తుడాకు ఏం సంబంధం తుమ్మలగుంట గ్రామానికి కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ ఒక మణిహారం. ఆ పార్క్ నిర్మాణం జరిగింది మా గ్రామానికి చెందిన భూమిలోనే. ప్రజలు తుడాకు కట్టిన పన్నులతో అభివృద్ధి చేశారు. ప్రభుత్వం నుంచి తుడాకు వచ్చిన నిధులు ఏమీ లేదు కదా..? మా గ్రామస్తులే కాదు ఈ విషయంలో ఎంతటి వారినైనా ఎదుర్కొంటాం. – సుబ్బరామిరెడ్డి, సర్పంచ్, తుమ్మలగుంట సమష్టిగా పోరాడతాం తుమ్మలగుంట అభివృద్ధిలో రాజకీయ కక్షలు వద్దు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. గెలిచిన వారికి చేతనైతే మా గ్రామమంలో మరింత అభివృద్ధి పనులు చేయాలి. చేసిన వాటిని పంచాయతీకి దూరం చేస్తామంటే ఒప్పుకోం. అడ్డుకునేందుకు సమష్టిగా పోరాడతాం. – రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్, తుమ్మలగుంటగతంలో మోసపోయాం గతంలో మా గ్రామం నుంచి ఒక పార్క్ను తుడా నిర్వహిస్తామంటే అప్పగించాం. నాలుగు నెలలకే సర్వనాశనం చేసేశారు. పార్క్ల నిర్వహణ తుడాకు కష్టమని తెలిసినా రాజకీయ కక్షలతో ఆహ్లాదకరమైన కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ను పంచాయతీ నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. – జయచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్, తుమ్మలగుంట నాశనం చేస్తామంటే ఒప్పుకోం జాతీయ స్థాయి ఆటల పోటీలు నిర్వహించేందుకు క్రీడాకారులకు అనువైన పార్క్ మా గ్రామంలో ఉందంటే అది మాకు గర్వకారణం. అలాంటి పార్క్ను మాకు దూరం చేస్తాం, నాశనం చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు.అభివృద్ధి పనులను దూరం చేస్తామంటే ఎవరూ ఒప్పుకోరు. మా ఊరు జోలికి వస్తే ఎవరినీ వదలం. – గోపాల్రెడ్డి, ఉపసర్పంచ్, తుమ్మలగుంట తమాషాగా ఉందా? తుమ్మలగుంట అంటే తమాషా గా ఉందా..? మా ఊరు జోలికి వస్తే ఎవరూ వదలరు.. మా గ్రామ అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఇదంతా చేస్తున్నారు. కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ వల్ల మా గ్రామం ఎంతలా అభివృద్ధి చెందిందో దేశ మంతా తెలుసు. ఆ పార్క్ను ఎవరికో ఇచ్చేస్తామంటే ఒప్పుకుంటామా..? ఎవరినైనా ఎదిరిస్తాం.. ఎంతవరకై నా పోరాడతాం. – రత్నమ్మ, జెడ్పీటీసీ సభ్యులు, తిరుపతి రూరల్ ఐక్యంగా ఎవరినైనా ఎదిరిస్తాం వృథా కాదు.. చెవిరెడ్డి కష్టం ఒకే వేదికపై ముక్త కంఠంతో గర్జించిన గ్రామస్తులు భూమి మాది.. హక్కు మాది తుమ్మలగుంటలో ఏర్పాటు చేసిన గోవిందధామం అయి నా.. కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ అయినా వాటికి కేటాయించిన భూమి మా గ్రామానికి చెందింది. దానిపై హక్కు మా ఊరి ప్రజలకే ఉంటుంది. అక్కడ జరిగిన అభివృద్ధిని ఎవరికో అప్పగించేస్తాం.. నాశనం చేసేస్తామంటే చూస్తూ ఊరుకోం. గ్రామంలో ప్రజలందరం ఏకమై పోరాడతాం. – దామోదర్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ -
అమానుషం.. అమానవీయం
తిరుపతి మంగళం/నెల్లూరు (స్టోన్హౌస్పేట)/ సాలూరు/ బద్వేలుఅర్బన్/సాక్షి, నరస రావుపేట/ పెదకూరపా డు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విడదల రజని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానుషం, అమానవీయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు సైతం చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేశ్ మెప్పు పొందేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు.చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు.. మాజీ మంత్రి, బీసీ నేత అని కూడా చూడకుండా విడదల రజని పట్ల ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. సీఐ గారూ.. సీఐ గారూ.. అని ఆమె పదే పదే గౌరవంగా మాట్లాడుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆమెను కారు నుంచి కిందకు లాగేయడం ఎంత దుర్మార్గం.. అని ప్రశ్నించారు. ఇటీవల గుంటూరు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలి పట్ల కూడా అర్ధరాత్రి పోలీసులు దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కూటమి నాయకుల బెదిరింపులకు, కక్ష సాధింపులకు, కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నా భయపడేది లేదని రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నంబూరు శంకరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని, కార్యకర్తలకు తామంతా అండగా ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన కీచకపర్వాన్ని తలపిస్తోందని వైఎస్సారీసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు.సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ మహిళా నేతలతో కలసి నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేలా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజని పట్ల పోలీసుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మహిళ మంత్రి విడదల రజని పట్ల పోలీసుల తీరు సరికాదని ఖండించారు.కొందరు పోలీసు అధికారులు సభ్యత, సంస్కారాలు మరచి వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ అన్న కనీస గౌరవ మర్యాద లేకుండా సీఐ అనుచితంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
చంద్రగిరి వద్ద డివైడర్ను డీకొట్టిన బస్సు
చంద్రగిరి: తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి తమిళనాడులోని వేలూరు నుంచి తిరుమలకు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగరాల నారాయణ కళాశాల వద్దకు వచ్చేసరికి బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. దాదాపు 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్ రాజారెడ్డి, కండక్టర్ లక్ష్మీనారాయణ, ప్రయాణికులు శ్రావణ్కుమార్, దీపారాణి, నితీశ్కుమార్, అక్షయ్కుమార్, తిరుసడై, తేజస్విని, రామ్లక్ష్మి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరికొందరిని చంద్రగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పాకాలలో శాంతి ర్యాలీ
పాకాల: పాకిస్తాన్ సైనికుల కాల్పుల్లో వీర మరణం పొందిన సత్యసాయి జిల్లా మురళీ నాయక్కు వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి నివాళులర్పించారు. శనివారం మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో పాకాలలో రైల్వే గేటు నుంచి చిత్తూరు రోడ్డు వరకు సైనికులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో మన దేశ సైనికులు 9 పాకిస్తానీ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. వీరమణం పొందిన మురళీ నాయక్కు ఘన నివాళులర్పించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సంతోషకరమని ఇకనైనా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడనాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సైనికులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఘనంగా ముగిసిన జానపద జాతర
తిరుపతి కల్చరల్: ప్రజాకళావేదిక, ఎస్వీయూ విద్యార్థుల సంక్షేమం, సాంస్కృతిక వ్యవహారాల సంచాలకుల సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఎస్వీయూలోని సెనేట్ హాల్లో చేపట్టిన మన పల్లె జానపద జాతర శనివారం ఘనంగా ముగిసింది. రెండో రోజు ఏపీ, తెలంగాణ రాష్టాల నుంచి సుమారు 300 మందికిపైగా కళాకారులు పాల్గొని జానపద గేయాలను ఆలపించి ఆకట్టుకున్నారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ మురళీధర్, అతిథులుగా గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, ప్రముఖ కవి, ప్రిన్సిపల్ డాక్టర్ సి.నారాయణస్వామి, సినీ గీత రచయిత కవి, సురేంద్రరొడ్డ, రుయా ఆస్పత్రి డాక్టర్ రోజారమణి, కల్చరల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, జానపద కళారుడు వేలూరు జగన్నాథం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులను, కళాకారులను ప్రజాకళా వేదిక నిర్వాహకుడు జయపాల్ ఘనంగా సత్కరించారు. ప్రజాకళా వేదిక ప్రతినిధులు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, కేఎం.రత్నం, రెడ్డిప్రసాద్, తెలంగాణకు చెందిన కట్ల శ్రీనివాసులు, ప్రజానాట్య మండలి పాండురంగారావు, లాలయ్య పాల్గొన్నారు. -
