Tirupati
-
జిల్లాకు 8, 9 స్థానాలు●
తిరువణ్ణామలై రద్దీ పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైకి వెళ్లేందుకు భక్తులు క్యూ కట్టారు. తిరుపతి బస్టాండ్ కిటకిటలాడింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల విద్యార్థులు సత్తాచాటారు. అత్యుత్తమ మార్కులతో అదరగొట్టారు. రాష్ట్ర స్థాయిలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 71 శాతం ఉత్తీర్ణతతో 9వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 86 శాతం ఉత్తీర్ణతతో 8వ స్థానాన్ని కై వశం చేసుకున్నారు. తల్లిదండ్రులకు, కళాశాల యాజమాన్యాలకు గుర్తింపు తెచ్చారు. ● సీనియర్ ఇంటర్లో 86 శాతం, జూనియర్ ఇంటర్లో 71 శాతం మంది ఉత్తీర్ణత ● మే 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ● మే 28 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ ● రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు 13 నుంచి 22వ తేదీల్లోపు ఫీజు చెల్లింపునకు గడువు ● సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు 15 నుంచి 22వ తేదీలోపు ఫీజు చెల్లింపునకు గడువు ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోతిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ ఫలితాలను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తిరుపతి జిల్లా 9, 8 స్థానాలను దక్కించుకున్నట్లు ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ) జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. మార్చి 1నుంచి 20వ తేదీ వరకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 86 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణలో జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 31,479 మంది హాజరయ్యారు. వీరిలో 22,403 (71శాతం) మంది ఉత్తీర్ణత సాధించడంతో జిల్లాకు 9వ స్థానం లభించింది. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 28,4630 మంది హాజరవ్వగా వారిలో 24,581 (86శాతం) మంది ఉత్తీర్ణత సాధించడంతో జిల్లాకు 8వ స్థానం దక్కిందని ఆర్ఐఓ తెలిపారు. జిల్లా నుంచి ప్రథమ, ద్వితీయ జనరల్, ఒకేషనల్తో పాటు ప్రైవేటు విద్యార్థులు 61,727మంది హాజరవ్వగా వారిలో 47,898మంది ఉత్తీర్ణత సాధించారు. ఫీజుల వివరాలు.. గడువు తేది రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే వారు ఈ నెల 13 నుంచి 22వ తేదీ లోపు రీకౌంటింగ్కు రూ.1,300, రీ వెరిఫికేషన్కు రూ.260 చెల్లించాలని ఆర్ఐఓ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు రూ.600, ప్రాక్టికల్స్కు రూ.275, జనరల్/ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు(మ్యాథ్స్, బైపీసీ విద్యార్థులు) రూ.165, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్ (ద్వితీయ సంవత్సరం)కు రూ.275, బెటర్ పర్ఫార్మెన్స్ (ఇంప్రూవ్మెంట్)కు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350, సైన్స్ వారు రూ.1,600 ఫీజు చెల్లించాలని చెప్పారు. న్యూస్రీల్మే 12 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 12 నుంచి 20వ తేదీ వరకు రోజూ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 4వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 6వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధైర్యపడొద్దు ఇంటర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిలయ్యామనో విద్యార్థులు అధైర్యం చెందవద్దని, క్షణికావేశపు నిర్ణయాలు తీసుకోవద్దని ఆర్ఐఓ విద్యార్థులకు సూచించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మెరుగైన మార్కులు సాధించడానికి అవకాశం ఉందని తెలిపారు. -
హంస వాహనంపై లక్ష్మీనరసింహుడు
రాపూరు: వసంతోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఉభయనాంచారులతో కలసి శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి హంస వాహనపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. స్వామి వారి అలంకార మండపంలో నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవీ ఉత్సవ విగ్రహాలను కొలువు దీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి మేళతాళాలు మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ కోన మాడ వీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం నందనవనంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా
తిరుపతి మంగళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ‘పొలిటికల్ అడ్వైజర్ కమిటీ’ని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించి పీఏసీ మెంబర్లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు పీఏపీ మెంబర్లుగా మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజాను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులను జారీచేసింది. 14న గ్రీవెన్స్ రద్దు తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో ఈనెల 14న జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రామాన్ని బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్తోపాటు డివిజన్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్ను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. -
ఆటవిక చర్యలు ఆగవా?
శ్రీకాళహస్తి : సమాజంలో ఇంకా నిమ్న కులాలపై అగ్ర కులాల దురహంకార దాడులు చేయడం హేయమైన చర్యగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి శ్రీకాళహస్తి డివిజన్ కార్యదర్శి రెడ్డిపల్లి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర కులాల దాడిలో గాయపడి స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విరూపాక్షపురం గిరిజనులను శనివారం కేవీపీఎస్ నాయకులతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గద్దగుంటకు చెందిన చైతన్య విచక్షణా రహితంగా వెంకటేష్ (35), నాగయ్య(60)పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, గురునాథం, సంక్రాంతి వెంకటయ్య పాల్గొన్నారు.ఆటో బోల్తా – మహిళ మృతి బుచ్చినాయుడుకండ్రిగ: ఆటో అదుపు తప్పి గుంతలో బోల్తా పడడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన పదోమైలు గ్రామం కేటీరోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. కేవీబీపురం మండలం, తిమ్మభూపాలపురం గ్రామానికి చెందిన పుల్లారెడ్డి ఆయన భార్య మునెమ్మ (55), కుమారుడు భక్తవత్సలరెడ్డి ఉల్లిపాయలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం వదరయ్యపాళెం గ్రామంలోని సంతకు ఆటోలో ఉల్లిపాయలు తీసుకుని వెళ్తుండగా పదోమైలు గ్రామం వద్ద ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మునెమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పుల్లారెడ్డి, భక్తవత్సలరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మునెమ్మను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విశ్వనాథనాయుడు తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం సాయంత్రం రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా పలువురు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం, మిర్యాలగూడకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కారులో తిరుమల నుంచి అలిపిరికి మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా 13వ మలుపు వద్ద కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో భక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. అదేవిధంగా తమిళనాడు, చైన్నెకి చెందిన 13 మంది భక్తులు టెంపోట్రావెలర్లో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా మొదటి మలుపు వద్ద కారు అదుపుతప్పి రక్షణ గౌడను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్లోని ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఘాట్రోడ్డు భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
శ్రీచైతన్య విద్యార్థుల హవా
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ఈ.గణేష్రెడ్డి, జె.సార్విక, ఎస్.ప్రణవి, ఎన్.హారిక 990 మార్కులు, జి.ప్రశాంత్రెడ్డి, కె.దివ్యశ్రీ, పి.స్పందన, ఎస్.నవీన్ 989 మార్కులు సాధించగా.. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సి.తన్మయి 466, ఎం.దివ్యశరణ్య, జి.జాహ్నవి, కె.హంసలేఖ, ఎ.రుషివేంద్ర, సి.యశ్వంత్కుమార్, బి.దివ్యశ్రీ, ఎ.నాగరిషిక 465 మార్కులు సాధించారు. అలాగే జూనియర్ బైపీసీ విభాగంలో కె.అభిగ్నరెడ్డి, టి.హర్షిత, వై.జోషిత 434 మార్కులు సాధించగా.. వీరిని విద్యాసంస్థల ఏజీఎం బీవీ ప్రసాద్, డీన్లు కెఎల్జీ.ప్రసాద్, రామమోహన్రావు, శ్రీనివాసరాజు, భాస్కర్ అభినందించారు. తిరువణ్ణామలై రద్దీ తిరుపతి అర్బన్: పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తమిళనాడులోని తిరువణ్ణామలైకి వెళ్లారు. జిల్లాలోని 10 డిపోల నుంచి 81 సర్వీసులను ఏర్పాటు చేశారు. అందులో తిరుపతి డిపో నుంచి 17 సర్వీసులను ఏర్పాటు చేశారు. అయితే ఒక్క తిరుపతి నగరం నుంచే 10వేల మంది భక్తులు శనివారం తిరువణ్ణామలైకి వెళ్లినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో తొక్కిసలాటలు లేకుండా జిల్లా ప్రజారవాణా అధికారి నరసింహులు, ఏటీఎం రామచంద్రనాయుడు, డీఎం బాలాజీ, టీఐ వీఆర్ కుమార్ చర్యలు చేపట్టారు. -
940 హెక్టార్లలో మొక్కల పెంపకం
సైదాపురం: నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది 940 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ భూముల్లో మొక్కలు పెంచనున్నట్టు నెల్లూరు జిల్లా అటవీ అధికారి కదిరి మహబూబ్ బాషా తెలిపారు. సైదాపురం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సైదాపురం సెంట్రల్ నర్సరీని శనివారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పా టు చేసిన ఈ సెంట్రల్ నరసరీలో 16 రకాలకు చెందిన 2 లక్షల మొక్కలను పెంచి.. అందులో 50 వేల మొక్కలను పంపిణీ చేయనున్నట్టు తెలిపా రు. జిల్లాలోని ఇనుకుర్తి, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, సైదాపురంలో ఉన్న నర్సరీల్లో ఈ ఏడాది 20 లక్షల మొక్కలను పెంచనున్నట్టు పేర్కొన్నా రు. ఆయన వెంట రేంజర్ మాల్యాద్రి, సెక్షన్ అధి కారి శ్రీనివాసులు, బీఓ రవిశేఖర్ పాల్గొన్నారు. కాళంగి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహంసూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని హోలీక్రాస్ స్కూల్ వెనుక భాగాన ఉన్న కాళంగి నదిలో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన గుర్తుతెలియని మహిళ శవం శనివారం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ బ్రహ్మనాయుడు మృతదేహాన్ని బయటకు తీశారు. ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. గంధం కలర్ చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించి ఉంది. మన్నారుపోలూరు వీఆర్వో పీ.మాధవయ్య నుంచి రిపోర్టు తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ముగిసిన శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు
తిరుపతి కల్చరల్: శ్రీరామచంద్ర పుష్కరిణిలో గత మూడు రోజులుగా చేపట్టిన శ్రీకోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజైన శనివారం రాత్రి స్వామి వారు తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం స్వామి,అమ్మవార్లు శ్రీరామచంద్ర పుష్కరిణికి వేంచేశారు. సుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు విహరించి భక్తులను కనువిందు చేశారు. ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. -
ఉన్నత లక్ష్య సాధనకు విద్యార్థి దశ కీలకం
తిరుపతి సిటీ: ఉన్నత లక్ష్య సాధనకు విద్యార్థి దశ కీలకమని, సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్య సాధనకు కృషి చేయా లని రిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ జే ప్రకాష్రెడ్డి పిలుపు నిచ్చారు. రిమ్స్లో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు వారం రోజులుగా కమ్యూనికేషన్, ఎంప్లాయిబిలిటీ స్కిల్స్పై జరిగిన శిక్షణ శనివారం ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడతూ విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అకడమిక్ విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం పలు పోటీలలో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. డైరెక్టర్లు వై.కొండారెడ్డి, ఆనందరెడ్డి, విజయ్రెడ్డి, హెచ్ఓడీ మధుర, ఫౌండేషన్కు చెందిన గురుస్వామి, వెంకటప్రసాద్, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
గోవిందా..భద్రత ఉందా?
పవిత్ర క్షేత్రంలో అపవిత్రం ● యథేచ్ఛగా నిషేధిత వస్తువులు ● పాదరక్షకులతో మహద్వారం వరకు వచ్చిన భక్తులు ● తిరుమల భద్రత గాలికి తిరుమల: తిరుమల క్షేత్రంలో భద్రత కరువైంది. కొద్ది రోజులుగా వైకుంఠ వాసుని చెంత జరుగుతున్న వరుస సంఘటనలే దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై నిఘా ఉంచాల్సిన సంబంధిత ఉన్నతాధికారులు పటిష్ట భద్రత ఉందంటూ ఊకదంపుడు ప్రసంగాలకే పరిమితమవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఇవి కనిపించలేదా గోవిందా? ● వారం క్రితం అలిపిరి టోల్గేట్ దాటుకుని ఒక ముస్లిం యువకుడు తనిఖీలు చేసుకోకుండా.. భద్రతా సిబ్బంది ఆపుతున్నా ఆగకుండా.. ముస్లిం వస్త్రాన్ని ధరించి ద్విచక్ర వాహనంపై తిరుమలకు చేరుకున్నాడు. తర్వాత తిరుమలలోని టోల్గేట్ వద్ద ఆ యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని టోల్గేట్ వద్దే అదుపు చేయలేకపోవడం అక్కడి భద్రత డొల్లతనం ఎత్తిచూపుతోంది. ● పది రోజుల క్రితం పాపవినాశనం డ్యాంలో అటవీశాఖ అధికారులు బోటింగ్ ప్రక్రియ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. పాపవినాశనానికి బోట్లు వచ్చిన సంగతి మీడియాలో వచ్చేవరకు ఉన్నతాధికారులకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ● మద్యం, సిగరెట్, గంజాయి వంటివి గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. వాటిని సేవించిన తర్వాత మందుబాబులు తిరుమలలో హల్చల్ చేస్తున్నారు. మాడ వీధులు మొదలుకుని అధికారులు నివాసం ఉండే ప్రాంతం వరకు కలియతిరుగుతున్నా వారిని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ● శనివారం మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముకేష్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవాణి టికెట్టుపై శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్–1 మీదుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. మహద్వారం వద్ద పనిచేసే టీటీడీ భద్రతా సిబ్బంది వీరిద్దరూ డిస్పోజబుల్ పాదరక్షలను ధరించి వచ్చినట్లు గుర్తించి వాటిని తొలగింపజేశారు. డిస్పోజబుల్ పాదరక్షలతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ క్యూలోకి ప్రవేశించి మహద్వారం వద్దకు వచ్చే వరకు ఎవ్వరూ గుర్తించకపోవడం అక్కడ భద్రత.. తనిఖీలు ఎలా ఉన్నాయో తేటతెల్లమవుతోంది. శాశ్వత సీవీఎస్వో లేకపోవడమే కారణమా? కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను ఇబ్బడిముబ్బడిగా బదిలీ చేశారు. ఇందులో భాగంగా తిరుమలలో పనిచేస్తున్న నరసింహకిషోర్ కొన్ని నెలల క్రితం బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత శాశ్వత సీవీఎస్వోను నియమించలేదు. అప్పటి నుంచి ఇన్చార్జ్ సీవీఎస్వోలతోనే భద్రతను నెట్టుకొస్తున్నారు. దీనికితోడు భద్రతా సిబ్బంది, విజిలెన్స్ అధికారులు సక్రమంగా తనిఖీలు చేయడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికారణంగానే తిరుమలలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. తిరుమలలో ఘోర అపచారాలు పాదరక్షకులతో శ్రీవారి దర్శనానికి భక్తులు టీటీడీలో భద్రత డొల్లతనం బట్టబయలు గోవుల మృతిపై విచారణ జరిపించాలి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర అపచారాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏదో ఒక సంఘటనలతో తిరుమల పవిత్రతను టీటీడీ అధికారులు మంటగలుపుతున్నారన్నారు. సాక్ష్యాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఆలయ మహద్వారం వరకు ముగ్గురు భక్తులు పాదరక్షకులతో రావడమే అందుకు నిదర్శనమన్నారు. తిరుమల మాడవీధుల్లోనే కాళ్లకు పాద రక్షకులు ధరించి తిరగడం నిషేధమన్నారు. అలాంటిది తిరుమల క్యూకాంప్లెక్స్లోకి ఎలా అనుమతించారు? అక్కడ నుంచి శ్రీవారి ఆలయ మహద్వారం వరకు పాదరక్షకులతో వస్తున్నా పట్టించుకోకుండా భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే దీనిపై టీటీడీ అధికారులు అవి పాదరక్షకులు కాదు చెవులకు రింగులు అని కూడా బుకాయిస్తారని మండిపడ్డారు. మేజోళ్లకు అనుమతి ఉందని టీటీడీ అధికారులు చెప్పినట్లు తెలిసిందన్నారు. వివరణ ఇచ్చి సరిపెట్టుకోవడం కుదరదు తిరుమలలో వరుసగా జరుగుతున్న ఘోర అపచారాలను తాము ప్రశ్నిస్తే వాటిపై వితండ వాదనలు, వివరణలు ఇచ్చి సరిపెట్టుకోవాలంటే కుదరదని భూమన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు చెప్పినప్పటి నుంచే ఇంతటి ఘోర అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమల పవిత్రతను కాపాడలేని టీటీడీ పాలక మండలి వెంటనే రాజీనామా చేయాలని, తిరుమలలో భద్రతా వైఫల్యాలకు కారకులైన అధికారులు, సిబ్బందిని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదండి.. నిరూపిస్తా గోమాతకు జరుగుతున్న నష్టంపైన మాట్లాడితే తనపై, జగన్మోహన్రెడ్డిపైన వ్యక్తిగత దాడికి ఆనం రామనారాయణరెడ్డితో పాటు చిన్న స్థాయి వ్యక్తులంతా మాట్లాడడం సరికాదన్నారు. గోశాలలో ఆవులు చనిపోయిన మాట నిజమని, అందుకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. అక్కడికి తనతో పాటు మీడియాను తీసుకెళితే అక్కడ పూడ్చిపెట్టిన ఆవుల కళేబరాలన్నింటినీ వెలికి తీద్దామన్నారు. గోవుల మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, తిరుతపి టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, డైరెక్టర్ మహ్మద్ ఖాసిం, ఎస్సీ విభాగం నాయకుడు కల్లూరి చంగయ్య పాల్గొన్నారు. -
కర్కశంగా మారిన కన్నతల్లి!
● కన్న కూతుర్ని హతమార్చి సహజ మరణంగా చిత్రీకరణ ● నరసింగాపురంలో పరువు హత్య ● ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే హత్య ● వివరాలను వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్ చంద్రగిరి: కన్నతల్లే.. కూతురి పట్ల కర్కోటకంగా మారి కడతేర్చింది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు తలవంపులు తెస్తోందని పరువు హత్యకు పాల్పడింది. ఇతర కులానికి చెందిన యువకుడిని బాలిక(16) ప్రేమించడమే ఆమె పాలిట శాపంగా మారింది. కూతురుని హత్యచేసిన తల్లి చివరకు కటకటాలపాలైన ఘటన శనివారం చంద్రగిరిలో చోటుచేసుకుంది. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని నరసింగాపురం గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. భర్తతో విభేదాలు రావడంతో 11 ఏళ్లుగా తల్లి అదే గ్రామంలో మరొక ఇంట్లో తన ఇద్దరు కుమార్తెలతో ఉంటోంది. బతుకుదెరువు కోసం తిరుమలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం తన పెద్ద కుమార్తె (16), మిట్టపాళెం గ్రామానికి చెందిన అజయ్ని ప్రేమించింది. దీనిపై అప్పట్లో అజయ్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అజయ్ను రిమాండ్కు తరలించారు. అప్పట్లో బాలిక గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా నాటు వైద్యం ద్వారా గర్భస్రావం చేశారు. అయితే అప్పట్లో బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇదిలా ఉండగా రిమాండ్ ఖైదీగా ఉన్న అజయ్ని సబ్జైలుకు వెళ్లి తరచూ పరామర్శిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. సబ్జైలు నుంచి బెయిల్పై వచ్చిన అజయ్తో బాలిక తరచూ సెల్ఫోన్లో చాటింగ్లు చేయడం, మాట్లాడడంపై తీవ్రంగా మండిపడ్డారు. తనను చంపేస్తారని ముందే తెలిసి తన కుమార్తె ప్రియుడు అజయ్తో చాటింగ్ చేయడం, ఫోన్లో మాట్లాడడాన్ని తల్లి గ్రహించింది. దీంతో కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో 15 రోజుల క్రితం బాలికను విషం పెట్టి చంపేసేందుకు తన తల్లి కుట్ర పన్నుతోందంటూ ప్రియుడికి వాట్సప్ ద్వారా మెసేజ్లు పెట్టినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆపై కొద్దిరోజుల్లోనే బాలిక మృతి చెందింది. ముక్కు, నోరు మూసివేసి! ఇంట్లో నిద్రస్తున్న బాలికను ఆమె తల్లే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 4వ తేదీన ఇంట్లో ఉన్న బాలిక ముక్కు, నోరు మూసివేసి హత్య చేసినట్లుగా నిందితురాలు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాలిక హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకూడదనే ఉద్దేశంతో గంటల వ్యవధిలో దహనం చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వేరొక కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతోనే తన కుమార్తెను హత్య చేసిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు నిందితురాలిని శనివారం అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన మీడియాకు వివరించారు. కేసు నమోదు చేసిన 72 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన సిబ్బందికి డీఎస్పీ రివార్డులను అందజేశారు. సీఐ సుబ్బరామిరెడ్డి, ఎస్ఐ అనిత ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో శ్రీధర్స్ ప్రభంజనం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి శ్రీధర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారని కళాశాల చైర్మన్ మద్దినేని శ్రీధర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సి.ఉమామహేశ్వర్ 465, కె.నిత్యశ్రీకల్యాణి 464, వి.శ్రీకర్రెడ్డి 463, ఎస్.యామిని, కె.పనుష్య, పి.వాసవి, పి.మానస 462, సి.షామితారెడ్డి, పి.యశ్విత 460 మార్కులు సాధించారన్నారు. జూనియర్ బైపీసీ విభాగంలో సి.జ్యోష్ణ 433, వీఎస్ రక్షిత 426, ఎం.దివ్య 422, సి.ధన్యత, వి.ప్రియదర్శిని 419 మార్కులు సాధించినట్లు చెప్పారు. అలాగే సీనియర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో బి.వన్షిక, మహమ్మద్ ఇమ్రాన్ 987, పి.నిఖిలేశ్వర్ 985, ఆర్.యుక్త 984, మహమ్మద్ తాలిబ్, డి.షోషిత 980 మార్కులు సాధించినట్టు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను అభినందించారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
గూడూరు రూరల్: పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందిన ఘటన గూడూరు రైల్వేస్టేషన్లో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం.. గూడూరు రైల్వే స్టేషన్ చివరి భాగంలో రైలు పట్టాలు దాటుతున్న సుమారు 55 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తిని బెంగళ్లూరు నుంచి గౌహతి వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్
సాక్షి, తిరుపతి: తిరుమల గోశాలలో గోవుల మృతి ఘటనపై మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల వ్యవధిలో పలు గోవులు చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గోవుల మృతి విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ద్వారా తెలిసింది. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాను’’ అని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.Fmr TTD Chair Karunakar Reddy has alleged that in the past 3 months, several sacred indigenous cows have died due to illness and lack of proper feed at TTD Goshala. I am gathering more information, Art 48 of the Indian Constitution, its State’s duty to protect them. PIL underway.— Subramanian Swamy (@Swamy39) April 12, 2025టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవుల మృతిపై వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న(శుక్రవారం) సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘టీటీడీ గోశాలలో దేశవాలి అవులు వందకు పైగా మృత్యువాత పడ్డాయి. నిర్వాహకులు ఈ విషయం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆవులు ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు పోస్ట్మార్టం కూడా నిర్వహించలేదు. డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్ చార్జిగా నియమించారు. ఆయనకు గోపరిరక్షణకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. -
తిరుమలలో మరో అపచారం
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహా ద్వారం వరకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించి వచ్చారు. అయితే, మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వీరిని గుర్తించకపోవడం గమనార్హం.ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలో భద్రతాలోపం మరోసారి బయటకు వచ్చింది. భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని మహా ద్వారం వరకు రావడం అధికార నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి వీరు పాదరక్షలు ధరించి మహా ద్వారం వరకు చేరుకున్నారు. వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం పాదరక్షలతో ఎలా వచ్చారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా తీరు, టీటీడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. ‘తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయట పడింది. పాద రక్షలు వేసుకుని మహా ద్వారం వరకు భక్తులు వెళ్ళారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోంది. శ్రీవాణి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహా ద్వారం వరకు పట్టించుకోలేదు. మేజోళ్ళుకు అనుమతి ఉంది అని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పండి. తిరుమల కొండపై జరుగుతున్న అపచారాలు గురించి చెప్తుంటే వితండ వాదనలు చేస్తున్నారు. తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి.రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేదు, చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు ఏనాడు రాలేదు. భద్రత డొల్లతనం ఏమిటి అన్నది తెలుస్తోంది. టీటీడీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోశాలలో ఆవులు చనిపోయాయి, దీనికి ప్రత్యక్ష సాక్షాలు ఉన్నాయి. జేసీబీలతో వెళ్ళి పూడ్చిన కళేబరాలు త్రవ్వి మీడియా సమక్షంలో బయటపెడదాం. టీటీడీ పాలకమండలి వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్ చేస్తున్నా. దీనికి కారణమై సెక్యూరిటీ, ఇతర అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తిరుమల భద్రత ఎంత అధ్వాన్న పరిస్థితికి వెళ్ళింది అనేది తేట తెల్లమైంది. తిరుపతి గోశాలలో గోవులు చనిపోయాయి అని చెప్తే, మాపై ఎదురు దాడి విమర్శలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
విరూపాక్షపురంలో కుల దురహంకారం
● బండి నెమ్మదిగా నడపమన్నందుకు గిరిజనులపై అగ్రకులాల మూకుమ్మడి దాడి శ్రీకాళహస్తి: ద్విచక్ర వాహనాన్ని నెమ్మదిగా నడమన్నందుకు అగ్ర కులాలు గిరిజనులపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన తిరుపతి జిల్లా, తొట్టంబేడు మండలం, విరూపాక్షపురం గిరిజన కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత గిరిజనుల కథనం మేరకు.. గద్దగుంట గ్రామానికి చెందిన వన్నెకాపు సుబ్రమణ్యం కుమారుడు చైతన్య శ్రీకాళహస్తి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో విరూపాక్షపురం ఎస్టీ కాలనీ వద్ద బండి వేగంగా నడపడంతో రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని ఢీకొనబోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న నాగయ్య, వెంకటేష్ బండి నెమ్మదిగా నడపొచ్చు కదా..? అంటూ చైతన్యను నిలదీశారు. దీంతో అహం దెబ్బతిన్న చైతన్య రోడ్డుపైనే నాగయ్య, వెంకటేష్పై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా గద్దగుంటకు వెళ్లి మరో 20 మందిని వెంట తీసుకొచ్చి ఇంకోసారి నాగయ్య, వెంకటేష్ లపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అగ్రకులస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన నాగయ్య(60), వెంకటేష్(30)ను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తొట్టంబేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గిరిజనులపై అహంకారపూరితంగా దాడికి దిగిన అగ్రకులస్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య డిమాండ్ చేశారు. -
మహిళా వర్సిటీలో ఏడు పరిశోధనలకు ఆమోదం
తిరుపతి సిటీ: అంతర్జాతీయ విద్యా పరిశోధన నిధి ద్వారా ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్(పీఎం ఉష) పథకం కింద ఏడు అంతర్జాతీయ విద్యా పరిశోధన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ తెలిపారు. ఇందులో ప్రధానంగా యూఎస్ఏ జెనోమిక్స్ బయోటెక్ ఇంక్ వర్సిటీ, మలేషియాలోని టెరెంగాను, యూనివర్సిటీ అటున్ హుస్సేన్ ఓన్, అలాగే యూఎస్లోని టెక్సెస్ ఫోర్ట్ వర్త్ వర్సిటీ, కెనడాలోని యార్క్ విశ్వవిద్యాలయం, నేపాల్లోని ఖాట్మండు విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో బయోటెక్నాలజీ, అఫ్లైడ్ మైక్రోబయాలజీ, హోమ్ సైన్న్స్, ఫార్మసీ, కంప్యూటర్ సైనన్స్ ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, లా విభాగాల్లో పరిశోధన ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. ఈ నిధులను మ్యాచింగ్ గ్రాంట్ కింద అధ్యాపకులకు అందిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాజెక్టుల సాధనలో కృషి చేసిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రజిని, డీన్ ప్రొఫెసర్ పి విజయలక్ష్మి, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఆర్ ఉషా పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 57,462 మంది స్వామివారిని దర్శించుకోగా 22,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
హంస వాహనంపై లక్ష్మీనరసింహుడు
రాపూరు: పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక వ సంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు ఉభయనాంచారులతో కలసి హంస వాహనంపై విహరించారు. స్వామి వారి అలంకార మండపంలో నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవమూర్తులను కొలువు దీర్చి, కోన మాఢవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు శ్రీవారి కల్యాణ మండపంలో నిత్యహోమం, 10 గంటలకు స్వామి వారి నందనవనంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీలో పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం నివారించి, మెరుగైన సరఫరాకు కృషి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతి ఎస్ఈ సురేంద్రనాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్పీడీసీఎల్) తిరుపతి సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సురేంద్ర నాయుడు శుక్రవారం శ్రీసిటీలో నిర్వహించిన పరిశ్రమల విద్యుత్ వినియోగదారుల సదస్సులో పాల్గొన్నారు. విద్యుత్ వినియోగం, సరఫరా, ఇతర విద్యుత్ సమస్యలపై పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. పరిశ్రమ వర్గాలకు పలు సందేహాలను నివృత్తి చేశారు. తుంబురు తీర్థానికి భారీగా భక్తులు తిరుమల: తుంబురు తీర్థ ముక్కోటికి భారీగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. శుక్రవారం, శనివారం పాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు శేషాచల అడవుల్లోని తుంబూరు తీర్థ ముక్కోటికి వస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 5 నుంచి 10 గంటల వరకు భక్తులను అనుమతించారు. తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు చేసి శ్రీ తుంబురుడిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదం, నీళ్ళు, మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులకు భద్రత, వైద్యసేవలను తితిదే విజిలెన్స్ ఆటవీశాఖ, వైద్యవిభాగం ఏర్పాటు చేశారు. భక్తులను శనివారం ఉదయం 5 నుంచి 10 గంటల వరకు మాత్రమే తుంబురు తీర్ధంకు అనుమతిస్తారు తితిదే ఏర్పాట్లను వీజీఓ సురేంద్ర, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మధుసూదర్రావు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి జీఎల్ఎన్ శాస్త్రి తదితరులు పర్యవేక్షించారు. -
పంటలపై అడవి పందుల దాడి
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కాంపాళ్లెం, కరకంబట్టు, కుక్కంబాకం, బు చ్చినాయుడుకండ్రిగ, గ్రామాల్లో రైతులు సాగు చేసి న పంటలపై అడవిపందులు దాడులు చేసి ధ్వంసం చేస్తున్నాయి. అటవీ సరిహద్దు గ్రామాల్లో 565 ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో అడవి పందులు రాత్రి వేళల్లో పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో పందులు నాశనం చేయటంతో రైతులు దిక్కుతోచక నానా అవస్థలు పడుతున్నారు. కిలాడీ లేడీది కలువాయి మండలమే! కలువాయి(సైదాపురం): ఉద్యోగం కావాలనా నా యనా... అయితే ఎస్బీఐలోనే ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.లక్షల్లో నగ దు తీసుకుని ఒక పోలీసు అధికారి సహకారంతో నెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్లో దందా సాగిస్తున్న ఓ కిలాడీ లేడీది శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, కలువాయి మండలంలోని చౌటపల్లిగా పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, కలువా యి మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన బత్తుల రజిత (రమ్య) మాదాపూర్ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు అందరినీ నమ్మించింది. స్నేహితుల సహకారంతో ఉద్యోగాలు ఇప్పిస్తా నంటూ నమ్మబలికేది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు నెల్లూరులోని ముత్తూట్ ఫైనాన్స్కు వెళ్లింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న శ్రీదేవి అనే మహిళతో పరిచయం పెంచుకుని, నీకు ఎస్బీఐలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఆమె నుంచి తన తండ్రి వెంకటేశ్వర్లు ఖాతాల్లోకి పలు దఫాలుగా రూ.9.6 లక్షల నగదును వేయించుకుంది. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత 2022లో నకిలీ ఎస్బీఐ అపాయింట్మెంట్ లెటర్ను, నకిలీ ఐడీ కార్డును ఇచ్చి హైదరాబాద్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని మాయమాటలు చెప్పింది. అయితే నెలలు గడుస్తున్నా శ్రీదేవికి ఉద్యోగం రాకపోవడంతో గొడవ పడింది. దీంతో రజిత రూ.70 వేలు నగదును శ్రీదేవికి అందజేసింది. మిగిలిన నగదు ఇవ్వాలని అడగగా శ్రీదేవిపై దౌర్జన్యానికి దిగింది. దీంతో ఆమె నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రజిత, ఆమె తండ్రి వెంకటేశ్వర్లుపై కేసు నమోదైంది. -
యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ పరీక్షలు రేపు
తిరుపతి అర్బన్: నగరంలో ఆదివారం యూపీఎస్సీ కంబెన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ పరీక్షలు జరగనున్నాయని, వీటికి నిర్వహనకు పటిష్ట చర్యలు చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. తిరుపతిలో 3 చోట్ల పరీక్షలు ఉంటాయన్నారు. యూపీఎస్సీ కంబెన్డ్ డిఫె న్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటలకు ఉంటాయని వెల్లడించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిలాల్లో 3 సెంటర్లు కేటాయించామన్నారు. 973 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఈ పరీక్షలకు డిప్యూటీ తహసీల్దార్ అధి కారి లైజన్ అధికారిగా ఉంటారన్నారు. పరీక్ష కేంద్రంలో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రికల్ వస్తువులకు అనుమతి లేదన్నారు. మరోవైపు బస్టాండ్ నుంచి ఆర్టీసీ వారు పరీక్ష కేంద్రాల వరకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారన్నారు. తిరుపతిలోని బాలాజీ కాలనీ వెస్ట్ చర్చి రోడ్డు మార్గంలోని శ్రీపద్మావతి బాలికల ఉన్నత పాఠశాలతోపాటు శ్రీపద్మావతి అతిథి గృహం వద్ద శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల(వింగ్–ఏ), శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్–బీ)పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయన్నారు. ఆర్డీఓ రామమోహన్, యూపీఎస్సీ డిప్యూటీ సె క్రటరీ ఎన్కే స్వామి పరీక్షలను పర్యవేక్షించనున్నారని చెప్పారు. -
25 మందిపై కేసు నమోదు
ఓజిలి: మండలంలోని అత్తివరం గ్రామంలో పరిశ్రమల విషయంలో చోటు చేసుకున్న వివాదంలో రెండు వర్గాలకు చెందిన 25 మందిపై గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం మేరకు.. అత్తివరం గ్రామంలోని పారిశ్రామిక సెజ్లో పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమలలో అధిపత్యం కోసం టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం పరిశ్రమలకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తుండగా పాల్చూరు అమరేంద్ర, ధర్మేంద్ర, పాకనాటి శ్రీనివాసులు మరో 10 మంది కలసి తనపై దాడి చేసి కులంపేరుతో దూషించారని బాధితుడు కుంపటి మహేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలో విచారణ జరిపి, 13 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. అలాగే పరిశ్రమలలో అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చెలరేగిన వివాదంలో ఎల్లు గురుమూర్తి, మహేంద్ర, అనీల్రెడ్డితోపాటు మరో 9 మంది తనపై దాడి చేశారని పాకనాటి లోకేష్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాదితుడు ఫిర్యాదు మేరకు 12 మందిపై ఎస్ఐ స్వప్న కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును శుక్రవారం నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు విచారణ చేపట్టారు. అత్తివరం గ్రామంలోని పరిశ్రమలు, గ్రామస్తులను విచారణ జరిపి వివరాలు సేకరించారు. ఈ మేరకు రెండు వర్గాలు మధ్య వివాదాలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పూలే సేవలు చిరస్మరణీయం
తిరుపతి అర్బన్: మహిళల విద్యకు మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్రలకు విద్య అవసరమన్న విషయం గుర్తించి, ఆ దిశగా ఎనలేని సేవలు చేసిన మహా మనిషి జ్యోతిబాపూలే అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు ఘనంగా జ్యోతిరావుపూలే జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించామన్నారు. దేశ చరిత్రలో సామాజిక సంస్కరణలకు జ్యోతిబా పూ లే ఆధ్యుడని తెలిపారు. అనంతరం కార్పొరేషన్ రుణాలకు చెందిన చెక్కును జారీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 600 మంది బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు పలు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాయాదవ్, డీఆర్వో నరసింహులు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈఓ బాబు రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డై రెక్టర్లు మదన్మోహన్, చంద్రన్న, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలాజీకాలనీలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేశా రు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాంగాటి గోపాల్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు, నేతలు యార్లపల్లి గోపి, అశోక్ సామ్రాట్ యాదవ్, మజీద్ పట్టేల్, శివశంకర్ పాల్గొన్నారు. ● కలెక్టరేట్లో పూలే జయంతి వేడుకలు.. -
పత్రికా స్వేచ్ఛ హరించడం సబబుకాదు
చిత్తూరు అర్బన్: పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, జర్నలిస్టులను అణగదొక్కాలని చూ స్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చి త్తూరులో పాత్రికేయలోకం కదం తొక్కింది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, చి త్తూరు ప్రెస్క్లబ్, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్క్లబ్, తవణంపల్లె ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు నగరంలో విలేకరులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోకనాథన్, మురళీకృష్ణ, చిత్తూరు ప్రెస్ క్లబ్ కార్యదర్శి కాలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వన్టౌన్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం, ఆర్డీఓ కార్యాలయం వరకు వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లోకనాథన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల గొంతుపై కేసులు పెట్టి పాత్రికేయులను లోబరచుకోవాలని చూస్తోందన్నారు. పల్నాడులో వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్యకు గురైన వార్తలు రాసినందుకు ఆరుగురు పాత్రికేయులతోపాటు, సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి పై క్రిమినల్ కేసులు పెట్టడం ఏమాత్రం ఆమోదయో గ్యం కాదన్నారు. పత్రికలో ప్రచురితమైన వార్తలో అభ్యంతరం ఉంటే ఖండించడం, న్యాయపరంగా ముందుకు వెళ్లడం చేయాలే తప్ప, ఎవరో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ రా జ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ ప్రకటనను హరించడమేనన్నారు. రాష్ట్ర డీజీపీ సైతం కనీస న్యా య సలహా తీసుకోకుండా పాత్రికేయులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడం మంచిది కాదన్నారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులను కలిసి సాక్షి పాత్రికేయులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాష్, ఉపాధ్యక్షులు శివకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్, వెంకటేష్ , చిత్తూరు ప్రెస్క్లబ్ ఉపాధ్యక్షులు పవన్, శివకుమార్, కార్యవర్గ సభ్యులు చంద్ర, రాజేష్, బాలసుందరం, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమలయ్య, నరేష్, తేజ, ఎంజీఆర్, తవణంపల్లి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు జగన్నాథం, శివకుమార్, అనంత్ కుమార్, పాత్రికేయులు హేమంత్ కుమార్, ప్రవీణ్, జయకుమార్, ఐరాల చిన్న, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ● పలమనేరు ఆర్డీఓకు వినతిపత్రం అందజేత పలమనేరు: పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించడం సబబుకాదని, పత్రికలను అణగదొక్కాలని గతంలో అనుకున్న పార్టీలు ఆపై కనిపించకుండా పోయాయని పలమనేరు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్, దిలీప్ అన్నా రు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసు నమోదుకు వ్యతిరేకంగా స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడి యా ప్రతినిధులతో కలసి శుక్రవారం నిరసన తెలిపి ఆపై స్థానిక ఆర్డీఓ భవానీకి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికల్లో వెలువడే వార్తలను పార్టీలకు అంటగడుతూ ఎడిటర్లపై కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. పత్రికలో వచ్చిన వార్త తప్పుగా ఇంటే దానిపై ఖండన, రీజయిండర్ ఇవ్వాలి గానీ, ఇలా కేసులు పెట్టడం, దాన్ని పోలీసులు అమలు చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాసామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై కేసులు పెట్టడం భవిష్యత్తులో అనర్థాలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి తప్పుడు కేసులపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఇలాంటి సంస్క్రృతి కొనసాగితే రేపు మరోపార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటివి పునరావృత్తం కావడం ఖాయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇందులో ప్రెస్క్లబ్ సభ్యు లు రెడ్డెప్ప, సుబ్రమణ్యం, రంజిత్, సూర్యబాబు, సాక్షి మణి, మోహన్మురళి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
