breaking news
Tirupati
-
నానీ గారు.. మాట నిలుపుకోండి!
‘‘సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి నానీ గారు.. మీరు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నష్ట పరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చండి.. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా హామీ ఊసే ఎత్తడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చొరవ తీసుకుని రాయలచెరువు ముంపు రైతులను గుర్తించారు. పూర్తి వివరాలతో పరిహారం అందించేలా ఫైళ్లను సిద్ధం చేయించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ఫైళ్లను పక్కనపెట్టారు. ఇప్పటికై నా మీరు స్పందించి తక్షణమే రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోండి’’ అంటూ వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి స్పష్టం చేశారు.రామచంద్రాపురం : మండంలోని రాయలచెరువుకు చేరుతున్న వరద నీటితోపాటు కరకట్టలను వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెరువు లీకేజీలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వరదలు వచ్చినపుడు రాయలచెరువు కట్టకు గండిపడితే అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వారం పాటు కట్టపై బస చేసి గండిని పూడ్చేంత వరకు ఇంటికి తిరిగిరాలేదని గుర్తు చేశారు. సుమారు లక్ష ఇసుక బస్తాలను కట్టకు అడ్డుగా వేసి గండిని పూడ్పించారని వెల్లడించారు. గండి పూడ్చే క్రమంలో కట్ట తెగితే దిగువ గ్రామాలన్నీ జలమయమవుతాయని, ముందుచూపుతో అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి ఆదుకున్నారని వివరించారు. ప్రాణాలకు తెగించి చెరువుకట్ట గండిని పూడ్పించిన ఘనత చెవిరెడ్డి భాస్కర్రెడ్డికే దక్కుతుందన్నారు. వరదల సమయంలో మనుషులకే కాదు పశువులకు సైతం ఉచితంగా దాణా అందించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆపద్భాందవునిలా సేవలందించారని తెలిపారు.చెరువు నుంచి లీకవుతున్న నీరు ప్రజల అవసరాలు తీర్చడానికే ..రాయలచెరువు నిండి చుట్టుపక్కల గ్రామాలు నీట మునిగిన సమయంలో ప్రజల అవసరాలు తీర్చడానికే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హెలికాప్టర్ వినియోగించాలని మోహిత్రెడ్డి స్పష్టం చేశారు. తుపాను సమయంలో మోకాటిలోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి బాధితులకు కేజీ బియ్యం కూడా ఇవ్వకుండా, దండంపెట్టి తిరిగిరావడం తమకు తెలియదని ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చేతనైనంత వరకు ప్రజలకు సాయం చేశామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సాయం చేయాలే కానీ, గతంలో సాయం చేసిన వారిపై విమర్శలు గుప్పించడం సబబు కాదని హితవు పలికారు. ముందుగా ఎమ్మెల్యే నాని ఇచ్చిన మాట నిలబెట్టుకుని, రైతులకు పరిహారం ఇప్పించి తర్వాత మాట్లాడాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, వైస్ ఎంపీపీ లావణ్య చంద్రబాబు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, నేతలు భానుకుమార్రెడ్డి, గిరిధర్రెడ్డి, రఘునాథరెడ్డి, భాస్కర్ రెడ్డి, కుప్పం భాస్కర్ యాదవ్, యశ్వంత్రెడ్డి, గోపీచౌదరి వెంకటేష్, పవన్ కుమార్ రెడ్డి, మారయ్య, బాదూరు భాస్కర్రెడ్డి, భాస్కరయ్య, టెండూల్కర్, రామిరెడ్డి, శంకర్రెడ్డి, శశి, పుష్ప కాంత్రెడ్డి, హిమాల్రెడ్డి పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నిర్వహించనున్న పుష్పయాగానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8 నుంచి 9గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ నిర్వహించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. నేడు పుష్పయాగం శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈనేపథ్యంలో తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. -
కొనలేం..తినలేం!
ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు కూరగాయలు కిలో రూ.లో టమాట 75ఉల్లి 70 వెల్లుల్లి 220 వంకాయ 110బెండ 85 పచ్చిమిర్చి 90కాకర 90 బీరకాయ 110దొండ 100గోరు చిక్కుడు 105 బీన్స్ 125క్యారెట్ 110బీట్రూట్ 105బంగాళదుంప 95 ఆకుకూరలు కట్ట 55రూ.వంద దాటిన కేజీ ధరల పెరుగుదలతో గృహిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏ కూర చేయాలన్నా టమాట, ఉల్లి తప్పనిసరి. ప్రస్తుతం కేజీ టమాట ధర రూ.వందకు చేరువలో ఉంది. రిటైల్ షాపులలో వంకాయ, బెండకాయ, బీన్స్, క్యారెట్ ధరలు రూ. 100 నుంచి 110వరకు పలుకుతున్నాయి. రైతు బజార్లోనే రూ.85 ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉల్లి ధరలు నాణ్యత, రకం మేరకు కేజీ రూ. 65 నుంచి 90వరకు పలుకుతున్నాయి. బెండ, చిక్కుడు, కాకర, బీట్రూట్, క్యారెట్, వంగ, బీన్స్, బంగాళదుంప వంటి కూరగాయలు ప్రస్తుతం తిరుపతి మార్కెట్లో రూ. 50 నుంచి రూ.120వరకు విక్రయిస్తున్నారు. తిరుపతి సిటీ : జిల్లాపై మోంథా తుపాను ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. మూడు రోజులుగా జన జీవనం స్తంభించింది. ఈ క్రమంలోనే కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అలాగే నిత్యావసర సరుకుల ధరలు సైతం పెరిగిపోయాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు పరిస్థితి దయనీయంగా మారింది. రెక్కడాతేగానీ డొక్కాడని దినసరి కూలీల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఏం తినాలన్నా మార్కెట్లో ధరలు దడ పుట్టిస్తున్నాయి. కేజీ కొనుగోలు చేసేవాళ్లు ప్రస్తుతం 250 గ్రాములతోనే సరిపెట్టుకుంటున్నారు. దెబ్బతిన్న పంటలు కూరగాయల ధరలు పెరగడానికి ప్రధాన కారణం మోంథా తుఫాన్ ప్రభావమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూరగాయల సాగు అధికంగా చేపట్టిన జిల్లాలలో తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా జిల్లాలో కూరగాయల సాగు సుమారు 2వేల ఎకరాల్లో చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కేవలం వెయ్యి ఎకరాలకే మాత్రమే చేపట్టారు. సాగు విస్తీర్ణానికి తగ్గట్టు పంట దిగుబడి రాకపోవడం. ఇతర రాష్ట్రాల నుంచి పూర్తి స్థాయిలో టమాట, ఉల్లి దిగుమతులు లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెటింగ్ శాఖ అంచనా ప్రకారం తిరుపతిలో రోజుకు 3వేల టన్నుల కూరగాయలు అవసరమవుతాయని, ప్రస్తుతం కేవలం 1,500 టన్నులు మాత్రమే రోజుకు దిగుమతి అవుతున్నాయని సమాచారం. మరో రెండు నెలల పాటు కొండెక్కిన కూరగాయల ధరలు దిగివచ్చే పరిస్థితి లేదని మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొరవడిన ప్రోత్సాహం కూరగాయల పంటల సాగుతో పాటు పూల తోటలను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. విత్తన సరఫరా, వ్యవసాయాధికారులనుంచి సమాచార లోపం కారణంగా చెప్పవచ్చు. ధరల నియంత్రణపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. -
కారును ఢీకొన్న బస్సు
చంద్రగిరి : పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున రవణప్పగారిపల్లె వద్ద కారును బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాలు.. తిరుపతికి చెందిన సురేష్ తన కారులో చిత్తూరుకు వెళుతుండగా బెంగళూరు నుంచి వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. సురేష్కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైక్ల ఢీ.. ఇద్దరికి గాయాలు
తిరుమల : తిరుమల రెండో ఘాట్ రోడ్లో బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే దారిలోని అలిపిరి చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనదారులు ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. మోటార్సైకిల్ ఢీకొని వ్యక్తి దుర్మరణం సూళ్లూరుపేట : పట్టణంలోని శేషసాయి కల్యాణమండపం ఎదుట మోటార్ సైకిల్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. సూళ్లూరుపేట మండలం మన్నేముత్తేరి పంచాయతీ గంపలకండ్రిగకు చెందిన పల్లికొండ పుల్లయ్య (45) బుధవారం రోడ్డు పక్కన నడిచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మరణించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ కేసు నమోదు చిల్లకూరు : మండలంలోని అన్నంబాక గ్రామానికి చెందిన తిరుమల చెంచమ్మ అనే మహిళ ఇంట్లో జరిగిన చోరీపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాలు.. చెంచమ్మ ఇటీవల చైన్నెలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువాను దుండగులు పగులగొట్టి బంగారు నగలు అపహరించినట్లు గుర్తించింది. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీమ్తో ఆధారాలు సేకచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పరివాహన్’పై అవగాహన శూన్యం
కాగిత రహిత సేవలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర రవాణా శాఖ 2019లో పరివాహన్ యాప్ను అందు బాటులోకి తెచ్చింది. దీని ద్వారా రవాణా శాఖకు సంబంధించిన 16 రకాల సేవలు పొందవచ్చు. కానీ, యాప్పై వాహన యజమానులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించలేదు. అలాగే యాప్ నిర్వహణ సైతం సక్రమంగా లేకపోవడంతో వాహన యజమానులు పర్మిట్లు, లైసెన్సుల కోసం ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది. రవాణా శాఖలో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష పాసైన తర్వాత వచ్చిన మెసేజ్ ఆధారంగా వాహన చోదకులు మీ–సేవ కేంద్రాలకు వెళ్లి ఆ పత్రాలు తీసుకోవాల్సి వస్తోంది. వీటిని ఉచితంగా ఇవ్వాల్సిన నిర్వాహకులు రూ.20 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. అదే కార్డు రూపంలో కావాలంటే రూ.100 నుంచి రూ.150 వరకూ చెల్లించాల్సి వస్తోంది. టూ వీలర్, ఫోర్ వీలర్ లైసెన్సులు, రెన్యువల్కు వచ్చే వారికి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, ఆటో, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులకు వచ్చే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులే ఉంటారు. వారిని రవాణా కార్యాలయానికి తీసుకువెళ్లి ఓటీపీ చెప్పిన అనంతరం దరఖాస్తు చేయించాల్సి వస్తోంది. కాగిత రహితంగా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి పూర్తి విరుద్ధంగా ఈ తతంగం సాగుతోంది. డబ్బులు ఇస్తేనే.. ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్)లను ఇప్పటికే ఇతర జిల్లాల్లో ఏర్పాటు చేసింది. వాటి నిర్వాహకులు కావాల్సిన సర్టిఫికెట్ ప్రకారం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆటో యూనియన్లు, రవాణా కార్మిక సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే అధికారం రవాణాశాఖకు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. జిల్లా మొత్తానికి శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి వద్ద ఒకే ఒక్క ఏటీఎస్ ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా సరిహద్దు ప్రాంతాల వారు ఎఫ్సీ కోసం సుమారు 70 కిలోమీటర్లు రావాల్సి వస్తోంది. శ్రీకాళహస్తి సమీపంలపోని రాచగున్నేరి వద్ద ప్రైవేటు ఏజెన్సీ ఏర్పాటు చేస్తున్న వాహన ఫిట్నెస్ పరీక్షల సెంటర్జిల్లాలో వాహనాల వివరాలు ప్రయాణికుల బస్సులు 3,551 స్కూల్ బస్సులు 1,105 గూడ్స్ క్యారియర్లు 19,427 కార్లు 23,541 త్రీ వీలర్లు 47,388 అగ్రికల్చర్ ట్రాక్టర్లు 10,858 కమర్షియల్ ట్రాక్టర్లు 9,802 ఇతర వాహనాలు 9,012తిరుపతి మంగళం : రవాణాశాఖ కార్యాలయాలు గతంలో వాహనదారులతో నిత్యం కళకళలాడుతుండేవి. క్రమేణా రవాణా శాఖ సేవలన్నీ దాదాపు ప్రైవేటు పరమైపోయాయి. మొత్తం 86 సేవల్లో ఎల్ఎల్ఆర్ మినహా మిగిలినవన్నీ బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఎల్ఎల్ఆర్ను కూడా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సర్కారు యత్నిస్తోంది. దీంతో రవాణా రంగం ప్రైవేటు నిర్వాహకుల ఇష్టారాజ్యం కానుంది. వాహనదారులను నిలువు దోపిడీ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వమే కల్పిస్తోంది.అంతా ప్రైవేట్ పరం కావడంతో జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం రవాణాశాఖను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం -
నిండిన జలాశయాలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తుపాను ప్రభావం మూడు నుంచి ఐదు రోజులపాటు కొనసాగింది. దీంతో కురిసిన వర్షాలకు జిల్లాలోని జలాశయాలు నిండిపోయాయి. అలాగే చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. జిల్లా జలవనరుల శాఖ పరిధిలో మొత్తం ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో కల్యాణి డ్యామ్ 50 శాతం నిండింది. మల్లిమడుగు, కాళంగి, అరణియార్, వాకాడులోని వైఎస్సార్ బ్యారేజ్, కృష్ణాపురం రిజర్వాయర్లకు వంద శాతం నీరు చేరింది. ఈ క్రమంలోనే 2,576 చెరువులకు గాను 2,200 చెరువులు వంద శాతం వర్షపు నీటితో నిండినట్లు అధికారులు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం తుపాను బలపడుతుందనే సంకేతాలు రావడంతో జిలాల్లోని నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశామని జిల్లా వాటర్ రిసోర్స్ ఎస్ఈ రాధాకృష్ణమూర్తి బుధవారం తెలిపారు. జలాశయాలు, చెరువులు, కుంటలు, వాగులు, వంకల వద్ద వరద పరిస్ధితిని సమీక్షించామని వివరించారు. ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే నీటి కాలువల మరమ్మతులకు రూ.33 కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రారంభమైన విద్యాసంస్థలు తిరుపతి సిటీ : మోంథా తుపాను ప్రభావంతో మూతపడిన విద్యాసంస్థలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ కేవీఎన్ కుమార్ బుధవారం నుంచి పాఠశాలలను మొదలుపెట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లాలోని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో సైతం తరగతులు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి తిరుపతి క్రైమ్ : తిరుపతిలోని గరుడ వారధిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. తిరుపతిలోని మంగళంలో నివసిస్తున్న రమేష్(40 సొంత పనుల నిమిత్తం బైక్పై తిరుచానూరు వెళ్లారు. తిరిగి గరుడ వారధిపై నుంచి వస్తుండగా లక్ష్మీపురం సర్కిల్ వద్ద అదుపు తప్పి పిట్ట గోడను ఢీకొన్నాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
మత్తు బానిసలకు ప్రత్యేక చికిత్స
తిరుపతి తుడా: మత్తుకు బానిసలుగా మారిన వారికి ప్రత్యేక వైద్య సదుపాయాలను ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తున్నట్లు ఐజీ రవికృష్ణ తెలిపారు. బుధవారం తిరుపతిలోని రుయా ఆస్పత్రి ఆధ్వర్యంలో మానసిక విభాగం, మత్తు వ్యసన నిర్మూలన కేంద్రాన్ని ఎస్పీ సుబ్బ రాయుడు, రుయా ఆస్పత్రి సూపరిండెంట్ రాధ, ఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణలతో కలసి ఆయన సందర్శించారు. అక్కడ చికిత్సపొందుతున్న వారితో మాట్లాడారు. వారికి అవసరమైన వసతుల గురించి తెలుసుకున్నారు. ఐజీ మాట్లాడుతూ 60 బెడ్ల హాస్పిటల్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో ఈ సెంటర్లను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు వివరించారు. మత్తుకు బానిసైన వారి మానసిక స్థితిని మార్పు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ మత్తుకు అలవాటు పడితే ఆరోగ్య సమస్యలతోపాటు కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు. వైద్యులు పద్మావతి, మానస, మురళి పాల్గొన్నారు. -
‘నువ్వు ఎవడ్రా.. మా ఊరి పొలం చేయడానికి..’
రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పేదలు, దళితులపై దౌర్జన్యాలకు తెగబడుతూ వారి భూములను లాక్కుంటున్నారు. ఇదేమని అడిగిన వారిపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. అధికారులూ టీడీపీ నేతలకే వంత పాడుతున్నారు. న్యాయం చేయండని బాధితులు మొత్తుకుంటున్నా తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.బాలాయపల్లి (సైదాపురం): ‘ఇది మా ఊరు. ఇదంతా మా భూమి. నువ్వు ఎవడ్రా మా ఊరి పొలం చేయడానికి’ అంటూ టీడీపీ నేత సీసీ నాయుడు ఓ దళిత కుటుంబంపై దాడికి తెగబడి.. ఆ కుటుంబం సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించే యత్నం చేశాడు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో అక్కసముద్రం పరిధిలోని ప్రభుత్వ భూమిని యాచవరం దళితవాడకు చెందిన దళితులు 10 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిపై వెంగమాంబపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత సీసీ నాయుడు కన్ను పడింది. ఆదివారం జేసీబీ, బుల్డోజర్లతో వచ్చి టీడీపీ నేత ఆ భూమిని దున్నే ప్రయత్నం చేశాడు. దీంతో దళితుడైన చిరంజీవి, భార్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీసీ నాయుడు ‘నీకు భూమి ఎక్కడ ఉంది. మా ఊళ్లో పొలాన్ని మీరెలా సాగు చేస్తారు’ అంటూ వారిపై చేయి చేసుకున్నాడు. ఈ పొలానికి సంబం«ధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని, భూమిని వదిలేయాలని దళిత దంపతులు ప్రాధేయపడినా వినకుండా ఆ దంపతులపై దాడికి యతి్నంచాడు. దీంతో దంపతులిద్దరూ బుల్డోజర్కు అడ్డంగా పడుకుని పనులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నా సీసీ నాయుడును అడ్డుకోలేదని స్థానిక దళితులు ఆవేదనకు గురయ్యారు. ఈ వ్యవహారంపై బాధితులు బుధవారం బాలాయపల్లి తహశీల్దార్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ నేత సీసీ నాయుడుపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేత, యాచవరం పీఏసీఎస్ అధ్యక్షుడు సీసీ నాయుడుపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ గోపీ తెలిపారు. తమ భూమిని ఆక్రమించేందుకు సీసీ నాయుడు ప్రయత్రించడమే కాకుండా తమను అసభ్య పదజాలంతో దూషించినట్టు వరికూటి అన్నపూర్ణమ్మ ఫిర్యాదు చేసిందన్నారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ చెప్పారు. -
బీఆర్ నాయుడు వచ్చాకే తిరుమల గోశాల నిర్వీర్యం: భూమన
సాక్షి, తిరుపతి: బీఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోషాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచన తప్పే కదా? అని భూమన ప్రశ్నించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయం బోర్డు దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడే స్వయంగా చెప్పారు. గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణపై, గోవుల మరణాలు జరుగుతున్నాయని చెప్పాను. దానికి నా మీద కేసులు పెట్టారు.అందుకు బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డిని నాపై ఉసిగొల్పారు. గోశాలపై వ్యాఖ్యలు చేసిన మీకు కూడా ఈ కేసులే వర్తిస్తాయి. నా మీద పెట్టిన కేసులో మీ మీద కూడా పెట్టాలి. దాదాపు 70ఏళ్ల టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోశాలను బీఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత నిర్వీర్యం చేస్తున్నారు. గోశాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనే తప్పే కదా?. మీ హయాంలో మీరు వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేరు, గోశాలను సరిగ్గా నిర్వహించలేరు. తిరుమలలో ఏం జరుగుతుందో యావత్ ప్రపంచానికి నా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. దానికి మీరు పెట్టిన కేసులన్నీ కూడా నన్ను భయపెట్టడానికి పెట్టినవే తప్ప మరొకటి కాదు. ఇలాంటి తప్పులు ఎన్ని మీరు చేసినా ఆ తప్పుల్ని ఎత్తి చూపటమే ఒక పూర్వ అధ్యక్షునిగా నా బాధ్యత. తిరుమలలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాను అని వ్యాఖ్యలు చేశారు. -
శేషాచలం అడవుల్లో.. అరుదైన బల్లి జాతి గుర్తింపు..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పవిత్ర తిరుమల పర్వతశ్రేణుల్లో హెమిఫిల్లో డాక్టిలస్ జాతికి చెందిన కొత్త బల్లి జాతిని హైదరాబాద్కు చెందిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 881 మీటర్ల ఎత్తులో ఓ గంధపు తోటలోని చెట్టు బెరడు కింద ఈ కొత్త జాతికి చెందిన బల్లిని గుర్తించారు. కేవలం 3.37 సెంటీమీటర్ల పొడవున్న ఈ జాతి బల్లికి హెమిఫిల్లో డాక్టిలస్ వెంకటాద్రి అని పేరుపెట్టారు. కొత్త బల్లి జాతి పరిశోధనలో భరత్ భూపతి, సుమిద్ రే, బి. లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం. కరుతపాండి, డాక్టర్ దీపా జైస్వాల్, డాక్టర్ నీలాద్రి బి.కర్, డాక్టర్ ప్రత్యూష్ పి. మొహాపాత్రలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పాలుపంచుకుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ జర్నల్ ‘హెర్పెటోజోవా’ప్రచురించింది. కొత్తగా కనుగొన్న బల్లి ఏపీ నుంచి గుర్తించిన హెమిఫిల్లో డాక్టిలస్ జాతికి చెందిన రెండో జాతి. మొదటిది హెచ్. అరకుయోన్సిస్. దీని జన్యు వైవిధ్యం భిన్నంగా ఉందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఈ సందర్భంగా భారత జంతు ప్రదర్శన శాల డైరెక్టర్ డాక్టర్ ధృతి బెనర్జీ పరిశోధన బృందాన్ని అభినందించారు. -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 64,065 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,250 మంది భక్తులు తలనీలాలు అర్పించున్నారు. స్వామివారి హుండీకి కానుకల రూపంలో రూ. 3.57 కోట్లు సమర్పించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వాకాడు : తుపాను ప్రభావంతో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సముద్ర తీరంలో గంట గంటకు పెను మార్పులు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం సముద్రం దాదాపు 10 మీటర్లు నుంచి 20 మీటర్లు వరకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం మోంథా దుపాను ముప్పునకు సంకేతంగా సముద్రం దాదాపు 20 మీటర్లు వెనక్కి వెళ్లింది. భీకర శబ్దాలతో అల్లకల్లోలంగా ఎగసి పడుతుంది. పెను ప్రమాదానికి సంకేతంగా దాదాపు 12 గంటల ముందు సముద్రం వెనక్కి వెళుతుందని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తర్వాత ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందని, ఇలాం పలుమార్లు జరిగిందని వెల్లడిస్తున్నారు. తూపిలిపాళెంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుతూపిలిపాళెం తీరంలో ఎగసి పడుతున్న కెరటాలుజిల్లాలో మోంథా తుపాను దడ పుట్టిస్తోంది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో తీరం దాటిన తర్వాత పెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రెండురోజులుగా ఎడతెరపి లేని వర్షాలతో జనజీవనం దాదాపు స్తంభించింది. చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఈ క్రమంలో రాబోయే 24 గంటలు కీలకమని.. భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ముంపు ప్రాంతవాసులను అధికార యంత్రాగం పునరావాస కేంద్రాలకు తరలించింది. కంట్రోల్ రూమ్లు ద్వారా సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వాగులు.. వంకలు.. చెరువులు.. నదుల్లో ఎవరూ దిగకుండా కట్టుదిట్టంగా నిఘా పెట్టింది. అయితే తుపాను ప్రభావంతో పలు చోట్ల పంటపొలాలు నీటమునిగాయి. రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలుల కారణంగా కొన్ని చోట్ల పూరిగుడెసెలు కూలిపోయాయి. తిరుపతి అర్బన్ : మోంథా తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి చలిగాలులు అధికమయ్యాయి. గ్రామీణ రహదారుల నుంచి హైవేల వరకు వర్షాలతో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటలే కీలకమని భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిశీలతోనే సరి జిల్లాలోని ముంపు ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నదులు, చెరువులు, వాగులు, వంకలను సందర్శిస్తున్నారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టకుండా కేవలం పరిశీలనతో సరిపెట్టేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇచ్చామని, సమస్యలు తలెత్తితే సమాచారం ఇవ్వాలని చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ముంపు ప్రాంతాలకు చెందిన వారిని వరదనీరు వస్తే ఎక్కడి తరలిస్తున్నామో కూడా స్పష్టంగా చెప్పడం లేదు. మరోవైపు పలు కాలనీల్లో దెబ్బతిన్న ఇళ్లు ప్రస్తుత వర్షాలకు కూలే ప్రమాదమున్నప్పటికీ అప్రమత్తం చేయకుండా తూతూమంత్రంగా పరిశీలనలు చేపడుతున్నారు. రైతులకు నష్టపోకుండా చర్యలు చిట్టమూరు : తుపాను కారణంగా రైతులు నష్ట పోకుండా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. చిట్టమూరు మండలం ఎల్లసిరి చెరువును ఎస్పీ సుబ్బరాయుడు, ప్రత్యేక అధికారి అరుణ్ బాబుతో కలిసి పరిశీలించారు. గండ్లు పడకుండా చూడాలని ఇరిగేష్న్ ఎస్ఈ రాధాకృష్ణారెడ్డిని ఆదేశించారు. వరద నీరు చేరిన మన్నెమాలను సందర్శించారు. నాయుడుపేట–మల్లాం రహదారిపై పులికాలువపై కల్వర్టు వద్ద నిఘా పెట్టాలని సూచించారు. రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. షోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కంట్రోల్ రూమ్కు తెలియజేయాలన్నారు. గర్భిణులు, బాలింతలకు ఇంటి వద్దనే చికిత్సలందించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. తూపిలిపాళెంలో అధికారుల పర్యటన తూపిలిపాళెంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పర్యటించారు. అల్లకల్లోలంగా మారిన సముద్రాన్ని పరిశీలించారు. అధికారుల నుంచి కచ్చితమైన ఆదేశాలు వచ్చే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశించారు. ఉప్పుటేరుకు వరద ఉధృతి చిల్లకూరు : మండలంలోని తిప్పగుంటపాళెం సమీపంలో ఉన్న ఉప్పుటేరు (కండలేరు క్రీక్)లో వరద ఉధృతి పెరిగింది. మంగళవారం రాత్రి కూడా వర్షం కురిస్తే రాక పోకలు నిలిచి పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో ఎవరూ వెళ్లకుండా అధికారులు ముళ్లకంపలు వేయించారు. అరణియార్లో చేపల వేటపై నిషేధం నాగలాపురం: తుపాను కారణంగా అరణియార్ ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో చేపలు వేటపై నిషేధం విధించినట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే మత్స్యకార లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కాళంగి డ్యామ్ గేట్లు ఎత్తివేత సూళ్లూరుపేట: కేవీబీ పురం మండలం అంజూరు వద్ద కాళంగి డ్యామ్ 21 గేట్లలో 5 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. . దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. మరో ఐదు గేట్లు ఎత్తిన పక్షంలో సూళ్లూరుపేట గోకులకృష్ణా కళాశాల వద్ద హైవేపై వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది. దీనికి గాను ముందుస్తుగానే చైన్నె నుంచి నెల్లూరు వైపు వచ్చే వాహనాలను తడ వద్దనే ఆపేస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. చిల్లకూరు: తిప్పగుంటపాళెంసమీపంలో ఉప్పుటేరు ఉధృతిగోవిందపల్లిలో చప్టాను పరిశీలిస్తున్న అధికారులు కాలనీ వాసులతో మాట్లాడుతున్న అధికారులు వాకాడు మండలంలో వెనక్కు వెళ్లిన సముద్రంకల్యాణి డ్యామ్లో పెరిగిన నీటి మట్టందెబ్బతింటున్న పంటలు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 8వేల ఎకరాల్లో నారుమళ్లు పోశారు. పంట కాలువలు పూడిపోవడంతో వరద నీరు పొలాల్లోకి చేరుతోంది. దీంతో నారుమళ్ల దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇసుక మేటలు వేస్తున్నాయని, దీంతో పంటల సాగుకు మరింత ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన చెందుతున్నారు. అలాగే జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల్లో సాగు చేస్తున్న కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. సాగర తీరంలో అలజడి నిరాశ్రయులకు పునరావాసం నారాయణవనం: మండలంలోని తుంబూరు పంచాయతీ వెలుతురుకండ్రిగ ఎస్టీ కాలనీలో మూడు గుడిసెలు పూర్తిగా, 14 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మంగళవారం తహసీల్దార్ రోజారాణి, ఎంపీడీఓ అరుణ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వెలుతురుకండ్రిగ ప్రాథమిక పాఠశాలలో పునరావాసం ఏర్పాటు చేశారు. సుమారు 40 మంది ఎస్టీ కాలనీ వాసులకు అన్ని సదుపాయాలను పునరావాసకేంద్రంలో కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. -
తీర ప్రాంతం.. అప్రమత్తం
కోట : మండలంలోని తీరప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోవిందపల్లి, గోవిందపల్లిపాళెం, కొత్తపట్నం, శ్రీనివాససత్రంలో అధికారులు పర్యటించారు. మత్య్సకారులకు తగు జాగ్రత్తలు చెప్పారు. ముంపు ముప్పు ఉన్న పుచ్చలపల్లి, దైవాలదిబ్బ, దొరువుకట్ట, అల్లంపాడును క్షేత్రస్థాయిలో పరిశీలించి స్వర్ణముఖిలో వరద ప్రవాహం పరిశీలించారు. ఈ మేరకు కోటలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. గూడలి వద్ద స్వర్ణముఖినది బ్రిడ్జిపై వరదనీరు ప్రవహించే అవకాశాలు ఉండడంతో అక్కడ పోలీసు కాపలా పెట్టారు. దీంతో విద్యానగర్ నుంచి కొత్తపాళెం వరకు రోడ్డుపై రాకపోకలు స్తంభించాయి. -
స్విమ్స్లో త్వరలోనే రోబోటిక్ సర్జరీలు
తిరుపతి తుడా : స్విమ్స్ ఆస్పత్రిలో త్వరలోనే రోబోటిక్ టెక్నాలజీతో సర్జరీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్విమ్స్ డైరెక్టర్, వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. మంగళవారం పద్మావతి ఆడిటోరియంలో వికేంద్రీకరణ ఎక్సలెన్స్, డెమోక్రటైజింగ్ యాక్సెస్, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణకు ఉజ్వల భవిష్యత్తు అనే అంశంపై సింహాద్రి సత్యనారాయణరావు చైర్ ఒరేషన్న్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్వీ కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ రావు ఏటా సర్జికల్ ఆంకాలజీ విభాగంలో ఛైర్ ఒరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సర్టికల్ అంకాలజీ విభాగానికి రూ.11 లక్షల ఆర్థికన్సాయం సైతం అందించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే సర్జికల్ రోబోటిక్ టెక్నాలజీలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ విశ్వజ్యోతి పి.శ్రీవాత్సవకు గోల్డ్ మెడల్ ప్రదానం చేసినట్లు తెలిపారు. క్యాన్సర్ విభాగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ప్రక్రియలపై వైద్యులు, వైద్య విద్యార్థులు పట్టు సాధించాల్సిన అవసరముందని సూచించారు. కార్యక్రమంలో డీన్ అలోక్ సచన్, రిజిస్ట్రార్ అపర్ణ బిట్లా, విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర, డాక్టర్ మణిలాల్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ ముత్తీశ్వరయ్య పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
కోట : ఆటోను తప్పించే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు చల్లకాలువలోకి ఒరిగిన ఘటన మంగళవారం కోట క్రాస్రోడ్డులో చోటుచేసుకుంది. వివరాలు.. బీఎస్ఎన్ఎల్ కేబుళ్లను భూమిలో అమర్చేందుకు ఇటీవల కోట క్రాస్ నుంచి కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు మార్జిన్లో గాడి తవ్వారు. పనులు పూర్తయిన తర్వాత గాడిని పూడ్చివేశారు. భారీ వర్షాలకు మట్టి మెత్తబడి ఉండడంతో నాయుడుపేట నుంచి కోటకు వస్తున్న వాకాడు డిపో ఆర్టీసీ బస్సు ఆటోను తప్పించే ప్రయత్నించే రోడ్డు మార్జిన్లో కూరుకుపోయింది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. పక్కనే కాలువలో పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు క్రేన్ సాయంతో బస్సును చల్లకాలువలో పడకుండా బయటకు తీశారు. అవినీతి ఆరోపణలపై విచారణ రేణిగుంట : రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డిపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై మంగళవారం విచారణ చేపట్టారు. విచారణాధికారి ముని శంకరయ్య ఆధ్వర్యంలో నలుగురు అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డి సమక్షంలోనే డాక్యుమెంట్లు పరిశీలించడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా విచారణ అధికారులతో కార్యాయలం వెలుప ఆనందరెడ్డి మంతనాలు సాగించడంతో అనుమానాలకు బలం చేకూరిందని స్పష్టం చేస్తున్నారు. అలాగే విచారణ అధికారులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు రాచ మర్యాదలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు గంటపాటు కార్యాలయంలో విచారణ చేపట్టిన అధికారులు మాత్రం విలేకర్లుకు ఎలాంటి సమాచార ఇవ్వకుండానే వెళ్లిపోయారు. దీంతో విచారణ సవ్యంగా సాగిందా, లేక ఆనందరెడ్డి లాబీయింగ్ పనిచేసిందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. -
జీవనోపాధికి ప్రశాంత సాగరం బాటలు వేస్తుంది. ప్రధానంగా మత్స్యకారుల నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లేందుకు వనరులు అందిస్తుంది. అయితే ఉగ్రరూపం దాల్చినప్పుడు బతుకులను అతలాకుతలం చేస్తుంది. నిలువ నీడ లేని దయనీయ స్థితిలోకి నెట్టేస్తుంది. అందుకే ప్రకృతి వైపరీత్యాలు సం