విమానాశ్రయంలో మాక్ డ్రిల్
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఇండో–పాక్ యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని శనివారం రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి మాక్ డ్రిల్ను పర్యవేక్షించారు. విమానశ్రయంలోకి మారణాయుధాలతో అక్రమంగా ప్రవేశిస్తే అనుసరించాల్సిన వ్యూహాలను చేసి చూపించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్, సీఐఎస్ఎఫ్ కమాండో బహుదూర్, సీఎస్ఓ.రాజేంద్రప్రసాద్, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు, గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి, విమానాశ్రయం సీఎస్ఓ, ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన ‘ఆత్రేయ గీతామృతం’
శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక బిజినెస్ సెంటర్లో శనివారం నిర్వహించిన ‘ఆత్రేయ గీతామృతం’ కార్యక్రమం అలరించింది. మద్రాసు విశ్వవిద్యాయలయం తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరావు వక్తగా విచ్చేసి ఆత్రేయ గారి సినీ గీతాలు, అందులోని అర్థవంతమైన సాహిత్యం, మాధుర్యం, ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ సినీసాహిత్యంలో ఓ విశిష్ట మైలురాయి ఆత్రేయ గీతాలన్నారు. మూగమనస్సులు సినిమాలోని ‘నా పాట నీ నోట పలకాలి చిలుక’.. ‘ముద్దబంతి పువ్వులో మూగ కళ్ల ఊసులో’.. ‘నీముక్కుమీద కోపం ముఖానికే అదం’ తదితర గీతాలను ప్రస్తావించి విశ్లేషించారు. కార్యక్రమ ప్రారంభంలో చైన్నె వేదవిజ్ఞాన వేదిక సంస్థ కార్యదర్శి కందనూరి మధు సభికులకు ఆచార్య శంకరరావు గురించి పరిచయం చేశారు. శ్రీసిటీ పీఆర్వో పల్లేటి బాలాజీ సమన్వయకర్తగా వ్యవహరించారు. శ్రీసిటీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, సూళ్లూరుపేట, శ్రీహరికోట, శ్రీసిటీ ప్రాంతాల నుంచి పలువురు పాల్గొన్నారు. -
ఎవడ్రా మన వాహనాలను ఆపేది?
● కలువాయిలో చెలరేగిపోయిన రేషన్ మాఫియా ● మీడియా ప్రతినిధులపై వాహనంతో దాడికి యత్నం సాక్షి టాస్క్ఫోర్స్: ‘ఎవడ్రా మన వాహనాలనాపేది.. అడ్డొస్తే తొక్కేయండి. నేను చూసుకుంటా’.. అంటూ రేషన్ మాఫియా కేటుగాళ్లు రెచ్చిపోయారు. అడ్డొచ్చిన మీడియా ప్రతినిధులపైనే దాడికి యత్నించారు. ఈ ఘటన శనివారం శ్రీపోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కలువాయిలో చోటుచేసుకుంది. వివ రాలు.. కలువాయి మండలంలో కూటమి ప్రభత్వం ఏర్పడినప్పటి నుంచి రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కిలో రూ.10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని కలువాయి సమీపంలోనే ఓప్రైవేట్ స్కూల్ వద్ద నిల్వ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మిల్లర్లకు ఒక్కో బస్తా రూ.1000 నుంచి రూ.1,500 వందల వరకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో విజన్టెక్ ఉద్యోగి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రేషన్ బియ్యాన్ని శనివారం తెల్లవారు జామున తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న మీడియో ప్రతినిధులు ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో కేటుగాల్లు రెచ్చిపోయారు. రేషన్ బియ్యాన్ని తరలిచే వాహనంతో మీడియా ప్రతినిధులను తొక్కేసే ప్రయత్నం చేశారు. చాకచక్యంగా మీడియా ప్రతినిధులు తప్పించుకున్నారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అంతర్రాష్ట్ర ఆవుల దొంగల ముఠా అరెస్ట్
