breaking news
Tirupati
-
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 71,208 మంది స్వామిని దర్శించుకున్నారు. 23,135 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.84 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
కార్మికుల ఆందోళన
చంద్రబాబు పాలనలో కష్టాలు తప్పడం లేదంటూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రధానంగా జీఓ నంబర్ 23 తీసుకువచ్చి 8గంటల పనిని 12 గంటలకు పెంచారని మండిపడ్డారు. అలాగే 67 షెడ్యూల్ రంగాల కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ,అంగన్వాడీ వర్కర్లుకు గౌరవ వేతనం పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 18 నెలలు గడుస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. – ధర్నా చేస్తున్న కార్మిక సంఘాలు -
ఈఎస్ఐ స్థలం పరిరక్షణకు డిమాండ్
తిరుపతి తుడా : తిరుపతి రాయలచెరువు రోడ్డు సమీపంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి చెందిన స్థలాన్ని కబ్జాదారుల నుంచి పరిరక్షించాలని వైద్యులు, సిబ్బంది డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ఆక్రమణకు గురైన స్థలం వద్ద నిరసన తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ శ్యామ్బాబు మాట్లాడుతూ ఆస్పత్రి ముఖ ద్వారంలో మరో గేటు నిర్మాణానికి చర్యలు చేపట్టిన తరుణంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలం తమదంటూ అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. ఈఎస్ఐ ఆస్పత్రికి గతంలో సర్వే నంబర్ 246/6, 246/7లో 6.45 ఎకరాలు కేటాయించారని, ప్రస్తుతం ఈ స్థలంలో కార్మిక శాఖ పరిధిలో 100 పడకల ఆస్పత్రి ఉందని వివరించారు. రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాలోని లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి స్థలం కబ్జా కాకుండా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. -
శ్రీసిటీ పరిశ్రమల సామాజిక బాధ్యత
శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీలోని ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చార్ట్–వీఆర్వీ పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు వెచ్చించాయి. సోమవారం ఈ మేరకు సత్యవేడులో రూ. 46 లక్షల వ్యయంతో బీసీ బాలుర కళాశాల హాస్టల్ భవనాన్ని ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా పరిశ్రమ ఎండీ హాజీయే కజోకా, శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్ఆర్) నిరీషా సన్నారెడ్డి ప్రారంభించారు. నూతన భవనంతో విద్యార్థులకు మెరుగైన వసతి కలిగిందని శ్రీకాళహస్తి డివిజన్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి మునీంద్రయ్య తెలిపారు. అలాగే చార్ట్– వీఆర్వీ పరిశ్రమ రూ.12 లక్షలు వెచ్చించి వానెల్లూరులో నిర్మించి నూతన అంగన్వాడీ భవనం, వంటగదిని సంస్థ డైరెక్టర్ (హెచ్ఆర్) యామినీ సిన్హా, తయారీ విభాగం హెడ్ ప్రసంజిత్ ప్రారంభించారు. సీడీపీఓ దేవకుమారి సదరు పరిశ్రమ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ డీజీఎం వెంకటేష్, సీఎస్ఆర్ కమిటీ సభ్యులు మల్లీశ్వరన్, పృథ్వీ, మహేష్, ప్రసాద్, హాస్టల్ వార్డెన్లు గంగాప్రసాద్, ఎస్. రామయ్య, అంగన్వాడీ కార్యకర్త నాగమ్మ పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన మద్యం మత్తు
– చెరువులో పడి జార్ఖండ్ వాసి మృతి పాకాల : అతి మద్యం తాగి మత్తులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది. వివరాలు.. జార్ఖండ్ రాష్ట్రం, జనతాడ జిల్లా, కమోడి గ్రామానికి చెందిన మాణిక్ బోరి(40) దామలచెరువు సమీపంలోని ఇటుకల బట్టీలో తన బంధువులతో కలిసి పని చేసేవాడు. శనివారం ఇటుకల బట్టీ యజమాని లెక్కలు చూసి మాణిక్కు రావలసిన డబ్బు అందజేశాడు. అదే రోజు రాత్రి దామలచెరువు మ్యాంగోనగర్ గేటులో వద్ద దుకాణంలో మద్యం కొనుగోలు చేసిన మాణిక్ లింగం చెరువు పక్కన బంధువులతో తాగాడు. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోగా మాణిక్ మరికొంత మద్యం తాగి వస్తానని ఉండిపోయాడు. ఈ క్రమంలో సోమవారం మాణిక్ మృతదేహం చెరువులో తేలింది. మద్యం మత్తులోనే చెరువులో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని తిరుపతి రుయాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వసతిలేని ప్రవేశం వద్దు!
తిరుపతి సిటీ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్ల్యూ, ఎస్వీ ఆర్ట్స్, ఎస్జీఎస్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలల్లో సోమవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లకు అనుమతినిస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ టీటీడీ అధికారులు మాత్రం స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించలేమని బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దీనిపై సోమవారం స్పాట్ అడ్మిషన్ల కోసం టీటీడీ డిగ్రీ కళాశాలలకు విచ్చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమలోని పలు జిల్లా నుంచి సుదూర ప్రాంతాల నుంచి స్పాట్ అడ్మిషన్ల కోసం ఎంతో ఆశతో వచ్చామని, కానీ ఇక్కడ అధికారులు కళాశాల సీట్లు మాత్రమే ఇస్తామని, హాస్టల్ వసతి కల్పించలేమని తేల్చి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వసతి కల్పించకపోతే తమకు కళాశాల ప్రవేశాలు అవసరం లేదని వందలాది మంది విద్యార్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు. విన్నపాలను పట్టించుకోని టీటీడీ టీటీడీ విద్యాసంస్థల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే పలు కోర్సులలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడంలో అధికారు లు విఫలమయ్యారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రిన్సిపాళ్లు పలుమార్లు టీటీడీ విద్యాశాఖకు విన్నవించారు. కానీ, ఇప్పటి వరకు హాస్టల్ సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో చాలా మంది విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి చూపడంలేదు. అలాగే కన్వీనర్ కోటాలో సైతం సీట్లు పొందిన వందలాది మంది విద్యార్థులకు హాస్టల్ సీట్లు దక్కకపోవడంతో టీసీలు తీసుకుని వెళ్లిపోయేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. టీటీడీ అధికారులు స్పందించకపోతే కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. -
అర్జీదారుల అసంతృప్తి
అలసత్వంపైఅర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి అర్బన్ : ప్రజాసమస్యల పరిష్కార వేదికపై అధికారులు అలసత్వం వహిస్తున్నారు. వివిధ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన వారికి అధికారి ముందు కూర్చుని మాట్లాడే వెసులుబాటును కూడా కల్పించడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం కలెక్టరేట్లో చేపట్టిన గ్రీవెన్స్ కార్యక్రమం 11.30 గంటలకే ఖాళీగా మారింది. కేవలం 313 అర్జీలు మాత్రమే వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్వర్, డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, శివశంకర్ నాయక్, సుధారాణి తదితరులు అర్జీలను స్వీకరించారు. చాలీచాలని వసతులు గ్రీవెన్స్కు 60 నుంచి 65 విభాగాలకు చెందిన అధికారులు హజరవుతుంటారు. అంటే వాళ్ల ఎదురుగా 60 నుంచి 65 కుర్చీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే సోమవారం మాత్రం కేవలం 15 మంది అధికారుల ముందు 15 కుర్చీలను ఏర్పాటు చేశారు. మిగిలిన అధికారుల ముందు నిలబడే సమస్యను అధికారి చెప్పాల్సి వచ్చింది. చాలీచాలని వసతులు కల్పించడంపై పలువురు అర్జీదారులు అసహనం వ్యక్తం చేశారు. గేటు వద్దే అడ్డగింత ఇటీవల కలెక్టరేట్ వద్ద వరుసగా నిరసనలు, ధర్నాలు ఎక్కువయ్యాయి. కొందరు పెట్రోల్ బాటిళ్లు తీసుకువచ్చి ఒంటిపై పోసుకున్నారు. దీంతో సోమవారం గ్రీవెన్స్కు వచ్చిన వారిని పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఎంతమంది వచ్చినా ఒకరిద్దరిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో చాలామంది కలెక్టరేట్ గేటు వద్దే నిలబడిపోయారు. గ్రీవెన్స్కు ప్రజలను లోపలికి రానివ్వకపోవడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సీఎండీ’కి 67 సమస్యలు
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ సీఎండీ’కి విశేష స్పందన లభిస్తోంది. సోమవారం తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి 67 మంది ఫోన్ చేసి తమ సమస్యలు వెల్లడించారు. స్పందించిన సీఎండీ శివశంకర్ మాట్లాడుతూ త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మూడు వారాలుగా డయల్ యువర్ సీఎండీకి వచ్చిన ఫిర్యాదులపై నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ క్రమంలోనే వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్లు: 1912, 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని సీఎండీ సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ఖాన్, కె. గురవయ్య, కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పీహెచ్ జానకిరామ్, జె.రమణా దేవి, ఎన్.శోభావాలెంటీనా, కె.ఆదిశేషయ్య, యం.మురళీకుమార్, పి.సురేంద్ర నాయుడు, జనరల్ మేనేజర్లు చక్రపాణి, రాజశేఖర్ రెడ్డి, సురేంద్ర రావు, భాస్కర్రెడ్డి, ప్రసాద్, వెంకటరాజు, విజయన్ పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 75,004 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,900 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. పల్లెల్లో ఏనుగుల భయం భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలంలోని అటవీ సమీప పల్లెల్లో ఏనుగుల భయంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రెండు మూడు రోజులుగా గజరాజులు భాకరాపేట పరిసరాల్లో సంచరిస్తుండడంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో టమాట, మామిడి, అరటి, వరి పంటలన నాశనం చేసేడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏనుగుల ఘీంకారలతో గ్రామస్తులు వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను దారి మళ్లించాలని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని సూచిస్తున్నారు. చీటీ డబ్బులు కట్టలేదని దూషణ – వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలువాయి(సైదాపురం): చీటి డబ్బులు కట్టలేదని అసభ్యకర పదజాలంతో దూషించడంతో మనస్తాపం చెందని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లిలో జంగాలపల్లి కాలనీకి చెందిన విక్రమ్ అదే గ్రామానికి చెందిన జాతి కత్తుల చిట్టయ్య వద్ద చీటీ వేశాడు. ప్రతి నెలా కట్టాల్సిన చీటీ నగదు కట్టడం ఆలస్యం కావడంతో కత్తుల చిట్టయ్య సోమవారం విక్రమ్ ఇంటికి వెళ్లి దూషించాడు. దీంతో విక్రమ్ పురుగుల మందు తాగేశాడు. కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మద్యం విక్రేత అరెస్ట్ నాయుడుపేటటౌన్ : పట్టణంలోని బేరిపేట సెంటర్లో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న కూల్డ్రింక్ షాపు యజమాని మూనుకూరు భాస్కర్ను అరెస్టు చేసినట్లు సీఐ బాబీ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ భాస్కర్ గతంలో సింగిల్ నంబర్లు లాటరీలు నిర్వహిస్తుండడంతో కేసులు సైతం నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భాస్కర్ దుకాణంలో తనిఖీలు చేపట్టగా తమిళనాడుకు చెందని 25 సీసాల మద్యం, ఏపీకి చెందిన 38 బాటిళ్ల మద్యం పట్టుబడినట్లు వివరించారు. బేరిపేటకు చెందిన రవి అనే వ్యక్తితో కలిసి అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. సోమవారం నాయుడుపేట కోర్టులో నిందితుడిని హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. -
భవిష్యత్ రక్షణపై అవగాహన
తిరుపతి సిటీ: తిరుపతి జీవకోనలోని విశ్వం హైస్కూల్లో మహిళా పోలీస్టేషన్ ఎస్ఐ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో విద్యార్థుల భద్రత – భవిష్యత్ రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసం, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసపూరిత చర్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రమాదాలు, జాగ్రత్తలు, టీనేజ్ వయసులో ఎదురయ్యే ఆకర్షణలు, వాటిని నియంత్రించనప్పుడు వచ్చే ప్రతికూల పరిణామాలను వివరించారు. విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథ్రెడ్డి పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సుకు సమష్టి కృషి తిరుపతి రూరల్:సమాజ శ్రేయస్సు కోసం సమష్టి గా కృషి చేయాలని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త రామకృష్ణారావు సూచించారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం అడపారెడ్డిపల్లెలో ఎస్వీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులతో పాటు గ్రామస్తులు సైతం సామాజిక బాధ్యత, సేవా గుణంతో ముందడుగు వేయా లని కోరారు. ఏఓ సుబ్బారావు, ఎన్ఎస్ఎస్ అధికారి సబితా మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని కోరారు. వ్యవసాయ శాఖ ఏడీ నాగమణి పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు తిరుపతి అర్బన్ : కార్తీక సోమవారం నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం, తిరుపతిలోని కపిలతీర్థం, తలకోనలోని సిద్ధేశ్వరాలయం, నారాయణవనం, నాగలాపురం, సురుటుపల్లిలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సిద్ధలయ్య కోనకు పోటెత్తిన భక్తులు సైదాపురం : సైదాపురం సమీపంలో సిద్ధలయ్యకోనకు కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు కృష్ణయ్య అధ్వర్యంలో 5వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. -
దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రామాణికం
తిరుపతి తుడా : గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రామాణికం కావాలని మేయర్ శిరీషకు రాయలసీమ మేధావుల ఫోరమ్ విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ను ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి, ఫోరం సమన్వయకర్త పురుషోత్తమరెడ్డి కలసి పలు అంశాలను వివరించారు. రాయలసీమ ప్రాంతంలో హైదరాబాద్, విశాఖ తరహా మహానగరానికి అవకాశం తిరుపతికి ఉందని, అధికార, ప్రతిపక్ష పార్టీలు గ్రేటర్ విషయంలో ఏకాభిప్రాయానికి రావడం మంచి పరిణామమన్నారు. ప్రణాళికాబద్ధంగా నగరాల రూపకల్పన , విస్తరణ జరగకపోతే భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. నీటి వనరుల సరఫరా, భూమి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల కల్పన, విస్తరణ, అభివృద్ధిలో ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ తిరుపతి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రస్తుత నగర సరిహద్దుల నుంచి 4 వైపులా విస్తరణ చేపట్టాలన్నారు. చంద్రగిరి కల్యాణి డ్యామ్, రాయలచెరువు, అంజేరమ్మ కణం, ఐఐటి వరకు మహానగర సరిహద్దులు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధిలో టీటీడీ, శ్రీవారి భక్తుల రాకపోకలు ప్రధానంగా ఉంటాయని, దీనికి అనుగుణంగా నగర విస్తరణ జరగాలని సూచించారు. అందులో భాగంగా బస్టాండ్ సముదాయం, రైల్వేస్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు, టీటీడీ సత్రాలను నగరానికి నాలుగు వైపులా నిర్మించాలని కోరారు. -
నేడు టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం
తిరుమల : టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం మంగళవారం స్థానిక అన్నమయ్య భవనంలో నిర్వహించనున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సభ్యులు హాజరై వివిధ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీపై చర్చించనున్నుట్ల తెలిసింది. పదిరోజులకు ఏవిధంగా టికెట్లు, టోకెన్లు జారీచేయాలనే విషయంపై స్పష్టత ఇవ్వనున్నారు. తీరంలో అలజడి వాకాడు : అల్పపీడనం నేపథ్యంలో సముద్రం తీరం అల్లకల్లోలంగా మారింది. భీకర శబ్దాలతో అలలు 10 మీటర్ల ఎత్తున ఉప్పొంగుతున్నాయి. ఉష్ణోగ్రతలు సైతం భారీగా తగ్గిపోయాయి. చలితీవ్రత ఒక్కసారిగా పెరగిపోయింది. కార్తీక మాసంలో సముద్రస్నానానికి వచ్చిన భక్తులు తీరంలో అలజడిని గమనించి వెనుదిరిగారు. -
మైనర్ బాలికపై ఇద్దరు లైంగిక దాడి
తిరుపతి క్రైమ్: తిరుపతిలో మైనర్ బాలిక (12)పై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఈస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ బాలికకు ఇన్స్టాగ్రామ్ లో పీలేరుకు చెందిన బాలు(20), గుణ(26) పరిచయమయ్యారు. వీరు బాలికకు మాయమాటలు చెప్పి ఈ నెల 9న పీలేరుకు పిలిపించుకున్నారు. అక్కడ ఓరోజు ఉండి తిరిగి పీలేరు నుంచి తిరుపతిలోని విద్యానగర్కు వచ్చారు.అక్కడ వారికి తెలిసిన ఓ మహిళ వద్దకు తీసుకువెళ్లి తమ బంధువు అని బాలికను పరిచయం చేశారు. 9న బాలిక అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక తిరుపతిలో ఉందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వెంటనే గుర్తించి వారి నుంచి బాలికను తీసుకువచ్చేశారు. బాలిక వచ్చిన అనంతరం ఆమెను పోలీసులు విచారించగా..తనపై ఇద్దరూ లైంగిక దాడి చేసినట్లు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసి ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. -
అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
సాక్షి,తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6.30 గంటలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9.15 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు.టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, కంకణ భట్టార్ పి. శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబు స్వామి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈవో శ్రీ శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, సోమవారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు. ఇదిలా ఉండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. -
తిరుమల రెండో ఘాట్లో ప్రమాదం
తిరుమల : తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్లో ఆదివారం ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. తమిళనాడుకు చెందిన భక్తులు కారులో అలిపిరి తనిఖీ కేంద్రం దాటిన తర్వాత మితిమీరిన వేగంతో వెళుతూ పిట్ట గోడను ఢీకొన్నారు. ప్రమాదంలో కారు బోల్తా కొట్టింది. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలె న్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అకడమిక్ కన్సల్టెంట్ల అవస్థలు – వేతనాల కోసం పడిగాపులు తిరుపతి సిటీ : ఎస్వీయూలో పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్ల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈనెల 17వ తేదీ గడుస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వర్సిటీ అధికారులను వేడుకున్నా ఈనెల వేతనం వచ్చేనెలలో చెల్లిస్తామని సమాధానం చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల ఈఎంఐలు. బ్యాంకు రుణాలు, వడ్టీలు, కుటుంబ అవసరాల కోసం ఇంట్లో నగలు తాకట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నెల కూడా ఒకటో తేదీన వేతనం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వేటు వేసినా తగ్గేదేలే..!
జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోకి అడుగు పెట్టాలంటేనే క్రయవిక్రయదారులు హడలిపోతున్నారు. అవినీతికి అలవాటు పడిన కొందరు సబ్ రిజిస్ట్రార్లతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. అంకణానికి ఇంత అని అడిగి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాసులు ముట్టజెప్పకుంటే నిబంధనల పేరుతో ఇక్కట్లకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత ఇచ్చేస్తే వివాదాస్పద భూములను సైతం ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారని విమర్శిస్తున్నారు. చివరకు సస్పెన్షన్ వేటు పడినా చలించకుండా పైరవీలు సాగించి మళ్లీ పోస్టులోకి వచ్చేస్తున్నారని వాపోతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతి జలగలు ప్రజల రక్తం పీల్చేస్తున్నాయని మండిపడుతున్నారు. తిరుపతి అర్బన్ : జిల్లాలో 17 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే తిరుమల కార్యాలయంలో కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తున్నారు. మిగిలిన 16 చోట్ల ఆస్తుల క్రయవిక్రయాలకు చెందిన రిజిస్ట్రేషన్లు చేపడుతున్నారు. వీటిలో తిరుపతి అర్బన్, రేణిగుంట, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, గూడూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు దోపిడీ కేంద్రాలు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ కాసులు ఇస్తే చాలు నిబంధనలతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే వారికీ వాటాలు ముట్టజెప్పి నోరుమూయిస్తున్నారు. దీంతో జిల్లా స్థాయి అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా దోపిడీ ప్రధానంగా తిరుపతి అర్బన్ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా దోపిడీ సాగుతున్నట్లు క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంకణానికి ఎంత ఇస్తావ్ అంటూ ముందే బేరాలు చేసుకుంటున్నారు. డాక్యుమెంట్స్ రైటర్లు చేతుల మీదుగా మాత్రమే నగదును స్వీకరిస్తున్నారు. డాక్యుమెంట్స్ అన్నీ సక్రమంగా ఉన్నప్పటికి ఏదో ఒక తప్పు చూపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా మదర్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, సర్వే రిపోర్టు, ఇంటి నంబర్, టాక్స్, డెత్ సర్టిఫికెట్, కమర్షియల్ ప్లాట్స్ అంటూ నగదును అధికంగా వసూలు చేస్తున్నారు. అడిగినంత చెల్లించిన వారికి అన్ని డాక్యుమెంట్స్ లేకున్నా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రైవేటు వ్యక్తులే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికంగా పెత్తనం చలాయిస్తున్నారు. ప్రధానంగా మ్యారేజ్ సర్టిఫికెట్స్కు రూ.2వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాస్ట్పోర్ట్ పొందేందుకు ఫ్యామిలీ మెంబర్, మ్యారేజ్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేశారు. ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా నగదు వసూలు చేస్తున్నారు. వెంటనే కావాలంటే రూ.2,500, వారం తర్వాత అయితే రూ.2వేలు అంటూ బేరాలు సాగిస్తున్నారు. అంతేకాకుండా ఓ రెగ్యులర్ ఉద్యోగి తన స్థానంలో ప్రైవేటు వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆయన ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నట్లు జోరుగా చర్చసాగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఉద్యోగులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అవినీతికి అడ్డాగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు చర్యలను పట్టించుకోరు రేణిగుంట సబ్రిజిస్ట్రార్ ఆనంద్రెడ్డి ప్రభుత్వ నిబంధనలకు విర్దుంగా రిజిస్ట్రేషన్లు చేయడంతో డీఐజీ గిరిబాబు ఇటీవల సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ ఆనంద్రెడ్డి పలుమార్లు శాఖా పరమైన చర్యలకు గురైన విషయం విధితమే. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే రేణిగుంటలో పనిచేస్తున్న ముగ్గురు సబ్రిజిస్ట్రార్లు సస్పెన్షన్కు గురికావడం జరిగింది. అయినప్పటికి సస్పెండ్ అయినవారంతా మళ్లీ సబ్రిజిస్ట్రార్లుగా పోస్టింగ్ సంపాదించుకున్నారు. దీంతో సబ్రిజిస్ట్రార్లకు సస్పెన్షన్ అంటే లెక్కలేకుండా పోయింది. తిరుపతి, శ్రీకాళహస్తిలోను ఇద్దరు సబ్రిజిస్ట్రార్లు సస్పెన్షన్కు గురైనప్పటికి మళ్లీ తిరిగి పోస్టింగ్ను సంపాదించుకోవడం గమనార్హం. -
ఈతకు వెళ్లి ఇద్దరి మృతి
రేణిగుంట : మండలంలోని మల్లిమడుగులో ఆదివారం ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాలు.. తిరుపతిలోని తాతయ్యగుంటకు చెందిన శివ(35), నరేష్(36), శేఖర్ మల్లిమడుగు రిజర్వాయర్ చూసేందుకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు శివ ముందుగా రిజర్వాయర్లోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతూ కేకలు వేశాడు. ఇది గమనించిన శివ బావ నరేష్ వెంటనే అతడిని కాపాడేందుకు మల్లిమడుగులోకి దూకాడు. ఈ క్రమంలో ఇద్దరూ మునిగిపోయారు. వారితోపాటు వెళ్లిన శేఖర్ అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పర్యవేక్షణ లోపం మల్లిమడుగు రిజర్వాయర్ సాధారణంగా వర్షాకాలం నిండుకుండలా ఉంటుంది. ఈ సమయంలో అందులోకి ఎవరూ దిగకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే పర్యవేక్షణ లోపం కారణంగా ఏటా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతికి సమీపంలోనే ఈ రిజర్వాయర్ ఉండడంతో సెలవు దినాలప్పుడు పెద్దసంఖ్యల నగరవాసులు ఇక్కడకు వస్తుంటారు. ఈ మేరకు భద్రతా చర్యలు చేపట్టడంతో అధికారులు వైఫల్యం చెందారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి కనీసం సెలవు రోజులప్పుడైనా రిజర్యాయర్ వద్ద నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
దేవుడి పేరిట దరా్జగా కబా్జ!
తిరుపతి అర్బన్ : తిరుపతి నడిబొడ్డున అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి చెందిన స్థలంలో సాక్షాత్తు ఓ రెవెన్యూ అధికారే ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టారు. ముందుగా రెండు సెంట్లు స్థలంలో చిన్నపాటి వెంకటేశ్వరస్వామి మందిరం కట్టారు. క్రమేణా ఆలయ విస్తరణ పేరుతో 5 సెంట్లు ఆక్రమించి నిర్మాణ పనులు సాగిస్తున్నారు. పైగా ఆలయం పేరు చెప్పి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. వివిధ పనుల కోసం తమ వద్దకు వచ్చేవారిని ఆలయ హుండీలో నగదు వేయాలని...విరాళం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాల మళ్లింపు అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి తూర్పు వైపున తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయం, ఉత్తరం వైపు సివిల్ సప్లయి ఆఫీస్, దక్షిణం వైపున డీఆర్డీఏ, డ్వామా కార్యాలయాలు, పడమటి వైపు యూత్ హాస్టల్ ఉన్నాయి. సమీప ప్రాంతంలో జీఎస్టీ కార్యాలయం, గ్రంథాలయం, సెరికల్చర్, మెప్మా తదితర శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం మీదుగా నిత్యం పెద్దసంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. అయితే పలు సందర్భాల్లో ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా ఆ రోడ్డును బ్లాక్ చేస్తున్నారు. సివిల్ సప్లయి ఆఫీస్ మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రోడ్డు పైభాగంగా శాశ్వతంగా రేకులతో పందిళ్లు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. ఖాళీ స్థలంపై కూటమి నేతలు చూపు? అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి ఉత్తరం వైపున సుమారుగా 50 సెంట్ల విశాలమైన ఖాళీ స్థలం ఉంది. ఇది సుమారు రూ.10 కోట్లు విలువ చేస్తుంది. ప్రస్తుతం ఆలయ నిర్మాణం చేపట్టినవారే ఈ స్థలంలో వాహన మండపం కట్టేందుకు యత్నిస్తున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు కూటమి నేతలు సైతం ఈ స్థలాన్ని ఆక్రమించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు తమ స్థలాన్ని కాపాడుకోవాల్సి ఉంది.తహసీల్దార్ కార్యాలయం ఉత్తరం వైపు ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం ప్రభుత్వ భూమిలో పేదలు చిన్నపాటి గుడిసె వేసుకుంటే ఆగమేఘాలపైన రెవెన్యూ అధికారులు వాలిపోతుంటారు. తీవ్రమైన నేరం చేసినట్లు హడావుడి చేస్తుంటారు. ఇల్లు పీకి పందిరేస్తుంటారు. బక్కజీవిని బలవంతంగా అక్కడ నుంచి నెట్టేస్తుంటారు. ఏది ఏమైనా సర్కారు స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది.. నిజమే కదా అని అనుకుంటూ ఉంటాం. అయితే ఎవరైనా పెద్దవాళ్లు అదే భూమిలో పాగా వేస్తే మాత్రం అదే అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారు. ఇక దేవుడి పేరుతో విలువైన స్థలాను కబళించినా కన్నెత్తి చూడరు. ఇదే ఇప్పుడు తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతోంది. ఆఫీస్కు చెందిన స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టినా స్పందించే వారే కరువయ్యారు. -
● అపూర్వ సమ్మేళనం
తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాల 1973–75 బ్యాచ్ విద్యార్థులు 76 మంది ఆదివారం రామానుజ సర్కిల్ వద్ద ఓ ప్రైవేటు హోటల్లో కలుసుకున్నారు. ఆత్మీయ సమ్మేళంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి విచ్చేశారు. ప్రస్తుతం 67– 68ఏళ్ల పూర్వవిద్యార్థులు 18 ఏళ్ల కుర్రాళ్లలాగా ఉత్సాహంగా ఉరకలేశారు. ఒకే మామా.. బావా అంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఫొటోలు తీసుకున్నారు. తమకు విద్యాబుద్దులు నేర్పించిన గురువుల బాగోగులను తెలుసుకున్నారు. పరస్పరం యోగక్షేమాలు విచారించుకుని మురిసిపోయారు. – తిరుపతి అర్బన్ -
గుట్టుగా మెడికల్ షాపుల ప్రారంభం
తిరుపతి తుడా : తిరుపతి రుయా ఆస్పత్రిలో అత్యవసర విభాగం వద్ద రెండు మెడికల్ షాపుల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 1988 నాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీఓను చూపించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఈ) అధికారులు అన్నపూర్ణ మెడికల్స్ సంస్థకు దొడ్డిదారిలో రెండు షాపులను కేటాయించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక భారీ మొత్తం చేతులు మారిందనే చర్చ అధికార పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది. ఓ మాజీ ప్రజాప్రతినిధి అల్లుడు బినామీలకు మంత్రి ద్వారా డీఎంఈలో పావులు కదిపి మరో నాలుగేళ్లపాటు మెడికల్ షాపులు నిర్వహించుకునేందుకు ఆదేశాలు తెచ్చుకున్నారు. రుయా అధికారుల అభిప్రాయాలకు తావు లేకుండా నేరుగా డీఎంఈ ఆర్డర్ తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఆ మెడికల్ షాపులకు సంబంధించి అద్దె ఖరారు కాకుండానే కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. మూడో కంటికి తెలియకుండా శనివారం మెడికల్ షాపుల ప్రారంభోత్సవం జరిగిపోయింది. మెడికల్ షాపులకు అద్దె నిర్ణయించాలంటూ రుయా అధికారులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు ప్రతిపాదనలు పంపారు. అక్కడ నుంచి అద్దె ఖరారు చేసి రుయాకు సదరు కాపీలను పంపించాల్సి ఉంది. ఆ ప్రకారం అద్దెను నిర్ణయించాక మెడికల్ షాపులను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే, అద్దె ఖరారు కాకుండానే షాపులను ప్రారంభించడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై రుయా అధికారులు వైద్యులు సైతం అవాక్కవుతున్నారు.రుయా అధికారులను మెడికల్ షాపుల యజమానులు కనీసం లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. మంత్రి అండ దండలతో నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉచిత మందులు హుళక్కే! ప్రభుత్వాస్పత్రులో రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు, సర్జికల్స్లను సర్కారు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. ఈ మందులు అన్ని ఉచితంగానే రోగులకు అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. ఎక్కడైనా రోగులకు అవసరమైన మందులను బయటకు రాసినట్లు తెలిస్తే వైద్యులపై కఠిన చర్యలు ఉంటాయి. మందుల కోసం రోగులను ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపకూడదనే నిబంధన ప్రస్తుతం కఠినంగా అమలవుతోంది. ఈ క్రమంలో రుయా అత్యవసర విభాగం వద్ద రెండు ప్రైవేటు మెడికల్ షాపులను ఏర్పాటు చేయడంపై వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రుయాలోకి వచ్చే రోగులు ఒక్క మెడిసిన్ కూడా బయట కొనకూడదు, అలాంటప్పుడు రుయా అత్యవసర విభాగం వద్ద రెండు ప్రైవేట్ మెడికల్ షాపులు ఎందుకంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. -
పూరిల్లు దగ్ధం
నాయుడుపేటటౌన్ : పట్టణంలోని లోతువానిగుంట కాలనీలో ఆదివారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో పూరిల్లు దగ్ధమైంది. వివరాలు.. యానాది సుబ్బమ్మ అమె భర్త పులయ్య బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం కోసం దాచి ఉందని రూ.2లక్షల నగదు, బంగారు, వెండి వస్తువులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతైనట్లు బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నిరుపేదలైన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పేకాట స్థావరంపై దాడి కోట: మండలంలోని ఊనుగుంటపాళెం అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. 9 మంది జూదరులతో పాటు రూ.65 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పవన్కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేర్వేరుచోట్ల ఎర్రచందనం పట్టివేత – నలుగురి అరెస్ట్ తిరుపతి అన్నమయ్యసర్కిల్ : జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం పరిధిలో వేర్వేరు చోట్ల 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఆర్ఎస్ఐ విష్ణువర్డన్ కుమార్ బృందం ఆదవరం బీటు పరిధిలో కూంబింగ్ చేపట్టగా సదాశివకోన వద్ద 15 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ముగ్గురు ఎర్రదొంగలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే తీర్ధాలపాలకోన వద్ద ఏఆర్ఎస్ఐ కె.మహేశ్వరనాయుడు టీమ్ చేపట్టిన కూంబింగ్లో 9 ఎర్రచందనం దుంగలతో సహా ఒక స్మగ్లర్ పట్టుబడ్డాడు. నిందితులు తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించారు. సీఐ ఖాదర్ భాషా, ఎస్ఐ రఫీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రగిరిలో లిక్విడ్ గంజాయి కలకలం
●చంద్రగిరి: తిరుపతి జిల్లా, చంద్రగిరి మండల పరిఽధిలోని రెడ్డివారిపల్లి, స్వర్ణముఖినది పరిసరాల్లో యువత లిక్విడ్ గంజాయి సేవించడం ఆదివారం కలకలం రేపింది. మండల పరిఽధిలోని రెడ్డివారిపల్లి, ఎగువరెడ్డివారిపల్లి, స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో ఇటీవల యువత లిక్విడ్ గంజాయిని సేవిస్తూ అలజడి సృష్టించారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్తున్న రైతులు గుర్తుతెలియని యువకులు లిక్విడ్ గంజాయి సేవించి, వదిలేసి వెళ్లిన బాటిళ్లను గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన ద్రవం ప్రాణాంతకమైన అత్యంత ప్రమాదకరమైన ఫైనల్ ప్రొడక్షన్ హాష్ అనే ప్రమాదకరమైన లిక్విడ్ గంజాయికి యువత బానిసలుగా మారారు. ముందుగా లిక్విడ్ గంజాయిని ఓ బాటిల్లో నింపి పొగబెట్టి, ఆపై వచ్చే ఆవిరిని పీల్చుతూ మత్తులో జోగుతున్నారు. ఇలా లిక్విడ్ గంజాయిని సేవించడం ద్వారా నరాల బలహీనత ఏర్పడడంతో పాటు అవయవాలు పూర్తిగా పాడైపోతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. రాత్రుల్లో వికృత చేష్టలు లిక్విడ్ గంజాయిని సేవించిన యువకులు రాత్రుల్లో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ నెల 1వ తేదీన రెడ్డివారిపల్లి ప్రధాన రహదారి వద్ద ఓ ఆటో డ్రైవరుపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. తాము నైట్బీట్ పోలీసులంటూ వారిని బెదిరించడంతో పాటు తీవ్రంగా దాడి చేశారు. ఆపై ఆటో డ్రైవరు వద్ద ఉన్న సెల్ఫోన్, రూ.7వేల నగదును ఎత్తుకెళ్లిపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని మందలించి వదిలేశారని తెలిసింది. అయితే ఆ యువకుడిపై గతంలో గంజాయి, హత్యాయత్నం కేసు కూడా ఉన్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల గంజాయి మత్తులో యువకులు అత్యంత వేగంగా వాహనాలను నడుపుతూ ప్రజలను భయభ్రాంతకులకు గురిచేస్తున్నారు. మునుపటిలా రాత్రుల్లో గస్తీని పటిష్టం చేయడం ద్వారా ఇలాంటి వాటిని అరికట్టవచ్చునని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
అక్రమంగా అనుమతులు
ఇసుక రవాణాకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారంటూ ఇసుక తోడేళ్లు కొన్ని పత్రాలను చూపించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి మండలంలో ఎలాంటి ఇసుక రీచ్లు లేకపోయినప్పటికీ, రెవెన్యూ అధికారులు అక్రమంగా అనుమతులు ఇవ్వడంపై మండిపడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు చూడలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు ఇసుక రవాణా చేయాలి, ఎంత కావాలి..ఏ ప్రాంతం నుంచి ఇసుకను తరలించాలి..రాత్రుల్లో ఇసుక తరలించేందుకు అనుమతి ఇస్తున్నారా..లేదా..? విషయాలపై ఎలాంటి క్లారిటీ లేకుండా అనుమతులు ఇవ్వడం ఏమింటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ శివరామసుబ్బయ్యను వివరణ కోరేందుకు యత్నించగా..ఆయన స్పందించలేదు. రెడ్డివారిపల్ల్లె సమీపంలోని స్వర్ణముఖినదిలో ఇసుక తవ్వకం -
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ’ నిర్వహించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన వినియోగదారులు 8977716661 నంబర్కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసినా, వాట్సాప్ నంబరు: 91333 31912తో చాటింగ్ ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని వివరించారు. చిల్డ్రన్ హోమ్స్లో ఉద్యోగాలకు దరఖాస్తులు తిరుపతి అర్బన్ : మిషన్ వాత్సల్య స్కీమ్లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్స్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ వసంతబాయి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్, పార్ట్టైమ్ ప్రాతిపదికన ఉద్యోగానికి తీసుకుంటామని వెల్లడించారు. ప్రధానంగా కుక్, నైట్వాస్మెన్, హౌస్ కీపర్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్స్, పీటీ, యోగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అర్హత కల్గిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా నేరుగా స్వీకరిస్తామన్నారు. సోమవారం నుంచి 24 సాయంత్రం 5.30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికై న వారికి రూ.7,944 నుంచి రూ.10 వేల వరకు వేతనం ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 30–45ఏళ్లలోపు వయసు ఉండాలని సూచించారు. కలెక్టర్ నేతృత్వంలో ఎంపిక ఉంటుందని వివరించారు. 19 నుంచి పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు తిరుపతి అర్బన్ : పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 19 నుంచి 24 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డీపీటీఓ జగదీష్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 30 మంది ప్రయాణికులు ఉంటే ఒక ప్రత్యేక బస్సును పంపుతామని చెప్పారు. మార్గం మధ్యలో కదిరి, లేపాక్షి ఆలయాలను సందర్శించుకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నృత్యం..మంత్రముగ్ధం
చంద్రగిరి: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో వారాంతపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతికి చెందిన పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో శ్రీనటరాజ అకాడమీ చిన్నారుల భరతనాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులు యగనశ్రీ, పర్ణశ్రీ, జశ్వంత్, సౌజన్య, జ్వాలిత, లలన్రాజ్, జినిషా, శ్రీనిధి తమ నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. అనంతరం ఏఓ సుధాకర్ కళాకారులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. మధురం..సంకీర్తనల గానం తిరుపతి కల్చరల్: అన్నమాచార్యుల కై వల్య సిద్ధి పొందిన బహుళ ద్వాదశి తిథి సందర్భంగా అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సా యంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనల కచేరి శ్రోతలను ఓలలాడించింది. డాక్టర్ కే. సుబ్రమణ్యం బహుళ ప్రచారంలోనున్న పలు అన్నమయ్య సంకీర్తలను సుమధురంగా గానం చేసి ఆకట్టుకున్నారు. వీరికి వయోలిన్పై జి.ఉదయ్కుమా ర్, తబలాపై జి.శోభనాద్రి, శృతి రిథమ్స్పై జి.శ్రీనివాసులు సహకారం అందించారు. -
నేరాలకు పాల్పడితే సహించం
తిరుపతి క్రైమ్ : జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, తరచూ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పోలీసు అతిథిగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదన్నారు. పీడీ యాక్టు నమోదు చేసినవారు డ్రగ్స్ విక్రయం, హత్యలు, హత్యాయత్నాలు, మహిళలపై అఘాయిత్కాలు, స్మగ్లింగ్, దోపిడీలు, రౌడీయిజం, భూకబ్జాల వంటి నేరాలకు పాల్పడ్డారని వెల్లడించారు. సమాజానికి ఇబ్బందికరంగా మారిన ఈ ఆరుగురిపై కలెక్టర్ సిపార్సు మేరకు పీడీ యాక్టు పెట్టినట్టు తెలిపారు. మరికొందరిపై కూడా త్వరలోనే పీడీ యాక్టు నమోదు చేసే అవకాశముందని చెప్పారు. ఇప్పటికై నా నేరస్తులు సన్మార్గంలోకి రావాలని సూచించారు. భూకబ్జాలకు తెగబడే వారిపై సైతం నిఘా పెట్టామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీడీ యాక్టు నమోదు చేసిన ఆరుగురు నేరగాళ్లు వివరాలు ఇలా.. -
TTD: ఫిబ్రవరి నెల దర్శన కోటా వివరాలు..