అధికారుల నిర్లక్ష్యం తుపాను వస్తోందనగానే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యల నిమిత్తం రూ.కోట్లు విడుదల చేసి, ఖర్చు చేస్తుంది. ముంపు గ్రామాల్లో నివసించే వారికి ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు, కమ్యూనిటీ భవనాల్లో పునరావాసం కల్పిస్తుంది. ఇందుకు వెచ్చించే నిధుల్లో కొంత తుపాను రక్షిత భవనాలను సరిచేసేందుకు వినియోగిస్తే వేలాదిమందికి ప్రాణాలకు భరోసా ఉంటుంది. అత్యవసర పరిస్థితిల్లో తీరప్రాంతవాసులకు రక్షణ కల్పించేందుకు వెసులుబాటు ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం విడుదల చేసే నిధులు కేవలం తాత్కాలిక సహాయానికే పరిమితమవుతున్నాయి. వాకాడు మండలం అందలమాలలో కూలేందుకు సిద్ధంగా తుపాను రక్షిత భవనంనాడు పదిలం..చిల్లకూరు : జిల్లాలో సుమారు 75 కిటోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో తుపానులు, వాయుగుండాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలోనే తీర ప్రాంతాల వాసులను ప్రకృతి వైపరీత్యాలు వణికిస్తుంటాయి. అలాంటి విపత్కర వేళల్లో దాదాపు 40 ఏళ్ల క్రితం తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాలతోపాటుగా వాటికి అనుబంధ పల్లెల్లో తుపాన్ రక్షిత భవనాలు నిర్మించారు. ఇవి బాగా ఉన్న రోజుల్లో తుపానులు వస్తే ముంపు బాధితులు ఈ భవనాలలోకి వెళ్లి తల దాచుకునేవారు. అయితే కాలక్రమంలో ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వాలు సైతం ఈ ఆలనా పాలనా పట్టించుకోకపోవడంతో కూలేందుకు సిద్ధంగా మారాయి. తీర ప్రాంత నియోజకవర్గాలైన గూడూరు, సూళ్లూరుపేటలోని సుమారు 48 తుపాను రక్షిత భవనాలు వినియోగానికి పనికిరాని విధంగా తయారయ్యాయి. వీటిని పర్యవేక్షించాల్సి పంచాయతీరాజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో భవనాలకు ఉన్న విలువైన కలప, కమ్మీలు, తలుపులు చోరీకి గురయ్యాయి. దీంతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తుపాను రక్షిత భవనాలు ప్రస్తుతం దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి. మత్స్యకారుల సామగ్రి భద్రతకు ఇబ్బందే! సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారులు తమ వలలు, ఇంజిన్లు ఇతర సామగ్రిని తుపాను సమయంలో భద్రపరుచుకోవడం ఇబ్బందిగా మారింది. రక్షిత భవనాలుంటే సామగ్రిని భద్రంపరుచుకునేందుకు వీలుగా ఉండేది. ప్రస్తుతం అవి పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో పాఠశాలల్లోని పునరావాస కేంద్రాల్లో సామగ్రిని ఉంచుకునేందుకు స్థలం సరిపోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తుపాను రక్షిత భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. తుపాను రక్షిత భవనాలపై శీతకన్ను వేసిన ప్రభుత్వాలు నివేదిక సిద్ధం చేస్తాం తీర ప్రాంతంలోని గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన తుపాను రక్షిత భవనాలపై నివేదిక సిద్ధం చేస్తాం. దీనిపై కలెక్టర్ సైతం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వచ్చేవాటిని ముందుగా గుర్తించి ఆ మేరకు ఎన్ని నిధులు ఖర్చు చేస్తే సరిపోతుందో నివేదికలో పొందుపరుస్తాం. మోంథా తుపాను ప్రభావం తగ్గిన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించి రిపోర్టు తయారు చేసి పంపుతాం. – రమణయ్య, డీఈఈ, పంచాయతీరాజ్, గూడూరు, నాయుడుపేట ప్రస్తుత పరిస్థితి మరీ దారుణం మోంథా తుపాను విరుచుకుపడిన ఈ విపత్కర సమయంలో తీర ప్రాంతంలో ముంపు కాలనీల్లో ఉన్నవారికి పునరావసం కల్పించడం అధికారులకు తలకుమించిన భారమైంది. సాధారణంగా తీర ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. అందుకే అక్కడ 30 నుంచి 50 మంది విద్యార్థులకు సరిపడేలా పాఠశాల భవనాలు నిర్మించి ఉన్నారు. ఆయా పాఠశాలలోఏ్ల ఎన్ని కుటుంబాలకు ఆశ్రయం కల్పించాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు. జిల్లాలో సముద్ర తీరం 75 కి.మీ. నియోజకవర్గాలు: గూడూరు, సూళ్లూరుపేట మత్స్యకార గ్రామాలు 58 అనుబంధ పల్లెలు 15 మొత్తం గ్రామాలు 73 తుపాన్ రక్షిత భవనాలు 54 వినియోగంలో లేనివి 48 -
‘పరకామణి’ కేసులో టీడీపీ నేత కోడూరును విచారించాలి
తిరుపతి మంగళం: టీటీడీ పరకామణిలో అవకతవకలకు పాల్పడిన రవికుమార్ ఆస్తులకు సంబంధించి టీడీపీ రాష్ట్ర నాయకుడు కోడూరు బాలసుబ్రమణ్యం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లుందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధికార ప్రతినిధి వాసుయాదవ్ చెప్పారు. అందువల్ల పరకామణి కేసులో సీఐడీ ఆయనను విచారించాలని కోరారు. తిరుపతి పద్మావతీపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వాసుయాదవ్ మీడియాతో మాట్లాడారు. టీటీడీలో జరుగుతున్న అపచారాలు, చైర్మన్ నియంత నిర్ణయాలను.. నిత్యం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఎత్తిచూపడాన్ని బాలసుబ్రమణ్యం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అందువల్లే టీటీడీపై అనవసర వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టారన్నారు. శ్రీవారి పరకామణిలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని, అందులో రూ.100 కోట్ల ఆస్తి కరుణాకరరెడ్డి రాయించుకున్నారంటూ మరో పోస్టు పెట్టారని చెప్పారు. రవికుమార్ వద్ద నుంచి భూమన కరుణాకరరెడ్డి రాయించుకుంటే బాలసుబ్రమణ్యం సాక్షి సంతకం చేశారా? అని ప్రశ్నించారు. పరకామణి కేసు హైకోర్టులో ఉందని, దానిపైన సీఐడీ విచారణకు ఆదేశించిందని చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరింది భూమన కరుణాకరరెడ్డే అని గుర్తుచేశారు. పరకామణి కేసుకు సంబంధించి కోడూరు బాలసుబ్రమణ్యం వద్ద వివరాలు తీసుకోవాలని సీఐడీకి తమ పార్టీ తరఫున వినతిపత్రం ఇస్తామన్నారు. బాలసుబ్రమణ్యం ఆధారాలు లేకుండా ఫేస్బుక్లో అబద్ధపు, బూటకపు పోస్టులు పెట్టారంటే.. ఇదివరకు వైఎస్సార్సీపీ నాయకుడు నవీన్పై పెట్టిన కేసుల్నే ఆయనపైనా పెట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీపై బాలసుబ్రమణ్యం పెడుతున్న పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేసి తమ పార్టీ నాయకుడు నవీన్కు వేసినట్లుగా ముసుగు వేసి జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపాలన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కరకంబాడి రోడ్డులో కోడూరు బాలసుబ్రమణ్యం కారుచౌకగా కొన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేశారని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెడతామని వాసుయాదవ్ చెప్పారు. -
తుపాన్పై ఆందోళన వద్దు
తిరుపతి అర్బన్: మోంథా తుపాన్పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఆయన సోమవారం కలెక్టరేట్ నుంచి మాట్లాడారు. జిల్లాలో మంగళ, బుధవారాలు వర్షాలు కురి సే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ, విపత్తుల నియంత్రణ శాఖ రెడ్ అలెర్ట్ను ప్రకటించిందని చెప్పారు. ఈ క్రమంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకోవాలని, వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని చెప్పారు. ప్రభుత్వ అధికారు లు సూచించిన వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని వెల్లడించారు. మీ పత్రాలు, సర్టిఫికెట్లు, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు, కవర్లలో ఉంచుకోవాలన్నారు. ఎలక్ట్రికల్ మెయి న్ స్విచ్ ఆఫ్ చేయాలని, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ కనెక్షన్ను తొలగించాలన్నారు. తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని హెచ్చ రించారు. ఇల్లు సురక్షితంగా లేకపోతే భారీ వర్షాలు కురవకముందే సురక్షితమైన షెల్టర్కు వెళ్లాలన్నారు. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు స్తంభాల వద్ద ఉండకూడదని తెలిపారు. పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలివేయాలని కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడ దని సూచించారు. అత్యవసర సహాయ సమాచారం నిమిత్తం జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్తో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూ రు, సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు : 112, 1070, 1800 425 0101 లకు కాల్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో అధికారులుజిల్లాకు రెడ్ అలెర్ట్ కంట్రోల్ రూమ్ నంబర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం 0877-2236007 ఆర్డీఓ కార్యాలయం, తిరుపతి 7032157040 ఆర్డీఓ కార్యాలయం, శ్రీకాళహస్తి 8555003504 ఆర్డీఓ కార్యాలయం, గూడూరు 08624-252807, 8500008279 ఆర్డీఓ కార్యాలయం, సూళ్లూరుపేట 08623295345 -
గ్రీవెన్స్ రద్దు
తిరుపతి అర్బన్: తుపాన్ నేపథ్యంలో కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ రద్దు చేస్తున్నట్లు రెండు రోజులకు ముందే అధికారులు మీడియా ద్వారా తెలియజేశారు. అయినా పలు సమస్య లు పరిష్కారం కాకపోవడంతో అర్జీదారులు పలువురు సోమవారం కలెక్టరేట్కు విచ్చేశారు. తుపాన్పై పదేపదే కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ బిజీగా ఉన్నప్పటికీ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి పంపించారు. కలెక్టర్ ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు మోంథా తుపాన్ నేపథ్యంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని డీఈఓ కేవీఎన్ కుమార్ హెచ్చరించారు. మంగళ, బుధవారాల్లో అన్ని పాఠశాలలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారని, ఆయన ఆదేశాలను పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానాలను విధిస్తామని చెప్పారు. సోమవారం కొన్ని పాఠశాలలు తరగతులు నిర్వహించినట్లు తమ దృష్టికి వచ్చిందని యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఉంది. క్యూకాంప్లెక్స్లో 8 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,021 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,894 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవాడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం
తిరుపతి మంగళం: దేశ రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వంలో జరగని ప్రజాఉద్యమం కూటమి ప్రభుత్వంలో మొదలైందని వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాటమాను రాజశేఖర్ పేర్కొన్నారు. తిరుపతి బాలాజీకాలనీలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో సోమవారం పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కోటి సంతకాల సేకరణలో వంద లాది మంది యువత, విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాటమాను రాజశేఖర్, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే పరమా వధిగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అన్నారు. అందులో భాగంగానే ప్రతి పేదవాడికీ ఉచితంగా మెరుగైన వైద్యం, పేద విద్యార్థులు సైతం ఉచిత వైద్యవిద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో కేవలం రెండేళ్లల్లో 17 మెడికల్ కాలేజీలను జగనన్న నిర్మించారన్నారు. మెడికల్ కాలేజీలన్నీ పూర్తి అయితే వైద్యవిద్యను అభ్యసించాలన్న పేద విద్యార్థుల కల నెరవేరుతుందన్నారు. అనంతరం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. పేదలకు ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను జగనన్న తీసుకొస్తే, వాటిని ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నడం దుర్మార్గమన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నుంచి 2019 వరకు రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. ఐదేళ్ల జగనన్న పాలనలో కరోనా వంటి విఫత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కేవలం రెండేళ్లల్లో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, అందులో ఏడు కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్ల దశకు తీసుకొచ్చారన్నారు. మిగిలిన పది కాలేజీలు 70 శాతం పూర్తి అయ్యాయని, వాటికి రూ.5 వేల కోట్లు ఖర్చుపెడితే పూర్తి అవుతాయని, తద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యంతో పాటు పేద విద్యార్థులు ఉచితంగా వైద్యవిద్యను అభ్యసించగలరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో సుమారు రూ. 2లక్షల కోట్లను అప్పు చేసిందని, అందులో రూ. 5వేల కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణానికి వెచ్చించలేదా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి తద్వారా రూ. వేల కోట్లును దండుకోవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణతో ప్రజాఉద్యమం ప్రారంభమైందన్నారు. కూటమి ప్రభుత్వ మెడలు వంచైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, ప్రచార కమిటీ నాయకులు కాపు ఉమ, రమణారెడ్డి, అమరనాఽథ్రెడ్డి, కిషోర్కుమార్రెడ్డి, మురళీధర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు -
గతంలో ఎప్పుడూ లేదు
10 ఏళ్ల కాలంలో ఎప్పు డూ ఏనుగులు ఇంత పెద్ద స్థాయిలో పొలాలపై దాడు లు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రెండు నెలలుగా ఏనుగులు పెద్ద ఎత్తున పంటలపై దాడులకు చేస్తూనే ఉన్నాయి. అధికారులు వచ్చి ఎన్ని చర్యలు తీసుకున్నా, ఏనుగుల దాడులు మాత్రం ఆగడం లేదు. ఏనుగుల దాడులను నివా రించేందుకు శాశ్వత పరిష్కారం చూపితే రైతులకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించి ఆ దిశగా చర్యలను చేపట్టాలి. – రాగిణి, సర్పంచ్, చిన్నరామాపురం నా నోట్లో మట్టి కొట్టాయి నేను కొన్నేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసా యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా ను. 20 రోజుల్లో చేతికి వ చ్చే వరి పంటను ఆదివా రం రాత్రి ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. సు మారు రూ.లక్ష పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట నాశనం అయ్యింది. ఇప్పుడు భూమి యజమానికి నేను ఎలా నగదు చెల్లించాలి. అటవీ అధికారులే మో పచ్చి వడ్లను కోసుకోమని సలహాలు ఇస్తున్నా రు. ఇలా ఎవరైనా చేస్తారా..? – చిన్నబ్బ, కౌలు రైతు, బూడిదగట్టువారిపల్లి 100 మీటర్లు వెళ్లి ఉంటే ప్రాణాలు పోయేవి వేరుశనగ పంటను రక్షించుకునేందుకు ఆదివారం రా త్రి నేను బైక్లో పొలం దగ్గరకు వెళ్లాను. మార్గం మధ్య లో పెద్ద ఎత్తున ఏనుగులు ఘీంకారాలు చేస్తూ, రోడ్డును దాటుతున్నాయి. వెంటనే అప్రమత్తమై బైక్ లైట్లు ఆఫ్ చేసి వెనుదిరిగి వచ్చేసి, ప్రాణాలను కాపాడుకున్నాను. అనంతరం ఏనుగుల దాడులపై గ్రామస్తులకు సమాచారం చే రవేశాను. అజాగ్రత్తగా ఉంటే నా ప్రాణాలు పోయేవి. – కృష్ణమోహన్, రైతు, కొండ్రెడ్డికండ్రిగచంద్రగిరి: అటవీ సమీప గ్రామాల్లోని ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కష్టపడి పండించిన పంటలు చేతికి అందేలోపు గజదాడుల్లో ధ్వంసం అవుతున్నాయి. ఏడాది పొడవునా ఏనుగుల దాడులతో రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గజరాజులు ఏకంగా గ్రామాల్లోకి చొరబడడంతో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నెల రోజులుగా మదపుటేనుగులు గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్నా అటవీ అధికారు లు చోద్యం చూస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రాణం బలికాకముందే ఏనుగుల సంచారాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు. చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె పరిసర గ్రామాల్లో ఏనుగుల దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. ప్రతిరోజూ రాత్రి వేళల్లో ఏనుగులు గ్రామ సమీపంలోని పంటలపై దాడులు చేయడం పరిపాటిగా మారుతోంది. మండలంలోని చిన్నరామాపురం, భీమవరం, కొండ్రెడ్డికండ్రిగ, బూడిదగట్టువారిపల్లి, యల్లంపల్లి గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అటవీ అధికారులు అటువచ్చి, ఇటు వెళుతున్నారే తప్ప, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత జనవరిలో ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ మరణించారు. ఈ క్రమంలో మరో ప్రాణం బలికాక ముందే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సోమవారం మరోసారి వరి, మామిడి పంటల ధ్వంసం బూడిదగట్టువారిపల్లిలోని పొలాల్లో పంటలను ఏనుగులు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేసినట్లు గుర్తించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు, గ్రామస్తులు సంయుక్తంగా ఏనుగులను తరిమేందుకు యత్నించారు. డప్పులు వాయిస్తూ, బాణసంచా పేల్చుతూ వాటిని బెదరగొట్టారు. ఈ లోపే ఓ కౌలు రైతుకు చెందిన వరి పంటను పూర్తిగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి యల్లంపల్లిలోని మరో ఇద్దరి రైతుల పొలాల్లోకి వెళ్లాయి. మామిడితోట ప్రహరీ గేట్లు, టేకు చెట్లతోపాటు ఫెన్సింగ్ను పూర్తిగా ధ్వంసం చేశాయి. ప్రాణభయంతో పరుగులు తీశాం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమ యంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. ఈ క్రమంలో మా పెంపుడు కుక్క పెద్ద ఎత్తున అరిచింది. వెనక్కి తిరిగి చూస్తే సుమారు 8 ఏనుగుల మంద గ్రామంలోకి వచ్చేసింది. వెంటనే నేను, నా కోడలు ఇంట్లోకి పరుగులు తీసి, తలుపు గడియ పెట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాం. ఏనుగులు మమల్ని చూసి ఉంటే దాడికి పాల్పడేవి. 20 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఏనుగుల మంద గ్రామంలోకి వచ్చిన సందర్భాలు లేవు. అధికారులు ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలి. – చేకూరి సిద్ధమ్మ, చిన్నరామాపురం మామిడి తోటలో వీరంగం చేశాయి నాకు, మా అక్కకు చెంది న మామిడి తోటల్లో ఏనుగులు వీరంగం చేశాయి. ఏనుగుల మంద దారి మళ్లి మా పొలాలపై పడ్డా యి. తోటకు రక్షణగా ఏర్పాటు చేసిన గేటును పూర్తిగా ధ్వంసం చేసి, విసిరి పడేశాయి. అక్కడ నుంచి మరో తోటలోకి వెళ్లి ఫెన్సింగ్ను తొక్కుకుంటూ అటవీలోకి వెళ్లిపోయాయి. ఈ ఏనుగుల మంద కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. వ్యవసాయాన్నే నమ్ముకున్న మాకు వేరే బతుకు మార్గం తెలియదు. మాపై ప్రభుత్వం కరుణ చూపి ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలి. లేకుండా అప్పుల పాలై కుటుంబం రోడ్డున పడడం తప్పదు. – నాగేశ్వరమ్మ, మహిళా రైతు, యల్లంపల్లి 15 రోజులుగా పంటలపై గజదాడులు గ్రామాల్లో స్వైరవిహారం ఆదివారం తెల్లవారుజామున సుమారు 8 ఏనుగుల మంద చిన్నరామాపురంలోకి రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం పశువుల వద్దకు వెళ్లిన, పాడి రైతులు పరుగున ఇళ్లలోకి వచ్చి, తలుపులు వేసుకున్నారు. ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగుల గుంపు చిన్నరామాపురంలోకి చేరుకుని పెద్ద ఎత్తున ఘీంకరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అనంతరం గ్రామం వెనుక ఉన్న పొలాల్లోకి వెళ్లి పంటలను నాశనం చేశాయని వాపోయారు. -
తెలుగుగంగలో గల్లంతైన బాలుడి మృతి