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట, వడమాలపేట, నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో ఆవులను దొంగతనం చేసి, వాటిని విక్రయిస్తున్న 9 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గాజులమండ్యం పోలీసులు పట్టుకుని కటకటాలకు పంపించారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లాలో ఆవుల దొంగతనాలను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి పర్యవేక్షణలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సూచనలతో రేణిగుంట రూరల్ సీఐ ఎం.మంజునాథ్రెడ్డి నేతృత్వంలో గాజులమండ్యం ఎస్ఐ టీవీ.సుధాకర్, పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా నిర్వహించారు. తిరుపతి–చైన్నె ప్రధాన రహదారి ఆయిల్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక బొలేరో వాహనంలో ఆవులను రవాణా చేస్తూ కనిపించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హర్యాణా కు చెందిన 8 మంది, తమిళనాడు ఊత్తుకోటకు చెందిన కబూర్ బాషా అని తేలింది. కబూర్ బాషా ఈ గ్యాంగ్ను ఏర్పరిచి గత ఆరు నెలలుగా రేణిగుంట, వడమాలపేట, నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో ఆవులను దొంగతనం చేసి, వాటిని కసాయికి తరలిస్తునట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు నిందితుల నుంచి నాలుగు ఆవులు, ఒక బొలేరో వ్యాన్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. -
వెరిటాస్ సైనిక్ స్కూల్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి
● దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే వెరిటాస్ లక్ష్యం ● వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బీ.శేషారెడ్డి తిరుపతి కల్చరల్: తిరుపతిలో గత 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్య తో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి కేద్రం ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అను మతి పొందడం జరిగిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బీ.శేషారెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించడంతోపాటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక, మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యనందిస్తున్నట్టు తెలిపారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ వంటి అన్ని సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించిన సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. విద్యాసంస్థలో ప్లస్–1 ఇంటర్ మీడియట్తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వెరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బీ.శ్రీకర్రెడ్డి, బీ.సందీప్రెడ్డి పాల్గొన్నారు. -
భావప్రకటనా స్వేచ్ఛపై ఎదురుదాడి
షార్లో భద్రత కట్టుదిట్టం సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శనివారం సీఐఎస్ఎఫ్ డీఐజీ సంజయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్, సబ్మైరెన్ పోలీస్ శాఖలతో షార్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రతపై పలు అంశాల గురించి చర్చలు జరిపారు. భారత్–పాకిస్థాన్ల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో షార్ కేంద్రాన్ని కాపాడుకోవడానికి భద్రతా సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. షార్ కేంద్రంలో పనిచేస్తున్న భద్రతా సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. సెలవుల్లో ఉన్న వారిని కూడా అందరినీ రప్పించారు. షార్లో ఉన్న రాడార్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శనివారం గేట్ నం.1బీ వద్ద సుమారు 70 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందితో మాక్డ్రిల్ నిర్వహించినట్టు సీఐఎస్ఎప్ డీఐజీ సంజయ్కుమార్ తెలిపారు. సీఐఎస్ఎప్ సీనియర్ కమాండెంట్ సంజిత్కుమార్, డిప్యూటీ కమాండెంట్ ఎన్కే.గౌర్, సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఇంటిలిజెన్స్ బ్యూరో అదికారులు, శ్రీహరికోట పోలీసుల, మైరెన్ పోలీసులు పాల్గొన్నారు. -