తిరుపతి: వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి దర్శన కోటా వివరాలను విడుదల చేసింది టీటీడీ ...నవంబర్ 18న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను విడుదల చేయనుంది.21న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్ల విడుదల21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల24న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల24న ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటా విడుదల24న మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల కోటా విడుదల.25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల.25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి కోటా ఆన్లైన్లో విడుదల. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 73,852 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,277 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.16 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
మరింత బలోపేతమే లక్ష్యం
తిరుపతి మంగళం:తిరుపతి నగరంలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీని మరింత బలో పేతం చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షు డు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక రైల్వే కాలనీలోని పార్టీ కార్యాలయంలో 34, 35, 44వ వార్డుల నేతలతో వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. భూమన మాట్లాడుతూ కార్యకర్తలు, ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకరంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ, అలాగే వార్డు కమిటీ నియామకాలను త్వరగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. అక్రమ కేసులకు వెనుకంజ వేయకుండా సమష్టిగా ప్రజల పక్షాన పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుందామని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షు డు మల్లం రవిచంద్రారెడ్డి, నేతలు పోలిరెడ్డి నాగిరెడ్డి, దినేష్రాయల్, అశోక్కుమార్రె డ్డి, పుల్లయ్య, నాధముని, యోగాంజనేయులు, ధీపక్,గౌతమ్,ముస్తఫా పాల్గొన్నారు. -
శ్రీసిటీకి భారీగా పెట్టుబడులు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): విశాఖ భాగస్వామ్య సదస్సు–2025లో రెండో రోజు శ్రీసిటీ భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా అయిదు కొత్త పరిశ్రమలను ప్రారంభించారు. 12 కొత్త కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మొత్తంగా రూ.31,450 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. చంద్రబాబు మాట్లాడుతూ శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక నమూనాగా అభివర్ణించారు. ప్రపంచ కనెక్టివిటీని మెరుగుపరచడానికి త్వరలో శ్రీసిటీ సమీపంలో ఎయిర్స్ట్రిప్ నిర్మిస్తామన్నారు. శ్రీసిటీ పురోగతిని ప్రశంసిస్తూ, డాక్టర్ సన్నారెడ్డి అంకితభావాన్ని అభినందించారు. సన్నారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో శ్రీసిటీని 50 దేశాలకు నిలయంగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. లారీని ఢీకొని విద్యార్థి మృతి చంద్రగిరి : లారీని వెనకనుంచి ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై నడింపల్లె వద్ద జరిగింది. వివరాలు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సమీపంలోని ఆనుకూరపల్లె దళితవాడకు చెందిన లక్ష్మీకాంత్(20) తిరుపతిలోని తన చిన్నాన్న ఇంట్లో ఉంటున్నాడు. పాకాల మండలం సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తిరుపతి నుంచి పల్సర్ బైక్పై కళాశాలకు చేరుకున్నాడు. పరీక్ష అనంతరం తిరిగి వస్తుండగా ముందు వెళుతున్న లారీ అకస్మాత్తుగా పక్కకు తిరగడంతో ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రచందనం పట్టివేత : ఇద్దరి అరెస్ట్ తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుమల పాపవినాశనం పరిధిలో శనివారం చేపట్టిన తనిఖీల్లో నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తిరుపతి రేంజ్ అటవీక్షేత్రాధికారి బి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. పట్టుబడిన దుంగల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని వెల్లడించారు. నిందితులను తమిళనాడులోని సేలానికి చెందిన అశోక్, రమేష్గా గుర్తించామని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో తిరుమల డీఆర్ఓ స్వప్నకుమారి, ఎఫ్బీఓ అఖిల్ పాల్గొన్నారు. -
ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్ : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన విజయ్ కుమార్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6లక్షల జరిమానా విధిస్తూ శనివారం తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జడ్జి నరసింహమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు 2017లో ఎర్రచందనం తరలిస్తూ టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు తుది తీర్పు దశలో ఉండగా కోర్టుకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే నిందితుడిని నాన్ బెయిలబుల్ వారెంట్పై అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచారని అప్పటి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విజయ్ కుమార్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి శిక్ష విధించారు. నగదు లెక్కింపు యంత్రాల బహూకరణ చంద్రగిరి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు శనివారం నగదు లెక్కించే యంత్రాలను బహూకరించారు. డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్కు బ్యాంకు జోనల్ మేనేజర్ పత్రి శ్రీనివాస కుమార్ అందజేశారు. ఏఈఓ దేవరాజులు, బ్యాంకు రీజనల్ మేనేజర్ సోమాచి శర్మ, మేనేజర్ ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు. అట్రాసిటీ కేసులపై సమీక్ష తిరుపతి లీగల్ : స్థానిక ఐదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో అట్రాసిటీ కేసులపై తిరుపతి ఐదో అదనపు జిల్లా జడ్జి, నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి రామ్ గోపాల్ సమీక్ష నిర్వహించారు. అట్రాసిటీ కేసుల్లో పోలీసు అధికారులు దర్యాప్తు ఎలా నిర్వహించాలి, చార్జిషీట్ ఎలా దాఖలు చేయాలి, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తునకు ప్రభుత్వం తగు బడ్జెట్ కేటాయించాలని సూచించారు. డీఎస్పీలు కేఎన్ మూర్తి, రవికుమార్, శ్యామ్సుందర్, బీవీ శ్రీనివాసులు, రవీంద్ర పాల్గొన్నారు. మెడికల్ కాలేజీకి విరాళంగా పార్థివ దేహం తిరుపతి తుడా : టీటీడీలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న కట్టమంచి కేఎల్ ఇందిర తన భర్త డాక్టర్ శివాజీ పార్థివ దేహాన్ని పద్మావతి మెడికల్ కాలేజ్ అనాటమీ విభాగానికి డొనేషన్ చేసినట్లు స్విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ డాక్టర్ శివాజీ అనేక విద్యాసంస్థలల్లో బోటనీ సీనియర్ ఫ్యాకల్టీగా సేవలందించారని వెల్లడించారు. డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్, వైధ్యాధికారులు డాక్టర్ శివాజీకి నివాళులర్పించారు. -
టీటీడీలో పరాకాష్టకు చేరిన బీఆర్ నాయుడి విద్వేషం
తిరుపతి మంగళం : చంద్రబాబు పాలనలో నియమితులైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి విద్వేషాలు పరాకాష్టకు చేరాయని, టీటీడీలో బ్రాహ్మణులపై వివక్ష రోజురోజుకూ పెచ్చుమీరుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. శనివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేదపారాయణ పండితుల నియామకాల కమిటీలో అవినీతిపరులను పరిశీలకులుగా నియమించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. యాభై ఏళ్ల క్రితం కాంచీపుర యతీంద్రులు శ్రీశ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు టీటీడీ ద్వారా ధర్మప్రచారం కొనసాగాలనే మహోపదేశం చేశారు. టీటీడీ దాన్ని ఒక దైవాజ్ఞగా స్వీకరించింది. ఆనాటి ఈవో పీవీఆర్కే ప్రసాద్, ప్రణాళిక సిద్ధం చేసిన ఉప్పలూరు గణపతి శాస్త్రి ద్వారా శ్రీకారం చుట్టుకున్న వేద పరిరక్షణ పథకం మహోన్నతమైంది. నాటి నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిష్టకు, సనాతన ధర్మ పరిరక్షణ యజ్ఞానికి ఆవు నెయ్యిగా 1,400 మందికి టీటీడీ సంభావన అందజేస్తోంది. టీటీడీ విభాగానికి వేదాధ్యయన సంస్థ అనే ప్రత్యేక ప్రాజెక్టును నెలకొల్పింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఘనాపాటీలు మరింతగా శ్రీవారి పక్షాన వేద విద్యకు వెలుగు దివ్వెలుగా ఉండాలని వారి సంఖ్యను మరింతగా పెంచారు. 700 పోస్టుల భర్తీకి మా ప్రభుత్వ హయాంలో జీవో ద్వారా టీటీడీకి అనుమతించారు. కానీ ఇటీవల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడులో బ్రాహ్మణ ద్వేషం పరాకాష్టకు చేరింది. వేద విశ్వవిద్యాలయం కులపతి.. ఆచార్య రాణీ సదాశివమూర్తిని ఒక హేయమైన పదజాలంతో దూషించడాన్ని కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని తలా పాపం తలా పిడికెడులా బోర్డు సభ్యుల ద్వారా ఆమోదింపజేసి వారి తొలగింపు ప్రతిపాదనను ప్రభుత్వానికి కూడా పంపారు. వేదాధ్యయన సంస్థ పీవోస్ శ్రీపణిగణపతిని దారుణంగా నిందించిన పాపం కూడా బీఆర్ నాయుడుదే. కేవలం ఒక్క రూపాయితో ఉద్యోగం చేస్తున్న ఆనంద తీర్థ స్వాముల వారికి మెట్లోత్సవ ప్రారంభానికి ఆహ్వానిస్తే ఆయనను అవమానపరిచిన ఘనత బీఆర్ నాయుడుదే. ఒక అర్చత శిరోమణి తనతో మాట్లాడడానికి వస్తే విషంలాగా ద్వేషపూరితమైన మాటలు మాట్లాడిన వ్యక్తి కూడా బీఆర్ నాయుడే. ఈరోజు 700 పోస్టులకు ఉన్నత వేదాధ్యయన సంస్థలో నియామక ప్రకటన ఇస్తే మీరు ఉద్దేశపూర్వకంగా వేద విధులకు సంభావన అందించే ప్రక్రియను నిలిపివేసి, నియామక ప్రక్రియను ఒకసారి వాయిదా కూడా వేశారు. ఇందుకోసం గతంలో ఉన్న అత్యంత నీతివంతులను కాదని, మీకు కావాల్సిన వారితో ఈ నియామక కమిటీని నియమించుకున్నారు. మేడసాని మోహన్ను అబ్జర్వర్గా నియమించుకున్నారు. ఆయన మహా పండితుడే కావచ్చు.. వేద పండితులను నియమించడంలో అజ్జర్వర్గా నియమించే అంతటి ఘనాపాటి ఆయన కాదు. మరో అబ్జర్వర్గా అవినీతికి పరాకాష్ట అయిన వ్యక్తిని నియమించారు. ఈ నియామకాల్లో మీ దాష్టీకాలను ప్రజలు గమనిస్తున్నారు. మీరు నన్ను కేసుల్లో ఇరికించో, లేక భయపెట్టాలని చూస్తే భయపడే రకం కాదు. మీ అవినీతి పర్వాలను నిరంతరం ఎత్తి చూపుతూనే ఉంటాను.. అని భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
చంద్రగిరి : తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని చంద్రగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఈ మేరకు డీఎస్పీ ప్రసాద్, సీఐ సురేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ధర్మవరానికి చెందిన సమ్మే రామాంజనేయులు అలియాస్ సాయిరాం అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడి జైలుక వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో కొంత కాలం క్రితం తిరుపతికి చెందిన సత్య సారథి, చాట్ల నరేంద్ర పరిచయమయ్యారు. వీరిద్దరూ స్వతహాగా డ్రైవర్లు కావడంతో, ఖాళీ సమయంలో తమ యజమానికి చెందిన స్కూటీపై గ్రామాల్లో రెక్కీ చేపట్టేవారు.అనంతరం ముగ్గురు కలసి ఎవరూ లేని ఇళ్లలోకి చొరబడి బంగారం, వెండి, ఇతర వస్తువులు అపహరించేవారు. ఈ మేరకు అక్టోబర్ 28వ తేదిన రాయలపురంలోని ఓ ఇంటికి కన్నం వేసి 3 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండిని చోరీ చేశారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కేఎంఎం కళాశాల వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. వీరి నుంచి 1,100 గ్రాముల వెండి, 50 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.10వేల నగదును రికవరీ చేశారు. కేసును ఛేదించడంతో కీలకంగా వ్యవహరించిన సీఐ సురేష్ కుమార్, ఎస్ఐలు రవీంద్ర, అనిత, మంజుల, మురళీ మోహన్తో పాటు సిబ్బందికి ఎస్పీ సుబ్బరాయుడు రివార్డులను ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. -
● కలెక్టరేట్ వద్ద బాధితుల ఆందోళన
నివాసాల తొలగింపుపై నిరసనతిరుపతి అర్బన్ : శ్రీకాళహస్తి పట్టణంలో సుమారు 40 ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇళ్లను పురపాలక అధికారులు కూల్చేస్తున్నారని మూడు కుటుంబాలకు చెందిన బాధితులు, తమ బంధుమిత్రులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. బాధితులు జె.రాజేంద్రప్రసాద్, ఆర్డీ సంజీవమ్మ, డి.షీరావతి, డి.ప్రశాంత్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. తమ ఇళ్లను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ నోటీసులు జారీ చేశారని, దీనిపై పురపాలక అధికారులను కలిస్తే రూ.లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంత మొత్తం ఇవ్వలేమన్నందుకు జేసీబీలో తమ నివాసాలను కూల్చేందుకు తెగబడ్డారని వాపోయారు. ఈ క్రమంలోనే కలెక్టర్కు తమ కష్టాలు విన్నవించేందుకు వచ్చామని తెలిపారు. అయితే ఇంతలోనే వారు పెట్రోల్ సీసాలు తీసుకుని ఆత్మహత్యే తమకు శరణ్యమని నిరసన తెలిపేందుకు యత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు హుటాహుటిన కలెక్టరేట్ వద్దకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. -
రూ.కోట్లు కొట్టేసేందుకే ప్రైవేటీకరణ
చిల్లకూరు : పేద విద్యార్థుల ఎంబీబీఎస్ కలను సాకారం చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో వైద్యకళాశాలలను నెలకొల్పితే, రూ.కోట్లు కొట్టేసేందుకే చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. శనివారం గూడూరులోని పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు జీవితంలో ప్రజలు గుర్తుంచుకునే ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదన్నారు. అన్ని రంగాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి సొమ్ము చేసుకునేందుకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నైజం తెలిసే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోటి సంతకాలకు సహకారం అందిస్తున్నారని వెల్లడించారు. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఎల్లసిరి గోపాల్రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, పలగాటి సంపత్కుమార్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టా రాధాకృష్ణారెడ్డి, గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు ఊటుకూరు యామిని, జగనన్న సేవా సమితి అధ్యక్షుడు ఊటుకూరు మహేంద్రరెడ్డి, నేతలు బత్తిన విజయకుమార్, దువ్వూరు శేషురెడ్డి, ఓడూరు బాలకృష్ణారెడ్డి, చెంచురాఘవరెడ్డి, నందవరం సుబ్బారావు పాల్గొన్నారు. -
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ కేసులో కీలక పరిణామం
సాక్షి, అనంతపురం జిల్లా: సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఏవీఎస్ఓ, ప్రస్తుత గుంతకల్లు రైల్వే పోలీస్ (జీఆర్పీ) సీఐ వై. సతీష్కుమార్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు తాడిపత్రి పోలీస్టేషన్కు గుత్తి రైల్వే పోలీసులు బదిలీ చేశారు. శరీరంపై ఉన్న గాయాలు, పోస్టుమార్టం ప్రాథమిక నివేదికపై చర్చ జరుగుతోంది. రైలు ఎక్కిన కాసేపటికే భార్యకు నాలుగుసార్లు సతీష్కుమార్ ఫోన్ చేశారు. భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డిస్ కంఫర్ట్గా ఉందంటూ వాట్సాప్ మెస్సేజ్ చేసినట్లు సమాచారం.సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు రైల్వే స్టేషన్కు వచ్చిన సతీష్ కుమార్.. రైల్వే స్టేషన్ పార్కింగ్లో తన బైక్ పార్క్ చేశారు. గుంతకల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలో సతీష్ కుమార్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్ను పోలీసులు గుర్తించారు. బైక్ పార్క్ చేసిన సతీష్కుమార్.. గుంతకల్ రైల్వేస్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన శుక్రవారం ఆయన మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. టీటీడీ పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్లో వెళుతూ ఇలా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరకామణి కేసులో విచారణకు వెళుతున్న ఆయను ఎవరైనా రైలు నుంచి తోసి హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సతీష్ కుమార్ 2023లో టీటీడీలో ఏవీఎస్ఓగా ఉన్న సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఈ ఏడాది జూలైలో జీఆర్పీ సీఐగా గుంతకల్లుకు బదిలీ అయ్యారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. గుంతకల్లుకు బదిలీపై వచి్చన తర్వాత పట్టణంలోని ఉరవకొండ రోడ్డులోని విశాల్ మార్టు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈయనకు భార్య మమత, కుమార్తె తారా (8), కుమారుడు రోహిత్(3) ఉన్నారు.పరకామణి కేసులో ఈ నెల ఆరో తేదీన తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరైన సతీష్ కుమార్.. మరోసారి హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిజాముద్దీన్–తిరుపతి (రాయలసీమ ఎక్స్ప్రెస్) రైల్లో టూ టైర్ ఏసీలో తిరుపతికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం రైల్వేట్రాక్ వద్ద ముఖం, శరీర భాగాలపై తీవ్రగాయాలతో మృతిచెందిన వ్యక్తిని గుర్తించిన రైల్వేట్రాక్ మెన్ షంషీర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరా తీయగా.. గుంతకల్లు రైల్వే రిజర్వ్డు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్గా తేలింది. దీంతో పై అధికారులకు సమాచారం చేరవేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షీమోíÙ, జిల్లా ఎస్పీ జగదీష్ , ఏఎస్పీ రోహిత్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని.. మృతికి కారణాలు, ఆధారాల కోసం విచారణ చేపట్టారు. డాగ్స్కా్వడ్, ఫొరెన్సిక్ నిపుణులతో పరిశీలించారు. గుంతకల్లు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలించారు. ఆయన ప్రయాణించిన బోగీలోని ప్రయాణికుల వివరాలనూ ఆరా తీస్తున్నారు. దీంతోపాటు సహచర ఉద్యోగులతో సతీష్ కుమార్ వ్యవహారశైలిపై విచారిస్తున్నట్లు సమాచారం. మృతికి కారణాలు విచారణలో తేలాల్సి ఉందని రైల్వే డీఎస్పీ శ్రీనివాసులు ఆచారి విలేకరులకు తెలిపారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన బ్రహ్మయ్య, చిదంబరమ్మ దంపతుల మొదటి కుమారుడు సతీష్ కుమార్. ఈయనది పేద కుటుంబం, తండ్రి మరణంతో తమ్ముడు శ్రీహరితో కలిసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కష్టపడి చదవి పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించారు. సతీష్ కుమార్ 2012 బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకున్న చివరి బ్యాచ్ వీరిదే. తొలిపోస్టింగ్ చిత్తూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా వచి్చంది. తర్వాత చాలా ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే పనిచేశారు.2012 బ్యాచ్లో రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన వారిలో కూడా సతీష్కుమార్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన బ్యాచ్మేట్స్ చాలా మంది ఇంకా ఆర్ఎస్ఐలుగానే ఉన్నారు. పరకామణి చోరీ కేసు నమోదైన సమయంలో ఈయన ఏవీఎస్ఓగా పనిచేస్తున్నారు. ఈనెల ఆరున సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మరోసారి హాజరుకావాల్సి ఉందని గుంతకల్లు నుంచి తిరుపతికి బయలుదేరారు. అంతలోనే ఇలా జరగడంపై చాలా మంది బ్యాచ్మేట్స్, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరో తేదీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత కొందరు సహచరులతో మాట్లాడుతూ తనకు మెమో ఇస్తారని, లేదా సస్పెండ్ చేస్తారని వాపోయినట్లు తెలిసింది. -
జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్గా శ్రీసిటీ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): భారత్–జపాన్ పారిశ్రామిక బంధం మరింత బలపడుతోందని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించిన 30వ సీఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో భాగంగా జరిగిన ‘భారత్–జపాన్ భాగస్వామ్యం’ సెషన్స్లో ఆయన ప్యానెలిస్ట్గా పాల్గొన్నారు. సన్నారెడ్డి మాట్లాడుతూ జపాన్ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిందన్నారు. మన దేశంలో రెండో అతిపెద్ద జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్గా శ్రీసిటీ ఎదిగిందని వెల్లడించారు. 300 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జపాన్ ఎన్క్లేవ్లో 35 కంపెనీలకు పైగా పనిచేస్తున్నాయని వివరించారు. అలాగే, శ్రీసిటీలోని జపాన్–ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ (జేఐఎం) నైపుణ్య కేంద్రం శిక్షణ ద్వారా స్థానిక యువతను జపనీస్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేస్తున్నారని వెల్లడించారు. ప్రత్యేక ఆకర్షణగా శ్రీసిటీ స్టాల్ సదస్సులో ఏర్పాటు చేసిన శ్రీసిటీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకర్షణీయ డిజిటల్ ప్రదర్శనలు, 3డీ మోడళ్లతో పలువురిని ఆకట్టుకుంది. సందర్శించిన దౌత్యవేత్తలు, మంత్రులు, పరిశ్రమల ప్రతినిధులు శ్రీసిటీ విలక్షణమైన సమగ్ర అభివృద్ధి నమూనాను ప్రశంసించారు. -
సతీష్కుమార్కు చిత్తూరు ఏఆర్తో అనుబంధం
చిత్తూరు అర్బన్: టీటీడీ పరకామణి కేసులోని కీలక అధికారి సతీష్కుమార్ మృతితో చిత్తూరు పోలీసుశాఖలో ఆర్ముడు రిజర్వు (ఏఆర్) విభాగంలోని పలువురు సీనియర్లకు మాట రావడంలేదు. అసలు సతీష్ కుమార్ చనిపోయింది వాస్తవమేనా..? అంటూ స్నేహితులకు ఫోన్లు చేసి కనుక్కుంటూ.. తీరా ఆయన మరణ వార్త తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం సతీష్ కుమార్ చిత్తూరు ఏఆర్ విభాగంలో విధుల్లోకి చేరారు. ఎస్ఐ పోస్టు సాధించిన తరువాత సతీష్కుమార్కు చిత్తూరు ఏఆర్లో తొలి పోస్టింగ్ లభించింది. దాదాపు రెండున్నరేళ్లకు పైగా ఆయన చిత్తూరులో ఆర్ఎస్ఐగా పనిచేశారు. పీఎస్ఓలకు ఇన్చార్జ్గా, స్పెషల్ పార్టీకి పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వర్తించారు. సహచరులతో ఎప్పుడూ చలాకీగా, చనువుగా ఉండడం సతీష్కుమార్ నైజం. చిత్తూరులో తొలి పోస్టింగ్ లభించడంతో ఇక్కడి పోలీసుశాఖలోని వందలాది మంది ఏఆర్ సిబ్బంది సోషల్మీడియాలో సతీష్ కుమార్ మృతికి సంతాపం ప్రకటించారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో వెట్టి చాకిరీ!
రేణిగుంట : ప్రభుత్వాస్పత్రుల్లో నర్సులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రేణిగుంట పీహెచ్సీని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి చక్రపాణిరెడ్డితో మాట్లాడారు. మహిళ స్టాప్ నర్సులకు లీవులను మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో నర్సుల కొరత ఏర్పడిందన్నారు. ఏడుగురు పనిచేయాల్సిన చోట ఇద్దరు, ముగ్గురు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి నర్సుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నర్సుల డ్యూటీ సమయాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు అమలు చేయాలని సూచించారు. -
చేయి విరిగినా.. చలించలేదు!
● చంద్రగిరిలో ప్రైవేటు పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం చంద్రగిరి : ప్రైవేటు పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి నరకయాతన అనుభవించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చంద్రగిరి– తిరుపతి రహదారిలోని అరుణ కాలనీ సమీపంలో శ్రీచైతన్య పాఠశాల ఉంది. ఆ స్కూలు విద్యార్థి మహానాయక్ బుధవారం ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డాడు. బాలుడు ఏడుస్తున్నా పాఠశాల నిర్వాహకులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు సాయంత్రం బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన స్కూలుకు వెళ్లి బాలుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థి ఎడమ చేయి విరిగిపోయినట్లుగా వైద్యులు గుర్తించి చికిత్సలందించారు. అంతటి బాధతో బాలుడు ఏడుస్తున్నప్పటికీ పాఠశాల నిర్వాహకులు చలించకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం బాలుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, శ్రీచైతన్య ఉపాధ్యాయులు బెదిరింపులకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎంఈఓ లలిత కుమారి, పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. అయితే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా, సలహాలు ఇవ్వడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్వీయూలో మళ్లీ ర్యాగింగ్
రాయలసీమకే తలమానికమైన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విష సంస్కృతి వేళ్లూనుకుంటోంది. ఇన్నేళ్లుగా నిద్రాణమైన ర్యాగింగ్ భూతం విశృంఖలంగా కోరులు చాస్తోంది. ఇటీవల సైకాలజీ విభాగంలో జరిగిన ఘటనను మరువక ముందే మళ్లీ గురువారం రాత్రి వికృత చేష్టలతో పడగ విప్పింది. ఈ పర్యాయం ఇంజినీరింగ్ హాస్టల్లోని విశ్వతేజ బ్లాక్ ర్యాగింగ్ దుశ్చర్యకు వేదికై ంది. ఇంటరాక్షన్ పేరుతో జూనియర్ విద్యార్థులను సీనియర్లు తీవ్రంగా వేధించిన ఘటన కలకలం రేపుతోంది. తిరుపతి సిటీ : ఎస్వీయూలో విధ్యార్థులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పేరుతో సీనియర్లు విరుచుకుపడుతున్నారు. ఇటు కళాశాలలో.. అటు వసతి గృహాలలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో జూనియర్లు బిక్కుబిక్కుమంటూ బతుకుతుకున్నారు. ఇంతటి దారుణాలు జరుగుతున్నప్పటికీ వర్సిటీ అధికారులు కనీసం స్పందించడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చేదు జ్ఞాపకం చెరగక ముందే.. ఎస్వీయూ సైకాలజీ విభాగంలో ఇటీవల సాక్షాత్తు ఆ విభాగాధిపతి జూనియర్లపై ర్యాగింగ్ చేయాలంటూ సీనియర్లు ప్రొత్సహించిన ఘటన వర్సిటీలో అలజడి రేపింది. దీంతో ర్యాగింగ్కు గురైన విద్యార్థినుల్లో నలుగురు ఏకంగా టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. అయినప్పటికీ వర్సిటీ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులిపేసుకున్నారు. ఈ చేదు జ్ఞాపకం నుంచి విద్యార్థులు తేరుకోక ముందే వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలల వసతి గృహంలో ర్యాగింగ్ కొనసాగింది. జూనియర్లకు టార్చర్ ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ విశ్వతేజ బ్లాక్లో ఈ ఏడాది బీటెక్ కోర్సులో అడ్మిషన్లు పొందిన జూనియర్ విద్యార్థులు గురువారం అర్ధరాత్రి నరకయాతన అనుభవించారు. ఇంటరాక్షన్ తరగతుల పేరుతో జూనియర్లను ఫార్మల్ డ్రస్సులు ధరించి రావాలని సీనియర్లు ఆదేశించారు. అనంతరం వారిని క్రమపద్దతిలో కూర్చోబెట్టి పలు రకాలు వికృత చేష్టలతో మానసికంగా వేధించారు. దీనిపై బాధితులు విద్యార్థి సంఘాలకు మొరపెట్టుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగాయి. కానీ, హాస్టల్, వర్సిటీ అధికారులు పట్టించుకోలేదని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఎస్పీ అవగాహన కల్పించినా.. ఎస్వీయూలో ర్యాగింగ్ను అరికట్టేందుకు వర్సిటీ అధికారులు రెండు రోజుల క్రితం ఎస్పీని ఆహ్వానించారు. యాంటీ ర్యాగింగ్పై శ్రీనివాసా ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ర్యాగింగ్ పర్యవసానాలు, శిక్షలు, కేసులపై విద్యార్థులకు అవగాహన కల్పించి హెచ్చరించారు. అయితే, సీనియర్లు, వారికి సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు మాత్రం వర్సిటీలో ర్యాగింగ్ ప్రక్రియను కొనసాగిస్తూ జూనియర్లకు నరకం చూపిస్తున్నారు. చర్యలు తీసుకోవాలి ఎస్వీయూలో ర్యాగింగ్ నివారణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాయలసీమ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఈ మేరకు రెక్టార్ సీహెచ్ అప్పారావుకు వినతిపత్రం సమర్పించారు. తక్షణం వర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
దీపం.. దివ్యతేజం
తిరుపతిలో టీటీడీ పరిపాలన భవన మైదానంలో శుక్రవారం రాత్రి శోభాయమానంగా కార్తీక దీపోత్సవం నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై సామూహికంగా దీపారాధన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళ ధ్వని, తిరుమల ధర్మగిరి వేద పాఠశాల ఆగమ పండితులు శ్రీరాఘవేంద్ర వేదస్వస్తి, అనంతరం దీప ప్రాశస్త్యం వివరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారికి, చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన జరిపించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. భక్తులతో దీప మంత్రం పలికిస్తూ లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ క్రమలో కళాకారులు ప్రదర్శించిన లక్ష్మీ ఆవిర్భావం నృత్య రూపకం ఆకట్టుకుంది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పఠిస్తుండగా నక్షత్ర హారతి, కుంభ హారతి నిర్వర్తించారు. – తిరుపతి అన్నమయ్యసర్కిల్ సామూహికంగా దీపారాధన చేస్తున్న భక్తులు (ఇన్సెట్) శ్రీదేవి భూదేవి సమేతశ్రీవేంకటేశ్వర స్వామి -
ఐసర్లో ‘ఇండియన్ అకాడమీ’ సదస్సు
ఏర్పేడు : శాస్త్ర, వైద్య రంగాల్లో భారతావనిని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపే పరిశోధనలు జరగాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ తెలిపారు. బెంగుళూరులో సర్ సీవీ రామన్ స్థాపించిన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 91వ వార్షిక సదస్సును శుక్రవారం ఏర్పేడు మండలం జంగాలపల్లె సమీపంలోని తిరుపతి ఐసర్ కొలీజియం(ఆడిటోరియం)లో అట్టహాసంగా ప్రారంభించారు. వరదరాజన్ మాట్లాడుతూ ఎన్హాన్సింగ్ ది స్టెబిలిటీ అండ్ ఎఫిఫియెన్సీ ఆఫ్ వైరల్ వ్యాక్సిన్స్ అనే అంశంపై పలువురు శాస్త్రవేత్తల సందేహాలను నివృత్తి చేశారు. హెచ్ఐవీ టీకాలు, ఔషధ పురోగతిని వివరించారు. కోవిడ్–19 వ్యాక్సిన్, పరిణామాలపై పలువురి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరిశోధనల స్టాల్లో సందడి సదస్సుకు వచ్చిన పలువురు విద్యార్థులు, శాస్త్రవేత్తలు సైన్స్ పరిశోధలకు సంబంధించిన పుస్తకాలను ఆసక్తిగా చదివారు. అలాగే వివిధ ఆవిష్కరణల ఫలితాలను విద్యార్థులకు వివరించారు. సదస్సులో ఏఎన్ఆర్ఎఫ్ సీఈఓ డాక్టర్ శివకుమార్ కల్యాణరామన్, బెంగళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ విజయ్ చంద్రు, ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ అమిత్కుమార్ పట్రా, తిరుపతి ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ నర్సింగరావు, ఐసర్ రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్సింగ్ కోహ్లీ, అకడమిక్ డీన్ సుదీప్తా దత్తా పాల్గొన్నారు. -
వంతెనకు తప్పని ప్రమాదం
స్వర్ణముఖిపై ఎల్ఏ సాగరం బీడీ కాలనీ, తుమ్మూరు వద్ద రైలు, వాహనాలు వెళ్లేందుకు రెండు వంతెనలు ఉన్నాయి. ఆ బ్రిడ్జిల వద్ద సైతం అక్రమార్కులు లోతుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో వంతెనల పరిస్థితి సైతం ప్రమాదంలో పడింది. ఇదే విధంగా మరికొంతకాలం వంతెనల వద్ద తవ్వకాలు సాగితే పెనుముప్పు వాటిల్లే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భీమవరం, తిమ్మాజికండ్రిగ, మూర్తి రెడ్డిపాళెం, అయ్యప్పరెడ్డి పాళెం, కల్లిపేడు, మర్లపల్లె, అన్నమేడు, వెముగుంట పాళెం తదితర ప్రాంతాల్లో కూడా ఇసుక తవ్వకాలు నిరంతరాయంగా సాగుతున్నాయని వెల్లడిస్తున్నారు. ఒకప్పుడు ఎటు చూసినా ఇసుక తిన్నెలతో కళకళలాడిన స్వర్ణముఖి నది.. ఇప్పుడు రాళ్లు తేలి దారుణంగా తయారైందని మండిపడుతున్నారు. -
పోలీస్ సహకారంతో సై‘ఖతం’!