తిరుపతి సిటీ: అణగారిన వార్గాల ఆశాజ్యోతి, సీ్త్ర విద్య కోసం ఎనలేని కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. శుక్రవారం తిరుపతి వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కుల వివక్ష నిర్మూలన, సమసమాజ స్థాపన కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సాంఘిక సంస్కర్త పూలే అన్నారు. నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయ కర్త అభినయ్రెడ్డి, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు లవ్లీ వెంకటేష్, మోహన్, అరుణ్, మురళి, బొగ్గుల వెంకటేష్, కరాటే శీను, గోపాల్రెడ్డి, రమణ, సాయికుమారి, పునీత, పుష్పలత, కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
మహిళపై ఎస్ఐ దాష్టీకం
రేణిగుంట: తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, పోలి భీమారం గ్రామానికి చెందిన ఓ మహిళపై రూరల్ ఎస్ఐ అభ్యంతరకర రీతిలో దాడికి పాల్పడిన సంఘటన ఇది. హత్యాయత్నం కేసు ఉందంటూ ఓ వ్యక్తి ఇంటికి వచ్చి ఎసై.. అతను పొలానికి వెళ్లడంతో అతని భార్యపై దాడికి దిగారు. బాధితురాలి కథనం మేరకు..శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహారావు సిబ్బందితో కలిసి భీమారం గ్రామానికి చెందిన చిన్నమనాయుడు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భార్య సంధ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్నమనాయుడు ఎక్కడ?, అతనిపై హత్యాయత్నం కేసు ఉంది, అరెస్ట్ చేయాలని గట్టిగా కేకలు వేశారు.బూతులు తిడుతూ మాట్లాడాడు. దీంతో పొలం వద్దకు వెళ్లాడని, ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారని సంధ్య ప్రశ్నించింది. విచక్షణ కోల్పోయిన ఎస్ఐ ఆమె జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి దాడి చేశారు. జాకెట్ చిరిగిపోయిందని, ఎంత ప్రాధేయపడుతున్నా వదలకుండా తాళిబొట్టు తెంచేశాడని సంధ్య కన్నీరుమున్నీరైంది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో తనపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితురాలు వాపోయింది. ఎవరిని చంపామో చెప్తే తమంతట తామే వచ్చి స్టేషన్లో లొంగిపోతామని వేడుకున్నా వినకుండా దారుణంగా దాడి చేశారని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తిని వివరణ కోరగా, హత్యాయత్నం కేసుకు సంబంధించి కొంత కాలం నుంచి పిలుస్తున్నా చిన్నమనాయుడు స్పందించకపోవడంతో ఎస్ఐ గ్రామానికి వెళ్లారన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్ చాట్లో సంచలన విషయాలు
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరిలో సంచలనం రేపిన పరువు హత్య ఘటనలో మిస్టరీ వీడింది. చంద్రగిరి మండలం నరసింగాపురంలో నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో తల్లే నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. కూతురు నిఖిత ప్రేమ వ్యవహారం నచ్చకే ఆమె తల్లి సుజాత నిఖితను తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిఖిత తల్లి సుజాతను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.మిట్టపాళెనికి చెందిన అజయ్ అనే వ్యక్తిని 17 ఏళ్ల నిఖిత ప్రేమించింది. ఏడాది క్రితం కూతురు నిఖిత గర్భం దాల్చడంతో కడుపులోని బిడ్డను డెలివరీ చేసి మరి తల్లి సుజాత హత్య చేసినట్లు సమాచారం. నిఖిత తల్లిదండ్రులు పిర్యాదుతో అజయ్పై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు పంపారు. నాలుగు నెలల పాటు జైలులో ఉన్న అజయ్ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది.బెయిల్ బయటకు వచ్చిన అజయ్ను మళ్లీ కలిసిన నిఖితపై కోప్పడిన తల్లి సుజాత.. గత శుక్రవారం నిద్రిస్తున్న కూతురిని చంపి గంటల వ్యవధిలో మృతదేహాన్ని కాల్చివేసింది. సాధారణ మరణంగా బంధువులను సుజాత నమ్మించింది. ఈ కేసులో సుజాతకు సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో వాట్సాప్ చాట్ ద్వారా నిజాలు వెలుగు చూశాయి. తనకు విషం పెట్టి చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ప్రియుడు అజయ్కు నిఖిత తెలిపింది. మా అత్త, అమ్మ, తాతయ్య విషం పెట్టీ చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ నిఖిత పేర్కొంది. వాట్సాప్ చాట్.. పోలీసులకు కీలక ఆధారంగా మారింది. -
తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన
తిరుపతి, సాక్షి: తిరుమల ప్రతిష్టతను దెబ్బ తీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్న ఆయన.. గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్నా ఆ సంగతిని బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది. కానీ, ఇవాళ జరుగుతోంది ఏంటి?. టీటీడీ గోశాల(TTD Goshala)లో అమ్మకంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తారు. కానీ, తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి. మూగజీవాలు దిక్కుమొక్కు లేకుండా మరణిస్తున్నాయి. కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించలేదు... మా పాలనలో 500 గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించాం. గతంలో వందే గో మాతరం అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో చేపట్టాం. అయినా ఎల్లో మీడియా ద్వారా మాపై విషం చిమ్మారు. ఆ ఆవుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోవుల పట్ల కూటమి సర్కార్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. లేగదూడలను పట్టించుకునేవాడు లేడు. చెత్తకు వేసినట్లుగా ఆవులకు గ్రాసం వేస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి గోశాలకు ఓ డైరెక్టర్ అంటూ లేడు. డీఎఫ్వో స్థాయి అధికారిని గోశాలకు ఇన్చార్జిగా నియమించారు. సాహివాల్ ఆవు గోశాలనుంచి బయటకు వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయింది. టీటీడీకి చెందినది కాదని చెప్పేందుకు చెవులు కట్ చేశారు. గోశాల.. గోవధశాలగా మారింది.. భగవంతుడితో సమానమైన గోవులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఈ మహా పాపం కూటమి సర్కార్, టీటీడీ అధికారులదే. ఇంత జరుగుతున్నా.. పవనానంద స్వామి(Pawan Kalyan) ఎక్కడ? ఏం చేస్తున్నారు?. గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందన్న భూమన.. గోవుల మృతిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. హైందవ సమాజం గోశాలలో ఘటనలపై స్పందించాలని కోరారాయన. -
నేడు, రేపు వానలు
సాక్షి, విశాఖపట్నం/తిరుపతి రూరల్/: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది గురువారం అర్ధరాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉంది. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులపాటు వర్షాల ప్రభావం అక్కడక్కడా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా.. నేడు, రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలుపడే సూచనలున్నాయని తెలిపారు. గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కోస్తాంధ్ర మత్స్యకారులు శుక్రవారం వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం గురువారం కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూరు, దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దర్శి మండలం చందలూరు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, అబ్బాయిపాలెం, మల్లవరం, చిదంబరంపల్లి, గొల్లపల్లి, కుంచేపల్లి పాములపాడు గ్రామాల్లో బొప్పాయి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
తడ: జాతీయ రహదారిపై కారూరు పంచాయతీ, కారూరుమిట్ట గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడులోని రెడ్ హిల్స్కి చెందిన సుబ్రమణి(50) మృతి చెందాడు. ఎస్ఐ కొడపనాయుడు కథనం.. కారూరు పంచాయతీ, ఖాశింగాడు కుప్పం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వద్ద సుబ్రమణి రైల్వే కూలి పనులకోసం వచ్చి అదే గ్రామంలో ఉంటున్నాడు. బుధవారం రాత్రి సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో రోడ్డు దాటుతుండగా చైన్నె నుంచి సూళ్లూరుపేట వైపు వెళుతున్న టెంపో ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రమణి అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
జాతీయ స్థాయికి ‘మినీ ఫాస్ట్ కంపోస్టర్ ప్రాజెక్టు’
తిరుపతి ఎడ్యుకేషన్ : కేంద్ర ప్రభుత్వ ఇన్నోవేషన్ సెల్ మంత్రిత్వ శాఖ, అటల్ టింకరింగ్ ల్యాబ్, నీతి ఆయోగ్, జాతీయ సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా 2024–25 విద్యాసంవత్సరంలో స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది. గత ఏడాది జూలై 29 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాల నుంచి దాదాపు లక్షకు పైగా మోడల్స్ను విద్యార్థులు పంపించారు. వీటి నుంచి 1,731 ప్రాజెక్టులు మొదటి దశలో ఎంపికవగా, మన రాష్ట్రం నుంచి 76 ప్రాజెక్టులున్నాయి. అందులో నుంచి తిరుపతి, విజయనగరానికి చెందిన రెండు ప్రాజెక్టులు మాత్రమే ఆర్థిక సాయానికి ఎంపికయ్యాయి. తిరుపతి జిల్లా, వడమాలపేట మండలం, తడుకు ఆర్ఎస్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు హేమశ్రీ, గీతిక, వినయ్కుమార్ జిల్లా సైన్స్ అధికారి భానుప్రసాద్ మార్గనిర్దేశంలో రూపొందించిన మినీ ఫాస్ట్ కంపోస్టర్ ప్రాజెక్టుకు అభివృద్ధికి రూ.90వేలు ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో ప్రాజెక్టు రూపకర్తలను, సైన్స్ ఆఫీసర్, డీఈఓ కేవీఎన్.కుమార్లను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ అభినందించారు. ఈ ప్రాజెక్టు పనితీరు, ఉపయోగాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుని సమాజాభివృద్ధికి అవసరమయ్యే ఆవిష్కరణలు చేయాలని జేసీ పిలుపునిచ్చారు. విద్యార్థులను అభినందించిన జేసీ, డీఈఓ -
గిరిజన విద్యార్థుల స్కాలర్షిప్ కోసం కృషి
● కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి జువల్ ఓరంతిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి జువల్ ఓరం హామీ ఇచ్చారు. గురువారం ఆయన జాతీయ సంస్కృత వర్సిటీలో పర్యటించి అధికారులు, గిరిజన విద్యార్థులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సంస్కృత భాషా వ్యాప్తికి వర్సిటీ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వర్సిటీ పరిశోధనలు, విద్యాభివృద్ధిలోనూ అగ్రస్థానంలో కొనసాగుతుండటం ప్రశంసనీయమన్నారు. భారతీ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. అనంతరం ఆయన వర్సిటీలోని శ్రీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఒడిశా చైర్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానరంజన్ పాండా, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్కు అంతరాయం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రేణిగుంట– కడప రహదారి కరకంబాడి వద్ద కడప వైపు వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపేసి ట్రాఫిక్ను తిరుపతి వైపు మళ్లించారు. కరకంబాడి వద్ద వాహనాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. రేపు జరిగే సీఎం కార్యక్రమానికి ఇప్పటి నుంచే వాహనాలను నిలిపివేయడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. అయితే సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ వల్లే వాహనాలను ఆపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాల్మీకి చరిత్ర పుస్తకావిష్కరణ తిరుపతి సిటీ: ఎస్వీయూ ప్రాచ్య పరిశోధన సంస్థ ముద్రించిన ‘వాల్మీకి చరిత్ర’ పుస్తకాన్ని గురువారం వీసీ ఆచార్య చిప్పాడ అప్పారావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నిధులతో ప్రాచ్య పరిశోధన సంస్థ రఘునాథ నాయకుడు రాసిన ‘వాల్మీకి చరిత్ర’ను ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ గ్రంథాన్ని సంస్థ సంచాలకులు ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు వచనంలో భావానువాదం చేశారని తెలిపారు. వాల్మీకి మహర్షిగా మారకముందు ఆయన జీవన సరళిని విపులంగా ఇందులో వివరించారన్నారు. కిరాతకుడిగా జీవించిన వ్యక్తి సప్తర్షుల ప్రభావంతో మహర్షిగా మారి సంస్కృత ఆదికావ్యం రామాయణం నిర్మించిన చరిత్ర ఈ గ్రంథంలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్వీయూ సెంట్రల్ లైబ్రరీ డైరెక్టర్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు. ముమ్మాటికీ అది దుర్మార్గం తిరుపతి కల్చరల్: అడవుల్లో నక్సల్ ఏరివేత ముమ్మాటికి దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. గురువారం తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 కల్లా నక్సల్ను తుదముట్టిస్తామన్న కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలు గిరిజన ప్రాంత వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. అటవీ ప్రాంతాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలన్న వైఖరితో కేంద్రం కుట్రచేస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఉభయసభల్లో వక్ఫ్ బిల్లుపై బుల్డోజ్ చేసి బిల్లు పాస్ చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు తిరువనంతపురంలో జాతీయ సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆక్వా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. -
భారతమ్మపై అనుచిత వ్యాఖ్యలు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు ● చేబ్రోలు కిరణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్బుచ్చినాయుడుకండ్రిగ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై బుచ్చినాయుడుకండ్రిగ పోలీస్ స్టేషన్లో గురువారం వైఎస్సార్సీపీ మండల కన్వీనరు కొణతనేని మణినాయుడు, చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనరు వేలూరు రాకేష్ ఫిర్యాదు చేశారు. యూట్యూబర్ చేబ్రోలు కిరణ్పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపై టీడీపీ ఆధ్వర్యంలో పనిచేసే ఐటీడీపీ వంటి సంస్థలు అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెట్టాయని ఆరోపించారు. కొన్నింటిని మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడం వారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతోందన్నారు. పాయింట్ బ్లాక్ అనే యూట్యూబ్లో చేబ్రోలు కిరణ్ అభ్యంతకరమైన ఆరోపణలు చేశారని, కిరణ్తోపాటు ఇంటర్వ్యూ చేసిన వారిపై కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వారి వెంట వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపాల్రెడ్డి, రవిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గురునాథం, వైస్ ఎంపీపీ మునికృష్ణారెడ్డి, నాయకులు గురవయ్య, ప్రసాద్పాల్, కిరణ్యాదవ్, ప్రసాద్, అమరలింగయ్య, వెంకటేష్, రాజశేఖర్, దయాకర్రెడ్డి ఉన్నారు. -
● మామిడి ఎగుమతులపై 26 శాతం పన్ను విధించిన అమెరికా ● భారీగా తగ్గనున్న మామిడి ఎగుమతులు ● ఫలితంగా ఢీలా పడనున్న మామిడి ధరలు ● నేడు చిత్తూరులో మామిడి వ్యాపారులు, రైతులతో హార్టికల్చర్ కాన్క్లేవ్
మామిడి.. పండ్లలో రారాజు. మాధుర్యం..చక్కటి రుచి, సువాసనలో సాటిలేనిది చిత్తూరు మామిడి. జిల్లాలో పండే ఈ పంట ప్రపంచంలోనే పేరుగాంచింది. అందుకే ఇక్కడి మామిడి పలు విదేశాలకు ఎగుమతి.. కర్షకులకు బహుమతిగా ప్రసిద్ధి చెందింది. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి పన్నుల విధానం.. స్థానిక పల్ప్ ఫ్యాక్టరీల నిర్వాహకులు సిండికేట్తో ధరలు పతనం తప్పదా? అన్న సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో మన మామిడి వి‘ఫల’రాజుగా మిగిలేనా? లేక రాణించేనా? అన్న మీమాంస రైతుల్లో నెలకొంది. శుక్రవారం జరగనున్న ఉద్యానవన సదస్సులో ఏ మి జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.పలమనేరు : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రైతులకు ప్రధాన ఆధారం మామిడి. ఇక్కడ 70 శాతం తోతాపురి తోటలున్నాయి. జిల్లాలోని మామిడి ఉత్పత్తుల్లో 60 శాతం మ్యాంగో పల్ప్ పరిశ్రమలకు వెళ్లగా 20 శాతం దాకా టేబుల్ వైరెటీలు విదేశాలకు ఏటా ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతులపై గతంలో మామిడిపై కేవలం 5 శాతం మాత్రమే పన్నులుండేవి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న అధిక పన్నుల కారణంగా చిత్తూరు జిల్లా నుంచి ఎగుమతి అయ్యే మామిడిపై 26 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే 2.50 లక్షల టన్నుల మామిడిపై అధిక పన్ను ప్రభావం పడనుంది. గతేడాది సీజన్లో టన్ను రూ.28 వేలు వరకు ఉన్న ధరలు అమాంతం తగ్గుముఖం పట్టి టన్ను రూ.21 వేలకు చేరింది. దీంతో మామిడి రైతులకు గతేడాది నష్టాలు తప్ప లేదు. ఏటా సీజన్లో పల్ప్ యాజమాన్యాలు సిండికేట్ అయి ధరలను నియంత్రిస్తున్నట్లు మామిడి రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో అమెరికా పన్ను కేవలం 5 శాతమే.. జిల్లా నుంచి టేబుల్ రకాల మామిడి అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బెహరైన్, నేపాల్, యూఏఈ దేశాలకు ఎగుమతులు జరిగేవి. ఎక్కువ శాతం యూఎస్ఏకు వెళ్లేది. గతంలో మామిడిపై పన్ను కేవలం 5 శాతం మాత్రమే ఉండేది. కానీ ట్రంప్ గద్దెనెక్కాక పన్నులను 26 శాతానికి పెంచేశారు. భారీగా పెరిగిన పన్నులు మామిడి ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఎగుమతి పన్ను పెరిగినందున ఇక్కడి వ్యాపారులు స్థానిక మామిడి తక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. దీంతో మామిడి రైతులకు నష్టాలు తప్పేలాలేవు. ఇతర దేశాలపై దృష్టి సారించాలి ఏటా ఇక్కడి నుంచి మామిడిని ఎగుమతి చేసే పలు దేశాల్లో పన్నులు తక్కువగా ఉన్న దేశాలకు ఎగుమతులను పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారుతుంది. పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ దెబ్బ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల్లో 30 దాకా మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. ఇక్కడ పండిన పంటలో 50 శాతం జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని జ్యూస్ ఫ్యాక్టరీలకు చేరుతుంది. మామిడి కాయలను పల్ప్ (మామిడి గుజ్జు) తయారు చేసి, ఇతర రాష్ట్రాలకే కాక విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తుంటారు. ఏటా జూన్ తొలివారం నుంచి జులై తొలి వారం వరకు తోతాపురి సీజన్ ముగుస్తుంది. ఆపై ఆగస్టు తొలివారం వరకు నీలం లాంటి టేబుల్ రకాలతో ఇక్కడి సీజన్ అయిపోతుంది. అయితే ఏటా జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల పల్ప్ పరిశ్రమలు సైతం సిండికేట్గా మారి ధరలను తగ్గిస్తున్న విషయం ఏటా జరుగుతూనే ఉంది. దీంతో తోతాపురి రైతులకు ఏటా పండించిన మామిడికి గిట్టుబాటు దక్కకుండా పోతోంది. నేడు చిత్తూరులో ఉద్యానవన సదస్సు అమెరికా పన్నులు పెంచిన నేపథ్యం, స్థానికంగా పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ వ్యవహారంపై నేడు జిల్లా కేంద్రంలో జరగనున్న ఉద్యానవన సదస్సుకు కలెక్టర్ , హార్టికల్చర్ శాఖ , చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్తో పాటు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మామిడి రైతులు, వ్యాపారులు, పల్ప్ పరిశ్రమల నిర్వాహకులు హాజరు కానున్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మామిడి రైతుకు గిట్టుబాటు ధర టన్ను రూ.30 వేల దాకా ఉండాలి. ఏటా గుజ్జు పరిశ్రమల సిండికేట్తో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తోతాపురి కాయలు కోతల కొచ్చే సమయంలో ఉన్నట్టుండి ధరలు తగ్గుముఖం పడితే రైతులకు తీవ్ర నష్టం వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు పల్ఫ్ పరిశ్రమ నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. – సుబ్రహ్మణ్యంనాయుడు, రామాపురం, పలమనేరు మండలం -
శాంతిభద్రతలను కాపాడండి
పెళ్లకూరు : సంఘ విద్రోహుల నుంచి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాజిక సమతుల్యతను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన తమ పార్టీ నాయకులతో వెళ్లి పెళ్లకూరు ఎస్ఐ నాగరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను మార్పింగ్ చేసి బూతు పదజాలంతో దుర్భాషలాడుతూ ‘రావణ్ మహరాజ్’ ఫేస్బుక్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం కోసం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం, నాయకులు బాలసుబ్రమణ్యం, మోహన్, జితేంద్ర, వీరకుమార్, హరిబాబురెడ్డి, చక్రపాణి, కృష్ణయ్య, కుమారస్వామి, ప్రశాంత్, తిరుపతయ్య, అశోక్, గురవయ్య పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 14 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 62,076 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.27 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ధ్యానంపై అవగాహన తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియంలో వైద్య విద్యార్థులకు ధ్యాన శాస్త్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధ్యాన శాస్త్ర నిపుణులు, ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సైన్స్ టీచర్ ఫౌండర్ మాస్టర్ ప్రదీప్ విజయ్ హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ధ్యానం జపం కాదు, ప్రార్థన అంతకంటే కాదని, శ్వాస శక్తి మాత్రమేనని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బాలిక మృతి కేసులో విచారణ వేగవంతం
● దహనం చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్, రెవన్యూ అధికారులు ● ల్యాబ్ పరీక్షల కోసం అస్తికలు సేకరించిన క్లూస్ టీం చంద్రగిరి: బాలిక అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నరసింగాపురం సమీపంలోని స్వర్ణముఖి వాగులో బాలికను దహనం చేసిన ప్రాంతాన్ని గురువారం సీఐ సుబ్బరామిరెడ్డి, తహసీల్దార్ శివరామసుబ్బయ్యలతో కలసి క్లూస్ టీం అధికారులు పరిశీలించారు. అనంతరం బాలిక అస్తికలను సేకరించారు. ఆ తర్వాత పోలీసు, రెవెన్యూ అధికారులు నరసింగాపురంలోని మృతురాలి ఇంటి వద్దకు వెళ్లి బాలిక తండ్రితో పాటు చుట్టుపక్కల వారిని విచారణ చేశారు. తన కుమార్తెను తల్లే పొట్టన పెట్టుకుందని మృతురాలి తండ్రి పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉంచితే, మైనర్ బాలిక తల్లిని పోలీసు స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తిరుమలకు వెళ్లిన పోలీసులు బాలిక మృతి చెందిన రోజు తాను ఇక్కడ లేనని, తిరుమలలో విధుల్లో ఉన్నట్లు ఆమె తల్లి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు గురువారం మధ్యాహ్నం తిరుమలకు వెళ్లినట్లు తెలిసింది. బాలిక తల్లి పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ఆమె సహద్యోగులను విచారణ చేసినట్లు సమాచారం. -
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు
తిరుపతి అర్బన్: వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ అధికారులతో మేథోమథన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ వచ్చే ఏడాది పంచాయతీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంల వినియోగంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో గూడూరు ఆర్డీవో రాఘవేంద్రమీనా, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ అమరయ్య పాల్గొన్నారు. -
పలు కోర్సులకు మంగళం
● ఎస్వీయూలో పలు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు ఇక కనబడవు ● పీజీ సెట్లో కానరాని ఆరు ప్రధాన కోర్సులు ● ఆవేదన చెందుతున్న విద్యార్థులు తిరుపతి సిటీ: అనుకున్నట్టే జరిగింది. ఎస్వీయూలో నూతన కోర్సులు దేవుడెరుగు.. ఉన్న కోర్సులకు మంగళం పాడేస్తున్నారు. ఏపీ పీజీ సెట్లో పలు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులను తీసేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆ కోర్సులకు ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏపీ పీజీ సెట్ నుంచి ఎస్వీయూలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను 2025–26 విద్యాసంవత్సరం నుంచి తొలగించినట్లు వీసీ అధికారికంగా ప్రకటించారు. అధ్యాపకులు రోడ్డు పాలు! కోర్సుల నిర్వహణ వర్సిటీకి భారంగా మారిందని అధికారులు చెబుతున్న కుంటి సాకులను విద్యార్థి సంఘాల నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు పీజీ సెట్లో అనుకున్న కోర్సులో సీటు సాధించలేని పక్షంలో సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. అటువంటి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లడం దారుణమని మండిపడుతున్నారు. కోర్సుల్లో ప్రవేశాలను పెంచేందుకు అధికారులు కృషి చేయాలి తప్ప పేదలు ఎక్కువగా చదివే పీజీ కోర్సులను తొలగించడం సమంజసం కాదనిఅంటున్నారు. వర్సిటీలో పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్లను వర్సిటీ నుంచి గెంటివేసి రోడ్డు పాలు చేసేందుకు అధికారులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఏఐఎస్ఎప్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఏ, పీడీఎస్ఓ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎస్వీయూ పరిపాలనా భవనం తొలగించిన పీజీ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు 1. ఎంకామ్ (ఎఫ్ఎమ్) 2. ఎంఏ ఎకనామిక్స్ 3. ఏంఏ తెలుగు 4.ఏంఏ సోషియల్ వర్క్ 5. ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ 6. ఎమ్మెస్సీ అనిమల్ బయోటెక్నాలజీ ఆదరణ లేక ఆపేస్తున్నాం ఎస్వీయూలో ఆదరణలేని పలు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులను ఏపీ పీజీసెట్–2025 నుంచి తొలగించాం. ఏపీ పీజీసెట్–2025కు దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 2 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే 3,373 దరఖాస్తులు అందాయి. మే 5వ తేదీ వరకు తుది గడువు ఉంది. ఎస్వీయూలో గత కొన్నేళ్లుగా 30శాతం లోపు అడ్మిషన్లు ఉన్న పలు కోర్సులను గుర్తించాం. ఇందులో ఆరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో విద్యార్థులు చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆదరణ లేని ఆ కోర్సులను ఈ ఏడాది పీజీసెట్ నుంచి తొలగించాం. – సీహెచ్ అప్పారావు, వీసీ -
విద్యుత్ షాక్తో ఎలుగుబంటు మృతి
సాక్షిటాస్క్పోర్స్: చామలా అటవీ వన్యప్రాణుల అభయారణ్యం (భాకరాపేట అడువులు)లో విద్యుత్ తీగలు తగిలి ఎలుగుబంటు మృతి చెందింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేకేతించింది. వివరాలు.. చిన్నగొట్టిగల్లు మండలం, చిట్టేచెర్ల పంచాయతీ, తుమ్మచేనుపల్లె అటవీ సరిహద్దు ప్రాంతమైన ఎర్రగొండ పెద్దాయన చెరువు సమీపంలో వేటగాళ్లు తీసిన విద్యుత్ తీగలకు ఎలుగుబంటు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు వేటగాళ్లు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై భాకరాపేట అటవీ అధికారులను వివరణ కోరడానికి ప్రయత్నించగా వారు స్పందించలేదు. -
కంగ్రాట్స్ రామ్
● వెంకటగిరి మున్సిపాలిటీ విజయంపై నేదురుమల్లికి జగన్ అభినందన వెంకటగిరి(సైదాపురం): ‘కంగ్రాట్స్ రామ్.. వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో నీ పాత్ర కీలకం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి కలిశారు. బుధవారం వెంకటగిరిలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన విశేషాలను జగన్కు వివరించారు. టీడీపీ కుట్రలను ఎదుర్కొని అవిశ్వాస తీర్మానంలో నెగ్గడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆయన కొనియాడారు. త్వరలోనే మున్సిపల్ చైర్మన్తోపాటు 18 మంది కౌన్సిలర్లతో ప్రత్యేక అభినంద సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ వెంటగిరి మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమతికిగా అందించినట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి సలహాలివ్వండి తిరుపతి అర్బన్: జిల్లాలో రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సీసీఎల్ ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, గూడూరు ఆర్డీవో రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో వర్క్షాపు నిర్వహించారు. జిల్లాలో పది నెలల కాలంలో 37వేల అర్జీలు వచ్చాయి. అందులో 25వేల అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు నిపుణుల నుంచి సలహాలు స్వీకరించనున్నట్టు తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, సుధారాణి, తిరుపతి ఆర్డీవో రామమోహన్, శ్రీకాళహస్తి ఆర్డీవో పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం
రాపూరు: వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా పెంచలకోనలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామికి గురువారం స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీవారికి గ్రీష్మ తాపాన్ని చల్లార్చేందుకు పెంచలకోనలో వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు శ్రీవారికల్యాణ మండలపంలో నిత్యహోమం, 10 గంటలకు స్వామి వారి నందనవనంలో శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను ఉంచి విశేషంగా అభిషేకించారు. ఉభయకర్తలుగా బండి తిరుపాల్రెడ్డి, తేజ దంపతులు వ్యవహరించారు. శేష వాహనంపై ఊరేగిన నృసింహుడు గురువారం రాత్రి శేష వాహనంపై నరసింహస్వామి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. -
పారిశ్రామికవేత్తలుగా రాణించాలి
తిరుపతి సిటీ: నూతన ఆవిష్కరణలపై యువత దృష్టి సారించి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జేఎన్టీయూ వీసీ సుదర్శన్రావు పిలుపునిచ్చారు. స్థానక కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో తరంగ్–2025 పేరుతో గురువారం జరిగిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రామన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్లోనూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలోనూ పట్టు సాధించాలన్నారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఉపయుక్తమైన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారిస్తే చిరస్థాయి గుర్తింపుతోపాటు పది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంటారన్నారు. వార్షికోత్సవం సందర్భంగా అకడమిక్ విద్యలోనూ, క్రీడల్లోనూ ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథులు జ్ఞాపికలు, ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం విద్యార్థుల ఫ్లాష్ మాబ్, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాయలసీమ విద్యాసంస్థల డైరెక్టర్ మన్నెం వెంకటరామిరెడ్డి, కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, కన్వీనర్ మునిశంకర్ పాల్గొన్నారు. -
ట్రాఫిక్కు అంతరాయం
ఒంటిమిట్టలో శుక్రవారం సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ట్రయల్రన్ నిర్వహించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. ● వసంత వైభవం! నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం రాపూరులోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామికి గురువారం స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. – 8లోతిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు నివేదించారు. అనంతరం శ్రీవారు తమ దేవేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. – తిరుమల – 8లో– 8లో -
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి, సాక్షి: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సూళ్లూరుపేట పోలీసులు పోసానిని విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తదుపురి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది. సూళ్ళూరు పేట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేసులో విచారణ అధికారిగా ఉన్న సీఐ మురళీ కృష్ణపై న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను మీరి దర్యాప్తు అధికారి(IO) వ్యవహరించారని, కేసులో అదనంగా 111 సెక్షన్ పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు నమోదు చేశారని పేర్కొంది. అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐ మురళీ కృష్ణకు ఫాం-1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల 24కి పోసాని పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. -
కక్ష సాధింపే ధ్యేయంగా.. పోసానిపై మళ్లీ కేసులు
తిరుపతి, సాక్షి: ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్(APFDC) మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఆపడం లేదు. తాజాగా.. టీటీడీ చైర్మన్పై సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ కేసులు నమోదు చేసి వేధించాలని చూస్తోంది. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు ఎంపికను పోసాని ఖండించారని, ఆయన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు ఇంతకు ముందే నమోదు అయ్యాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 15వ తేదీన విచారణకు రావాలంటూ పోసానికి సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ నోటీసులు జారీ చేశారు. ఈ ఫిర్యాదు ఎవరు చేశారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో పోస్టులు చేశారని.. టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదు మేరకు ఇంతకు ముందు ఆయన్ని అరెస్ట్ చేసి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన హైదారాబాద్లో రాయచోటి(అన్నమయ్య జిల్లా) పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ఓబులవారీపల్లి పీఎస్కు తరలించారు. మార్చి 22వ తేదీన గుంటూరు జైలు నుంచి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మొత్తంగా ఆయనపై అప్పటికే ఏపీలో వ్యాప్తంగా 19 కేసులు నమోదుకాగా.. కోర్టు ఆయనకు ఊరట ఇచ్చింది. -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 65,201 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,040 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.93 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగి న భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వచ్చిన భక్తుల ను క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
అహంభాను!
అంతేనా.. తిరుపతి మంగళం : ఆధ్యాత్మిక నగరం తిరుపతిని అత్యంత పరిశుభ్రంగా ఉంచేందుకు కాళ్లు పట్టుకున్నా కనికరం లేదా? భానుప్రకాష్రెడ్డి అన్నా.. అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్ వద్ద భానుప్రకాష్రెడ్డికి పూల బొకేలు ఇచ్చి వైఎస్సార్సీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి వందేళ్లు గుర్తుండేలా మాస్టర్ప్లాన్ రోడ్లు నిర్మించారని తెలిపారు. ఈ క్రమంలోనే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చొరవతో తిరుపతి నగరపాలక సంస్థకు 1,700మంది పారిశుద్ధ్య కార్మికులను అదనంగా నియమించే దిశగా టీటీడీ నిధులు వెచ్చించేందుకు అభినయ్ శ్రమించారన్నారు. అయితే టీటీడీ నిధులు రాకుండా మీరు కోర్టు కెక్కారని విమర్శించారు. దీంతో తిరుపతి నగరపాలక సంస్థలో ఉన్న కార్మికులు సరిపోక రోడ్లు, కాలువల్లో చెత్త పేరుకుపోతోందని వివరించారు. స్థానికుడిగా మీకు తిరుపతి పరిశుభ్రతపై బాధ్యత లేదా? అని భానుప్రకాష్రెడ్డిని ప్రశ్నించారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కు టీటీడీ నుంచి రూ. కోటి నిధులు కేటాయించడంలో కీలకపాత్ర పోషించిన మీరు.. పారిశుద్ధ్య కార్మికులకు నుంచి వచ్చే నిధులను అడ్డుకోవడం సమంజసమేనా? ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం అంటారే కానీ కేవలం తిరుమల అని ఎక్కడా పేర్కొనలేదని వెల్లడించారు. తిరుపతిలో టీటీడీకి చెందిన ఆలయాలు, భవనాలు, కళాశాలలు, పాఠశాలలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటప్పుడు టీటీడీలో భాగమైన తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయిస్తే తప్పేంటని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలు, కుట్రలతో నగర అభివృద్ధిని అడ్డుకోవడం సబబుకాదని హితవు పలికారు. ఇప్పటికై నా కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని భానుప్రకాష్రెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు నల్లాని బాబు, లవ్లీ వెంకటేష్, గీతాయాదవ్, టౌన్బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్, డైరెక్టర్ కడపగుంట అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్వంశీ, గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు మద్దాలి శేఖర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, నేతలు అనిల్రెడ్డి, మోహన్రాజ్, అరుణ్యాదవ్, సాయికుమారి, పద్మజ, రమణారెడ్డి, కోదండ, విజయలక్ష్మి, పుణీత, ఉష, జ్యోతి, చందు, కిషోర్, మల్లం రవి పాల్గొన్నారు. స్వచ్ఛ తిరుపతికి సహకరించాలని వైఎస్సార్పీపీ నేతల వినతి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్రెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకోలు ససేమిరా అంటూ తిరస్కరించడంపై ఆవేదన తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్రెడ్డి వ్యవహారశైలిని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు. తిరునగరి పరిశుభ్రతకు సహకరించకపోవడంపై మండిపడ్డారు. కాళ్లు పట్టుకుని వేడుకున్నప్పటికీ కనికరించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో పారిశుద్ధ్య పనులకు టీటీడీ నిధులు మంజూరు కాకుండా అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. కోర్టు కేసును వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక క్షేత్రం అభివృద్ధికి కలసిరావాలని కోరితే అహంభావంతో తిరస్కరించడం దారుణమని విమర్శించారు.కనికరించే ప్రసక్తే లేదు తిరుపతిలో టీటీడీ నిధులు ఖర్చు చేయడం కుదరదని, పారిశుద్ధ్య కార్మికుల కోసం నిధులు రాకుండా కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోనని భానుప్రకాష్రెడ్డి తేల్చి చెప్పారు. కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశారు. తిరుపతి అభివృద్ధికి స్మార్ట్సిటీ నిధులు వస్తున్నాయన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తిరుపతి అభివృద్ధికి ఏదో ఒక మార్గంలో నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చిలక పలుకులు వల్లించారు. అంతే కానీ, తిరుపతి పరిశుభ్రతకు టీటీడీ నిధులు రాకుండా కోర్టులో వేసిన కేసును ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకోనని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా..ససేమిరా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
● ఫలించిన ఎంపీ గురుమూర్తి కృషి
రైల్వే డబ్లింగ్ పనులకు ఆమోదం తిరుపతి మంగళం: ఎంపీ గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతి–పాకాల–కాట్పా డి రైలు మార్గం డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమో దం తెలిపింది. దాదాపు రూ.1332 కోట్ల అంచనా వ్యయంతో 104 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లో ఈ లైన్ విస్తరించబడి ఉంది. ఈ లైన్ నిర్మాణంతో తిరుపతి, శ్రీకాళహ స్తి పుణ్యక్షేత్రాలకి ప్రయాణ సమయం తగ్గి, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకువచ్చేందుకు ఎంపీ గురుమూర్తి ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించారు. రైల్వే శాఖకు సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓలతో సమావేశమై ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఎట్టకేలకు డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు తిరుమల : తిరుమలలో గురువారం నుంచి శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు కనులపండువగా వేడుకలు జరిపించనున్నారు. వసంత్సోవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ మేరకు తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేయనున్నారు. స్నపన తిరుమంజనసేవలో సేదతీరనున్నారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశించనున్నారు. ఈ క్రమంలోనే రెండో రోజు సర్వాలంకారభూషితులైన దేవదేవేరులు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. మూడోరోజు మలయప్పతోపాటు రుక్మిణీ సమేత కృష్ణస్వామి, సీతారామలక్ష్మణులు వేర్వేరు పల్లకీల్లో ఊరేగనున్నారు. వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వసంతోత్సవంలో పాల్గొనే భక్తులకు ఇప్పటికే ఆన్లైన్లో రూ.150 చొప్పున 450 టికెట్లను విక్రయించింది. -
వెంకటగిరి పురపీఠం వైఎస్సార్సీపీదే..