● పేరుకుపోయిన ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు ● అవస్థలు పడుతున్న విద్యార్థులు ● 20 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఏదీ? ● తప్పును ఎత్తి చూపితే కేసులు, దాడులా? ● ‘సాక్షి’తో మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు
తిరుపతి సిటీ: ‘ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. రాష్ట్రంలో అలాంటి హక్కుకు భంగం కలిగేలా ఘటనలు జరగడం ప్రమాదకరం. పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలు చట్ట విరుద్ధం. ప్రభుత్వం చేసే తప్పును ఎత్తి చూపితే కేసులు, భయభ్రాంతులకు గురిచేసేలా దాడులు చేయడంలో ఆంతర్య మేమిటో అర్థంకాని పరిస్థితి.’..అని మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గత ఏడాదిగా సాగుతున్న పాలనపై తన అభిప్రాయాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే.. బలహీన పడుతున్న విద్యావ్యవస్థ రాష్ట్రంలో పాఠశాలలు బలహీన పడే పరిస్థితి నెలకొంది. 9 రకాల పాఠశాలల ఏర్పాటు అనే కాన్సెఫ్ట్తో ప్రభుత్వం నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. దీంతో వందల సంఖ్యలో పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. సుమారు 10వేల ఉపాధ్యాయ పోస్టులు సర్ప్లస్ కానున్నాయి. గత ప్రభుత్వంలో మ్యాథ్స్, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రమోషన్లు రద్దు కానున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు విలయతాండవం చేయనున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రొత్సహించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాడు–నేడు పథకంతో గత ప్రభుత్వం పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించింది. మరికొన్ని పాఠశాలల్లో మౌలికవసతులను కల్పించాల్సి ఉంది. వాటిని పట్టించుకోవడం లేదు. 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని గత ప్రభుత్వ చర్యలు తీసుకుంటే, కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం సరైన పద్ధతి కాదు. డీఎస్సీపై ఆంక్షలు దారుణం మెగా డీఎస్సీ పేరుతో 16 వేల పోస్టులకు పైగా విడుదల నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం అందులో ఆంక్షలు విధించడం దారుణం. అభ్యర్థుల వయోపరిమితి 47కు పెంచాలి. అభ్యర్థుల ప్రిపరేషన్కు కనీసం 90 రోజులు గడువు ఇవ్వాలి. అర్హతల పేరుతో మార్కుల శాతం పరిగణనలోకి తీసుకునేలా నిబంధనలు విధించారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ప్రతి జిల్లాకు వేర్వేరుగా ప్రశ్న పత్రాలు ఇవ్వాలి. తప్పు ఎత్తిచూపే హక్కు మీడియాకుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంది. భావప్రకటనా స్వేచ్ఛపై ఎదురుదాడికి దిగుతోంది. ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపే హక్కు పత్రికలకు, మీడియాకు ఉంది. అలాంటి వాటిని స్వీకరించి తప్పులను సరిదిద్దుకోవాలి. కానీ అలా జరగకపోగా మీడియా ప్రతినిధులపైన, కలం కార్మికులపైన దాడులు చేయడం దారుణం. భయపెట్టడం, కేసులు బనాయించడం దారుణం. ప్రతికా చ్ఛనుహరించడం రాజ్యాంగ విరుద్ధం. సంక్షేమం గాలికే కూటమి ప్రభుత్వం అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. రైతులకు అన్నదాత సుఖీభవ, ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకాలు నిర్వీర్యమయ్యాయి. వాటి ప్రస్తావనే ఎత్తడం లేదు. పీ4, స్వరాంధ్ర 2.0 అంటూ స్వప్నలోకంలో ప్రగతి జరుగుతున్నట్లు ఉంది. రాబోయే నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్న గ్యారంటీ లేదు. 