దొరవారిసత్రం : మండలంలోని వేటగిరిపాళెంలో ఇసుకాసురులకు పోలీసులే అండగా నిలుస్తున్నారు. కూటమి నేతల అండతో కాళంగి నదిని తవ్వేస్తున్న అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. వివరాలు.. సూళ్లూరుపేట ప్రాంతానికి ఓ నేత కన్ను కాళంగి నదిపై పడింది. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను తవ్వేసి తరలించేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేటగిరిపాళెం వాసులు తమ గ్రామం మీదుగా వెళుతున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్నారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామస్తులను భయపెట్టి ట్రాక్టర్లను అక్కడ నుంచి పంపేశారు. దీనిపై ప్రశ్నించిన స్థానికులను కేసులు పెడతామని బెదిరించారు. ఇసుక రవాణాకు అడ్డుపడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇసుకాసురులను అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి అండగా నిలుస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి, అక్రమార్కులతోపాటు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల : తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు సేవించుకున్నారు. వీరిలో సింగపూర్ హోంమంత్రి షణ్ముగం, మలేషియా ఎంపీ గణపతి రావు, రాష్ట్ర మంత్రి నారాయణ తదితరులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.శ్రీవారి దర్శనానికి 12 గంటలుతిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టెంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టిక్కెట్లు లేని వారికి 12గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. -
రాళ్లమయం!
ఇసుక మాయం..నాయుడుపేటటౌన్ : ఇసుకాసురుల ధన దాహానికి స్వర్ణముఖి ధ్వంసమవుతోంది. కూటమి నేతల అండదండలతో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ప్రధానంగా స్వర్ణముఖి నది కాజ్వే నుంచి మున్సిపల్ అధికారులు ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపునకు పెట్టిన గేటు ద్వారా పట్టపగలే అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇందుకోసం అక్రమార్కులు ఏకంగా అధికారులు ఏర్పాటు చేసిన గేట్లనే తొలగించేయడం గమనార్హం. పోలీసు, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో మరింతగా రెచ్చిపోతున్నారు. దెబ్బతింటున్న నీటి వనరులు స్వర్ణముఖిలో లోతుగా ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నారు. నదీతీరంలోని సాగునీటి బోర్లు ఎండిపోతున్నాయి. అలాగే నాయుడుపేట వాసుల తాగునీటి అవసరాలు తీర్చే పురపాలక నీటి పథకాలు నిర్వీర్యమవుతున్నాయి. నదిలో మున్సిపాలిటీకి చెందిన 11 బోర్లు చుక్కనీరు రాక నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు స్వర్ణముఖిలో కేవలం రెండు నుంచి మూడు అడుగుల్లోనే నీరు ఉబికి వచ్చేది. అలాంటిది ఇప్పుడు పది అడుగుల మేర తవ్వినా నీటి జాడే కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలతో ప్రాణాపాయం నదిలో ఇసుక తవ్వకాల కారణంగా ఏర్పడి భారీ గుంతలతో ప్రమాదం పొంచి ఉన్నట్లే అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తిరుపతి రూరల్లో ఇదే విధంగా స్వర్ణముఖిలోని గుంతల్లో పడి ఏడుగురు బాలురు మృత్యువాత పడిన ఘటనను గుర్తు చేస్తున్నారు. నదిలోని గుంతల్లో వర్షాలు కురిసినప్పుడు బురద చేరుతుందని, ఎవరైనా అందులో పడితే ప్రాణాపాయం తప్పదని వివరిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఇష్టారాజ్యంగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి అడ్డుకోవాలని కోరుతున్నారు. లేకుంటే ఇప్పటికే రూపురేఖలు కోల్పోయిన స్వర్ణముఖి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు.స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలుస్వర్ణముఖి నది నుంచి పగటిపూట ట్రాక్టర్లు, రాత్రివేళ టిప్పర్లతో ఇసుక స్మగ్లింగ్ను నిరాటంకంగా సాగిస్తున్నారు. భారీ యంత్రాలను వినియోగించి దాదాపు 9 అడుగుల లోతు వరకు నదిలో తవ్వకాలు చేపడుతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు సైతం తెగబడుతున్నారు. అడ్డుకోవాలని చూసిన అధికారులను మామూళ్ల మత్తులో జోకొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇసుక లోడ్లతో అతి వేగంగా వెళ్లే టిప్పర్ల కారణంగా నాయుడుపేట, సమీప ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. రోడ్లు దెబ్బతింటుండడంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. -
ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం
తిరుపతి సిటీ: ఎస్వీయూలో మళ్లీ ర్యాగింగ్ కలకలం సృష్టించింది. 15రోజుల ముందు వర్సిటీలోని సైకాలజీ విభాగంలో ర్యాగింగ్కు గురై నలుగురు విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్లిపోగా ఇప్పుడు మరో ఘటన జరిగింది. వర్సిటీలో పైశాచికానందంతో సీనియర్లు ర్యాగింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బాలుర వసతి గృహం విశ్వతేజ బ్లాక్ హాస్టల్లో గురువారం అర్ధరాత్రి జూనియర్లకు ఇంటరాక్షన్ క్లాసుల పేరుతో సీనియర్లు ర్యాగింగ్ చేశారు.అర్ధరాత్రి హాస్టల్లో జూనియర్లను గంటల తరబడి నిల్చోబెట్టి వికృత చేష్టలకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు వర్సిటీకి చేరుకుని విషయంపై ఆరాతీయగా ఇంటరాక్షన్ క్లాసులు మాత్రమేనంటూ సీనియర్లు, హాస్టల్ సిబ్బంది మాయ మాటలు చెప్పసాగారు. దీంతో శుక్రవారం విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ మృతి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల పరకామణికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే మృతి చెందారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. అది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసి ఆయన మృతికి కారణమైన అధికారులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ మరణానికి కారణమైన ప్రభుత్వం, పోలీస్ అధికారులతో పాటు ఆయన మీద ఒత్తిడి తెచ్చినవారందరినీ దోషులుగా చేర్చాలన్నారు.విచారణ పేరుతో సాటి పోలీసులనే వేధిస్తూ, తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ ఈ ప్రభుత్వం తప్పుడు సంప్రదాయానికి తెర తీసిందని మండిపడ్డారు. పోలీసు అధికారుల మరణాలకు కారణమయ్యేలా జరుగుతున్న విచారణలు పోలీసు సమాజానికే అవమానకరమన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులే లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అందుకు అధికారులను పావులుగా వాడుకుంటోందన్నారు. తమపై ఎలాగైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలన్న ప్రభుత్వ కుట్రలకు ఒక అమాయక పోలీసు అధికారి బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడారు.సీబీఐతో విచారణ జరిపించాలి..‘ఈ ప్రభుత్వం చేస్తున్న అపచారాలను ప్రశి్నస్తున్న నన్ను దోషిగా ఇరికించేందుకు టీటీడీ పాలకమండలి అధ్యక్షుడి నుంచి నారా లోకేష్ వరకూ ఏ రకంగా మాట్లాడారో, ట్వీట్లు చేశారో అందరికీ తెలుసు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. సతీష్ మరణం వెనుక కారణాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి. పది రోజులుగా జరుగుతున్న సీఐడీ విచారణ తతంగం, న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించడానికి జరుగుతున్న యత్నాలపై కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలి’ అని భూమన డిమాండ్ చేశారు.ఇది ప్రభుత్వ హత్యే..!‘పరకామణికి సంబంధించి రెండు నెలలుగా పత్రికల్లో వస్తున్న కథనాలతో సతీష్ కుమార్ తీవ్రంగా కలత చెందారు. వారం రోజులుగా సీఐడీ విచారణ పేరుతో తనను వేధిస్తోందని సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం నా పేరు చెప్పాలంటూ సతీష్కుమార్పై ఒత్తిడి తెచ్చి మానసిక క్షోభకు గురి చేసింది. పోలీసు అధికారుల ద్వారా రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నిన కుట్రలకు ఒక అమాయకుడు, సౌమ్యుడు, నిజాయితీపరుడైన పోలీస్ అధికారి బలైపోయారు. ఎస్పీ గంగాధర్, డీఎస్పీలు వేణుగోపాల్, గణపతి అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.పరకామణి కేసును విచారిస్తున్న అధికారులు న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. రౌడీలు, గూండాల తరహాలో పచ్చి బూతులు తిడుతూ విచారణ ఎదుర్కొంటున్న వారిని వేధిస్తున్నారు. ఏ అర్హత లేని లక్ష్మణ్ రావు అనే క్రిమినల్ కూడా విచారణలో పాల్గొని సతీష్ కుమార్ను బండ బూతులు తిట్టాడు. తన పై అధికారి సీవీఎస్వీ నరసింహ కిషోర్ చెప్పడం వల్లే రాజీకి వెళ్లానని అధికారులకు సతీష్ కుమార్ చెప్పారు’ అని భూమన చెప్పారు. -
టీటీడీ మాజీ ఏవీఎస్వో అనుమానాస్పద మృతి!
తాడిపత్రిటౌన్/గుంతకల్లు/అనంతపురం సెంట్రల్/ తిరుమల తిరుపతి దేవస్థానం/పత్తికొండ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఏవీఎస్ఓ, ప్రస్తుత గుంతకల్లు రైల్వే పోలీస్ (జీఆర్పీ) సీఐ వై. సతీష్కుమార్ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన శుక్రవారం ఆయన మృతదేహం లభించింది. టీటీడీ పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్లో వెళుతూ ఇలా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పరకామణి కేసులో విచారణకు వెళుతున్న ఆయను ఎవరైనా రైలు నుంచి తోసి హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ కుమార్ 2023లో టీటీడీలో ఏవీఎస్ఓగా ఉన్న సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఈ ఏడాది జూలైలో జీఆర్పీ సీఐగా గుంతకల్లుకు బదిలీ అయ్యారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. గుంతకల్లుకు బదిలీపై వచి్చన తర్వాత పట్టణంలోని ఉరవకొండ రోడ్డులోని విశాల్ మార్టు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈయనకు భార్య మమత, కుమార్తె తారా (8), కుమారుడు రోహిత్(3) ఉన్నారు.విచారణకు వెళుతూ..పరకామణి కేసులో ఈ నెల ఆరో తేదీన తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరైన సతీష్ కుమార్.. మరోసారి హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిజాముద్దీన్–తిరుపతి (రాయలసీమ ఎక్స్ప్రెస్) రైల్లో టూ టైర్ ఏసీలో తిరుపతికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం రైల్వేట్రాక్ వద్ద ముఖం, శరీర భాగాలపై తీవ్రగాయాలతో మృతిచెందిన వ్యక్తిని గుర్తించిన రైల్వేట్రాక్ మెన్ షంషీర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరా తీయగా.. గుంతకల్లు రైల్వే రిజర్వ్డు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్గా తేలింది. దీంతో పై అధికారులకు సమాచారం చేరవేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షీమోíÙ, జిల్లా ఎస్పీ జగదీష్ , ఏఎస్పీ రోహిత్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని.. మృతికి కారణాలు, ఆధారాల కోసం విచారణ చేపట్టారు. డాగ్స్కా్వడ్, ఫొరెన్సిక్ నిపుణులతో పరిశీలించారు. గుంతకల్లు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలించారు. ఆయన ప్రయాణించిన బోగీలోని ప్రయాణికుల వివరాలనూ ఆరా తీస్తున్నారు. దీంతోపాటు సహచర ఉద్యోగులతో సతీష్ కుమార్ వ్యవహారశైలిపై విచారిస్తున్నట్లు సమాచారం. మృతికి కారణాలు విచారణలో తేలాల్సి ఉందని రైల్వే డీఎస్పీ శ్రీనివాసులు ఆచారి విలేకరులకు తెలిపారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.2012 బ్యాచ్ అధికారికర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన బ్రహ్మయ్య, చిదంబరమ్మ దంపతుల మొదటి కుమారుడు సతీష్ కుమార్. ఈయనది పేద కుటుంబం, తండ్రి మరణంతో తమ్ముడు శ్రీహరితో కలిసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కష్టపడి చదవి పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించారు. సతీష్ కుమార్ 2012 బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకున్న చివరి బ్యాచ్ వీరిదే. తొలిపోస్టింగ్ చిత్తూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా వచి్చంది. తర్వాత చాలా ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే పనిచేశారు.2012 బ్యాచ్లో రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన వారిలో కూడా సతీష్కుమార్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన బ్యాచ్మేట్స్ చాలా మంది ఇంకా ఆర్ఎస్ఐలుగానే ఉన్నారు. పరకామణి చోరీ కేసు నమోదైన సమయంలో ఈయన ఏవీఎస్ఓగా పనిచేస్తున్నారు. ఈనెల ఆరున సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మరోసారి హాజరుకావాల్సి ఉందని గుంతకల్లు నుంచి తిరుపతికి బయలుదేరారు. అంతలోనే ఇలా జరగడంపై చాలా మంది బ్యాచ్మేట్స్, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరో తేదీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత కొందరు సహచరులతో మాట్లాడుతూ తనకు మెమో ఇస్తారని, లేదా సస్పెండ్ చేస్తారని వాపోయినట్లు తెలిసింది.నిష్పక్షపాతంగా విచారణ చేయాలిసతీష్ కుమార్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కుమ్మర శాలివాహన సంఘం నాయకులు గోపాల్, ఓబుళపతి, నాగేంద్ర, రామాంజనేయులు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం అనంతపురం సర్వజనాస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన చేశారు. సతీష్కుమార్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఐడీ అధికారులతో సిట్ ఏర్పాటు చేసి పారదర్శకంగా దర్యాప్తు చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సతీష్ కుమార్ భార్య మమతను సంప్రదించాలని ‘సాక్షి’ ప్రయతి్నంచగా ఆమె సెల్ఫోన్ను పోలీసు అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు బంధువుల ద్వారా తెలిసింది. ఆమెను మీడియాతో మాట్లాడనీయకుండా కట్టడి చేశారు. పోలీసులు ఆమె సెల్ఫోన్ను తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉందని బంధువులు ప్రశ్నిస్తున్నారు.పోస్టుమార్టం పూర్తిసతీష్కుమార్ మృతదేహానికి అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మృతదేహాన్ని స్వగ్రామం కర్నూలు జిల్లా పత్తికొండకు తరలించారు. తొలుత మృతదేహానికి సీటీస్కాన్ చేశారు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం చేశారు. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. జిల్లా ఎస్పీ జగదీష్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా సతీష్ వినియోగిస్తున్న సెల్ఫోన్ను విజయవాడ ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. దాదాపు 3 గంటలకు పైగా జిల్లా ఎస్పీ జగదీష్ ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోనే ఉన్నప్పటికీ చివరకు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాగా, సతీష్ కుమార్ మృతి ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీసేందుకు సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అనంతపురానికి చేరుకున్నట్లు సమాచారం.హత్య కోణంలో దర్యాప్తు చేయాలి: బీజేపీసాక్షి, అమరావతి: తిరుపతి పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి సతీష్కుమార్ అనుమానాస్పద మరణం ఆందోళనకరమని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘రైల్వే ట్రాక్పై మృతదేహం లభించడం దర్యాప్తును మరింత తీవ్రమైన కోణంలో పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఈ ఘటనను హత్య కోణంలో దర్యాప్తు చేయమని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నాం. ఈ కేసుకు సంబంధించిన సాక్షులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ మరణం వెనుక ఎవరి హస్తం ఉన్నా కఠినంగా శిక్షించాలి. నిజం వెలుగులోకి రావాలి’ అంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్నారాయణ ప్రకటనలో పేర్కొన్నారు. -
రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో మృతదేహం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై విగతజీవిగా పడి కనిపించారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును గతంలో విచారించిన సతీష్ను.. ఆపై నిందితుడిగా సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్ఐగా పని చేస్తున్న ఆయన్ని ఈ నెల 6వ తేదీన సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం విచారణ జరిపింది. అయితే.. మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో వేధింపులు భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సతీష్ను వేధించారు: వైఎస్సార్సీపీసతీష్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ‘‘పరకామణి కేసులో రవికుమార్ ని పట్టుకున్నదే సతీష్ కుమార్. అలాంటి వ్యక్తి చనిపోవడం అనుమానాస్పదంగా ఉంది. సతీష్ మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపించాలి. వాస్తవాలు ఏంటో బయటి ప్రపంచానికి తెలియచేయాలి. సతీష్ను వేధించారు. భూమన కరుణాకరరెడ్డిని ఆ కేసులో లాగాలని సతీష్ పై ఒత్తిడి చేశారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయాలలో కి లాగటం బాధాకరం. ఈ కేసులో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే సతీష్ ఆత్మహత్య చేసుకున్మాడో అర్థం చేసుకోవచ్చు. తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని సతీష్ కుమార్ తన ఫ్రెండ్స్ దగ్గర చాలా సార్లు చెప్పారు. నాలుగు రోజుల సతీష్ విచారణ లో ఏం జరిగిందో బయట పెట్టాలి. వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి 24 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 62,129 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,026 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 4.13 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. -
పొలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు!
చిట్టమూరు: రాజకీయంగా పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో సాగు చేసుకునే సొంత భూమిలోకి కూడా దిగనివ్వకుండా అడ్డుకుంటున్నారని వళ్లీపురం గ్రామానికి చెందిన పంట్రంగం రామసుబ్బయ్య గురువారం ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ మండలంలోని మల్లాం రెవెన్యూలో తనకు 1.40 సెంట్లు భూమి ఉందన్నారు. ఈ భూమికి పక్కనే మరొక రైతుకు పట్టా భూమి ఉందన్నారు. ఆ రైతు లీజుకు ఇవ్వగా వారు భూమి చుట్టూ కంచె నాటి తన పొలంలోకి వెళ్లేందుకు దారి లేకుండా చేశారన్నాడు. పొలం దుక్కి దున్నుకునేందుకు ట్రాక్టర్ వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోవడంతో నాటిన కంచెను తొలగించాలని కోరితే తన పట్టా భూమిలోకి దిగేందుకు వీలు లేదన్నారు. పక్కనే ఉన్న దేవాదాయ శాఖ భూమిలో నుంచైనా వెళదామంటే లీజుకు తీసుకున్న వారు కూడా కంచె నాటేయడంతో ఇప్పటికే పొలంలో వేసిన నారుమడి ముదిరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయ గా, విచారణ నిమిత్తం తహసీల్దార్ నరేష్ భూమి వద్దకు వచ్చి పరిశీలించి, కంచె నాటిన వ్యక్తి పట్టా భూ మి కావడంతో తామేమి చేయలేమని వెళ్లారన్నారు. రాజకీయ కక్షలతో పట్టా భూమంటూ ఎవరికి వారు ఫెన్షింగ్లు, కంచె నాటుకుంటే అవతలి పొలాల్లోకి రైతులు ఎలా వెళ్లగలరని ప్రశ్నించాడు. అయితే పట్టా భూమిలో ప్రభుత్వ అసైన్మెంట్ భూమి ఉందని, దానిని సర్వే చేయమని రెవెన్యూ అధికారులను కోరగా పట్టించుకోవడం లేదని రైతు ఆరోపించాడు. ఈ విషయమై తహసీల్దార్ను వి వరణ కోరగా కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించామన్నారు. అయితే తన ది పట్టా భూమి అని, తాను తన పొలంలో నుంచి పోనివ్వనని సమాధానం చెప్పాడన్నారు. రాజకీయ రంగు పులుముకోవడంతో తామేమి చేయలేకపోతున్నామన్నారు. -
అల్లకల్లోలం
వాకాడు: రెండు రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా మండలంలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురువడంతోపాటు చలిగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం అనూహ్య మార్పుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసి పడుతున్నాయి. అలాగే బంగాళాఖాతం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కరుస్తోంది. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్రంలో అలలు దాదాపు 5 నుంచి 7మీటర్ల ఎత్తుకు భీకరమైన శబ్దాలతో ఎగసి పడుతున్నాయి. దీంతో సముద్ర తీరం దాదాపు 50 మీటర్లు వరకు ముందుకు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తీరంలో వర్షంతోపాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా పగలు సైతం రాత్రిని తలపిస్తోంది. దీంతో తీరానికి వచ్చే పర్యాటకులు భయంతో వెనుతిరిగి వెళుతున్నారు. సముద్రంలో భిన్న మార్పులు చోటు చేసుకోవడంతో ముందుగా పసిగట్టిన ఉదయాన్నే వేటకు వెళ్లిన మత్స్యకారులు హుటా హుటీన ఖాళీ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు ఎవరూ వేటకు వెళ్లకూడదని మత్స్యకార పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. ఒడ్డుకు చేరుకుంటున్న మత్స్యకారుల బోట్లు -
నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యం
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు విధులు నిర్వహించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ కోరారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో గురువారం సంస్థ పరిధిలో పనిచేసే చీఫ్ ఇంజినీర్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి వరకు హాజరైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు అధికారులు, సిబ్బంది మెరుగైన, సత్వర సేవలు అందించాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలపై సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ స్థాయిల్లో సంబంధిత అధికారులు నిరంతరం సమీక్షిస్తూ, వాటిని పూర్తిస్థాయిలో నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగ దారుల సేవల్లో అలసత్వాన్ని ప్రదర్శించవద్దని హెచ్చరించారు. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో సిబ్బంది అందిస్తున్న సేవలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ తరహా ఫిర్యాదులను తగ్గించేందుకు సిబ్బంది వినియోగ దారులకు మరింత మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె.గురవయ్య, కె.రామ్మోహన రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, పి. హెచ్.జానకీరామ్, కె. ఆదిశేషయ్య, ఎన్. శోభా వాలెంటీనా, ఎం. ఉమాపతి, ఎం. మురళీ కుమార్, పి. సురేంద్ర నాయుడు, జనరల్ మేనేజర్లు రామచంద్ర రావు, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, సురేంద్ర రావు, మురళీధర్, రాజశేఖర్ రెడ్డి, విజయన్, చక్రపాణి, భాస్కర్ రెడ్డి, మోజెస్, శ్రీనివాసులు, జగదీష్, ఎస్ఈలు రమణ, తిరుమల రావు, ఇస్మాయిల్ అహ్మద్, శేషాద్రి శేఖర్, ప్రదీప్ కుమార్, సంపత్ కుమార్, సుధాకర్, రాఘవేంద్ర, చంద్రశేఖర్ రావు, ఈశ్వర్రెడ్డి పాల్గొన్నారు. నేడు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వార్షిక సదస్సు ఏర్పేడు: బెంగుళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 91వ వార్షిక సదస్సు తిరుపతి ఐసర్ కొలీజియం(ఆడిటోరియం)లో శుక్రవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు జరగనున్నట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ తెలిపారు. ఐసర్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి ఐఐటీ, తిరుపతి నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ లేబొరేటరీ సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 150 మంది శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొని, తమ పరిశోధనల ఫలితాలు, ఆలోచలను పంచుకుంటారన్నారు. బెంగుళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ అధ్యక్షోపన్యాసం చేస్తారన్నారు. ఈ సమావేశంలో ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ అమిత్కుమార్ పట్రా, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టాటా నరసింగారావు, ఐఐటీ ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల, ఐసర్ రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్సింగ్ కోహ్లీ, అకడమిక్ డీన్ సుదీప్త దత్తా పాల్గొన్నారు. -
గుక్కెడు నీటికి కడివెడు కష్టం
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలంలోని తుమ్మచేనుపల్లిలో తాగునీటి సమస్య నెలకొంది. వర్షాకాలంలోనూ గుక్కెడు నీరు దొరకడం గగనమైంది. నీటి కోసం మహిళలు ఉదయం పూట బిందెలు తీసుకుని పొలాల్లోని బావుల వైపు వెళుతున్నారు. రెండు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పొలాల్లోని బావుల వద్ద వేచి ఉండి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలను బడికి పంపాల్సిన సమయంలో ఉదయం పూట పనులు మానుకుని నీటి కోసం తిప్పలు పడుతున్నారు. గ్రామంలో ఉన్న పాత బోర్లు పాడైపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతు చేయకపోవడం, కొత్త బోర్లు తవ్వకంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. నీటి విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి ఎటువంటి స్పందన లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరతతో చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శిని గ్రామస్తులు నిలదీయడంతో ఆయన సమాధానం చెప్పలేక వెళ్లిపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
అన్ని రంగాల్లో రాణించాలి
తిరుపతి అర్బన్: ప్రతి వ్యక్తికీ విభిన్న అంశాల్లో ప్రతిభ ఉండాలని, అన్ని రంగాల్లోనూ రాణించేలా ముందుకు సాగితేనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు అనంతపురంలో జరిగిన 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగులు సత్తా చాటారు. ఈ క్రమంలో గురువారం విజేతలను కలెక్టరేట్లో కలెక్టర్ సత్కరించారు. జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లు జయరాజ్ (కలెక్టరేట్ సివిల్ సఫ్లైస్ డీటీ), సురేంద్ర (చంద్రగిరి సివిల్ సఫ్లైస్ డీటీ) క్యారమ్స్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి పతకాలను సాధించారు. అలాగే పుత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్ట్గా పనిచేస్తున్న మాధవి మ్యూజికల్ చైర్స్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచి, పతకాన్ని సాధించారు. పతకాలు సాధించిన ఈ ముగ్గురు అధికారులను కలెక్టర్ శాలువలతో సత్కరించారు. డీఆర్వో నరసింహాలు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి అశోక్రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ గోపినాద్రెడ్డి, జిల్లా కోశాధికారి రూప్ చంద్, క్రీడా సాంస్కృతిక సెక్రటరీ దిలీప్, భాస్కర్ పాల్గొన్నారు. -
164 కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు
తిరుపతి అర్బన్: జిల్లాలో 164 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో జేసీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 1200 మంది ఓటర్లుకు మించి ఉంటే కొత్త పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా బీఎల్వోలు చేసిన సర్వే మేరకు జిల్లాలో 1200 ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, కొత్తగా 164 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అలాగే జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 38 పోలింగ్ కేంద్రాల ప్రాంతాల మార్పునకు, 9 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పునకు, 44 పోలింగ్ కేంద్రాలు విలీనం చేయడానికి ప్రతిపాదనలు పంపినటు్ల్ స్పష్టం చేశారు. ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్ వస్తే 21,41గా ఉన్న పోలింగ్ కేంద్రాలు 2,261కి చేరతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, సుధారాణి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
107 రైల్వేగేటుకు మోక్షం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలితంగా తిరుపతి–రేణిగుంట మార్గంలోని రైల్వే గేటు నంబర్ 107కు మోక్షం లభించింది. ఈ మార్గంలో నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జి వద్ద అదనంగా ఎడమ వైపునకు (రేణిగుంట వైపు) యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వేశాఖ నుంచి ఆమోదం లభించింది. తిరుపతి నగర విస్తరణతో ట్రాఫిక్ భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జ్కు పాత హీరోహోండా షోరూమ్ వద్ద రైల్వేగేట్ నంబరు 107 వైపు మాత్రమే యాక్సెస్ ఉండడంతో భవిష్యత్తులో వాహనచోదకులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఎంపీ గురుమూర్తి గ్రహించారు. ఈ నేపథ్యంలో కాటన్మిల్ వద్ద ఉన్న రైల్వేగేట్ నంబర్ 108 వైపుగా అదనపు యాక్సెస్ రోడ్డు అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవకు లేఖ రాశారు. ఎంపీ ప్రతిపాదనపై రైల్వే శాఖ సాధ్యాసాధ్యాల పరిశీలించిన అనంతరం యాక్సెస్ రోడ్డు ఏర్పాటు సాధ్యమేనని సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు రైల్వే జీఎం ఎంపీకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ నిర్ణయంతో తిరుపతి–రేణిగుంట మార్గం నుంచి మంగళం, లీలామహల్ సర్కిల్ వైపునకు వాహనాలు సులభంగా వెళ్లే అవకాశం కలుగుతుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
పాతెయ్ జెండా
జిల్లాలో ప్రజాప్రతినిధులు, నాయకుల అండ ఉంటే చాలు.. ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా జెండా పాతేయెచ్చు. అధికారులన్నారనే కదా మీ అనుమానం. ఇదంతా మాకు షరామామూలే.. అంటూ యంత్రాంగం కళ్లప్పగించి చూస్తుండడంతో అక్రమార్కుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఖాళీ స్థలాలే కాదు.. కొండలు, గుట్టలు, చివరకు చెరువులనూ వదలడం లేదు. అడిగినప్పుడు చూసుకుందాంలే అన్న ధోరణిలో బరితెగిస్తున్నారు. నాయకుల అండ.. జాతీయ రహదారి నుంచి ముత్యాలపాడు చెరువు, ఏపీఐఐసీ భూముల్లో వేస్తున్న 60 అడుగుల రోడ్డు సాక్షి టాస్క్ పోర్సు: చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తరువాత గూడూరు నియోజకవర్గంలో భూములకు రెక్కలు రావడంతో ఎవరికి వారు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని, విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధి పూర్తిస్థాయిలో అండదండలు పుష్కలంగా లభిస్తుండడంతో అధికారులు కూడా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా మిన్నకుండిపోతున్నారు. స్థానికులు జిల్లాస్థాయి అధికారులకు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఫిర్యాదులు చేస్తే, దానికి సంబంధించిన రికార్డుల్లో పట్టా భూమిగా ఉందని స్థానిక అధికారులు జిల్లా అధికారులను పక్క దారి పట్టిస్తున్నారు. ఇందులో ఏదైనా ఇబ్బంది ఎదురైతే స్థానిక ప్రజా ప్రతినిధి జిల్లా అధికారులతో చర్చించి సర్దుబాటు చేస్తున్నారు. దీంతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా, జిల్లాస్థాయి అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గంలోని 16వ నంబర్ జాతీయ రహదారికిరువైపులా ఉన్న భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతుండగా వీటికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగంగా పుంజుకుంది. ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టే వ్యాపారం చేసే సంస్థలు కూడా ఈ ప్రాంతంలో వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధం అవుతూ రహదారి పక్కను పట్టా భూమిని కొనుగోలు చేసి, దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా అందులో కలిపేసుకుంటున్నాయి. ఇందుకు స్థానిక ప్రజా ప్రతినిధి పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పండుగగా మారుతుంది. ఈ క్రమంలోనే చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లికి చెందిన రైతులకు కడివేడు రెవెన్యూ పరిధిలో ముత్యాలపాడు చెరువుకు సమీపంలో సుమారు 40 ఎకరాల పట్టా భూమి ఉండగా దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ను అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. అయితే రియల్ ఎస్టేట్కు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో రహదారి లేకపోవడంతో ప్రత్యామ్నా మార్గం ఆలోచించి, స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా దారి ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. దీంతో ఆయన సలహాల మేరకు ముత్యాలపాడు పంచాయతీకి చెందిన నాయకుడి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా జాతీయ రహదారికి అనుకుని ఉన్న సర్వే నంబర్ 41లోని ఏపీఐఐసీ భూములతోపాటు ముత్యాలపాడు చెరువు భూమి రెండు ఎకరాలకు పైగా ఆక్రమించి, 60 అడుగుల రోడ్డు నిర్మిస్తున్నారు. ఒక వైపు ముత్యాలపాడు చెరువు ఆయకట్ట కింద ఉన్న రైతులు ఇలా లోతట్టులోని భూములు ఆక్రమణలకు గురి అవుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా కనీసం నీటి పారుదల శాఖ అధికారులు కూడా అటు వైపు కన్నెతి చూడడం లేదు. ఏపీఐఐసీకి చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నా ఆ శాఖకు చెందిన అధికారులు కనీసం అటు వైపు రాకుండా ఉండడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు మాత్రం రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన వాటిని నేరుగా తీసుకుని వెళ్లేందుకు జాతీయ రహదారి నుంచి తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ డీఈఈ ఆనందబాబును వివరణ కోరగా చెరువులో రహదారి నిర్మాణం చేపడుతున్నారనే విషయం ఇప్పటివరకు తన దృష్టి రాలేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. -
నేటి నుంచి ‘నృత్యవాహిని’
తిరుపతి రూరల్ : నగరంలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో అంతర్జాతీయ సాంస్కృతిక నృత్య మహోత్సవం (నృత్య వాహిని) నేటి నుంచి ప్రారంభమవుతుందని వీసీ ఆచార్య ఉమ తెలిపా రు. నృత్యోత్సవాల నిర్వహణపై బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే నృత్య మహోత్సవానికి దేశ, విదేశాల నుంచి నృత్యకారులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్ డాన్స్ ఫెస్టివల్–2025 గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. నవంబరు 15 వరకు జరిగే నృత్యోత్సవాల్లో ఆంధ్రప్రదే శ్, మహారాష్ట్రతో పాటు థాయ్లాండ్, శ్రీలంక నుంచి వచ్చిన 87 మంది కళాకారులు పాల్గొంటారన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్టు వీసీ ఉమ తెలిపారు. ఈ ఉత్సవాలను వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. రజని, కన్వీనర్లు ఆచార్యసి.వాణీ, ఆచార్య పి. విజయలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.హిమబిందు పర్యవేక్షించనున్నారు. -
‘ఆహార భద్రత’ను అతిక్రమిస్తే చర్యలు
నారాయణవనం: జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలు చేయకపోయినా, అతిక్రమించినా చర్యలు తప్పవని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని నారాయణవనం, పుత్తూరు, వడమాలపేట మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు, పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్నం భోజనంలో నాణ్యత లోపించడం, రికార్డు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, కొలతలు, స్టాక్ వివరాల్లో తేడా ఉండడం గమనించి మండిపడ్డారు. వెంటనే ఆయా నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురం రేషన్ డీలర్, ఎస్బీఆర్ పురం, పుత్తూరు మండలం మజ్జిగగుంట ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మెమో ఇచ్చారు. నారాయణవనం మండలం కొండలచెరువు ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు చిన్న కోడిగుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వడమలపేటలోని జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న బోజనం నాణ్యతను పరిశీలించారు. పౌర సరఫరాలశాఖ జిల్లా అధికారి శేషాచలంరాజు, ఎండీ బాలకృష్ణ, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి, అధికారులు రమణారావు, ఎన్.స్వామి, జగదీష్, విక్రాంత్ కుమార్, శ్యామ్ సుందర్, తిరుపతి సీఎంఓ సురేష్ పాల్గొన్నారు. -
యూనియన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం
చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం తిరుచానూరులోని శిల్పారామం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వినియోగదారులు, విరమణ పొందిన ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోనల్ హెడ్ జనరల్ మేనేజర్ పత్రి శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ, బ్యాంక్ వారసత్వాన్ని ప్రస్తావించారు. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన ఈ సంస్థ, సమగ్ర అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ.22.10 లక్షల కోట్లు దాటిందని, దేశంలోని ఐదవ అతిపెద్ద బ్యాంక్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదిగిందని తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్కు 8,655 శాఖలు, 9,064 ఏటీఎంలు, 74,200 మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ఏప్రిల్ 2025లో ఏర్పడిన తిరుపతి జోన్, తొమ్మిది జిల్లాల్లోని 310 శాఖలను కలిగి ఉందని, పలు పనితీరు ప్రమాణాలలో జాతీయ స్థాయిలో అగ్రస్థానం సాధించిందని ఆయన గర్వంగా తెలియజేశారు. ‘బ్యాంక్ యూనియన్ ఈ–బిజ్’ బిజినెస్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ప్రారంభించింది. అదేవిధంగా 51 కొత్త శాఖలు, కార్యాలయాలను (వర్చువల్గా) ప్రారంభించింది. బ్యాంక్ ఉద్యోగులు రూ.21.68 కోట్లు జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందించారు. -
చీటింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
నాయుడుపేటటౌన్ : పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని, కార్లను తక్కువ ధరకే అందిస్తామని పలువురిని రూ.లక్షలు మోసం చేసిన ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేసినట్లు సీఐ బాబీ తెలిపారు. వివరాలు.. బాలాయపల్లెకు చెందిన కొమ్మురు గురుప్రసాద్ అలియాస్ ప్రసాద్రెడ్డి, ఓజిలి మండలం కుందాం గ్రామానికి చెందిన శిల్పా ప్రియాంక ఏపీఆర్డీ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. నాయుడుపేట మండలం అన్నమేడుకు చెందిన దొనపార్తి సాధన అనే మహిళను తమ సంస్థలో ఏజెంటుగా నియమించుకున్నారు. తర్వాత ఆమెకు మాయమాటలు చెప్పి రూ.25లక్షలు కాజేశారు. ఇదే విధంగా పలువురికి ఇళ్లు కట్టిస్తామని, కార్లు ఇప్పిస్తామని మోసం చేసినట్లు తెలియడంతో బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు స్థానిక విద్యుత్ కార్యాలయం సమీపంలోని నిందితుల నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివిధ పత్రాలు, బ్యాంకు పాసు పుస్తకాలు, ప్రామిసరీ నోట్లు, అనేక స్టాంపులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులన కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించినట్లు సీఐ బాబీ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బీజేపీలో మహిళలకు ప్రాధాన్యం తిరుపతి గాంధీ రోడ్డు:భారతీయ జనతా పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. బుధవారం ఓ ప్రైవేటు అతిథి గృహంలో పార్టీ సమావేశం నిర్వహించారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిషీధా రాజు ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావం తర్వాత జాతీయ స్థాయిలో మహిళా మోర్చా మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ నిషిధారాజు కుటుంబం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. నేతలు సామంచి శ్రీనివాస్, గోపీనాథ్రెడ్డి, కోలా ఆనంద్, దస్తగిరిరెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రవేశానికి పడిగాపులు!
తిరుపతి సిటీ : ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని వందలామంది విద్యార్థులు మూడు వారాలుగా సతమతమవుతున్నారు. ఓఏఎమ్డీసీ ద్వారా ఇప్పటికే డిగ్రీలో ప్రవేశానికి మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలిన సీట్లను భర్తీ చేసే దిశగా స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇవ్వడంలో ఉన్నత విద్యామండలి మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రధానంగా తిరుపతి నగరంలో టీటీడీ నిర్వహిస్తున్న పద్మావతి, ఎస్వీ, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. తక్షణం స్పాట్ అడ్మిషన్లకు టీటీడీ విద్యాసంస్థలలో అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘వసతి’కి తప్పని నిరీక్షణ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న డిగ్రీ కళాశాలల్లో సీట్లు పొంది హాస్టల్ వసతి కోసం వందలాది మంది విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న సీట్లు ఇప్పటికే పూర్తిగా భర్తీ అయ్యాయని, టీటీడీ అధికారులు వసతిని పెంచితేగాని తాము సీట్లు కేటాయించలేమని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు తెగేసి చెబుతున్నారు. హాస్టల్ సీట్లను ఒక్కో కళాశాలలకు సుమారు 200 వరకు పెంచాలని ఇప్పటికే టీటీడీ అధికారులకు విన్నవించినట్లు వెల్లడిస్తున్నారు. అయితే టీటీడీ మాత్రం ఈ విషయంపై దృష్టి సారించకపోవడ దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే టీసీలు తీసుకుని వెళ్లిపోకతప్పదని వాపోతున్నారు. -
భద్రతా వలయంలో తిరునగరం
తిరుపతి రూరల్ : ఢిల్లీలో బాంబు దాడుల నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ, విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం ఈ మేరకు తిరుపతి శివారులో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతిస్తున్నారు. రంగంలోకి స్పెషల్ పార్టీ.. జాతీయ రహదారితోపాటు అలిపిరి మీదుగా తిరుమల వెళ్లే మార్గాల్లో చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు నేతృత్వంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు చెర్లోపల్లె, పచ్చికాపల్లం, వేదాంతపురం అగ్రహారంతోపాటు రేణిగుంట మీదుగా జాతీయ రహదారిపై నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. వాహనాల తనిఖీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్లలో.. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్తోపాటు రైల్వే స్టేషన్లలో కట్టుదిట్టంగా నిఘా పెట్టారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు ఎక్కడ కనిపించినా వెంటనే కంట్రోల్ రూమ్ 100, 112లకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. తిరుమల తర్వాత అత్యధికంగా భక్తులు తరలివచ్చే పద్మావతీ అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. -
భక్తులకు మెరుగైన ప్రసారాలే లక్ష్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మెరుగైన ప్రసారాలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. బుధవారం ఈ మేరకు ఎస్వీబీసీ బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించేలా, పాలన పారదర్శకంగా ఉండేలా, వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మానవ వనరులు, ఆర్థిక వ్యవహారాలు, ఉత్పత్తి, సరఫరా, నిల్వలు తదితర విభాగాల అంశాలను ఒకే స సాఫ్ట్ వేర్ వ్యవస్థలో సమన్వయం చేసేందుకు సమగ్ర ప్రణాళికా వ్యవస్థను తీసుకురావాలన్నారు. ఎస్వీబీసీలో ఆర్థిక అంశాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేకంగా అకౌంట్స్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశించారు. ఎస్వీబీసీ ఇన్చార్జి ఈసీఓ డి.ఫణికుమార్ నాయుడు, ఎఫ్ఏ అండ్ సీఏఓ ఓ. బాలాజీ పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి బుచ్చినాయుడుకండ్రిగ : అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి బుధవారం మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని కాటూరు ఎస్సీ కాలనీకి చెందిన కోటేశ్వరరావు(50) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాపిల్లలతో విడి పోయి దాదాపు పదేళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నా డు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంటి వచ్చి గ్యాస్ స్టవ్పై వంట చేసుకుని, గ్యాస్ ఆపకుండా సిమ్లో పెట్టి నిద్రపోయాడు. గ్యాస్ లీకై ఇళ్లంతా వ్యాపించింది. రాత్రి విద్యుత్ పోవడంతో కొవ్వొత్తి వెలిగించారు. దీంతో ప్రమాదం జరిగింది. పక్కంటివారు హుటాహుటిన కోటేశ్వరరావును తిరుపతిలోని రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కోటేశ్వరరావు మరణించినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
15న ఎస్వీయూలో జాబ్మేళా
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ ఆఫీస్లో ఈనెల 15వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఎస్వీయూలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. దేశీయ గోవుల అభివృద్ధే లక్ష్యం దొరవారిసత్రం : రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం) కింద దేశీయ గోవు జాతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పశుసంవర్థకశాఖ డీడీ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం డీవీసత్రం మండలం పాళెంపాడులో నిర్వహించిన పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరంలో ఆయన మాట్లాడారు. ఆర్జీఎంలో భాగంగా మేలుజాతి పశువుల అభివృద్ధితోపాటు పాల ఉత్పత్తి, పశుగ్రాసం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏడీలు మునిరాజా, గోవర్ధన్, ధనంజయులు, పశు వైద్యాధికారి శ్రీదేవి పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 67,367 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,369 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.30 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. ముక్కంటి హుండీ లెక్కింపు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని ప్రధాన హుండీతోపాటు పరివార దేవతల వద్ద హుండీలను బుధవారం లెక్కించారు. అక్టోబర్ 8వ తేదీ నుంచి హుండీ ద్వారా ఆలయానికి రూ.2,20,13,724 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 59.100 గ్రాముల బంగారం, 599 కిలోల వెండి, 132 విదేశీ కరెన్సీ సమకూరినట్లు వివరించారు. 19న స్పాట్ అడ్మిషన్లు తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్లో ఫార్మసీ డిప్లొ మా కోర్సులో ప్రవేశానికి నవంబర్ 19న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బుధవారం తెలిపారు. ఈ నెల14 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్లో ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులు సర్టిఫికెట్ల ఒరిజినల్తో సహా 3సెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా 19న హాజరు కావాల్సి ఉంటుందన్నారు. కోర్సులకు నిర్ణీత ఫీజుతో విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 92990 08151, 92475 75386, 89789 93810ను సంప్రదించాలని సూచించారు. ఎస్వీ పాలిటెక్నిక్లో... తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్లో డీ ఫార్మసీ కోర్సుకు ఈ నెల 19న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ద్వారకనాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, 19న ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలియజేశారు. ఫీజు రూ.6,300 చెల్లించాలని పేర్కొన్నారు. వివరాలకు 99667 61446, 9550 69007, 99088 57585 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
రేపటి నుంచి పంచగవ్య వైద్య సమ్మేళనం
తిరుపతి కల్చరల్ : గోమాత సంరక్షణ, సర్వ మానవాళి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మహతి ఆడిటోరియంలో పంచగవ్య వైద్య మహాసమ్మేళనం నిర్వహించనున్నట్లు గవ్య సిద్ధాచార్య నిరంజన్ వర్మ తెలిపారు. బుధవారం ప్రెస్క్లబ్లో ఈ మేరకు మహా సమ్మేళనం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమ్మేళనానికి దేశ నలుమూలల నుంచి పంచగవ్య వైద్య శాస్త్ర వేత్తలు, గవ్య ఉత్పత్తి నిర్వాహకులు, గోశాల నిర్వాహకులు, గో రక్షరకులు సుమారు 1,200 మంది హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు గోవిజ్ఞానానికి సంబంధించి పరిశోధనా పత్రాలు సమర్పించనున్నట్లు వివరించారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉపన్యాసాలు ఉంటాయన్నారు. ఇందులో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాంకేతిక అధ్యయన అంశాలు ఉంటాయని చెప్పారు. ప్రతి రోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అలాగే పంచగవ్య వైద్య శాస్త్ర విద్యను పూర్తి చేసిన 201 మంది విద్యార్థులకు ‘అడ్వాన్స్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరఫీ’ సర్టిఫికెట్లు అందించనున్నట్లు వెల్లడించారు. పంచగవ్య వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ‘విద్యావారధి’ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో బాలకృష్ణ స్వామి, ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జనాగ్రహం
● చంద్రబాబు ప్రభుత్వంపై వెల్లువెత్తిన నిరసన ● భారీ ర్యాలీలతో కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు ● స్వచ్ఛందంగా హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు ● ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ హోరెత్తిన నినాదాలు ●పేదలంటే బాబుకు గిట్టదు మహోన్నత ఆశయంతో జగనన్న నెలకొల్పిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. కేవలం డబ్బులకు ఆశపడి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారు. ఆయనకు పేదలంటే గిట్టదు. ప్రజా సంక్షేమం పట్టదు. ఇప్పటికై నా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు పగల్బాలు తప్ప ప్రయోజనం లేదు కేంద్ర ప్రభుత్వం సైతం మాపైనే ఆధారపడి ఉందని చంద్రబాబు పగల్బాలు పలకడం తప్ప రాష్రానికి ప్రయోజనం ఏమీ లేదు. వైద్యకళాశాలల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రూ.5వేల కోట్లు తేలేకపోయారు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్ తగిన మూల్యం చెల్లిస్తారు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి బాబు పాలన దుర్మార్గం రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గంగా పాలన సాగిస్తున్నారు. పేదలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలను భగ్నం చేస్తున్నారు. మేలు చేస్తారని ప్రజలు గెలిపిస్తే, పెత్తందార్లకు అండగా నిలుసూ.. పేదలకు తీరని ద్రోహం చేస్తున్నారు. – బియ్యపు మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి జగనన్నకు పేరు వస్తుందనే.. పేదలకు నాణ్యమైన వైద్యం, పేద విద్యార్థులకు ఉచితంగా వైద్యవిద్యను అందించాలనే జగనన్న 17 మెడికల్ కాలేజీలన నెలకొల్పారు. అయితే అవి పూర్తి చేస్తే జగనన్నకు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. రాజకీయ కక్షతో ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇది క్షమించరాని విషయం. – భూమన అభినయ్రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త స్వార్థ ప్రయోజనాల కోసమే.. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే మెడికల్ కాలేజీలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. తన అనూయాయులకు కళాశాలలను కట్టబెట్టి రూ.వేల కోట్లు దండుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. రాష్ట్ర ఆస్తిని పరులపాలు చేసేందుకు తెగబడుతున్నారు. – చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త ప్రజా సంక్షేమం పట్టదు చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు ప్రజా సంక్షేమం పట్టదు. కార్పొరేట్లకే వంత పాడుతుంటారు. అందులో భాగంగానే ఉన్నత ఆశయంతో జగనన్న స్థాపించిన ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. – నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త పోరాటం ఆగదు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. జగనన్న పిలుపును అందిపుచ్చుకుని జనం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వైఎస్సార్సీపీ వెంట అడుగులు వేస్తున్నారు. చంద్రబాబుకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు. – నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, వెంకటగిరి సమన్వయకర్త తిరుపతి అర్బన్ : కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్రం అతలాకుతలమైనప్పుడు వైద్యసిబ్బంది తమ ప్రాణాలకు తెగించి లక్షలాది మందికి ఊపిరి పోశారు. ఆ సమయంలో కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు తగినంత మంది వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. నిపుణులైన వైద్యులను తయారు చేయాలని సంకల్పించింది. ఆ మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతంగా ఆలోచించి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. అవసరాలకు అనుగుణంగా వైద్యుల సంఖ్యను పెంచేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలోనే యుద్ధప్రాతిపదికన 5 మెడికల్ కాలేజీలను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉండగా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ వైద్యకళాశాలలపై శీతకన్ను వేసింది. వీటిని పూర్తి చేస్తే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే కుట్రపూరిత ఆలోచనలతో రాష్ట్ర ప్రయోజనాలను సైతం తుంగలో తొక్కింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు తెగబడింది. తద్వారా రూ.వేల కోట్లను దోచుకునేందుకు పన్నాగం పన్నింది. ఈ మేరకు బాబు సర్కారు దుర్మార్గపు పాలనపై వైఎస్సార్సీపీ నిరసన గళం విప్పింది. ముందుగా కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ భారీ ర్యాలీలు చేపట్టింది. వెన్నుపోటు బాబుకు అలవాటే.. చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం అలవాటే. సాధారణంగా పార్టీలు, నేతలకు టోపీ పెడుతుంటారు. ఈ పర్యాయం నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు స్వభావ సిద్ధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వైద్యులను అందించే దేవాలయాల వంటి మెడికల్కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఇది దారుణం. – కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట సమన్వయకర్త నిరుపేదలంటే చులకన చంద్రబాబుకు మొదటి నుంచీ నిరుపేదలంటే చులకన. వారిని కేవలం ఓటర్లగానే చూస్తారు. అందుకే పేదలకు ఉచితంగా వైద్యం, పేదబిడ్డలకు వైద్య విద్యను అందించే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు ఎంబీబీఎస్ చదివేందుకు వీలు లేకుండా చేసేస్తున్నారు. ఇలాంటి పాలన సరికాదు. – మేరిగ మురళీధర్, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త -
ఈకేవైసీ!
బాబోయ్..తిరుపతి అర్బన్ : చిన్నపనే అయితే సంబంధిత విభాగానికి వెళ్లి చేయించుకోవాల్సి ఉంటుంది...అందుకు అధికారులు పూర్తిగా సహకారం అందించాలి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈకేవైసీ అంటూ పథకాలకు, రాయితీలపై ముడిపెట్టింది. దీనిపై అవగాహన లేక పెద్దసంఖ్యలో లబ్ధిదారులు పథకాలకు దూరమవుతున్నారు. అలాగే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో పెద్ద పథకాల లబ్ధిదారుల జాబితా నుంచి సైతం అర్హులైన వారు తొలగింపునకు గురై లబోదిబోమంటున్నారు. ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈకేవైసీ)ని చంద్రబాబు ప్రభుత్వం అన్నింటికీ తప్పనిసరి చేసేంది. దీంతో చాలా మంది లబ్ధిదారులు సంక్షేమ పథకాలు, రాయితీలను పొందలేదకపోతున్నారు. గ్యాస్ రాయితీ అంతే.. ఎన్నికల్లో చంద్రబాబు ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి మూడు సిలెండర్లకు మాత్రమే రాయితీ ఉంటుందని మెలిక పెట్టారు. జిల్లాలో 5.6 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇందులో 25 శాతం మందికి రాయితీతో ఇచ్చే 3 సిలెండర్లు అందలేదు. ఎందుకు ఇవ్వలేదని వినియోగదారులు ప్రశ్నిస్తే ఈకేవైసీ చేయకపోవడంతో అందలేదని చెబుతున్నారు. ఏటా గ్యాస్ సెంటర్లలో ఈకేవైసీ చేయించుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. కూలీల అవస్థలు చంద్రబాబు పాలనలో జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో అందరి చూపు ఉపాధి పథకం వైపు మళ్లింది. జిల్లా వ్యాప్తంగా 11.50 లక్షల మందికి పైగా జాబ్ కార్డులు ఉన్నాయి. వారంతా రోజు వారీ కూలి పనులు చేసుకుంటూ వచ్చే డబ్బులతో జీవనం గడుపుతున్నారు. అయితే కూలీ నగదు సక్రమంగా రావడం లేదు. మరోవైపు ఈకేవైసీ లేదంటూ జిల్లాలో 20శాతం మందికి పనులు కట్ చేశారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో మస్టర్లు ఉండేవి...తాజాగా ఆన్లైన్ నేపథ్యంలో ఈకేవైసీ తప్పనిసరిగా మారింది. బ్యాంకు లావాదేవీలకు సైతం.. బ్యాంకు లావాదేవీలన్నింటికీ ఈకేవైసీ తప్పనిసరిగా మారింది. ఆధార్కార్డును బ్యాంకు పాస్ పుస్తకానికి లింక్ చేసుకోవడానికి ఈకేవైసీ ఉండాల్సిందే. అలా చేసుకోకపోవడంతో చాలా మంది తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. ఇప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తమ పిల్లలకు పథకం అందలేదని కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో అర్జీలు ఇస్తున్నారు. అలాగే సామాజిక భద్రతా పింఛన్ల విషయంలోనూ ఈకేవైసీ తప్పనిసరి, అంతేకాదు పొదుపు సంఘాల సభ్యులు సైతం రుణాలు పొందడానికి ఈకేవైసీ ఉండాల్సిందే. అయితే లబ్ధిదారులకు ఈకేవైసీ ఉంటేనే పథకాలు, రాయితీలు వస్తాయనే అంశాన్ని పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన సర్కారు ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతుయి. దీంతో అర్హత ఉన్నా అనేక పథకాలకు పేద కుటుంబాలకు చెందిన ఎందరో దూరమవుతున్నారు. ఆ తర్వాత కార్యాలయాల చుట్టూ పదే పదే తిరుగుతున్నా ప్రయోజనం చేకూరడం లేదని పలువురు వాపోతున్నారు. అన్నదాతల ఆవేదన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయంగా వైఎస్సార్ రైతు భరోసా పేరుతో జిల్లాలోని 2 లక్షల మందికి పైగా రైతులకు ఏటా క్రమం తప్పకుండా నగదు అందించింది. చంద్రబాబు ప్రభుత్వం అదే పథకాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఇస్తామని చెప్పింది. అయితే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకుంటేనే పథకం వర్తిస్తుందని మెలిక పెట్టింది. దీంతో జిల్లాలోని 2,12,004 మంది రైతులు సుఖీభవ పథకానికి అర్హులైతే, కేవలం 1,54,908 మందికి మాత్రమే నగదు జమ చేసింది. 57,096 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదని సుఖీభవ నగదు జమ చేయకుండా మొండిచేయి చూపింది. దీనిపై ఇటీవల కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రత్యేకంగా అగ్రికల్చర్ అధికారులతో సమావేశమై 100 శాతం మంది రైతులకు ఈకేవైసీ చేయించాలని ఆదేశించాల్సి వచ్చింది. రేషన్ అందక ఇక్కట్లు జిల్లాలో 6.05 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ పాలనలో బియ్యం, చక్కెర, కందిపప్పు, నూనెతోపాటు 12 రకాల సరుకులు ఇచ్చేవారు. చిరుధాన్యాలు సైతం ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే చంద్రబాబు పాలనలో బియ్యంతో మాత్రమే సరిపెట్టేస్తున్నారు. కందిపప్పు ఊసేలేదు. అరకొరగా చక్కెర అందిస్తున్నారు. అయితే ముందుగా ఈకేవైసీ చేయించుకోలేదని 15శాతం మందికి ఇచ్చే బియ్యం కూడా నిలిపేశారు. -
ఆంక్షలపై అసహనం
తిరుపతి కల్చరల్ : తిరుపతిలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని పుణ్యస్నానాలు, దీపారాధనలతో భక్తులు పులకిస్తుంటారు. అయితే టీటీడీ అధికారులు కుంటి సాకులతో భక్తులను ఆలయంలోని పుష్కరిణిలోకి అనుమతించకుండా.. దీపారాధనలు చేయనీయకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో పుష్కరిణి చుట్టూ కంచె వేశారని భక్తుల మండిపడుతున్నారు. అలాగే, అయ్యప్పమాలధారులు స్నానమాచరించే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. అయ్యప్ప భక్తుల ఆందోళన రెండ్రోజులుగా అయ్యప్ప భక్తులను కపిలతీర్థం పుష్కరిణిలోకి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. టీటీడీ అధికారులు విధించిన ఆంక్షలపై అసహనం వ్యక్తంచేశారు. అయ్యప్ప భక్తులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ ఆరోపించారు. టీటీడీ ఈఓ డౌన్ డౌన్, టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పుణ్యస్నానాలకు ఎస్పీ అనుమతించినప్పటికీ టీటీడీ విజిలెన్స్ అత్యుత్సాహం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. అరగంట మాత్రమే అయ్యప్ప భక్తులను పుష్కరిణిలోకి అనుమతించారు. ఆందోళనకు దిగిన అయ్యప్ప భక్తులు -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి దుర్మరణం
వడమాలపేట (పుత్తూరు): మండలంలోని తడుకు ఆర్ఎస్ వద్ద పాదచారులపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నుంచి పుత్తూరు వైపుగా వెళుతున్న వాహనం పాదచారులను ఢీకొని వెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే విజయపురం మండలం కేవీ పురం గ్రామానికి చెందిన రంజిత్నాయుడు(52) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో క్షతగాత్రుడు వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం గ్రామానికి చెందిన బాబురాజు అలియాస్ నరసింహరాజన్న(54)కు పుత్తూరు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దీంతో రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు వడమాలపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: సిట్ విచారణకు సహకరించానని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పానన్నారు. గతంలొ టీటీడీలో పనిచేసిన అధికారులను ప్రశ్నించినట్టే తానను కూడా విచారించారన్నారు. కొత్త ప్రసార మాధ్యమాల్లో అవాస్తవాలు వేస్తున్నారని.. విచారణకు సంబంధించిన అవాస్తవాల ప్రసారంతో ప్రజలను పక్కదారి పట్టించవద్దన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని ధర్మారెడ్డి అన్నారు.టీటీడీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ నేతృత్వంలోని సిట్ టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డిని నిన్న (మంగళవారం, నవంబర్ 11) కూడా విచారణ చేశారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లోలోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు ధర్మారెడ్డి హాజరయ్యారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు మంగళవారం ఉదయం 10:58 గంటలకు ధర్మారెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం ఇచ్చారు.భోజన విరామ సమయంలో మీడియా సిబ్బంది మాట్లాడండి.. అని కోరగా ధర్మారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఫొటోలు వీడియోలు తీసుకోమని చెప్పారు. ఇదే సమయంలో జనసేన పార్టీ బహిష్కృత నేత కిరణ్ రాయల్ సిట్ కార్యాలయం వద్ద ఓవర్ యాక్షన్ చేశారు. ఎవరో తెచ్చిన లడ్డూలను తానే తిరుమల నుంచి తెచ్చా.. ధర్మారెడ్డికి ఇస్తా అంటూ హల్చల్ చేశారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే కిరణ్ రాయల్ అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ధర్మారెడ్డి భోజనానికి వెళ్లి.. 3.10 గంటలకు తిరిగి విచారణకు హాజరయ్యారు. రాత్రి 9.15 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇవాళ కూడా ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. -
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ . క్యూకాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 67,367 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,369 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.30 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
కపిల తీర్థం వద్ద అయ్యప్ప భక్తుల ఆందోళన..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో అయ్యప్ప భక్తుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు దిగింది. కపిల తీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వకపోవడంతో మాల ధరించిన స్వాములు ఆందోళనకు దిగారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు నినాదాలు చేశారు.వివరాల ప్రకారం.. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తులు ఆందోళన దిగారు. కపిల తీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో తెల్లవారుజామున స్నానం ఆచరించే అయ్యప్ప భక్తుల పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరిస్తోందని స్వాములు ఆరోపించారు. టీటీడీ వైఖరిపై భక్తులు, స్వాములు మండిపడుతున్నారు. ఎట్టకేలకు అయ్యప్ప భక్తుల ఆందోళనతో దిగివచ్చిన టీటీడీ వారి స్నానాలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ నాయుడు డౌన్ డౌన్.. టీటీటీ డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు.తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయం పుష్కరిణీ వద్ద అయ్యప్ప స్వాముల ఆందోళనస్నానం చేసేందుకు భక్తుల్ని అనుమతించని టీటీడీ విజిలెన్స్ అధికారులుటీటీడీ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన అయ్యప్ప భక్తులుకార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో స్నానాలకు దీపారాధనకు అనుమతించని అధికారులు… pic.twitter.com/s74F1Dp7jb— Rahul (@2024YCP) November 11, 2025అయితే, కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో భక్తుల స్నానాలకు, దీపారాధనకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. భక్తుల తాకిడి తక్కువగా ఉన్నప్పటికీ భక్తులపై విజిలెన్స్ అధికారులు ఆంక్షలు విధించారు. ఆలయంలో రద్దీ తగ్గుముఖం పట్టినప్పటికీ విజిలెన్స్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. దీంతో, తమకు కార్తీక మాసంలో కపిలేశ్వర స్వామి సన్నిధిలో కోనేరు దర్శనాన్ని దూరం చేస్తున్నరని భక్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భక్తులు ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో, టీటీడీ దిగి వచ్చింది. -
అక్రమ అరెస్టులు అనుచితం
వెంకటగిరి రూరల్ : వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్లకు పాల్పడడం అనుచితమని పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మండిపడ్డారు. బాబు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత కొండూరు చంద్రశేఖర్రాజుని పెనమలూరులో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విడుదలై వచ్చిన చంద్రశేఖర్ను మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై కేసులు పెట్టవద్దని కోర్టులు హెచ్చరిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని వేధిస్తే, భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం వెంకటగిరి రాజ కుటుంబీకులు డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమ వారం అర్ధరాత్రి వరకు 76,096 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,289 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.01 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తు లు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
ప్రభుత్వ స్థలం కబ్జా
సాక్షి, టాస్క్పోర్సు : గూడూరు మండలం గాంధీనగర్ ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేటుగా బ్రిక్స్ యూనిట్ ఏర్పాటు చేసి ఓ టీడీపీ నేత కాసులు కొట్టేస్తున్నాడు. వివరాలు ఇలా.. గూడూరు మండలం గాంధీనగర్ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆ సమయంలో ఇల్లు కట్టుకునేందుకు స్థోమత లేని వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో తాత్కాలికంగా సిమెంట్ బ్రిక్స్ యూనిట్ను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు మాత్రమే విక్రయించుకునేలా ఇటుకల తయారీ చేపట్టారు. అయితే ప్రభుత్వం మారి చంద్రబాబు అధికారం చేపట్టడంతో స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ఓ స్థానిక నాయకుడు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ యూనిట్ను ఖాళీ చేయించి తనకు అనుకూలంగా ఉన్న వారితో యూనిట్ను నడిపించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సిమెంట్ బ్రిక్స్ యూనిట్ సర్వే నంబర్ 1988–9పీ,లో 15 సెంట్లు, 1988–10పీలో 25 సెంట్లు, 1988–11పీలో 10 సెంట్లు భూమి మొత్తంగా 50 సెంట్లు భూమిని ఏడాదికి పైగా దర్జాగా వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే పక్కనే ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలంలో జామాయిల్ సాగు చేపట్టి దానికి పెన్సింగ్ వేసుకుని దర్జాగా ఆక్రమించేశారు. విద్యుత్ కనెక్షన్ ఎలా ఇచ్చారో.. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన త్రీ ఫేజ్ విద్యుత్ కనెక్షన్ను ఆ శాఖాధికారులు ఎలా ఇచ్చారు అనేది కూడా వారే చెప్పాలి. అదే స్థానిక ప్రజా ప్రతినిధి మాట చెప్పడమే తరువాయి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా త్రీ ఫేజ్లైన్ ఏర్పాటు చేసి బ్రిక్స్ యూనిట్కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పట్టించుకోని అధికారులు గూడూరు రూరల్ పరిధిలోని జగనన్న లే అవుట్లో ఉన్న రూ.లక్షలు విలువ చేసే 50 సెంట్ల భూమిని ఓ టీడీపీ నేత ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నా ఏ శాఖ అధికారి కూడా దీనిపై దృష్టిసారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై గూడూరు ఇన్చార్జి తహసీల్దార్ ఆర్వీ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఆ సర్వే నంబర్లో ఉన్న భూమిపై క్లారిటీ లేదని వీఆర్ఓను పంపి పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం చర్యలు చేపడతామని వివరణ ఇచ్చారు. -
శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. వాహన సేవల వివరాలు ఈనెల 17 నుంచి 25 వరకు జరగనున్న శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 17 నుంచి 25 వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. -
పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన
పెళ్లకూరు:ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.11 లక్షల కోట్లతో పరిశ్రమల స్థాపన కోసం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసినట్లు జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం పాలచ్చూరు, శిరసనంబేడు ఏపీఐఐసీ భూముల్లో కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీతో కలిసి ఆయన 3ఎక్స్ప్రే, ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు భూమిపూజ చేసి శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అలాగే దమ్ము బయో ప్యూయెల్ ప్లాంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో కిరణ్మయి, పేట డీఎస్పీ చెంచుబాబు, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, నాయకులు అనీల్కుమార్రెడ్డి, మాధవరెడ్డి, మల్లికార్జున్రెడ్డి, కృష్ణయ్య, ప్రసాద్నాయుడు, మధన్నాయుడు పాల్గొన్నారు. వసతిగృహం నుంచి బాలికలు అదృశ్యం తిరుపతి రూరల్:తిరుపతి సాయినగర్ పంచాయ తీ పరిధిలోని బైరాగిపట్టెడలోని మాతృశ్య వసతి గృహం నుంచి ఇద్దరు చిన్నారులు తప్పిపోవడంతో నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. తిరుపతి నగరంలోని జీవకోనకు చెందిన 12 ఏళ్ల బాలిక, గొల్లపల్లికి చెందిన 8 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు నిర్వాహకులు వారి చిత్రాలను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. సీఐ చిన్నగోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు తిరుపతి లీగల్ : చెక్ బౌన్స్ కేసులో తిరుపతి నగరం లక్ష్మీపురానికి చెందిన మధుకు 6 నెలలు జైలు శిక్ష, ఐదువేల రూపాయలు జరిమానా విధిస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్ జడ్జి కోటేశ్వరరావు మంగళవారం తీర్పు చెప్పారు. సాయినగర్కు చెందిన ప్రసాద్ వద్ద మధు 2015 మార్చి 27వ తేదీ రూ.4 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము చెల్లించే క్రమంలో అసలు, వడ్డీ కలిపి 2018 ఫిబ్రవరి 27వ తేదీ ఓ చెక్కును అతడు ప్రసాద్ కు ఇచ్చాడు. ఆ చెక్కును బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. దీంతో మధు పై ప్రసాద్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశాడు. నేరం మధు పై రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
● రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
ఊరూ వాడా రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. వర్షమొస్తే ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ బాగుందో తెలియని పరిస్థితి నెలకొంది. వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల పనులు మొదలు పెడతాం.. అద్దాల్లాంటి రోడ్లు నిర్మిస్తాం. మీ ఊర్లకొచ్చే బంధువులు వాటిని చూసి ఆశ్చర్యపోయేలా చేస్తాం..’ అంటూ ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు ఆచరణలో చతికిల పడ్డారు. ఎక్కడ రోడ్లు అక్కడే వదిలేశారు. గుంతల్లో ప్రయాణించలేక వాహనచోదకులు, పాదచారులు నానా ఇక్కట్ల పాలవుతున్నారు. అందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట సర్కిల్ మీదుగా కడపకు వెళ్లే ప్రధాన మార్గమే నిదర్శనం. మరోవైపు కరకంబాడి నుంచి తిరుపతికి వెళ్లే రహదారి కూడా ఇలాగే కనిపించింది. పాలకులు ఎలాగూ రోడ్ల గురించి ఆలోచించడం లేదు.. కనీసం అధికారులైన స్పందించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి -
అమ్మవారి బ్రహ్మోత్సవాలు జయప్రదం చేద్దాం
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థానమండంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ వెంకటేశ్వర్, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్ఓ మురళీకృష్ణతో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. తిరుచానూరు ఆలయం పరిసరాలు, పద్మసరోవరం, హోల్డింగ్ పాయింట్ల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజు దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు అన్నప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, పటిష్ట క్యూలైన్లు, జర్మన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడుతారన్నారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్రపతి రాక పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 17న పట్టువస్త్రాలను సమర్పించనున్న మంత్రి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నవంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని తెలిపారు. నవంబర్ 25న పంచమి తీర్థం ఉత్సవాన్ని పురష్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి వచ్చే సారె ఊరేగింపు సందర్భంగా తిరుపతి నగరంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతకుముందు టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ, జేఈవో, సీవీఎస్వోలు అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. సమావేశంలో ఆలయ అర్చకులు బాబు స్వామి, మణికంఠ స్వామి, సీఈ టి.వి. సత్యనారాయణ, ఎఫ్.ఎ అండ్ సీఏవో బాలాజీ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమం.. ఉధృతం
●మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం ఉధృతంగా మారింది. కోటి సంతకాల సేకరణతోపాటు వైఎస్సార్సీపీ తలపెట్టిన ర్యాలీకి అన్నివర్గాల మద్దతు పెరుగుతోంది. బుధవారం ఈ మేరకు జిల్లావ్యాప్తంగా కదంతొక్కేందుకు ప్రజానీకం సన్నద్ధమవుతోంది. పేదలకు ఉచిత వైద్యం.. వైద్యవిద్యను దూరం చేస్తున్న చంద్రబాబు పాలనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దిశగా సాగిస్తున్న కుట్రలపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. జగనన్న పిలుపు మేరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ సన్నాహాలు పూర్తి చేసింది. పేద విద్యార్థులు బలి చంద్రబాబు కుట్రకు పేద విద్యార్థులు బలవుతున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి మరింత మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు అందించేందుకు కృషి చేసింది. కానీ, చంద్రబాబు సర్కారు దోపిడీ విధానంతో కార్పొరేట్లకు కాలేజీలను కట్టబెట్టి రూ.వేల కోట్లు దోచుకునేందుకు సిద్ధమైంది. పేద బిడ్డల కడుపుకొట్టింది. బాబు వైఖరిపై విద్యార్థుల తల్లిదండ్రులు రగిలిపోతున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారు. – డాక్టర్ ఓబుల్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిర్వీర్యం చేసే కుట్ర చంద్రబాబు సర్కార్ వైద్య విద్యను నిర్వీర్యం చేసే కుట్రకు తెరతీయడం దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్ల నుంచి సుమా రు 3వేల ఎంబీబీఎస్ సీట్లు ప్రైవేటు పరం కావడంతో మెరిట్ విద్యార్థులకు వైద్య విద్య దూరమైంది. దీంతో నీట్లో 472మార్కులు సాధించిన విద్యార్థికి సైతం కన్వీనర్ కోటాలో సీటు రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. – అశోక్, యూనివర్సిటీల రాష్ట్ర కన్వీనర్, ఎస్ఎఫ్ఐ తక్షణం ఉపసంహరించుకోవాలి రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ పాలనలో ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ప్రైవే టు పరం చేయడం దారుణం. ఒక్కో జిల్లాలో ఏడాదికి కన్వీనర్ కోటా కింద సుమారు 300మంది, బి–కేటగిరీలో సుమారు మరో 500మంది ఎంబీబీఎస్ సీట్లు కోల్పోతున్నా రు. ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి. లేకుంటే పోరాటం ఉధృతం చేస్తాం. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి తిరుపతి తుడా/ తిరుపతి సిటీ : మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన ఆందోళనకు విద్యార్థి లోకం పూర్తిగా మద్దతు పలికింది. చంద్రబాబు సర్కార్ వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కక్షపూరిత విధానాలను అమలు చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని పేద, మెరిట్ విద్యార్థులకు ఉచితంగా వైద్యవిద్యను అందించాలనే ఉన్నత లక్ష్యంతో గ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలను నెలకొల్పారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నిస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా గత రెండేళ్లలో సుమారు 1,500మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీటు పొందలేకపోయారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణకు పోరాటం -
శ్రీసిటీలో జర్మనీ ప్రతినిధుల బృందం
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : జర్మనీలోని సాక్సోనీ రాష్ట్రానికి చెందిన 18 మంది వాణిజ్య ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీ సిటీని సందర్శించింది. ఆ రాష్ట్ర వాణిజ్య, కార్మిక, ఇంధన, వాతావరణ శాఖ మంత్రి డిర్క్ పాంటర్ నేతృత్వంలో పర్యటనకు విచ్చేసిన ప్రతినిధులకు శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఒనగూరే వ్యూహాత్మక వ్యాపార ప్రయోజనాలను డాక్టర్ సన్నారెడ్డి వారికి వివరించారు. అనంతరం ప్రతినిధి బృందం స్థానిక బెల్ ఫ్లేవర్స్ – ఫ్రాగ్రెన్సెస్ పరిశ్రమను సందర్శించి, కార్యకలాపాలను పరిశీలించింది. ఈ పర్యటనలో ప్రధానంగా దుస్తులు, మెటల్ ఉత్పత్తులు, వైద్య పరికరాల తయారీ, నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణ కార్యక్రమాలలో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించారు. వెంటాడిన మృత్యువు రేణిగుంట : మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు పట్టణానికి చెందిన తల్లీ కొడుకు మృతి చెందిన సంఘటన మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కర్నూలు పట్టణానికి చెందిన కె.ఎన్. చంద్రభాను సింగ్ (37), ఓ మెడికల్ కంపెనీలో ఏరియా బిజినెస్ మేనేజర్గా పనిచేస్తూ తన తల్లి సరస్వతీ భాయ్ (63), భార్య శ్రీదివ్య (24), కుమార్తె త్రీక్షణ సింగ్ (5)తో కలిసి కర్నూలు నుంచి కారులో చైన్నెకు వెళుతుండగా మార్గ మధ్యలోని రేణిగుంట మండలం శ్రీనివాసపురం సమీపంలో కారును అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో చంద్రభాను సింగ్ అక్కడికక్కడే మరణించగా, ఆయన తల్లి సరస్వతీ భాయ్ తీవ్ర గాయాలతో రుయా ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రభాను భార్య శ్రీదివ్య స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే చిన్నారి త్రీక్షణ సింగ్ సురక్షితంగా బయటపడ్డారు. -
మా ఆవేదన తగులుతుంది
నీట్–2025లో మా అబ్బాయికి 469 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ కన్వీనర్ కోటాలో సీటు దక్కలేదు. జగనన్న ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలలు ప్రైవేటు చేతికి వెళ్లకపోయుంటే మా అబ్బాయికి తప్పకుండా సీటు వచ్చేదు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. లేకుంటే మా తల్లిదండ్రుల ఆవేదన తప్పక తగులుతుంది. – కోమలాదేవి, విద్యార్థి తల్లి, తిరుపతి వైద్యుల సంఖ్య తగ్గితే ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడంతో వైద్యుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. దీంతో వైద్యం సైతం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమవుతుంది. గత వైఎస్సార్సీపీ సర్కారు రాష్ట్రంలో 17మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకే పెద్దపీట వేస్తోంది. – పరంధామరెడ్డి, విశ్రాంత వైద్యాధికారి, తిరుపతి -
మూడు చక్రాల వాహనాలకు..
