Tirupati
-
నేడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూన్ కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుంచి 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. కాగా, ఆర్జిత సేవా టికెట్లు, జూన్ 9 నుంచి 11వరకూ జరిగే శ్రీవారి జ్యేష్టాభిషేకం టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ మార్చి 21న ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునే టోకెన్ల కోటాను 22న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మార్చి 24న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ప్రవేశాలను పెంచడం చేతగాకే...
ప్రవేశాలను పెంచుకోవడం చేతగాకనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, తమిళ్, ఉమెన్ స్టడీస్ వంటి కోర్సులకు చరమగీతం పాడుతూ మరిన్ని కోర్సులను మెడ్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏడీ బిల్డింగ్ను ముట్టడిస్తాం. – ఎస్.చిన్న, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి, తిరుపతి స్వతహాగా పీజీసెట్ బెటర్ వర్సిటీ అభివృద్ధి పథంలో నడవాలంటే కోర్సులను తొలగించడం కాదు. ప్రవేశాలను ప్రొత్సహించి, స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇవ్వాలి. ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంచే ప్రయత్నం జరగాలి. కామన్ పీజీసెట్ను రద్దు చేసి, వర్సిటీ స్వతహాగా పీజీసెట్ నిర్వహిస్తే అడ్మిషన్లు పెరుగుతాయి. – భగవత్ రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి -
ప్రత్యేక నైపుణ్యమే లక్ష్యం
తిరుపతి అర్బన్: ప్రత్యేక నైపుణ్యం సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగులకు కోర్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యంతో సుపరిపాలన పెంపొందించే దిశగా కోర్సులు ఉంటాయని చెప్పారు. ఐ గాట్ కర్మయోగి పోర్టల్ యాప్ ద్వారా రాష్ట ప్రభుత్వం మూడు రకాల కోర్సులను ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. జిల్లాలో డీడీఓలు అందరూ ఈ యాప్ గురించి అవగాహన చేసుకోవాలని చెప్పారు. ఈ కోర్సులను మార్చి 20వ తేదీ లోపు పూర్తి చేయాలని సూచించారు. లాగిన్ కు సంబంధించిన సమస్యలు తలెత్తితే 9652171785, 9063494729 నంబనర్లలో సంప్రదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ట్రైనింగ్ అధికారి వెంకటేష్ , సీపీఓ ప్రేమ్చంద్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 92 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 92 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్్ రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఇటీవల ఏఆర్పీసీ(3786) అనిల్కుమార్ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ మేరకు ఎస్పీ చేతుల మీదుగా మృతుడి తల్లి సుశీలమ్మకు రూ.50 వేలను అందజేశారు. మహిళలకు భరోసా శక్తి మహిళలకు మేమున్నామని భరోసా కల్పించే విధంగా ఉండడమే శక్తి టీం ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షకు 125 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్మెటిక్స్(బైపీసీ) సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్ 41 మంది, ఒకేషనల్లో 1,070 మంది, జనరల్ బ్రిడ్జి కోర్సులో 47 మంది, మొత్తం 1,158మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 125 మంది గైర్హాజరైనట్టు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్మెటిక్స్(బైపీసీ) సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,721 మంది స్వామివారిని దర్శించుకోగా 27,261 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.46 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
పింఛన్ కోసం తిరుగుతున్నా
వృద్ధాప్య పింఛన్ కోసం కొన్ని వారాలుగా తిరుగుతూనే ఉన్నా. నాకు న్యాయం చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజం లేదు. కలెక్టరేట్లోనైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడి వచ్చా. – యు.రమణయ్య అచ్చారి, పెద్దపాలేడు, బుచ్చినాయుడుకండ్రిగ మండలం శ్మశాన వాటికకు దారిలేదు మా కాలనీకి చెందిన శ్మశానికి వెళ్లడానికి దారి లేదు. నానా ఇక్కట్లు పడుతున్నాం. గ్రామ స్థాయి నుంచి మండల, డివిజన్ స్థాయి వరకు అధికారులుకు మొరపెట్టుకున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టరేట్లో అర్జీ ఇచ్చాం. –మునికృష్ణయ్య, పెనుమల్లం, ఏర్పేడు మండలం నా భర్తకు పక్షవాతం వచ్చింది నా భర్తకు పక్షవాతం వచ్చింది. మంచానికే పరిమితమయ్యాడు. పింఛన్ కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నాం. కనీసం ఆయన మందులకు కూడా డబ్బుల్లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – భర్త కోటయ్యతో రమణమ్మ, జాండ్రపేట, వాకాడు మండలం నా భూములు ఆక్రమించారు నా భూమిని ఆక్రమించారు. స్థానిక రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదు. విచారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – కోదండరామయ్య, పీఎస్ పాళెం, చిన్నగొట్టిగల్లు మండలం -
ప్రజాసమస్యల పరిష్కారవేదికకు ఇబ్బడిముబ్బడిగా అర్జీలు
● కూమిట ప్రభుత్వంలో ఇంతవరకు అందని కొత్త పింఛన్లు ● అర్జీల స్వీకరణకే పరిమితమవుతున్న అధికారులు ● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న అభాగ్యులు ● కలెక్టరేట్కొచ్చినా కనికరం లేదంటూ నిట్టూర్పులు భర్త చనిపోయాడు! ● వాకాడు మండలానికి చెందిన బత్తెల కమలమ్మ భర్త తొమ్మిది నెలల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్ కోసం అర్జీ పట్టుకుని తిరగని కార్యాలయం లేదు. కలవని అధికారి లేడు. తీరా సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. భర్త చనిపోయి ఆర్థికంగా చితికిపోయినట్టు వెల్లడించారు. ‘ఓకే మేము పరిశీలిస్తాం.. సంబంధిత అధికారికి పంపుతాం..’ అంటూ అధికారులు సమాధానం ఇచ్చి పంపారు. ఎక్కడికెళ్లినా పరిష్కారమార్గం చూపడం లేదని ఆమె ఆవేదనతో వెనుదిరిగారు. ● శ్రీకాళహస్తికి చెందిన పి.నరసింహారెడ్డి స్వర్ణముఖి పరిసర ప్రాంతాల్లోని శ్మశానాన్ని కొందరు ఇసుకాసురులు తవ్వేస్తున్నారని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. గతంలో పలుమార్లు శ్రీకాళహస్తి ఆర్డీఓ, ఎమ్మార్వో కార్యాలయాల్లో తెలియజేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. స్వర్ణముఖి నదీతీర ప్రాంతంలో మకాం వేసి శ్మశానాన్ని సైతం వదలడం లేదని పేర్కొన్నారు. శ్మశానాన్ని పరిరక్షించాలని వినతి పత్రం సమర్పించారు. ‘సరే..అధికారులకు పంపుతాం’ అంటూ ఫిర్యాదుదారునికి రిసిప్ట్ ఇచ్చి పంపారు. శ్మశానానికి దారేది?షరామామూలే సోమవారం జరిగిన గ్రీవెన్స్ కూడా తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక అంధులు, వికలాంగులు, పండుటాకులు, చంటిబిడ్డ తల్లులు విలవిల్లాడడం కనిపించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 36,606 అర్జీలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో 74 శాతం సమస్యలు పరిష్కారమైనట్టు లెక్కలు చెప్పారు. వాస్తవంగా ఇందులో 30 శాతానికి మించి సమస్యలు పరిష్కారం కాలేదని అర్జీదారులు చర్చించుకోవడం కనిపించింది. పరిష్కారమేదీ? వచ్చిన వినతులపై సంతకం చేయడం .. రిసిప్ట్ అందించడం మాత్రమే చేస్తున్నారు. సోమవారం వచ్చిన సుమారు 250 అర్జీలలో 165 వినతులు రెవెన్యూకు సంబంధించినవి ఉన్నట్టు తేల్చారు. వాటికి పరిష్కారం చూపలేదు. మీ మొబైల్కు ఫోన్ వస్తుందని మాత్రమే సమాధానం చెప్పి పంపించేశారు. -
వేదాల పరిరక్షణకు కృషి
తిరుపతి సిటీ: గ్రామ స్థాయి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలలో వేదాల పరిరక్షణకు కృషి చేయాలని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి పిలుపునిచ్చారు. ఎస్వీ వేదిక్ వర్సిటీ, మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిష్ఠాన్ సంయుక్త ఆధ్వర్యంలో వేదిక్ వర్సిటీలో మూడు రోజుల వేద సమ్మేళనం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.వర్సిటీలో వేదపండితులు, అతిథులు, విద్యార్థులు పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. వేదాల రక్షణే లోకరక్షణగా భావించాలన్నారు. వేదాలతో జ్యోతిష్యం, పురాణాలు, ఇతిహాసాలు, నీతి శాస్త్రం, యోగ శాస్త్రం అనుసంధానం చేసి వాటి సారాన్ని సమాజానికి అందించాలన్నారు. విశిష్ట అతిథులు, ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, వేదిక్ వర్సిటీ వీసీ రాణిసదాశివమూర్తి, సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టానం సచివులు ఆచార్య విరూపాక్ష జడ్డీపాల్ ప్రసంగించారు. వేదాలు మానవ జీవన విధానాన్ని తెలియజేస్తాయని, వేద పరిరక్షణతోనే దేశ పరిరక్షణ సాధ్యమన్నారు. ధార్మిక చైతన్యం పెరగాలని, వేదం అభ్యసించిన వారు సైనికుల్లా దేశ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భాస్కరుడు, గణేష్భట్, పీఆర్ఓ టి.బ్రహ్మాచారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వేద పండితులు పాల్గొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి పిలుపు -
ప్రశాంతంగా పది పరీక్షలు
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా 162 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదోతరగతి పరీక్షలు కావడంతో విద్యార్థులు పలు దేవాలయాల వద్ద కిటకిటలాడారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు జిల్లాలోని 26,670మంది విద్యార్థులు హాజరవ్వాలి ఉండగా వారిలో 269 మంది గైర్హాజరయ్యారు. సప్లిమెంటరీ విద్యార్థులు 133 మందికి గాను 30మంది గైర్హాజరయ్యారు. వివిధ కారణాలతో పరీక్ష రాయలేని విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులకు స్క్రైబ్కు అనుమతి ఇచ్చారు. పటిష్ట బందోబస్తు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. బయటి వ్యక్తులు లోనికి వెళ్లకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. పరీక్ష నిర్వహణాధికారుల సెల్ఫోన్లను కేంద్రాల్లోకి నిషేధించారు. ఆకస్మిక తనిఖీలు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ రెండు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈఓ కేవీఎన్.కుమార్ మూడు పరీక్షా కేంద్రాలను, జిల్లా స్థాయి పరిశీలకులు 10 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మరో 10 మంది పది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే సమస్యాత్మక 30పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ విధులు నిర్వహించారు. ఎటువంటి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. -
అష్టబంధన మహా సంప్రోక్షణ
తిరుపతి కల్చరల్:అలిపిరి పాదాల మండపంలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం శాస్త్రోక్తంగా అష్ట బంధన మహా సంప్రోక్షణ నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం వద్దనున్న స్వామి వారి ఆలయం, శ్రీలక్ష్మీ నారాయణస్వామి వారి ఆల యానికి అనుబంధంగా ఉన్న శ్రీగోదా అమ్మవారి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కుంభ ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, రుత్వికులు పాల్గొన్నారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వండి తిరుపతి అర్బన్: వినియోగదారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్తోపాటు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిసోర్స్ పర్సన్ జనార్థన్తో కలిసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బ్రోచర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధర్వంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రిసోర్స్ పర్సన్ డా.యాసుఫ్, చెంచయ్య పాల్గొన్నారు.‘క్షయ’పై అవగాహన తప్పనిసరి తిరుపతి అర్బన్: క్షయవ్యాధి నిర్ధారణతోపాటు నివారణపై అవగాహన ఉండాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఈ నెల 24న ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్లో సోమవారం నిర్మూలనకు చెందిన ఓ బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్ధారణ, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందన్నారు. జిల్లాలో 24 పంచాయతీలను టీబీ ముక్త్ పంచాయతీలుగా గుర్తించినట్టు వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్, వైద్యులు శ్రీనివాసులురెడ్డి, సుబ్బారావ్, రవిరాజు, రాజా పాల్గొన్నారు. -
రైల్లో నుంచి పడి యువకుడి మృతి
చిల్లకూరు: చిల్లకూరు మండలం, తీపనూరు సమీపంలో 33 ఏళ్లు ఉన్న గుర్తుతెలియని యువకుడు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చైన్నె వైపు వెళ్లే రైలులో నుంచి తీపనూరు సమీపంలో ఓ యువకుడు కింద పడిపోయాడు. ప్రయాణికులు గుర్తించి 100కు సమాచారం అందించారు. దీంతో వారు చిల్లకూరు పోలీసులను అప్రమత్తం చేశారు. తర్వాత 108 వాహనంలో యువకుడ్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. చిల్లకూరు పోలీసులు గూడూరు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు విచారణ చేస్తున్నారు. మృతునిది గుంటూరు ప్రాంతం అని రైల్వే పోలీసులు గుర్తించినా పూర్తి వివరాలు తెలియలేదు. -
వెదురు పెంపకంపై అవగాహన
తిరుపతి అర్బన్: వెదురు పంట సాగుకు రాయితీలున్నాయని జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి తెలిపారు. తిరుపతిలోని అటవీశాఖ బయోట్రిమ్ కార్యాలయంలో రైతులకు వెదురు సాగుపై అవగాహన కల్పించారు. తిరుపతితోపాటు చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన రైతులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా ఒక హెక్టార్లు సాగుకు రూ.50 వేల రాయితీ ఉందని చెప్పారు. అలాగే నర్సరీ సాగుచేస్తే హెక్టార్కు రూ.20 లక్షలు గరిష్టంగా అందిస్తారని వివరించారు. ఉదయగి అగ్రికల్చర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి వెదురుపై రైతులకు అంశాల వారీగా వివరించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఒరవడి – తిరుపతి ఐఐటీ ఇన్నోవేషన్ హబ్ను సందర్శించిన డీఎస్టీ సెక్రటరీ ఏర్పేడు(రేణిగుంట): ఆపరేషన్ ద్రోణగిరితో భౌగోళిక స్థాన సంబంధిత విధానం అమలుతో దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలలో నూతన ఒరవడి చోటుచేసుకోనుందని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అభయ్ కరండేకర్ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్లో జరుగుతున్న డెమోడే షోకస్ ఈవెంట్లో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎం– ఐసీపీఎస్ మిషన్ డైరెక్టర్ ఏక్తా కపూర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ ధనలక్ష్మి, జీడీపీడీసీ చైర్మన్ శ్రీకాంత్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల పురోభివృద్ధికి అలవంభించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రోషన్ శ్రీవాస్తవ్ కొత్త ప్రాజెక్టుల గురించి వివరించారు. జియోస్పేషియల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావటానికి 25 అగ్ర స్టార్టప్లను గుర్తించినట్లు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి పెళ్లకూరు: మండలంలోని ముమ్మారెడ్డిగుంట గ్రామానికి చెందిన చింతపూడి హరీష్(18) సోమవారం అక్కగారిపేట గ్రామ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ నాగరాజు కథనం మేరకు.. చిన్నతనంలోనే హరీష్ తల్లిదండ్రులను కోల్పోయాడు. ముమ్మారెడ్డిగుంట గ్రామంలోని మేనమామ ఆనంద్ వద్ద ఉంటున్నాడు. అయితే గత కొంత కాలంగా మద్యానికి బానిసై అక్కగారిపేట గ్రామ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ చేరుకుని 108 సహాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. హరీష్ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అర్జీలు..నిరసనల హోరు
తిరుపతి అర్బన్: సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు కలెక్టరేట్కు పోటెత్తారు. సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి మొత్తం 250 అర్జీలు వచ్చినట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అందులో 165 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆరోగ్య మిత్రల నిరసన కలెక్టరేట్ వద్ద ఆరోగ్య మిత్రలు నిరసన వ్యక్తం చేశారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్నా క్యాడర్ అమలు చేయలేదన్నారు. ఎంటీఎస్ లేక.. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తింపు లేక ఇక్కట్లు పడుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు సీసీ కెమెరాల కింద కుర్చూని పనిచేయడం మహిళలకు ఇబ్బందిగా ఉందని ఆవేదన చెందారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. పెన్షనర్ల సమస్యలను పట్టించుకోండి ‘మూడు దశాబద్దాలకు పైగానే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశాం.. కానీ రావాల్సిన బెనిఫిట్స్ను తీసుకోకుండానే పలువురు మృతి చెందుతున్నారు’ అంటూ పలువురు పెన్షనర్లు వాపోయారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీకి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులకు డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, ఐసీ, జీఎన్ఎస్, నల్సా విభాగాలకు చెందిన విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆ మేరకు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. -
పోలీసుల్లో ‘ఫైర్’ ఉండాలి
చంద్రగిరి: వార్షిక ఫైరింగ్ శిక్షణలో ప్రతి ఒక్కరూ ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకాంక్షించారు. కల్యాణీ డ్యామ్లో నిర్వహిస్తున్న ఫైరింగ్ శిక్షణను సోమవారం ఆయన పరిశీలించారు. అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి ఆయన సిబ్బందిలో ఉత్సాహం నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకమని, ఫైరింగ్ రేంజ్లో అధికారుల పర్యవేక్షణలో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ఆ తర్వాత ఏఆర్ పోలీసు అధికారులు, సిబ్బందితో ఫైరింగ్ శిక్షణపై మాట్లాడారు. ప్రతి బుల్లెట్ టార్గెట్ (లక్ష్యం) వైపే బుల్ పడేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని జిల్లా పోలీసు శాఖ ఉన్నతి కోసం ముందడుగు వేయాలన్నారు. తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అని, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉండడంతో వీవీఐపీలు, వీఐపీలు సరైన భద్రత, మరో వైపు ప్రజా రక్షణను దృష్టిలో ఉంచుకుని ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. సివిల్ పోలీసులు 1500మంది, ఆర్మ్డ్ సిబ్బంది 640మంది, సీఐలు 36, డీఎస్పీలు 11, ఎస్ఐలు 67మంది, అడిషనల్ ఎస్పీలు 4 ఫైరింగ్లో శిక్షణ పొందినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి హేమంత్, అదనపు ఎస్పీలు రామకృష్ణ, నాగభూషణం, శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు. ● ఫైరింగ్ శిక్షణలో ఎస్పీ దిశానిర్దేశం -
పునుగు పిల్లుల నివాస స్థావరాల అభివృద్ధి
తిరుమల : తిరుమల శ్రీవారి అభిషేకంలో ఉపయోగించే పునుగు తైలం కోసం తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో పెంచుతున్న పునుగు పిల్లుల నివాస స్థావరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జూపార్కులో ఇప్పటికే నిర్మించిన నిశాచర జీవుల నివాస స్థావరం (నాక్టనల్ హౌస్)లో పునుగు పిల్లుల సంరక్షణకు ప్రత్యేకంగా నిర్మించిన గదులు ఇంటీరియర్ అభివృద్ధి కోసం జూ అధికారుల ప్రతిపాదనలను అనుమతిస్తూ 2024 డిసెంబర్ 24 తేదీన బోర్డు సమావేశంలో టీటీడీ అంగీకారం తెలిపింది. రూ.1,97,31,200లతో రూపొందించిన సదరు ప్రతిపాదనలను టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. టీటీడీ ప్రతిపాదనలకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉరి వేసుకొని యువకుడి మృతి సత్యవేడు: శ్రీసిటీ పరిధిలోని చిగురుపాళెం చెరువు కట్టపై రాజస్థాన్కు చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని తనువుచాలించాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. రాజస్థాన్కు చెందిన సిబ్ ముంజి(45) శ్రీసిటీలోని హెమల్టన్ కంపెనీలో కార్మికుడిగా ఉంటూ చిగురుపాళెం గ్రామ పరిసరాల్లో నివసిస్తున్నాడు. తనకున్న అనారోగ్య సమస్య, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మద్యం తాగి గ్రామ సమీపంలోని చెరువుపై ఉన్న వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకొని మృతిచెందినట్టు ఎస్ఐ హరిప్రసాద్, సీఐ శ్రీనివాసులు తెలిపారు. సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. రాయలవారి కోట సందర్శన చంద్రగిరి: చంద్రగిరి కోటను న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన బృందం సోమవారం సందర్శించింది. స్టడీ టూర్లో భాగంగా చంద్రగిరి కోటను సందర్శించారు. ఏపీ మానవ వనరుల శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు నేతృత్వంలో నేషనల్ డిఫెన్స్ మేజర్ జనరల్ సీపీ సంఘ్రా, సివిల్ సర్వీసెస్ అధికారి బాలాజీ ఆధ్వర్యంలో ఇండియన్ నేవి, ఇండియన్ ఎయిర్ఫోర్స్, సివిల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ అధికారులు భారతదేశానికి చెందిన 12 మంది, రష్యా, శ్రీలంక, ఇండోనేషియా, సౌతాఫ్రికా, నేపాల్ దేశాలకు చెందిన ఐదుగురు కోటను సందర్శించారు. ఏపీ టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి, కోట ఆర్కియాలజీ కన్జర్వేటర్ బాలకృష్ణారెడ్డి, చంద్రగిరి తహసీల్దార్ శివరామసుబ్బయ్య, ఎంపీడీఓ వెంకటరత్నం, బృందం కో–ఆర్డినేటర్ కార్తీక్ పాల్గొన్నారు. -
తిరుపతికి నీటి సరఫరా, మురుగునీటి ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి నగరానికి నీటి సరఫరా, మురుగునీరు సెప్టేజ్, తుపాను నీటి పారుదల, పార్క్ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకాన్ సాహు తెలిపారు. సోమవారం ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. సెల్ఫోన్ రిపేర్, సర్వీసింగ్లపై ఉచిత శిక్షణ చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 25 నుంచి 30 రోజుల పాటు పురుషులకు సెల్ఫోన్ రిపేరు, సర్వీసింగ్లపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న పురుషులు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి అని, శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని, రానూ పోనూ ఒక్కసారి చార్జీలు ఇస్తామన్నారు. అలాగే శిక్షణానంతరం ధ్రువ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు జెరాక్స్లు, 4 పాస్పోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని, తొలుత పేర్లు నమోదు చేసుకున్న ప్రాధాన్యత ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 94949 51289, 63017 17672 సంప్రదించాలని సూచించారు. మధ్యవర్తిత్వంపై శిక్షణ తిరుపతి లీగల్: రాష్ట్ర, జిల్లా న్యాయసేవా సంస్థల ఆదేశాల మేరకు తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 44 మంది న్యాయవాదులకు సోమవారం నుంచి మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. స్థానిక రాస్ భవనంలో జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమానికి తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం.గురునాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణ తరగతులు ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది అనుజ సక్సేన, మధ్యప్రదేశ్కు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త నీనాకరే మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి ఎమ్ఎస్ భారతి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..
తిరుపతి, సాక్షి: తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ (TTD) అంగీకరించింది. ఇందులో భాగంగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన మేరకు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించే విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది. వీఐపీ బ్రేక్,రూ.300 దర్శనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సోమవారం,మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనం, బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు మాత్రమే అనుమతి కల్పిస్తుండగా.. సిఫార్సు లేఖపై టీటీడీ ఆరుగురికి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. -
శ్రీవారిమెట్టులో కొనసాగుతున్న టోకెన్ల దందా!
చంద్రగిరి: శ్రీవారిమెట్టు మార్గంలో టోకెన్ల దందా కొనసాగుతోంది. విజిలెన్స్ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా టీటీడీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఎంతో దూరం నుంచి ఆదివారం శ్రీవారి దర్శనం కోసం వచి్చన సామాన్య భక్తులు టోకెన్లు లభించక తీవ్ర అగచాట్లు పడ్డారు. ఆటో డ్రైవర్లతో కలిసి పలువురు సిబ్బంది అడ్డదారిలో టోకెన్లు విక్రయిస్తున్నారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) యంత్రాంగం కొన్ని నెలలుగా రోజుకు కేవలం 3 వేల టోకెన్లే జారీ చేస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వారాంతాల్లోనూ అదే రీతిలో టోకెన్లు ఇస్తోంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 10 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిమెట్టు వద్దకు పోటెత్తారు. ఉదయం 6 గంటలకే భక్తులు భారీగా తరలిరావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీవారిమెట్టు మార్గంలోని పంపు హౌస్ వద్ద బారికేడ్లతో భక్తుల వాహనాలను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. కానీ ఆటోలను మాత్రం ముందుకు అనుమతించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ శ్రీవారి మెట్టుకు చేరుకున్నారు. తిరుపతి నుంచే వసూలు మొదలు.. తిరుపతిలో తమ వాహనాలు ఎక్కితే.. శ్రీవారి దర్శన టోకెన్లు ఇస్తామంటూ ఆటో డ్రైవర్లు జనాన్ని తీసుకువస్తున్నారని భక్తులు ఆరోపించారు. గ్రూపులుగా వచ్చే వారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. సుమారు ఏడుగురు ఉండే గ్రూప్ నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. బెంగళూరుకు చెందిన కృష్ణమూర్తి అనే భక్తుడు మాట్లాడుతూ.. “బెంగళూరు నుంచి కుటుంబసభ్యులతో శ్రీవారిమెట్టు సమీపానికి శనివారం అర్ధరాత్రికే వచ్చా. అప్పటి నుంచి సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని అనుమతించలేదు. కానీ ఆటోలను మాత్రం పంపించారు. దీనిపై ప్రశ్నిస్తే జవాబు చెప్పట్లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఇలా ఇబ్బందులు పెట్టడం దారుణం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తగినన్ని టోకెన్లు జారీ చేయాలని టీటీడీని కోరారు. టోకెన్లను బ్లాక్లో విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
● వ్యవసాయానికి సక్రమంగా అందని విద్యుత్ ● 9 గంటల సరఫరా హామీ బుట్టదాఖలు ● అంతరాయాల నడుమ 7 గంటలకే పరిమితం ● ఆఖరు తడికి అగచాట్లు పడుతున్న రైతులు ● ఎండుముఖం పడుతున్న పంటలు
సక్రమంగా ఇవ్వడం లేదు వ్యవసాయానికి విద్యుత్ను ఏడు గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. అనేకసార్లు లైన్లు ట్రిప్ అవుతూ కరెంటు పోతోంది. మళ్లీ సిబ్బంది వచ్చి రిపేర్లు చేసే వరకు ఎదురు చూడాలి. నేను రెండెకరాల్లో వేసిన వేరుశనగ పంటకు సాగునీరు చాలడం లేదు. గతంలోనూ చంద్రబాబు కక్ష గట్టి మరీ రైతులపైనే కేసులు పెట్టించారు. కోతలు లేకుండా ఏడు గంటలైనా నిరంతరాయంగా వ్యవసాయ విద్యుత్ అందించాలి. – మంగారెడ్డి, కె.వెంకటాపురం, శ్రీకాళహస్తి మండలం రేణిగుంట: జిల్లాలోని రైతులు ఎక్కువగా వ్యవసాయ బోర్లపైనే ఆధారపడి పంటల సాగు చేస్తున్నారు. ఇప్పటికే ముందస్తుగా నాటిన చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఆఖరి తడి అందించాల్సిన పరిస్థితి. ఈ సమయంలో విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు ప్రతి బోరు వద్ద ట్రాన్స్ఫార్మర్లు పెట్టడంతో తరచూ లైన్లు ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే ట్రాన్స్కో సిబ్బంది చేయి తడపాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు సతమతమవుతున్నారు. దగా చేస్తోంది కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది. రైతులకు 9గంటలు నాణ్యమైన విద్యుత్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. అయితే ఇప్పుడు ఏడు గంటలకు తగ్గించేశారు. దీంతో ఆఖరి తడులకు సాగునీరు అందక పంటలు ఎండబెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా నాణ్యమైన విద్యుత్ అందించాలి. – శంకర్రెడ్డి, రైతు సంఘం నేత, రేణిగుంట -
పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనది
తిరుపతి అర్బన్: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువలేనదిగా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అమరజీవి జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆదివారం బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జ్యోత్స్న నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి అని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడని కొనియాడారు. ఆయన 1901 మార్చి 16న జన్మించి 1952 డిసెంబరు 15న అమరులయ్యారన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవియై మహాపురుషుడిగా నిలిచారన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిందని వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి దేవేంద్ర రెడ్డితోపాటు పలువురు హాజరయ్యారు. -
అవినీతి అంతస్తులు
తిరుపతి తుడా: తిరుమల బైపాస్ రోడ్డులోని ఎస్బీఐ ఎటీఎం ఎదురుగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కూటమి నేతల అండతో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆరు అంతస్తుల భారీ భవనం నిర్మిస్తున్నా అటువైపు ఎవ్వరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి సుమారు రూ.2 కోట్ల మేర గండి పడుతోంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఆరు అంతస్తులతో టౌన్ప్లానింగ్ అనుమతి లేకుండా భవనం కడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యా రు. కొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారులు కాసుల కక్కుర్తితో అక్రమ నిర్మాణానాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 20న ఎన్ఎస్యూ స్నాతకోత్సవం తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని ఈనెల 20వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మహతి ఆడిటోరియంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ సంస్కృత వర్సిటీగా విద్యాపీఠం రూపాంతరం చెందిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు స్నాతకోత్సవాలు నిర్వహించారు. అదే స్ఫూర్తితో నాలుగో స్నాతకోత్సవాన్ని వైభవోపేతంగా జరింపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం తిరుపతి ఎడ్యుకేషన్:తిరుపతిలోని ఎస్వీ జూనియ ర్ కళాశాలలో సోమవారం నుంచి ఇంటర్ మూ ల్యాంకనం చేపట్టనున్నట్లు ఆర్ఐఓ జీవీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 17నుంచి ఇంగ్లిష్, మ్యాథ్స్, తెలుగు, సివిక్స్, తమిళ మీడియం, ఒకేషనల్ జవాబుపత్రాల వాల్యుయేషన్ ఉంటుందన్నారు. 22 నుంచి ఫిజిక్స్, బోటనీ, హిస్టరీ, తమిళ మీడియం, ఒకేషనల్ సబ్జెక్టులు, 24నుంచి కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, 26వ తేదీ నుంచి జువాలజీ మూల్యాంకనం జరుగుతుందని వివరించారు. 42వ రోజుకు చేరిన జూడాల సమ్మె తిరుపతి సిటీ:గౌరవవేతనం పెంచాలంటూ ఎస్వీ వెటర్నరీ వర్సిటీ జూడాలు చేస్తున్న సమ్మె ఆదివారానికి 42వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకోకపోవడం దారుణమన్నారు. గౌరవేతనం పెంచేవరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు.● ఈమె పేరు మునెమ్మ. ఏర్పేడు మండలం బండారుపల్లె. 18 గుంటల పొలంలో వేరుశనగ, మరో 16 గుంటల్లో వరి సాగు చేపట్టారు. వేరుశనగ ఒబ్బిడి దశకు చేరుకుంది. మరో 10 రోజుల్లో పంట చేతికందే పరిస్థితుల్లో విద్యుత్ కోతల కారణంగా మొక్కలు ఎండుముఖం పట్టాయి. కేవలం 7 గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేస్తుండడంతో ఆఖరి తడికి నీరు అందడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక మునెమ్మ కొట్టుమిట్టాడుతోంది. ఈ దుస్థితి ఒక్క మునెమ్మకు మాత్రమే కాదు. జిల్లాలోని వేలాదిమంది అన్నదాత లకు దాపురించింది. 9 గంటల విద్యుత్ సంగతి దేముడెరుగు.. వచ్చే 7 గంటలు కూడా సక్రమంగా సరఫరా కాకపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. కళ్లెదుటే పంట ఎండిపోతుంటే కన్నీరు పెడుతున్నారు. -
పచ్చమూక ఆక్రమణలో అటవీ భూములు
● వెంకటగిరి పరిధిలో కబ్జాల పర్వం ● 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో వందల ఎకరాలు అన్యాక్రాంతం ● గత వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో 100 ఎకరాల స్వాధీనం ● మిగిలిన భూములను దర్జాగా సాగు చేసుకుంటున్న టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : వెంకటగిరి రూరల్ మండలంలోని విలువైన అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. అక్కడక్కడా మిగిలిన భూములను సైతం గత కొంత కాలంగా దర్జాగా కబ్జా చేస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు అడ్డుకునేందుకు సాహసించలేకపోతున్నారు. చేసేది లేక కొందరు అధికారులు సైతం టీడీపీ నాయకులతో కుమ్ముకై ్కపోతున్నారు. ఆక్రమిత భూముల్లో కొన్నింటిని ఆన్లైన్లో రెవెన్యూ భూములుగా మార్చుకుంటున్నారు. అధికారమే అండగా.. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. భారీగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. అలా ఆక్రమించుకున్న వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకటగిరి రూరల్ మండలం మన్నేగుంట, పూలరంగడుపల్లి, బసవాయిగుంట పరిధిలో సుమారు 1200 ఎకరాల అటవీ, మరో 65 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయి. 2014–19 మధ్య కాలంలో ఈ భూములను టీడీపీ నేతలు కొందరు ఒక్కొక్కరు 20 నుంచి 100 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. అందులో అటవీ యాక్ట్ని తుంగలో తొక్కి ఉన్న చెట్లను జేసీబీలతో తొలగించి చదునుచేసి పంటల సాగు ప్రారంభించారు. అటవీ భూముల్లో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరు. అయినా కొందరు విద్యుత్ కనెక్షన్లు తీసుకుని బోర్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. మరి కొందరు బోర్లు వేసుకుని సోలార్ విద్యుత్ ద్వారా పంటలు పండించుకుంటున్నారు. ఈ ఆక్రమణలను అప్పట్లోనే సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నంబర్ 74లోని 175 ఎకరాల్లో సుమారు వంద ఎకరాల వరకు అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భూముల్లో జోలికి వెళ్లలేదు. అప్పట్లో టీడీపీ నేతలు అడ్డుకున్నారని నాటి అటవీ అధికారులు చెప్పుకొచ్చారు. మరోసారి రెచ్చిపోతున్న కబ్జాదారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమార్కులు రంగంలోకి దిగారు. మిగిలి ఉన్న అటవీ భూములను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లతో చదునుచేసి సాగు చేసుకునేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణలకు కొందరు అటవీ, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నోటీసులు ఇస్తున్నాం వెంకటగిరి రేంజ్ పరిధిలో భారీగా అటవీ భూములు ఉన్న మాట వాస్తవమే. వాటిని కొందరు ఆక్రమించుకున్నదీ నిజమే. కబ్జాకు గురైన భూముల్లో సుమారు వంద ఎకరాల వరకు స్వాధీనం చేసుకుని ప్లాంటేషన్ చేశాం. మిగిలిన భూమిని స్వాదీనం చేసుకోవాల్సి ఉంది. ఆక్రమణ దారులకు నోటీసులు ఇస్తున్నాం. అటవీ భూముల ఆక్రమణ చట్టరీత్యానేరం. ఎప్పటికై నా స్వాధీనం చేసుకుంటాం. – లోకేష్, ఫారెస్ట్ రేంజర్, వెంకటగిరి -
జీజేఎల్ఏ జిల్లా అధ్యక్షుడిగా రవి
తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం(జీజేఎల్ఏ) తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా వి.రవి (చంద్రగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల) ఎన్నికయ్యారు. తిరుపతిలో ఆదివారం జీజేఎల్ఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా పి.రాజనాల, కార్యదర్శిగా సి.వంశీకృష్ణ (చంద్రగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల), సంయుక్త కార్యదర్శిగా టీఆర్.చక్రాధర్ (పుత్తూరు ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల), కోశాధికారిగా బి.అనిల్కుమార్ (సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల), లేడీ సెక్రటరీగా డాక్టర్ పి.అమ్ముదేవి (పుత్తూరు ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల), రాష్ట్ర కౌన్సిలర్లుగా డాక్టర్ కె.రవీంద్రబాబు (వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల), వీఎన్ రవి (వరదయ్యపాళెం ప్రభుత్వ జూనియర్ కళాశాల) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు జీసీజీటీఏ జిల్లా కార్యదర్శి ఎస్.శ్రీకాంత్రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. -
గుంతలెప్పుడు పూడ్చుతారో?