20లక్షల ఉద్యోగాల మాటేంటో నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3వేలు, 20 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండ్ విడుదల హామీలు ఏమయ్యాయో. ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు పారిశ్రామిక, ఐటీ రంగాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో సుమారు 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. -
తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు
తిరుపతి అర్బన్: గురుపౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని తిరువణ్ణామలైకి జిల్లా నుంచి ఆది, సోమవారాలు 160 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. తిరుపతితోపాటు జిల్లాలోని పలు డిపోల నుంచి సర్వీసులను అందుబాటులో ఉంచినట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రయివేటుకు ఆర్టీసీ విచారణ కేంద్రాలు తిరుపతి అర్బన్: తిరుపతి సెంట్రల్ బస్టాండ్లోని ఆర్టీసీ విచారణ కేంద్రాలను ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెట్టింది. ఓ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ వాళ్లకు బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు శనివారం నుంచి తిరుపతి బస్టాండ్లోని విచారణ కేంద్రాల నిర్వహణ వారి ఆధ్వర్యంలో సాగుతోంది. తిరుపతి బస్టాండ్ ఆధారంగా రోజూ లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో తిరుపతి సెంట్రల్ బస్టాండ్ పరిధిలోని శ్రీహరి బస్టాండ్, శ్రీనివాస బస్టాండ్, పల్లె వెలుగు బస్టాండ్లలో ఒక్కో విచారణ కేంద్రం చొప్పున నిర్వహిస్తున్నారు. అయితే ఆర్టీసీ కండక్టర్లే విచారణ కేంద్రంలో పనిచేస్తున్నారు. ఇటీవల కండక్టర్ల కొరత ఉందంటూ ఓ కాంట్రాక్టర్కు విచారణ కేంద్రం బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు 14 మందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. అయితే ఈ అంశంపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. మురళీనాయక్కు ఘన నివాళి తిరుపతి సిటీ: దేశం కోసం కదనరంగంలో శత్రువులతో వీరోచితంగా పోరాడి అశువులు బాసిన భరతమాత ముద్దు బిడ్డ మురళీనాయక్కు ఘన నివాళి అర్పించారు. శనివారం ఎస్వీయూలో జరిగిన ఈ కార్యక్రమంలో జీజేఎస్ వ్యవస్థపక అధ్యక్షుడు మహేంద్రనాయక్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్లో భాగంగా దేశ భద్రత కోసం సరిహద్దుల్లో పోరాడి ప్రాణాలర్పించిన వీర జవాన్ శహీద్ మురళీనాయక్ ఆశయసాధనకు యువత నడుం బిగించాలన్నారు. ఆయన చూపిన అపార ధైర్యం, అంకితభావం, సేవా నిబద్ధత ఈ తరం యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. విద్యుత్ బస్సు డ్రైవర్ల నిరసన తిరుపతి అర్బన్: తిరుమలకు నడుస్తున్న విద్యుత్ బస్సు డ్రైవర్లకు సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో శనివారం అలిపిరి డిపో వద్ద మూడు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. దీంతో తిరుమల భక్తులకు విద్యుత్ బస్సుల కొరత నెలకొంది. అనంతరం ఆర్టీసీ అధికారులు రెండు రోజుల్లో జీతాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి యథావిధిగా విధులకు వెళ్లారు. -
హనుమంత వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీనరసింహుడు(ఇన్సెట్) ఆకట్టుకున్న నృత్యం