తిరుపతి అర్బన్: విభిన్న ప్రతిభావంతులు మూడు చక్రాల వాహనం కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయసంచాలకులు విక్రమ్కుమార్రెడ్డి మంగళవారం వెల్లడించారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులు చెల్లవని స్పష్టం చేశారు. కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 10 మందికి మాత్రమే ఇస్తామని చెప్పారు. దళారులను నమ్మకుండా డబ్లూడబ్యూడబ్యూ.ఏపీడీఏఎస్సీఏసీ.ఏపీ.జీవో.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి 18–45ఏళ్ల లోపు వయస్సు కలిగిన 70శాతం వైకల్యం ఉండాలని పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స ఉండాలని తెలిపారు. దరఖాస్తుదారుడు గతంలో ఎటువంటి వాహనాలు పొంది ఉండకూడదన్నారు. దరఖాస్తుదారులపై సొంత వాహనాలు ఉండకూడదని, ఎవరి సహాయం లేకుండా నడవలేని వారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. దివ్యాంగులకు వైకల్యం శాతంపై టెన్షన్ జిల్లాలో 7600 మందికి వైకల్యం తగ్గడంతోనే పింఛన్లు తొలగిస్తున్నట్లు సచివాలతయ సిబ్బంది నోటీసులు జారీ చేశారు. దీంతో దివ్యాంగులు పెద్ద ఎత్తున న్యాయం కోసం రోడ్డెక్కారు. ఈ క్రమంలో దిగివచ్చిన చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా పింఛన్లు ఇవ్వాలని సూచనప్రాయంగా తెలిపారు. అలాగే మరోసారి వైకల్యం పరీక్షలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు పలు ప్రభుత్వాస్పత్రుల్లో వైకల్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 30శాతం మందికి మాత్రమే పరీక్షలు చేసి, 20 శాతం మందికి కొత్త సర్టిఫికెట్లు జారీ చేశారు. మిగిలిన 70శాతం మందికి వైకల్యం పరీక్షలు చేయడానికి మరో రెండు నెలలు సమయం పట్టేలా ఉంది. పాత సర్టిఫికెట్లు, కొత్త సర్టిఫికెట్లు ఏదీ తీసుకోవడం లేదు.. రాష్ట్రంలో 5.80 లక్షల మంది దివ్యాంగులుంటే చంద్రబాబు పాలనలో ఈ ఏడాది ఆగస్టులో ఇచ్చిన వైకల్యం శాతం ప్రకారం 1.30 లక్షల మందికి మాత్రమే 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉంది. మిగిలిన 4.50 లక్షల మందికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉండేలా ఇచ్చారు. తిరిగి న్యాయం కోసం పోరాటాలు చేస్తే మళ్లీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2.50 లక్షల మందికి పరీక్షలు చేశారు. అందులో లక్ష మందికి మాత్రమే కొత్త సర్టిఫికెట్లు వచ్చాయి. మిగిలిన 1.50 లక్షల మందికి కొత్త సర్టిఫికెట్లు రాలేదు. మరోవైపు 3.30 మందికి పరీక్షలు చేయాల్సి ఉంది. ఇంకోవైపు అన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి పాత, కొత్త సర్టిఫికెట్లు ఏవైనా సిస్టమ్ తీసుకోవడం లేదు. ఈ క్రమంలో ఒక్కో నియోజకవర్గానికి 10మందిని ఏలా ఎంపిక చేశారో తెలియడం లేదు. అధికార పార్టీ నేతలు చెప్పిన వాళ్లకు ఇవ్వకుండా నిజమైన అర్హులకు ఇవ్వాలని కోరుతున్నాం. –చంద్రశేఖర్, దివ్యాంగుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ -
చాకచక్యంగా విద్యుత్ మరమ్మతు పనులు
నారాయణవనం:ఆరు అడుగుల లోతున్న చెరువు మధ్యలో విద్యుత్ స్తంభంపై విరిగిన పిన్ ఇన్సులేటర్ను విద్యుత్ సిబ్బంది వినూత్నంగా ఆలోచించి మంగళవారం మార్పు చేసి, అందరి మన్ననలు పొందారు. వివరాల్లోకి వెళితే.. సముదాయం సబ్స్టేషన్ నుంచి వెత్తలతడుకు చెరువు మీదుగా హెచ్టీ లైన్ వెలుతోంది. చెరువు మధ్యలో స్తంభంపై పిన్ ఇన్సులేటర్ విరిగిపోవడంతో విద్యుత్ అంతరాయం కలిగింది. సమస్యను గుర్తించిన లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, జేఎల్ఎం ఏఎల్ఎం అమర్నాథ్, ఆంజనేయులతో క్షేత్ర పరిశీలనతో సుమారు ఆరు అడుగుల లోతున్న చెరువు మధ్యలో పిన్ ఇన్సులేటర్లు విరిగిపోవడం గుర్తించారు. లారీ ట్యూబ్పై కుర్చున్న గురునాథ్ను ఆంజనేయులు తీసుకువెళ్లి పిన్ ఇన్సులేటర్లను మార్చి, విద్యుత్ ప్రసా రాన్ని పునరుద్ధరించారు. అమర్నాథ్, ఆంజనేయులను సిబ్బందితో పాటు పలువురు ప్రశంసించారు. -
బైక్ను ఢీకొన్న బస్సు
● చికిత్స పొందుతూ ఒకరి మృతి తిరుపతి రూరల్ : తిరుపతి– చంద్రగిరి మార్గంలోని తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల సమాచారం మేరకు... తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందిన వెంకటరెడ్డి, తన సోదరుడు హనుమంతరెడ్డి కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తిరుపతి నుంచి చంద్రగిరి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ఘటనలో వెంకటరెడ్డి, హనుమంతరెడ్డి ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ వెంకటరెడ్డి మంగళవారం మృతి చెందగా హనుమంతరెడ్డి గాయాలతో ఆసుపత్రిలోనే ఉన్నారు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాగరమాల పనులను అడ్డుకున్న అన్నదాతలు కోట : మండలంలోని కొత్తపాళెం వద్ద మంగళవారం సాగరమాల రోడ్డు నిర్మాణ పనులను కొత్తపాళెం, నెల్లూరుపల్లి గ్రామాల రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా తూర్పు కనుపూరు వరకు సాగరమాల రోడ్డు పనులు జరుగుతున్నాయి. విద్యానగర్ నుంచి కొత్తపాళెం వరకు పెన్నక్కచెరువు మీదుగా రోడ్డు వెలుతుంది. పెన్నక్క చెరువు నుంచి దిగువ ఆయకట్టుకు నీటిని తీసుకెళ్లే ఆరు పంట కాలువలను రోడ్డు నిర్మాణంలో భాగంగా పూడ్చి వేశారు. దీంతో రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు పెన్నక్కచెరువు నుంచి నీరు అందని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. దీంతో సాగరమాల రోడ్డు పనులను అడ్డుకున్నారు. టీటీడీ ఉద్యోగికి రిమాండ్ తిరుపతి లీగల్ : చీటింగ్ కేసులో టీటీడీ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్యకు ఈనెల 24వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్ జడ్జి కోటేశ్వరరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నిందితుడు శంకరయ్య తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తానంటూ భక్తుల వద్ద అధిక డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు నిందితుడు శంకరయ్య పై చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడు శంకరయ్య ప్రజాప్రతినిధుల పీఆర్ఓ లను దర్శనాల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసుల ముమ్మర తనిఖీలు రేణిగుంట:ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వం హై అలర్ట్ ప్రకటించింది. అందులో భాగంగా రేణిగుంట విమానాశ్రయం, రైల్వేస్టేషన్లో రూరల్ సీఐ మంజునాథరెడ్డి, అర్బన్ సీఐ జయచంద్ర, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. -
ర్యాగింగ్ సరదా కాదు.. అమానుషం
– ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి సిటీ:ర్యాగింగ్ సరదా కాదు.. అని అదో అమా నుష ప్రక్రియ అని అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. మంగళవారం ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియం వేదికగా స్టూడెంట్స్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థుల్లో మానవతా విలువలను పెంపొందించడమే విద్య ప్రధాన లక్ష్యమన్నారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థి మనోభావాలను దెబ్బతీయడం, మానవత్వం కాదన్నారు. కొత్తగా యూనివర్సిటీలో అడుగు పెట్టిన విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేయడం నేరమన్నారు. జూనియర్లను స్నేహపూర్వకంగా ప్రోత్సహించడం ప్రతి సీనియర్ బాధ్యతని, ర్యాగింగ్ ద్వారా ఎవరికీ ఆనందం రాదని, అది ఎదుటివారికి మానసిక క్షోభను కలిగిస్తుందన్నారు. అలాంటి ఘటనలు జరిగితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ర్యాగింగ్ ఘటనపై ఫిర్యాదు చేసిన వారికి పూర్తి రక్షణ, న్యాయం అందించనున్నట్లు ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం వీసీ ప్రొఫెసర్ నర్సింగరావు మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది విద్యార్థి జీవితాన్ని దెబ్బతీసే దుర్మార్గమైన అలవాటని, ఎస్వీయూలో ప్రతి విద్యార్థీ సురక్షిత వాతావరణంలో చదువుకునే హక్కు ఉందన్నారు. ఆ హక్కుకు ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, రెక్టార్ అప్పారావు, డీఎస్పీ భక్తవత్సలం పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మోసపోయిన రైతు
తిరుపతి: అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలంలోని ఎగువ రెడ్డిపల్లికి చెందిన రైతు తన పిల్లల చదువుల కోసం తిరుపతి రూరల్ ఓటేరు పంచాయితీలోని శ్రీవాణి నగర్లో నివాసం ఉంటున్నాడు. అయితే రైతు ఫోన్ నెంబర్ వాట్సప్కు PMJY కిసాన్ యోజన పథకం పేరుతో ఉన్న లింక్ వచ్చింది. లింక్ ఓపెన్ చేయడంతో వ్యక్తిగత వివరాలను అడిగిన సైబర్ నేరగాళ్లకు తన వివరాలు తెలిపాడు రైతు. దాంతో రైతు అకౌంట్లో ఉన్న 10 లక్షల 81 వేల రూపాయలలో 7.50 లక్షల నగదు విత్ డ్రా అయినట్టు రైతు ఫోన్కు మెసేజ్ వచ్చింది. తన అకౌంట్ నుండి 7.50 లక్షల నగదు సైబర్ నేరగాళ్లు కొట్టేశారని గ్రహించిన బాధితుడు.వెంటనే 1930కు కాల్ చేసి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాడు. తను మోసపోయినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు. సైబర్ నేరగాళ్లను చేధించే పనిలో పడ్డారు. -
● బకాయిలు చెల్లించాలని ధర్నా
మామిడి రైతుల నిరసన పాకాల : మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీ రామిరెడ్డి ఇండ్లు సమీపంలో ఉన్న సుప్రీమ్ క్వాలిటీ ఫుడ్ ప్రాడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులు నిరసన తెలిపారు. బకాయిలు చెల్లించాలంటూ సోమవారం ధర్నాకు దిగారు. జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ఆనంద నాయుడు మాట్లాడుతూ మామిడి కేజీకి రూ.8 చెల్లిస్తామని కొనుగోలు చేసి, రూ.4 మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కేజీకి రూ.8 ప్రకారం మామిడి రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సుమారు 765 మంది రైతులు 3,656 టన్నులు మామిడిని ఫ్యాక్టరీకి అమ్మినట్లు వెల్లడించారు. వెంటనే బకాయిలను చెల్లించాలని ఫ్యాక్టరీ మేనేజర్కు వినతిపత్రం అందించారు. నేతలు హరిబాబు చౌదరి, లవకుమార్రెడ్డి, చంద్రమౌళి, పద్మనాభనాయుడు, రమేష్నాయుడు పాల్గొన్నారు. -
20న జిల్లాకు రాష్ట్రపతి రాక
తిరుపతి అర్బన్ : రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈ నెల 20వ తేదీన రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్లో ఎస్పీ సుబ్బరాయుడుతో కలసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 20వ తేదీ మధ్యాహ్నం 3.25 గంటలకు రాష్ట్రపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. 4.30కి బయలుదేరి 5.20 గంటలకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రి బస చేస్తారని వెల్లడించారు. 21వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, 11.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నట్లు వివరించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఆర్ఓ నరసింహులు, ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్రెడ్డి, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డీపీఓ సుశీలాదేవి, ఆర్అండ్బీ ఎస్సీ రాజా నాయక్, డీఆర్డీఏ పీడీ శోభనబాబు పాల్గొన్నారు. ప్రారంభమైన సమ్మెటివ్ పరీక్షలు – నేటి నుంచి 1– 5వ తరగతులకు తిరుపతి సిటీ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు సమ్మెటివ్–1 పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం 1– 5వ తరగతుల విద్యార్థులకు ప్రారంభంకానున్నాయి. ఈనెల 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 78,217 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,000 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. సిరులు కురిపించే భూములు ఎడారిని తలపిస్తున్నాయి. పచ్చదనంతో విలసిల్లిన పంట పొలాలు ఇసుక మేటలతో నదీ తీరాలను గుర్తుకుతెస్తున్నాయి. ఓళ్లూరు రాయలచెరువు ఘటనతో ఎక్కడికక్కడ రాళ్లు చేరి వ్యవసాయాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ముంపు గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇన్నేళ్లుగా పోషించిన నేలతల్లి ధ్వంసం కావడంతో అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆపన్నహస్తం అందించాల్సిన ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. -
డ్రైవింగ్ స్కూల్లో 36వ బ్యాచ్కు శిక్షణ
తిరుపతి అర్బన్: తిరుపతి అలిపిరి ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్లో సోమవారం 36వ బ్యాచ్కి శిక్షణ ప్రారంభించారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ పూర్తి చేసుకున్న 35వ బ్యాచ్కి వీడ్కోలు పలికారు. ఒక్కో బ్యాచ్ కింద నామమాత్రపు ఖర్చులతో 16 మందికి శిక్షణ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే 36వ బ్యాచ్లో షెడ్యూల్ కులం సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో 10 మందికి అవకాశం కల్పించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి విక్రమ్కుమార్రెడ్డి, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ హరిబాబు, ఈఈ నరసింహులు, మణి పాల్గొన్నారు. నేడు ఇండస్ట్రియల్ పార్క్కు భూమి పూజ వరదయ్యపాళెం: చిన్నపాండూరులో ఏపీఐఐసీ సెజ్లో 5.68 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్కు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా భూమి పూజ చేయనున్నట్లు ఏపీఐఐసీ జెడ్ఎం విజయ్ భరత్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.16.78 కోట్లతో ప్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వర్చువల్గా జరిగే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘పది’ పరీక్ష ఫీజుకు 25 వరకు గడువు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఈనెల 25వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 25వ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అపరాధ రుసుముతో డిసెంబర్ 3వ తేదీ వరకు అవకాశముంటుందని వెల్లడించారు. -
పవనానందం.. హాస్యాస్పదం
తిరుపతి మంగళం : ఉప్పొంగి ప్రవహించే నదిలో నీరు పోయడం.. దట్టమైన అడవిలో మొక్కలు నాటడం.. నల్లకళ్లజోడు ధరించి పుస్తకాలు చదవడం.. తిరుపతి, పలమనేరులో రెండు రోజులు పర్యటించిన అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీరు హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అడవులపై అటవీశాఖ మంత్రికి ఏ మాత్రం అవగాహన లేదని అందరికీ తెలిసిందన్నారు. మామండూరు అడవుల్లో సినిమా షూటింగ్కు వచ్చి ఫోజులిచ్చినట్లు ఉందే తప్ప, ఏం తెలుసుకోవాలని వచ్చారో అర్థం కావడంలేదన్నారు. తిరుమల శ్రీవారికి గాయమైనప్పుడు నేలపై పడిన రక్తతో ఎర్రచందనం మొక్కలు పెరిగాయని, అందుకే అవి ఎర్రగా ఉంటాయని పవన్ కల్యాణ్ చెప్పడం ఆయన అవగాహన రాహిత్యాన్ని చాటుతోందని తెలిపారు. అరుదైన ఎర్రచందనం చెట్ల గురించి ఏమాత్రం తెలియని తొలి అటవీశాఖ మంత్రి పవన్కల్యాణ్ అయ్యుంటారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేల టన్నుల ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిపోకుండా పట్టుకుని భద్రపరిచామని వెల్లడించారు. రెండు రోజులు తిరుపతి, పలమనేరు పర్యటనకు రావడం ఏంటి? రాత్రి మళ్లీ హైదరాబాదుకు వెళ్లడం ఏంటి? తిరిగి ఉదయం మళ్లీ తిరుపతికి రావడం ఏంటని ప్రశ్నించారు. జనసేన శ్రేణుల్లో అసంతృప్తి రేణిగుంట ఎయిర్పోర్టులో తిరుపతి ఎమ్మెల్యే, పలమనేరులో అక్కడి ఎమ్మెల్యేని పట్టించుకోలేదని, ఇక జనసేన నేతలను నిర్లక్ష్యం చేశారని, దీనిపై ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎంగా ప్రజలను కూడా చూసీచూడనట్టు వెళ్లిపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవీబీపురం మండలం ఓళ్లూరు రాయలచెరువు ఘటనలో బాధితులను కనీసం పరామర్శించేందుకు వెళ్లకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. -
మోటార్ బైక్ను ఢీకొన్న బస్సు..ఒకరి మృతి
నాయుడుపేటటౌన్: పట్టణంలోని కేకే కల్యాణ మండపం సమీపంలో సోమవారం సాయంత్రం ఓ ప్రైవేటు బస్సు మోటార్ బైక్ ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషయంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. పెళ్లకూరు మండలం అర్ధమాల గ్రామానికి చెందిన ఏ శివ(27), నాయుడుపేట మండలం చిలమాత్తురు గ్రామానికి చెందిన గొనుపల్లి శ్రావణి బైక్పై పెళ్లకూరు గ్రామం వైపు నుంచి నాయుడుపేటకు వస్తున్నారు. నాయుడుపేట బైపాస్రోడ్డులోని కేకే కల్యాణ మండపం సమీపంలో వారి బైక్ను మేనకూరు సెజ్లోని ఓ పరిశ్రమకు ఉద్యోగులను తరలించే ప్రైవేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్లో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. శ్రావణి పరిస్థితి విషయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ బాబి సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంబీయూను సందర్శించిన పెన్ యూనివర్సిటీ ప్రతినిధులు
చంద్రగిరి: మండలంలోని మోహన్బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)ను ఆమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కోసం ఎంబీయూ ప్రతినిధులతో చర్చించారు. రెండు యూనివర్సిటీల మధ్య సహకార సంబంధాలు మరింత బలోపేతం దిశగా చర్చలు నిర్వహించినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులు ప్రారంభ సంవత్సరాలను ఎంబీయూలో పూర్తి చేసి, తర్వాత పెన్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు కొనసాగించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్లు, స్కాలర్షిప్, ఆర్థిక సాయం వంటి అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫసర్ వెంకటరామన్, అమండా లూట్, వెండి మోయ్నిహాన్, ఎంబీయూ వీసీ నాగరాజ్ రామారావు, రిజిస్ట్రార్ సారథి, డీన్ అకాడమిక్స్ డాక్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు. పటిష్టంగా క్యూల నిర్వహణ తిరుమల: తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్పై సోమవారం ఉదయం టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ మురళీకృష్ణతో కలిసి సమీక్షించారు. ఆయన మాట్లాడు తూ క్యూల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. క్యూలో భక్తుల సంఖ్య, కదలికలపై గణాంకాలను ఎప్పటికప్పుడు వి శ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఐటీ విభాగానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు. ప్రస్తుత సాప్ట్ వేర్ ను మరింతగా అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీటీడీ ఐటీ జీఎం ఫణి కుమార్ నాయుడు, డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, డీజీఎం(ఐటీ) వెంకటేశ్వర నా యుడు, కార్య ఫౌండేషన్ ప్రతినిధులు జయ ప్రసాద్, రవి పాల్గొన్నారు. -
పెట్రోల్తో కలెక్టరేట్కు వచ్చిన దంపతులు
తొట్టంబేడు మండలంలోని శ్రీకృష్ణాపురం రెవె న్యూ పరిధిలో భూ సమస్య పరిష్కారానికి ఆరు నెలలుగా తిరుగుతున్న ఎస్.వీరాస్వామి, అమరావతి దంపతులు సోమవారం కలెక్టరేట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కుమారుడు ప్రేమ్కుమార్ ఓ కట్టెల సంచిలో పెట్రోల్ క్యాన్ ఉంచారని, ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడడానికి సిద్ధమయ్యారని పోలీసులకు ముందుగా సమాచారం అందింది. దీంతో పోలీసులు వారి వద్దకు వెళ్లి పెట్రోల్ ఉన్న క్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న కలెక్టర్ వెంకటేశ్వర్ భార్యభర్తలను పిలిపించి, వారి భూమికి సంబంధించిన లోటుపాట్లును వివరించారు. మరోవైపు తిరుచానూరు పోలీసులు వారిపై కేసును నమోదు చేయడానికి తమ పోలీస్స్టేషన్కు తీసుకుపోయారు. -
సిద్ధలయ్య కోనలో భక్తుల రద్దీ
సైదాపురం: మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సిద్ధలయ్యకోనలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మూడో కార్తీక సోమవారం సందర్భంగా జరిగే తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. మహిళలు దీపారాధన చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘డయల్ యువర్ సీఎండీ’కి విశేష స్పందన
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నిర్వహిస్తున్న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఏపీ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంర్ నిర్వహించిన డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి 76 మంది విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. అందులో అత్యధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, గృహాలపై వెళ్లే విద్యుత్ లైన్లు, పాఠశాల ప్రాంగణంలోని విద్యుత్ లైన్ల మార్పు, కాలిపోయిన/చోరీకి గురైన ట్రాన్స్ ఫార్మర్లను మార్చడంలో జాప్యం, విద్యుత్ బిల్లులు, విద్యుత్ లైన్లు/స్తంభాల మార్పిడి, విద్యుత్ లైన్లకు దగ్గరగా చెట్ల కొమ్మలు ఉండడం, ఇనుప విద్యుత్ స్తంభాల మార్పు, విద్యుత్ స్తంభాలపై డిష్ వైర్లు వేలాడుతుండడం, తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం తదితర సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై ఫిర్యాదు చేసిన వారికి సీఎండీ శివశంకర్ లోతేటి సమాధానమిస్తూ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో ప్రత్యేకాధికారులు ఆయా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. గత సోమవారం నిర్వహించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా నమోదైన 87 సమస్యల్లో 62 సమస్యలను కేవలం వారం రోజుల్లో పరిష్కరించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్ఖాన్, కె.గురవయ్య, కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణాదేవి, కె. ఆదిశేషయ్య, పి. సురేంద్ర నాయుడు, ఎం. మురళీ కుమార్, జనరల్ మేనేజర్లు సీహెచ్ రామచంద్రరావు, జి. చక్రపాణి, డి. సురేంద్రరావు, సి. ప్రసాద్, వై. వెంకటరాజు, పి.భాస్కర్రెడ్డి, డి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి
తిరుపతి అర్బన్:‘సార్.. మా సమస్యలు పరిష్కరించండి’ అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, సుధారాణిని ప్రాధేయపడ్డా రు. కలెక్టర్తోపాటు అధికారులు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 266 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపై 169 అర్జీలు వచ్చాయి. ఆత్మహత్యానికి పాల్పడితే కేసులు తప్పవు సమస్యలు ఉంటే వాటికి పరిష్కారానికి పోరాటాలు చేయడం తప్పుకాదని కలెక్టర్ అన్నారు. అయితే పెట్రోల్తో కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఊరుకోబోమని, వారిపై కేసులు పెడ తామని హెచ్చరించారు. ఒకరిని చూసి మరొకరు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఒక్కో అటెండర్ 20 మందిని పంపేస్తున్నారు! పీజీఆర్ఎస్లో 10 మంది వరకు అటెండర్లు పనిచేస్తున్నారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ఉదయం వచ్చినా అర్జీలను సిద్ధం చేసుకుని క్యూలో నిల్చున్నా అధికారులను కలవడానికి మధ్యాహం 2 గంటలవుతోంది. అయితే అక్కడ పనిచేస్తున్న అటెండర్లు మాత్రం దర్జాగా ఆయన మా వీధిలో వాడు, ఆయన మా స్నేహితుడికి కావాల్సిన వారు, ఆయన బంధువు అంటూ ఒక్కో అటెండర్ గ్రీవెన్స్లో అడ్డదారిలో 10 నుంచి 20 మందికిపైగా అధికారులను కలవడానికి పంపేస్తున్నారు. దీంతో పలువురు అర్జీదాలులు ప్రశ్నించడంతో వాగ్వావాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ భూమని ఆక్రమించి మొక్కలు నాటేశారు! అధికారపార్టీ నేతల అండతో చెంగల్రెడ్డి అనే నేత ప్రభుత్వ భూమిని ఆక్రమించి మొక్కలు నాటేశారని ఎర్రవారి పాళెం మండలంలోని చెరుకువారి పల్లి గ్రామానికి చెందిన నాగరాజు అన్నారు. దశాబద్దాలుగా ప్రభుత్వ భూమిలో ఉన్న బండి బాట మీదుగా అవతల వైపు ఉన్న తమ పొలంలోకి వెళ్లేవాళ్లమని చెప్పారు. అయితే తాజాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి మొక్కలు నాటి, ఆ మార్గాన్ని మూసి వేశారన్నారు. మా బిడ్డకు పింఛన్ ఇవ్వండి తమ బిడ్డకు పింఛన్ ఇవ్వాలని సత్యవేడు మండలం శిరసనంబేడు గ్రామానికి చెందిన సోనియా, ఆమె భర్త పేరు అన్నమలై కోరారు. తమ కుమార్తె గాయత్రి నాలుగో తరగతి చదువుతోందన్నారు. ఇటీవల అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రిలో చూపించామని, ఆమెకు ఒక కిడ్నీ మాత్రమే ఉందని డాక్టర్లు చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తె గాయత్రికి పింఛన్ ఇప్పించాలని కోరారు. -
మోసం కేసులో నిందితులు..