పెళ్లకూరు: కొణతనేరి–కోనేటిరాజుపాళెం ఆర్అండ్బీ రహదారి మార్గం, ముమ్మాడ్డిగుంట గ్రామ సమీపాన రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడాయి. ఆదివారం ఓ కారు గుంతలో పడి ఇరుక్కుపోయింది. గత కొన్ని రోజులుగా ఈ గుంతల వల్ల స్కూల్ బస్సులు, ఆర్టీసీ సర్వీసులు కూడా నడవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఆర్అండ్బీ అధికారులు స్పందించాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చంద్రగిరి: మండలంలోని తొండవాడ వద్ద ఈ నెల 9న బైక్ ఢీకొని గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ గాంధీపురానికి చెందిన నారాయణ(45) 9న బైక్లో చంద్రగిరి నుంచి తిరుపతి వెళుతున్నాడు. తొండవాడ వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నారాయణను స్థానికులు 108లో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రెండు కార్ల ఢీ చంద్రగిరి : పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై కాశిపెంట్ల వద్ద ఆదివారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. తిరుపతికి చెందిన భువానదిత్య, వరప్రసాద్, సాయికుమార్ వ్యక్తిగత పనులపై కారులో చిత్తూరు వైపునకు బయలుదేరారు. ఈ క్రమంలో కడప నుంచి కుప్పానికి వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొంది. దీంతో కడప నుంచి వస్తున్న కారులోని శ్రీనివాసన్, మంజునాథ, గీత, భాగ్యలక్ష్మి, సువార్త, అరవింద్ కుమార్తో పాటు తిరుపతికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. క్షగాత్రులను చంద్రగిరి ఏరియా ఆస్పత్రి, తిరుపతి రుయాకు తరలించారు. -
తూతూమంత్రంగా ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో అధికారులు పెద్దసంఖ్యలో జనం నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అయితే వాటి పరిష్కారంలో మాత్రం శీతకన్ను వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వారాలు మినహా ఇప్పటి వరకు మొత్తం 34 వారాలు గ్రీవెన్స్ నిర్వహించారు. అందులో దాదాపు 8వేలకు పైగా అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ సమస్యలపైనే 6వేల వరకు వినతులు ఉన్నాయి. మిగిలిన 2వేల అర్జీల్లో ఇప్పటి వరకు 50శాతం కూడా పరిష్కరించకపోవడం గమనార్హం. సచివాయాల్లో సిబ్బంది సర్వేల్లో తలమునకలు కావడం, మండ కార్యాలయాల అధికారులు గ్రీవెన్స్ను పట్టించుకోకపోవడంతో చిన్నాచితక సమస్యలపై కూడా ప్రజలు కలెక్టరేట్కు రావాల్సి వస్తోంది. వీధిలైట్లు, దారి, తాగునీటి సమస్యలకు కూడా కలెక్టరేట్లో అర్జీ పెట్టుకోవాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఒక్కోసారి.. ఒక్కోలా.. కలెక్టరేట్ గ్రీవెన్స్లో అధికారులు ఒక్కోవారం ఒక్కో విధంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒక వారం క్యూ విధానం పాటిస్తారు. మరోసారి అర్జీదారులను గుంపులు గుంపులుగా వదిలేస్తున్నారు. ఈ క్రమంలోనే వినతులు రాసేందుకు సైతం ఏర్పాట్లు చేయడంలేదు. ప్రజలు కుర్చునేందుకు సైతం అవకాశం కల్పించడం లేదు. ఈ క్రమంలోనే మరుగుదొడ్ల పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారు. దీంతో కలెక్టరేట్లోని పలు విభాగాల వద్ద దుర్వాసనే ప్రజలకు స్వాగతం పలుకుతోంది. వినతులు సరే.. పరిష్కారమేదీ? పట్టించుకోని అధికారులుఅందరూ రారు..! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. కలెక్టరేట్లోని మొత్తం 80 విభాగాలకు చెందిన జిల్లా అధికారులు హజరయ్యేలా చర్యలు చేపట్టేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 50 విభాగాల అధికారులు హాజరైతే గొప్పగా మారిపోయింది. మిగిలిన విభాగాల వారు తమ సిబ్బందిని పంపించి చేతులుదులిపేసుకుంటున్నారు. గ్రీవెన్స్లో కలెక్టరే ఉంటే ఓ విధంగా, జేసీ ఉంటే ఇంకోలా.. డీఆర్ఓ హాజరైతే మరోలా అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం. -
వృక్ష సంపదపై అధ్యయనం
తిరుపతి సిటీ : ఎస్వీయూ వృక్షశాస్త్ర విభాగం విద్యార్థులు మూడు రోజుల పశ్చిమ కనుమల వృక్ష సంపద, జీవ వైవిధ్యం అధ్యయన యాత్రకు శ్రీకారం చుట్టారు. అధ్యాపకులు నాగలక్ష్మి, దేవమ్మ, కామాక్షమ్మ, వేణు, అంకన్న పర్యవేక్షణలో, విద్యార్థులు రూపేష్, శివాని నేతృత్వంలో యాత్ర చేపట్టారు. ప్రధానంగా కేరళలోని హొగెనెకల్ జలపాతం, టీ ఫ్యాక్టరీ, థ్రెడ్ గార్డెన్, రోజ్ గార్డెన్, నేషనల్ బొటానికల్ గార్డెన్, ఊటీ కొండలు, అతిరేపల్లి వాటర్ఫాల్స్ వంటి ప్రదేశాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లోని వృక్షసంపదను అధ్యయనం చేశారు. అధ్యాపకులు మాట్లాడుతూ వైవిధ్యమైన మొక్క భాగాలను విద్యార్థులు సేకరించారని, వాటిని హెర్బెరియం షీట్ల ద్వారా నిల్వ చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం యాత్ర ముగించుకుని వర్సిటీకి చేరుకోనున్నట్లు తెలిపారు. తిరుచ్చిపై సూర్యనారాయణుడు తిరుపతి రూరల్ : తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీసూర్యనారాయణస్వామివారు ఆదివారం బంగారు తిరుచ్చిపై విహరించారు. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. సాయంత్రం సూర్య నారాయణ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చిపై కొలువు దీర్చారు. అనంతరం తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జి సూపరింటెండెంట్ ప్రసాద్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు పాల్గొన్నారు. -
రేపటి నుంచి అన్నమయ్య సంకీర్తనోత్సవాలు
తిరుపతి కల్చరల్: శ్రీత్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు త్యాగరాజ మండపంలో అన్నమయ్య సంకీర్తనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ సుందరం, కంచి రఘురాం తెలిపారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 80 ఏళ్లుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలను చేపడుతూ ప్రతిభావంతులైన ప్రముఖ విద్యాంసులచే త్యాగరాజ సంగీతోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్యకు క్రోధి నామ సంవత్సరం స్వామివారు సాక్షాక్తరించి ఆశీస్సులు అందించారన్నారు. ఆ పవిత్రమైన ఏడాదిని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు అంటే ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 9.30 గంటల వరకు ప్రముఖ విద్యాంసులచే అన్నమయ్య సంకీర్తన కచేరీలు ఉంటాయని తెలిపారు. -
మహిళపై కర్రలతో దాడి
● కేసు నమోదు చేయని పోలీసులు ● ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన చిన్నగొట్టిగల్లు (ఎర్రావారిపాళెం): పాత కక్షలతో ఓ మహిళను నడిరోడ్డుపై పట్టపగలు ఈడ్చుకుని వెళ్లి కర్రలతో కొట్టినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన జీవిత అనే మహిళ తలకోనకు వెళ్లే మార్గంలో హోటల్ నడుపుకుంటోంది. అదే గ్రామానికి చెందిన ఈశ్వరయ్య, అతడి కుమారుడు హరికి ఆమెతో భూవివాదముంది. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన జీవిత తన హోటల్ వద్ద ఉండగా ఈశ్వరయ్య, హరి అటువైపుగా వచ్చి తమ గొర్రెలను వదిలేశారు. హోటల్ వద్ద ఉన్న ఓ వ్యక్తి వాటిని తరిమేందుకు యత్నించగా ఆగ్రహించారు. జీవితపై దాడికి దిగారు. బాధితురాలు వెంటనే పోలీస్స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. ముందు ఆస్పత్రికి వెళ్లాలని పంపేశారు. ఆదివారం ఉదయం పోలీసుల వద్దకు వెళ్లినా స్పందించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి నేతల ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదుకు వెనుకాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నారు. దీనిపై ఎస్ఐ ఎర్రిస్వామిని వివరణ కోరగా దాడిచేసిన వారు బాధితురాలికి సమీప బంధువులని, ఈ మేరకు తాము మాట్లాడతామని గ్రామపెద్దలు కోరడంతో కేసు నమోదుకు సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందులో వేరే ఉద్దేశం లేదని తెలిపారు. కారు బోల్తా : వృద్ధురాలి మృతి చిల్లకూరు : చైన్నె– కోల్కత్తా జాతీయ రహదారిపై రైటార్సత్రం వద్ద ఆదివారం వేకువజామున ఓ కారు బోల్తా పడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన జాలా పెంచలమ్మ(76) శ్రీకాళహస్తిలో ఉన్న తన కుమార్తె సునీత దగ్గరకు రెండు రోజుల క్రితం వెళ్లింది. కారులో కుమార్తె సునీత, మనుమరాళ్లు లహరి, పెన్నిధితో తిరుగు ప్రయాణం కాగా మార్గం మధ్యలో అదుపు తప్పి కల్వర్టు ఢీకొని బోల్తా పడింది. దీంతో పెంచలమ్మ అక్కడిక్కడే మరణించింది. మిగిలినవారు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
‘కాశీనాయన’ కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరు?: భూమన
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్లతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...సనాతనధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్?సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో, ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోంది. సనాతన ధర్మంపై దాడి చేస్తే, వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయింది. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా? గతంలో తిరుపతిలో ఆరుగురు చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు.ఈ రోజు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చేవేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీశాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రంను నిర్మించి ఇస్తానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నారా లోకేష్, పవన్ కల్యాణ్ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా?సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే. రెడ్బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు? మీకు తెలియకుండానే ఆలయాలు నేలమట్టం అవుతాయా? ఆశ్రమాలు కూలతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం కింద విషం చిమ్ముతున్నది మీది కాదా? పార్టీ మీటింగ్లకు ప్రభుత్వ సొమ్ముతో గాలిలో ఎగిరి ప్రయాణాలు చేసే పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్కు కాశీనాయన క్షేత్రంకు దారి కనిపించడం లేదా?మా ఇంట్లోనే సనాతన ధర్మం పుట్టింది అంటూ గతంలో పవన్ చెప్పారు. ఆయనే మా తండ్రి పూజ గదిలో వెలిగే దీపారాదనతో సిగరెట్ వెలిగించుకునేవారు అని కూడా అన్నారు. ఇవ్వన్నీ కూడా సనాతన ధర్మం కిందకు వస్తాయా అని కూడా పవనానంద స్వామీ చెప్పాలి. శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారా?కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై దేవాదాయశాఖ మంత్రి స్పందిస్తూ ఈ క్షేత్రం టైగర్జోన్ పరిధిలో ఉన్నందునే కూల్చివేశారు అంటూ ప్రకటన చేశారు. టైగర్జోన్ పరిధిలోనే ఉన్న శ్రీశైలంను కూడా కూల్చివేస్తామనే ఉద్దేశం ఆ శాఖ మంత్రి మాటల్లో అర్థమవుతోంది. టైగర్జోన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేయాలన్నదే ఈ కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు దిక్కులేకుండా పోయింది.ఆలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు లేవు. రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న కాశీనాయన క్షేత్రంకు ఉన్న ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా దీనిని అటవీ చట్టాల పరిధి నుంచి మినహాయించాలని ఆనాడే సీఎం హోదాలో వైఎస్ జగన్ కేంద్ర అటవీశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు సనాతన సారధి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు కేంద్ర అటవీశాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండానే ఈ క్షేత్రంలోని నిర్మాణాలను కూల్చివేశారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండానే ఈ కూల్చివేతలు జరిగాయా? వీటిని కూల్చివేస్తున్నారని తెలిసి కూడా ఎందుకు పవన్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయడం, మోయడంలో తనమునకలు అయ్యి ఉండటం వల్లే ఇటువంటి ఘోరమైన సంఘటనను పట్టించుకోలేదా? బొట్లు పెట్టడం, మెట్లు కడగడం మినహా ఆలయాలను పరిరక్షించాలనే విషయాన్ని విస్మరించారు. బీజేపీ కూడా ఎందుకు స్పందించడం లేదు. కాశీనాయన క్షేత్రంను కులం కోణంలో చూస్తున్నారా అనే అనుమానాలు, అది అసలు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అనే భావనను కలిగిస్తున్నారా అనుమానం భక్తుల్లో కలుగుతోంది.కూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలంకూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వానికి వైయస్ఆర్సీపీపై అభాండాలు మోపి పబ్బం గడుపుకోవడమే తెలుసు. తిరుయల లడ్డూలో కల్తీనెయ్యి అంటూ ఒక పచ్చి అబద్దాన్ని తెరమీదికి తీసుకువచ్చి ఆనాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుర్మార్గమైన నిందలు మోపారు. ఆవుకొవ్వు, పందికొవ్వు కలిపారంటే సాక్షాత్తూ సీఎం ఒక ప్రకటన చేయడం, వారి రాజకీయం కోసం ఎంత దూరమైన సరే దిగజారిపోతారనడానికి నిదర్శనం.జనం దీనిని నిజమని నమ్మేలా శతవిధాల ప్రయత్నించారు. దీనిపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అత్యున్నత పదవిలో ఉన్నవారు బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇదంతా ఒక కుట్ర అంటూ వైఎస్సార్సీపీ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుతో వెనక్కి తగ్గింది.అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగా తొక్కిసాలకు గురై ఆరుగురు మృతి చెందడం, 45 మందికి పైగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో చిన్నచిన్న పొరపాట్లను కూడా అత్యంత దారుణంగా చిత్రీకరించారు. అదే కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఏదో పొరపాటున జరిగిన చిన్న అంశంగా సమర్థించుకుంటున్నారు. తాజాగా ఒక తాగుబోతు నేరుగా శ్రీవారి ఆలయ ప్రాంగణం బయట మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడవ చేశాడు. శ్రీవారి కొండపై మద్యం ఎంతైనా దొరుకుతుందంటూ వీరంగం సృష్టించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎర్రచందనం కొండపై పట్టుబడింది. దానిపై ఎటువంటి చర్యలు లేవు. ఎన్టీఆర్ను మానసికంగా చంపి పుట్టిన పార్టీ టీడీపీమంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాలపైన పుట్టిన పార్టీ అంటూ మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీఆర్ను మానసికంగా చంపి, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని లాక్కుని అనే విషయం లోకేష్ గుర్తించాలి. తెలుగుదేశం అధికారపీఠం కింద విగతజీవులైన పింగళి దశరథ్రామ్, వంగవీటి మోహనరంగా వంటి వారు ఉన్నారని లోకేష్ తెలుసుకోవాలి.గిల్లి జోల పాడటం, చంపి మాలవేయడం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కడం టీడీపీ లక్షణం. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకే కాషాయదళం నోరువిప్పడం మానేసింది. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్రక్షేత్రం కాషాయదళానికి కనిపించడం లేదు. అమరావతిలో శ్రీవారి కళ్యాణం జరిపామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు స్వామివారి కళ్యాణాలను గ్రామాల్లోకి తీసుకువచ్చాం. 2004 డిసెంబర్ నుంచే నేను టీటీడీ బోర్డ్ సభ్యుడగా ఉన్నప్పుడే మొట్టమొదటి సూళ్ళూరిపేట దళితవాడలో స్వామివారి కళ్యాణంను అద్భుతంగా నిర్వహించాం. తరువాత కొన్ని పదుల సంఖ్యలో శ్రీవారి కళ్యాణాలు చేయించాం’’ అని భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. -
కేంద్ర నిధులు గడువులోపు ఖర్చు చేయండి
తిరుపతి అర్బన్: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను గడువులోపు ఖర్చు చేయాలని మినిస్ట్రీ అఫ్ ట్రైబల్ అఫైర్స్ కార్యదర్శి విభునాయర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్తోపాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ జాతీ య ఉన్నత్ గ్రామ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన మూడు ఎస్టీకాలనీల్లో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని మేలచ్చూరు ఎస్టీకాలనీ, డక్కిలి మండలంలోని కందులవారిపల్లి, వడమాలపేట మండలంలోని కదిరికుప్పంలో సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాంటివి మ రిన్ని ఎస్టీకాలనీలున్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా విభునాయర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన 500 మంది ఎస్టీలున్న కాలనీలను ఎంపిక చేయాలని చెప్పారు. లేదంటే 50 శాతానికి మించి ఎస్టీలున్న గ్రామాలు ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ పథకంలోకి వస్తాయన్నారు. అలాంటి గ్రామాలు జిల్లాలో మరో 25 ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. ఆ 25 గిరిజన గ్రామాల వివరాలను పంపాలని విభునాయర్ చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ సదా భార్గవి, ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి మల్లికార్జున నాయక్, అడిషనల్ డైరెక్టర్లు సరస్వతి, మల్లికార్జున్రెడ్డి, జాయింట్ డైరెక్టర్ ప్రతిభాభారతి, డీడీ చంద్రిక, నెల్లూరు జిల్లా ఈడీ శ్రీనివాసరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తా
తిరుపతి అర్బన్: జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి అధికారి, పాఠశాల, ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ(ఐఏఎస్)కోన శశిధర్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి అధికారిగా కోన శశిధర్, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలసి అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఉపాధి కల్పనలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ చురుగ్గా పనిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు స్థానిక అవసరాలకు, రాష్ట్ర అవసరాలకు వీలుగా ఉండే పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు రామమోహన్, భానుప్రకాష్రెడ్డి, కిరణ్మయి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, డీపీఓ సుశీలాదేవి, డీఈఓ కేవీఎస్ కుమార్, ఎకై ్సజ్ జిల్లా అధికారి నాగమల్లేశ్వర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డీఏఓ ప్రసాద్రావు, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, మత్స్యశాఖ జిల్లా అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి జిల్లా ఇన్చార్జి అధికారి కోన శశిధర్ తిరుపతి తుడా: స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జి అధికారి కోన శశిధర్ పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్లు, మహిళ వర్సిటీ విద్యార్థినులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ టూరిజం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్వీయూ ఎన్టీఆర్ స్టేడియం నుంచి టౌన్క్లబ్ సర్కిల్ వరకు విద్యార్థులు, అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజంగా మార్చేందుకు విద్యార్థులు ప్లాస్టిక్ రహిత ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ‘రెడ్యూస్ – రీ యూస్ – రీ సైకిల్’ అనే ట్రిపుల్ ఆర్ విధానాన్ని సమాజం అవలంబించాలని కోరారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతికి ప్రథమ స్థానం వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. మహిళా వర్సిటీ వీసీ ఉమా మాట్లాడుతూ ప్లాస్టిక్ సమాజంలో విధ్వంసం సృష్టిస్తుందని, ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నిషేధించేందుకు ప్రతిన పూనాలన్నారు. ఎస్వీయూ వీసీ అప్పారావు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధాన రుగ్మత అయిన క్యాన్సర్ కారకంగా ప్లాస్టిక్ వాడకమేనని, సమాజం వీలైనంతవరకు ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం న్యూబాలాజీ కాలనీలో త్రిపుల్ ఆర్ సెంటర్ను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, మున్సిపల్, జిల్లా రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ పాకనాటి హరికృష్ణ, డాక్టర్ మునిలక్ష్మి, మునీంద్ర పాల్గొన్నారు. -
టర్మ్ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!
● ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదంటే.. మాకేటి సంబంధం ● ఫీజు బకాయిలు చెల్లించి తీరాల్సిందే ● ఎస్వీయూలో విద్యార్థులకు అధికారుల హుకుం ● రంగంలోకి విద్యార్థి సంఘాలు.. అధికారుల తీరుపై ఆగ్రహం ●మంత్రి మాట.. ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదని కళాశాలలు విద్యార్థులను ఇబ్బంది పెట్టినా, ఫీజు కట్టాలని ఒత్తిడి చేసినా ఆ కళాశాలల భరతం పడతాం.. ఇదీ సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరిక. ఎస్వీయూ తీరు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న టర్మ్ ఫీజు లు చెల్లిస్తేకాని పరీక్ష ఫీజు కట్టించుకోం. ఫీజురీయింబర్స్మెంట్ రాలేదంటే..మా కే టి సంబంధం. ఇదీ ఎస్వీయూ అధికారులు మంత్రి మాటలకు ఇచ్చిన విలువ. ఇబ్బంది పెడితే ఊరుకోం విద్యార్థులను ఇబ్బంది పెడితే ఊరుకోం. ఈ విషయమై ఇప్పటికే పలుసార్లు అధికారులను సంప్రదిం చాం. అధికారులు మొండివైఖరి మార్చుకుని పరీక్ష ఫీజును క ట్టించుకోవాలి. టర్మ్ ఫీజుకు ముడిపెడితే వి ద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు. వ ర్సిటీ అధికారులు వైఖరి మార్చుకోకపోతే విద్యార్థి సంఘాలతో కలసి ఉద్యమిస్తాం. –చిన్న, ఏఐఎస్ఏ, జిల్లా కార్యదర్శి, తిరుపతి జీవితాలతో ఆటలు దారుణం టర్మ్ ఫీజు పేరుతో పరీక్ష ఫీజు కట్టించు కోకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవ డం దారుణం. ఎస్వీ యూ అధికారులకిది తగదు. పేద విద్యార్థులే 90 శాతం మంది వర్సిటీలో చదువుతున్నారు. వారు రూ.వేలు కట్టే పరిస్థితి లేదు. విద్యార్థులను టార్ఛర్ చేయడం దారుణం. –రంజిత్ కుమార్, బీపీఈడీ విద్యార్థి, ఎస్వీయూ ఫీజు కట్టలేని పరిస్థితి పేద విద్యార్థులు ఒక్కసారిగా అంత ఫీజు కట్టే పరిస్థితిలేదు. అధి కారులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలే తప్ప, మాలాంటి పేద విద్యా ర్థులను ఇబ్బంది పెట్టడం సమంజంకాదు. స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు స్తంభించిపోయాయి. దీంతో ఒక్క రూపాయి సైతం చెల్లించలేనిస్థితి. –వేణు, బీఈడీ విద్యార్థి, ఎస్వీయూ తిరుపతి సిటీ: కళాశాల విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు గత ఏడాది నుంచి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దీంతో ఎస్వీయూలో ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో పీజీ, బీపీఈడీ, బీఈడీ చదువుతున్న పేద విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. పెండింగ్లో ఉన్న ఫీజులు చెల్లించాలని కళాశాల అధికారులు ఒత్తిడి చే యడంతో పలుమార్లు అధికారులను బతిమ లాడినా కనికరించలేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తాం టర్మ్ ఫీజులు చెల్లించకుంటే సెమిస్టర్ పరీక్ష ఫీజును కట్టించుకోమని అధికారులు మొండి వైఖరి ప్రదర్శించడం దారుణమని ఏఐఎస్ఏ, పీడీఎస్యూ నాయకులు చిన్న, లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ స్కాలర్ షిప్లు ఇవ్వకపోతే టర్మ్ ఫీజులు ఎలా కడతామని ఆవేదన వ్యక్తం చేశారు. టర్మ్ ఫీజులతో సంబంధం లేకుండా వెంటనే పరీక్ష ఫీజులు కట్టించుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలసి పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆగ్రహానికి గురికాక తప్పదు పేద కుటుంబాల నుంచి వచ్చాం. రూ.వేల ల్లో టర్మ్ ఫీజులు చెల్లించాలంటే మాటలా..అ ప్పులు చేసే అవకాశం లేదు. అధికారు లు వెంటనే పరీక్ష ఫీజు కట్టించుకోవాలి.లేదంటే వి ద్యార్థుల ఆగ్రహానికి గురికాకతప్పదు. –వంశీ, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి, ఎస్వీయూ మొండి వైఖరి మార్చుకోవాలి పెండింగ్లో ఉన్న ఫీ జురీయింబర్స్ మెంట్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ వాటితో సంబంధం లేకుండా టర్మ్ ఫీజు చెల్లించాల్సిందే నంటూ అధికారులు చెబుతున్నారు. పేద విద్యార్థులమైన మేము ఇప్పటికిప్పుడు రూ.వేలు ఎలా చెల్లించాలి. అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలి. –ఈష, బీపీఈడీ విద్యార్థిని, ఎస్వీయూ ఆంక్షలు విధిస్తే ఏం చేయాలి వర్సిటీలో చదువుతోంది మా లాంటి పేదలే. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబ ర్స్, స్కాలర్షిప్లు రా లేదు.. వ స్తే కడతాం. టర్మ్ ఫీజు చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టాలంటూ ఆంక్షలు విధిస్తే ఏం చేయాలి. –భవిత, బీపీఈడీ విద్యార్థి, ఎస్వీయూ అందని ఫీజు రీయింబర్స్మెంట్.. టర్మ్ ఫీజులు తప్పనిసరిగా చెల్లించాలని విద్యార్థులపై కళాశాలల అధికారులు ఒత్తిడి..వెరసి.. పేద విద్యార్థికి ఉన్నత విద్య భారమైంది. తీరా పరీక్ష ఫీజు చెల్లించాల్సిన సమయానికి ఎస్వీయూ అధికారులేమో పైసా వసూలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పలు కోర్సుల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్ష ఫీజు కట్టించుకోం! ఎస్వీయూలో త్వరలో ప్రారంభం కానున్న పీజీ రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు దగ్గరపడుతోంది. దీంతో పీజీలోని అన్ని కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టేందు అధికారులను సంప్రదించగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న టర్మ్ ఫీజులు చెల్లిస్తేకాని పరీక్ష ఫీజు కట్టించుకోమంటూ హుకుం జారీ చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్షిపులు అందలేదని బతిమలాడినా వాటితో తమకు సంబంధం లేదని తెగేసి చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
తడ: జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రామాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ కొడపనాయుడు కథనం మేరకు.. తమిళనాడు, గుమ్మిడిపూండి తాలూకా, ఆరంబాకం గ్రామానికి చెందిన కే రవి (57) లారీ క్లీనర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతను తన సొంత పని పని నిమిత్తం తడ మండలం, రామాపురం గ్రామం వద్ద ఉన్న సిమెంటు షాపు వద్దకు శుక్రవారం రాత్రి వెళ్లాడు. చైన్నె వైపు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న రవిని అదే మార్గంలో వెళుతున్న ఐషర్ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో రవి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు రవిని తమిళనాడులోని ఎళ్లావూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుని కుమారుడు శనివారం ఈ మేరకు తడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొడపనాయుడు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించారు. -
భవనం పైనుంచి పడి కార్మికుడి దుర్మరణం
తిరుపతి క్రైమ్: భవనం పైనుంచి పడి ఒక కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి ఎస్ఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు.. గుంటూరుకు చెందిన అబ్రహం కుమారుడు దావీదు(56) శుక్రవారం సాయంత్రం ఆటోనగర్లో ఓ భవనం వద్ద పెయింట్ పనులు చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కాలుజారి కింద పడ్డాడు. అయితే దీనిని గమనించిన కార్మికులు వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దావీదు మృతి చెందాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వారి బంధువులకు సమాచారం అందించారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
తిరుపతి అర్బన్: స్థానిక బస్టాండ్లోని దుకాణదారులు ప్రయాణికులకు వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ప్రజారవాణా అధికారి నరసింహులు తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా ఆయన శనివారం తిరుపతి బస్టాండ్లోని పలు దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటళ్లలో నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్లాస్టిక్ను వినియోగించకూడదని స్పష్టం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిషేధిత వస్తువులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, ఏటీఎం రామచంద్రనాయుడు పాల్గొన్నారు. -
వంటతో పెద్ద తంట
● పని ఒత్తిడితో వంటగదికి మహిళలు దూరం ● ఆన్లైన్ ఆర్డర్లు వైపు మొగ్గు ● సెలవురోజుల్లో హోటళ్లకు వెళ్లడం ఫ్యాషన్గా భావిస్తున్న కుటుంబాలు ● తిరుపతిలో పెరిగిన జొమోటో, స్విగ్గి కల్చర్ ● వంటగదిపై ఆసక్తి చూపని 40 శాతం మంది మహిళలు ● సమయపాలన, ఒత్తిడే కారణం ● రుచికర ఆహారానికి ఆకర్షితులవుతున్న పిల్లలు ఆన్లైన్ ఆహారం వివరాలివీ.. మహిళా ఉద్యోగులు 12,875 నూతన జంటలు 2,140 భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన కుటుంబాల సంఖ్య 7,396 బ్యాచులర్లు 10,250 విశ్రాంత ఉద్యోగులు 3,256 ఒంటరి మహిళలు, పురుషులు 895 వ్యాపారవేత్తలు 1,276 సందర్భం ఆధారంగా ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నవారు 2,564భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం..వ్యాపార నిమిత్తం ఉదయం నుంచి ఉరుకుల పరుగులమయం.. రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే వైనం.. దీనికితోడు పిల్లల అభ్యున్నతికి ఆరాటం.. నిత్యం బతుకు పోరాటం.. ఇదీ నేటి నగర జీవనం.. ఈ స్థితిలో వంట తయారీకి దొరకని సమయం.. కొత్తజంటలకు వంట చేయడం తెలియనితనం.. వెరసి..హోటళ్లలో భోజనమే ఆధారం..అక్కడి వరకూ వెళ్లడానికి ఓపిక లేనితనం.. ఆన్లైన్ భోజనం ఆరగించడానికే మొగ్గు చూపుతున్న జనం. ఫలితం రోజురోజుకూ పెరుగుతున్న ఇంటి వద్దకే భోజనం సంప్రదాయం. ఇంటి వంటతోనే ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఇంటి వంటలతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అయితే కాలానుగుణంగా ఇళ్లలో ఒత్తిడి పెరగడం, తీరికలేని జీవనంతో వంటగదికి వెళ్లేందుకు కొంతమంది ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. ఉన్న సమయంలో ఇంట్లోనే వంట వండుకుని తినేందుకు ఆసక్తి చూపాలి. బయటి రుచులకు అలవాటు పడితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. రుచికరమైన ఆహారంతో అనారోగ్యం తప్పదు. పిల్లలకు ఇంట్లో ఆహారంపై ఆసక్తి పెంచేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. –డాక్టర్ మంజువాణి, పోషకాహార నిపుణురాలు, తిరుపతి కొత్తగా పెళ్లి అయ్యింది.. వంట సరిగ్గా రాదు మాకు కొత్తగా పెళ్లి అయ్యింది. ఏడాది కావస్తోంది. వంట చేయడం రాదు. ఎంటెక్ వరకు చదివాను. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా ను. నా భర్త నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకుడు. ఇద్దరికీ వంట చేయడం తెలియకపోవడంతో ప్రతిరోజు ఆన్లైన్ ఆర్డర్లతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. సెలవు రోజుల్లో మాత్రం వంట ప్రయోగాలు చేస్తుంటాం. తప్పని పరిస్థితి. –సరళ, ప్రైవేటు ఉద్యోగిని, తిరుపతి ఇద్దరం ఉద్యోగులం తప్పని పరిస్థితి మాది కర్నూలు. నా కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. నా భర్త ఓ ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేస్తా రు. ఇద్దరం ఉద్యోగులం కావడంతో ఉదయమే విధులకు హాజరు కావాలి. దీంతో ఆదివారం సెలవు దినాలలో తప్ప ఇంట్లో వంట వండుకునేందుకు అవకాశం దొరకదు. దీంతో మాకు ఆన్లైన్ ఆర్డర్లే గతి. ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. –పార్వతి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, తిరుపతి ఆన్లైన్ ఆర్డర్ల వైపు మొగ్గు కుటుంబ వ్యవహారాలతోపాటు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ పురుషులతోపాటు మహిళలు సైతం అలసిపోతున్నారు. ఒత్తిడి కారణంగా ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేక చాలా మంది మహిళలు వంట తయారీపై ఆసక్తి చూపడం లేదు. అన్నం, కూరలు లేదా టిఫిన్ కర్రీలను వండుకునేందుకు గంటకుపైగా సమయం పడుతుంది. ఆ సమయంలో పిల్లలతో గ డపడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంట్లో ఇతర పనులను చక్కబెట్టుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై కు టుంబ సమేతంగా మొగ్గు చూపుతున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు జొమోటా, స్విగ్గి సేవలను అందుబాటులో ఉంచడంతో ఆన్లైన్ రేటింగ్ ఆధారంగా హోటల్ను ఎంపిక చేసుకుని నచ్చిన ఆహారం తెప్పించుకుంటున్నారు. అలానే మరి కొన్ని హోటళ్ల లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి తెచ్చించే వెసులుబాటును యజమానులు కల్పించారు. ఆర్డర్ పెట్టుకున్న అర్థగంటలోపే ఇంటికే నచ్చిన ఆహారం తెప్పించుకుని ఆరగిస్తున్నారు. 40 శాతం కుటుంబాలు ఆన్లైన్ ఆహారంతో గడిపేస్తున్నారు. తిరుపతి తుడా: నగర జీవనం బిజీబిజీగా గడుస్తోంది. మెరుగైన జీవనం కోసం భార్యాభర్తలిద్దరూ కష్ట పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులుగానో.. వ్యాపారం వైపో పరుగులు పెడితేగాని కుటుంబాలు ముందుకు సాగడంలేదు. ఈ క్రమంలో పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, బిజీలైఫ్తో మహిళలు వంటగది వైపునకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పిల్లలు, కుటుంబం, ఉద్యోగం ఇతర పనుల్లోనూ మహిళలు భాగస్వాములు కావడంతో వంట అదనపు భారం అవుతోంది. ఈ క్రమంలోని ఎక్కువ కుటుంబాలు ఆన్లైన్ ఫుడ్పై ఆధారపడుతున్నాయి. ఇక సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు కుటుంబ సమేతంగా హోటల్లోకి వెళ్లి పూట గడిపేస్తున్నాయి. మరికొందరు అన్నం వండుకుని కర్రీ లు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఆన్లైన్ డెలివరీ ఇచ్చే జొమోటో, స్విగ్గి వంటి సంస్థలు విస్తరించాయి. ఇంట్లో కూర్చొని కావాల్సిన ఆహారం నచ్చిన హోటల్ నుంచి తెప్పించుకోవడం చాలా మందికి ఫ్యాషన్గా మారింది. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ క్రమేణా పెరుగుతోంది. నగరంలో ఆన్లైన్ ఆహారంపై ఆధారపడిన వారి వివరాలను ఓ సర్వే సంస్థ అంచనా వేసింది. విలాస జీవనానికి కొత్త జంటల ఆరాటం కొత్త జంటలు విలాసవంత జీవనానికి అలవాటు పడ్డాయి. దీనికితోడు పలువురు యువతులు పుట్టింట్లో వంటల ఓనమాలు నేర్చుకోకుండా అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఈ క్రమంలో అత్తారింట సైతం అలానే కొనసాగాలనే ఉద్దేశంతో పైళెన కొత్తలోనే వేరు కాపురాలు పెడుతున్నారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆన్లైన్ ఆర్డర్లు, హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు కొత్తగా కాపురం పెట్టి వంట చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చానళ్లు చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వండిన వంట రుచికరంగా లేకవపోవడంతో అబ్బాయిలు ఆమాడదూరం వెళ్లిపోతున్నారు. దీంతో వంట తంట నుంచి తప్పించుకునేందుకు ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నారు. హోటల్కు వెళ్లడం ఫ్యాషన్ సెలవు రోజులు, ఇతర ప్రత్యేక దినాలు, కుటుంబంలో ఎవరికైనా పుట్టిన రోజు వంటివి ఉన్నప్పు డు కుటుంబ సమేతంగా, మరికొందరు బంధుమిత్రులతో కలిసి హోటళ్లకు వెళ్లి తినడం ఫ్యాషన్గా భావిస్తున్నారు. సాయంత్రం పూట అలా బైక్లో నో కారులోనో వెళ్లి హోటల్లో కొంతసేపు సరదాగా గడిపి, ఎవరికి నచ్చిన ఆహారం వారు తినేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బ్యాచిల ర్లు రూమ్ల్లో అన్నం వండుకుని కర్రీలు తెచ్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డబ్బు పొదుపులో భాగంగా బ్యాచిలర్లు కర్రీ పాయింట్లపైన ఆధారపడుతున్నారు. అలానే రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడే ఆహారప్రియులు రో జూ హోటల్ నుంచి తప్పించుకుని లాగియిస్తున్నారు. పిల్లలు, యువత ముఖ్యంగా రుచికరమైన ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. తిరుపతి నగరంలో 11 గంటలకు అన్ని హోటళ్లు బంద్ చే స్తున్నారు. అయితే ఆన్లైన్ ఫుడ్ మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు దొరుకుతుంది. -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి
తిరుపతి తుడా:జిల్లాలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు నివేధించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మట్లాడుతూ తడి,పొడి చెత్త వేరు చేయడం, డ్రైనేజ్లో చెత్త వేయడంతో దోమల ఉత్పత్తికి ఆవాసాలుగా మారుతా యని తెలిపారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛదివస్పై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శాంతకుమారి, అదన పు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, డిప్యూటి డీఎంహెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ శ్రీనివాసరావ్, మలేరియా నివారణాధికారి డాక్ట ర్ రూప్కుమార్, వరలక్ష్మి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ తమ వంతుగా ప్రతి రోజూ కొంత సమయాన్ని కేటాయించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈఎస్ఐ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు పేర్కొన్నారు. ఆస్పత్రిలో శనివారం ఆయన డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఈఎస్ఐ లబ్ధిదారులతో కలసి ‘స్వచ్ఛాంధ్ర –స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. -
తిరుమలలో అపచారం..