జిల్లా సమాచారం మండలాలు: 33 పంచాయతీలు: 806 ఉపాధి కూలీలు: 2.12 లక్షలు పశువులకు నీటి తొట్టలకు అనుమతులు: 2.636 పూర్తి చేసినవి: 966 గొర్రెలు, పశువులకు సంబంధించిన షెడ్లు: 1647 పూర్తి చేసినవి: 1278 సోప్ పిట్లు(రూ.6 వేల విలువతో): 12,344 పూర్తి చేసినవి: 6,568 జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధుల్లేక నీరసిస్తోంది. చేసిన పనులకు బిల్లులు ఇవ్వక కూలీలు డొక్కలు మాడ్చుకోవాల్సి వస్తోంది. అప్పులు చేసి నిర్మించిన నీటి తొట్టలకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిల్లకూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోంది. పనులు చేసి మూడు నెలలవుతున్నా ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి పథకం కింద గత ఐదు నెలలుగా చేపట్టిన ఏ ఒక్క పనికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయలేదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. మేం చూడం బాబోయ్! కూటమి నాయకులు నిబంధనలు పాటించకుండా.. నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలేసి గ్రామాల్లో ఇష్టానుసారంగా సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. వీటికి పూర్తి స్థాయి నగదు చెల్లింపులు జరగాలంటే క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించాలి. వీటిని ఎక్కడ ఓకే చేస్తే సోషల్ ఆడిట్లో తమ మెడకు చుట్టుకుంటుందోనని వారు మిన్నకుండిపోతున్నట్టు సమాచారం. ఫలితంగా బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. కూటమి నేతలకే నీటితొట్టెలు ఉపాధి పథకం కింద పశువులు ఉన్న రైతులకు షెడ్లు, మూగజీవాల పెంపకందారులకు నీటి సౌకర్యం కోసం నీటి తొట్టెలు కూటమి నేతలే సొంతం చేసుకున్నారు. ఒక్కో షెడ్డుకు రూ.2 లక్షల వరకు మంజూరు చేయాల్సి ఉంది. అయితే జీఎస్టీ బిల్లులు పెడితేనే పూర్తి స్థాయిలో బిల్లులు మంజూరు చేస్తామని అధికారులు తేల్చిచెప్పారు. లేకుంటే రూ.1.4 లక్షలు మంజూరు చేస్తామని మెలికపెట్టడంతో కూటమి నేతలు బావురమంటున్నారు. వేధిస్తున్న నిధుల కొరత సిబ్బందికి జీతాల్లేవ్ కూలీలకు వేతనాలూ కరువు చేసిన పనులకు బిల్లులు చెల్లింపులు లేవు మేకపోతు గాంభీర్యం చూపుతున్న కూటమి నేతలు అప్పులు చేసి పనులు చేసినా..! కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ఆ పార్టీల నాయకులు ఇబ్బడిముబ్బడిగా సీసీ రోడ్లు, క్యాటిల్ షెడ్లు, సీసీ డ్రైన్లు నిర్మించారు. మొదట్లో కొంత నగదు మంజూరు కావడంతో జబ్బలు చరిచారు. ఆపై పనులు పూర్తి చేసి ఐదు నెలలుకుపైగా అవుతున్నా పూర్తి స్థాయిలో బిల్లు లు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. -
వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ.. స్పందించిన కేంద్రం
తిరుపతి: తిరుపతిలో సీజీహెచ్ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం) వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 4న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. దీనికి స్పందించిన కేంద్రం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసిందని ఎంపీ తెలిపారు.కేవలం విజయవాడ, నెల్లూరు, విశాఖ, గుంటూరుకు మాత్రమే పరిమితమైన ఈ వెల్నెస్ సెంటర్ తిరుపతిలో కూడా ఏర్పాటు చేయడం ద్వారా 15 వేల మంది కేంద్ర ప్రభుత్వ సంస్థాగత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పదవీ విరమణ పొందిన వారికి సరైన వైద్యం, రిఫరల్ సౌకర్యాలు అందుతాయన్నారు. -
● జానపద కళాకారులు.. ఆ వేషాలు ఎక్కడ నాయకా? ● వేపాకు తోరణాలు లేవు.. డివిజన్కో అమ్మవారి విగ్రహం లేదు ● నాడు రోజూ ప్రతి డివిజన్ నుంచి అమ్మవారికి సారె ● నేడు కనిపించని నాటి సందడి.. ● కమిటీలపై ఉన్న శ్రద్ధ తిరుపతి గంగ జాతరపై లేదా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరంటే.. అందో పెద్ద పండుగ. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గంగ జాతర గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన వారు కూడా ప్రత్యేకంగా చర్చించుకున్నారు. నాటి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు.. నేడు నిర్వహిస్తున్న గంగ జాతరకు ఎంతో తేడా కనిపిస్తోంది. ఆ నాటి సందడి నేడు కనిపించకపోవడంతో నగర ప్రజలే కాదు.. జాతరకొచ్చే వారంతా ఔరా..