వరదయ్యపాళెం: తూకంలో మోసం చేసేందుకు ఏకంగా వే బ్రిడ్జికి చిప్పును అమర్చి మోసానికి పాల్పడిన వారిని శ్రీసిటీ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ బీవీ శ్రీనివాసులు కథనం మేరకు.. శ్రీసిటీలోని డానియల్ పరిశ్రమ సమీపంలోని డీపీజెడ్ ప్రాంతంలో ఉన్న వే బ్రిడ్జి వద్ద కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి తూకాల్లో మోసం చేసేందుకు కొన్ని పరికరాలను అమర్చి మోసానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సెక్యూరిటీ విజిలెన్స్ విభాగం ఏజీఎం రమేష్ శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి, సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టి, నిందితులను గుర్తించి సోమవారం అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఇమ్రాన్బాషా, బాబా సాహేబ్, ఇషాద్ బాషా, మనోజ్ నాయక్, మహ్మద్ అబ్బాస్తోపాటు గుమ్మడిపూండికి చెందిన జాకీర్ హుస్సేన్ బాషా ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెయ్యల తిప్ప ఆక్రమణల తొలగింపు
కలువాయి(సైదాపురం): కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని సర్వే నంబర్ 733లో ఉన్న 10 ఎకరాల పెయ్యల తిప్పను కొందరు స్థానికులు, నాయకులు సాయంతో ఆక్రమించారు. పేదలకు ఇదే ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రధాన రహదారికి తిప్ప దగ్గరగా ఉండడంతో కొందరు నాయకులు సాయంతో ఆక్రమణ దారులు పెట్రేగిపోతున్నారు. ఈ విషయమై స్థానికులు ఇన్చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయగా సోమవారం వీఆర్వో జనార్దన్ జేసీబీ సహాయంతో ఆక్రమణలను తొలగించారు. మహిళ మెడలో గొలుసు చోరీ తిరుపతి రూరల్: పేరూరు పంచాయతీ విద్యానగర్ కాలనీలో నివాసముంటున్న అనసూయ సోమవారం కార్తీక మాసం కావడంతో పక్కింట్లో జరిగే పూజకు వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్సైకిల్పై వచ్చి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఆ సమయంలో ఆమె గట్టిగా అవరడంతో ఆమె కుమారుడు ఇంటి మేడపై నుంచి రోడ్డువైపు చూడగా అప్పటికే బైక్పై వేగంగా దూసుకుపోతున్న ఆ ఇద్దరు యువకులను పట్టుకునేందుకు ఎదురుగా వచ్చేవారెవరూ సాహసించలేదు. దీంతో వారు పారిపోయారు. చోరీకి గురైన మహిళ మెడలోని 50 గ్రాముల బంగారం గొలుసు విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని బాధితురాలు చెబుతోంది. బాధితురాలు అనసూయ కుమారుడు దుద్దుకూరు కుమార్ ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేశారు. -
‘మనోబంధు’ పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి అర్బన్ : మానసిక సమస్యలతో బాధపడుతూ రహదారులపై తిరుగుతున్న వారిని గుర్తించి రక్షణ కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సోమవారం మనోబంధు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, జిల్లా కార్యదర్శి డాక్టర్ జి.ప్రథీత్, డీఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్ పాల్గొన్నారు. అలాగే ఐదేళ్లలోపు పిల్లల్లో న్యుమోనియాను నివారణకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డీఎంహెచ్ఓ బాలకృష్ణనాయక్తో కలసి అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి న్యుమోనియా నివారణపై పిల్లలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శాంతకుమారి, డీపీహెచ్ఎన్ఓ మంజుల, డిప్యూటీ డెమో అధికారి షేక్ ఖాజావలీ, మురళి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే జిల్లాను కుష్టు వ్యాధి రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 30 వరకు కుష్టు నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. టీబీ, కుష్టు నివారణ అధికారి శైలజ, డీఐఓ శాంతకుమారి, డీఎన్ఎం డాక్టర్ రాజా, ఫిజియోథెరపిస్ట్ వెంకటరమణ పాల్గొన్నారు. -
శ్రీహరికోటకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సూళ్లూరుపేట: పట్టణంలోని మన్నారు పోలూరు విద్యుత్ సబ్స్టేషన్ నుంచి శ్రీహరికోటకు వెళ్లే 33–11 కేవీ విద్యుత్ లైన్ పులికాట్ సరస్సుకు మధ్యలో తెగిపోయింది. శ్రీహరికోటలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఏడీఈ శేఖర్, ఏఈ జగదీస్, లైన్ ఇన్స్పెక్టర్ రఫీ వారి సిబ్బంది వెంటనే స్పందించి ఎక్కడ తెగింది అనే దానిపై పులికాట్ సరస్సు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను పరిశీలించగా కుదిరి–అటకానితిప్ప మద్యలో విద్యుత్ వైర్లు తెగిపోవడాన్ని గుర్తించారు. అయితే పులికాట్ సరస్సులో ఉప్పు వల్ల తుప్పు పట్టి ఇలా తెగిపోవడం సహజమే. ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో విద్యుత్ వైర్లు మార్చాల్సి ఉంది. విద్యుత్ వైర్లు తెగిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. వెంటనే విద్యుత్ సరఫరా అపేసి మరమ్మతులు చేసి శ్రీహరికోటకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పులికాట్ సరస్సులో విద్యుత్ లైన్ మరమ్మతు చేస్తున్న ట్రాన్స్కో సిబ్బంది -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
రేణిగుంట: మండలంలోని లక్ష్మీనగర్లోని వైన్షాపు సమీపంలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. సోమవారం గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రవి మనోహరాచారి ఈ కేసు వివరాలను వెల్లడించారు. క్లూస్ టీమ్ సహకారంతో మృతదేహం వేలిముద్రలు సేకరించి పరిశీలించగా, మృతుడు కొండూరు మనోజ్ అని నిర్ధారణ అయ్యింది. దర్యాప్తులో ముఖ్యమైన ఆధారాలు లభించాయి. కట్టపుట్టాలమ్మ ఆలయం వద్ద పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రధాన నిందితుడు హరిప్రసాద్ సుధాకర్, శ్యామ్సన్ సహాయంతో హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. హత్య కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు. -
లడ్డూ ప్రసాదంపై బాబు సర్కారు కుట్ర!
సాక్షి అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకొచ్చే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం మరింత పదును పెట్టింది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు బరి తెగించింది. అందుకోసం పరస్పర విరుద్ధ ఆరోపణలు, అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి న్యాయస్థానాలను బురిడీ కొట్టించేందుకు కూడా తెగబడుతుండటం తీవ్ర విభ్రాంతి కలిగిస్తోంది. టీటీడీ నెయ్యి వివాదంలో సిట్ తాజాగా అరెస్టు చేసిన సుగంథ్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ నివేదికే అందుకు తాజా తార్కాణం.ఆ రిమాండ్ నివేదికలోని అంశాలను ఎల్లో మీడియాతోపాటు వివిధ మీడియా సంస్థలకు ముందుగానే లీక్ చేసి రాద్ధాంతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం తన కుట్రలను నిస్సిగ్గుగా బయట పెట్టుకుంది. ఆ దుష్ప్రచార కథనాలను మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. అంటే పక్కా కుతంత్రంతోనే ఈ దుష్ప్రచార కుట్రలకు ప్రభుత్వం బరి తెగించిందన్నది స్పష్టమవుతోంది. తిరుపతి పోలీసులు అరెస్టు చేసిన అజయ్ కుమార్ సుగంథ్ను నెల్లూరు ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా ఈ నెల 21 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడిన ప్రభుత్వ కుట్ర ఇలా ఉంది..జంతువుల కొవ్వు అన్నారు.. కాదు కాదు పామాయిల్ అంటున్నారు!తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి దుష్ప్రచారానికి పాల్పడిందన్నది ఈ రిమాండ్ నివేదిక బయటపెట్టింది. గత ఐదేళ్లలో లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. అదే నిరాధార ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా పదేపదే ఉద్ఘాటించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన విషయం తెలిసిందే. కాగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక స్పష్టం చేయడంతో ప్రభుత్వ కుట్ర బెడిసికొట్టింది.సీఎం చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తూ అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు కూడా కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని స్పష్టం చేయడం గమనార్హం. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈవోపై ఒత్తిడి తెచ్చి ఆయన మౌనం దాల్చేలా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో కుతంత్రానికి ఈ రిమాండ్ నివేదిక ద్వారా కుట్ర పన్నింది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో పామాయిల్, ఈస్ట్, ఇతర రసాయనాలు కలిపారని తాజాగా పేర్కొంది. జంతువుల కొవ్వు ఆరోపణలు బెడిసికొట్టడంతో నెయ్యిపై దుష్ప్రచారం చేసేందుకు పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్ కలిపారనే వాదనను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.అందుకోసం దర్యాప్తు పేరుతో సాక్షులను వివిధ డెయిరీ సంస్థల ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పినట్లుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే అక్రమ కేసులో ఇరికిస్తారనే భయంతోనే డెయిరీ ప్రతినిధులు వారి ఒత్తిడికి తలొగ్గినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. భోలే బాబా డెయిరీపై భిన్న వాదనలు..లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం భోలే బాబా డెయిరీపై పరస్పర విరుద్ధ ఆరోపణలతో తన కుట్రలను బయటపెట్టుకుంటోంది. ఏపీ భవన్ ఉద్యోగి చిన్న అప్పన్నను పోలీసులు వైవీ సుబ్బారెడ్డి పీఏగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆయన భోలే బాబా డెయిరీని బెదిరించి రూ.50 లక్షలు లంచం అడిగారని ఆరోపించారు. అందుకు ఆ డెయిరీ నిరాకరించడంతో టీటీడీ జీఎంపై ఒత్తిడి తెచ్చి బ్లాక్ లిస్టులో పెట్టించారని పేర్కొన్నారు. మరో రెండు కంపెనీలకు భోలేబాబా డెయిరీ ఎల్ 1గా వచ్చినప్పటికీ ఆ డెయిరీని కాదని మరో రెండు డెయిరీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇప్పించినట్లు ఆరోపణలు చేశారు. ఆయన వ్యక్తిగత బ్యాంకు లావాదేవీలను వక్రీకరిస్తూ వాటిని ఆధారంగా చూపించేందుకు తాపత్రయపడ్డారు.కానీ అదే సమయంలో చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వద్ద పీఏగా పని చేశారన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. పోలీసులు భోలేబాబా డెయిరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిందని పేర్కొనడం గమనార్హం. అంటే భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే టీటీడీ నిలిపివేసిందని స్పష్టమవుతోంది. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క చుక్క కూడా పాలు సేకరించలేదని సిట్ పేర్కొంది. కానీ అదే డెయిరీ యూపీలో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే సిట్ పూర్తి భిన్నమైన వాదన వినిపించింది.భోలే బాబా డెయిరీ పేరుతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ రిపోర్టులో సిట్ కొత్త కట్టుకథను వినిపించింది. భోలే బాబా డెయిరీ సుగంథ్ ఆయిల్ ప్రొడక్ట్స్ ద్వారా కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు కొత్త కట్టుకథ సృష్టించింది. అందులో వివిధ ప్రైవేట్ డెయిరీల పాత్ర ఉన్నట్లు కూడా పేర్కొంది. ఆ మేరకు హర్‡్ష ట్రేడింగ్ కంపెనీ, హర్‡్ష డెయిరీ ప్రొడక్ట్స్ తదితర పేర్లను పేర్కొంది. అంటే ఆ కంపెనీ ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు పక్కాగా పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది.సుప్రీం తీర్పునూ బేఖాతర్ చేస్తూ...రాజకీయాల్లోకి కనీసం భగవంతుడినైనా దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం చంద్రబాబు బేఖాతర్ చేస్తోంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎల్లో మీడియా ద్వారా రాద్ధాంతం చేస్తోంది. అజయ్కుమార్ సుగంథ్ రిమాండ్ రిపోర్టును న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే ఎల్లో మీడియాకు చేరడం అందుకు నిదర్శనం. ఎల్లో మీడియా, కొన్ని ఇంగ్లీషు పత్రికలు, వెబ్సైట్లలో దుష్ప్రచార కథనాలను సోమవారమే వైరల్ చేయడం విభ్రాంతి కలిగిస్తోంది.టీటీడీ లడ్డూ ప్రసాదానికి కళంకం ఆపాదించేలా మీడియా చానళ్లలో చర్చా గోష్టి నిర్వహించింది. ఆ దుష్ప్రచార కథనాలను మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే ప్రభుత్వం, ఎల్లో మీడియా లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడినట్లు స్పష్టమవుతోంది. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ, తీర్పుతో నిమిత్తం లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. -
తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి,తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సైకాలజీ విభాగంలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఈ ఘటనపై నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన విద్యార్థులపై కక్ష్య సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. వారిని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడికి గురిచేశారు. అంతేకాక, వారిపై బెదిరింపులకు కూడా దిగినట్లు సమాచారం.ఈ ఒత్తిడిని భరించలేక, నలుగురు విద్యార్థులు తమ టీసీలు తీసుకుని యూనివర్సిటీని విడిచిపెట్టారు. ర్యాగింగ్ ఘటనలో ప్రమేయం ఉన్న ఆరుగురు సీనియర్ విద్యార్థులతో పాటు, సైకాలజీ విభాగ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ఓడీ) ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిని యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. విద్యార్థుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు యూనివర్సిటీ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ర్యాగింగ్ను ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై కూడా బెదిరింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. -
తిరుమలలో మరో అపచారం.. తప్పు ఒప్పుకున్న టీటీడీ!
సాక్షి, తిరుమల: కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమలలో మరో అపచారం జరిగింది. తిరుమల నడకదారిలో మరోసారి మహాపచార ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తింటున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత.. మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తిన్నారు. ఈ సందర్బంగా కాలినడకన వెళ్తున్న భక్తులు వారిని ఈ అపచారంపై ప్రశ్నించగా.. సదరు సిబ్బంది భక్తులని బెదిరింపులకు గురిచేశారు. శ్రీవారి మెట్ల మార్గంలో ఘటన జరగడంతో భక్తులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఎట్టకేలకు ఈ ఘటనపై టీటీడీ స్పందిస్తూ..‘టీటీడీ ఔట్సోర్సింగ్లో పనిచేసే రామస్వామి, సరసమ్మ అనే ఉద్యోగులు నిన్న అలిపిరి వద్ద మాంసాహారం తిన్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రామస్వామి, సరసమ్మ అనే ఇద్దరు ఉద్యోగులపై తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించినట్టు తెలిపింది. -
ఇల్లు కూలిపోయింది
మాకు ఇప్పటికే వయసు మీదపడింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాం. పూరింట్లో జీవనం సాగిస్తున్నాం. ఇటీవల జరిగిన రాయలచెరువు ఘటనలో నీటి ప్రవాహానికి మా పూరిల్లు కూలిపోయింది. మేము ప్రాణంతో బతక గలిగాం అంటే దేవుడి దయే. ప్రస్తుత పరిస్థితిల్లో ఈ ఇంటిని బాగు చేసుకునేందుకు మాకు స్తోమత లేదు. ప్రభుత్వం స్పందించి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అలాగూ నెల తం రూ.40 వేలతో పాలిచ్చే ఆవును కొన్నాం. అది కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత పడింది. దీనికి నష్టపరిహారం చెల్లిస్తే మా జీవనోపాధికి ఉపయోగపడుతుంది. – మునివేలు, సూర్యపుత్రి ఇల్లు గడవడమే కష్టంగా మారింది నేను టమాటా వ్యాపారం చేస్తుంటా. నా భార్య పశుపోషణతో చేదోడుగా ఉంటుంది. రోజూ మదనపల్లె నుంచి టమాటాలను తీసుకువచ్చి పలు దుకాణలు సరఫరా చేస్తుంటా. రాయలచెరువు కట్ట తెగిన రోజు ఇంటి వద్ద 80 బాక్సుల టమాటా ఉంది. నీటి ప్రవాహానికి మొత్తం పోయింది. టమాటా రవాణాకు వినియోగించే వాహనానికి వాయిదాలు కట్టేందుకు ఇంట్లో ఉంచిన రూ.50వేలు కొట్టుకుపోయాయి.అలాగే ఆరు గేదెలు మృతి చెందాయి. పైసా పైసా కూడబెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చే మాకు ఈ విపత్తు కారణంగా రూ.5లక్షల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం టమాటా వ్యాపారం చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రస్తుతం ఇల్లు గడవడమే కష్టంగా మారింది. – సౌందరరాజ్, అముద, కళత్తూరు దళితవాడ ఉపాధి పోయింది నాతో పాటు గ్రామంలో మరో పదిమందికి బీడీలు చుట్టడం ద్వారా ఉపాధి కల్పిస్తున్నా. రాయలచెరువు తెగి మా గ్రామాన్ని నీటి ప్రవాహం ముంచెత్తింది. దీంతో మా ఇంటి వద్ద నిల్వ చేసిన 15 బస్తాల బీడీ ఆకు, 8 బస్తాల పొగాకు, 53 వేల బీడీలు కొట్టుకుపోయాయి. అంతేకాకుండా ఇంట్లోని వస్తువులు సైతం ప్రవాహంలో వెళ్లిపోయాయి. ఈ విపత్తు కారణంగా మాకు సుమారు రూ.2.5లక్షల వరకు నష్టం వాటిల్లింది. నాకు ఉపాధి పోయింది. ప్రస్తుతం పెట్టుబడికి చేతిలో పైసా లేని పరిస్థితి. నేను గుండె జబ్బుతో బాధపడుతున్నా. ఇటీవలే యాంజియోగ్రామ్ కూడా చేశారు. వయసు మీద పడింది. ఇప్పుడు ప్రభుత్వం చేయూతనందించాలి. – ఎన్.విజయ్ కుమార్ కోలుకోలేని నష్టం రాయలచెరువు తెగిన ఘటనలో నీటి ప్రవాహం కారణంగా మా కుటుంబానికి రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. మాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి చెందిన 10 పశువులు, చిన్నవాడికి చెందిన 9 పశువులు ఉప్పెన ఉధృతికి మృత్యువాత పడ్డాయి. రెండు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు వాటి ఆచూకీ తెలియలేదు. 20 బస్తాలు బియ్యం నీటి పాలైంది. మా పశువుల కొట్టంలో మూడు లేగదూడలు మాత్రమే మిగిలాయి. వాటికి పాలిచ్చే గేదెలు మృతి చెందడంతో బయటి నుంచి పాలు కొనుగోలు చేసుకుని ఆకలి తీరుస్తున్నాం. ఈ విపత్తు కారణంగా కోలుకోలేని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సాయం చేస్తే కానీ, కుదుటపడలేం. – నగరం మురగయ్య, సుశీలమ్మ అంతా పోయింది రాయలచెరువుల ఘటనలో మాకు అంతా పోయింది. ఏమీ మిగలలేదు. ఇంట్లోని వస్తువులు, పిల్లల సర్టిఫికెట్లు, పాసు పుస్తకాలు, గుర్తింపు కార్డులు గల్లంతయ్యాయి. నాకున్న పది ఆవుల్లో ఏడు మృత్యువాత పడ్డాయి. పంట సాగుకు తెచ్చిపెట్టుకున్న వరి విత్తనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దాదాపు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మాలాంటి బాధితులను ఆదుకోవాలి. మా కళత్తూరు దళితవాడ లోతట్టు ప్రాంతంలో ఉంది. మాకు మిట్ట ప్రాంతంలో ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. – కె.సుబ్రమణ్యం -
పూలంగిసేవలో పార్వతీ పరమేశ్వరులు
● నేడు త్రిశూల స్నానంతో ఉత్సవాలు పరిసమాప్తి చంద్రగిరి: తొండవాడ స్వర్ణముఖీ నది ఒడ్డున శ్రీఅగస్తేశ్వరస్వామి(ముక్కోటి) ఆలయంలో నిర్వహిస్తున్న రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ, ఆలయ పరివార దేవతలైన శ్రీరామచంద్రమూర్తి, శ్రీవేణుగోపాలస్వామిలకు అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారు అధికార నంది వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆ తర్వాత పుష్పయాగం కనుల పండువగా నిర్వహించారు. రాత్రి స్వామివారు రావణా సుర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త మొగిలి రఘురామిరెడ్డి, సిబ్బంది పర్యవేక్షించారు. సోమవారం త్రిశూల స్నాన ఘట్టం, సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. -
టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి విశ్వనాథం ప్రకటించారు. అధ్యక్షుడిగా చీర్ల కిరణ్, అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీహరి చౌదరి, ప్రధాన కార్యదర్శిగా వంకీపురం పవన్, కోశాధికారిగా గుంటూరు రేఖ, వర్కింగ్ ప్రెసిడెంట్గా గంట భరత్, అదనపు కార్యదర్శిగా మణికంఠ, ఉపాధ్యక్షులుగా సి.సునీల్ కుమార్ యాదవ్, కొప్పర్తి శివ, వి.ఈశ్వర్ నాయక్, బి.ఈశ్వరయ్య, ఈ.విశ్వనాథం, పార్థసారథి, వెంకటరమణ, బి.ధరణి కుమార్, గౌరవ సలహాదారులుగా చిన్నంగారి సూరిబాబు, పి.అశోక్ కుమార్, కోలా గిరి, జి.శ్రీనివాసరావు, చంద్రకుమార్, ఎస్.చంద్రకిరణ్, మదన్, సుబ్రహ్మణ్యం, కందూరి రంగాచార్యులు, డిప్యూటీ సెక్రటరీలుగా తులసమ్మ, ఎస్.తేజస్విని, వి.రామాదేవి, కె.అంకయ్య, పి.వి.సురేష్, పి.రవికుమార్రెడ్డి, ఎం.ఉమాశంకర్, ఎ.టి.యోగేష్, జాయింట్ సెక్రటరీలుగా ఎ.మురళీబాబు, టి.హర్షవర్ధన్, ఎన్.గుణశేఖర్, ఉత్తమ కుమారి, గోవర్ధన్, ఏ.మునిహరీష్, హేమలత, మురళి, నిర్మల, ఈసీ మెంబర్లుగా 13 మంది ఎన్నికయ్యారు. -
భారీగా గంజాయి స్వాధీనం
చంద్రగిరి: కూటమి ప్రభుత్వంలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోందనడానికి ఇదొక నిదర్శనం. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి రవాణాను పోలీసులు చేధించారు. మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి గాదంకి టోల్ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి తమిళనాడుకు వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కారు డోర్ లోపల, డ్యాష్ బోర్డు, గేర్బాక్స్, స్టెప్నీ టైర్ లోపల, స్టెపనీ వెనుక రహస్య ఛాంబర్లో ఉంచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానం రాకుండా శునకాన్ని రక్షణగా ఉంచుకుని విశాఖ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న గంజాయి రవాణాపై ఎవరికీ అనుమానం రాకుండా డ్రైవరు తన తెలివితేటలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కారు వెనుక భాగంలో ఓ భారీ సైజులోని శునకాన్ని ఉంచుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో ఎవరైనా వాహనాలను తనిఖీ చేసేందుకు వస్తే వారిపైకి శునకం పెద్ద ఎత్తున అరవడంతో, అధికారులు బెంబేలెత్తిపోతారన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. ఈ క్రమంలో గంజాయిను తరలిస్తున్న బొలెరోతో పాటు డ్రైవరును, శునకాన్ని పోలీసులు చంద్రగిరి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే పట్టుబడిన గంజాయిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. -
వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యం
పాకాల: వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తామని మాజీ వలంటీర్లు స్పష్టం చేశారు. ఆదివారం పాకాలలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పుట్టినరోజుల వేడుకలను పురస్కరించుకుని పది మంది మాజీ వలంటీర్లు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీ వలంటీర్లు మాట్లాడుతూ చెవిరెడ్డి పుట్టినరోజే మంచి రోజుగా భావిస్తున్నామన్నారు. జగనన్న పాలనలో తమకు ఎంతో గౌరవం దక్కేదని, సకాలంలో వేతనాలు చెల్లించేవారని వెల్లడించారు. అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి సైతం తమను బిడ్డల్లా చూసుకున్నారని కొనియాడారు. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ ఆంక్షల కారణంగా మోహిత్రెడ్డి వెంట నడవలేకపోయామని, జెండాను చేతపట్టుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బహిరంగంగానే పార్టీ జెండాలు పట్టుకుని ప్రజల్లోకి వెళతామని స్పష్టం చేశారు. వలంటీర్లను కూటమి నేతలు దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. ఇకపై పార్టీలో కార్యకర్తలుగా క్రియాశీలకంగా పనిచేస్తామని తెలిపారు. మోహిత్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలంటీర్లను మాత్రమే కాదని, అన్ని రంగాల్లోని ఉద్యోగులను మోసం చేసిందన్నారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత నడ్డివిరుస్తోందని చెప్పారు. వలంటీర్లు ఎప్పుడు పార్టీలోకి వస్తామన్నా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో హేమ, మౌనిక, రేవతి, పూజ, జె.జోషపిన్, కె.జోషపిన్, యువరాణి, ఉన్నామాలీలై, శోభ, అర్చన ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నంగా నరేష్రెడ్డి, విక్రమ్ రెడ్డి, మున్నీర్బాయ్, కపిలేశ్వర్రెడ్డి, సురేష్, రహీమ్భాయ్, హసీనా, రూకేష్ రెడ్డీ, రమేష్, యుగంధర్ చౌదరి, యస్వంత్రెడ్డి, అశోక్, నవీన్, అల్తాఫ్, పవన్కుమార్ పాల్గొన్నారు. తిరుపతి రూరల్: ‘కూటమి ప్రభుత్వం వచ్చింది.. ప్రతిపక్షంపై నిఘా పెట్టడమే పనిగా పెట్టుకుంది.. ఇంత కాలం నేరాల నియంత్రణ, కీలకమైన కేసుల్లో నిజాలు వెలికి తీయడానికి మాత్రమే ఉపయోగించే ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఇప్పుడు అన్నింటికీ వాడుకుంటోంది. ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్సీపీలో యాక్టివిస్టులను టార్గెట్గా చేసుకుని వరుసగా సిట్ బృందాలను పంపించి కేసులు పెట్టిస్తున్నారు. అందులో భాగంగానే చెవిరెడ్డిని అక్రమంగా మద్యం కేసులో ఇరికించి 145 రోజులుగా జైలులో పెట్టారు.. మూడేళ్లు గడిస్తే జగనన్న మళ్లీ వస్తారు.. రాజన్న పాలనను తీసుకువస్తారు’అని చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. పాకాలలో జరిగిన చెవిరెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సిట్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చెవిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి ప్రజలకు దూరం చేసినా పార్టీ తమకు అండా నిలబడిందన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు చెవిరెడ్డి కుటుంబానికి అనుక్షణం రక్షణ కవచంలా నిలబడడం చూస్తుంటే ఎన్నిజన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేమన్న భావన కలుగుతోందన్నారు. సిట్ అధికారులను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు వాడుకోవడం కరెక్ట్ కాదన్నారు. జగనన్న వస్తారు.. రాజన్న పాలన మళ్లీ తెస్తారు! -
గుండె‘కోత’
జలప్రళయం అన్నదాతకు గుండెకోత మిగిల్చింది. రాయలచెరువు ఆయకట్టు పరిధిలోని రెండు వేల ఎకరాల మేర ధ్వంసమైంది. పాతపాళెం, పాతపా ళెం దళితవాడ, అరుంధతి వాడ, ఎస్.ఎల్.పురం, కళత్తూరు, ఎం.ఏ రాజులకండ్రిగ గ్రామాల్లో పొలా లన్నీ కోతకు గురయ్యాయి. కోతకు గురై రూపురేఖలే మారిపోయాయి. ఇసుక మేటలు వేశాయి. రాళ్లుతేలిపోయాయి. వీటిని బాగు చేయడానికి భారీగా ఖర్చుచేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆదుకుంటేనే రైతులను గట్టున పడే అవకాశం ఉంది.పాతపాళెం ప్రాంతంలో రాళ్లు తేలిన పంట పొలాలు -
ఏం చేయాలో తెలియడం లేదు
నేను పదేళ్లుగా కళత్తూరు పరిసర గ్రామాల్లో చీరలు అమ్ముకుంటూ ఆ వ్యాపారంతో కుటుంబ పోషణ చేసుకుంటున్నా. పది రోజుల క్రితం రూ.70 వేలకు వెంకటగిరిలో చీరలు కొని ఇంట్లో ఉంచా. అందులో రూ.10 వేల విలువైన చీరలను విక్రయించా. అయితే చెరువు తెగి ఒక్క సారిగా వచ్చిన నీటి ప్రవాహానికి ఇంట్లోని చీరలు మొత్తం కొట్టుకుపోయాయి. ఏం చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం ఆదుకుంటే గాని వ్యాపారం చేసుకోలేం. –సీహెచ్ జ్యోతి మణి బురదలో నిలబడిపోయాం నాకు ఓ ప్రమాదంలో చేయి పోయింది. ఇక ఏ పని చేసుకోలేక మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యుల సహకారంతో మా కాలనీలోనే మళిగంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయితే రాయలచెరువు తెగిన ఘటనలో ఉప్పెనలా వచ్చిన నీటి ప్రవాహానికి దుకాణం మునిగిపోయింది. అంలోని పప్పు, ఇతర నిత్యావసర సరుకులు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. చివరకు దుకాణం, ఇంటిలో నిండిపోయిన బురదలో నిలబడిపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – పి.రాజా ప్రశ్నార్థకంగా జీవనం నేను రోజువారీ నిర్మాణ పనులకు వెళుతుంటా. కాంక్రీట్ మిల్లరు ద్వారా ఉపాధి పొందుతుంటా. ఇళ్లకు శ్లాబు కాంక్రీట్ పనులకు కూలీలను తీసుకుని వెళతా. పని ఉన్న రోజు మిల్లరుకు రూ.1000 అద్దె వస్తుంది. దాంతో పాటు నాకు కూలి కింద మరో రూ.600 ముట్టుతుంది. అయితే రాయలచెరువు ఘటనతో నీటి ప్రవాహానికి నా ఇంటి ముంగిట పెట్టిన కాంక్రీటు మిల్లర్ కొట్టుకుపోయింది. దీంతో మా కుటుంబ జీవనం ప్రశ్నార్థకంగా మారింది. కాంక్రీటు మిల్లర్ కొత్తది కొనాలంటే రూ.లక్ష కావాలి. రోజు వారీ కూలీగా కుటుంబ పోషణ చేసుకునే నేను ఒక్క సారిగా అంత పెట్టుబడి పెట్టలేని దుస్థితి. ప్రభుత్వం ఆదుకుంటే కానీ, మా బతుకు ముందుకు సాగదు. – కోళ్ల విజయరత్నం -
‘స్పాట్’ లేనట్టేనా?