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో అపచారం జరిగింది. ఓ యువకుడు మద్యం తాగి మాడ వీధుల్లో హల్చల్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ మహిళతో గొడవకు దిగాడు. దీంతో, ఘటన చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి తిరుమలలో హల్చల్ చేశాడు. నేను లోకల్ అంటూ.. తిరుమల మాడ వీధుల్లో తిరుగుతూ ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో తాను మద్యం తాగుతాను.. కావాలంటే అక్కడ మద్యం కూడా అమ్ముతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక, విజిలెన్స్ అధికారుల ముందే ఇదంతా జరగడం గమనార్హం. అనంతరం, అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,987 మంది స్వామివారిని దర్శించుకోగా 26,880 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు. టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: అలిపిరి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో 32వ బ్యాచ్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్, అలిపిరి డిపో మేనేజర్ సింగంహరిబాబు తెలిపారు. అలిపిరి డ్రైవింగ్ స్కూల్లో హెవీ లైసెన్స్ కోసం శిక్షణ పూర్తి చేసుకున్న 31వ బ్యాచ్కి సర్టిఫికేట్స్ అందించి వీడ్కోలు పలికారు. వారికి శిక్షణ పూర్తి చేసిన సర్టిఫికేట్స్ను అందించారు. అలాగే 32వ బ్యాచ్కి శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్తోపాటు మెకానిజంలోనూ పట్టుసాధించేలా శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 496 మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. 32వ బ్యాచ్ను శుక్రవారం ప్రారంభించామని చెప్పారు. ఈ నెల 20 నుంచి 33 బ్యాచ్కి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. -
గ్యాసు..మోసమే బాసు
గ్యాస్ సిలీండర్లపై ముద్రితమైన బరువు తప్ప వాస్తవంగా ఎంత ఉందో చాలా మందికి అంచనా ఉండదు. వినియోగదారుని ఎదుట బరువు తూచాకే గ్యాస్ సిలిండర్ను అందించాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ప్లాంట్ స్థాయి నుంచే మోసాలు జరుగుతున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ నింపడానికి ముందు మీటర్ రీడింగ్ జీరో.. ఉందో లేదో గమనించాలి. బంకు సిబ్బంది మాటల్లో దింపి దృష్టి మరల్చి రీడింగ్ జంప్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అనుమానం వస్తే పెట్రోల్ బంకులోని ముద్రతో ఉన్న ఐదు లీటర్ల పరిమాణం గల కొలత పాత్ర ద్వారా సరిచూసుకోవచ్చు. ఇంధనం నాణ్యతమీద అనుమానం ఉంటే బంకు దగ్గర ఉన్న ఫిల్టర్ పేపర్ తీసుకుని పరిశీలించాలి. -
‘కూటమి’!
ఇసుకాసురుల● జిల్లాలో ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు ● రెండో దశలో గుర్తించిన ఇసుక రీచ్ల్లోనూ ఇబ్బడిముబ్బడిగా తవ్వకాలు ● పక్కాగా అమలయ్యేనాటికి అక్కడ ఇసుక ఉంటుందో లేదో? తిరుపతి అర్బన్: ఉచిత ఇసుక మాటున కూటమి ప్రభుత్వం లబ్ధిదారులతో చెడుగుడు ఆడుతోంది. గత ఏడాది జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లాలో నామమాత్రంగా ఒక నెల మాత్రమే ఇసుక పంపిణీ చేసి చేతులు పైకెత్తేసింది. గత ఏడాది సెప్టెంబర్ 8 నుంచి ఇసుక లేక రీచ్లను మూత వేసింది. రెండు నెలల క్రితం గాజులమండ్యం, అవిలాల, కాటన్మిల్ వద్ద ఇసుక యార్డ్ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. వారు అన్నమయ్య జిల్లాలో ఇసుకను కొనుగోలు చేసి జిల్లాలో విక్రయాలు చేస్తున్నారు. రెండో దఫా దోపిడీకి సిద్ధం రెండో దఫా ఇసుక పాలసీని రేపో మాపో జిల్లాలో మొదలు పెట్టనున్నారు. గూడూరు ప్రాంతంలోని గూడలి సమీపం వద్ద ఒక పాయింట్, పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద రెండు ఇసుక పాయింట్లు గుర్తించారు. ఈ మూడు పాయింట్లలో 1,37,686 టన్నుల ఇసుక ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆయా పాయింట్ల వద్ద ఇసుక ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా ఎగువ కలవకూరు– దిగువ కలవకూరు మధ్యలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి ఇష్టారాజ్యంగా టీడీపీ నేతలు ఇసుక తరలించేస్తున్నారు. గూడలి పాయింట్ వద్ద ఉన్న ఇసుకలోనూ 50 శాతం ఇప్పటికే కూటమి నేతలు తరలించినట్లు తెలుస్తోంది. అధికారికంగా అమలయ్యే నాటికి అక్కడ ఇసుక ఉంటుందోలేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ఏజెన్సీకి తవ్వకాల బాధ్యత ఓ ప్రైవేటు ఏజెన్సీకి కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడు ఇసుక పాయింట్లలో తవ్వకాల బాధ్యతను అప్పగించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడు ఇసుక పాయింట్లలో ఒక టన్ను ఇసుకకు ఎంత చెల్లించాలో స్పష్టత లేదు. గతంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఇసుక పాలసీలో టన్ను ధర వెంకటగిరి మొగళ్లగుంట వద్ద రూ.590 చెల్లించాల్సి ఉండేది. అయితే ఏజెన్సీ పాత్ర ఏంటో స్పష్టంగా తెలియడం లేదు. -
వ్యాపారికి మేలు జరిగేటట్టు
తూనికల్లో కనికట్టు.. తూనికలు, కొలతల్లో భారీ గా మోసాలు చోటు చేసు కుంటున్నాయి. తూనిక రాయి అడుగు భాగాన సీల్ వేసేందుకు 50 గ్రాముల నుంచి వంద గ్రాముల బరువు పట్టే రంధ్రం ఉంటుంది. చాలామంది తూనిక రాయి అడుగు భాగాన ఐస్కాంతం, ఇనుము అమర్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రానిక్ కా టాలో కాటా స్క్రీన్లో జీరోలు వచ్చేలా సరిచూసుకోవాలి. కంపెనీల నుంచి వచ్చే కొన్ని ప్యాకెట్ల బరువుల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. బి య్యం మిల్లులు, ఎరువుల దుకాణాలు, సిమెంట్ బస్తాల్లోనూ కనికట్టు రాజ్యమేలుతోంది. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
తడ: జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీసిటీలోని ఐఐఐటీ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కర్ణాటకకు చెందిన విద్యార్థి ప్రత్యూష్ ఎంఆర్ (21) మృతిచెందాడు. ఎస్ఐ కొండపనాయుడు కథనం.. హోలీ సంబరాల కోసం రంగులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రత్యూష్ కళాశాలకు చెందిన స్కూటీపై సూళ్లూరుపేట వెళ్లాడు. సరుకులు కొనుగోలు చేసి తిరుగు పయనంలో కొండూరు చెరువు వద్దకు వచ్చే సరికి వెనుక వచ్చిన లారీ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రత్యూష్పై లారీ టైర్లు ఎక్కడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్ను ఆదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఎర్రచందనం వేలం కంటే.. పుష్ప సినిమా ఆదాయమే ఎక్కువ
● మాజీ ఏపీసీసీఎఫ్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి మల్లికార్జునరావు తిరుపతి మంగళం : ఎరచ్రందనం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే స్మగ్లింగ్పై తీసిన పుష్ప–2 సినిమాకే ఎక్కువ ఆదాయం వచ్చిందని మాజీ ఏపీ సీసీఎఫ్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పి.మల్లికార్జునరావు తెలిపారు. తిరుపతిలోని మారస సరోవర్ హోటల్లో నేషనల్ బయో డైవర్సిటీ అథారిటీ, ఏపీ బయో డైవర్సిటీ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిపుణుల కమిటీ(ఎక్స్ వర్డ్ కమిటీ) సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎరచ్రందనం తోటలను పెంచకుండా ఆటవీశాఖ ఆదేశించాలన్నారు. రైతులు పెంచుతున్న ఎరచ్రందనం వృక్షాలు శేషాచలం అడవుల్లోని చెట్ల నాణ్యత తరహాలో ఉండడం లేదన్నారు. స్మగ్లర్లు రైతులను అడ్డు పెట్టుకుని గేమ్ అడుతున్నట్టు సమాచారం ఉందన్నారు. అటవీశాఖ రైతులకు ఇచ్చే అనుమతి పత్రాలను స్మగ్లర్లు దక్కించుకుని దుర్వినియోగం చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. బయో డైవర్సిటీ సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎరచ్రందనం ప్రాధాన్యతను గుర్తించకుండా, స్మగ్లింగ్పై పుష్పలాంటి సినిమా తీయడం సరైంది కాదన్నారు. ఎరచ్రందనం వేలం ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే పుష్ప– 2 సినిమాకు వచ్చిన రూ.1,800 కోట్లే ఎక్కువని చెప్పారు. -
గుంతలు బాబోయ్!
● అధ్వాన్నంగా గ్రామీణ రహదారులు ● సంక్రాంతి గడువు దాటినా మోక్షం లేని రోడ్లు ● పల్లెలకు వెళ్లే బాటలన్నీ గతుకుల మయం ● ప్రధానంగా పీఎన్ పేట– శ్రీకాళహస్తి మార్గంలో తప్పని అవస్థలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్రాంతి పండుగలోపు రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించింది. ఇంతలో పండుగ రానే వచ్చింది. గ్రామాలకు వచ్చిన వారు తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. అయినా రహదారులు మాత్రం బాగుపడలేదు. జిల్లాలో అక్కడక్కడ కొన్ని రహదారులకు కంకర, తారు అద్ది ఆ ఫొటోలను తమ అనుకూల పత్రికల్లో నాడు– నేడు అని ప్రచురించుకుని గొప్పలు చెప్పుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయమై అధ్వాన్నంగా మారాయి. ఆ మార్గంలో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. తరచూ ప్రమాదాల బారినపడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రేణిగుంట–పాపానాయుడుపేట రహదారిని సంక్రాంతికి ముందు హడావుడిగా వేశారు. బాగుచేసిన రహదారి దెబ్బతినకుండా.. ప్రమాదాలు జరుగకుండా రోడ్డు పటిష్టంగా ఉండేందుకు ఇరువైపులా గ్రావెల్ లేదా మట్టితో ‘సైడ్ బర్మ్’ ఏర్పాటు చేస్తారు. అయితే అటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వాహనాల రాకపోకల సమయంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న గుంతల్లో ఒరిగిపోయి ప్రమాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. నరక ప్రయాణం పాపానాయుడుపేట– శ్రీకాళహస్తి మార్గంలో పాడైన రహదారిని బాగుచేయాల్సింది పోయి.. దెబ్బతిన్న చోట్లంతా తవ్వేసి కంకరతో కప్పేశారు. శివరాత్రికి ముందు తవ్వేశారు. ఆ తరువాత తవ్వేసిన ప్రాంతాల్లో కంకరతో నింపేశారు. మరి కొన్ని చోట్ల గుంతలు ఉన్నా పూడ్చే కార్యక్రమం చేపట్టకలేదు. ఫలితంగా మర్రిమంద నుంచి ముసిలిపేడు వరకు సుమారు 10 కి.మీ నరకం కనిపిస్తోంది. వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కొందరు కంకర, గుంతల్లో పడిలేచి వెళ్లాల్సి వస్తోంది. గాజులమండ్యం సమీపంలోని ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి సూరప్పకశం, బ్రాహ్మణపట్టు వెళ్లే గ్రామీణ రహదారి పూర్తిగా ఛిద్రమైంది. ఈ ప్రాంతంలో ప్రయాణం ప్రమాదంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట మండలం జీ పాళెం వద్ద రోడ్డు దుస్థితిపాపానాయుడుపేట– శ్రీకాళహస్తి మార్గంలో అధ్వాన్నంగా ఉన్న రహదారిశివరాత్రికి ముందు పాపానాయుడుపేట– శ్రీకాళహస్తి రహదారిలో గుంతలు ఏర్పడిన పలు ప్రాంతాల్లో ఇలా తవ్వేశారు -
ఎస్వీయూలో జర్మనీ భాష అభ్యసన కేంద్రం!
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల శ్రీస్టడీ వింగ్స్ ఓవర్సీస్ సంస్థ సహకారంతో జర్మనీ భాష అభ్యసన కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప కులపతి కార్యాలయంలో స్టడీ వింగ్స్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం వర్సిటీ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు సమావేశమయ్యారు. వీసీ మాట్లాడుతూ.. జర్మనీలో విద్యా, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని కోసం వర్సిటీ నందు శ్రీస్టడీ వింగ్స్ టు ఓవర్సీస్ఙ్ సంస్థ సహకారంతో జర్మనీ అభ్యసన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సమావేశం అనంతరం సంస్థ ప్రతినిధులు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్టడీ వింగ్స్ సంస్థ ప్రతినిధులు నరేంద్ర రెడ్డి, వల్లేరు సుకన్య, అధ్యాపకులు, ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
వివాహ వేడుకకు వెళ్తూ..
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి, పెన్నేపల్లి గ్రామ సమీపాన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రదీప్(26) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ నాగరాజు కథనం.. కర్ణాటక రాష్ట్రం, ఓసూరు ప్రాంతానికి చెందిన ప్రదీప్ విజయవాడలో జరగనున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు మోటారు బైక్లో వెళుతున్నాడు. మార్గ మధ్యంలో పెన్నేపల్లి గ్రామ సమీపాన రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. ప్రదీప్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. సైబర్ నేరగాళ్ల వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.5.39 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. పేరూరు గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఉద్యోగం కంటే బెటర్ జాబ్ చూసుకుని కొత్త కంపెనీకి మారాలనే ఉద్దేశంతో ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండగా, 2024 డిసెంబర్ 29న టెలిగ్రామ్ ద్వారా ఓ సందేశం అతని ఫోన్ నెంబర్కు అందింది. పార్ట్ టైం జాబ్ పేరుతో ఉన్న ఆ మెసేజ్లో ఉన్న లింక్ ఓపెన్ చేయగా, హోటళ్లకు స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించొచ్చు అని పేర్కొన్నారు. బాధితుడు సూచించిన విధంగా పని చేయగా, మొదట రూ.700 అతని ఖాతాలో జమైంది. స్థిరమైన ఉద్యోగం కావాలంటే ముందుగా డబ్బు జమ చేయాలని చెప్పి మోసగాళ్లు చెప్పిన 12 బ్యాంక్ ఖాతాల్లో రూ.5.39 లక్షలను సదరు ఉద్యోగి జమ చేశాడు. అయినా సరే వంద పాయింట్లు పూర్తి కాలేదని, మరింత డబ్బు జమ చేయాలని నేరగాళ్లు ఒత్తిడి చేయడంతో మోసపోయినట్లు బాధితుడు గ్రహించాడు. వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
భారీ స్కాంపై విచారణ
చంద్రగిరి: ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమ నిర్మాణం చేసిన షెడ్డుకు అధికారులు విద్యుత్ సోలార్ అమర్చడంపై అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రిలో స్వర్ణ నారావారిపల్లి క్లస్టర్లో భారీ స్కాం శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తిరుపతి రూరల్ డీఈ రెడ్డెప్ప తన సిబ్బందితో కలసి ఏ.రంగంపేట సమీపంలోని నాగపట్ల వద్ద అక్రమ నిర్మాణం చేపట్టిన షెడ్డును పరిశీలించారు. షెడ్డులో ఎలాంటి నివాసం లేకపోయినా విద్యుత్ సోలార్ను అమర్చడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏ ప్రాదిపదికన షెడ్డుకు సోలార్ను అమర్చారంటూ అధికారులను నిలదీశారు. సోలార్ ఏర్పాటుకు షెడ్డు యజమానులు ఎలాంటి పత్రాలను అందజేశారంటూ ఆయన ఆరాతీశారు. -
వినియోగదారుల హక్కులు
● కొనుగోలుదారుల చేతిలో పాశుపతాస్త్రం వినియోగదారుల చట్టం ● మోసపోయి ఆశ్రయిస్తే చాలు.. ● వస్తువులు, సేవల కేసుల పరిష్కారంలో ప్రధాన పాత్ర తిరుపతి లీగల్ : వినియోగదారుల చేతిలో పాశుపతాస్త్రంగా వినియోగదారుల హక్కుల చట్టం పనిచేస్తోంది. లోప భూయిష్టమైన వస్తువులు, సేవల నుంచి రక్షణ కల్పిస్తోంది. మోసపోయిన బాధితులను అక్కున చేర్చుకుంటోంది. వారికి న్యాయం చేకూర్చి బాసటగా నిలుస్తోంది. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కమిషన్న్ పనితీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వినియోగదారులు ఎవరంటే? ఏదైనా వస్తువు, సేవలను ఉపయోగించుకునే వాళ్లు వినియోగదారులే. పది రూపాయలు వెచ్చింది ఏదైనా వస్తువు కొనుగోలుచేసినా, ఏదైనా ఒక సేవ పొందినా వాళ్లు వినియోగదారుల కిందకే వస్తారు. కొన్న వస్తువు సరిగా పనిచేయకపోయినా, పొందిన సేవలో లోపం ఉన్నా ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్న్ మెట్లెక్కవచ్చు. తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టు భవనాల సముదాయంలో జిల్లా వినియోగదారుల కమిషన్న్ ఉంది. చట్టం పుట్టుక ఇలా.. వినియోగదారుల సంరక్షణ కోసం 1962 మార్చి 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనడి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1983 నుంచి మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. భారతదేశంలో 1986 డిసెంబర్ 24న ఈ చట్టానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం 1988 నుంచి అమల్లోకి వచ్చింది. ఫిర్యాదు చేయడం ఇలా..! వివాద పరిహారం రూ.50 లక్షలకు లోబడి ఉన్నప్పుడు జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు దాఖలు చేయాలి. బాధితుడు నేరుగా కానీ, న్యాయవాది ద్వారా కానీ ఫిర్యాదు చేసుకోవచ్చు. కాల పరిమితి సంఘటన జరిగిన రెండేళ్లు లోపు ఉండాలి. ● వినియోగదారుల ప్రాణ, ఆస్తులకు హాని కలిగించే వస్తువులను మార్కెట్లో విక్రయించకుండా నిరసించే హక్కు ● కొనదల్చుకున్న వస్తువు విలువ, పరిమాణం, స్వచ్ఛత తెలుసుకునే హక్కు ● వస్తువులను దాని విలువ ముందుగా పరిశీలించుకునే హక్కు ● తనకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసే హక్కు ● ఆరోగ్యకరమైన పరిసరాలకు సంబంధించిన హక్కు ● హక్కులకు భంగం కలిగినప్పుడు పరిహారం పొందే హక్కుఫలప్రదం.. విని‘యోగం’!చెల్లించాల్సిన ఫీజు వినియోగదారుల కమిషన్లో పరిహారం విలువ ఐదు లక్షల రూపాయల లోపు అయితే ఎటువంటి ఫీజు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రూ.200, 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రూ.400, 20 లక్షల నుంచి 50 లక్షల వరకు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలి. జరిమానాతో పాటు శిక్ష వినియోగదారుల కమిషన్ తీర్పులను అమలు పరచని ప్రతివాదికి నెలకు తక్కువ కాకుండా మూడేళ్ల వరకు శిక్ష లేదా జరిమానా రూ.2 వేల నుంచి రూ.పది వేల వరకు పడుతుంది. లేదా శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.తిరుపతి జిల్లా వినియోగదారుల కమిషన్ తిరుపతి ఎంఆర్ పల్లి సర్కిల్ సమీపంలోని అద్దె భవనంలో ఉంది -
వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్నజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుడిమల్లం ఆలయాన్ని దర్శించిన సుప్రీంకోర్టు జడ్జి ఏర్పేడు(రేణిగుంట): భారత సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి శుక్రవారం ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేదపండితుల ఆశీర్వచనాలను అందించి ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణశర్మ, అర్చకులు యోగేంద్రపవన్కుమార్శర్మ, సంతోష్ పాల్గొన్నారు. అలాగే కృష్ణా నది బోర్డు మెంబర్ దివాకర్ రాయపురి గుడిమల్లం పరశురామేశ్వరుని దర్శించకున్నారు. బీఈడీ, ఎంబీఏఫలితాలు విడుదల తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీలో జనవరిలో జరిగిన ఏంబీఏ మీడియా మేనేజ్మెంట్ తొలి సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ ఫలితాలను సైతం విడుదల చేసినట్లు తెలియజేశారు. ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఎర్రచందనం వేలం, విక్రయాలపై చర్చ తిరుపతి మంగళం : తిరుపతి నగరంలోని మారస సరోవర్ హోటల్లో నేషనల్ బయో డైవర్సిటీ అథారిటీ, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిపుణుల కమిటీ (ఎక్స్ పర్ట్ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అటవీ, బయోడైవర్సిటీ అథారిటీ, ఏపీ బయోడైవర్శిటీ బోర్డు, జీవవైవిధ్య కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎర్ర చందనం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం, కొనుగోలు చేసిన వారి నుంచి వసూలు చేయాల్సిన 5 శాతం నిధులు, అంతేకాకుండా అటవీ ఉత్పత్తులను ట్రేడింగ్ చేసే వ్యాపారుల నుంచి 2, 3 శాతం నిధుల వసూలుపై చర్చించినట్లు సమాచారం. ఎర్రచందనం వేలం, రైతులు సాగు చేస్తున్న ఎర్రచందనం అమ్మకాల విధి విధానాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ నిపుణుల కమిటీ సమావేశం శనివారం కూడా జరగనుంది. డీఎస్సీ ఉచిత శిక్షణ దరఖాస్తులకు తుది గడువు నేడు తిరుపతి అర్బన్ : డీఎస్సీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కోచింగ్ సదుపాయం పొందడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి శనివారం వరకు గడువు ఉందని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి విక్రమ్ కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిని పరిగణలోకి తీసుకుంటున్నామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన అభ్యర్థులు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే బీసీలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుందని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జోత్స్న తెలిపారు. 10వ తేదీ నుంచి కలెక్టరేట్లోని బీ బ్లాక్ మూడో అంతస్తులోని తమ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. -
వ్యాపారికి మేలు జరిగేటట్టు
తూనికల్లో కనికట్టు.. తూనికలు, కొలతల్లో భారీ గా మోసాలు చోటు చేసు కుంటున్నాయి. తూనిక రాయి అడుగు భాగాన సీల్ వేసేందుకు 50 గ్రాముల నుంచి వంద గ్రాముల బరువు పట్టే రంధ్రం ఉంటుంది. చాలామంది తూనిక రాయి అడుగు భాగాన ఐస్కాంతం, ఇనుము అమర్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రానిక్ కా టాలో కాటా స్క్రీన్లో జీరోలు వచ్చేలా సరిచూసుకోవాలి. కంపెనీల నుంచి వచ్చే కొన్ని ప్యాకెట్ల బరువుల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. బి య్యం మిల్లులు, ఎరువుల దుకాణాలు, సిమెంట్ బస్తాల్లోనూ కనికట్టు రాజ్యమేలుతోంది. -
కర్రలతో ఇరువర్గాల దాడులు
నాయుడుపేటటౌన్: కర్రలతో ఇరువర్గాలు దాడి చేసుకున్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. పట్టణంలోని సంజయ్గాంధీ కాలనీలో నివాసం ఉంటున్న రామనారాయణ, రవి కుటంబాల మధ్య గతంలో గొడవలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మరళా గురువారం రాత్రి గొడవ పడ్డారు. దీంతో ఇరువార్గలకు చెందిన కుటంబ సభ్యులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రామనారాయణ, రవికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు చిత్తూరు అర్బన్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు రాష్ట్ర మైనారిటీ విభాగం జోనల్ అధ్యక్షుడిగా షఫీ అహ్మద్ ఖాద్రీ, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శులుగా ఎస్డీ అబ్బాస్, మహీన్, మహ్మద్ మగ్దూం మొహిద్దీన్, రాష్ట్ర మైనారిటీ విభాగం సంయుక్త కార్యదర్శులుగా షేక్ సర్దార్, నూర్, రాష్ట్ర ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా కొప్పాల భాస్కర్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శిగా యుగంధర్ రెడ్డి నియమితులయ్యారు. -
ఇదేం వివక్ష?.. తిరుమలకే వచ్చి తాడో పేడో తేల్చుకుంటాం
తిరుపతి, సాక్షి: సిఫార్సు లేఖల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన ఆయన.. లెటర్ల అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో టీటీడీకి ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులందరి సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 294 మంది ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు, వసతి సౌకర్యాలు కల్పించేవాళ్లు. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ వివక్ష బాధాకరం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించాలని స్వయంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలక మండలి కూడా అందుకు అంగీకరించింది. అయితే.. స్వయంగా సీఎం ఆదేశించినా.. అధికారులు మాత్రం అమలు చేయడం లేదు.. ఎందుకు?. తెలంగాణ ప్రజాపతినిధుల లెటర్లకు వెంటనే దర్శనాలు, గదుల సౌకర్యం కల్పించాలి. ఈ వివక్షపై టీటీడీ పునరాలోచించాలి. ఈ విషయమై పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించాలి. వేసవి సెలవుల్లో సిఫార్సు లేఖలు జారీ చేస్తాం. అనుమతించకపోతే ఎమ్మెల్యేలంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం. పార్టీలకతీతంగా నేను ఇది చెబుతున్నా’’ అని హెచ్చరించారాయన. -
Tirumala: ఇక ఫ్లయింగ్ జోన్గానే తిరుమల?
తిరుపతి, సాక్షి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన చోట.. పదే పదే అపచారం జరుగుతోంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఒకింత ఆందోళన.. అదే సమయంలో ఆగ్రహానికి లోనవున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోరా? అని ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువైపోయాయి. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ప్రతిరోజు శ్రీవారి ఆలయం మీద నుంచి విమానాలు వెళ్తుండడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలనే డిమాండ్ కొత్తేం కాదు. ఈ అంశంపై కేంద్రానికి పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వాలు లేఖలు రాసినా స్పందన లేకుండా పోయింది. తిరుపతిలో విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చంటూ కేంద్రం అప్పట్లో వివరణ ఇచ్చుకుంది. అంతెందుకు గతంలో టీడీపీ తరఫున అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. కానీ, అడుగులు ముందుకు పడలేకపోయాయి. అయితే.. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి కావడం, పైగా రాష్ట్రానికి చెందిన రామ్మోహన్నాయుడు విమానయానశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సానుకూల స్పందన రావొచ్చని భక్తులు భావించారు. కానీ, అదీ జరగడం లేదు.తాజాగా విమానయాన శాఖ మంత్రికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ లేఖ రాశారు. తిరుమలపై విమాన రాకపోకలు నిషేధించాలని లేఖలో కోరారు. ఈ లేఖకు మంత్రి రామ్మోహన్నాయుడు స్పందించారు. తిరుమలకు నో ఫ్లయింగ్ జోన్ ఇవ్వడం సాధ్యం కాదని, అలాంటి హోదా ఇవ్వడానికి నిబంధనలు లేవని అన్నారు. పైగా దేశంలో ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి ఇలాంటి వినతులు వస్తున్నాయని చెప్పారు. అయితే తిరుమల గగనతలంపైకి విమానాలు రాకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ విభాగాలతో చర్చించి చర్యలు తీసుకుంటాం అని మాత్రం హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినా.. ఇప్పుడు మళ్లీ విమానాలు తిరుగుతున్నాయి. ఇంతటి అపచారం జరుగుతున్నా.. తిరుమలను ఫ్లయింగ్ జోన్గానే కొనసాగిస్తారా? అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగమశాస్త్రం ఏం చెబుతోందంటే.. దేవాలయాలపైన ఎవరూ సంచరించకూడదని అగమశాస్త్రం చెబుతోంది. ఆలయాలు ఉన్నత ప్రాంతాలు. భగవంతుడి కంటే ఎత్తులో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. దైవానికి నివేదన చేసేటప్పుడు.. గంటానాదం, ఢమరుకం, వాయిద్యాలు తప్పించి.. మరేయితర శబ్ధాలు వినిపించకూడదు. అలా జరిగితే అది అపచారం. కావున అగమశాస్త్రం ప్రకారం విమానాలు, రాకెట్లు ఆలయం మీదుగా వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. పైగా తిరుమలలాంటి స్వయంవ్యక్త క్షేత్రం కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలకు ప్రతీక కాబట్టి సముచితమైన రీతిలో కాపాడుకోవాలని పిలుపు ఇస్తున్నారు. -
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 51,148 మంది స్వామిని దర్శించుకున్నారు. 21,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.56 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
● చెదులుపాకం చెరువులో మొదలైన గ్రావెల్ తవ్వకాలు ● తమిళనాడుకు తరలిస్తున్న అక్రమార్కులు ● దందాకు సహకరిస్తున్న టీడీపీ నేతలు ● కన్నెత్తి చూడని రెవెన్యూ, పోలీసు అధికారులు
వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలోని చెదులుపాకం వద్ద చెరువులో ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో మట్టిని తవ్వేస్తున్నారు. నియంత్రించాల్సిన రెవెన్యూ, పోలీస్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానికులు అడ్డుపడుతున్నా అధికారుల సహకారం లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారితో ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు మాత్రం తమకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక అక్రమంగా అనుమతులను ఇస్తూ మాఫియాకు మద్దతు పలకడం విమర్శలకు దారి తీస్తోంది. గ్రామస్తుల విన్నపాలను పట్టించుకోని అధికారులు గ్రావెల్ మాఫియాను ప్రోత్సహించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతజరుగు తున్నా మైనింగ్ అధికారులు పత్తా లేకుండా పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం వ్యవహారానికి టీడీపీ స్థానిక నేతలే కారణమని ఆరోపిస్తున్నారు. తమ జేబులు నింపుకునేందుకు చెరువును ధ్వంసం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాలనీకి ముప్పు చెదులుపాకం వద్ద ఇల్లు లేని నిరుపేదల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. పేదలకు పట్టాలు పంపిణీ చేయ గా కొంతమంది ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. అయితే ప్రస్తుతం జగనన్న కాలనీకి సమీపంలోని చెదులుపాకం చెరువులో భారీగా తవ్వకాలు చేపడుతున్న కారణంగా వర్షాకాలంలో తమ నివాసాలకు ముప్పు తప్పదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాక జగనన్న కాలనీ మీదుగా వందలాది వాహనాలు గ్రావెల్ లోడ్తో రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో దారులు సైతం ధ్వంసమవుతున్నట్లు వాపోతున్నారు. మట్టి కోసం వేచి ఉన్న టిప్పర్లు తెర వెనుక తమ్ముళ్లు చెదులుపాకం చెరువు వద్ద సాగుతున్న గ్రావెల్ దందా వెనుక మండలానికి చెందిన ఓ వర్గం టీడీపీ కీలక నేతలు ఉన్నట్లు గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. వీరి అండదండలతోనే తమిళనాడుకు మట్టి అక్రమ రవాణా జరుగుతోందని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా అనుమతులు తీసుకుని గ్రావెల్ దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శిస్తున్నారు. -
మొల్లమాంబకు ఘన నివాళి
తిరుపతి మంగళం : వాల్మీకి మహర్షి రాసిన సంస్కృత భాషల నుంచి తెలుగులోకి అత్యంత రమణీయంగా రాసిన మొట్టమొదటి మహిళా కవయిత్రి మొల్లమాంబ అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. ఈ మేరకు తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసం వద్ద గురువారం కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పుష్పాలతో నివాళి అర్పించారు. ఎంపీపీ యశోదమ్మ, సర్పంచ్ చిన్నియాదవ్, ఎంపీటీసీలు జైకర్, నాగభూషణమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు రుద్రగోపి, వాసు, సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఘనంగా మొల్ల జయంతి తిరుపతి అర్బన్: కవయిత్రి మొల్ల రచనా శైలి ఎంతో సరళమైందని, రమణీయమైనదని డీఆర్వో నరసింహులు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో ఆమె జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుంచి సామాన్యులకు అర్థమయ్యే విధంగా తెలుగు భాషలోకి అనువధించిన కవయిత్రి మొల్ల అని కొనియాడారు. కడప జిల్లా, గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోత్స్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్, జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య పాల్గొన్నారు. -
● ముదురుతున్న డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారం ● ఘర్షణలు, దాడులు, కిడ్నాప్లు, ఆస్తుల ధ్వసంపై న్యాయపోరాటం ● దుశ్చర్యపై పార్లమెంట్ వేదికగ గళమెత్తిన ఎంపీ గురుమూర్తి ● మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్హెచ్ఆర్సీ కన్నెర ● సీబీఐ దర్యాప్తును కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన ధమనకాండపై వైఎస్సార్సీపీ నేతలు న్యాయపోరాటానికి దిగారు. దీనిపై తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యస్వామి సైతం స్పందించారు. ఈ ఎన్నిక వ్యవహారంపై లోతైన విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టు తలుపుతట్టారు. అలాగే తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఆధారాలతో సహా పార్లమెంట్లో గళ మెత్తారు. దీన్ని రాష్ట్ర హైకోర్టు సైతం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు డీజీపీ, హోం శాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీచేసింది. మానవ హక్కుల కమిషన్ సైతం విచారణకు ఆదేశించింది. నేడో రేపో పార్లమెంట్ కార్యాలయం సైతం స్పందించనుంది. ఇలా అన్ని రకాలుగా పోలీసులు, అధికారులు నాడు దౌర్జన్యకాండకు దిగిన టీడీపీ, జనసేన నేతలకు ఉచ్చు బిగియనుంది. తిరుపతి తుడా: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికను గతనెల 3వ తేదీన నిర్వహించారు. తిరుపతి కార్పారేషన్ 50 డివిజన్లు ఉండగా, గతంలో 49 డివిజన్లకు ఎన్నకలు నిర్వహించారు. ఇందులో టీడీపీ నుంచి ఒక్కరు మాత్రమే గెలుపొందారు. 4వ డివిజన్ కార్పొరేట్గా ఉన్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పదవికి రాజీనామా చేశారు. అనార్యోగంతో 24వ డివిజన్ కార్పొరేటర్ మృతి చెందారు. ఇలా మొత్తం 47 మంది కార్పొరేటర్లలో 46 మంది వైఎస్సార్సీపీ గుర్తుపై గెలుపొందినవారే ఉన్నారు. డెప్యూటీ మేయర్ ఎన్నికలను సజావుగా నిర్వహించి ఉంటే వైఎస్సార్సీపీ అభ్యర్థి డిప్యూటీ మేయర్గా విజయం సాధించి ఉండేవారు. బలం లేకపోయినా బరితెగింపు కూటమి నేతలు తమకున్న 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణను డెప్యూటీ మేయర్ ఎన్నికల్లో బరిలోకి దింపారు. ఈ క్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సైతం తిరుపతిలో తిష్ట వేసి ఉన్నతాధికారులను సైతం పిలిపించుకుని గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని హుకుం జారీ చేసినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కొంతమంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి తమ వైపుకు తిప్పుకున్నారు. అప్పటికీ కూటమి అభ్యర్థికి 11 మంది మాత్రమే బలం ఉంది. దీంతో రంగప్రవేశం చేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులపై దండయాత్ర ప్రారంభించారు. మరో కార్పొరేటర్కు చెందిన వ్యాపారాలను సీజ్ చేస్తామంటూ హెచ్చరికలు జారీచేశారు. దానికితోడు ఐదుగురు కార్పొరేటర్లను ఎన్నికలు జరిగే వేదిక సమీపంలోనే కిడ్నాప్ చేశారు. కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి భయబ్రాంతులకు గురిచేశారు. కార్పొరేటర్లు బస చేస్తున్న హోటల్పై అర్ధరాత్రి వేళ అరాచకం సృష్టించారు. ఎన్నిక రోజు పోలింగ్కు వచ్చిన కార్పొరేటర్ల వాహనంపై దాడికి తెగబడ్డారు. వాహనాన్ని ధ్వసం చేసి బస్సులోని కార్పొరేటర్లను కొట్టుకుంటూ టీడీపీ, జనసేన నేతల తమ సొంత వాహనాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కార్పొరేటర్లను పోలింగ్కు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీసీ పుటేజ్లు, పేపర్ క్లిపింగ్లు, నాడు దాడి జరిగిన విజువల్స్ ఆధారంగా వైస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది.టీడీపీ, జనసేన నేతల్లో టెన్షన్ అల్లర్లు, దాడులు, కిడ్నాప్ వ్యవహారాలపై ఆధారలతో సహా ఫిర్యాదు చేయడంతో ఓ పక్క మానవ హక్కుల కమిషన్, మరో పక్క రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం తీవ్రంగా స్పందించాయి. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సీపీ పుటేజ్లు, వీడియో టేపులు, ఫొటోల ఆధారంగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దాడులు, కిడ్నాప్ వ్యవహారం పూర్తిగా విజువల్స్లో ఉండడంతో టీడీపీ, జనసేన నేతలలో టెన్షన్ మొదలైంది. కేసుల వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుంది ఆందోళ చెందుతున్నారు.నాటి అల్లర్లపై స్పందించిన హైకోర్టు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో చోటు చేసుకున్న వ్యవహారం పై బీజేపీ మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యస్వామి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు వ్యవహారం ముదురుతుండడంతో పోలీసు అధికారులు, ఆస్తుల కూల్చివేతకు దిగిన టౌన్ ప్లాన్ అధికారుల్లో ఆందోళ నెలకొంది. రాజకీయ కుట్రకు తాము బలికాకతప్పదన భయం పట్టుకుంది. మానవ హక్కుల కమిషన్ కన్నెర్ర ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కార్పొరేటర్లతో కలసి ఎస్వీయూ సెనేట్ హాల్కు చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన మూకలు ఎంపీపై దురుసుగా ప్రవర్తించాయి. దీంతో ఆయన జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఆధారలతో సహా కమిషన్ ముందు ఉంచారు. ఇందుకు కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీ పుటేజ్లు, వీడియో క్లిప్లింగ్లు, పేపర్ కటింగ్లను సైతం మానవహక్కుల కమిషన్కు అందజేశారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. త్వరలో విచారణ బృందం ఈ వ్యవహారంపై విచారించనుంది. -
బేస్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి బస్టాండ్లో ఇంటర్–మోడల్ స్టేషన్(ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) కు బేస్ మాస్టర్ ప్లాన్ సిద్దమైందని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. బేస్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైనందున ప్రాజెక్ట్ డిజైన్ను సంబంధిత వర్గాల సూచనలతో మెరుగుపరచే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణికుల రవాణా సౌకర్యం, భద్రత, వేగవంతమైన రాకపోకలకు అనుగుణంగా మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నారని చెప్పారు. డిజైన్ సిద్దమైన వెంటనే పీపీపీ మోడల్ ద్వారా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ఈప్రాజెక్ట్ అమలు చేయనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. ఇంటర్ పరీక్షకు 901 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్లో 31,898 మంది, ఒకేషనల్లో 1,190మంది మొత్తం 33,088 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 901మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ సబ్జెక్టుల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు విద్యార్థులకు హాల్టిక్కెట్ ప్రామాణికం తిరుపతి అర్బన్: పదో తరగతి విద్యార్థులకు హాల్టిక్కెట్ ప్రామాణికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి నరసింహులు తెలిపారు. ఈనెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు విద్యార్థి స్వస్థలం నుంచి లేదా వారి పాఠశాల నుంచి పరీక్ష కేంద్రం వరకు వెళ్లిరావడానికి కండక్టర్కు హాల్టిక్కెట్ చూపిస్తే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్టినరీ సర్వీసుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయవచ్చ, ఆ మేరకు జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఇదిలావుండగా తమిళనాడులోని తిరువణ్ణామలైకు గురు, శుక్రవారాలు పౌర్ణమి సందర్భంగా 142 సర్వీసులను జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. -
ఆధ్యాత్మిక సౌరభం
భూ సమస్యల పరిష్కారానికే రీసర్వే భూ సమస్యల పరిష్కారానికే రీసర్వే అని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేర కు ఆయన రీ సర్వేని పరిశీలించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. చివరి రోజు అయిన గురువారం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి తెప్పపై విహరిస్తూ కనువిందు చేశారు. భక్తులు తండోతండాలుగా తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు. – తిరుమల – 8లో– 8లో -
ఏప్రిల్ 30న పాలిసెట్ ప్రవేశ పరీక్ష
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్హతతో పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ మేరకు తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్, జిల్లా కో–ఆర్డినేటర్ ఆర్వీ.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి, సత్యవేడు, గూడూరులో ఏర్పాటుచేయనున్న పరీక్షా కేంద్రాల్లో పాలిసెట్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు పదో తరగతి పాసైన విద్యార్థులు, ప్రస్తుతం పది పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచితంగా శిక్షణతో పాటు మెటీరియల్ను అందించనున్నట్లు తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీపీఓఎల్వైసీఈటీ.ఏపీ.ఎన్ఐసీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, బీసీ, ఓసీ విద్యార్థులు రూ.400పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోదలచిన విద్యార్థులు సమీపంలోని ఏదేని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించవచ్చని, అలాగే తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెల్ప్లైన్ సెంటర్లో సంప్రదించవచ్చని తెలిపారు. వివరాలకు 99851 29995 నంబరులో హెల్ప్లైన్ సెంటర్ ఇంచార్జ్ కమల్ను సంప్రదించాలని ఆయన కోరారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 8 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 68,509 మంది స్వామివారిని దర్శించుకోగా 23,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
యువత పోరు విజయవంతం
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన యువత పోరు విజయవంతం అయిందని, ఇందులో పాల్గొన్న విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులకు చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వయువతపోరులో పాల్గొని కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై విద్యార్థులు, యువత ఉద్యమించిందన్నారు. ఇన్చార్జి సీవీఎస్ఓ బాధ్యతల స్వీకరణ తిరుమల: టీటీడీ ఇన్చార్జ్ సీవీఎస్ఓగా మంగళవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయ న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనను టీటీడీ ఆలయ డిప్యూటీ ఈలో లోకనాథం లడ్డూ ప్రసాదాలతో సత్కరించి, వేద ఆశీర్వచనాలు అందించారు. -
పారదర్శకంగా పది పరీక్షలు
● జిల్లాలో 164 పరీక్షా కేంద్రాలు ● హాజరుకానున్న 28,656 మంది విద్యార్థులు ● డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు ● ‘సాక్షి’తో డీఈవో కేవీఎన్ కుమార్ తిరుపతి అర్బన్: ‘పది పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశాం. ప్రధానంగా మాస్కాఫియింగ్కు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాం’అని జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా అన్ని వసతులు కల్పిస్తాం. జిల్లా వ్యాప్తంగా 164 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో 28,656 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి 31 వరకు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 15,455 మంది, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 11,548 మంది, 634 మంది ప్రైవేటు విద్యార్థులు, 1,019 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 1,904 మందికి డ్యూటీలు ఇచ్చాం. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూతవేయాలి. డ్యూటీలో ఉన్న ప్రతి ఉద్యోగి ఐడీ కార్డులతోనే విధులకు హాజరుకావాలి. 1,476 మంది ఇన్విజిలేటర్లుతోపాటు రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖకు చెందిన ముగ్గురు అధికారులతో కూడిన 6 ప్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. అంతేకాకుండా 30 సిట్టింగ్ స్క్వాడ్స్, 164 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 163 మంది డిపార్ట్మెంట్స్ ఆఫీసర్వు, 41 మంది కస్టోడియన్లు, 11 మంది రూట్ ఆఫీసర్లు, ఆరుగురు అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లు డ్యూటీల్లో ఉంటారు. జిల్లాలోని 39 పోలీస్ స్టేషన్లలో ప్రశ్నపత్రాలు ఉన్నాయి. వచ్చే శనివారం మరోసారి సిబ్బందితో సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. ఏమైనా ఫిర్యాదులు వస్తే స్వీకరించడానికి 7569787131 కంట్రోల్ రూమ్ను డీఈఓ కార్యాలంలో ఏర్పాటు చేశాం.’ అని చెప్పారు -
క్రియేటివిటీ, నైపుణ్యాలతో ఇంజినీర్లకు గుర్తింపు
నారాయణవనం: క్రియేటివిటీ, నైపుణ్యాలతోనే యువ ఇంజినీర్లకు గుర్తింపు లభిస్తుందని అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ సుదర్శనరావు పేర్కొన్నారు. పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల 24వ జూబిలేషన్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాల్గొన్నారు. ఓపెన్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం కాకుండా కోడీంగ్, డీ–కోడింగ్, ప్రాబ్లమ్ సొల్యాషన్ల మీద పనిచేయలని, పారిశ్రామిక వేత్తలుగా ఎదనాలని పిలుపునిచ్చారు. సెమీ కండక్టర్ టెక్నాలజీ, నిర్మాణ, విద్యాత్ రంగాల్లో స్టార్టప్ ప్రాజెక్ట్లపై దృష్టి సారించాలని చెప్పారు. కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు, యోగా, ధ్యానంపై దృష్టి పెట్టి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అకడమిక్ టాపర్లకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. దక్షిణాది సినీ నటి సంయుక్తా మీనన్ ఆటల పాటలతో అలరించారు. యాంకర్ భానుశ్రీ తన మాట తీరుతో ఆకట్టుకున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. జేఎన్టీయూ వీసీ సుదర్శనరావు -
తాకట్టు నగలు చోరీ కేసులో అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్
సత్యవేడు: నాగలాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన నగల చోరీ కేసులో ఆ బ్యాంకు అసిస్టెంట్మేనేజర్ ఏ.సూర్యతేజను అరెస్టు చేసినట్టు సీఐ మురళి తెలిపారు. ఈ మేరకు గురువారం నిందితుడిని అరెస్ట్ చూపారు. తిరుపతి రీజినల్ మేనేజర్ వీ.బ్రహ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు పై నాగలాపురం పోలీస్ స్టేషన్లో గత నెల ఫిబ్రవరి 21న కేసు నయోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మార్చి 12వ తేదీన నాగలాపురం ఈస్టు చర్చి వద్ద ముద్దాయిని అరెస్టు చేసి బంగారు నగలు తాకట్టు పెట్టిన రసీదులు స్వాధీనం చేసుకున్నారు. జరిగింది ఇలా.. బ్యాంకు మేనేజర్ తిరైవరాజ్ ,అసిస్టెంట్ మేనేజర్ ఏ.సూర్యతేజ బంగారు నగల లాకర్కు కస్టోడియన్లుగా ఉన్నారు. నగలు ఉన్న లాకర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు ఇద్దరూ ఉండాల్సి ఉంది. బ్యాంకు మేనేజరు నిర్లక్ష్యం కారణంగా దానిని ఆసరగా తీసుకొన్న అసిస్టెంట్మేనేజర్ 30 మంది బంగారు నగలు (2,634 గ్రాములు) దొంగతనంగా బ్యాంకు నుంచి తీసుకొని ఇతర బ్యాంకులు, వివిధ ప్రయివేటు ఫైనాన్స్ సంస్థల నుంచి తనపేరున రుణం, మరో 11 పేర్లతో 37 సార్లు బంగారు నగలు మార్చిమార్చి తాకట్టుపెట్టి రూ.1.3 కోట్ల రుణం పొందాడు. ఆ డబ్బును ఆన్లైన్ జూదమాడి పోగొట్టుకున్నాడు. ఫిబ్రవరి 10న జోనల్ ఆడిట్అధికారి రాజ్కమల్ నాయక్ తనిఖీ చేపట్టారు. అడిట్ చేపట్టిన సమయంలో లాకర్ పరిశీలిచగా 11 మంది పేరిట ఉండాల్సిన ఆభరణాలు లేకపోవడంతో.. అసిస్టెంట్ మేనేజర్ను ఫోన్లో సంప్రదించగా నేరాలు ఒప్పుకోవడంతో ఆడిట్ అదికారి అవాక్కయ్యారు. బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లను ఫిబ్రవరి 11న సస్పెండ్ చేశారు. వారి స్థానంలో కొత్తగా మేనేజర్గా నాగమునేంద్ర, అసిస్టెంట్ మేనేజర్గా విజయ్శేఖర్ నియమించారు. రెండో ముద్దాయిగా ఉన్న మేనేజర్ తిరైవరాజ్ను త్వరలో అరెస్టు చేస్తామన్నారు సీఐ తెలిపారు. -
అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతం
సూళ్లూరుపేట: డాకింగ్ టెక్నాలజీని సముపార్జన కోసం ఇస్రో చేసిన అన్ని పరీక్షలను విజయవంతం చేశారు. గురువారం 9.20 గంటలకు స్పేడెక్స్ ఉపగ్రహాలను విడదీసే అన్డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. డిసెంబర్ 30న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ద్వారా స్పేడెక్స్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. జనవరి 16న సేడెక్స్లోని ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తమ అదుపులోకి తీసుకుని నియంత్రిస్తూ ఒకదానితో ఒకటి అనుసంధానం చేశారు. గురువారం 9.20 గంటలకు డాకింగ్లో ఉన్న రెండు ఉపగ్రహాలను విడదీసి అన్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రక్రియ ఇస్రోకి ఒక చరిత్రాత్మక క్షణంగా, అలాగే డాకింగ్ టెక్నాలజీని అందుకోవడం కూడా ఇస్రో చరిత్రలో ఒక మైలు రాయిగా ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. డాకింగ్ టెక్నాలజీని సముపార్జించుకోవడం ప్రపంచంలో నాలుగవ దేశంగా భారత్ పేరు ప్రఖ్యాతులు పొందిన విషయం తెలిసిందే. -
కంటైనర్ లారీ ఢీకొని మహిళ మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: ద్విచక్ర వాహనాన్ని వెనుకవైపు నుంచి కంటైనర్ లారీ ఢీ కొనడంతో మహిళ మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు గాయాలైన ఘటన వెస్టువరత్తూరు గ్రామం వద్ద కేటీరోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి మండలం, రామాపురం గ్రామ ఎస్టీ కాలానికి చెందిన రజనమ్మ(30), భర్త రమణయ్య, మామ సుబ్బరామయ్యతో కలసి పెద్దపాండూరు గ్రామంలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యంలోని వెస్టు వరత్తూరు గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని తిరుపతి నుంచి చైన్నెకి వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా ఢీ కొంది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రజనమ్మకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రమణయ్య, సుబ్బరామయ్యకు గాయాలయ్యాయి. రమణయ్య, సుబ్బరామయ్యను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తికి 108 అంబులెన్స్లో తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విశ్వనాథనాయుడు తెలిపారు. -
‘ఓపెన్’గానే పరీక్షలు
వెంకటగిరి రూరల్ : దూర ప్రాంతాల్లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు మాస్ కాఫీయింగ్కు దారితీస్తున్నాయి. ఓపెన్ ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు వెంకటగిరిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి సిట్టింగ్ స్క్వాడ్ –2, ఇన్విజిలేటర్లు –10 మంది, చీఫ్–1, డిపార్టమెంట్ అధికారి–1 మొత్తం 12 మందిని ఏర్పాటు చేశారు. విద్యార్థులను పాస్ చేయడమే లక్ష్యంగా కొన్ని కళాశాలల నిర్వాహకులు మాస్కాపింగ్ను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు సమర్పించినట్టు సమాచారం. -
వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శిగా వెంకటరమణ
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టి.వెంకటరమణను చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. టర్మ్ ఫీజుతో ముడిపెట్టడం దారుణం తిరుపతి సిటీ: ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో అల్లాడిపోతున్న విద్యార్థులకు వర్సిటీ అధికారులు తలనొప్పిగా మారారని ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రంజిత్ కుమార్, చిన్న ఆవే ఛీన వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులు టర్మ్ ఫీజు చెల్లించనిదే సెమిస్టర్ పరీక్ష ఫీజులకు అనుమతి ఇవ్వకపోడం దారుణమన్నారు. ఈ మేరకు వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భాస్కర్రెడ్డికి గురువారం వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పూర్తిగా విడుదల కావడంలేదని, కానీ వర్సిటీ అధికారులు పీజీ విద్యార్థులకు టర్మ్ ఫీజు చెల్లించిన తర్వాతనే సెమిష్టర్ ఫీజు కట్టించుకుంటామంటూ నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. తక్షణం అధికారులు సెమిస్టర్ పరీక్షఫీజులు కట్టించుకోవాలని, లేని పక్షంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎ నాయకులు రాజు, వేణు, కృష్ణవంశీ, వంశీ పాల్గొన్నారు. హిటాచీ సీజ్ తిరుపతి రూరల్: స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుకను తోడేస్తున్న హిటాచీను తిరుపతి రూరల్ పోలీసులు సీజ్ చేశారు. గురువారం తిరుపతి రూరల్ మండలం, చిగురువాడ సమీపంలోని స్వర్ణముఖి నదిలో కొంత మంది అక్రమార్కులు ఇసుకను అక్రమంగా తోడేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హిటాచీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రూరల్ పోలీసు స్టేషన్కు తరలించారు. -
భూ సమస్యల పరిష్కారానికే రీసర్వే
శ్రీకాళహస్తి: రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా రీసర్వే ప్రక్రియ చేపట్టామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఆయన తొట్టంబేడు మండలం బోనుపల్లిలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డి, స్థానిక రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రీసర్వేపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని, అందులో ముఖ్యమంత్రి, అలాగే మంత్రులు, శాసనసభ్యులు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా భూసమస్యలపైనే వచ్చాయని చెప్పారు. ఇదివరకు జరిగిన భూసర్వేలో జరిగిన తప్పుల వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, ఆ తప్పులను సరి చేసి పక్కాగా రీసర్వే చేస్తామన్నారు. రీసర్వే, రెవెన్యూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకోవడానికే గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. ఈ గ్రామంలో రీసర్వే వల్ల జాయింట్ ఖాతాలు, వన్బీ సమస్యలు, భాగపరిష్కారం, సాదాబైనామీ అయి సాగులో ఉన్న వారికి పట్టాలు లేకపోవడం వంటి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. కాళంగి నది వల్ల పంట పొలాలు మునిగిపోవడం జరిగిందని రైతులు తెలుపగా.. రోజూవారీ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో ఈ గ్రామ సమస్యలకు ఏవిధంగా పరిష్కారం చూపాలో ఆర్డీఓ, తహసీల్దార్ను ఆదేశించామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపరిహారం కూడా పొందలేకపోయారని, ధాన్య సేకరణకు అవకాశం ఉన్నా కూడా సంబంధిత వ్యవసాయ అధికారుల అవగాహనా లోపం వల్ల ఈ ప్రక్రియ జరగలేదని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు మధుసూదన్రావు, సర్వేయర్ హరినాథ్ , రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బోనుపల్లి రీసర్వే ప్రక్రియలో దొర్లిన తప్పులను సరిదిద్దుతాం క్షేత్ర స్థాయిలో పర్యటించిన కలెక్టర్ వెంకటేశ్వర్ -
చిరుధాన్యాలతో అధిక లాభాలు
తిరుపతి సిటీ: చిరుధాన్యాలతో అధిక లాభాలు పొందవచ్చని ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ కరీముల్లా పేర్కొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అఖిల భారత జొన్న, చిరుధాన్యాల సమన్వయ పరిశోధనా పథకం ఆధ్వర్యంలో గురువారం షెడ్యూల్డ్ కులాల మహిళా రైతులకు చిరుధాన్యాలతో తయారు చేసే పలు రకాల పదార్థాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మహిళలకు అవగాహన కల్పించారు. ఆహారపు అలవాట్లు సైతం మారకతప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం వంట పాత్రలను, చిరుధాన్యాల ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసే కిట్ను మహిళకు అందజేశారు. ఏడీఆర్ డాక్టర్ సుమతి, డాక్టర్ కదిరిమోహన్ హాజరయ్యారు -
జీవవైవిధ్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి సిటీ: ఎస్వీయూలో శేషాచలం–జీవవైవిధ్యం అనే అంశంపై ఎన్ఎస్ఎస్, అక్షర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 17న సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు గురువారం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీన్ నరసింహ, అక్షర ఫౌండేషన్ అధినేత మద్దినేని హరిబాబు, ఎస్వీయూ కో–ఆర్డినేటర్లు డాక్టర్ పాకనాటి హరికృష్ణ, డాక్టర్ పత్తిపాటి వివేక్ పాల్గొన్నారు. శ్రీవారి సేవలో ప్రముఖులు తిరుమల: తిరుమల శ్రీవారిని హీరో కిరణ్ అబ్బవరం గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. -
స్వర్ణ నారావారిపల్లి క్లస్టర్లో భారీ స్కామ్
● అక్రమ నిర్మాణాల్లో ఉచిత సోలార్ను అమర్చిన అధికారులు ● నివాసం ఉన్న ఇళ్లకు కాకుండా అక్రమ నిర్మాణం చేపట్టిన షెడ్డుకు సోలార్ ఏర్పాటు చంద్రగిరి: ‘సోలార్ విద్యుత్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇందు కోసం నా స్వగ్రామం నారావారిపల్లిని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నా. స్వర్ణ నారావారిపల్లి క్లస్టర్ పేరుతో ఏ.రంగంపేట నుంచి మూలపల్లి వరకు ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ను వినియోగించేలా ఉచితంగా కనెక్షన్లను అందజేసి, ప్రజల్లో వాటి వినియోగం పెంచేలా అవగాహ కల్పించడమే ఉద్దేశం’ అంటూ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలకు అధికారులు ఉప్పొంగిపోయారు. అర్హులైన లబ్ధిదారులకు స్వర్ణ నారావారిపల్లి క్లస్టర్ ప్రాజెక్టు కింద విద్యుత్ సోలార్ను అమర్చాల్సి ఉంది. అయితే అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని ఏ.రంగంపేట సమీపంలోని నాగపట్ల లెక్కదాఖల సర్వే నం.80/ఏలో 8.31 సెంట్ల ప్రభుత్వ తోపు పోరంబోకు భూమి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏ.రంగంపేటకు చెందిన ఓ వ్యక్తి సుమారు రూ.50లక్షల విలువైన 100 అంకణాల భూమిని దర్జాగా అక్రమించేశాడు. అపై అక్రమంగా షెడ్డును నిర్మించి, బౌండరీని ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై గతంలోనే పలు ఫిర్యాదు వెళ్లాయి. అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, ఎవరికీ పట్టాలు మంజూరు చేయలేదని, అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదంటూ రెవెన్యూ అధికారులు సైతం విద్యుత్ శాఖ అధికారులకు సర్కులేషన్ను అందించారు. అవన్నీ పక్కనబెట్టిన విద్యుత్ అధికారులు అక్రమ షెడ్డుకు విద్యుత్ కనెక్షన్ను మంజూరు చేశారు.అధికార పార్టీకు చెందిన ఓ వ్యక్తి ఓ ప్రజాప్రతినిధికి మీడియా పీఏ అంటూ చెప్పుకుని అక్రమంగా నిర్మించిన షెడ్డులో ఎవరూ నివాసం లేకపోయినా ఉచిత సోలార్ సిస్టెమ్ను అమర్చుకోవడం ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
చట్టాలపై అవగాహన అవసరం
తిరుపతి తుడా: మహిళా సాధికారతను సాధించడానికి, స్వీయ రక్షణ కోసం రాజ్యాంగం అనే చట్టాల ద్వారా హక్కులను కల్పించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఎస్వీఎన్ భట్టి పేర్కొన్నారు. స్విమ్స్ పద్మావతి ఆడిటోరియంలో గురువారం చట్టం, మహిళా సాధికారత అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. చట్టాలపై మహిళలకు అవగాహన ఉండాలన్నారు. భారత రాజ్యాంగం మహిళలకు సమానత్వాన్ని ప్రసాధించిందన్నారు. సాధికారత అంటే ఎగుమతి, దిగుమతి చేసుకునే సరుకు కాదని గుర్తుచేశారు. మహిళలు తమకు తాముగా సాధికారతను సాధించుకోగలరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సాధికారిత, లింగ సమానత్వంపై అడిగిన ప్రశ్నలను ఆయన నివృత్తి చేశారు. డాక్టర్ ఆర్వీ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చిల్లకూరు : కోట క్రాస్ రోడ్డు సమీపంలోని నెలబల్లిరెట్టపల్లెకు వెళ్లు మార్గం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. గూడూరు రూరల్ మండలం పోటుపాళానికి చెందిన మోరా శ్రీనివాసులు(38) బైక్పై శ్రీకాళహస్తికి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపు తప్పి హైవే అథారిటీ వారు ఏర్పాటు చేసిన ఎస్ఓఎస్ బాక్సును ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. గూడూరు డీఎస్పీ గీతాకుమారి ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్బాబు తెలిపారు. -
గడువులోపు ఇల్లు కడితే బోనస్
తిరుపతి అర్బన్ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–1 పథకంలో భాగంగా ఏప్రిల్ 30వ తేదీలోపు ఇల్లు నిర్మించుకుంటే ఇప్పటికే అందిస్తున్న రూ.1.80 లక్షలతోపాటు అదనపు నగదు అందించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గడువులోపు ఇల్లు కట్టుకుంటే ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరు చేస్తామని వెల్లడించారు. అయితే గత ఏడాది డిసెంబర్ 10వ తేదీ నాటికి ఇంటి నిర్మాణాలు ప్రారంభించిన వారు మాత్రమే అర్హులని వివరించారు. ఈ మేరకు లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు సర్వే చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. -
రైల్వే ఉద్యోగం పేరుతో టోకరా
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి వారి వద్ద నుంచి రూ.కోట్లు కాజేసిన ఘరానా మోసగాడి ఉదంతం బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ క్రమంలో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. వివరాలు.. రేణిగుంట మండలం ఎస్ఎన్ పురానికి చెందిన కృష్ణమూర్తి సీఆర్ఎస్లో రైల్వే ఉద్యోగిగా పనిచేసేవాడు. ఈ మేరకు రైల్వేలో ఉద్యోగాలు ఉన్నాయని, తాను ఇప్పిస్తానంటూ పలువురి నుంచి సుమారు రూ.2కోట్లు వసూలు చేశాడు. తర్వాత సమాధానం చెప్పకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గతంలోనూ ఈ ఘనుడిపై గాజులమండ్యం పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదై ఉంది. ఈ క్రమంలోనే రెండు నెలలల క్రితం 12 మంది బాధితులు తమ వద్ద రూ.10లక్షల చొప్పున వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బుధవారం రైల్వేకోడూరుకు చెందిన కొందరు తమను కూడా కృష్ణమూర్తి మోసం చేసినట్లు రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ విధంగా ఎంతమంది సదరు కృష్ణమూర్తి చేతిలో మోసానికి గురయ్యారో తేలుస్తామని పోలీసులు వెల్లడిస్తున్నారు. పరశురామేశ్వరుని సేవలో శ్రీరాములు ఏర్పేడు(రేణిగుంట) : ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన పరశురామేశ్వరుని బుధవారం కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సేవించుకున్నారు. ఆలయ ఈఓ రామచంద్రారెడ్డి, పాలకమండలి మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
వాగులో మునిగి విద్యార్థి మృతి
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : రేణిగుంట మండలం మామండూరులో వాగులో మునిగిపోయి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. అనంతపురం జిల్లాకు చెందిన వివేక్(21) రేణిగుంట మండలంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం కాలేజీకి సెలవు ఇవ్వడంతో ఐదుగురు స్నేహితులతో కలిసి మాముండూరు పర్యాటక కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడి నీటి వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. స్నేహితులు వెంటనే వెలికి తీసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఓటేరు’ పరిరక్షణే లక్ష్యం
తిరుపతి రూరల్ : కబ్జా కోరల నుంచి ఓటేరు చెరువు పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు. బుధవారం ఓటేరు చెరువును పరిశీలించారు. నారాయణ మాట్లాడుతూ చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత అంటారని, చెరువులు పూడ్చేస్తుంటే చూస్తూ ఉంటారని విమర్శించారు. కార్యక్రమంలో నేతలు గుజ్జుల ఈశ్వరయ్య, రామానాయుడు, పి.మురళి, చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, జె .విశ్వనాథ్, బి.నదియా, కత్తి రవి, కె.శివారెడ్డి, కె.పద్మనాభ రెడ్డి, హేమలత, జయచంద్ర, వేణు బుజ్జమ్మ, పి.అంజయ్య పాల్గొన్నారు. పోరాటమే నిత్యకృత్యం తిరుపతి కల్చరల్ : జాస్వామ్యం పరిరక్షణలో భాగంగా పోరాటమే నిత్యకృత్యమని నారాయణ తెలిపారు. సాయినగర్లోని వైన్షాపు మార్పునకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడంపై సీపీఐ ఆధ్వర్యంలో పది రోజులుగా నిరసన చేపట్టామన్నారు. ఈ మేరకు విజయం సాధించినట్లు వెల్లడించారు. నేతలు జి.ఈశ్వరయ్య , రామానాయుడు, పి.మురళి, చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, కె.శివారెడ్డి పాలొన్నారు. -
ప్రజలతోనే పదిహేనేళ్లు
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ గత పదిహేనేళ్లుగా ప్రజలతో మమేకమై ముందుకు సాగుతోందని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి మారుతీనగర్లోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లపాటు జనరంజకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిందన్నారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అందించి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. నిరుపేద విద్యార్థులు సైతం ఉన్నతంగా చదువుకోవాలనే సంకల్పంతో మహానేత వైఎస్సార్ ఫీజురీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. తండ్రిక తగ్గ తనయుడిగా జగన్మోహన్రెడ్డి సైతం మహోన్నత పథకానికి మరింత మెరుగులు దిద్ది పకడ్బందీగా కొనసాగించారని వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. పేద విద్యార్థుల బతుకులతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తూ ఆడపడుచులను మోసం చేశారని ఆరోపించారు. ప్రజలను గాలికి వదిలేసి, వైఎస్సార్సీపీ నేతలను జైలులో పెట్టడమే పనిగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులోనే తేల్చుకుంటాం... మంగళంపేటలో అటవీ భూములను ఆక్రమించుకున్నానంటూ ఈనాడు పత్రిక పనికట్టుకుని తప్పుడు వార్తలు రాస్తోందని పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ఆకాంక్షలకు అనుగుణంగా తనను టార్గెట్ చేసి అసత్య కథనాలను వండి వారుస్తోందన్నారు. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. జనరంజకంగా వైఎస్ జగన్ పాలన పేదలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవంలో పెద్దిరెడ్డి, భూమనపేదల కోసమే పుట్టింది పేద ప్రజల అభ్యున్నతి కోసమే వైఎస్సార్సీపీ పుట్టిందని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నేతలు, కార్యకర్తలకు పంచిపెట్టారు. భూమన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగుపెడుతోందన్నారు. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజాసంక్షేమం కోసం శ్రమిస్తున్నారని వెల్లడించారు. జగనన్న పాలనను ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని విమర్శించారు. కార్యక్రమంలో మేయర్ శిరీష, పార్టీ తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, నూకతోటి రాజేష్, తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, ఉదయ్వంశీ, దినేష్రాయల్, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు గీతాయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షులు మాధవిరెడ్డి పాల్గొన్నారు. -
● వైఎస్సార్సీపీ ‘యువత పోరు’కు పోటెత్తిన విద్యార్థులు ● ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించాలని నినాదాలు ● కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం ● సీఎం చంద్రబాబు దగా చేశారంటూ ఆక్రోశం
అడుగు అడుగు కదలి.. యువత పోరు కార్యక్రమానికి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. భూమన కరుణాకరరెడ్డితోపాటు మేయర్ శిరీష, పార్టీ తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, నూకతోటి రాజేష్, తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, యువత విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, యువజన విభాగం నగర అధ్యక్షుడు దినేష్రాయల్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు గీతాయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షులు మాధవిరెడ్డి, నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్కు చేరుకున్నారు. మరోవైపు భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కలెక్టరేట్కు చేరుకుని వైఎస్సార్సీపీ ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం కరుణిస్తుందేమో అని పేద విద్యార్థులు ఆశపడ్డారు.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేరుస్తారేమో అని పడిగాపులు కాశారు.. చదువుకు ఆటంకం కలగకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారేమో అని గత 9 నెలలుగా ఎదురుచూశారు.. సర్కారు నిర్లక్ష్య వైఖరితో విసిగి వేశారిపోయారు.. ఆవేదనతో నలిగిపోయారు. ఆగ్రహంతో రగిలిపోయారు.. ఈ క్రమంలో తల్లడిల్లిన నిరుపేద విద్యార్థుల గుండె మండింది. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన యువత పోరుశ్రీకు పోటెత్తింది. జగనన్న పాలనలో సజావుగా అందిన విద్యాదీవెనను గుర్తుచేసుకుంది. భూమన నేతృత్వంలో కదంతొక్కింది. కలెక్టరేట్ను ముట్టడించి ఆందోళనకు దిగింది. ప్రజా విద్రోహ పాలనకు వ్యతిరేకంగా నినదించింది. తిరుపతి అర్బన్/తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం తిరుపతి కలెక్టరేట్ వద్ద చేపట్టిన యువత పోరు విజయవంతమైంది. పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల ఓవర్యాక్షన్పై మండిపడ్డారు. నిరసనకారులను నిర్దాక్షిణ్యంగా నెట్టేయడంపై ఆవేదన చెందారు. ఉద్రిక్త వాతావరణంలోనే భూమన నేతృత్వంలో పలువురు నేతలు కలెక్టరేట్లోకి వెళ్లి కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రం అందించారు. పేద విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వం దగా చేస్తోందని, ఇప్పటికై నా ఫీజు బకాయిలు జమ చేయాలని పేర్కొన్నారు. అన్నివర్గాలకు అన్యాయం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పేద ప్రజలను నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు దురాలోచనతో నోటికి వచ్చిన అబద్దాలు చెప్పారన్నారు. సూపర్సిక్స్ పథకాలంటూ ఊదరగొట్టి ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. చివరకు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ సైతం చెల్లించని ప్రజాద్రోహి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలకు ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులను ఆయా యాజమాన్యాలు బయటకు పంపేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ బిడ్డల భవిష్యత్పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే ఇస్తానన్న రూ. 3వేలు నిరుద్యోగ భృతి, 20లక్షల ఉద్యోగాల సంగతి ఏమైందని ప్రశ్నించారు. జగనన్న ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి పేదల బతుకుల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను అందించిన దేవుడని వెల్లడించారు. సకాలంలో ఫీజురీయింబర్స్మెంట్ అందిస్తూ విద్యార్థుల ఉన్నత భవితకు కృషి చేశారని వివరించారు. పేద పిల్లలు సైతం వైద్యులుగా ఎదగాలని రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిన దార్శనికుడు జగనన్న అని కొనియాడారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకుండా కేవలం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించేందుకే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందుకే ప్రజల్లో సైతం ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించారు. -
గుణాత్మక విద్య తప్పనిసరి
ఏర్పేడు(రేణిగుంట) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరిగా గుణాత్మక విద్యను అందించాలని, వారి సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ కేవీఎం కుమార్ ఆదేశించారు. బుధవారం ఏర్పేడు, పంగూరు కాంప్లెక్స్ సమావేశాలను ఆయన తనిఖీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అమలు చేయాల్సిన విద్యా ప్రణాళికలను వివరించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శివశంకరయ్య, ఎంఈఓలు ప్రేమలత, దయాకర్రావు పాల్గొన్నారు. -
చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
నారాయణవనం: ప్రభుత్వ వైద్యశాలల్లోని ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ల్యాబ్ టెక్నీషియన్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోగికి వైద్య సేవలు అందాలంటే రోగ నిర్ధారణ చేస్తున్న టెక్నీషియన్ల పాత్ర కీలకమని తెలిపారు. గ్రేడ్–2 క్యాడర్లోనే ఉద్యోగంలో చేరి, అదే క్యాడర్లో విరమణ చెందే దౌర్భాగ్యం తమదేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్లు, జోనల్ క్యాడర్గా మార్పు, పీహెచ్సీలలో 2వ ల్యాబ్ టెక్నిషియన్ పోస్ట్ మంజూరు, ల్యాబ్ల ఆధునీకరణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇంటర్ పరీక్షకు 598 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు బుధవారం జిల్లా వ్యాప్తంగా 598 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 86 కేంద్రాల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించారు. జనరల్లో 28,599మంది, ఒకేషనల్లో 1,040మంది మొత్తం 29,639మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 29,041మంది మాత్రమే పరీక్ష రాసినట్లు ఆర్ఐఓ జీవీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. గురువారం ఫస్టియర్ విద్యార్థులకు కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని గాంధీరోడ్డులో బుధవారం చోరీ యత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సంక్షిప్తంగా.. చిత్తూరు నగరంలోని గాంధీరోడ్డు–లక్ష్మీ థియేటర్ కూడలి వద్ద ఓ మారుతి ఓమ్నీ వ్యాను వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఆరుగురికి పైగా వ్యక్తులు ఎదురుగా ఉన్న ‘పుష్ప షాపింగ్ కిడ్ వరల్డ్’ దుకాణంపైన ఉన్న చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడ్డారు. మొహానికి మాస్కులు, టోపీలు పెట్టుకున్న వ్యక్తులు చంద్రశేఖర్, అతని తల్లి సరస్వతి, భార్య శాంతి వైపు తుపాకులు చూపించి, బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు నగలు బ్యాగులో వేయాలని చెబుతుండగా.. చంద్రశేఖర్ పెద్దగా కేకలు వేయడంతో పైఅంతస్తులో ఉన్న కుమారుడు లోకేష్, ఇతని భార్య మానస పరుగు పరుగున కింద అంతస్తులోకి వచ్చారు. వాళ్లకు తుపాకీ చూపి కింద కూర్చోపెట్టారు. చంద్రశేఖర్ ప్రతిఘటించడంతో తల, చేతికి గాయాలయ్యాయి. నిందితుల్లో ఒకరు బొమ్మ తుపాకీ పేల్చగా, అతి టప్ మంటూ శబ్దం చేసింది. వెంటనే తప్పించుకున్న లోకేష్ రోడ్డుపైకి వచ్చి సాయం కోసం అరవడం, చంద్రశేఖర్ మిద్దైపె నుంచే దొంగలు అని కేకలు వేశారు. స్థానికంగా టీ తాగడానికి వచ్చిన ఉమాపతి, అతని స్నేహితులు హుటాహుటిన దొంగలు ఉన్న భవనంలోకి ప్రవేశించారు. వీళ్లను చూసిన వెంటనే ఇద్దరు పారిపోయారు. ఇక ఉమాపతి గొంతుకు కత్తి పెట్టడంతో నిందితుడిని కాలితో తన్నాడు. కత్తి కిందపడడంతో స్థానికులంతా కలిసి నిందితులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. తాళ్ల సాయంతో నలుగురు నిందితులను కట్టేసి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురు నిందితులను స్థానికులు, పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు తుపాకులతో ఇంట్లోనే ఉన్నట్లు చెప్పడంతో అలజడి మొదలైంది. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య తన సిబ్బందితో కలిసి మరో భవనం నుంచి చంద్రశేఖర్ ఇంట్లోకి ప్రవేశించారు. అందర్నీ బయటకు తీసుకొచ్చారు. ఎస్పీ మణికంఠ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వద్ద ఆయుధాలున్నాయనే సమాచారం రావడంతో సాయుధ బలగాలను రప్పించారు. బుల్లెట్ఫ్రూఫ్ జాకెట్లు ధరించి చేతుల్లో తుపాకులు పట్టుకున్న అధికారులు, సిబ్బంది భవనం లోపలకు వెళుతున్నారు, బయటకు వస్తున్నారు. కానీ ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. నిందితులు వచ్చిన కారుకు తమిళనాడుకు చెందిన ద్విచక్రవాహన నంబర్ వేసుకోవడంతోపాటు, ప్రెస్ అని స్టిక్కర్ వేసుకోవడం, కారులో కత్తి, పెట్రోలు గుర్తించిన పోలీసులు దీన్ని చిన్న ఘటనగా భావించలేదు. విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. తిరుమలలో ఉన్న ఆక్టోపస్ బలగాల సాయం తీసుకోవాలని డీజీపీ చెప్పడంతో.. ఎస్పీ మణికంఠ వారిని చిత్తూరుకు రప్పించారు. 20 మందికి పైగా ఉన్న ఆక్టోపస్ బలగాలు ఘటనా స్థలం మొత్తాన్ని జల్లెడ పట్టాయి. చుట్టుపక్కల భవనాల్లో సైతం వెతికినా పారిపోయిన నిందితుల ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసుల ఆపరేషన్ ముగిసింది. అందరూ వెనుతిరుగుతున్న సమయంలో... ఘటన జరిగిన భవనం గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంకు ఉంది. దొంగలు బ్యాంకులో దాక్కున్నారా..? బ్యాంకును దోచుకోవడానికి వచ్చారా..? అనే ప్రశ్నలు తలెత్తడంతో మళ్లీ ఆక్టోపస్ బలగాలు బ్యాంకులోకి తుపాకులతో ప్రవేశించి, వెతికినా ఎవరూ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుని ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయారు. ‘‘ఊరంతా అప్పులు. ఒక్క దోపిడీ చేస్తే, వచ్చేదాంతో అప్పులన్నీ కొట్టేయచ్చు. చోరీల్లో ఆరితేరినవాళ్లను సాయం అడిగితే వచ్చేదాంట్లో వాటాలు అడుగుతారు. తలా రూ.2 వేలు ఇస్తే నా వద్ద పనిచేసేవాళ్లే వచ్చేస్తారు. ఇక అంతా సిద్ధం. పదండి లోపలకు..’’ అన్నాడు ముఠా నాయకుడు. డామిట్ అప్పుడే కథ అడ్డం తిరిగింది. భవన యజమాని ప్రతిఘటించాడు. స్థానికంగా ఉన్న యువకులు పిచ్చ కొట్టొడుకొట్టారు. ఒకరి కాలు విరిగింది. మరొకరికి మొహం మారిపోయింది. తీరా పోలీసుల రంగ ప్రవేశంతో ఉత్కంఠత నెలకొన్నా.. చివర్లో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క దోపిడీతో.. అప్పులన్నీ కొట్టేద్దామనే ఆశ చిత్తూరులో రచ్చరచ్చ చేసిన కొత్త దొంగలు బొమ్మ తుపాకీలతో పట్టపగలు ఇంట్లో చోరీకి యత్నం ప్రతిఘటించిన యజమాని.. స్థానికులే హీరోలైన వైనం జిల్లా ఎస్పీ నుంచి.. ఆక్టోపస్ బలగాల పరుగులు కంటిమీద కునుకులేక.. ఆపై ఊపిరి తీసుకున్న ఖాకీలు 10 గంటలు: 7.47 గంటలు: సీన్ కట్ చేస్తే.. చిత్తూరు నగరంలోని కలెక్టరేట్ భవనం వెనుక ఉన్న జీకే నగర్లో కాపురముంటున్న సుబ్రమణ్యంరెడ్డి 16 ఏళ్ల క్రితం కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ సోఫాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. అందరికీ అప్పులు ఇచ్చి, ఆర్థికంగా నష్టపోవడంతో ఒక్క దోపిడీ చేసి అప్పులన్నీ సెటిల్ చేద్దామని ఇలా తొలి ప్రయత్నంగా చోరీకి ప్రయత్నించి చావుదెబ్బలు తిని.. కటకటాలపాలయ్యాడు. సుబ్రమణ్యంరెడ్డితోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన నవీన్, ఇబ్రహీమ్ బాషా, ప్రవీణ్, రామాంజనేయులు పోలీసులకు చిక్కగా.. రాజేష్తో పాటు మరో ఇద్దరు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గురువారం ఈ ఘటనపై వివరాలను మీడియాకు వివరించే అవకాశం ఉంది. ఉదయం 6.28 గంటలు: 6.57 గంటలు: 8.10 గంటలు: ఉదయం 6.35 గంటలు: 7.23 గంటలు: 9 గంటలు: 9.30 గంటలు: 6.40 గంటలు: -
పోటీతత్వంతో ఉన్నత భవిత
నారాయణవనం:యువ ఇంజినీర్లు పోటీ తత్వం పెంపొందించుకుంటే ఉన్నత భవిష్యత్ పొందవచ్చని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు తెలిపారు. బుధవారం కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో జుబిలేషన్ డే నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అశోక్రాజు మాట్లాడుతూ జీవితంతో ఎంత ఎత్తుకు ఎదిగినా, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలని సూచించారు. మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. అనంతరం ఆయనను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలోనే వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జుబిలేషన్లో భాగంగా గురువారం చేపట్టే కార్యక్రమాలకు జేఎన్టీయూ అనంతరపురం వీసీ సుదర్శనరావు, సినీనటి సంయుక్తా మీనన్, యాంకర్ భానుశ్రీ హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఆల్జీబ్రాపై అవగాహన అవసరం
తిరుపతి సిటీ : గణితశాస్త్రంలో ఆల్జీబ్రా, ఆల్జీబ్రాయిక్ కీలకమని వాటిపై విద్యార్థులకు అవగాహన అవసరమని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు తెలిపారు. వర్సిటీ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్జీబ్రా, ఆల్జీబ్రాయిక్ నంబర్ థియరీ, ట్రోపాలజీ వాటి ఆవర్తనాలు అనే అంశంపై శిక్షణ తరగతులను బుధవారం ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ గణితశాస్త్రంలో కీలకమైన, క్లిష్టమైన అంశాలపై విద్యార్థులకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని తరగతులు నిర్వహించేందుకు వర్సిటీ ప్రొత్సాహం అందిస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి, ఐజర్ ప్రొఫెసర్ డీఎస్ నాగరాజా, గణితశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సి.జయసుబ్బారెడ్డి పాల్గొన్నారు. 15 నుంచి ఈఏపీసెట్కు దరఖాస్తులు తిరుపతి సిటీ : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ యూజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్–2025 (గతంలో ఎంసెట్)కు ఈనెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 24వ తేదీని దరఖాస్తులకు చివరి గడువుగా పేర్కొన్నారు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. -
ప్రధాన మంత్రి పంటల బీమా పరిస్థితి ఏంటి?
– లోక్ సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన మంత్రి పంటల బీమా యోజన కింద సరిగా అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మంగళవారం లోక్ సభలో ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పంటల బీమా యోజన, మార్పు చేసిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్.డబ్లు.బి.సి.ఐ.ఎస్) కింద 2.63 లక్షల మంది రైతులు తమ పంటలకు బీమా నమోదు చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఈ పథకం కోసం 2022–23 సంవత్సరంలో 1,09,865 మంది రైతులు 1,16,895 హెక్టార్ల భూభాగానికి నమోదు చేసుకున్నారని తెలిపారు. అలాగే 2023–24లో 1,18,880 మంది రైతులు 1,42,695 హెక్టార్లకు, 2024–25లో 35,553 మంది, 45,507 హెక్టార్ల కు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ పథకం కింద వరి, వేరుశనగ, సజ్జలు, పత్తి, పెసలు తదితర పంటలకు బీమా అందిస్తామని తెలిపారు. -
కారులో చెలరేగిన మంటలు
పాకాల: ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన మండలంలోని పదిపుట్లబైలు వద్ద చోటుచేసుకుంది. మంగళవారం ఎస్ఎఫ్ఓ గుణశేఖర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి మండలం, రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ తిరుపతి నుంచి మదనపల్లికి కారులో పదిపుట్లబైలు క్రాస్ రోడ్డు వద్ద మహేంద్ర కారులో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో కారులో మంటలు చెలరేగాయి. చిత్తూరు కంట్రోల్ రూం నుంచి సమాచారం రావడంతో తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్టు ఎస్ఎఫ్ఓ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. అగ్నిమాపక సిబ్బంది మనోహర్రెడ్డి, సురేంద్రబాబు, బాలాజీ, నాగార్జున పాల్గొన్నారు. భారత్ ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టు తిరుపతి కల్చరల్: బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్లో నెంబర్ ఒన్ అని, భారత్ ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టుపెట్టే చర్యలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో చంద్రబాబు, నితీష్ కుమారులు ఇద్దరకూ కలిసి సొంత ప్రయోజనాల కోసం మోదీని కాపాడారని విమర్శించారు. అధిక మంది పిల్లలను కందాం అనే దరిద్రమైన బీజేపీ స్లోగన్ను చంద్రబాబు బుజాన వేసుకున్నారని మండిపడ్డారు. -
స్పేస్ పోర్టు నిర్మాణానికి భూమిపూజ
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర్పట్నంలో ఎస్ఎస్ఎల్వీ లాంచ్కాంఫ్లెక్స్ (ఎస్ఎల్సీ) నిర్మాణానికి ఈనెల 5న భూమిపూజ చేసినట్టు ఇస్రో తన వెబ్సైట్లో మంగళవారం తెలిపింది. చిన్న ప్రయోగాలు, వాణిజ్యపరమైన ప్రయోగాలను ఎస్ఎస్ఎల్వీ లాంటి చిన్నతరహా రాకెట్ల ద్వారా చేయడానికి ఈ స్పేస్పోర్టు నిర్మాణాన్ని చేపట్టినట్టు వెల్లడించింది. ప్రయివేట్ సంస్థలకు చెందిన చిన్న చిన్న రాకెట్లకు కూడా మంచి డిమాండ్ ఉండడంతో కులశేఖరపట్నంలో రాకెట్ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 13 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 69,746 మంది స్వామివారిని దర్శించుకోగా 23,649 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.27 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి సేవలో ప్రముఖులు తిరుమల శ్రీవారిని మంగళవారం ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు వేణు, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డు ప్రసాదాలతో సత్కరించారు. -
జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య
● కానరాని నోటిఫికేషన్లు.. కనికరించని కూటమి నేతలు ● స్తంభించిన పారిశ్రామిక రంగం ● జాబ్ క్యాలెండర్ జాడలేక వెతలు ● వలసబాట పడుతున్న యువత ● జిల్లాలో 6 లక్షల 23వేల మంది నిరుద్యోగుల ఆర్తనాదాలు తిరుపతిలో ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన జాబ్ మేళాకు తరలివచ్చిన నిరుద్యోగులు నియోజకవర్గం యువత తిరుపతి 1,30,000చంద్రగిరి 85,000 శ్రీకాళహస్తి 93,000 సత్యవేడు 80,000 వెంకటగిరి 90,000 గూడూరు 75,000 సూళ్లూరుపేట 70,000● తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇటీవల ఓ సంస్థ జాబ్మేళా ఏర్పాటు చేసింది. సుమారు 80 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 2 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఎస్ఎస్సీ అర్హతగల ఉద్యోగానికి సైతం పీజీలు పూర్తిచేసిన యువత హాజరుకావడంతో నిర్వాహకులు ముక్కున వేలువేసుకున్నారు. ● రేణిగుంటకు చెందిన వరప్రసాద్ ఎమ్మెస్సీ, పీహెచ్డీ పూర్తిచేశాడు. పేరొందిన కార్పొరేట్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డీఎస్సీ నోటిఫికేషన్పై తొలి సంతకం చేశారు. ఎంతో ఆశతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో వరప్రసాద్ ఉద్యోగాన్ని వదులుకుని లక్షలు అప్పుచేసి కోచింగ్ సెంటర్ బాటపడ్డారు. ఏడాది కావస్తున్నా అతీగతి లేదు. మళ్లీ జాబ్ వేటలో చైన్నెకి వెళ్లి ఓ హోటల్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు.. .. జిల్లాలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందనడానికి ఇవి మచ్చుకు రెండు మాత్రమే. జిల్లాలో ప్రతి ఏటా నిరుద్యోగులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారు. పీజీలు, పీహెచ్డీలు చేసిన వారు సైతం ఖాళీగా ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. కూటమి ప్రభుత్వం జాబ్క్యాలెండర్ పూర్తిగా విస్మరించడం ఏంచేయాలో తెలియక తికమకపడుతున్నారు. ఇందులో ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, టీటీసీ, డిప్లొమో చేసినవారు 1,25,000 డిగ్రీ, బీటెక్, బీఈడీ పూర్తి చేసిన వారు 1,55,000 పీజీ, పీహెచ్డీ 85,000 వృత్తి విద్య, మెడకల్, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసినవారు 2,58,000తిరుపతి సిటీ: ‘యువతకు 20 లక్షల ఉద్యోగాలు, జాబ్ వచ్చేంతవరకు నెలకు రూ.3వేలు భృతి’...ఇవీ ఎన్నికల సమయంలో సూపర్సిక్స్లో భాగంగా నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చిన వరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిరుద్యోగ భృతిపై నోరు మెదపడం లేదు. జాబ్ క్యాలెండ్ జాడలేకపోవడంతో జిల్లాలోని నిరుద్యోగ యువత పొట్ట చేతబట్టుకుని పక్క రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. మూడుపూటలా కడుపునిండితే చాలు..చిరు ఉద్యోగమైనా చేస్తామంటూ పీజీలు, పీహెచ్డీలు చేసిన యువకులు ఎక్కడ జాబ్ మేళాలు ఏర్పాటు చేసినా వేల సంఖ్యలో ఎగబడుతున్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగ యువత వివరాలు గత ఏడాది ఎన్నికల ముందు ఓ ప్రైవేటు ఎన్ఆర్ఐ సంస్థ ద్వారా తిరుపతి జిల్లాలో చేపట్టిన సర్వే ప్రకారం ఎస్ఎస్సీ నుంచి పీజీ, పీహెచ్డీ వరకు నియోజకవార్గాల వారీగా నిరుద్యోగ భృతికి అర్హులైన వారి జాబితా దాదాపుగా 6లక్షలా 23వేల మంది ఉన్నట్లు తేలింది. జిల్లాలో ఒక్కో నిరుద్యోగికి భృతి రూ.3వేల చొప్పున మొత్తం రూ.186.90కోట్లు నెలకు చెల్లించాల్సి ఉంది. పరిస్థితి దారుణం జిల్లాలో నిరుద్యోగం తాండిస్తోంది. నోటిఫికేషన్లు లేవు. నిరుద్యోగ భృతి లేదు. ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయడంలేదు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంతవరకు భృతి ఇవ్వాల్సిందే. – బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు, తిరుపతి జిల్లా ఎక్కడ జాబ్ మేళా జరుగుతున్నా.. ఉద్యోగ వేటలో ఏడాదిగా తిరిగి తిరిగి విసిగిపోయా. బీటెక్ సివిల్ పూర్తిచేశాను. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఊసేలేదు. ప్రైవేటు కంపెనీలు రావడం లేదు. దీంతో కొత్త ఉద్యోగాలు జాడ కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. జిల్లాలో ఎక్కడ జాబ్ మేళా జరిగినా పడిగెడుతున్నా. –రమణారెడ్డి, బీటెక్, చంద్రగిరిఉద్యోగావకాశాల్లేవు నేను ఎంఏ పీహెచ్డీ చేశాను. వర్సిటీలో అధ్యాపక పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంతో శ్రమించి కోచింగ్ తీసుకున్నా. కానీ కూటమి సర్కార్ ఆ నోటిఫికేషన్ను తుంగలో తొక్కేసింది. గత ఏడాది ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. బెంగళూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేసేందుకు ఇంటర్వ్యూ పూర్తిచేశాను. వచ్చే నెల నుంచి అక్కడికి వెళ్లకతప్పడం లేదు. –పూజిత, ఎంఏ, పీహెచ్డీ, తిరుపతి -
రెండు కార్లు రికవరీ
బుచ్చినాయుడుకండ్రిగ : బాడుగకు తీసుకుని అమ్మేసిన రెండు కార్లను రికవరీ చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు స్థానిక సీఐ తిమ్మయ్య, ఎస్ఐ విశ్వనాథనాయుడు తెలిపారు. మంగళవారం వారు స్థానిక పోలీసుస్టేషన్లో రికవరీ చేసి కార్లను, అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను చూపారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని ఆర్ అనంతపురం గ్రామానికి చెందిన మహేష్, తిమ్మభూపాలపురం గ్రామానికి చెందిన ఉమాశంకర్కు ఆమేజ్, ఎర్టీగా కార్లను నెల బాడుగకు ఇచ్చారు. అయితే ఉమాశంకర్ అనుచరులు దశరథన్, జాఫర్బాషాలతో కలసి పాకాలకు చెందిన వారికి వాహనాల రికార్డులను తారుమారు చేసి ఆమ్మేశారు. ఉమాశంకర్ కార్లు బాడుగ ఇవ్వకపోగా, కార్లను ఆమ్మేశాడని తెలియడంతో స్థానిక పోలీసుస్టేషన్లో మహేష్ ఫిర్యాదు చేశారు. దీంతో గాలించగా పాకాలలో ఉన్నట్లు సమాచారం అందడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్ల విలువ రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు. ఉమశంకర్ పరారీలో ఉండడంతో దశరథన్, జాఫర్బాషాను అరెస్టు చేశారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి రేణిగుంట: తిరుపతి–శ్రీకాళహస్తి మార్గం రాచగున్నేరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్కు రక్తగాయాలయ్యాయి. రూరల్ పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి మండలం, రామలింగాపురానికి చెందిన ఆదినారయ్య(60 తన పొలంలోని వరి గడ్డిని డ్రైవర్ బత్తెయ్యతో కలిసి ట్రాక్టర్పై వేసుకుని బంగారుపాళెం సమీపంలో విక్రయించి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాచగున్నేరి సమీపంలో ఓ గుర్తు తెలియని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో కూర్చున్న ఆదినారయ్య కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న బత్తెయ్యకు రక్తగాయాలయ్యాయి. ఢీకొన్న బస్సు ఆగకుండా వెళ్లిపోవడంతో ప్రమాదానికి కారణమైన బస్సును కనుగునేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
యువత పోరుకు తరలిరండి
తిరుపతి లీగల్: జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న ‘యువత పోరు’ను విజయవంతం చేయాలని ఆ పార్టీ లీగల్ సెల్ తిరుపతి అధ్యక్షుడు దొరబాబు (మునిబాల సుబ్రమణ్యం) ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉద్యోగాల కల్పన లేకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెనల బకాయిలు చెల్లించకుండా, వైద్య విద్యను ప్రైవేటీకరిస్తూ విద్యార్థులను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బకాయిలు చెల్లించేలా ‘యువత పోరు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్ట పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షకు 941 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్లో 32,541మంది, ఒకేషనల్లో 1,357మంది మొత్తం 33,898 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 941 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ పరీక్షలో భాగంగా బుధవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పని ఒత్తిడి తగ్గించండి ఏర్పేడు(రేణిగుంట): తమకు సర్వేల పేరుతో పనిభారం మోపొద్దని ఏర్పేడు ఎంపీడీవో సౌభాగ్యంకు మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు విన్నవించారు. కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు షఫీవుల్ల, కోశాధికారి లోకముని ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. అన్ని శాఖల పనులు తమకే చెప్పి సర్వేలను పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. పిచ్చాటూరు అంగన్వాడీ కార్యకర్తకు బ్రెయిన్ స్ట్రోక్ – ధర్నా కోసం విజయవాడకు వెళ్లి కుప్పకూలిన వైనం నాగలాపురం: పిచ్చాటూరు అంగన్వాడీ కార్యకర్త బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఆమె తోటి అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ఆదివారం విజయవాడలో జరిగిన మహాధర్నాకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం ధర్నా చేపట్టడానికి తోటి కార్యకర్తలతో కలిసి అలంకార్ ప్రాంగణానికి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమెకు చిన్నమెదడు చిట్లిపోయి రక్తం గడ్డకట్టినట్టు నిర్ధారించారు. కనీసం 24 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిని చెప్పలేమని వైద్యులు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం వాణిశ్రీకి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. 15న జాబ్మేళా శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈ నెల 15న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, ప్రిన్సిపల్ నాగరాజునాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్త, ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్, సీడాఫ్, డీఆర్డీఏ, జేకేసీ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి జాబ్మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. పలు బహుళ జాతీయ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పదోవ తరగతి, ఇంటర్మీడియెట్, ఐఐటీ, డిప్లొమో, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి యువతీయువకులు అర్హులని తెలిపారు. ఇంటర్ూయ్వలకు హాజరయ్యే వారు ఆధార్, విద్యార్హత సర్టిపికెట్స్ జిరాక్సులు, బయోడేటాతో పాటు సంబంధిత రిజిస్ట్రేషన్ లింక్లో నమోదు చేసుకున్ని అడ్మిట్ కార్డుతో జాబ్మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7989509540, 8919889609 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
జిల్లాలో మూడు ఇసుక పాయింట్లు
తిరుపతి అర్బన్: జిల్లాలో ఈనెల 15వ తేదీలోపు మూడు ఉచిత ఇసుక పాయింట్లు (స్వర్ణముఖినది ఆధారంగా)అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలసి అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కోట మండలం, గూడలి వద్ద ఒక ఇసుక పాయింట్, పెళ్లకూరు మండలం, పుల్లూరు సమీపంలో రెండు ఇసుక పాయింట్లు గుర్తించామని చెప్పారు. ఈ మూడు పాయింట్ల నుంచి 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తోడుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే డీసిల్టేషన్(ఇసుక పాయింట్ల) వద్ద ఇసుక తవ్వడానికి, రవాణా చేయడానికి ఏజెన్సీలను నియమించినట్టు వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకుని నేరుగా ఇసుక పాయింట్ల వద్దకు వెళ్లి రుసుం చెల్లించి ఇసుక తీసుకుపోవాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇసుక పాయింట్ల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఇసుక పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తడ, గాదంకి, సురుటుపల్లి చెక్స్పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, గూడూరు సబ్కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామమోహన్, భానుప్రకాష్రెడ్డి, జిల్లా గనులశాఖ అధికారి బాలాజీ నాయక్, గూడూరు ఏడీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, గ్రౌండ్ వాటర్ టీడీ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.ఇసుక పై స్పష్టత ఏదీ? కూటమి సర్కార్ జూలై 8న ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. గతంలో ఇసుక ఉచితం అని చెప్పినా జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు పాయింట్ల వద్ద టన్నుల లెక్క విక్రయించారు. జూలై 8న జిల్లాలో నాలుగుచోట్ల ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక పాయింట్లు మూతపడ్డాయి. ఆ తర్వాత ఆరు నెలలకు మళ్లీ ఉచిత ఇసుక గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఏర్పాటు చేస్తామన్న మూడు పాయింట్లను ఏజెన్సీకి ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఏజెన్సీకి ఏ పద్ధతిలో ఇస్తున్నారో క్లారిటీ లేదు. -
రాజకీయ ప్రాధన్యత పెరగాలి
తిరుపతి సిటీ: మహిళలకు రాజకీయ ప్రాధాన్యత పెరినప్పుడే సమాజంలో సీ్త్రకి సమానత్వం నిర్మితమవుతుందని వీసీ సీహెచ్ అప్పారావు అభిప్రాయపడ్డారు. ఎస్వీయూ ఉమెన్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకులు మంగళవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సాంకేతిక యుగంలోనూ మహిళలపై వివక్ష తగదన్నారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అభ్యంతరకర పోస్టులు పెడుతుండటం దారుణమన్నారు. అనంతరం చిత్ర లేఖనం, వక్తృత్వ పోటీలు, ఎగ్జిబిషన్, లింగ సమానత్వం, హింసలపై విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. విభాగాధిపతి డాక్టర్ సాయి సుజాత, డీఎస్పీ శ్రీలత, ప్రొఫెసర్ భాస్కర్రెడ్డి, డాక్టర్ రమణ, డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
తిరుపతి: హోటల్లో కుప్పకూలిన పైకప్పు
సాక్షి, తిరుపతి: నగరంలోని బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో పైకప్పు కూలింది. రూమ్ నంబర్ 314లో ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోటల్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అద్వితీయం!