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. శోభాయాత్ర అదో అద్భుతం చాటింపు మరుసటి రోజు తిరుమల యాత్రకు ముఖద్వారమైన అనంత వీధి నుంచి శోభాయాత్ర నిర్వహించేవారు. ఈ యాత్రలో 150 కళాబృందాలు.. 1,400 మంది కళాకారులు పాల్గొనేవారు. యాత్ర వస్తుంటే.. నగరంలోని ప్రతి గడప ముందు కల్లాపు చల్లి, ముగ్గులు వేసి, పసుపు నీటితో స్వాగతం పలికేవారు. వారం రోజుల పాటు జాతరే జాతర చాటింపు రోజు నుంచి జాతర ముగిసే వరకు నగరంలోని ప్రతి డివిజన్లో సందడి కనిపించేది. ప్రతి డివిజన్లో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి విచిత్ర వేషధారణలతో మొక్కులు చెల్లించుకునేవారు. గంగమ్మ తల్లిని నగర వాసులు ఇంటి ఆడబిడ్డగా భావించడంతో 50 డివిజన్ల నుంచి స్థానికు లు ఉదయం, సాయంత్రం ఊరేగింపుగా సారె తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేవారు. లక్ష కుంకుమార్చనేదీ? ప్రతి ఏటా మేలో తిరుపతిలో నిర్వహించే తాతయ్యగుంట గంగ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. రాష్ట్ర పండుగగా గుర్తించి.. రాష్ట్ర ముఖ్యమంత్రే వచ్చి అమ్మవారికి సంప్రదాయ పద్ధతిలో సారె సమర్పించారు. ఇంకా ప్రముఖ పీఠాధిపతులు కూడా తిరుపతికి విచ్చేసి జాతర ప్రాశస్త్యం గురించి తెలియజేశారు. కమిటీలపై ఉన్న శ్రద్ధ జాతరపై లేదే? జాతర కోసం ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీలో చోటు కోసం జాబితాలను మార్చి మార్చి తన అనుచరులను నియమించారు. ఈ కమిటీలో చోటుకోసం కూటమి నేతలు పోటీలు పడి జిల్లా కలెక్టర్పై ఒత్తిడిచేసి ప్రకటించిన జాబితాను మూడు సార్లు మార్పించారు. ఇంత చేసినా.. జాతరపై ఏ ఒక్కరికీ శ్రద్ధ లేదు. కమిటీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు ఉన్నా జాతర ఏర్పాట్ల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారం కోసం ఆరాటం తప్ప జాతర గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. నాడు శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా తిరుపతితాతయ్య గుంట గంగమ్మ జాతరను నిర్వహించారు. అందులో భాగంగా జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి అంగరంగ వైభవంగా చేపట్టారు. జాతర నిర్వహణ కోసం నాడు ప్రభుత్వమే టీటీడీ నుంచి రూ.50 లక్షలు, కార్పొరేషన్ ద్వారా రూ.25 లక్షలు, తుడా నుంచి రూ.25 లక్షలతో పాటు సాంస్కృతిక శాఖ ద్వారా రూ.10 లక్షలు ఇప్పించింది. అందుకు తగ్గట్టే బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. చాటింపునకు ముందే తిరుపతి నగరమంతా వేపాకు తోరణాలు.. ఫ్లెక్సీలతో జాతరకు ఆహ్వానం పలికారు. నగరమంతా మైక్సెట్లు ఏర్పాట్లు చేసి జాతర విశేషాలు, గోవిందనామ స్మరణలు వినిపించేలా ఏర్పాట్లు చేశారు.చాటింపు తర్వాత వచ్చే శుక్రవారం లక్ష కుంకుమార్చని నిర్వహించే కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గత ఏడాది భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఆ కుంకుమను ప్యాకెట్లలో పెట్టి వలంటీర్ల ద్వారా ప్రతి నివాసానికీ అందజేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతరలో లక్ష కుంకుమార్చన ఊసే లేకుండా పోయింది. -
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
తిరుపతి అర్బన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్వో నరసింహులు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన పరీక్షల నిర్వాహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు 64 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 30,182 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు.