breaking news
Tirupati
-
బాబు, పవన్ రాక్షసుల కంటే నీచం: భూమన
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను దెబ్బతీయడానికే చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతున్నదని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారికి సేవ చేయాలనే తపనతో జగన్ అడుగులు వేశారని, అయితే తిరుమల లడ్డూలో వాడే నెయ్యి మీద మీద వారు లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. వైఎస్ జగన్ యజ్ఞం చేస్తుంటే చంద్రబాబు రక్తం పోస్తున్నారని భూమన పేర్కొన్నారు. తమ మీద ఆరోపణలు చేయడం తప్ప ఏమి చేశారని నిలదీశారు. చంద్రబాబు, పవన్ రాక్షసుల కంటే నీచమని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు దేశంలోని హిందువులు మనోభావాలు దెబ్బతీయడానికి కుట్రలు చేశారని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సిట్ తన నివేదికలో యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టం చేసింది. అధికారులు, డెయిరీ నిర్వాహకులు కుమ్మక్కు అయి కల్తీ చేశారు అని నివేదిక పేర్కొన్నదన్నారు. 2019-24 వరకు సిబిఐ విచారణ చేయాలని సుప్రీం కోర్టు కు వెళ్లింది మాజీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అని భూమన పేర్కొన్నారు.చంద్రబాబు సిట్ నివేదిక ఇచ్చి ఉంటే152 దేశ ద్రోహం కింద కేసు పెట్టారు. సుబ్బారెడ్డి సుప్రీం కోర్టు లో వాస్తవాలు వెలికి తీసేందుకే వెళ్ళారు. మీకు ధైర్యం ఉంటే 2014 -19 సీబీఐ విచారణ కోరే దమ్ము ఉందా అని భూమన ప్రశ్నించారు. 2013 నుంచి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ నే టిటిడి కు నెయ్యి సరఫరా చేసింది.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. 2021 లో కేంద్రం ఆదేశాలు మేరకే టెండర్ నిబంధనలు మార్పులు చేశాం. స్టార్ అప్ కంపెనీలు ప్రోత్సహించాలని కేంద్రం కోరిందన్నారు. సీబీఐ నివేదికలో చాలా స్పష్టంగా తేలిపోయిందని, అధికారులు, డైరీ యజమానులు లాలూచీ పడటం వల్ల జరిగింది అని సీబీఐ తేల్చిందని భూమన పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు చేప కొవ్వు, పంది కొవ్వు ఎక్కడ వాడలేదు అని సీబీఐ తెలిపిందన్నారు. ఒక ఆవుకూడా లేని సంస్థ ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోంది. ఎడీడీబీ చైర్మన్ ను పిలిపించి 50 కోట్ల నిధులతో , గిర్,సాహివాల్ ఆవులు ద్వారా పెయ్యా దూడలు పెంచే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ఎన్డిడిబి ద్వారా బీటా స్టెరాలసిస్ టెస్టు లకు అత్యాధునిక మెషీన్లు మా హయాం లో కొనుగోలు చేశాం. నెయ్యి ప్రామాణికత మెరుగు పర్చడానికి 5.కోట్ల50 లక్షలు నూతన యంత్రాలు మేము కొనుగోలు చేశాం. విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర 2013 నుంచి సాంకేతిక నిపుణులు గా ఉన్నారు..వీళ్లు దోషులు అని సీబీఐ తేల్చిందని భూమన తెలిపారు.యజ్ఞం చేస్తున్నది జగన్ మోహన్ రెడ్డి, రక్తం పోస్తున్నది పవన్ కళ్యాణ్, చంద్రబాబు అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌరవ్ బోరా అనే బోర్డు సభ్యుడు నెయ్యి సరఫరా చేస్తున్నారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తమ స్వార్థం కోసం 140 కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. నాలుడుట్యాంకర్ లు తిరస్కరించినవి మళ్ళీ కొండకు వస్తె, తిరిగి మళ్ళీ కల్తీ నెయ్యి ను లడ్డూ తయారీకి వాడారు..దీనికి సమాధానం చెప్పాలని భూమన నిలదీశారు. మా పాలనలో 18 ట్యాంకర్ లు రిజెక్ట్ అయ్యాయి. మీ హయంలో 14 ట్యాంకర్ లు రిజెక్ట్ అయ్యాయి. 2024 సెప్టెంబర్ 24 మళ్ళీ అదే నెయ్యి కల్తీ అయ్యిందని చంద్రబాబు ప్రచారం చేశారు. ఏడాదిన్నర గా నెయ్యి కల్తీ చేశారని, మతం రెచ్చగొట్టి, హిందువులు రెచ్చ గొట్టారు. పదవి పొందడం కోసం పాతాళం కన్నా కిందికి దిగజారారు. పవన్ కళ్యాణ్ పాప పరిహారం కోసం అమరావతి నుంచి తిరుపతి వరకురోడ్లు కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకోవాలని భూమన డిమాండ్ చేశారు. -
తిరుమలలో మరో అపచారం..
సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి ప్రభుత్వంలో తిరుమలలో వరుస అపచారాలు వెలుగు చూస్తున్నాయి. టీటీడీ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తిరుమలలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట ఫోటో షూట్ చేయడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల మేరకు.. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట ఫోటో షూట్ తీసుకున్నారు. గొల్లమండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు తీసుకున్నారు. ముద్దులు కూడా పెట్టుకున్నారు. సదరు జంట ఇలా ఫొటోలు, వీడియోలు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు టీటీడీ భద్రతా సిబ్బందిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
జనసేన నాయకుల ఇసుక దోపిడీ
కలువాయి(సైదాపురం): రాజుపాళెంలోని పెన్నా పరివాహక ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి వెంకటరెడ్డి, ఇతర జనసేన నాయకులు అక్రమంగా ఇసుకను తరలించేశారు. సిమెంట్ రోడ్లు నిర్మాణం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా వారి ఇష్టానుసారంగా పెన్నా నదికి తూట్లు పొడుస్తున్నారు. పగలు అయితే గ్రామస్తులు అడ్డగిస్తారని అర్ధరాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. తరలించిన ఇసుకను డంపింగ్ చేసి పెట్టుకున్నారు. తెలుగు రాయపురంలో టీడీపీ నేతలు, రాజుపాళెంలో జనసేన ఇలా పెన్నా పరివాహక ప్రాంతంలో ఇసుకను తరలించేందుకు వాటాలు పంచుకుంటున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఆర్టీసీ కార్గో ఏజెన్సీకి అవకాశం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: చంద్రగిరి, పాకాల, రంగంపేట, పాపనాయుడుపేట, ఏర్పేడు, తడ, శ్రీసిటీ, నాగలాపురం, మేనకూర్ సెజ్ ప్రాంతాల్లో ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ఏపీబీ(ఆథరైజ్డ్ పార్సెల్ బుకింగ్) ఏజెన్సీ నిర్వహణకు అవకాశం ఉందని కమర్షియల్ ఏటీఎం తెలిపారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ తీసుకొని కార్గో వ్యాపారం చేయడానికి ఆసక్తి గలవారు డిపాజిట్ చెల్లించాలన్నారు. అందుకుగాను బుకింగ్ నెట్ అమౌంట్కి 15 పర్సెంట్ రిసీవింగ్కి 2 పర్సెంట్ కమీషన్ లభిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు ఏటీఎం కమర్షియల్ తిరుపతి 73311 47268 లేదా పురుషోత్తం 95538 55667 నెంబర్లను సంప్రదించాలని కోరారు. సత్వర సేవలే లక్ష్యం తిరుపతి కల్చరల్: డిజిటల్ పద్ధతిలో అత్యాధునిక సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా ఎంఎన్వీ కేర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎంఎన్వీ సొల్యూషన్స్ ఎండీ ఎంఎన్.వెంకటేష్ తెలిపారు. అశోక్నగర్లోని తమ కార్యాలయంలో ఎంఎన్వీ కేర్ యాప్ను బీఎస్ఎన్ఎల్ డీజీఎం వెంకోబారావు బుధవారం ఆవిష్కరించారు. యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. -
ఇక యుద్ధమే..
చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో గత రెండేళ్లుగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇక యుద్ధం మొదలుపెడతాం.. ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్న అవినీతిని ప్రజల ముందు పెడతాం.. రాష్ట్రంలో వున్న 175మంది ఎమ్మెల్యేల్లో పులివర్తి నాని అంత అవినీతి పరుడు మరెవ్వరు లేరని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రగిరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని అవినీతిపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యేగా నాని ఒకటిన్నర సంవత్సరంలో రూ.300 కోట్లు అవినీతికి పాల్పడ్డారని, ఎక్కడెక్కడ ఎంత సంపాదించారు, ఏయే భూములు కాజేశారన్న వివరాలు త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ హెడ్ ఆఫీసుల నుంచి కూడా విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.. అనునిత్యం దోచుకో.. దాచుకో.. అన్నట్టుగా ప్రకృతి వనరులను దోచేస్తున్న నాని తాను నీతిమంతుడనని కబుర్లు చెప్పుకుంటూ నిజాయతీగా బతికే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రూ.300 కోట్ల అవినీతి గడిచిన ఒకటిన్నర సంవత్సరంలో రూ.300 కోట్లు చంద్రగిరి ఎమ్మెల్యే అవినీతితో సంపాదించారని ఆరోపించారు. తమ వద్ద కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెవిరెడ్డి మోహిత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా చేయించి అందులో వాటాలు తీసుకోలేదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఆయన గెలవగానే మొదటగా తాను అభినందించానని, ప్రజలు అవకాశం ఇచ్చారు బాగా పరిపాలన చేయమని కోరుకున్నట్టు తెలిపారు. ఒక ఏడాదిన్నర లోపు ఇంత అవినీతి చేస్తారని, ప్రజలను ఇంతలా పీడిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ప్రతిరోజు ఎమ్మెల్యే నాని ఇంటికి అవినీతి సొమ్ము రాకపోతే వారికి నిద్ర పట్టదని, ఎంత దోచేసినా ప్రజలకు సాయం చేయడానికి మనస్సు రాదన్నారు. చంద్రగిరిలో జరిగే అవినీతి, అక్రమాలపై పోరాడుతాం... కాణిపాకంలో ప్రమాణం చేయగలరా? అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతికి పాల్పడ లేదని ఆయన కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. నిజాయతీగా భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసి ఆ సంపాదనలో 90 శాతం ప్రజలకే ఖర్చు పెట్టిన చెవిరెడ్డి కుటుంబంపై నిందలు వేయడం మంచిది కాదని హెచ్చరించారు. రాజకీయాల్లో అత్యధిక శాతం ప్రజల కోసమే బతికిన తన తండ్రి చెవిరెడ్డి చేసిన సాయాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తు చేసుకుంటుంటారని తెలిపారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిని అడుగుతుంటే సాయం చేయడం చేతకాక చేసిన వారిపై అపనిందలు వేస్తున్నారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఒక అవినీతి తిమింగలంగా మారారని, ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా కబ్జా చేసేస్తున్నారని ఆరోపించారు. లాలూచీ పడడం తెలియదు.. అందుకే జైలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోరాటం చేయడం తప్ప అధికార పార్టీ నేతలతో లాలూచీ పడడం తమకు తెలియదన్నారు. ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేయడంతోనే మద్యం అక్రమ కేసులో తన తండ్రి చెవిరెడ్డిని జైలుకు పంపారన్నారు. ఆ విషయం ప్రజలు అందరికీ తెలుసనన్నారు. అవసరానికి కాళ్లు పట్టుకోవడం అవసరం తీరాక నిలువునా ముంచేయడం ఎమ్మెల్యే నానికి తెలిసినంత తమకు తెలియదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఎవరెవరి ద్వారా ఎన్ని పనులు చేసుకున్నారో తనకు తెలుసునని, అలా రాజీ పడడం తమకు తెలియదు అన్నారు. సమావేశంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, చంద్రగిరి మండల పార్టీ అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, మస్తాన్, బుల్లెట్ చంద్రమౌళిరెడ్డి, యారాశి శంకర్ రెడ్డి, కోటేశ్వరరెడ్డి, రమేష్ రెడ్డి ఉన్నారు. -
ఒకేషనల్ ప్రాక్టికల్స్కు 72 మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులకు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. బుధవారం రెండో రోజు జరిగిన పరీక్షలకు 72 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జి.రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9 కేంద్రాల్లో జరిగిన ఫస్టియర్ ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ పరీక్షలకు 409 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 362 మంది హాజరయ్యారని, అలాగే ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 348 మందికి 323 మంది హాజరయ్యారని తెలియజేశారు. అసభ్యకర ప్రవర్తనపై కేసు దొరవారిసత్రం: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించి, ఇబ్బంది పెట్టిన యనమల అశోక్పై పోలీసుల బుధవారం కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలు... వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన అశోక్ నాలుగు రోజుల కిందట బైక్లో వెళ్తూ పొలంలో పని చేసే ఓ వివాహితను వదిలిపెడుతానని బైక్లో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తరువాత అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ అజయ్కుమార్ విచారణ జరిపి కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆగమమే శాస్త్రాలకు మూలం తిరుపతి సిటీ: శాస్త్రాలకు మూలం ఆగమ శాస్త్రమేనని, వందల వృత్తుల వారు దేవాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారని వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి పేర్కొన్నారు. ఎస్వీ వేదిక్ వర్సిటీలో ఏడు రోజులపాటు నిర్వహించనున్న శిల్ప శాస్త్ర వర్క్షాపు బుధవారం వర్సిటీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన అకడమిక్ డీన్ గోలి సుబ్రమణ్యశర్మతోపాటు పలువురు పండితులతో కలసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాలు, విద్యాలయాలు, మాతృగర్భంలాంటి సంస్కార కేంద్రాలని తెలిపారు. ఆగమంలో చెప్పబడిన శిల్ప సంబంధమైన విషయాలను శిల్పశాస్త్ర సహాయంతో వారం రోజులపాటు జరిగే కార్యాశాల ద్వారా తెలుసుకోవాలన్నారు. ఆగమ అధ్యాపకులు, డీన్ డాక్టర్ రాజేష్కుమార్, డాక్టర్ నీలకంఠం, రామకృష్ణ, భరతశేఖరాచార్యులు, కార్తికేయన్ పాల్గొన్నారు. వెండి నాగపడగల తయారీ కేంద్రంలో ప్రమాదం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని వెండి నాగపడగల తయారీ కేంద్రంలో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. వెండి కరిగించేందుకు ఉపయోగించే గ్యాస్ పైపు ఊడిపోవడంతో మాధవ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈఓ బాపిరెడ్డి స్పందించి ఆలయం తరఫున ఆర్థిక సాయం అందించారు. అయితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పాలిటెక్నిక్ స్పోర్ట్స్మీట్ ప్రారంభం తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025–26 బుధవారం కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్వీయూ రీజియన్ ఆర్జేడీ నిమ్మల కుమార్ ప్రియ, ఏయూ రీజియన్ ఆర్జేడీ రామచంద్రరావు ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్మీట్ను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. తొలిరోజు బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, లాంగ్, హైజంప్ పోటీలు నిర్వహించారు. కాపు సంఘం చైర్మన్ వరప్రసాద్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శేఖర్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కమల బాషా, నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ ద్వారకనాథ్రెడ్డి, పీడీ రాజీవ్, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు, 15 మంది కేంద్రకమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సిద్ధార్థలో సిల్వర్ జూబ్లీ వేడుకలు
నారాయణవనం: సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు నిర్వహించే సిల్వర్ జూబ్లీ సావనీర్ను కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. బుధవారం ఉదయం కళాశాల ఆడిటోరియంలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి అశోకరాజు దంపతులు రుత్వికులు గణపతి, సరస్వతి, సుదర్శన హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో ప్రతి రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ ఇన్నోవేషన్లపై ప్రాజెక్ట్, పేపర్ ప్రజెంటేషన్లు, సెమినార్లు, క్రీడల పోటీలు, అకడెమిక్ ఎక్స్పర్ట్స్ ప్రసంగాలు, అవార్డులు, నృత్య ప్రదర్శనలు ఉంటాయని అశోకరాజు తెలిపారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో 24 గంటల హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమాలలో వైస్ చైర్మన్ ఇందిరవేణి, డైరెక్టర్ చాందిని, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్టార్టర్లు, కాపర్ చొరీ పెళ్లకూరు: మండలంలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్ స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్ కాపర్ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు రైతులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. పెళ్లకూరు, టెంకాయతోపు, రావులపాడు, భీమవరం, కానూరు వ్యవసాయ పొలాల్లో విద్యుత్ మోటార్లకు ఏర్పాటు చేసుకున్న 40కి పైగా స్టార్టర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి అందులో ఉన్న కాపర్తోపాటు ఆయిల్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిపారు. తరచూ స్టార్టర్ల చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
అధిక చార్జీలపై చర్యలు తప్పవు
తిరుపతి మంగళం: మోటారు వాహనాల కొనుగోలుదారుల నుంచి రిజిస్ట్రేషన్కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన దానికంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. మంగళంలోని తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బుధవారం మోటారు వాహన డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మురళీమోహన్ మాట్లాడుతూ వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం వాహన డీలర్లకే అనుసంధానం చేసిన విషయం తెలిసిందేనన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిర్దేశిత రుసుము కంటే వాహన డీలర్లు అధికంగా వసూలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తున్న ఆర్టీజీఎస్ ద్వారా వెల్లడి అయిందన్నారు. వాహన డీలర్లు కొనుగోలుదారులతో సరైన ప్రవర్తన నియమావళితో మెలగాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చార్జీల పట్టికను ప్రదర్శించాలని డీలర్లకు ఆదేశించారు. మోటారు వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, స్వర్ణలత, ఏఓలు విజయకుమార్, విజయ ప్రశాంతి, వాహన డీలర్లు పాల్గొన్నారు. -
మట్టిమాఫియా ఆగడాలు
ఏర్పేడు: మండలంలో మట్టి మాఫియా ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మండలంలోని చిందేపల్లిలో కొందరు టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా ఏర్పడి గ్రామ శివార్ల నుంచి రాత్రింబవళ్లు తేడా లేకుండా మట్టి తరలించేస్తున్నారు. ఎస్టీ కాలనీ సమీపంలో చెరువు పోరంబోకు స్థలంలో మట్టిని జేసీబీల సాయంతో తవ్వి ట్రాక్టర్లతో ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. రాత్రివేళల్లో ట్రాక్టర్లు వరుసపెట్టి పెద్ద శబ్దాలు చేసుకుంటూ మట్టిని తీసుకెళ్తుండడంతో ఎస్టీ కాలనీవాసులకు రాత్రిళ్లు నిద్ర కరువవుతోంది. చిందేపల్లి సమీపంలోని తిరుపతివాసులకు ఇళ్లు కేటాయించిన జగనన్న కాలనీ మధ్యలోనే మట్టిని తవ్వేసి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. అయితే అధికారగణం కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. అలాగే మండలంలోని కృష్ణాపురానికి వెళ్లే మార్గంలో అడవి నుంచి వచ్చే వాగులో మట్టిని టిప్పర్ల సాయంతో ఎత్తేసి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు సాక్షాత్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా మండలంలో మట్టిమాఫియా ఆగడాలు అదుపులోకి రావడం లేదు. మండలంలోని పాగాలి జగనన్న కాలనీలోని ఓ చెరువులోనూ నిత్యం మట్టి ఎత్తుతూ ఓ టీడీపీ నేత సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి మట్టిమాఫియా ఆగడాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్లోని నేషనల్ డెయిరీ డవలప్మెంట్ బోర్డు(NDDB) ద్వారా నెయ్యి శాంపిల్స్ను సీబీఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది. సీబీఐ దర్యాప్తుతో టీడీపీ, పచ్చ మీడియా ప్రచారాలు తప్పని అని తేలింది.తిరుమల లడ్డూపై సీబీఐ ఇచ్చిన సంచలన రిపోర్ట్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చెంపపెట్టులా మారింది. చంద్రబాబు, పవన్లు చేసింది తప్పుడు ప్రచారమేనని నిర్థారణ అయ్యింది. సీబీఐ రిపోర్ట్తో చంద్రబాబు అబద్ధాల పుట్ట బద్ధలైంది. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన చంద్రబాబు, పవన్.. రాజకీయ దురుద్ధేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం చేశారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.తిరుమల లడ్డూపై విషం చిమ్మిన కూటమికి దిమ్మతిరిగేలా సీబీఐ నివేదిక ఇచ్చింది. 2024లో జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్లో మిగిలి ఉన్న శాంపిల్స్ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. -
సైన్స్ సెంటర్లో బయోమిమిక్రీ గ్యాలరీ
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ప్రకృతి స్ఫూర్తితో సైన్స్ అనే థీమ్తో నూతనంగా ఏర్పాటు చేసిన బయోమిమిక్రీ గ్యాలరీని మంగళవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్) డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య హాజరై గ్యాలరీని ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులతో కలిసి గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. తిరుపతి సర్కిల్ అటవీ అధికారి సి.సెల్వం, బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం(వీఐటీఎం) డైరెక్టర్ సాజు భాస్కరన్, సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ, ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎన్టీ పురుషోత్తమ, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణరాజు పాల్గొన్నారు. పీఆర్ఎస్ఐ తిరుపతికి బెస్ట్ ప్రోగ్రామ్స్ అవార్డు తిరుపతి అన్నమయ్యసర్కిల్: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) తిరుపతి చాప్టర్కు జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రోగ్రామ్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి.రవి చేతుల మీదుగా మంగళవారం చాప్టర్ చైర్మన్ డాక్టర్ జీఎస్.ప్రసాద్, కార్యదర్శి దుద్యాల చంద్రమోహన్, ఇతర కార్యవర్గ సభ్యులు అందుకున్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇటీవల ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పీఆర్ఎస్ఐ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అజిత్ పాథక్, సెక్రటరీ జనరల్ డాక్టర్ పీఎల్కే మూర్తి, వైస్ ప్రెసిడెంట్ (సౌత్) యుఎస్.శర్మ కలిసి తిరుపతి చాప్టర్కు బెస్ట్ చాప్టర్ అవార్డును ప్రకటించారు. సీపీఆర్ఓను పీఎస్ఆర్ఐ తిరుపతి చాప్టర్ కార్యవర్గ సభ్యులు మెమెంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఆర్ఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు కె.శ్రీనివాసరావు, కోశాధికారి కె.మధుసూదన్, జాయింట్ సెక్రటరీ సంస్కార్ రాజేష్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ సి.స్వరాజ్యలక్ష్మి, వివి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. దేశీయ పద్ధతిలో చెరకు సాగు పరిశీలన తిరుపతి రూరల్: వేమూరు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ సాగు రైతు అయ్యప్పనాయుడు పొలంలో కొత్తరకం చెరకు(16టి7) రకాన్ని దేశీయ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. ఆ విధానాన్ని మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. పెరుమాళ్లపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎం.రెడ్డికుమార్, బ్రీడింగ్ విభాగం శాస్త్రవేత్త ఠాగూర్, మండల వ్యవసాయ అధికారి సుబ్బారావు పరిశీలించారు. ప్రకృతి వనరులతో తయారు చేసిన ఎరువుల వాడకం, పంట సాగులో సరికొత్త పద్ధతులతో చెరకు పంట ఏపుగా పెరగడాన్ని గమనించిన శాస్త్రవేత్తలు వివరాలను రైతు ద్వారా తెలుసుకున్నారు. ఏనుగుల బీభత్సం – తుమ్మచేనుపల్లిలో పంటలు ధ్వంసం భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ పరిధిలోని తుమ్మచేనుపల్లి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్రెడ్డి మామిడి తోటలోకి సోమవారం రాత్రి చొరబడిన ఏనుగులు పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. తోటలోని 30 మామిడి చెట్లు, 10 కొబ్బరి చెట్లు నేలమట్టం అయ్యాయి. దీంతో రైతు లక్ష్మణ్రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. సంబంధిత అధికారులు స్పందించి పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేయాలని, ఏనుగుల దాడులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
శ్రీరంగ నీతులు ఆపండి
మహిళలకు అన్యాయం జరిగితే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పదే పదే చెప్పేవారు. చివరుకు తాను తప్పు చేసినా ఉరి తీయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే చెప్పారు. అప్పుడు మహిళల రక్షణ పై ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న శ్రీరంగనీతులు చెప్పడం అపి రైల్వేకోడూరు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి. – కుమారి, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి, మహిళ సమాఖ్య ఏదీ చిత్తశుద్ధి రైల్వే కోడూరు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుని పవన్ కల్యాణ్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మహిళలు ఎవరైనా ఒక్కటే. అందులో ప్రభుత్వ ఉద్యోగిని వేధించి భయాందోళనకు గురిచేశారు. ఎమ్మెల్యే దౌర్జన్యం పై ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వచ్చింది. ఎంత వేధించి ఉంటే ఆ మహిళ అంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుంది. ఇప్పటికై న చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – చిట్టెమ్మ, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి, ఐద్వా -
మైనారిటీ నేత ఇల్లు కూల్చివేతకు యత్నం
శ్రీకాళహస్తి: పట్టణంలోని అయ్యలనాడుచెరువు ప్రాంతంలో వైఎస్ఆర్ సీపీ మైనారిటీ నాయకుడు అమాన్ గత ప్రభుత్వంలో కట్టుకున్న ఇంటిని కూల్చేందుకు మంగళవారం అధికార యంత్రాంగం మొత్తం కదలివచ్చింది. అయ్యలనాయుడుచెరువు మొత్తం కూడా ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న వారే. అయితే వైఎస్ఆర్ సీపీ నేత కావడంతో అమాన్కు గండంగా పరిణమించింది. గత నెల 20వ తేదీ కోర్టును ఆశ్రయించగా మూడు వారాల్లో సంబంధిత పత్రాలను పురపాలక అధికారులకు సమర్పించాలని సూచించింది. అయితే తను పత్రాలు ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా అధికారులు తీసుకోలేదని బాధితుడు అమాన్ తెలిపాడు. కదిలివచ్చిన యంత్రాంగం పురపాలక కమిషనర్, డీఎస్పీ, ముగ్గురు సీఐలు, సుమారు 15మంది పోలీసులు, సుమారు 15 మంది పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు 15 మంది, రెండు జేసీబీలతో ఉదయం ఇంటి వద్దకు చేరుకున్నారు. అమాన్ను టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించి కూల్చివేయాలని ప్రయత్నించారు. అయితే అవమాన్ కుటుంబసభ్యులు పెట్రోల్ బాటిల్ పట్టుకుని, బయటకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఇంటికి వెళ్లే విద్యుత్ కనెక్షన్, వాటర్ పైపులైను, సీసీ కెమెరాను, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే ౖపైపులైన్లను పురపాలక సంఘం అఽధికారులు పగులగొట్టారు. చివరకు బుధవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బుధవారం సాయంత్రం వరకు గడువు ఇస్తారా లేక రాత్రికి రాత్రే తొలగిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సుమారు 400 ఇళ్లు, పునాదులు ధ్వంసం చేశారు. ఈ చర్యలతో ఆ ప్రాంతమంతా భయభ్రాంతులకు గురయ్యారు. -
తప్పులు లేని పాస్ పుస్తకాలు అందించండి
తిరుపతి అర్బన్: సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో రైతులకు తప్పులు లేని పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు పీజీఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం చూపాలని చెప్పారు. ఈకేవైసీ, మ్యుటేషన్, డిజిటల్ సైన్ తది తర సమస్యలకు పరిష్కారం చూపాలని వెల్లడించారు. ఆ మేరకు ఆర్డీవోలు పర్యవేక్షించాలని వివరించారు. అనంతరం రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపై అధికారులతో సమావేశం అయ్యా రు. ఏ పనులు ఏయే దశల్లో ఉన్నాయో తెలుసుకు న్నారు. పనుల్లో పురోగతి చూపాలని ఆదేశించా రు. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నేషనల్ హైవే పీడీలు, ఆర్డీవోలు పాల్గొన్నారు. సూపర్ మార్కెట్లో చోరీ తిరుపతి క్రైమ్: నగరంలో ఐఎస్ మహల్ సమీపంలోని ఎస్మార్ట్ సూపర్ మార్కెట్లో చోరీ జరిగిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్మార్ట్ సూపర్ మార్కెట్ల్లోకి సోమవారం అర్ధరాత్రి తర్వాత షట్టర్ పగలగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. 15 నిమిషాల్లోనే షాపులో ఉన్న లక్షల రూపాయల నగదు దోచుకెళ్లినట్లుగా గుర్తించారు. ముగ్గురు దుండగులు ముసుగు వేసుకొని ఈ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. దీనిపై షాపు యజమాని జాబీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్ని అర్హతలు ఉన్నాయి
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఎంతైనా అవసరం. విశాఖ జోన్ ఏర్పడుతున్న క్రమంలో కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాల్సి వస్తే అది ముందుగా బాలాజీ డివిజనే అని భావిస్తున్నా. అన్ని అర్హతలు బాలాజీ డివిజన్కు ఉన్నాయని రైల్వే నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నాఉ. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆ దిశగా ఆడుగులు వేయాలని కోరుతున్నా. – పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీ, రాజంపేట గట్టిగా వాణి వినిపిస్తా మరుగున పడిన తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వెలుగులోకి తెచ్చా. పలుమార్లు రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లా. రైల్వే డివిజన్ ఏర్పాటుకు సాధన సమితి ఉద్యమ నాయకులు సహకారం కోరారు. వారి వినతులను స్వీకరించా. బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా వాణి వినిపించి రైల్వేడివిజన్ సాధనకు కృషి చేస్తా. – గురుమూర్తి, ఎంపీ, తిరుపతి పూర్వ వైభవం బాలాజీ డివిజన్ ఏర్పాటుకు తిరుపతి చాలా అనుకూలం. ఈ డివిజన్ ప్రతిపాదన దశాబ్దాల కాలం నాటిది. గతంలో కూడా అధికారులు పరిశీలనలు కూడా చేశారు. తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు అమలు చేయాలని పెద్దల సభలో చర్చించా. కొత్త డివిజన్ ఏర్పాటుతో ఐదు జిల్లాలకు పూర్వవైభవం వస్తుంది. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు -
దశాబ్దాల డివిజన్
దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష.. ఏళ్ల తరబడి ఐదు జిల్లాలవాసుల కల.. చినుకులా మొదలైన ఉద్యమం.. తారస్థాయి చేరింది. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రతి ఒక్కరి మది నిండా ఉంది. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కూటమి ఎంపీలు సహకరించాలని ప్రజానీకం కోరుతోంది. వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి గళమెత్తాలని స్పష్టం చేస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తోంది.తిరుపతి రైల్వేస్టేషన్తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ఆధ్యాత్మిక క్షేత్రంన తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ఈ సారైనా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారా లేదా..? అనే అంశం ఐదు జిల్లాల ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్గా చేయాలనే ప్రజల ఆకాంక్ష నేరవేర్చేలా ఏపీ ఎంపీలు గళమెత్తి నినదించాల్సిన అవసరముంది. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో సానుకూల నిర్ణయం ఉంటుందనే ఆశాభావం రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యుల్లో వ్యక్తమవుతోంది. ఉద్యమం.. ఉధృతం బాలాజీ రైల్వే డివిజన్కు కేంద్రం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఐదు జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. డివిజన్ ఏర్పాటుకు అనుకూల అంశాలు ఉన్నా కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఎన్నికల జరిగే రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తారని, కొత్త డివిజన్లు, రైలు మార్గాలు ప్రకటన వెలువడుతుందని రైల్వే నిపుణులు భావిస్తున్నారు. రైల్వేట్రాక్ మీద రాజకీయ భవిష్యత్తును ఉంచుకునే దిశగా కేంద్రం బడ్జెట్ రూపకల్పన ఉంటుందనేది ప్రాథమిక అంచనా. ఇందులో భాగంగా బాలాజీ రైల్వేడివిజన్కు చోటు లభిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే డివిజన్ ఏర్పాటుకు రైల్వేబోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వే డివిజన్ సాధన సమితి చేపట్టిన ఉద్యమం తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్ కడప. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది. ఐదు జిల్లాల ప్రజల ఆకాంక్ష నెరవేరేనా? -
పేదలకే భూములు దక్కాలని ఆందోళన
పెళ్లకూరు: నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు నిరుపేదలకే దక్కాలంటూ ముమ్మారెడ్డిగుంట గ్రామానికి చెందిన పలువురు దళితులు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలోని సర్వే నంబరు 1లో 61ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడ భూములను పుల్లూరు గ్రామానికి చెందిన కొందరు భూస్వాములు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామంలోని దళితులు సంబంధిత భూముల్లోకి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక ఆర్ఐ సంతోషిణిబాయి, సర్వేయర్ సుప్రజ, లక్ష్మణ్ భూముల వద్దకు చేరుకొని పరిశీలించారు. రెవెన్యూ రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి వరకు భూముల్లోకి ఎవ్వరూ దిగకూడదని హెచ్చరించారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలి తిరుపతి మంగళం : వాహన డ్రైవర్లతో పాటు ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని రాయలసీమ జోన్ ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ కృష్ణవేణి సూచించారు. మంగళంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించారు. కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రవాణా నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు. వాహన డ్రైవర్లకు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, హైదరాబాదు నుంచి విజయవాడకు వస్తున్న బస్సు డ్రైవర్ గుండెపోటుతో మరణించిన విషయాన్ని వాహనదారులకు గుర్తు చేశారు. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించకుండా ప్రమాద బీమాను చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎస్.వెంకటేశ్వరరావు, మోటారు వాహనాల తనిఖీల అధికారులు సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, అతికానాజ్, ప్రసాద్వర్మతో పాటు డాక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
లోపాల రీసర్వే
వరదయ్యపాళెం: రీసర్వేతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సమస్యలు తీరి రికార్డు పక్కాగా అనుభవదారుడి పేరిట చేయాలన్న రీసర్వే లక్ష్యం అధికారుల అలసత్వానికి నీరు గారుతోంది. దీనిపై ఫిర్యాదులు అందుతున్నా పరిష్కారం కాని వైనం. అయితే రీసర్వేకు ఎంపికై న గ్రామాల్లో సగానికి పైగా సమస్యలు అలానే ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి మ్యుటేషన్, కరక్షన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే వీటికి సంబంధించి సర్వర్లను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో రోజువారీ సచివాలయాలు, మీసేవల చుట్టూ అర్జీదారులు తిరుగుతున్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో అటు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, ఇటు మండల తహశీల్దార్ కార్యాలయానికి అర్జీదారులు పోటెత్తుతున్నారు. వరదయ్యపాళెం మండలంలో మొదటి దశ కింద అప్పటి ప్రభుత్వంలో కోవూరుపాడు, నెల్లటూరు, అయ్యవారిపాళెం గ్రామాలు రీసర్వేకు ఎంపికయ్యాయి. అయితే ఈ గ్రామాల్లో ఇప్పటిదాకా గడిచిన మూడేళ్ల నుండి సర్వే ప్రక్రియ పూర్తికాలేదు. అంతేకాక సమస్యలు సైతం పుట్టుకొస్తున్నాయి. పాసు పుస్తకాల పంపిణీకి హడావిడి ప్రస్తుతం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి కోవూరుపాడు రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ 169 మంది రైతులకు చెందిన భూఖాతాలు ఉన్నాయి. అందులో 74 మంది రైతుల ఖాతాలకు సంబంధించి అన్ని వివరాలతో సక్రమంగా ఉన్నవిగా గుర్తించారు. వీరికి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఈకేవైసీ సైతం చేపడుతున్నారు. అయితే సర్వే నెంబర్లు కొన్ని నమోదు కావాల్సి ఉందని రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటాడుతున్న సర్వర్ల సమస్య ప్రధానంగా రీసర్వేలో సమస్యల పరిష్కారం జరగాలంటే సర్వర్లు ఓపెన్ కావాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. రోజువారీ జిల్లా ఉన్నతాధికారులు హడావిడి చేస్తున్నారే గానీ అందుకు సంబంధించి విడుదల చేయాల్సిన సర్వర్లు మాత్రం పనిచేయకుండా చేస్తున్నారు. దీంతో వచ్చే అర్జీదారులకు సమాధానం చెప్పలేక, సమస్యలు పరిష్కారం కాక సతమతమవుతున్నారు. -
వీళ్లా పాలించేది
మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. అందులో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే మహిళలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. అలాంటిది ఎమ్మెల్యేలే ఇంత దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటు. సీ్త్రల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వాళ్లా మనల్ని పాలించేది. ఆడవారిపై ఎవరైనా చేయివేస్తే నరుకుతానని ప్రకటించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ఆచరించి చూపాలి. బాధితురాలికి ఏం న్యాయం చేస్తారో చెప్పాలి. – నదియా, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి, తిరుపతి సిగ్గుచేటు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక కూటమి ఎమ్మెల్యేలు కొందరు కీచకులుగా మారిపోయారు. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. బెదిరింపులతో లొంగదీసుకుని వారి జీవితాలను ఛిద్రం చేసేస్తున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు. దీనిపై చంద్రబాబు, పవన్కల్యాణ్తోపాటు హోంమంత్రి అనిత కూడా స్పందించాలి. కీచక ఎమ్మెల్యేను కఠినంగా శిక్షించాలి. – చంద్రకళ, ప్రజాతంత్ర మహిళా సంఘం మండల కార్యదర్శి, నాయుడుపేట -
నేటి నుంచి భూ సర్వేకు బ్రేక్!
తిరుపతి అర్బన్ : జిల్లాలో భూ సర్వే పనులను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు లియాకత్ అలీ, కార్యదర్శి జ్యోతిగన్ వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు కలెక్టరేట్లో జిల్లా సర్వే అధికారి అరుణ్కుమార్కు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ప్రమోషన్లు, బేసిక్ పే తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రామ సర్వేయర్లకు రూ.32వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ కనీస అర్హతను ఐఐటీ నుంచి డిప్లొమా సివిల్ లేదా బీటెక్ సివిల్కు మార్పు చేయాలని కోరారు. రీ సర్వేలో భాగంగా సాంకేతిక పనులు నిర్వహిస్తున్నందుకు టెక్నికల్ అలవెన్స్ ఇప్పించాలన్నారు. రీసర్వేకు అవసరమైన లాప్టాప్లు, రోవర్లు, స్టేషనరీని సరిపడా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సంఘం వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
తెప్పపై శ్రీపార్థసారథి స్వామి విహారం
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీరుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారథి స్వామివారు తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్వామివారు దేవేరులతో కలిసి తెప్పను అధిరోహించి పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. బుధవారం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారు తెప్పపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రదర్శించిన హరికథాగానం, భజనలు, సంగీత విభావరి భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ మీట్కు సర్వ సిద్ధం
తిరుపతి సిటీ : ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా బుధవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్’అండ్ గేమ్స్ మీట్కు సర్వ సిద్ధం చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకనాథరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు జిల్లాల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు తిరుపతికి చేరుకున్నట్లు వెల్లడించారు. వారి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ప్రశాంతంగా ఒకేషనల్ ప్రాక్టికల్స్ తిరుపతి సిటీ : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్స్ను మంగళవారం ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. జిల్లాలోని 9 కేంద్రాల్లో చేపట్టిన ఫస్ట్ఇయర్ ఒకేషనల్ కోర్సు ప్రాక్టికల్స్కు 406మంది విద్యార్థులకు గాను, 361మంది హాజరైనట్లు వెల్లడించారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 350 మందికి గాను 326మంది హాజరైనట్లు వివరించారు. స్విమ్స్లో ‘డయాబెటిక్ ఫుట్ క్లినిక్’ తిరుపతి తుడా : స్విమ్స్లో డయాబెటిక్ ఫుట్ క్లినిక్ను మంగళవారం ప్రారంభించారు. స్విమ్స్ పద్మావతి ఆస్పత్రిలో డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి సేవలకు శ్రీకారం చుట్టారు. డైరెక్టర్ మాట్లాడుతూ డయాబెటిక్ కారణంగా పాదాల సమస్యలతో బాధపడుతున్న రోగులకు సమగ్ర చికిత్స అందిస్తామన్నారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ హరిప్రసాద్ ఈ క్లినిక్ అధ్యక్షుడిగా నియమితులయ్యారని వెల్లడించారు. ఆయన పొడియట్రిక్, డయబెటిక్ ఫుట్ సమస్యల నివారణపై ప్రత్యేక శిక్షణ పొందారని వివరంచారు. ఫుట్ పరిశీలన, ప్రమాద స్థాయి అంచనా, న్యూరోపతి, ఇస్కీమియా ఇన్ఫెక్షన్ గుర్తింపు, గాయం సంరక్షణ, శస్త్ర చికిత్స వంటి సేవలందించనున్నట్లు వివరించారు. డాక్టర్ అలోక్ సచిన్, డాక్టర్ ముక్తేశ్వరయ్య, డాక్టర్ ఉషా కళావత్, డాక్టర్ కోటి రెడ్డి పాల్గొన్నారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 77,049 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,469 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
Arava Sreedhar: వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో జనసేన నేతల కీచక పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మహిళల్ని వేధింపులు గురి చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా వేధిస్తున్నారని మీడియా ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ దారుణాల్ని బయటపెట్టింది. ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేత అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందినందుకు అరవ శ్రీధర్కు ప్రభుత్వ శాఖలో చిరుద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బాధిత మహిళ ఫేస్బుక్లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్కు అరవ శ్రీధర్ రిప్లయి ఇచ్చారు. అంతే నాటి నుంచి శ్రీధర్ తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. మాట్లాడాలి. కలవాలి అంటూ పలు మార్లు ఆమెకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితురాలు భయాందోళనకు గురైంది. ఎమ్మెల్యే ఏంటి ఇలా అంటున్నారంటూ సమాధానం ధాటవేసింది. అసలే ఎమ్మెల్యే. తనకున్న అధికారంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎవరు? .ఎక్కడ ఉద్యోగం చేస్తుంది?. పెళ్లైయ్యిందా?. భర్త ఏం చేస్తుంటాడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు. వారి వయస్సు ఎంత. ఆమె ఇంటి అడ్రస్ ఎక్కడ. ఇలా అన్నీ వివరాలు సేకరించాడు. బాధితురాలికి తల్లిదండ్రులు లేరని, భర్త ఐటీ ఉద్యోగిగా హైదరాబాద్లో పనిచేస్తుంటారని తెలుసుకున్నాడు. అంతే ఓ రోజు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. పలానా ప్రాంతానికి వెళ్లాలంటూ కారులో ఎక్కించుకున్నాడు. భర్త ఉద్యోగం పేరుతో హైదరాబాద్లో ఉంటున్నాడు. మూడేళ్ల కుమారుడు చేసేది లేక ఎమ్మెల్యే కారు ఎక్కింది. ఓ ప్రాంతానికి వెళ్లాలంటూ కారు ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో ఓ గ్రామ సమీపంలో కారులోనే ఆమెపై బలవంతం చేయబోయాడు. చేస్తుంది తప్పని, వద్దని వారించింది. కారు దిగిపారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో బాధితురాల్ని అరవ శ్రీధర్ ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు. కారులోనే దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. జనసేన ఎమ్మెల్యే శశ్రీధర్ ఆగడాలు అంతటితో ఆగలేదు. ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తాయి. భర్తకు విడాకులు ఇవ్వాలని.. తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబడట్టాడు. లేదంటే బాధిత మహిళ మూడేళ్ల కుమారుణ్ని ప్రాణం తీస్తానని హెచ్చరించారు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా, వీడియోలు, వాట్సాప్ చాట్లతో సహా పలు ఆధారాల్ని బయట పెట్టడం కలకలం రేపుతోంది. -
ఒంటరితనం తట్టుకోలేక..