● మున్సిపల్ చైర్మన్పై వీగిన అవిశ్వాస తీర్మానం ● కూటమి కుతంత్రాలకు తలొగ్గని 19 మంది కౌన్సిలర్లు ● గైర్హాజరైన ఆరుగురు ఫిరాయింపుదార్లు ● పురపాలక సంఘం చైర్మన్గా నక్కా భానుప్రియ ● టీడీపీ పతనానికి ఇదే నాంది : నేదురుమల్లి న్యాయమే గెలిచింది వెంకటగిరిలో న్యాయమే గెలిచిందని, మళ్లీ వైఎస్సార్సీపీ జెండానే ఎగుర వేశామని నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తెలిపారు. ఎన్జేఆర్ భవనంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, కౌన్సిలర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దొడ్డిదారిన పురపాలక పీఠం కాజేయాలని చూసిన కూటమి కుతంత్రాలను సమష్టిగా తిప్పికొట్టామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ గుర్తుపై 25 మంది కౌన్సిలర్లు గెలిస్తే, ప్రలోభపెట్టి ఆరుగురిని లాక్కున్నారని విమర్శించారు. వెంకటగిరి నుంచే టీడీపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. రెడ్బుక్ రాజ్యాంగం ఇక్కడ పనిచేయదని, జగన్ రూలింగ్ మాత్రమే నడుస్తుందని వెల్లడించారు. నిజాయితీగా పార్టీకి కట్టుబడిన కౌన్సిలర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. వెంకటగిరి(సైదాపురం) : వెంకటగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. బుధవారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. కూటమి నేతలు అధికారం అండతో ప్రలోభాలకు పాల్పడినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నిజాయితీగా నిలబడ్డారు. వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి నేతృత్వంలో 19 మంది కౌన్సిలర్లు కట్టుగా సత్తా చాటారు. ప్రతిపాదించి.. గైర్హాజరు వెంకటగిరి మున్సిపాల్టీలో మొత్తం 25 వార్డులు ఉన్నాయి. అన్నింట్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరుగురు కౌన్సిలర్లు పార్టీ ఫిరాయించారు. అయినప్పటికీ పురపాలక సంఘంలో వైఎస్సార్సీపీకి 19 మంది కౌన్సిలర్ల బలం ఉంది. అయితే కూటమి నేతలు కుట్రపూరితంగా వ్యవహరించి మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా ప్రిసైడింగ్ అధికారిగా అవిశ్వాస తీర్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీకి చెందిన 19 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఫిరాయింపు కౌన్సిలర్లు మాత్రం గైర్హాజరయ్యారు. దీంతో తీర్మానం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. ఈ మేరకు ధ్రువీకరణపత్రం అందించారు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్గా మళ్లీ నక్కా భానుప్రియ పీఠం అధిరోహించారు. -
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
తిరుపతి అర్బన్ : తిరుచానూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో ముగిసింది. శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, అనంతపురం, అనకాపల్లి, పల్నాడు, కోనసీమ జిల్లాలకు చెందినన విద్యార్థుల జవాబు పత్రాలను తిరుపతిలో మూల్యాంకనం చేశారు. జిల్లాకు చెందిన వివిధ సబ్జెక్టుల టీచర్లను నియమించి మూల్యాంకనం ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశారు. ప్రతిరోజూ ఓఎంఆర్ షీట్లను సీల్ చేసి, పటిష్ట భద్రత నడుమ విజయవాడకు తరలించారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ డీవైఈఓ బాలాజీ, ఎంఈఓ భాస్కర్, ఏఈ గురవారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ బి.శిరీష్ కుమార్ ఆధ్వర్యంలో పకడ్బందీగా పర్యవేక్షించినట్లు వివరించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఆర్జేడీ శామ్యూల్ స్పాట్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు. -
చికిత్స పొందుతూ కూలీ మృతి
తిరుపతి క్రైమ్ : అలిపిరి పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం వద్ద ఈ నెల 7వ తేదీన ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడిపోయి గాయపడిన కూలీ చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. మధ్యప్రదేశ్కి చెందిన విజయ్(29) భవన నిర్మాణ పనులు చేస్తూ కిందపడ్డాడు. తోటి స్నేహితులు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. మృతుడి అన్న మనీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
పాత బస్సులకు..
● ఆర్టీసీ సర్వీసుల బాడీ కన్వర్షన్ ● తిరుపతి బస్టాండ్ నుంచి శ్రీకారం ● ఇప్పటికే 9 బస్సుల రీ మోడల్ ● అదేబాటలో పలు సర్వీసులు‘మేమొస్తే ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపిస్తాం. కొత్త బస్సులు తీసుకువస్తాం. ముఖ్యంగా తిరుపతి సెంట్రల్ బస్టాండ్కు 50 నుంచి 100 కొత్త సర్వీసులు మంజూరు చేస్తాం.. ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం అదనంగా సర్వీసులు ఏర్పాటు చేస్తాం’ అని ఎన్నికల ముందు కూటమి నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా..తిరుపతి బస్టాండ్కు ఒక్క కొత్త బస్సు కూడా అందించలేదు. చివరకు చేసేది లేక ఆర్టీసీ అధికారులు పాత బస్సులనే రీమోడల్ చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. ముందుగా తిరుపతి డిపో నుంచే కాలం చెల్లిన వాహనాలకు సరికొత్త రూపం తీసువచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రీమోడల్ చేస్తున్న దృశ్యంతిరుపతి అర్బన్ : ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలోని సెంట్రల్ బస్టాండ్ ప్రాంగణంలో శ్రీహరి, శ్రీనివాస, ఏడుకొండలు, పల్లెవెలుగు బస్టాండ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుపతి, మంగళం డిపోలతోపాటు ఇతర డిపోలకు చెందిన సర్వీసులు నడుస్తున్నాయి. తిరుపతి జిల్లాలోని 11 బస్టాండ్ల నుంచి ప్రతి రోజూ 2.70 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా తిరుపతి బస్టాండ్ నుంచే 1.60 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యకు తగినట్టు బస్సులు లేవు. ఈ క్రమంలో కాలం చెల్లిన బస్సులను రీ మోడల్చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరుపతి ఆర్టీసీ డిపోలో పనులు మొదలు పెట్టారు. 15 ఏళ్లు దాటిన ప్రతి సర్వీసునూ రీమోడల్ చేయడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి డిపోకు చెందిన సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా తీర్చిదిద్దుతున్నారు. ఒక్కొక్కటిగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుపతిలో బాడీ కన్వర్షన్ బస్సుల కొరత కారణంగా తిరుపతి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులకు తగినన్ని సర్వీసులను నడపలేకపోతున్నారు. ఈ క్రమంలో డీపీటీవో నరసింహులు, డీఎం బాలాజీ ఉన్నతాధికారుల అనుమతుల మేరకు గ్యారేజీ సిబ్బందితో చర్చించి తిరుపతిలో బస్సు బాడీ కన్వర్షన్కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తొమ్మిది సర్వీసులకు మార్పులు చేశారు. పనికొచ్చే పరికరాలు మినహా పాడైన వాటిని తొలగించి స్క్రాప్కు వేశారు. రేకులు, చక్కటి సీట్లు, పిల్లర్స్, టైర్లు, లైటింగ్, బ్రేకులు, గేర్ బాక్సు, ఎయిర్ ఫిల్టర్లు, ఇతర సాంకేతిక పరమైన వాటిని కొత్తగా ఆమర్చుతున్నారు. వీటికి సుమారు రూ.2 లక్షల మేరకు ఖర్చు పెట్టి 52 సీట్ల సామర్థ్యంతో పల్లె వెలుగు బస్సుగా మార్చుతున్నారు. రూట్పై వెళ్లిన తర్వాత సమస్యలు వస్తున్నాయా అనే అంశాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గత ఏడాది ఒక డీజిల్ బస్సును విద్యుత్ బస్సుగా మార్పు చేసిన విషయం తెలిసిందే. మెరుగైన సౌకర్యాలు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చిపోతున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. బస్సుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పాత బస్సులకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి కొత్త రూపాన్ని ఇస్తున్నాం. మెకానిక్స్ ఆర్టీసీ వాళ్లు కావడంతో ఖర్చులు తగ్గుతున్నాయి. రీ మోడల్ తర్వాత నిత్యం వాటిపై నిఘా పెడుతున్నాం. – బాలాజీ, తిరుపతి ఆర్టీసీ డిపో మేనేజర్ -
నోటీసుల జారీకి ఆదేశం
తిరుపతి రూరల్: మదర్ డెయిరీ యాజమాన్యానికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, వ్యర్థాలను బయటకు వదిలితే చర్యలు తప్పవని హెచ్చరించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశించారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలోని మదర్ డెయిరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, చుట్టు పక్కల నివాసముంటున్న ప్రజలు దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. దీనిపై ఈనెల7వ తేదీన ‘కలుషితం.. భూగర్భ జలం..’ శీర్షికతో సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మదర్ డెయిరీ నుంచి అవిలాల చెరువులోకి వ్యర్థాలు రాకుండా చూడాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు కూడా లేఖ పంపించాలని ఎంపీడీఓ రామచంద్రను ఆదేశించారు. పాల పదార్థాలతో రూ.కోట్ల వ్యాపారం సాగించే డెయిరీ యాజమాన్యానికి ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. కలెక్టర్తో ఐఐటీ డైరెక్టర్ భేటీ తిరుపతి అర్బన్ : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుతో సరికొత్త ఆవిష్కరణల దిశగా విద్యార్థులను ప్రోత్సహించవచ్చని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్క వెంకటేశ్వర్ను కలిసి చర్చించారు. తిరుపతి ఐఐటీ స్పోక్ హబ్గా సేవలందిస్తుందని వెల్లడించారు. అటవీశాఖ అధికారికి జైలు సూళ్లూరుపేట రూరల్ : మహిళా ఉద్యోగిని వేధించిన కేసులో అటవీశాఖ అధికారి వరప్రసాద్రావుకు మూడు నెలలు జైలు శిక్ష, 5వేలు జరిమానా విధిస్తూ సూళ్లూరుపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.అనిల్కుమార్ బుధవారం తీర్పునిచ్చారు. వివరాలు.. 2023లో దొరవారిసత్రం మండలం నెలపట్టు పక్షుల కేంద్రంలో ఎస్కే అస్మతున్నీసా అనే అటవీశాఖ మహిళా ఉద్యోగినితో వరప్రసాద్రావు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రవర్తించడంతో దొరవారిసత్రం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు న్యాయమూర్తి విచారణ చేపట్టి నిందితుడిపై నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున కేసును అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ వాదనలు వినిపించారు. నేడు, రేపు ఏఎన్ఎంల ఉద్యోగోన్నతికి కౌన్సెలింగ్ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గ్రేడ్–3 ఏఎన్ఎం ఉద్యోగోన్నతికి సంబంధించిన తుది జాబితా ఎట్టకేలకు పూర్తయింది. గతేడాది ప్రారంభమైన జాబితా తయారీ ప్రక్రియ...పలు ఆరోపణల నడుమ బుధవారం సాయంత్రానికి పూర్తి చేశారు. 1000 మందిపైగా గ్రేడ్–3 ఏఎన్ఎం ఉంటే 307 మందితో ఈ జాబితా సిద్ధం చేశారు. గురు, శుక్రవారాల్లో ఉద్యోగోన్నతికి సంబంధించి కౌన్సెలింగ్ చిత్తూరు నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. డీఆర్ఓ సమక్షంలో కౌన్సెలింగ్ జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిపై కొంతమంది మళ్లీ అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని అంటున్నారు. దీనిపై అధికారులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి వరదయ్యపాళెం : తడ– వరదయ్యపాళెం రహదారిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు.. బుచ్చినాయుడు కండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరుకు చెందిన డి.విజయ్(17), గురువర్ధన్ అనే ఇద్దరు విద్యార్థులు ద్విచక్రవాహనంపై తడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉండగా రాచకండ్రిగ వద్ద ఆగి ఉన్న బస్సును ఢీకొన్నారు. దీంతో విజయ్ అక్కడికక్కడే మరణించాడు. గురువర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీసిటీ హైటెక్ పోలీస్స్టేషన్ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
బాధ్యతగా తాబేళ్ల సంరక్షణ
చిల్లకూరు : అంతరించిపోతున్న ఆలివ్ రెడ్లీ తాబేళ్ల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం చిల్లకూరు మండలం గమ్మళ్లదిబ్బ బీచ్ వద్ద అటవీశాఖ, జిందాల్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఆలివ్ రెడ్లీ తాబేళ్లను సముద్రంలోకి వదిలిపెట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ సముద్రం పరిశుభ్రతకు తాబేళ్లు దోహదపడతాయన్నారు. వాటి పరిరక్షణకు మత్స్యకారులు సైతం కృషి చేయాలని కోరారు. ఇటీవల ఆలివ్ రెడ్లీ తాబేళ్లు పలు ప్రాంతాల్లో మృత్యువాత పడినట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. దీంతో సముద్రంలో కాలుష్యం పెరిగిపోయే ప్రమాదముందని, అందుకే కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా తాబేళ్ల రక్షణ బాధ్యతను స్థానిక పరిశ్రమల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే గమ్మళ్లదిబ్బతోపాటు కోట మండలం శ్రీనివాససత్రం బీచ్లలో తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదులుతున్నామన్నారు. దీంతో సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తాబేళ్లు ఈ బీచ్లకే వచ్చి గుడ్లు పెడతాయని వివరించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ గుడ్లను సేకరించి హేచరీల్లో పొదిగిస్తారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి సముద్రంలో చేపల వేట కూడా ఉన్నందున, ఈ సందర్భంలో పిల్లలు కూడా పెరిగే అవకాశముంటుందని వివరించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు వివేక్, ఆఫ్జల్, రవీంద్ర, ధనలక్ష్మి, గాయం శ్రీనివాసులు, గోపి, తహసీల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్ నెల్లిపూడి సుబ్రమణ్యం, జిందాల్ ప్లాంట్ హెడ్ శ్రీనివాస్రావ్, స్థానిక నేతలు వెంకటేశ్వర్లు రెడ్డి, సతీష్యాదవ్ పాల్గొన్నారు. కోట మండలంలో ... కోట మండలం శ్రీనివాససత్రం బీచ్ వద్ద కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆలివ్రెడ్లీ తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. కలెక్టర్ మాట్లాడుతూ సమత్స్యకారులు వేట సాగించే సమయంలో తాబేళ్లు వలలకు చిక్కినా వాటిని తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టాలని సూచించారు. -
సినీ నటుడు సప్తగిరికి మాతృవియోగం
● తిరుపతి గోవిందధామంలో ముగిసిన అంత్యక్రియలు తిరుపతి రూరల్ : సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ తల్లి చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టెమ్మ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారు. బుధవారం తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీలోని నివాసానికి చిట్టెమ్మ భౌతికకాయం తీసుకువచ్చారు. కన్నతల్లి మరణంతో కన్నీటిపర్యంతమైన సప్తగిరి ప్రసాద్ను బంధుమిత్రులు ఓదార్చారు. చిట్టెమ్మ మరణంతో సప్తగిరి గుండెలవిసేలా విలపించడం చూపరులను కదలించింది. ఈ క్రమంలో సప్తగిరి మిత్రులు, పరిచయం ఉన్న వ్యాపారులు, రాజకీయ నేతలు, సినీ రంగంలో సన్నిహితంగా ఉండేవారు, అభిమానులు పెద్ద సంభ్యలో తరలివచ్చి చిట్టెమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిరుపతి నగరంలోని గోవింద దామంలో అంత్యక్రియలను పూర్తి చేశారు. -
ఫలించిన చర్చలు.. దీక్ష విరమణ
తిరుపతి రూరల్ : ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట సుమారు 16 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేపట్టిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో ఉన్నతాధికారుల చర్చలు బుధవారం ఫలించాయి. సీఎండీ సమక్షంలో జరిగిన చర్చల వివరాలను మినిట్స్ రూపంలో రాత పూర్వకంగా హెచ్ఆర్ డైరెక్టర్ లక్ష్మీనరసయ్య, డీజీఎంలు మూర్తి, సురేంద్ర, ప్రసాద్ తదితరుల దీక్షా శిబిరం వద్ద కార్మికులకు అందించారు. అనంతరం కార్మిక సంఘం నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. హెచ్ఆర్ డైరెక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, ఇతర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వేతనాల పెంపు, పీఆర్ అరియర్స్ తదితర అంశాలను హెచ్ఆర్ కమిటీలో అజెండాగా చేరుస్తామని తెలిపారు. సీపీఎం నేత కందారపు మురళి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేత శివప్రసాద్ రెడ్డి, కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణ, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షుడు కొండయ్య, అనంతపురం జిల్లా నేతలు నూర్ బాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి రవికుమార్, పుత్తూరు కార్యదర్శి మురళి పాల్గొన్నారు. -
వెటర్నరీ వర్సిటీలో మధ్యప్రదేశ్ మంత్రి
తిరుపతి సిటీ : ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో బుధవారం మధ్యప్రదేశ్ మంత్రి లకన్ పాటిల్ పర్యటించారు. ఈ సందర్భంగా వీసీ రమణ, డీన్ వీరబ్రహ్మయ్య, ఇన్చార్జి రిజిస్ట్రార్ శ్రీలతతో సమావేశమయ్యారు. వర్సిటీలో చేపట్టిన పరిశోధనలు, పశువైద్య విద్య, పలు విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశువైద్య శాలను పరిశీలించారు. సజావుగా దూరవిద్య పరీక్షలు తిరుపతి సిటీ : ఎస్వీయూ దూరవిద్య విభాగం ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న యూజీ, పీజీ పరీక్షలు సజావుగా సాగుతున్నట్లు డైరెక్టర్ వూకా రమేష్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ దాదాపు 32 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. ప్రధాన కోర్సుల పరీక్షలు ముగిశాయని, యూజీకి చెందిన కొన్ని ప్రత్యేక పరీక్షలు మరో వారంలో ముగియనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు పరీక్షలను పారదర్శకంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చేసినట్లు వెల్లడించారు. సహకరిస్తున్న పోలీస్శాఖతోపాటు ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థిని సృజనకు అభినందన తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీలో బీఫార్మసీ విద్యార్థిని వైష్ణవీ హరీష్ తన సృజనాత్మకతను ఆవిష్కరించారు. స్మార్ట్ డిజిటల్ స్టెతస్కోప్ను రూపొందించారు. యూఎస్ ఎంబసీ సహకారంతో ఉకాన్ గ్లోబల్ సంస్థ భాగస్వామ్యంతో ఢిల్లీలోని అమెరికన్ సెంటర్లో నిర్వహించిన స్టార్టప్ నెక్సస్ కోహోర్ట్–20 ప్రొగ్రామ్లో ఈ పరికరం ప్రదర్శించి సర్టిఫికెట్ అందుకున్నారు. బుధవారం ఈ మేరకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ, విభాగాధిపతి ప్రొఫెసర్ జోత్స్నారాణి అభినందనలు తెలిపారు. తీరంలో కట్టుదిట్టంగా నిఘా వాకాడు : సముద్ర మార్గం నుంచి అసాంఘిక శక్తులు చొరబడకుండా మైరెన్ పోలీసులు తీరంలో కట్టుదిట్టంగా నిఘా ఏర్పాటు చేశారు. బుధవారం ఈ మేరకు సాగర్ కా వాచ్ కార్యక్రమం చేపట్టారు. దుగరాజపట్నం మైరెన్ సీఐ వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ సముద్ర తీరంలో నిఘా పరిశీలించేందుకు తమ సిబ్బంది రెండు గ్రూపులుగా సముద్రంలోకి వెళ్లారని చెప్పారు. ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, కృష్ణపట్నం, చిల్లకూరు, కోట, వాకాడు మండలాలలోని సముద్ర తీరంలో 120 మంది పోలీస్ సిబ్బందితో సాగర్ కా వాచ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందులో నాయుడుపేట, గూడూరు డీఎస్పీలు, వాకాడు, గూడూరు, మనుబోలు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 120 మంది పోలీసులు పాల్గొన్నారని వెల్లడించారు. -
39 రోజులు.. జరిమానా రూ.22.8లక్షలు!
● జాతీయ రహదారిపై పోలీసుల నిరంతర తనిఖీలు ● రాంగ్రూట్లో వెళుతున్న 912 మందిపై కేసులుతిరుపతి రూరల్ : పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధానంగా రాంగ్రూట్లో వాహనం నడిపేవారికి జరిమానా విధిస్తున్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యం తిరుచానూరు వద్ద కలెక్టరేట్ నుంచి సి.మల్లవరం జంక్షన్ వరకు జాతీయ రహదారి సమీపంలోని ప్రధాన కూడళ్ల నుంచి ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు యథేచ్ఛగా రాంగ్ రూట్లో వస్తున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఎస్పీ హర్షవర్ధన్రాజు ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రహదారిపై నిరంతరం వాహన తనిఖీలు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచారి, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. రాంగ్ రూట్లో వస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించేస్తున్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. వాహనం పట్టుకున్న తర్వాత ఎవరి సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వందల సంఖ్యలో కేసులు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వచ్చే వాహనాలకు జరిమానాలు విధించే ప్రక్రియను మార్చి 1వ తేదీ నుంచి పోలీసులు చేపట్టారు. ఇప్పటి వరకు కేవలం 39 రోజుల్లో 912 వాహనాలను సీజ్ చేసి 186 కేసులను నమోదు చేశారు. ఈ మేరకు నిందితులు జరిమానా కింద రూ.22.80 లక్షలు కోర్టుకు చెల్లించినట్టు సమాచారం. ఈ మేరకు వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని, రాంగ్ రూట్లో రావడం మానుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి రూరల్ మండలంలోని సి.మల్లవరం క్రాస్, రామానుజపల్లి క్రాస్, ఆర్సీపురం క్రాస్, తనపల్లె క్రాస్, నారాయణాద్రి ఆస్పత్రి క్రాస్ వద్ద రాంగ్రూట్ ప్రయాణం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు. -
టీడీపీకి షాక్.. వీగిపోయిన మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానం
సాక్షి, తిరుపతి: వెంకటగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ పట్టు నిలుపుకుంది. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. చైర్మన్పై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 20 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. 25 మంది కౌన్సిలర్లలో 20 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో, టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. అయితే, అవిశ్వాస తీర్మానానికి ముందే వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల దెబ్బకు టీడీపీ ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ చేతులెత్తేశారు. ఇక, టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్సీపీ ఇంచార్జ్ రామ్కుమార్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ఇక, ఈరోజు ఉదయమే వైఎస్సార్సీపీ కౌన్సిలర్స్ కౌన్సిల్ హాల్కు బయలుదేరారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నియోజకవర్గ ఇంచార్జ్ రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వాహనాలలో 20 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్ నక్కా భాను ప్రియపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ చేసిన కుట్రను వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తిప్పి కొట్టారు. -
సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి!
● అడ్మిషన్లు చేయకుంటే జీతాలు కట్ ● టార్గెట్ పూర్తయితేనే ఉద్యోగం పదిలం ● మండుటెండల్లో ఇంటింటికీ క్యాంపెయిన్ ● ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బందికి తప్పని తిప్పలు తిరుపతి ఎడ్యుకేషన్: ప్రస్తుతం విద్య వ్యాపారంగా మారింది. విద్యాసంస్థలు వాణిజ్య సంస్థలుగా మారాయి. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. వీధికొకటి ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి. కార్పొరేట్ హంగులతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్లు పెంచుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయి. ఉపాధ్యాయులు, అధ్యాపకులకే కాకుండా చిన్నాచితక బోధనేతర సిబ్బందికి టార్గెట్లు విధిస్తున్నాయి. అడ్మిషన్లు చేస్తే జీతాలు ఇస్తామని, ఉద్యోగం సైతం పదిలంగా ఉంటుందని తెగేసి చెబుతున్నాయి. ఈ క్రమంలో అందులో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది టార్గెట్ పూర్తిచేసే పనిలో పడ్డారు. మండుటెండల్లో ఇంటింటికీ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ‘మీ పిల్లలను మా విద్యాసంస్థలో చేర్పించండి’ అంటూ ప్రాధేయపడుతున్నారు. ఆగస్టు నుంచే అడ్మిషన్ల వేట ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల సిబ్బంది ఆగస్టు నుంచే అడ్మిషన్ల వేట మొదలు పెడుతున్నారు. పీఆర్వోల పేరుతో సిబ్బందిని నియమించుకుని ఆగస్టులో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల అడ్రెస్లను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ల ఇళ్లకు వెళ్లి తమ కళాశాలలో చేర్పించాలంటూ తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఇప్పుడే అడ్మిషన్ చేయించుకుంటే ఫీజులో రాయితీ ఇస్తామని చెప్పి నమ్మబలుకుతున్నారు. మోసపోతున్న తల్లిదండ్రులు ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రత్యేకతలను గ్రాఫిక్స్లో చూపించడంతో తల్లిదండ్రులు ఆకర్షణలో పడి మోసపోతున్నారు. ప్రభుత్వ, స్థానిక ప్రైవేటు పాఠశాలలు మించి తమ విద్యాసంస్థలో ఉన్న సౌకర్యాలను వివరిస్తున్నారు. రోజువారీ టెస్ట్లు, ప్రతి రోజూ స్టడీ అవర్స్, కంప్యూటర్, లైబ్రరీ, ల్యాబ్, ప్రతి పండుగ సెలబ్రేషన్, ఆటపాటలతో పాటు కరాటే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులు బదిలీ అయితే అదేచోట బ్రాంచ్కు విద్యార్థుల బదిలీ సౌకర్యం కల్పిస్తామని కార్పొరేట్ స్కూల్ సిబ్బంది వివరిస్తున్నారు. విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకొని అడ్మిషన్ ఫీజు కట్టించుకునే వరకూ పాఠశాల ఫీజు మాత్రమే చెబుతారు. ఫీజు చెల్లించిన తరువాత బస్సు ఫీజు, యూనిఫామ్, బుక్స్ ఫీజు అంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్లో ఫిక్స్ చేసిన ఫీజులని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు నిలువునా మోసపోతున్నారు. వేధిస్తూ..టార్గెట్లు విధిస్తూ జిల్లాలో దాదాపు 2వేలకుపైగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపుగా 40 వేల మంది వరకూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఆయా పాఠశాలల నిర్వాహకులు ప్రస్తుత విద్యాసంవత్సరానికి గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే అడ్మిషన్ల టార్గెట్ విధిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలవ్వగానే పూర్తి స్థాయిలో టార్గెట్ను రీచ్ అవ్వాలంటూ ఆదేశిస్తున్నారు. టార్గెట్ చేస్తేనే జీతం, ఉద్యోగం రెండూ పదిలమంటూ హుకుం జారీచేస్తున్నారు. ఈ నిబంధనలకు పనిచేయాలో.. లేక బయటకు రావాలో.. తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
అంగన్వాడీ చిన్నారులకు అస్వస్థత
పెళ్లకూరు: మండలంలోని కానూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోని ఆరుగురు చిన్నారులకు మంగళవారం ఫుడ్పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు.. అంగన్వాడీ కేంద్రంలో ఏనిమిది మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఆరుగురికి మంగళవారం మధ్యాహ్నం పులిహోర వడ్డించారు. మిగిలిన ఇద్దరు చిన్నారులు ఇంటికి వెళ్లారు. పులిహోరా తిన్న చిన్నారులు గురువర్షిత్, జోషన్, జశ్వన్, నాని, గురవయ్య, శాన్విక గంట వ్యవధిలో వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం నాయుడుపేటకు తరలించారు. సీడీపీవో ఉమామహేశ్వరి, నాయుడుపేట సీఐ సంఘమేశ్వరరావు, ఎస్ఐలు నాగరాజు, ఆదిలక్ష్మి, సూపర్వైజర్ సాయిలక్ష్మి ఆస్పత్రికి చేరుకుని చిన్నారుల ఆరోగ్యంపై ఆరా తీశారు. విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం పులిహోర తినడం వల్ల వాంతులయ్యాయని, ఎలాంటి అందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడి వైద్యులు వెల్లడించారు. చిన్నారులను రాత్రికి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరివెంట అంగన్వాడీ వర్కర్ శ్రీదేవి, చిన్నారుల తల్లిండ్రులు ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): శ్రీకాళహస్తి మండలంలోని రామాపురం రిజర్వాయర్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. రామాపురం డ్యాం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన విషయాన్ని స్థానికులు గుర్తించి శ్రీకాళహస్తి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమితం శ్రీకాళహిస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద రెండు సెల్ఫోన్లు, రూ.10 వేల నగదు ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన ఆధారాలు ఏమీ లేకపోవడంతో గుర్తితెలియని మృతదేహంగా కేసు నమోదుచేశారు. -
మార్క్శంకర్ త్వరగా కోలుకోవాలి
తిరుపతి మంగళం: జనసేన అధినేత పవన్కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ప్రమాదానికి గురికావడం బాధాకరమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందన్నారు. శ్రీ కలియుగ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మార్క్శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గ్రీవెన్స్కు ప్రాధాన్యం తిరుపతి అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పరిధిలో పెండింగ్లోని అర్జీలకు పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చేపట్టాల్సిన అంశాలను వివరించారు. వేసవిలో లక్ష మందికి కూలి పనులు కల్పించాలని చెప్పారు. డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పింఛన్ సొమ్ము అందజేత సత్యవేడు: స్థానిక పంచాయతీలోని 1వ సచివాలయం వీఆర్ఓ చిట్టిబాబు రూ. 63 వేల పింఛన్ సొమ్మును సత్యవేడు సెక్రటరీ మునిరవికుమార్కు మంగళవారం అందజేశారు. ఏప్రిల్కు సంబంధించి 64 మందికి పింఛన్లను వీఆర్వో పంపిణీ చేయాల్సి ఉండగా అందులో 48 మందికే అందజేశారు. మిగిలిన 16 మందికి సంబంధించిన పింఛన్ డబ్బు రూ.63 వేలు తన వద్దనే ఉంచుకున్నాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో వైద్యశాలలో ఉండడంతో కార్యాలయానికి రాలేకపోయానని, అధికారులకు అందుబాటులో లేనని వివరణ ఇచ్చారు. 15న శ్రీకాళహస్తిలో మెగా జాబ్మేళా ● 30 బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ● పోస్టర్ల ఆవిష్కరణలో కలెక్టర్ వెల్లడి తిరుపతి అర్బన్: ఈ నెల 15న శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్రెడ్డి, విజయశ్రీతోపాటు నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు లోకనాధం,గణేష్తో కలసి జాబ్మేళా పోస్టర్లను తన కార్యాలయంలో కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మెగా జాబ్మేళాకు 30 బహుళజాతి కంపెనీలు హాజరు కానున్నాయని, 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. 5వ తరగతి నుంచి ఉన్నత చదువులు చదువుకున్న వారందరూ అర్హులేనని, దీనిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 13లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అదనపు సమాచారం కోసం 7989509540, 8919889609 (వినయ్) సెల్ నంబర్లను సంప్రదించాలని నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలియజేశారు. తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు హైదరాబాద్, చైన్నె తదితరప్రాంతాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయని, విద్యార్హతలను బట్టి వేతనం ఉంటుందని తెలియజేశారు. -
వెళ్లొస్తాం!
● విదేశీ విహంగాలు తిరుగుముఖం ● సీజన్ పూర్తికావస్తుండడంతో వెలవెలబోతున్న పక్షుల రక్షిత కేంద్రం ● రూ.25 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు వెలవెలబోతున్న పర్యావరణ కేంద్రం, (ఇన్సెట్) తెలుగు గంగ నీళ్లు సులువుగా చేరేలా కాలువ అభివృద్ధి, చెరువులో పక్షులకు ఆటంకం ఏర్పడకుండా గుర్రపు డెక్క చెట్లను తొలగిస్తున్న కూలీలుదొరవారిసత్రం: నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో విదేశీ విహంగాలు ఆయా దేశాలకు తిరుగుముఖం పట్టాయి. సుమారు ఏడు నెలల పాటు సందర్శకులు, పర్యాటకులు, పక్షి ప్రేమికులతో ఆహ్లాదాన్ని పంచిన పక్షులు ఆయా దేశాలకు తమ పిల్లలతో తిరుగుప్రయాణమయ్యాయి. పర్యాటకులు, పక్షి ప్రేమికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సందడిగా ఉండాల్సిన కేంద్రం నేడు వెలవెలబోతోంది. సీజన్లో ఆలస్యంగా ఇక్కడకు విచ్చేసిన గూడబాతులు మాత్రమే సుమారు రెండు వందల వరకు అడుగంటిన చెరువు నీటిలో ఈదుతూ సేద తీరుతున్నాయి. ఇక్కడే పుట్టి...ఎక్కడో పెరిగి! విదేశీ వలస విహంగాలు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో వాటి వాటి సంతానాభివృద్ధి చేసుకునేందుకు క్రమంతప్పకుండా సీజన్(అక్టోబర్లో మొదలై ఏప్రిల్కు పూర్తి)లో వేల సంఖ్యలో విచ్చేస్తాయి. సుమారు ఏడు నెలల పాటు కేంద్రం పరిధిలోని నేరేడు, మారేడు, అత్తిగుంట చెరువుల్లోని కడప చెట్లపై బస చేస్తాయి. సమీపంలోని పులికాట్ సరస్సులో చేపలను వేటాడుతూ జీవనం సాగిస్తాయి. పిల్లలను పొదిగి పెద్దవై ఎగిరే స్థాయికి వచ్చిన తర్వాత ఆయా దేశాలకు తిరిగి వెళ్లిపోతాయి. ఈ సీజన్లో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, తెడ్డుముక్కుకొంగలు, నీటి కాకులు, స్వాతికొంగలు, బాతుల జాతికి చెందిన పలు రకాల పక్షుల 1,7500 వరకు విచ్చేశాయి. 2వేలకు పైగా పిల్లలను పొదిగి తిరిగి ఆయా దేశాలకు ఇప్పటికే 75శాతం వరకు వెళ్లిపోయినట్టు స్థానిక వన్యప్రాణి విభాగం అధికారులు తెలిపారు. నైజీరియా, బర్మా, ఆప్ఘనిస్తాన్, సైబీరియా తదితర దేశాల నుంచి పక్షుల కేంద్రానికి ప్రతి ఏడాదీ విచ్చేస్తున్న విషయం తెలిసిందే. రూ.25లక్షలతో అభివృద్ధి పనులు నేలపట్టు పక్షుల కేంద్రంలో ఇటు పర్యాటకుల సౌకర్యార్థం, అటు విహంగాల అవాసయ్యోగంగా పలు అభివృద్ధి పనులు రూ.25 లక్షలతో చేపడుతున్నట్టు స్థానిక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలయ్య తెలిపారు. -
ముగిసిన పోస్టల్ రాష్ట్ర మహా సభలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వేదికగా గత మూడు రోజులుగా జరిగిన అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్టుమెన్, ఎమ్టీఎస్ రాష్ట్ర శాఖ మహాసభలు మంగళవారంతో ముగిశాయి. తపాలా శాఖ ప్రయివేటీ కరణను తిప్పికొట్టడానికి రాష్ట్రంలో ఉన్న తపాలా ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. మేలో జరగనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని ఆ సంఘం జాతీయ కార్యదర్శి ఆర్.పి.సారంగ్ పిలుపునిచ్చారు. చివరిగా రాబోయే రెండేళ్ల కాలానికి 15 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్టుమెన్ అండ్ ఎమ్టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్. విద్యాసాగర్, కే.మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి 300 మంది ఉద్యోగులు డెలిగేట్లుగా, పరిశీలకులుగా పాల్గొన్నారు. నేటి నుంచి ఏఐ స్కిల్స్పై శిక్షణ తిరుపతి సిటీ: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో 9 నుంచి 11వ తేదీ వరికు మూడు రోజులపాటు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రిన్సిపల్ ఆచార్య శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాయకత్వ లక్షణాలపై అవగాహన నెల్లూరు (పొగతోట): హర్యానా ఐఐఎంలో పంచాయతీలో సమర్థవంతమైన పాలన, నాయకత్వ నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తిరుపతి జిల్లా పెళ్లకూరు జెడ్పీటీసీ ప్రిస్కిల్లా హాజరయ్యారు. ఈ మేరకు పంచాయతీ పాలన, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించారు. ఈ అవకాశం కల్పించిన జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
వెల్ఫేర్ అధికారుల బదిలీ
తిరుపతి అర్బన్: బీసీ వెల్ఫేర్ అధికారి రాజేంద్రనాథ్రెడ్డిని తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఆ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ను కలిశారు. ఈయన అనంతపురం జిల్లా నుంచి తిరుపతికి విచ్చేశారు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి చంద్రశేఖర్ రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఈ క్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జ్యోత్స్నకు జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే మంగళవారం నూతనంగా విచ్చేసిన రాజేంద్రనాథ్రెడ్డి జిల్లా పగ్గాలు చేపట్టారు. అలాగే జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిగా పనిచేస్తున్న సూర్యనారాయణను విశాఖపట్నం జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న రాజా సోమును తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఆ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శెట్టిపల్లి భూసమస్యకు పరిష్కారం చూపుతాం తిరుపతి అర్బన్: తిరుపతిలోని శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపుతామని, మోడల్ టౌన్షిప్గా రూపుదిద్దుకునేలా చర్యలు చేపడుతామని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలసి ఆయన అధికారులతో శెట్టిపల్లి భూ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి సూళ్లూరుపేట, చంద్రగిరి ఎమ్మెల్యేలు విజయశ్రీ, పులివర్తి నాని, యాదవ సంఘం నేత నరసింహ యాదవ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజన్ 2020 తరహాలోనే విజన్ 2047కు సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. శ్రీ సిటీలో పలు పరిశ్రమల స్థాపనకు రెండో దఫా భూ కేటాయింపుల్లో భాగంగా 2,500 ఎకరాలు అందించనున్నట్టు వెల్లడించారు. తిరుపతిలో ఒబెరాయ్ హోటల్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తామన్నారు. అలాగే టీడీఆర్ బాండ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పులికాట్ ముఖద్వార పూడికతీతకు రూ.100 కోట్లతో పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే లైన్, సాగరమాల పనులు త్వరలో పూర్తయ్యేలా చర్యలు చేపడుతామన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువుల షెడ్ల పరిశీలన సత్యవేడు: మండలంలో దాసుకుప్పం పంచాయతీలో ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించిన ఐదు సిమెంట్ రోడ్లు, గోకులం షెడ్డును మంగళవారం డ్వామాపీడీ శ్రీనివాస ప్రసాద్ పరిశీలించారు. అనంతరం దాసుకుప్పం పంచాయతీలో జరిగిన ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ తమకు బిల్లులు మంజూరు కాలేదని ఆరోపించారు. పీడీ స్పందిస్తూ త్వరలో బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. ఏపీఓ విజయభాస్కర్, ఉపాధి హామీ జేఈ హరి, టెక్నికల్ అసిస్టెంట్ మనోహర్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి!
ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 8 కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 66,503మంది స్వామివారిని దర్శించుకోగా 23,941 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక, సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తిరుమల: తిరుమల శ్రీవారిని మంగళవారం సినీనటి రంభ, ప్రముఖ మాజీ క్రికెటర్ రవి శాస్త్రి, డైమండ్స్ గ్రూప్ ఆఫ్ అధినేత గౌతమ్ సింఘానియా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికారు. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. – 8లో -
పారంపర్య వైద్యానికి పెద్దపీట
తిరుపతి మంగళం : వంశపారంపర్యంగా చేస్తున్న వై ద్యానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహ కారం అందిస్తోందని ఏపీ ఔషధ, సుగుంధ మొక్కల బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి కపిలతీర్థంలోని ప్రధాన ఆటవీశాఖ కార్యాలయంలో మంగళవారం తిరుపతి సర్కిల్ సీఎఫ్ సి.సెల్వంతో కలిసి ఆయన వైద్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఔషధ మొక్కలను ఆధారంగా చేసుకుని వైద్య విధానం కొనసాగుతోందన్నారు. అద్భుతమైన ఫలితాలనిచ్చే మందులు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే అలాంటి ప్రకృతి వైద్యం చేసేవారికి, చేసే వైద్యానికి ఎలాంటి గుర్తింపు లేదని, దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. అలాంటి వైద్యులకు చేయూతనిస్తామని చెప్పారు. ఎస్వీయూ బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జే.కామాక్షమ్మ, రేజర్లు ప్రభాకర్, పారంపర్య వైద్యులు పాల్గొన్నారు. -
అక్రమాస్తుల కేసులో మళ్లీ సోదాలు
● గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన చంద్రగిరి పంచాయతీ ఈవో ● సదరు ఈవోను సస్పెండ్ చేసిన జిల్లా ఉన్నతాధికారులు ● సస్పెన్షన్లో ఉండగానే మరోసారి సోదాలు సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య లంచం తీసుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఏసీబీకి చిక్కారు. అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. అయితే సరిగ్గా నెల రోజుల తర్వాత ఆయన ఇంటిపై మరోసారి ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇంట్లోని పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసినట్టు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు తిరుపతి రూరల్ మండలం, పేరూరు పంచాయతీ సమీపంలోని ఏకదంతా అపార్ట్మెంట్లో ఉన్న మహేశ్వరయ్య ప్లాటుకు మంగళవారం ఉదయమే ఏసీబీ అధికారులు చేరుకున్నారు. అతని కుటుంబీకులకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బంగారం, వెండికి సంబంధించిన బిల్లులు, స్థిరాస్తులకు సంబంధించిన దస్తావేజులను పరిశీలించి.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కన మహేశ్వరయ్యను జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేయగా మరోసారి ఆయన ఇంట్లో సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. మహేశ్వరయ్య ఇంటితో పాటు కారు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో సుమారుగా మార్కెట్ విలువ ప్రకారం రూ.30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు అంచనా వేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా ఏసీబీ అధికారులు సోదాలు పూర్తయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. -
పరిహారం ఇప్పించండయ్యా !
తిరుపతి అర్బన్: ‘రైల్వే లైన్ వేయాలంటూ మా ఇళ్లు తీసుకున్నారు. రెండు నెలల క్రితమే కొట్టేశారు. ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. దూర ప్రాంతంలో ఇంటి పట్టాలు చూపించారు. ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకోవడానికి సాయం చేయలేదు. వీధుల్లో నివాసం ఉంటున్నాం. మేము కూడా మనషులమే సర్’ అంటూ పలువురు సుగాలీలు తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమాచారం అందుకున్న రేణిగుంట మండలం, తూకివాకం పంచాయతీకి చెందిన 26 సుగాలీల కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ మంత్రి చాంబర్ ముందు ఆందోళనకు దిగారు. కొత్త రైల్వే లైన్ వేస్తున్నామంటూ 26 ఇళ్లు కూల్చివేశారని వాపోయారు. అయితే 21 మందికి మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చారని ఆవేదన చెందారు. ఐదు పట్టాలను ఎవరు నొక్కేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని తెలిపారు. న్యాయం కోసం మంత్రిని కలిసి తమ బాధను తెలియజేస్తామంటూ భీష్మించారు. సమాచారాన్ని తెలుసుకున్న తిరుచానూరు పోలీసులు ఎస్ఐ జగన్నాథంరెడ్డి నేతృత్వంలో సుగాలీలకు సర్ది చెప్పారు. ఆందోళన వద్దని, తర్వాత జిల్లా అధికారులను కలసి సమస్యను చెప్పుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో వారంతా తిరిగి తూకివాకం వెళ్లిపోయారు. -
నేడే అవిశ్వాస తీర్మానం
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం ఉదయం 10.45 గంటలకు గూడూరు సబ్కలెక్టర్ రాఘవేంద్రమీనన్ నేతృత్వంలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్తోపాటు గూడూరు డీఎస్పీ గీతాకుమారి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఎలాగైనా ఈ ఎన్నికను వాయిదా వేయించాలని కూటమి నేతలు కుయుక్తులు పన్నుతుండడం విమర్శలకు తావిస్తోంది. కౌన్సిలర్లకు విప్ జారీ వెంకటగిరి మున్సిపాలిటీలో 25 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు ఆ పార్టీ అధిష్టానం విప్ జారీచేసింది. జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్రెడ్డి సూచనల మేరకు విప్జారీ చేశారు. విప్ అందుకున్న సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఎన్నిక ప్రక్రియను వాయిదా వేసేందుకు పచ్చపన్నాగం వెంకటగిరిలో 25 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ ప్రతినిధులే -
పది టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
శ్రీకాళహస్తి: పది టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం శ్రీకాళహిస్త మండలంలో చోటు చేసుకుంది. తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదేశాల మేరకు సీఐ వెంకటరవి, ఎస్ఐ రామకృష్ణ నాయక్, సీఎస్డీటీ రవిచంద్రబాబు, హెడ్ కానిస్టేబుల్ వెంకటాద్రి, కానిస్టేబుల్ అయ్యప్ప నేతృత్వంలో దాడులు చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ముసలిపేడు మార్గంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్టు సమాచారం రావడంతో రామాపురం జలాశయం వద్ద బియ్యంతో వెళుతున్న వాహనాన్ని అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.3.51 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేవీబీపురం మండలం, కోవనూరు గ్రామానికి చెందిన వెంకటయ్య కుమారుడు కే.రాజేష్ (25)ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అనంతరం బియ్యా న్ని శ్రీకాళహస్తి ఎంఎల్ఎస్ కేంద్రానికి తరలించామని, నిందితునితోపాటు వాహనాన్ని శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. గోవింద ధామానికి భూమిపూజ చంద్రగిరి: స్థానిక శ్రీనివాసమంగాపురం మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న గోవింద ధామంకు మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే పులివర్తినాని హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ చంద్రగిరి మండల ప్రజలకు ఇబ్బంది కలగకుండా హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా వారి సౌకర్యార్థం ‘గోవింద ధామం’ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ గోవింద ధామం ఏర్పాటుతో చంద్రగిరి ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమన్నారు. సర్పంచ్లు రేవతి, ముదికుప్పం రూపరామ్మూర్తి, జెడ్పీటీసీ చిల్లకూరి యుగంధర్రెడ్డి పాల్గొన్నారు. -
తవ్వేస్తూ.. తరలిస్తూ!
● నాయుడుపేట చుట్టుపక్కల యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ● స్వర్ణముఖి వంతెనల వద్ద అడ్డూఅదుపూ లేకుండా తరలింపు ● చెలరేగిపోతున్న కూటమి నేతలు నాయుడుపేటటౌన్: స్వర్ణముఖి నదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో రాత్రీపగలు తేడాలేకుండా తవ్వేస్తున్నారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరు స్వర్ణముఖి నది వద్ద రెండు రైల్వే బ్రిడ్జీల సమీపంలో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇసుక తవ్వేది ఇక్కడే మండల పరిధిలోని భీమవరం, చిగురుపాడు, అయ్యప్పరెడ్డిపాళెం, కల్లిపేడు, మూర్తిరెడ్డిపాళెం, మర్లపల్లి తదితర ప్రాంతాల్లో స్వర్ణముఖి నది నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇసుకాసులు ధన దాహానికి గిరిజనుడు బలి స్వర్ణముఖి నది నుంచి రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తు ట్రాక్టర్ అతి వేగానికి రెండు రోజుల కిందట లో గిరిజనుడు బలయ్యాడు. ఇసుక లోడ్డుతో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ను తుమ్మూరు వద్ద బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని అయ్యప్పరెడ్డిపాళెం మీక్సిడ్ కాలనీకి చెందిన ఈగ పులయ్య(26) మృతి చెందాడు. ప్రమాదంలో రైల్వే బ్రిడ్జీలు స్వర్ణముఖి నదిపై బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జీల సమీపంలో భారీగా ఇసుక తవ్వేస్తుండడంతో వాటికి ప్రమాదం పొంచి ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. రైల్వే అధికారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు ఇసుకను తమిళనాడుకు తరలించేందుకు డంపింగ్ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం స్వర్ణముఖి నదిలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే మండల పరిధిలోని పలు చోట్ల స్వర్ణముఖి నది వద్ద అడ్డుగా గోతులు తీశాం. మళ్లీ వీఆర్వోలను పంపించి పరిశీలిస్తాం. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. – మాగర్ల రాజేంద్ర, తహసీల్దార్, నాయుడుపేట ఇసుక తవ్వకాలతో ప్రమాదం స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్మంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కావడంలేదు. పట్టణ పరిధిలోని తుమ్మూరుతో పాటు పలు చోట్ల నదిలో భారీగా ఇసుక ఆగాధాలు ఏర్పడ్డాయి. పిల్లలు సరదాగా ఈతకెళ్తే అంతే. – శివకవి ముకుందా, సీపీఎం పార్టీ నాయకులు, నాయుడుపేట -
నాటు తుపాకీ పేలి ఒకరి మృతి
వెంకటగిరి రూరల్: బాలాయపల్లి మండలం, కోటంబేడు గ్రామానికి చెందిన రమణయ్య నాటు తుపాకీ పేలి మృతి చెందినట్లు వెంకటగిరి సీఐ ఏవీ రమణ తెలిపారు. పట్టణంలోని పోలీసుస్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోటంబేడు గ్రామానికి చెందిన వెంకటరమణయ్య గత నెల 30వ తేదీ నుంచి కనిపించడం లేదని అతని కుమారుడు శివప్రసాద్ స్థానిక పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తు నిర్వహించగా కోటంబేడు తెలుగుగంగ కాలువ బ్రాంచ్ కెనాల్ వద్ద మృతదేహం లభ్యమైనట్టు తెలిపారు. దర్యాప్తులో ఓజిలి మండలం, రావిపాడు గ్రామానికి చెందిన కొండా శివయ్యతో గత నెల 30వ తేదీ వెంకటరమణయ్య కలసి నాటు తుపాకీతో అడవి పందుల వేటకు ద్విచక్ర వాహనం పై వెళ్లినట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనం గుంతల్లో అదుపు తప్పి నాటు తుపాకి పేలి గుండు రమణయ్యకు తగిలి అక్కడికక్కడే మృతిచెందినట్టు వెల్లడించారు. దీంతో శివయ్య రమణయ్య మృతదేహాన్ని సమీప తెలుగుగంగ కాలువలో పడేసి అడవుల్లో తిరుగుతూ కాలం వెలదీశాడన్నారు. నీటీలో ఉన్న మృతదేహం పైకి తేలడంతో మృతదేహన్ని సమీప ముళ్ల పొదల్లో పడేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఈనెల 4వ తేదీన అటవీ ప్రాంతంలో రమణయ్య మృతదేహం గుర్తించి పోస్టుమార్టం నిర్వహించినట్లు వివరించారు. ఆపై శివయ్యను అరెస్టుచేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రెడ్బుక్ పాలనలో పచ్చనేతలకే పనిముట్లు
● తమ్ముళ్లకే సబ్సిడీ యంత్రాలు ● కూటమి నేతల లెటర్లే అర్హత ● మండల నేతలు ఇచ్చిన జాబితా ప్రకారమే మంజూరు ● పేద రైతులకు మొండిచెయ్యి జిల్లాలో వ్యవసాయ పనిముట్ల మంజూరు విషయంలో అధికారులు, నేతలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రైతులకే సబ్సిడీ పనిముట్లు మంజూరు చేస్తున్నారు. అర్హత కలిగిన పేద రైతులను పక్కన పెట్టేస్తున్నారు. ఇదేమని అడిగితే నేతల నుంచి సిఫార్సు లేఖ తెమ్మంటున్నారు. లేకుంటే వారి నుంచి తమకు ఫోన్ చేయించాలని సూచిస్తున్నారు. కూటమి నేతల చుట్టూ తిరగలేక చాలామంది కర్షకులు మిన్నకుండిపోతున్నారు. ఇదే అదునుగా అధికారులు అధికార పార్టీ నేతల సిఫార్సులనే అర్హతగా భావించి పరికరాలు మంజూరు చేస్తున్నారు. దీనిపై అన్నదాతలు రగిలిపోతున్నారు. తిరుపతి అర్బన్: జిల్లాలో రెడ్బుక్ పాలన నడుస్తోంది. కక్ష్యలు, కుట్రలు, దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. ఇవి చాలదన్నట్టు ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ వ్యవసాయ పరికరాలూ కూటమి నేతలకే చెందుతున్నాయి. అధికారులు సైతం అధికార పార్టీ అధినాయకుల లెటర్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటి వరకు 1,069 దరఖాస్తులు జిల్లాలో ఇప్పటివరకు రాయితీ వ్యవసాయ పనిముట్ల కోసం 1,069 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటిని అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కూటమి నేతల నుంచి సిఫార్సు లెటర్లు ఇస్తేనే ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. లేదంటే మీ ప్రాంతంలోని అధికార పార్టీకి చెందిన నేత దగ్గర నుంచి ఫోన్ చేయించాలని వ్యవసాయశాఖ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. చేసేది లేక పలువురు పేద రైతులు రాయితీ పనిముట్లపై ఆశలు వదులుకుంటున్నారు. అధికార పార్టీ నేతల అండదండలున్నవారు మాత్రం దర్జాగా పనిముట్లకు పట్టుకుపోతున్నారు. 50శాతం రాయితీ జిల్లాకు పురుగు మందుల స్ప్రేయర్లు 609, ట్రాక్టర్లకు చెందిన పలు విడిభాగాలు 745, పలు రకాల కట్టర్లు 50 జిల్లాకు వచ్చాయి. మొత్తంగా 1,404 పనిముట్లకు ఇప్పటి వరకు 1,069 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 650 మందికి జిల్లా వ్యాప్తంగా కూటమి నేతల నుంచి లెటర్లు, ఫోన్లు చేయించిన వారికి సిఫార్స్ జాబితాలో రాయితీ పనిముట్లను అప్పగించారు. మిగిలిన వారికి ఈ నెల 15వ తేదీ అందించాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. డ్రోన్ స్ప్రేయర్లలోనూ సిఫార్సుల జోరు జిల్లాకు తాజాగా 36 డ్రోన్ యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్ ధర రూ.10 లక్షలు. రైతులకు 80శాతం సబ్సిడీతో వీటిని అందించనున్నారు. ఆ మేరకు రెండు రోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శిక్షణ లేకుండానే.. గత ప్రభుత్వంలో డ్రోన్ల వినియోగంపై గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీలో రెండు వారాలపాటు కొందరు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థులకు డ్రోన్ యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పట్లో శిక్షణ పొందిన విద్యార్థులతో సంబంధం లేకుండా.. పచ్చ నేతలకు శిక్షణ లేకుండా రాయితీ డ్రోన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పారదర్శకంగా పంపిణీ వ్యవసాయ పనిముట్లు రైతులకు పారదర్శకంగా అందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 50 శాతం రాయితీతో వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నాం. అంతేతప్ప మాకు సిఫార్సు లెటర్లు ఎవ్వరూ ఇవ్వలేదు. డ్రోన్ విషయంలోనూ అదేమాదిరిగా పాటిస్తున్నాం. –ప్రసాద్రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారికూటమి నేతల చేతుల మీదుగా వ్యవసాయ పనిముట్లు అందిస్తున్న అధికారులువ్యవసాయ పనిముట్లు -
గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
తిరుపతి, సాక్షి: పవన్ కల్యాణ్ తనయుడు సింగపూర్లో ప్రమాదానికి గురికావడంపై అటు సినీ, ఇటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అంటున్నారు.ఈరోజు పవన్కల్యాణ్గారి చిన్నబాబు మార్క్ శంకర్(Mark Shankar) ప్రమాద వార్త నా మనసుని ఎంతో కలచివేసింది.ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్ చేశారు. ఈరోజు @PawanKalyan గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.#Getwellsoon— Roja Selvamani (@RojaSelvamaniRK) April 8, 2025ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. దీంతో ఈ ఘటన అంతలా హైలైట్ అయ్యింది. పవన్-అన్నాలెజినోవాల చిన్న కొడుకే మార్క్ శంకర్ పవనోవిచ్(mark shankar pawanovich). ఈ ప్రమాదంలో ఆ చిన్నారి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని.. పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యకరంగానే ఉన్నట్లు సమాచారం. -
అరవపాళెం పాఠశాలకు మౌలిక వసతులు
చిట్టమూరు: మండలంలోని అరవపాళెం జెడ్పీ హైస్కూల్కు ప్రయివేటు పాఠశాలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తామని శ్రీ సిటీ ఎండీ రవిసన్నారెడ్డి స్పష్టం చేశారు. శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో పాఠశాల ఆవరణలో జపాన్కు చెందిన ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రొసెసింగ్ లిమిటెడ్ కంపెనీ ఎండీ టైజో ఇవామితమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.29.5 లక్షలతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని శ్రీసిటీ ఎండీతో పాటు, టైజోఇవామితో కలసి సోమవారం ప్రారంభించారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రవిసన్నారెడ్డి మాట్లాడుతూ తాను అరవపాళెం గ్రామంలో జన్మించి ఇదే పాఠశాలలో పదో తరగతి వరకు చదివానని గుర్తుచేసుకున్నారు. అనంతరం బీటెక్ పూర్తి చేసి అమెరికాకు వెళ్లి అక్కడ ఉన్నత విద్య అభ్యసించి తడలో శ్రీసిటీని ప్రాంభించినట్టు తెలిపారు. శ్రీసిటీలోని ఐమాస్ కంపెనీ సామాజిక సేవలో భాగంగా తాను చదువుకున్న పాఠశాలకు అదనపు భవనం కావాలని కోరగా వెంటనే ఎండీ టైజో ఇవామి స్పందించి భవన నిర్మానానికి సహకరించారన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పది పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.లక్ష, జిల్లా స్థాయిలో రాణించిన విద్యార్థికి రూ.50వేలు, మండల స్థాయిలో రాణించిన వారికి రూ.10 వేలు నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎంఓఈ బీవీ కృష్ణయ్య, హెచ్ఎం ప్రభావతి పాల్గొన్నారు. -
నేటి నుంచి పోషణ్ పఖ్వాడా
తిరుపతి అర్బన్: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 7వ పోషణ్ పఖ్వాడా కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు నిర్వహించాలని డీఆర్వో నరసింహులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోషణ్ అభియాన్లో భాగమైన పోషక విలువలు, ఆరోగ్యకరమైన ఆహార స్వీకరణ అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఐసీడీఎస్ పీడీ వసంతబాయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 64 మందిలో 48 మందికే పింఛన్ సత్యవేడు: మండలంలోని సత్యవేడు పంచాయతీ వీఆర్ఓ 64 మందికికి గాను 48 మందికే పింఛన్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్యవేడు 1వ సచివాలయ పరిధిలోని వీఆర్ఓగా పనిచేస్తున్న చిట్టిబాబుకు ఏప్రిల్ పింఛన్ను 64 మందికి అందజేసేందుకు రూ.2.68 లక్షలు తీసుకున్నారు. ఏప్రిల్ 1న 48 మందికి పింఛన్ రూ.2.2 లక్షలు పంపిణీ చేశారు. ఆ తర్వాత బంధువులకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెళ్లాడు. వారం రోజులైనా ఆయన జాడ లేదు. దీంతో సత్యవేడు సెక్రటరీ మునిరవికుమార్ ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో లబ్ధిదారులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో తృతీయ స్థానం
తిరుపతి ఎడ్యుకేషన్ : పిడుగురాళ్లలో ఈ నెల 5, 6 తేదీల్లో అండర్–19బాలబాలికల రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు తిరుపతి జిల్లా నుంచి బాలబాలికల జట్లు హాజరయ్యాయి. ఈ పోటీల్లో జిల్లా బాలబాలికల జట్లు తృతీయ స్థానంలో నిలిచి ట్రోఫి, మెడల్స్ను అందుకున్నాయి. బాలికల విభాగంలో బెస్ట్ బ్యాట్స్ ఉమన్గా ఎ.రేష్మ, బాలుర విభాగంలో బెస్ట్ బ్యాట్స్మన్గా పోలరాజ్, నరసింహలు ప్రశంలందుకున్నారు. ప్రతిభ చాటిన బాలబాలికల జట్లను జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఎ.దేవరాజ్, కార్యదర్శి బి.మనోహర్, కోచ్ హరినాథ్ అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు లక్నోలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు. -
ప్చ్..కాపాడలేకపోయారు!
శ్రీకాళహస్తి: పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి సపర్యలు చేశారు. అన్ని పరీక్షలు నిర్వహించారు. తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రెఫర్ చేయలేక స్థానికంగానే డెలివరీ చేశారు. కానీ బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. ఈ ఘటన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం.. బుచ్చినాయుడుకండ్రిగ మండలం, చెన్నాయగుంటకు చెందిన అభినయ, అంకయ్య దంపతులు. అభినయ నిండు గర్భిణి కావడం.. పురిటి నొప్పులు రావడంతో ఆదివారం ఉదయం 7.50 గంటలకు ఆమె తల్లి నాగమణి కుమార్తెను తీసుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి చేరింది. విధుల్లో ఉన్న నర్సులు స్కానింగ్ తదితర వంటివి పూర్తి చేశారు. బిడ్డకు రెండు పేగులు చుట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. మధ్యాహ్నం వరకు అభినయకు నొప్పులు సరిగా రాకపోవడం.. అప్పటి వరకు విధుల్లో ఉన్న నర్సులు డ్యూటీ దిగిపోవడంతో తర్వాత వచ్చినవారు క్రిటికల్గా ఉందని చెప్పి వెళ్లిపోయారు. డాక్టర్ సతీష్, కొంతమంది పీజీ డాక్టర్లు గైనకాలజిస్టు లేకనే డెలివరీ చేయడానికి ప్రయత్నించారు. సాయంత్రం 3గంటల ప్రాంతంలో సూపరింటెండెంట్ విజయలక్ష్మికి ఫోన్ చేసి బయటకు తీసుకెళ్లడం మంచిది కాదని చెప్పడంతో అక్కడే డెలివరీ చేశారు. ఉలుకూ పలుకూ లేని బిడ్డ బిడ్డ పుట్టగానే ఉలుకూ పలుకు లేకపోవడంతో వెంటనే తిరుపతికి తీసుకెళ్లాలని అక్కడి డాక్టర్లు సూచించారు. 108 రావడానికి రెండు గంటలు పడుతుందని చెప్పడంతో బంధువులు వెంటనే ఓ ప్రైవేటు అంబులెన్స్కు రూ.6,500 చెలించి తిరుపతి రుయాకు తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే బిడ్డ మృతిచెందినట్టు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మూడు రోజులుగా లేని 108 డ్రైవర్లు ఏరియా ఆస్పత్రిలో మూడు రోజులుగా 108 అంబులెన్స్లకు డ్రైవర్లు లేరు. దీంతో సకాలంలో వైద్యం అందక పేద రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
అక్రమ అరెస్ట్లకు భయపడం
● కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉంటాం ● ఆగ్రహం వ్యక్తం చేసిన అభినయ్ తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం చేయించే అక్రమ అరెస్ట్లు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం కూటమి అరాచక పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు. అయితే కూటమి ప్రభుత్వానికి కొమ్ముగాసే ఎల్లో మీడియా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి వారికి భయాన్ని పరిచయం చేయండి అన్నట్లుగా ఆ పత్రిక రాసిన కథనాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉచిత బస్సు, విద్యుత్ చార్జీల పెంపు వంటి వాటిపై వినూత్న నిరసనలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్లకు పాల్పడడం సరికాదన్నారు. ఆరేళ్ల క్రితం ప్రత్యేక హోదా కోసం సహకరించని అప్పటి హోంమంత్రి అమిత్షా తిరుమలకు విచ్చేసినప్పుడు ఆయన కాన్వాయ్పై టీడీపీ నాయకులు చెప్పులు విసిరి నిరసన తెలిపారన్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే అప్పుడు లేని అక్రమ కేసులు, అరెస్ట్లు ఇప్పుడు తమపై ఎందుకు పెట్టమని పదేపదే రాస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా, రెడ్బుక్లో పేర్లను అండర్లైన్ చేసినా తాము అదరం, బెదరమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామని తెలిపారు. చేతనైతే ఏమి చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసిరారు. -
భగ్గుమన్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు
తిరుపతి రూరల్: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు భగ్గుమన్నారు. ఏపీఎస్పీడీసీఎల్లో కాంట్రాక్టర్లనే కాదు కాంట్రాక్టు కార్మికులను కూడా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ తిరుపతి నగరంలో మహా ధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం లక్ష్మీపురం సర్కిల్ నుంచి కేశవాయనగుంట ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నానుద్దేశించి పలువురు నాయకులు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా ఒక్క సమస్యా పరిష్కారం కాలేదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పి4 సర్వే పేరిట పేదల బతుకుల్ని పెద్దల దయాదాక్షిణ్యానికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఆదాయం రూ.16 వేల కోట్లు ఉండగా కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కోసం ఒకటిన్నర శాతం కూడా ఖర్చు చేయడం లేదన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక చిత్తూరు అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి)గా అరుణ సారిక నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మచిలీపట్నంలో పనిచేస్తున్న అరుణ సారికను చిత్తూరు జిల్లా జడ్జిగా బదిలీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న ఇ.భీమారావును అనంతపురం జిల్లా జడ్జిగా నియమించింది. చిత్తూరులోని పోక్సో కోర్టు జడ్జిగా పనిచేస్తున్న ఎన్.శాంతిని కడప ఫ్యామిలీ కోర్టుకు, 6వ అదనపు జిల్లా జడ్జి బి.బాబూనాయక్ను మచిలీపట్నం ఎస్సీ–ఎస్టీ కోర్టుకు, రాజమహేంద్రవరంలో పనిచేస్తున్న ఆర్.శ్రీలతను మదనపల్లె 7వ జిల్లా సెషన్స్ జడ్జిగా, రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టు జడ్జి పీవీఎస్.సూర్యనారాయణ మూర్తిని మదనపల్లె 2వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా, ఇక్కడ పనిచేస్తున్న బందెల అబ్రహాంను విజయవాడ 7వ అదనపు, జిల్లా సెషన్స్ జడ్జిగా, తూర్పుగోదావరి రామచంద్రాపురంలో పనిచేస్తున్న ఎం.శంకర్రావును చిత్తూరు పోక్సో కోర్టు జడ్జిగా బదిలీ చేసింది. అలాగే గూడూరు 7వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న షమి పర్వీన్ సుల్తానా బేగంను గుంటూరు పోక్సో కోర్టుకు, నెల్లూరులో ఫ్యామిలీ కోర్టులో పనిచేస్తున్న కె.వెంకటనాగపవన్ను గూడూరు 7వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ చేసింది. రెగ్యులర్ చేయాలంటూ మహాధర్నా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో న్యాయమూర్తుల బదిలీ చర్చలకు సానుకూల స్పందన డిస్కం పరిధిలోని అధికారులు కాంట్రాక్ట్ కార్మికులకు అండగా నిలిచారు. తాము చేయగలిగిన పరిష్కారాలను చేయడానికి అభ్యంతరం లేదని సీజీఎం హెచ్ఆర్డీ రమణదేవి, డీజీఎంలు మూర్తి, సురేంద్రబాబు, వెంకటరత్నం హామీ ఇచ్చారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులతో చర్చించి వినతి పత్రాలు స్వీకరించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నాను విరమించారు. -
ఇసుక ట్రాక్టర్ను ఢీకొన్న మోటార్బైక్
నాయుడుపేట టౌన్: ఇసుక ట్రాక్టర్ను మోటారు బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. అయ్యప్పరెడ్డిపాళెం మిక్సిడ్ కాలనీకి చెందిన పులయ్య(26) ఆదివారం రాత్రి మోటారు బైక్పై నాయుడుపేట నుంచి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యంలోని తుమ్మూరు వద్ద ఇసుక లోడ్డుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా మలుపు తిరగడంతో అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీకొనింది. తీవ్రంగా గాయపడిన పుల్లయ్య గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఈగా సునీత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతిరాపూరు: మోటారు సైకిల్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రాపూరు– మద్దెల మడుగు మధ్యలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రాపూరుకి చెందిన బొజ్జా కోటేశ్వరరావు (35) మద్దెల మడుగు నుంచి రాపూరుకు ద్విచక్ర వాహనంలో వస్తున్నాడు. ఈ క్రమంలో మోటారు సైకిల్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కోటేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రభుత్వ భూములు అమ్మేస్తున్న తిరుపతి రూరల్ ఎమ్మార్వో
● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు ● ఆధారాలతో సమర్పించిన ప్రజాప్రతినిధులు ● విచారణకు జేసీని ఆదేశించిన కలెక్టర్ తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండల పరిధిలోని ప్రభుత్వ భూములను అక్రమార్కుల చేతుల్లోకి చేర్చి అవినీతికి పాల్పడుతున్న తిరుపతి రూరల్ తహసీల్దారు రామాంజులు నాయక్పై విచారణ జరిపించాలని తిరుపతి రూరల్ మండల ప్రజాప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్ను కోరారు. తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, వైస్ఎంపీపీలు మాదవరెడ్డి, యశోద, జెడ్పీటీసీ సభ్యురాలు రత్నమ్మలతో పాటు పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిశారు. తిరుపతి రూరల్ మండలం తహశీల్దారు రామాంజులు నాయక్ అండగా నిలబడడంతో తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన భూములన్నీ అక్రమార్కుల పరం అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుపతి రూరల్ తహశీల్దారుగా రామాంజుల నాయక్ వచ్చినప్పటి నుంచి ఆక్రమణదారుల చెంతకు చేరిన ప్రభుత్వ భూములు, మఠం, భూములు, ఇనాం భూములు, కాలువ భూములు, చెరువు భూముల వివరాలను ఆధారాలతో సహా కలెక్టర్కు అందజేశామని తెలిపారు. భూ ఆక్రమణలకు సంబంధించి ఎవైనా తహసీల్దార్కు సమాచారం ఇస్తే వారి వివరాలను క్షణాల్లో ఆక్రమణదారులకు అందుతున్నాయంటే ఆయన ఏరకంగా వారితో ఆక్రమణదారులతో లాలూచీ పడ్డారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల దురాక్రమణలపై పత్రికల్లో ప్రచురించిన కథనాలు ప్రతులను కూడా కలెక్టర్కు అందజేశామని తెలిపారు. భూ ఆక్రమణదారులతో బేరం పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సాక్ష్యాలు కూడా ఆధారాలు కూడా వున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి తహశీల్దారుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలందరితో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపట్టడానికి సిద్ధంగా వున్నట్టు తెలిపారు. పది రోజుల సమయం తరువాత ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్ పూర్తిస్థాయి విచారణకు జిల్లా జాయింట్ కలెక్టర్కు ఆదేశిస్తున్నట్టు తెలిపారన్నారు. విచారణ తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. -
తవ్వుకో.. తరలించుకో!
● గూడూరు నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు ● ప్రజాప్రతినిధి అండతో చెలరేగిపోతున్న కూటమి నేతలు ● ఎలాంటి అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్ ● భయాందోళనలో తుంగపాళెం వాసులు సాక్షి, టాస్క్ఫోర్స్: గూడూరు రూరల్ పరిధి, చెన్నూరు రెవెన్యూలో అనుమతులు లేని ఓ మైనింగ్ కంపెనీని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. తుంగపాళెం ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి సదరు మైనింగ్కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఆరు నుంచి ఎనిమిది టిప్పర్ల క్వార్జ్ట్ ఖనిజాన్ని చైన్నె ప్రాంతానికి తరలిస్తున్నారు. మైన్లోకి బయట నుంచి ఖనిజం అనుమతులు లేని మైన్లోకి ప్రభుత్వ భూముల్లో తవ్విన క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించి అక్కడ వాటిని గ్రేడింగ్ చేసి తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ అక్రమంగా మైనింగ్ జరగడానికి స్థానిక ప్రజాప్రతినిధి అండగా ఉండగా చెన్నూరు ప్రాంతానికి చెందిన ఓ కూటమి నాయకుడు కనుసన్నల్లోనే ఈ తతంగం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సబ్ కలెక్టర్కు ఫిర్యాదు తుంగపాళెం సమీపంలోని మైనింగ్ కంపెనీలో అక్రమంగా తవ్వకాలు చేసి క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని మైనింగ్ కంపెనీలో భాగస్వామి ఒకరు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనకు ఫిర్యాదు చేశారు. తనకు మైనింగ్ విషయం తెలియకుండానే అక్రమంగా తవ్వకాలు, తరలింపు చేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. మెటీరియల్కు అనుమతులు ఉన్నాయి తుంగపాళెం సమీపంలో ఉన్న మైన్కు అనుమతులు అయితే లేవు గానీ, అందులో మూత వేసే సమయంలో ఉన్న ఖనిజాన్ని బయటకు తరలించుకునేందుకు అనుమతులు కావాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ మేరకు వాటిని పరిశీలించి ఉన్న ఖనిజాన్ని తరలించే వరకు అనుమతులు మంజూరు చేసి ఉన్నారు. బయట నుంచి ఖనిజాన్ని తరలించే విషయం నా దృష్టికి రాలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, గనులశాఖాధికారి, గూడూరు రాత్రి బ్లాసింగ్.. పగలు రైట్రైట్ చెన్నూరు బిట్–2లోని తుంగపాళెం సమీపంలో ప్రభుత్వ, మేత పోరంబోకు భూములున్నాయి. వీటిలో విలువైన క్వార్ట్జ్ ఖనిజం ఉంది. దీనిపై కూటమి నేతలు దృష్టి పెట్టారు. అనుమతులు లేని మైనింగ్ నిర్వాహకులతో కుమ్మకై ్క రాత్రిపూట బ్లాస్టింగ్ చేసి.. పగటి పూట మెటీరియల్ను తరలిస్తున్నారు. అక్కడి నుంచి ముడిసరుకును నేరుగా టిప్పర్లలో చైన్నెకి చేరవేస్తున్నారు. క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలిస్తున్న టిప్పర్లు బ్లాస్టింగ్కు అనుమతులు ఎక్కడవి?. గనుల శాఖలో బ్లాస్టింగ్ చేయాలంటే పలు రకాల అనుమతులు అవసరం. అయితే తుంగపాళెం వద్ద అసలు ఎలాంటి అనుమతులు లేని మైనింగ్లో రాత్రి పూట బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీనిద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రిపూట నిద్రలేక అగచాట్లు పడుతున్నారు. -
అట్టహాసంగా తిరుపతి రూరల్ ఎంపీపీ బాధ్యతల స్వీకరణ
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీపీ బాధ్యతల స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. గత నెల 27న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మూలం చంద్రమోహన్రెడ్డి విజయం సాధించిన విషయం విధితమే. ఈమేరకు ఆయన తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్లో సోమవారం బాధ్యతలను స్వీకరించారు. తర్వాత ఎంపీపీని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఘనంగా సత్కరించారు. తదనంతరం ఎంపీపీ దంపతులు మోహిత్రెడ్డిని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. వైస్ ఎంపీపీ మాధవరెడ్డి, యశోదతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపీపీని సత్కరించారు. అలాగే ఎంపీడీవో రామచంద్రతో పాటు కార్యాలయ సిబ్బంది సత్కరించి అభినందనలు తెలిపారు. ఫ్లెక్సీలపై అధికారుల ఓవరాక్షన్ తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన మూలం చంద్రమోహన్రెడ్డికి పలువురు ఎంపీటీసీలు, పార్టీ నేతలు, శ్రేయోభిలాషులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వీటి ఏర్పాటు విషయంలో పంచాయతీ అధికారులు ఓవరాక్షన్ చేసి వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. దీన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆపై ప్రమాణస్వీకర మహోత్సవం పూర్తవగానే ఫ్లెక్సీలను తొలగించారు. -
బలవంతపు భూసేకరణ ఆపండి
సత్యవేడు: మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటిపాకం(రాచపాళెం), రాళ్లకుప్పం గ్రామాల్లో బలవంతపు భూసేకరణ ఆపాలని ఆయా గ్రామాల రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సోమవారం ఆయా గ్రామాలకు చెందిన వంద మంది రైతులు కలసి ఇరుగుళంలో సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. శ్రీసిటీ ఏర్పాటు చేసిన తొలి దశలో ఏపీఐఐసీకి సేకరించిన భూములలో ఇంకా 40 శాతం భూమి ఖాళీగానే ఉందన్నారు. ఆ భూమిని వదిలేసి మళ్లీ భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు. నాలుగు గ్రామాల్లో ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు రైతులందరూ తీర్మానం చేసినట్టు వెల్లడించారు. మండల పరిధిలో ఏపీఐఐసీకి నాలుగు గ్రామాల్లో 2,583.99 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీచేయగా.. ఇందులో రైతుల పట్టా భూమి 1,753.060, ప్రభుత్వ భూమి 830.239 ఎకరాలు ఉన్నట్లు సమాచారం.పోలీస్ గ్రీవెన్స్కు 121 అర్జీలుతిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 121 ఫిర్యాదులు అందినట్టు ఏఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.12న తుంబురుతీర్థ ముక్కోటితిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసి ఉన్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఈనెల 12న జరగనుంది. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే ఈ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.టీటీడీకి రూ.30 లక్షల విరాళంతిరుమల: బెంగళూరుకు చెందిన బీఎంకే నగేష్ అనే భక్తుడు సోమవారం ఎస్వీ సర్వ శ్రేయస్ ట్రస్టుకు రూ.30 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలో అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరికి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్రెడ్డి చేతుల మీదుగా విరాళం డీడీని అందజేశారు.మూడు యూనిట్లకు రూ.726 బిల్లుసైదాపురం: సైదాపురంలోని 311233 4000551 సర్వీసు నంబర్ గల వినియోగదారుడికి మూడు యూనిట్లకు రూ.726 బిల్లు వచ్చింది. అందులో ఫిక్సిడ్ చార్జీ రూ.30, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 0.18 పైసలు, ఎఫ్పీపీసీఏ (2022) రూ.360, ఎఫ్పీపీసీఏ (2023) రూ.232, ట్రూ ఆఫ్ చార్జీ రూ.45, సర్చార్జీ రూ.25 మొత్తం రూ.726 వచ్చింది. అయితే వాస్తవంగా 3 యూనిట్లకు గాను రూ.5.70 కట్టాల్సి ఉంది. దీంతో వినియోగదారుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నాడు.శ్రీవారి దర్శనానికి 8 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,960 మంది స్వామివారిని దర్శించుకోగా 23,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
రామ్సర్ సైట్ ఒక్కటే మార్గం
● పులికాట్ సరస్సు సంరక్షణ గాలికి ● ముందుకు సాగని సముద్రముఖద్వారాల పూడికతీత పనులు ● సర్వేలతోనే కాలం నెట్టుకొస్తున్న నేతలు ● అబద్ధాలతో మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం ● పెదవి విరుస్తున్న మత్స్యకారులు, పర్యావరణ వేత్తలు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా సముద్ర ముఖద్వారాల పూడికతీత సమస్యను తెరమీదకు తెచ్చి మత్స్యకారులను మోసం చేయడం అలవాటుగా మారిపోయింది. 1994–2004, 2014–19 సంవత్సరాల్లో ఇదేమాదిరిగా మాట ఇచ్చి నిలబెట్టుకోలేక పోయింది. ఇప్పుడేమో సాగరమాల ప్రాజెక్టు ద్వారా రూ.129 కోట్లతో పూడిక తీత పనులు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తోంది. సర్వేలు జరుగుతున్నాయని, నిధులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని బురిడీ కొట్టిస్తోంది.సూళ్లూరుపేట: ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన పులికాట్ సరస్సు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బంగాళాఖాతం ముఖద్వారాల వద్ద పూడిక పేరుకుపోవడంతో ఉప్పు నీటిరాక మందగించింది. విదేశీ విహంగాలతోపాటు మత్స్యకారులకు ఇది గుదిబండగా మారింది. జీవ వైవిధ్య సరస్సు ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో సుమారు 620 చదరపు కిలోమీటర్ల పరిధిలో పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు ఆంధ్రరాష్ట్రం పరిధిలోని నెల్లూరు జిల్లా తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, వాకాడు, చిట్టమూరు మండలాల్లో విస్తరించి ఉంది. మిగిలిన 120 చదరపు కిలో మీటర్లు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, పొన్నేరి తాలుకా పరిధిలో విస్తరించి ఉంది. జీవవైవిధ్యాన్ని సంతరించుకున్న రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు పొందింది. ప్రతిఏటా వేసవికి ముందే సుముద్ర ముఖద్వారాలకు అడ్డుగా ఇసుక మేటలు పేరుకుపోయి సరస్సు ఎడారిలా మారిపోతోంది. బంగాళాఖాతం నుంచి తమిళనాడు పరిధిలోని పలవేరికాడ్ వద్ద ఒక ముఖద్వారం, మన రాష్ట్రంలో రాయదొరువు వద్ద మరొక ముఖద్వారం ఉంది. వర్షాకాలంలో స్వర్ణముఖి, కాళంగినదితో పాటు చిన్నాచితక కాలువల నుంచి మంచినీరు సరస్సుకు చేరుతుంది. సముద్రంలో ఆటుపోట్లు వచ్చి అలల ఉఽఽధృతి పెరిగినపుడు అందులో నుంచి ఉప్పునీరు పులికాట్లోకి ప్రవేశిస్తుంది. మంచినీరు, ఉప్పునీరు కలగలసిన సంగమం కాబట్టి దీన్ని జీవి వైవిధ్యం కలిగిన సరస్సుగా పర్యావరణ వేత్తలు గుర్తించారు. ప్చ్..ఫలితం లేదు! దాదాపు 20 ఏళ్లుగా ఎంతో మంది ఎంపీలు.. నేతలు మాట ఇచ్చి చేతులు ముడుచుకుంటున్నారు తప్ప పులికాట్ సంరక్షణకు ఏమాత్రం సహకరించడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నేతల ఒత్తిడితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం సర్వేలకే పరిమితమవుతున్నాయి. గత యేడు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్స్లోనూ సముద్ర ముఖద్వారాల పూడిక తీత విషయాన్ని నేతలు ప్రముఖంగా ప్రస్తావించి మిన్నకుండిపోయారు.పోరాడుతున్న ఎంపీ పులికాట్ సరస్సు సంరక్షణకు వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అవిరాళంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. నిధులు మంజూరు చేయించాలని అభ్యర్థించారు. ఆమేరకు ఒత్తిడి తెస్తున్నా చలనం లేకుండా పోతోంది. పులికాట్ సరస్సు చిత్తడి నేలల సరస్సు. ఇరాన్ కేంద్రంగా నడుస్తున్న రామ్సర్ సైట్లోకి దీన్ని చేర్చితే పులికాట్ సరస్సుకు పూర్వ వైభవం రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా చేయాలంటే ముందుగా శాసనసభలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. ఆపై దీన్ని ఆమోదించేవరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. తద్వారా పులికాట్ సరస్సును అభివృద్ధి చేయొచ్చని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. -
● జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు ● నెట్వర్క్ ఆస్పల్లో రోగుల అవస్థలు ● పట్టించుకోని కూటమి నేతలు
ఎప్పటి నుంచి పెండింగ్ 12 నెలలుగా రోజూ ఆరోగ్యశ్రీ ఓపీలు 1,456ఆశ్రయిస్తున్న రోగులు 2వేల మందికి పైగాతిరుపతి తుడా: ఆరోగ్యశ్రీకి ముసలం పట్టుకుంది. నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. వైద్యం అందక పేద రోగులు అల్లాడిపోతున్నారు. తిరుపతి జిల్లాలో 38 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలందిస్తున్నారు. పేరుకుపోయిన బకాయిలు ఏప్రిల్ 6వ తేదీలోపు చెల్లించాలని ఆయా ఆస్పత్రుల నిర్వాహకులు ఆల్టిమేటం జారీ చేశారు. కానీ కూటమి నేతలు పట్టించుకోలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ముందస్తుగా ప్రకటించిన మేరకు సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసింది. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కౌంటర్లు వెలవెలబోతున్నాయి. వైద్యం కోసం వచ్చిన పేద రోగులు వెనుదిరుగుతున్నారు. బకాయిలు విడుదల చేస్తేనే జిల్లా వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులకు గత 12 నెలలుగా రూ.220 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. వీటిని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లిస్తేగానీ ఆరోగ్యశ్రీని కొనసాగించలేమని ఆస్పత్రుల నిర్వాహకులు తేల్చిచెప్పారు. రూ.10 కోట్లు రావాల్సిన ఆస్పత్రులకు రూ.50 లక్షలు విడుదల చేస్తే ఎలా నడపాలని ఆవేదన చెందుతున్నారు. వెలవెలబోయిన ఆరోగ్యశ్రీ కౌంటర్ఆరోగ్యశ్రీ మాటెత్తితే మండిపడుతున్నారు మాది రేణిగుంట. నేను తిరుపతి నగరంలోని ఓ చెప్పుల షాపులో కూలీగా పనిచేస్తున్నాను. నాకు రెండుకాళ్లు వాచిపోయాయి. కిడ్నీలు దెబ్బతిన్నాయనే అనుమానం ఉంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి సోమవారం వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డు చూపించా. అక్కడున్న సిబ్బంది దయచేసి వెళ్లిపోండి అని చెప్పారు. నేను నా భార్య బతిమలాడినా వినిపించుకోలేదు. చేసేది లేక ఇంటికి వచ్చేశాం. –రమణాచారి, మంగళం, తిరుపతి అయోమయంలో రోగులు ప్రభుత్వం దిగివచ్చి బకాయిలు చెల్లించని పక్షంలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు పూర్తిగా పేదలకు దూరంకానున్నాయి. ఇప్పటికే నెట్వర్క్ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో రోగులు అడ్మిషన్లు తీసుకుని ఉన్నారు. మరికొందరు శస్త్ర చికిత్సలు చేసుకుని వైద్యసేవలు పొందుతున్నారు. ఇంకొందరు ఆరోగ్యశ్రీ అనుమతుల కోసం బెడ్లపై నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఉన్నపళంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో పేద రోగుల పరిస్థితి అయోమయంలో పడింది. వెంటనే బకాయిలు చెల్లించి పేద రోగులకు ఆరోగ్యశ్రీ భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కౌన్సిలర్లను బెదిరిస్తున్నారు
చిల్లకూరు : వెంకటగిరి మున్సిపాలిటీలోని 25 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లలో ఆరుగురిని తమ వైపునకు తిప్పుకుని మిగిలిన వారిని బెదిరించి అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించాలని కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్తో కలిసి గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనన్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని కోరారు. కూటమి నేతలు కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీస్ స్టేషన్కు పిలిపించి కేసులు ఉన్నాయని, వాటిని తిరగదోడి ఇబ్బందులు పెడతామని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఎవరూ ప్రలోభాలకు లొంగకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమి నేతల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. అవిశ్వాసంలో వైఎస్సార్ సీపీ విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. కౌన్సిలర్లకు విప్ జారీ వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి మున్సిపాలిటీలో ఈనెల 9న జరగనున్న అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కౌన్సిలర్ల విప్ జారీ చేసినట్టు నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు విప్ నివేదికలను గూడూరు సబ్కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ రాఘవేంద్రమీనన్కు కూడా అందజేసినట్టు వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేసేందుకు టీడీపీ కుయుక్తులు పన్నుతోందన్నారు. -
ప్రతి అర్జీకి పరిష్కారం
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారవేదికకు వచ్చే ప్రతి అర్జీకి అధికారులు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అత్యధికంగా 480 అర్జీలు వచ్చాయి. కలెక్టర్తోపాటు జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు హాజరై అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు రసీదులు ఇవ్వాల్సిన కౌంటర్ వద్ద రద్దీ నెలకొంది. న్యాయం చేయండి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు చెందిన బెనిఫిట్స్ ఇవ్వాలని గూడూరు రూరల్ మండలం, చెన్నూరు పాత గిరిజన కాలనీకి చెందిన అడ్డూరు రమణమ్మ, ఆమె భర్త వేణు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్కు విచ్చేసి అర్జీని అందించారు. వారికి మద్దత్తుగా గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బీఎల్ శేఖర్ నిలిచారు. మురుగును శుభ్రం చేయండి నేను దివ్యాంగుడిని. తనపల్లి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నా. మా కాలనీ చుట్టూ, కాలనీ వద్ద మరుగునీటితో నానా తంటాలు పడుతున్నాం. రెండు సార్లు నేను మురుగునీటిలో జారిపడ్డాను. దొమల బెడద అధికంగా ఉంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – విజయభాస్కర్, తనపల్లి, తిరుపతి రూరల్ మండలం -
ఎన్నికల కమిషనర్ను కలిసిన వైఎస్సార్సీపీ బృందం
విజయవాడ: తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసింది వైఎస్సార్సీపీబృందం. ఈ ఎన్నికపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టి తద్వారా ఎన్నిక వాయిదా వేయాలని కుట్రకు తెరలేపిన నేపథ్యంలో వైఎస్సార్సీపీసభ్యులు మల్లాది విష్ణ/, వైఎస్సార్సీపీఎంప్లాయిస్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులు ఎన్నికల కమిసనర్ ను కలిశారు.అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉపఎన్నిక పై ఈసీని కలిశాం. వెంకటగిరిలో 25 కార్పోరేటర్లను వైఎస్సార్ సీపీ గెలిచింది. ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా అవిశ్వాసం ప్రవేశపెట్టింది. దీని ద్వారా మరొకవైపు ఎన్నిక వాయిదా వేసేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోంది. ఈనెల 9వ తేదీన జరగబోయే ఎన్నిక వాయిదా వేయాలని చూస్తోంది. ఎన్నిక వాయిదా పడకుండా చూడాలని ఈసీని కోరాం. 9వ తేదీనే జరిగేలా చూడాలిన కోరాం. భయపెట్టి...బెదిరించి గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కలెక్టర్లకు సరైన ఆదేశాలివ్వాలని కోరాం. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో ఎన్నిక జరపాలి’ అని ఈసీని కోరామన్నారు మల్లాది విష్ణు. -
ఇష్టారాజ్యంగా వ్యర్థాలను వదిలేస్తున్న పాల డెయిరీ
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి శివారులోని గాంధీపురం పంచాయతీలో ఉన్న ఓ పాల ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్న వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కలుషితమై మంచినీరు రంగు మారుతోంది. పరిశ్రమ సమీపంలోని నివసించేవారు దుర్వాసన భరించలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. డెయిరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు ప్రజలకు అనర్థాలు తెచ్చిపెడుతున్నా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు. ప్రధానంగా డెయిరీ నుంచి వస్తున్న మురుగునీరు అవిలాల చెరువులో కలుస్తోంది. దీంతో చెరువు వద్ద వాకింగ్ కోసం వచ్చేవారు ముక్కు మూసుకుని నడవాల్సి వస్తోంది.ఫిర్యాదు చేసినా ఫలితం లేదుడెయిరీ నుంచి వస్తున్న వ్యర్థాలతో ఇబ్బందిపడుతున్నామని జిల్లా ఉన్నతాధికారులు, కాలుష్య నియంత్రణ మండలి వారికి వరుసగా ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని గాంధీపురం, అవిలాల పంచాయతీలకు చెందిన పలు కాలనీల వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగడంతో డెయిరీ యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. అప్పట్లో డెయిరీ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారని, కొంతకాలం పాటు బయటకు వదల్లేదని వెల్లడిస్తున్నారు. గత ఆరునెలలుగా మళ్లీ వ్యర్థాలను ఇష్టారాజ్యంగా బయటకు వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా డెయిరీకి పక్కనే ఉండే జర్నలిస్ట్ కాలనీలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో ఉండలేక తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని వివరిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెంటనే స్పందించి డెయిరీ నుంచి వ్యర్థాలు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేకుంటే కోర్టును ఆశ్రయించడమే తమకు శరణ్యమని స్పష్టం చేస్తున్నారు.గుంతల్లోకి చేరుతున్న మురుగుడెయిరీ చుట్టూ ప్రహరీ గోడ ఉన్నప్పటికీ వ్యర్థాలతో కూడిన మురుగునీరు బయటకు వచ్చి గుంతల్లోకి చేరుతోంది. అందులో గేదెలు, పందులు దొర్లుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. విషజ్వరాలతోపాటు చర్మవ్యాధులకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అవిలాల, గాంధీపురం, మల్లంగుంట పంచాయతీల పరిధిలోని కొన్ని బోర్లు నుంచి వస్తున్న నీరు రంగు మారిపోయింది. దీంతో స్థానికులు మంచి నీటికోసం మినరల్ వాటర్ ప్లాంట్లను ఆశ్రయించాల్సి వచ్చింది. డెయిరీ వ్యర్థాలతో కూడిన నీటిని తాగిన పశువులు సైతం అనారోగ్యానికి గురవుతున్న తెలిసింది.స్థానికుల ఆవేదనపాల డెయిరీ వ్యర్థాలతో నిండిన మురుగునీరు భూమిలోకి ఇంకుతోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారి బోరుల్లో నుంచి ఎర్రగా నీరు వస్తోంది. వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా నీటిని శుద్ధి చేసేందుకు కూడా వీలు కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నామని, అలాగే సొంతింటిని వదిలి వేరే చోటుకి వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. డెయిరీ యాజమాన్యానికి తమ సమస్యలు విన్నవించే అవకాశం లేకుండా పోయిందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.నిబంధనలకు పాతరడెయిరీ నిర్వాహకులు పాల వ్యాపారంలో రూ.కోట్లు ఆర్జిస్తున్నా.. సామాన్యుల జీవితాలతో చెలగాలమాడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం డెయిరీ నుంచి వ్యర్థాలను శుద్ధి చేసి వదలాల్సి ఉంది. అయితే నిబంధనలకు పాతర వేస్తూ యథేచ్ఛగా మురుగును జనం మీదకు వదిలేయడంపై పలువురు మండిపడుతున్నారు. రూ.కోట్లు సంపాదిస్తున్నా.. వ్యర్థాలను శుద్ధి చేసే యంత్రాలను ఎందుకు ఏర్పాటు చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజా రోగ్యంతో ఆడుకుంటున్న డెయిరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేనే చైర్మన్.. నాదే పెత్తనం!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెంచయ్యనాయుడు వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఆలయ పాలకమండలి ప్రకటించకపోయినా.. తానే చైర్మన్లా పెత్తనం చెలాయించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సేవా కమిటీ పేరుతో చెంచయ్యనాయుడు ఇష్టారాజ్యంగా హవా చూపించారు. ఈ క్రమంలోనే ఆలయంలో చేపట్టే ప్రతి ఉత్సవంలో చెంచయ్యనాయుడుని చైర్మన్లా పీటల మీద కూర్చుని పూజలు నిర్వహించేందుకు అధికారులు అనుమతిస్తుండడంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో ఆలయ పాలకమండలి చైర్మన్ భర్తీకి జీఓ రావడం ఒక్కరోజు ఆలస్యమైతేనే పచ్చమీడియా గగ్గోలు పెట్టింది. ఇప్పుడు సర్వం తానే అంటూ హల్చల్ చేస్తున్న చెంచయ్యనాయుడు తీరుపై ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తుండడం గమనార్హం. రెండు కిలోల బంగారం స్వాధీనం నెల్లూరు(క్రైమ్): కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు నెల్లూరు కాపువీధికి చెందిన ఓ చాట్ బండి దుకాణ నిర్వాహకుడిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. సెంట్రల్ ఎకై ్సజ్ లేదా డీఆర్ఐ అధికారులో స్పష్టంగా తెలియదు గానీ ఆదివారం గూడూరు సమీపంలో బిల్లుల్లేకుండా అక్రమంగా తరలిస్తున్న సుమారు 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో కాపువీధికి చెందిన ఓ చాట్ బండి దుకాణ నిర్వాహకుడి ప్రమేయం ఉందని గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యాపారి పేరుకే చాట్ బండి దుకాణం నిర్వహిస్తూ లోపల బంగారు వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముగిసిన దివ్యాంగ క్రికెట్ సెలెక్షన్స్
తిరుపతి సిటీ: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫెరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ, డిఫెరెంట్లీ ఎబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ వేదికగా జరిగిన దివ్యాంగ క్రికెట్ సెలెక్షన్స్ ముగిసినట్టు ఆ సంఘ చైర్మన్ సూర్యనారాయణ, కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 20 మంది దివ్యాంగులు ఈ సెలెక్షన్స్లో పాల్గొన్నారని తెలిపారు. ఎంపికలో ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ సంఘ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసం వెంకట దుర్గారావు, ఉమ్మడి చిత్తూరు జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘ జాయింట్ సెక్రటరీ తలారి మోహనబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పురుషోత్తం రెడ్డి, సభ్యులు నరేష్, తులసికృష్ణా, కోచ్ మహాలింగం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి పట్టణ శివారు వీఎపంల్లి పీఎన్ జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. రెండో పట్టణ పోలీసుల కథనం.. అమ్మపాళెంకు చెందిన మధుసూన్రెడ్డి కారులో నెల్లూరుకు బయలుదేరాడు. అదే సమయంలో ప్రకాశం జిల్లాకుకు చెందిన ప్రభుదాస్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమలకు వస్తున్నాడు. మార్గమధ్యంలో వీఎంపల్లి వద్ద మధుసూదన్రెడ్డి ప్రయాణిస్తున్న కారు పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ అవతలి వైపు వస్తున్న ప్రభుదాస్ కారును ఢీకొంది. ఈ ఘటనలో మధుసూదన్రెడ్డి తీవ్రంగా గాయపడగా.. ప్రభుదాస్, అతని భార్య హర్షిత, కుమారుడు సామి, అల్లుడు గిరీష్కుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మధుసూదన్రెడ్డిని ప్రథమ చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
శాస్త్రోక్తంగా పెద్దకొట్టాయి ఉత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం శాస్త్రోక్తంగా పెద్దకొట్టాయి ఉత్సవం జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు పలు రకాల అభిషేక పూజలు నిర్వహించారు. స్వామి,అమ్మవార్లకు నైవేద్యం, మంత్రపుష్పం, దీపారాధన, హారతులు సమర్పించారు. ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పందుల దాడిలో పంటలు ధ్వంసం బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని కాంపాళెం, కరకంబట్టు, కుక్కంబాకం, బుచ్చినాయుడుకండ్రిగ, గ్రామాల్లో పంటలను అడవి పందులు శనివారం రాత్రి ధ్వంసం చేశాయి. చేతికొచ్చే దశంలో పంట నష్టపోవడంతపై బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ అడవి పందులు దాడికి దిగుతుండడంపై ఆందోళన చెందుతున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో సుమారు 565 ఎకరాలు సాగులో ఉన్నాయి. వీటిని అడవి పందులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండడంపై రైతులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అడవి పందులను కట్టడి చేయకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. పంటల రక్షణకు సోలార్ఫెన్సింగ్ను రాయితీపై అందించాలని విన్నవిస్తున్నారు. ఫిజియోథెరపీపై శిక్షణ తిరుపతి కల్చరల్: నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్డులో ఉన్న రాస్ కార్యాలయంలో ఫిజియోథెరపీ విభాగానికి చెందిన డాక్టర్ రేవతి, డాక్టర్ చరణ్ ఆధ్వర్యంలో ఆదివారం ఫిజియోథెరపిస్టులకు, విద్యార్థులకు ఆటిజంపై అమెరికన్ అడ్వాన్డ్స్ ఫిజియోథెరపీ మెళకువలపై శిక్షణలో భా గంగా తెలిపారు. ఇందులో ఆటిజంపై ఉన్న పిల్ల ల తల్లిదండ్రులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఆటిజంతో ఉన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల చికిత్స కోసం ఫిజి యోథెరపీ సెంటర్ను, లేదా 9290234075ను సంప్రదించాలని వారు తెలియజేశారు. -
నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. గత సోమవారం రంజాన్ సందర్భంగా గ్రీవెన్స్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో నేటి గ్రీవెన్స్కు పెద్దసంఖ్యలో అర్జీదారులు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వసతులు అవసరం వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వచ్చిన అర్జీదారులకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరముంది. ఈ క్రమంలో మరుగుదొడ్లు శుభ్రం చేయించాలని పలువురు సూచిస్తున్నారు.అలాగే కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. అర్జీదారులతో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా వృద్ధులు, దివ్యాంగులు ఏదైనా సమాచారం కోసం అడిగితే సిబ్బంది విసుక్కుంటున్నట్లు తెలుస్తోంది. అర్జీలు రాసుకోలేని వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అలాగే సమాచారం చెప్పేందుకు కొందరిని అందుబాటులో ఉంచాల్సిన అవసరముంది. జిల్లాస్థాయి గ్రీవెన్స్లో నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులు పాల్గొనాలి. అయితే పలువురు అధికారులు తమ సబార్డినేట్లను పంపి చేతులు దులిపేసుకుంటున్నట్లు అర్జీదారులు ఆరోపిస్తున్నారు. గ్రీవెన్స్లో కలెక్టరేట్ ఉంటే ఒకలా...జాయింట్ కలెక్టర్ ఉంటే ఇంకోలా, డీఆర్ఓ ఉంటే మరోలా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో గ్రీవెన్స్ నిర్వహిస్తే 25 శాతానికి మించి అధికారులు హజరుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
శ్రీసిటీలో ‘సమ్మర్ క్యాంప్’
శ్రీసిటీ (సత్యవేడు): శ్రీసిటీలో ఈ నెల 9 నుంచి మే 30వ తేదీ వరకు విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నారు. శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు కంపూటర్ కోర్సు, ఇంగ్లిషు గ్రామర్, రైటింగ్ స్కిల్, గణిత సూత్రాలు, పోటీ పరీక్షల మెలకువలు, జనరల్ నాలెడ్జ్, ప్రపంచ వార్తలు తదిర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే యోగా, కరాటే, స్పోర్ట్స్, గేమ్స్ విభాగాల్లో ట్రైనింగ్ అందించనున్నారు. ఈ క్రమంలోనే క్విజ్ పోటీలు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించనున్నారు. ప్రాథమిక చికిత్సలపై అవగాహన కల్పించనున్నారు. శ్రీసిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిగే క్యాంపునకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత భోజనం సౌకర్యం ఉంటుంది. అలాగే శ్రీసిటీ జీరో సాయింట్, చెరివి కూడలి వరకు ఉచిత వాహనం సదుపాయం కల్పించనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు 833 103 5857 నంబర్లో సంప్రదించాలని శ్రీసిటీ అధికారులు సూచించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వీడ్కోలు రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుగుప్రయాణమయ్యారు. పలువురు న్యాయమూర్తులు, అధికారులు సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ శ్రీనివాస శివరామ్, డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి ఈ. భీమారావు, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి గురునాథ్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ శుభం బన్సల్, జ్యుడీషియల్ ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ధనుంజయనాయుడు పాల్గొన్నారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీకి సాదరంగా.. రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత్ దాస్ ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభమ్ బన్సల్ సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. 11న కలెక్టరేట్ ఎదుట బీసీల నిరసన తిరుపతి సిటీ : బీసీలకు 52శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ నెల 11వ తేదీన కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగనున్నట్లు బీఎస్పీ, బీసీ సమన్వయ కమిటీ నేతలు వెల్లడించారు. ఆదివారం తిరుపతి ప్రెస్క్లబ్లో వారు మాట్లాడారు. దేశంలో బీసీలు అధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యత లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద కేవలం 10శాతం మంది చేతుల్లోనే ఉందని, బీసీలను అగ్రకులాలవారు అణగదొక్కేశారని మండిపడ్డారు. దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీలను అధికారం కోసం వాడుకుని వదిలేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వ ఎన్నికల సమయంలో వడ్డెర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్ వద్ద చేపట్టే నిరసనకు జిల్లాలోని అన్ని కుల సంఘాల నేతలు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం నిరసనకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, నేతలు వేణుగోపాల్ రాజు, శశికుమార్, ధనంజయ, వెంకన్న, బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బీవీ కేశవులు, నేతలు వి.రమణ, రోశయ్య, విజయభాస్కర్ పాల్గొన్నారు. -
జిల్లాలో ఇష్టారాజ్యంగా సైఖతం
● యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ● టిప్పర్లతో సరిహద్దు దాటిస్తున్న కూటమి నేతలు ● ఇంటి నిర్మాణాల నిమిత్తం సామాన్యులు వెళితే కేసులు ● పచ్చమూక అక్రమార్జనకు అండగా అధికారులు సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో కూటమి నేతలకు ఉచిత ఇసుక ప్రకటన పెద్ద వరంగా మారింది. స్థానికుల పేరుచెప్పి విచ్చలవిడిగా ఇసుక తవ్వి అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. కళ్లముందే మొత్తం వ్యవహారం నడుస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. స్థానిక ఎమ్మెల్యేల పేరుచెప్పి అనుచరులు యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. నదుల్లో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా ఇసుకాసురులు లెక్కచేయడం లేదు. అక్కడ ఇష్టారాజ్యం ● సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల పరిధిలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ● సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం, పిచ్చాటూరు పరిధిలో అడవికొడియంబేడు, బైటకొడియంబేడు పరిధిలోని అరుణానదిలోని ఇసుకను భారీ యంత్రాలతో తవ్వి తమిళనాడుకు తరలించేస్తున్నారు. ● సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం అన్నమేడు, మర్లపల్లె, భీమవరంలో స్వర్ణముఖి నది నుంచి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తండ్రి పేరుచెప్పుకుని వారి బంధువులు, అనుచరులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ● పెళ్లకూరు మండలం కలవకూరు, చావాలి గ్రామాల నుంచి పలువురు కూటమి నేతలు గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ● గూడూరు నియోజక వర్గం చిట్టమూరు మండలం రొయ్యల వాగు, గుణపాటిపాళెం వద్ద ప్రతి రోజూ ఇసుకను తోడి అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ● వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలోని తెలుగురాయపురం, రాజుపాళెం నుంచి రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. బెంగళూరు, చైన్నెకి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, ప్రైవేటు భూముల్లో సైతం కూటమి నేతలు అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. రేణిగుంట మండలంలో..చంద్రగిరిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న దృశ్యం(ఫైల్) చంద్రగిరిలో తగ్గేదేలే..! చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల పరిధిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. చంద్రగిరి మండలంలోని ఎం.కొత్తపల్లె, ఐతేపల్లె, నాగయ్యగారిపల్లె, రెడ్డివారిపల్లె, నరసింగాపురం, బుచ్చినాయుడుపల్లె, తొండవాడ, శానంబట్లలో స్వర్ణముఖి నది నుంచి ఇసుకను జేబీసీలతో తవ్వుతూ టిప్పర్లతో బయటి ప్రాంతాలకు తరలించేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలంలోని పైడిపల్లె, అడపారెడ్డిపల్లె, దుర్గసముద్రం, చిగురువాడ, కేసీపేట, తనపల్లె, తిరుచానూరు ప్రాంతాల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నా రు. నదిలో ఇసుక నిల్వలు కరిగిపోతుండడంతో సమీపంలోని రైతుల పొలాల్లో కూడా తవ్వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ వందల కొద్దీ ట్రాక్టర్లు, టిప్పర్లు వేగంగా రాకపోకలు సాగిస్తుండడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సైతం భయపడుతున్నారు. స్వర్ణమ్మకు గర్భశోకం! శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నది పరీవాహకప్రాంతంలో ఇసుకను కూటమి నేతలు ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. తొట్టంబేడు మండలం పెన్నలపాడు, విరూపాక్షిపురం వద్ద స్వర్ణముఖి నదిలో ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం హోటల్ వెనుక, ఎన్టీఆర్ పార్కు లోపలి వైపు, ఆనకట్ట సమీపంలో పచ్చమూకకు అడ్డే లేకుండా పోయింది. శ్రీకాళహస్తి మండలం టీఎంవీ కండ్రిగ, చుక్కలనిడిగల్లు, పుల్లారెడ్డి కండ్రిగ ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తవ్వేసి, తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ఏర్పేడు మండలం ముసలిపేడు, పాపానాయుడుపేట పరిధిలోని స్వర్ణముఖి నదిలోని ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నారు. రేణిగుంట మండలం గాజులమండ్యం, జీపాళ్యెం ప్రాంతాల్లో స్వర్ణముఖి పరివాహక ప్రాంతాల వద్ద ఎక్కడ పడితే అక్కడ ఇసుకను తోడేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే ముఖ్యఅనుచరుల పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. జీపాళెం వద్ద స్వర్ణముఖి నదిలో చెన్నంపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త ఒకరు ఎమ్మెల్యే పేరుచెప్పి అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రతి రోజూ వంద ట్రాక్టర్ల ఇసుకను తోడి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సీపీఎస్ రద్దుకు చైతన్య యాత్ర
తిరుపతి సిటీ : రాష్ట్రంలో సీపీఎస్ రద్దు కోసం చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు ఏపీ సీపీఎస్ఈఏ అసోసియేట్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ వెల్లడించారు. ఆదివారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు యాత్ర నిర్వహిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. తొలి రోజు తిరుపతిలో కలెక్టర్కు అర్జీ అందించనున్నట్లు వివరించారు. చైతన్య యాత్రలో భాగంగా అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వోద్యోగులను కలుస్తూ సీపీఎస్తో వాటిల్లే నష్టాలను తెలియజేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీలోపు సీపీఎస్పై తగు నిర్ణయం తీసుకుని పాత పెన్షన్ విధానం అమలు చేయాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం చైతన్య యాత్ర పోస్టర్ విడుదల చేశారు. సమావేశంలో నేతలు వంకీపురం పవన్, గుంటూరు రేఖ, మురళి, ధరణి కుమార్, ఈశ్వర్ నాయక్, చలపతి, గోపాల్ పాల్గొన్నారు. కార్మికుల నమోదుకు ప్రత్యేక శిబిరాలు చిత్తూరు కార్పొరేషన్ : ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) విస్తరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చిత్తూరు, తిరుపతి జిల్లాల ఉప కార్మిక కమిషనర్ ఓంకార్రావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుంటే గుర్తింపు కార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు. పోర్టల్ నందు ఫ్లాట్, గిగ్ కార్మికులు పేర్లు నమోదుకు ఈనెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ప్రత్యేక నమోదు శిబిరాలను తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలను పొందాలంటే నమోదు తప్పనిసరన్నారు. తదితర వివరాలకు కార్మిక శాఖ కార్యాలయంలో లేదా మెప్మా, డీఆర్డీఎ అధికారులు, తిరుపతి జిల్లా 9492555230, చిత్తూరు జిల్లా 9492555223, 9492555216 నంబర్లను సంప్రదించాలని వివరించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలుతిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 78,496 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,046 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.60 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేనివారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వస్తే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం
వెంకటగిరి(సైదాపురం):ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వెంకటగిరి మున్సిపాలిటీలో టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మా నం వీగిపోతుందని, వైఎస్సార్సీపీ గెలుపు తథ్య మని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఎన్జేఆర్ భవన్లో ఆయన కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. నేదురుమల్లి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ జెండాతో 25 మంది కౌన్సిలర్లు విజయం సాధించారన్నారు. ఈ క్రమంలో కూట మి నేతలు కొందరిని ప్రలోభాలకుగ గురి చేసి అక్రమంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని మండిపడ్డారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు విప్ జారీ చేశామని, ధిక్కరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. 19 మంది కౌన్సిలర్లు తమ వెంటే ఉన్నారని, మిగిలిన ఆరుగురు సైతం వైఎస్సార్సీపీకే ఓటేసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను దించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని వివరించారు. కూటమి నేతలు కుట్రలకు తెరతీయకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. అభివృద్ధే మా లక్ష్యం వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తమ కుటుంబం పనిచేస్తోందని తెలిపారు. పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు కృషి చేశామని, 100 ఎకరాల్లో నగరవనం ఏర్పాటు చేశామని వివరించారు. రూ.110 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు తీసుకువచ్చామని వెల్లడించారు. కూటమి నేతల అడుగులకు మడుగులొత్తుతూ వైఎస్సార్సీపీ శ్రేణులను వేధించే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. అలాగే పారవోలు ఎంపీటీసీ సభ్యులు పుల్లూరు శ్రీదేవిని అవమానించడం హేయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జెడ్పీ చైర్మన్, కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, విప్ పి.లక్ష్మి, కౌన్సిలర్లు కందాటి కల్యాణి, వహీదా, ధనియాల రాధ, ఆరి శంకరయ్య, సుకన్య, యచ్చా విజయలక్ష్మి, శివకుమార్, సుబ్బారావు, తుపాటి సుజాత, ఆటంబాకం శ్రీనివాసులు, మాడా జానకిరామయ్య, పద్మశాలి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, పార్టీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్రెడ్డి, రూరల్ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
Tirupati: హమ్మయ్యా.. ఎట్టకేలకు చిరుత చిక్కింది
తిరుపతి,సాక్షి: తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని ప్రజలను ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న చిరుత ఎట్టకేలకు దొరికిపోయింది. తిరుపతి వేదిక్ యునివర్సిటీలో బోనులో చిరుత చిక్కింది.గత కొంత కాలంగా ఓ చిరుత భయ భ్రాంతులకు గురిచేస్తుంది. ఈ తరుణంలో రెండు రోజుల కిందట ఆ చిరుతను పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ తరుణంలో ఆదివారం వేకువ జామున చిరుత ఆ బోనులో చిక్కుకుంది. సమాచారం అందుకున్న వైల్డ్లైఫ్ అధికారులు చిరుతను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. -
స్వర్ణముఖిలో ఇసుక తోడేళ్లు
అమ్మవారి సేవలో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ తిరుచానూరు శ్రీపద్మావతమ్మను ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత దాస్ శనివారం దర్శించుకున్నారు. ఇంట్లో చోరీ చంద్రగిరి మండలం, భీమవరం గ్రామంలో ఓ ఉపాధ్యాయురాలి ఇంటికి దొంగలు కన్నం పెట్టారు. ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోచెరబట్టేశారు: ఇసుక తోడేయడంతో ఏర్పడిన గుంతలు కొట్రమంగళం గ్రామం తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల మధ్య ఉంది. ఇక్కడ పుష్కలంగా ఇసుక ఉండడంతో కూటమి నేతల కన్ను పడింది. పగలు ట్రాక్టర్లు, రాత్రుల్లో జేసీబీలు పెట్టి ఇసుక తరలించేస్తున్నారు. కలెక్టరేట్కు వెనుకనే ఈతంతు జరుగుతున్నా అటు వైపు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. – రేణిగుంట(శ్రీకాళహస్తి రూరల్)– 8లో– 8లోన్యూస్రీల్ -
ఇన్సూరెన్స్ డబ్బు కోసమే కిడ్నాప్