వరదయ్యపాళెం: తెలుగుగంగ కాలువలో గల్లంతైన బాలుడు మహిత్ శవమై తేలాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. రెండో తరగతి చదువుతున్న బాలుడు మహిత్ ఆదివారం సాయంత్రం కారు కడిగేందుకు తన తాత బాబు వెంట ఉబ్బలమడుగు సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్దకు వెళ్లి గల్లంతైన ఘటన తెలిసిందే. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం బీఎన్కండ్రిగ సీఐ తిమ్మయ్య, ఎస్ఐలు హరిప్రసాద్, మల్లికార్జున ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉబ్బలమడుగు ప్రధాన ముఖద్వారం నుంచి సత్యవేడు వైపుగా వెళ్లే తెలుగుగంగ కాలువలో 120వ కి.మీ సమీపంలో బాలుడు మహిత్ మృతదేహం కాలువ అంచులో ఉన్న చెట్ల పొదల్లో ఇరుక్కుని ఉండగా అటుగా వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బృందం గుర్తించింది. దీంతో వారి సహకారంతో బాలుడి మృత దేహాన్ని కాలువ గట్టుపై చేర్చారు. వివరాలు నమోదు చేసుకుని శవపంచనామా నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాలుడు మహిత్తోపాటు తెలుగుగంగ కాలువలో గల్లంతైన డ్రైవర్ షరీఫ్ ఆచూకీ లభ్యం కాలేదు. -
వెంకటగిరిని వీడే ప్రసక్తే లేదు
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిపై ఇటీవల ఓ ఛానల్లో వచ్చిన వ్యాఖ్యలపై నేదురుమల్లి ఘాటుగా స్పందించారు. పట్టణంలోని 8వ వార్డులో సోమవారం జరిగిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ తనకు ప్రమోషన్ వచ్చిందని, ఢిల్లీకి పోతానని, ఓ ఛానల్లో దుష్ప్రచారం చేయడం సమంజం కాదన్నారు. వెంకటగిరి ప్రజానికాన్ని వదిలి ఢిల్లీకి కాదు కదా ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు ఎళ్లవేలా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై సుముఖంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే బరిలో నిలవనున్నట్లు తెలిపారు. ఫేక్ న్యూస్లు సృష్టించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. వెంకటగిరి నియోజకవర్గం తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని, ఆ బంధం అలానే నేదురుమల్లి వారసుడిగా కొనసాగిస్తానని చెప్పారు. -
మోంథా.. కలవరింత
వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం తీవ్ర వాయుగుండంగా మారడంతో సముద్రం అల్లకల్లోలమై, తీరం కోతకు గురవుతోంది. దీంతో జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకారులు, ప్రజల్లో వణుకు పుట్టుకొస్తుంది. జిల్లా అంతటా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చలిగాలులు వీస్తున్నాయి. తిరుపతి జిల్లాలోని వాకాడు, కోట, చిల్లకూరు, తడ, సూళ్లూ రుపేట మండలాల్లో 75 కిలోమీటర్ల పొడవున ఉన్న సముద్ర తీరంలో 58 తీరప్రాంత గ్రామాలున్నాయి. అందులో 4,879 కుటుంబాలు సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ కొట్టుమిట్టాడుతున్నారు. సముద్ర తీరం వెంబడి భీకరమైన శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఆయా గ్రామాల ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లా సైక్లోన్ స్పెషల్ ఆఫీసర్గా అరుణ్బాబును నియమించారు. మోంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. దుగ్గరాజపట్నం మైరెన్ పోలీసులు సముద్రానికి కిలో మీటరు దూరంలోనే భద్రతా బారికేడ్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. స్పెషల్ ఆఫీసర్ అరుణ్బాబుతోపాటు మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మైరెన్ ఉన్నతాధికారులు తన సిబ్బందితో తీర ప్రాంత మండలాల్లో పర్యటించి ప్రజ లను అప్రమత్తం చేస్తున్నారు. ఆక్వా రైతుల గుండెల్లో మోంథా తుపాన్ దడపుట్టిస్తుంది. ఈ క్రమంలో రైతులు తమ చెరువులను ఖాళీ చేసే క్రమంలో తక్కువ కౌంటుతోనే రొయ్యలను పట్టుకుని వచ్చిన వరకు సొమ్ము చేసుకుంటున్నారు. విద్యుత్ శాఖ అప్రమత్తం తిరుపతి రూరల్: మోంథా తుపాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఇప్పటికే ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించారు. నెల్లూరు సర్కిల్కు ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ జె.రమణా దేవి, తిరుపతి సర్కిల్కు చీఫ్ జనరల్ మేనేజర్ పి.సురేంద్ర నాయుడు, చిత్తూరు సర్కిల్కు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. ఉమాపతిని నియమించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని సర్కి ల్స్, డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పా టు చేసినట్టు తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపడడం వంటి సంఘటనలు గుర్తిస్తే విద్యుత్ శాఖ సిబ్బందికి గానీ, టోల్ ఫ్రీ నంబర్ 1912, 1800425155333కు కాల్ చేసి సమాచారం అందజేయాలన్నారు. అలాగే సంస్థ వాట్సాప్ నంబర్ 9133331912కు చాట్ చేయాలని సూచించారు. రాయలచెరువును పరిశీలిస్తున్న అధికారులు మల్లెమడుగు గేట్ల ఎత్తివేత రేణిగుంట: మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సోమవారం అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రస్తుతం ఎగువ భాగం నుంచి 700 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులకు తెలిపారు. పెరుగుతున్న రాయలచెరువు నీటిమట్టం -
వాహనం ఢీ కొని రెండు గేదెలు మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని పల్లమాల గ్రామం వద్ద కేటీ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీ కొని రెండు గేదెలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, పాలు ఇచ్చే గేదెలు మృతి చెందడంతో పాడి రైతు గోపాల్రెడ్డి లబోదిబోమన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి నాయుడుపేట టౌన్ : మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ప్రత్యేక అధికారి అరుణ్బాబు ఆదేశించారు. ఆయన సోమవారం సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయితో కలిసి నాయుడుపేట రెవెన్యూ కార్యాలయలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. అనంతరం తహసీల్వార్ రాజేంద్ర, ఎంపీడీఓ సురేష్ బాబు, సీఐ బాబి, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా తదితరులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణముఖి నది, మామిడి కాలువ నీటి ప్రవాహంతోపాటు చెరువుల పరిస్థితిపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను తీవ్రమైతే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. -
సియోల్లో శ్రీసిటీ బృందం
శ్రీసిటీ (వరదయ్యపాళెం): విదేశీ పెట్టుబడులు, వ్యాపార విస్తరణలో భాగంగా శ్రీసిటీ మార్కెటింగ్ బృందం సోమవారం కొరియాలో పర్యటించింది. ఈ సందర్భంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.శివశంకర్ నేతృత్వంలో సియోల్లోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ మిషన్ చీఫ్ నిషికాంత్ సింగ్, జపాన్ ఉన్నతాధికారులను కలిసి, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతి, 31 దేశాలకు చెందిన 240కు పైగా పరిశ్రమలను ఆకర్షించడంలో శ్రీసిటీ కీలక పాత్రను తెలియజేశారు. ఎల్జీ, సోలుమ్, హ్యుందాయ్ ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్ (హెచ్డీసీ), ఎస్కే ప్యుకోర్, ఎల్జీ పాలిమర్స్ వంటి ప్రముఖ కొరియన్ కంపెనీలు ఇప్పటికే శ్రీసిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వారికి వివరించారు. -
హౌసింగ్ ఏఈపై కేసు నమోదు
బాలాయపల్లి(సైదాపురం): ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళ కండెక్టర్పై దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణతో వెంకటగిరి హౌసింగ్ ఏఈ శ్రీనివాసులపై కేసు నమోదు చేసినట్లు బాలాయపల్లి ఎస్ఐ గోపి తెలిపారు. వెంకటగిరి– గూడూరు మార్గంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు బస్సులోని మహిళా కండెక్టర్ కస్తూరమ్మతో దురుసుగా ప్రవర్తించడం, విధులకు అడ్డుపడడంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెధిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ మేరకు కండెక్టర్ బాలాయపల్లి పోలీసులు స్టేషన్ వద్ద బస్సు ఆపి, శ్రీనివాసులను పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు. -
‘టీటీడీ ఒత్తిడికి ఆగమశాస్త్ర సలహాదారులు తలొగ్గారు’
తిరుపతి: తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని రెండు రోజులకే పరిమితం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తప్పుబట్టారు. గత వైఎస్సార్సీపీ హయాంలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని 26 మంది పీఠాధిపతుల ఆగమ సలహాల మేరకు 10 రోజుల దర్శనం ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని రెండు రోజులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు. ఆ రోజు పీఠాధిపతులు ఇచ్చిన సూచనలు ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మొత్తం 32 మంది ప్రముఖులతో చర్చించిన తర్వాతనే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం 10 రోజులపాటు ఉండే విధంగా ఏర్పాటు చేశామన్నారు.2020లో జగన్ సీఎంగా ఉండగా పదిరోజులు పాటు వైకుంఠ ఏకాదశి పదిరోజులు దర్శనం అందుబాటులోకి తీసుకువచ్చాం. కృష్ణ మూర్తి వైద్యనాధన్ అప్పుడు బోర్డు సభ్యులు ఆనాడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. శృంగేరీ మఠం, ఆండవాన్ వన్ మఠం, త్రిదండి ,ఉత్తరాది, వ్యాసారాజ మఠం, పేజావర్ మఠం, అహోబిల మఠం పీఠాధిపతులు సూచనలు సలహాలు తీసుకునే ఈ నిర్ణయం ఆనాడు తీసుకున్నాం. ద్రావిడ సంప్రదాయం అంటూ కొత్తపల్లవి అందుకున్నారు. 12 మంది ఆళ్వారులు స్వామి వారిని కీర్తి, నారాయణ దివ్య ప్రబంధంగా ఇప్పటికీ నిరంతరం కొనసాగుతున్న పక్రియ. ద్రావిడ సంప్రదాయం కొనసాగించవద్దు అని వితండ వాదం చేస్తున్నారు ప్రస్తుత టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత ఏడాది 6మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, మీ పరిపాలన లోపం వల్ల జరిగింది. తిరుమలలో 10 సార్లు, 12 సార్లు ఏడాదికి జరిగేవి, కాలానికి అనుగుణంగా పూర్వ కాలం నిర్ణయాల్లో మార్పులు వచ్చాయి. మీ నిర్ణయం వల్ల 10 లక్షల మందికి వైకుంఠ ఏకాదశి దర్శనం దూరం చేస్తున్నారు. మీ ఒత్తిడి వల్లే ఆగమ శాస్త్ర సలహాదారులు తలొగ్గారు, రెండు రోజులకు తగ్గించాలనే అలోచన మానుకోవాలి. స్థానికులకు దైవ దర్శనం దూరం చేయాలని చూస్తున్నారు, నాలుగేళ్లు పదిరోజులు పాటు వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం లక్షలాది మందికి మేము సమర్ధవంతంగా నిర్వహించాము. శ్రీరంగం తరువాత తిరుమల లో పదిరోజులు పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అందుబాటులోకి తీసుకు వచ్చాం. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్న ఈవోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. శ్రీరంగం ద్రావిడ సంస్కృతి అంటూ తెరపైకి తీసుకు వస్తున్నారు. రెండు రోజులకే కుదించాలని చేస్తున్న కుట్ర మానుకోవాలి. రెండు రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్వనం 110 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే’ అని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. -
‘పాపవినాశనం’లో గంగ పూజ
తిరుమల : తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పాపవినాశనం డ్యామ్ వద్ద టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు హారతి సమర్పించారు. ఆయన మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు 95 శాతం నిండిపోవడం శుభ పరిణామమన్నారు. పాపవినాశనం, గోగర్భం డ్యామ్ లు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజూ 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుందని, తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యామ్ల నుంచి 25 లక్షల గ్యాలెన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు. తిరుమలలో 250 రోజుల అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. డ్యామ్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ శాఖను అభినందించారు. అలాగే టీటీడీ చరిత్రలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు. గడిచిన 11 నెలల కాలంలో టీటీడీ ట్రస్టులకు రూ.918 కోట్లు విరాళాలు అందినట్లు వివరించారు. కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ఈఈలు సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, సుధాకర్, డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు. -
కొర్లగుంటలో కార్డన్ సర్చ్
తిరుపతి క్రైమ్: కొర్లగుంటలో ఈస్ట్ పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సుమారు 40 మంది సిబ్బంది పాల్గొని ప్రతి ఒక్కరూ డీటెయిల్స్ను సేకరించారు. పది మంది రౌడీషీటర్ల ఇళ్లు తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను గుర్తించి, సరైన ఆధారాలను చూపించిన అనంతరం వారిని విడుదల చేశారు. అదేవిధంగా 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను సీజ్ చేశారు. వాటికి జరిమానా విధించి వదిలేశారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని చుట్టుపక్కల ప్రజలకు తెలిపారు. ఆర్టీసీ బస్సులో బంగారం, నగదు పోగొట్టుకున్న మహిళ నాగలాపురం: మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో 3 సవర్ల బంగారు, రూ.5 వేల నగదు పోగొట్టుకుంది. పోలీసుల కథనం మేరకు.. వెల్లూరు గ్రామానికి చెందిన లేట్. చెంగమ నాయుడు భార్య నీలమ్మ(62) శనివారం ఉదయం తమిళనాడులోని తిరువళ్లూరులో ఉంటున్న కూతురు ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం తిరువళ్లూరు నుంచి బస్సులో నాగలాపురం బయలుదేరింది. ఊత్తుకోటలో నాగలాపురానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఉచిత ప్రయాణం కోసం తన ఆధార్ కార్డును పర్సు నుంచి తీసి కండక్టరుకు చూపించింది. రద్దీ ఎక్కువగా వుండడంతో కారణి వరకు నిలబడి ప్రయాణించింది. నాగలాపురం బస్టాండులో దిగిన తరువాత తన బ్యాగులో ఉన్న పర్సు కనిపించలేదు. బస్సులో పడి ఉండవచ్చని, అందులో 3 సవర్ల బంగారు, రూ.5 వేలు నగదు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
పోలియో రహిత ప్రపంచమే లక్ష్యం
చంద్రగిరి: పోలియో రహిత ప్రపంచమే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ బెంగళూరు రోటరీ క్లబ్ సభ్యులు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం చంద్రగిరికి చేరుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వరకు సైకిల్పై యాత్ర సాగిస్తూ పోలియో మహమ్మారి నిర్మూలనే ధ్యేయంగా పది మంది సైకిల్పై యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రగిరి కోట వద్ద పలువురు పర్యాటకులకు పోలియో నిర్మూలన ప్రాధాన్యతను వివరించారు. రోటరీ క్లబ్ బెంగళూరు జిల్లా గవర్నర్ బీఆర్ శ్రీధర్ మాట్లాడుతూ మన దేశంలో 12 ఏళ్లుగా పోలియో కేసులు నమోదు కాలేదన్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో ఇప్పటికీ పోలియో కేసులు నమోదవున్నాయని వెల్లడించారు. ప్రపంచమంతా పోలియో రహితంగా మారడమే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యమని వివరించారు. క్లబ్ ప్రతినిధులు హేమచంద్ర, రాజేంద్ర శెట్టి, సోము రవికుమార్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం
తిరుపతి అర్బన్ : ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని, ఈ అంశాన్ని ప్రజలు గుర్తించాలని డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్(డీసీటీఎం) మేనేజర్ విశ్వనాథం తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరమన్నారు. జిల్లాలోని 11 ఆర్టీసీ డిపోల్లో 955 ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. అందులో 122 ఏసీ బస్సులు ఉన్నాయని చెప్పారు. అలిపిరి డిపో నుంచి 100 విద్యుత్ బస్సులు నడుస్తున్నాయన్నారు. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో అగ్నిప్రమాద సంభవిస్తే వెంటనే మంటలను అదుపు చేసే పరికరాలు ఉన్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో అద్దాలు పగులగొట్టేందుకు వీలుగా ప్రత్యేక సామగ్రి ఉందని వెల్లడించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ప్రధానంగా డ్రైవర్లు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారా తెలుసుకోవడానికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 55 ఏళ్ల పైబడిన వారిని పల్లెవెలుగు బస్సుల్లో డ్యూటీలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీసీ డ్రైవర్లకు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. డ్యూటీకి వెళ్లేప్పుడు తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే నిత్యం 300 బస్సులు ప్రమాదకరమైన తిరుమల ఘాట్లో సురక్షితంగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
హాస్టల్ ఉద్యోగి మృతి
తిరుపతి సిటీ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల హాస్టల్లో కుక్గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి టి.ముద్దు కృష్ణ ఆదివారం గుండోపోటుతో మృతి చెందారు. ఉదయం విధులకు హాజరైన ఆయన వంటగదిలో ఆవిరి ముఖానికి తాకడంతో ఊపిరాడక గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. అధికారులు వంటగదిలో తగిన సదుపాయలు కల్పించడంలో విఫలమయ్యారని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీ నగర్కు చెందిన ముద్దుకృష్ణకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నట్లు సమాచారం. ఆయన మరణంతో కుటుంబంలో భార్య, పిల్లలు అనాథలుగా మారారు. వారి కుటుంబీకుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. పని ఒత్తిడితోనే .. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై పని భారం అధికమవడంతో ఒత్తిడికి గురై ప్రాణాలు వదులుతున్నారు. మరికొందరు దీర్ఘకాలిక వ్యాధులతో అనారోగ్యాలకు గురై విధుల నుంచి తప్పుకుంటున్నారు. పలు విద్యా సంస్థలలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఘటనలు జరిగినా టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్కో హాస్టల్ వంటశాలలో కనీసం 15 మందికి పైగా పనిచేయాల్సి ఉండగా కేవలం 5 నుంచి ఏడుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై పని ఒత్తిడి అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. రూ.25లక్షల పరిహారానికి డిమాండ్ పద్మావతి డిగ్రీ కళాశాల హాస్టల్ ఉద్యోగి మరణానికి పని ఒత్తిడే కారణమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం ఆరోపించారు. ముద్దు కృష్ణ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని, వారి కుటుంబంలో ఒక్కరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఊరూరా.. నారావారి సారా!
తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన వైన్ షాపుతిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నారా వారి సారా ఏరులై పారుతోంది. నిబంధనలు బేఖాతర్ చేస్తూ ఎక్కడబడితే అక్కడ మద్యం దొరుకుతోంది. జాతీయ రహదారులు, గుడి, బడి తేడాలేకుండా వైన్షాపులు, బెల్టు దుకాణాలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. రాత్రింబవళ్లు కొన్ని చోట్ల బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం విక్రయాలు సాగుతుండడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. – సాక్షి, నెట్వర్క్ తిరుపతి కేటీ రోడ్డులో గుడి పక్కనే వైన్షాపుఏర్పేడులో వేళాపాళా లేకుండా మద్యం అమ్మకాలు -
ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
తిరుపతి రూరల్ : విద్యుత్ సంస్థల్లోని ఇంజినీర్లందరూ ఐక్యమత్యంతో పోరాటం చేస్తేనే సమస్యల పరిష్కారం సాధ్యమని ఏపీఎస్ఈబీ ఇంజినీర్లు సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శామ్యూల్, ప్రధానకార్యదర్శి నాగప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ ఇంజినీర్ల సంఘం ఏర్పాటు చేసి 50 ఏళ్లు గడిచాయని తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమష్టి పోరాటాలతోనే అనేక సమస్యలను పరిష్కరించుకున్నామని వెల్లడించారు. ఖాళీగా ఉన్న ఏఈల పోస్టుల భర్తీకి యాజమాన్యాలతో చర్చలు సాగిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఉద్యోగోన్నతులు, నూతన జిల్లాలకు అదనపు పోస్టులు మంజూరు, కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన వంటి సమస్యలపై పోరాడనున్నట్లు వివరించారు. అత్యవసర సమయాల్లో కష్టపడిన ఇంజినీర్లకు తగిన గౌరవం, గుర్తింపు లభించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర నేతలను డిస్కం యూనియన్ నేతలు సత్కరించారు. నేతలు కేవీ రామారావు, డి.నాగరాజు, కృష్ణప్రసాద్, లక్ష్మణరావు, జయప్రకాష్, మునిప్రసాద్, ఆంజనేయులు, రమేష్, సతీష్ వెంటకలక్ష్మి, స్వాతి పాల్గొన్నారు. నిబంధనలు పాటించని బస్సులు సీజ్ తిరుపతి మంగళం : నిబంధనలు పాటించకుండా రాకపోకలు సాగిస్తున్న 13 ప్రైవేట్ బస్సులను రవాణాశాఖ, పోలీస్ అధికారులు సీజ్ చేశారు. ఆదివారం ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చిన ప్రైవేట్ బస్సులను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన 13 బస్సులను సీజ్ చేశారు. 27 వాహనాలపై కేసు నమోదు చేశారు. అధికారులు మాట్లాడుతూ ధ్రువీకరణ పత్రాలతోపాటు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. అలాగే సురక్షిత ప్రయాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కొరప్రాటి మురళీమోహన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బస్సులను మంగళం ఆర్టీసీ డిపోకు తరలించారు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, నగర డీఎస్పీ భక్తవత్సలం, ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం, సీఐలు, మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, మోహన్ కుమార్, ఆంజనేయ ప్రసాద్, ఆంజనేయ వర్మ పాల్గొన్నారు. -
సముద్రం..అల్లకల్లోలం
వాకాడు: మోంథా తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద ఆదివారం సముద్రపు కెరటాలు ఎవ్వెత్తున 5 మీటర్ల వరకు ఎగసి పడుతున్నాయి. అలాగే దాదాపు 15 మీటర్లు వరకు సముద్రం ముందుకు రావడంతో తీరం కోతకు గురైంది. వాతావరణ మార్పులతో తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారుల ఆదేశాలతో మత్స్యకార కాపులు సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కు పిలిపించారు. మరో నాలుగు రోజులపాటు ఎవరూ వేటకు వెళ్లకూడదని మత్స్యశాఖ జిల్లా అధికారులు ఆదేశించారు. మండలంలోని 14 గ్రామాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు తమ బోట్లు, వేట సామగ్రిని ఒడ్డుకు చేర్చి లంగరు వేశారు. ఈ క్రమంలోనే తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఎంపీడీఓ సాయిప్రసాద్, మైరెన్ అధికారులు తమ సిబ్బందితో ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పర్యాటకులు సముద్రం వద్దకు రాకుండా నిఘా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
అత్యంత అప్రమత్తత అవసరం
వాకాడు : మోంథా తుపాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని, అధికారులందరూ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించడం అవసరమని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఆదివారం వాకాడు మండలంలో మంపునకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాలను సందర్శించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ స్వర్ణముఖి బ్యారేజ్లో వరద ఉధృతిని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్యారేజ్ గేట్లకు ఏమైనా మరమ్మతులు ఉంటే తక్షణమే చేయించాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మూడు రోజుల పాటు సుమారు 90 నుంచి 100 కిలోమీటర్లు వేగంతో గాలులు, అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదముందన్నారు. జిల్లాలో 75 కిలోమీటర్లు సముద్ర తీరం విస్తరించి ఉందని, అందులో చిల్లకూరు. కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట తీర ప్రాంత మండలాలు ఉన్నాయని తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో ఈ ఐదు మండలాల్లో 60 నుంచి 70 కిటోమీటర్లు వేగంతో గాలులతోపాటు అతి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసిందని వెల్లడించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీ య ఘటనలు చోటు చేసుకోకుండా కంట్రోలు రూమ్లతోపాటు తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అవసరాలకు అనుగుణంగా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సోమవారం నుంచి మూడు రోజులు పాటు ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువుల పరిశీలన ఏర్పేడు : మండలంలోని జంగాలపల్లె, పల్లం చెరువులను కలెక్టర్ వెంకటేశ్వ, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలసి పరిశీలించారు. జంగాలపల్లె చెరువు కలుజు వద్ద తాత్కాలికంగా నిర్మించిన రింగ్బండ్ కొట్టుకుపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పల్లం చెరువు కట్ట బలోపేతం చేయాలని సూచించారు. ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, తహసీల్దార్ భార్గవి, ఎంపీడీఓ సౌభాగ్యమ్మ పాల్గొన్నారు. స్వర్ణముఖి పొర్లు కట్టలను పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్ సురక్షిత ప్రాంతాలకు పరీవాహక ప్రజలు కోట : స్వర్ణముఖి పొర్లుకట్టలు బలహీనంగా ఉన్న క్రమంలో పరీవాహక గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆదివారం కోట మండలం దైవాలదిబ్బ, దొరువుకట్ట ప్రాంతంలో స్వర్ణముఖి నది పొర్లు కట్టలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది కోతకు గురైన పొర్లు కట్టలకు మరమ్మతులు చేపట్టలేదని, భారీ వరదవస్తే 10 గ్రామాలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు విన్నవించారు. దీంతో కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వరదల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. పొర్లు కట్టల ఆధునికీకరణ కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. తహసీల్దార్ జయజయరావు, డీటీ మల్లికార్జున్ పాల్గొన్నారు. -
‘ప్రైవేటీకరణ వద్దు’ పుస్తకావిష్కరణ
తిరుపతి సిటీ : మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతిలోని యూటీఎఫ్ కార్యాలయంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ రచించిన పీపీపీ పేరుతో మెడికల్ కళాశాల ప్రవేటీకరణ వద్దు అనే పుస్తకం ఆవిష్కరించారు. వక్తలు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణతో అనుబంధ ఆస్పత్రులు సైతం ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు వైద్య సేవలు పూర్తిగా దూరమవుతాయని మండిపడ్డారు. ఎంబీబీఎస్ చేయాలనుకున్న గ్రామీణ విద్యార్థులు తీవ్రస్థాయిలో నష్టపోతారని ఆరోపించారు. జేవీవీ నేత బిర్లా నాయుడు, యూటీఎఫ్ నేతలు ముత్యాల రెడ్డి, మధు, రామచంద్రా రెడ్డి, నాగరాజా పాల్గొన్నారు. -
‘పాపవినాశనం’లో గంగ పూజ
తిరుమలలోని పాపవినాశనంలో డ్యామ్ పూర్తిస్థాయిలో నిండడంతో గేట్లు తెరిచి నీటికి దిగువకు విడుదల చేశారు.లగేజీ కౌంటర్లలోనూ.. ఆలయంలోని లగేజి కౌంటర్లలోనూ నిర్ణీత ధరల కంటే రెండు రెట్లు అదనంగా భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై భక్తులు ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు తెగబడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆలయ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా భక్తులను దోచుకుంటున్నారు. ఇప్పటికై నా కొలువుదీరిన నూతన పాలకమండలి అయినా ఈ అక్రమాలపై దృష్టి పెట్టి, భక్తులను కాపాడాల ని పలువురు కోరుతున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రం పవిత్రతను పరిరక్షించాలని సూచిస్తున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
తిరుపతి రూరల్ : మోంథా తుపాను నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఈ క్రమంలోనే సెలవులను రద్దు చేశామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ స్పష్టం చేశారు. ఆదివారం సదరన్ డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల ఇంజినీరింగ్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి నుంచి సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్తు సబ్ స్టేషన్లలో మూడు రోజుల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుకే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సెలవులు రద్దు చేసినట్టు వెల్లడించారు. తుపాను ప్రభావం తగ్గేవరకు సీజీఎం స్థాయి అధికారులు ఒక్కో జిల్లాను మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని ఆదేశించారు. -
హర్షిత్రెడ్డికి మరింత బాధ్యత
తిరుపతి రూరల్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మరింత బాధ్యతలు అప్పగించారు. పార్టీ విద్యార్థి విభాగం జోన్–4 కింద ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఆదివారం ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలో పలువురు నేతలు, విద్యార్థి విభాగం నాయకులు పెద్దసంఖ్యలో చెవిరెడ్డి నివాసానికి చేరుకుని హర్షిత్రెడ్డికి అభినందనలు తెలిపారు. హర్షిత్రెడ్డి, మోహిత్రెడ్డిని ఘనంగా సత్కరించారు. మోహిత్రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణను విద్యార్థి విభాగం నేతలు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, నేతలు చెంగల్ రెడ్డి, వినోద్ కుమార్, యశ్వంత్ రెడ్డి, శేషారెడ్డి, వీర నాగేందర్, వెంకటరమణ నాయక్, రెడ్డి ప్రసాద్ నాయుడు, కత్తి నాగార్జున, కరుణాకర్, కాజాపీర్, వినోద్, శ్రీకాంత్, హరికృష్ణ, శివ, శేఖర్, రెడ్డి నాయక్, సాగర్ నాయక్ పాల్గొన్నారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 21 కంపార్ట్ మెంట్లు నిండి బయట్లలో వేచి ఉన్న భక్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 82,010 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,634 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 3.58 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. -
నాగలాపురంలో మహిళ హత్య
నాగలాపురం: స్థానిక బీసీ కాలనీలో నివసిస్తున్న మునిలక్ష్మి (55) అనే మహిళ శనివారం దారుణ హత్యకు గురైంది. వివరాలు.. భర్త మరణించడంతో మునిలక్ష్మి ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. ఓ హోటల్లో పనిచేసుకుంటూ పొట్టపోసుకునేది. శుక్రవారం యథావిధిగానే హోటల్కు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంది. శనివారం ఉదయం హోటల్కు రాక పోవడంతో యజమాని పక్కింటి వాళ్లకి ఫోన్ చేశాడు. వారు ఆమె కోసం వెళ్లగా ఇంట్లో మునిలక్ష్మి విగత జీవిగా పడివుంది. గొంతు వద్ద గాయం ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ రవికుమార్, సీఐ రవీంద్ర, ఎస్ఐ సునీల్, శిక్షణ ఎస్ఐ ప్రసాద్, పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు , తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బంగారం కోసమేనా..? మునిలక్ష్మి మెడలో బంగారు గొలుసు, చేతికి వేలుకి ఉన్న ఉంగరం కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం రాత్రి ఒక మహిళ, పురుషుడు ఆమె ఇంట్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. మునిలక్ష్మిని హత్య చేసి ఆనవాళ్లు చెరిపేసేందుకు ఇంట్లో కారప్పొడి సైతం చల్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డాగ్ స్క్వాడ్, వేలి ముద్ర నిపుణులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. -
విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి మృతి
చంద్రగిరి: విద్యుత్ తీగలు పట్టుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం అర్థరాత్రి తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలోని తనపల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి తనపల్లిలోని ఓ విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు. ఆపై విద్యుత్ తీగలను పట్టుకోవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెంది, తలకిందులుగా వేలాడాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయినాథ్ చౌదరి తెలిపారు. -
ప్రయాణికుల భద్రతే ప్రధానం
తిరుపతి క్రైం:ప్రయాణికుల భద్రతే ముఖ్యమని అదనపు ఎస్పీ రవిమనోహర్ ఆచారి, డీటీఓ మురళీమోహన్ తెలిపారు. కర్నూలు ఘటన నేపథ్యంలో ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ప్రయివేటు ట్రావెల్స్ను ముమ్మరంగా తనిఖీ చేశారు. ప్రమాద సమయంలో అత్యవసర తలుపులు సరిగా పనిచేస్తున్నాయా లేదా..? గాజు బ్రేకర్లు, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉన్నాయా లేదా..? బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ లైసెన్సులు, అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేవా అని నిర్ధారించారు. లగేజ్ కంపార్ట్మెంట్లలో మండే పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువులు రవాణా అవుతున్నాయోలేదో చెక్ చేశారు. డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనల ప్రకారం పత్రాలు కలిగి ఉన్నారో లేదో పరిశీలించారు. . నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో శాంతిభద్రతల ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ ఆచారి పాల్గొన్నారు. -
ఎర్రచందనం పట్టివేత
బాలాయపల్లి(సైదాపురం) : మండలంలోని అలిమిలి వద్ద ముళ్లపొదల్లో దాచి ఉంచిన 10 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ సిబ్బంది భవానీ, అశోక్, గిరి పాల్గొన్నారు. రైలు కింద పడి వ్యక్తి మృతి తిరుపతి క్రైమ్ : తిరుపతి రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి (45) రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. కొల్హాపూర్ వెళ్లే హరిప్రియ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఐదో నంబర్ ప్లాట్ఫామ్పై నుంచి జారి రైలు కింద పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడ్డాడు. మృతుడి వివరాలు తెలియలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించామని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు సమాచారం తెలిసిన వారు 9440627638 నంబర్ను సంప్రదించాలని కోరారు. కనుమలో లారీ బోల్తా చంద్రగిరి : తిరుపతి–పీలేరు జాతీయ రహదారిపై భాకరాపేట కనుమ వద్ద శనివారం వేకువజామున ఓ లారీ బోల్తా పడింది. వివరాలు.. పీలేరు నుంచి టమాట లోడ్తో వస్తున్న లారీ కనుమలోని పెద్ద మలుపు వద్ద అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. అయితే లారీ డ్రైవరు, క్లీనర్లు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వెనుక వచ్చే వాహనాలను దారి మళ్లించారు. అనంతరంయంత్రాల సాయంతో లారీను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు బస్సులో వ్యక్తి మృతి నాయుడుపేటటౌన్ : చైన్నె నుంచి నెల్లూరు వెళుతున్న తమిళనాడు బస్సులో ఎల్లసిరి శ్రీనివాసులు(42) అనే వ్యక్తి గుండెపోటుతో శనివారం సాయంత్రం మృతి చెందారు.వివరాలు.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెంది శ్రీనివాసులు సూళ్లూరుపేటలో తమిళనాడు బస్సు ఎక్కి గూడూరుకు టికెట్ తీసుకున్నారు. పండ్లూరు సమీపంలో వచ్చేసరికి శ్రీనివాసులు అచేతనంగా పడిపోయారు. కండక్టర్ ధనంజయులు సమాచారం మేరకు 108 సిబ్బంది చేరుకుని శ్రీనివాసులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ప్రయాణికులను తమిళనాడు చెందిన మరో బస్సులో నెల్లూరుకు చేర్చారు. శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాను ప్రమాదం.. అప్రమత్తం
తిరుపతి అర్బన్ : మోంథా తుపాను ముంచుకొస్తోందని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శనివారం తన నివాసం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ మౌర్య, డీఆర్ఓ నరసింహులు ఇతర అధికారులు వారి కార్యాలయాల నుంచి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురవనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా 27,28,29 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉందని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కు 0877–2236007 ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాగాన్నిఅప్రమత్తం చేసినట్లు చెప్పారు. జేసీ మౌర్య మాట్లాడుతూ వర్షాలకు ముందే తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
పెళ్లకూరు : నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై కొత్తూరు గ్రామం వద్ద శనివారం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. వివరాలు.. రాజమండ్రి నుంచి బెంగళూరుకు 34మంది ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్ ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ఐరన్ బారికేడ్లను ఢీకొని పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రయాణికులను మరో బస్సులో బెంగళూరుకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. టెంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. వినియోగంలో లేని వస్తువుల విక్రయం తిరుపతి అర్బన్ : సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో వినియోగంలో లేని వస్తువుల అమ్మకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ విభాగం జిల్లా అధికారి విక్రమకుమార్రెడ్డి శనివారం తెలిపారు. ఆసక్తి గలవారు కలెక్టరేట్ బి–బ్లాక్లోని మూడో అంతస్తు రూమ్ నంబర్ 309లో దరఖాస్తులు పొందవచ్చని వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో టెండర్లు ఓపెన్ చేస్తామని వివరించారు. 30 నుంచి శ్రీవారి మెట్లోత్సవం తిరుమల : తిరుమల ఆస్థాన మండపంలో ఈ నెల 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు శనివారం వెల్లడించారు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహించనున్నట్లు వివరించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకండి చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని భవిత కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఈఆర్పీ (సహిత విద్యా రిసోర్స్ పర్సన్)లు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న ఐఈఆర్పీలకు రెగ్యులర్ పే స్కేల్ అందజేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. 3 తర్వాతే స్పాట్ అడ్మిషన్లు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు మరో వారం రోజుల పాటు నిరీక్షించక తప్పని పరిస్థితి. ఇప్పటికే ఓఎండీసీ ఆధ్వర్యంలో ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల పేరుతో రెండు విడతలుగా ప్రవేశాలు కల్పించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి మూడవ విడతగా వచ్చే నెల ఒకటో తేదీన అర్హత కలిగిన విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. దీంతో వచ్చేనెల 3వ తేదీ పైన ప్రభుత్వ, టీటీడీ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ క్రీడా పోటీలు వాయిదా తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈనెల 27వ తేదీ నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఇంటర్ కాలేజియేట్ క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం శివశంకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నవంబర్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 1న వాయిదా వేసిన క్రీడలను ఒకే రోజు నిర్వహిస్తామని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. నవోదయ, సైనిక్ పరీక్షలపై ఉచిత అవగాహన తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రంలో ఆదివారం ఉదయం 10గంటలకు నవోదయ సైనిక్ మోడల్ టెస్ట్పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8688888802/03, 9399976999 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. వేగంగా ఓటరు క్లెయిమ్ల పరిష్కారం తిరుపతి రూరల్ : ఓటరు క్లెయిమ్లను వేగంగా పరిష్కరిస్తున్నామని, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆర్డీఓ రామ్మోహన్ తెలిపారు. శనివారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పలుచోట్ల కొత్త కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
కళ్లకు గుంతలు!