తిరుపతి క్రైమ్ : స్థానిక తిమ్మినాయుడుపాళెంలో నివసిస్తున్న ప్రియాంక (30) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.వివరాల ప్రకారం.. ప్రియాంక ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులు గతంలో మృతి చెందడంతో కొంతకాలంగా ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అయితే ఆ ప్రేమ వ్యవహారం విఫలమైన నేపథ్యంలోనే ఈ ఘోర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం రాత్రి ఆమె తన నివాసంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నదిలో మునిగిపోయి ఇద్దరి మృతి
చిట్వేలి:చిట్వేలి గుంజన నదిలోకి సోమవారం సాయంత్రం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఇద్దరు మృతిచెందినట్లు ఎస్ఐ వినోద్కుమార్ తెలియజేశారు. తిరుపతి నెహ్రూ నగర్కు చెందిన షేక్ అప్రిద్ (30) తన కుమార్తె పుట్టెంట్రుకలు తీయించడానికి శనివారం రాత్రి చిట్వేలిలోని షేక్ సయ్యద్ సాదక్ వల్లి దర్గాకు సుమారు 15 మంది బంధువులతో చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే బసచేసి ఆదివారం పుట్టెంట్రుకలు తీయించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కొందరు తిరుపతికి వెళ్లిపోగా ఇద్దరు ఇక్కడే ఉండిపోయారు. షేక్ ఆసిస్ (14), నూరుల్లా (36) సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో దర్గాకు దగ్గరలోని గుంజన నదిపై ఉన్న హైలెవల్ బ్రిడ్జి కిందకు పోయారు. ఈతకోసం బాలుడు ఆసిస్ నీటిలోకి దిగాడు. ఈతరాక మునిగిపోతుండగా బాలుడికి దగ్గర బంధువు అయిన నూరుల్లా కాపాడడానికి నీటిలోకి దిగి ఈత రాకపోవడంతో ఆయన కూడా మునిగిపోయి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ వినోద్ కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సార్టెంట్ దేవరాజ్ హఠాన్మరణం తిరుపతి సిటీ : ఉమ్మడి చిత్తూరు జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి విశ్రాంత ఎయిర్ఫోర్స్ సార్జెంట్ ఎస్.దేవరాజ్ (64) సోమవారం హఠాన్మరణం చెందారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని బాలాజీనగర్ లేఔట్లో నివసిస్తున్న ఆయన సోమవారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. దేవరాజు కుటుంబంలో రెండు రోజుల్లోనే రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. దేవరాజ్ అక్క భర్త డేనియల్ శనివారం ఉదయం మృతి చెందడం గమనార్హం. వెంట వెంటనే రెండు విషాదాలు వాటిల్లడంతో కుటుంబీకులు తల్లడిల్లిపోతున్నారు. ఎయిర్ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నివాళి సార్జెంట్ దేవరాజ్ భౌతికకాయానికి ఎయిర్ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి చాప్టర్ వారు ఘనంగా నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ జెండాను కప్పి అంజలి ఘటించారు. దేశానికి, క్రీడారంగానికి దేవరాజ్ చేసిన సేవలను కొనియాడారు. సంఘం సభ్యులు ఏఎస్బీ ప్రసాద్, బాలాజీ, ఎస్ఎస్ రెడ్డి, ఎస్ఎమ్కే కృష్ణమూర్తి, ఎస్బీన్ స్వామి, పి.సుధాకర్, సిద్ధయ్య, గిరిధర్సింగ్, సురేష్ కుమార్, జనార్ధన్, రత్న కుమార్, హర్షవర్ధన్రెడ్డి, డేవిడ్ రాజు పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుడికి రిమాండ్ సాక్షి టాస్క్ఫోర్స్ : పాకాల మండలం దామలచెరువుకు చెందిన అశోక్ అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడు విష్ణువర్ధన్కు సోమవారం పాకాల కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు నిందితుడిని చిత్తూరు జైలుకు తరలించారు. -
సోలార్ వెలుగుల్లో గ్రామీణం
తిరుపతి రూరల్ : గ్రామీణ ప్రాంతాలను సోలార్ వెలుగుల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ ఎండీ శివశంకర్ తెలిపారు. సోమవారం ఎస్పీడీసీఎల్ కార్యలయంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండియన్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి 5 జాతీయ అవార్డులను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోని 54 విద్యుత్ సంస్థల్లో ఏపీ ఎస్పీడీసీఎల్ 27వ ర్యాంకుతో గ్రేడ్–బిలో స్థానం దక్కించుకోవడం గర్వకారణమని, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని వివరించారు. 2.07లక్షల రూఫ్టాప్ ప్లాంట్లు ఎస్పీడీసీల్ పరిధిలో 2.07 లక్షల ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఒక్కో గృహానికి 2 కిలోవాట్ల చొప్పున మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద ఇప్పటి వరకు 16 వేల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ను ఏర్పాటు చేయడం ద్వారా 60 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. ఉత్తమ సేవలకు ప్రశంస విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు, బెస్ట్ సర్కిల్, బెస్ట్ డివిజన్, బెస్ట్ సబ్–డివిజన్, బెస్ట్ సెక్షన్లకు సీఎండీ శివశంకర్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు.వీరిలో చీఫ్ జనరల్ మేనేజర్లు ఎం. మురళీ కుమార్, ఎన్. శోభావాలెంటీనా, జనరల్ మేనేజర్లు టీఎస్. రాజశేఖర్ రెడ్డి, జి. చక్రపాణి ఉన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కె. గురవయ్య, పి. అయూబ్ ఖాన్, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణాదేవి, ఆర్. పద్మ, పీహెచ్ జానకిరామ్, కె. ఆదిశేషయ్య, ఎం. ఉమాపతి, ఎం.కృష్ణా రెడ్డి, జాయింట్ సెక్రటరీ యం. గోపాలకృష్ణ, చీఫ్ విజిలెన్న్స్ ఆఫీసర్ కె. జనార్ధన్ నాయుడు, సీజీఆర్ఎఫ్ చైర్ పర్సన్ ఎ. శ్రీనివాస ఆంజనేయమూర్తి పాల్గొన్నారు. -
హోరాహోరీగా అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నీ
తిరుపతి రూరల్:మండలలోని పెరుమాళ్లపల్లెలో ‘యంగ్ మెన్స్ రిక్రియేషన్ క్లబ్ వారు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నమెంట్ హోరా హోరీగా సాగింది. రెండు రోజులుగా నిర్వహించిన పోటీలకు ఏపీతోపాటు త మిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచి 60 జట్లు పాల్గొన్నా యి. క్రీడాకారులు అందరికీ వసతి, భోజన సదుపా యాలను నిర్వాహకులు కల్పించారు. విజేతలకు 1.25 లక్షల నగదు బహుమతులు, ట్రోఫీలను అందించారు. పట్టుకో.. పట్టుకో.. రిపబ్లిక్ డే రోజున సోమవారం కబడ్డీ టోర్నమెంట్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రెండు కోర్టుల్లో క్రీడాకారులు కబడ్డీ పోటీల్లో తలపడ్డారు. పట్టుకో.. పట్టుకో.. అంటూ ప్రేక్షకులు క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. విజేతలు వీరే.. కబడ్డీ పోటీల్లో పాల్గొన్న 60 జట్లులో మొదటి స్థానంలో బెంగుళూరు రాయల్స్, రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన సేలం జట్టు, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సదుం జట్టు, నాలుగో స్థానంలో ఏపీకి చెందిన మహదేవజట్లు నిలిచాయి. విన్నర్స్కు రూ.50వేలు, రన్నర్స్కు రూ.35వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.25వేలు, నాలుగోస్థానంలో నిలిచిన వారికి రూ.15వేలు అందించారు. -
ఆర్థిక వ్యవస్థ బలోపేతం
వాణిజ్య ఉపగ్రహాలతో.. సూళ్లూరుపేట : వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. సోమవారం షార్లోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మకుమార్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్పేస్ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయులను, అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందో మహానుభావులు ప్రాణత్యాగాల ఫలితాలను మనం అనుభవిస్తున్నామన్నారు. యువత బాగా చదువుకుని దేశానికి ఉపయోగడే సైంటిస్టులుగా తయారు కావాలని కోరారు. యువభారత్ రాబోయే 25 ఏళ్లలో శక్తివంతమైన దేశంగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో ఇస్రో అర్థవంతమైన పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. ఎల్వీఎం3 రాకెట్ల ద్వారా 5 టన్నుల నుంచి 6 టన్నుల ఉపగ్రహాలను సునాయాసంగా ప్రయోగిస్తోందని వివరించారు. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చి మనదేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడారు. కార్యక్రమంలో సీఐఎస్ఎప్ కమాండెంట్ సంజిత్కుమార్ అసిస్టెంట్ కమాండెంట్ నిధి, షార్ ఎంఎస్ఎం డైరెక్టర్ గోపీకృష్ణ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ‘సిద్ధార్థ’ సిల్వర్ జూబ్లీ వేడుకలు
తిరుపతి కల్చరల్: సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వేడుకగా చేపడుతున్నట్లు ఆ కళాశాల చైర్మన్ కె.అశోక్ రాజు తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న విద్యార్థులు వ్యర్థ వస్తువులతో తయారుచేసిన రోబో లు, గన్స్, హెలికాప్టర్ వంటి సుమారు 65 వస్తువులను ప్రదర్శన ఉంటుందన్నారు. 30న కళాశాలలోని అన్ని విభాగాల వర్క్షాపు, 31న ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థుల ప్రాజెక్టు ఎగ్జిబిషన్, ఫిబ్రవరి 1న 24 గంటల పాటు హ్యాకథాన్ పేరుతో 1,750 డెలిగేట్ల వివిధ అపరిష్కృత సమస్యల పరిష్కార మార్గాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో సమస్య పరిష్కారాలు చూపిన వారికి రూ.3.50లక్షలను బహుమతిగా ఇస్తామని వెల్లడించారుు. 2న అన్ని విభాగాల కార్యక్రమాల నిర్వహణ, 3న నైపుణ్యాలపై పత్రాలు సమర్పణ, 4న మన సంస్కృతి,సాంప్రదాయాలు తెలిపేలా ప్రముఖ ప్రవచనకర్త ప్రసంగం, 5న పేరెంట్స్ డే, 6న స్పోర్ట్స్ డే, 7న తమ విద్యాసంస్థ పూర్వ విద్యార్థులతో జూనియర్లకు ఆన్లైన్ తరగతుల, 8న సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు. కళాశాల వేడుకలకు సినీ నటి మీనాక్షి చౌదరి, సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గంగ కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహంతొట్టంబేడు : తెలుగుగంగ కాలువలో సోమవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనబడింది. తొట్టంబేడు మండలంలోని కల్లిపూడి గ్రామానికి సమీపంలోని తెలుగంగ కాలువ సబ్ కెనాల్ గేట్ల వద్ద ఓ మహిళ మృతదేహం కాలువ నీటిలో కొట్టుకుంటూ పోతోందని గమనించిన గ్రామస్తులు ఎస్ఐ బాలకృష్ణకు తెలియజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతి చెందిన మహిళ వయసు 55 ఏళ్లు ఉంటుందని, ఆమె వద్ద శ్రీకాళహస్తి పట్టణంలోని మాధురి గోల్డ్ సంస్థ పర్సు ఒకటి ఉందని, అందు 460 రూపాయల నగదు కూడా ఉందని తెలిపారు. ఒక్కో చేతికి ఒక్కో ఇత్తడి రంగు గాజు, చెవులకు బంగారు వర్ణం కమ్మలు ఉన్నట్టు గుర్తించారు. మృతురాలి ఆచూకీ తెలిసినవారు. బుచ్చినాయుడు కండ్రిగ సీఐ 9440796763, ఎస్ఐ 9440900724 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసుల అవినీతిపై ఏసీబీ దర్యాప్తు నాయుడుపేటటౌన్ : పట్టణంలోని అర్బన్ సీఐ బాబీ, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్రాజు అవినీతిపై ఏసీబీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా సీఐ అవినీతి చిట్టాను పూర్తిస్థాయిలో వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐ మల్లికార్జున సోమవారం సాయంత్రం నాయుడుపేటలోని సీఐ బాబీ, హెడ్కానిస్టేబుల్ రామ్మోహన్ ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వర వైన్షాపు నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు సీఐ, హెడ్కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్న విషయం విధితమే. ఈ క్రమంలోనే అవినీతి పోలీసుల అక్రమాస్తులను లెక్కగట్టేందుకు ఏసీబీ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నిందితుల ఇళ్లలోని నగదు, బంగారు నగలు సైతం స్వాధీనం చేసకుని వివరాలను నమోదు చేస్తున్నారు. సీఐ బాబీకి సంబంధించి నెల్లూరు, ఆయన స్వగ్రామమైన మాచర్ల తదితర ప్రాంతాల్లో కూడ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నిందితులను రిమాండ్కు పంపనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
కల్తీ ఎక్కడ బాబూ?
కార్వేటినగరం: తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మత విధ్వేషాలు రగిల్చి ఓ వర్గాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దూరం చేయాలన్న కుట్రకు కూటమి ప్రభుత్వం ఆజ్యం పోసిందని మాజీ డెప్యూటీ మాజీ నారాయణస్వామి ధ్వజమెత్తారు. సోమవారం పుత్తూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగకపోయినా దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించి డైవర్షన్ రాజకీయాలు చేసినట్లు చెప్పారు. తీరా కల్తీ జరగలేదని తేలుతుండడంతో ఇప్పుడు పామాయిల్ వాడినట్లు కొత్త నాటకారానికి తెరదీశారన్నారు. లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు చేసిన ప్రచారం ఏరోజుటికై నా అవాస్తవమని తేలుతుందని, ఆ రోజు వారికి శిక్ష పడడం ఖాయమని స్పష్టం చేశారు. దేవుళ్లకు కులాలను అంటగట్టి రాజకీయ లబ్ధిపొందాలన్న దురాలోచన కూటమి నేతలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా 1.5 సెంటు ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపడితే దాన్ని కూడా వక్రీకరించారన్నారు. నేను అధికారంలోకి వస్తే మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని ప్రజలను నమ్మబలికినట్లు గుర్తు చేశారు. పేదల సంక్షేమం కోసం వెచ్చించకూడదా? రూ.కోట్ల ప్రజాధనాన్ని ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు వెచ్చించే బదులు పేద ప్రజల సంక్షేమం కోసం ఎందుకు వెచ్చించకూడదని నారాయణస్వామి ప్రశ్నించారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఎల్ఆర్పేట కొండను తచ్చూరు రోడ్డు పేరుతో భారీగా తవ్వకాలు జరిపి రోజూ వందల టిప్పర్లలో గ్రావెల్ను చైన్నెకి తరలించి రూ. కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న దోపిడీలు జిల్లా కలెక్టర్కు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మైనింగ్ శాఖలో ఓ అధికారి కూటమి నేతలతో చేతులు కలిపి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని చంద్రబాబును కోరారు. చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నంలో గీతం ప్రైవేటు యూనివర్సిటీకి అప్పనంగా 54.73 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్నట్లు నారాయణస్వామి తెలిపారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరంచేసి పేదలను ఉన్నత విద్యకు దూరం చేసినట్లు గుర్తుచేశారు. గతంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను తీసుకొస్తే దానిపై కూడా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రయివేటు వర్సిటీకి ప్రభుత్వ భూములా? -
వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యం
రైల్వేకోడూరు అర్బన్:వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయా లని పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు సురేష్బాబు పిలుపునిచ్చారు. సోమవారం ఈ మేరకు వైఎస్సార్సీపీ రైల్వేకోడూరు నియోజకవర్గ సమన్వయకర్త కొరముట్ల శ్రీనివాసులు అధ్యక్షతన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తూ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశా రు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్య మంత్రి జగనన్న విప్లవాత్మకంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అయితే చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. బాబు పాలనపై జనం విసిగిపోయారని, రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కో–ఆర్డినేటర్ వజ్రం భాస్కర్రెడ్డి మాట్లాడుతూ కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాలను అధినేతన జగనన్న, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వెల్లడించారు. అందుకే ఏమాత్రం అలసత్వం వహించకుండా సమష్టిగా పనిచేసి ఫిబ్రవరి 15వ తేదీలోపు గ్రామ కమిటీలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీఎమ్మెల్యే గుంటివెంకటేశ్వరప్రసాద్కు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, పార్టీ ఓబులవారిపల్లి, చిట్వేలి, పుల్లంపేట మండలాల అధ్యక్షులు వత్తలూరు సాయికిషోర్రెడ్డి, చెవు శ్రీనివాసులురెడ్డి, ముస్తాక్, పంజంవే ణుగోపాల్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యు లు రత్నమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మారెళ్ల రాజేశ్వరి, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, తల్లెం భరత్కుమార్రెడ్డి, యనమాల మహేష్, నందాబా ల, డీవీ రమణ, రత్తయ్య, సుబ్బరామరాజు, జనార్ధన్రాజు, హరికృష్ణారెడ్డి, బండారుమల్లి, ముజీబ్, సుదర్శన్రెడ్డి, ఘని ఆర్వీ రమణ, లక్ష్మీనారాయణ మ్మ, రాజయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. -
● తెప్పోత్సాహం
శ్రీగోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. తొలి రోజుసీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై దేవదేవేరులను దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. – తిరుపతి కల్చరల్ రేపటి నుంచి స్పోర్ట్స్ మీట్ తిరుపతి సిటీ : తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ వేదికగా బుధవారం నుంచి రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ద్వారకనాథ్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ శుక్రవారం వరకు కొనసాగనున్న స్పోర్ట్స్ మీట్ రాష్ట్రంలోని పలు కళాశాలల నుంచి సుమారు 1,500మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులకు వసతి, రవాణా, భద్రత, వైద్య సౌకర్యాలకు కల్పించనున్నట్లు వివరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఎన్నిక తిరుపతి సిటీ : ఎస్వీయూలో రెండు రోజులుగా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్, సహాయ కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ కొత్త కమిటీని ప్రకటించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పవిత్ర, అక్బర్, ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్, వినోద్, తేజ, రవీంద్ర, అనిత, మరో 21మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. -
సత్కారం.. రుణసాయం
హోరాహోరీగా అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నీ తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నీ హోరాహోరీగా సాగింది.సోలార్ వెలుగుల్లో గ్రామీణం గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ రూఫ్టాప్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏఈ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఉత్తమ సేవలకు పురస్కారం మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుతిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో పండుగ వాతావరణం ఆవిష్కృతమైంది. ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ సంబరం ప్రతి ఒక్కరిలో దేశభక్తిని ఇనుమడింపజేసింది. ఈ క్రమంలోనే కలెక్టర్ చేతులమీదుగా జాతీయ జెండా సగర్వంగా ఎగిరింది. త్రివర్ణ పతాకం సమున్నతంగా రెపరెపలాడింది. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రతిభ కనువిందు చేసింది. ప్రగతి శకటాల పరుగు కట్టిపడేసింది. వినూత్నంగా చేపట్టిన డాగ్ షో అబ్బురపరిచింది. విభాగాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లలోని సామగ్రి ప్రత్యేకతను చాటుకుంది. అలాగే ఉద్యోగుల విశిష్ట సేవలకు అవార్డులతో గుర్తింపు లభించింది. జాతీయ జెండా ఆవిష్కరించి వందనం సమర్పిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్, పక్కన ఎస్పీ సుబ్బరాయుడుశ్రీవారి దర్శనానికి 20 గంటలుతిరుమల:తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ గోగర్భం డ్యాం వద్ద ఉన్న ఆక్టోపస్ బిల్డింగ్ వద్దకు చేరుకుతుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,131 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. జాతీయ విద్యా సదస్సుకు సురేష్ కేవీబీపురం: కేవీబీపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూనాటి సురేష్కు కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న జాతీ విద్యా సదస్సుకు ఆహ్వానం అందింది. జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఈ సదస్సు చేపట్టనున్నారు. పరీక్షలు సంస్కరణలు అనే అంశంపై ఢిల్లీలోని ఎన్సీఆర్టీ క్యాంపస్లో మంగళవారం నుంచి జరగనున్న సదస్సులో సురేష్ మాట్లాడనున్నారు. కేంద్రమంత్రులు, విద్యాశాఖ అధికారులు, దేశంలోని అన్ని రాష్ట్రాల నిపుణులు ఇందులో పాల్గొననున్నారు. ఎకై ్సజ్ సీఐకి సేవా పతకం నారాయణవనం: విజయవాడలో సోమవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలేఓ్ల పుత్తూరు ఎకై ్సజ్ సీఐ మురళీమోహన్కు ఉత్తమ సేవా పతకం లభించింది. ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు.తిరుపతి అర్బన్/ తిరుపతి క్రైమ్ : తిరుపతి నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం మైదానంలో ఆయన ఎస్పీ సుబ్బరాయుడుతో కలసి ఓపెన్ టాప్ వాహనంలో ముందుకు సాగుతూ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. అలాగే వివిధ శాఖలకు చెందిన ప్రగతి శకటాలు, పలు విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, జేసీ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డీఆర్ఓ నరసింహులు, ఆర్డీఓ రామ్మోహన్ సందర్శించారు. అలరించిన విద్యార్థులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 8 పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వీరిలో ఉత్తమ ప్రతిభను కనబరచి మొదటి బహుమతిని తిరుపతిలోని శ్రీచైతన్య పాఠశాల పిల్లలు, రెండో బహుమతిని ఏర్పేడులోని ఎస్వోఎస్ చిల్ర్ట్న్స్ స్కూల్, మూడో బహుమతి చంద్రగిరిలోని అక్షరధామ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు దక్కించుకున్నారు. పోటీపడిన మిగిలిన పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లను కలెక్టర్ చేతులమీదుగా అందించారు. ఈ క్రమంలోనే పోలీస్ జాగిలాలతో ప్రదర్శించిన డాగ్ షో విశేషంగా ఆకట్టుకుంది. తొమ్మిది ప్రగతి శకటాలు గణతంత్ర వేడుకల్లో అధికారులు పోటీలు పడి 9 ప్రగతి శకటాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో మొదటి బహుమతి విద్యుత్శాఖకు, రెండో బహుమతి వ్యవసాయ, ఉద్యానశాఖ, మూడో బహుమతి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు దక్కింది. మద్దిలేటి, ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ హారిక,డీఎఫ్ఓ, సూళ్లూరుపేట బాపిరెడ్డి, ఈఓ, శ్రీకాళహస్తీశ్వరాలయం చంద్రశేఖర్,ఎస్ఈ, ఎస్పీడీసీఎల్శ్రీరామ్కుమార్, జిల్లా రిజిస్ట్రార్బాలాజీ నాయక్, మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఎస్ఈ, ఆర్అండ్బీసురేష్బాబు, తిరుపతి తహసీల్దార్రోజ్మాండ్, ఎస్డీసీదేవేంద్రరెడ్డి, ఎస్డీసీతిరుపతి అర్బన్/తిరుపతి క్రైమ్ : పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలందించిన వివిధశాఖల ఉద్యోగులకు పురస్కారాలు ప్రదానం చేశారు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ మేరకు అవార్డులను అందించారు. ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, జేసీ గోవిందరావు, డీఆర్ఓ నరసింహులతోపాటు అవార్డు గ్రహీతల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఘనంగా గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడైన రాజంపేట తాలూకా ఉర్లగట్టుపాడుకు చెందిన రామలింగరాజు వారసుడైన ఆయన కుమారుడు రాధాకృష్ణమరాజును కలెక్టర్ ఘనంగా సత్కరించారు. అనంతరం డీఆర్డీఏ పీడీ శోభనబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి పథకాలకు చెందిన లబ్దిదారులకు రూ.410.60 కోట్ల మెగా చెక్కును అందించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి రామచంద్రుడు, తిరుపతి, చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, గాలి భాను ప్రకాష్, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ ,యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. 11 స్టాళ్లు విభాగాల వారీగా 11 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో మొదటి బహుమతిని పశుసంవర్థక శాఖ, రెండో బహుమతి మత్స్య శాఖ, మూడో బహుమతి ఐసీడీఎస్ శాఖలకు లభించాయి. అలాగే వివిధ విభాగాలకు చెందిన 246 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ సేవల నేపథ్యంలో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. -
వనరుల విధ్వంసం!
పచ్చటి పొలాలు.. ప్రశాంత వాతావరణం.. సగటు మనిషి స్వేచ్ఛగా జీవించేందుకు అనుకూలమైన ప్రాంతం చంద్రగిరి. అలాంటి ప్రస్తుతం ఇసుకాసురుల దాడులు.. రణగొణధ్వనులతో రాత్రింబవళ్లు తిరుగుతున్న భారీ టిప్పర్లు.. ప్రకృతి వనరులను కరిగించేస్తున్న జేసీబీలు.. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పచ్చమూక అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా నదులు.. వంకలు.. వాగులను తవ్వేస్తున్నారు. కొండలు.. గుట్టలను స్వాహా చేసేస్తున్నారు. మాఫియా ఏర్పడి వనరులను విధ్వంసం చేస్తున్నారు. అక్రమంగా రూ.కోట్లు పోగేసుకుంటున్నారు. అధికారులు సైతం రాజకీయ ఒత్తిడికి తలొగ్గి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్ : చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో గ్రావెల్ దందా కొనసాగుతూనే ఉంది. ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో రాత్రింబవళ్లు ఇసుక, మట్టి తవ్వకాలు.. తరలింపు సాగుతూనే ఉంది. ప్రధానంగా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె పంచాయతీ దళవాయి చెరువులో సుమారు 40 అడుగుల మేర తవ్వేసి గ్రావెల్ను తరలిస్తున్నారు. 15శాతం మేర కమీషన్ల రూపంలో వాటాలు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లె, అనుప్పల్లె, గుండోడుకణం, నెత్తకుప్పం, రాయలచెరువు, సిద్ధేశ్వరగుట్ట ప్రాంతాల నుంచి వందలాది టప్పర్లతో అక్రమంగా గ్రావెల్ తరలించేసినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 18 నెలల కాలంలో సుమారు రూ.200కోట్లకు పైగా విలువైన మట్టిని అక్రమార్కులు కొల్లగొట్టారని స్పష్టం చేస్తున్నారు. మారిన రూపురేఖలు ఇసుక స్మగ్లింగ్కు చంద్రగిరి మండలం కేంద్రంగా నిలుస్తోంది. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండతో గత ఏడాదిన్నరగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. స్వర్ణముఖినది పరివాహక ప్రాంతాలను భారీ యంత్రాల సాయంతో తవ్వేస్తున్నారు. పట్టపగలే జేసీబీలు, హిటాచీ వంటి భారీ యంత్రాలతో ఇసుకను తోడేసి, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించేస్తున్నారు. ఒక్కో ఇసుక ట్రాక్టర్ నుంచి నెలకు రూ.3వేల వరకు ఓ శాఖకు చెందిన అధికారికి ముడుపులు ముడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం ఇసుకలోనే పట్టణంలోని ఓ మైనారిటీ నేత, మరికొందరు టీడీపీ యువ నేతలు రూ.కోట్లు కూడబెట్టినట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా శానంబట్ల, రెడ్డివారిపల్లె, నాగయ్యగారిపల్లె, బుచ్చినాయుడుపల్లె, చంద్రగిరి, పనపాకం, శివగిరి, నరసింగాపురం ప్రాంతాల రూపురేఖలు ఇసుకాసురుల తాకిడికి పూర్తిగా మారిపోవడం గమనార్హం. -
సూపర్ సిక్స్ పేరుతో మోసం
సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మోసం చేశారని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మేడా రఘునాఽథరెడ్డి ఆరోపించారు. పార్టీ బలోపేతానికి ఈ నెల 31వ తేదీలోపు గ్రామ, పట్టణస్థాయి కమిటీలను పూర్తి చేయాలని కోరారు. సూళ్లూరుపేట:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నేతలు ముందు వరుసలో కార్యకర్తలు వెనుక ఉండేవారని, రాబోయే జగనన్న 2.0లో శ్రేణులకే పెద్దపీట వేసేలా అధినేత ప్రణాళికలు రూపొందిస్తున్నారని పార్టీ ఉమ్మ డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎంకేఎం కల్యాణమండపంలో సూళ్లూరుపేట నియోజకవర్గస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మె ల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కాకాణి మాట్లాడుతూ ఇకపై జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలను భుజాల మీద మోస్తామని తెలిపారు. అలాగే శ్రేణులకు గుర్తింపు కార్డులు ఇస్తామని, ఇన్సూరె న్స్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అక్ర మ కేసులు, దౌర్జన్యా లు తప్ప పాలన సాగడం లేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కోటి సంతకాలు సేకరణ చేపడితే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకువచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబుకు త్వరలోనే ప్రజలే గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. త్వరితగతిన కమిటీ పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేస్తామని వైఎస్సార్సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఒక్కో కమిటీలో 9 నుంచి 15 వరకు ఉంటారన్నారు. కష్టపడి చేసిన ప్రతి కార్యకర్త నేరుగా జగనన్నను కలిసేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. అనంతరం నేతలను వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్రవర్మ, రాష్ట్ర కార్యదర్శులు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వెంకట నారాయణరెడ్డి, సనత్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అల్లూరు అనిల్కుమార్రెడ్డి, కె.ఆర్ముగం, దువ్వూ రు రాహుల్రెడ్డి, పాదర్థి హరినాథ్రెడ్డి, ఒబ్బు వెంకటరత్నం, వట్టూరు కిషోర్యాదవ్, పట్టణ అధ్యక్షులు కృపాకర్రెడ్డి, కలికి మాధవరెడ్డి, జిల్లా కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు దబ్బల శ్రీమంత్రెడ్డి, కటకం దీపిక, నేతలు కామిరెడ్డి రాజా రెడ్డి, జెట్టి వేణుయాదవ్, మీజూరు రామకృష్ణారెడ్డి, చిన్ని సత్యనారాయణ, అలవల సురేష్ పాల్గొన్నారు. జగనన్న 2.0లో కార్యకర్తలకే పెద్దపీట -
పులికాట్లో పక్షుల లెక్కింపు
సూళ్లూరుపేట రూరల్ : పులికాట్ సరస్సుతోపాటు దొరవారిసత్రంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఆదివారం వాటర్ బర్డ్స్ సెన్సెస్ చేపట్టారు. డీఎఫ్ఓ హారిక మాట్లాడుతూ రెండు రోజులుగా పక్షుల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముంబయికి చెందిన బీఎన్హెచ్ సొసైటీ, తిరుపతిలోని ఐఐఎస్ బృందం, క్రియా యూనివర్సిటీ విద్యార్థులు, వన్యప్రాణి విభాగం అధికారులు మొత్తం 8 బృందాలు లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. ఏఎస్పీ రవి మనోహరాచారికి రాష్ట్రపతి మెడల్ తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ రవిమనోహరాచారి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ మెడల్కు ఎంపికాయ్యారు. మన రాష్ట్రం నుంచి ప్రెసిడెంట్ మెడల్కు ఎంపికై న ఏకై క వ్యక్తి కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన రవిమనోహరాచారి 1991 మ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్గా పోలీసు శాఖలోకి అడుగుపెట్టారు. శిక్షణ అనంతరం 1992లో చిత్తూరు జిల్లా ఐరాలలో ఎస్ఐగా తొలి పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశారు. 2005లో సీఐగా పదోన్నతి పొంది చిత్తూరు ఈస్ట్, వెస్ట్, సర్కిళ్లు, సత్యవేడు, తిరుపతి టౌన్ సీఐగా పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది తిరుమల కై మ్ డీఎస్పీగా.. అనంతరం మదనపల్లి, కడప, నరసాపురం ప్రాంతాల్లో పనిచేశారు. తరువాత 2024 నుంచి తిరుపతి టౌన్ డీఎస్పీగా పనిచేస్తూ ఏఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. తన సర్వీసుల్లో అనేక సంచలనమైన కేసులను చాకచక్యంగా దర్యాప్తు చేశారు. 2027లో ఆయన మెడల్ అందుకోనున్నారు. -
బ్రహ్మాండ తేజం