● తిరుపతి జీవకోన కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు ● ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీలత తిరుపతి అర్బన్: డబ్బు కోసం ఏకంగా స్నేహితుడితోపాటు వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించిన ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ శ్రీలత శనివారం అలిపిరి పోలీస్స్టేషన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి నగరం, జీవకోనలో నివాసం ఉంటున్న కాసరం రాజేష్(33) మీ సేవా కేంద్రాన్ని నడపడంతోపాటు ఇన్సూరెన్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన స్నేహితుడు భార్గన్ అలియస్ భాను కూడా జీవకోన ప్రాంతంలోనే నివాసం ఉన్నాడు. అయితే కాసరం రాజేష్ తల్లికి తాజాగా ఇన్సూరెన్స్ డబ్బులు పెద్ద మొత్తంలో వచ్చినట్లు తెలుసుకున్న భాను ఆ డబ్బులను ఎలాగైనా కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో భాను తమ స్నేహితులైన వట్టికుంట అరుణ్కుమార్ అలియాస్ అరుణ్(తిరుపతి), ధమకోతి సాయికుమార్(శ్రీకాళహస్తి మండలం), బాలిపాకు మణికంఠ(రేణిగుంట మండలం), చీరాల ప్రకాష్(ఏర్పేడు మండలం), సిరియాల గమేష్(పెళ్లకురూ మండలం)కు చెందిన వారితో కలసి కుట్రకు శ్రీకారం చుట్టారు. ఈ ఆరుగురు గత నెల 28న ఓ ప్రణాళిక ప్రకారం కాసరం రాజేష్తోపాటు కుటుంబ సభ్యులను తిరుపతిలో కిడ్నాప్ చేశారు. ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తే వదిలేస్తామని లేదంటే ఐదుగురిని చంపేస్తామని బెదిరించారు. తెలివిగా వ్యవహరించిన రాజేష్ కాసరం రాజేష్ తెలివిగా ఇన్సూరెన్స్ డబ్బులు తిరుపతిలో తమ వద్దలేవని.. చిత్తూరులోని తమ బంధువుల వద్ద ఉందని వారికి చెప్పాడు. దీంతో నిందితులు ఆరుగురు తాము కిడ్నాప్ చేసిన ఐదుగురిని తీసుకుని రెండు కార్లులో చిత్తూరుకు బయలుదేరారు. మార్గ మధ్యంలో ఐతేపల్లి వద్ద కాసరం రాజేష్ కారులో నుంచి దూకి తప్పించుకున్నాడు. దీంతో నిందితులు మిగిలిన కుటుంబ సభ్యులను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. కాసరం రాజేష్ అలిపిరి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల కోసం తొమ్మిది రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం రేణిగుంట–కడప రోడ్డు మార్గంలో కుక్కలదొడ్డి వద్ద రెండు కార్లలో ఆరుగురు నిందితులు హైదరాబాద్కు పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు 7 మొబైల్ఫోన్లు, 4 కత్తు లు, 5మీటర్ల ప్లాస్టిక్ తాడు, వాటర్ ప్రూఫ్ టేప్, 60 నైలాన్ టైస్, ఓ ఐరన్ రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో అరుణ్కుమార్, భార్గవ్, సాయిపై గతంలో పలు కేసులున్నాయని పేర్కొన్నారు. -
పీఓఈఎం–04 శకలాలు సముద్రంలోకి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత ఏడాది డిసెంబర్ 30న పీఎస్ఎల్వీ సీ60 ద్వారా స్పేడెక్స్ ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ తరువాత నాలుగో దశలోని పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పరమెంట్ మాడ్యూల్(పీఓఈఎం–04) తన పనిని పూర్తిచేసింది. తదనంతరం దాని శకలాలను శనివారం ఉదయం 8.03 గంటలకు హిందూ మహాసముద్రంలో పడదోసినట్టు ఇస్రో తన వెబ్సైట్లో పేర్కొంది. పీఎస్ఎల్వీ రాకెట్ల సిరీస్లో పీఓఈఎం–4 అంటే నాలుగో దశతో కొన్ని పేలోడ్స్ వివిధ రకాల కక్ష్యల్లో ప్రవేశపెట్టి కొత్తరకం కక్ష్యలను అన్వేషించింది. ఈ క్రమంలో ఇప్పటికి నాలుగు పీఓఈఎంలను ప్రయోగించగా పీఎస్ఎల్వీ సీ60కి అమర్చిన పీఓఈఎం మాత్రం 1000 రకాల కక్ష్యలను పూర్తి చేసి 24 పెలోడ్స్ను వివిధ రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టి తన పనిని పూర్తిచేసింది. పీఓఈఎం–4 ఇంజిన్ 55.2 డిగ్రీల వంపుతో భూమికి 350 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యను తొలగిచింది. దీంతో ప్రమాదవశాత్తూ విచ్ఛిన్నమయ్యే సంభావ్య ప్రమాదాన్ని తగ్గించేందుకు మిగిలిపోయిన అపోజి ఇంధనాన్ని బయటకు పంపడం ద్వారా పీఓఈఎం–4 శకలాలు హిందూ మహాసముద్రంలో పడిపోయే విధంగా చేయడం విశేషం. బహుముఖ ప్రజ్ఞ గత ఏడాది డిసెంబర్ 30న పీఎస్ఎల్సీ 60 రాకెట్ స్పేడెక్స్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత పీఓఈఎం దాని కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ దశలో మొత్తం 24 పేలోడ్స్ను అమర్చి పంపించిన విషయం తెలిసిందే. ఈ 24 పేలోడ్స్ను కచ్చితత్వంతో కూడిన కక్ష్యల్లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. పీఓఈఎం–4 ప్రయోగాత్మక ప్లాట్ఫామ్గా బహుముఖ ప్రజ్ఞను నిరూపించిందని ఇస్రో పేర్కొంది. -
గూడూరులో క్రిస్ సిటీ కోసం భూ సేకరణ
● ప్రభుత్వ భూములకు తన బినామీ పేర్లు చేర్చి పరిహారాన్ని నొక్కేసే కుట్ర ● అదనంగా ప్రతి ఎకరాకు రూ.లక్ష మంజూరు చేయించిన వైనం ● ఆ రూ.లక్ష కూడా స్థానిక ముఖ్య నేతకే ఇవ్వాలని అనుచరుల ద్వారా ఆదేశాలు ● అవకతవకలు జరుగుతున్నాయంటూ రోడ్డెక్కిన స్థానికులు అసలు కథ ఇక్కడే మొదలు శ్రీసిటీ తరహాలో గూడూరు పరిధిలో క్రిస్సిటీని ఏర్పాటు చేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. క్రిస్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 10,834.50 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతలో 2,228.50 ఎకరాలు సేకరించమని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. భూముల వివరాలు సేకరించడం పూర్తయ్యాక ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం రావడంతో గూడూరుకు చెందిన టీడీపీ ముఖ్యనేత భూ సేకరణ ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పథకం వేశారు. ఆ వెంటనే అధికారుల ద్వారా పట్టా, డీకేటీ, ప్రభుత్వ భూముల వివరాలు తెప్పించుకున్నట్లు గూడూరుకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. కిస్ సిటీ కోసం సేకరించిన భూములు ఇవేశ్రీసిటీ తరహాలో క్రిస్ సిటీ ఏర్పాటు కోసం సేకరించే భూముల పరిహారాన్ని నొక్కేసేందుకు గూడూరుకు చెందిన ముఖ్యనేత స్కెచ్ వేశారు. తన అనచరులను రంగంలోకి దింపి బినామీ పేర్లతో భారీగా కొల్లగొట్టేందుకు పథకం రచించారు. అధికారులను తన చెప్పుచేతల్లోకి తీసుకుని పేదల పరిహారాన్ని బొక్కేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మతలబుపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. అందరికీ పరిహారం చెల్లించాల్సిందేనంటూ రోడ్డెక్కుతున్నారు. సాక్షి తిరుపతి టాస్క్ఫోర్స్: క్రిస్ సిటీ కోసం సేకరించే భూములకు ప్రభుత్వం కేటాయించిన పరిహారాన్ని నొక్కేసేందుకు టీడీపీ ముఖ్యనేత పెద్ద ప్లాన్ వేశారు. ప్రభుత్వ భూములకు బినామీ పేర్లు చేర్చి.. ఆ భూములకు వచ్చే పరిహారాన్ని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేశారు. మరోవైపు పెంచిన పరిహారాన్ని సైతం కాజేసేందుకు పథకం వేశారు. మొత్తంగా క్రిస్ సిటీకి సేకరించే కోట్లాది రూపాయల భూ పరిహారాన్ని కొల్లగొట్టేందుకు అధికారులు, అనుచరులను రంగంలోకి దించారు. ఈ విషయం లబ్ధిదారులు పసిగట్టి అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. పెంచిన వాటా ముఖ్యనేతకే ప్రభుత్వ, డీకేటీ, పట్టా భూములు ఎకరాకు రూ.7 లక్షల నుంచి రూ.21.5 లక్షల వరకు పరిహారం ఇవ్వనున్న నేపథ్యంలో.. టీడీపీ నేత ఆ పరిహారంలో వాటా కోసం పథకం వేసినట్టు సమాచారం. చిల్లకూరు, కోట మండలాల పరిధిలోని 11 గ్రామాల్లో తన అనుచరులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఒక్కో గ్రామానికి ఐదుగురు సభ్యులను నియమించారు. ఆ ఐదుగురు సభ్యులు ఏది చెబితే అదే ఫైనల్ చేయాలని అధికారులకు హుకుం జారీ చేశారు. పనిలోపనిగా పరిహారం కింద చెల్లించే నిధులను అదనంగా రూ.లక్ష పెంచాలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేశారు. పథకం ప్రకారం ప్రభుత్వం అదనంగా పెంచి ఇచ్చే ఆ రూ.లక్ష పరిహారాన్ని నేరుగా టీడీపీ ముఖ్య నేతకే చేరేలా అధికారులు, అనుచరులకు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. జేసీని అడ్డుకుని నిరసన తెలుపుతున్న లబ్ధిదారులు (ఫైల్) రికార్డుల్లోకి బినామీలు క్రిస్ సిటీ కోసం సేకరించే భూముల్లో 500 ఎకరాల ప్రభుత్వ భూములను తన అనుచరులు సాగు చేసుకుంటున్నట్లు వారి పేర్లను రికార్డుల్లో చేర్చమని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఆ 500 ఎకరాలకు వచ్చే మొత్తం పరిహారంలో గూడూరుకు చెందిన టీడీపీ నేతకు 60శాతం, మిగిలిన 40 శాతం అనుచరులు, కొందరు అధికారులకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.భగ్గుమంటున్న లబ్ధిదారులు పరిహారం స్వాహా చేసే విషయం స్థానికులు, రైతులకు తెలియడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. తిరుపతి జేసీ శుభం బన్సల్ రెండు రోజుల క్రితం చిల్లకూరు మండలం, తమ్మినపట్నంలో పర్యటించారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆయన వాహనాన్ని అడ్డుకుని ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. క్రిస్ సిటీ భూముల పరిహారం విషయంలో బినామీ పేర్లతో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని జాయింట్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళనను విరమించారు. అడ్డుతగులుతున్న అధికారిపై గుర్రు ఈ విషయం జిల్లా అధికారికి తెలియడంతో అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం నిధులను కూడా పంపిణీ చేయకుండా ఆపినట్లు తెలుస్తోంది. ఆ అధికారి అడ్డుపడుతుండడంతో అతన్ని బదిలీ చేసేందుకు అమరాతిలోని ముఖ్యనేత సహకారం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
స్విమ్స్లో నిరంతర వైద్య విద్య కార్యక్రమం
తిరుపతి తుడా:స్విమ్స్ ఇమ్యూనో హెమటాలజీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఎమర్జెన్సీ మెడిసిన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పద్మావతి ఆడిటోరియంలో నిరంతర వైద్య విద్య కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్బాబు ప్లాస్మాఫెరిసిస్ చికిత్స, ప్లాస్మా మార్పిడి వంటి విషయాలపై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డాక్టర్ ప్రవీణ్, డాక్ట ర్ రోహిత్ గుప్తా, స్విమ్స్ బ్లడ్ బ్యాంక్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్బాబు, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ క్రిష్ణసింహారెడ్డి, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి గ్యాంగ్ వార్
తిరుపతి క్రైమ్:నగరంలోని రెండు హోం స్టేల మధ్య అర్ధరాత్రి గ్యాంగ్ వార్ జరిగింది. ఈ ఘట న శనివారం వేకు జామున చోటుచేసుకుంది. ఈస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బస్టాండ్ సమీపంలోని చింతల్ చేను వద్ద రెండు హోంస్టేల్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డిస్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోమ్ స్టే యాజమాన్యం దాడి చేసింది. ఇందులో డస్క్ సూట్స్ హోమ్స్ డే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, పణీందర్రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వీరి వద్దకు వచ్చే కస్టమర్లను మరొక హోమ్ స్టే వాళ్లు లాక్కెళ్తున్నా రని వీరి మధ్య గొడవ చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడికి పాల్పడిన ఏడుగురిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నగరంలో అర్ధరాత్రి ఇలాంటి ఘటనలు జరగడంతోస్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అనుమతి లేని హోం స్టేలపై చర్యలు శూన్యం నగరంలో హనుమతులేని హోమ్ స్టేలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా రూములను అద్దెకి తీసుకొని హోమ్ స్టీల్ పేర్లతో నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోతున్నాయి. నిరంతరం గొడవలు చోటుచేసుకుంటున్నాయి. అయితే పోలీసులు మామూలు మత్తులో తూలుతూ.. వారికే వత్తాసు పలుకుతున్నారు. ఇప్పటికై నా ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి పెట్టాల్సి ఉంది. ఇంట్లో చోరీ చంద్రగిరి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మండల పరిధిలోని భీమవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. భీమవరం గ్రామానికి చెందిన సుమతి వెదురుకుప్పం మండలంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం పండుగ సందర్భంగా శనివారం ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో ఉంచిన 64 గ్రాముల బంగారం, కిలో వెండితో పాటు రూ.లక్ష నగదు దోచుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ దుర్మరణంపుత్తూరు: విధులు ముగించుకుని గ్రామానికి చేరుకుంటున్న ఏఎస్ఐ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంఘటన శనివారం రాత్రి పుత్తూరు మండలం వేపగుంట క్రాస్ వద్ద చోటు చేసుకుంది. సీఐ సురేంద్రనాయుడు కథనం మేరకు.. పుత్తూరు మండలం వేపగుంట పంచాయతీ అక్కేరి దళితవాడకు చెందిన ఎ.రఘుకుమార్(59) తిరుపతి ఎంఆర్పల్లెలో ఆర్ముడు రిజర్వు పోలీస్ ఫోర్స్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. శనివారం యథావిధిగా విధులను ముగించుకుని తిరుపతి నుంచి బస్సులో స్వగ్రామానికి బయలుదేరి వేపగుంట గ్రామం వద్ద దిగి రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి 108లో పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 15 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,327 మంది స్వామివారిని దర్శించుకోగా 26,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రతి ఇంటా వెలగాలి నవమి కాంతులు తిరుపతి అర్బన్: తెలుగు ప్రజలకు ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి పండుగను ఆదివారం వేడుకగా జరుపుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో శ్రీరామ నవమి వేడుకలను ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఘన నివాళి తిరుపతి క్రైమ్: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్కు ఘన నివాళి అర్పించారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి ఎస్పీ హర్షవర్ధన్రాజు పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం తిరుపతి అర్బన్: భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్లో జగ్జీవన్ రామ్ 118 జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జగ్జీవన్రామ్ సేవలను కొనియాడారు. డీఆర్వో నరసింహులుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,327 మంది స్వామివారిని దర్శించుకోగా 26, 354 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
కూటమి అధినేతల మాస్క్లతో వైఎస్సార్సీపీ నేతలు
కూటమి పాలనలో చావే శరణ్యం అంటూ ఉరి వేసుకుంటున్న రైతు మాట్లాడుతున్న భూమన అభినయ్రెడ్డివిద్యుత్ చార్జీల భారం కారణంగా పాపం ప్రజలు ఏమంటున్నారో విందాం రండి సాధారణ గృహిణి తల్లికి వందనం అంటే వంచన అని తెలుసుకున్నాం. ప్రతి బిడ్డకీ రూ.15 వేలు అంటే.. అరచేతిలో స్వర్గమని అర్థమైంది. జగనన్న ఉండి ఉంటే జూన్లోనే డబ్బులు పడేవి. చంద్రబాబు పథకాలు ఇస్తానని చెవిలో పువ్వు పెట్టాడు. కరెంటు చార్జీలు పెంచి వైర్లలో షాక్ ఇస్తున్నాడు ఈ చంద్రన్న. అప్పులు చేసి కరెంటు బిల్లు కడుతున్నాం. చెప్తుండా వినండి చంద్రన్న ఎప్పుడొచ్చినా జనాలకి షాక్ ట్రీట్మెంట్ తప్పదు. భూమన అభినయ్ : బాబు గారి హయాంలో వ్యాపారస్తుడి బాధ ఎలా ఉందో చూద్దాం రండి.. వ్యాపారిః బాబన్న వస్తే జేబు అంతా ఖాళీ. రూ.1,500 బిల్లు వచ్చేది. ఇప్పుడు అదే బిల్లు రూ.15 వేలయ్యింది. దేవుడికే నామం పెట్టే నారావారి పాలన.. జనం నమ్మకానికి అవహేళన. అభినయ్: రైతు దేశానికి వెన్నెముక అంటారు మరి కూటమి ప్రభుత్వంలో రైతు ఎంత దీనంగా ఉన్నాడో చూద్దాం రండి.. రైతు: ‘పెట్టుబడి సాయం ఇస్తానని రైతులకి పంగనామాలు పెడుతున్నాడు. స్మార్ట్ మీటర్ల పేరుతో చావబాదుతున్నాడు. ఆయనకి పవర్ వచ్చిందంటే మనకి పవర్ బిల్లు పెరిగిందని అర్థం..’ అంటూ రైతు వేషధారి ఉరితాడు తగిలించుకుని రైతు ఆత్మహత్యల గురించి రైతు వేషధారణలోని పాపిరెడ్డి సోమశేఖర్రెడ్డి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. -
ప్రాధాన్యం ఎక్కడ?
● వరి రైతు విలవిల ● గిట్టుబాటు ధరలేక అవస్థలు ● ఊసేలేని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ● పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు రేణిగుంట: వరి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. పంటకు గిట్టుబాటు ధరలేక..పెట్టుబడీ చేతికందక విలవిల్లాడుతున్నాడు. గత ఏడాది 80 కిలోల బస్తా రూ.2,300 పలికింది. అదే బస్తా నేడు రూ.1,500 నుంచి రూ.1,600 కూడా పలకకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. గతంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు జిల్లా నుంచి ఎక్కువగా వరి ధాన్యం తరలించేవారు. అయితే ప్రస్తుతం ఆంక్షలు కఠినతరం చేయడంతో మిల్లర్లు, దళారులు ధర అమాంతం తగ్గించేశారు. తగ్గిన దిగుబడి జిల్లాలో ఈ రబీలో 1,82,790 ఎకరాలలో వరిసాగు చేశారు. ఇప్పటికే సగానికిపైగా పంట నూర్పిడి పనులు పూర్తయ్యాయి. తూర్పు మండలాల్లోనే ఎక్కువగా వరి సాగైంది. సీజన్ ప్రారంభంలో ఎడతెరిపి లేని వర్షాలు, వెన్ను దశలో మంచుతీవ్రత కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 45 బస్తాలు రావాల్సిన దిగుబడి 30 బస్తాలకు పడిపోయింది. సవాలక్ష ఆంక్షలు ప్రభుత్వం 75 కిలోల ఏగ్రేడ్ వరి ధాన్యం రూ.1,700కు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల గురించి సరైన అవగాహన లేకపోవడానికితోడు తేమశాతం, కేడి ధాన్యం, చెత్తాచెదారం వంటి ఆంక్షలు పెట్టడంతో రైతులు విధిలేక ప్రయివేటు మిల్లర్లు, దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ సీడ్స్లో మరో రకంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీ సీడ్స్) శ్రీకాళహస్తి కేంద్రంలో మేలిరకపు విత్తనాలను ప్రతియేటా సేకరిస్తున్నారు. ఈ సారి ఏపీ సీడ్స్లో దీర్ఘకాలిక రకాలైన వరిధాన్యం క్వింటాల్ రూ.2,900, స్వల్పకాలిక రకాలు రూ.2,450 వరకు ధర నిర్ణయించి సేకరిస్తున్నారు. ఇక్కడికి తీసుకొచ్చే ధాన్యం మళ్లీ రైతులకు విత్తనాలుగా అందిస్తున్న నేపథ్యంలో సేకరించే ధాన్యంలో ఏ మాత్రం నాణ్యత తక్కువైనా తిప్పి పంపేస్తున్నారు. నాణ్యత కోసం ల్యాబ్కు పంపి, అక్కడ ఆమోదం పొందితేనే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తారు. దీంతో చాలా మంది రైతులు ఏపీ సీడ్స్కు తాము పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి విక్రయం కోసం నిరీక్షిస్తున్నారు. ధాన్యం తీసుకున్న 20రోజుల్లోపు నగదును రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. వరిధాన్యం కొను‘గోల్మాల్’! తిరుపతి అర్బన్: జిల్లాలో ఈ సారి సుమారుగా 5.65,000 మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో వరి ధాన్యం కొనుగోలును ప్రారంభించిన సివిల్ సప్లయ్ అధికారులు మార్చి 31తో ముగించారు. ఈ రెండు నెలల వ్యవధిలో 65వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన 5,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని రైతులు దళారీ సహకారంలో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఏప్రిల్ 30వ తేదీ వరకు వరి ఒబ్బిళ్లు ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అయితే మార్చి 31తోనే వరిధాన్యం కొనుగోలుకు స్వస్తి పలకడం విమర్శలకు తావిస్తోంది. చాలా దుర్మార్గం నాకు ఐదెకరాల పొలం ఉంది. గత ఏడాది రూ.2,300కు బస్తా వరిధాన్యం అమ్మాను. ఈ సారి దానికంటే ఎక్కువ ధర లభిస్తుందన్న ఆశపడ్డాను. కానీ ఈ సారి దిగుబడి తగ్గింది. ఎకరాకు 27 బస్తాలయ్యాయి. కోతయంత్రానికి గంటకు రూ.2,400 ఇచ్చి కోయించాను. తీరా మూడు రోజులు ఎండబెట్టి అమ్మేసరికి బస్తా రూ.1,600కు కూడా అడిగేవారే కరువయ్యారు. – నాదముని, రైతు, చెర్లోపల్లి, శ్రీకాళహస్తి మండలం 80శాతం ఒబ్బిళ్లు పూర్తి జిల్లాలో మార్చి 31కి 80శాతం పంట ఒబ్బిళ్లు పూర్తి చేశారు. మరో 20శాతం పంట మాత్రమే ఒబ్బిళ్లు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30కి 100శాతం పంట ఒబ్బిళ్లు పూర్తి అవుతుందని అంచనాలు వేస్తున్నాం. ఆ తర్వాత ఖరీప్లో సాగు చేయాల్సిన పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తాం. –ప్రసాద్రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
స్విమ్స్కి జాతీయ హోదా ఇవ్వండి
● పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ తిరుపతి మంగళం: రాయలసీమ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న తిరుపతి స్విమ్స్ ఇన్స్టిట్యూట్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పరిగణించాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేస్తుందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్లో ఈ అంశాన్ని ఎంపీ లేవనెత్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా గుర్తింపు పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు, గత దేళ్లలో ఇలా గుర్తింపు పొందిన ఆరోగ్య సంస్థల జాబితా వివరాలు తెలపాలని కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి గుర్తింపు కోసం ప్రభుత్వానికి ఏవైనా ప్రతిపాదనలు అందాయా? అని ఎంపీ ప్రశ్నించారు. జాతీయ ప్రాముఖ్యత హోదా కలిగిన సంస్థగా ప్రకటించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్జాదవ్ పేర్కొన్నారు. తిరుపతి స్విమ్స్కు జాతీయ ప్రాముఖ్యత హోదా గుర్తింపు కోసం ప్రతిపాదనలు అందాయని, కానీ స్విమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా స్థాపించిన సంస్థ అని, ఈ హోదా కోసం పార్లమెంటులో చట్టం చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. -
పరిశోధనలతోనే గుర్తింపు
నారాయణవనం: వృత్తి విద్యను అభ్యసిస్తున్న యువ ఇంజినీర్లు వినూత్న పరిశోధనలతోనే గుర్తింపును పొందుతారని పలువురు పేర్కొన్నారు. స్థానిక పుత్తూరు సిద్ధార్థ కళాశాలలో శుక్రవారం నేషనల్ లెవల్ టెక్నికల్ సింపోజియంను నిర్వహించారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 1,200 మంది యువ ఇంజినీర్లు 400 పరిశోధనాత్మక పత్రాలను సమర్పించారు. బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ గ్రూప్కు చెందిన చీఫ్ ఇంజినీర్ జోహర్ సింగ్, తిరుపతికి చెందిన ఇండో ఎంఐఎం లిమిటెడ్ హెచ్ఆర్ కిరణ్కుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక పరిశోధనలతో నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్రెడ్డి, జనార్దనరాజు మాట్లాడుతూ టెక్నికల్ ఇన్ఫోయిజంలను వేదికగా చేసుకుని యువ ఇంజినీర్లు తమ సాంకేతిక పరిజ్ఞాన్ని పెంచుకోవాలని తెలిపారు. పవర్ పాయింట్, పేపర్ ప్రజెంటేషన్లో మొదటి ముగ్గురు విజేతలకు జ్ఞాపికలను, సర్టిఫికెట్లతోపాటు నగదు బహుమతిని అందజేశారు. వివిద ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. గదుల కేటాయింపునకు ప్రత్యేక యాప్ తిరుపతి కల్చరల్: గదుల శుభ్రత, కేటాయింపులకు ప్రత్యేక యాప్ తీసుకురానున్నట్టు టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలు సంతృప్తికరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ తిరుమలలోని పలు ప్రాంతాలు, కాటేజీలలో పరిశుభ్రతను పెంచేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా యాప్పై అవగాహన కల్పించాలన్నారు. టీటీడీ వసతి గతుల కేటాయింపుపై సమగ్ర సమాచారం తెలిసేలా సిబ్బందికి యాప్ రూపొందించాలన్నారు. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, ఇన్చార్జ్ సీవీఎస్వో వి.హర్షవర్దన్రాజు, టీటీడీ సీఈ టీవీ.సత్యనారాయణ పాల్గొన్నారు. అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు తిరుపతి అర్బన్: అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని సివిల్ సప్లయ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన తిరుపతి కృష్ణానగర్లో దీపం–2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ రెండో సిలిండర్ బుకింగ్ చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి, చంద్రగిరి, కోడూరు ఎమ్మెల్యేలు, జనసేన నేతలు, అధికారులు హాజరయ్యారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు రెండో సిలిండర్ బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. -
ఐదుగురు క్షేత్రసహాయకుల తొలగింపు
చిట్టమూరు : మండలంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి కర్కశంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఐదుగురు క్షేత్ర సహాయకులపై వేటు వేసింది. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 23 పంచాయతీలలో గత ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులను తనిఖీలు నిర్వహించి డీఆర్పీలు అవకతవకలను చదివి వినిపించారు. ఇందులో మస్టర్లు సక్రమంగా లేవనే సాకుతో మల్లాం, యాకసిరి, ఆలేటిపాడు, మొలకలపూడి, యాకసిరి, ఆరూరు పంచాయతీల క్షేత్ర సహాయకులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మండలంలో రూ.లక్ష రికిరీకి ఆదేశించినట్టు పేర్కొన్నారు. అనంతరం డ్వామా పీడీ శ్రీనివాస్ప్రసాద్ మాట్లాడుతూ పేద వాడి కష్టం విలువ తెలిసిన వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నామన్నారు. విధుల పట్ల అలసత్వం వహించినా, కూలీల పట్ల తమ ప్రవర్తన సక్రమంగా లేకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనికి వచ్చిన ప్రతి కూలీకి రూ.300 దినసరి కూలి వచ్చేలా పని చూపించాలన్నారు. ఏపీడీ వరప్రసాద్, విజిలెన్స్ అధికారి గణేష్, ఎంపీడీఓ మనోహర్గౌడ్, ఏపీఓ షీలా పాల్గొన్నారు. రూ.5.1 లక్షలు రీకవరీ ఓజిలి: ఉపాధి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సిబ్బందిపై డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ చర్యలు చేపట్టారు. మండల ఏపీఓ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ బహిరంగ సమావేశం నిర్వహించారు. 26 పంచాయతీలలో 2024–25కుగాను రూ.14.2 కోట్లతో ఉపాధిహామీ, పంచాయతీరాజ్ పనులు చేశారు. ఈ పనులకు సంబంధించి నిధులు సక్రమంగా ఖర్చు చేయకపోవడంతో సిబ్బంది నుంచి రూ.5.1 లక్షలు రికవరీకి ఆదేశించారు. అలాగే వెంకటరెడ్డిపాళెం, ఆర్మేనిపాడు గ్రామాలకు చెందిన క్షేత్రసహాయకులు నిధులను దుర్వినియోగం చేశారని విధులు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా టీఏ మహేష్కుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను అందజేశారు. దీంతోపాటుగా టీఏపై ఏపీడీఓ విచారణకు ఆదేశించారు. -
స్లాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తిరుపతి అర్బన్: జిల్లా కేంద్రమైన తిరుపతి సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పైలెట్ ప్రాజెక్టుగా శుక్రవారం ప్రారంభించారు. జిల్లాలో 17 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో తిరుమలలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆస్తుల క్రయవిక్రయాలు మిగిలిన 16 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో మాత్రమే స్లాట్ రిజిస్ట్రేషన్లు చేపట్టారు. వారం రోజుల తర్వాత జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. కాగా తొలి రోజు అయిన శుక్రవారం తిరుపతిలో 22 స్లాట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ విభాగానికి తగ్గిన రాబడి గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రాబడిపై లెక్కలను వెల్లడించారు. జిల్లాలోని మొత్తం 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.782.68 కోట్ల మేర ప్రభుత్వం టార్గెట్ విధించగా.. అందులో రూ.696.58 కోట్ల వరకు వచ్చినట్టు అధికారులు వివరించారు. తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రూ.153.77 కోట్లతో ప్రథమ స్థానంలో ఉండగా.. చిన్నగొట్టిగల్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం రూ.5.54 కోట్లతో చివరి స్థానంలో నిలిచింది. -
ఐఐటీ ప్రస్థానం.. ప్రతిష్టాత్మకం
● మరో పదేళ్లలో మొదటి తరం ఐఐటీగా గుర్తింపు ● 10వ వ్యవస్థాపక దినోత్సవంలో డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఏర్పేడు (రేణిగుంట): తిరుపతి ఐఐటీ రానున్న పదేళ్లలో మొదటి తరం(ఫస్ట్ జనరేషన్) ఐఐటీగా అవతరించబోతోందని ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్.సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో శుక్రవారం 10వ వ్యస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ కంపెనీ వ్యవస్థాపకులు ఆర్వీ చక్రపాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఐఐటీ డైరెక్టర్ మాట్లాడుతూ పదేళ్ల తిరుపతి ఐఐటీ ప్రస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిందన్నారు. ఐఐటీ శాశ్వత భవనంలోకి మారేందుకు పదేళ్లు పట్టిందని గుర్తుచేశారు. విద్యార్థులు శాశ్వత భవనంలో చదువుకునే అవకాశాన్ని కల్పించాలన్న సంకల్పంతో తాను కేంద్ర విద్యాశాఖ బృందాన్ని ఒప్పించి సౌత్జోన్ క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని 2018 కల్లా శాశ్వత క్యాంపస్లోకి చేరుకున్నట్టు తెలిపారు. ఇక్కడ 548 ఎకరాల్లో తాము అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో కూడిన వసతులను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఐఐటీ ప్రాంగణంలో ఫేజ్– ఏ నిర్మాణాలను 2023 అక్టోబర్ కల్లా పూర్తి చేశామన్నారు. సెంట్రల్ లైబ్రరీ, నాలెడ్జ్ సెంటర్, 800 మంది సామర్థ్యంతో ఆడిటోరియం, హెల్త్ సెంటర్ నిర్మాణాలను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వివరించారు. మే 11న టెక్నాలజీ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ఐఐటీని సందర్శించనున్నట్లు తెలిపారు. జూలై 20న ఐఐటీ స్నాతకోత్సవం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ వ్యవస్థాపకులు చక్రవర్తి మాట్లాడుతూ కోర్ ఇంజినీరింగ్ కోర్సులైన మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసి సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
నాగఫణిశర్మ.. తెలుగు జాతి ఆణిముత్యం
తిరుపతి సిటీ: బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మను పద్మశ్రీ వరించడం తెలుగుజాతికి గర్వకారణమని, ఆయన తెలుగు ప్రజల ఆణిముత్యమని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యచౌదరి కొనియాడారు. జాతీయ సంస్కృత వర్సిటీలో శుక్రవారం ద్విసహస్రావధాని పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మను వర్సిటీ అధికారులతో కలసి ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ జాతీయ సంస్కృత విద్యాపీఠం పూర్వ విద్యార్థి మాడుగుల నాగఫణి శర్మకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ వరించడం అదృష్టమని, ఆయన నేటి యువతకు ఆదర్శనీయులన్నారు. అనంతరం వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడారు. విద్యాపీఠం విద్యార్థిగా గర్వపడుతున్నా జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యనభ్యసించడం అదృష్టంగా భావిస్తున్నాని పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. వర్సిటీ తనను సత్కరించడం విద్యాపీఠం విద్యార్థిగా గర్వపడుతునాని తెలిపారు. వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి, విశ్రాంత ఆచార్యులు కొంపెల్ల రామ సూర్యనారాయణ, మాజీ వీసీ రాళ్లపల్లి రామూర్తి, స్విమ్స్ డీన్ అల్లాడి మోహన్, ఎన్ఎస్యూ రిజిస్ట్రార్ వెంకట నారాయణరావు, అధ్యాపకులు డాక్టర్ నల్లన్న, సత్యనారాయణ, శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ పాల్గొన్నారు -
స్విమ్స్కి జాతీయ హోదా ఇవ్వండి
● పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ తిరుపతి మంగళం: రాయలసీమ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న తిరుపతి స్విమ్స్ ఇన్స్టిట్యూట్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పరిగణించాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేస్తుందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్లో ఈ అంశాన్ని ఎంపీ లేవనెత్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా గుర్తింపు పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు, గత దేళ్లలో ఇలా గుర్తింపు పొందిన ఆరోగ్య సంస్థల జాబితా వివరాలు తెలపాలని కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి గుర్తింపు కోసం ప్రభుత్వానికి ఏవైనా ప్రతిపాదనలు అందాయా? అని ఎంపీ ప్రశ్నించారు. జాతీయ ప్రాముఖ్యత హోదా కలిగిన సంస్థగా ప్రకటించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్జాదవ్ పేర్కొన్నారు. తిరుపతి స్విమ్స్కు జాతీయ ప్రాముఖ్యత హోదా గుర్తింపు కోసం ప్రతిపాదనలు అందాయని, కానీ స్విమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా స్థాపించిన సంస్థ అని, ఈ హోదా కోసం పార్లమెంటులో చట్టం చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. -
స్లాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తిరుపతి అర్బన్: జిల్లా కేంద్రమైన తిరుపతి సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పైలెట్ ప్రాజెక్టుగా శుక్రవారం ప్రారంభించారు. జిల్లాలో 17 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో తిరుమలలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆస్తుల క్రయవిక్రయాలు మిగిలిన 16 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో మాత్రమే స్లాట్ రిజిస్ట్రేషన్లు చేపట్టారు. వారం రోజుల తర్వాత జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. కాగా తొలి రోజు అయిన శుక్రవారం తిరుపతిలో 22 స్లాట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ విభాగానికి తగ్గిన రాబడి గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రాబడిపై లెక్కలను వెల్లడించారు. జిల్లాలోని మొత్తం 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.782.68 కోట్ల మేర ప్రభుత్వం టార్గెట్ విధించగా.. అందులో రూ.696.58 కోట్ల వరకు వచ్చినట్టు అధికారులు వివరించారు. తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రూ.153.77 కోట్లతో ప్రథమ స్థానంలో ఉండగా.. చిన్నగొట్టిగల్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం రూ.5.54 కోట్లతో చివరి స్థానంలో నిలిచింది. -
నాగఫణిశర్మ.. తెలుగు జాతి ఆణిముత్యం
తిరుపతి సిటీ: బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మను పద్మశ్రీ వరించడం తెలుగుజాతికి గర్వకారణమని, ఆయన తెలుగు ప్రజల ఆణిముత్యమని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యచౌదరి కొనియాడారు. జాతీయ సంస్కృత వర్సిటీలో శుక్రవారం ద్విసహస్రావధాని పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మను వర్సిటీ అధికారులతో కలసి ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ జాతీయ సంస్కృత విద్యాపీఠం పూర్వ విద్యార్థి మాడుగుల నాగఫణి శర్మకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ వరించడం అదృష్టమని, ఆయన నేటి యువతకు ఆదర్శనీయులన్నారు. అనంతరం వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడారు. విద్యాపీఠం విద్యార్థిగా గర్వపడుతున్నా జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యనభ్యసించడం అదృష్టంగా భావిస్తున్నాని పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. వర్సిటీ తనను సత్కరించడం విద్యాపీఠం విద్యార్థిగా గర్వపడుతునాని తెలిపారు. వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి, విశ్రాంత ఆచార్యులు కొంపెల్ల రామ సూర్యనారాయణ, మాజీ వీసీ రాళ్లపల్లి రామూర్తి, స్విమ్స్ డీన్ అల్లాడి మోహన్, ఎన్ఎస్యూ రిజిస్ట్రార్ వెంకట నారాయణరావు, అధ్యాపకులు డాక్టర్ నల్లన్న, సత్యనారాయణ, శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ పాల్గొన్నారు -
సారా నిర్మూలనకు నవోదయ 2.0
తిరుపతి క్రైం: సారా నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు. తిరుపతి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎకై ్సజ్ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధ్యాత్మిక జిల్లాలో సారా నిర్మూలించడంలో నవోదయ 2.0 కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేయాలన్నారు. ప్రత్యేకంగా గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి దృష్టి పెట్టాలని సూచించారు. కల్తీ మద్యం విషయంలోనూ సీరియస్గా వ్యవహరించాలని చెప్పారు. చిత్తూరు డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్, అసిస్టెంట్ కమిషనర్లు శ్రీనివాసాచారి, బాలకృష్ణన్, తిరుపతి, చిత్తూరు జిల్లాల సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర్రెడ్డి, శ్రీనివాస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ వాసుదేవచౌదరి పాల్గొన్నారు. నీటి కోసం నిరసన తిరుపతి అర్బన్: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ వెంటగిరి మండలం, పెట్లూరు గ్రామం సీతారాం ఏచూరి నగర్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్కు చేరుకుని తమ ఆనేదన వెళ్లగక్కారు. కాలనీకి తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేదని వాపోయారు. తమ కాలనీ అభివృద్ధికి అటవీశాఖ అధికారులు అడ్డుగా నిలుస్తున్నారని ఆరోపించారు. వారికి సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజుతోపాటు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, జిల్లా కార్యదర్శి మునిరాజ, రమణయ్య తదితరులు అండగా నిలిశారు. అనంతరం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్కు వినతిపత్రాన్ని అందించారు. -
ఎరచ్రందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి, ఎరచ్రందనం దుంగలను నరికి తరలిస్తున్న కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ ప్రత్యేక కోర్టు జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు కానిస్టేబుల్ శివకుమార్ కథనం.. 2020 జనవరి 24వ తేదీ తిరుపతి టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది కరకంబాడి అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నిందితులు ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, ఓబులాపురానికి చెందిన సీ.వెంకటరమణ, కర్నూలుకు చెందిన పీ.మహబూబ్బాషా మరో ముగ్గురు కలిసి 103 కిలోల ఐదు ఎరచ్రందనం దుంగలను నరికి, తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరిలో ఒకరు కేసు విచారణ దశలో మృతి చెందారు. మరొకరు కేసు విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం నిందితులు వెంకటరమణ, మహబూబ్ బాషా, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన రవి పై కేసు విచారణ జరిగింది. నేరం వెంకటరమణ, మహబూబ్ బాషాపై రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. రవిపై నేరం రుజువు కాకపోవడంతో అతనిపై కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి నారాయణవనం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తి గాయాలతో ఆస్పత్రి పాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుని భార్య హంస ఫిర్యాదు మేరకు వివరాలు.. పుతూరు ఎన్జీవో కాలనీలో పెయింటర్ శివకుమార్(45) నివాసముంటున్నాడు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నారాయణవనం మండలం వైకుంఠపురంలోని స్నేహితుడు యువరాజ్ని కలిసేందుకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో స్కూటర్పై మరో స్నేహితుడు జనార్దన్తో కలిసి వైకుంఠపురానికి బయలుదేరాడు. జాతీయ రహదారి నారాయణవనం బైపాస్ రోడ్డులో హైలెవల్ బ్రిడ్జికి చేరుకున్న వీరి స్కూటర్ను వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బ్రిడ్జిపై నుంచి స్కూటర్ కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో శివకుమార్ మృతి చెందగా జనార్దన్ గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చస్తున్నట్టు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఎనిమిది మందికి జరిమానా తిరుపతి లీగల్: మద్యం తాగి తిరుపతిలో వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ శుక్రవారం తీర్పు చెప్పినట్టు కోర్టు సూపర్ండెంట్ ఎన్వీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించి మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు కోర్టు కానిస్టేబుల్ గిరిబాబు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి బాలాయపల్లి(సైదాపురం) : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన బాలాయపల్లి మండలం కోడంబేడులో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోపి కథనం.. కోటంబేడు గ్రామానికి చెందిన వెంకటరమణయ్య(50) కొద్ది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఆయన మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం కోడంబేడు సమీపంలో ఉన్న తెలుగు గంగ కాలువ సమీపంలో గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
మనసు నిండుగా.. మురి'పాల' పండుగ
సృష్టిలో అమ్మ స్థానం అత్యున్నతం. అమ్మ గొప్పతనం వర్ణనాతీతం.. అమ్మ త్యాగం అనన్యసామాన్యం.. పురిటి నొప్పులను సైతం పంటి బిగువున భరిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రాణం పెట్టేస్తుంది. అందుకే అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. అయితే కొంతమంది తల్లులు అనివార్యకారణాలతో శిశువుకు ముర్రెపాలు అందించలేక తల్లడిల్లిపోతున్నారు. అలాంటి సమయంలో బిడ్డ ఆకలి తీర్చడమే కాకుండా రోగనిరోధకశక్తిని పెంచే తల్లిపాలను అందించేందుకు కొందరు అమ్మలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అమ్మతనానికి మరింత వన్నె తీసుకువస్తున్నారు. ఈ ప్రక్రియకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు.తిరుపతి తుడా : తల్లి పాలు అవసరం ఉన్న నవజాత శిశువులకు అవసరమైన పాలను మదర్ మిల్క్ బ్యాంకు అందిస్తుంది. అమ్మపాలు శిశువు ఎదుగుదలకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం, తల్లి పాల ప్రాధాన్యత తెలియకపోవడంతో కొందరు పిల్లలకు పాలిస్తే తమ శరీర ఆకృతి పాడైపోతుందని ఆవు, గేదె పాలను, మిల్క్ పౌడర్ను బాటిల్స్తో పట్టిస్తుంటారు. మరికొందరు బాలింతల విషయంలో శిశువుకు తగినంత పాలు లేకపోవడం, తల్లి అనారోగ్యం కారణంగా పాల వృద్ధి క్షీణిస్తుంది. ఇటువంటి వారికోసం మదర్ మిల్క్ కేంద్రం ఓ వరంగా పనిచేస్తోంది. 247లీటర్ల సేకరణ తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని తల్లి పాల కేంద్రంలో ఏడాదిగా సుమారు 247లీటర్ల పాలను సేకరించి సుమారు 3,475మంది శిశువులకు అందించారు. ప్రతి నెల సుమారు 23 నుంచి 25 లీటర్ల పాలను డోనర్స్ నుంచి సేకరిస్తున్నారు. పాలు డొనేట్ చేసిన తల్లులకు సుమారు 6రకాల డ్రైఫ్రూట్స్ అందించి ప్రోత్సహిస్తున్నారు. మదర్ మిల్క్ కావలసిన వారు, డోనర్స్ 8919469744 నంబర్లో సంప్రదించవచ్చు. ఎలాంటి శిశువులకు అందిస్తారంటే... డెలివరీ అయిన వెంటనే తల్లి చనిపోయిన శిశువులకు, 2కేజీల కంటే బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు, తల్లి ఆరోగ్యంగా ఉండి చనుపాల ద్వారం (నిప్పిల్స్) మూసుకుపోయిన పాలు రాని పరిస్థితి ఏర్పడిన శిశువులకు, తల్లిపాలు పడని బిడ్డలకు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న బాలింతల పిల్లలకు పాలు అందిస్తున్నారు. ఒక్కో ఫీడింగ్కు 30ఎమ్ఎల్ చొప్పున రోజుకు 12సార్లు పాలు ఇస్తారు. ఇలా ఒకటి నుంచి 6నెలల వరకు శిశువుకు పాలు అందిస్తారు. సేకరణ ఇలా... స్వచ్ఛందంగా వచ్చే డోనర్స్ నుంచి తల్లి వయసు, డెలివరీ, ఆధార్కార్డుతో పూర్తి వివరాలను దరఖాస్తు రూపంలో నమోదు చేసుకుంటారు. అనంతరం తల్లి ఆరోగ్య సమాచారం సేకరించి అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. తల్లి శరీరంపై టాటూస్ (పచ్చ»ొట్టులు) ఉన్నా, బ్రెస్ట్ సమీపంలో మచ్చలు, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాలింతల నుంచి పాలు సేకరించరు. సంపూర్ణ ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి మాత్రమే పాల సేకరణ చేస్తున్నారు. ప్రధానంగా హెచ్ఐవీ, హెచ్సీవీ, హెచ్బీఎస్ఏజీ, వీడీఆర్ఎల్ పరీక్షలు ప్రతి తల్లికీ తప్పని సరిగా చేసి నెగటివ్ రిపోర్టు ఉంటేనే పాల డొనేషన్కు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలింతలు తమ బిడ్డకు సరిపోగా మిగులు పాలను మాత్రమే డొనేట్ చేయాల్సి ఉంటుంది.స్టోరేజ్ ఇలా...ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి సుమారు 200ఎమ్ఎల్కు పైబడి ఒక సిట్టింగ్లో పాలు సేకరిస్తారు. ఇందులో 10ఎమ్ఎల్ శాంపిల్ పాలను పరీక్షల నిమిత్తం మైక్రోబయోలజీ విభాగానికి పంపుతారు. మిగిలిన పాలను మిక్స్ చేసి రిఫ్రిజిరేటర్లో భద్రపరుస్తారు. అనంతరం యూవీ రేస్లో ఉంచి పూలింగ్ ప్రక్రియ కొనసాగిస్తారు. సుమారు 3గంటల పాటు శుద్ధి చేసి 62.4 టెంపరేచర్లో వేడి చేస్తారు. అనంతరం సుమారు అరగంట పాటు కూలింగ్ ప్రాసెసర్లో ఉంచుతారు. సుమారు ఆరు నెలలపాటు పాలు సురక్షితంగా ఉండేందుకు మిల్క్ బ్యాంకు అధికారులు. సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శిశు మరణాల నివారణకే.. శిశు మరణాలను తగ్గించాలనే సంకల్పంతోనే హ్యూమన్ మిల్క్ బ్యాంకుకు శ్రీకారం చుట్టాం. సుమారు రూ.35లక్షల వ్యయంతో ఏర్పాటు చేశాం. చాలా మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 3,475 మంది పసికందుల గొంతు తడిపాం. వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశాం . – టి.దామోదరం,మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ చైర్మన్, తిరుపతి తల్లిపాలే తొలి వ్యాక్సిన్ నవజాత శిశువుకు తొలి వ్యాక్సిన్ తల్లి పాలే. గైనకాలజిస్టా్గ తల్లిపాల శ్రేష్టతపై స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఇప్పటివరకు 34 లీటర్లకు పైగా పాలను మిల్క్ బ్యాంకుకు అందించా. బాలింతలు తమ మిగులు పాలను ఇచ్చేందుకు ముందుకు రావాలి. పసికందుల ప్రాణరక్షణకు సహకారం అందించాలి. – డాక్టర్ సోనా తేజస్వి, గైనకాలజిస్ట్ -
ఏపీ మరో బిహార్లా..
సాక్షి, టాస్క్ఫోర్స్: మీరు విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులా.. అయితే, ఖచ్చితంగా మీ భూములకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీ భూములు భద్రంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోండి. ఎందుకంటే.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ఆర్ఐలకు చెందిన రూ.కోట్లు విలువైన స్థలాలను యథేచ్ఛగా కబ్జాచేసే ముఠాల ఆగడాలు శృతిమించుతున్నాయి. ప్రత్యేకించి పోలీసులతో కుమ్మక్కయి మరీ ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈ విషయంలో ఒక ఎన్ఆర్ఐ పడుతున్న ఆవేదన ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది. ఏపీ మరో బిహార్లా మారిందంటూ తిరుపతికి చెందిన ఎన్ఆర్ఐ బొర్రా రాజేంద్రప్రసాద్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. అందులో ఆయన ఏమన్నారంటే..ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో తిరుచానూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 298/4లో 120 అంకణాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేస్తే ప్రైవేట్ వ్యక్తులు కొందరు దానిని కబ్జాచేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. నిజానికి.. కిందటేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి జనసేన ఎన్ఆర్ఐ విభాగం తరఫున ఆస్ట్రేలియాలో చురుగ్గా పనిచేశాను. మా నాన్న బొర్రా వెంకటరమణ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైరయ్యారు. ఆయన కూడా జనసేన నుంచి తిరుపతికి పోటీచేసిన ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి నుంచి పోటీచేసిన పులివర్తి నానిల గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు. కూటమి ప్రభుత్వం కోసం కష్టపడినందుకు ఇదేనా మాకు దక్కుతున్న న్యాయం? మా నాన్న నాలుగుసార్లు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో, తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదుచేస్తే పట్టించుకోలేదు. ఏపీ మరో బిహార్లా తయారైంది. నాలాంటి ఎన్ఆర్ఐలు చాలామంది బాధితులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు ఎన్నడూ జరగలేదు. నిజానికి.. ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలను జగన్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. ఈ సమస్యను ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందనలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం కోసం కష్టపడ్డా.. కానీ ఇప్పుడు సిగ్గేస్తోంది. ఇదిలా ఉంటే.. తిరుచానూరు పరిసరాల్లో ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలను ఎంచుకుని కబ్జా రాయుళ్లు వాటిల్లోకి వాలిపోతున్నారని.. వీరికి పోలీసుల సహకారం ఉండటంతో ఎన్ఆర్ఐలు ఏమీ చేయలేకపోతున్నారని బొర్రా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. చివరికి.. తమ స్థలం విషయంలో పోలీసులు ప్రత్యర్థులతో సెటిల్ చేసుకోవాలని పరోక్షంగా చెబుతున్నారని మండిపడ్డారు. -
సీఎం గారూ ఇదేనా మంచి పాలన?
తిరుపతి మంగళం: సీఎం చంద్రబాబు గారు టీడీపీ నేతలు బ్యాంకు అధికారులపై దౌర్జన్యం చేయడం.. రౌడీయిజం చేయడమేనా? కూటమి అందిస్తున్న మంచిపాలన అని తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ప్రశ్నించారు. గురువారం టౌన్బ్యాంక్లోని తమ చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2023లో రెండువేల నోట్లు రద్దు సందర్భంగా టౌన్బ్యాంక్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్న కే.రోహిణికుమార్ బ్యాంక్ డిపాజిట్ దారులకు కొంత శాతం కమిషన్ పట్టుకుని, నోట్లు మార్పు చేసుకునే సౌలభ్యం టౌన్బ్యాంక్లో ఉందని పలువురికి మెసెజ్లు పెట్టారన్నారు. దీంతో ఆందోళనకు గురైన పలువురు ఖాతాదారులు తాము ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ.2 కోట్లు వరకు గడువుకు ముందే తీసుకెళ్లారని చెప్పారు. ఈ విషయంపై విచారణ జరిపి, వాస్తవాలు తేలడంతో ఆ ఉద్యోగిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సర్వీసు నుంచి తొలగించామన్నారు. అయితే ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారని చెప్పారు. తనని విధుల్లోకి తీసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చినట్లు గత నెల 26వ తేదీన ఆయన చెప్పారని పేర్కొన్నారు. అయితే 29న బ్యాంక్ బోర్డు మీటింగ్ ఉందని, ఆ తర్వాత తమ న్యాయవాదితో మాట్లాడి ఆర్డర్ను పరిశీలించి, ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పామని వెల్లడించారు. అయితే ఆ ఉద్యోగి పలువురు టీడీపీ నేతలతో కలసి గురువారం బ్యాంక్లోకి చొరబడి ఎండీ శివకుమార్పై దౌర్జన్యం చేసి, బలవంతంగా రీ జాయినింగ్ రిపోర్ట్ తీసుకుపోవడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. 12 ఏళ్ల పాటు టౌన్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసిన పులిగోరు మురళీకృష్ణరెడ్డి బాధ్యతగా వ్యవహరించకుండా ఇలా బ్యాంక్లో దౌర్జన్యం చేయడం ఏమిటని తప్పుపట్టారు. ఆయనతోపాటు తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ నేత జేబీ శ్రీనివాస్తోపాటు పలువురు టీడీపీ నేతలు బ్యాంక్లోకి వచ్చారని చెప్పారు. కోర్టు అంటే తమకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. సమయం పడుతుందని చెప్పినప్పటికీ ఇలా దారుణంగా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో తాము టీటీడీ నుంచి రూ.10 కోట్లు టౌన్ బ్యాంక్లో డిపాజిట్లు చేయించామని చెప్పారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ వారు చేసిన డిపాజిట్లను వెనుక్కి తీసుకువెళ్లేలా కృషి చేశారని ఆరోపించారు. బ్యాంక్ అభివృద్ధికి సహకరించాల్సిన కూటమి నేతలు ఇలా చేయడం ఏ మాత్రం న్యాయమో వారి విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నామన్నారు. బ్యాంకులపై దౌర్జన్యం న్యాయమా? 12 ఏళ్లు టౌన్బ్యాంక్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తికి బాధ్యత లేదా? కోర్టు ఆర్డర్ను ఎప్పుడూ గౌరవిస్తాం టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఎండీని రిక్వెస్ట్ చేశాం అయితే బ్యాంక్ వివాదంపై టౌన్బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడుతూ టౌన్బ్యాంక్ ఎండీ శివకుమార్ను కలిసి, రోహిణి కుమార్కు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వాలని రిక్వెస్ మాత్రమే చేశామని తెలిపారు. -
నేడు తిరుపతి ఐఐటీ 10వ వ్యవస్థాపక దినోత్సవం
ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్లో శుక్రవారం 10వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఐఐటీని 2015లో తిరుపతి సమీపంలో తాత్కాలిక భవనంలో ప్రా రంభించామన్నారు. మద్రాసు ఐఐటీ సహకారంతో తరగతులు ప్రారంభించినట్టు తెలిపారు. ఏర్పేడు సమీపంలోని 548 ఎకరాల్లో అధునాతన హంగులతో శాశ్వత ప్రాంగణాన్ని నిర్మించుకున్నట్లు చెప్పారు. 35 ఎకరాల్లో సౌత్ క్యాంపస్లో క్లాస్ రూమ్స్, హాస్టల్, ల్యాబ్స్, స్పోర్ట్స్ క్లబ్లను నిర్మించి తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2017లో ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రామ్లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2018లో ఎంఎస్సీ ప్రవేశాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం తి రుపతి ఐఐటీ క్యాంపస్లో 1,667 మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారన్నారు. 1.26 లక్షల మీటర్ల విస్తీర్ణంలో ఫేస్–ఏ క్యాంపస్ నిర్మాణాలు పూర్తి చేసినట్టు చెప్పారు. ఐఐటీ క్యాంపస్ శేషాచలం కొండకు దిగువున ఉన్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు 10 ఎకరాల విస్తీర్ణంలో రెండు నీటి సరస్సులు, 80 మిలియన్ లీటర్ల కెపాసిటీతో రెయిన్ వాటర్ ప్లాంట్ను ఏ ర్పాటు చేసుకున్నామన్నారు. దీనికి జాతీయస్థాయి అవార్డును కూడా వచ్చిందన్నారు. 1 మెగా వాట్ రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎకో ఫ్రెండ్లీ పరిసరాలను రూపొందించడంలో భాగంగా, 1.10 లక్షల పూలమొక్కలు, 260 ఔషధ మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. వ్యవ స్థాపక దినోత్సవంలో ఐఐటీ శాశ్వత ప్రాంగణ నిర్మాణ సంస్థ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఎండీ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ విశేష కృషి ఏర్పేడు సమీపంలో 548 ఎకరాల్లో ఐఐటీ శాశ్వత ప్రాంగణం నిర్మాణంలో విభిన్న శైలి, అధునాతన వసతుల కల్పనలో డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ కృషి ఎంతో ఉంది. ఆయన అనునిత్యం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిబ్బందిని సమన్వ యం చేసుకుని ఎన్నో గొప్ప విజయాలు సొంతం చేసుకోవటంలో సఫలీకృతులయ్యారు. -
వైద్య విధి..
వారికి నిబంధనలు అడ్డురావు.. అక్రమాలను ఆపాల్సిన అధికారులు అభ్యంత రం చెప్పరు..ప్రశ్నించేవారు ఎదురుపడరు.. ఇంకేముంది.. ఏ పని చేయాలన్నా చేయి చాపుతారు. ముడుపులు ముట్టజెప్పందే.. ఏదీ జరగదు..వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈ జాఢ్యం పెరిగిపోయింది. కూటమి గద్దె నెక్కిన తరువాత వసూళ్ల పర్వం మర్రిచెట్టు ఊడల్లా పాతుకుపోయింది. వైద్య ఆరోగ్య శాఖను అవినీతి కాలుష్యం ఆవహించింది. ఈ విష సంస్కృతి ఆ శాఖ సిబ్బందికి హానికరంగా మారింది. వైద్య ఆరోగ్యశాఖలో వసూల్ రాజాలు! ● ప్రతి పనికీ మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే ● ఓ ప్రైవేటు ఆస్పత్రి రెన్యువల్కు 8 ఏసీలు పంపాలని హుకుం ● డిప్యుటేషన్ల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు వసూలు ● పెండింగ్ బిల్లులు పాస్ కావాలంటే.. కార్యాలయానికి వస్తువులు ● పదోన్నతి పొందిన ఏఎన్ఎంల మూమెంట్ రికార్డు కోసం లంచం ● వెలవెలబోతున్న పీహెచ్సీలు.. రోగులకు తప్పని తిప్పలు ● పట్టించుకోని అధికార యంత్రాంగం సాక్షి తిరుపతి ప్రతినిధి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు కిందిస్థాయి అధికారుల పెత్తనం శృతి మించుతోంది. బదిలీ కావాలన్నా.. బిల్లులు పాస్ కావాలన్నా వారు అడిగింది సమర్పించుకుంటే పని పూర్తి అయినట్టే. ఆస్పత్రుల రెన్యువల్, డిప్యుటేషన్లు, పెండింగ్ బిల్లులు పాస్ చేయించడానికి, పదోన్నతి పొందిన వైద్య సిబ్బంది మూమెంట్ రిజిస్టర్ కోసం ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫలితంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అవినీతికి అడ్డాగా మారిపోతోంది. జిల్లా కేంద్రమైన తిరుపతి వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కొందరు యూడీసీలు, ఓ ఇద్దరు కిందస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో యూడీసీలు డిప్యుటేషన్పై వచ్చిన వారు, యూనియన్లలో ఉన్న వారు కావడం గమనార్హం. జిల్లాలో 58 పీహెచ్సీలు, 26 అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారాల్లో తలదూరుస్తూ ఆరోగ్యశాఖను భ్రష్టుపట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల రెన్యువల్ కోసం మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని రెన్యువల్ కోసం వెళితే.. జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి 8 ఏసీలు పంపమని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చేసేది లేక ఆరు ఏసీలు కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిసింది. కొనుగోలు చేసిన బిల్లులను సైతం తమకే ఇవ్వాలని ఒత్తిడి చేసి తీసుకున్నట్లు జిల్లా కార్యాలయంలోని ఓ అధికారి వెల్లడించారు. ఏసీలను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి బిల్లులు పెట్టి అటు వైపు నుంచి కూడా డబ్బులు మంజూరు చేయించుకుని, జేబులు నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులకు తనిఖీల పేరుతో వెళ్లి వసూళ్ల పర్వానికి తెర తీస్తున్నారు. అవినీతి అధికారుల అండతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఘోరాలు జరుగుతున్నా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లపై పడి కాసులు గుంజుకుంటున్నారు. మూమెంట్ రిజిస్టర్కూ మామూళ్లు ఇవ్వాల్సిందే డిప్యుటేషన్ల వేయించుకున్న వారంతా జిల్లా కార్యాలయం లోనే తిష్ట వేసి కాలక్షేపం చేస్తున్నారు. కొందరు కార్యాలయానికి వచ్చి హాజరు వేయించుకుని వెళ్లిపోతుంటే.. మరి కొందరు జిల్లా కార్యాలయంలో కూర్చొని కును కు తీస్తున్నారు. వీరు నచ్చిన వారికి, రూ.50 వేలు ఇచ్చిన వారిని నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్పై కోరిన ప్రాంతానికి పంపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవ ల ఉద్యోగోన్నతులు వచ్చిన ఏఎన్ఎంలకు అవసరమైన మూమెండ్ రిజిస్టర్ల కోసం ఆ వసూల్ రాజాలు వారి నుంచి మామూళ్లు పుచ్చుకుంటున్నట్లు ఏఎన్ఎం ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. చేయి తడిపితే కానీ ఇవ్వనని తెగేసి చెప్పినట్లు తెలిపారు. ఇలా ప్రతి ఒక్కరికీ రేటు నిర్ణయించి వసూళ్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరుగుతున్న దందాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి అవినీతి అధికారులు, పనిపాట లేకుండా ఒకేచోట కూర్చొని ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా పైరవీలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు అధికారులు తమ ఇష్టా రాజ్యంగా పైరవీలు నడుపుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని డిప్యుటేషన్లు రద్దు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. అయినా 29 మందికి డిప్యుటేషన్పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లింది. డిప్యుటేషన్లు రద్దు చేస్తామని వెల్లడించారు. ఆ తరువాత కూడా డిప్యుటేషన్ల సంఖ్యను 25కు కుదించారు. అనంతరం మరి కొందరిని వారి వారి స్థానాలకు పంపినట్లు చెబుతున్నారు. అయినా ఇప్పటికీ కొందరు అధికారులు జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే తిష్ట వేసి ఉన్నారు. ఓ అధికారి గుట్టుచప్పుడు కాకుండా డిప్యుటేషన్ల వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు చొప్పు న వైద్యులు ఉండాలనే నిబంధనలకు కూటమి ప్రభుత్వం నీళ్లొదిలింది. 17 పీహెచ్సీలో ఒక్కొక్కరు వంతున వైద్యులు ఉన్నారు. డిప్యుటేషన్ల పేరుతో కొందరు పీహెచ్ వైద్యులు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడం మానేసి, సొంత క్లినిక్లో కూర్చొని డబ్బులు సంపాదించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అందుకు శ్రీకాళహస్తిలో పనిచేసిన ఓ వైద్యురాలి నిర్వాకమే ఇందుకు నిదర్శనం. యూడీసీలు కొందరు వారు పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లకుండా సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. బి కొత్త కోటలో పనిచేస్తున్న ఓ ఏఎన్ఎం ఐపీ పెట్టింది. ఆ తరువాత సెలవులో ఉండి.. మూడు నెలల తరువాత కార్వేటినగరానికి బదిలీ చేసుకుంది. ఇందుకు ఆమె జిల్లా కార్యాలయంలోని ఓ అధికారికి ముడుపులు చెల్లించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నపాండూరులో హెల్త్ అసిస్టెంట్ పనిచేసిన వ్యక్తి ఆ పీహెచ్సీలో సిబ్బందితో దురుసుగా వ్యవహరిస్తుండడంతో జిల్లా ఆరోగ్యకేంద్రానికి డిప్యుటేషన్పై బదిలీ చేశారు. అక్కడి నుంచి నెల్లూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు పైరవీలు చేసుకుని అనధికారికంగా గూడూరుకు చేరుకున్నారు. -
బ్రాండ్ అంబాసిడరా?
రియల్ ఎస్టేట్కి శ్రీవారు ● దీనికి ఆగమశాస్త్ర సలహాలు తీసుకోవాలని చెప్పడం దారుణం ● కూటమి హయాంలో దిగజారిన టీటీడీ ప్రతిష్ట ● మీ పాలనకు నిరసనగా సాధువులు, స్వాములు ఆందోళన చేయలేదా? ● కొండపై విచ్చలవిడిగా మద్యం, మాంసం ● మంత్రి నారా లోకేష్ పీఏ రోజూ 10 –13 సిఫార్సు లెటర్లు జారీ ● టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వైఎస్సార్సీపీ హయాంలోనే నాణ్యమైన లడ్డూ తిరుమల లడ్డూ నాణ్యత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హ యాంలోనే పెరిగిందని భూమన కరుణాకరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలతో శ్రీవారి అన్న ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయించారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో 3, 4 వేల లోపు వీఐపీ దర్శనాలుంటే కూటమి పాలనలో రోజుకు ఏడు వేలకు పెరిగాయన్నారు. మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు రోజుకు 10 నుంచి 13 సిఫార్సు లెటర్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి నేతలు వీఐపీ సేవల్లో తరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలన లో భక్తులకు మేలు జరిగిందని చెప్పడానికి ఒక్కటైనా ఉందా? అని భూమన సవాల్ విసిరారు. కూటమి పా లనలో సీవీఎస్ఓ, జేఈఓ, స్విమ్స్ డైరెక్టర్ను కూడా నియమించలేకపోయారంటే.. మీ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతుందన్నారు. స్విమ్స్ హాస్పిటల్ను నిర్వీర్యం చేస్తోంది కూటమి ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రక్షాళన అంతా డొల్ల అని మీ ఎల్లో పత్రికనే రాసిందని ఎద్దేవా చేశారు. సీఎం నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు.. సమర్థుడు అయిన అధికారులను వెంటనే తీసి వేయమని చెప్పడం ఏమిటని భూమన ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పిన డిప్యూటీ సీఎం ఎక్కడ? అని నిలదీశారు. వైఎస్సార్సీపీ పాలనలో తప్పు జరిగిందా..? ఈ పది నెలలు కాలంలో అపవిత్రం జరిగిందా? అనే అంశంపై తాము చర్చకు సిద్ధం అని భూమన సవాల్ విసిరారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వెంచర్లకు శ్రీవేంకటేశ్వరస్వామిని బ్రాండ్ అంబాసిడర్గా మారుస్తున్నారని, ఇందుకు ఆగమశాస్త్ర సలహాలు తీసుకోవాలని చెప్పడం దారుణం అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని వైఎ స్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం రోజు రోజుకు దిగజార్చుతోందని మండిపడ్డారు. చైన్నెలో జీ స్క్వేర్ సంస్థ సొంత నిధులతో ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం ఎంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ అభ్యంతరం చెప్పినా సీఎం చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కలియుగదైవం వేంకటేశ్వరస్వామివారిని, టీటీడీని ప్రమోటర్గా చేసే ప్రయ త్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థకు దేశ వ్యాప్తంగా వెంచర్లు ఉన్నాయని, సొంత నిధులతో ఇలానే దేవాలయాలు నిర్మాణం చేస్తామని ముందుకు వచ్చి, వాళ్ల వ్యాపారం పెంచుకుంటారన్నారు. సొంత ఖర్చులతో టీటీడీ ఆలయాలు కడితే తప్పు ఏమిటని సాక్షాత్తు సీఎం అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాళ్లా వేళ్లా పడి విచారణ ఆపుకోలేదా? వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించి హోమ్ శాఖ నుంచి విచారణకు జారీ చేసిన ఆదేశాలను కాళ్లా వేళ్లా పడి ఆపుకోలేదా?.. ఇది నిజం కాదా? అని భూమన నిలదీశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగ లేదన్నారు. దేశంలో ఉన్న మఠాధిపతులతో తాము సమావేశం నిర్వహించామని, ఇతర మతాలు నుంచి తిరిగి హిందువులుగా మారేందుకు ఒక వేదిక ఏర్పా టు చేయాలని వైఎస్సార్సీపీ పాలనలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని భూమన గుర్తు చేశారు. హిందూమతంలో చేరేవారికి నేరుగా వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఇప్పించాలని నిర్ణయించామని, దీనిపైనా నాడు టీడీపీ రాజకీయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చిన్న పిల్లలు గోవిందా కోటి రాస్తే వారికి శ్రీవారి దర్శన అవకాశం కల్పించింది వైఎస్సార్సీపీ పాలనలోనేనని స్పష్టం చేశారు. శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహహోమం కార్యక్రమం తామే నిర్వహించామని, ఇప్పటికీ అత్యద్భుతంగా జరుగుతోందన్నారు. అయినా ఆ విషయాన్ని కూడా కూటమి పాలనలోనే జరుగుతున్నట్లు చెప్పుకోవడం దారుణమన్నారు. ఈ పది నెలలు పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనిలేదని ఆరోపించారు. వేంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే అపచారం అవుతుందన్నారు. చిత్తశుద్ధితో ఆలయ ప్రతిష్ట పెంచేందుకు పనిచేయాలని హితవుపలికారు. టీటీడీ ప్రతిష్ట దిగజార్చుతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి టీటీడీ ప్రతిష్టను మరింతగా దిగజార్చుతున్నారని భూమన ఆందో ళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ పార్టీ నేత లు, భక్తులే అంటున్నారని చెప్పారు. లడ్డూ వివాదం మొదలుకొని నేటి వరకు అన్నీ అపచారాలే అన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ పాలనపై చేసిన ఆరోపణలకు సీబీఐ, సిట్ ఒక్క ఆధారం చూపించలేదన్నారు. కూటమి పాలనపై సాధువులు, స్వాములు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట, తిరుమలలో ఆందోళన చేయ లేదా? అని నిలదీశారు. తిరుమలలో బాలాజీ నగర్, ఇతర ప్రాంతాల్లో మద్యం, మాంసం విచ్చలవిడిగా అమ్ముతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యమతస్తుడు తిరుమల కొండకు వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా వెళ్లడించారు. -
రైటింగ్ స్కిల్స్తో సమాచారం విశ్వవ్యాప్తం
తిరుపతి సిటీ: అకడమిక్ రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకుంటేనే అలోచనలు, రచనలు వంటి స మాచారం ప్రపంచానికి చేరుతుందని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు పేర్కొన్నారు. ఎస్వీయూ ఇంగ్లీషు విభాగం ఆధ్వర్యంలో ‘విద్యార్థులకు, పండితులకు అకడమిక్ రైటింగ్– మెళకువలు’ అ నే అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న జా తీయ వర్క్షాపు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మా ట్లాడారు. ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థు లు, పరిశోధకులు, పండితులు రైటింగ్ స్కిల్స్పై ప్రత్యేక దృష్టి సారించి మెళకువలను అభ్యసనం చేయాలని సూచించారు. దిండిగల్ గాంధీగ్రామ్ రూరల్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ జోసెఫ్ దొరై రాజ్ రిసోర్స్ పర్సన్ గా విచ్చేసి అకడమిక్ రైటింగ్ నైపుణ్యాలు, ఏకీకరణ, పొందిక, స్పష్టత అనే అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. క న్వీనర్ ప్రొఫెసర్ శారద మాట్లాడుతూ విద్యార్థు లకు అకడమిక్ రైటింగ్ స్కిల్స్ ఎంతో అవసరమని, ఎన్ఈపీ 2020తో దీని ఆవశ్యకత సంతరించుకుందని, ఈ క్రమంలో జాతీయ వర్క్షాపు ని ర్వహించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. డీన్ ప్రొఫెసర్ మురళి పాల్గొన్నారు. 6న జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు తిరుపతి ఎడ్యుకేషన్ : నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్లోని టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ, బాక్సింగ్ డెవెలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వ ర్యంలో ఈ నెల 6వ తేదీన జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఆ మేరకు రాష్ట్ర అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేన్ జిల్లా ఇన్చార్జ్ పి.గీతా ఒక ప్రకటనలో తెలిపారు. క్యాబ్, కేడెట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 5వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఈ పోటీల్లో గెలిచిన బా లబాలికలు ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 95731 44232, 70135 91635 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
రాజల సీమ కీర్తి
ఆధ్యాత్మికపురి.. నేటితో జిల్లాకు మూడేళ్లు ● 34 మండలాలు..ఏడు నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు ● జిల్లాకు సముద్రతీరం ● 2022 ఏప్రిల్ 4న తిరుపతి జిల్లా ఏర్పాటుజిల్లా సమాచారం మండలాలు 34 పంచాయతీలు 774 రెవెన్యూ డివిజన్లు 4 నియోజకవర్గాలు 7 పార్లమెంట్ స్థానం 1 సముద్రతీరం 72 కిలోమీటర్లు తిరుపతి అర్బన్: ప్రాచీన నేపథ్యం.. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాతికపురి తిరునగరి ప్రముఖ పుణ్యక్షేత్రంగా, విద్యాకేంద్రంగా విరాజిల్లింది. కాలక్రమంలో తిరుపతిగా రూపుదిద్దుకుంది. ఈ నగరం మూడేళ్ల కిందట జిల్లా కేంద్రంగా అవతరించింది. దీంతో పూర్వపు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తిరుపతి జిల్లాలో కలవడంతో ఆధ్యాత్మిక నగరికి సముద్రతీరం, షార్ కూడా వచ్చి చేరింది. అ న్ని హంగులతో దేశంలోనే ఓ ప్రత్యేక, విశిష్ట జిల్లా గా విరాజిల్లుతోంది. పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన సౌలభ్యం కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4వ తేదీన జిల్లాల పునర్విభజనలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పాటు అయ్యింది. టీటీడీకి చెందిన శ్రీపద్మావతి అతిథి గృహాన్ని కలెక్టరేట్ కార్యాలయానికి కేటాయించారు. గత సర్కార్ తీసుకున్న చక్కటి నిర్ణయంతో జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉందని తమ మనస్సులో మాటను వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్లోనే కార్యాలయాలు కలెక్టరేట్కు వెళితే అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండడంతో ఇబ్బందులు లేకుండా అన్ని పనులు చూసుకురావడానికి సౌకర్యంగా ఉంది. గత సర్కార్ ముందుచూపులో చక్కటి అలోచన చేశారని భావిస్తున్నాం. గతంలో మూడు కార్యాలయాల్లో పనులు ఉంటే ఒక రోజు మొత్తం సరిపోయేది కాదు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా సులువుగా ఉంది. – జగదీష్రెడ్డి, సత్యవేడు ఎంతో అనుకూలం ఒకేచోట అన్ని కార్యాలయాలు ఉండడంతో అందరికీ ఎంతో అనుకూలంగా ఉంది. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు పలు కార్యాలయాలకు వెళ్లడానికి నానా తిప్పలు పడేవారు. అయితే కలెక్టరేట్లోనే అన్ని కార్యాలయాలు ఉండడంతో ఎంతో అనుకూలంగా ఉందని భావిస్తున్నాం. దానికితోడు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో పద్మావతి అతిథి గృహాన్ని ఎంపిక చేయడంతో విశాలమైన భవనం నేపథ్యంలో ఎంతో సౌకర్యంగా ఉంది. – వెంకటేష్, రేణిగుంట -
ఎస్వీ హైస్కూల్లో అత్యుత్తమ విద్య
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర హైస్కూల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నట్లు అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం తిరుమలలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి విద్యార్థులు, అధ్యాపకులతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ చాలాకాలం తర్వాత ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి పాదాల చెంత టీటీడీ పాఠశాలలో చదువుకుంటున్న మీరంతా ఎంతో అదృష్టవంతులన్నారు. అనంతరం వివిధ పోటీ పరీక్షలు, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, అకడమిక్ ఇన్చార్జ్ రంగలక్ష్మి, హెచ్ఎం సురేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగం దుర్మార్గం
నాయుడుపేటటౌన్: కూటమి నాయకులు రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహస్తున్నారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మండిపడ్డారు. నాయుడుపేట పట్ట్టణంలోని సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో గురువారం వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రజలకు అండగా నిలిచి, కూటమి నాయకుల దౌర్జన్యాలు, ఆరాచాకా లు అడ్డుకోవడాన్ని తట్టుకోలేక కాకాణిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల దౌర్జనాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అణిచివేసే చర్యలు చేపట్టడడం ఎంతవరకు సమంజసమని ని లదీశారు. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు కావసున్నా, వారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమ లు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. సంక్షేమాన్ని గాలికి వదలి, కేవలం వైఎస్సార్ సీపీ నాయకులనే టార్గెట్ చేసుకుని పాలన సాగిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పాలు ఇచ్చే గేదెను వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. జమిలి ఎన్నికలు వస్తే కూటమి నాయకులను ప్రజలు తరిమికొడతారన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే పని పాలన సాగిస్తుందని, ఈ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట పట్టణ, మండల కన్వీనర్లు కలికి మాధవరెడ్డి, ఒట్టురు కిషోర్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, పార్టీ మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి కురుగొండ ధనలక్ష్మి, నియోజవర్గ కన్వీనర్ ఈదా రత్నశ్రీ , ఏఎంసీ మాజీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి, కట్టా కమలకర్రెడ్డి, చదలవాడ కుమార్, దారా రవి, పాలేటి నాగార్జున, మండల కన్వీనర్లు పాదర్తి హరినాఽథ్రెడ్డి, ఆర్ముగం, పేట చంద్రారెడ్డి, షేక్ షబ్బీర్, వరకళా చంద్ర, రహమాతుల్లా, కింగ్స్వే జిలానీ, ఆశోక్ కుమార్, పేర్నాటి రాహుల్, ఆర్కాట్ శాంత కుమార్, మెస్ భాస్కర్రెడ్డి, అనపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ● మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య -
● బస్సు ఎక్కనివ్వని కండక్టర్లు ● చిత్తూరు ప్రయాణికులకు ఇబ్బందులు ● వేలూరులో ఆర్టీసీ బస్సుల్లో రోజూ గొడవలే ● రాత్రిపూట అవస్థలు పడుతున్న ప్రయాణికులు ● పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
చిత్తూరు ప్రయాణికులంటే ఆర్టీసీ చిన్నచూపు చూస్తోంది. వేలూరులో చిత్తూరంటేనే బస్సు ఎక్కనివ్వడంలేదు. ఒక వేళ ఎక్కినా...సీటు లేదంటూ దింపేస్తున్నారు. చిత్తూరుకు రావాలంటే రాత్రిపూట ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ మండి పడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆరీస్టీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి. – చిత్తూరు రూరల్ (కాణిపాకం) ఆర్టీసీ చిత్తూరు మీదుగా వేలూరుకు 46 బస్సు లు కేటాయించింది. ఇందులో చిత్తూరు–2 డిపో నుంచి 9 బస్సులుండగా 54 ట్రిప్పులు, అరుణాచలానికి 4 బస్సులుండగా 8 ట్రిప్పులు, తిరుమల నుంచి 33 బస్సులకు గాను 66 ట్రిప్పులు ఆర్టీసీ తిప్పుతోంది. ఈ ప్రయాణంలో చిత్తూరు నుంచి వేలూరు వెళ్లేటప్పుడు మాత్రం ఆర్టీసీ బ స్టాండు నుంచి గుడిపాల వరకు కాట్పాడి... వేలూర్....వేలూర్ అంటూ పిలిచి ఎక్కించుకుంటున్నారు. తిరుమల సర్వీసుల్లో కూడా ఇలానే గౌరవంగా పిలిచి ఎక్కించుకుంటున్నారు. ఇలా నిత్యం వేలూరుకు వేల మంది వెళ్లి వస్తుంటారు. ప్రధానంగా సీఎంసీ, దుస్తుల కొనుగోలు, వ్యా పార లావాదేవీలు, వాహన, ఇతర సామగ్రి, ఎరువులు తదితర పనుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే తిరుగు ప్రయాణంలో చిత్తూరంటే ఆర్టీసీ కండక్టర్లు బస్సుల్లో ఎక్కించుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కరోనా కాలం తర్వాత చిత్తూరు ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించుకోవడం లేదని ఫిర్యాదు వస్తే అప్పటి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తక్షణం స్పందించారు. ఏ డిపో బస్సులైనా చిత్తూరు ప్రయాణికులను ఎక్కించాల్సిందేనని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఆయన వైస్ చైర్మన్గా ఉన్నంత కాలం ఈ సమస్య రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. తిరుపతి డీపీటీఓతో మాట్లాడుతున్నాం.. వేలూరు నుంచి చిత్తూరుకు వచ్చే ప్రయాణికులను తిరుపతికి వెళ్లే బస్సుల్లో ఎక్కించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై తిరుపతి డీపీటీఓతో మాట్లాడుతున్నాం. కచ్చితంగా సమస్యలు రాకుండా చూస్తాం. ఏ మార్గాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయో చూసి కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – జగదీష్, డీపీటీఓ, చిత్తూరు -
భక్త జనహోరు
కోదండరాముడి తేరు.. శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారు రథంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగారు. రథం యథాస్థానానికి చేరిన తర్వాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి, హారతి సమర్పించారు. మధ్యాహ్నం తిరుమంజనం, ఆస్థానం, సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారి అశ్వవాహన సేవ వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, పుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. న్యూస్రీల్ వైభవంగా రథోత్సవం రాత్రి అశ్వంపై స్వామి విహారంనేడు చక్రస్నానం శ్రీకోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరుగనుంది. -
జిల్లా మత్స్యశాఖ ఇన్చార్జిగా రాజేష్
● డీడీ నాగరాజుకు ఉద్యోగోన్నతి తిరుపతి అర్బన్: మత్స్యశాఖ జిల్లా అధికారిగా పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ నాగరాజుకు జాయింట్ డైరెక్టర్గా ఉద్యోగోన్నతి క ల్పించారు. ఆ మేరకు ఆయన కాకినాడకు బదిలీ అయ్యారు. గూడూరు డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్గా(ఏడీ) పనిచేస్తున్న రాజేష్ కు జిల్లా మత్స్యశాఖ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు రాజేష్ తిరుపతి అలిపి రి రోడ్డులోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు నాగరాజు తిరుపతి జిల్లా నుంచి రిలీవ్ అయి, కాకినాడకు వెళ్లారు. రెండేళ్లుగా జిల్లా మత్స్యశాఖ డీడీగా నాగరాజు విధులు నిర్వహించారు. -
‘రియల్ ఎస్టేట్ వెంచర్లో శ్రీవారి ఆలయమా?’