స్వర్ణముఖిలో బరితెగించిన ఇసుకాసురులు సాక్షి, టాస్క్ఫోర్స్ : తిరుపతి రూరల్ మండలం పరిధిలోని వేదాంతపురం, కేసీపేట, చిగురువాడ, దుర్గసముద్రం, అడపారెడ్డిపల్లె, శివగిరి ప్రాంతాల్లోని ఇసుకాసులు బరితెగించేశారు. స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్విన గోతుల్లోకి భారీగా వరదనీరు చేరడంతో అందులో పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అడ్డుకట్ట పడేనా..? వేదాంతపురం వద్ద స్వర్ణముఖి నదిలో నలుగురు బాలురు మృత్యువాత పడిన తర్వాతైన ఇసుకాసురులకు అధికారులు చెక్ పెడతారా అని పరీవాహక గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడం కంటే ఆ ప్రమాదానికి కారణమైన ఇసుక తవ్వకాలకు అడ్డుకోవాలని కోరుతున్నారు. స్వర్ణముఖి నదిలో వర్షాకాలం ముగిసేంత వరకు తవ్వకాలు జరగకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమార్జనకే ప్రాణాలు బలి ఇసుకాసురులు కేవలం అక్రమార్జనకే ప్రాధాన్యమిస్తున్నారని, ఎన్ని ప్రాణాలు పోయినా కనికరించడం లేదని పరీవాహక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు కఠిన వైఖరి తీసుకోకుంటే మరింత మంది బలవుతారని హెచ్చరిస్తున్నారు. స్వర్ణముఖిలో ఉసురు తీస్తున్న గుంతలు ఇవే..కూటమి నేతల అండతోనే .. కూటమి నేతల అండదండలతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని నదీ పరీవాహక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగినా అక్రమార్కులు లెక్క చేయడం లేదని మండిపడుతున్నారు. రోడ్లపైకి రావాలంటేనే భయంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణా చేసే టిప్పర్లు, ట్రాక్టర్ల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే స్వర్ణముఖి స్వరూపం మారిపోయిందని, సరిహద్దులను కూడా తవ్వేస్తుండడంతో గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అడపారెడ్డిపల్లె నుంచి తనపల్లె వరకు సుమారు 10కిలోమీటర్ల మేర నదికి ఇరువైపులా ఇసుక మేటలను తవ్వేశారని వెల్లడిస్తున్నారు. -
ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/డోన్/తిరుపతి తుడా: ‘మోంథా’ సూపర్ సైక్లోన్ రాష్ట్రం వైపు వస్తోంది. శనివారం రాత్రి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ పోర్ట్బ్లెయిర్కి 510 కి.మీ., విశాఖకు 920, చెన్నైకి 890, కాకినాడకు 920, ఒడిశాలోని గోపాల్పూర్కి 1,000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. సోమవారం ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అనంతరం వాయువ్య దిశగా, ఆ తర్వాత ఉత్తర–వాయువ్య దిశగా ప్రయాణించి 28న ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత దీనికి ‘మోంథా’ అని పేరు పెట్టనున్నారు. తీవ్ర తుపానుగా మారాక 28న సాయంత్రం నుంచి రాత్రిలోపు కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇది తీరం దాటే సమయంలో గంటకు 90–100 కి.మీ., గరిష్టంగా 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో సాధారణం కంటే 1–1.5 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడతాయని వెల్లడించారు. ఈ నెల 29 వరకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను అప్రమత్తం చేశారు. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 27 నుంచి అతి భారీ వర్షాలు అల్పపీడనం నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 27నుంచి 30వ తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 3 రోజులపాటు కోస్తాలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 27న అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ప్రకాశం, బాపట్ల, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. నంద్యాల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 28న వైఎస్సార్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్.. నంద్యాల, శ్రీపొట్టి శ్రీరాములు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. 29న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కంభంలో 6.8 సెం.మీ. వర్షం ప్రకాశం జిల్లా కంభంలో శనివారం 6.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. చిత్తూరు జిల్లా పలమనేరులో 5.9, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 5.6, అసనపురంలో 5.2, ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం నాగులవరం, నెల్లూరు జిల్లా విడవలూరులో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా డోన్ మండలంలో 44.2 మి.మీ. వర్షం కురవడంతో వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎర్రగుంట్ల వద్ద ఆర్టీసీ బస్సు వంకలో ఆగిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు బయటకు నెట్టుకొచ్చారు. ఉమ్మడి తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీగా వర్షం కురిసింది. తిరుపతిలో 2 గంటల పాటు భారీ వర్షం పడటంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
తిరుమలను వదలని వరుణుడు
సాక్షి, తిరుపతి/విశాఖ: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. దీంతో.. వాతావరణ శాఖ అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. ఇంకోవైపు.. తిరుమలలో వారం రోజులుగా ఎడతెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. జలాశయాలలో బారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే గోగర్భం డ్యామ్ నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. ముంపు ముప్పు దృష్ట్యా.. లోతట్టు ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేశారు. తిరుమల భక్తుల రద్దీ ఇలా.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,110గా ఉంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 25,695 మంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు.మరిన్ని వర్షాలుఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం. దీని ప్రభావంతో ఇవాళ(శనివారం, అక్టోబర్ 25)) కోనసీమ,కృష్ణా,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే.. ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ప్రాణాలర్పించైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తిరుపతి మంగళం: వైఎస్సార్సీపీ నాయకులమంతా తమ ప్రాణాలైనా అర్పించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల పిల్లలు సైతం ఇంజినీరింగ్ వంటి ఉన్నతవిద్యను అభ్యసించేందుకు మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. అలాగే ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి బిడ్డా బడికి వెళ్లి చదువుకోవాలన్న లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లి ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15 వేలు నగదు జమ చేశారన్నారు. అలాగే బడుగు, బలహీన వర్గాల వారు సైతం ఉచిత వైద్యవిద్యను అభ్యసించాలన్న సంకల్పంతో దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా కేవలం రెండేళ్లల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదల కోసం నిర్మాణం చేపట్టిన మెడికల్ కాలేజీలను కూట మి ప్రభుత్వం పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యతోపాటు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సి ఉందన్నారు. అయితే వాటిని ప్రైవేటీకరణ చే సి, రూ.వేల కోట్లు దండుకోవాలని చంద్రబాబు కుట్ర లు పన్నుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభ్యున్నతికి నిరంతరం వైఎస్. జగన్ మోహన్రెడ్డి శ్ర మిస్తుంటే, చంద్రబాబు పేదల భవిష్యత్తును నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని ఆ గ్రహం వ్యక్తం చేశారు. పేదలంటే చంద్రబాబుకు ఎ ప్పుడూ చులకనే అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
మైనర్పై ఫోక్సో కేసు నమోదు
సత్యవేడు: సొంత బంధువు కుమారుడు తన కూ తురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితు రాలి తల్లి సత్యవేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మైనర్ బాలుడిపై ఫోక్సో కేసు నమో దు అయ్యింది. పోలీసుల కథనం మేరకు.. దాసుకుప్పం పంచాయతీలో తాపీ మేస్త్రి దంపతులు జీవిస్తున్నారు. వారికి రెండో తరగతి చదువుతు న్న కుమార్తె(7), యూకేజీ చదువుతున్న కుమా రుడు ఉన్నారు. తాపీ మేసీ్త్ర బావమర్ధి కుమారుడు మైనర్ బాలుడు తాపీమేస్త్రి ఇంట్లోనే ఉంటున్నా డు. ఊత్తుకోటలో పనిచేస్తున్న తాపీమేస్త్రి తన పిల్లలను బడి నుంచి ఇంటికి తీసుకురావాలని బావమర్ధి కుమారుడికి ఫోన్లో చెప్పాడు. పిల్లల్ని తీసుకువచ్చిన ఆ బాలుడు, బాలికపై అఘాయి త్యం చేశాడు. ఈ విషయం ఆ బాలిక తన తల్లికి చెప్పింది. తల్లి సత్యవేడు పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో పుత్తూరు డీఎస్పీ రవికుమార్, శ్రీసిటీ డీఎస్సీ శ్రీనివాసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కెమికల్ ట్యాంకర్ బోల్తా రేణిగుంట:మండలంలోని గాజులమండ్యం సమీపంలోని తిరుపతి–చైన్నె రహదారిలో గురువారం తెల్లవారుజామున కెమికల్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్ నుంచి తమిళనాడులోని శ్రీ పెరంబూరుకు వెళుతున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. ట్యాంకర్ నుంచి కెమికల్ లీకేజ్ కావడంతో గాజుల మండ్యం గ్రామస్తులు భయాందోళన చెందారు. పెయింట్లో వాడే కెమికల్ పదార్థంగా పోలీసులు గుర్తించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని నివారణ చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో ట్యాంకర్పై నీటిని చల్లుతూ క్రైన్ల సహాయంతో ట్యాంకర్ను పైకి తీయించారు. స్థానిక కంపెనీల సాంకేతిక నిపుణులు వచ్చి ప్రమాదకర కెమికల్ కాదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
చెరువులకు జలకళ
తిరుపతి అర్బన్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. అలాగే వాగులు, వంకలు, కాలువలు సాగడంతో రైతులు ఈ ఏడాది పంట సాగుకు ఇబ్బంది ఉండవని భావిస్తున్నారు. ప్రధానంగా స్వర్ణముఖి నది సాగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి వర్షంతో రూ.కోటి నష్టం మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రయాణికులు తగ్గిపోయారు. మరోవైపు ఆర్టీసీ అన్ని మార్గాల్లో తిప్పలేదు. దీంతో రోజుకు రూ.30 లక్షలు చొప్పున మూడు రోజుల్లో రూ.కోటికి పైగా నష్టం చోటుచేసుకుంది. కూలిన పూరిగుడిసెలు బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆలత్తూరు గ్రామ దళితవాడలో ఒక పూరి గుడిసె, పట్టాభిగిరిజన కాలనీలో మూడు పూరిగుడిసెలు కూలాయి. పూరి గుడిసెలు కూలిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాత్రంతా వర్షానికి తడుస్తూ, చలి గాలులతో నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం స్పందించి కూలిన పూరిగుడిసెలకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. బురదలో కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు కలువాయి(సైదాపురం): మండలంలోని దాచూరు కొలపనాయుడుపల్లి గ్రామాల మధ్యలో గురువారం ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది. వర్షాలకు బురదమయం కావడంతో రోడ్డు పక్కన దిగిన బస్సు ఇరుక్కుపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం వాకాడు: మండలంలో గురువారం దాదాపు 20 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అధికంగా రావడంతో వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్లో ఉధృతంగా ప్రవహిస్తోంది. దిగువన ఉన్న బాలిరెడ్డిపాళెం – గంగన్నపాళెం గ్రామాల మధ్య వంతెన నీట మునిగి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సముద్రపు కెరటాలు తీర గ్రామాలను తాకుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఒడ్డున ఉన్న తమ వేట సామగ్రిని భద్రపరుస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు, మైరెన్ అధికారులతోపాటు వాకాడు తహసీల్దార్ మహ్మద్ ఇగ్బాల్, ఎంపీడీఓ సాయిప్రసాద్ సముద్ర తీరాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రొయ్యల కాలవ, పులికాలవ పొంగిపొర్లడంతో అక్కడక్కడా లోతట్టు రహదారులు నీటి మునిగిపోయాయి. బ్యారేజ్లో 35 ఎంసీటీఎఫ్ నీరు నిల్వ ఉండగా 8 గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు వరదనీటిని దిగువ ప్రాంతాలకు వదిలిపెట్టారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు. -
చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు
దొరవారిసత్రం: వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గ ల్లంతయ్యారు. వివరాల్లో కి వెళితే.. దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాళెం ఎస్టీ కాలనీకి చెందిన మేకల పోలయ్య(31) కాళంగి నదిలో కాలనీ వాసులతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు జారిపడి వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటన తనియాలి పంచాయతీ కమ్మకండ్రిగ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రేక్షపాత్ర వహించారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు. గల్లంతైన వ్యక్తికి భార్య, కుమారుడు ఉన్నారు. చల్లకాలువలో వ్యక్తి గల్లంతు కోట: చేపల వేటకు వెళ్లి వరద ప్రవాహంలో వ్యక్తి గల్లంతైన సంఘటన కర్లపూడిలో చోటుచేసుకుంది. ఎస్ఐ పవన్కుమార్ కథనం మేరకు.. కర్లపూడి గిరిజన కాలనీకి చెందిన మానికల పోలయ్య(75) బుధవారం సాయంత్రం స్వర్ణముఖి చల్లకాలువలో చేపటవేటకు వెళ్లాడు. పొద్దుపోయిన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా కనిపించకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం తహసీల్దార్ జయజయరావు, ఎస్ఐ పవన్కుమార్, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసులు తమ సిబ్బందితో వెళ్లి చల్లకాలువలో బోట్ల సాయంతో తీవ్రంగా గాలింపు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించలేదు. చీకటిపడడంతో గాలింపు నిలిపివేశారు. పోలయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎట్టకేలకు పీజీ ఫలితాలు విడుదలతిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎంఏ, ఎమ్మెస్సీ పరీక్షలకు సంబంధించి పలు సెమిస్టర్ల ఫలితాలు ఎట్టకేలకు వర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఫలితాల విడుదలపై ఇప్పటికే పలుసార్లు అధికారులను విద్యార్థులు నిలదీయడంతోపాటు నిరసనలు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం పరీక్షల విభాగం అధికారులు, ఉద్యోగులతో నూతన వీసీ సమావేశం ఫలితాల ప్రకటనలపై ఆరా తీశారు. దీంతో అధికారులు స్పందించి ఎట్టకేలకు పీజీ మూడో సెమిస్టర్కు సంబంధించి పలు కోర్సుల ఫలితాలను ప్రకటించారు. దీంతో విద్యార్థులకు కాస్త ఊరట లభించినట్టైంది. బాల్బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక శ్రీకాళహస్తి: రాష్ట్రస్థాయిలో జరిగే 17 బ్యాడ్మింటన్ బాలబాలికల జుట్లకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టును గురువారం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జునరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్నంలోని దర్శ బ్యాండ్మిటన్ అకాడమిలో ఈ పోటీలు జరిగాయి. 150 మంది క్రీడాకారులు చిత్తూరు ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపిక పోటీలకు హాజరయ్యారు. బాలుర జట్టుకు కార్తీక్, ఏ ప్రణవ్, హెచ్ కార్తీక్, ఎస్కే ప్రణీత్, కే పుష్కర్ను ఎంపిక చేశారు. బాలికల జట్టులో బి జీవిత, పి శరణ్య, ఎస్ సువర్ణాంజలి, హెచ్ యుగభారతి, ఎం షష్టిని ఎంపిక చేశారు. ఈ పోటీలు తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి కిషోర్ కుమార్, భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, పీడీలు హేమకుమార్, భక్తగోపాల్, వినోద్, బాబు, జేమ్స్, రమణ, సురేంద్ర, నిరంజన్, లోకనాథం, కిరణ్, చంగల్ రాయులు, గోపి, క్రాంతి పాల్గొన్నారు. -
రేషన్ దందా
పచ్చనేతలసాక్షిటాస్క్ఫోర్స్: రేషన్ మాఫియాకు పాల్పడుతు న్న కూటమి నేతలు తరచూ పట్టుబడుతూనే ఉన్నారు. లక్షల విలువైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. ఈక్రమంలో బుధవారం అక్రమ రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.8 లక్షల విలువగల 31.4 టన్నుల రేషన్ బి య్యం, ఏడు వాహనాలను డీఎస్పీ మహమ్మద్ స య్యద్ అజీజ్ నేతృత్వంలో పోలీసులు పట్టుకున్నారు. నాలుగు నెలల కిందట.. ఈ ఏడాది జూన్ 30న ఇదే ప్రాంతంలో సుమారు 6 లక్షలు విలువ గల 13 టన్నుల బియ్యం పట్టుకు న్నారు. ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ నేత అమృతరాజ్ నాడార్ అలియాస్ టీఆర్ఎస్తోపాటు వై.ధనుష్, డి.బోస్, ఎన్.రోహిత్, వి.దినేష్, గజేంద్రన్, రాజేష్ అలియాస్ రాజు అనే వారిని అరెస్టు చేశారు. జోర్ ఎంజాయ్ హోటల్ టీడీపీ నేతదే అక్రమ బియ్యం నిల్వలు రెండుసార్లు పట్టుపడిన జోర్ ఎంజాయ్ హోటల్ టీడీపీ నేత అమృతరాజ్ నాడార్దే అని, ఆయన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచరుడని నగరి పట్టణ ప్రజలు అందరికీ తెలిసి న విషయమే. అయినా పట్టుకున్న బియ్యం ఎవరిదో కనిపెట్టాలంటూ పోలీసులు తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిండ్ర మండలంలోనూ అదే తంతు ఈ నెల 14వ తేదీన నిండ్ర మండలం, అత్తూరులోను నిల్వ ఉంచిన 34 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఆ కేసులోను పోలీసులు నిందితుల పేర్లు వెల్లడించకుండా నగరి పట్టణానికి చెందిన వ్యక్తి బియ్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారని మాత్రమే పేర్కొన్నారు. అక్రమార్కులపై ప్రత్యేక నిఘా బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఐ విక్రమ్ వెల్లడించారు. రహస్య సమాచారం మేరకు మున్సిపల్ పరిధి కీళపట్టు వద్ద తిరుత్తణి బైపాస్ రోడ్డును ఆనుకొని మూతబడి ఉన్న జోర్ ఎంజాయ్ హోటల్లో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కాగా సమాచారం అందింది. దీంతో డీఎస్పీ, సీఐ సిబ్బందిని వెంటబెట్టుకొని డిప్యూటీ తహసీల్దార్ మేఘవర్ణం, వీఆర్వోతో పాటు సంబంధిత స్థలానికి చేరుకొని అక్కడ నిల్వ ఉంచిన బియ్యం, నాలుగు పెద్ద వాహనాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో బియ్యం నిల్వను కొలత వేయగా 31.4 టన్నులు ఉన్నట్లు తేలింది. ఈ రేషన్ బియ్యం ఎవరెవరు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు. అక్రమ రవాణాలో పాత్రదారులు ఎవరు అనే విషయాలు ప్రత్యేక దర్యాప్తు చేసి అందరిపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీజ్ చేసిన బియ్యాన్ని మండల స్థాయి స్టాక్ పాయింట్ గోదాముకు సేఫ్ కస్టడీ నిమిత్తం తరలించారు. భారీగా పట్టివేత సరిగ్గా 4 నెలల కాలం గడవక ముందే అదే ప్రాంతంలో గతంలో పట్టుకున్న బియ్యం కన్నా ఎక్కువగా పట్టుకున్నారు. దీంతో పచ్చనేతల రేషన్ దందా వరుసగా బహిర్గతమవుతూ వస్తోంది. అ యితే పోలీసులు పట్టుకున్న బియ్యం ఎవరిది, దీని వెనుక ఎవరున్నారన్నది త్వరలో ప్రకటిస్తా మని చెప్పడం, విషయం ఎక్కువగా ప్రచారం కా కూడదని వివరాలను కూడా రాత్రిపూట వెల్లడించడం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు విశ్వసనీయ స మాచారం. అందరికీ తెలిసిన విషయమే అయి నా పార్టీకి నష్టం వాటిల్లే అంశం కావడంతో రాజకీయంగా పోలీసులపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది. -
కదంతొక్కిన విద్యార్థి లోకం
తిరుపతి సిటీ: ఎస్వీయూలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వికృత చేష్టలపై విద్యార్థి లోకం కదం తొక్కింది. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో వర్సిటీలో విద్యార్థి సంఘం నాయకు లు గురువారం పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, సంతకాలు చేశారు. స్వచ్ఛందంగా క్యూకట్టిన విద్యార్థులు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుల పిలుపు మే రకు ఎస్వీయూలోని పీజీ విద్యార్థులు పెద్దఎత్తున కోటి సంతకాల కార్యక్రమానికి హాజరయ్యారు. స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో విద్యార్థినులు క్యూలో నిల్చుని సంతకాలు చేశారు. ఇందులో ప్రధానంగా వందలాది మంది మహిళా విద్యార్థులు పాల్గొని, పోటీ పడి సంతకాలు చేయడంతో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ స్థాయిలో విద్యార్థులు గళమెత్తడంతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తింది. ప్రభుత్వ నిర్ణయానికి చెంపపెట్టు రాష్ట్రంలో సుమారు 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసిన కూటమి ప్రభుత్వంపై విద్యా ర్థి లోకం తిరగబడి కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వాములై గళమెత్తడం అభినందనీయ మని, ఇది ప్రభుత్వ నిర్ణయానికి చెంప పెట్టు అని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యవిద్యను పేదలకు దూ రం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభు త్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామీణ, పేద విద్యార్థులకు వైద్యవిద్యను అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. అలాంటి కళాశాలలను కూటమి ప్రభుత్వం లాభార్జనే ధ్యేయంగా తమ అనుచరుల చేతుల్లో పెట్టి పేదలకు వైద్యవిద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షులు ప్రేమ్కుమార్, చంద్రగిరి నియోజకవర్గం అధ్యక్షుడు చెంగల్రెడ్డి, విద్యార్థి విభాగం మండలాల అధ్యక్షులు నక్క హరినాథ్, శేషారెడ్డి, వెంకటరమణ నాయక్, విద్యార్థి నేతలు ముని, హరినాయక్ , లిఖిత్, సతీష్, మహేష్, నవీన్, నీరజ్ రెడ్డి, సాయి పాల్గొన్నారు. -