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు ● శోభాయమానంగా ప్రకాశించిన తిరుగిరులు ● శ్రీమలయప్పస్వామికి విశేష వాహన సేవలు ● పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు సూర్యప్రభ వాహనంపై శ్రీవారుసూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న శ్రీమన్నారాయణుడుబలోపేతమే లక్ష్యంగా కమిటీలు సూళ్లూరుపేట రూరల్ : వైఎస్సార్సీపీ మరింత బలోపేతమే లక్ష్యంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నెల్లూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎంకేఎం కల్యాణమండపంలో సూళ్లూరపేట నియోజకవర్గస్థాయి సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి, మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తండిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు భీరేంద్రవర్మ, ఎన్డీసీసీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి హాజరయ్యారు. కాకాణి మాట్లాడుతూ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, అనుబంధ సంస్థలకు కమిటీలు వేస్తున్నామన్నారు. 18లక్షల మందిని జగనన్న సైనికులుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. 19 నెలల చంద్రబాబు పాలనపై ప్రజలకు విసిగిపోయారని, వైఎస్సార్సీపీకి ఆదరణ పెరిగిందని వివరించారు. సర్కారు అరాచకాలు, దౌర్జన్యాలను వైఎస్సార్సీపీ శ్రేణులు దీటుగా ఎదుర్కొంటున్నారని ప్రశంసించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వైఫల్యం చెందిందని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలే తిరగబడ్డారని తెలిపారు. సూపర్ సిక్స్ పేరుతో చేసిన మోసాలను జనం గుర్తించారని, రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నేతలను పార్టీ శ్రేణులు గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు వేళ్లపాలెం కృపాకర్రెడ్డి , తడ మండలం అధ్యక్షుడు కెలివి ఆర్ముగం, పెళ్లకూరు మండలం అధ్యక్షుడు వెంకటరత్నం, నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు ఓట్టూరు కిషోర్ యాదవ్, ఓజిలి మండలం అధ్యక్షుడు పాదర్తి హరనాథరెడ్డి, కలికి మాధవరెడ్డి, నేతలు జెట్టి వేణు, అలవల సురేష్ పాల్గొన్నారు. 25ఎస్ఎల్పి141 నేతలను గజమాలతో సత్కరిస్తున్న నేతలు 25ఎస్ఎల్పి 142 హాజరైన నేతలు, కార్యకర్తలు పవిత్ర రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి సేవకు ముక్కోటి దేవగణం ఆదివారం తిరుమలకు తరలివచ్చిందా అన్నట్టు తిరుగిరుల తేజం ఇనుమడించింది.. తిరుమలేశుని వైభవం త్రిలోకాలను మైమరపించింది.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధి సకల ప్రాణకోటిని పరవశింపజేసింది.. వివిధ వాహనాలపై విశేషాలంకరణలో దర్శనమిచ్చిన వేంకటాచలపతిని వీక్షించి అశేష భక్తజనం తన్మయత్వం చెందింది.. తొలుత సూర్యప్రభల కాంతులీనుతూ సాక్షాత్కరించిన మలయప్పస్వామి దివ్యతేజస్సుకు పులకరించింది.. చిన్నశేషునిపై చిద్విలాసంగా ఆశీనులైన శ్రీనివాసునికి కై మోడ్పులర్పించింది.. అత్యంత ప్రీతిపాత్రమైన గరుడుని అధిరోహించిన శ్రీమన్నారాయణుని సేవించుకుని చరితార్థమైంది.. పుణ్య పుష్కరిణిలో చేపట్టిన చక్రస్నాన ఘట్టంలో పాలుపంచుకుని పునీతమైంది.. కల్పవృక్ష నీడలో కొలువుదీరిన సర్వాంతర్యామి అనుగ్రహంతో సకల అభీష్టాలను సిద్ధించుకుంది.. గోపాలా.. సర్వభూపాలుడి నువ్వేనంటూ వేనోళ్ల కొనియాడింది.. చంద్రప్రభ శోభితంగా ఊరేగుతున్న ఏడుకొండలస్వామికి మొక్కులు సమర్పించుకుని తరించింది. – తిరుమల -
దళిత యువతిపై లైంగికదాడి
తిరుపతి క్రైమ్: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి మాయ మాటలు చెప్పి దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలంలో నివాసముంటున్న 19 ఏళ్ల దళిత యువతికి కడపకు చెందిన యశ్వంత్రాజ అనే వ్యక్తి కొద్దికాలం కిందట ఇన్స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 21న ఆ యువకుడు తిరుపతికి వస్తున్నానని యువతికి తెలిపాడు.ఇదే క్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రనగర్లోని ఓ హోటల్ రూమ్కి తీసుకువెళ్లి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన యువతి డీలాగా ఉండడంతో తల్లి గమనించి ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 24వ తేదీ రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
‘గరిమెళ్ల’ గళానికి ‘పద్మశ్రీ’ పరిమళం
తిరుపతి కల్చరల్/రాజమహేంద్రవరం సిటీ: అన్నమయ్య సంకీర్తనల పదార్చనే జీవితంగా నిరంతరం తపించి తన స్వర కీర్తనలతో అలరారింపజేసిన సంగీత తపస్వి గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ని పద్మశ్రీ వరించింది. శ్రీవారి పరమభక్తుడు అన్నమయ్య సంకీర్తనలకు రాగాలనద్ది, వైవిధ్యభరితంగా బాణీలు కట్టి భిన్నమైన స్వర ప్రయోగాలతో సాహిత్య సౌరభంతో అన్నమయ్య కీర్తలను జన బాహుళ్యం చేసిన ఘనాపాటిగా గరిమెళ్ల ప్రసిద్ధి చెందారు.సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి శిష్యరికంతో మరింత రాటుతేలిన ఆయన శాస్త్రీయ, ఆధ్యాత్మిక గాయకుడుగా గుర్తింపు పొందారు. గరిమెళ్ల 1978లో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడిగా ప్రవేశించి అపార ప్రతిభతో టీటీడీ ఆస్థాన విద్యాంసుడిగా ఎదిగారు. అన్నమయ్య కీర్తనలకు స్వపరపరిచి ఆలపించి తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి సంకీర్తన నైవేద్యాన్ని సమర్పించారు. టీటీడీతోపాటు కంచి కామకోటి పీఠం (2010), అహోబిల మఠం (2020) ఆస్థాన సంగీత విద్వాంసులుగా కూడా గరిమెళ్ల పనిచేశారు. అంచెలంచెలుగా.. గొప్ప సంగీత విద్వాంసుడిగా.. రాజమండ్రిలో 1948 నవంబరు 9న కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ జన్మించారు. ఆయన తండ్రి నరసింహారావు కూడా విద్యాంసుడు కావడంతోపాటు ప్రముఖ సినీగాయని జానకి స్వయాన పిన్నమ. వారి స్ఫూర్తితో ఆయన చిన్నప్పటి నుంచి సంగీతంపట్ల ఆసక్తితో అంచెలంచెలుగా ఎదిగి గొప్ప సంగీత విద్యాంసుడిగా గుర్తింపు పొందారు. చివరి దశలో తిరుపతిలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రాధ, కుమారులు అనిల్కుమార్, పవన్కుమార్. గరిమెళ్ల నిత్యం సంగీతార్చనతో తన ఆధ్యాత్మిక భక్తి పారవశాన్ని చాటుకున్నారు. 2025 మార్చి 9న తిరుపతిలో తన తుదిశ్వాస వరకు నిత్యనూతన మధుర గానంతో సంగీత ప్రియులను అలరిస్తూ, సంగీతోపాసన చేస్తూ నాదయోగిగా పరమపదాన్ని చేరుకున్న ధన్యజీవి, మధుర గాయకుడు, స్వరకర్త, మహా వాగ్గేయకారుడు బాలకృష్ణ ప్రసాద్.జనరంజకంగా అపూర్వ రాగాల సృష్టికర్త‘వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనవుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’ లాంటి పలు కీర్తనలకు ఆయనే స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు. రాగమే ధ్యాసగా, ఆధ్యాత్మిక సంగీతమే జీవితంగా పయనిస్తూ వేయికి పైగా అన్నమాచార్య సంకీర్తనలను శాస్త్రీయ లలిత, జానపద బాణీలలో జనరంజకంగా స్వరపరిచి ఆ కీర్తనల సాహిత్య పరిమళాలను పండిత, పామరులకు విస్తరింపజేశారు.బహుళ ప్రచారంలో మోహన, హంసధ్వని, శంకరాభరణం, తోడి, కల్యాణి, మాయామాళవగౌళ రాగాలను సరళమైన పద్ధతిలో స్వరపరిచి నొటేషన్లతోపాటు చిన్నచిన్న పుస్తకాలుగా అందుబాటులోకి తెచ్చారు. రతిపతిప్రియ, వరం, నటహిందోళం, శివరంజని, పాడి, మిశ్రవకుళాభరణం వంటి రాగాల్లో ఆయన స్వరపరిచిన సంకీర్తనలు ఎంతో అలరింపజేశాయి. సుందరంజని, సుమశ్రీసుకామవర్థని, సుమగంధి, సునాదనంది, సత్యప్రియ, సంజీవి, సింధుప్రియ, శ్యామకాం¿ోజి, వాణీప్రియ, చిత్రకల్యాణి, నిషాది, ప్రసూన, కోమలి వంటి సుమారు 20 అపూర్వ రాగాలను సృష్టించి అందులో కీర్తనలను రచించి పుస్తకాలతోపాటు ఆడియో రూపంలోనూ తీసుకొచ్చారు. త్యాగరాజస్వామి ఆరాధానోత్సవాల పంచరత్న కీర్తనల గోష్టిగానం తరహాలో ప్రపంచవ్యాప్తంగా సప్తగిరి సంకీర్తనల గోష్టిగానాన్ని ప్రచారం చేసిన ఘనత గరిమెళ్లకే దక్కింది.పురస్కారాలు అనేకం.. సంగీతమే జీవితంగా.. అనునిత్యం ఆధ్యాత్మిక సంకీర్తనల స్వరధారణలో గరిమెళ్ల సంగీత యజ్ఞ ప్రతిభకు విశేష పురస్కారాలు వరించాయి. అన్నమాచార్య సంకీర్తన మహతి, హరికీర్తనాచార్యలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్యాతిక సంస్థల పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. పొట్టి శ్రీరాముల తెలుగు వర్సిటీ నుంచి విశిష్ట పురస్కారంతోపాటు రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్న ప్రతిభాశాలి గరిమెళ్ల. అంతటి సంగీత విద్వాంసుడు 2025 మార్చి 9న తుదిశ్వాస విడిచారు. ఆయన సంగీత సేవా ప్రతిభను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్కు పద్మశ్రీ వరించడంతో సంగీతాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రీ సర్వేను బహిష్కరిస్తాం
తిరుపతి అర్బన్: గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27 నుంచి భూముల రీ సర్వేను బహిష్కరిస్తామని గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ హెచ్చరించింది. సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ఆందోళనలకైనా సిద్ధమని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఆదివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మహాప్రస్థానం పేరిట రాష్ట్రస్థాయిలో గ్రామ సర్వేయర్ల సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు మాట్లాడుతూ.. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పరిష్కారం చూపాలనిడిమాండ్ చేశారు. లేదంటే పోరాటాలకు వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నా చిన్నచిన్న సాకులు చూపిస్తూ పదేపదే మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా సస్పెన్షన్ విధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రీసర్వే విధుల్లో ఉంటున్న గ్రామ సర్వేయర్ల ప్రయాణ భత్యం, కరువు భత్యం, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.మహేష్నాయుడు మాట్లాడుతూ.. జాబ్ చార్టులకు విరుద్ధంగా జాయింట్ ఖాతాల తొలగింపు, పట్టాదారులను నిర్ణయించడం తదితర కీలక అంశాలు రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంటే బలవంతంగా సర్వేయర్లపై రుద్దడం తగదన్నారు. లాప్టాప్లు, రోవర్లు, స్టేషనరీ సరిపడినంతగా సరఫరా చేయకుండా ఇక్కట్లకు గురిచేస్తున్నారని వెల్లడించారు. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 4,722 మంది గ్రామ సర్వేయర్లను సర్వే సంబంధిత శాఖల్లో కౌన్సెలింగ్ విధానంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. గ్రేడ్–1కి సంబంధించి పదోన్నతులు 70శాతం ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. ఐదేళ్ల సర్వే పూర్తి చేసుకున్న వారికి కనీస బేసిక్ రూ.32 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
తిరుమలలో ఘనంగా రథ సప్తమి వేడుకలు
సాక్షి, తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రంగా మారింది. నేడు (ఆదివారం) రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రథసప్తమి (సూర్య జయంతి) రోజున ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు కనువిందు చేయనుండటంతో, ఆ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. దీంతో భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని, క్యూలైన్లలో ప్రవేశిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో, ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి అధిక సమయం పడుతోందని సమాచారం. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు ఆహార పానీయాలను అందిస్తున్నారు.వైభవంగా ఏడు వాహనాల సేవలునేటి రథసప్తమి మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు మలయప్ప స్వామి వారు ఏడు విభిన్న వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ, భక్తులను అనుగ్రహించనున్నారు. ఇది కూడా చదవండి: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం -
నేడు తిరుమలలో రథసప్తమి
తిరుమల :వేంకటేశ్వరస్వామివారి రథసప్తమి మహోత్సవాన్ని ఆదివారం తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాటు పూర్తి చేసింది. రథసప్తమి సందర్భంగా సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు మలయప్పస్వామి సప్త వాహనాల్లో విహరిస్తూ భక్తకోటిని మంగళవారం అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంతోపాటు మాడ వీధుల్లో 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50 వేలు కట్ ఫ్లవర్స్తో అలంకరించారు. రథసప్తమి పర్వదినానికి విస్తృత ఏర్పాటు తిరుమలలో రథసప్తమి పర్వదినం నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు గ్యాలరీల్లో, మాతశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు పీఏసీలో అన్నదానం నిర్వహిస్తారన్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్య ప్రభ వాహనం, 9 నుండి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, 11 నుంచి 12 గంటల వరకు గరుడవాహనం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు హనుమంత వాహనం, అనంతరం 3 గంటల వరకు చక్రస్నానం కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్షవాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ జరుగుతుందన్నారు. విద్యుత్ దీపాల వెలుగులో శ్రీవారి ఆలయంభారీగా తరలి వస్తున్న భక్తులు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల రథసప్తమి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుపతిలో ప్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్ఓ) టోకెన్లు జారీ చేయకపోవడంతో భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల క్యూ శనివారం సాయంత్రానికి తిరుమలలోని సేవాసదన్ వరకు ఉంది. వీరికి శ్రీవారి దర్శనం 16 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 60,726 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ. 1.12 కోట్లు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
రామచంద్రాపురం: మండలంలోని బలిజపల్లిలో ఉన్న ఒంటరి మహిళ మునీశ్వరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు విశ్వనాథ్ (ప్రశాంత్)ను అరెస్టు చేసినట్లు సీఐ సురేష్ కుమార్ శనివారం మీడియాకు వెల్లడించారు. బలిజపల్లికి చెందిన మునీశ్వరి తన నివాసంలో ఒంటరిగా నివసించేవారు. ఈ నెల 11వ తేదీన ఆమె తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలి కుమారుడు కుప్పయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎస్సై భక్తవత్సలం నేతృత్వంలోని బృందం సాంకేతిక టెక్నాలజీతో నిందితుడి కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో రాయలచెరువు సమీపంలోని చిట్టతూరు, కాళేపల్లి జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం నిందితుడు విశ్వనాథ్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ నెల 8వ తేదీనే తాను మునీశ్వరిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గత ఏడాది వెంకట్రామాపురం వద్ద పొలాలు ఒంటరి మహిళ మునీశ్వరి వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడు వద్ద నుంచి రెండు బంగారు చైన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదించిన ఎస్ఐ భక్తవత్సలం, ఏఎస్ఐ ఈశ్వరయ్య ఇతర సిబ్బందిని సీఐ సురేష్ కుమార్ అభినందించారు. -
జగనన్నను సీఎం చేద్దాం
కలసికట్టుగా పోరాడదాం..వెంకటగిరి(సైదాపురం): కలసి కట్టుగా పోరాడాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్రెడ్డి, తిరుపతి టాస్క్పోర్స్ సభ్యులు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి , నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలతతో కలసి వెంకటగిరి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న చంద్రబాబు పాలనకు తగిన బుద్ధి చెబుతామన్నారు. రెండేళ్లు పూర్తికాకముందే టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు గ్రామ కమిటీలు బలోపేతం చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఒక్కరు ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. ఎగిరిపడేవారికి తగిన బుద్ధి చెబుదాం అఽధికారం అండదండలున్నాయని ఎగిరెగిరి పడే వారికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పడం తథ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్ధానాలతోపాటు రెండు లోక్సభ స్థానాల్లో వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 10వేల మందితో జగనన్న సైన్యంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు సముచితమైన స్థానం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు జగనన్న 2.0 సముచిత స్థానం దక్కుతుందని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీకీ పూర్వ వైభవం తేవడానికి సమష్టిగా పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వెంకటగిరిలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, జగనన్నకు బహుమతిగా ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, సీఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్రెడ్డి, బొలిగర్ల మస్తాన్ యాదవ్, ఆత్మకూరు పరిశీలకులు కోటేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటరమణారెడ్డి, నేతలు చిట్టేటి హరికృష్ణ, రామతులసమ్మ, అనిల్కుమార్రెడ్డి, పార్టీ కన్వీనర్లు పులి ప్రసాద్రెడ్డి, కాల్తిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, మన్నారపు రవికుమార్ యాదవ్, మధుసూదన్రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తుమ్మలగుంటలో రథసప్తమికి సర్వం సిద్ధం
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఏర్పాట్లు చేయించారు. స్వామివారు ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటలపైన చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారు. సూర్య జయంతి పర్వదినాన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఇప్పటికే ఆలయంతో పాటు పుష్కరణి పరిసరాలను శుభ్రం చేశారు. గర్భాలయాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. ఆదివారం ఉదయం 5.30 గంటల నుంచే వాహన సేవలు ప్రారంభం అవుతుండడంతో తగిన ఏర్పాట్లు చేశారు. -
ప్రమాద రహిత జిల్లాగా తిరుపతి
తిరుపతి అన్నమయ్యసర్కిల్:రోడ్డు ప్రమాద రహి త జిల్లాగా తిరుపతి ఉండాలనే లక్ష్యంతో డ్రైవర్లు పనిచేయాలని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి జ గదీష్ సూచించారు. డ్రైవర్స్ డే సందర్భంగా శని వారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో రోజాలను అందించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ సురక్షితంగా వాహనాలు నడుపుతున్నారంటూ డ్రై వర్లను కృతజ్ఞతలు తెలిపారు. చెడు అలవాట్లను దూరం చేసి ఆరోగ్యంగా ఉండాలని ఉత్తమ డ్రైవర్గా పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథ్, తిరుపతి డిపో మేనేజర్ సురేంద్ర కుమార్, సెంట్రల్ బస్టాండ్ ఏటీఎం, బస్టాండ్ అసిస్టెంట్ మేనేజర్, బస్టాండ్ కంట్రోలర్లు డ్రైవర్లు పాల్గొన్నారు. పోలీసులే కబ్జాలకు పాల్పడుతున్నారు –బాధితుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి తిరుపతి కల్చరల్: కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా కాపాడాల్సిన పోలీసులే కబ్జాలకు పాల్పడుతూ దౌర్జన్యానికి ఒడిగట్టారని బాధితుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009లో తిరుపతి అర్బన్ మండలం మంగళం సర్వే నంబర్ 109/2 లో 88 అంకణాల స్థలాన్ని తన భార్య అంజనా దేవి పేరుతో కొనుగోలు చేశానన్నారు. అయితే ఈ నెల 7వ తేదీన ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ రామకృష్ణ ఈ స్థలం తనదంటూ దౌ ర్జన్యానికి దిగుతూ ఆ స్థలంలో ప్రహరీ గోడ నిర్మా ణం తలపెట్టారని తెలిపారు. ప్రజలకు అన్యా యం జరిగితే న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. తన స్థలాన్ని ఆక్రమణ నుంచి కాపాడాలని అలిపిరి డీఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. -
ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్ టెకెట్ల విడుదల
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను శనివారం విడుదల చేసినట్లు ఆర్ఐఓ జి రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల లాగిన్లో కానీ నేరుగా httpr://bie.ap.gov.in వెబ్సైట్ నుంచి కానీ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్టికెట్ల డౌన్లోడ్ కోసం తమ ఫస్ట్ ఇయర్ హాల్టికెట్ నంబర్ను లేదా ఆధార్ నంబర్ను నమోదు చేయాల్సి ఉంటుందని సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలు రేణిగుంట: మండలంలోని పిళ్లపాళెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రోటోకాల్, బందో బస్తు విధుల్లో బిజీగా ఉన్న సమయాన్ని అదునుగా చూసుకుని ఇసుకాసురులు యథేచ్ఛగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. శనివారం ఉదయం జేసీబీలతో ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలకు తరలించారు. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో స్థానికులు ఎవరూ అడ్డుకునే సాహసం చేయడం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి హవా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రాంతీయ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేణిగుంట మండలంలోని స్థానిక వ్యక్తి జేసీబీ ఇసుక తవ్వి, ట్రాక్టర్లతో తరలిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అలాగే గాజులమండ్యం పోలీస్ స్టేషన్లోని కొందరు సిబ్బంది సహకరిస్తుండంతో రోజూ రాత్రి వేళల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపి తరలిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి కడప సెవెన్ రోడ్స్ : రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులకు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రానున్న బడ్జెట్లో అఽధిక ప్రాధాన్యత ఇవ్వాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటిపారుదలకు 15 శాతం నిధులు కేటాయించాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరిస్తే నే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సామాజిక న్యాయం ఒనగూరుతుందని అభిప్రాయపడ్డా రు. విభజన హామీలు తక్షణమే అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణరెడ్డి అధ్యక్షతన శనివారం కడపలోని బీసీ భవన్లో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఈఎస్ఎస్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య హాజరయ్యారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ మాట్లాడుతూ సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు అమరావతి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తే సంపద సృష్టి జరుగుతుందా? అని ప్రశ్నించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన నారాయణరెడ్డి మహా నగరాల అభివృద్ధి కోసం నిధులు ఖర్చుచేస్తున్నారు తప్ప ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారి
తిరుపతి క్రైమ్: నగరంలో ఈ నెల 21వ తేదీన కిడ్నాప్ అయినా బాలికను ఈస్ట్ పోలీసులు సురక్షితంగా శనివారం తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు ఆధ్వర్యంలో లాండర్ అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. చింతలచేనులో నివాసం ఉంటున్న సుజిత్ర, ఆమె భర్త మస్తాన్ దంపతుల 13 నెలల పాపను వారి ఇంటికి సమీపంలో నివాసముంటున్న మారియమ్మ, ఆమె భర్త కన్నన్ కందన్ అలియాస్ మురుగన్ ఈనెల 21వ తేదీన కిడ్నాప్ చేశారు. దీనిపై ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు నేతృత్వంలో ఈస్ట్ సీఐ శ్రీనివాసులు మూడు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయన్నారు. పాపని భిక్షాటన చేసేందుకు రూ. 25 వేలకు విక్రయించారన్నారు. బాలికను తీసుకుని తమిళనాడులోని ఈ రోడ్డు రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తుండగా పోలీసులు గుర్తించి, ఈనెల 23వ తేదీన సాయంత్రం తమిళనాడులోని వేలూరు జిల్లా విడదంపట్టు ప్రాంతంలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. వారి వద్ద నుంచి బాలికను, రూ.2500 నగదు, రూ.279 చిల్లర నాణ్యాలు, పాల బుడ్డి, చిన్న టవలు, టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించే విషయంలో డీఎస్పీ భక్తవత్సలం నాయుడు, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ హేమాద్రి సిబ్బంది ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. -
పూటకు 550 బిర్యానీలు అమ్ముతాం
తిరుపతిలో 2020 నుంచి బిర్యానీలకు ప్రత్యేక క్రేజ్ పెరిగింది. చిన్న పిల్లలు, యువత ఇంట్లో వండిన వంటకాలపై శ్రద్ధ చూపడం లేదు. బిర్యానీ ఆర్డర్ పెట్టు అంటూ తల్లిదండ్రులను మారం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం లేకపోలేదు. కరోనా సమయంలో చికెన్, మటన్ ప్రతి ఇంట్లో విపరీతంగా వినియోగించారు. దీంతో ఆ అలవాటుతో ప్రస్తుతం బిర్యానీల క్రేజ్ పెరిగింది. నగరంలో మాది చిన్న బిర్యానీ హోటల్ మాత్రమే. ఆన్లైన్లో ఒక పూటకు 200 బిర్యానీల వరకు పంపుతాం. ప్రజలు నేరుగా మరో 250 బిర్యానీల వరకు కొనుగోలు చేశారు. పండగలు, పార్టీల వంటి ప్రత్యేక రోజుల్లో రోజుకు 2 వేల వరకు సేల్ అవుతాయి.–మస్తాన్, హోటల్ యజమాని, తిరుపతి అతిగా తింటే ప్రమాదమే! ఫైబర్, మినరల్స్ తక్కుగా ఉండి, అఽధిక క్యాలరీలు, నూనె, వనస్పతి, ఫ్యాటీ మీట్స్ ఉండడంతో బిర్యానీ అధికంగా తినేవారికి ఊబకాయం తప్పదు. దీంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెటబాలిక్ సిండ్రోమ్, ప్యాటీ లివర్, షుగర్, బీపీ, జీర్ణక్రియ సంబంధిత వ్యాధుల భారినపడుతున్నా రు. అధికంగా తింటున్న యువత చిన్న వయస్సులోనే గ్యాస్ట్రిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. బిర్యానితో పాటు శీతలపానీయాలతో మరిన్ని ఆరో గ్య సమస్యలకు గురవుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు హోటల్ బిర్యానీలకు దూరంగా ఉండాలి. –డాక్టర్ రమేష్రెడ్డి, వైద్య నిపుణులు, తిరుపతి -
● ఉప్పొంగే శక్తి.. దేశభక్తి
పరాయి పాలన నుంచి దేశం విముక్తి పొంది..సర్వసత్తాక ప్రజాతంత్ర పాలనా వ్యవస్థ ఊపిరిపోసుకున్న మహోన్నత రోజు ఇది. ప్రతి ఒక్కరి హృది దేశభక్తితో సంపూర్ణంగా నిండిన రోజు ఇది..అందుకే ఆ రోజును గుర్తు చేసుకుంటూ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో 26వ తేదీన జరిగే వేడుకలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన భవనానికి త్రివర్ణ రంగుల తో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన భవనం త్రివర్ణ రంగుల వెలుగుల్లో మెరుస్తోంది. దీనికితోడు భవనం ఎదుట ఉన్న జాతీయ పతాకం కనువిందు చేస్తోంది. కాగా కలెక్టరేట్ను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా ముస్తాబు చేశారు. – రేణిగుంట/తిరుపతి అర్బన్ -
పీఏఎల్ఎస్తో తిరుపతి ఐఐటీ భాగస్వామ్య ఒప్పందం
ఏర్పేడు: తిరుపతి ఐఐటీ శనివారం పీఏఎల్ఎస్(పాన్–ఐఐటీ పూర్వ విద్యార్థుల అభ్యసనం, నైపుణ్యాభివృద్ధి)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ, పీఏఎల్ఎస్ ట్రస్టీ ఎన్.అలిమేలు, చైర్మన్ సీఎన్ చంద్రశేఖరన్తో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కాంపిటెన్సీ డెవలప్మెంట్ అండ్ ఔట్ రీచ్ యూనిట్ వ్యూహాత్మక సహకారాల ద్వారా నైపుణ్యాభివృద్ధి, విద్యా ఔట్రీచ్, సామర్థ్య నిర్మాణంలో సంస్థాగత చొరవలను నడిపించడానికి బాధ్యత వహిస్తుందని వారు విశ్వసించారు. వివిధ ఐఐటీలకు చెందిన పూర్వ విద్యార్థుల నేతృత్వంలో స్వచ్ఛంద సేవకుల ఆధారిత విద్యా చొరవ, ఇంజినీరింగ్ విద్యను మెరుగుపరచడానికి, సంస్థలు పరిశ్రమకు సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్లు, ఔత్సాహిక వ్యవస్థాపకులను ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం విద్యార్థి ఇంటర్న్షిప్ కార్యక్రమాలు, అధ్యాపక అభివృద్ధి కార్యకలాపాలు, ఉమ్మడి హ్యాకథానలు వంటి సహకార కార్యక్రమాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డీన్లు ప్రొఫెసర్ అరుణ్ కె. తంగిరాల, ప్రొఫెసర్ శశిధర్ గుమ్మా, ప్రొఫెసర్ రామకృష్ణ సాయి గోర్తి, ప్రొఫెసర్ అనిల్ కుమార్ కాంపిటెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సలహాదారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గోర్తి, రిటైర్డ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె. పి. కృష్ణకుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ రుచిక, పీఏఎల్ఎస్ ప్రతినిధులు సుబ్రమణియన్, మోహన్ పాల్గొన్నారు. -
సప్త వాహనాలపై సప్తగిరీశుడు
ఈ విశ్వంలో కేవలం శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణాలు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన ఏడు గుర్రాలతో, అనూరువైన సారథి నడుపుతున్న రథాన్ని అధిరోహించి అంతరిక్షంలో మన మాంసనేత్రంతో చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథం ప్రత్యేకతను తెలియజేస్తూ, మాఘ శుద్ధ సప్తమిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టినరోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని ‘‘రథసప్తమి’’ పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారు నేడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ విశేషాలు...కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణచైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధుల్లో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్యజయంతిగానే గుర్తింపు పొందింది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది.సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది. ఆయన సారథీ అంతే.. వికలాంగుడైన అనూరుడు క్షణం విశ్రాంతి తీసుకోడు. ఎప్పుడూ విధి నిర్వహణలోనే ఉంటాడు.సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిషులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో ‘అర్క‘ నామంతో సంచరిస్తాడు.సూర్యారాధన ఫలాలుఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చె΄్తారు. శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్ని పొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. సూర్య నారాయణ స్వామిని నిత్యం ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణంతో సమానం. అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాలను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని శాస్త్రవచనం. రథసప్తమి ... శ్రీవారి వాహన సేవల వివరాలురథసప్తమి సందర్భంగా తిరుమలలో స్వామివారు ఈనెల 25వ తేదీ, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు ద్శనమిస్తారుఉదయం 5.30 నుండి 8 వరకు : సూర్య ప్రభ వాహనం ఉదయం 9 నుండి 10 వరకు : చిన్న శేష వాహనం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 వరకు : గరుడ వాహనం మధ్యాహ్నం 1 నుండి 2 వరకు : హనుమంత వాహనం మధ్యాహ్నం 2 నుండి 3 వరకు : చక్రస్నానం సాయంత్రం 4 నుండి 5 వరకు : కల్పవృక్ష వాహనం సాయంత్రం 6 నుండి 7 వరకు : సర్వభూపాల వాహనంరాత్రి 8 నుండి 9 వరకు : చంద్రప్రభ వాహనం– అలిదేన లక్ష్మీకాంత్, సాక్షి, తిరుమల -
వైఎస్సార్ సీపీ విద్యార్థి నేతలకు నోటీసులు
తిరుపతి సిటీ: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఓబుల్ రెడ్డి, విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షుడు ప్రేమ్కుమార్కు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. విద్యార్థి సంఘాల నేతలపై ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా చేసినందుకు కేసులు పెట్టడం దుర్మార్గమని, ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని వారు అన్నారు. ఎస్వీయూలో రిమోట్ పైలట్ శిక్షణ తిరుపతి సిటీ: ఎస్వీయూలో చిన్న, మధ్యస్థ తరగతి రోటర్ క్రాఫ్ట్ కింద రిమోట్ పైలట్ శిక్షణను నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ఆమోదం లభించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన 18–65 ఏళ్ల వయస్సుగల ఔత్సాహికులకు డ్రోన్ పైలెట్ శిక్షణకు అర్హులుగా నిర్ణయించారు. 5 నుంచి 7 రోజుల పాటు శిక్షణ పొందిన వారికి 10 ఏళ్ల పాటు చెల్లుబాటు అయ్యేలా సర్టిఫికెట్లను అందజేయనున్నారు. శిక్షణ విజయవంతగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు భారతదేశం అంతటా వాణిజ్య, పారిశ్రామిక, పరిశోధన, ప్రజా సేవా అనువర్తనాల కోసం చట్టబద్ధంగా డ్రోన్లను ఆపరేట్ చేయడానికి అర్హులుగా పరిగణిస్తారు. ఈ విషయంపై ఎస్వీయూ వీసీ టాటా నరసింగరావు క్యాంపస్లోని డ్రోన్ శిక్షణా కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ త్వరలో శిక్షణకు సంబంధించి కోర్సు ఫీజు, సిలబస్, శిక్షణ సమయాలను వెల్లడిస్తామని తెలిపారు. పీబీసీ ఏరో హబ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ప్రణవ్ కుమార్ చిట్టే , రితేష్ కుమార్ సింగ్, రూసా కోఆర్డినేటర్లు ఆచార్య సుచరిత ఆచార్య బాలాజీ, సీఈఓ వంశీ రాయల్ హాజరయ్యారు. శ్రీసిటీలో బాధ్యతాయుత వ్యాపార విధానాలపై వర్క్షాప్ శ్రీసిటీ (వరదయ్యపాళెం): తయారీ రంగ సంస్థలను అజెండా–2030కు సంసిద్ధం చేసే క్రమంలో భాగంగా ’బాధ్యతాయుత వ్యాపార విధానాలు’ అంశంపై శుక్రవారం శ్రీసిటీలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీసిటీ, దక్షిణ భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (ఎస్ఐసీసీఐ) సంయుక్తంగా స్థానిక స్టేషన్–ఎస్ ఆడిటోరియంలో నిర్వహించింది. ఎస్ఐసీసీఐ సీఎస్ఆర్ కమిటీ చైర్మన్ రత్నవేల్ రాజన్ మాట్లాడుతూ మానవ హక్కులు, స్థిరత్వాన్ని వ్యాపార కార్యకలాపాల్లో భాగం చేయడంతో పరిశ్రమలను శక్తివంతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు. ది రెమెడీ ప్రాజెక్ట్ సీఈఓ ఆర్చనా కోటేచా, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ)కు చెందిన బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్ స్పెషలిస్ట్ నుస్రత్ ఖాన్ మాట్లాడుతూ గ్లోబల్, జపాన్, భారతీయ నియంత్రణా విధివిధానాలపై అవగాహన, వివిధ విభాగాల్లో తయారీ రంగ సంస్థలు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. భారత తయారీ రంగంలో బాధ్యతాయుత వ్యాపార విలువలను పెంపొందించే ప్రక్రియలో భాగమైన ఈ వర్క్షాప్ చొరవను ప్రశంసించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, వర్క్షాప్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీసిటీ ఏజీఎం (హెచ్ఆర్) వి.శివకుమార్ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించగా, ప్రశ్నోత్తరాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమం ముగిసింది. -
ఫౌండేషన్ విద్య.. మిథ్య!