ఎస్వీయూ చరిత్రలో మరో మైలురాయి ● జాతీయ యువజనోత్సవంలో ఎస్వీయూకు ద్వితీయ స్థానం ● అన్నిరంగాల్లో యువతను ప్రోత్సహించడమే వర్సిటీ లక్ష్యం ● మీడియాతో వీసీ, రిజిస్ట్రార్ తిరుపతి సిటీ: ఎస్వీయూ మరో మైలురాయిని దాటిందని వర్సిటీ వీసీ సీహెచ్ అప్పారావు ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ యువజనోత్సవాల్లో విశేష ప్రతిభకనబరిచి వర్సిటీకి దేశంలోనే ద్వితీయ స్థానం సాధించిపెట్టిన విద్యార్థులను చూసి వర్సిటీ గర్వపడుతోందన్నారు. సోమవారం వీసీ చాంబర్లో ఆయన రిజిస్ట్రార్ భూపతినాయుడుతో కలసి మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని అమితి వర్సిటీ వేదికగా జాతీయ స్థాయిలో జరిగిన యువజనోత్సవాల్లో దేశ వ్యాప్తంగా సుమారు 148 యూనివర్సిటీల నుంచి 2,400 మంది విద్యార్థులు పోటీపడ్డారని తెలిపారు. ఎస్వీయూ నుంచి ఐదు విభాగాలలో పోటీపడి విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. ఫైనార్ట్స్ విభాగంలో ఓవరాల్ ద్వితీయ చాంపియన్గా వర్సిటీ నిలవడం గర్వంగా ఉందన్నారు. అకడమిక్ విద్యతో పాటు క్రీడలు, ఫైనార్ట్స్ వంటి అన్ని రంగాల్లోనూ వర్సిటీ విద్యార్థులను ప్రొత్సహిస్తోందని పేర్కొన్నారు. ఇంతటి విజయానికి కృషి చేసిన డాక్టర్ పత్తిపాటి వివేక్, ప్రొఫెసర్ మురళీధర్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డాక్టర్ పాకనాటి హరికృష్ణ, శరత్బాబు, ప్రసన్న కుమార్రెడ్డి పాల్గొన్నారు. ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉంది టీటీడీ శిల్ప కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. దేశ వ్యాప్తంగా 2,400 మంది విద్యార్థులు 148 వర్సిటీల నుంచి యువజనోత్సవాల్లో పాల్గొన్నారు. ఇందులో క్లై మోడలింగ్ విభాగంలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. –కే.తేజ, విద్యార్థి, ఎస్వీయూ మెహందీలో ద్వితీయ స్థానం ఎస్పీడబ్ల్యూ కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. జాతీ య స్థాయిలో జరిగిన పో టీలలో ఇన్స్టలేషన్ విభా గంలో ద్వితీయ స్థానంలో నిలిచా. మెహందీ విభాగంలో రెండవ స్థానం సాధించి ప్రశంసాపత్రం, ట్రోఫీ అందుకోవడం సంతోషంగా ఉంది. –దీప్తి, విద్యార్థిని, ఎస్వీయూ ఊహించలేదు వర్సిటీ పరిధిలోని విజ యం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను. మెహందీ, ఇన్స్టలేషన్ విభాగాలలో ప్రతిభ చూపి రెండవ స్థానంలో నిలవడం గర్వంగా ఉంది. ఇంతటి విజయం సాధిస్తానని అనుకోలేదు. – సంధ్య, విద్యార్థిని, ఎస్వీయూ వర్సిటీకి రుణపడి ఉంటా ఎస్వీ మ్యూజిక్ కళాశాలలో డిగ్రీ చేస్తున్నా. జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఎస్వీయూకు రుణపడి ఉంటా. జాతీయ స్థాయిలో రంగోళి విభాగంలో రెండవ స్థానం సాధించాను. – ఎం వీరాంజనేయులు, విద్యార్థి, ఎస్వీయూ గర్వంగా ఉంది టీటీడీ శిల్ప కళాశాలలో డిగ్రీ చేస్తున్నా. సౌత్జోన్ పోటీలలో విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. కల్చలర్ కో–ఆర్డినేటర్స్ సహకారంతో ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. నేను ఇన్స్టలేషన్ విభాగంలో పాల్గొని రెండవ స్థానం సాధించా. –మౌనిక, ఎస్వీయూ రెండు విభాగాల్లో సత్తా చాటాను ఎస్వీయూ పరిధిలోని సీకాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. వర్సిటీ ప్రోత్సాహంతో అత్యుత్తమ శిక్షణ అందించిన అధ్యాపకులు మురళీధర్, వివేక్ సహకారం మరువలేనిధి. ఇన్స్టలేషన్ విభాగంలో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం, పోస్టర్ మేకింగ్లో మూడవ స్థానం సాధించాను. – డీ.దేవా, విద్యార్థి, ఎస్వీయూ -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో జిల్లా జట్టు విజయం
తిరుపతి ఎడ్యుకేషన్ : గుంటూరు ఏఎన్యూలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ హాకీ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ప్రతిభ కనబరిచిన తిరుపతి, సత్యసాయి జిల్లా జట్లు ఫైనల్కు చేరాయి. హోరాహోరీగా తలపడ్డ ఫైనల్ పోటీల్లో సత్యసాయి జిల్లా జట్టుపై 6–2గోల్స్ తేడాతో తిరుపతి జిల్లా జట్టు విజయం సాధించినట్టు ఏపీ హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, ఏపీ హాకీ డైరెక్టర్ నిరంజన్రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు బ్యాక్ క్రీడాకారుడు శ్రీనివాసులురెడ్డి(చంద్రగిరి), సెంటర్ హాఫ్ క్రీడాకారుడు సందీప్(గూడూరు) ఓవరాల్ ప్రతిభ కనబరిచి బెస్ట్ ప్లేయర్స్ అవార్డులను అందుకున్నారు. ప్రతిభ కనబరచిన జిల్లా జట్టు, క్రీడాకారులను జిల్లా హాకీ జట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్పర్ధన్రాజు, బీ.ఆదిత్య, కోచ్లు దీపక్ ఆకాష్, అశోక్, రమేష్, జెర్సీ స్పాన్సర్లు వీఎన్ మొబైల్స్ అప్పు, వెంకట్ అభినందించారు. -
అరెస్ట్లు..నిరసనలు!
తిరుపతి అర్బన్: అంగన్వాడీ వర్కర్లతో కూటమి ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు విజయవాడకు బయలుదేరిన వారిపై ఝులుం ప్రదర్శించింది. ఎక్కడికక్కడ అరెస్ట్లకు పూనుకుంది. ఇది చాలదన్నట్టు హౌస్ అరెస్ట్లూ చేసి నరకం చూపించింది. సెక్టార్ సమావేశాల్లోనే నిరసన జిల్లాలోని 11 ఐసీడీఎస్ సెంటర్లలో సోమవారం సెక్టార్ సమావేశాలు నిర్వహించారు. సాదారణంగా సెక్టార్ సమావేశం ప్రతి నెలా 25వ తేదీ పైన నిర్వహిస్తుంటారు. కానీ విజయవాడలో సోమవా రం జరిగిన మహాధర్నాకు వెళ్లకుండా కుయుక్తులు పన్నారు. సెక్టార్ సమావేశాన్ని సోమవారమే ఏర్పాటు చేశారు. జిల్లాలో 2,092 మంది అంగన్వాడీ వర్కర్లుండగా.. అందులో 500 మంది వరకు విజయవాడకు వెళ్లారు. మిగిలిన వారు సెక్టార్ సమావేశాల్లోనే నిరసన వ్యక్తం చేశారు. అండగా ఉంటామని! ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబునా యుడు, నారా లోకేష్ అంగన్వాడీలకు అండగా ఉంటామని హామీలిచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు అంగన్వాడీ వర్కర్లు వాపోయారు. -
వాళ్లు ఉండరు..
సచివాలయాలు వెలవెల ● మహాత్మా గాంధీ కలలకు కూటమి నేతల తూట్లు ● చిన్న సమస్యలకూ కలెక్టరేట్కు పరుగులు ● క్షేత్ర స్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ● ఆపసోపాలు పడుతున్న ప్రజలు ‘క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగులు సైతం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారమవ్వాలి..’ అన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మహాత్మాగాంధీ కలలకు తూట్లు పొడుస్తోంది. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. సర్వేల పేరుతో సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతోంది. చిన్న సమస్యకూ ప్రజలు సుదూర ప్రాంతంలోని కలెక్టరేట్కు పరుగులు పెట్టేలా చేస్తోంది. ఏం చేయాలో తెలియక.. తమ బాధలు ఎక్కడ చెప్పుకోవాలో అర్థంగాక జనం నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సిబ్బంది లేని చిట్టమూరు మండలంలోని ఆరూర్ సచివాలయం ఖాళీగా వరదయ్యపాళెంలోని సీఎల్ఎన్పల్లి గ్రామ సచివాలయం జిల్లా సమాచారం సచివాలయాలు 619 సచివాలయ ఉద్యోగులు 7,405 రూరల్లో సచివాలయాలు 495 సచివాలయ ఉద్యోగులు 5,445 అర్బన్ పరిధిలో సచివాలయాలు 196 సచివాలయ ఉద్యోగులు 1,960వికలాంగుల పింఛన్ కోసం వచ్చా నాది తిరుపతిలోని చింతలచేను. నా పేరు పీ.మంగమ్మ. నా భర్త పేరు వెంకటేష్. వికలాంగుల పింఛన్ కోసం కలెక్టరేట్కు వచ్చాం. సచివాలయంలో ఎవ్వరూ అందుబాటులో లేరు. మేము కటిక పేదవాళ్లం. దానికితోడు వికలాంగురాలుని. పింఛన్కు అర్హత ఉంది. న్యాయం చేయాలి. పింఛన్ ఇవ్వడంలేదయ్యా! నా పేరు కోనేటి రోసయ్య. మాది కేవీబీపురం మండలంలోని కోవనూరు ఎస్టీకాలనీ. వృద్ధాప్య పింఛన్ కోసం తిరుగుతున్నా. రెండు వారాలుగా కలెక్టరేట్కు వస్తున్నా. మా గ్రామం నుంచి కలెక్టరేట్కు రావాలంటే 70 కి.మీ. మా కష్టాన్ని గుర్తించాలి.తిరుపతి అర్బన్: సచివాలయ వ్యవస్థకు కూటమి నేతలు తూట్లు పొడుస్తున్నారు. సర్వేల పేరుతో సిబ్బందిని ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇంటి వద్దే అందుతున్న సేవలను అందకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఫలితం చిన్న సమస్యకూ విధిలేని పరిస్థితుల్లో కలెక్టరేట్కు వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, వీధిలైట్లు, దారి సమస్య, సర్టిఫికేట్స్, రేషన్కార్డులు, ఫించన్లు, పాఠశాలల్లో కొళాయిల మరమ్మతులు ఇలా.. అన్నింటికీ కలెక్టరేట్కు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంలో 2024 డిసెంబర్ 2వ తేదీ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 82 అర్జీలు వచ్చాయి. ప్రస్తుతం మార్చి 10వ తేదీ ఆ అర్జీల సంఖ్య 265కి చేరింది. మూడు రెట్లు అర్జీలు పెరిగాయి. రాబోవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పీఎంజేఏవై కార్డు కోసం తిరుగుతున్నా నా పేరు గూడూరు అయ్యప్ప. నా కుమారుడు గూడూరు దయాకర్ 5వ తరగతి చదువుతున్నాడు. పదేళ్ల వయస్సులోనే గుండె సమస్యతో బాధపడుతున్నాడు. ఆస్పత్రులకు వెళితే పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారు. పీఎంజేఏవై కార్డు ఉంటే ఉచితంగా ఆపరేషన్ చేస్తామని చెప్పారు. గతంలో ఈ కార్డును సచివాలయ పరిధిలోనే ఇచ్చేవారు. ప్రస్తుతం వారు ఇవ్వడం మానుకున్నారు. దీంతో రెండు వారాలుగా పీఎంజేఏవై కార్డు కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. రేషన్ కార్డు కోసం వచ్చాం నా పేరు పీ.నాగయ్య. నా భార్యపేరు పీ.మురగమ్మ. మాది వడమాలపేట మండలంలోని బట్టికండ్రిగ గ్రామం. మాకు రేషన్కార్డు లేదు. సచివాలయానికి వెళితే అక్కడ ఎవ్వరూ ఉండడం లేదు. దీంతో మూడు వారాలుగా అన్ని పనులు వదులుకుని కలెక్టరేట్కు వస్తున్నాం. మేము చాలా పేదవాళ్లం. మాకు రేషన్ కార్డు ఇప్పించాలని కోరుతున్నాం. -
దుగరాజుపట్నం పోర్టు నిర్మాణం అంతేనా?
● పార్లమెంట్లో గళమెత్తిన ఎంపీ గురుమూర్తి తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు పరిధిలోని దుగరాజపట్నం పోర్టు నిర్మాణ పరిస్థితి ఏంటని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం లోక్ సభలో ఆయన మాట్లాడారు. 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం నౌకాశ్రయ అభివృద్ధి ఇంకా ప్రారంభం కాలేదన్నారు. 2018 నాటికే మొదటి దశ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. దీనిని తక్షణమే ప్రారంభించి, రాష్ట్ర సముద్ర వాణిజ్య అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరారు. ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోకపోవడం లోపంగా కనిపిస్తోందన్నారు. ఈ–బిల్స్ ఆఫ్ లేడింగ్ అమలు చేయడం ద్వారా సముద్ర రవాణా మెరుగుపడుతుందని గుర్తుచేశారు. 2 నుంచి డీడీఈ పరీక్షలు నిర్వహించండి తిరుపతి సిటీ: ఎస్వీయూ డీడీఈ పరీక్షలను వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించాలని వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించాలని కోర్టు గతంలో ఆదేశాలు జారీచేయగా, పదో తరగతుల నేపథ్యంలో పరీక్షలను నిర్వహించలేమని వర్సిటీ అధికారులు కోర్టుకు విన్నవించారు. అన్ని విషయాలను పరిశీలించిన ధర్మాసనం ఈ మేరకు షెడ్యూలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. రేపటి నుంచి ఏపీఈసెట్కు దరఖాస్తులు తిరుపతి సిటీ: ఏపీ ఈసెట్–2025 నోటిఫకేషన్ విడుదలైంది. బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీటెక్ కోర్సులో రెండవ ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందేందుకు నిర్వహించే ఏపీఈసెట్కు వచ్చేనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఇంజీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమో, బీఎస్సీ (గణితశాస్త్రం)లో డిగ్రీ ఫైనల్ ఇయిర్ చదువుతున్న, పూర్తి చేసిన అభ్యర్థులు ఏపీఈసెట్ పరీక్షకు అర్హులని తెలిపారు. ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన నిర్వహించనున్నారు. ఈకేవైసీకి 18 వరకు గడువు తిరుపతి అర్బన్:ఈకేవైసీ చేయించుకోవడానికి రైతులకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు సోమవారం తెలిపారు. రబీ సీజన్కు సంబంధించి 2,03,860 ఎకరాలకు చెందిన 72,966 మంది రైతులకు ఈ పంట నమోదు చేశామని చెప్పారు. అలాగే 1,94,696 ఎకరాలకు సంబంధించి 69,166 మంది రైతులకు ఈకేవైసీ చేయాల్సి ఉందని వెల్లడించారు. 18వ తేదీ వరకు చేయించుకున్న వారి జాబితాను ఈనెల 22న ప్రకటిస్తామని తెలిపారు. కురుణామయుడా.. కనికరించు! తిరుపతి సిటీ: గౌరవవేతనం పెంచాలంటూ గత 36 రోజులుగా పశువైద్య విద్యార్థులు తరగతులు బహిష్కరించి వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక వెస్ట్ చర్చిలో వెటర్నరీ జూడాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారు మట్లాడుతూ నెల రోజులకు పైగా ఆకలి కేకలతో ధర్నాలు, నిర సనలు చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్పై స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సమ్మె విరిమించేది లేదని హెచ్చరించారు. వేదవిజ్ఞానానికి ప్రత్యేక వెబ్సైట్ తిరుపతి సిటీ: వేద విజ్ఞానాన్ని డిజిటలైజేషన్ చేసి ప్రపంచానికి అందించేందుకు వేదం.ఓఆర్జీ పేరుతో ప్రత్యేక వెబ్సైటన్ను జాతీయ సంస్కృత వర్సిటీలో అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. వర్సిటీలో ఖండనఖండఖాద్య గ్రంథాధ్యయనంపై పది రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ వర్కషాపులో భాగంగా ఈ వెబ్సైట్ను ప్రారంభించారు. శ్రీసత్యసాయి వేదప్రతిష్ఠానం, న్యాసీ ప్రబంధకులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్ పరమహంస, వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, డీన్ రజనీకాంత్ శుక్లా, ప్రొఫెసర్ గణపతిభట్, అధ్యాపకులు సతీష్, నాగరాజు భట్, మనోజ్షిండే, శివరామ దాయగుడే పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలతో నిఘా
నాయుడుపేట టౌన్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సిబ్బందిని ఆదేశించారు. నాయుడుపేట పోలీస్ డివిజన్ కార్యాలయం, అర్బన్, రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో గౌరవ ప్రదంగా వ్యవహరించాలన్నారు. మహిళలు వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వస్తే తక్షణం స్పందించాలని చెప్పారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేసేలా ఈగల్ టీం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డీఎస్పీ చెంచుబాబు, సీఐలు బాబి, సంగమేశ్వర రావు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ సీజ్
చంద్రగిరి: ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటనలో ఎట్టకేలకు పోలీసులు ట్రాక్టర్ను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. రెండు రోజుల క్రితం చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ సమీపంలో జరిగిన ప్రమాదంలో బైక్పై వెళ్తున్న చాణక్య అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ అధికార పార్టీ నేతకు చెందినది కావడంతో దాన్ని తప్పించేందుకు టీడీపీ నేతలు పోలీసులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ట్రాక్టర్ను సీజ్ చేయడంలో పోలీసులు వెనుకంజ వేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చేసేది లేక పోలీసులు ట్రాక్టర్ను సీజ్ చేసినట్టు సమాచారం. -
నీ శరణిదే జొచ్చితిని!
సంగీత తపస్వి గరిమెళ్ల ● అన్నమయ్య సంకీర్తనలే జీవితం ● రాగాలద్ది.. వైవిధ్యభరితంగా జనబాహుళ్యంలోకి ● భిన్నస్వరాలతో బాణీలు ● ఆయన లేని లోటు తీర్చలేనిదంటున్న సంగీత ప్రియులు తిరుపతి కల్చరల్: సంగీత తపస్వి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. ఆయన ఆధ్యాత్మికత సుపరిమళ గుబాళింపుగా ప్రాశస్తి చెందిన అన్నమయ్య సంకీర్తనలనే జీవితంగా మలుచుకున్నారు. తన స్వర కీర్తనలతో అలరారింపజేశారు. రాగాలనద్ది, వైవిధ్యభరితంగా బాణీలు కట్టారు. భిన్నమైన స్వర ప్రయోగాలతో సాహిత్య అభిమానులను సంగీత సాగరంలో ముంచెత్తారు. తుది శ్వాస వరకు.. గరిమెళ్ల భార్య రాధ. ఆయన కుమారులు అనిల్కుమార్, పవన్ కుమార్. నిత్య సంగీతార్చనతో తన ఆధ్యాత్మిక భక్తి పారవశాన్ని చాటుకున్నారు. తుది శ్వాస వరకు సంగీతోపాన్యాసం చేస్తూ నాద యోగిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైవిధ్య బాణీలు రాగమే ధ్యాసగా.. ఆధ్యాత్మిక సంగీతమే జీవితంగా పయనిస్తూ వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలను పండిత పామర జనరంజకంగా శాసీ్త్రయ లలిత, జానపద బాణీలలో స్వరపరిచారు. అన్నమయ్య కీర్తనల సాహిత్య పరిమళలాలను విస్తరింపజేశారు. బహుళ ప్రచారంలో మోహన, హంసధ్వని, శంకరాభరణం, తోడి, కల్యాణి, మాయామాళవగౌళ రాగాలను సరళమైన పద్ధతిలో స్వరపరిచారు. అన్నమాచార్య సంకీర్తనలను భావయుక్తంగా తన గళంలో పలికించేందుకు వీలుగా ఆయా సంకీర్తనలలోని సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి దానికి తగిన రాగాలను స్వరబాణీలను సమకూర్చారు. అంతేగాక రతిపతిప్రియ, వరం, నటహిందోళం, శివరంజని, పాడి, మిశ్రవకుళాభరణం వంటి రాగాల్లో ఆయన స్వర పరిచన సంకీర్తనలు అలరింపజేశాయి. సుందరంజని, సుమశ్రీసుకామవర్థని, సుమగంధి, సునాదనంది, సత్యప్రియ, సంజీవి, సింధుప్రియ, శ్యామకాంభోజి ,వాణీప్రియ, చిత్రకల్యాణి, నిషాది, ప్రసూన, కోమలి వంటి సుమారు 20 అపూర్వ రాగాలను సృష్టించి అందులో కీర్తనలను రచించి పుస్తకాలుగా, ఆడియో రూపంలో తీసుకువచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా సప్తగిరి సంకీర్తనల గోష్టిగానాన్ని ప్రచారం చేసిన ఘనత గరిమెళ్లకే దక్కింది. స్వరం మాధుర్యం..ప్రతిభ అపారం సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి శిష్యరికంతో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మరింత రాటుతేలారు. శాసీ్త్రయ, ఆధ్యాత్మిక గాయకుడుగా గరిమెళ్ల 1978లో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడుగా ప్రవేశించారు. అపార ప్రతిభతో టీటీడీ ఆస్థాన విద్యాంసుడుగా ఎదిగారు. టీటీడీ ఆస్థాన పండితుడుగా అన్నమయ్య కీర్తనలను స్వపరపరిచి ఆలపించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరునికి సంకీర్తన నైవైద్యాన్ని సమర్పించారు. రాజమండ్రిలో 1946 నవంబర్ 9వ తేదీన కృష్ణవేణి, నరసింహరావు దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి నరసింహరావు విద్యాంసుడు. ప్రముఖ సినీ గాయని జానకి స్వయాన పిన్నమ్మ కావడంతో చిన్నప్పటి నుంచి ఆయన సంగీతం పట్ల ఆసక్తితో అంచెలంచెలుగా ఎదిగారు. చివరి దశలో తిరుపతిలో స్థిరపడ్డారు. కళా నీరాజనం గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్కు పలువురు ప్రముఖులు, కళాకారులు సోమవారం నివాళి అర్పించారు. ఇందులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్, బ్రాహ్మణ సమాజం ప్రతినిధులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు, టీటీడీ అన్నదానం డెప్యూటీ ఈవో రాజేంద్రకుమార్, డీపీపీ కార్యదర్శి, అన్నమయ్య వంశీయులు హరినారాయణదాస, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఉన్నారు. విశేష పురస్కారాలు గరిమెళ్ల చేసిన సంగీత యజ్ఞ ప్రతిభకు విశేష పురస్కారాలు వరించాయి. అన్నమాచార్య సంకీర్తన మహతి, హరికీర్తనాచార్యులతో పాటు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్యాతిక సంస్థల పురస్కార సత్కారాలు అందుకున్నారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ నుంచి డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాముల తెలుగు వర్సిటీ నుంచి విశిష్ట పుస్కారంతో పాటు రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. -
ముగిసిన జాతీయ సదస్సు
తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020పై జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా గత రెండు రోజులుగా జరిగిన జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సంస్కృత వర్సిటీ వీసీ శ్రీనివాస వర్కేడి, లాల్ బహుదూర్ శాస్త్రి సంస్కృత వర్సిటీ వీసీ మురళీమనోహర్ పాఠక్, ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం వర్సిటీ అధికారులు అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. రాష్ట్రపతి సన్మానగ్రహీత, మాజీ అకడమిక్ డీన్ కొంపెల్ల రామసూర్యనారాయణ, వర్సీటీ వీసీ లక్ష్మీశ్రీనివాస్ పాండే, పలు వర్సిటీల మాజీ వీసీలు పరమేశ్వరనారాయణశాస్త్రి, అర్కనాథ చౌదరీ, సంస్కృత సంవర్థన ప్రతిష్టానం డైరెక్టర్ చాంద్ కిరణ్ సలూజా పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో జిల్లా జట్టు విజయం
తిరుపతి ఎడ్యుకేషన్ : గుంటూరు ఏఎన్యూలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ హాకీ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ప్రతిభ కనబరిచిన తిరుపతి, సత్యసాయి జిల్లా జట్లు ఫైనల్కు చేరాయి. హోరాహోరీగా తలపడ్డ ఫైనల్ పోటీల్లో సత్యసాయి జిల్లా జట్టుపై 6–2గోల్స్ తేడాతో తిరుపతి జిల్లా జట్టు విజయం సాధించినట్టు ఏపీ హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, ఏపీ హాకీ డైరెక్టర్ నిరంజన్రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు బ్యాక్ క్రీడాకారుడు శ్రీనివాసులురెడ్డి(చంద్రగిరి), సెంటర్ హాఫ్ క్రీడాకారుడు సందీప్(గూడూరు) ఓవరాల్ ప్రతిభ కనబరిచి బెస్ట్ ప్లేయర్స్ అవార్డులను అందుకున్నారు. ప్రతిభ కనబరచిన జిల్లా జట్టు, క్రీడాకారులను జిల్లా హాకీ జట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్పర్ధన్రాజు, బీ.ఆదిత్య, కోచ్లు దీపక్ ఆకాష్, అశోక్, రమేష్, జెర్సీ స్పాన్సర్లు వీఎన్ మొబైల్స్ అప్పు, వెంకట్ అభినందించారు. -
పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక..
● విద్యార్థినుల మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు వెంకటగిరి రూరల్: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ నుంచి పరారైన విద్యార్థినుల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించిన ఘటన సోమవారం వెంకటగిరి పట్టణంలో చోటు చేసుకుంది. గూడూరు డీఎస్పీ గీతాకుమారి కథనం..స్థానిక బాలికోన్నత పాఠశాలలో చదువుతూ స్థానికంగా ఉన్న ఎస్సీ హాస్టల్కు చెందిన బాలికలు ముగ్గురు ఆదివారం హాస్టల్ నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న వెంకటగిరి సీఐ ఏవీ రమణ నేతృత్వంలో వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి ఎస్ఐలతో కూడిన మూడు మృందాలు సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ విక్రమ్, ఎస్డీపీ నాయుడుపేట పర్యవేక్షణలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొదటగా విద్యార్థినులు ఆర్టీసీ బస్సు ఎక్కి నాయుడుపేటకు చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ధ్రువీకరించారు. ఈ మేరకు సోమవారం తెల్లవారు జామన ఆ మగ్గురు విద్యార్థినులను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. పరీక్షల ఈనెల 17వ తేదీన జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఒత్తిడి కారణంగా వారు హాస్టల్ నుంచి పారిపోయినట్టు డీఎస్పీ తెలిపారు. సీఐ ఏవీ రమణ, ఎస్ఐలు సుబ్బారావు, భవాని, శివశంకర్, సీడీపీఓ శంషాద్బేగం పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తడ: జాతీయ రనహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో పూడి గ్రామానికి చెందిన ఇరుగళం వినోద్(24) మృతి చెందాడు. ఎస్ఐ కొండపనాయుడు కథనం.. పూడి గ్రామానికి చెందిన వెట్టి భాస్కర్, వినోద్ బైక్పై తడవైపు బయలు దేరారు. కొద్ది సేపటికే రోడ్డుపై వెళుతున్న మరో బైక్ను దాటే క్రమంలో అదుపు తప్పి ముందు వెళుతున్న బైక్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చుని ఉన్న వినోద్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి మృత దేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. నయా మోసం! ● క్యూఆర్ కోడ్పై నకిలీ స్టిక్కర్ అతికించిన వైనం తడ: నగదు స్కానింగ్ విషయంలో రోజుకో మోసం వెలుగులోకి వస్తోంది. తాజాగా తడలోని పలు దుకాణాల్లో కొత్త రకం మోసంతో వ్యాపారులు నష్టపోతున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల సమాచారం మేరకు.. టీ, మాంసం దుకాణాల్లో ఫోన్పే, గూగుల్ పే వంటి నగదు బదిలీల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు షాపులు బయట అతికించి ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఓ చికెన్ దుకాణం వద్ద వినియోగదారుడు నగదు బదిలీ చేసినప్పటికీ సదరు నగదు దుకాణ దారునికి చేరలేదు. దీనిపై ఆరాతీయగా అసలు స్టిక్కరుపై ఉన్న క్యూఆర్ కోడ్ వరకు కొత్తగా మరో స్టిక్కర్ ఉండడాన్ని గుర్తించారు. దుకాణ దారుడు మిగిలిన వారిని కూడా విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ క్యూర్ కోడ్ ఏ బ్యాంకుతో లింక్ అయిందో తెలుసుకునేందుకు పోలీసులు బ్యాంకులను సంప్రదిస్తున్నారు. ఇంటర్ పరీక్షకు 375 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్లో 25,107 మంది, ఒకేషనల్లో 1,037 మంది మొత్తం 26,144 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 375 మంది గైర్హాజరైనట్టు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ పరీక్షలో భాగంగా మంగళవారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో జిల్లా వ్యాప్తంగా 86పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్కు అర్జీదారులు పోటెత్తారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్తో కలిసి అధికారులు అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 265 అర్జీలు రాగా.. అందులో 172 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. సమస్యలే సమస్యలు ● గిరిజన యానాది కాలనీల్లో పలువురు పిల్లలతోపాటు పెద్దలకు ఆధార్కార్డులు లేవని ఏపీ యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బీఎల్ శేఖర్, జిల్లా కన్వీనర్ శ్రీనివాసరావు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ● కేవీబీపురం మండలం, ఎస్ఎల్పురం గ్రామంలోని స్కూల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను 2.5 కి.మీ దూరంలోని పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, వారిని కళత్తూరు పాఠశాలకు మార్పు చేయాలని కోరారు. పలువురికి ఇంటి పట్టాలిచ్చినా స్థలాలు చూపించలేదన్నారు. ● బైరాగిపట్టిడిలోని మద్యం షాపును మరోచోటుకు మార్పు చేయాలని పలువురు కలెక్టర్కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ● అవిలాల చెరువును రక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. ● వరి ధాన్యానికి గిట్టుబాటు ధర పెంచాలని పలువురు రైతులు కోరారు. అలాగే సకాలంలో బిల్లులు ఇవ్వాలన్నారు. -
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి.. రాజ్యసభలో వైఎస్సార్సీపీ డిమాండ్
ఢిల్లీ: తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు.రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. చెన్నై, బెంగళూరుకు సమాన దూరంలో ఉన్న తిరుపతికి భారీ సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు.భారీ సంఖ్యలో ప్రయాణికులను నేపథ్యంలో ఈ డివిజన్ ఫీజిబిలిటీ ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ను వరల్డ్ క్లాసు రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాలి. అన్నమయ్య జిల్లాలో నందలూరు రైల్వే స్టేషన్ వద్ద ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలి. అక్కడ 400 ఎకరాల భూమి, అవసరమైన నీరు అందుబాటులో ఉంది.వైజాగ్ రైల్వే జోన్లో వాల్తేరు జోనును సంపూర్ణంగా విలీనం చేయాలి.రైల్వే బోర్డులో ఏపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రీమియం ట్రైన్లలో సామాన్య ప్రయాణికుల కోసం ఐదు కోచ్ లు అదనంగా ఏర్పాటు చేయాలి. రైల్వే ప్రమాదాల నేపథ్యంలో ఇండిపెండెంట్ సేఫ్టీ ఆడిట్ జరగాలి.అపరిశుభ్రమైన రైలు నాణ్యతలేని ఆహారం తదితరు అంశాలపై ప్రయాణికుల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’అని కోరారు. -
రోజురోజుకీ రొయ్య ధర పతనం
● తగ్గుతున్న ఎగుమతులు ● గగ్గోలు పెడుతున్న అన్నదాతలు హార్వెస్టింగ్ చేస్తున్న దృశ్యంజిల్లా సమాచారం రొయ్య సాగుచేసే మండలాల సంఖ్య 7 సాగులో ఉన్న విస్తీర్ణం 15 వేల హెక్టార్లు ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు రూ.2 లక్షలు రైతులు 7 వేల మంది ఏటా దిగుబడి 1.5 లక్షల టన్నులు ఇందులో ఎగుమతి 90 శాతం వరకు వాకాడు: రొయ్య ధరలు రోజురోజుకీ పతనమవుతు న్నాయి. రోజుకి రూ.10 చొప్పున తగ్గిపోతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎగుమతి దారులు ప్రస్తుతం ఏ కారణం చెప్పకుండానే ధరలు తగ్గించేస్తున్నారు. దళారులు సిండికేట్గా ఏర్పడి మరింత పతనం చేస్తున్నారు. దీని వల్ల ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. గత నెల రొయ్యల ధరలతో లెక్కిస్తే రూ.4 వేల కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. ఐతే ప్రస్తుత ధరలతో అది కాస్త రూ.3.5 వేల కోట్లకు పడిపోయింది. యూటర్న్ భారతదేశం నుంచి రొయ్య ఎగుమతులు ఎక్కువుగా యూరోపియన్ దేశాలకు వెళ్తుంటాయి. యూరప్లోని 10 దేశాల్లో ఆంధ్రా రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది. ఐతే కొంతమంది రైతులు అత్యుత్సాహానికి వెళ్లి నిషేధిత యాంటీ బయోటిక్స్ సాగులో వాడడం వల్ల యూరోపియన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ నౌకాశ్రయాల ద్వారా ఎగుమతవుతున్న ప్రతి రెండు కంటైనర్లో ఒకదానికి శాంపిల్స్ తీస్తున్నారు. యాంటీ బయోటిక్స్ ఉన్నట్లు తేలితే ఎగుమతులు చేసే లైసెన్సులు రైతులు కోల్పోతున్నారు. ఐతే అమెరికా దేశానికి ఎగుమతయ్యే రొయ్య ఉత్పత్తును శాంపిల్స్ తక్కువుగా తీస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఆ దేశం వైపు మొగ్గు చూపుతున్నారు. నాసిరకం సీడ్, ఫీడ్ హేచరీలు అధిక ధరలతో నాసిరకం సీడ్ అంటగడుతున్నాయి. దీన్ని చెరువుల్లో పోసిన పది రోజులకే రొయ్య పిల్లలు విపరీతంగా చనిపోతున్నాయి. వాటిల్లో కొన్ని బతికి బయటపడ్డా అవి సమాన గ్రోత్ రావడం లేదు. వాటిని అమ్ముకుందామంటే రొయ్యల ప్రొసెస్ కంపెనీ వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి అందినకాడకి దోసుకుపోతున్నారు. ప్రొసెస్ కంపెనీ వ్యాపారులదీ అదే పరిస్థితి. మామూళ్లమత్తులో అధికారులు నాణ్యమైన సీడ్ అందేలా చూడాల్సిన కోస్టల్ ఆక్వా అథారిటీ, మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాస్తవానికి మత్స్యశాఖ అధికారులు నెలకు రెండు సార్లు హేచరీలను పరిశీలించి ఆయా యజమానులకు నాణ్యమైన సీడ్ ఉత్పత్తులపై పలు చూచనలు, సలహాలను ఇవ్వాల్సి ఉంది. ఐతే గత ఆరు నెలలుగా అలా జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు జిల్లా తీరం వెంబడి దాదాపు 45 వేల ఎక్టార్లలో ఆక్వాసాగు చేసేవారు. ప్రస్తుత 15 వేల ఎక్టార్లకు పడిపోయింది. ఆరు రోజుల్లో రూ.60 తగ్గిపోయింది రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్లుగా ఏర్పడి ఆరు రోజుల నుంచి రోజుకి రూ.10 చొప్పున రూ. 60 తగ్గించేశారు. నెల కిందట 30 పైసలు ఉన్న రొయ్య పిల్ల ఇప్పుడు 55 పైసలకు పెంచారు. నాణ్యమైన సీడ్ దొరకడం లేదు. అంతా నకిలీల మయంగా మారింది. సాగులో తీవ్ర నష్టాలు వస్తున్నాయి. – ఎస్.మధురెడ్డి, ఆక్వా రైతు, ముట్టెంబాకఒడిదుడుకులు సహజం అన్ని వ్యాపార రంగాలలో ఒడిదుడుకులు సహజం. ఆక్వా రంగంలోనూ నేడు ధరల హెచ్చ తగ్గులు సర్వ సాధారణంగా జరుగుతున్నాయి. ఎక్కడా దళారీ వ్యవస్థ, సిండకేటు వ్యవస్థ కొనసాగడం లేదు. బార్డ్ ఫ్లూ ఉన్నందున రొయ్యల ధరలు పుంజుకునే అవకాశం ఉంది. – మత్స్యశాఖ జేడీ వివరణ ఎకరాకు రూ.1.5 లక్షల నష్టం ఓ పక్క ఆక్వా పెట్టుబడులు ఆమాంతంగా పెరిగి పోయాయి. లక్షలు పెట్టుబడులు పెట్టి 95 రోజులు కష్ట పడి పండించిన రొయ్యలకు ధరలు తగ్గించేశారు. ఎకరా సాగులో దాదాపు రూ.1.5 లక్షల వరకు నష్టం వస్తోంది. – చెంగయ్య ఆక్వా రైతు పల్లెపాళెంస్టోరేజీ సౌకర్యం లేకనే.. జిల్లా నుంచి ఏటా దాదాపు 1.5 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తుంటారు. ధరలు ఆశాజనకంగా లేనప్పుడు వాటిని నిల్వ చేసుకునేందుకు సరైన స్టోరేజీలు లేకపోవడంతో ఒకటికి సగానికి తెగనమ్ముతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలోని కౌలు రైతులకు ప్రాంతాన్ని బట్టి కౌలు నిర్ణయించారు. రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు కౌలు ధర ఉంది. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే కౌలు రైతుకు చివరకు మిగిలేది అప్పులే. రొయ్య ధరలు ఇలా కౌంట్ ఫిబ్రవరిలో మార్చిలో 40 రూ.415 రూ.350 50 రూ.375 రూ.335 60 రూ.345 రూ.315 70 రూ.310 రూ.285 80 రూ.290 రూ.255 90 రూ.270 రూ.235 100 రూ.260 రూ.225 -
సేవలు..
సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం కక్షగట్టింది. వివిధ రకాల సర్వేల పేరుతో నిత్యం వేధింపులకు గురిచేస్తోంది. సెలవు రోజుల్లో సైతం శిక్షణ పేరుతో ముప్పతిప్పలు పెడుతోంది. అన్ని శాఖల పనులను వారి నెత్తిపైనే రుద్ది పొమ్మనలేక పొగబెడుతోంది. ఈ క్రమంలోనే ప్రజలకు సకాలంలో సేవలు అందకుండా అడ్డుపడుతోంది. ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన వ్యవస్థను నీరుగార్చేందుకు యత్నిస్తోంది. ఈ మేరకు సర్కారు నిర్వాకంతో జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్.. మండల కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. సులభతరంగా అందుతున్న సేవలను దూరం చేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలకుల వ్యవహారశైలి మారకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లా సమాచారం మొత్తం సచివాలయాలు 691 ఉద్యోగులు 7,405 సచివాలయాల్లో పౌరసేవలు అందే సమయంలో కలెక్టరేట్ స్పందనకు వచ్చిన అర్జీలు 2023 డిసెంబర్ 554 2024 జనవరి 801 2024 ఫిబ్రవరి 802 కూటమి ప్రభుత్వంలో కలెక్టరేట్ గ్రీవెన్స్కు వచ్చిన అర్జీలు 2024 డిసెంబర్ 942 2025 జనవరి 660 (రెండు వారాలు గ్రీవెన్స్ జరగలేదు) 2025 ఫిబ్రవరి 948సాక్షి ప్రతినిధి, తిరుపతి : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా సేవకే పెద్దపీట వేసింది. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 35 శాఖలకు సంబంధించి సుమారు 500 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధానంగా పింఛన్, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, సివిల్ పనులు, వైద్యం, ఆరోగ్యం, రెవెన్యూ సమస్యలు, భూముల సర్వే, శిశు సంక్షేమం, డెయిరీ, పౌల్ట్రీ వంటి అనేక అంశాలకు సంబంధించిన సేవలను ఆయా గ్రామాల్లోనే ప్రజలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యను పరిష్కరించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సచివాలయ సిబ్బందికి తోడుగా వలంటీర్లను నియమించింది. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేసేలా దిశానిర్దేశం చేసింది. ఫలితం ఇదీ.. సర్వేల కారణంగా సిబ్బంది పౌరసేవలకు దూరంగా ఉండాల్సి రావటంతో పశు వైద్యం మూగబోయింది. మహిళా పోలీసులను కూడా సర్వేలకు వాడుకోవడంతో పల్లెల్లో సారా, గంజాయి విక్రయాలతోపాటు బెల్టు షాపులు జోరందుకున్నాయి. సచివాలయ సిబ్బంది సర్వేలకు పరిమితం కావడంతో గ్రామస్థాయి నుంచి పైస్థాయికి సమాచారం చేరడం లేదు. కీలకంగా పనిచేయాల్సిన డిజిటల్ అసిస్టెంట్లు కూడా గట్టిగా సీట్లో కూర్చులేకపోతున్నారు. వారికి సైతం అదనపు పనులు అప్పగించడంతో ప్రజా సేవలు కుంటుపడుతున్నాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా పొలం బడిని వదిలేశారు. సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం వివిధ శాఖలకు సర్ధుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పని చేస్తున్నా.. తప్పని ఫిర్యాదులు మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టుగా తయారైంది సచివాలయ సిబ్బంది పరిస్థితి. సర్వేలు, సొంత పనులు, సేవలు తలనొప్పిని తెచ్చిపెడుతుంటే.. మరో వైపు కూటమి నేతలు మరింతగా ఇబ్బందిపెడుతున్నారు. పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులపై కావాలనే ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోవడం లేదని జులుం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఎవరి మాట వినాలో తెలియక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కలెక్టరేట్కు వినతుల వెల్లువ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 80 శాఖలకు సంబంధించి మొత్తం 3,208 అర్జీలు వచ్చాయి. ఇందులో 1,896 వినతులను పరిష్కరించారు. మిగిలిన 1,312 ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. అయితే పలు అర్జీలకు కచ్చితమైన పరిష్కారం లభించక ప్రజలు మాత్రం కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయా సచివాలయాల్లోనే సమస్యలు పరిష్కారమయ్యేవని అర్జీదారులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం వాటిని నిర్వీర్యం చేయడంతోనే వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు.కత్తిగట్టిన కూటమి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థపై కత్తిగట్టింది. పల్లె పాలనను పూర్తిగా రద్దు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా తొలుత వలంటీర్లను పక్కనపెట్టేసింది. సచివాలయ సిబ్బందిని పలు సర్వేల పేరుతో వేధిస్తోంది. గతంలోనూ సర్వేలు చేపట్టినప్పటికీ.. పౌరసేవలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ప్రస్తుతం పౌరసేవలను పూర్తిగా పక్కనపెట్టి 36 రకాల సర్వేలను సిబ్బందికి అప్పగించి ఊరూరా తిప్పుతోంది. సెలవు రోజుల్లోనూ సర్వేలపై శిక్షణ అని పిలిపించుకుంటూ ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన పనులను తమపై రుద్దుతుండడంపై సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బందిని ముప్పతిప్పలు పెడుతున్న ప్రభుత్వం నాలుగు నెలలుగా 36 రకాల సర్వేలతో ప్రజా సేవకు దూరం సమస్యలు తీర్చేవారు లేక కలెక్టరేట్, మండల కార్యాలయాలకు జనం పెరిగిన ఒత్తిడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా సర్వే అంటేనే భయపడే దుస్థితి దాపురించింది. తెల్లారితే సర్వే అని మొదలుపెడితే సాయంత్రానికి సర్వర్ డౌన్వుతోంది. రాత్రి ఇంటికి వెళ్లే సరికి సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఆపై కూడా పంచాయతీ కార్యదర్శులు సర్వేలు చేయాలి. ఎంపీ, ఎమ్మెల్యే పర్యటనకు వస్తే వారి మీటింగ్ల నిర్వహణ చూసుకోవాలి. -
తిరుమలలో విస్తృత తనిఖీలు
తిరుమల : తిరుమలలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నందకం, వకుళమాత, వరాహస్వామి అతిథిగృహాల వద్ద అనధికారికంగా వ్యాపారాలు సాగిస్తున్న 25 మంది నానల్ లోకల్, హ్యాకర్లను గుర్తించారు. నేర చరిత్ర ఏమైనా ఉందా తెలుసుకునేందుకు వేలిముద్రలు సేకరించారు. తిరుమలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకే తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అంబేడ్కర్ వర్సిటీని ఏర్పాటు చేయాలి తిరుపతి సిటీ: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీని తక్షణం ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్టడీసెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ వై మల్లికార్జున మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11ఏళ్లు పైబడినా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ నుంచి ఎక్కువ మంది యూజీ, పీజీ, డిప్లొమో కోర్సులలో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం తక్షణం వర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేణుగోపాల్రెడ్డి, ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ స్టడీసెంటర్ విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యం
చిల్లకూరు : వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ మేధావుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎస్వీ సుబ్రమణ్యంరెడ్డి ఆదివారం తాడేపల్లె నివాసంలో వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పటిష్టతకు ఎప్పటికప్పుడు సలహాలు అందించాలని సూచించారు. ఉత్తమ అంగన్వాడీగా బుజ్జమ్మ రేణిగుంట : శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె అంగన్వాడీ కార్యకర్త ఎం.బుజ్జమ్మ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. శనివారం న్యూఢిల్లీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు పురస్కారం ప్రదానం చేశారు. ఆదివారం ఈ మేరకు సీడీపీఓ శాంతిదు ర్గ, సూపర్వైజర్ మంజుల అభినందించారు. -
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : ప్రముఖ సంగీత విద్వాంసులు, శాస్త్రీయ సంగీత గాయకుడు, స్వరకర్త గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గరిమెళ్లకు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా బాలకృష్ణ ప్రసాదు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు వైఎస్ జగన్. సంగీత విద్వాంసుడిగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలనకు స్వరకల్పన చేసి.. అన్నమాచార్యుల వారి సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు వైఎస్ జగన్. -
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
సాక్షి,తిరుపతి: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. 1978 నుండి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ భౌతిక దేహానికి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాళులర్పించారు. అంనతరం భూమన మాట్లాడుతూ.. ఆయనకు మరణం వేంకటేశ్వర స్వామి భక్తులకు తీరని లోటు. అన్నమయ్య కీర్తనలను గానం చేసి నేటి తరం భక్తులకు అందించిన మహనీయుడు గరిమెళ్ళ బాలకృష్ణ మరణించడం దురదృష్టకరమని అన్నారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర,పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చిన గరిమెళ్ళ సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. -
నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ ద్రోహం: భూమన
సాక్షి, తిరుపతి జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘యువత పోరు’ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను, ప్రజలను అడ్డగోలుగా మోసగించారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ యువతకు, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చిన ప్రతి హామిని నేరవేర్చారని భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. -
తిరుపతి: విరిగిన రైలు పట్టాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
తిరుపతి జిల్లా: గూడూరు సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. గొర్రెల కాపరి గమనించి ఎర్ర టవలు కట్టడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విజయవాడ తిరుపతికి వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు ప్రమాదవశాత్తు విరిగిందా? లేక కుట్ర ఏమైనా దాగి ఉందా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. -
రేపు ఐటీఐలో అప్రెంటిస్షిప్ మేళా
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నారు. ఆ మేరకు ప్రిన్సిపాల్, కన్వీనర్ వి.శ్రీలక్ష్మీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వున్న గుర్తింపు పొందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అలాగే ఆయా కంపెనీల్లో అప్రెంటీస్ ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు అప్రెంటీస్షిప్ సలహాదారు సి.గంగాధరంను 94416 47174, 95337 17170 నంబర్లలో సంప్రదించాలని కోరారు. లక్ష్య సాధనకు నిబద్ధతతో పనిచేయాలి తిరుపతి సిటీ: మహిళలు ఉన్నత లక్ష్యసాధనకు నిబద్ధతతో అడుగు ముందుకు వేయాలని, అప్పుడే విజయం సొంతమవుతుందని మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ పేర్కొన్నారు. పద్మావతి మహిళా వర్సిటీ, మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా వే ఫౌండేషన్ సహకారంతో శనివారం సావేరి సెమినార్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా దినోత్సవం 2025 థీమ్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. స్విమ్స్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ వి.వనజాక్షమ్మ మహిళల ఆరోగ్య సంరక్షణపై వివరించారు. కార్యక్రమంలో డీన్ కొలకలూరి మధుజ్యోతి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, సుధారెడ్డి, మాజీ వైస్ వీసీ ప్రొఫెసర్ దుర్గా భవాని, ఇన్చార్జి రిజిస్ట్రార్ గీతావాణి, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య, మహిళా అధ్యయన శాఖ ఇన్చార్జి డాక్టర్ నీరజ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,127 మంది స్వామివారిని దర్శించుకోగా 22, 910 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
అంగన్వాడీల్లో అలజడి
అంగన్వాడీల్లో అలజడి మొదలైంది. అధికారులు, నేతలు బెదిరింపులకు దిగడం విమర్శలకు తావిస్తోంది.● ఆ శక్తి రూపమె! శ్రీసిటీలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. షార్ మహిళా శాస్త్రవేత్తలు, శ్రీసిటీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో నిర్వహించిన వేడుకలను మమతా సన్నారెడ్డి, తిరుపతి ఏఎస్పీ బీహెచ్ విమలకుమారి, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ సీనియర్ సైంటిస్ట్ లత ప్రారంభించారు. అనంతరం మహిళలను సత్కరించారు. శ్రీసిటీ డైరెక్టర్ నిరీషా సన్నారెడ్డి పాల్గొని ప్రసంగించారు. – సత్యవేడు– 8లో -
ఇంటర్ పరీక్షకు 651 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ పబ్లిక్ పరీక్షలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–1బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్లో 28,981 మంది, ఒకేషనల్లో 1,357 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా జనరల్లో 552 మంది, ఒకేషనల్లో 99 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐవో జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 14న స్విమ్స్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ తిరుపతి తుడా: స్విమ్స్లో అడహక్ బేసిస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 38 సీనియర్ రెసిడెన్స్ పోస్టులకు ఈనెల 14వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బట్లా తెలిపారు. హిందూ మతానికి సంబంధిచిన వారు మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులను రిజర్వేషన్, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు స్విమ్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. మెగా కార్పొరేట్ క్రీకెట్ లీగ్ ప్రారంభం తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎన్టీఆర్ స్టేడియంలో మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ టీ–20 టోర్నమెంట్ను శనివారం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు ప్రారంభించారు. పది జట్లకు పైగా పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలిరోజు కలెక్టర్ టీమ్, పోలీస్ టీమ్ తలపడ్డాయి. కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, ఆరోగ్య సంరక్షణలో కీడ్రలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. -
ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే!
ఓటేరు చెరువు కోసం శ్రీకాళహస్తి టీడీపీ నేతల మధ్య వార్ ● రూ.కోట్ల విలువచేసే చెరువును ఆక్రమించారని ఎమ్మెల్యే బొజ్జల ధ్వజం ● ఎమ్మెల్యేపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ● తిరుపతి సమీపంలోని చెరువు చుట్టూ కూటమి నేతల రాజకీయం సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటేరు చెరువు విషయమై కూటమి ప్రభుత్వంలోని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు దుమ్మె త్తి పోసుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలం, అవిలాల గ్రామ సమీపంలో ఓటేరు చెరువు ఉంది. ఈ చెరువుపై వివాదం తలెత్తడంతో జలపరిరక్షణ సమితి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 36.34 ఎకరాల విస్తీర్ణం ఓటేరు చెరువుదేనని 2006లో ప్రభుత్వం నిర్థారించినట్లు, 2013 అక్టోబర్లో ఏపీ హైకోర్టు సదరు భూమిని ప్రభుత్వ చెరువుగా ఉత్తర్వులు ఇచ్చినట్లు జలపరిరక్షణ సమితి వారు చెబుతున్నారు. ఇదే చెరువుపై గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ వివాదం తలెత్తింది. ఆ తరువాత ఓటేరు చెరువులోకి ఎవ్వరూ అడుగుపెట్టలేదు. తాజాగా మూడు రోజుల క్రితం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు భారీ వాహనాలతో మట్టి తీసుకొచ్చి చెరువుని పూడ్చివేసే ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకున్నారు. సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనలకు దిగారు. శ్రీకాళహస్తి కూటమి నేతల మధ్య వార్ ఓటేరు చెరువు ఆక్రమణకు గురవుతోందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనివెనుక శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు హస్తం ఉందని పరోక్షంగా ప్రస్తావించారు. దీనిపై మాజీ ఎమ్మె ల్యే స్పందించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే బొజ్జలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పనిలో పనిగా.. అవిలాల సర్వే నం.376లో 12.45 ఎకరాలు ఓటేరు చెరువు అని, సర్వే నం.370లో 6.70 ఎకరాలు కాలువ ఉందని, సర్వే నం.377లో 17.18 ఎకరాలు రైతుల భూమి ఉందని చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే విమర్శలపై శ్రీకాళహస్తి టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఎస్సీవీ నాయుడుపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఆ చెరువుకి.. ఈ ఇద్దరికీ సంబంధం ఏంటి? ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇద్దరిదీ శ్రీకాళహస్తి సొంత నియోజకవర్గం. చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న ఓటేరు చెరువుకు వీరిద్దరికీ ఏమిటి సంబంధం అని జిల్లాలో చర్చ సాగుతోంది. ఓటేరు చెరువు అక్రమణల వెనుక ఎస్సీవీ నాయుడు ఉన్నారని పరోక్షంగా ప్రస్తావించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి.. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ముఖ్య టీడీపీ నేత హస్తం ఉందని సీపీఐ, సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్సీవీ నాయుడికి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ప్రయోజనం జరగకుండా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి అడ్డుపడుతున్నారని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీవీకి ప్రయోజనం చేకూరితే.. భవిష్యత్లో తనకు ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యే బొజ్జల లోచన చేస్తున్నట్టు ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఓటేరు చెరువు వివాదం శ్రీకాళహస్తి కూటమి నేతల మధ్య చిచ్చురేపింది. -
మహిళా పక్షపాతి జగనన్న
తిరుపతి మంగళం : మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి అని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి కొనియాడారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు. మేయర్ శిరీష మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో పేదల సంక్షేమం, మహిళాభ్యున్నతి కోసం కృషి చేసిన ఏకై క నాయకుడు జగనన్న మాత్రమేనన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించి అన్ని రంగాల్లో ఉన్నత స్థానాన్ని కల్పించారని కొనియాడారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాధవి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఆలోచనతో మహిళలకు అన్ని రకాలుగా తోడున్న నాయకుడు జగనన్న అన్నారు. కార్పొరేటర్ ఆరణి సంధ్య మాట్లాడుతూ జగనన్న పాలనలో మహిళలు మహారాణులుగా జీవించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు అణిచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వాపోయారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మహిళా కార్పొరేటర్లు అని చూడకుండా తమపై దాడులకు తెగబడ్డారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన సూపర్సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆదిలక్ష్మి, పుణీత, శాలిని, శ్రావణి, ప్రముఖ రచయిత మస్తానమ్మ, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఆయన పాలనలోనే మహిళలకు సముచిత స్థానం కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, అత్యాచారాలు మహిళా దినోత్సవంలో వక్తలు -
మార్చి 31 వచ్చేస్తోంది?