తిరుపతి సిటీ: జిల్లాలోని వర్సిటీలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు ఈ సారి ఉండవనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏపీపీజీసెట్–2025 ద్వారా 45 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రధానంగా ఎస్వీయూలో 51 విభాగాలలోని పీజీ కోర్సులలో రెండు వేల సీట్లకు పైగా సీట్లు ఉండగా ఇప్పటి వరకు 759 మాత్రమే భర్తీ అయ్యాయి. అలాగే పద్మావతి మహిళా వర్సిటీలోనూ 50శాతం సీట్లు భర్తీకి నోచుకోలేదు. ఇది ఇలాఉండగా ఉన్నత విద్యామండలి అకడమిక్ ఇయర్ ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం చేయడం ఇందుకు ప్రధాన కారణమని అధ్యాపకులు, వర్సిటీ అధికారులు ఆరోపిస్తున్నారు. నిర్వీర్యమే ప్రభుత్వ లక్ష్యమా? ఏపీపీజీసెట్ కన్వీనర్ కోటా నియామకాలు పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా వర్సిటీలలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి చేపట్ట లేదు. ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఉన్నత విద్యామండలి కవ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాలు, వర్సిటీలలోని బోధన, బోదనేతర సిబ్బంది మండిపడుతున్నారు. ఈ ఏడాది స్పాట్ అడ్మిషన్లు ఉండవనే సంకేతాలు ఇప్పటికే వర్సిటీ అధికారులకు ఉన్నత విద్యామండలి సూచనా ప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. ర్యాగింగ్ భూతంతో అడ్మిషన్లపై ప్రభావం ఎస్వీయూ ఇటీవల సాక్షాత్తు అధ్యాపకులే సీనియర్లను ప్రొత్సహించి నూతనంగా పీజీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ర్యాగింగ్ చేయమని ప్రోత్సహించారు. ఇప్పటికే ఎస్వీయూలో పలు పీజీ కోర్సులలో అడ్మిషన్లు పొందిన జూనియర్ విద్యార్థులు వర్సిటీలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అలాగే వర్సిటీ స్పాట్ అడ్మిషన్లు చేపట్టినా కనీసం ఐదు శాతం మంది కూడా వర్సిటీలో స్పాట్ అడ్మిషన్లపై మొగ్గు చూపుతారా అనే అనుమానం ఉంది. దీంతో ఎస్వీయూలో ఈ ఏడాది అన్ని పీజీ కోర్సులలోనూ కనీసం 50 శాతం అడ్మిషన్లు జరుగుతాయనే నమ్మకం లేదని విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, సాక్షాత్తు వర్సిటీలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీయూ పరిపాలనా భవనం -
ఎంపీ నిధులతో రోడ్డు నిర్మాణం
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని కంచనపుత్తూరులో ఎంపీ గురుమూర్తి మంజూరు చేసిననిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆదివారం ఈ మేరకు సర్పంచ్ స్వప్న, మాజీ సర్పంచ్ గురవయ్య పనులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని గంగమ్మగుడికి సిమెంట్ రోడ్డు నిర్మించేందుకు ఎంపీ గురుమూర్తి రూ. 10 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ డాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 80,560 మంది స్వామివారిని దర్శించుకోగా 35,195 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్ తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం గ్రీనెన్స్ నిర్వహించనున్నారు. గత సోమవారం కొంత గందరగోళం నెలకొంది. తమ సమస్యకు పరిష్కారం ఉంటుందని వచ్చే వాళ్లకు అధికారులు భరోసా కల్పించాల్సి ఉంది. అలాగే కనీస వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు. నేడు డయల్ యువర్ సీఎండీ తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఏపీఎస్సీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తేవాలని ఆయన కోరారు. నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చంద్రగిరి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుద్ధి నిర్వహించనున్నారు. ఆనంతరం ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. భక్తులను ఉదయం 9.30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 11న, నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. -
వైఎస్ జగన్ ఇచ్చింది రూ.లక్ష కోట్ల ఆస్తి
పుంగనూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలల రూపంలో రాష్ట్ర ప్రజలకు రూ.లక్ష కోట్ల ఆస్తి సృష్టించారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న ర్యాలీ పోస్టర్లను ఆదివారం పుంగనూరులో పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ఏడు కాలేజీలు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని కాలేజీలు వినియోగంలోకి వస్తాయన్నారు. తద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఆస్తి విలువ రూ.లక్ష కోట్లు అవుతుందని, ఇది ప్రజలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఆస్తి అన్నారు. వీటి పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్నారని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. పేదలకు వైద్యం, వైద్య విద్య దూరమవుతాయని ఆగ్రహంవ్యక్తంచేశారు. ధనవంతులు, విదేశాల్లో ఉన్నవారు, పొరుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ వైద్య కళాశాలల్లో సీట్లు పొంది చదువుకుంటారని, విద్య పూర్తయిన తర్వాత వారి స్వస్థలాలకు లేదా విదేశాలకు వెళ్లిపోతారని, దీనివల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమీలేదన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యం, విద్య ఉండాలని వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే, ఇప్పుడు వాటిని చంద్రబాబు పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తున్నారన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న నియోజకవర్గ స్థాయి ర్యాలీని విజయవంతం చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. కార్తీక వన భోజనం
తిరుమల : కార్తీకమాసం సందర్భంగా ఆదివారం తిరుమలలోని పార్వేట మండపంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. శ్రీమలయప్పస్వామిని బంగారు తిరుచ్చిపై వాహన మండపానికి వేంచేపు చేశారు. ఉదయం 8.30 గంటలకు సమర్పణ అనంతరం స్వామివారిని చిన్న గజవాహనంపై పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. మరో పల్లకిపై ఉభయనాంచారులను రంగనాయక మండపం నుంచి పార్వేట మండపానికి వేంచేపు చేశారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు దేవదేవేరులకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. ఐదేళ్ల అనంతరం.. కార్తీక మాసంలో వర్షాల కారణంగా 2020 నుంచి పార్వేట మండపంలో కార్తీక వన భోజనాలు నిర్వహించేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత మహోత్సవం చేపట్టడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠనాథుని సమక్షంలో సహపంక్తి భోజనం చేశారు. టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్యప్రాజెక్టు వారు భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. -
పరమ పవిత్రం.. శ్రీవారి లడ్డూ ప్రసాదం
సాక్షి, అమరావతి: రాజకీయ కుట్ర కోసం ఎంతకైనా దిగజారుతామని టీడీపీ కూటమి ప్రభుత్వం పదేపదే నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది. అందుకోసం ఏకంగా శ్రీవారి దివ్య క్షేత్రమైన తిరుమల పవిత్రత, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యంపై దుష్ప్రచారం చేసేందుకు కూడా తెగిస్తామని నిరూపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలతో లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం తెచ్చేందుకు తెగబడుతోంది. ఆ పక్కా కుట్రలో భాగంగానే సిట్ నివేదిక పేరుతో ఎల్లో మీడియా ద్వారా మరోసారి విషం చిమ్ముతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై అవాస్తవ ఆరోపణలతో అసత్య కథనాలు వండి వారుస్తోంది. రాజకీయాలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు సూచనను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ దుష్ప్రచారానికి బరితెగిస్తోంది. శతబ్దాలుగా కొనసాగుతున్న లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగిస్తూ తమ మనోభావాలను దెబ్బ తీస్తున్న ఎల్లో మీడియాపై ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. అందుకే ఈ వ్యవహారంలో ఎల్లో మీడియా కుతంత్రాలను తిప్పికొడుతూ అసలు వాస్తవాలను “సాక్షి’ ప్రజల ముందు ఉంచుతోంది.చిన్న అప్పన్న ఏపీ భవన్ ఉద్యోగితిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్రచారం చేస్తోంది. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పీఏగా పని చేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. చిరుద్యోగి అయిన ఆయన ఏకంగా టీటీడీ జీఎం స్థాయి ఉన్నతాధికారుల్ని ప్రభావితం చేశారని కట్టుకథలు అల్లుతోంది. ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన ఆస్తుల ఉదంతాన్ని వక్రీకరిస్తోంది. వాటి ఆధారంగా చిన్న అప్పన్నను బెదిరించి, వేధించి తమకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడం కూడా తప్పేనా!? నెయ్యి నాణ్యతపై ఫిర్యాదు రావడంతో టీటీడీ చైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించడం తప్పన్నట్టుగా పోలీసులు వక్రీకరిస్తుండటం గమనార్హం. ఓ అనాకమ ఫిర్యాదు వస్తే బోలే బాబా డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించినట్టు పోలీసులు తమ నివేదికలో పేర్కొనడం గమనార్హం. మామూలుగా ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించకపోతే పట్టించుకోలేదని విమర్శిస్తారు.. విచారణకు ఆదేశిస్తే ఎందుకు ఆదేశించారని ఈనాడు, ఇతర టీడీపీ ఎల్లో మీడియా తిరిగి ప్రశ్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. టీడీపీ రాజకీయ కుట్రలో భాగంగా కేవలం విష ప్రచారం చేయాలన్న కుట్రే తప్ప, వాస్తవాలతో తమకు నిమిత్తం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.చైర్మనే సర్వస్వం కాదు.. టీటీడీ బోర్డు ఉంటుంది ఇక రాజకీయ కుతంత్రంతో కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా టీటీడీ వ్యవస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. తిరుమల–తిరుపతి వ్యవహారాలకు టీటీడీ చైర్మనే సర్వస్వం, సర్వాధికారి కాదు. టీటీడీ బోర్డుదే అత్యున్నత అధికారం. ఆ బోర్డులో సభ్యులు చర్చించి తీసుకున్న నిర్ణయాలనే టీటీడీ అమలు చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు నిర్ణయాన్ని కూడా అదే రీతిలో బోర్డు తీసుకుంది. ఎల్లో మీడియా ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే.. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా సభ్యులుగా ఉన్నారు. టీటీడీ పర్చేజ్ కమిటీలో కూడా సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. భోలే బాబా డెయిరీ పాల సేకరణపై భిన్న కథనాలుపోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ కూటమి ప్రభుత్వం కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించి భోలే బాబా డెయిరీ గురించి ప్రభుత్వం, ఎల్లో మీడియా పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తుండటమే అందుకు తార్కాణం. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క పాల చుక్క కూడా సేకరించకుండా టీటీడీ నుంచి రూ.240 కోట్ల నెయ్యి కాంట్రాక్టు పొందిందని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్టు ఎల్లో మీడియా తన కథనంలో పేర్కొంది. మళ్లీ భోలే బాబా డెయిరీ ఉత్తర్ప్రదేశ్లో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి, పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే కథనంలో పేర్కొనడం గమనార్హం. మరి ఆ డెయిరీ పాలు సేకరిస్తున్నట్టా.. సేకరించనట్టా? రెండూ ఎల్లో మీడియానే చెబుతుంటే అందులో ఏది వాస్తవం!?నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబు ప్రభుత్వమేకర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలం పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ పరంపరను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తినా, చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. అంటే నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొన లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వ లేదు కాబట్టి.. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనమని చెప్పింది. వాస్తవాలు అలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నందిని డెయిరీకి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇస్తారు? ఇస్తే అసలు టెండరు వేయని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇచ్చారని అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రశ్నించేది కాదా? టెండరులో పాల్గొన్న ఇతర డెయిరీలు కూడా అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేవి కదా! టీడీపీ వీరవిధేయ సిట్తో కుతంత్రంనెయ్యి వివాదాన్ని టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని కూటమి ప్రభుత్వం యత్నించింది. అందుకే ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో గత ఏడాది హడావిడిగా సిట్ను ఏర్పాటు చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పని చేసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించింది. అప్పటి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు. రిటైరైన తర్వాత కొన్నేళ్లు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించిన కృష్ణయ్యను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్గా నియమించారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పదవి కట్టబెట్టడం గమనార్హం. సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత.. నెయ్యిలో కల్తీపై టీటీడీ ద్వారా తిరుపతిలోని ఈస్ట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించడం గమనార్హం. ఆ ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐని బదిలీ చేసి, ఆ స్థానంలో టీడీపీకి అనుకూల పోలీసు అధికారిని నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. సుప్రీం కొరడా.. సిట్ క్లోజ్ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఉండి లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డూ ప్రసాదం అంశంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా.. అన్నది ఆలోచిస్తామని తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్ కార్యకలాపాలను తక్షణం నిలిపి వేసింది. అనంతరం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర బృందం దర్యాప్తు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పరిశీలకులు స్పష్టం చేశారు.డైవర్షన్ డ్రామా కోసం తిరుమల పవిత్రతపై దుష్ప్రచారంఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ డ్రామాలో భాగంగానే కల్తీ నెయ్యి అంటూ రాద్ధాంతం చేస్తోంది. అందుకోసం ఏకంగా తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు బరితెగిస్తోంది. గత ఏడాది బుడమేరుకు భారీ వరద వస్తుందని నిపుణులు ముందే హెచ్చరించినా, కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. దాంతో భారీ వరద విజయవాడను ముంచెత్తి అతలాకుతలం చేసింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిపై దుష్ప్రచారానికి తెగబడింది. కూటమి నేతలు, ఎల్లో మీడియా పక్కా పన్నాగంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఏమాత్రం వెనుకాడ లేదు. కానీ టీడీపీ కూటమి నేతల కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అధికారిక ప్రకటనే తిప్పికొట్టింది. ఆ వ్యవహారం ఇలా సాగింది.2024 జులై 23వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు వెనక్కి పంపాం నెయ్యిలో కల్తీ జరిగిందని శాంపిల్స్ పరీక్షల్లో తేలింది. వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసిందని వెల్లడైంది. దాంతో కాంట్రాక్టరును బ్లాక్ లిస్ట్ పెట్టి షోకాజ్ నోటీసు ఇచ్చాం. ఆ సంస్థ సరఫరా చేసిన ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం కోసం వినియోగించనే లేదు. – టీటీడీ ఈవో శ్యామలరావు2024 సెప్టెంబర్ 18 నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు : చంద్రబాబుటీటీడీ ఈవో అధికారిక ప్రకటనలకు విరుద్ధంగా లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 22నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపాం : టీటీడీ ఈవోఅయినా సరే చంద్రబాబు ఆరోపణలను టీటీడీ ఈవో శ్యామలరావు తిప్పికొట్టారు. నమూనాలను పరీక్షించాక అది కల్తీ నెయ్యి అని తేలడంతో ఆ డెయిరీ పంపిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను నిలిపి వేశామని తెలిపారు.సెప్టెంబరు 22 ఆ నెయ్యి వాడారు : చంద్రబాబుఅయినా సరే చంద్రబాబు తన దుష్ప్రచారాన్ని కొనసాగించారు. నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. అందులోని కల్తీ నెయ్యిని వాడారని మళ్లీ దుష్ప్రచారం చేయడం గమనార్హం. అంటే వాస్తవాలతో తనకు నిమిత్తం లేదని, రాజకీయ ప్రయోజనం కోసం తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీసేందుకు వెనుకాడనని నిరూపించారు. ఇంతటితో ఆగకుండా, టీడీపీ కూటమి ప్రభుత్వం తన డర్టీ పాలిటిక్స్కు మరింత పదును పెట్టింది. 2024 సెప్టెంబర్ 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే.. ఆ మర్నాడే అంటే సెప్టెంబర్ 19న ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. వాస్తవానికి ఎన్డీడీబీ నివేదికను గోప్యంగా ఉంచాలి. కానీ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ టీడీపీ కార్యాలయం ఆ నివేదికను విడుదల చేయడం గమనార్హం.సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కోరిన వైవీ సుబ్బారెడ్డితిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచారంపై వైవీ సుబ్బారెడ్డి సత్వరం స్పందించారు. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోరినందునే వైవీ సుబ్బారెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోంది.టీటీడీలో నెయ్యి కొనుగోలుకు పటిష్ట వ్యవస్థ⇒ రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా మారింది. కానీ నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలు చేసేందుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తోంది. నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసేందుకు టీటీడీ పటిష్ట విధానం అనుసరిస్తోంది.⇒ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్ చేసిన వాటిలో ఎల్1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు.⇒ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తించిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ను కూడా సమర్పించాలి.⇒ అలా ట్యాంకర్ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కు పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు.⇒ తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవం.ప్రస్తుత నెయ్యి వివాదం టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనిదే ప్రస్తుతం కల్తీ అంటూ చేçస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? 2024 జూన్ 12న తీసిన శాంపిల్స్ అవి. 2024 జూన్ 4నే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి గెలిచిందన్నది తేలి పోయింది. జూన్ 12నే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగిందన్నది సుస్పష్టం.జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ చెప్పనే లేదు నెయ్యి కల్తీ జరిగిందని మాత్రమే ఎన్డీడీబీ నివేదిక వెల్లడించగలదు. కానీ, ఆ కల్తీ జంతువుల కొవ్వు కలపడంతో జరిగిందని నిరూపించే అవకాశమే లేదని ఆహార శాస్త్రవేత్త నేహా దీపక్ షా స్పష్టం చేశారు. సోయాబీన్, పొద్దు తిరుగుడు పువ్వు, రేపీడ్స్, గోధుమ జెర్మ్, మొక్కజొన్న జెర్మ్, పత్తి విత్తనాలు, కొబ్బరి, పామ్ ఆయిల్ ద్వారా కూడా కల్తీ చేసే అవకాశాలున్నాయి. సాధారణంగా నెయ్యిలో కల్తీ చేయాలంటే వ్యాపారులు పామాయిల్, హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వును కలుపుతూ ఉంటారని ఆహార శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే అవి అయితేనే తక్కువ వ్యయంతో కల్తీ చేయవచ్చన్నారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి కల్తీ చేశారన్నది ఎన్డీడీబీ నివేదికలో స్పష్టం చేయనే లేదు. కానీ చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు మాత్రం టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతవుల కొవ్వు కలిపారని రాద్ధాంతం చేయడం కేవలం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం. -
నకిలీ బంగారంతో రుణాలు
చిన్నగొట్టిగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో భారీ కుంభకోణం జరిగింది. విచారణ చేపట్టనున్నారు.బెదిరిస్తూ..సవాల్ విసురుతూ! ఇక్కడి క్యాంపులో అభిమన్యు, క్రిష్ణ, జయంత్, వినాయక, దేవా, రంజన్లనే కుంకీ ఏనుగులు ఉన్నాయి. ఇటీవల సోమలలో రైతును ఏనుగులు చంపడంతో పలువురు రోడ్డెక్కారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అటవీశాఖ హుటాహుటిన టేకుమంద వద్ద కుంకీలతో ట్రయల్ రన్ చేశారు. అడవిలో ఏనుగుల మళ్లింపునకు పూర్తిఫిట్నెస్ కలిగిన క్రిష్ణ, జయంత్, వినాయక్ను మాత్రం మావటీల ద్వారా పంపారు. అడవిలోని ఏనుగుల గుంపును అక్కడి నుంచి కౌండిన్య ఫారెస్ట్లోకి మళ్లించారు. ఇలా అడవిలోని ఏనుగులను ఎన్ని సార్లు మళ్లించినా అవి అడవిని దాటి వస్తూనే ఉన్నాయి. రైతుల పంట పొలాలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. మదపుటేనుగులైతే గ్రామాలే కాదు ఇటీవల పలమనేరు పట్టణంలోకి ఓ మదపుటేనుగు వచ్చి హల్చల్ చేసింది. దీన్ని మళ్లించే క్రమంలో సుకుమార్ అనే ఎఫ్ఎస్వోపై దాడి చేసింది. తాజాగా మదపుటేనుగులు ఇక్కడి ఎలిఫెంట్ క్యాంపు వద్దకొచ్చి ఘీంకారాలు చేస్తూ కుంకీలకు సవాల్ విసిరాయి. ఇప్పుడు కుంకీలున్న చోటకే ఎక్కువగా మదపుటేనుగులు వచ్చి వాటిని బెదిరిస్తున్నాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా కుంకీలపై మదపుటేనుగులు దాడి చేసే అవకాశం లేకపోలేదు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్ల భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,075 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,535 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్వనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. భక్తుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్లు తిరుమల : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని కల్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి ఆదేశించారు. ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవలకు ద్వారా సేకరించిన భక్తుల అభిప్రాయాలపై శనివారం పద్మావతి విశ్రాంతి భవనంలో సమీక్షించారు. విభాగాల వారీగా అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు ఈఓ మాట్లాడుతూ కాలిబాట మార్గాల్లో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు తరచూ తనిఖీలు నిర్వహించి దుకాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు భోజనం వడ్డించేటప్పుడు సిబ్బంది చేతులకు తొడుగులు ధరించాలని సూచించారు. లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గదుల కాషన్ డిపాజిట్ చెల్లింపుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్యూల్లో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు అందేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. అలాగే పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అనంతరం గోపార్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుమలలోని పార్కింగ్ సమస్య పరిష్కారానికి యాప్ అభివృద్ధి, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రణాళిక, పార్కింగ్ ప్రీ బుకింగ్, నిర్దేశిత పార్కింగ్ జోన్ల గుర్తింపు, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్ తిరుపతి సిటీ : మద్యం తాగి విధులకు హాజరైన ఉపాధ్యాయుడిపై శనివారం సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు.. ఏర్పేడు మండలం అముడూరు ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు సెలవులో ఉండడంతో, పల్లం దళితవాడ ఎంపీపీఎస్ స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ నాగరాజును డిప్యుటేషన్ మీద పంపించారు. అయితే ఆ ఉపాధ్యాయుడు మద్యం తాగి పాఠశాలకు వచ్చి పడిపోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న ఎంఈఓ వెంటనే డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారించి సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. బాలికల సైనిక్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తులు తిరుపతి సిటీ:కర్ణాటకలోని కిట్టూర్ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్స్లో ఆరో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైందని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల అధినేత విశ్వనాథ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఫిబ్రవరి ఒకటో తారీఖున ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నారు. వివరాలకు తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ పోటీ పరీక్షల సమాచార కేంద్రం, లేదా 86888 88802 / 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వైభవంగా రుద్రహోమం తిరుపతి కల్చరల్:శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం వైభవంగా రుద్రహోమం ప్రారంభమైంది. కార్తీక మాసం సందర్బంగా ఆలయంలో హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నా రు. అందులో భాగంగా చేపట్టిన రుద్ర హోమం ఈనెల 18వ తేదీ వరకు జరిపించనున్నారు. ఈమేరకు యాగశాలలో పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, హారతి సమర్పించారు. డిప్యూటీ ఈఓ నాగరత్న పాల్గొన్నారు. -
అమ్మా...ఒక్కసారి రావా?
చిల్లకూరు : పుట్టిన నాటి నుంచి ఏడేళ్ల వరకు కంటికి రెప్పలా చూసుకున్న కన్న తల్లి అటు తరువాత కుమారుడిని వదలివెళ్లి పోయింది. దీంతో ఆ చిన్నారి ఆరోగ్యం దెబ్బతిని నడవలేని స్థితికి చేరుకున్నాడు. అలాంటి స్థితిలో బాలుడిని కన్న తండ్రి చూసుకుంటుండగా రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించి ఆ బాలుడు మంచానికే పరిమితం అయ్యాడు. తండ్రి ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో వృద్ధాప్యంలో ఉండే నాయనమ్మ, తాతయ్య బాలుడికి ఆధారం అవుతున్నారు. అయితే బాలుడు ఇటీవల కన్నతల్లి కోసం మారాం చేస్తూ అమ్మ కావాలి అని విలపిస్తున్నాడు. ఈ సంఘటన గూడూరు పట్టణంలోని దూడల కాలువ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటుగా వెళ్లే వారు ఆ చిన్నారిని చూసి జాలిపడకుండా ఉండలేకున్నారు. గూడూరు పట్టణంలోని దూడల కాలువ ప్రాంతంలోని విగ్నేశ్వరపురంలో నివాసం ఉండే నాగరాజుకు 15 ఏళ్ల కిందట బంధువుల కుటుంబంలోని యువతితో వివాహం అయ్యింది. అటు తరువాత ఏడాదికి ఒక బాబు పుట్టగా అతడికి మహదీప్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉన్నారు. బాబుకు ఐదేళ్లు వచ్చిన తరువాత కాళ్లు వంకర్లు తిరిగి పోయి నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో ఆసుపత్రల్లో చూపించారు. వ్యాధి నయం కాకపోగా శరీరం ఊబయ కాయంగా మారింది. అప్పడు బాబుకు ఏడేళ్లు పూర్తవుతున్న సమయంలో బాబు తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో బాబు తండ్రి నాగరాజు పలు ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకపోయింది. అయితే నేడు బాబుకు 14 ఏళ్లు వచ్చే సరికే అతడికి తల్లి గుర్తుకు వచ్చి అమ్మ కావాలి అని ఏడుస్తూ అన్నం తినకుండా విలపిస్తుండడం చూసి తండ్రి , నాయనమ్మ, తాతయ్య అతడిని ఓదార్చలేక అల్లాడిపోతున్నారు. కన్నతల్లి కోసం మతి స్థితిమితం లేని ఆ కుమారుడు పడుతున్న వేదనను గుర్తించి తల్లి ఎక్కడున్నా రావాలని కోరుతున్నారు. -
‘ప్రైవేటీకరణ’పై 12న ర్యాలీ
తిరుపతి సిటీ: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా తిరుపతిలో ఈ నెల 12వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శనివారం ఈ మేరకు పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. భూమన మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే ప్రధాన ఉద్ధేశంతో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను జగనన్న తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కానీ, కూటమి ప్రభుత్వం కుట్రతో మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా చేపట్టనున్న ర్యాలీకి ల్లాలోని పార్టీ కార్యకర్త లు, నాయకులు, విద్యార్థులు పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ శిరీష, సత్యవేడు సమన్వయ కర్త నూకతోటి రాజేష్, జీడీ నెల్లూరు సమన్వయ కర్త కృపాలక్ష్మి, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రరెడ్డి పాల్గొన్నారు. -
వరద.. వదలని బురద
వరదయ్యపాళెం : సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో ఈ నెల 6వ తేదీ సంభవించిన ఓళ్లూరు రాయల చెరువు వరద ఘటనలో కళత్తూరు, పాతపాళెం దళితవాడలు ముంపునకు గురయ్యాయి. ఈ ప్రమాదం సంభవించి 3 రోజులు గడిచినా ఆ గ్రామాలు ఇప్పటికీ తేరుకోలేదు. కొట్టుకొచ్చిన బురదను వదిలించుకునేందుకు బాధితులు నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ 50శాతం బురద కూడా ఆ గ్రామాన్ని వదల్లేదు. అటు ఇళ్లు, ఇటు వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిం చేందుకు ఇక్కట్టు ఎదుర్కొంటున్నారు. నామమాత్రంగా ప్రభుత్వ సాయం ప్రభుత్వం తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 3వేలు నగదు, 25కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే శుక్రవారం సాయంత్రం హడావిడిగా సత్యవేడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఐదు కుటుంబాలకు సాయం అందించినట్లు అధికారులు ఫొటోలకు ఫోజులిచ్చారు. మిగిలిన కుటుంబాలకు శనివారం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించి మరచిపోయారు. దీంతో బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు. ఇంతటి విపత్తు సంభవిస్తే సహాయక చర్యలు చేపట్టే తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కన్నెత్తి చూడని మంత్రులు జిల్లాలో అతిపెద్ద విపత్తుగా పరిగణిస్తున్న ఓళ్లూరు రాయలచెరువు ఘటనపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. వందలాది పశువులు మృత్యువాడగా, వెయ్యి ఇళ్లకు పైగా దెబ్బతిన్నాయి. ఇంత పెద్ద ఘోరం జరిగితే ఒక్క మంత్రి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. జరిగిన నష్టానికి పూర్తిస్థాయి పరిహారం అందాలంటే అధికార యంత్రాంగం పర్యటిస్తే సరిపోదు. మంత్రులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని కళ్లారా చూసి తెలుసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళితేనే బాధితులకు సక్రమంగా న్యాయం జరుగుతుంది. ఈ క్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, విపత్తుశాఖ మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఏమాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓళ్లూరు రాయల చెరువు వరద బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. విపత్తు జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ బురదలోనే కాలం గడుపుతున్నారు. నామమాత్రం సహాయక చర్యలతో అధికారులు చేతులుదులుపుకోవడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఫొటోలకు ఫోజులిచ్చి జారుకోవడంతో ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి రాయలచెరువు ఘటనలో ముంపునకు గురైన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. శనివారం కళత్తూరు దళితవాడ, పాతపాళెంలో వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్తో కలసి ఆయన పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. విపత్తు కారణంగా జరిగిన నష్టాలను, హృదయ విదారక దృశ్యాలను చూసి చలించిపోయారు. విపత్కర సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎంపీ మాట్లాడుతూ తూతూ మంత్రంగా పరిహారం ప్రకటించి తప్పుకోవాలనుకుంటే సహించే ప్రసక్తే లేదని, క్షేత్రస్థాయిలో పోరాడుతామని హెచ్చరించారు. తక్షణ సహాయక చర్యల కోసం ఎంపీ నిధుల నుంచి రూ. 20లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. విపత్తు జరిగి 3 రోజులు గడిచినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. గ్రామాల్లో పేరుకుపోయిన బురదను తక్షణమే తొలగించాలని కోరారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. నూకతోటి రాజేష్ మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు హౌసింగ్ ద్వారా నివాసాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టం జరిగిన రైతులకు, దెబ్బతిన్న పొలాలకు, మృతి చెందిన పశువులకు నష్ట పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు గవర్ల కృష్ణయ్య, జిల్లా మహిళా అధ్యక్షులు మాధవిరెడ్డి, నేతలు నందకుమార్, భరణి ధనంజయరెడ్డి, లాల్బాబు యాదవ్, శాస్త్రి రాజు పాల్గొన్నారు. -
గజ దాడులు ఆగేనా?
చంద్రగిరి : గజరాజుల ఘీంకారాలు..పంట పొలాలపై దాడులు..అడ్డొచ్చిన రైతులను హతమార్చుస్తుండడం.. ఫలితంగా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ప్రజలు.. ఇది శేషాచల, నాగపట్ల, భాకరాపేట బీట్ల పరిధిలో నివసిస్తున్న రైతుల దుస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలుగా అటవీ సమీప గ్రామాల్లో గజరాజుల దాడులు నితృకృత్యమవుతున్నాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో గజ దాడుల కారణంగా పంటలు నాశనం అవుతున్నాయి. రాత్రుల్లో ఏనుగుల గుంపులు గ్రామాల్లో స్వైర విహారం చేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఏనుగుల దాడులను అరికట్టాల్సిన అటవీ అధికారులు కంటి తుడుపు చర్యలు చేపట్టడం పరిపాటిగా మారింది. పరిస్థితి ఇలా.. ఏనుగుల దాడులను అరికట్టాల్సిన అటవీ అధికారులు చేతులెత్తేయడంతో రైతులే వాటిని ఎదుర్కొనేందుకు సాహిస్తున్నారు. ఈ క్రమంలో ఏనుగుల దాడుల్లో ఓ వైపు పంట పొలాలను ధ్వంసం కావడంతో రైతులే వాటిని కట్టడి చేసేందుకు పూనుకుంటున్నారు. గత జనవరిలో కందులవారిపల్లి(సీఎం చంద్రబాబు సొంత పంచాయతీ) ఉప సర్పంచ్, టీడీపీ నాయకుడు రాకేష్ చౌదరి కొంత మంది రైతులతో కలసి ఏనుగులను తరిమేందుకు యత్నించాడు. గజరాజులు ఒక్కసారిగా వారిపై దాడులకు పూనుకున్నాయి. ఈ దాడుల్లో టీడీపీ నాయకుడు రాకేష్ చౌదరిని చంపేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. గత ఏడాది నవంబర్ 23న భాకరాపేట పంచాయతీలోని పంట పొలాల్లో రైతుల ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగ తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. అలాగే అదే మండలంలో మే 5న చిట్టేచర్ల పంచాయతీ దాసర్లపల్లికి చెందిన రైతు సిద్ధయ్య పొలంలో నిద్రిస్తుండగా ఏనుగులు దాడి చేసి చంపేశాయి. చేతులెత్తేసిన అటవీ అధికారులు పొలాలపై ఏనుగుల దాడులు చేస్తున్నా వాటిని కట్టడి చేయడంలో అటవీ అఽధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా బాధితులు ఏనుగుల దాడులపై సమాచారం ఇచ్చానని..స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కంటే భిన్నంగా అటవీ అధికారులు వ్యవహరించడంపై రైతులు, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై తిరుగుతూ టపాసులు కాల్చి వెళ్లిపోతున్నారే తప్ప, పూర్తి స్థాయిలో ఏనుగుల అరికట్టడంలో విఫలమవుతున్నారని రైతులు మండిపడుతున్నారు. అటవీశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా పనిచేస్తున్నా..చర్యలు మాత్రం లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలపై దాడులు చంద్రగిరి, చిన్నగొట్టిగళ్లు, ఎర్రావారిపాళెం మండలాలు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న గజరాజులు రాత్రుల్లో పొలాలపై వీర విహారం చేస్తున్నాయి. వరి, చెరకు, మామిడి, అరటి పంటను తొక్కి నాశనం చేస్తున్నాయి. మరో 20 రోజుల్లో చేతికి వచ్చే వరి పంట సైతం తొక్కేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సుమారు 10కు పైగా ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేయడంతో పాటు ఇటీవల చంద్రగిరి మండంలోని చిన్నరామాపురం గ్రామంలోని ఏనుగులు రావడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి సారి గ్రామంలోకి ఏనుగులు రావడంతో అధికారుల పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. పరిహారానికి ఎదురుచూపులే 20 రోజుల్లో చేతికి వచ్చే పంటను 10 రోజుల కిందట ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. సుమారు రూ.లక్ష పెట్టుబడి పెట్టి పండించిన పంట నాశనం అయింది. ఇప్పుడు భూమి యజమానికి నేను ఎలా నగదు చెల్లించాలి. అటవీ అధికారులేమో పచ్చి వడ్లను కోసుకోమని సలహాలు ఇస్తున్నారు. ఇలా ఎవరైనా చేస్తారా..? పరిహారం కూడా నామమాత్రంగా అందిస్తున్నారు.. పరిహారం కోసం మరో ఆరు నెలలు ఆగాల్సి వస్తోంది. – చిన్నబ్బ, కౌలు రైతు ఏనుగుల కట్టడికి శాశ్వత పరిష్కారం చూపాలి గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఏనుగులు ఇంత పెద్ద స్థాయిలో పంట పొలాలపై దాడు లు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రెండు నెలలుగా ఏనుగులు పెద్ద ఎత్తున పంట పొలాలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. అధికారులు వచ్చి ఎన్ని చర్యలు తీసుకున్నా, ఏనుగుల దాడులు మాత్రం ఆగడం లేదు. ఏనుగుల దాడు లను నివారించేందుకు శాశ్వత పరిష్కారం చూపి తే రైతులకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. – రాగిణి, సర్పంచ్, చిన్నరామాపురం -
9న తిరుమలలో కార్తీక వన భోజనం
తిరుమల : కార్తీక వనభోజన కార్యక్రమం నవంబరు 9న తిరుమలలోని గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో జరగనుంది. కార్తీక మాసంలో వన భోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు మలయప్ప స్వామి చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఊరేగింపు ఉండనుంది. ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 19న స్వర్ణముఖి నదీ హారతులు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ స్వర్ణముఖి నదీ హారతులు ఇస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు తెలిపారు. గ్రామస్తులపై తిరగబడ్డ ఇసుకాసురులు నాయుడుపేటటౌన్ : మండల పరిధిలోని చిగురుపాడులో స్వర్ణముఖి నది వద్ద ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు చేస్తుండడంతో శనివారం సాయంత్రం గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో స్వర్ణముఖి నది వద్ద అధికారులు వేసిన అడ్డుకట్టను తెగ్గొట్టి ఏకంగా జెసీబీతో ఇసుక అక్రమ రవాణాకు పూనుకున్నారు. దీంతో గ్రామస్తులు వారిని వారించారు. దీంతో ఇసుకాసురులు తిరగబడి గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
కుంకీల లక్ష్యం ఇదీ!