ఏర్పేడు: ‘‘రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకొచ్చిన ఫౌండేషన్ స్కూల్ విధానంతో రాష్ట్రంలో సర్కారు విద్యావ్యవస్థ అంపశయ్యకు చేరువవుతున్నదనేందుకు ఈ పాఠశాలలో అమలవుతున్న విద్యనే నిలువెత్తు నిదర్శనం. అది ఏర్పేడు మండలం గుడిమల్లం ప్రాథమిక పాఠశాల.. ఇక్కడ ఉపాధ్యాయురాలు జయంతి ఒక్కరే తరగతి గదిలో కూర్చుని పాఠశాల గోడలకు పాఠాలు చెప్పాల్సిన దుస్థితి. ఈ పాఠశాలలో 2వ తరగతిలో ఎం.శివ అనే ఒక్క విద్యార్థే చదువుతున్నాడు. గతంలో ఈ పాఠశాలలో 14 మంది విద్యార్థులు చదువుతుండగా, ఇక్కడ ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సమీపంలోని రావిళ్లవారికండ్రిగ మోడల్ ప్రైమరీ స్కూల్లో కలిపేశారు. దీంతో ఇక్కడ ఫౌండేషన్ స్కూల్ పేరుతో 1,2 తరగతులను మాత్రమే నిర్వహిస్తున్నా రు. ఈ రెండు తరగతులకు ఒక్క విద్యార్థే ఉన్నాడు. ఆ చిన్నారికి పాఠ్యాంశాలను బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయిని నియమించారు. ఇది కేవలం ఒక్క గుడిమల్లం ఫౌండేషన్ స్కూల్కే పరిమితం కాదు. జిల్లాలోని దాదాపు అన్నీ ఫౌండేషన్ స్కూళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. గత ప్రభుత్వ పాలనలో గుడిమల్లం పాఠశాలను నాడు–నేడు నిధులు రూ.12 లక్షలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ వసతులన్నీ అడవికాచిన వెన్నెలను ప్రతిబింబిస్తోంది. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
తిరుపతి రూరల్: అవిలాల గ్రామ పంచాయతీ సుబ్బయ్య కాలనీలో కాంక్రీట్ పనులు చేస్తున్న యువకుడు విద్యుత్షాక్ గురై మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సుబ్బయ్య కాలనీలోని ఓ ఇంట్లో శుక్రవారం కాంక్రీట్ పనులు చేస్తున్న మహేష్ (25) అనే యువకుడుకి విద్యుత్తు షాక్ గురయ్యాడు. దీంతో తోటి కార్మికులు అతన్ని హుటాహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మహేష్ అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడు తిరుచానూరు యోగిమల్లవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా తోటి కార్మికులు చెబుతున్నారు. తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్టు
రూ.9 లక్షలు విలువైన సొత్తు రికవరీ రేణిగుంట: రైళ్లల్లో ప్రయాణికుల సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయని వచ్చిన వరుస ఫిర్యాదుల మేరకు రెండు ప్రత్యేక బృందాలతో విచారించిన రేణిగుంట రైల్వే పోలీసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అలీపురుదూర్ జిల్లాకు చెందిన హరిబర్మన్ (31) నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రేణిగుంట రైల్వేస్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే జీఆర్పీ సీఐ యతేంద్ర ఈ వివరాలను వెల్లడించారు. రైళ్లల్లో మొబైల్ ఫోన్లు చోరీ చేసిన వెంటనే సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి వారికి తెలియకుండానే భారీ ఎత్తున నగదు చోరీ చేసి, ఆ డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేసేవాడని తెలిపారు. రేణిగుంట పరిధిలో ఇప్పటికీ సుమారు ఐదు సంఘటనలు జరిగాయని, వాటి ద్వారా సుమారు రూ.18 లక్షల వరకు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడని అన్నారు.ఈ నేరాలపై రేణిగుంట జీఆర్పీ సీఐ యతేంద్ర, కడప జీఆర్పీ సీఐ సుధాకర్ రెడ్డి సంయుక్తంగా రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. దర్యాప్తు బృందాలు ఫిర్యాదుదారుల మొబైల్ ఫోన్ డేటా, సీసీ కెమెరాల ఆధారంతోపాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు నుంచి రూ.లక్షల విలువచేసే బంగారం, మొబైల్ ఫోన్లు, ట్యాబ్, నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఆర్పీఎఫ్ సీఐ వెంకటేశ్వర్లు, చైన్నె రైల్వేక్రైమ్ బ్రాంచ్ సీఐ నవీన్ కుమార్, ఎస్ఐలు మధుసూదన్, రమేష్, జగదీష్ పాల్గొన్నారు. -
నేటి నుంచి బెంగళూరు–అలీపుర్దావార్ వీక్లీ ఎక్స్ప్రెస్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: బెంగళూరు–అలీపుర్దువార్ మధ్య కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. శనివారం బెంగళూరు నుంచి ఏపీ మీదుగా పశ్చిమబెంగాల్ అలీపుర్దువార్ వరకు వెళ్లనుంది. ఏపీలోని కుప్పం, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్త వలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వేస్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. దీంతో ఈ రూట్లల్లో ప్రయాణించేవారితో పాటు బెంగళూరు వెళ్లేవారికి ఈ రైలు బాగా ఉపయోగపడనుంది. -
ఆలకించండి.. ఆదుకోండి
తిరుపతి అర్బన్ : సమస్యలపై ఎస్సీ, ఎస్టీలకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి వివిధ సమస్యలతో అర్జీదారులు తరలివచ్చారు. కేవీబీపురం మండలంలో ముంపునకు గురైన ఓళ్లూరు యానాది కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. పంట భూములు గుంతలమయంగా మారి నాశనం అయ్యాయని న్యాయం చేయాలని కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. అలాగే పలువురు ఎస్సీలు తమకు అర్హత ఉన్నా పింఛన్ రావడంలేదని.. ఇప్పించాలంటూ వేడుకున్నారు. పీజీఆర్ఎస్కు 336 అర్జీలు వస్తే అందులో 258 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే రావడం గమనార్హం. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీలకు చెందిన పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలను ప్రత్యేకంగా పరిష్కారం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్తో పాటు ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా ఎస్సీ,ఎస్టీ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ప్రత్యేకంగా నిర్వహించిన పీజీఆర్ఎస్లో మెడికల్ బృందం ఏర్పాటు లేదు, బేబీ ఫీడింగ్ రూమ్ను లాక్ చేశారు. కుర్చీలు చాలీచాలకుండా ఏర్పాటు చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వలముని, పర్వతయ్య, పెంచలయ్య, సరస్వతమ్మ, తాజుద్దీన్, వెంకటరమణ, ధనశేఖర్ పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు 94 కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పీజీఆర్ఎస్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యాక్రమం 40 నిమిషాలు ఆలస్యంగా మొదలుపెట్టారు. అయినప్పటికీ వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు 94 అర్జీలను అధికారులకు అందజేశారు. ప్రధానంగా రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగులు 66 సమస్యలపై, జీఎస్డబ్ల్యూఎస్ వారు ఏడు, ఎడ్యుకేషన్ వారు 3, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వారు 3, పంచాయతీరాజ్ వారు 3, ఆర్టీసీకి ఉద్యోగులు 3, సోషల్ వెల్ఫేర్ వారు 3, విద్యుత్ విభాగం వారు 2, ట్రెజరీ విభాగం వారు 2, మెడికల్ విభాగం నుంచి 1, సీపీవో విభాగం నుంచి ఒక సమస్యపై కలెక్టర్కు అర్జీలను అందజేశారు. పింఛన్ వస్తేనే మాకు బతుకు మాది శ్రీకాళహస్తి మండలంలోని ఎర్రగుడిపాడు ఎస్సీ కాలనీ. మా ఎస్సీ కాలనీలోనే 10 మందికి పైగా వృద్ధాప్య పింఛన్కు అర్హులైన వారు ఉన్నారు. ప్రభుత్వం నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి రాలేదంటూ వాయిదా వేస్తున్నారు. పింఛన్ వస్తేనే మాకు బతుకు, మాపై దయచూపండి. –ఎర్రగుడిపాడు ఎస్సీ కాలనీ వాసులు,శ్రీకాళహస్తి మండలం -
కబ్జాకోరులకు సహకరిస్తే సహించం
పుల్లంపేట : భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వారికి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కబ్జాకోరులకు అధికారులు అండగా నిలిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా తిప్పాయపల్లె, అన్నాసముద్రంలో ప్రభుత్వ, గ్రామంలో ప్రస్తుతం లేనివారి డీకేటీ భూములే లక్ష్యంగా కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారన్నారు. సుమారు రూ.50కోట్ల విలువైన 50 ఎకరాలు ఆక్రమణకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తిప్పాయపల్లెలోని సర్వే నంబర్లు 335, 336, 337 ,338లో ఉన్న డీకేటీ భూములను అన్నాసముద్రానికి చెందిన కూటమి నేత కబ్జా చేశారని, బాధితులు ఆర్డీఓ, కలెక్టర్, నందలూరు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వెల్లడించారు. చివరకు బాధితులు సుబ్బరత్నమ్మ, చెంగయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం అక్రమార్కులకే అండగా నిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేసేంతగా బరితెగించారని తెలిపారు. ఈ క్రమంలోనే ఒకే కుటుంబానికి చెందిన అయ్యల రాజశేఖర్రెడ్డి, శంకరమ్మ, రిషిత, హర్షిత, వెంకటనారాయణరెడ్డికి 20 ఎకరాలు అప్పగించిన ఘనత కూడా రెవెన్యూ అధికారులకే దక్కిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పుల్లంపేట మండలంలోని దాదాపు వెయ్యి ఎకరాల వరకు కబ్జాకు గురైందని ఆరోపించారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి ఆక్రమణలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఆకేపాటి.శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్సీపీ నేత సుదర్శన్రెడ్డి, పార్టీ చేనేత విభాగం కన్వీనర్ బోగా.పార్ధసారథి పాల్గొన్నారు. -
ఆలకించండి.. ఆదుకోండి
ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్కు పెద్ద ఎత్తున అర్జీదారులు తరలివచ్చారు. సైబర్ నేరగాడి అరెస్టు పశ్చిమ బెంగాల్కు చెందిన సైబర్ నేరగాడిని రేణిగుంట జీఆర్పీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.చేనేతల డిమాండ్లు ఇవీ శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026‘మేం అధికారంలోకి వస్తే చేనేత బతుకుల్లో వెలుగులు నింపుతాం.. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం..ఇదీ నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ.. గద్దె నెక్కిన తరువత ఆ హామీ తూచ్ అన్న చందంగా మారింది. బాబు హామీల అమలుకు ప్రతిపక్షాల ఒత్తిడితో తూతూ మంత్రంగా చేనేతకు ఉచిత విద్యుత్ జీఓ.. ఏడాదిగా అమలులోకి రాని గవర్నమెంట్ ఆర్డర్. వెరసి నెలానెలా పెరుగుతున్న విద్యుత్ చార్జీలతో చేనేత బతుకుల్లో చీకట్లు అలుమున్నాయి. పెట్టుబడులు భరించలేక నేత పనులు సాగక.. పండుగపూటా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. మగ్గం నేస్తున్న దృశ్యంవెంకటగిరి(సైదాపురం): ఉచిత విద్యుత్ జీఓ ఇచ్చి ఏడాది కావస్తున్నా అమలు కాకపోవడంతో కాంతి లేని సంక్రాంతిని జరుపుకోవాల్సి వచ్చిందని నేతన్నలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవర్ లూమ్స్కు మంచి రోజులు వస్తాయని నేతన్నలు ఆశించారు. అయితే ప్రభుత్వం కొలువు దీరి రెండేళ్లు కావస్తున్నా విద్యుత్ బాదుడు కొనసాగుతూనే ఉంది. కంటి తుడుపుగా జీఓ ఇచ్చి చేతులు దులుపుకోవడంపై నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఓ అమలుపై ఇప్పటికే విద్యుత్ అధికారులకు వినతులు ఇచ్చిన నేత కార్మికులు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. ఉచిత విద్యుత్ జీఓతో నేతన్న జీవితాల్లో కొత్త వెలుగులు విరజిమ్మాతాయనుకుంటే గాఢాందకారం అలుముకుంది. కొత్త ఏడాదిలోనైనా చంద్ర కాంతులతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలన్న నేతన్నలకు నిరాశే మిగిలింది. వెంకటగిరి నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద రంగం చేనేత రంగం. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోంది. లయబద్ధంగా వినడే పవర్లూమ్స్ ధ్వని వినిపించడం తగ్గిపోతుంది. ఇందుకు వివిధ సుంకాల పేరిట పెరిగిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. చాలీ చాలని కూలీలతో తమ జీవితాలు అప్పుల పాలవుతన్నాయనని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత విద్యుత్ జీఓ నంబర్ 44కు ఏడాది కావస్తున్న అమలు కాలేదు. ఒత్తిడి తెచ్చినా... అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో దిగివచ్చిన బాబు ప్రభుత్వం గత ఏడాది మార్చిలో జీఓను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల వాస్తవ సంఖ్యను పవర్ లూమ్ యానిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా నూలు, పట్టు చేనేత కుటుంబాలు 2.79 లక్షల మంది ఉండగా కేవలం 93 వేల మందిగా చూపించారు. అలాగే మరగ్గాలు 81 వేలు ఉండగా 10,534 ఉన్నట్లు చూపారు. ఈ లెక్కల ప్రకారం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు పవ్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు జీఓలో స్పష్టం చేశారు. ఇందుకు ఏడాదికి సుమారు రూ. 125 కోట్లు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. జీవో అమలుకు డిస్కామ్ సంస్థలు బడ్జెట్ మంజూరు చేయాలని ప్రతిపాదించాయి. అయితే నిధులు విడుదల కాకపోవడంతో నేటికీ జీఓ అమలకు నోచుకోలేదు. ప్రతి నెలా యథావిధిగా పెరిగిన విద్యుత్ చార్జీలు బిల్లును అందుకుంటున్న నేతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఇంధన శాఖకు తగిన బడ్జెట్లో నేత కార్మికులకు ఉచిత విద్యుత్ జీఓ విడుదలతోపాటు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఏడాది గడిచినా జీఓ అమలు కావడంలేదు. దీనిపై అధినేతను అడగలేక అడుగుతున్నవారికి సమాధానాలు చెప్పలేక స్థానిక నేతులు తికమక పడుతున్నారు.గత ప్రభుత్వంలో ఆదుకున్న నేతన్న నేస్తం ఎన్విరాన్మెంట్ పరీక్షకు 381మంది గైర్హాజరు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షకు 381మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జి రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు పక్కా ఉత్తీర్ణత సాధించాల్సిన ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 30,373 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 29,992 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ తిరుపతి తుడా: మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగ యువతకు హోటల్ మేనేజ్మెంట్ రంగంలో పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మెప్మా సంచాలకులు ఇప్రీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. టాటా సంస్థ సహకారంతో పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు కర్ణాటక రాష్ట్రం తుమకూర్లోని హాస్పిటల్ స్కిల్ సెంటర్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాఽధి, ఉద్యోగవకాశాలను కల్పిస్తారని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో భోజన వసతితోపాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా అందిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ట్రైనర్ మధుసూదన్రావు 8309154991 నంబర్లో సంప్రదించాలని సూచించారు శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 64,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.84 కోట్లు స మర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తుల కు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. జీఓ నంబర్ 44ను వెంటనే అమలు చేయాలి. మొత్తం రాష్ట్ర బడ్జెట్ నుంచి 10 శాతం రూ.8 వేల కోట్లు కేటాయించాలి. నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలి. నూలు, సిల్క్కు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి. చేనేత కుటంబాలకు రూ.5 లక్షలు వరకు వడ్డీ లేని రుణాలుఇవ్వాలి. గృహం, వర్క్షెడ్ పతకాన్ని అమలు చేయాలి. జీవిత బీమా సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసిన కొనసాగించాలి. సహకార సంఘాలను బలోపేతం చేయాలి. ప్రత్యేకపోరాటానికి సిద్ధం ఉచిత విద్యుత్పై గత ఏడాది మార్చిలో జీఓ విడుదల చేసినప్పటీకీ పథకం అమలు చేయకపోవడం నేత కార్మికుల ను మోసం చేయడమే. దీనిపై ఇప్పటికే పలుచోట్ల అధికారులకు వినతి పత్రం సమర్పించాం. అయినా ఫలితం శూన్యం. విధిలేక అన్నీ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో కలసి ప్రత్యక్ష పోరాటానికి నేత కార్మికులు సిద్ధమవుతున్నారు. – కూన మల్లిఖార్జునరావునేతన్న నేస్తం అమలు చేయాలి గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అమలుచేయాలి. ఈ పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ. 24వేలు ఆర్థిక సాయం అందడంతో మా కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఉచిత విద్యుత్తోపాటు నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలి. –రవి, నేత కార్మికుడు, వెంకటగిరి ఉచిత విద్యుత్ అమలు చేయాలి ఉచిత విద్యుత్ పేరిట జీఓ ఇచ్చి ఏడాదవుతున్నా అమలు చేయకపోవడం దారుణం. పెరిగిన విద్యుత్ చార్జీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 15 ఏళ్లుగా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఉచిత విద్యుత్ జీఓను వెంటనే అమలు చేయండి. – బాలాజీ, నేత కార్మికుడు, వెంకటగిరిగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. అంతేగాకుండా విద్యుత్చార్జీలు నుంచి 96 పైసల యూజర్స్ చార్జీలను తగ్గించి వెసులుబాటు కల్పించింది. గత ఎన్నికల సమయంలో ప్రతి పక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు బహిరంగ సభల్లో చేనేత పవర్లూమ్స్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటూహామీ ఇచ్చారు. దీనిని గుడ్డిగా నమ్మిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం నాటి ఎన్నికల హామీకి ఎగనామం పెట్టడంతో పాటు వివిధ సుంకాలపేరిట విద్యుత్ చార్జీలను పెంచి నేత కార్మికుల నడ్డి విరుస్తున్నారు. -
నీలగిరి తైలం చెట్ల కూల్చివేత
ఏర్పేడు: మండలంలోని చిందేపల్లి రెవెన్యూ పరిధిలోని 5 ఎకరాల పట్టా భూమిలో సాగు చేస్తున్న నీలగిరి తైలం చెట్లు గురువారం రాత్రి నీలగిరి తైలం చెట్లు దౌర్జన్యంగా దున్నేసి చదును చేశారు. చిందేపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 113–12 నుంచి 113–24 వరకు 4.99 ఎకరాలు డీకేటీ భూమి నాగంపల్లికి చెందిన కై లాసం చెంగారెడ్డి భార్య కె.రమణమ్మ పేరిట డీకేటీ పట్టా ఉంది. రెండేళ్ల కిందట ఆ పొలంలో నీలగిరి తైలం మొక్కలు నాటి సాగు చేసుకుంటున్నారు. అయితే తిరుపతికి చెందిన మున్సిపల్ ఉద్యోగి జ్యోతిరెడ్డి ఈ భూమిని చెంగారెడ్డి సోదరుడు మునికృష్ణారెడ్డి తనకు విక్రయించాడని, పొలాన్ని వదిలిపెట్టాలని బెదిరించేవాడన్నారు. అయితే గురువారం రాత్రి దౌర్జన్యంగా ట్రాక్టర్లు తీసుకొచ్చి రెండేళ్ల నుంచి సాగు చేస్తున్న నీలగిరి తైలం చెట్లను నేలమట్టం చేశారన్నారు. ఈ మేరకు బాధితులు మున్సిపల్ ఉద్యోగి జ్యోతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏర్పేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి కోర్టుకు హాజరైన చెవిరెడ్డి మోహిత్రెడ్డి తిరుపతి రూరల్: వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శుక్రవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌటింగ్ సెంటర్ వద్ద జరిగిన గొడవల్లో అక్రమంగా 36 మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడం, అదే కేసులో 37వ నిందితునిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చేర్చడం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వాయిదాకు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు, న్యాయమూర్తి కేసు వాయిదా వేయడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు. అనంతరం కోర్టు బయట మోహిత్ రెడ్డి మాట్లాడుతూ అక్రమంగా పెట్టిన కేసులో తనతో పాటు 37 మంది కోర్టుకు రావాల్సి వచ్చిందని, ప్రతిపక్షంలో ఇలాంటి అక్రమ కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. తనతోపాటు కోర్టుకు వచ్చిన వారందరికీ ధైర్యం చెప్పిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందరికీ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్ తిరుపతి సిటీ : జిల్లాలో మూడు రోజులుగా జేఈఈ మెయిన్స్ సెషన్–1 పరీక్షలు కొనసాగుతున్నాయని సిటీ ఏన్టీఏ కోర్డినేటర్ కై లాస్నాథ్ తెలిపారు. జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాలలో శుక్రవారం మూడవ రోజు జరిగిన పరీక్షకు 2111 మంది హాజరు కావాల్సి ఉండగా 2076 మంది హాజరైనట్లు చెప్పారు. ఎరచ్రందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎరచ్రందనం చెట్లను నరకడానికి ప్రయత్నించిన కేసులో తమిళనాడు, కృష్ణగిరి జిల్లాకు చెందిన మురుగన్కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్న్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక దళం సిబ్బంది 2017లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. నిందితుడు మురుగన్ అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించడాన్ని ఫారెస్ట్ సిబ్బంది గుర్తించి, అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు. మురుగన్పై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అడ్మిషన్ పేరుతో రూ.5,65 లక్షల ఆన్లైన్ మోసం తిరుపతి రూరల్: యూఎస్లో ఎంఎస్ అడ్మిషన్ కోసం ఆన్లైన్లో ప్రయత్నిస్తున్న ఓ మహిళను ఇన్స్ర్ట్రాగామ్లో ఓ ప్రకటన కపించడం, ఆ ప్రకటనలో పరిచయమైన ఫేక్ కోఆర్డినేటర్లు మెహ ర్, నితీష్, షేక్ సోనాకు అడ్మిషన్ తీసిస్తామని నమ్మించి రూ. 5,65,841 కాజేసిన ఘటన తి రుపతిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లి ఆమోగ్య విల్లా ట్రీ అపార్ట్మెంట్ బి బ్లాక్ 308లో నివసిస్తున్న 49ఏళ్ల ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేసి నగదు కాజేశారు. 2025 డిసెంబర్ నెలలో ఆమె కుమార్తె ఎంఎస్ చదు వుల నిమిత్తం యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇన్స్ట్రాగామ్లో ‘‘యాక్సలేరటెడ్ పా థ్ వే ప్రోగ్రాం ఫర్ ఎంఎస్’’ అనే ప్రకటన క నిపించింది. ఆ ప్రకటన ద్వారా సంప్రదించగా మెహర్, నితీష్. షేక్సోనాలు తాము అప్గ్రేడ్ కోఆర్డినేటర్లుగా పరిచయం చేసుకుని గూగుల్మీట్ ద్వారా వివరాలు తెలిపారు. సీట్ కన్ఫా ర్మ్ అయ్యిందని నమ్మించి వివిధ తేదీల్లో ఫోన్ పే, బ్యాంక్ ట్రాన్స్సెక్షన్, ఎడ్యుకేషన్ లోన్ ద్వారా 5,65,841 తీసుకున్నట్టు బాధితురాలు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ కు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు. -
బావిలో పడి వ్యక్తి మృతి
రామచంద్రాపురం: బావిలో పడిన మోటారును తీసే క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం కమ్మపల్లి పంచాయతీ పరిధిలోని లింగమనాయుడు కండ్రిగ బాబు నాయుడు వ్యవసాయ బావి వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. వెంకటరామాపురం పంచాయతీ శవాయి కాల్వ హరిజనవాడ గ్రామానికి చెందిన రాజేష్ (40) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో లింగమనాయుడు కండ్రిగలోని బాబు నాయుడు వ్యవసాయ బావిలో పడిపోయిన మోటారును బయటకు తీసేందుకు రాజేష్ను తీసుకెళ్లారు. బావిలోకి దిగిన రాజేష్ ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించాడు. స్థానికుల అనుమానాలు రాజేష్ మృతిపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేష్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసిన చంద్రయ్య, వేణుగోపాల్ నాయుడు అతడిని బావి వద్దకు తీసుకెళ్లారని సమాచారం. మోటార్ పైపును లాగే క్రమంలో వారు పైపును వదిలేయడంతో రాజేష్ బావిలో పడిపోయాడని, అతను పడిన వెంటనే కాపాడే ప్రయత్నం చేయకపోవడం వలన ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఓ సామాజిక వర్గం పోలీసుల అండతో ప్రమాదాన్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారన్నారు. మృతుడికి భార్య సుమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మది.. చెదిరినది
స్వర్ణముఖి నదిని కుళ్లబొడిచేస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్వేసి ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. నది చుట్టూ పొర్లు కట్టలను ధ్వంసం చేసి రవాణాకు మార్గం ఏర్పాటుచేసుకుని ట్రాక్టర్లు, భారీ వాహనాల్లో రవాణా చేస్తున్నారు. రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచి అక్కడి నుంచి తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు దర్జాగా తరలిస్తున్నారు. భారీ వర్షాలు వస్తే పొర్లు కట్టలు తెగ్గిట్టిన ప్రాంతాల నుంచి వరద నీరు గ్రామాలను ముంచెత్తుతుందని సమీప పల్లెల ప్రజలు భయపడుతున్నారు. అధికార పార్టీ నాయకులే ఇసుకాసురులుగా మారడంతో అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయుడుపేట టౌన్: స్వర్ణముఖి నది నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇసుకాసురులు ఖాతరు చేయడం లేదు. నాయుడుపేట మండల పరిధిలోని అయ్యప్పరెడ్డి పాళెం సమీపంలో స్వర్ణముఖి నది నుంచి ప్రతిరోజు ట్రాక్టర్లలో అధిక సంఖ్యలో తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. స్వర్ణముఖి నదిలో తవ్వేసిన ఇసుకను రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి పట్టపగలే దర్జాగా టిప్పర్లలో తమిళనాడు ప్రాంతానికి రవాణా చేస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్వేయడంతో పలుచోట్ల స్వర్ణముఖి నదిలో అగాధాలు ఏర్పడ్డాయి. ముంపునకు గురయ్యే ప్రమాదం ఇసుక అక్రమ రవాణా కోసం స్వర్ణముఖి నది పొర్లు కట్టలను ధ్వంసం చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తే సమీప గ్రామాలు ముంపునకు గురేయ్యే ప్రమాదం ఉంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి స్వర్ణముఖి నది సమీపంలో తెగ్గొట్టిన పొర్లు కట్టలను పూడ్చివేసి, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. డీస్పీకి ఫిర్యాదు అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ సమీపంలో స్వర్ణముఖి నది నుంచి భారీ హిటాచీ యంత్రాలతో టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణాకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు కొందరు గురువారం రాత్రి నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పరిశీలించి చర్యలు చేపడుతామని డీఎస్పీ హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.రోజుకు వందల ట్రాక్టర్ల అక్రమ రవాణా చిల్లకూరు, కలవకూరు, కప్పగుంట కండ్రిగ గ్రామాల వద్ద స్వర్ణముఖి నది నుంచి జేసీబీలతో తవ్వేసి ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రతి రోజూ వందల ట్రాక్లర్ల ఇసుకను నాయుడుపేట సమీపంలోని మేనకూరు సెజ్లోని పరిశ్రమలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుకాసురులంతా అధికార పార్టీ నాయకులే కావడంతో అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. నది పొర్లు కట్టలు ధ్వంసం నాయుడుపేట పట్టణ పరిధిలోని ఏల్ఏ సాగరం, బీడీ కాలనీ, మర్లపల్లి, అన్నమేడు, కల్లిపేడు, మూర్తిరెడ్డి పాళెం, భీమవరం తదితర గ్రామాల్లో చాలా చోట్లు స్వర్ణముఖి నది పొర్లు కట్టలను సైతం ధ్వంసం చేశారు. ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల రాకపోకలు అనువుగా ఏర్పాట్లు చేశారు. ఆ మార్గంలో పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలించేస్తున్నారు. మండల పరిధిలోని చిగురుపాడు, మర్లపల్లి, అయ్యప్పరెడ్డి పాళెం తదితర గ్రామాల్లో అక్రమ రవాణాపై ప్రశ్నిస్తున్న గ్రామస్తుల ఇసుకాసురులు దౌర్జ్యనానికి దిగుతున్నారు. చిగురుపాడు గ్రామం వద్ద స్వర్ణముఖి నది వద్ద ఇటీవల అధికారులు అడ్డు కట్టలు వేశారు. వాటిని తొలగించి మళ్లీ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని పలు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దుండగుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులకు ఈ వివరాలను ఆయన వెల్లడించారు. తడ మండలం చేన్నుగుంట గ్రామానికి చెందిన వేణు (22) జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నాడు. ఇంట్లో గొడవ పడి మరదవాడలోని అన్న ఇంటి వద్ద ఉండేవాడు. గురువారం ఉదయం కారణిలోని షిర్డిసాయిబాబా మందిరంలో హుండీని తీసుకుని పొలాల వద్ద పగలగొట్టుతుండగా గ్రామస్తులు పట్టుకుని, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. నీర్పాకోట గ్రామంలోని చెంగాళమ్మ గుడి, తలారివెట్టులోని ఆలయాల్లో చోరీ చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఎయిర్ అలియన్స్ విమానం గంట ఆలస్యం రేణిగుంట: హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చే ఎయిర్ అలియన్స్ విమానం గురువారం ఒక గంట ఆలస్యంగా చేరింది. మామూలుగా ఉదయం 7.10 గంటలకు వచ్చి మళ్లీ 7.50 గంటలకు తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా గురువారం ఉదయం 8.20కి చేరుకుని 8.50 గంటలకు తిరుగు ప్రయాణం అయింది. ఆలస్యానికి గల కారణాలు అధికారులు తెలపలేదు. నాయుడుపేటలో 3 వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్ నాయుడుపేట టౌన్: రైల్వేస్టేషన్లో కొత్తగా మూడు వీ రైల్వేస్టేషన్ల స్టాపింగ్ ఏర్పాటుకు రైల్వే ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చినట్లు సదరన్ రైల్వే డీఆర్యూసీసీ సభ్యుడు పేర్నాటి జోసఫ్, వినియోగదారుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మస్తాన్ తెలిపారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితోపాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చొరవతో కొత్తగా ఎక్స్ప్రెస్ స్టాపింగ్కు అనుమతులు వచ్చాయని వారు హర్షం వ్యక్తం చేశారు. ట్రైన్ నెంబర్ 16523/16524 ఎస్ఎంవీటీ బెంగళూరు టూ బలుర్ఘాట్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం 3.18 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఆదివారం 6.18 గంటలకు నాయుడుపేటలో ఆగనుందని తెలిపారు. ట్రైన్ నెంబర్ 16223/16224 ఎస్ఎంవీటీ బెంగళూరు టూ రదీకపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గురువారం 10.40 గంటలకు, తిరుగు ప్రయాణం మంగళవారం 11.40 గంటలకు నాయుడుపేట స్టాపింగ్ ఉంటుందన్నారు. అలాగే రైలు నంబర్ 20610/ 20609 ఎన్జే పీ తిరుచ్చి చెంగల్ పట్టాయ్ టూ న్యూ జల్పాయిగురి వీక్లీ ఎక్స్ప్రెస్ బుధవారం 3.58 గంటలకు, తిరుగు ప్రయాణం ఆదివారం 5.28 గంటలకు ఆగుతుందని రైల్వే అధికారులు తెలియజేసినట్లు తెలిపారు. రేణిగుంట మీదుగా మరో రైలు రేణిగుంట: దక్షిణ మధ్య రైల్వే నూతనంగా హైదరాబాద్ (చర్లపల్లి)– తిరువనంతపురం నార్త్ మధ్య అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ను శుక్రవారం నుంచి ప్రారంభిస్తుంది. ఈ రైలు రేణిగుంట మీదుగా వెళ్లనుంది. రేణిగుంటలో తెల్లవారుజామున 3.30కి బయలుదేరి చర్లపల్లికి 4.30 సాయంత్రం చేరుకోనుంది. రాత్రి శ్రీవారి దర్శనం అనంతరం పగలు ప్రయాణం చేసేవారికి ఈ రైలు చాలా ఉపయోగపడనుంది. రైలు ప్రారంభ ప్రత్యేక స్టాప్లు, సమయాల వివరాలను రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ స్పెషల్ ట్రైన్లో 8 స్లీపర్ క్లాస్ కోచ్లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్, రెండు సెకండ్ క్లాస్ కోచ్లు (దివ్యాంగులకు అనుకూలమైనవి) ఉంటున్నాయి. -
నేడు ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రత్యేక పీజీఆర్ఎస్
●తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జరపనున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలు రెవెన్యూ సమస్యలతోపాటు పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, రోడ్లు, వీఽధిలైట్లు, పాఠశాల సమస్యలు, శ్మశాన వాటికలు తదితర అన్ని సమస్యలపై అధికారులకు అర్జీలు ఇవ్వవచ్చును. అలాగే సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు(టీటీడీ మినహా) వారి సమస్యల పరిష్కారం కోసం అర్జీలను అధికారులకు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. -
పూజా మండపాల్లోనే నాగపడగలు
– కౌంటర్లలో పూజా సామగ్రి మాత్రమే పంపిణీ శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు అలెర్ట్ అయ్యారు. నాగపడగల గోల్మాల్ వ్యవహారంపై గురువారం సాక్షి దినపత్రికలో ‘రాహు–కేతులనే మింగేస్తున్నారు’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై ఆలయాధికారులు, పాలక మండలి స్పందించింది. రాహు–కేతు టికెట్ల కౌంటర్లలో పూజా సామగ్రి మాత్రమే పంపిణీ చేస్తోంది. నాగపడగలను ఆయా పూజా మండపాల్లో భక్తులకు అందజేస్తున్నారు. ఒక్కో ఆధార్ కార్డుకు ఒక టికెట్ మాత్రమే విక్రయిస్తున్నారు. పైగా దీనిపై ఉదయం నుంచి మైకుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పూజ అయిన వెంటనే ప్రత్యేక క్యూలైన్న్లో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు నాయుడుపేట టౌన్: పట్టణంలోని లక్ష్మణ్ నగర్లో నివాసమున్న స్రవంతి ఒకటిన్నరేళ్ల కుమార్తె లాస్యపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. చిన్నారి లాస్య ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా పక్కనే ఓ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీంతో అక్కడ ఉన్న మహిళలు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారిని కుక్కల బారి నుంచి కాపాడి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. లక్ష్మణ్ నగర్లో తరచూ ఇక్కడి కుక్కలు అనేక మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని స్థానిక మహిళలు రోధిస్తూ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మహిళలు స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం చెక్ పోస్టు వద్ద గురువారం అక్రమంగా కారులో తరలిస్తున్న 28 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారు పైలెట్ వాహనంగా వినియోగించిన ద్విచక్రవాహనంతోపాటు కారును సీజ్ చేశారు. రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానంద టీమ్, స్థానిక ఎఫ్బీఓ ఆదిశేషయ్యతో కలసి నెల్లూరు– గూడూరు మార్గంలో వెళుతున్న వాహనాలను తనిఖీ చేశారు. వెంకటాచలం చెక్ పోస్టు వద్దకు చేరుకోగా, ఒక మోటారు సైకిల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారితో పాటు వెనకే వస్తున్న ఒక కారును అడ్డగించి, నిలిపారు. కారును ఆపిన వెంటనే అందులోని వ్యక్తులు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. టాస్క్ ఫోర్సు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని కారులో తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. ఆ నలుగురు వ్యక్తులను నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. డీఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారణ అనంతరం ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలి
తిరుపతి తుడా: నియోజకవర్గ పరిధిలో పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ – 2026పై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. 2025 జాబితాలోని ఓటర్లను 2002 ఓటర్ల జాబితాలోని ఓటర్లతో మ్యాపింగ్ ప్రక్రియ చేసే నిమిత్తం అందరూ బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి, మ్యాపింగ్ శాతాన్ని పెంచాలన్నారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎన్నికల డీటీ సుధాకర్ నాయక్ పాల్గొన్నారు. -
ఏపీఎండీసీ వైఖరికి నిరసనగా మిల్లులు మూత
ఓబులవారిపల్లె :టీడీపీ అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయాల కారణంగా మంగంపేట గనులపై ఆ ధారపడి ఏర్పరుచుకున్న పల్వరైజింగ్ మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా సీ అండ్ డీ గ్రేడ్ ముడి ఖనిజానికి రెండు రకాల ధరలు నిర్ణయించడం, ప్రస్తుతం పిలిచిన టెండర్లలో నిబంధనలతో ఇబ్బందులు పెట్టడంతో మిల్లుల యజమానులు దిక్కుతోచని స్థితిలో గురువారం నుంచి స్థానికంగా ఉన్న పల్వరైజింగ్ మిల్లులన్నీ స్వచ్ఛందంగా మూసి వేసి ఖనిజ రవాణాన్ని నిలిపి వేశారు. దీంతో మంగంపేట ఏపీఎండీసీలో డిస్ప్యాచ్ నిలిచిపోయింది. వాహనాలు మిషన్లు ఆగిపోయాయి. మంగంపేట నీరుపల్లె ఆంజనేయస్వామి దేవాలయంలో మిల్లు యజమానులు సమావేశమై ఏపీఎండీసీ యాజమాన్య వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏపీఎండీసీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా సీ అండ్ డీ గ్రేడ్ ఖనిజానికి ఎగుమతి దారులకు రూ.1.190, పల్వరైజింగ్ మిల్లులకు రూ.1.680 ధరల వ్యత్యాసంతో అమ్మకాలు జరగలేదని విమర్శించారు. స్థానికంగా ఏపీఎండీసీ గనులుపై ఆధారంగా నిర్మించుకున్న పల్వరైజింగ్ మిల్లులు కేవలం ముగ్గురాయి ఆడేందుకు మాత్రమే ఉపయోగపడతాయని, తద్వారా వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఏపీఎండీసీ యాజమాన్యం నిబంధనలు పేరుతో పర్వరైజింగ్ మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. బల్కర్ టెండర్ పేరుతో ఎగుమతిదారులకు తక్కువ ధరకు ఖనిజాన్ని ఇవ్వడం స్థానికంగా ఉన్న చిన్న పరిశ్రమలకు అధిక ధరకు విక్రయించడం ఏమిటని ప్రశ్నించారు. ఎగుమతిదారులకు ఇస్తున్న ధరకే పల్వరైజింగ్ మిల్లులకు కూడా ఇవ్వాలని వారు కోరారు. మంగంపేట ఏపీఎండీసీ ముగ్గురాయి ఖనిజం ప్రపంచంలోనే మేలురకం ఖనిజమని, ఇష్టారాజ్యంగా ఎగుమతులు చేయడం ద్వారా భవిష్యత్తులో ముగ్గురాయి ఖనిజాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు. ముడి ఖనిజం ఎగుమతులు ఆపేసి కేవలం పౌడర్ ను మాత్రమే ఎగుమతి చేయాలని, తద్వారా స్థానిక మిల్లులకు ఉపా ధి కలిగి వేలాది మందికి జీవనోపాధి కలుగుతుందన్నారు. ఏపీఎండీసీ యాజమాన్యం వెంటనే ఈ విషయంపై స్పందించి ఎగుమతి దారులకు ఇస్తు న్న ధరలకే మిల్లులకు కూడా ముగ్గురాయి ఇవ్వాలని వారు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మిల్లులు ఖనిజ రవాణా స్వచ్ఛందంగా నిలిపివేశామన్నారు. పల్వరైజింగ్ మిల్లుల యజమానులు మాచినేని విశ్వేశ్వర నాయుడు, గుత్తిరెడ్డి హరినాథ్రెడ్డి, గజ్జల శ్రీనివాసులురెడ్డి, కాలూరు మధుసూదన్ రెడ్డి, గునిపాటి చిన్నరాయుడు, తల్లెం రమణారెడ్డి, జరుగు నారాయణ రెడ్డి, కౌలూరు రమణారెడ్డి, కౌలూరు శ్రీనివాసులు రెడ్డి, కల్లా చలపతి, పోతల లక్ష్మీనారాయణ, కౌలూరు బ్రహ్మానందరెడ్డి, అంబికా రవి, గల్లా సురేష్, గల్లా రమణ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి మాఫియాపై ఉక్కుపాదం
చంద్రగిరి మండలంలో గంజాయి మాఫియా పై ఉక్కుపాదం మోపుతామని సీఐ సురేష్ కుమార్ చెప్పారు.వెంకటగిరి మండలం లాలా పేటలో జరుగుతున్న డ్రైన్ల నిర్మాణం పర్యవేక్షణ లోపం డ్రైనేజీలకు శాపం వెంకటగిరి(సైదాపురం): అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని చందంగా మారింది. పీఎంఏజీవై నిధులను ప్రభుత్వం మంజూరు చేసినా వాటిని సద్వినియోగం చేసుకునే పాపాన పోలేదనే విమర్శలు గుప్పుమంటున్నారు. ప్రారంభమైన మురుగు నీటి కాలువల నిర్మాణ పనులు కూడా నాణ్యత లోపించడంతో ఇష్టానుసారంగానే డ్రైనేజీ పనులను కొనసాగించడంపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదికాలాలపాటు ఉండాల్సిన పనులు నాణ్యత లోపిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటగిరి నియోజకవర్గంలోని పీఎంఏజీవై పథకం పనుల తీరుతెన్నులు ఇలా ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన వెంకటగిరి కి పీఎంఏజీవై నిధులు మంజూరు కాగా వాటిలో రూ.20 లక్షల వ్యయంతో రూరల్ మండలంలోని లాలాపేటలో డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టారు. సుమారు 615 మీటర్లతో పనులను ప్రారంభించి, పనులు కూడా ముగించేశారు. ఆ సమయంలో ఇష్టానుసారంగా పనులను జరగడంతో నాణ్యత లోపించిదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాగే సైదాపురం మండలంలోని రామసాగరం, కొమ్మిపాడు, కృష్ణారెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసినా కూడా కేవలం కృష్ణారెడ్డిపల్లి పంచాయతీకి రెండు డ్రైన్లు, ఒక బోర్, ఒక ఆర్వో ప్లాంట్కు రూ.20 లక్షలు నిధులను మంజూరు చేశారు. కానీ ఆ పనులు నేటికీ ప్రారంభించలేదు. రాపూరు మండలంలోని కంబాలపల్లి, గరిమెనపెంట, ఏపూరుకు రూ.20లక్షల చొప్పున మొత్తంగా రూ.60 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ పనులు కూడా ఇంకా ప్రారంభించలేదు. తిరుపతి జిల్లా సమాచారం ఎంపికై న గ్రామాలు 52 పనుల సంఖ్య 283 వాటి విలువ రూ.10.33 కోట్లు ఖర్చు రూ.4.12 కోట్లు -
వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే సైనికులు
తిరుపతి మంగళం : దేశ భద్రతకు సైనికులు ఎలానో.. వైఎస్సార్సీపీకి కార్యకర్తలు అలానే అని ఎమ్మెల్సీ, కమిటీల నియామక టాస్క్ఫోర్స్ సభ్యు లు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని నియోజకవర్గ సమన్వయకర్తలతో పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ పార్టీపై అభిమానం, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ పార్టీ అనుబంధ విభాగాల కమిటీల్లో నియమించాలన్నారు. కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఐడీ కార్డులు ఇచ్చి వారికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తారన్నారు. పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో సమన్వయకర్తలంతా త్వరగతిని కమిటీలను నియమించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుద్దామని పిలుపునిచ్చారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలేనన్నారు. వైఎస్. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే అగ్రస్థానం కార్యకర్తలకేనన్నారు. నియోజకవర్గాల్లో కమిటీలను పూర్తి చేయడంతో ఆ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ధర్నాలు, ఉద్యమాలు, నిరసనలు ఇతరత్రా ఏ కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటే అందుకు ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలేనని, వారిని మరిచిపోయే ప్రసక్తే లేదని చెప్పారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకాలు పెచ్చుమీరిపోయాయన్నారు. ప్రతి పేదవాడికి మేలు జరగాలంటే మళ్లీ జగనన్న అధికారంలోకి రావాలన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలిచే పార్టీ వైఎస్సార్సీపీ అన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వచ్చిందని, పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కార్యకర్తలు లేకుంటే పార్టీనే లేదని, పార్టీకి పునాదులు కార్యకర్తలేనన్నారు. జగనన్న వంటి గొప్ప నాయకుడు తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలతో పాటు కార్యకర్తలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చిత్తూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకులు చవ్వా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ పార్టీ అనుబంధ కమిటీల నియామకాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలు చొరవతీసుకుని త్వరగతిని పూర్తి అయ్యేలా చేయాలన్నారు. కమిటీల నియామకాలను ఒక యజ్ఞంలా పూర్తి చేద్దామని కోరారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలలో సమావేశాలు నిర్వహించుకుని కమిటీలను నియమించాలన్నారు. ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని నియోజకవర్గాల సమన్వయకర్తలు బియ్యపు మధుసూధన్రెడ్డి, వెంకటేగౌడ్, భూమన అభినయ్రెడ్డి, విజయానందరెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, నూకతోటి రాజేష్, డాక్టర్ సునీల్కుమార్, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.కమిటీ నియామకాలతోనే పార్టీ బలోపేతం -
వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం
రథసప్తమికి సర్వం సిద్ధం తిరుమలలో రథసప్తమికి సర్వం సిద్ధం చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ గ్రామాల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పీఎంఏజీవై (ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి రూ.కోట్ల బడ్జెట్ విడుదల చేస్తోంది. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కవుతున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పనుల నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు తూతూమంత్రంగా పనులు చేసి జేబులు నింపుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా సమస్యల పరిష్కారం కోసం ఆయా గ్రామాల ప్రజలు నిత్యం చిత్తూరు, తిరుపతి కలెక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పీఎంఏజీవై నిధుల దుర్వినియోగంపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 74,056 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,517 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. యూనివర్సిటీలో జాబ్ మేళా రేపు తిరుపతి అర్బన్: ఎస్వీ యూనివర్సిటీలోని ఎంప్లాయీమెంట్ ఆఫీస్ వద్ద శనివారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఈఎంసీ క్లస్టర్ శ్రీసిటీ, చైన్నెలోని పలు కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నాయని వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ చదువుకున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ముందుగా శుక్రవారం రిజి స్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 81435 76866, 99888 53335 నంబర్లలో సంప్రదించాలని కోరారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం తిరుమల: చిత్తూరుకు చెందిన చింతల దివ్యాంత్ రెడ్డి అనే భక్తుడు గురువారం టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళం అందజేశారు. దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. నేడు శ్రీవారి ఆలయంలో వార్షిక విశేష పూజ తిరుమల: వసంత పంచమి పర్వదినం సందర్భంగా శుక్రవారం శ్రీవారి ఆలయంలో వా ర్షిక విశేష పూజ నిర్వహించనున్నారు. గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేష పూజ చేసేవారు. ఇందులో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలని జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితులు సూచించారు. ఈ క్రమంలో వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విశేష పూజలను ఏడాదికోసారి నిర్వహించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ప్రతి ఏటా వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేష పూజను ఏకాంతంగా నిర్వహిస్తోంది. నిధుల మేత..చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పీఎంఏజీవై పథకం నీరుగారుతోంది. ఈ పథకం నిధుల దుర్వినియోగం పై పలు గ్రామాల ఎస్సీ, ఎస్టీ ప్రజలు నేరుగా పంచాయతీరాజ్శాఖ మంత్రికి ఫిర్యాదులు చేస్తున్నారు. చేపడుతున్న పనుల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. టీడీపీ నేతలు పనులను నాసిరకంగా చేసి చేతులు దులుపుకుంటున్నారు. మురుగు కాలువల నిర్మాణం, చెత్త బండ్ల కొనుగోలు, రోడ్లు, వీధి లైట్లు పనులు చేయకుండానే చేసినట్టు బిల్లులు సృష్టిస్తున్నారు. రోడ్ల పనుల్లో నాసిరకం సిమెంట్ వాడకం, నిష్పత్తి ప్రకా రం ఇసుక, కంకర వాడకుండా మోసం చేస్తున్నారు. తాగునీటికి ఏర్పాటు చేసిన పైపుల్లో నాణ్యత లేని వాటిని వినియోగిస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖల అధికారులు లంచాలకు అలవాటుపడి బిల్లులను ఆమోదిస్తున్నారు. నీకింత..నాకింత! రెండు జిల్లాల్లో పీఎంఏజీవై పథకం నిధులను కాజేసేందుకు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పచ్చనేతతో కుమ్మక్కయ్యారు. అధికారులు15 నుంచి 20 శాతం వరకు.. ప్రజాప్రతినిధులు 20 శాతం వరకు కమీషన్లు దిగమింగుతున్నా రు. దీంతో ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అటు అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ సంబంధం లేదనే ధోరణిలో మిన్నకుండిపోతున్నారు. మీదే రాజ్యం..మేం కన్నెత్తి చూడం! పీఎంఏజీవై పథకాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సమీక్షలు నిర్వహించాల్సిన చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు పట్టించుకోవడం లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో అధికారులు.. పచ్చ నేతలు ఆడిందే ఆటగా నిధుల ను దుర్వినియోగం చేస్తున్నారు. నాసిరకంగా పనులను చేసి ఎస్సీ,ఎస్టీ గ్రామాల ప్రజలను మోసగిస్తున్నారు. రూ.23.19 కోట్లతో పనులు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మొత్తం 65 మండలాల్లో మూడు విడతల్లో 118 గ్రామాల్లో రూ.23.19 కోట్ల అంచనా వ్యయంతో 720 పనులు చేపట్టారు. ఎంపిక చేసిన ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున నిధులను మంజూరు చేశారు. మొత్తం మూడు విడతల్లో చిత్తూరు జిల్లాలోని 437 పనులకు గాను రూ.13.53 కోట్లు, తిరుపతి జిల్లాలో 283 పనులకు రూ.10.42 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో ఎంపిక చేసిన ఎస్సీ, ఎస్టీ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సి ఉంది. విద్య, వై ద్యం, మౌలిక వసతులతో పాటు ఆయా గ్రామా ల్లో ని యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి ఆర్థిక స్వావలంబనకు చర్యలు చేపట్టాలి. అయితే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ పథకం ఆశయం నిర్వీర్యమవుతోంది. దళిత గ్రామాల అభివృద్ధికి పీఎంఏజీవై నిధులు వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే, ఇటు నియోజకవర్గ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ మధ్య వర్గ విబేధాలతో అభివృద్ధి పనులను ముందుకు సాగనివ్వడం లేదు. ఆ మేరకు ఇటీవల మొదటి, రెండో విడతలో నియోజకవర్గంలో 15 గ్రామాల వరకు పీఎంఏజీవై పథకం కింద ఎంపిక అయ్యాయి. ఆ దిశగా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం పంచాయతీ చెదులుపాకంలో శ్మశానవాటికకు ప్రహరీ గోడ, షెడ్డు, అంగన్వాడీ భవన నిర్మాణానికి పీఎంఏజీవై పథకం కింద రూ. 20 లక్షలు మంజూరు చేసింది. అయితే 3 నెలలుగా స్థానికంగా రెండు వర్గాల మధ్య వర్గపోరుతో పనులు ఆగిపోయాయి. ఈ విషయంలో ఎంపీడీఓ ఏకపక్షంగా ఒక వర్గానికి వత్తాసు పలకడంతో మరో వర్గం తమకు పనులు కేటాయించాలని అడ్డుకున్నారు. దీంతో సర్దుబాటు చేయలేని అధికారులు పనులను అలాగే వదిలేశారు. నాగలాపురం, సత్యవేడు, నారాయణవనం, బీఎన్కండ్రిగ, కేవీబీపురం మండలాల్లో ఇప్పుడిప్పుడే కొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. చేయాల్సిన పనులు ఎంపికైన గ్రామాల్లో శుద్ధ నీరు, పారిశుద్ధ్యం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, రహదారి పనులు, కాలువలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. -
ఏఆర్ కానిస్టేబుల్ ఆగడాల నుంచి కాపాడండి
చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆగడాల నుంచి తమను కాపాడాలంటూ పలువురు మహిళలు పోలీసులను కోరారు. ఈ మేరకు గురువారం ఏఆర్ కానిస్టేబుల్ పెద్ద రెడ్డప్పపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ అకృత్యాలకు సంబంధించిన వాయిస్ రికార్డులను కూడా పోలీసులకు అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ఎ.రంగంపేటకు చెందిన పెద్ద రెడ్డప్ప కల్యాణి డ్యామ్ సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ)లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన పోలీసు యూనిఫాంలోనే మద్యం తాగి రంగంపేట బస్టాండ్ వద్ద తరచూ స్థానికులు, మహిళలను బూతులు తిడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని చెప్పారు. ఆయన ఆగడాలను ప్రశ్నిస్తే తుపాకీతో కాల్చి చంపుతా.. అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. మీరు మాట్లాడే భాష సరిగా లేదంటే... మరింత అసభ్యకంగా మాట్లాడుతూ వాటిని వాట్సాప్ స్టేటస్గా పెట్టి తీవ్రంగా అవమానిస్తున్నాడని తెలిపారు. ‘‘మీ కుటుంబాల్లో ఎంత మంది మహిళలు ఉంటే అంతమందిని అనుభవిస్తారా.. నా కొడకల్లారా’’ అంటూ అతడ్ని ఎదిరించినవారికి వాయిస్ మెసేజ్లు పంపి బెదిరిస్తూ మనోవ్యధకు గురిచేస్తున్నాడంటూ మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. గతంలోనూ పెద్ద రెడ్డప్ప ఇలానే ప్రవర్తించాడని, అప్పట్లో అతనిపై కేసు నమోదు కావడంతో కోర్టులో విచారణ జరుగుతున్నట్లు వివరించారు. కాగా, ఏఆర్ కానిస్టేబుల్ పెద్ద రెడ్డప్ప భార్య అధికార పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా ఉండటం వల్లే ఆయన రెచ్చిపోయి అనుచితంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. -
సీమ కరువుకు చిరునామా
దేశంలో కరువు కాటకాలకు నెలవుగా ఉన్న ప్రాంతం రాయలసీమ మాత్రమే. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు నదీప్రవాహక ప్రాంతం కాకపోవడంతో మరింత దాహర్తి ఉంది. రూ.వేలు వెచ్చించి, నిత్యం చిత్తూరు జిల్లాలో నీరు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు కుప్పానికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు కొనసాగించి తీరాలి. సీపీఐ అఖిల పక్ష తీర్మానానికి పూర్తి మద్దతు తెలుపుతోంది. –జనార్దన్, సీపీఐ నాయకులు, తిరుపతి ● -
ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్
తిరుపతి సిటీ: ఎన్టీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాల్లో బుధవారం నుంచి ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ సెషన్–1 పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ఎన్టీఏ సిటీ కోఆర్డినేటర్ కై లాస్నాథ్ తెలిపారు. రెండు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పరీక్షలకు 2,107 మంది హాజరు కావాల్సి ఉండగా 2,028 మంది హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయని చెప్పారు. ఇంటర్ ఎథిక్స్ పరీక్ష ప్రశాంతం తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు బుధవారం జరిగిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యా ల్యూస్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఆర్ఐఓ జి రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను జిల్లాలో 30,377మంది విద్యార్థు లు హాజరు కావాల్సి ఉండగా 29,989మంది హాజరైనట్లు తెలిపారు. గెస్ట్హౌస్ను ప్రారంభించిన సీఎస్ తిరుపతి రూరల్: నగరంలోని బ్లిస్ హోటల్ వద్ద ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ నిర్మించిన నూతన గెస్ట్ హౌస్ను రాష్ట్ర సీఎస్ విజయానంద్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ శివశంకర్, పూర్వపు సీఎండీలు కలాల రంగనాథం, పి.గోపాల్రెడ్డి, డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు సుబ్బారావు, కేవీ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ టీఏ మృతి
పెళ్లకూరు: 71వ నంబరు జాతీయ రహదారిలోని దిగువచావలి గ్రామం వద్ద బుధవారం కర్ణాటక ఆర్టీసీ బస్సు మోటారు బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఉపాధిహామి టీఏ సయ్యద్ షమీమ్ ఉద్దీన్ (55) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కథనం మేరకు.. ఉపాధిహామి టీఏ సయ్యద్ షమీమ్ ఉద్దీన్ పెళ్లకూరులో విధులు ముగించుకుని మోటారుబైక్లో నాయుడుపేటకు వెళుతుండగా మార్గం మధ్యలో దిగువ చావలి గ్రామం వద్ద బెంగళూరు నుంచి విజయవాడకు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు బైక్ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో షమీమ్ ఉద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హుండీ చోరీ కేసులో ముగ్గురి అరెస్టు సత్యవేడు: హుండీ చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సత్యవేడు ఎస్ఐలు టి.సాయినాద్, బి.లావణ్య తెలిపారు. మండలంలోని పుదుకుప్పంలో నూతనంగా నిర్మించిన మురుగన్, విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీ రాత్రి హుండీ పగులగొట్టి రూ. 2500 చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేవీబీపురం మండలం పాతపాళెం అరుంధతివాడకు చెందిన డి.చందు,(20), పి.హేమంత్(20), పి.వంశీ(18)ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిఘా ఉంచారు. సత్యవేడు ఎస్ఐలు టి.సాయినాద్, బి.లావణ్య సిబ్బందితో కలసి సత్యవేడు– ఊత్తుకోట మార్గంలోని వీఆర్ కండ్రిగ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బజాజ్ సీటీ 100 ద్వికచ్రవాహనంపై వచ్చిన ముగ్గురుని అనుమానించి, అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు, రూ.50 వేలు విలువ చేసే ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. చోరీ కేసులో నిందితులను త్వరితగతిన అరెస్టు చేసిన సత్యవేడు ఎస్ఐలు, ఏఎస్ఐ మార్కొండేయులు, హెడ్ కానిస్టేబుల్ ఆర్. ప్రతాప్, పీసీలు కే కుప్పారావు, ఎస్. చల్లయ్య, కే. విజయ్ను పుత్తూరు డీఎస్పీ, సీఐ అభినందించారు. జేబు దొంగ అరెస్టు తిరుమల: శ్రీవారి భక్తుల్ని మోసగించి జేబుల్లోని వస్తువులను చోరీ చేస్తున్న వ్యక్తిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఐ లు రమేష్, చలపతి తెలిపారు. ఎస్ఐల కథనం మేరకు.. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం కంపార్ట్మెంట్ 19లో ఓ మహిళ భక్తురాలి జేబులో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై వారి కుటుంబసభ్యుడు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రెడ్డెప్ప ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 21వ తేదీన ఆస్థాన మండపం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తమిళనాడుకు చెందిన శివయ్య అలియాస్ శివ(55)గా గుర్తించామని ఎస్ఐలు తెలిపారు. క్యూలోని భక్తుల జేబుల్లో చోరీకి పాల్పడినట్లుగా విచారణలో తేలిందని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 56 గ్రాముల బంగారం, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకుని, నిందితుని రిమాండ్కు తరలించామన్నారు. దొంగకు మూడేళ్లు జైలు తిరుపతి లీగల్: నగరంలో మూడు వేర్వేరు చోట్ల మూడు ద్విచక్ర వాహనాలను అపహరించిన వేర్వేరు కేసుల్లో శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి మండలం, కాలసముద్రం గ్రామానికి చెందిన పఠాన్ షాహిద్ బాషా అలియాస్ షాహిద్కు ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.వంద చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి పల్లపోలు కోటేశ్వరరావు బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు కానిస్టేబుల్ అయ్యప్ప కథనం మేరకు.. నిందితుడు షాహిద్బాషా ఇద్దరితో కలిసి 2024 డిసెంబర్ ఐదో తేదీ కొర్లగుంట మారుతి నగర్లో రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు. అలాగే గత ఏడాది జనవరి ఏడో తేదీ స్థానిక రైల్వే కాలనీలో ఒక ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. వాహనాల యజమానుల ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. నిందితుడు షాహిద్ బాషాను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసుల పూర్వపురాలను పరిశీలించిన న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. -
కాలుదువ్వి..రంకెలేసి!
జిల్లాలోనే ఎడ్ల పందేలు (జల్లికట్టు)కు అత్యంతం ప్రాధాన్యత ఉన్న గ్రామం రంగంపేట. బుధవారం ఉదయమే పశువుల యజమానులు జల్లికట్టుకు కోడెగిత్తలను సిద్ధం చేశారు. కొమ్ములకు పలకలు కట్టి.. నడుముకు నల్లదారం చుట్టి ముస్తాబు చేశారు. ఆపై జనం మధ్యలో విడిచి పెట్టారు. కోడెగిత్తలు జనాన్ని చూసి కాలుదువ్వుతూ.. రంకెలేస్తూ దూసుకుపోయాయి. వీటిని నిలువరించేందుకు.. కొమ్ములకు కట్టిన పలకలు సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ పరుష పందేలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిపై టీడీపీ వర్గీయుల దాడి
వేలాది మంది జనం, ఎమ్మెల్యే సమక్షంలోనే దాడి చంద్రగిరి: చంద్రగిరి మండలం ఎ.రంగంపేట వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పడాకుల శేషాద్రిరెడ్డిపై టీడీపీ వర్గీయులు భౌతిక దాడులకు పాల్పడి, గాయపరచడంతో వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి బుధవారం ఆయన్ని పరామర్శించారు. టీడీపీ వర్గీయులు ఎందుకు దాడి చేశారన్న విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెవిరెడ్డి మోహిత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జల్లికట్టులో వైఎస్సార్ సీపీ పలకలు కడితే కొడతారా?, పచ్చని పల్లెలకు రక్తపు మరకలు అంటించడం మంచిది కాదు..పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుండడంతోనే తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఐదేళ్లు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీల నేతలను మంచిగా చూసుకున్నారని, వైఎస్సార్ సీపీ నేతలు గొడవలు చేస్తే వారిపైనే కేసులు పెట్టించి, పల్లెల్లో ప్రశాంతతను నెలకొల్పారన్నారు. ప్రతిపక్షాలను కేవలం ప్రత్యర్థులుగా మాత్రమే చూశామని, శత్రువులుగా ఎప్పుడూ చూడలేదన్నారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి చంద్రగిరిలో కనిపించడం లేదని, పచ్చని పల్లెలకు రక్తపు మరకలు అంటిస్తున్నారని, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై వరుస దాడులు చేస్తున్నారన్నారు. ఎవరికై నా సహనం కొంత వరకే ఉంటుందని, ఏదో ఒకరోజున సహనం కోల్పోయి ఇటువైపు నుంచి కూడా ఎదురు దాడులు మొదలైతే పల్లెల్లో ప్రశాంతత లేకుండా పోతుందన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కళ్లముందే వైఎస్సార్ సీపీ కార్యకర్తను కొడుతుంటే ఆపకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వేలాది మంది జనం ముందు వైఎస్సార్ సీపీ నేతను కొట్టడం చూస్తుంటే ఎంతకు బరితెగించారో అర్థమవుతోందన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతోనే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తరచుగా దాడులు జరుగుతున్నాయని, ఎదురు దాడులు మొదలైతే దానికి పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవడానికి తాము ఎంత దూరమైన ముందుకు వెళతానని స్పష్టం చేశారు. అంతకు ముందు శేషాద్రిరెడ్డి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో పార్టీ మండల అధ్యక్షులు కొటాల చంద్రశేఖర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బోసు చంద్రారెడ్డి, రాజయ్య, బుల్లెట్ చంద్రమౌళి, ఉపసర్పంచ్ మోనీష్రెడ్డి, బీకే. వినోద్ కుమార్, దేవా, దేవరాజులు, మురళి, భాస్కర్ రెడ్డి, హస్సేన్ ఉన్నారు. -
● డైట్లో ఉత్సాహంగా రంగోత్సవ పోటీలు ● విజేతలకు బహుమతులు పంపిణీ
రంగోత్సాహం!కార్వేటినగరం: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే రంగోత్సవ పోటీలు నిర్వహిస్తున్నట్టు డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. బుధవారం డైట్లో రంగోత్సవ పోటీలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీ లు దోహదపడుతాయన్నారు. జిల్లా విద్యాశాఖ ఏపీసీ అధికారి వెంకటరమణ మాట్లాడారు. తరువాత రంగోత్సవ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందించారు. జానపద పోటీల్లో చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారని, ద్వితీయ స్థానంలో సత్యవేడు మండలం, రాజగోపాలపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు, తృతీయ స్థానంలో వరదయ్యపాళ్యం మండలం, సంతవేలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు కై వసం చేసుకున్నట్టు వెల్లడించారు. అలాగే రోల్ప్లే పోటీల్లో చిత్తూరు పట్టణం దేవీ బాలమందిర్ విద్యార్థులు ప్రథమ స్థానంలో.. చిత్రలేఖన పోటీల్లో కార్వేటినగరం బాలికోన్నత పాఠశాల మొదటి స్థానంలో నిలిచాయి. చిత్తూరు దేవిబాలమందిర్ హైస్కూల్ విద్యార్థులు ద్వితీయ స్థానంలో, చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. రంగోలి పోటీల్లో నాగలాపురం మండలం, ఎస్ఎస్పురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో, సత్యవేడు మండల, రాజగోపాలపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో, దేవీబాల మందిర్ చిత్తూరు సంతపేట విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. చేతి రాత పోటీల్లో చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో, నాగలాపురం మండలం ఎస్ఎస్పురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో, పాలసముద్రం మండల టీఆర్పురం ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచినట్లు డీఈఓ పేర్కొన్నారు. అనంతరం విజేతలకు డీఈఓ చేతుల మీదుగా బహుమతులను అందించారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు 23వ తేదీ విజయవాడలోని పోరంకి మురళీ రిసార్ట్స్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. చంద్రగిరిలో దోపిడీ దొంగల బీభత్సం చంద్రగిరి: పట్టణంలోని దాసరవీధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి లోపలికి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం అర్థరాత్రి ఒక ఇంట్లో సుమారు రూ.10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించగా, మరో ఇంట్లో రూ.50 వేల రూపాయల విలువైన వెండి వస్తువులను చోరీ చేశారు. బుధవారం ఉదయం ఇళ్లకు చేరుకున్న యజమానులు, తలుపులు పగులగొట్టి ఉండడం చూసి షాక్కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి సీఐ సురేష్, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. కేసు దర్యాప్తులో ఉంది. -
గమ్మత్తులో దాడులు
గంజాయి మత్తులో యువత కూరుకుపోయింది. ఆ మత్తులో యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఆ యువతను పచ్చనేతలు, ఇసుకాసురులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. తమ అక్రమ రవాణాకు అడ్డుపడిన వారిని లక్ష్యం చేసుకుని, వారిపై దాడులు చేయిస్తున్నారు. గంజాయి మూకలు ఏకంగా ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.చంద్రగిరి: పచ్చ నేతల ధనదాహానికి పల్లె ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అక్రమ ఇసుక, గ్రావెల్ దందాను అడ్డుకున్న వారిని టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు గంజాయి మూకలను దాడులకు ఉసిగొల్పుతున్నారు. చంద్రగిరి మండలంలో కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు గంజాయి ముఠాను ప్రోత్సహిస్తూ, వారికి అడ్డొచ్చిన వారిపై దాడులకు ఉసిగొల్పి, అక్రమ ఇసుక, గ్రావెల్ దందాను కొనసాగిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులకు టీడీపీ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధి పేరు చెప్పి వారిని లోబరుచుకుంటున్నారు. రెడ్డివారిపల్లిలో ఇళ్లు ధ్వంసం మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీ ఎగువరెడ్డివారిపల్లిలోని ఓ ఇంటిపై మంగళవారం అర్థరాత్రి గంజాయి మూకలు దాడికి పాల్పడ్డారు. స్థానికంగా ఉండే సన్నీ అనే వ్యక్తితోపాటు తిరుపతికి చెందిన సుమారు 10 మంది గంజాయి మూకలు అర్ధరాత్రి ఎగువ రెడ్డివారిపల్లికి చెందిన మౌనిక ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో ఇంటి కిటికీలు, విద్యుత్ మీటరు, ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇంటి ప్రధాన ద్వారంపై భారీ బండరాళ్లతో మోదారు. పెద ఎత్తున అరుస్తూ వారి ఇంటిపై దాడికి పాల్పడడంతో ఆ ఇంట్లోని వారు కేకలు వేశారు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి జరిగిన ఇంటిని పరిశీలించారు. దాడి జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న ఓ కానిస్టేబుల్కు కూడా గాయం కావడంతో స్థానికులు ప్రథమ చికిత్స చేశారు. ఇసుకాసురులను అడ్డుకోవడంతోనే దాడులు స్వర్ణముఖినది నుంచి నియోజకవర్గ ప్రజాప్రజనిధి అనుచరులు అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో ఇటీవల గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఓ ఇసుకాసురుడు ఏకంగా గ్రామ హద్దురాయిని జేసీబీతో తొక్కించారు. ఆ ప్రజాప్రతినిధి పేరుతో పట్టణానికి చెందిన ఓ నేత చేస్తున్న స్మగ్లింగ్పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు అదే గ్రామానికి చెందిన గంజాయి లీడర్ సన్నీని అడ్డుపెట్టుకుని గ్రామస్తులపై దాడులకు పాల్పడుతున్నారు. గతంలోనూ ఓ వ్యక్తిపై దాడికి చేసి హత్యాయత్నానికి పాల్పడారు. ఈ దాడులపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గంజాయి లీడర్పై పోలీసుల ఉదాసీనతగంజాయి విక్రయాలు, సేవించడానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న సన్నీపై పోలీసుల ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలల కిందట గంజాయి మత్తులో ఓ ఆటో డ్రైవర్పై సన్నీతోపాటు మరికొంత మంది దాడి చేసి, రూ.7 వేల నగదు, సెల్ఫోన్ను లాక్కెళ్లారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఆటోడ్రైవర్ సన్నీకి పోలీసుల అండ ఉందని నిమ్మకుండిపోయారు. అంతేకాక ఇళ్లపై దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు నామమాత్రం కేసులు నమోదు చేసి, చేతులు దులుపుకోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సన్నీపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరిలో చెలరేగిపోతున్న గంజాయి మాఫియా -
ఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎస్
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం వద్ద ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివవంకర్ లోతేటి పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుతోపాటు ట్రైనీ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ఆ కార్యాలయం వద్ద సీఎస్ విజయానంద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం సీఎస్ విజయానంద్ సీఎండీ కార్యాలయంతోపాటు సమావేశ మందిరంలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నూతనంగా అమలు చేస్తున్న డయల్ యువర్ సీఎండీ, కరెంటోళ్ల జనబాట వంటి కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ మండలి తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణపై ఆరా తీశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలతో పాటు తిరుపతి నగరానికి చెందిన పలువురు వ్యాపారులు విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వాడకం అధికంగా పెరుగుతుండడంతోపాటు దానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పతి చేయడానికి ఉన్న అవకాశాలపై సీఎస్ విజయానంద్ సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖకు ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో 2026–27కు సంబంధించిన ఏపీఎస్పీడీసీఎల్ తయారు చేసిన వార్షిక ప్రణాళికలను సీఎండీ శివశకంర్ ఆయనకు అందజేశారు. కాగా ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతస్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించగా మీడియాను అనుమతించలేదు. -
బాబు పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం
రైల్వేకోడూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల అన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆదేశాల మేరకు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, వెంకట సుబ్బయ్య బుధవారం రేణిగుంట ఎయిర్ పోర్టులో ఆర్ఏ శ్యామలకు పుష్పగుచ్ఛం అందజేసి, ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్యామల రైల్వేకోడూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ జన్మనిచ్చిన రాయలసీమపై చంద్రబాబు నాయుడు ధ్వేషం పెంచుకోవడం చాలా బాధాకరమన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేందుకు చంద్రబాబు తన వంతు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడపడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. సముద్రంలో నీరు వృథా పోకుండా ఉండేందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుచూపుతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కి తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం చాలా దుర్మార్గమన్నారు. అనంతరం చిట్వేలిలోని మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ దశదిన కర్మకు ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాయికిషోర్ రెడ్డి, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, సుంకేశుల రఫీ తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటేమిటీ?
రాపూరు: మండలకేంద్రంలోని మద్దెలమడుగు సెంటర్లో అర్ధరాత్రి పైలాన్ ఉన్న స్థూపం వద్ద దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చేయడం ఏమిటని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్రెడ్డి, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి బత్తిన పట్టాభిరామిరెడ్డి ప్రశ్నించారు. స్థానిక బాలాజీ కల్యాణ మండపం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడారు. 2009లో సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ శంకుస్థాపనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మండల కేంద్రంలో పైలాన్ ప్రారంభించారని, ఆయన గుర్తుగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు అ ప్పటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాణరెడ్డి పైలాన్ను తొలగించి, దాని స్థానంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్య లు చేపట్టారని, అయితే జాతీయ రహదారిపై పెట్ట వచ్చా? లేదా అని కొంత మీమాంస చోటు చేసుకోవడం, అనంతరం జరిగిన రాజకీయపరిణామాలతో వైఎస్సార్ విగ్రహ స్థాపన వాయిదా పడిందన్నారు. అయితే పైలాన్ ఉన్న స్థానంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని అర్థరాత్రి స్థాపించడం ఏమిటని, మరో చోటపెట్టవచ్చు కదా అని నిలదీశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, రాత్రికి రాత్రి విగ్రహం ఏర్పాటు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ విషయపై జిల్లా నాయకులతో చర్చించి, వారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళాతామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఖాదర్బాషా, రైతు సంఘం నాయకులు పిచ్చిరెడ్డి, కోటేశ్వరరెడ్డి, రాపూరు మండల ఉపాధ్యక్షులు గౌస్పీర్, కార్యదర్శి డీవీ రమణయ్య, నాయకులు ఏటూరు మురళీమోహన్రెడ్డి, రమణారెడ్డి, వెంకటసుబ్బయ్య, డ మ్మాయి రమణయ్య పాల్గొన్నారు. -
పిడికిలి బిగిద్దాం.. ఎత్తిపోతలు సాధిద్దాం
తిరుపతి సిటీ: ‘రాయలసీమ భవిష్యత్తు ప్రమాదంలో పడనుంది. మౌనంవీడి రండి. పిడికిలి బిగించి పోరాడదాం’ అని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి ఏర్పాటు చేశారు. రాయలసీమ దాహారి తీర్చేందుకు కరువుబండ పేరుతో 1986 జనవరి 1నుంచి 21వరకు జరిగిన పోతిరెడ్డిపాడు పాదయాత్ర పూర్తయి 40 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా రాయలసీమ భవిష్యత్తు నీటి అవసరాలపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ చైర్మన్ భూమన సుబ్రమణ్యంరెడ్డి మట్లాడుతూ రాయలసీమ తాగు, సాగునీటి కోసం పోతిరెడ్డిపాడు తూముల సామర్థ్యాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలనే ప్రధాన ఉద్దేశంతో రాయలసీమలోని అన్ని ప్రాంతాల నుంచి కరువుబండ పేరుతో పాదయాత్ర చేసినట్లు చెప్పారు. 50 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం పోతిరెడ్డిపాడు వద్ద శ్రీశైలం కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రసంగిస్తూ రాయలసీమకు న్యాయం జరిగేవరకు ఉద్యమం ఆగదని చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు జారీచేసిన చీకటి జీవో 69ని తరువాత సీఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి రద్దుచేశారని చెప్పారు. చంద్రబాబు మళ్లీ కుట్ర రాజకీయాలతో అడ్డుకున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే రూ.7 వేలకోట్లు కేటాయించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారని తెలిపారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. చంద్రబాబుతో చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయించానని చెప్పారన్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోగా ఈ ఎత్తిపోతల పథకం వల్ల ఉపయోగం లేదని మాట్లాడడం రాయలసీమకు ద్రోహం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో పోరాడతా తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజమైన విజనరీలని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం పార్లమెంట్లో పోరాటం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ రాయలసీమకు ఇప్పటివరకు మేలుచేసింది వైఎస్ కుటుంబమేనన్నారు. మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యమం చేపట్టి రాయలసీమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సీపీఎం నాయకుడు కందారపు మురళి మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై బీజేపీ నోరు విప్పకపోవడం, పవన్కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని చెప్పారు. రాయలసీమ తాగు, సాగునీటి హక్కులను పరిరక్షించుకునేందుకు భూమన అభినయ్రెడ్డి పలు ప్రతిపాదనలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి ఏర్పాటు చేస్తూ సమావేశం తీర్మానించింది. త్వరలో పోతిరెడ్డిపాడు సందర్శించేందుకు, రాయలసీమ ప్రజలకు ఎత్తిపోతల పథకం అవసరాన్ని తెలిపేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సమావేశం నిర్ణయించింది. సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సీపీఐ, కాంగ్రెస్, రైతు,ఉద్యోగ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అపాచీ పరిశ్రమలో వ్యక్తి ఆత్మహత్య
తడ: అపాచీ పరిశ్రమలోని మరుగుదొడ్డిలోకి వెళ్లి దార్ల యుగంధర్(47) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మాంబట్టులోని అపాచీ బూట్లు తయారీ పరిశ్రమలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, కార్మికులు కథనం మేరకు.. నాయుడుపేట మండలం తన్నమాల గ్రామానికి చెందిన యుగంధర్ అనే వ్యక్తి మాబంట్టు ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో ఉన్న అపాచి బూట్లు తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతడు రోజూలాగనే విధులకు హాజరైన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్లాంట్–బీ సెక్షన్లోని మరుగుదొడ్డిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పారిశుద్ధ్య కార్మికులు మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు వెళ్లారు. లోపల గడి పెట్టి ఉండడంతో పలుసార్లు డోర్ తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కంపెనీ యాజమాన్యానికి సమాచారం అందించారు. కంపెనీ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేసుకుని, తలుపు పగులగొట్టి చూడగా గదిలోని ఓపైపునకు తాడుతో ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ కొండప్పనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వివాహిత.. ఓజిలి: కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరివేసుకుని కాకాని మౌనిక(18) మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, రెవెన్యూ అధికారులు కథనం మేరకు.. కురుగొండ ఎస్సీ కాలనీకి చెందిన కాకాణి మౌనికను వాకాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్కు ఇచ్చి మూడు నెలలు కిందట పెద్దలు వివాహం చేశారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు కురుగొండలో అమ్మ మస్తానమ్మ ఇంటికి దంపతులు వచ్చారు. అమ్మతో కలసి పండుగ మూడురోజులు ఆనందంగా గడిపారు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంత సేపటికి మౌనిక తలుపులు తీయకపోవడంతో భర్త ప్రశాంత్, స్థానికులకు అనుమానం వచ్చి చూసేసరికి ఉరివేసుకుని ఉంది. దీంతో తలుపులు పగులకొట్టి మౌనికను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆమె మృతి చెందింది. ఈ విషయమై మస్తానమ్మ సమీప బంధువు బల్లి హైమావతి, ఆమె భర్త రాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీకాంత్ కొండాపురం వెళ్లి మౌనిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకునిచ పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్వో కురుగొండలో స్థానికులు, బంధువులు నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆచార్య ఎన్జీ రంగా కళాశాలలో అగ్రగామిగా ఇంక్యుబేటర్
చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పోషణ ఇంక్యుబేటర్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోనే అగ్రగామిగా యూనివర్సిటీ నిలిచిందని వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి అన్నారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఆర్ఏఆర్ఎస్) సంయుక్తంగా వ్యవసాయ, అనుబంధ రంగా ల్లో కొత్త ఆవిష్కరణలకు మద్దతుగా వ్యవసాయ అంకుర సంస్థలకు గ్రాంట్ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీతోపాటు ఇతర అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడో బ్యాచ్కి (ప్రీ– సీడ్ కేటగిరీ) ఒకే విడతలో మొత్తం గ్రాంట్, ఐదో బ్యాచ్కు (సీడ్ కేటగిరీ) రెండో విడత గ్రాంట్తోపాటు కార్యక్రమంలో మొత్తం 11 స్టార్టప్లకు గ్రాంట్లను అందజేశారు. అందరికీ కలిపి రూ. 55 లక్షలు గ్రాంటును వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి అందజేశారు. అలాగే ఏడో బ్యాచ్ ప్రీ–సీడ్ స్టార్టప్లతో ఏన్జీఆర్ఏయూ పోషణ ఇంక్యుబేటర్ పరస్పర అవగాహన ఒప్పందాల (ఎంఓయు)కు సంతకాలు, ఐదో బ్యాచ్ కోహోర్ట్ సీడ్ స్టేజ్ ఇంక్యుబేటర్తో అనుబంధ అవగాహన ఒప్పందాల(సప్లమెంటరీ ఎంఓయూ)ను చేసుకున్నారు. వీసీ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏఎన్జీఆర్ఏయూ పోషణ ఇంక్యుబేటర్ రాష్ట్రంలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. యువత కొత్త ఆలోచనలతో వ్యవసాయాన్ని సమర్థవంతంగా మార్చేలా ప్రయత్నించాలన్నారు. -
మత్స్యకారుల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తా..
– ఎంపీ గురుమూర్తి తిరుపతి మంగళం: మత్స్యకారుల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. జిల్లాలోని పులికాట్ ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదం సమస్యను మత్స్యకారులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తిరుపతిలోని ఎంపీ కార్యాలయంలో మంగళవారం పులికాట్ ప్రాంత మత్స్యకారులు ఎంపీ గురుమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని సుమారు 24 గ్రామాల మత్స్యకారులకు పులికాట్ సరస్సు, దాని పరిసర తీర ప్రాంతాల్లో చేపల వేటే ప్రధాన జీవనాధారమని, అందులో ఐదు గ్రామాలు పూర్తిగా చేపల వేటాడే వృత్తిపైనే ఆధారపడి ఉన్నాయని వారు ఎంపీకి వివరించారు. పన్నంగాడు ప్రాంతంలో ఉన్న పులికాట్ సరస్సు పబ్లిక్ పులికాట్ మ్యాప్స్ ప్రకారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే ఉందని, ఈ ప్రాంతం అంతర్రాష్ట్ర సరిహద్దుకు సుమారు 3.34 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు సరిహద్దులు మార్చేశారని, అందువలన చేపల వేట కొనసాగించడం సమస్యగా మారిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటూ, స్థానిక మత్స్యకారులు భయభ్రాంతులకు గురవుతూ జీవనాధారం కోల్పోయే పరిస్థితి నెలకొందని ఎంపీకి తెలియజేశారు. ఈ సమస్యపై గతంలో పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఈ విషయమై మరోసారి పార్లమెంటులో ప్రస్తావిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్తో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి అక్రమ చొరబాట్లను అరికట్టి స్థానిక మత్స్యకారులకు రక్షణ కల్పించాలని, వారి సంప్రదాయ మత్స్యకార హక్కులను కాపాడేలా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. -
శుకబ్రహ్మాశ్రమంలో విశేష హోమపూజలు
శ్రీకాళహస్తి: పట్టణంలోని శుకబ్రహ్మాశ్రమంలో మంగళవారం దివ్య దినోత్సవం శాస్త్రోకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి విద్యాస్వరూపానందగిరిస్వామి మాట్లాడుతూ శుకబ్రహ్మాశ్రమం 1950లో సద్గురు మళయాళ స్వామి చేతుల మీదుగా ప్రారంభించిందన్నా రు. ఆశ్రమ ప్రారంభదినాన్ని పురస్కరించు కుని పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మలయాళస్వామి, విద్యాప్రకాశనందగిరి స్వామి చిత్రపటాలకు విశేష పూజలు, హోమ పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్ఎస్యూలో సంస్కృత బోధనపై జాతీయ సదస్సు తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో భారతీయ భాషా సమితి, నవదేహలి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సంస్కృత భాషలోనే సంస్కృత బోధన అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం వర్సిటీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, సంస్కృత భారతి సంస్థ అఖిల భారతీయ ప్రశిక్షణ ప్రముఖులు శ్రీరామ్ హాజరైన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృత విద్యాసంస్థల్లో వివిధ ఆధునిక విషయాలను సంస్కృతంలోనే బోధించే విధానం అమలు చేయాలని కళాశాల అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాధా గోవింద్ త్రిపాఠి, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి సంస్కృత ఉపన్యాసకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆ పరీక్షలు రాయకుంటే పక్కా ఫెయిల్! తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాల మేరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్పై, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్పై పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ జీ రాజశేఖర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు బుధవారం ఎథిక్స్ పరీక్ష, 23వ తేదీ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. రెండు సబ్జెక్టులు వంద మార్కులకు ఉంటాయని, ఇందులో కనీస ఉత్తీర్ణత మార్కులు 35 సాధించాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షలకు హాజరుకాపోయినా, ఉత్తీర్ణత మార్కులు సాధించకపోయినా ఇంటర్ ఫెయిల్ అయినట్లేనని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. గత ఏడాది ఈ సబ్జెక్టులల్లో తప్పిన విద్యార్థులు ఖచ్చితంగా పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని చెప్పారు. లేనిపక్షంలో మిగిలిన రెగ్యులర్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించినా సర్టిఫికెట్లు జారీ చేయమని తెలిపారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు. పీటీసీలో మోటివేషన్పై ప్రత్యేక శిక్షణ చంద్రగిరి: మండలంలోని కల్యాణీ డ్యాం సమీపంలో ఉన్న పోలీసు ట్రైనింగ్ కళాశాల(పీటీసీ)లో మంగళవారం మోటివేషన్పై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. పీటీసీలో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 750 మంది కానిస్టేబుళ్లు శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్కు చెందిన ఇంపాక్ట్ ఫౌండర్, సైకాలజిస్ట్, మోటివేషనల్ ట్రైనర్ గంపా నాగేశ్వర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మానసిక ధైర్యం, వృత్తిపరమైన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీసు విధుల్లో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనడం, ప్రజాసేవలో మానవీయ విలువలను పెంపొందించుకోవాల న్నారు. అనంతరం పీటీసీ అధికారులు ఆయన్ని సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్ సుబ్రమణ్యం, చిత్తూరు డీటీసీ డీఎస్పీ రాంబాబు, ఇంపాక్ట్ ప్రాంతీయ అధ్యక్షుడు ముకేశ్వర్, కార్యదర్శి తహనుశీనా బేగం, లక్ష్మీప్రసాద్, నాగిరెడ్డి పాల్గొన్నారు. -
సేద్యానికి జీరామ్..రామ్
గ్రామీణ్–వీబీ జీరామ్జీ అన్ని రంగాలకు అనుసంధానం చేస్తామని ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. దీంతో వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తోంది. ఫలితంగా మట్టి మనుషులకు పెట్టుబడులు పెరగడంతోపాటు ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇక్కట్లు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది. సైదాపురం: ఉపాఽధిహామీ (గ్రామీణ్–వీబీ జీరామ్జీ ) పథకాన్ని వ్యవసాయనికి అనుసంఽధించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నయే తప్ప అమలు చేయడంలో మాత్రం విఫలమవుతున్నాయి. కూలీలు ఎక్కువగా ఉపాధిహామీ పథకం పనులకు వెళుతుండడంతో వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడుతుంది. దీంతో కూలి పెరగడంతో పాటు సకాలంలో వ్యవసాయ పనులు పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 34 మండలాల్లో 2.66 లక్షల జాబ్కార్డులు ఉండగా 2,.2 లక్షల మంది కూలీలుగా నమోదై ఉన్నారు. అందులో రోజు సుమారు లక్ష మంది వరకు(గ్రామీణ్–వీబీ జీరామ్జీ) ఉపాధి పనులకు వెళుతున్నారు. దీంతో వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడుతోంది. యంత్ర పరికరాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా చాలా పనులు కూలీల ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఉపాఽధిహామీ పథకాన్ని వ్యవసాయనికి అనుసంధానం చేస్తే రైతులకు ఊరట కలుగుతుంది. రైతులపై కూలీల ఖర్చు భారం కూడా కాస్త తగ్గుతుంది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉపాఽధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తామని హమీ ఇచ్చి విస్మరించింది. ప్రస్తుతం బీజేపీ, జనసేనతో కలసి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకో ఆ హామీలను అమలు చేసే దిశగా ముందుకు వెళ్లడం లేదు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. రైతులు వారి స్తోమతకు మించి మెట్ట ప్రాంతాల్లో బీడు భూములు ఉండకూడదని వ్యవసాయం చేస్తుంటారు. అందులో వచ్చిన ఆదాయంతో జీవనం సాగిద్దామనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో తరచూ నష్టాలే మిగులుతున్నాయి. వరి, వేరుశనగ, సాగు చేస్తున్న రైతులు విత్తనాలు చల్లడం, కోతలు, నూర్పిళ్లు తదితర పనులకు ఎకరా సాగుకు దాదాపు రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు ఖర్చులు భరించాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేస్తే కూలీల కొరత తీరడంతోపాటు పెట్టుబడి కూడా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని రైతాంగం కోరుతుంది. ఉపాధి(గ్రామీణ్–వీబీ జీరామ్జీ) పనులకు వెళ్తున్న కూలీలు కష్టాలను గుర్తించాలి ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి ఉపాధి హామీ(గ్రామీణ్–వీబీ జీరామ్జీ )పథకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలి. అలా చేస్తే రైతులతోపాటు కూలీలకు కూడా మేలు జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయంలో కనీసం పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. – ఏడుకొండలు తిప్పిరెడ్డిపల్లి, వెంకటగిరి నియోజకవర్గం అప్పుల పాలవుతున్నాం రైతులకు పంటల సాగు భారంగా మారింది. వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడులు కూడా దక్కడంలేదు. పెట్టిన ఖర్చులు కూడా రాకపోగా అప్పుల పాలవుతున్నాం. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయనికి అనుసంధానం చేయాలి. అప్పుడే కూలీల భారం తగ్గుతుంది. –రామ్గోపాల్రెడ్డి గులించెర్ల, వెంకటగిరి నియోజకవర్గం రైతులకు ప్రయోజనం ఉపాఽధిహామీ (గ్రామీణ్–వీబీ జీరామ్జీ )పథకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పంట సాగు రైతులకు భారంగా మారుతుంది. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిపంటలు సాగు చేస్తున్నప్పటికీ లాభాలు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. లేదంటే రైతులు వీధుల పాలవుతారు. – వరప్రసాద్రాజు, లింగసముద్రం, వెంకటగిరి నియోజకవర్గం -
పరిశోధనలు కొనసాగాలి
చంద్రగిరి: సమగ్ర పంటలు, ఆరోగ్య యాజమాన్యంపై నిరంతరం పశోధనలు కొనసాగించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి అన్నారు. తెగుళ్ల శాస్త్ర విభాగం ఇండియన్ ఫైటో పాథలాజికల్ సొసైటీ, సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు, సింపోజియం మంగళవారం ఎస్వీ అగ్రికల్చర్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు పురుగులు, తెగుళ్ల యాజమాన్యంతో పాటు సమగ్ర మొక్కల ఆరోగ్య యాజమాన్యం, సుస్థిర సాగు పద్ధతులపై పరిశోధనల ద్వారా ఆహార భద్రతను సాధించవచ్చని పిలుపునిచ్చారు. అనంతరం గౌరవ అతిథిగా విచ్చేసిన వియత్నం దేశ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గుయన్ డాక్ కోవా మాట్లాడుతూ సాగు పద్ధతుల్లో గణనీయమైన మార్పులతో పంటల్లో తెగుళ్ల తీవ్రత పెరుగుతోందని, వీటిని నివారణకు భారతదేశంలోని వ్యవసాయ పరిశోధన సంస్థలతో కలిసి పని చేస్తామని చెప్పారు. ఇండియన్ ఫైటో పెథాలాజికల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథన్, శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.కృష్ణారెడ్డి, డాక్టర్ సిలియా షిమోగా, వ్యవసాయ వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎంకే. నాయక్, డీన్ పీజీ స్టడీస్ డాక్టర్ ఏవీ రమణ, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి.శివ నారాయణ, అసోసియేటెడ్ డాక్టర్ ఎం.రెడ్డిశేఖర్, కళాశాల తెగుళ్ల శాస్త్ర విభాగం డైరెక్టర్ డాక్టర్ వేమన తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఐవీలో ఏపీ రెండో స్థానం
తిరుపతి అర్బన్: దేశంలో హెచ్ఐవీ రోగులు అధికంగా ఉన్న రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్టినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు వెల్లడించారు. మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి హెచ్ఐవీకి చెందిన మందుల శాతం తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు కమిటీ సభ్యులు, కమిటీ ఇన్చార్జి విశ్వనాథం, అప్సక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డితో కలసి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్ఐవీపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. హెచ్ఐవీ ఉన్నవారిపై వివక్ష చూపడం చట్టరీత్య నేరంగా భావించాల్సి ఉందని చెప్పారు. అలాగే వారి గోప్యత హక్కు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై ఓ విలేకరి ప్రశ్నిస్తే...ఆ అంశంపై మరోసారి మాట్లాడుదాం...ఇది వేదిక కాదంటూ సమాధానం దాటవేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి, శ్రావణిశ్రీ, గాలి భాను ప్రకాష్, కన్నా లక్ష్మీనారాయణ, వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు రాంగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఈ రఘునందన్, డీపీహెచ్ అండ్ ఎఫ్ డబ్ల్యూ డాక్టర్ పద్మావతి, డీఆర్వో నరసింహులు, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, స్విమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు, డాక్టర్ శైలజ, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉష కళావత్, రిజిస్టార్ అపర్ణ, డిప్యూటీ రిజిస్టార్ రెడ్డి, డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
తాకట్టు పెడుతున్నారు
బాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచలేదని, 26 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ చేసి చార్జీలు తగ్గించామని గొ ప్పలు చెప్పుకోవడం ప చ్చి మోసం. గత రెండేళ్లలో రూ.17వేల కోట్లు అదనపు భారాన్ని వినియోగదారులపై మోపింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో డిస్కంలు స మర్పించిన నివేదికల్లో బోగస్ లెక్కలు, తప్పుడు సమాచారంతో రూ.12,771 కోట్ల భారం ప్రభు త్వం తరఫున ప్రజలపై వేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు కుట్ర పన్నాయి. విద్యుత్ రంగాన్ని తాకట్టు పెడుతున్నారు. – కందారపు మురళి, సీపీఎం నేత -
ఉలిక్కిపడిన తెలుగు తమ్ముళ్లు
రేణిగుంట: మండలంలోని కరకంబాడిలో కొండను చదును చేసి ప్లాట్లు వేసి, విక్రయానికి పెట్టిన తెలుగు తమ్ముళ్లు అక్రమాలపై సాక్షిలో మంగళవారం ‘కొండలనూ మింగేస్తున్నారు’ శీర్షికన కథనం రావడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. దానికి తోడు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం, రెండు ట్రాక్టర్లను సీజ్ చేయడంతో ఉక్కిరిబిక్కిరి అయిన స్థానిక తెలుగు తమ్ముళ్లు మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సాక్షిదినపత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అసత్యమని, అక్రమాలు ఏమీ జరగలేదని, జరిగినట్లు నిరూపించాలని టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బుజ్జినాయుడు వితండవాదం చేశారు. గ్రామంలో కళ్లెదురుగా కొండను తవ్విన ఆనవాళ్లు ఉండగా, ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరీ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంతో స్థానికంగా ఆయన నవ్వుల పాలయ్యారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందంగా తెలుగు తమ్ముళ్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తమకేమీ సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఆక్రమణలే జరగకపోతే రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఎందుకు పెడతారు. అక్రమ తవ్వకాలు జరగకపోతే కొండను తవ్విన ఆనవాళ్లు ఎక్కడ నుంచి వచ్చాయని స్పష్టత ఇవ్వకుండా ప్రెస్మీట్ను ముగించారు. -
పీటీసీలో మోటివేషన్పై శిక్షణ
చంద్రగిరి మండలంలోని పీటీసీలో మోటివేషన్ పై పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.●బుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026 కాలువ పొరంబోకులో పరదాల మాటున నిర్మిస్తున్న భవనంఅడిగేవారు లేరు.. అడ్డుకునే వారు రారని.. ఖాళీ జాగా కనిపిస్తే చాలు తమ ఖాతాలో వేసుకోవడానికి కొందరు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములపోయే..ఖాళీ స్థలాలు పోయే.. చివరకు కాలువపోరంబోకు స్థలాన్ని ఆక్రమార్కులు వదల్లేదు. తిరుపతి నగర నడిబొడ్డున ఇప్పుడలాంటి భూమిపైనే జనసేన, పచ్చనేతలు కన్నేశారు. తప్పుడు పట్టాలతో రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారులు వారికి సై అంటున్నారు. నేటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు తిరుపతి సిటీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరగనున్న జేఈఈ మెయిన్స్ సెషన్–1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈనెల 30వ తేదీ వరకు జరగనున్న సెష న్–1 పరీక్షలు తిరుపతి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలలో జరగనున్నాయి. తిరుపతి ఎస్వీ జూపా ర్క్ సమీపంలోని ఇయాన్ డిజిటల్ సెంటర్, రేణిగుంట రోడ్డులోని చదలవాడ కళాశాలలో జరగనున్న పరీక్షలు రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒక్కొక్క సెషన్కు సుమారు 320 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి నేత చెంగల్రెడ్డికి నోటీసులు తిరుపతిరూరల్: వైఎస్సార్ సీపీ విద్యార్థి విభా గం చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు చెంగల్రెడ్డికి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన తి రుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా లో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్కు అంతరా యం కలిగించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి న పోలీసులు ఆ కేసులో విచారణకు హాజరుకావాలని 41 నోటీసులను మంగళవారం అందజే శారు. విద్యార్థి సంఘాలపై ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా చేసినందు కు మరో కేసు పెట్టడం దుర్మార్గమని, ఎన్ని కేసు లు పెట్టినా తమ పోరాటం ఆగదని అన్నారు. నేడు చర్చాగోష్టి తిరుపతి మంగళం : మంగళం రోడ్డులోని డీఎల్ఆర్ గ్రాండ్ హోటల్లో బుధవారం ఉదయం 10 గంటలకు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మే ధావులతో చర్చాగోష్టి నిర్వహించనున్నట్టు రాయలసీమ అధ్యయన సంస్థ చైర్మన్ భూమన సుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. ఎయిడెడ్ స్కూళ్లల్లో టీచింగ్ పోస్టులకు 25న పరీక్షలు తిరుపతి సిటీ: జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలలు, శ్రీ పొట్టి శ్రీరాములు అప్పర్ప్రైమరీ స్కూల్లో (ఎస్పీఎస్యూపీఎస్) ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 25, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జూపార్క్లోని ఇయాన్ డిజిటల్ సెంటర్లో పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. 25వ తేదీన గ్రేడ్–2 హిందీ పోస్టుకు, అదే రోజున గ్రేడ్–2 తెలుగు పోస్టుకు, 27వ తేదీని సెంకడరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు జరగనున్నా యని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్టికెట్లను cre.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నడిబొడ్డున రూ.కోట్ల విలువచేసే కాలువ పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పది రోజుల క్రితం ముళ్లచెట్లను తొలగించి.. ఆ తరువాత తీరిగ్గా పక్కా భవన నిర్మాణం చేపడుతున్న విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని రామానుజ కూడలి పక్కన, గరుడ వారధి కింద సర్వే నంబర్ 43/1లో 2.40 ఎకరాలు కాలువ పోరంబోకు భూమి ఉంది. 1979లో రెండు సెంట్ల చొప్పున పది మందికి పట్టాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే కాలువ పోరంబోకు కావడం, వర్షం వస్తే వరద నీరు ప్రవహిస్తుండడంతో లబ్ధిదారులెవరూ నివాసాలను నిర్మించుకోలేదు. కొన్నేళ్ల తరువాత అక్కడ నిర్మాణాలు చేపట్టడం అంత యోగ్యం కాదని భావించి, అప్పటి ప్రభుత్వం ఆ భూమిని 22ఏ కింద చేర్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిరుపతిలో అనేక నిర్మాణాలు 22ఏలోనే ఉన్నాయని స్థానికులు అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇదే విషయాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతిలో నివాసాలు నిర్మించుకుని ఉన్న స్థలాలను 22ఏ నుంచి తొలగించమని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తిరుపతిలో అనేక మంది లబ్ధిపొందారు. ఖాళీగా ఉన్న భూములు మాత్రం ఇప్పటికీ 22ఏ లోనే ఉన్నాయి. 43/1లోని ఆ భూమి మొత్తం ముళ్లచెట్లతో నిండిపోయి ఉండేది. మూడేళ్ల కిందట అదే భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించగా గత ప్రభుత్వంలోని అధికారులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి అందులోకి ఎవరూ ప్రవేశించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం రూ. కోట్ల విలువచేసే కాలువ పోరంబోకు భూమిపై పడింది. మరో వైపు కార్వేటినగరం రాజులకు చెందిన వారు ఇదే భూమి కోసం తిరుపతికి వచ్చి విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇదే సర్వే నంబర్ 43/1 శ్రీకాళహస్తి నియోజక వర్గ పరిధిలో ఉందని తెలుసుకుని కార్వేటినగరం రాజులకు సంబంధించిన వారు వెనుదిరిగారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన, టీడీపీ నేతలు ఈ భూమిని సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలుశ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 79,098 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,083 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కల్పించాలితిరుపతి అర్బన్: పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు సరైన భద్రత కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా పరిశ్రమల ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. చిన్న చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు కేటాయించిసినట్లు తెలిపారు. మరోవైపు పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి పెండింగ్లో ఉన్నవాటిని పరిశీలించి, అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ తిరుపతి విజయ భరత్ రెడ్డి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణారెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లోకనాథం, డీఆర్డీఏ ఏడీ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట: మండలంలోని కరకంబాడిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై మంగళవారం సాక్షి దినపత్రికలో వచ్చిన ’కొండలనూ మింగేస్తున్నారు’ కథనానికి స్పందించిన తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఆక్రమణ జరిగిన ప్రదేశాలను పరిశీలించి, మట్టి అక్రమ రవాణా చేసే రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. సర్వే నంబర్ 153లోని కొండను తవ్విన ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించేందుకు ప్రయత్నించిన కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. ట్రాక్టర్లను మైనింగ్ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.కబ్జా.. అదో దర్జా! ఆక్రమణలను తొలగిస్తాం కాలువ పోరంబోకు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నట్లు నాకు ఇప్పుడే సమాచారం వచ్చింది. మా వాళ్లను పంపించి ఆక్రమణలను తొలగిస్తాం. కాలువ పోరంబోకు స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టటానికి వీల్లేదు. – సురేష్ బాబు, అర్బన్ తహసీల్దార్, తిరుపతి -
Ratha Sapthami: ఈ నెల 25న తిరుమలలో రథ సప్తమి వేడుకలు
సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.వాహనసేవల వివరాలు :• తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.• ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.• ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.• మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.• మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.• సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.• సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.• రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.ఆర్జిత సేవలు రద్దు :ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరీ‘అనగనగా ఓ రాజు’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరీ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన నవీన్ పోలిశెట్టి, ‘అనగనగా ఓ రాజు’ చిత్రం బ్లాక్బస్టర్ కావడంతో శ్రీవారి ఆశీస్సులు కోరేందుకు తిరుమల వచ్చాం. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంక్రాంతి పండుగకు అద్భుతమైన విజయాన్ని అందించింది అని తెలిపారు.అలాగే, త్వరలో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మరో కొత్త సినిమాతో ముందుకు వస్తాను అని నవీన్ పోలిశెట్టి హామీ ఇచ్చారు. హీరోయిన్ మీనాక్షి చౌదరీ కూడా ఈ విజయానికి ప్రేక్షకులే కారణమని కృతజ్ఞతలు తెలిపారు. -
టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాద వితరణ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరు నుంచి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ ప్రస్తుతం టీటీడీలోని 56 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందన్నారు. కాగా మార్చి నెలాఖరునాటికి అన్ని ఆలయాల్లో రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి, స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. చైన్నెలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్లు, పరిపాలనా అనుమతుల అంశాలను బోర్డు ఆమోదానికి తీసుకురావాలని ఆదేశించారు. రుషికేష్లోని పీఏసీ కూలిపోయే స్థితిలో ఉందన్నారు. ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి, వచ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు. -
నిమ్మ రైతులకు ఊరట
సైదాపురం: నిమ్మ ధరలు మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల చలి ప్రభావంతో నిమ్మ ధరలు ఆశించిన స్థాయిలో పలకక పోవడంతో రైతులు ఆందోళన చెందారు. ప్రస్తుతం గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ.25 నుంచి రూ.40 ధర పలుకుతున్నాయి. అయితే నాణ్యత కలిగిన కాయలు ధర రూ.40 వస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. గతంలో కిలో కేవలం రూ.6 మాత్రమే పలకడంతో రైతులు కాయలను చెట్లుకే వదిలివేశారు. సైదాపురం మండలంలో సుమారు 9 వేల ఎకరాలకు పైగా నిమ్మ సాగు చేస్తున్నారు. రైతులందరూ నిమ్మ తోటలపైనే ఆధారపడి ఉన్నారు. ఈక్రమంలో ఇటీవల వరకు రూ.6 పలికిన ధరలు నేడు రూ.25 నుంచి రూ.40 వరకు పలుకుతుండడంతో నిమ్మ రైతులకు కొంత మేర ఊరట లభించింది. దీంతో సోమవారం గూడూరు నిమ్మ మార్కెట్లో లూజు (50 కిలోల బస్తా)రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు కొనుగోలు చేశారు. నాణ్యత కలిగిన నిమ్మకాయలకు మరింతఽ ధర లభిస్తోంది. ఈ సీజన్లో నిమ్మ కాయలున్నా రైతులకు అధిక ధరలు పలికే అవకాశం ఉంటుంది. -
కొండలనూ మింగేస్తున్నారు!
ప్రభుత్వ భూములు ఆక్రమించిన కబ్జాదారుల కన్ను కొండలపై పడింది. కొండలను లక్ష్యంగా చేసుకుని వాటిని చదును చేస్తూ ఆక్రమణ పర్వానికి తెర లేపారు. ఓ వైపు కొండలను తవ్వి చదును చేస్తూ, మరో వైపు వాటిని ప్లాట్లు వేసి, విక్రయిస్తున్నారు. దీంతో కొండలు కనుమరుగవుతున్నాయి. రేణిగుంట మండలంలోని కరకంబాడి గ్రామానికి ఆనుకుని ఉన్న కొండను తవ్వివేయడమే ఇందుకు నిదర్శనం. కొండని తవ్వి చదును చేసిన ప్రాంతం రేణిగుంట: మండలంలోని కరకంబాడి గ్రామానికి ఆనుకుని ఉన్న కొండను స్థానిక టీడీపీ నాయకులు తవ్వి ప్లాట్లుగా మార్చి, విక్రయిస్తున్నారని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ కార్యాలయం పక్కనే కొండను హిటాచిలతో తవ్వి ఆ మట్టిని కొండ పక్కనే ఉన్న లోతుగా ఉన్న ప్రాంతంలో వేస్తూ ఆ ప్రాంతాన్ని చదును చేస్తూ ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇలా మార్చిన ప్లాట్లను స్థానిక టీడీపీ నాయకులు ఒక అంకణం రూ.50 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అడ్డుకోవాల్సిన అధికారులు, అధికార పార్టీనేతలతో లాలూచీ పడుతుండడంతో వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొండకు రెండు వైపులా అక్రమ తవ్వకాలు సాగిస్తూ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లో కొండ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. పాఠశాల ఆట స్థలం మాయం కరకంబాడి రెవెన్యూ సర్వే నంబర్ 150లో 1997వ సంవత్సరంలో ఐదు ఎకరాల భూమిని కరకంబాడి జిల్లా పరిషత్ పాఠశాల ఆట స్థలానికి కేటాయించారు. కాలక్రమైన ఆక్రమణలకు గురవుతుండగా, ప్రస్తుతం మిగిలి ఉన్న స్థలంలో స్థానిక టీడీపీ నాయ కులు ప్లాట్లు వేసి, విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆట స్థలాన్ని కాపాడాల్సిన పంచాయతీ అధికారులు, పాఠశాల అధికారులు తమకెందుకులే అన్నట్లు ఉండడంతో అక్రమణదారులు ఆట స్థలాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు మేలుకుని ఉన్న స్థలాన్ని అయిన కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. కోర్టులో కేసు ఉన్నా లెక్క చేయకుండా.. కరకంబాడి లెక్క దాఖలు 153 సర్వే నంబర్లోని భూమికి సంబంధించి ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తికి మధ్య హైకోర్టులో కేసు ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తినీ భయపెట్టి, అధికారులను అటువైపు రాకుండా చూసుకుంటూ స్థానిక టీడీపీ నాయకులు ఎత్తు పల్లాలను చదును చేస్తూ విక్రయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారులు కరకంబాడి కొండను పరిశీలించి అక్రమాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. కొండని తవ్వి..ప్లాట్లు వేసి.. -
నాడు అంగీకరించారు.. నేడు అడ్డుకుంటున్నారు..!
చంద్రగిరి: మండలంలోని మోడల్ స్కూల్ ఏర్పాటుకు నాడు అంగీకరించిన నాయకులే నేడు పాఠశాలకు విద్యార్థులను పంపించకుండా అడ్డుకోవడం విమర్శలకు తావ్విస్తోంది. నాడు పాఠశాల పీఏసీ చైర్మన్తోపాటు స్థానిక తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు సంతకాలు చేశారు. మోడల్ స్కూల్ ఏర్పాటు చేసిన తర్వాత దళిత విద్యార్థులతో కలసి తమ పిల్లలను చదివించమంటూ కులవివక్షను ప్రదర్శించడంతో పనపాకం హరిజనవాడ వాసులు నిరసనకు దిగారు. దీనిపై ఇటీవల పత్రికల్లో వార్తలు రావడంతో రెవెన్యూ, పోలీసు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి, విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత సోమవారం మరోసారి తమ పిల్లలతో నిరసనకు దిగి, పాత పాఠశాలలోనే తరగతులు నిర్వహించాలంటూ స్పష్టం చేశారు. పాఠశాలకు తాళాలు వేసి..! పనపాకం హరిజనవాడ మోడల్ స్కూల్లో దళిత విద్యార్థులతో కలసి ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులను చదవించేందుకు అరిగెలవారిపల్లెకు చెందిన స్థానికులు అంగీకరించలేదు. ఈ క్రమంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనధికారికంగానే అరిగెలవారిపల్లెలో పాఠశాల నిర్వహించేలా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీనిపై కథనాలు రావడంతో విచారణ చేపట్టిన అధికారులు తిరిగి అరిగెలవారిపల్లెకు చెందిన 3,4,5వ తరగతి విద్యార్థులు పనపాకం హరిజనవాడ మోడల్ స్కూల్కు రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉద యం అరిగెలవారిపల్లిలోని ప్రాథమిక పాఠశాలకు స్థానిక టీడీపీ నేత తాళాలు వేశారు. విషయం బయటకు పొక్కడం, పోలీసులకు వస్తున్నట్లు తెలుసుకుని తాళాలను తీసేసినట్లు స్థానికులు తెలిపారు. మా స్కూలే మాకు కావాలంటూ నిరసన తమ పాఠశాలలోనే తమకు చదువులు చెప్పాలంటూ విద్యార్థులతో కలసి స్థానిక టీడీపీ నాయకులు, వారి తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ చదువులు చెప్పాలని, తమకు కులవివక్ష లేదంటూ వారు నినాదాలు చేపట్టారు. లేకుండా బీసీ నాయకులతో కలసి ఎంఈఓ కార్యాలయం వద్ద నిరసన చేస్తామని స్పష్టం చేశారు. -
ఎస్సీ, ఎస్టీ సమస్యలపై 23న ప్రత్యేక పీజీఆర్ఎస్
తిరుపతి అర్బన్: ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, డీఆర్వో నరసింహులతో కలసి పీజీఆర్ఎస్ నిర్వహణతోపాటు పలు సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు పీజీఆర్ఎస్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పీజీఆర్ఎస్ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో ప్రతి నెల 2 నుంచి 9వ తేదీ వరకు పాస్ పుస్తకాలు జారీ చేయాలన్నారు. మార్చి 10 నుంచి పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. గణతంత్ర దినాన్ని వేడుకగా నిర్వహిద్దాం ఈనెల 26న తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దిన వేడుకలను వేడుకగా నిర్వహిద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం పర్యావేక్షణ పూర్తి బాధ్యత తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్కు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు డీఈఓ కేవీఎన్ ఈ కార్యక్రమంలో అడిషనర్ ఎస్పీ రవిమనోహరాచారి, ఆర్డీఓ రామ్మోహన్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, తుడా సెక్రటరీ శ్రీకాంత్, డీఈఓ కేవీఎన్ కుమార్, డీఐపీఆర్ఓ గురుస్వామి శెట్టి పాల్గొన్నారు. -
కలెక్టరేట్కూ కరెంట్ కట్
తిరుపతి అర్బన్: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు విద్యుత్ సరఫరా లేదు. దీంతో పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీదారులకు తిప్పులు తప్పలేదు. చీకటిలోనే అధికారులు పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరించారు. అర్జీలను అన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి కరెంట్ లేకపోవడంతో 50 శాతం మంది అర్జీదారులు వచ్చే వారం తీసుకుందామంటూ వెళ్లిపోయారు. మరో 50 శాతం మంది అర్జీదారులు అక్కడే పడిగాపులు కాశారు. 12.40 గంటలకు కరెంట్ రావడంతో అక్కడే ఉన్న అర్జీదారులు ఒక్కొక్కరుగా రసీదులు స్వీకరించారు. విద్యుత్ వైర్ల సమస్యలతో ఆ భవనం వరకు మాత్రమే విద్యుత్ అంతరాయం చోటుచేసుకుంది. పీజీఆర్ఎస్కు 251 అర్జీలు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 251 అర్జీలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, సుధారాణి అర్జీలను అందుకున్నారు. శెట్టిపల్లి జాబితాలో మా పేర్లు చేర్చండి శెట్టిపల్లిలో ఆది నుంచి మాకు పట్టాలున్నాయని..తాజాగా అధికారులు ప్రకటించిన జాబితాలో మా పేర్లు ఎందుకు చేర్చలేదంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి వారి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో పరిశీలించి, న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు. పింఛన్కు అనుమతులు వచ్చాయా? కేవీబీపురం మండలంలోని ఎస్ఎల్ పురం ఎస్టీకాలనీకి చెందిన ఇ. సుబ్బమ్మ ఇ.బాలాజీ 2024 మార్చిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతడికి ఓ కాలు తీసివేశారు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పింఛన్ కోసం తిరుగుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయి సార్ అంటూ ఆమె దివ్యాంగుడైన తమ కుమారుడితో అధికారులకు మొరపెట్టుకున్నారు. -
వేమన గొప్ప తత్వవేత్త
తిరుపతి అర్బన్: యోగి వేమన గొప్ప తత్వవేత్తగా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో వేమన జయంతిని పురస్కరించుకుని కలెక్టర్తోపాటు జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులుతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగి వేమన తన పద్యాల ద్వారా కుల, మత, ఆర్థిక భేదాలను తీవ్రంగా ఖండిస్తూ సమానత్వం, మానవత్వం, సత్యం, నైతిక విలువలను ప్రజల్లో నాటేందుకు కృషి చేసిన గొప్ప మహనీయుడని పేర్కొన్నారు. అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలను ఎదిరిస్తూ సామాజిక చైతన్యాన్ని కలిగించిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. వేమన రచించిన పద్యాలు సరళమైన ప్రజాభాషలో ఉండడంతో సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యాయని, వాటిలోని తాత్విక భావాలు నేటికీ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని తెలిపారు. మానవుడు నిజాయితీగా, నైతికంగా జీవించాలనే సందేశాన్ని వేమన తన జీవితాంతం ప్రజలకు మంచిని అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, సెట్విన్ సీఈఓ యశ్వంత్, టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి, ల్యాండ్ సర్వే రికార్డ్స్ జిల్లాధికారి అరుణ్కుమార్, ఏపీఐఐసీ జెడ్ ఎం భరత్ కుమార్ రెడ్డి, సెట్విన్ మేనేజరు మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్వీయూ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
తిరుపతి సిటీ: ఎస్వీయూలో నిబంధలను తుంగలో తొక్కి అన్ని అర్హతలుండి అకడమిక్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న తనని అధికారులు తొలగించడం దారుణమని తాత్కాలిక అధ్యాపకుడు డాక్టర్ ఎస్ శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వర్సిటీ అధికారులపై కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడేళ్లుగా వర్సిటీలో కామర్స్ విభాగంలో తాత్కాలిక అధ్యాపకుడిగా పనిచేస్తున్నానని, ఇటీవల వర్సిటీ అధికారులు ఫర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో తాత్కాలిక అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హత ఉన్నవారిని సైతం తొలగించడం దారుణమన్నారు. విద్యార్హతలతో పాటు, అధ్యాపక అర్హత పరీక్షలో సైతం ఉత్తీర్ణులయ్యానని, ఆ విభాగంలో పనిచేస్తున్న ఏ అధ్యాపకునికి ఇటువంటి అర్హతలు లేవన్నారు. తాను పనిచేసిన విభాగంలో వంద శాతం ఫలితాలు సాధించి రికార్డు సృష్టించి మెరిట్ శాలరీ సైతం అందుకున్నానని తెలిపారు. సాక్షాత్తు రిజిస్ట్రార్ తన చాంబర్లో తనతో మాట్లాడుతూ లంచం ఇవ్వలేవు.. రాజకీయంగా సపోర్టు లేదు.. ఎలా నిన్ను కొనసాగించాలంటూ నేరుగా అడిగారని ఇందుకు సంబంధించిన సీసీ పుటేజ్ను సైతం పోలీసులు తనిఖీ చేయాలని కోరారు. ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు తిరుమల: తిరుమలలో మూడురోజులుగా టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న పురందరదాసు ఆరాధన మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ మానవ జీవన విధానంలో ఎదురయ్యే సమస్యలకు పూర్వజన్మ కర్మ ఫలమే కారణమన్నారు. దీని నుంచి బయట పడటానికి మహాత్ములను సందర్శించి, వారి మార్గదర్శకంలో భగవంతుడిని సేవించడం ద్వారా మోక్షం పొందవచ్చన్నారు. అలాగే 4.75 లక్షల సంకీర్తనలు రచించడం సాక్షాత్తు నారద స్వరూపులైన పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు. -
పేకాట స్థావరంపై దాడులు
డక్కిలి: మండలంలోని మిట్టవడ్డిపల్లి శివారు ప్రాంతంలో పేకాట స్థావరంపై డక్కిలి ఎస్ఐ శివ శంకర్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏడుగురు జూదరులు, నాలుగు సెల్ఫోన్లు, రూ,3750 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఫిబ్రవరిలో విశేష పర్వదినాలు తిరుమల: ఫిబ్రవరి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు టీటీడీ ప్రజాసంబంధాల విభాగం సోమవారం వెల్లడించింది. ఫిబ్రవరి 1న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ, 3న తిరుమొళి శైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 6న కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 26న శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం, 28న కుళశేఖరాళ్వా ర్ వర్ష తిరు నక్షత్రం నిర్వహించునున్నారు. వందరోజుల ప్రణాళికను పక్కాగా అమలు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశించిన వందరోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయా లని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 317 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రణాళికలో భాగంగా ఉదయం, సాయంత్రం ఒక గంట పాటు అదనపు తరగతులు నిర్వహించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఎంఈఓలు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. తరగతుల్లో విద్యార్థుల సామర్థాన్ని మదింపు చేసేందుకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి లీఫ్ యాప్లో ఉపాధ్యాయులు నమోదు చేయాలని ఆదేశించారు. వచ్చేనెల 2 నుంచి ఏపీఆర్ సెట్ ఇంటర్వ్యూలు తిరుపతి రూరల్: ఏపీఆర్సెట్–2024కు సంబంధించి అర్హత సాధించిన విద్యార్థులకు వచ్చేనెల 2 నుంచి 6వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా పద్మావతి మహిళా వర్సిటీ, ఎస్వీయూ, ఆంధ్రవర్సిటీ, ఆచార్య నాగార్జున వర్సిటీ, కాకినాడ, అనంతపురం జేఎన్టీయూలలో ఇంటర్వ్యూల ప్రక్రియను చేపట్టాలని అధికారులు సంబంధిత వర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఉన్నత విద్యామండలి వెబ్సైట్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు. గణేష్ రెడ్డి అదృశ్యం శ్రీకాళహస్తి: మండలం తిరుమంజికండిగ (టీఎంయూ కండిగ) గ్రామానికి చెందిన ఎం. మునెమ్మ కుమారు డు గణేష్ రెడ్డి ఈ నెల 5 వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆయన భార్య గీత ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఇంట్లో స్వల్ప వివాదం కారణంగా గణేష్ రెడ్డి అలిగి బయటకు వెళ్లాడు. గతంలో కూడా పలుసార్లు ఇలాగే వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సందర్భాలు ఉండడంతో బంధువులు, చుట్టాల ఇళ్ల వద్ద వెతికించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రోజులు గడుస్తున్నా జాడ లభించకపోవడంతో తల్లి మునెమ్మ, భార్య గీత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై శ్రీకాళహస్తి రూరల్ పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు, తమ భర్తను గుర్తించి, అప్పగించాలని ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు. సీఆర్పీలతోనే సంఘాల్లో పారదర్శకత తిరుపతి రూరల్: సీఆర్పీలు పని చేసే విధానంతోనే సంఘాల్లో పారదర్శకత ఉంటుందని డీపీఎం ఐబీ వెంకటేష్ తెలిపారు. తిరుపతి రూరల్ మండల సమాఖ్య సమావేశ మందిరంలో సీఆర్పీలకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణకు డీపీఎం ఐబీ వెంకటేష్ హాజరయ్యా రు. ఆయన మాట్లాడుతూ ఈ–నారి, సీఆర్పీలు ప్రతి 10 సంఘాలకు ఒక్కరిని నియమించినట్లు తెలిపారు. అలాగే 25 సంఘాలు దాటినా వీఓఏ ల్లో ఇద్దరు జీవనోపాధులకు సంబంధించి ఇద్దరు సీఆర్పీలను నియమించామన్నారు. అలాగే వారికి కేటాయించిన సంఘాల్లో సమావేశాలకు హాజరుకావడం, సంఘాల పుస్తకాలు రాయడం, సంఘ సమావేశంలో ఆర్థిక లావాదేవిలు వీఓఏలకు స మర్పించి వారితో లైవ్ మీటింగ్స్ డేటా అప్డేట్ చేయించాలన్నారు. ఏపీఎం నాగేశ్వరరావు, దు ర్వాసులు నాయుడు, సీసీలు చిత్ర, రవి, రమేష్, ధనుంజయ, వాహిని , సుజాత పాల్గొన్నారు. -
ఏ.రంగంపేటలో పశువుల పందేలు రేపు
చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేటలో బుధవారం పశువుల పందేలు(జల్లికట్టు)ను నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది కనుమ రోజున పందేలను నిర్వహించడం ఆనవాయితీ. అదే రోజు గ్రామంలోని ఇద్దరు మృతి చెందడంతో శూతకం కారణంగా వాయిదా వేశారు. దీంతో బుధవారం వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. నేడు ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో జాతీయ సదస్సు చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో రెండు రోజుల పాటు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు కళాశాల అసిసోసియేట్ డీన్ డాక్టర్ రెడ్డి శేఖర్ తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తెగుళ్ల శాస్త్ర విభాగం, ఇండియన్ ఫైటో ప్యాథలాజికల్ సొసైటీ, సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో జాతీయ సదస్సు, సింపోజియం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ శారద జయలక్ష్మీదేవి, వర్సిటీ ఉన్నత అధికారులు పాల్గొంటారన్నారు. అలాగే వియత్నం దేశం నుంచి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గుయన్ డాక్ కోవా, షిమోగా వ్యవసాయ వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎంకే. నాయక్తోపాటు పలువురు శాస్త్రవేత్తలు హాజరుకానున్నారన్నారు. అలాగే 8 రాష్ట్రాల నుంచి పీజీ పీహెచ్డీ పరిశోధక విద్యార్థులు, వివిధ వ్యవసాయ వర్సిటీల అధ్యాపకులు శాస్త్రవేత్తలు పాల్గొంటారన్నారు. -
విదేశీ అతిథి..
సూళ్లూరుపేట : పులికాట్ సరస్సు జనవరికే అడుగంటిపోతోంది. ఫలితంగా విదేశీ వలస విహంగాలకు ఆహారం కొరత ఏర్పడుతోంది. దీంతో విదేశీ పక్షుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ ఏడా ది పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ పులికాట్ సరస్సు అప్పుడే ఎడారిలా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీవర్షాలతో సరస్సుకు నీరు చేరడంతో ఈ ఏడాది నవంబర్ నెలలోనే పలు రకాల విదేశీ వలస విహంగాలు విడిదికి విచ్చేశాయి. ముఖ్యంగా ఫ్లెమింగోలు (సముద్రపు రామచిలుకలు), పెలికాన్స్ (గూడ బాతులు) పెయింటెడ్ స్టార్క్స్(ఎర్రకాళ్లకొంగలు)లతోపాటు అనేక రకాల పక్షులు విచ్చేసి ఆహారవేటలో ఉండి పర్యాటకులకు కనువిందు చేశాయి. ఇందులో ఫ్లెమింగోలు మాత్రం నీళ్లు అలా ఎండిపోగానే కనిపించకుండా దూరంగా వెళ్లిపోయాయి. పెలికాన్స్ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో పిల్లలను పొదిగి పెద్దవి చేసుకునే పనిలో ఉన్నాయి. శ్రీహరికోట రోడ్డుకు ఉత్తరం వైపు సర స్సు ఎడారిగా మారడంతో నేలపట్టులోని పక్షులు సమీపంలోని చెరువుల్లో, పల్వేరికాడ్, ఎన్నూరు ప్రాంతాలకు వెళ్లి ఆహారవేట చేస్తున్నాయి. ఎర్రకాళ్లకొంగలు మాత్రం ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. సరస్సు ఎండిపోతుండడంతో ఆహారం లేక పక్షులు అల్లాడిపోతున్నాయి. సాధారణంగా విదేశీ వలస విహంగాలు పిల్లలను పొదిగి, వాటిని పెద్దవి చేసుకునే వెళ్లే సమయమిది. ఈ సమయంలో ఎండిపోయిన సరస్సులో నేలపై మోకాళ్లు మడిచి కూర్చుని తమ విలాపాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. కొన్ని వలస విహంగాలు ఆహారం లేకపోవడంతో కాళ్లు మడతేసుకుని కూర్చుని కనిపించాయి. మరికొన్ని విహంగాలు అప్పుడే ఆహారం అయిపోయిందా! దిగులుతో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. వీటి మూగరోదన చూసిన పర్యాటకులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల పండుగతోనే సరి..ఆపై ఆమడదూరంలో పులికాట్ అభివృద్ధి రాష్ట్ర పర్యాటక శాఖ రూ.కోట్లు వెచ్చించి పక్షుల పేరుతో పండుగ చేస్తున్నారే తప్ప వలస వస్తున్న విహంగాలకు కడుపునిండా ఆహారం వనరు అయిన పులికాట్ సరస్సును మాత్రం అభివృద్ధి చేయడం లేదు. పక్షులు పండుగకు కేటాయిస్తున్న నిధుల్లో కొంత భాగం వెచ్చించి ముఖద్వారాలు పూడిక తీయిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ పాలకులు, అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు. పండుగ జరిగిన ప్రతిసారీ అన్ని రూ.కోట్లు ఇన్ని రూ.కోట్లు కేటాయించాం. అని మాటలు చెబుతున్నారే తప్ప, వాస్తవంగా మాత్రం ఏమీ కనిపించడం లేదు. ఈ ఏడాది పండుగ ముగింపు ఉత్సవానికి విచ్చేసిన పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ ప్రాంతంలోని పులికాట్ సరస్సును, నేలపట్టు పక్షుల కేంద్రాన్ని పర్యాటక హబ్గా ఏర్పాటు చేస్తానని చెప్పేసి వెళ్లారు. ఇక వచ్చే పండుగకు కూడా వచ్చి ఇదే హామీలే ఇచ్చేసి వెళతారు. ఈ సరస్సును నమ్ముకుని ఏటా శీతాకాలంలో ఇక్కడే తలదాచుకుని సంతానోత్పత్తిని చేసుకునే వెళ్లే పక్షుల ఆహారం కొరతను ఎవరు తీరుస్తారు. పండుగ మూడు రోజుల తరువాత సరస్సును పట్టించుకోకపోవడంతో జనవరి నెల ముగియకముందే ఎడారిలా మారి, పక్షులకు ఆహారం కొరత ఏర్పడింది. ఇప్పటికై నా స్పందించి ప్రత్యామ్నాయంగా సముద్ర ముఖద్వారాన్ని పూడిక తీయించాలని పర్యాటక ప్రియులు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.అడుగంటుతున్న పులికాట్ సరస్సు విదేశీ వలస విహంగాలకు ఆహారం కొరత -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి
తిరుపతి అర్బన్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టరేట్లో ఆయన పలు విభాగాలకు చెందిన అధికారులతో కలసి ధా న్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన బ్యానర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో వరి పంట సాగు అధికంగా ఉండడంతో ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దళారీల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న రైతు సేవా కేంద్రాలకు వెళ్లి సంప్రదించాలని సూచించారు. మీ పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు మాత్రమే వెళ్లాలని, అలాగే అక్కడే ఈ–పంట, ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలన్నారు. ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాల్ రూ.2389కి, సాధారణ రకం క్వింటాల్ రూ.2369కి కొనుగోలు చేస్తారని వెల్లడించారు. సమస్యలుంటే పరిష్కారం కోసం పౌరసరఫరాల సంస్థ కంట్రోల్ రూమ్ నెంబర్ 8008901962కు ఫోన్ చేయాలని వివరించారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, డీఆర్వో నరసింహులు, సివిల్ సప్లయి జిల్లా మేనేజర్ బాలకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్రావు, మార్కెట్ కమిటీ జిల్లా అధికారి సురేంద్రబాబు, ప్రాథమిక సహకార సంఘం జిల్లా అధికారి నాగవర్థిని పాల్గొన్నారు. -
ఇదేమిటి సర్వేశ్వరా?
రీసర్వేపై నాడు దుష్ప్రచారం.. నేడు సానుకూలతవందేళ్ల పూర్వం భూ సర్వే.. ఫలితంగా పరిష్కారం కాని భూ సమస్యలు.. కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు.. వీటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. దీనిపై అప్పటి ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు నానా రాద్ధాంతం.. అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు.. నేడు అదే రీసర్వేకు సానుకూలత వ్యక్తం చేస్తున్న సర్కారు.. ఇదేమిటి సర్వేశ్వరా.. నాడు మంచిది కాదన్నారు.. నేడు అదే అవలంభిస్తున్నారని రైతులు గుసగుసలాడుతున్నారు. రీసర్వే జరిగిన గ్రామాలు మండలం గ్రామం కేవీబీపురం సుబ్రమణ్యపురం పిచ్చాటూరు రామాపురం నాగలాపురం వేలూరు నారాయణవనం పాలమంగళం వరదయ్యపాళెం యానాదివెట్టు సత్యవేడు కాదిరివేడు బీఎన్కండ్రిగ కేవీపురం గత ప్రభుత్వంలో రీసర్వే జరిగిన గ్రామాలు మండలం గ్రామాలు వరదయ్యపాళెం నెల్లటూరు, కోవూరుపాడు, అయ్యవారిపాళెం నాగలాపురం కృష్ణాపురం, కాళంజేరి పిచ్చాటూరు రాజానగరం, అప్పంబట్టు బీఎన్కండ్రిగ కంచనపుత్తూరు సత్యవేడు: పేరడం, ఆంబాకం, మదనంజేరి, తొండుకొల్లి, సిరనంబూదూరు, మదనపాళెం, దళవాయి అగ్రహారం, చెంగంబాకం నారాయణవనం: పాలమంగళం నార్త్, పాలమంగళం సౌత్, తుంబూరు, నైనారుకండ్రిగ, అరణ్యకండ్రిగ, కీలగరం, కసింమిట్ట, భీమునిచెరువు, డీకేపాళెం, ఇప్పన్తాంగల్, నారాయణవనం, తిరువట్యం, వీకేపాళెం, ఎరికంబట్టు, కళ్యాణపురం, బొప్పరాజుపాళెం వరదయ్యపాళెం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేపై సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన, బీజేపీనేతలతో పాటు ఎల్లో మీడియా చేసి న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ సర్వేపై రైతులు, ప్రజల్లో అనేక సందేహాలు రేకెత్తించారు. అప్పట్లో ప్రతిపక్షనేత హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల బహిరంగ సభల్లో సమగ్ర భూ రీసర్వేను ఉద్దేశించి.. తమ్ము ళ్లు మీ భూములను జగన్మోహన్రెడ్డి లాగేసు కుంటున్నారు.. కూటమిని గెలిపిస్తే భూ రీసర్వే ను రద్దు చేస్తాం..మీ భూములను కాపాడుతాం అంటూ ఉన్నవి లేనివి కల్పించి ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ఎడపెడా కథనాలు ప్రచురించారు. ఏ సర్వేను అయి తే రద్దు చేస్తామని నాడు చంద్రబాబు, కూటమి నేతలు చెప్పారో అదే సర్వేని నేడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రారంభించడంతో ప్రజలు, రైతులు సర్వత్రా చర్చించుకుంటున్నారు. వందేళ్ల తర్వాత సర్వే రైతులు ఎన్నో ఏళ్లుగా భూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. భూమి ఒకరిది అయితే మరొకరి పేరున రికార్డులో నమోదు కావడం, సర్వే నంబర్లలో తప్పులు, సరిహద్దుల సమస్య, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికావడం వంటి అనేక సమస్యలు ఉన్నాయి. తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఏళ్లతరబడి తిరిగేవారు. జిల్లా స్థాయిలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమాల్లోనూ భూ సమస్యలపైనే అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చేవి. రైతులు ఏ అధికారి వద్దకు, ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా వారి భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమగ్ర భూరీసర్వేకు శ్రీకాారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లో వందేళ్ల తర్వాత సమగ్ర భూ రీసర్వేను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. ఇంతకు ముందు ఏ ప్రభుత్వమూ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం గురించి ఆలోచన చేయలేదు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో 2020లో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పేరుతో రాష్ట్రంలో మొదటి విడత సమగ్ర భూసర్వేను గత ప్రభుత్వం ప్రారంభించింది. మూడు దశలో 2023 జనవరి నాటికి సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వందలాది సర్వే బృందాలతో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లతో సర్వే చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని 7 మండలాల్లో 170కి పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో మొదటి విడతగా కొన్ని గ్రామాల్లో గత ప్రభుత్వం రీసర్వే పూర్తి చేసింది. అయితే భూ రీసర్వేపై ఎన్నికల నోటిఫికేషన్కు ముందు నుంచే టీడీపీ, జనసేన అగ్ర నాయకత్వం నుంచి కింది కేడర్ వరకు వారికి జతకడుతూ ఎల్లో మీడియా ఎంతో చెడు ప్రచారం చేసింది. ఒక విధంగా చెప్పాలంటే భూ రీసర్వే అంటే రైతులు భయపడేంతలా విషప్రచారం చేశారు. ఇంత స్థాయిలో వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఏపీ భూ రీసర్వే పేరుతో సర్వేను మళ్లీ ప్రారంభించారు. ఆ దిశగా నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 7 రెవెన్యూ గ్రామాల్లో భూ రీసర్వే ప్రక్రియను సర్వే సిబ్బంది గత ఏడాది ప్రారంభించారు. తదుపరి మండలానికి మూడు గ్రామాలను ఎంపిక చేసి తాజాగా సర్వే ప్రక్రియను మొదలుపెట్టారు. 2027 కల్లా అన్ని రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి కావాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేయడం గమనార్హం. సత్యవేడు నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి రీ సర్వే చేశారు. సర్వే చేస్తున్నాం వరదయ్యపాళెం మండలంలో ప్రస్తుతం రీసర్వే మొదలైంది. చిన్న పాండూరు, కువ్వాకొల్లి, కారిపాకం రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రక్రి య మొదలైంది. రీసర్వేను మొదలు పెట్టేందుకు మండల సర్వేయర్, ఇతర సర్వే బృందం సభ్యులు ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి పాసుపుస్తకాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. విడతలవారీగా కొన్ని రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసే ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచనల మేరకు 2027 కల్లా సర్వే ప్రక్రియను మండలంలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. – సుధీర్రెడ్డి, తహసీల్దార్, వరదయ్యపాళెం మండలం -
చెవిరెడ్డి హర్షిత్రెడ్డికి పోలీసుల నోటీసులు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న ఆర్డీవో ఆఫీస్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి.విద్యార్థి సంఘాలపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు ఎత్తేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ధర్నాకు మద్దతు తెలిపిన హర్షిత్ రెడ్డితో పాటు 14 మంది విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. -
పోరు బాట తప్పదు
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు ప్రజల సొమ్మును వినియోగిస్తే బాబు సర్కారుపై పోరుబాట తప్పదు. విగ్రహ ప్రతిష్ట కేవలం టీడీపీకి చెందిన విషయం. వారి పార్టీ నిధులు, ఎన్టీఆర్ వారసుల డబ్బులతో విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి. అంతే కానీ, ప్రజలు పన్నుల రూపేణా కట్టిన సొమ్మును దుర్వినియోగం చేస్తే సహించం. ఒక్క విగ్రహానికి రూ.వేల కోట్లు ఖర్చు చేయాలనుకోవడం దుర్మార్గం. ఆ నగదును ఫీజు రీయింబర్స్మెంట్కు వాడితే ఉపయోకరం. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తే మంచిది. – జ్యోతి, సీఐటీయూ, జిల్లా కార్యదర్శి, పూతలపట్టు సర్కారు తీరు హాస్యాస్పదం సర్కారు తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు నిధులు లేవని చేతులేత్తేసి, రూ.వేల కోట్లుతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పడంలో ఆంతర్యమేంటో పాలకులు వెల్లడించాలి. రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే వైద్యకళాశాలలు అందుబాటులోకి వస్తాయి. వేలాది మంది పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారు. ఇక విగ్రహం పెట్టాలనుకుంటే టీడీపీ ఫండ్ నుంచి నిధులు వెచ్చించుకోవాలి. – విశ్వనాథ్, సీపీఐ నగర కార్యదర్శి, తిరుపతి -
● ధాన్యం కొనుగోలుకు పంట నమోదు తప్పనిసరి ● ఫిబ్రవరి 25 ఆఖరి గడువు ● ఇప్పటి వరకు 21శాతం మాత్రమే పూర్తి
పంట నమోదు చేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు (ఫైల్) తిరుపతి అర్బన్: ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి వారంలో ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుడుతుంటా రు. జనవరి 31వ తేదీలోపు పూర్తి చేస్తుంటారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం కారణంగా గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో పంటల నమోదును ప్రారంభించారు. ఫిబ్రవరి 25వ తేదీ వరకు గడువు నిర్దేశించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 21శాతం మాత్రమే ఈ–క్రాప్ నమోదు చేసినట్లు తెలిసింది. సిబ్బంది కొరత ఈ–క్రాప్ నమోదు చేయడమంటే అగ్రికల్చర్ అసిస్టెంట్లు రైతు పొలం వద్దకు వెళ్లి ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. అందులో ఎంత విస్తీర్ణంలో సాగు చేపట్టారు. ఏ పంట వేశారనే వివరాలను పొందుపరచాలి. అయితే జిల్లా లో మొత్తం 445 రైతు సేవా కేంద్రాలుంటే, అందులో 45శాతం సెంటర్లలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు లేరు. ఉన్నవారు వివిధ సర్వేల్లో తలమునకలయ్యారు. దీంతో ఈ–క్రాప్నమోదులో తీవ్రమైన జాప్యం తప్పడం లేదు. ఒక వైపు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ–క్రాప్ నమోదు చేయకుంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు. ఇక రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. అరకొర ధరలకు పంటలను అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. 2.35 లక్షల ఎకరాల్లో వరి సాగు ఈ రబీ సీజన్లో 2.35 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. వీరందరూ ప్రభుత్వానికి ధాన్యం విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారు. శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ సంస్థ ఏటా రబీ సీజన్లో 5వేల ఎకరాల్లోని వరి పంటను రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. అయితే నష్టాలు వస్తున్నాయంటూ ఈ ఏడాది కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పేసింది. దీంతో ఆ రైతులు కూడా ప్రభుత్వానికే ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో గడువు లోపు 100 శాతం ఈ క్రాప్ నమోదు చేయాల్సిన బాధ్యత అగ్రికల్చర్ అసిస్టెంట్లపై ఉంది. అలాగే మరో 55 వేల ఎకరాల్లో మామిడి పంట, 45 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు జిల్లాలో సాగులో ఉన్నాయి. -
మైమరపించిన ‘సంకీర్తన’
తిరుమల : తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు ఆదివారం సాయంత్రం పురంధరదాసు కీర్తనలతో మార్మోగాయి. పురంధరదాసు ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఊంజల్సేవలో సేదతీరారు. ఈ సందర్భంగా దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపించింది. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురంధరదాసు కీర్తనలు ఆలపించారు. ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, డిప్యూటీ ఈఓ లోకనాథం, 3,500 మందికి పైగా భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. వేర్వేరు చోట్ల రెండు పూరిళ్లు దగ్ధం కేవీబీపురం/రాపూరు : కేవీబీపురం మండలంలోని అంజూరు ఎస్సీ కాలనీ, రాపూరు మండలం తూమాయి ఆర్ఆర్ సెంటర్ దళితవాడలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. వివరాలు.. అంజూరు ఎస్సీకాలనీలోని జరిగిన అగ్నిప్రమాదంలో ఇంట్లోని బీరువా, దుస్తులు, వస్తువులు, మంచాలతోపాటు రూ.2లక్షల నగదు కాలిపోయినట్లు బాధితుడు పల్లమాల కాటయ్య తెలిపారు. నాలుగు గేదెలను అమ్మగా వచ్చిన నగదును ఇంట్లో ఉంచానని, ఈ ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయానని విలపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే తూమాయి ఆర్ఆర్సెంటర్ దళితవాడలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఇంటితోపాటు నగదు, బియ్యం, దుస్తులు కాలిపోయినట్లు బాధితుడు తూమాటి అశోక్ తెలిపారు. వందేభారత్కు అదనపు బోగీలు తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి – సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు బోగీల సంఖ్యను పెంచారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉంటోంది. దీంతో అదనంగా బోగీలను పెంచాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 16 నుంచి 20 బోగీలను పెంచింది. గుర్తు తెలియని వృద్ధుడి మృతి పాకాల : పాకాల– నేండ్రగుంట మార్గంలోని ఉప్పువంక వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. సుమారు 60 ఏళ్ల వృద్ధుడు రైల్వే ట్రాక్ పక్కన మృతి చెంది పడి ఉన్నాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ఒంటరి ఏనుగు హల్చల్ పాకాల: మండలంలోని పదిపుట్లబైలు వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రెండు మూడు రోజులుగా ఒంటరి ఏనుగు పదిపుట్లబైలు, పేరసానిపల్లి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల మధ్య సంచరిస్తోందని రైతులు వాపోతున్నారు. దీంతో పొలాల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉందని చెబుతున్నారు. రెండు నెలల క్రితం ఇదే విధంగా ఒంటరి ఏనుగు సంచరించి రైతులను భయబ్రాంతులకు గురి చేసింది. ఆ సమయంలో అటవీశాఖ అధికారులు ఏనుగును గుర్తించి దారి మళ్లించారు. ప్రస్తుతం ఒంటరి ఏనుగు మళ్లీ హల్చల్ చేస్తుండడంతో ఎప్పుడు దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టి ఒంటరి ఏనుగును దారి మళ్లించాలని కోరుతున్నారు. మళ్లీ కాలువ భూమి ఆక్రమణ! రేణిగుంట: మండలంలోని కృష్ణాపురంలో ఆక్రమణదారులు మళ్లీ రెచ్చిపోయారు. గత నెల రాళ్ల కాలువ భూమిని కొందరు చదును చేసి ఆక్రమించేందుకు యత్నించడంతో సమాచారం అందుకున్న తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తమ సిబ్బందిని పంపించి ఆక్రమణ పనులను అడ్డుకున్నారు. జేసీబీతో కాలువ తవ్వించారు. అయితే పండుగల సమయంలో ఆక్రమణదారులు మళ్లీ తెగబడ్డారు. గుట్టుగా కాలువను చదును చేశారు. ఇది ఆదివారం తహసీల్దార్ దృష్టికి రావడంతో స్పందించారు. ఆయన ఆదేశాలతో వీఆర్వో సాయికుమార్ ఆక్రమణ ప్రదేశాన్ని పరిశీలించారు. జేసీబీతో కాలువను యధావిధిగా తవ్వించారు. ఆక్రమణలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. -
కాలువలోకి దూసుకెళ్లిన టెంపో ట్రావెలర్
– ఇద్దరికి తీవ్ర గాయాలు చంద్రగిరి: చంద్రగిరి–తిరుపతి రూరల్ మండలం సరిహద్దులోని మల్లవరం కూడలి వద్ద శనివారం రాత్రి టెంపో ట్రావెలర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన భక్తులు టెంపోట్రావెలర్ వాహనంలో తిరువణ్ణామలై వెళ్లారు. అక్కడ స్వామిని దర్శించుకుని శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో మల్లవరం కూడలి వద్ద వాహనం అదుపుతప్పి రహదారికి అనుకుని ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలోని 10 మంది ప్రయాణికుల్లో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఇద్దరి కాళ్లలోకి ఇనుప రాడ్లు చొచ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనం ద్వారా తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ నిర్బంధానికి 215 రోజులు
తిరుపతి రూరల్ : అక్రమ మద్యం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని 215 రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్బంధంలో పెట్టడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగానే ఆయనను జైలు పాలు చేశారని ఆరోపిస్తున్నారు. చెవిరెడ్డి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 16వ తేదీన రిమాండ్ పొడిగింపులో భాగంగా ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ఆయనను చూసిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన చెందారు. బరువు తగ్గి బలహీనంగా కనిపించడంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలో చెవిరెడ్డికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పండుగలు, పర్వదినాల్లో చెవిరెడ్డిని తలుచుకునే ప్రతి కుటుంబం ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతోందని స్పష్టం చేస్తున్నారు. చెవిరెడ్డికి బెయిల్ రాకుండా కుట్రలు పన్నుతున్నారని మండిపడుతున్నారు. చేయని తప్పుకు ఆయన శిక్ష అనుభవిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఎప్పటికై నా చెవిరెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
రిపబ్లిక్ డే పరేడ్కు తిరుపతి విద్యార్థులు
తిరుపతి సిటీ : అమరావతిలో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్కు తిరుపతికి చెందిన 18 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఆర్మీ, నేవీ, ఎయిర్వింగ్ ఎన్సీసీ విభాగాల నుంచి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చెందిన ఫణికుమార్, యుగంధర్, శ్రీనివాసులు, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల నుంచి పవన్, డిస్మిత, భావన, ఎస్పీడబ్లూ డిగ్రీ కళాశాల నుంచి జయశ్రీ, కావ్య, రుక్మిణి ఎంపికయ్యారు. అలాగే ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నుంచి వర్షిత, వేదా చౌదరి, హరీనా, జగదీష్, అరుణ్కుమార్, హర్షవర్ధన్ పరేడ్లో పాల్గొననున్నారు. ఈ మేరకు విద్యార్థులు ప్రత్యేక శిక్షణ నిమిత్తం ఆదివారం అమరావతికి బయలుదేరి వెళ్లారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఎస్పీడబ్ల్యూ కాలేజీ విద్యార్థులుఎస్జీఎస్ కళాశాల విద్యార్థులు -
వైభవంగా ముగిసిన ‘విరాసత్’
ఏర్పేడు : మండలంలోని జంగాలపల్లె సమీపంలో ఉన్న తిరుపతి ఐసర్లో మూడు రోజుల పాటు నిర్వహించిన విరాసత్–2026 సాంస్కృతిక ఉత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. వేడుకల్లో వివిధ ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులను ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. స్పిక్ మికాయ్ అనే సంస్థ సహకారంతో చేపట్టిన ఉత్సవాల్లో ఆదివారం భారతీయ శాసీ్త్రయ నృత్య కళాకారులు పద్మశ్రీ విద్వాన్ ఘనకాంత బోరా, డాక్టర్ అన్వేష మహంతా నృత్య ప్రదర్శనలు వీక్షకులను అబ్బురపరిచాయి. కార్యక్రమంలో ఐసర్ రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీ పాల్గొన్నారు. -
రద్దీ..రద్దీ
శ్రీకాళహస్తి: తై అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు క్యూ కట్టారు. సంక్రాంతి సెలవులు ముగింపు దశలో ఉండడంతో తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. 7,220 రాహుకేతు పూజలు జరిగినట్లు వెల్లడించారు. దళారులతో తిప్పలు ఆలయానికి వచ్చిన భక్తులకు దళారులు చుక్కలు చూపిస్తున్నారు. ఆదివారం 30 వేల మంది భక్తులు వచ్చినప్పటికీ అంతరాలయ దర్శనాలు 365 మాత్రమే జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దళారుల ఆధ్వర్యంలో అంతరాలయ దర్శనాలు వేలల్లో జరిగినట్టు తెలుస్తోంది. నాలుగు మాడవీధులు, ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద భారీ రద్దీ నెలకొనగా, పట్టణంలో వాహనాల రద్దీ కూడా పెరిగింది. -
వైభవంగా ఏటి పండగ
నాయుడుపేటటౌన్ : సంక్రాంతిని పురస్కరించుకుని నాయుడుపేటలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఏటి పండగ ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజున వేలాది మంది రావడంతో స్వర్ణముఖి నదీ తీరం జన సంద్రంగా మారింది. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కమిషనర్ షేక్ ఫజులుల్లా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. బంధుమిత్రులతో కలిసి నదీ తీరంలో సహపంక్తి భోజనాలు చేశారు. ఆటపాటలు, వినోద కార్యకమ్రాలతో సందడి చేశారు. తీరంలోని నీలకంఠేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, దుర్గా మల్లేశ్వరి దేవి ఆలయాలకు పోటెత్తారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఏటి పండుగ వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యాక్రమాలు ప్రజలను విఽశేషంగా ఆకట్టుతున్నాయి. ఆదివారం రాత్రి నిస్సీ ఈవెంట్ అర్గనైజర్ మేర్లపాక హరి అధ్వర్యంలో పలువురు బుల్లి తెర నటులు, స్థానిక యువకులతో చేిసిన నృత్యాలు అలరించాయి. నటులను కమిషనర్ సత్కరించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే విజయశ్రీ చేతులమీదుగా బహుమతులు అందించారు. -
హర్షిత్రెడ్డికి పోలీసుల నోటీసు
– 21న విచారణకు హాజరు కావాలని సూచన తిరుపతి రూరల్: అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఈనెల 9వ తేదీన విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. ఆందోళనకు మద్దతుగా వెళ్లిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డితోపాటు మరో 14 మంది విద్యార్థి సంఘాల నేతలపై ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. 126(2), 292, 132టి/టీ3(5)బీఎన్ఎస్, 30 పోలీస్యాక్ట్–186 సెక్షన్ల పెట్టారు. ఆ కేసులో ఏ3గా ఉన్న చెవిరెడ్డి హర్షిత్రెడ్డికి ఎస్వీయూ పోలీసులు 41 నోటీసు జారీ చేశారు. ఆదివారం ఈ మేరకు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటికి చేరుకుని ఈనెల21వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసు అందించారు. దీనిపై హర్షిత్రెడ్డి మాట్లాడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తూ పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. కేసులతో ఉద్యమాలను ఆపలేరని, విద్యార్థుల సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మహాత్మా మన్నించు! నాగలాపురం: నాగలాపురంలోని బజారు వీదిలో మహాత్ముని విగ్రహం వద్ద టీడీపీ నేతలు అనుచితంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించే క్రమంలో గాంధీజీ విగ్రహాన్ని కమ్మేసేలా నేతలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాతిపిత విగ్రహానికి అపచారం జరుగుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్టు వెళ్లిపోయారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాత్మాగాంధీనే గౌరవించని వారు ప్రజలకు ఏం ఒరగబెడుతారని మండిపడుతున్నారు. -
రేపటి నుంచి పంచాయతీల్లో ఉచిత పశువైద్య శిబిరాలు
తిరుపతి అర్బన్: ప్రతి పంచాయతీలో ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశువైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రవికుమార్ తెలిపారు. శనివా రం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 36 మండలాల్లోనూ సోమవారం నుంచి ప్రారంభిస్తామన్నారు. ఒక్కొక్క రోజు రెండు పంచాయతీల చొప్పున ఆయా మండల పశువైద్యాధికారి పర్యవేక్షణలో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పశువు లు, లేగ దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నిర్మూలనతోపాటు అవసరం అయిన మేరకు మందులను ఉచితంగా అందిస్తామని తెలిపారు. పాడి రైతులు పశు వైద్య శిబిరాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ రోజు ఏ పంచాయతీలో ఉంటుందన్న సమాచారాన్ని ముందుగానే ప్రతి పంచాయతీకి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.రోడ్డు ప్రమాదంలోబాలుడి మృతిభాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలంలోని దేవరకొండ–భాకరాపేట రహదారిపై బోడిరెడ్డిగారి పల్లి బస్స్టాండ్ సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. దేవరకొండ నుంచి భాకరాపేట వైపు ట్రాక్టర్ వెళుతున్న ట్రాక్టర్, మోటార్ సైకిల్పై మైలవాండ్లపల్లెకు చెందిన వేముల లోకేష్ (24), షేక్సుల్తాన్ వెళుతుండగా వారిని ఢీకొంది. ఈ ఘటనలో వెనుక కూర్చుని ఉన్న షేక్ సుల్తాన్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన లోకేష్ణు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిట్టేచర్ల గ్రామానికి చెందిన సాడు పవన్ కుమార్ (27) ట్రాక్టర్ డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతితిరుపతి క్రైమ్: నగరంలో నివాసముంటున్న ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. అలిపిరి పోలీసుల కథనం మేరకు.. సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్న తులసీరామ్(25) హోటల్లో రూమ్బాయ్ గా పని చేస్తున్నాడు. ఇటీవల అతనికి ఓ మహిళతో ప్రేమ వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు రావడంతో మృతుడు భార్య తండ్రితో కలిసి మృతుడి ఇంట్లోనే ఉండేది. అయితే ఏమైందో ఏమో కానీ శనివారం తెల్లవారుజామున తులసి రామ్ చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడు అన్న జోషి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
పేట..ఏటోత్సవంతో శోభిల్లే
నాయుడుపేటటౌన్: సంక్రాంతి పండగలను పురస్కరించుకుని నాయుడుపేట స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఏటి పండగ వేడుకల్లో రెండో రోజు శనివారం కూడా జనాలు పోటెత్తారు. నది వద్దకు అధిక సంఖ్యలో జనాలు తరలివచ్చి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కనిపించారు. పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వేలాది మంది హాజరై ఏటోత్సవంలో పాల్గొని, సందడి చేశారు. నది వద్ద చిన్ననాటి స్నేహితుల పలకరింపులు, కొత్తగా పెళ్లయిన యువజంటల కేరింతలు, మహిళల ఆటల పోటీలు, చిన్నారులు సందడి చేస్తు కనిపించారు. నది వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉన్న దుకాణాలు, రంగుల రాట్నాలు తదితర ప్రాంతాల వద్ద జనాలు ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. చిన్నారులు పోటాపోటీగా గాలిపటాలను ఎగురవేస్తూ ఎంతో ఆనందంగా కనిపించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సీఐ బాబి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉల్లాసంగా... ఉత్సాహంగా.... ఏటి పండగ సంధర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజలు ఉల్లాసంగా..ఉత్సాహంగా గడిపారు. నిస్సీ ఈవెంట్స్కు చెందిన మేర్లపాక హరి అర్గనైజేషన్ వారు రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రముఖ యాంకర్లు, బుల్లితెర నటులు తదితరులు చేసిన సందడి అందరిని ఆకట్టుకుంది. పలువురు చిన్నారులు చేసిన భారత నాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలను ఆకర్షిణీయంగా నిలిచింది. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులూల్లా , మేనేజర్ ఉరుకుందమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా!
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి కల్చరల్: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆ పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. చిరు వ్యాపారులు, ఆటో కార్మికుల నుంచి నాకింత, నీకింత అంటూ పోటీపడుతున్నారు. తేడా వచ్చిన చోట ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు తెగబడుతూ భక్తులు, యాత్రికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పవిత్రతకు, ప్రశాంతతకు ప్రతీకగా నిలిచే తిరుపతిలో రాజకీయ వర్గ పోరు ఇటు స్థానికులు, అటు భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చే తిరుపతిలో ఇటువంటి ఘటనలు జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి బస్టాండ్ పరిసరాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో టీడీపీ, జనసేన పార్టీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనడమే ఇందుకు తాజా ఉదాహరణే నిదర్శనం. ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని మంజూనాథ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన జనసేన ఎమ్మెల్యే ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. సమీపంలోని పార్కింగ్ స్థలానికి ఫ్లెక్సీ అడ్డుగా ఉందని టీడీపీ నాయకుడు హోటల్ యజమానిని కోరినట్లు తెలిసింది. అయితే ఎంతకూ తొలగించకపోవడంతో టీడీపీ నాయకుడు ఆ ఫ్లెక్సీని తొలగించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు, యాత్రికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వివాదంపై టీడీపీ, జనసేన శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఒక్క వివాదమే కాదు.. నగరంలో రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలం, శ్రీనివాసం, మాధవం, బైరాగిపట్టెడ, ఇలా అనేక ప్రాంతాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. తమ పార్టీ వారు తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకునేందుకు టీడీపీ, జనసేన నేతలు పోటీపడి చిరు వ్యాపారులపై దౌర్జన్యాలు దిగుతున్నట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో స్టాండ్లో తమ వారి ఆటోల కోసం టీడీపీ, జనసేన నేతలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఆటో స్టాండ్లో ఆటో ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.2.50 లక్షలు మామూళ్లు చెల్లించాలని ఓ డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం. తిరుపతి ప్రతిష్ట దెబ్బతీస్తున్న కూటమి కుమ్ములాటలు తిరుపతిలో దోపిడీయే ధ్యేయంగా కూటమి నేతలు గూండాలుగా గ్రూపులు కడుతూ అరాచకాలతో బాహాటకంగా ఘర్షణలకు పాల్పడుతూ తిరుపతి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుయాదవ్ మాట్లాడుతూ తిరుపతిలో కూటమి నేతల గూండాగిరి తీరుపై తీవ్ర స్థాయిలో ఉందని ధ్వజమెత్తారు. తిరుపతిలో కూటమి పార్టీల నేతలు బహిరంగ బాహాబాహిగా తలపడుతున్న సంఘటనలతో నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేస్తారనే నమ్మకంగా ఓట్లు వేసి అధికారం కట్టపెడితే అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి తమ స్వార్థ సంపాదనల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, ప్రధానంగా జనసేన నేతలు క్షేత్రస్థాయిలో చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి వసూళ్లు, భూ దందాలు, వివాదస్పద స్థలాలకు సంబంధించి సెటిల్మెంట్ల వంటి వ్యవహారాల్లో వాటాల్లో తేడాలు రావడంతో వారికి వారే గొడవలకు దిగుతూ ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నారని తెలిపారు. నగరంలో గత 18 నెలలుగా కూటమి నేతలు బరి తెగించి చేస్తున్న సిగ్గుమాలిన చర్యలకు దిగుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని సాగిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్లెక్సీల విషయంలో టీడీపీ, జనసేన నేతలు బహిరంగంగా కొట్టుకోవడం చూసిన ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసిందని తెలిపారు. అక్కడ బహిరంగంగా ఘర్షణలకు దిగుతూ తాము ఎమ్మెల్యే అనుచరులమని బాహాటకంగా చెప్పుకోవడం బరితెగింపు కాదా అని ప్రశ్నించారు. తిరుపతిలో సనాతన ధర్మం గురించి ప్రబోధించిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు వర్గాలుగా విడిపోయి రౌడీయిజం చేసే వారిని వెంటబెట్టుకుని తమ కార్యకలాపాలు జరుపుకోవడంతో నగర ప్రజలు గొడవలు ప్రత్యక్షంగా చూసే పరిస్థితి దాపురించిందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేట్ కోటూరి ఆంజనేయులు, వైఎస్ఆర్సీపీ నేతలు కోటి, అమరనాథ్రెడ్డి, తాళ్లపాక మహేష్ పాల్గొన్నారు. -
కోడెగిత్తల జోరు.. యువత హుషారు
చంద్రగిరి: మండలంలోని దోర్నకంబాల, మండపంపల్లి, మల్లయ్యపల్లి గ్రామాల్లో శనివారం పశువుల పందేలు(జల్లికట్టు)ను ఘనంగా నిర్వహించారు. పశువుల యజమానులు ఎడ్ల కొమ్ములకు రంగులు వేసి, నడుముకు నల్లధారం కట్టి, వాటి కొమ్ములకు పలకలను కట్టి సిద్ధం చేశారు. ఒక్కసారిగా ఎడ్లను బరికిలోకి ఉసిగొల్పడంతో పరుగులు తీసిన ఎడ్లను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. అయితే మదమెక్కిన ఎడ్లను నిలువరించేందుకు యువకులు పోటీ పడినా అవి లెక్క చేయకుండా జనం మధ్య దూసుకెళ్లాయి. కొంత మంది యువకులు ఎడ్లను నిలువరించి వాటి కొమ్ములకు కట్టిన పలకలను సొంత చేసుకుని విజయ గర్వంతో ఊగిపోయారు. ప్రత్యేక ఆకర్షణగా వైఎస్ జగన్ దళపతి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న ప్రజల్లో మాత్రం వైఎస్సార్సీపీపై అభిమానం ఇసుమంతైనా తగ్గలేదు. మల్లయ్యపల్లి నుంచి మండపంపల్లి వరకు ఎక్కడ చూసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు, నేతల ఫొటోలతో స్వాగత తోరణాలే కనిపించాయి. మల్లయ్యపల్లిలో బీసీ నేత బొమ్మగుంట రవికు చెందిన కోడెగిత్త ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోడెగిత్తను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.లక్ష వెచ్చించి ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల పుష్పగుచ్చాలతో మండపాన్ని అలంకరించడంతో పాటు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ఫొటోతో కూడిన దళపతి పలకను ఎద్దు కొమ్ములకు కట్టి, ప్రదర్శనగా నిలిచారు. ఎద్దును చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆపై బరిలోకి దిగిన కోడెగిత్తను పట్టుకోవడానికి యువకులు పోటీ పడినా, నిలువరించడంలో విఫలమయ్యారు. -
సైనిక్, నవోదయ– 2026 బ్రోచర్ ఆవిష్కరణ
తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్లోని విశ్వం టాలెంట్ స్కూల్ ప్రాంగణంలో విశ్వం సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల– 2026 బ్రోచర్ను ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి, విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్ రెడ్డి, ఎన్ విశ్వశ్రీ ఆవిష్కరించారు. శనివారం పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2025 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకుతో పాటు 63 సీట్లు, అలాగే నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల్లో 69 సీట్లు సాధించి విశ్వం విద్యాసంస్థ రికార్డు సృష్టించడం గర్వించదగ్గ విషయమన్నారు. గత 35 ఏళ్లుగా సైనిక్, నవోదయ స్కూల్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అగ్ర ర్యాంకులు సాధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో విశ్వం విద్యా సంస్థలు ప్రత్యేక గుర్తింపు పొందాయని కొనియాడారు. అనంతరం డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో 46 రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులతో పాటు మొత్తం 967 సీట్లు సాధించడం శిక్షణ రంగంలో ఒక అరుదైన రికార్డు అని పేర్కొన్నారు. సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలపై మరింత సమాచారం కోసం 86888 88802, 93999 76999 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
సేవలు అంతంత మాత్రమే
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, రాపూరు, బాలాయపల్లి, డక్కిలి, కలువాయి, వెంకటగిరి మండలాలకు గత ప్రభుత్వంలో సంచార పశు వైద్య వాహనాలను ఏర్పాటు చేసింది. 1962కు కాల్ చేసిన వెంటనే గ్రామాలకు వచ్చి పశువులకు వైద్య సేవలను అందించేవారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో పాడి రైతులకు క్షణాల్లోనే వైద్యం అందుతుండేది. నేడు అంతంత మాత్రంగానే అందుతున్నాయని పాడి రైతులు వాపోతున్నారు. సంచార పశువైద్య వాహనంలో వైద్యులు రాకపోవడంతోపాటు మందులు అందుబాటులో ఉండకపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్పై దాడి
రేణిగుంటలో శనివారం రాజంపేట నుంచి తిరు పతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై మద్యం మత్తులో యువకులు దాడి చేశారు.సేవలు శూన్యం చంద్రగిరి నియోజకవర్గంలో సంచార పశువైద్య సేవలు అందడం లేదు. ఎప్పుడు చూసినా పాడైపోయిందంటున్నారు. వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. పశువులు, పొలం వద్ద లేదా రోడ్లుపై అనారోగ్యంతో నడవలేకపోతే వాటిని తరలించడం కష్టంగా ఉంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో సంచార వాహనం ఏర్పాటు చేశారు. అయితే కార్యాలయం వద్ద నిరుపయోగంగా ఉంచేశారు. దీంతో సేవలు అందడం లేదు. – రాజారెడ్డి, చిన్నగొట్టిగల్లు, పాడిరైతు అందని సంచార పశువైద్యం వైఎస్సార్ సీపీ హయాంలో పశువులకు గ్రామాల్లోనే వైద్యంతో పాటు అత్యవసర సమయాల్లో సహాయ చర్యలు అందేలా వైఎస్సార్ పశు సంచార ఆరోగ్య వాహనం ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాడి రైతులకు ఇంటి ముంగిటకే పశువులకు వైద్య సేవలు అందాయి. చంద్రబాబు అధికారంలో వచ్చిన తరువాత గ్రామాల్లో సంచార వైద్యం పూర్తిగా అందకుండాపోయింది. – రాజశేఖర్, పాడిరైతు, డీవీ సత్రం సేవల కోసం ఎదురుచూపులు గత ప్రభుత్వం సంచార పశువైద్య వాహన సేవల ను అమలు చేసింది. పశువులు వ్యాధి బారిన పడిన వెంటనే 1962కు ఫోన్ చేస్తే సంబంధిత అధికారు లు ఆయా గ్రామాల్లోకి వచ్చి వైద్యసేవలు అందించేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం పాతవిధానానికి స్వస్తి పలికి నెలలో ఆరు రోజులు మాత్రమే మండలంలోని గ్రామాల్లో పర్యటించేలా ఆదేశాలు జారీ చేశారు. పాడిరైతులకు మెరుగైన వైద్యం అందే అవకాశం లేకుండాపోయింది. – పోలి.రమణయ్య, పాడి రైతు, పుల్లంపేట -
ఐసర్లో ఆకట్టుకున్న ‘విరాసత్’ సంగీత కచేరీలు
ఏర్పేడు: ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్లో స్పిక్ మాకే సహకారంతో ‘విరాసత్–2026’ పేరుతో జరుగుతున్న సంగీత కచేరీ, వర్క్షాప్లు ఆకట్టుకున్నాయి. ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని విభిన్న, సంస్కృతులు, కళలను మేళవించి, దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. రెండవరోజు శనివారం ఐసర్ ప్రాంగణంలోని కొలీజియం హాల్లో సాయంత్రం విద్వాన్ అమృత మురళి కర్ణాటక సంగీత కచేరీ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కచేరీలో వయోలిన్పై విద్వాన్ ఆర్కె శ్రీరామ్కుమార్, మృదంగంపై విద్వాన్ మనోజ్ శివ, కంజీరపై విద్వాన్ కేవీ గోపాలకృష్ణన్ సహకారం అందించడంతో శాసీ్త్రయ నృత్య ప్రదర్శన సభికులను కట్టిపడేసింది. -
జిల్లా సమాచారం...