–మీ టార్గెట్ పూర్తి చేశారా? తిరుపతి అర్బన్:‘మార్చి 31 వచ్చేస్తోంది.. మీ డిపో టార్గెట్ పూర్తి చేశారా..? అంటూ విజయవాడ, కడప ఈడీలు అప్పలరాజు, చంద్రశేఖర్ డిపోల వారీగా సమీక్షించారు. శనివారం తిరుపతి సెంట్రల్ బస్టాండ్ను పరిశీలించిన అనంతరం డీపీటీవో కార్యాలయంలో రాబడిపై డిపో అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు వచ్చిన రాబడి రూ.535 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, డీఎంలు మునిచంద్ర, భాస్కర్, ప్రశాంతి, అసిస్టెంట్ డీఎంలు, మెకా నిక్ అసిస్టెంట్లు చాందిని, పుష్పలత పాల్గొన్నారు. -
గూడ్సు రైలు ఢీకొని వ్యక్తి మృతి
నాయుడుపేట టౌన్: నాయుడుపేట రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రైలు పట్టాలు దాటుతున్న కాపులూరు మణేయ్య(48) అనే వ్యక్తిని గూడ్పు రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సూళ్లూరుపేట రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కథనం.. కల్లిపేడు గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ కాపులూరు మణెయ్య, భార్య పిల్లలతో కలిసి మండల పరిధిలోని చిగురుపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. శనివారం మణెయ్య రైల్వే స్టేపన్ చివరి ప్లాట్ఫారమ్ నుంచి నడుచుకుంటు వెళ్లి రైలు పట్టాలు దాటుతున్నాడు. చైన్నె వైపు వెళ్లే గూడ్సు రైలు అతనిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు
తిరుపతి మంగళం : ప్రతి పేదవాడికి మెండుగా సంక్షేమ పథకాలను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు జగనన్న అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంటెక్ బాబు అన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద శనివారం సత్యవేడు నియోజకవర్గ సమన్వకర్త నూకతోట రాజేష్ ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్ శిరీష సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. ఎంటెక్ బాబుకు కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సత్యవేడులో రాజేష్ అన్న గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బీరేంద్రవర్మ, పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, సత్యవేడు నియోజకవర్గ మండల నాయకులు దయాకరరెడ్డి, భానుప్రకాష్రెడ్డి, గురునాథం, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న కారు
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి తాళ్వాయిపాడు గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి గుడివాడ వెళుతున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్కుమార్(40) మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ నాగరాజు కథనం మేరకు.. సతీష్కుమార్ తన స్నేహితురాలు శిరీషాతో కలిసి కారులో బెంగళూరు నుంచి గుడివాడకు వెళుతున్నారు. మార్గ మధ్యంలో తాళ్వాయిపాడు గ్రామం వద్ద ప్రమాద వశాత్తు కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సతీష్కుమార్ మృతి చెందాడు. రక్త గాయాలైన శిరీషాను నెల్లూరు తరలించారు. మృతునికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్ బస్సును ఢీకొట్టిన లారీ నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో పెన్నేపల్లి గ్రామ సమీపంలో ఉన్న అరబిందో అపార్ట్మెంట్ వద్ద శనివారం తెల్లవారు జామును ఆగి ఉన్న ట్రావెల్ బస్సును లారీ ఢీట్టింది. ఈ ఘటనలో పర్విన్ అనే మహిళకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం.. బెంగళూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న ఎన్వీడీటీ ట్రావెల్ బస్సు మార్గ మధ్యంలో పెన్నేపల్లి గ్రామ సమీపంలో అరబిందో అపార్ట్మెంట్ వద్ద ప్రయాణికుల కాలకృత్యాల నిమిత్తం రోడ్డు పక్కగా ఆగింది. అదే మార్గంలో వెళుతున్న లారీ ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పర్విన్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన పర్విన్ను చికిత్సల నిమిత్తం నాయుడుపేటకు తరలించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
తిరుపతి క్రైం: శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్వీ యూనివర్సిటీ పోలీసుల కథనం.. సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి పద్మావతి డిగ్రీ కాలేజ్ సమీపంలో ఉన్న రైల్వే గేట్ వద్ద మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ట్రెక్కింగ్కు అనుమతుల్లేవ్!చంద్రగిరి: పనపాకం రేంజ్తో పాటు చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో అటవీ ఏనుగులు సంచరిస్తున్నాయని, అనుమతులు లేకుండా ఎవరైనా అడవుల్లోకి ప్రవేశిస్తే చర్యలు తప్పవని పనపాకం రేంజ్ డీఆర్ఓ చిన్నబాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అడవుల్లో సంచరించడం, ట్రెక్కింగ్ను పూర్తిగా నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చంద్రగిరి: రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలు రాణించాల్సిన ఆవశ్యకత ఉందని చిత్తూరు జిల్లా జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మండలంలోని ఐతేపల్లి, అగరాల పంచాయతీ సర్పంచ్లు ఫాజిలా, అగరాల భాస్కర్ రెడ్డిల అధ్యక్షతన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఐతేపల్లి ఎంపిక కావడం శుభపరిణామమన్నారు. అనంతరం మహిళా డిజిటలైజేషన్, ఇన్నోవేషన్ టెక్నాలజీలో మహిళల పాత్ర గురించి వివరించారు. తర్వాత మహిళలను వారు ఘనంగా సత్కరించారు. డీపీఓ సుశీలాదేవి, ఎంపీడీఓ శేఖర్, ఎంఈఓ లలితకుమారి, ఈఓఆర్డీ వెంకటరత్నం, ఏపీఎం గంగయ్య, మెడికల్ అధికారిణి డాక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. 15 నుంచి ఇంటర్ మూల్యాంకనం తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ చేపట్టనున్నట్టు ఆర్ఐవో జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఇది వరకే సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించి మూల్యాంకనం చేపట్టినట్లు తెలిపారు. 15వ తేదీ నుంచి సబ్జెక్టుల మూల్యాంకనానికి ఇంటర్ బోర్డు నుంచి అధ్యాపకులకు ఉత్తర్వులు రానున్నాయని తెలిపారు. ఉత్తర్వులు అందుకున్న ప్రతి అధ్యాపకుడు విధిగా స్పాట్ వాల్యుయేషన్కు హాజరుకావాలని కోరారు. -
అంగన్వాడీల్లో అలజడి
బెదిరింపులకు దిగుతున్న నేతలు, అధికారులు ● విజయవాడలో రేపు మహా ధర్నా ● ధర్నాకు వెళితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు ● ముందస్తు అరెస్ట్లకు సర్కార్ సిద్ధం తిరుపతి అర్బన్: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లలో అలజడి రేగింది. సమస్యలపై ఈనెల 10వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒత్తిడి చేస్తున్నారు. ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగానే ఇంటివద్దే అరెస్ట్లు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఓ వైపు ఉన్నతాధికారుల నుంచి.. మరోవైపు పోలీసుల నుంచి అంగన్వాడీలకు ఒత్తిడి తప్పడం లేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం ఽవిజయవాడ ధర్నాకు వెళ్లి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షంలో అలా....అధికారంలో ఇలా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు అంగన్వాడీలకు చెందిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు అప్పట్లో నారా లోకేష్ సమస్యలపై ధర్నాలు చేసుకుంటే తాము అడ్డురామని చెప్పిన విషయాలను అంగన్వాడీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నాకు వెళ్లకుండా బెదిరింపులకు పాల్పడడంపై పలువురు మండిపడుతున్నారు. 11 ప్రాజెక్టుల్లోనూ బెదిరింపులు జిల్లాలో 11 అంగన్వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టు అధికారుల నుంచి అంగన్వాడీ టీచర్లతోపాటు హెల్పర్లకు ఒత్తిడి తప్పడం లేదు. సాధారణంగా ప్రతి నెలా 25వ తేదీపైన సెక్టార్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. అయితే విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాకు అంగన్వాడీలు పిలుపునివ్వడంతో మార్చి 10న సెక్టార్ మీటింగ్ ఉందంటూ ఆయా ప్రాజెక్టుల పరిధిలోని సీడీపీవోలు సమాచారం ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. 10వ తేదీ సెక్టార్ మీటింగ్ అంట! అంగన్వాడీ చరిత్రలో ఎప్పుడూ 10వ తేదీ సెక్టార్ మీటింగ్ నిర్వహించలేదు. ప్రతి నెలా 25వ తేదీ తర్వాతే నిర్వహించేవారు. విజయవాడలో 10వ తేదీ జరిగే ధర్నాకు వెళ్లకుండా అదే రోజు సెక్టార్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. న్యాయమైన కోర్కెల కోసం పోరాటం చేస్తే తప్పేముంది. –రాజేశ్వరి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి (సీఐటీయూ అనుబంధం) బెదిరింపులకు దిగడం సరికాదు న్యాయమైన కోర్కెల సాధన కోసం ప్రశాంతంగా ధర్నా చేస్తామని ముందే అధికారులకు తెలియజేశాం. అయితే ధర్నాకు వెళ్లడం నేరంగా భావింతి ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదు. అంగన్వాడీలకు పని ఒత్తిడి పెరిగింది. వేతనం రూ.26వేలు చెల్లించాలి.– పద్మలీలా, అంగన్వాడీ వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు(సీఐటీయూ) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీన సెక్టార్ మీటింగ్ నిర్వహించనున్నాం. ధర్నాకు సంబంధించి అంగన్వాడీ నేతలు మాకు వినతిపత్రాన్ని అందించారు. బెదిరింపులు, ఒత్తిళ్లు లేవు. – వంసతబాయి, ఐసీడీఎస్, పీడీజిల్లా సమాచారం అంగన్వాడీ ప్రాజెక్టుల సంఖ్య 11 అంగన్వాడీ సెంటర్లు 2,492 అంగన్వాడీ మెయిన్ సెంటర్ల కార్యకర్తలు 2,092 అంగ్వాడీ మినీ సెంటర్ల కార్యకర్తలు 348 అంగన్వాడీ హెల్పర్లు 2,066పోరాటం తప్పదు అంగన్వాడీల న్యాయమైన కోర్కెల కోసం పోరాటం చేయాలని భావించాం. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈనెల 10వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహించనున్నాం. సెంటర్ల అద్దెలు, టీఏ, డీఏలు చెల్లించాలి. – సౌజన్య, శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు -
‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలుకళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.గోకుల బృందావనంలో పుట్టి..మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,127 మంది స్వామివారిని దర్శించుకోగా 22,910 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
No Headline
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025సత్తా చాటితే! మాది మదనపల్లి. నా పేరు డాక్టర్ వీ.సుమతి. తిరుపతిలో ఏడీఆర్, ఆర్ఏఆర్ఎస్ పనిచేస్తున్నాను. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మేము ముగ్గురం ఆడపిల్లలు, ఒక అబ్బాయి. పురుషులతో సమానంగా మా తల్లిదండ్రులు మమ్ముల్ని ఉన్నత చదువులు చదివించారు. 1984 వరకు ప్రభుత్వ పాఠశాలలోనే ఇంటర్ వరకు చదివాను. ఉన్నత విద్యను తిరుపతి అగ్రికల్చరల్ కళాశాలోనే పీజీ, పీహెచ్డీ పూర్తిచేశాను. 22 ఏళ్లు పాటు అధ్యాపకురాలిగా పనిచేశా. ఆరేళ్లపాటు రీసెర్చ్ విభాగంలో విధులు నిర్వహించా. ఇదే కళాశాలలో చదివి ఇక్కడే ఆర్ఏఆర్ఎస్కు ఏడీఆర్గా పనిచేయడం సంతోషంగా ఉంది. ‘కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు.. పడినా కూడా మళ్లీ లేస్తున్నందుకు’ అని అంటున్నారు ఈ మహిళా మణులు. ఆశయం కోసం శ్రమించారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని అడుగులు వేశారు. జీవితమనే చుక్కానికి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదురొడ్డి పోరాడారు. పురుషులకు సైతం చదువు అందని ద్రాక్షగా ఉన్న రోజుల్లోనే పీజీలు, పీహెచ్డీలు చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సమాజంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జన్మించినా సమాజంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా మణుల మనోగతం మీ కోసం .. – తిరుపతి సిటీ దృఢసంకల్పమే ఆయుధం నా పేరు వీ.ఉమ. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ వీసీగా పనిచేస్తున్నాను. మాది తెనాలి. వ్యవసాయ కుటుంబం. నాన్న రైతు. అమ్మ గృహిణి. మేము ముగ్గరం ఆడపిల్లలం. ఒక తమ్ముడు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా నాన్న తమ్ముడితో సమానంగా ఉన్నతంగా చదివించారు. ఆ రోజుల్లోనే పీజీ సోషల్ వర్క్ ముంబైలో పూర్తిచేశాను. మహిళా వర్సిటీకి 1981లో అధ్యాపకురాలుగా రూ.1,500 జీతంతో చేరాను. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. పలు అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేశాను. విదేశీ సదస్సుల్లో పాల్గొని అవార్డులు, రివార్డులు సాధించాను. వర్సిటీ రెక్టారుగా, ఇన్చార్జి వీసీగా పనిచేశాను. జీవితాన్ని చాలెంజ్గా తీసుకోవాలి మాది భాకరాపేట దగ్గర చిన్న గ్రామం. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. నాన్న రైతు. మేము నలుగురు ఆడపిల్లలం. ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవడం తక్కువ. ఆ నాడే నలుగురి ఆడపిల్లలను నాన్న చదివించారు. పద్మావతి కళాశాలలోనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. పీజీ, పీహెచ్డీ ఎస్వీయూలో చేశా. అదే కలాశాలలో అధ్యాపకురాలిగా చేరా. సుమారు 33 ఏళ్లపాటు అధ్యాపకురాలకుగా పనిచేశా. ప్రస్తుతం అదే కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేయడం ఆనందంగా ఉంది. –డాక్టర్ టీ.నారాయణమ్మ, ప్రిన్సిపల్, ఎస్పీడబ్ల్యూ కళాశాల, తిరుపతి అద్భుతం..ఆదర్శం తిరుపతి రూరల్: మండలంలోని చెర్లోపల్లి సర్పంచ్ సుభాషిణి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కఠోర శ్రమతో గ్రామరూపు రేఖలు మార్చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలో అమలు చేస్తూ అభివృద్ధికి బాటలు వేశారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు పంచాయతీ కార్యదర్శిని కూడా పరుగులు పెట్టించారు. భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తిచేసి శభాష్ అనిపించుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి వీధిలో సిమెంటు రోడ్డు, వీధి దీపాలు, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల వద్ద మొక్కలు నాటించడం, ఉద్యానవనాలు అభివృద్ధి తదితర చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.10 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఉత్తమ సర్పంచ్ అవార్డుతో సత్కరించింది. కష్టే ఫలి మాది కృష్ణా జిల్లా పామర్రు, నాన్న వెటర్నరీ డాక్టర్గా రిటైర్డ్ అయ్యారు. తల్లి గృహిణి. మేము ఇద్దరం ఆడపిల్లలం. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం సాగింది. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో శ్రమించాం. ప్రతి విద్యార్థినీ తమ సృజనాత్మక శక్తిని వెలికితీసి తాము ఎంపిక చేసుకున్న రంగంలో రాణించాలి. మనలో సత్తాలేకుంటే సమాజమేకాదు.. ఇంటిలోనూ, బంధుమిత్రుల దగ్గర గుర్తింపు ఉండదు. డాక్టర్ సీహెచ్ శ్రీలత, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఇన్చార్జి రిజిస్ట్రార్, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ న్యూస్రీల్ -
తాగునీటి సమస్యపై దృష్టి
తిరుపతి అర్బన్: వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలు లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్తోపాటు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ టీటీడీ నిధులతో చేపట్టాల్సిన ఎండీ పుత్తూరు నుంచి మంగళం వరకు తాగునీటి పైపులైన్ పనులు వేగవంతం చేయాలన్నారు. పైప్లైన్ ఏర్పాటుకు చెందిన మ్యాప్ను అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్రెడ్డి, ఏపీఐఐసీ తిరుపతి జోనల్ మేనేజర్ విజయ్భరత్రెడ్డి, డిప్యూటీ జోనల్ మేనేజర్ రాంబాబు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ శ్యామ్సుందర్, ఈఈ తులసీకుమార్ పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షకు 597 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్–2ఏ, బోటనీ–1, సివిక్స్–1 సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్లో 28,639 మంది, ఒకేషనల్లో 1,059 మంది మొత్తం 29,698మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 597మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. శనివారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–1బీ, జువాలజీ–1, హిస్టరీ–1 సబ్జెక్టుల్లో జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు. ఓటేరు చెరువును రక్షించండి తిరుపతి అర్బన్: తిరుపతి రూరల్ మండలం, జాతీయ రహదారి సమీపంలోని ఓటేరు చెరువును ఆక్రమణల నుంచి రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆయన నేతృత్వంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. పారదర్శకంగా ఉంటామని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతుంటే ఇలా చెరువులను ఆక్రమించడం ఏంటని మండిపడ్డారు. తప్పును తప్పుగానే తాము చూస్తామని వెల్లడించారు. చెరువులను కాపాడడం కోసం సీపీఐ, సీపీఎం పోరాటాలు చేస్తుంటే తమపై శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. మరోవైపు ఓటేరు సమీపంలోనే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కార్యాలయం ఉందని, ఇప్పటి వరకు ఆయన స్పందించకపోవడం సరికాదన్నారు. క్రీడలతోనే క్రమశిక్షణ సాధ్యం తిరుపతి సిటీ: ఉద్యోగుల్లో టీమ్ వర్క్, క్రమశిక్షణ క్రీడలతోనే సాధ్యమని పోస్ట్ మాస్టర్ జనరల్ కే.ప్రకాష్, 2024 క్యారమ్స్ ప్రపంచ చాంపియన్ కొమరపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక స్మార్ట్ సిటీ ఇండోర్ స్డేడియంలో జరిగిన 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. దేశంలోని 13 రాష్ట్రాల నుంచి 108పైగా ఉద్యోగులు క్యారమ్స్ పోటీలలో పాల్గొనడం అభినందనీయమన్నారు. పురుషుల ఓవరాల్ చాంపియన్స్గా తమిళనాడు జట్టు నిలవగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర దక్కించుకున్నాయి. మహిళల ఓవరాల్ చాంపియన్స్గా మహారాష్ట్ర ప్రథమ స్థానం, ద్వితీయ, తృతీయ స్థానాలలో వెస్ట్బెంగాల్, తెలంగాణ నిలిచాయి. ఉమెన్స్ సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించిన ఉద్యోగులకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్విసెస్ ఏపీ సర్కిల్ సంతోష్నేతా, మంజుకుమార్, తిరుపతి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ బీ.నరసప్ప, పోస్టల్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు -
బారికేడ్ల వితరణ
తిరుపతి కల్చరల్: నగరంలో ట్రాఫిక్ స్టేషన్కు శుక్రవారం భారతి సిమెంట్ కంపెనీ వారు 20 బారికేడ్లను వితరణగా అందజేశారు. ట్రాఫిక్ సీఐ సుబ్బారెడ్డి సమక్షంలో భారతి సిమెంట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ విజయవర్థన్రెడ్డి బారికేడ్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భారతి సిమెంట్ తిరుపతి డీలర్లు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్లో 23 కంపార్టుమెంట్లు నిండాయి. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
భూ బకాసురులు!
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతికి సమీపంలో కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. గత టీడీపీ హయాంలో ఆక్రమణకు గురైన ఇదే భూమి కోసం ఇరువర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నాయకుడు సహకారంతో ఈ భూమిని రాత్రికి రాత్రే ఆక్రమించేశారు. ముళ్ల చెట్లతో ఉన్న ప్రభుత్వ భూమిని రాత్రి సమయంలో జేసీబీలతో ఆఘమేఘాలపై చదునుచేసి మట్టితోలి చదును చేశారు. స్థానికుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం, పేరూరు గ్రామ లెక్కదాఖలు సర్వే నంబర్ 529/4ఏలో సుమారు ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు రూ.20 కోట్లకుపైనే ఉంటుంది. గత టీడీపీ హయాంలో అప్పటి ఓ ఎంపీ ఆ భూమి తనదేనని అందులోకి ప్రవేశించారు. ఈ విషయం పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. ప్రభుత్వ భూమి విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఎంపీని పిలిచి మందలించారు. అయితే ఆ ఎంపీ తన వద్ద ఉన్న పత్రాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదేవిధంగా స్థానికంగా నివాసం ఉన్న ఓ వ్యక్తి కూడా ఈ భూమి తనదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు సైతం ఈ భూమి ప్రభుత్వానిదేనని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మొత్తం భూ వివాదం న్యాయస్థానంలో నడుస్తుండగానే.. గురువారం రాత్రి పక్క పంచాయతీలో నివాసం ఉంటున్న స్థానిక కీలక టీడీపీ నాయకుడి సమీప బంధువు తన జేసీబీలతో శుభ్రం చేసి, తన టిప్పర్లతో మట్టి తోలి చదును చేశారు. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ ఆక్రమణల విషయం స్థానికులకు తెలియడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో కబ్జాదారుడిని నిలదీశారు. ఈ భూమి తనదేనని, న్యాయస్థానంలో కూడా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. తీర్పు కాపీని చూపించమని స్థానికులు నిలదీయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. రూ.20 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా! అర్ధరాత్రి చదును చేసి మట్టి తోలిన అక్రమార్కులు చంద్రగిరి టీడీపీ కీలక నాయకుడికి సమీప బంధువు దురాక్రమణ అది ప్రభుత్వ భూమి అది ప్రభుత్వ భూమి. ఆ భూమికి సంబంధించిన వ్యవహారం హైకోర్టులో నడుస్తోంది. అర్ధరాత్రి అక్రమణ జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. వీఆర్వోను పంపించాం. ఆ భూమిలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తాం. – రామాంజులు నాయక్, తహసీల్దార్, తిరుపతి రూరల్ -
కుటుంబ వ్యవస్థకు మూలం సీ్త్ర
తిరుపతి కల్చరల్: సమాజంలో కుటుంబ వ్యవస్థకు మూలం సీ్త్ర అని, మహిళల భాగస్వామ్యంతో సమాజంలో సంపదను సృష్లించవచ్చని టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్యచౌదరి తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాళ్లు రంగశ్రీ, జానకీదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ప్రముఖ వైద్యరాలు డాక్టర్ రేఖ మాట్లాడుతూ ఎవరి జీవితానికి వారే కర్త, కర్మ, క్రియలని చెప్పారు. ప్రముఖ వక్త రాజేశ్వరి మాట్లాడుతూ హైందవ సనాతన సంస్కృతిలో మహిళకు విశేషమైన స్థానం ఉందన్నారు. హైదరాబాద్ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలాలత, అర్జున్ అవార్డు గ్రహీత జీవనజీదీప్తి మాట్లాడుతూ ఆశయం బలంగా ఉండాలని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలంస్తున్న 12 మంది మహిళా ఉద్యోగులను సన్మానించి, 5 గ్రామలు వెండి డాలర్, శ్రీపద్మావతి అమ్మవారి జ్ఞాపిక అందజేశారు. అలాగే ఈ ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న 63 మంది మహిళా ఉద్యోగులను సత్కరించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల బృందం ప్రదర్శించిన భరతనాట్యం, వీణ వాయిద్య కచేరి ఆకట్టుకుంది. డీఎల్ఓ వరప్రసాద్, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ ఆనందరాజు, బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ ప్రశాంతి, పలువురు మహిళా డెప్యూటీ ఈఓలు పాల్గొన్నారు. -
No Headline
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఐతేపల్లి చంద్రగిరి: మండలంలోని ఐతేపల్లి సర్పంచ్ ఫాజిలా కృషికి విశిష్ట గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ ప్రాజెక్టు కింద ఐతేపల్లి పంచాయతీ ఎంపికై ంది. ఇప్పటికే పంచాయతీలో సుమారు రూ.కోటి వరకు వెచ్చించి రోడ్డు నిర్మాణం, ఆర్వో ప్లాంటు, రూ.7 లక్షలతో క్రీడా మైదానం సుందరీకరణ, పులిత్తివారిపల్లి జగనన్న కాలనీ, మామండూరు జగనన్న కాలనీ, ఎర్రగుట్టపల్లిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టారు. పులిత్తివారిపల్లి శ్మశానానికి బీటీ రోడ్డును నిర్మించారు. ఐతేపల్లి జగనన్న కాలనీలో జల్జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ కొళాయి కనెక్షన్, గత ప్రభుత్వంలో తుడా నిధుల కింద సమావేశ మందిరాలు, సచివాలయ నిర్మాణాలు, కాలువల నిర్మాణాలు చేపట్టారు. – ఫాజిలా, ఐతేపల్లి సర్పంచ్ వనిత... జాతీయ ఘనత రేణిగుంట : శ్రీకాళహస్తి మండలం, జగ్గరాజుపల్లికి చెందిన ముసలిపాటి బుజ్జమ్మ స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమె 18 ఏళ్ల కృషికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో కీర్తిని తెచ్చిపెట్టింది. చిట్టి మెదళ్లలో గట్టి పునాది వేసింది. ఆమె సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా అవార్డుకు ఎంపిక చేసింది. శనివారం దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. ఆమెకు ఆమె భర్త వీరరాఘవులు, కుమార్తె పూజిత, కుమారుడు రాఘవేంద్రకుమార్ ఉన్నారు. పూర్వపాఠశాల స్థాయి చిన్నారులతో మమేకమవుతూ వారిలో చదువుల జ్ఞానానికి సంబంధించి బలమైన పునాధి వేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ వాటిక’ పథకం ద్వారా పాఠశాల ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు సేంద్రియ ఎరువులతో ఆరోగ్యకరమైన సమతుల పోషకాహారాన్ని అందిస్తోంది. నెలలో రెండుసార్లు విధిగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి పిల్లల అభ్యసన పురోగతికి ప్రేరణ కలిగిస్తోంది. పాఠశాలలో 25 మంది పిల్లలు చదువుతున్నారు. జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా అవార్డుకు బుజ్జమ్మ ఎంపికవడం తమకెంతో గర్వకారణమని శ్రీకాళహస్తి సీడీపీవో శాంతిదుర్గ, సూపర్వైజర్ మంజు తెలిపారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, టాస్క్ పోర్సు: గూడూరు సబ్కలెక్టరేట్ ఆవరణలో ఓ మహిళ తనకు న్యాయం చేయాలని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిపాలైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కొడవలూరు మండలం, రావూరు గ్రామానికి చెందిన ఆమె చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామంలో బంధువుల వద్ద మూడు ఎకరాల భూమిని పదేళ్ల క్రితం కొనుగోలు చేసింది. ఈ భూమిని తన పేరు మీద రికార్డుల్లో మార్చాలని రెవెన్యూ అధికారులకు విన్నవించింది. ఆ భూమి చుక్కల భూమిగా నమోదైందని చెప్పడంతో ఆమె మరొకరికి లీజుకు ఇచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వం చుక్కల భూములను తొలగించడంతో ఆమె కొనుగోలు చేసిన భూమిని కూడా విడుదల చేశారు. ఆ సమయంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిని మరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో సబ్ కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఎస్సీవీ నాయుడు విమర్శలు విడ్డూరం
తిరుపతి కల్చరల్: ఓటేరు చెరువు కబ్జాను అడ్డుకున్న వావపక్ష నేతలపై మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అనుచిత వ్యాఖ్యాలు చేయడం విడ్డూరమని వామపక్ష, ప్రజాసంఘా నేతలు ఽతెలిపారు. శుక్రవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, ఆర్పీఐ దక్షిణాది అధ్యక్షుడు పి.అంజయ్య, రైతు సంఘ నేత మాంగాటి గోపాల్రెడ్డి, సీఐటీయూ జిల్లా నేత కందారపు మురళి మాట్లాడారు. ఓటేరు చెరువును కబ్జాను కమ్యూనిస్టు నేతలుగా తాము పరిశీలించి అడ్డుకోవడం జరిగిందన్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకొని చెరువును కాపాడాలని డిమాండ్ చేశామన్నారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆ భూమి తనదని, కమ్యూనిస్టులు తన చుట్టూ తిరిగారని అనుచిత వ్యాఖ్యాలు చేయడం తగదన్నారు. తక్షణం తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
రెవెన్యూ పని తీరుపై ఆర్డీఓ అసహనం
చంద్రగిరి: మండలంలో రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆర్డీఓ రామ్మోహన్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక సమావేశమయ్యారు. భూ సమస్యలు, రెవెన్యూ దర ఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో జోరుగా ఇసుక అక్ర మ రవాణా, గ్రావెల్ దందా, ఇసుక డంపులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఆయనకు ఫిర్యా దులు అందాయి. వాటికి సంబంధించి సిబ్బంది నుంచి వివరాలు కోసం ఆరాతీశారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన మండిపడ్డారు. ఇంతలో ఓ వీఆర్ఓ తహసీల్దార్ అనుమతులు ఇచ్చారంటూ తెలపడంతో, ఆయనకు ఫోన్ చేసి వివరాలను కనుక్కోమని సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ స్పందిస్తూ అనుమతుల గడువు ముగిసినట్లు తెలపడంతో ‘మీరు ఏ మాత్రం పనిచేస్తున్నారో తెలుస్తోంది’ అంటూ ఆగ్రహించారు. నాగయ్యగారిపల్లిలో ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. తాను ప్రతి వారం ఆకస్మిక తనిఖీ చేస్తానని, అధికారుల పనితీరులో అలసత్వం కనిపిస్తే ఉపేక్షించేంది లేదని ఆయన స్పష్టం చేశారు. -
● టాటా ఏసీ వాహనం ఢీకొని ఇద్దరు వలస కూలీల మృతి ● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
దూసుకొచ్చిన మృత్యువు రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్)/ పెళ్లకూరు: పొట్ట కూటి కోసం వలస వచ్చిన కూలీల పైకి టాటా ఏసీ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం.. రేణిగుంట మండలం, గాజులమండ్యం పోలీస్ స్టేషన్ సమీపంలోని నాయుడుపేట– పూతలపట్టు జాతీయ రహదారి, యోగానంద కాలేజీ నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జి పై కూలీలు రమణమ్మ, తిరుపాల్, సరోజమ్మ, సక్కమ్మ, శైలజ పనిచేస్తున్నారు. అదే సమయంలో ఓ టాటా ఏసీ వాహనం వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమణమ్మ(41), తిరుపాల్(50) మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు –12 మంది గాయాలు పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి కొత్తూరు గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు.. రోడ్డు అభివృద్ధి పనుల చేసే కూలీలను తరలించే ట్రాక్టర్ కొత్తూరు గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆపి ఉంచారు. తిరుపతి నుంచి కర్నూలు, శ్రీశైలం వెళ్లే గూడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నాయుడుపేటకు తరలించారు. వీరిలో తీవ్ర గాయాలైన పెమ్మసాని పద్మ, సుబ్బరాజు, నాగరత్నమ్మను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పంబలేరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం గూడూరు రూరల్: గూడూరు రూరల్ పరిధిలోని పురిటిపాళెం సమీపంలో ఉన్న పంబలేరు కాలువలో గుర్తు తెలియన వ్యక్తి మృత దేహాన్ని గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మనోజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి 30–35 సంవత్సరాలు ఉంటాయన్నారు. నల్ల ప్యాంటు, తెలుపు, పసుపు రంగలు షర్టు వేసుకున్నట్టు వెల్లడించారు. రెండు రోజుల క్రితం మృతిచెంది ఉండొచ్చని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. -
గంజాయి బ్యాచ్ అరెస్ట్
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంటలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను అర్బన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట పోలీసుల కథనం మేరకు.. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో శుక్రవారం అర్బన్ సీఐ శరత్ చంద్ర, ఎస్ఐ అరుణ్కుమార్రెడ్డి ప్రభుత్వ బాలుర హైస్కూల్ పక్కన హిందూ శ్మశాన వాటిక వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గంజాయి విక్రయిస్తున్న వినాయక్ నగర్కు చెందిన కాజేరిరాజు(21), పాంచాలి నగర్కు చెందిన కాజేరి రాము(20), రాము మదన్ (21), అడపాల సాయిప్రసాద్ (27), ఏఎన్ఆర్ కాలనీకి చెందిన గురవయ్య(20)ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై వారి వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. వారిపై పలు కేసులు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రిమాండ్ విధించారు. -
గందరగోళం.. దా‘రుణం’!
చంద్రగిరి: రాష్ట్ర ప్రభుత్వం కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, బీసీ, బ్రాహ్మణ, వైశ్య కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు అందిస్తున్న రుణాల ఇంటర్వ్యూల్లో గందరగోళం నెలకొంది. శుక్రవారం ఉదయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు అధికారులు, బ్యాంకర్లు సంయుక్తంగా ఇంటర్వ్యూలను నిర్వహించారు. మండలంలోని ఏడు బ్యాంకులకు 68 యూనిట్లను టార్గెట్గా ప్రభుత్వం కేటాయించింది. రుణాల కోసం వచ్చిన లబ్ధిదారులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలను నోటీసు బోర్డులో ఏర్పాటు చేయలేదు. ఇదిలావుండగా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చంద్రగిరి ఎస్బీఐ, ఎస్బీఐ(ఏడీబీ), బీఓఐ బ్యాంకుల అధికారులు హాజరు కాలేదు. 562 మంది దరఖాస్తుదారులకు గాను 450 మంది హాజరు కాగా, 112 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నానానికి ఇంటర్వ్యూలను మమ అనిపించారు. వెనక్కి ఇచ్చేసిన బ్యాంకర్లు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కొంత మంది లబ్ధిదారుల దరఖాస్తు ఫారాలను తిరిగి ఇచ్చేయడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ దరఖాస్తులు తమ బ్యాంకుకు సంబంధం లేదంటూ సంబంధిత అధికారులు తేల్చిచెప్పారు. దీంతో చేసేది లేక లబ్ధిదారులు నిట్టూర్పులు వెళ్లగక్కుతూ ఇళ్లకు చేరారు. -
తిరుమల మొదటి ఘాట్లో ఏనుగుల గుంపు
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో శుక్రవారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించింది. ఘాట్లోని ఏడో మైలు వద్ద రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. వెదురు చెట్లను ధ్వంసం చేశాయి. ఇదే ప్రాంతంలో గురువారం రాత్రి కూడా ఏనుగులు సంచరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వేసవి ప్రారంభ దశ కావడంతో నీటి కోసం వస్తున్నాయా, వెదురు చెట్ల కోసం వస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్ లో ఏనుగుల సంచారం -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
చంద్రగిరి: ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమై ట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన ఓ యువ నాయకుడిది కావడం గమనార్హం. దీంతో సదరు ట్రాక్టర్ను పోలీసు శాఖలోని ఓ అధికారి తప్పించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. తిరుపతి రూరల్ మండలం, మల్లవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సురేష్ కుమారుడు చాణక్య(25) శుక్రవారం రాత్రి మల్లయ్యపల్లి నుంచి తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. అదే సమయంలో చంద్రగిరి నుంచి మల్లయ్యపల్లి మార్గంలో ఇసుక ట్రాక్టర్ వేగంగా వస్తూ ఇందిమ్మ కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో చాణక్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఇసుక ట్రాక్టర్ చంద్రగిరి పట్టణానికి చెందని టీడీపీలోని ఓ యువనాయుకుడిదిగా గుర్తించారు. అధికార బలంతో ఆ యువ నాయకుడు ఘటనా స్థలం నుంచి ట్రాక్టర్ను తప్పించినట్లు తెలుస్తోంది. రాత్రి 10.30 గంటలైనా పోలీసులు ట్రాక్టర్ను స్టేషన్కు తరలించలేదు. ట్రాక్టర్ను తప్పించి, మరొక ట్రాక్టర్ను చూపించేందుకు అధికార పార్టీ నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎస్ఐ అనితను వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్లో ప్రయత్నించగా ఆమె స్పందించ లేదు. అనంతరం సీఐ సుబ్బరామిరెడ్డిని వివరణ కోరగా.. చంద్రగిరికి చెందిన టీడీపీ నాయకుడి సోదరుడి ట్రాక్టర్గా గుర్తించామని, ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను స్టేషన్కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
● ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్తిరుపతి మంగళం : కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో రూ.35 లక్షల విలువ చేసే 34 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. టాస్క్ఫోర్స్ హెడ్ ఎల్.సుబ్బారాయుడు, టాస్క్ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ జీ.బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ పీ.నరేష్ టీమ్ శుక్రవారం బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది. సి.రామాపురం సమీపంలో ఎద్దులబోడు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. దాంతో సిబ్బంది వెంబడించి వారిని పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 34 ఎరచ్రందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నుంచి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. వీటి విలువ రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఫీ తెలిపారు. -
జాతీయ స్థాయిలో ఎస్వీయూ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: ఉత్తరప్రదేశ్ నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ వేదికగా ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ విశ్వవిద్యాలయాల సాంస్కృతిక పోటీలలో ఎస్వీయూ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఓవరాల్ ఛాంపియన్స్గా రెండో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. వర్సిటీ కల్చరల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, ఆచార్య మురళీధర్ నాయకత్వంలోని వర్సిటీ విద్యార్థుల బృందంలోని ప్రతిభ చూపిన వారిలో మోడలింగ్ విభాగంలో కె.తేజ ప్రథమ స్థానం, ఇన్స్టలేషన్లో ఆర్.మౌనిక, డి.దేవా రెండో స్థానం, మెహందీలో ఎస్ సంధ్య, దీప్తి రెండో స్థానం, రంగోలిలో వీరాంజనేయులు రెండో స్థానం, పోస్టర్ మేకింగ్లో దేవా మూడో స్థానం సాధించారు. వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, అధ్యాపకులు ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. సత్తాచాటిన మహిళా వర్సిటీ విద్యార్థినులు నోయిడా యువజనోత్సవాలలో పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థినులు ఫైనార్ట్స్ విభాగంలో మూడో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. కల్చరల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శైలేశ్వరి ఆధ్వర్యంలో పోటీలలో పాల్గొన్న విద్యార్థుల బృందం పలు విభాగాలలో సత్తా చాటింది. ప్రధానంగా మైమ్స్ విభాగంలో ప్రత్యూష, మౌనిక, భాను, చంద్రజ్యోతి, మీనాభాను, శివాని, కీర్తి సత్తా చాటగా, స్కిట్ విభాగంలో నీలిమ, సత్య భార్గవి, సువర్ణేశ్వరి, సాత్విక, నిహారిక విజేతలుగా నిలిచారు. విద్యార్థినులను వీసీ ఉమ, రిజిస్ట్రార్ రజిని, అధ్యాపకులు అభినందించారు. -
అత్త దారుణ హత్య
తిరుపతి క్రైం : నగదు కోసం అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ సీఐ మురళీమోహన్, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రావారిపాళెం మండలం, బండమీద కమ్మపల్లికి చెందిన ప్రమీలమ్మ(60) తన భర్త గోపాల్రెడ్డితో కలిసి గత 30 ఏళ్లుగా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉండేది. ఈ మధ్య కాలంలో ప్రమీలమ్మ చింతకాయల వీధిలో పాచి పనులు చేసుకుంటూ అదే ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆమె భర్త మేస్త్రి పనిచేసుకుంటూ పీపీ చావడిలో నివాసముండేవాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శుక్రవారం ఉదయం డెంటల్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న ఆమె చిన్న కూతురు రోజా వద్దకు వెళ్లింది. కుమార్తె డ్యూటీలో ఉండడంతో కోలా వీధిలోని చిన్న గుంటలో ఉన్న ఇంటి తాళాలను వారి అమ్మకి ఇచ్చి పంపించింది. దీంతో ఇంటికి వెళ్లిన ప్రమీల అక్కడ ఏమైందో ఏమో గానీ రోజా వచ్చి చూసే సరికి నోట్లో రక్తం వచ్చి కింద పడిపోయి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఇదిలా ఉంటే చుట్టుపక్కల స్థానికులు మాత్రం రోజా రెండవ భర్త రవినాయక్(డ్రైవర్ గా పనిచేస్తున్నాడు) అత్త ప్రమీలతో నగదు కోసం గొడవపడి.. ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. గొంతు నిలిమి చంపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న నగదు కోసమే హత్య చేసి ఉంటాడని చెబుతున్నారు. మందుబాబుల వీరంగం తడ: మధ్యం కోసం కలిసి వచ్చి, మత్తు ఎక్కాక ఓ మిత్రుడు మరో మిత్రుని తలపై బీరు బాటిల్తో దాడి చేసి గాయపరిచిన ఘటన తడలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. వరదయ్యపాళెం మండలం, పులివెల్లం గ్రామానికి చెందిన ముని సమీప గ్రామానికి చెందిన వినోద్తో కలిసి తడలో శ్రీకాళహస్తి మార్గంలో ఉన్న మద్యం దుకాణానికి వచ్చారు. అక్కడ మద్యం సేవించి మత్తులో ఉన్న వినోద్ సమీపంలో ఉన్న ఖాళీ బీరు బాటిల్తో ముని తలపై కొట్టాడు. భయపడ్డ వినోద్ అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై పోలీసులకు ఎలాంటి ిఫిర్యాదు అందలేదు. -
‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..!
విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. భార్య, చిన్నకుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో ఆటో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తన కళ్లెదుటే తల్లిదండ్రులు కన్నుమూయడం ఆ బాలిక మనసును కలచివేసింది. తన గాయాలు లెక్కచేయక అమ్మా..నాన్నా..! మాట్లాడండి నాన్నా..? అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో బాలిక ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న చెల్లిని, విగత జీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసి గుండెలు బాదుకున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.సైదాపురం/తిరుపతి: ‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! అంటూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమార్తె, ఆమె అక్క రోదించడం స్థానికంగా కలచివేసింది. సైదాపురం – తిప్పవరపాడులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా.. చిన్న కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, గూడూరు రూరల్ పోలీసుల వివరాల మేరకు.. శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, సైదాపురానికి చెందిన దొడ్డగ మునెయ్య బట్టల దుకాణం నడుపుకుంటున్నారు. భార్య జ్యోతి టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉండేది. ఈ క్రమంలో వారికి నిహారిక, వైష్ణవి ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. వారు స్థానిక పాఠశాలల్లో 8, 7 తరగతులు చదువుకుంటున్నారు. మునెయ్య బంధువులు కోట మండలంలోని విద్యానగర్లో ఉండడంతో వారి వద్దకు వెళ్లేందుకు భార్య జ్యోతి, చిన్న కుమార్తె వైష్ణవిని తీసుకుని స్కూటీపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో సైదాపురం నుంచి గూడూరు వైపు వస్తున్న ఆటో స్కూటీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మునెయ్య, జ్యోతిలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు కళ్లెదుటే దుర్మరణం చెందడంతో బాలిక్ షాక్కు గురైంది. అమ్మా..నాన్న వెళ్లిపోయారా..అంటూ కన్నీటిపర్యంతమవడం స్థానికులను కలచివేసింది.