‘దాడి చేసిన వారిని శిక్షించండి’ తన భర్తపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతూ రేణిగుంట విమానాశ్రయం వద్ద బాధితురాలు ఆందోళనకు దిగింది.శిక్షణ, ట్రయల్స్కే పరిమితం ఆదివారం శ్రీ 9 శ్రీ నవంబర్ శ్రీ 2025కుంకీల ఆపరేషన్ సర్కస్ ఫీట్లకే పరిమితమైంది. ఇంకా శిక్షణ, ట్రయల్ రన్తోనే సాగుతోంది. ఒకపక్క ఏనుగులు భీకర దాడులు చేస్తున్నా కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చేతికొచ్చిన పంటలు సర్వనాశనమవుతున్నా.. మనుషులను తొక్కి ప్రాణాలు తీస్తున్నా చూస్తూ మిన్నకుండిపోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన కుంకీల క్యాప్చరింగ్ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల దాడులు.. కుంకీల క్యాప్చరింగ్పై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్..! మొసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపులోని కుంకీలు కుంకీలు..సర్కస్ ీఫీట్లు! జిల్లాలో ఏనుగుల పరిస్థితి ఇదీ పలమనేరు, కుప్పం, పూతలపట్టు, పుంగనూరు పరిధిల్లోని కౌండిన్య అభయారణ్యంలో మొత్తం 105దాకా ఏనుగులుండగా ఇందులో కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీలోనే 56 దాకా ఉన్నాయి. ఇవిగాక పక్క రాష్ట్రాల నుంచి మైగ్రేటెట్ ఏనుగులు ఇక్కడికి వస్తుంటాయి. పలమనేరు: టేకుమంద ఫారెస్ట్లో మూడు నెలల క్రితం కుంకీ ఏనుగుల ట్రయల్రన్ చేపట్టారు. అది విజయవంతమైందని అధికారులు డప్పుకొట్టారు. మదపుటేనుగుల క్యాప్చరింగ్ త్వరలో చేపడతామని చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న కుంకీలకు మనిషి చెప్పినట్టు వినేలే కమాండింగ్స్ ఇచ్చి వాటి ద్వారా రకరకాల సర్కస్ ఫీట్లను మాత్రం చేయిస్తున్నారు. వీటిని చూసేందుకు ఎక్కువగా ప్రజలు ఎలిఫెంట్ క్యాంపునకు వెళుతున్నారు. తొక్కి చంపేస్తున్నాయి! 2012 నుంచి ఇటీవల సోమలలో మృతి చెందిన కృష్ణంరాజు దాకా మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పాయారు. ఏనుగుల దాడుల్లో 25 మందికిపైగా గాయపడ్డారు. ఏనుగుల బారినపడి 64 పశువులు మృతి చెందాయి. ఈ దాడులు చేసింది ఎక్కువగా మదపుటేనుగులే. 9 వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఏనుగులు అడవిని దాటి బయటకొచ్చి ఇప్పటిదాకా 24 దాకా మృత్యువాత పడ్డాయి. ఆ రాష్ట్రాల్లో క్యాప్చరింగ్ ఎలాగంటే..! ప్రజల ప్రాణాలు తీస్తున్న వాటిలో 90శాతం మదపుటేనుగులే. ఇక్కడి ఎలిఫెంట్ క్యాంపులోని దేవా, రంజన్ సైతం కుంకీలుగా మారాలి. అప్పుడు కుంకీలు నాలుగు దిశల్లో వెళ్లి గుంపులోని మదపుటేనుగులను అదుపుచేయాలి. ఆ సమయంలో మావటీలు మత్తు సూదిచ్చి దాన్ని బంధించి క్యాంపునకు తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన మదపుటేనుగులను క్యాంపులోని క్రాల్స్లో బంధించి మూడు నుంచి ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఆపై అవి కుంకీలుగా మారుతాయి. ఈ ప్రక్రియ పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడులో సాగుతోంది. అదే విధంగా ఇక్కడి మదపుటేనుగులను కట్టడి చేయాలంటే ఇంకా మూడేళ్లదాకా పట్టే అవకాశముంది. భారంగా కుంకీల సంరక్షణ ఏనుగుల సమస్యలు అదుపులోకి రాలేదని రైతుల ఆవేదనవ్యక్తం చేస్తుంటే ఉన్న కుంకీలకు మేత, ఆహారం కోసం అటవీశాఖకు మరింత భారంగా మారింది. ఇక్కడి క్యాంపు నిర్వహణకు నెలకు రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి రేంజ్లోని సిబ్బంది కుంకీ పనుల్లోనే బిజీగా మారిపోయారు. కుంకీ క్యాంపును పరిశీలించేందుకు వస్తున్న డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఈ ప్రాంతంలో ఏనుగుల సమస్యను పూర్తిగా పరిష్కరించే అంశంపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఎలిఫెంట్ క్యాంపులోని ఏనుగులు కుంకీ ఏనుగుల ద్వారా ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కుంకీ ఆపరేషన్లు గత కొన్నేళ్లుగా జరుగుతున్నా యి. అక్కడ విజయవంతం కావడంతో కూటమి ప్రభుత్వం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు దుబేరా బేస్ క్యాంపు నుంచి నాలుగు కుంకీ ఏనుగులు, రామకుప్పం ననియాల నుంచి రెండు ఏనుగులను తెప్పించారు. వీటికి ఈ ప్రాంతాన్ని అలవాటు చేసి ఆపై అడవిలోని ఏనుగులను కట్టడి చేయాలి. ఇందులో అత్యంత ముఖ్యమైన పని క్యాప్చరింగ్. అంటే మదపుటేనుగులను గుర్తించి వాటికి మత్తుచ్చి కుంకీల సాయంతో క్యాంపునకు తీసుకొచ్చి ఇక్కడి ఎలిఫెంట్ క్రాల్స్లో బంధించాలి. ఆపై వీటికి ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తే అవి కుంకీలగా మారి డాడులు చేయకుండా మాట వింటాయి. ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఇంకా సమయం పడుతుంది కుంకీల ద్వారా క్యాప్చరింగ్కు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇందుకు కొంత సమయంపడుతుంది. జిల్లాలోని పలు చోట్ల ఏనుగుల గుంపులు ఎక్కువగా ఉన్నాయి. మూడు నాలుగు కుంకీలు వాటిని నియంత్రించడం కష్టం. మావటీల ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి ఓ ప్రణాళిక మేరకు ఏనుగుల కదలికలును గమనిస్తూ ఆపై క్యాప్చరింగ్ చేసే అవకాశాలున్నాయి. – సుబ్బరాజు, చిత్తూరు డీఎఫ్వో -
మతిస్థిమితం లేని యువకుడు తండ్రి చెంతకు
రేణిగుంట : చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నరసరాజు కుమారుడు జగదీష్ మతిస్థిమితం కోల్పోయి గత నెల 21న తప్పిపోయాడు. రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్న అతడిని గుర్తించిన హైకోర్టు అడ్వకేట్ పేరూరు మునిరెడ్డి సమాచారం ఇవ్వడంతో రేణిగుంట సర్పంచ్ నగేషం అభయ క్షేత్రంలో ఆశ్రయం కల్పించారు. అభయ క్షేత్రంలో చేర్పించిన వార్త వివిధ పత్రికల్లో రావడంతో నరసరాజు రేణిగుంటకు చేరుకున్నారు. శనివారం సర్పంచ్ సమక్షంలో అభయ క్షేత్రం నిర్వాహకురాలు తస్లీమా బేగం మతిస్థిమితం లేని యువకుడిని తండ్రికి అప్పగించారు. తన బిడ్డను ఆదుకున్న అందరికీ యువకుడు తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. -
‘నా భర్తపై దాడి చేసిన వారిని శిక్షించండి’
ఏర్పేడు : తన భర్తను దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సారిక అనే యువతి శనివారం పిల్లలు, బంధువులతో కలిసి రేణిగుంట విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కోసం ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరీక్షించారు. పాత టెర్మినల్ వద్ద పవన్ కాన్వాయ్ సమీపిస్తుండటంతో గట్టిగా కేకలు పెట్టినా కాన్వాయ్ ఆపకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు.. కేవీబీపురం మండలం పవనివారికండ్రిగ గ్రామానికి చెందిన తన భర్త బొడుగు దామోదరం సౌదీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తూ 15రోజుల కిందట ఇంటికి వచ్చాడని ఆమె తెలిపింది. అయితే గ్రామ సర్పంచ్ చెంచుప్రకాష్ యాదవ్ పంచాయతీ నిధులు రూ.2 కోట్లుకు పైగా అక్రమాలకు పాల్పడి స్వాహా చేశాడని సోమవారం కొందరు యువకులు గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారన్నారు. అయితే తన భర్త దామోదరం ఇదంతా చేయిస్తున్నాడని కక్ష పెంచుకున్న సర్పంచ్ ఈనెల 4వ తేదీన ఇంట్లో ఉన్న తన భర్త దామోదరంపై గొడవకు వచ్చి మూకుమ్మడిగా దాడికి పాల్పడి తలపై బలంగా కొట్టి గాయపరిచారన్నారు. అడ్డు వచ్చిన దామోదరం తల్లి బొడుగు రత్నమ్మ, చింత శ్రీనివాసులు, మణిలను కొట్టి గాయపరిచారన్నారు. అయితే తీవ్రంగా గాయపడిన దామోదరం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగానే ఉందని ఆమె వివరించింది. తన భర్త దామోదరం పై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా కేవీబీపురం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె వాపోయారు. -
అదృశ్యమైన విద్యార్థి అప్పగింత
చిల్లకూరు:మండల కేంద్రమైన చిల్లకూరులోని గురుకు ల బాలుర కళాశాల నుంచి అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి హరినాథ్ను తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు ఇలా..రాపూరు మండలం అక్రమాంబపు రం గ్రామానికి చెందిన దాసరి హరినాథ్ చిల్లకూరు గురుకులంలో ఇంటర్ చదువుతున్నాడు. శనివారం ఉదయం కళాశాల నుంచి అదృశ్యమయ్యాడు. దీనిని గుర్తించిన వార్డెన్ వెంటనే ప్రిన్సిపల్కు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో విద్యార్థి చైన్నె వైపు వెళ్లే రైలు కోసం గూడూ రు రైల్వే స్టేషన్లో వేచి ఉండడంతో అతడిని పట్టుకుని స్టేషన్కు తరలించి అతడి తండ్రికి అప్పగించారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
– షూటింగ్లో కాంస్య పతకం చిల్లకూరు : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో రైఫిల్ షూటింగ్లో ఓ బాలిక తన ప్రతిభను చాటి బ్రాంజ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. గూడూరు పట్టణంలోని దూర్జటి నగర్లో నివాసం ఉండే లక్ష్మీప్రసన్న స్థానికంగా ఉండే ప్రవేటు కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో బాలిక స్థానికంగా ఉండే అకాడమీలో కోచ్ జయశంకర్ ఆధ్వర్యంలో షూటింగ్లో శిక్షణ పొందింది. ఈ క్రమంలో స్కూల్ గేమ్స్ సమాఖ్య ద్వారా జరుగుతున్న క్రీడా పోటీలలో ఆమె పాల్గొని మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది. ఒంగోలులో జరిగిన జాతీయ స్థాయి ఎంపికల్లో పాల్గొన్న బాలిక ముగ్గురితో పోటీ పడి బ్రాంజ్ మెడల్ సాధించింది. దీంతో ఆమె త్వరలో జరిగే జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. జాతీయ స్థాయికి బాలిక ఎంపిక కావడంతో పలువురు అభినందించారు. -
ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి.. తల్లి ఆత్మహత్య
తిరుపతి : జిల్లాలోని సూళ్లూరుపేట మండలం ఉగ్గుమూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సమస్యల కారణంగా ఓ మహిల ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు బిడ్డలు మృతి చెందారు. దాంతో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడటానికి కుటుంబంలో చోటు చేసుకున్న చిన్నపాటి ఘర్షనే కారణమయ్యి ఉండవచ్చిన చుట్టుపక్కల వారు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పవన్ సార్.. మాకు న్యాయం చేయండి
సాక్షి, తిరుపతి: తెలుగు రాష్ట్రాల్లో జనసేన నేత(మాజీ) వినూత కోట డ్రైవర్ రాయుడి కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. జనసేన తరఫున తమకు న్యాయం కావాలంటూ రాయుడి కుటుంబం నిరసనకు దిగింది. సరిగ్గా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.‘‘పవన్ కల్యాణ్గారూ.. మీరే మాకు న్యాయం చేయండి’’ అంటూ శ్రీనివాసులు అలియాస్ రాయుడి కుటుంబ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తిరుపతి కలెక్టరేట్ ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. మా బిడ్డ రాయుడు పవన్ వీరాభిమాని. జనసేన పార్టీ కార్యకర్తగా కూడా ఉన్నాడు. అలాంటోడు చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నా ఆ పార్టీ నుంచి కనీస స్పందన లేదు. ఇప్పటికైనా జనసేన, పవన్ తరఫు నుంచి మాకు న్యాయం జరగాలి’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జులైలో చెన్నై సమీపంలోని కూవం నదిలో గుర్తు తెలియని మృతదేహం ఒకటి కొట్టుకు వచ్చింది. చేతిపై జనసేన రాతల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది జనసేన కాళహస్తి ఇంచార్జి ఇంచార్జి వినూత కోట మాజీ డ్రైవర్ రాయుడిదిగా నిర్ధారణ అయ్యింది. రాజకీయ, వ్యక్తిగత కారణాలతోనే హత్య చేశారని చెబుతూ చెన్నై పోలీసులు.. వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన ఆమెను పార్టీ నుంచి తొలగించింది. అయితే..ఈ కేసులో వినూత కోట తన ప్రమేయం లేదంటూ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఆపై కోర్టు బెయిల్ ఇవ్వడంతో షరతుల ఆధారంగా ఆమె, ఆమె భర్త చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈలోపు.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి , వినుత మద్య రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. సంచలన వివరాలతో రాయుడి సెల్ఫీ వీడియో ఒకటి బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఆ వెంటనే వినుత కూడా కుట్రలను అన్ని ఆధారాలతో త్వరలోనే బయటపెడతానంటూ సెల్ఫీ వీడియో విడుదల చర్చనీయాంశమైంది. అయితే.. ఇప్పటికీ ఈ వ్యవహారంపై జనసేన, టీడీపీ పార్టీల నుంచి ప్రతిస్పందన లేకపోవడం గమనార్హం. -
లోకేష్.. ఎంత మందిని జైలులో పెడతావు?: అంబటి
సాక్షి, తిరుపతి: మంత్రి నారా లోకేష్కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారం శాశ్వతం కాదు.. ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. మీ నాన్నను జైల్లో పెట్టారని నీకు కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీలో ఏ ఒక్కరూ భయపడరు. మా పార్టీ నాయకులపైన అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడతామని చూస్తే దీని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అధికారం శాశ్వతం కాదు. అధికార మదంతో లోకేష్ ఉన్నాడు. తన తల్లిని అంబటి రాంబాబు అవమానించాడు అంటూ లోకేష్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. విచారించుకోండి నేను ఏరోజు ఆయన తల్లిని అవమానించలేదు. మీ నాన్నను జైల్లో పెట్టారని నీకు కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా?. ఎంత మందిని జైలులో పెడతారు?. జైల్లో పెడితే బయటకు రామా.. మీరు ఏమైనా చంపేస్తారా. జైల్లో నుంచి మీ నాన్న చంద్రబాబు బయటకు రాలేదా?. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మొదలైంది. అన్నీ ప్రజలే చూస్తున్నారు. రాబోయే మూడేళ్లలో మేమంతా ఎలా బలపడతామో మీరే ఊహించుకోండి. కూటమి ప్రభుత్వానికి ఓట్లు ఎందుకు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఆయన్ను ఓడించాము అనే బాధతో ప్రజలు ఆయన పర్యటనకు తరలి వస్తున్నారు.మీ రెడ్బుక్ బంగాళాఖాతంలో మునగడం ఖాయం. పవన్ కళ్యాణ్.. మీరు 15 ఏళ్లు కాదు జీవితాంతం కలిసే ఉండండి మాకేం నష్టం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగింది మీరు కలిసి ఉంటేనే మాకు కలదు సుఖం. మేము బలపడతాం. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ.. చిరంజీవిని అవమానిస్తే పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. మీరు పోరాట యోధులు అన్నారు. అన్యాయం జరిగితే సహించరు అన్నారు ఇదేనా?. నువ్వు చెప్తే నమ్మి కాపులందరూ చంద్రబాబుకు ఓటు వేశారు. మీ పోరాట పటిమని గంగలో ముంచేయండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి 30 కంపార్ట్ మెంట్లు నిండి బయట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,075 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,535 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 3.80 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. -
కూటమి నేతల భోజ్యం
చిట్టమూరు : మండలంలో మొత్తం 98 చెరువులు ఉన్నాయి. 30 వేల ఎకరాల ఆయకట్లు ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోగిలి, ఆరూరు, చిట్టమూరు, చిల్లమూరు తదితర చెరువులకు సప్లయ్ చానల్ పనులు చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకుండా కూటమి నేతలే కాంట్రాక్టర్లుగా తూతూమంత్రంగా పనులు చేసి నిధులు తినేసినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తూములు శిథిలావస్థకు చేరుకుని చెరువులోని నీరంతా బయటకు వెల్లిపోతుందని వాపోతున్నారు. యాకసిరి, ఆరూరు, మల్లాం, కలగుర్తిపాడు,చిల్లమూరు, మొలకలపూడి చెరువుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వెల్లడిస్తున్నారు. 07జీడీఆర్101 కలుగుర్తిపాడు చెరువుకు పడిన గండి. 07జీడీఆర్102 శిథిలావస్థకు చేరి నీరు లీకవుతున్న తూము -
ముప్పు ముంగిట.. కరకట్ట!
నిండితే కడ‘గండ్లే’ చిల్లకూరు : మండలంలో సుమారు 62 చెరువులు ఉన్నాయి. వీటికి 7,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే చెరువులు పూర్తిగా నిండితే గండ్లు పడే పరిస్థితి. కట్టలకు మరమ్మతులు చేయించమని రైతులు విన్నవిస్తే అధికారులు నిధులు లేవని చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రధానంగా ముత్యాలపాడు చెరువు, ఓడూరు, కడివేడు, కలవకొండ, పెన్నాక, యద్దలచెరువు, పాపి చెరువులు ప్రమాదకరంగా ఉన్నాయి. దీంతో స్థానిక రైతులే ఇసుక బస్తాలు వేసుకుని కాపాడుకుంటున్నారు. జిల్లా సమాచారం -
● ప్రతిధ్వనించిన వందేమాతరం
తిరుపతి రూరల్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బంకిం చంద్ర చటర్జీ రాసిన ‘‘వందే మాతరం’’ 150వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్శిటీలో ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు భోదనేతర సిబ్బంది అందరూ వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వర్శిటీ వీసీ ఆచార్య ఉమ మాట్లాడుతూ.. 1875లో రచించిన వందేమాతరం గేయంభారత దేశంలో దేశ భక్తి పెంచేలా చేసిందన్నారు. వందేమాతరం గేయం ప్రతి భారతీయుడు చిరస్మరణీయంగా గుర్తు పెట్టుకునే గీతమని, ఆ గేయాన్ని గుండెల నిండా నింపుకోవాలన్నారు. భారతీయ సంప్రదాయం , చేనేత సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వర్సిటీలో ప్రతి నెల 7వ తేదీన చేనేత వస్త్రాలను మాత్రమే ధరించి రావాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. రజని, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు. రేణిగుంట : వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం రేణిగుంట విమానాశ్రయంలో వేడుకలను ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామూహికంగా వందేమాతర గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో విమానాశ్రయ డైరెక్టర్ డి. భూమి నాథన్, అధికారులు, సీఐఎస్ఎఫ్, జడ్పీ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు వర్సిటీలే
తిరుపతి సిటీ: దేశాభివృద్ధికి యూనివర్సిటీలే పట్టుకొమ్మలని నీతిఅయోగ్ సభ్యులు, జేఎన్యూ చాన్సలర్ డాక్టర్ వీకే సర్వసత్ తెలిపారు. ఎస్వీయూ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం వర్సిటీ సెనేట్ హాల్ వేదికగా ది ఇంజిన్ ఆఫ్ వికసిత్ భారత్– 2047 అనే అంశంపై సర్వసత్ ప్రసంగించారు. ఆధునిక సాంకేతికత, డిజిటల్ వ్యవస్థ నిర్వహణ, పారిశ్రామిక అభివృద్ధి, పరిశోధనలు, పర్యావరణ పరిరక్షణ వంటివి దేశాభివృద్ధికి మూల స్తంభాలని పేర్కొన్నారు. దేశ మేధోసంపత్తి విదేశాలకు తరలిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఎస్వీయూ వీసీ నర్సింగరావు మాట్లాడుతూ ఎస్వీయూలో నూతన పరిశోధనలకు, నాణ్యమైన విద్యాబోధనపై దృష్టి సారించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీఎస్ కార్యదర్శి డాక్టర్ టి నారాయణరావు, మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ భూపతినాయుడు, రెక్టార్ సీహెచ్ అప్పారావు, ప్రిన్సిపాళ్లు, డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
తాగి బండెక్కితే కఠిన చర్యలు : ఎస్పీ
తిరుపతి క్రైమ్ : మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలో ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ పరికరాలను పంపిణీ చేశారు. ట్రాఫిక్ పోలీసులకు మొదటగా ఆయన నూతన బ్రీత్ అనలైజర్ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి వాహనాలను తనిఖీలను చేయాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి వద్ద తప్పనిసరిగా ఈ పరికరాలు ఉండాలని తెలిపారు. తాగి వాహనాలు నడిపే వారిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలన్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పరికరాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. -
ప్రమాదకరంగా పేరూరు చెరువు
తిరుపతి రూరల్ : మండలంలోని పేరూరు చెరువుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2 కిలోమీటర్ల మేరకు కరకట్ట నిర్మించారు. తర్వాత ఐదేళ్ల పాటు ఉపాధి హామీ పనుల ద్వారా మరమ్మతులు, చెట్లు తొలగింపు వంటి పనులను చేపట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేరూరు చెరువు కట్టను అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరింత పటిష్టం చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేరూరు చెరువులో అత్యధికంగా మట్టి తవ్వకాలు జరగడంతో భారీగా గోతులు ఏర్పడ్డాయి. దీంతో కట్ట బలహీనంగా మారింది. -
డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ
తిరుపతి తుడా : స్థానిక ఓల్డ్ మెటర్నరీ ఆసుపత్రి ప్రాంగణంలోని ఎపిడమిక్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ స్టోర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టోర్లోని మందుల డేటాను పరిశీలించారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పీహెచ్సీ కేంద్రాలకు మందులను తరలించేందుకు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.హత్యాయత్నం కేసులో 10 ఏళ్ల జైలు చిల్లకూరు : మండలంలోని తిక్కవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ ఆస్తి విషయంలో మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలో నెల్లూరు కోర్టు నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షను శుక్రవారం ఖరారు చేసింది. చిల్లకూరు పోలీసుల వివరాల మేరకు తిక్కవరం గ్రామానికి చెందిన రాయపాటి వీర రాఘవయ్య కుటుంబ ఆస్తి విషయంలో వరసకు తనకు చెల్లి అయిన వెంకటలక్ష్మిపై 2017లో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పట్లో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్ఐగా ఉన్న శ్రీనివాసరావు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసు వాదోప వాదాలు ముగించుకుని నిందితుడి నేరం రుజువు కావడంతో తీర్పు దశకు చేరుకుంది. ఈ క్రమంలో నెల్లూరులోని 8వ అదనపు జిల్లా జడ్జి తీర్పును వెల్లడిస్తూ నిందితుడు వీర రాఘవయ్యకు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ 1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో రెండు నెలలు సాధారణ జైలు శిక్షను అనుభవించాలన్నారు. -
ఆన్లైన్లో అంగప్రదక్షిణ టోకెన్లు
తిరుమల : శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణం టోకెన్లను ఆన్లైన్లో జారీ చేయనున్నట్లు టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ యువర్ఈఓలో ఆయన పాల్గొన్నారు. రాబోయే ఏడాది ఫిబ్రవరి నుంచి అంగ ప్రదక్షిణం ఆన్లైన్ కోటా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫోన్లో పలువురు భక్తులతో ఆయన మాట్లాడారు. వివరాలు ఈఓ మాటల్లోనే.. ● తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ● భక్తుల సౌకర్యార్థం రూ.25 కోట్లతో తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత షెల్టర్, క్యూలైన్లు, స్టీల్ ఫుట్ ఓవర్ వంతెనలు, మరుగుదొడ్లు నిర్మిస్తాం. ● శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. ● రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5 వేల భజన మందిరాలు నిర్మిస్తాం. ● టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపడతాం. ● అమరావతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రాకారం, కల్యాణోత్సవ మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులకు ఈనెల 27వ తేదీన శ్రీకారం చుడతాం. ● శ్రీవారి దర్శనానికి దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచిస్తున్నాం. -
డిప్యూటీ సీఎం పర్యటన గోప్యం
తిరుపతి అర్బన్ : రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాకు వస్తుంటే....ఆయన ప్రోగ్రామ్లో స్పష్టత కరువైంది. రెండు రోజుల క్రితం ఈ నెల 7 (శుక్రవారం), 8 (శనివారం) రెండు రోజుల పాటు అటవీశాఖకు సంబంధించి పర్యవేక్షణ నేపథ్యంలో జిల్లాలో పర్యటిస్తారని జీఆర్ మధుసూదన్ పేరుతో ఓ ప్రకటన వెల్లడించారు. ఆ తర్వాత మరుసటి రోజు 9న (ఆదివారం) చిత్తూరు జిల్లాలోని పలమనేరులో అటవీశాఖ పరిధిలో ఒక్క రోజు పర్యవేక్షణ ఉన్నట్లు మరో ప్రకటన వెల్లడించారు. తాజాగా తిరుపతి జిల్లా సమాచారశాఖ విభాగానికి చెందిన అధికారులు శుక్రవారం సాయంత్రం 6.08 గంటల సమయంలో ఓ ప్రకటన మీడియాకు విడుదల చేశారు. డిప్యూటీ సీఎం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్లో సమావేశం ఉంది...ఐదు నిమిషాలు మాత్రం ఫొటోలు, వీడియోలు తీసుకునే అవకాశం ఉంది...ఆ తర్వాత మీడియాకు అనుమతి లేదు... అనంతరం ప్రెస్ బ్రీఫింగ్ ఉందని వెల్లడించారు. అయితే శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తిరుపతి కలెక్టరేట్కు ఏ మార్గంలో వస్తారో సమాచారం ఇవ్వలేదు. కేవలం రెండు లైన్లు ప్రకటనలో అసంపూర్తి సమాచారంతో సమాచారశాఖ ప్రకటన విడుదల చేయడం ఏంటో అంటూ అంతా చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం జిల్లాకు వస్తుంటే అంతా గోప్యంగా సమాచారాన్ని ఉంచాల్సిన అవసరం ఏముందో అంటూ చర్చించుకుంటున్నారు. మంత్రులు వస్తేనే పూర్తి వివరాలు వెల్లడించే సమాచారశాఖ అధికారులు డిప్యూటీ సీఎం వస్తుంటే రెండు లైన్లతో కనీసం ఏ మార్గం ద్వారా తిరుపతి కలెక్టరేట్కు వస్తున్నారో అనే సమాచారాన్ని ఇవ్వకపోవడంలో అంతర్యం ఏమిటో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.శ్రీవారి సేవలో ప్రముఖులుతిరుమల : తిరుమల శ్రీవారిని గురువారం సీనియర్ ఐఆర్ఎస్ అధికారి, ఏపీ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని, సినీనటి దీవి వదిత్య దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగ నాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డు ప్రసాదాలతో సత్కరించారు. -
పచ్చమూక స్వార్థంతోనే..
తిరుపతి అర్బన్ : జిల్లాలోని చెరువుల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం కనీస మాత్రం చర్యలు చేపట్టలేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ చెరువుల బలోపేతానికి చేసింది శూన్యమని విమర్శిస్తున్నారు. కేవీబీపురం మండలం కళత్తూరులో రాయల చెరువుకు గండిపడి ఊరు మొత్తం కొట్టుకుపోయే దుస్థితి దాపురించేందుకు సర్కారు నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వందలాది చెరువులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దుంగలు, కేసులు సరే..దొంగలేరీ!
బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి సమీపంలో పలమనేరు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న ఎర్రదుంగలు(ఫైల్) చిత్తూరు అర్బన్: శేషాచల అడవుల్లో గొడళ్ల చప్పుళ్లు ఆగనంటున్నాయి. రంపపు కోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎర్రచందనం వృక్షాలకు కత్తుల గాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. గత రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఎర్ర చందనం దుంగలను తరలిస్తూనే ఉన్నారు. స్మగ్లర్లను పట్టుకుంటే అధికార పార్టీ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లకు యంత్రాంగం తలొగ్గుతోందనే ప్రచారం సాగుతోంది. మనకు మాత్రమే.. ఎర్రచందనం చెట్లు వాతావరణం, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లోని నేలల్లో మాత్రమే పెరుగుతుంది. తిరుపతి, తిరుమల, శేషాచల అడవులు, చిత్తూరు, యాదమరి, పూతలపట్టు, పుంగనూరు, సదుం, సోమల, కార్వేటినగరం, ఎస్ఆర్.పురం, పులిచెర్ల, పలమనేరు ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకోవడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ విభాగం, అటవీశాఖ అధికారులు ఉన్నా కూడా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. చిత్తూరులో గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఎస్బీఎక్స్ పేరిట ప్రత్యేక విభాగం పనిచేసేది. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. శాంతిభద్రతలు పర్యవేక్షించే ఆయా పోలీస్ స్టేషన్ అధికారులే ఎర్రచందనం స్మగ్లింగ్ను కూడా చూడాలి. స్పెషల్బ్రాంచ్, ఈగల్ లాంటి విభాగాలున్నా ఎర్ర బంగారం దోచుకెళ్లే నేరస్తులపై నిఘా ఉంచడం లేదనే విమర్శలున్నాయి. శేషాచలనంలో అవే చప్పుళ్లు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు నేలకూల్చని రోజంటూ ఉండదు. తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో వచ్చే కూలీలు ఎర్రచందనం చెట్లను కొట్టి, వాటిని రవాణా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పగలు–రేయి తేడా లేకుండా గొడ్డళ్లు, పదునైన కత్తులతో రోజుకు వందల సంఖ్యలో ఎర్రచందనం వృక్షాలను నరికేస్తున్నారు. కానీ వీళ్ల వెనుక ఉన్న డాన్లను మాత్రం ఎవ్వరూ పట్టుకోవడం లేదు. కూలీలపై కేసులు పెట్టి చేతులు దుపులుకుంటున్నారే తప్ప.. కింగ్పిన్ ఎవరనే కనీస విచారణ కూడా చేయడం లేదనే విమర్శలున్నాయి. నామమాత్రపు తనిఖీలు ఎర్రబంగారం చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి దేశ, విదేశాలకు తరలుతోంది. తమిళనాడులోని పలు సముద్ర తీరాల్లోని కంటైనర్ల ద్వారా విదేశాలకు వెళుతున్న ఎర్రచందనం దుంగలను జిల్లా సరిహద్దుల్లోనే నిలువరించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు మునుపు చిత్తూరు జిల్లాలో 92 ప్రాంతాల్లో చెక్పోస్టులుండగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12కే పరిమితం కావడం అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు స్మగ్లర్లను పట్టుకుంటే రాజకీయ నేతల నుంచి ఫోన్లు రావడం, ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేయడం సర్వసాధారణగా మారిపోయింది. ఏడాదిన్నరకాలంలో ఒక్క స్మగ్లర్పై కూడా పీడీ యాక్టు పెట్టలేదంటే అధికారుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.చిత్తూరు జిల్లాలో 2024–25లో ఎర్రచందనం స్మగ్లింగ్పై పది కేసులు, అటవీశాఖ అధికారులు ఓ కేసు నమోదు చేశారు. ఇందులో 42 మందిని అరెస్టు చేసి, 518 ఎర్రచందనం దుంగలను, 14 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2025–26కు ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేసి.. 32 ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తిరుపతిలో పోలీసు, అటవీశాఖ కలిపి ఈ ఏడాది తొలి నుంచి జూన్ వరకు 28 కేసులు నమోదుచేస్తే, 105 మంది నిందితులను అరెస్టు చేశారు. 1,169 ఎర్రచందనం దుంగలు, 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది. పాపులేషన్ స్టడీస్, ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలో చిరుత కదలికలను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. సీసీ కెమెరాలో చిరుతపులి సంచార దృశ్యాలు రికార్డు అయ్యాయి. చిరుత పులి.. కుక్కను వేటాడింది. వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు బయట ఒంటరిగా తిరగొద్దని సిబ్బంది హెచ్చరిస్తున్నారు.కాగా, వారం రోజుల క్రితం కూడా తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. టీటీడీ, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపించారు. -
విశృంఖల పర్వం
తిరుపతి సిటీ: శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి ర్యాగింగ్ గ్రహణం పట్టింది. వర్సిటీ అధికారులు తమ నియంతృత్వ పోకడలతో విద్యార్థుల భవిష్యత్ను అంధకారంలోకి నెడుతున్నారు. వర్సిటీని గాడిన పెట్టాల్సిన ప్రభుత్వం సైతం చోద్యం చూస్తోంది. పీజీ సైకాలజీ విభాగంలో నూతనంగా ఫస్ట్ ఇయర్లో చేరిన జూనియర్ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. సైకాలజీ ప్రొఫెసర్ విశ్వనాథ్రెడ్డి ప్రోత్సాహంతో సీనియర్లు ఈనెల ఒకటో తేదీ నుంచి రెండురోజుల పాటు గంటల తరబడి నలుగురు విద్యార్థినులను ర్యాగింగ్లో భాగంగా వేధించారు. ఏమీ చేయలేని స్థితిలో ర్యాగింగ్ను భరించి వెంటనే వర్సిటీ రిజిస్ట్రార్, రెక్టార్కు విద్యార్థి సంఘాలతో కలసి విన్నవించారు. కానీ విచారిస్తున్నాం.. చర్యలు తీసుకుంటాం అంటూ విద్యార్థులను, బాధితులను అధికారులు మభ్యపెట్టి అనంతరం ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్లపైనా, సదరు ప్రొఫెసర్పైనా కనీసం చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థి లోకం కన్నెర్రజేసింది. భారీఎత్తున వర్సిటీలో బాధిత విద్యా ర్థినులు, తల్లిదండ్రులతో కలసి ర్యాగింగ్కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. దీంతో అధికారులు ర్యాగింగ్కు పాల్పడిన, ప్రోత్సహించిన అధ్యాపకుడిపై చర్యలు తీసుకోకపోగా.. గళం విప్పిన విద్యార్థి నాయకులపైనే కేసులు బనాయించారు. అధ్యాపకున్ని సస్పెండ్ చేశాంఎస్వీయూలో ర్యాగింగ్ను ప్రోత్సహించినట్లు సైకాలజీ విభాగాధిపతి విశ్వనాథ్రెడ్డిపై అభియోగాలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయనను సస్పెండ్ చేశామని రిజిస్ట్రార్ భూపతినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలో ర్యాగింగ్కు తావులేదని, వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్ఛరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు వర్సిటీలో తావులేదని చెప్పారు. ఘటనపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వర్సిటీ అభివృద్ధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు.వర్సిటీలో పరిస్థితులు దారుణం ఎస్వీయూలో అధికారుల తీరు దారుణంగా తయారైంది. ర్యాగింగ్కు గురైన మహిళా విద్యార్థుల తరఫున అధికారులకు ఫిర్యాదు చేశాం. దీంతో వర్సిటీ అధికారులు మాపై పోలీసులను ఉసిగొల్పి దాడులు చేశారు. ఓ ప్రొఫెసర్ ప్రోత్సాహంతో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను అసభ్యకరంగా ర్యాగింగ్ చేసినా.. ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోకపోడం దారుణం. గళమెత్తిన మాపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎస్వీయూ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. – విద్యార్థి సంఘాల నాయకులు, ఎస్వీయూ వీడియోలు తీశారు ఎస్వీయూ సైకాలజీ విభాగాధిపతి ఆదేశాలతోనే సీనియర్లు మాతో గత శని, ఆదివారాల్లో ఇటు కళాశాలల్లోనూ అటు హాస్టల్లోనూ గంటల తరబడి డ్యాన్సులు వేయించి నరకం చూపించారు. సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుని పైశాచికానందం పొందారు. ఈ విషయంపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసిన నాటి నుంచి ప్రొఫెసర్ మాపై నిఘా ఉంచారు. మీకు అండగా ఉండే వారిపై కేసులు బనాయిస్తాం మీకు ఎవరు దిక్కువస్తారో చూస్తా అంటూ ఆ ప్రొఫెసర్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకే ఇక్కడ మాకు భద్రత లేదని టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నాం. – మీడియాతో మాట్లాడుతున్న బాధిత విద్యార్థినులు టీసీలు ఇవ్వండి.. వెళ్లిపోతాం.. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎస్వీయూలో మా పిల్లలు సీటు సాధించారు. శ్రీవారి పాదాల చెంత చదివే భాగ్యం కలిగిందని సంతోషపడ్డాం. కానీ మా ఆశలు ఆవిరయ్యాయి. ఎస్వీయూలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సాక్షాత్తు ప్రొఫెసర్ సీనియర్ల చేత ర్యాగింగ్ చేయించిన తీరు మమ్మల్ని కలచి వేసింది. ర్యాగింగ్పై అధికారులను నిలదీసినా వారి నుంచి స్పందనలేదు. దీంతో ఎస్వీయూలో మా పిల్లలకు భద్రత లేదు. అందుకే టీసీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మా ఊర్లకు పిల్లలను తీసుకుని వెళ్లిపోతాం. – మీడియాతో ర్యాగింగ్కు గురైన విద్యార్థినుల తల్లిదండ్రులు -
మానవత్వం మంటగలిసిన వేళ
శ్రీకాళహస్తి: మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. 39 ఏళ్ల పాటు వేలమందికి విద్యాబోధన చేసిన ఓ ప్రధానోపాధ్యాయురాలి చివరి మజిలీ కన్నీళ్లు తెప్పిస్తోంది. రమాదేవి(77) అనే ఓ రిటైర్డు హెచ్ఎం.. తాను చనిపోతే కష్టపడి కట్టుకున్న సొంత ఇంట్లో నుంచి సాగనంపాలని కొడుకును కోరింది. అనారోగ్య సమస్యల కారణంగా ఆమె గురువారం మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకురావద్దంటూ కోడలు నిర్దాక్షిణ్యంగా తలుపులు మూసివేయడంతో మృతదేహాన్ని రోడ్డు మీదే ఉంచి ఆ కొడుకు పెట్టిన ఆర్తనాదాలు కన్నీళ్లు తెప్పించిన ఘటన శ్రీకాళహస్తిలో వెలుగుచూసింది. వివరాలు.. అత్యంత రద్దీగా ఉండే పెళ్లి మండపం నుంచి వైఎస్సార్ విగ్రహానికి వెళ్లే మధ్య మార్గంలో రిలయన్స్ మార్ట్ ఎదురుగా రోడ్డు మీదే మృతదేహాన్ని పెట్టి కొడుకు, మనవరాలు ఆర్తనాదాలు పెట్టారు. అయితే రిటైర్డు హెచ్ఎం రమాదేవి కొడుకు సురేష్కు భార్యతో వివాదాలు ఉన్నాయి. అప్పటి నుంచి సురేష్ తన తల్లితో కలిసి పుత్తూరులో నివాసం ఉంటూ కూతురును చదివించుకుంటున్నారు. అయితే రమాదేవి గురువారం మృతి చెందడంతో సొంతింట్లో ఉంచి తన అంతిమయాత్ర నిర్వహించాలన్న చివరి కోరిక తీర్చడానికి సురేష్ తన సొంతింటికి తీసుకొచ్చాడు. కానీ కోడలు ఆమె మృతదేహాన్ని లోపలకు తేకుండా తలుపులు వేసుకుని లోపల కూర్చుంది. దీంతో సురేష్కు ఏంచేయాలో దిక్కుతోచక తన కూతురు రేష్మతో కలిసి రోడ్డు మీదే రోధించారు. తన తల్లి కట్టుకున్న ఇంట్లోకి ఆమె శవాన్ని తీసుకెళ్లనీయకుండా తన భార్య ఇబ్బంది పెడుతోందని రోడ్డుపైనే కూతురితో కలిసి రోధించాడు. అధికారులు వెంటనే స్పందించి రమాదేవి మృతదేహాన్ని ఆమె సొంతింట్లో పెట్టారు. అంతిమ యాత్ర పూర్తి చేయాలని సురేష్కు సూచించారు.