పశు సంచార వైద్యశాల వాహనాలు 13 పశుసంవర్థకశాఖ అధికారి కార్యాలయం 1 డిప్యూటీ డైరెక్టర్ స్థాయి పశువైద్యశాల 1 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండే పశువైద్యశాలలు 17 ప్రాంతీయ పశువైద్యశాలలు 77 గ్రామీణ పశువైద్యశాలలు 58 గోపాలమిత్ర కేంద్రాలు 440 ఆవులు 2.40 లక్షలు బర్రెలు 2.60లక్షలు గొర్రెలు 3.50 లక్షలు మేకలు 3.70 లక్షలు కోళ్లు 24 లక్షలు -
దళిత ద్రోహి చంద్రబాబు
తిరుపతి మంగళం : దళిత ద్రోహి సీఎం చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు తలారి రాజేంద్ర, ఎస్సీ సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ నల్లాని బాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్కుమార్ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు సాల్మన్ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని అంబేడ్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్నారు. వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ దళితులపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. సాల్మన్ది రాజకీయ హత్యని ఆరోపించారు. దళిత మహిళ అనిత హోమ్మంత్రిగా ఉన్నా దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో తిరగడం, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ప్రజాసంక్షేమాన్ని పట్టించుకుంటున్నావా? పవన్కళ్యాన్ అని ప్రశ్నించారు. సాల్మన్ కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారంతో పాటు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు వాసుయాదవ్, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, లవ్లీ వెంకటేష్, పసుపులేటి సురేష్, మేర్లపాక మురళి, రమణారెడ్డి, కోటి, అరుణ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా సంచారవైద్య సేవ
ఏర్పేడు: గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార వైద్యసేవ పాడిరైతులకు దూరమైంది. వాహనాలు ఉత్సవ విగ్రహాలుగా మారి కార్యాలయాలకే పరిమితం అయ్యాయి. దీంతో అత్యవసర సమయంలో గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కనిపిస్తోంది. నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల పరిధిలోని గ్రామాలకు శ్రీకాళహస్తిలో, ఏర్పేడు, రేణిగుంట మండలాలకు రేణిగుంటలో సంచార పశువైద్య వాహనాలున్నాయి. అయితే పాడి పశువులకు ఏదైనా జబ్బు చేసి విషమ పరిస్థితి తలెత్తితే తప్ప వాహనాలు గ్రామాల్లో తిరగడం లేదు. -
నేడు ఏపీ పీఎస్ హెచ్ఎం ఫోరం సీమ సమావేశం
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ జిల్లాల ఏపీ పీఎస్ హెచ్ఎం ఫోరం రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఈనెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్ హెచ్ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్, జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారెడ్డి, శ్యాంసుందర్ తెలిపారు. సమావేశంలో పీఎస్ హెచ్ఎంల తాజా సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకు పోవడంపై చర్చిస్తామన్నారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రతి పీఎస్ హెచ్ఎం తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమస్ఫూర్తితో ముందుకు రావాలని కోరారు. రేపటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం తిరుపతి సిటీ: సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు సంక్రాంతి సెలవుల్లో సరదాగా గడిపిన విద్యార్థులు తమ స్వస్థలాల నుంచి బడిబాట పట్టనున్నారు. జాతీయ ప్రతిభా పురస్కారానికి జగన్నాథం ఎంపిక వరదయ్యపాళెం: మండలానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి, జానపద కళాకారుడు పోల్లూరు జగన్నాథం జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న సాహితీ సాంస్కృతిక పట్టాభిషేక మహోత్సవంలో పోల్లూరు జగన్నాథం జాతీయ ప్రతిభా పురస్కారం అందుకోవాలని ఆయనకు ఆహ్వానం అందింది. తెలుగు అక్షర సేవలు, సాహిత్య, సాంస్కృతిక తపన, సజనాత్మక ప్రతిభను గుర్తించి ఆయన్ని ఎంపిక చేసినట్లు శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీభూషణం ఆహ్వానపత్రంలో పేర్కొన్నారు. -
సాల్మన్ హత్యపై ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న రాజ్యంగ ఉల్లంఘన, ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై దాడులు, చేస్తున్న హత్యలు, దారుణాలపై పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో శనివారం(జనవరి 17వ తేదీ) నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ హత్యను నిరసిస్తూ ఏపీలో పార్టీ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహించాయి. . దీనిలో భాగంగా తిరుపతిలో వైఎస్సార్సీపీ ధర్నా చేపట్టింది. ముందుగా డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి,.,.ఆపై ధర్నా చేపట్టింది వైఎస్సార్సీపీ. .ఎస్సీ సెల్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర తలారి ఆద్వర్యంలో ధర్నాచేపట్టారు. ఈ మేరకు రాజేంద్ర తలారి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో దళితుల పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రంలో దళితులు బతకకూడదా?, సల్మాన్ మారణాయుదాలతో అత్యంత కిరాతకంగా చంపేసారు టిడిపీ .మరణించిన సల్మాన్ కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా తోపాటు 5 ఎకరాల భూమి ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్రంలో రెడ్ రాజ్యాన్ని వదిలి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చెయ్యాలి. చంద్రబాబుకు దళితులు బుద్ది చెప్పే సమయంలో వచ్చింది’ అని హెచ్చరించారు. విజయవాడలో ర్యాలీసాల్మన్ హత్యను నిరసిస్తూ విజయవాడలో వైఎస్సార్సీపీ ధర్నా చేపట్టింది. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి వైఎస్సార్సీపీ శ్రేణలు. పార్టీ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టార. ‘ ఏపీలో దారుణాలు ఘోరంగా ఉన్నాయి. దాడి చేసిన వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతోంది’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. నరసరావుపేటలో..పల్నాడు జిల్లాలోని నరసరావు పేటలో వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ‘ దళితులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఒక చనిపోయి వ్యక్తి దగ్గరకు వెళ్లడానికి కూటమి ప్రభుత్వం హైడ్రామా నడిపింది. ఇదేమన్నా న్యాయమా.. ఇది రెడ్బుక్ పాలన కాకపోతే మరేంటి? అని ప్రశ్నించింది వైఎస్సార్సీపీ. దళితులను బ్రతకనివ్వరా అంటూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న దళిత సంఘాలు నిలదీస్తున్నాయి. ఏలూరు జిల్లాలో.. పచ్చమూకల దాడులలో హత్యకు గురైన దళిత వైఎస్ఆర్సిపి కార్యకర్త సాల్మన్ హత్యను నిరసిస్తూ ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు ఇంచార్జ్ జయప్రకాష్, వైఎస్ఆర్సిపి శ్రేణులు పాల్గొన్నాయి. ‘ పిన్నెల్లి గ్రామంలో జరిగిన హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాము. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారు. చివరకు మర్డర్లు హత్యలు చేస్తున్నారు. అధికారంలో ఉంటే సంక్షేమ ఫలాలు అందించాలి. మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు మీకు సిగ్గుందా.....?, మంచి ప్రభుత్వం అంతే మర్డర్లు చేయటమా....?’ అని ధ్వజమెత్తారు దూలం నాగేశ్వరరావు. కృష్ణాజిల్లాలో..సాల్మన్ హత్యను నిరసిస్తూ గుడివాడలో వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముందుగా నివాళులు అర్పించిన వైఎస్సార్సీపీ నాయకులు.. సాల్మన్న హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో..సాల్మన్ హత్యను ఖండిస్తూ డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ దళిత విభాగం నిరసన చేపట్టింది. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు.. నిందితులను అరెస్టు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలో..సాల్మన్ హత్యను నిరసిస్తూ నంద్యాలలో నిరసన కార్యక్రమం చేపట్టింది వైఎస్సార్సీపీ. ఈ నిరసన కార్యక్రమంలో దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నిరసన కార్యక్రమానికి దిగింది వైఎస్సార్సీపీ. కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలు ఇంకెన్నాళ్లు వైఎస్సార్సీపీ శ్రేణులు నిలదీశాయి. దళితులు, మైనార్టీల పట్ల కూటమి నేతల దాడులు ఆపకపోతే భవిష్యత్లో తీవ్ర పరిణామాలుంటాయని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. కర్నూలు జిల్లాలో..కూటమి ప్రభుత్వం ఆగడాలను నిరసిస్తూ కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత వైఎస్సార్ సిపి కార్యకర్త మండా సాల్మన్ హత్యకు కూటమి ప్రభుత్వంమే కారణమని పార్టీ నేతలు మండిపడ్డారు. తక్షణమే హత్య కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.విజయనగరం జిల్లాలో.. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ హత్యకు నిరసనగా విజయనగరం లో పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యం లో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. టీడీపీకి ఎస్సీలు అంటే చులకన భావన అని. ఎస్సీ ల పట్ల వివక్ష చూపుతున్నారని దళిత సంఘాలు మండిపడ్డాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నిర్మూలించడానికి టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పాలన అమలు చేస్తోందని ధ్వజమెత్తారు జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు.పార్వతీపురం మన్యం జిల్లాలో..పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో దళితి యువకుడి హత్యను నిరసిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది వైఎస్సార్సీపీ.వైఎస్సార్ జిల్లాలో..సాల్మన్ హత్యను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా కడపలో పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీనిలో భాగంగా ముందుగా అంబేద్కర్కు నివాళులర్పించి.. నిరసన కార్యక్రమం చేపట్టాయి. ‘ మంచి ప్రభుత్వం అంటే మర్డర్లు ేచేయటమా?, సాల్మన్ను హత్య ేచేసిన వారిని కఠినంగా శిక్షించాలి. సాల్మన్పై దాడి చేసిన టీడీపీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు. ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతోంది’ అని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. -
రైల్ వన్యాప్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రైల్వే శాఖ పలు రకాల రైలు సేవలను ఒకే ప్లాట్ఫాంపైకి తెచ్చింది. ఇందులో భాగంగా రైలు ప్రయాణికుల మరింత చేరువుగా రైల్ వన్యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ టికెట్లపై 3 శాతం రిబేటు ప్రకటించింది. ఈ యాప్ ద్వారా బుధవారం నుంచి టికెట్ల రిబేటు విధానాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. గతంలో అన్ రిజర్వ్డ్ టికెట్ల జారీ కోసం రైల్వేశాఖ పదేళ్ల కిందట అన్ రిజర్వడ్ టికెట్ సర్వీస్ (యూటీస్) పేరిట ఒక యాప్ను లాంచ్ చేసింది. ఆ అప్లికేషన్స్ రైల్వే శాఖ ప్రచారం చేసినా పూర్తిస్థాయిలో ప్రజాదరణ పొందలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రైల్వే ఆన్లైన్ సేవలను ఒక గొడుగు కిందకు తెచ్చే క్రమంలో గత ఏడాది జూలైలో రైల్ వన్యాప్ను ప్రారంభించింది. ఆ యాప్ ద్వారా రైలు టికెట్లపై ఎటువంటి డిస్కౌంట్ ప్రకటించలేదు. సాధారణ టికెట్ల జారీ ఆప్షన్ రైల్ వన్యాప్లో ఉండడంతో యూటీఎస్ అవసరం లేకుండాపోయింది. దీంతో మార్చి నుంచి ఆ యాప్ రద్దు చేసే యోచనలో రైల్వే శాఖ ఉంది. ఈ మేరకు యూటీఎస్ యాప్లో ఆన్లైన్ జనరల్ టికెట్పై ఇచ్చే 3 శాతం డిస్కౌంట్ను రైల్ వన్యాప్లో సంక్రాంతి కానుకగా రైల్వే శాఖ ప్రయాణికులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల టికెట్లపై డిస్కౌంట్... యూటీఎస్ యాప్లో కేవలం అన్ రిజర్వ్ టికెట్లు జారీ చేసేవారు. అలాగే వ్యాలెట్ డబ్బుతో బుక్చేసే అన్ రిజర్వ్ టికెట్లపై మాత్రమే 3 శాతం రిబేటు లభించేది. ప్రస్తుతం రైల్ వన్ యాప్ ద్వారా అన్ రిజర్వుడ్తో పాటు రిజర్వ్ టికెట్లపై కూడా 3 శాతం రిబేటు ఇవ్వడానికి రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. రైల్వే శాఖ టికెట్లు జారీ చేసే కమర్షియల్ శాఖ సిబ్బందిని, కాంట్రాక్టు, టికెట్ బుకింగ్ కౌంటర్లకు తగ్గించే లక్ష్యంతో దశాబ్దం కిందట యూటీఎస్ యాప్ను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. కేవలం ఈ యాప్ అన్రిజర్వుడు టికెట్లకే పరిమితం కావడంతో ప్రయాణికులు రిజర్వుడు టికెట్ల కోసం ఆయా రైల్వేస్టేషన్లోని పీఆర్ఎస్ కౌంటర్లకు రావడమో, ఐఆర్సీటీసీ, ఇతర ప్రైవేటు ఆన్లైన్ యాప్ల ద్వారా టికెట్ను బుక్ చేసుకోవడం వంటివి చేసేవారు. దీనిని అధిగమిస్తూ రైల్వే శాఖ సరికొత్తగా రైల్ వన్యాప్ను డిజైన్ చేసింది. ఇతర సేవలను కూడా దీని ద్వారా ప్రయాణికులకు అందించి ఆదరణ పొందే యత్నంలో భాగంగానే రైల్ వన్యాప్ ద్వారా అన్ని రకాల టికెట్ల బుకింగ్పై 3 శాతం డిస్కౌంటును ప్రకటించింది. బహుళ ప్రయోజనాలు రెల్ వన్యాప్ ద్వారా రిజర్వ్, అన్ రిజర్వుడ్తోపాటు ప్లాట్ఫామ్, సీజన్ టికెట్లను కూడా ప్రయాణికులు పొందే సదుపాయాన్ని కల్పించారని తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ వెల్లడించారు. టికెట్లపై రిబేటు మాత్రమే కాకుండా పలు రకాల సేవలను ప్రయాణికులకు చేరువ చేసిందన్నారు. కాగా యూటీఎస్ యాప్లో అన్ రిజర్వుడ్ టికెట్లను బుక్ చేయాలంటే రైల్వేస్టేషన్ వెలుపలే యాప్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. రైల్ వన్యాప్ ద్వారా రైల్వే స్టేషన్లోనూ టికెట్లను బుక్ చేసే వెసులుబాటు కల్పించారన్నారు. -
తిరుమలలో ఘనంగా శ్రీవారి పార్వేట ఉత్సవం
తిరుచ్చిపై ఊరేగుతున్న కృష్ణస్వామి తిరుమల : వేంకటేశ్వరస్వామివారికి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కై ంకర్యాలు పూర్తి అయిన తరువాత మలయప్పస్వామి వారు, కృష్ణస్వామి తిరుచ్చిలపై పార్వేట మండపానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ అర్చకులు స్వామివారికి పుణ్యాహవచనం, ఆరాధాన, నివే దన, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉభయదారులైన తాళ్లపాక వారికి, మరం వారికి మర్యాదలు జరిగాయి. కృష్ణస్వామివారికి సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. తరువాత మలయప్పస్వామివారు పార్వేట నిర్వహించారు. అంతకముందు అదనపు ఈఓ వెంకయ్యచౌదరి శ్రీసన్నిధి గొల్లభాగ్య చరితం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, ముఖ్య అర్చకులు కిరణ్ దీక్షితులు, పేష్కార్ రామకృష్ణ, పారుపత్తేదారు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. -
తిరుపతిలో తారాస్థాయికి ‘కూటమి’ విభేదాలు
తిరుపతి: తిరుపతిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడ్డవారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని టీడీపీ నేల, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పరామర్శించారు. దీనిలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తిరుపతిలో రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. బయట ప్రాంత వ్యక్తుల వచ్చి తిరుపతి ప్రశాంత వాతావరణం దెబ్బతిస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలు పుటేజీ బయటపెట్టాలన్నార సుగుణమ్మ. అదే సమయంలో నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
క్యాటరింగ్ దుకాణంలో అగ్ని ప్రమాదం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని సీఎస్ తేజ సెంటర్ సమీపంలో ఉన్న ఓ క్యాటరింగ్ దుకాణంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. క్యాటరింగ్ దుకాణ నిర్వహకులు శుక్రవారం ఉదయం దుకాణంలో దేవుని పటాల వద్ద దీపం వెలగించి ఆలయాలనికి వెళ్లారు. వెలుగుతున్న దీపం కింద ఉన్న పేపరుకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. దుకాణంలో మంటలు వస్తుండడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దుకాణ నిర్వహకులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అదుపు తప్పి ఆటో బోల్తా నాయుడుపేటటౌన్: పట్టణంలోని తుమ్మూరు సమీపంలో శుక్రవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోడ్రైవర్తోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కథ నం మేరకు.. పట్టణంలోని కాలవగట్టు ప్రాంతానికి చెందిన చెంచమ్మ అమె బంధువు, పిల్లలతో కలిసి నాయుడుపేట పట్టణం నుంచి సగటూరుకు ఆటోలో బయలు దేరారు. ఆటో తుమ్మూరుకు వచ్చేసరికి రహదారిపై ఒక్కసారిగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటో నడుపుతున్న చంద్రబాబు కాలనీకి చెందిన డ్రైవర్ అబ్దుల్ అతని పక్కనే కూర్చుని ఉన్న అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ స్నేహితుడు వెంకటేష్తోపాటు చెంచమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ అబ్దుల్లాతోపాటు అతని స్నేహితుడు వెంకటేష్ మద్యం మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యాత్రికురాలికి బ్యాగు అప్పగించిన పోలీసులు రేణిగుంట: చైన్నెకు చెందిన వినోద్ కుటుంబసభ్యులు గురువారం రేణిగుంట రైల్వేస్టేషన్లో బంగారం ఉన్న బ్యాగ్ను మర్చిపోయి వదిలి వెళ్లిపోయారు. గుర్తుతెలియని బ్యాగ్ ఉందని ప్రయాణికులు రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా బ్యాగులో బంగారం, వస్తువులు ఉండడాన్ని గమనించి విచారించి బ్యాగ్ యజమానిని పోలీస్ స్టేషన్కు పిలిపించి బ్యాగును అప్పగించారు. ఆశ్రమ పీఠాధిపతి కన్నుమూత నారాయణవనం: మండలంలోని ప ర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన కైలా సనాథ కోనలోని శాంతి ఆశ్రమ పీఠాధిపతి కైలాసనంద గిరి స్వామి శుక్రవా రం మధ్యాహ్నం శివైక్యం పొందినట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆశ్రమంలో సమాధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవల టికెట్ కౌంటర్ ప్రారంభం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో టికెట్ కౌంటర్లు, శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రచార రథాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అన్ని సేవల టికెట్లు ఒకే ప్రాంగణంలో లభించేలా రంగుల గోపురం సమీపంలో కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర క్షేత్ర ప్రభావాన్ని తెలిపేలా ప్రచారరథాన్ని ప్రారంభించామన్నారు. చైర్మన్ కొట్టే సాయి. ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు. బంగారు గొలుసు చోరీ తిరుపతి రూరల్: మండలంలోని శ్రీనివాసపురంలో గుర్తు తెలియని వ్యక్తులు మోటర్ బైక్లో వచ్చి నడచి వెళుతున్న ఓ మహిళ మెడలో చైను లాక్కెళ్లిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురంలో కాపురముంటున్న లెక్కల గజేంద్ర నాయుడు భార్య శశిరేఖ మిల్క్పార్లర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11.40 గంటలకు దుకాణం నుంచి తన కుమార్తె చరితతో కలసి ఇంటికి నడచి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు మోటర్ బైక్లో వచ్చి ఆమె వెనుక నుంచి మెడలోని చైన్ లాక్కొని పరారయ్యారు. తన మెడలోని బంగారం గొలుసు 36 గ్రాములు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి రూరల్ ఎస్ఐ జ్యోతి తెలిపారు. -
కోడి పందేల స్థావరాలపై దాడులు
ఓజిలి: మండలంలోని నె మళ్లపూడి ఎస్సీకాలనీ సమీపంలోని మామిడికాలువ ఒడ్డున కోడి పందేలస్థావరాలపై ఎస్ఐ శ్రీకాంత్ గు రువారం దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు పందేలరాయుళ్లు, 4 కోళ్లు, రూ.3150 నగదు స్వాధీ నం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ తెలిపారు. కోడిపందేలు, పేకాట నిర్వహించి వారిపై చట్టపరమైన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. తొట్టంబేడులో.. తొట్టంబేడు: మండలంలోని తంగేళ్లపాళెంలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు దాడి చేసి 13 మంది జూదరులు, 4 కోళ్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. తంగేళ్లపాళెం సమీపంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు రహస్యసమాచారం అందింది. దీంతో టూటౌన్ సీఐ ప్రకాష్కుమార్, ఎస్ఐ జ్యోతి, పోలీసు సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో 13 మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 కోళ్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి దొరవారిసత్రం: పోలిరెడ్డిపాళెం రైల్వేస్టేషన్కు సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని సుమారు 45 ఏళ్లు వయస్సు కలిగిన ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడిపోయి శుక్రవారం మృతి చెందాడు. జీఆర్పీ పోలీసుల కథనం మేరకు.. చైన్నె నుంచి బర్మపూర్ వెళ్లే భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదశాత్తు జారిపడిపోయి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వివరాలు తెలియలేదు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు జీఆర్పీ హెచ్సీ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి తడ: జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వరదయ్యపాళెం మండలం, సిద్ధమఅగ్రహారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ చెరివి ముునిచంద్రయ్య(40) మృతి చెందగా హైవేపై పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఎస్ఐ కొడపనాయుడు కథనం మేరకు.. ఆటో డ్రైవర్ చెరివి ముునిచంద్రయ్య తన ఆటోలో తడ నుంచి సూళ్లూరుపేటకు బయలుదేరాడు. చేనిగుంట గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి రహదారిపై పని చేస్తున్న సిబ్బందిని ఢీకొంది. ప్రమాదం అనంతరం ఆటో డివైడర్ని ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ముునిచంద్రయ్య డివైడర్పై పడ్డాడు. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. హైవే సిబ్బంది వెంకటరమణయ్య, సురేష్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఇంటింటా సంక్రాంతులు నిండాలి
నగరి : సంక్రాంతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, కనుమ కమ్మనైన అనుభూతులు మిగల్చా లని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. శుక్రవారం కనుమ పండుగను ఆమె నగరి పట్టణంలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యు లు, బంధువులతో కలిసి వైభవంగా నిర్వహించుకున్నారు. సంక్రాంతి పర్వదినాన తిరుత్తణి సుబ్రమణ్య స్వామిని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి దర్శించుకున్నారు. ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేసి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంప్రదాయాలకు నెలవన్నారు. సంక్రాంతి పండుగ అందరిలో వెలుగులు నింపాలన్నారు. అలాగే కనుమ ప్రజలకు కమ్మనైన అనుభూతులను నింపాలన్నారు. గోమాతకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అన్నదాత అయిన రైతుకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ సంక్రాంతి అయితే రైతుతో పాటు వ్యవసాయ పనుల్లో పాల్గొనే గోమాతకు ప్రాధాన్యత ఇవ్వడానికి కనుమ పండుగన్నారు. గోమాత సకల దేవతలకు నిలయమన్నారు. గోమాతను పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే అన్నారు. -
సైద్ధాంతిక నిబద్ధతకు తార్కాణం ఏవీ వర్మ
తిరుపతి కల్చరల్: కష్టాలు, కన్నీళ్లు, నిర్భంధాలు అధిగమించి ఎర్రజెండా పురోభివృద్ధికి చివరివరకు నిలబడిన వ్యక్తి క్రామేడ్ ఏవీ వర్మ అని, ఆయన సైద్ధాంతిక నిబద్ధతకు తార్కాణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మూలం రమేష్ తెలిపారు. సీపీఎం సీనియర్ నేత ఏవీ.వర్మ పార్థివదేహాన్ని ఎ స్వీ మెడికల్ కళాశాలకు గురువారం సీపీఎం శ్రేణు లు అందించారు.ఈ సందర్భంగా జరిగిన అంతిమ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంరణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.రాంభూపాల్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ తరగతుల్లో తన మనవరాలితోపాటు పది రోజులు అధ్యయనం చేయడానికి వర్మ పాల్గొన్న తీరు తనను అబ్బుర పరిచిందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు వందవాసి నాగరాజు రా మానాయుడు, పి.మురళి, పెంచలయ్య, ఆర్.హరికృష్ణ, కందారపు మురళి, జయచంద్ర, టి.సుబ్రమణ్యం ప్రసంగించి నివాళులర్పించారు. -
వైభవంగా గిరిప్రదక్షిణ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి, అమ్మవార్ల గిరిప్రదక్షిణ శుక్రవారం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసిన స్వామి అమ్మవార్లకు కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా స్వామి అమ్మవార్లు ఏటా కనుమ పండుగ రోజు కై లాసగిరి ప్రదక్షిణ చేసి దేవతలు, రుషులను ఆహ్వానిస్తారు. మొదట జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారికి ఆలయ అలంకార మండపంలో పలు రకాల అభిషేకాలు చేశారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఉత్సవమూర్తులను చప్పరాలపై కొలువుదీర్చి కై లాసగిరి ప్రదక్షిణకు బయలుదేరారు. ఈ సందర్భంగా చతుర్మాడవీధులు శివనామస్మరణలతో మారుమ్రోగాయి. స్వామి అమ్మవార్లు జయరామరావువీధి, కై లాసగిరికాలనీ, రామచంద్రాపురం, రాజీవ్నగర్ మీదుగా రామాపురం రిజర్వాయరు సమీపంలోని అంజూరు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అక్కడ ఆలయాధికారులు భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లు వెయిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమం వద్ద ఉన్న ఎదురుసేవ మండపం వద్దకు వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈఓ బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయాధికారులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పంచమూర్తుల గిరిప్రదక్షిణ శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో సంక్రాంతిని పురస్కరించుకుని గురువారం శాస్త్రోక్తంగా పంచమూర్తుల గిరిప్రదక్షిణ నిర్వహించారు. స్వామి అమ్మవార్ల గిరిప్రదక్షిణలో భాగంగా పంచమూర్తుల పల్లకిపై కొలువుదీరి గిరిప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం గొబ్బెమ్మకు అలంకార మండపంలో పలు రకాల అభిషేక పూజలు చేసి, విశేషంగా అలంకరించారు. అమ్మవారిని సింహవాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. -
నలుసైపోయావే..చేప
మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన వృత్తి. అయితే మత్స్యకారులకు వేట రోజురోజుకూ తగ్గిపోయి, ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో గతంలో ప్రభుత్వాలు నీలి విప్లవం తీసుకువచ్చాయి. నీరున్న అన్ని చెరువుల్లో చేపపిల్లల పెంపకం చేపట్టేవి. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నీలివిప్లవం తూతూ మంత్రంగా సాగుతుండడంతో చేప నలుసైపోయి.. మత్స్యసంపదకు గండిపడింది. మత్స్యకారులకు ఉపాధి కరువైంది. తిరుపతి అర్బన్: జిల్లాలో మత్యకారుల సొసైటీల పరిధిలో 99 చెరువులు ఉండగా ఇరిగేషన్, పంచాయతీ రాజ్ పరిధిలో 650కి పైగా చెరువులు ఉన్నాయి. ఏటా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నవంబర్, డిసెంబర్ నెలల్లో జిల్లాలో 90 శాతం నీరున్న చెరువులకు చేపపిల్లలను వదిలిపెట్టేవారు. 150 రోజుల్లో ఆ పిల్లలు 600 గ్రాముల నుంచి కిలో వరకు పెద్దవి అయ్యేవి. ఆ తర్వాత సొసైటీ చెరువుల్లో మాత్రం సొసైటీ సభ్యులుగా ఉన్న మత్స్యకారులు వాటిని పట్టుకుని వ్యాపారం చేసుకునేవారు. మిగిలిన చెరువులకు వేలం పాట పాడేవారు. ఆ డబ్బులు చెరువు ఆయకట్టుకు 50 శాతం, గ్రామ పంచాయతీకి 30 శాతం, మత్స్యశాఖకు 20 శాతం చొప్పున పంపిణీ చేసేవారు. చంద్రబాబు గారి పాలనలో ఇలా.. చంద్రబాబుగారి పాలనలో చూస్తే గత ఏడాది తిరుపతిలోని మత్స్యశాఖ జిల్లా కార్యాలయంలోని తొట్టెలు దెబ్బతిన్నాయని, వాటిని మరమ్మతు చేయాలంటే రూ.70 వేలు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు జిల్లా మత్స్యశాఖ కార్యాలయ ప్రాంగణంలోని నీటి తొట్టెల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ మోటారు చోరీ జరిగింది. దీంతో కొత్త మోటారు ఏర్పాటుకు రూ.30 వేలు ఖర్చు అవుతుందని, మొత్తంగా రూ.లక్ష ఖర్చు చేయాల్సి ఉందని, తమకు నిధులు లేవంటూ గాలికి వదిలేశారు. దీంతో గత ఏడాది చేపపిల్లలు పెంపకం జరగలేదు. దీంతో విజయవాడలో టెండర్లు నిర్వహించి, అక్కడి నుంచే చేపపిల్లలు తెచ్చి, జనవరిలో సొసైటీ పరిధిలోని కొన్ని చెరువుల్లో ఆలస్యంగా వదిలిపెట్టారు. దీంతో పట్టుబడికి కేవలం 70 నుంచి 80 రోజుల సమయం మాత్రం మిగలడంతో మంచి దిగుబడి రాక నష్టపోయారు. ఈ ఏడాది గత ఏడాది లాగే కేవలం సొసైటీ చెరువుల్లో మాత్రమే వదిలిపెడతామని చెబుతున్నారు. జనవరి పూర్తి కావస్తున్నా ఆ ప్రక్రియ మొదలు కాకపోవడంతో ఫిబ్రవరిలో వదిలి, మార్చి నుంచి పట్టుకుంటే ప్రయోజనం శూన్యమని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు పాలనలో మత్స్య సంపదకు గండి పడిందనే చర్చ జోరుగా సాగుతుంది. గత పాలనలో ఇలా.. గత వైఎస్సార్సీపీ పాలనలో జిల్లా కేంద్రమైన తిరుపతిలోని మత్స్యశాఖ జిల్లా కార్యాలయం ప్రాంగణంలోని 13 చేపపిల్లల పెంపకం తొట్టెలు ఏర్పాటు చేశారు. తెనాలి నుంచి సెప్టెంబర్, అక్టోబర్లో కోటి మేరకు చేపపిల్లలు తెప్పించి, జాలర్ల సమక్షంలో రెండు నెలలు పెంచి, నవంబర్, డిసెంబర్ నెలల్లో 99 సొసైటీ చెరువులతోపాటు ఇరిగేషన్, పంచాయతీ రాజ్ పరిధిలోని 90 శాతం నీరున్న 350 చెరువుల్లో చేపపిల్లలు వదిలిపెట్టారు. మరోవైపు ప్రైవేటుగా చేపలను పెంచుకోవాలనుకున్న వారికి నామ మాత్రపు ధరలతో పిల్లలు ఇచ్చారు. దీంతో మత్స్యకారులకు అవసరం మేరకు మత్స్యసంపద అందడంతో వారంతా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకున్నారు. మరోవైపు ఫిష్ ఆఽంధ్ర పేరుతో మత్స్యకారులకు రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు రాయితీలు కల్పించారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
చంద్రగిరి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని ఏ.రంగంపేటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మునిరత్నం(46) తోపుడు బండిపై పానీపూరి విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మునిరత్నానికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట మునిరత్నం భార్య తన భర్తను వదిలేసి, పెద్ద కుమార్తెను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తీవ్ర వేదనకు లోనైన మునిరత్నం మద్యానికి బానిసగా మారాడు. తన భార్య వదిలి వెళ్లిపోవడంతో నిత్యం మద్యం సేవించి తీవ్ర మనోవేదనకు లోనవుతూ వచ్చాడు. ఈ క్రమంలో గురువారం తన భార్య తిరిగి ఏ.రంగంపేటకు వచ్చింది. ఇంటికి వెళ్లిన కాసేపటికి మునిరత్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి క్లూస్టీం సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికళ్ కళాశాలకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
శెట్టిపల్లిలో అందరికీ న్యాయం చేయండి
తిరుపతి అర్బన్: శెట్టిపల్లి భూ సమస్యలో అందరికీ న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నా రు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్రెడ్డి నేతృత్వంలో లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను కలెక్టరేట్కు పిలిపించారు. త్వరలో ఆ ప్రాంతా న్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కలెక్టర్ 636 ఎకరాల పరిధిలోని శెట్టిపల్లికి సంబంధించి 2,111 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. 406 మంది పేర్లు ఎందుకు వెల్లడించలేదు శెట్టిపల్లిలో 2,111 మందికి పట్టాలు పంపిణీ చేయ డానికి జాబితాను విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారని, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు శుక్రవారం తెలిపారు. అయితే అందులో 1,705 మంది పేర్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. మిగిలిన 406 మంది పేర్లు ఎందుకు వెల్లడించలేదని అధికారులను నాగరాజు ప్రశ్నించారు. అనేక పోరాటాలు చేసిన తర్వాత ఇస్తున్నారని చెప్పారు. -
తిరుపతిలో వైభవంగా గోదా కల్యాణం
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది. కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు.అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. తదుపరి మహా సంకల్పం, స్వామి, అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది. తర్వాత ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది.టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు, శ్రీవారి ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
అభివృద్ధి ఊసేది?
తారల తళుకు బెళుకులే.. ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే.. తారల తళుకుబెళుకులే తప్ప, మంత్రులు పులికాట్ అభిృవృద్ధికి ఇచ్చిన హామీలు నీటి మూటలవుతున్నాయి. ఏటా వస్తున్నారు..వెళుతున్నారు.. విదేశీ వలస విహంగాల ఆవాసానికి వసతులు కల్పించిన దాఖలాలు శూన్యం. హామీలు అమలుకు నోచుకోక పులికాట్ జీవవైవిధ్యం కోల్పోతోంది. సూళ్లూరుపేట: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సుకు ఏటా శీతాకాలంలో విచ్చేసే విదేశీ వలస విహంగాలను ఆధారంగా చేసుకుని ఫ్లెమింగో ఫెస్టివల్ 2001 నుంచి నిర్వహిస్తున్నా సరస్సు అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత 25 ఏళ్లల్లో 21 సార్లు పండుగను టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించాయి. ఈ కాలంలో పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షులు రక్షితకేంద్రం, భీములవారిపాళెం పడవల రేవు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఏటా పక్షులు పండుగ ప్రారంభోత్సవానికి, ముగింపు ఉత్సవానికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల వచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి, అనేక రకాల హామీలు ఇచ్చేసి వెళుతున్నారు. 2001 నుంచి 2004 దాకా, 2014 నుంచి 2019 దాకా, అలాగే 2025 నుంచి ఇప్పటివరకు అఽధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పండుగను తామే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం తప్ప పులికాట్ సరస్సు అభివృద్ధికి చేసేదిదేమీ లేదు. ప్రస్తుత పర్యాటక శాఖామంత్రి 2025లో పండుగ ప్రారంభోత్సవానికి విచ్చేసి సూళ్లూరుపేట ప్రాంతాన్ని పర్యాటక హబ్గా చేస్తానని హామీ ఇచ్చా రు. గత ఏడాది ముగింపు ఉత్సవానికి విచ్చేసిన ఆ యన అప్పుడూ ఇదే వ్యాఖ్యలు చేశారు. అదే వ్యాఖ్య లు ఈ ఏడాది కూడా చేశారు. పులికాట్ ముఖద్వారాల పూడికతీతకు రూ.142 కోట్లు సీఎం చంద్రబా బు మంజూరు చేశారని 2025లో చెప్పారు. ఈ ఏడా దీ అదే విషయం చెప్పారు. జీవ వైవిధ్య సరస్సుగా పులికాట్ ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని తిరుపతి జిల్లా, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో సుమారు 620 చదరపు కిలోమీటర్లు పరిధిలో పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని తిరుపతి జిల్లా తడ, సూళ్లూరుపేట, దొర వారిసత్రం, వాకాడు, చిట్టమూరు మండలాల్లో విస్త రించి ఉంది. మిగిలిన 120 చదరపు కిలో మీటర్లు త మిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, పొన్నేరి తాలుకా పరిధిలో విస్తరించి ఉంది. బంగాళా ఖాతం నుంచి తమిళనాడు పరిధిలోని పలవేరికాడ్ వ ద్ద ఒక ముఖద్వారం, వాకాడు మండలం కొండూరుపాళెం, రాయదొరువు వద్ద రెండు ముఖద్వారాలు ఉ న్నాయి. వర్షాకాలంలో వరదలు వచ్చినా, చిన్నపాటి వర్షాలు వచ్చినా స్వర్ణముఖి, కాళంగినది, తమిళనాడులో ఆరణియార్ నదులతో పాటు చిన్నా చితకా కా లువల నుంచి మంచినీరు సరస్సుకు చేరుతుంది. స ముద్రంలో ఆటుపోట్లు వచ్చి అలల ఉఽధృతి పెరిగినపు డు కడలి నుంచి ఉప్పునీరు పులికాట్లోకి ప్రవేశిస్తుంది. మంచినీరు, ఉప్పునీరు కలగలసిన సంగమం కావడంతో మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది. సుమా రు 20 వేలమంది మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడమే కాకుండా 204 రకాల 1.20 లక్షల విదేశీ వలసపక్షులకు ఆహారాన్ని అందిస్తూ జీవవైవిధ్యాన్ని సంతరించుకున్న రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు ఉంది. తమిళనాడులోని పల్వేరికాడ్ ముఖ ద్వారాన్ని ఏటా సుమారు రూ.30 లక్షల వ్యయంతో ఇసుకమేటలు తొలగించే ప్రక్రియను చేపడుతున్నారు. అందుకే దక్షిణవైపు సరస్సు ఎప్పుడూ జలకళతో కళకళలాడుతోంది. వాకాడుమండలం రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలు మూసుకు పోవడంతో వేసవిలో ఉత్తరవైపు సరస్సు ఎడారిని తలపిస్తోంది. తమిళనాడు తరహాలో రాయదొరువు, కొండూరుపా ళెం ముఖద్వారాలను పూడిక తీయిస్తే ఈ ప్రాంతంలో కూడా సరస్సు ఎప్పుడు జలకళతో కళకళలాడే ఆవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని అటు మత్స్యకారులు, ఇటు పర్యావరణ ప్రేమకులు శ్రీసిటీలో ఏర్పాటు చేసిన సింపోజియంలో కోరారు. వర్షాకాలంలో నిండుకుండలా పులికాట్ సరస్సు (పాతచిత్రం) కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్ర ఉత్సవం ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నపుడు కూడా ఎన్నో హామీలిచ్చారు. ఇలా ఎంతో మంది మంత్రులు వస్తున్నారు.. వెళుతున్నా రు. సరస్సు అభివృద్ధికి మాత్రం ఎవరూ కృషి చేయలేదు. అయితే పక్షులు పండుగను మాత్రం 2013లో టూరిజం క్యాలండర్లో చేర్చారు. ఆ తరువాత 2014లో స్టేట్ మెగా ఫెస్టివల్గా మార్చారు. పక్షుల పండుగ అంటే మూడు రోజులు పాటు సినీ తారల తళుకు బెళుకులు, సినీ యాంకర్లు, పాట కచ్చేరిలు, రక రకాల అర్ధనగ్నం డాన్స్లు, కామెడీ షోలు మిమిక్రీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో సరిపెట్టేసి మమ అనిపించేస్తున్నారు. పక్షులు నివాసానికి వసతులేవీ? నేలపట్టులో పక్షులు నివాసానికి చెట్లు పెంచడం, పులికాట్ సరస్సులో నీళ్లు ఎప్పుడూ ఉండేలా ముఖద్వారాలు పూడిక తీయించడం, భీములవారి పాళెం పడవల రేవు వద్ద రిస్టార్ట్స్ ఏర్పాటు, నిరంతర బోట్ షికారు తదితర పనులు చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఎవరూ ప్రయత్నం చేయలేదు. పండుగ మూడు రోజులు రాజకీయ నాయకులు ఉత్తుత్తి హామీలు, అధికారులు హడావుడి తప్ప ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదు. ఆనం రామనారాయణరెడ్డి పర్యాటకశాఖామంత్రిగా ఉన్న సమ యంలో భీములవారిపాళెం పడవల రేవు వద్ద రిసార్ట్స్ నిర్మాణానికి వేసిన శిలా ఫలకాలు ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉన్నాయి. -
రెండేళ్లవుతున్నా సూపర్ సిక్స్ హామీలెక్కడ?
తిరుపతి మంగళం : ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలన్న దురాలోచనతో నోటికి వచ్చినట్లు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి రెండేళ్లవుతున్నా అమలు ఎక్కడ అని వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ప్రశ్నించారు. తిరుపతి లక్ష్మీపురం వద్ద ఆయన ఆధ్వర్యంలో బుధవారం భోగి పండుగ సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన సూపర్సిక్స్ హామీల ప్రతులను పార్టీ నాయకులు భోగి మంటల్లో వేసి తగులపెట్టారు. ఈ సందర్భంగా మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు అధికార దాహమే తప్ప, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న కనీస ఆలోచన లేదని మండిపడ్డారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో దేశ రాజకీయాలకే ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు అందించిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. కూటమి నాయకులకు ఎందుకురా గెలింపించామని ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి నేతల మనసుల్లోని మోసం, వంచన భోగిమంటల్లో కాలిపోవాలని, ఇక నుంచైనా ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నల్లాని బాబు, వాసుయాదవ్, మల్లం రవికుమార్, గీతాయాదవ్, కార్పొరేటర్ కోటూరు ఆంజినేయులు, పార్టీ నాయకులు వెంకటేష్రాయల్, మునిరెడ్డి, కడపగుంట అమరనాధ్రెడ్డి, పసుపులేటి సురేష్, దినేష్రాయల్, అనీల్రెడ్డి, అంజూర్బాషా, పద్మజ, విజయలక్ష్మి, బాలాజీ, కోటి, స్వరూప్, రమణారెడ్డి, మురళీయాదవ్, లక్ష్మణ్రాయల్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
భోగి మంటల్లో 590, 847జీఓ ప్రతులు
పెళ్లకూరు: చంద్రబాబు సర్కారు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ విడుదల చేసిన 590, 847 జీఓ నకలు పత్రాలతో భోగి మంటలు వేశామని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్రెడ్డి అన్నారు. ఆయన నాయకులు కలిసి బుధవారం పుల్లూరులో సంబంధిత జీఓ నకలు పత్రాలను భోగిమంటల్లో వేసి కాల్చివేశారు. ఈ సందర్భంగా చిందేపల్లి మాట్లాడుతూ వైద్యం, వైద్యవిద్య పేద కుటుంబాల విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే ఆకాంక్షతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలనే లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారన్నారు. వీటిలో ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి కాగా మరికొన్ని వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేయడంతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టి గవర్నర్కు విజ్ఞప్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్రెడ్డి, గురవయ్య, చెంగయ్య, రామయ్య, సునీల్, నరసింహులు, మురళి, గోపి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
జేసీగా గోవిందరావు బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్: జిల్లా జాయింట్ కలెక్టర్గా ఆర్.గోవిందరావు బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తమ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. 2018 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆయన సివిల్ సప్లయి కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తూ తిరుపతి జిల్లా ఇన్చార్జి జేసీగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు అనంతరం మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ను ఆయన చాంబర్లో కలిశారు. అలాగే జేసీ చాంబర్కు వెళ్లి డీఆర్వో నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ రామాంజుల నాయక్ తదితరులు జేసీని మర్యాద పూర్వకంగా కలిశారు. అందరికి అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని జేసీ ఈ సందర్భంగా వెల్లడించారు. 21 నుంచి ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు తిరుపతి సిటీ: వచ్చేనెల 23 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈనెల 21వ తేదీ నుంచి రెండో విడత ప్రీ ఫెనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్లో మొదటి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించామని, పబ్లిక్ పరీక్షల కు విద్యార్థులను సన్నద్ధం చేసే దృష్టితో మరోసా రి ప్రీ ఫైనల్ నిర్వహించాలని అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే మార్చి 16 నుంచి పది పబ్లిక్ జరగున్న నేపథ్యంలో పదో తరగతి విద్యా ర్థులకు వచ్చేనెల 17 నుంచి 24వ తేదీ వరకు ప్రీ ఫైనల్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.టీటీడీకి రూ.10 లక్షల విరాళంతిరుమల: చైన్నెకు చెందిన ధర లాజిస్టిక్స్ సంస్థ బుధవారం వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. -
చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఇంటి వద్ద ఓ వృద్ధుడి ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేస్తామని చెప్పి ఏడాది గడిచినా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని.. పైగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వాపోతూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నాగి రాజయ్య గారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) తనకున్న భూసమస్యపై సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం నారావారిపల్లికి వచ్చాడు. అయితే.. సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రుయాకు తరలించారు. ఏడాది గడిచినా.. గోవిందరెడ్డికి తన అన్నదమ్ములతో భూ పంచాయితీ నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. గత ఏడాది జనవరిలో మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబును నారావారిపల్లెలోనే కలిసి న్యాయం చేయమని బతిమాలాడాడు. ఆ సమయంలో.. తాము చూసుకుంటామంటూ తండ్రీకొడుకులు మాట ఇచ్చారు. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు. గోవిందరెడ్డితో వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి మాట్లాడుతూ.. నేను బైక్ పార్కింగ్ చేస్తుండగా ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందరెడ్డి వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. కలెక్టర్, ఎమ్మార్వోలను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు పంచాయితీల పేరుతో లక్షలు నష్టపోయాడు. డబ్బులు ఖర్చు చేసినా న్యాయం జరగలేదు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. న్యాయం కోసం గత ఏడాది నారావారిపల్లెలో మంత్రి లోకేష్ను కలిశాం. న్యాయం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గోవిందరెడ్డికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
పండక్కి ఊరెళుతూ పరలోకాలకు..
నాగలాపురం: పండక్కి ఊరెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగలాపురం మండలం, కృష్ణాపురంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని దక్షిణపుకోట వీధికి చెందిన టి.శేఖర్ కుమారుడు టి.హర్షవర్ధన్(13) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల నిమిత్తం తన మేనమామ, అతని కొడుకుతో కలిసి ముగ్గురు ద్విచక్రవాహనంలో తిరుపతికి బయలు దేరారు. కృష్ణాపురం స్పీడ్ బేకర్ వద్ద వెనుక కూర్చుని ఉన్న హర్షవర్థన్ ద్విచక్ర వాహనం నుంచి అదుపు తప్పి కింద పడిపోయాడు, ఆ సమయంలో ఊత్తుకోట్టై వైపు వెళుతున్న టిప్పర్ హర్షవర్థన్ తలపై ఎక్కడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ను సురుటుపల్లి సరిహద్దు చెక్పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులో తీసుకున్నారు. మృతుని తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు.