తిరుపతి: ఓ రియల్ ఎస్టేట్ సంస్ధలో టీటీడీ ఆలయాలు కట్టాలనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చూస్తుంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామిని, టీటీడీని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రమోటర్లుగా వాడుకోవడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.‘రియల్’ వెంచర్ లో శ్రీవారి ఆలయమా?రోజూ తిరుమల ప్రక్షాళన గురించి మాట్లాడే చంద్రబాబు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన జీ స్వ్కేర్ వెంచర్ లో టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తే తప్పేంటి అని అనడం దారుణం. కూటమి పాలనలో శ్రీవారి పేరు మీద భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని భయాందోళనలు కలుగుతున్నాయి.దేశంలో ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలున్నాయి. వారంతా తమ సొంత ఖర్చుతో ఆలయాలు నిర్మిస్తే వాటిని టీటీడీ తీసుకుంటుందా? ఆ వెంఛర్లకు టీటీడీ ప్రమోటర్గా ఉంటుందా? శ్రీ వేంకటేశ్వరస్వామిని వెంచర్లకు ప్రమోటర్గా చేయడం కాదా ఇది? వెంచర్ల ఆదాయం పెంచడానికి శ్రీవారిని వాడుకోవడం దుర్మార్గం కాదా? దీనికి ఆగమశాస్త్ర పండితులు సలహాలు సూచనలు ఇవ్వాలనడం ఇంకెంత దారుణమైన విషయం?తిరుమలలో వరుస దారుణాలు👉కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ఆలయ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతుందని నెత్తీనోరూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తిరుమలలో జరుగుతున్న వరుస సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి.👉శ్రీవారి లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం నుంచి మొదలుపెడితే ఆనాటి నుంచి అనేక ఘటనల్లో కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు వరుసగా బయటపడుతూనే ఉన్నాయి. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెప్పడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది.👉చంద్రబాబు అనుమతించిన హోటల్కి స్వామీజీలు ధర్నాలు చేస్తే వారిని పోలీసులతో మెడపట్టి గెంటేయించారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గి అనుమతులు రద్దు చేయాల్సి వచ్చింది.👉తిరుమలలో జోరుగా మద్యం, మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. కొండపై బిర్యానీలు తింటున్నారు. గంజాయి, మద్యం మత్తులో భక్తుల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు కాదు. తిరుమల పోలీసులే ఆధారాలతో సహా పట్టుకున్నట్టు అన్ని మీడియాల్లో ఫొటోలతో సహా ప్రచురితం అయ్యాయి. 👉ఇటీవల ఒక అన్యమతస్తుడు బైకుపై తిరుమలకు వెళితే మానసిక వికలాంగుడు అని ప్రభుత్వం కవర్ చేసుకుంది. పాపవినాశనం జలపాతంలో జరిగిన బోట్ షికారు ఎందుకునే దానిపై ప్రభుత్వ శాఖల నుంచే భిన్నమైన అభిప్రాయాలు చెప్పినా, వాస్తవం ఏంటనేది ఇంతవరకు ప్రభుత్వం నుంచి సరైన వివరణ రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అడుగడుగునా విజిలెన్స్ లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నా ప్రభుత్వం కళ్లుండీ చూసీచూడనట్టు వదిలేస్తుంది.తేడాను ప్రజలే గుర్తించారుతన చేతకానితనాన్ని ఒప్పుకోలేని ప్రభుత్వం భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ తమకుతామే కితాబిచ్చుకోవాల్సి దుస్థితి నెలకొంది. లడ్డూ నాణ్యత పెరిగిందని, అన్న ప్రసాదం బాగుందని తమకు తామే చెప్పుకోవడం తప్పించి, లోపాలు ఆధారాలతో సహా బహిర్గతం అవుతున్నా నష్టనివారణ చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వానికి చేతకావడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల వైభవానికి ఇప్పుడు జరుగుతున్న అరాచకాలకు తేడాను పది నెలల్లోనే భక్తులు గుర్తించారు. గత మా ప్రభుత్వంపై బురదజల్లేందుకు తిరుమల కేంద్రంగా జనసేన-టీడీపీ కలిసి చేయించిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. లోకేష్ పీఏ 12 లెటర్లు పంపుతున్నాడు👉కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలను వీఐపీల అడ్డాగా మార్చేశారు. గత మా ప్రభుత్వ హయాంలో వీఐపీలకు రోజుకు 4 వేలు వీఐపీ టికెట్లు ఇస్తే, ఇప్పుడు రోజుకు 7500 టికెట్లు ఇచ్చి దర్శనం కోసం వస్తున్న సామాన్య భక్తులను గంటలపాటు క్యూ లైన్లలో మగ్గేలా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సమీక్షలో మాత్రం సామాన్యులకు పెద్ద పీట వేస్తామని పచ్చి అబద్ధాలు మాయమాటలు చెప్పుకుంటున్నారు.👉మంత్రికి వీఐపీ బ్రేక్ కోసం రోజుకు ఒక లెటర్ చొప్పున ఆమోదిస్తుంటే, మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు రోజుకు 12 వీఐపీ లెటర్లు పంపుతున్నాడు. అది కూడా పీఎస్ టూ సీఎంఓ పేరుతో సాంబశివరావు పంపుతున్నాడు.👉అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంతవరకు ఎస్వీబీసీ చైర్మన్ను, తిరుమల జేఈవోను, సీవీఎస్వోను, బర్డ్ డైరెక్టర్ను నియమించలేకపోయారు. కొండ మీద పాలన పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం’ అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల పవిత్రత కాపాడాంభక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో అలిపిరి వద్ద ధర్మశాలను కట్టాలనే నిర్ణయం కూడా వైఎస్సార్సీపీ హాయాంలో జరిగిందే. అదేదో తామే చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.రాయలసీమకు తలమానికంగా ఉన్న స్విమ్స్ ఆస్పత్రిని కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు.ఏ విషయంలోనూ వైఎస్సార్సీపీ కన్నా మిన్నగా కూటమి పాలనలో తిరుమలలో ప్రక్షాళన చేశారో చంద్రబాబు చెప్పాలి.ఇన్ని అరాచకాలు జరుగుతున్నా సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్, ఇంకెప్పుడు మాట్లాడతారు? కొండమీద జరుగుతున్న అపవిత్రత గురించి ప్రశ్నించలేరా?చంద్రబాబుకి ఇదే నా సవాల్. టీడీపీ నుంచి ఏ నాయకుడిని పంపినా తిరుమల పవిత్రతపై వారితో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా.తిరుమల కొండ మీద ఏం జరిగిందో తెలుసుకోవాలని కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశిస్తే వారి కాళ్లూ వేళ్లూ పట్టుకుని అడ్డుకున్న సంఘటన కూటమి పాలనలో జరిగిందా? లేదా? ఇలాంటి ఘటనలు ఏనాడైనా వైఎస్సార్సీపీ పాలనలో జరిగినట్టు నిరూపించగలరా?ఏ మతస్తుడైనా హిందువుగా మారడానికి తిరుమలలో ఒక వేదిక ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నది కూడా మా హయాంలోనే అనేది గర్వంగా చెబుతున్నా.గోవింద కోటి రాసిన వారికి కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. వేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం కూడా మేం తీసుకున్న నిర్ణయమే.లడ్డూ నాణ్యత మా హయాంలో ఎలా ఉన్నదో ఇప్పుడూ అలాగే ఉన్నది. గడిచిన పది నెలల కూటమి పాలనలో ఒక్క విషయంలోనైనా ప్రక్షాళన జరిగి ఉంటే చూపించాలి. వేంకటేశ్వరుని స్వామిని రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశం ఇప్పటికైనా విడనాడాలి. -
ఎన్ఆర్ఐల భూములపై పాగా.. రెచ్చిపోతున్న కబ్జా రాయుళ్లు
సాక్షి, తిరుపతి: తిరుచానూరులో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలపై కబ్జా రాయుళ్ల కన్నుపడింది. తిరుచానూరులో కోట్ల విలువైన భూములపై పాగా వేశారు. సెటిల్మెంట్ చేసుకొని పక్షంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏపీ లో బీహార్ రాష్ట్ర తరహా ఘోరాలు జరుగుతున్నాయంటూ ఎన్ఆర్ఐ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తిరుచానూరులో కోట్లు విలువ చేసే తన భూమిని కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. తన తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండ్గా పనిచేసిన వ్యక్తి అని.. ఆయన నాలుగు సార్లు ఎస్పీని కలిసిన తిరుచానూరు సీఐ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎన్ఆర్టీ ద్వారా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసు నమోదు చేశారన్నారు.ఏపీలో మరో బీహర్ తరహా దోపిడీ ఘోరాలు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఎన్ఆర్ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రవాస ఆంధ్రుల భూములకు రక్షణ కరువైందన్నారు. ఎన్నికలు సమయంలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసినందుకు బాధపడుతున్నామని ఆయన చెప్పారు. -
శ్రీవారికి కునుకు కరువాయె!
తిరుమల: కూటమి ప్రభుత్వం ప్రజలకే కాదు.. తిరుమల వేంకటేశ్వరస్వామికి కూడా కునుకు లేకుండా చేస్తోంది. కూటమి ప్రభుత్వం నియమించిన టీటీడీ అధికారులు, పాలక మండలి చైర్మన్ వీఐపీల సేవలో తరిస్తూ.. సామాన్య భక్తులకు స్లాట్ ప్రకారం దర్శనం చేయించలేక, అర్ధరాత్రి వరకు దర్శనాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్రహ్మండ నాయకుడైన తిరుమల శ్రీనివాసునికి విశ్రాంతి కరువైంది. టీటీడీ అధికారులు ఆగమ శాస్త్ర నిబంధనలను పాటించక పోవడం మహాపచారంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రోజుకు మూడు వేలకు మించి విఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కేటాయించే వారు కాదు. కానీ నేడు ఆ సంఖ్య 7 వేల నుంచి 7,500 వరకు పెరిగింది. దీంతో ఉదయం 8 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభమై మధ్యలో ప్రొటోకాల్ బ్రేక్, శ్రీవాణి దర్శనం, దాతలు, రెఫరల్ ప్రొటోకాల్ దర్శనాలు వరుసగా మధ్యాహ్నం 1:30 గంట వరకు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత గంట సమయం కలిగిన ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు, టైం స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనం మొదలై 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ఇలా ఒక్కో స్లాట్ ఆలస్యం అవుతుండటంతో తర్వాతి స్లాట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వెరసి రాత్రి నుంచి పడిగాపులు కాచిన సామాన్య భక్తులకు చాలా ఆలస్యంగా దర్శనం మొదలై అర్ధరాత్రి దాటినా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా టీటీడీ దాదాపు 45 వేల టికెట్లు కేటాయిస్తుండగా, సర్వ దర్శనంలో దాదాపు 20 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరందరికీ దర్శనం చేయించడానికి అర్ధరాత్రి దాటుతోంది. టీటీడీ అధికారులు విఐపీలకు ఇచ్చే ప్రాధాన్యత శ్రీవారికి ఇవ్వడం లేదని సామాన్య భక్తులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలను రాజకీయంగా వాడుకోవడం పరిపాటిగా మారిందని, దేవదేవుడికి కూడా విశ్రాంతి లేకుండా చేశారని నిట్టూరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరు వల్ల ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందిన వారికి కూడా నిర్ధేశించిన సమయానికి టీటీడీ దర్శనం చేయించలేకపోతోంది. గత ప్రభుత్వంలో ఈ దర్శనం రెండు మూడు గంటల్లో పూర్తయ్యేది. ఇప్పుడు నాలుగైదు గంటలు పడుతోంది. ఏకాంత సేవ సమయాన్ని పెంచాలిపెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి వారు సేదదీరే సమయం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో స్వామి వారి ఏకాంత సేవ సమయాన్ని పెంచాలని అర్చక, పండిత బృందం టీటీడీ అధికార యంత్రాంగానికి సూచిస్తోంది. రోజూ వేకువజామున సుప్రభాత సేవతో స్వామికి నివేదనలు మొదలవుతాయి. ప్రస్తుతం వేకువజామున 2.30 గంటలకు మహాద్వారం, వెండి వాకిలి, బంగారు వాకిలి తలుపులు తెరిచి 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు. అంతకంటే ముందు అర్ధరాత్రి 12 గంటలలోపే ఏకాంత సేవ నిర్వహించాలి. అయితే కొన్ని నెలలుగా ఈ సేవ నిర్వహణ సమయం అర్ధరాత్రి 1–2 గంటల మధ్యకు మారిపోయింది. కొన్నాళ్లుగా తెల్లవారుజామున 2.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహించి, ఆలయం తలుపులు మూస్తున్నారు. ఒక్కోసారి 2.50 గంటలకు ఏకాంత సేవ పూర్తిచేసి, ఆ వెంటనే.. అంటే కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే తిరిగి ఆలయం తలుపులు తెరుస్తున్నారు. క్యూలైన్లు భారీగా ఉండి, కంపార్టుమెంట్లలో గంటల తరబడి భక్తులను నిరీక్షింప చేస్తున్నందున అర్ధరాత్రి దాటినా సరే దర్శనం పూర్తి చేయించాలనే ఉద్దేశం వల్ల ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి.వెరసి రోజుకు 23 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇది సరికాదని, గర్భాలయంలోని మూల మూర్తికి కనీసం గంట నుంచి గంటన్నర సేపైనా ఏకాంతం కల్పించాలని అర్చకులు, కొందరు పండితులు టీటీడీ అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిని ఆరాధిస్తారని, స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారని పురాణాల్లో ఉందని.. దేవతల ఆగమన సమయంలో మానవ సంచారం ఉండకూడదని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. -
కబ్జాలు.. కిడ్నాప్లు
పచ్చమూక చెరలో చింతగుంట చెరువు చంద్రగిరి మండలంలోని చింతగుంట చెరువును అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. రెచ్చిపోతున్న కూటమి నేతలు ● యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా ● ప్రశ్నిస్తే దాడులు.. దౌర్జన్యాలు ● ‘భూ’చోళ్లకు సహకరిస్తున్న అధికారులు ● కిడ్నాప్లకు సైతం తెగబడుతున్న పచ్చమూక ● వైన్షాపు యజమానులకు బెదిరింపులు ● ఇష్టారాజ్యంగా మద్యం దందా ‘స్లాట్’ రిజిస్ట్రేషన్ ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి స్లాట్ బుకింగ్ను తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ప్రారంభించనున్నారు.గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోకబ్జాలు.. దాడులు.. దౌర్జన్యాలు.. కిడ్నాప్లు.. బెదిరింపులతో కూటమి నేతలు పేట్రేగిపోతున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూములను ఆక్రమించేస్తున్నారు. వివాదాస్పద స్థలాల విషయంలో పెద్దమనుషులుగా అవతారమెత్తి అసలుకే ఎసరు పెట్టేస్తున్నారు. అప్పు వసూలు పేరుతో రౌడీయిజం చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులందరూ ప్రత్యేక బృందంగా తయారై అందిన కాడికి దోచేసుకుంటున్నారు. మామూళ్లతో అధికారుల కళ్లకు గంతలు కట్టేస్తున్నారు.రంగంలోకి ఐదుగురు ఇటీవల తిరుపతికి చెందిన ఓ కుటుంబాన్ని కూటమి పార్టీలకు చెందిన గూండాలు కిడ్నాప్ చేసిన విషయం తెలిసింది. చేసిన అప్పు తిరిగి ఇవ్వలేదని అందరినీ ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఉదంతంపై సంబంధిత అధికారులు ‘మమ’ అనిపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి నగర పరిధిలో వివాదాస్పద భూముల విషయంలో ప్రధానంగా టీడీపీ, జనసేనకు చెందిన ఐదుగురు వ్యక్తులు రంగంలోకి దిగారు. విలువైన స్థలాను ఆక్రమించుకుని పాగా వేస్తున్నారు. అందులో భాగంగా దామినేడు, తిమ్మినాయుడుపాళెం, తిరుపతి అర్బన్ పరిధిలోని దూరదర్శనం కేంద్రం ముందు వెనుక ఉన్న ఫుట్పాత్, ఆర్టీసీ బస్టాప్కు కేటాయించిన రూ.కోట్లు విలువైన స్థలాలను కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఈ ఆక్రమణలపై రెండు రోజుల క్రితం సాక్షిలో ‘భూ చోళ్లు’ అనే శీర్షికతో వెలుగులోకి తీసుకువచ్చినా అధికారుల నుంచి స్పందన లేదు. రేణిగుంట మండలం కుర్రకాల్వ వద్ద రియల్ వెంచర్ వేస్తున్న అక్రమార్కులుసాక్షి ప్రతినిధి, తిరుపతి : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి గూండాల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మధ్యస్తం పేరుతో వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించుకుంటున్నారు. మద్యం దుకాణాల్లో దందాలు, వ్యాపారుల కిడ్నాప్లతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంపై జనం మండిపడుతున్నా రు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయా పార్టీల నేతలు అన్ని వర్గాల వారిని వేధిస్తున్నారు. మద్యం డీలర్లతో ఒప్పందం? చిత్తూరు నియోజక వర్గ పరిధిలోని షాడో ఎమ్మెల్యే పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రధానంగా మద్యం దుకాణాల యజమానులను తన కనుసన్నల్లోకి తెచ్చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం డీలర్లతో కూడా ఇప్పటికే ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. డిమాండ్ లేని బ్రాండ్లను అమ్మిస్తామని భరోసా ఇచ్చి కమీషన్ కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఒక పర్యాయం మద్యం డీలర్లతో చర్చలు సాగించినట్లు వైన్షాపు యజమానులు ఆరోపిస్తున్నారు. అమ్ముడుపోని బ్రాండ్లను తమకు అంటగట్టి వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జగన్మోహన్ పేరు చెప్పి సదరు షాడో ఎమ్మెల్యే బెదిరింపులకు దిగుతున్నట్లు వాపోతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించడపోవడంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మద్యం డీలర్ల నుంచి కమీషన్లు రాబట్టుకునేందుకు షాడో ఎమ్మెల్యే మరో పర్యాయం సమావేశం కాన్నుట్లు సమాచారం. – 8లో– 8లోన్యూస్రీల్ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ రేణిగుంట మండలం కుర్రకాల్వ పరిధిలో సర్వే నంబర్ 18/1బి 4.21 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.కోట్లలో ఉంది. ఈ భూమికి పై భాగంలో చెరువు నిండితే కలుజు ద్వారా నీరు కిందికి ప్రవహిస్తుంది. రేణిగుంట–పాపానాయుడుపేట మార్గంలోని ఈ విలువైన భూమిపై టీడీపీ నేతల కన్నుపడింది. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి పేరు చెప్పి ఏర్పేడు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి సహకారంతో ఈ భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. స్థానికులు అడ్డుకుంటే.. ఈ భూమిని 20 ఏళ్ల క్రితమే తాము కొనుగోలు చేసుకున్నామని, ఫ్రీహోల్డ్లో రిజిస్ట్రేషన్ కూడా అయ్యిందని సదరు కబ్జాదారులు ఎదురు దాడికి దిగారు. దీనిపై స్థానికులు వెంటనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే తిరుపతి అర్బన్ మండలం అక్కారాంపల్లె సర్వే నంబర్ 112/11లో 273 అంకణాల ప్రభుత్వ భూమిని జనసేన నేతలు ఆక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. సుబ్బారెడ్డి నగర్లో నివాసాలకు మధ్యలో ఉన్న రూ.కోట్లు విలువైన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
కార్మికుల భద్రతకు ప్రాధాన్యం
తిరుపతి అర్బన్ : పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదకరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీల్లో కార్మికులకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే నష్ట నివారణకు అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ శాఖలు సమష్టిగా కృషి చేయాలని వెల్లడించారు.డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ రావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ రమణయ్య, శ్రీ కాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. హైవే పనులు వేగవంతం మల్లవరం–నాయుడుపేట మార్గంలో పెండింగ్లో ఉన్న హైవే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జేసీ శుభం బన్సల్తో కలసి అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్చువల్గా చైన్నెకి చెందిన జాతీయ రహదారి పీడీ రవీంద్రరాపు హాజరయ్యారు. ఇరిగేషన్ శాఖ ఈఈ వెంకటేశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంపై సమీక్ష వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. భూసారం పెంచేందుకు కొత్తగా వచ్చిన 30రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 2025–26కు సంబంధించి జిల్లాలో 40వేల ఎకరాల్లో ఆ విత్తనాలను చల్లించాలని సూచించారు. అలాగే మత్స్యకారులకు రాయితీపై బోట్లు ఇప్పించాలని కోరారు. సముద్రంలో నాచు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రొయ్యల చెరువుల అభివృద్ధికి ఉపాధి నిధులు వాడుకోవాలని కోరారు. ఉద్యానశాఖ అధికారులు వ్యాపార పంటలను ప్రోత్సహించాలని చెప్పారు.పశుసంవర్థక శాఖ అధికారులు పాడి రైతులకు పశుగ్రాసాలపై అవగాహన కల్పించాలని వెల్లడించారు. వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు, ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి, మత్స్యశాఖ అధికారి నాగరాజు, పశుసంవర్థకశాఖ అధికారి రవికుమార్, ప్రకృతి వ్యవసాయ అధికారి షణ్ముగం పాల్గొన్నారు. టూరిజంపై ప్రత్యేక దృష్టి జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా కల్యాణి డ్యామ్, చంద్రగిరి కోటతోపాటు ముఖ్యమైన ప్రాంతాలను ఎంపిక చేసి టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. టూరిజం అధికారులు రమణప్రసాద్, జనార్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణపై అవగాహన
ఏర్పేడు(రేణిగుంట):ఏర్పేడు మండలం ఎండీ పుత్తూరులో ధాన్యం సేకరణపై రైతులకు బుధవా రం అవగాహన కల్పించారు. సివిల్ సప్లయ్ డీఎం పద్మావతి మాట్లాడుతూ ధాన్యంలో తేమ శాతం 17 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలన్నారు. చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసి రైతు సేవా కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. పీఏసీఎస్లో రైస్మిల్ అసైన్ చేయించుకుని ధాన్యం అప్పగించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1,740 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాకు నగదు జమ చేస్తామని వెల్లడించారు. దీనిపై సర్పంచ్ కందాటి మోహనప్రియ మాట్లాడుతూ గత ఏడాది బస్తాకు రూ.2,300 వరకు చెల్లించారని, ఇప్పుడు ఇస్తున్న రేటులో రైతులు నష్టపోతారని తెలిపారు. ఈ క్రమంలో ధర పెంచి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ షణ్ముగం, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ టి.భారతి పాల్గొన్నారు. నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి తిరుచానూరు జెడ్పీ హైస్కూల్లో జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం) ప్రక్రియ ప్రారంభమవుతుందని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాకు 1.85లక్షల జవాబు పత్రాలను మూల్యాంకన నిమిత్తం కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీకి ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం తుది సవరణలు, డేటా ఎంట్రీ, వెరిఫికేషన్ ఉంటాయని వివరించారు. ఈ నెల 20– 25వ తేదీల మధ్య ఫలితాలు వెల్లడించే అవకాశమున్నట్లు తెలిపారు. మూల్యాంకన పర్యవేక్షణకు ఇద్దరు చీఫ్ కోడింగ్ ఆఫీసర్లు, 130మంది చీఫ్ ఎగ్జామినర్లు, 775మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 260మంది స్పెషల్ అసిస్టెంట్లు, 10మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు.ఒక్కో ఎగ్జామినర్ రోజుకు 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు వెల్లడించారు. -
టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా?
● చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భూమన తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో తిరుమల పవిత్రతను మంటగలిపేశారని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తిరు పతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీటీడీని ప్రక్షాళన చేస్తా మని, శ్రీవారి వైభవాన్ని మరింత పెంచుతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారని ఆరోపించారు. అదన పు ఈఓ వెంకయ్యచౌదరి అధికారిలా కాకుండా చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తూ మంత్రి లోకేష్ పీఏ సాంబశివరావు సిఫార్సు చేసే లెటర్లతో వీఐపీ దర్శనా ల దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం రోజుకు 4వేలు మాత్రమే వీఐపీ దర్శనాలు కల్పించి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని గుర్తుచేశారు. ఇప్పుడు సామాన్య భక్తులను గాలికి వదిలేసి వీఐపీల సేవలో టీటీడీ అధికారులు మునిగితేలుతున్నారని విమర్శించారు. తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూలో ఆవు కొవ్వు కలిపారంటూ దుష్ప్రాచారం చేయడం, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో ఆరుగురు మృతి చెందడం, శ్రీవారి ఆలయం ఎదుట బిర్యానీ, గుడ్లు తెచ్చుకుని తినడం, విచ్చలవిడిగా మద్యం, మత్తు పదార్థాలు గంజాయి వినియోగించడం, తిరుమలలో నాలుగుసార్లు ఎర్రచందనం పట్టుబడడం, పవిత్రమైన పాపనాశనం జలాల్లో బోటింగ్ పెట్టడం వంటి అనేక పాపాలకు చంద్రబాబే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల గుండెల్లో జగనన్న సంక్షేమ పథకాల ద్వారా రూ. 3లక్షల కోట్లు అందించి పేదల గుండెల్లో స్థిరంగా నిలిచిపోయిన నాయకుడు జగనన్న అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత ఒక్క పేదవాడికీ మేలు చేయని ప్రజాద్రోహి చంద్రబాబు అని ఆరోపించారు. తిరుమల పవిత్రత మంటగలుస్తున్నా, పేదలకు సంక్షేమ పథకాలు అందక అలమటిస్తున్నా తనకేమీ పట్టనట్లుగా సనాతన ధర్మ పరిరక్షకుడు పవనానందస్వామి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూటమి అరాచకపాలనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. -
పాలిటెక్నిక్ విద్యతో ఉన్నత భవిత
తిరుపతి ఎడ్యుకేషన్ : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సు చేస్తే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందని తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి అన్నారు. బుధవారం ఆ విద్యాసంస్థలో నిర్వహించిన పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ నమూనా పరీక్ష, అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. ఆయన మాట్లాడుతూ, పాలిటెక్నిక్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, మైనింగ్, కెమికల్, బయోమెడికల్, మెటలర్జి, త్రీడి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, పెట్రోలియం, టెక్స్టైల్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఇండస్రీ ఇంటిగ్రేటెడ్), మెకానికల్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. పాలిటెక్నిక్ విద్యార్హతతో ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఇంజినీరింగ్, ఆర్అండ్బీ, రైల్వే, బెల్, బీఎస్ఎన్ఎల్, ఆర్టీసీ, విద్యుత్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోను, అలాగే కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, వీటిలో డిప్లొమో చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారని, దీనికి దరఖాస్తు చేసుకోవడానికి 15వ తేదీ ఆఖరు అని, అలాగే ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష ఈ నెల 25వ తేదీ ఉంటుందని, దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 6వ తేదీ ఆఖరు అని తెలిపారు. గత 35ఏళ్లుగా సైనిక్, నవోదయ, పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ వంటి పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నట్టు చెప్పారు. ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. సదస్సులో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాలిసెట్, ఏపీఆర్జేసీ అవగాహన సదస్సుకు స్పందన -
న్యాయం చేయాలని వినతి
తిరుపతి అర్బన్ :ఎస్వీయూ కో–ఆపరేటివ్ స్టోర్, ఎల్పీజీ గ్యాస్ సెంటర్లో నాలుగు ఏళ్ల నుంచి పనిచేస్తున్నామని, అకారణంగా అధికారులు తొలగించారని, తమకు న్యాయం చేయాలని టర్మినేట్ అయిన ఉద్యోగులు కోరారు. బుధవారం ఈ మేరకు కలెక్టర్కు విన్నతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా సహకార శాఖ అధికారులు తమను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తమతో చెప్పినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తొలగింపునకు గురైన ఉద్యోగులు లక్ష్మీదేవి, స్రవంతి, సాగర్, గురవారెడ్డి, సుబ్రమణ్యం, సత్యవేలు, సయ్యద్బాషా, మునెయ్య, వెంకటేష్, తులసీప్రియ, నాగరాజు, రాజమోహన్, లోకేష్రెడ్డి, పరంధామ, జగదీష్, మహేష్రెడ్డి పాల్గొన్నారు. కొండను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు చంద్రగిరి : తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిపై భాకరపేట కనుమలో బుధవారం ఆర్టీసీ బస్సు కొండను ఢీకొంది. చోటు చేసుకుంది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ముప్పు తప్పింది. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో గమ్యానికి చేర్చారు. ‘వక్ఫ్’ బిల్లుపై ఆందోళనతిరుపతి మంగళం :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్బోర్డ్ బిల్లుపై వైఎస్సార్సీపీ ముస్లిం నేతలు ఆందోళనకు దిగారు. బుధవారం ఈ మేరకు పద్మావతిపురంలో వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ జోనల్ విభాగం అధ్యక్షుడు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి మాట్లాడుతూ ముస్లింల భూములను కొట్టేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలతో వక్ఫ్బోర్డ్ బిల్లును ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఇతర కుల మతాలకు కూడా అన్యాయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనకాడవని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి మాత్రం వక్ఫ్బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిలకు మద్దతు తెలపడం అభినందనీయమన్నారు. కూటమి పాలనలో ముస్లింలకు చీకటి రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు ఖాదర్బాషా, షేక్ ఇమ్రాన్, గఫూర్, హాజీ షేక్ ఫరీతాప్, షేక్ సలీమ్, ఎస్కే కలీమ్, ఎస్.అమీర్బాషా పాల్గొన్నారు. -
స్లాట్ రిజిస్ట్రేషన్
● రేపటి నుంచే బుకింగ్ విధానం అమలుతిరుపతి అర్బన్ : ఆస్తుల క్రయవిక్రయాలకు ప్రభుత్వం నూతన విధానం ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్కు సంబంధించి స్లాట్ బుకింగ్కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శుక్రవారం నుంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా తిరుపతిలో తొలి రోజు ఈ విధానం అమలు చేయనున్నారు. ఇందుకోసం ఓ సీనియర్ అసిస్టెంట్ను ఏర్పాటు చేశారు. తిరుపతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఓ కౌంటర్ను ఏర్పాటు చేయనున్నారు. తర్వాత వరుసగా జిల్లాలోని 15సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను ఇదే పద్ధతిని అమలు చేయనున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ నీరజ నేతృత్వంలో ఏర్పాట్లు చేపట్టారు. పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య స్లాట్స్ను బుక్ చేసుకోవచ్చు. అనంతరం నిర్దేశించిన సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా గంటకు ఆరు రిజిస్ట్రేషన్లకు వీలుగా స్లాట్స్ కేటాయించనున్నారు. ఒక సబ్ రిజిస్టార్ ఉన్న కార్యాలయంలో గరిష్టంగా 39 స్లాట్స్, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నచోట గరిష్టంగా 78 స్లాట్స్ను రోజుకు అందించనున్నారు.క్రయవిక్రయదారులు పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా అధికారిక వెబ్సైట్గా ఉన్న రిజిస్ట్రేషన్.ఏపీ.జీవోవీ.ఇన్ లోని స్టాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. తిరుపతిలో అదనపు సమాచారం కోసం హెల్ప్ డెస్క్ నంబర్ 9885378880 ఏర్పాటు చేశారు. బుకింగ్కే తొలి ప్రాధాన్యత ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబందించి కచ్చితంగా స్లాట్స్ బుకింగ్ చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఈ మేరకు జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ముందుగా తిరుపతిలో ప్రారంభిస్తున్నాం. తర్వాత జిల్లాలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మొదలుపెడతాం. సాయంత్రం 5.30 తర్వాతే స్లాట్ బుకింగ్ చేయని వారికి రిజిస్ట్రేషను చేయాల్సి ఉంటుంది. – శ్రీరామకుమార్, జిల్లా రిజిస్ట్రార్, తిరుపతి -
భగవంతుని సేవకు చేరువ చేసేది ఆగమశాస్త్రమే!
తిరుపతి సిటీ: అర్చకులను భగవంతుని సేవకు చేరువ చేసేది ఆగమశాస్త్రమేనని ఎన్ఎస్యూ ప్రొఫెసర్ సీ.రంగనాథన్ అన్నారు. ఎస్వీ వేదిక్ వర్సిటీలో 21 రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సిద్ధాంత కార్యశాల బుధవారం ముగిసింది. ముఖ్యఅతిథిగా రంగరాథన్ మాట్లాడారు. ఆగమశాస్త్రంలోని రహస్యాలను తెలుసుకోవాలంటే వర్క్షాపులు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. దైవారాధన క్రియలలో లోతైన జ్ఞానాన్ని పొందడం వల్ల లోకానికి మంచి జరుగుతుందన్నారు. శ్రీకాళహస్తి ప్రధాన అర్చకులు పరశురామ గురుకుల్ శివ అద్వైతం, అర్చన ప్రక్రియలో సిద్ధాంత స్వరూపం గురించి వివరించారు. అనంతరం వీసీ రాణి సదాశివమూర్తి వర్క్షాపు ప్రాధాన్యతను తెలియజేశారు. రిజిస్ట్రార్ భాస్కరుడు, డీన్ రాజేష్కుమార్, సహ సంచాలకులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ భరత్ శేఖరాచార్యులు, డాక్టర్ కార్తికేయన్, డాక్టర్ టీ.బ్రహ్మాచార్యులు, అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ఉబర్’ సమస్యల పరిష్కారానికి వినతి
తిరుపతి మంగళం : ఉబర్ సంస్థ కారణంగా తలెత్తిన సమస్యలు పరిష్కరించాలని వాహన యజమానులు కోరారు. బుధవారం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఉబర్ వాహన యజమానులతో డీటీడీఓ మురళీమోహన్ సమావేశం నిర్వహించారు. ప్రయాణ చార్జీలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని విన్నవించారు. తిరుపతి రైల్వే స్టేషన్, విమానాశ్రయంలో పార్కింగ్ ఇబ్బందులను తొలగించాలన్నాఉ. ఉబర్ సంస్థ వైఖరికి నిరసనగా సమ్మె చేస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీటీఓ మాట్లాడుతూ ఉబర్ వాహన యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంవీఐ సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, మోహన్ కుమార్, పరిపాలనాధికారి విజయ ప్రశాంతి, సీనియర్ సహాయకుడు చరణ్ చక్రవర్తి పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
పుత్తూరు: స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, ఈఎస్ టాస్క్ఫోర్స్ సంయుక్తంగా బుధవారం చేసిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిచ వారి వద్ద నుంచి రూ.9,600 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ బి.మురళీమోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వడమాలపేట గ్రామంలోని గుంటకట్టవీధిలో నివాసమున్న వల్లెమ్మ(45) ఇంట్లో దాడి చేయగా ఇంట్లో 700 గ్రాముల గంజాయి దాచి ఉండగా గుర్తించి, దానితోపాటు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వల్లెమ్మ(45), ఆమె కుమారుడు ఢిల్లీప్రసాద్(27)ను అరెస్టు చేశారు. వల్లెమ్మ గతంలోనూ గంజాయి కేసులో పట్టుబడి, ఏడాది జైలుశిక్ష అనుభవించి విడుదలైంది. ఈమైపె నిఘా ఉంచడంతో మళ్లీ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారంతో దాడి చేసి అరెస్టు చేశారు. దాడుల్లో సీఐ మురళీమోహన్, ఎస్ఐలు శివప్రసాద్, స్వామినాధన్, సిబ్బంది రవి, చంద్రశేఖర్, మునిరెడ్డి, డేవిడ్, చిరంజీవి, మోహతాజ్, హారతిలు పాల్గొన్నారు. -
సెప్టిక్ ట్యాంక్లో పడి కార్మికుడి మృతి
సూళ్లూరుపేట : పట్టణంలోని కస్వారెడ్డిపాళెం కాలనీ (కేఆర్పీ కాలనీ)లో బుధవారం సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తూ అందులో పడి ఎద్దల నాగరాజు (41) అనే కార్మికుడు మృతి చెందాడు. వివరాలు.. నాగరాజు సుమారు 15 ఏళ్లుగా షార్లో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. తహసీల్దార్ నరసింహారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీసి షార్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఫిర్యాదు అందినట్లు ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు.‘భవిత’ విద్యార్థికి కలెక్టర్ చేయూతతిరుపతి అర్బన్ : తిరుపతిలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల పరిధిలోని భవిత కేంద్రం విద్యార్థి వడ్లమూడి రమేష్కు కలెక్టర్ వెంకటేశ్వర్ చేయూతనందించారు. బుధవారం ఈ మేరకు రూ.50వేలు విలువైన బ్యాటరీ మోటార్ సైకిల్ను సొంత నిధులతో కొనుగోలు చేసి అప్పగించారు. కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్, డీఈఓ కేవీఎన్ కుమార్, భవిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.17 మందికి జరిమానాతిరుపతి లీగల్: మద్యం తాగి తిరుపతిలో వాహనాలు నడుపుతున్న కేసుల్లో 17 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పినట్టు కోర్టు సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి ట్రాఫిక్ పోలీసులు నగరంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారని కోర్టు కానిస్టేబుల్ గిరిబాబు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి జరిమానా విధించినట్లు వివరించారు.రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు ఇంటర్వ్యూతిరుపతి తుడా : స్విమ్స్ వర్సిటీ న్యూరాలజీ విభాగంలో రీసెర్చ్ అసోసియేట్గా ఆరునెలల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క పోస్టు మాత్రమే ఉందని, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 9వ తేదీన స్విమ్స్ పాత డైరెక్టర్ కార్యాలయంలోని కమిటీ హాల్లో హాజరుకావాలని కోరారు. అర్హతలు, దరఖాస్తు ఫారం కోసం స్విమ్స్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.న్యూసెన్స్ చేస్తే సహించంరేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్ ): డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, ప్రజలను ఇబ్బంది పెట్టేలా న్యూసెన్స్ చేసినా సహించే ప్రసక్తే లేదని రేణిగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని స్పష్టం చేశారు. -
పచ్చమూక చెరలో చింతగుంట చెరువు
చంద్రగిరి :ప్రకృతి సంపదను అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు. ఇన్నాళ్లు ఇసుక అక్రమ రవాణానే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న పచ్చమూక, ఇప్పుడు గ్రావెల్పై పడ్డారు. ఏకంగా చెరువులోని మట్టిని భారీ యంత్రాలతో తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వివరాలు.. చంద్రగిరి మండలం శానంబట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని చింతగుంట చెరువు పూర్తిగా పచ్చ నేతల చెరలోకి వెళ్లిపోయింది. తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లెకు చెందిన ఓ నేత, పాతకాలువకు చెందిన మరో నేత కలిసి చింతగుంట చెరువుపై పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మూడు రోజులుగా చెరువులోని మట్టిని గొల్లపల్లిలోని ఓ వెంచర్కు అక్రమంగా తరలించేస్తున్నారు. ఒక్క రాత్రికి రూ.6లక్షలు ప్రతి రోజూ రాత్రి 7.30 గంటల నుంచి గ్రావెల్ మాఫియా పడగ విప్పుతోంది. సుమారు 10 టిప్పర్ల ద్వారా ఒక్కో టిప్పర్ 10లోడ్ల చొప్పున సుమారు 100 లోడ్ల వరకు వెంచర్కు తరలిస్తున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్క రాత్రికే అధికార పార్టీ నేతలు సుమారు రూ.6లక్షల వరకు జేబులో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా టిప్పర్లకు జాతీయ రహదారి పనుల స్టిక్లర్లను ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పటినైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు గొల్లపల్లెలోని వెంచర్కు అక్రమ తరలింపు రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా రవాణా కఠిన చర్యలు తప్పవు అనుమతి లేకుండా చెరువుల్లో మట్టి తవ్వడం చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. చింతగుంట చెరువు రెండు మండలాలకు సరిహద్దుగా ఉంది. చెరువులో నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. పనులను అడ్డుకుని, వాహనాలను సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించాం. అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. – శివరామసుబ్బయ్య, తహసీల్దార్, చంద్రగిరి