30 వరకు ఆధార్ శిబిరాలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 30వ తేదీ వర కు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సచివాలయాధికారి తెలిపారు.కూటమి ప్రభుత్వం రాకతో క్యాన్సర్ ఆస్పత్రికి గ్రహణం కదంతొక్కిన విద్యార్థి లోకం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్వీయూనివర్సిటీలో విద్యార్థిలోకం గురువారం కదం తొక్కింది.వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాన్సర్ ఆస్పత్రికి గ్రహణం పట్టింది. అనుకున్నట్టు క్యాన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఎక్కడ వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందోనని శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రిని నిర్యీర్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆస్పత్రి గుర్తింపు చెరిపేసేలా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫలితంగా క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు మందగించాయి. చెల్లించాల్సిన బిల్లులు బ్రేక్ పడింది. ఏడాది అవుతున్నా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. 400 పడకలను వేర్వేరు విభాగాలకు కేటాయించారు. ప్రస్తుతం కేవలం వంద పడకలకే క్యాన్సర్ ఆస్పత్రి పరిమితమైందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెండింగ్ బిల్లుల మంజూరుకు టీటీడీ ఆమోదం తెలిపినా.. ప్రస్తుతం క్యాన్సర్ ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిలా దర్శనమిస్తోంది. ఏటా 70 నుంచి 80 వేల మంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆంకాలజీ సెంటర్ నేడు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాడైన పరికరాలు, అందుబాటులోని భాగాలు, సాంకేతికలోపంతో క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్
తిరుపతి మంగళం : రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, అందులో భాగంగానే తమ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని పోలీసులు విచారణకు పిలిచారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విమర్శించారు. టీటీడీకి సంబంధించిన గోశాల గోవులు పెద్ద సంఖ్యలో మరణించడంపై వివరాలు బయట పెట్టారనే కారణంతో గురువారం భూమన కరుణాకరన్నను ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు విచారణకు పిలిచారన్నారు. ఎస్వీ యూనివర్సిటీ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో గోమాతల మరణాలపై భూమన ఆధారాలతో సహా బయటపెట్టారని గుర్తు చేశారు. తప్పుల్ని సరిదిద్దుకోడానికి, వాస్తవాల్ని బయటపెట్టిన భూమనను విచారణ పేరుతో వేధించడం సబబు కాదన్నారు. గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు, అందుకు విరుద్ధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ వేర్వేరు సంఖ్యలు చెప్పారన్నారు. గోవుల మరణాలపై పాలకుల్లోనే స్పష్టత లేదన్నారు. విచారణ పేరుతో గంటల తరబడి విచారించడం తగదని మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, అలాగే నకిలీ మద్యం తయారీ తదితర అంశాలపై తీవ్ర ప్రజావ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఇలాంటి వాటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే భూమనను విచారణకు పిలిచారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా తన పద్ధతుల్ని మానుకుని, హామీల అమలుకు ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయ్
తిరుపతి అన్నమయ్యసర్కిల్:మరో రెండేళ్లలో తిరుపతి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయని సికింద్రాబాద్ సెంట్రల్ ప్యాసింజర్ సేవల విభాగం కమర్షియల్ మేనేజర్ (సీసీఎం) డి.సత్యనారాయణ వెల్లడించారు. ప్రయాణికుల భాగస్వామ్యంతో రైల్వేష్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతోపాటు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గురువారం స్థానిక రైల్వేస్టేషన్లోని వీఐపీ విశ్రాంత భవనంలో ‘అమృత్ సంభాషణ– ప్రజల స్వరమే అభివృద్ధి శక్తి’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రైల్వే అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో తిరుపతి స్టేషన్ కూడా ఒక్కటన్నారు. ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధిలో భాగంగా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. తిరుపతి స్టేషన్న్ను మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. బాలజీ డివిజన్గా పరిగణించాలనే డిమాండ్తోపాటు సామాన్యులను దృష్టిలో ఉంచుకుని, అదనపు జనరల్ బోగీలను ఏర్పాటు చేయాలనే సలహాలు, అభిప్రాయాలను కేంద్ర రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ముందుగా సదస్సుకు హాజరైన తిరుపతి వాసులు బుజ్జిబాబు, రామిరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, అనిల్గౌర్, మురళి, శేషగిరిరావు, మునీశ్వరరెడ్డి, యాసిన్, అరవ జయపాల్ వేర్వేరుగా మాట్లాడుతూ స్టేషన్ అభివృద్ధికి సంబంధించి లోపాలను ఉదహరిస్తూ శాఖా పరంగా చేపట్టాల్సిన అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, మేనేజర్ చిన్నపరెడ్డి, సీసీఆర్ఐ శ్రీకాంత్, సీనియర్ కమర్షియల్ క్లర్క్ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతి బాలోత్సవం తేదీ మార్పు
తిరుపతి కల్చరల్: నగరంలో ఈ నెల 25, 26వ తేదీల్లో జరగాల్సిన తిరుపతి బాలోత్సవం 4వ పిల్లల పండుగను భారీ వర్షాల కారణంగా నవంబర్ 1, 2 తేదీలకు మార్పు చేసినట్లు తిరుపతి బా లోత్సవం అధ్యక్ష, కార్యదర్శులు మల్లారపు నాగార్జున, నడ్డి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. బాలోత్సవ ఏర్పాట్లన్నీ పూర్తయినా 160 పాఠశా లల నుంచి 10 వేల మందికిపైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకున్నారని, ఎడతెరపిలేని వర్షాల కారణంగా పిల్లలు హాజరు కాలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తిరుపతి బాలోత్సవం కమిటీ సదరు తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొ క్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి గురువారం తీర్పు చెప్పారు. కో ర్టు లైజనింగ్ ఆఫీసర్లు బాబు ప్రసాద్, ఏ.ఖ్యాతి, కోర్ట్ కానిస్టేబుల్ చంద్రకళ కథనం మేరకు.. 2018 డిసెంబర్ 6వ తేదీ పీలేరు రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సిబ్బంది పీలేరు రోడ్డులోని యల్లమంద క్రాస్ సమీపంలో వాహనాలను తనిఖీ చే శారు. ఆ సమయంలో ఓ టాటా సఫారీ వాహనం అతివేగంగా వచ్చింది. ఫారెస్ట్ సిబ్బంది ఆ వాహనాన్ని ఆపిన ఆగలేదు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది ఆ వాహనాన్ని వెంబడించి వాహనాన్ని ఆపారు. వాహనంలోని తమిళనాడు, వేలూరు జిల్లా, వానం బాడీ తాలూకా, బాలప్పనూరు గ్రామానికి చెందిన కె విజయ్కుమార్, తిరువణామలై జిల్లా, సింగం తాలూకా, కుత్తు టూరు గ్రామానికి చెందిన వి రామరాజును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విచారించగా పీలేరు రేంజ్, రొంపిచర్ల సెక్షన్, మేళ్లచెరువు బీట్ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి కర్ణాటకకు తరలిస్తున్నట్టు ఫారెస్టు సిబ్బందికి తెలిపారు. వాహనంలో 71 కిలోల ఆరు ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ అమరనారాయణ వాదించారు. -
నేను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదు: భూమన
సాక్షి, తిరుపతి: తాను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదని.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ‘‘11.04.25న మీడియా సమావేశంలో గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయని నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా’’ అని భూమన స్పష్టం చేశారు.‘‘గోవుల పట్ల నిర్లక్ష్యంగా తగదని నేను మాట్లాడాను. పోలీస్ విచారణకు పిలిచారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండ అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నేను వాస్తవాలు చెబితే సమాధానాలు ఇవ్వడం లేదు. వాళ్ల మీడియాలో నాపై విష ప్రచారం చేస్తున్నారు. మీ చేతిలో అధికారం ఉంది. విచారణ చేయించాలి కదా?’’ అంటూ భూమన ప్రశ్నించారు. -
నేడు విద్యాసంస్థలకు సెలవు
తిరుపతి సిటీ : భారీ వర్షాల కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ బుధవారం తెలిపారు. అంగన్వాడీ భవనాలపై ప్రత్యేక దృష్టి తిరుపతి అర్బన్ : భారీ వర్షాల నేపథ్యంలో అంగన్వాడీ భవనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ పీడీ వసంతబాయితో కలిసి సీడీపీఓలతో సమీక్షించారు. జేడీ మాట్లాడుతూ పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు మాత్రం క్రమం తప్పకుండా పౌష్టికాహారం పంపిణీ చేయాలని కోరారు. ప్రధానంగా పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్ల పరిమాణం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ మేరకు కాంట్రాక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. పీడీ, సీడీపీఓలు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఎప్పటికప్పుడు సరిచేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్ అవసరం తిరుపతి సిటీ : ఎస్వీయూలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేందుకు అంతర్జాతీయ సిలబస్ అవసరమని వీసీ నర్సింగరావు తెలిపారు. బుధవారం ఈ మేరకు ఇంజినీరింగ్ కళాశాల అధికారులతో సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ నూతన పాఠ్యాంశాల రూపకల్పన, తరగతుల నిర్వహణ, టైమ్ టేబుల్, ప్లేస్మెంట్ తదితర అంశాలపై కళాశాల అధికారులు, అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీ, హైడ్రోజన్ మొబిలిటీ, సెమీ కండక్టర్ డిజైన్, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలపై కోర్సులను ప్రవేశపెట్టాలని కోరారు. మామండూరు పర్యాటక కేంద్రం మూత రేణిగుంట: వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా రేణిగుంట మండలంలోని మామండూరు పెద్ద ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫారెస్ట్ అధికారులు బుధవారం మామండూరు వద్దనున్న పర్యాటక కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి పర్యాటకును అనుమతిస్తామని మామండూరు వన సంరక్షణ సమితి చైర్మన్ కుమార్ తెలిపారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 26 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,343 మంది తిరుమలేశుని దర్శించుకున్నారు. 18,768 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.34 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారికి క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం
రేణిగుంట : జి.పాళ్యం పంచాయతీ పరిధిలోని కుర్రకాల్వ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. చెరువు కలుజు కింద అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ వేసి ప్రహరీ గోడను నిర్మించారు. దీంతో భారీ వర్షం వస్తే ప్రమాదం తప్పదని సాక్షి పత్రికలో పలు కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. ఆ కథనాలను ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండు కుండలా మారి కలుజు ప్రవహిస్తోంది. అయితే అడ్డుగా అక్రమ లేఅవుట్ ప్రహరీ గోడ ఉండడంతో నీరు పైకి ఎగదన్నుతూ ఉంది. ఈ క్రమంలో చెరువు కట్ట తెగిపోయే ప్రమాదముంది. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి ప్రహరీగోడను తొలగించకుంటే కుర్రకాల్వ గ్రామాన్ని వరద ముంచెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అర్బన్ : జిల్లావ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అంద రూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ మౌర్య హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో డీఆర్ఓ నరసింహులుతో కలిసి అధికారులతో సమీక్షించారు. గురువారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. రేణిగుంటలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశమున్న శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటతోపాటు సముద్రతీర ప్రాంతాలైన కోట, వాకాడు, తడలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల ని కోరారు. మత్స్యకారులను అప్రమత్తం చేయాలని చెప్పారు. చెరువులతోపాటు ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఏ స్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్– 0877–2236007ను పరిశీలించారు. హెల్ప్డెస్క్కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీపీఓ సుశీలాదేవి, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, అగ్రికల్చర్ జేసీ ప్రసాద్రావు, ఉద్యానశాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, సీపీఓ రాజశేఖర్, ఇరిగేషన్ అధికారి వెంకటశివారెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్లోకి వరద కలెక్టరేట్ భవనం సెల్లార్లోకి వరద నీరు చేరింది. దీంతో ఉద్యోగులు తమ వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొట్టుకుపోయిన రింగ్బండ్ ఏర్పేడు : మండలంలో స్వర్ణముఖీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోవిందవరం, పాతవీరాపురం వద్ద లోలెవల్ కాజ్వేలపై నీటి ప్రవాహం పెరిగింది. అలాగే చెన్నంపల్లి, పెన్నగడ్డం గ్రామాలకు వెళ్లే నక్కలవంక వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే జంగాలపల్లి కలుజు వద్ద తాత్కాలికంగా నిర్మించిన రింగ్బండ్ కొట్టుకుపోయింది. మల్లె మడుగు పరిశీలన రేణిగుంట మండలంలోని మల్లె మడుగు రిజర్వాయర్ను బుధవారం సాయంత్రం జాయింట్ కలెక్ట మౌర్య, ఏఎస్పీ రవిమనోహరాచారి, ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. అల్లకల్లోలంగా సముద్ర తీరం వాకాడు: వాయుగుండంగా ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తూపిలిపాళెం తీరం వద్ద సాధారణం కంటే 15 మీటర్లు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మత్స్యకారులందరిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్వర్ణముఖి బ్యారేజ్లో వరదనీరు అధికంగా చేరడంతో 7 గేట్ల ద్వారా 7 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలి పెట్టారు. వాకాడు : ఉవ్వెత్తున్న ఎగస్తున్న అలలురాపూరు మండలం పంగిలి వద్ద కొట్టుకుపోయిన రోడ్డుతిరుమలలో నిండుకుండలా గోగర్భం డ్యామ్చిల్లకూరు : తిప్పగుంట పాళెంలో వరద ఉధృతిజిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు అరణియార్లో పెరిగిన నీటి మట్టం నాగలాపురం: పిచ్చాటూరు మండలంలోని అరణియార్ రిజర్వాయర్లో నీటి మట్టం 26.3 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయానికి 301 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద నిఘా పెట్టినట్లు వెల్లడించారు. కల్యాణిడ్యామ్కు వరద చంద్రగిరి:ఏ.రంగంపేట సమీపంలోని కల్యాణి డ్యామ్ కు వరద నీరు చేరుతోంది. డ్యామ్ పూర్తి స్థాయి సామ ర్థ్యం 900 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 849 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
అనుక్షణం.. అప్రమత్తం
తిరుపతి క్రైమ్ : జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎడతెరపి లేని వానలకు రోడ్లు నీటి మడుగులను తలపిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. నీటి ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వర్షాలు తగ్గేవరకు సెలవులపై ఎవరూ వెళ్లకుండా సేవలందించేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద స్వర్ణముఖీ నది చెక్డ్యామ్ను ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. నదులు, కాలువలను ఎవరూ దాటకుండా రోడ్డుపై ముళ్ల కంచెలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తాము అందుబాటులో ఉంటామని, ఎవరైనా నేరుగా కూడా తనను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. అలాగే ప్రజలు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయన మాటల్లోనే.. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
● గరుడ వారధిపై నుంచి కిందకు దూకిన తమిళనాడు వాసి తిరుపతి క్రైమ్ : ెపళ్లి కాలేదని మనస్తాపంతో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు బుధవారం తిరుపతిలోని గరుడ వారధిపై కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. మధురైకి చెందిన పాండ్యరాజన్(31) వివాహం కాలేదని కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కుటుంబీకులతో కలిసి తిరుమలకు వచ్చాడు. శ్రీవారి దర్శనానంతరం కుటుంబసభ్యులను మధురై వెళ్లేందుకు రైలు ఎక్కించాడు. తాను బస్సులో వస్తానని వారికి చెప్పి బుధవారం ఉదయం మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి పైనుంచి కిందకు దూకేశాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి సెల్ఫోన్ ఆధారంగా కుటుంబీకులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించినట్లు అలిపిరి ఎస్ఐ లోకేష్కుమార్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిమృతి కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ పరిధిలో తిరుపతికి చెందిన బీటెక్ విద్యార్థి పవన్ (20) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిర్వాహుకులు తెలిపిన వివరాల మేరకు.. పవన్ ఓ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో ఏడాది చదువుతూ ఓ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్ గదిలో బొద్దింకల నివారణకు పురుగుల మందును సిబ్బంది పిచికారీ చేశారు. ఆ విషయం తెలియని పవన్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తెలియకుండానే పురుగుల మందును పీల్చడంతో కొంతసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో గదిలో ఎవరూ లేరు. కొంతసేపటికి మందు ప్రభావంతో యువకుడు మరణించాడు. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు స్థానిక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే దీనిపై తోటి విద్యార్థులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. -
భవిష్యత్ పరిశోధనలపై దృష్టి అవసరం
తిరుపతి సిటీ: భవిష్యత్తు పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అందుకోసం పరస్పర సహకారంపై అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్వీయూ వీసీ నర్సింగరావుతో బుధవారం వర్సిటీలోని వీసీ చాంబర్లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. క్వాంటమ్ టెక్నాలజీ, హైడ్రోజన్ మొబిలిటీలో ఉమ్మడి పరిశోధన చేయడానికి చర్చలు జరిపారు. పరిశోధన అంశాలపై రెండు వర్సిటీలు సమన్వయంతో నూతన పరిశోధనల బలోపేతం చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్చించారు. ఎస్వీయూ క్వాంటమ్ టెక్నాలజీ, హైడ్రోజన్ మొబిలిటీ వంటి పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉందని వీసీ తెలియజేశారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ భూపతి నాయుడు పాల్గొన్నారు. -
ఐజర్లో ఘనంగా స్వచ్ఛోత్సవ్
ఏర్పేడు: ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో ఉన్న తిరుపతి ఐజర్లో బుధవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛోత్సవ్’ ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్చంద్ర మాట్లాడుతూ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనే స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణ సవాళ్లకు ఐజర్ విద్యార్థులు, శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాలు కనుక్కోవాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న ప్రజా అలవాట్లతో దేశం ఎదుర్కొనే పారిశుధ్య, పర్యావరణ సమస్యల పరిష్కారమే మానవాళి మనుగడకు కీలకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని 2014లో ప్రారంభించిన నాటినుంచి గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛత పట్ల సమాజంలో అవగాహన పెరిగిందన్నారు. దేశాన్ని 2047 కల్లా వికసిత భారతదేశంగా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రతి పౌరుడు పరిశుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించి, ‘పరిశుభ్రతే సేవ’ అనే సందేశాన్ని ఇవ్వడమే స్వచ్ఛతా హి సేవ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఐజర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హుస్సేన్ భుక్య మాట్లాడుతూ కళాశాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్లాస్టిక్ రహిత కళాశాలగా మార్చడంలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ రిజిస్ట్రార్ కుమార్ హిమాన్షు శేఖర్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కళాశాల ఆవరణలో మొక్కలు పెంచుతున్నామని అందులో భాగంగా అమ్మ పేరిట ఒక్క మొక్క అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి వాటి ప్రాముఖ్యతను తెలిపారు. అందరూ స్వచ్ఛతకు కట్టుబడి ఉంటామని స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులకు స్వచ్చత పై వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలను అందజేశారు. -
తండ్రిని పరామర్శిస్తే తప్పా?
తిరుపతి రూరల్ : ‘‘ఆరోగ్యం సరిగా లేక వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన తండ్రిని ఆయన కొడుకు పరామర్శిస్తే తప్పా..? అందరి సమక్షంలో కేవలం 15 నిముషాలు మాట్లాడితే నేరమా..? రాజ్యాంగంలో అలా ఎక్కడైనా రాసి ఉందా? ఇప్పటికే చేయని తప్పుకు 130 రోజులుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి జైలులో ఉన్నారు.. ఆయన బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిసి ఈనెల 24వ తేదీన తీర్పు ఇవ్వనున్నారు. ఈ సమయంలో ఆయనకు బెయిల్ రానీయకుండా చేయడానికి ఓ దిన పత్రిక (సాక్షి కాదు)లో అసత్య వార్తలు రాయడం, కోర్టులను ప్రభావింతం చేసేలా కథనాలు వండి వార్చడం అనైతికం’’ అంటూ తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మద్యం కేసులో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం కోర్టు ఇచ్చిన ముందస్తు బెయి లులో సహ నిందితులను కలవకూడదు అని ఎక్కడా చెప్పలేదన్నారు. అది కూడా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మోహిత్ రెడ్డి వెళ్లి పలకరించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. చెవిరెడ్డి ధర్మబద్ధంగా వచ్చే బెయిల్ను అడ్డుకోవడానికి ఇంత అనైతికంగా ప్రభుత్వానికి అనుకూలమైన ఓ పత్రికలో వార్తలు రాయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. అలా రాసిన వారి విచక్షణకు వదిలేస్తున్నామని, దీనికి కాలమే సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. -
యూరియా పంపిణీకి చర్యలు
చిట్టమూరు:‘యూరియా కోసం రైతుల ఆందోళన’ శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. చిట్టమూరు తహసీల్దార్ రైతులకు యూరియా అందించేందుకు చర్యలు చేపట్టారు. ముందుగా యాకసిరి గ్రామ సచివాలయంలో వీఆర్ఓ సునయన చేతుల మీదుగా రైతులకు యూరియా గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ అందుబాటులో యూరియా ఉంచేలా వ్యవసాయాధికారుల ద్వారా చర్యలు చేపట్టామని వెల్లడించారు. రైతులకు గుర్తింపు కార్డులను అందించామని, ఆ మేరకు యూరియా పంపిణీ చేయాలని ఏఓ నిరంజన్ కుమార్ను ఆదేశించారు. పోక్సో కేసులో ముగ్గురి అరెస్ట్ సైదాపురం : మైనర్ బాలికను వేధించి, కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ముగ్గురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బుధవారం ఈ మేరకు నిందితులు నన్నేం ప్రేమ్రాజ్, చింత సాయి, గానుగపెంట శరత్కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
వినియోగదారులకు మెరుగైన సేవలందించండి
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలను అందించి వినియోగదారుల మన్ననలు పొందేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. బుధవారం ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి 9 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని 410 సెక్షన్లలో విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు అందుబాటులో ఉంటూ నిరంతర విద్యుత్ సరఫరా, లో ఓల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థ పరిధిలో పునర్వ్యవస్థీకరణ విద్యుత్ పంపిణీ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద 11 కేవీ ఫీడర్లు, ఓవర్ లోడెడ్ 33 కేవీ ఫీడర్లను గుర్తించి వేరు చేసే పనులను వేగవంతం చేయాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకంపై జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి, ఈ పథకంపై వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సంస్థ పరిధిలో పెండింగ్లో ఉన్న వర్క్ ఆర్డర్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. విద్యుత్ శాఖ ఏఈఈలు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదల కారణంగా ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో వినియోగదారుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు వీలుగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్లు 1912, 1800 425 155333కు కాల్ చేసి సమస్య పరిష్కారించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్, హెచ్ఆర్డీ డైరెక్టర్ కె.గురవయ్య, ప్రాజెక్ట్స్ అండ్ ఐటీ డైరెక్టర్ పి.ఆయూబ్ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) పి. సురేంద్రనాయుడు, సీఎస్సీ జనరల్ మేనేజర్ చక్రపాణితోపాటు 9 జిల్లాల నుంచి సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న గజ బీభత్సం
నాశనమైన వరి పంట చంద్రగిరి : మండలంలోని ఏ.రంగంపేట అటవీ ప్రాంత సమీపంలో ఉన్న పంట పొలాలపై మూడు రోజులుగా గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రైతులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం వేకువజామున కందులవారిపల్లె, కూచువారిపల్లె పంట పొలాలపై ఏనుగులు విరుచుకుపడ్డాయి. వరి, అరటి, కొబ్బరి చెట్లు, గ్రాస్ గడ్డిని ధ్వంసం చేశాయి. పొలానికి వేసి ఉన్న ఫెన్సింగ్, నీటి సరఫరాకు అమర్చిన పైపులను కూడా నాశనం చేశాయి. ఏనుగులు పంటల పొలాలను ధ్వంసం చేస్తుండటంతో గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులు గుంపును దారి మళ్లించారు. బుధవారం రాత్రి కూడా చిన్నరామాపురం, కందులవారిపల్లె, భీమవరం ప్రాంతాలలో గజరాజులు సంచరించే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
గందరగోళంగా చైన్నె ప్యాసింజర్ రైలు ప్రయాణం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : చైన్నె ప్యాసింజర్ రైలు ప్రయాణం గందరగోళంగా మారింది. సాధారణంగా ఈ రైలు తిరుపతి నుంచి నడుస్తోంది. బుధవారం నుంచి తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ముందుగా ప్రకటించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తిరుపతిలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ రైలు కోసం వందల మంది ప్రయాణికులు, విద్యార్థులు తిరుపతి రైల్వే స్టేషన్లో వేచి ఉన్నారు. అధికారులు ఉన్నఫళంగా రైలును తిరుచానూరు స్టేషన్ నుంచి నడపాలని నిర్ణయించారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ లేకుండా నడిచే ప్యాసింజర్ రైలు కావడంతో ఎక్కువ మంది సామాన్యులే ఉంటారని, రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. ఖాళీగా వెళ్లిన రైలు తిరుచానూరు స్టేషన్ నుంచి బయలుదేరిన చైన్నై ప్యాసింజర్ రైలు ప్రయాణికులు లేక ఖాళీగా వెళ్లింది. చైన్నె నగరంతోపాటు అక్కడి ప్రాంతాలకు చెందిన భక్తులు ఎక్కువగా చైన్నె ప్యాసింజర్ రైలులో తిరుపతి చేరుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రైలును మార్చడం సరైన పద్ధతి కాదని ప్రయాణికులు, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రొమ్ము క్యాన్సర్కు అత్యాధునిక చికిత్స
తిరుపతి తుడా: రొమ్ము క్యాన్సర్కు స్విమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. ఈ మేరకు స్విమ్స్ పద్మావతి ఆస్పత్రి మెడికల్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్వీ కుమార్ మాట్లాడుతూ మహిళలు రొమ్ము క్యాన్సర్పై అవగాహన పెంచుకుని వైద్యులు సూచించిన విధంగా తరచు స్వీయపరీక్ష చేసుకోవాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో క్యాన్సర్పై అవగాహన, స్క్రీనింగ్ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదిక నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా రెండు పింక్ బస్సుల ద్వారా ఇప్పటివరకు 713 క్యాంపులు నిర్వహించి, దాదాపు 42 వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని, దాదాపు 3 వేల మంది అనుమానితులను గుర్తించి 895 మందికి క్యాన్సర్ వైద్యం అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, డాక్టర్ భార్గవి, డాక్టర్ సుబ్రమణ్యన్, డాక్టర్ విజయలక్ష్మి, వైద్యులు పాల్గొన్నారు. -
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 21 కంపార్ట్ మెంట్లు నిండి బయట్లలో వేచి ఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 73,853 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,551 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 3.47 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. -
తీవ్ర అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వానలు పడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా తడిసి ముద్దయింది. బుధవారం కూడా తిరుపతి జిల్లాలో వర్షం తెరిపినివ్వలేదు. శేషాచలం కొండల నుంచి వరదలు పోటెత్తడంతో స్వర్ణముఖి నది, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మాల్వాడిగుండం, కపిలతీర్థం సమీపంలోకి ప్రజలను అనుమతించడం లేదు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్లలో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. చెన్నై– విజయవాడ జాతీయరహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చిల్లకూరు సమీపంలో వరగలి క్రాస్ రోడ్డు నుంచి 2 కి.మీ మేర వాహనాలు బారులు తీరాయి. వాకాడు వద్ద 10 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచి్చంది. తిరుమలలోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీనికితోడు పొగమంచు తిరుమలను కమ్మేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఘాట్రోడ్డులోని జలపాతాలు పొంగిప్రవహిస్తున్నాయి.తిరుమలలోని గోగర్భం ఆకాశగంగ, పాపవినాశం, కుమారధార–పసుపుధార డ్యాముల్లో నీటి ప్రవాహం పెరిగింది. తిరుపతి, శ్రీకాళహస్తితో పాటు తొట్టంబేడు, కోడూరు, బుచి్చనాయుడి కండ్రిగ, వడమాలపేట, ఏర్పేడు, వెంకటగిరి, బాలాయపల్లె, పెళ్లకూరు, సూళ్లూరుపేట తదితరచోట్ల భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాలతో అన్నమయ్య జిల్లాలోని చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పింఛ డ్యామ్ వద్ద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. రైల్వేకోడూరు రోడ్లు జలమయం అయ్యాయి. ⇒ కడప నగరం జలమయమైంది. రోడ్లపైకి నీరు భారీగా చేరింది. అనేకచోట్ల మోకాళ్ల లోతులో నిలిచి... జనజీవనం స్తంభించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో మిడతవాగు, ఉలవపాడు మండలంలో ఉప్పుటేరు, అనంతరసాగరం మండలంలోని కొమ్మలేరు, మనుబోలు–గూడూరు మధ్య ఉండే పంబలేరు, చేజర్ల మండలంలోని నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు నీటమునిగి నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మతో పాటు, ముసి, మన్నేరు, పాలేరుతో పాటు ఇతర వాగుల్లో నీరు చేరి పారుతున్నాయి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో 33.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ఎరతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో 2,296 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పది సెంటీమీటర్లకు పైనే... ⇒ మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పాపమాంబపురంలో 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏర్పేడులో 13.4, బాలాయపల్లి మండలం చిలమన్నూరులో 13.1, వెంకటగిరి మండలం లాలాపేటలో 12.8, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం గంగరాజుపురంలో 12.4, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 12, అనుమసముద్రంపేట మండలం దూబగుంటలో 11.1, తిరుపతి జిల్లా బాలాయపల్లె మండలం హస్తకావేరిలో 11.9, గొల్లగుంటలో 11.6, వెంకటగిరిలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులో 8.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. లింగసముద్రం మండలం ముగిచర్లలో 7.8, కృష్ణా జిల్లా నాగాయలంక భావదేవరపల్లెలో 7.5, గుంటూరు జిల్లా దుగ్గిరాల, ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం ఉమరెడ్డిపల్లెలో 6.1, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జంగందొరువు రోడ్డులో 5.9 సెంటీమీటర్ల వర్షం పడింది. వాయుగుండంగా బలపడొచ్చు! ⇒ తీవ్ర అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదులుతున్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీ తీరాలకు ఆనుకుని ఉన్న పశి్చమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాత ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్ర తీరాల మీదుగా కదిలే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 4 రోజులు పలుచోట్ల అతి భారీ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ⇒ తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.అప్రమత్తంగా ఉండండి: సీఎస్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కె.విజయానంద్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతోపాటు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలుచేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీల మృతిపొన్నూరు: పిడుగు పడి పొలంలో కలుపు తీస్తున్న ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పొన్నూరు 23వ వార్డులోని క్రిస్టియన్పేటకు చెందిన వలపర్ల మరియమ్మ (45), నీలం మాణిక్యమ్మ, 27వ వార్డు షరాఫ్ బజార్కు చెందిన షేక్ ముజాహిద (45), మరికొందరు మహిళా కూలీలు కలిసి బుధవారం పెద ఇటికంపాడు రోడ్డులోని ఓ పొలంలో కలుపు తీసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షం మొదలై వారు పని చేస్తున్న ప్రాంతంలో పిడుగు పడింది. దాని తీవ్రత వల్ల వలపర్ల మరియమ్మ, షేక్ ముజాహిదా అక్కడికక్కడే మృతిచెందారు. నీలం మాణిక్యమ్మ కాలికి తీవ్ర గాయమైంది. ఆమెను 108 సహాయంతో నిడుబ్రోలు సీహెచ్సీకి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. -
నకిలీ టీసీ అరెస్టు
తిరుపతి క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లో టికెట్ కలెక్టర్గా నటిస్తూ టికెట్ లేని ప్రయాణికులు మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ టీసీని అరెస్టు చేసినట్లు రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైన్నెకి చెందిన జితేందర్షా కొంతకాలంగా రైల్వేస్టేషన్లో నకిలీ టికెట్ కలెక్టర్గా చలామణి అవుతున్నాడు. రైల్వేస్టేషన్లో రైలు దిగిన ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారిని టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి రూ.వెయ్యి జరిమానా విధిస్తూ దోచేసేవాడు. ఈ క్రమంలో సోమవారం ఓ ప్రయాణికుడితో గొడవ పడుతుండగా పోలీసులు గమనించారు. ఎందుకు గొడవ పడుతున్నారని ప్రశ్నించగా ప్రయాణికుడు సార్ టికెట్ లేదని రూ.500 చెల్లించాలని, రసీదు ఇవ్వకుండా మరో రూ.500 చెల్లించాలని బెదిరిస్తున్నాడని తెలిపారు. నకిలీ టికెట్ కలెక్టర్ను ఆధారాలు చూపించమని పోలీసులు అతడిని ప్రశ్నించగా.. ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అయితే తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, తాను పొట్టకూటి కోసం మోసాలు చేస్తున్నట్లు తెలిపారు. అతని అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాళహస్తీశ్వరునికి బంగారు తొడుగు, రుద్రాక్షలు అందజేత
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామికి బి.కొత్తకోటకు చెందిన ఉషారాణి దంపతులు మంగళవారం రూ.3 లక్షలు విలువ చేసే 25 గ్రామలు బంగారు తొడుగు రుద్రాక్ష మాలను అందజేశారు. వీటిని ఈఓ బాపిరెడ్డి స్వీకరించి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలకు ఈఓ స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారికి ఆశీర్వవచనం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. మాయమాటలతో మహిళ చైన్ అపహరణ తిరుపతి క్రైమ్: నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద మామిడి ఆకులు విక్రయిస్తున్న మహిళలను గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలతో మోసం చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. వెదురుకుప్పం గ్రామానికి చెందిన కళావతి దీపావళి పండగ సందర్భంగా తిరుపతిలోని కూరగాయల మార్కెట్ వద్ద మామిడి ఆకులు విక్రయించేందుకు తిరుపతికి వచ్చింది. ఇదే క్రమంలో గుర్తు తెలియని మహిళ ఆమె వద్దకు వచ్చి, మన వద్ద ఉన్న నగలను జాగ్రత్తగా ఉంచుకోవాలని మొదటగా నమ్మించింది. పక్కకు పిలిచి ఆ నగలను చేతికి తీసుకుని మూట కట్టుకోవాలని తెలిపింది. లేదంటే మూట కూడా వద్దని పేపర్లో చుట్టుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న నకిలీ చైన్ను కళావతికి పేపర్లో చుట్టి ఇచ్చి ఆమె బంగారు చేన్తో ఉడాయించింది. ఆమె తేరుకుని పరిశీలించగా తాను మోసపోయామని తెలుసుకుంది. ఈ విషయమై బాధితురాలుతన 16 గ్రాములు చేన్ చోరీ జరిగినట్లు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈస్ట్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్లు తిరుపతి ఎడ్యుకేషన్ : దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఈ నెల 18 నుంచి నవంబరు 18వ తేదీ వరకు వివిధ ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ ప్రకటించినట్లు జీఎం సి.అమరేంద్రనాథ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రూపాయికే సిమ్కార్డుతో పాటు 30రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ ఇంటర్నెట్, 100ఎస్ఎంఎస్లు ఉంటాయని తెలిపారు. ఏదేని కార్పొరేట్ కస్టమర్ కనిష్టంగా పది అంతకుమించి పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు తీసుకున్నా, ఒక ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ తీసుకున్నా వారికి మొదటి నెల రీచార్జ్పై 10శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 18నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ ద్వారా మిత్రులకు, కుటుంబ సభ్యులకు రీచార్జ్ చేస్తే, రీచార్జ్ మొత్తంలో 2.5శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. దీపావళి సందర్భంగా సీనియర్ సిటిజన్లకు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.1,812కే సిమ్కార్డుతో పాటు 365 రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ డేటా, 100ఎస్ఎంఎస్లు, 6నెలల పాటు బైటీవీ సబ్స్క్రిప్షన్ అందించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.485, రూ.1,999 ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసిన వారికి 5శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పిడుగు పాటుకు ఇల్లు దగ్ధం
చిల్లకూరు: వర్షాల కారణంగా సోమవారం రాత్రి ఓ ఇంటి సమీపంలో పిడుగు పడడంతో ఓ ఇల్లు కాలిపోయిన సంఘటన మండలంలోని లింగవరం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. లింగవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఆదివారం నెల్లూరులోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. వర్షాలు భారీగా కురుస్తుండడంతో ఆమె అక్కడే ఉండి పోయింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి సమీపంలో పిడుగు పడడంతో ఇంటితోపాటు అందులోని ఎలక్ట్రికల్ వస్తువులు పూర్తిగా కాలి పోయాయి. స్థానికులు ఆమెకు మంగళవారం సమాచారం ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చి చూసుకోగా ఇంట్లో వస్తువులు ఏమి మిగలకపోవడంతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు. -
జర్నలిస్టు కాలనీలో దొంగలు పడ్డారు..!
తిరుపతి రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదర్ డెయిరీ సమీపంలో ఉన్న జర్నలిస్టు కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. చీకటి పడిన వెంటనే విద్యుత్ మోటార్లు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు కథనం మేరకు.. గాంధీపురం పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న జర్నలిస్టు కాలనీలో ఇళ్లలోకి దొంగలు యథేచ్ఛగా వస్తుండడంతో ఇంటి లోపల మహిళలు ఒంటరిగా ఉండాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆ కాలనీలోని వీధుల్లో విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడం, ఆ ఇళ్లకు ఆనుకుని ముళ్ల చెట్లు ఏపుగా పెరగడంతో దోపిడీ దొంగలు, మత్తుకు భానిసైన యువకులు ఆ చెట్ల మాటున దాక్కుంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి విద్యుత్ మోటార్లు, విలువైన వస్తువులను అపహరించేందుకు ప్రయత్నం చేశారు. గుట్టుగా చోరీకి పాల్పడుతున్న ఆ ఇద్దరిని ఓ జర్నలిస్టు గుర్తించి, ఎవరని ఆరా తీయగా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో స్థానికులు చుట్టుముట్టి వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పరుగెత్తి ముళ్ల చెట్ల మాటున చీకట్లో దాకున్నారు. ఇంతలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుపతి రూరల్ ఎస్ఐ షేక్షావల్లీతో పాటు పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని ముళ్ల చెట్లు మాటున దాక్కున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ చెట్లు మాటు నుంచి బయటకు వచ్చిన మగ వ్యక్తి పరారుకాగా, మహిళ పోలీసులకు చిక్కింది. ఆ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించి, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. కాగా జర్నలిస్టుల కాలనీలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. -
అమరుల సేవలు చిరస్మరణీయం
తిరుపతి క్రైమ్: అమర వీరుల సేవలు చిరస్మరణీయమని, వారి సేవలు స్మరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి హాజరై, పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు రాకుండా సమాజాన్ని కాపాడుతూ, ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం మన అందరి బాధ్యతని, పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు సమాజాన్ని కాపాడడంలో ముందుంటూ, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గత ఏడాది 191 మంది పోలీసు సిబ్బంది దేశ సేవలో ప్రాణత్యాగం చేశారని, అందులో మన రాష్ట్రానికి చెందిన ఐదుగురు పోలీసు సిబ్బంది ఉన్నారని తెలిపారు. పోలీసు సిబ్బంది కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, వారి త్యాగాలకు మనమంతా జోహార్లు అర్పించాల అన్నారు. ‘దేశ సేవలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు వృథా కావని, రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీసు సిబ్బంది సహా దేశవ్యాప్తంగా ప్రాణాలర్పించిన 191 మంది అమరవీరుల కుటుంబాలకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నానన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకునే పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం మన దేశానికి గర్వకారణమైన రోజని అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బంది తమ కర్తవ్య నిష్ఠను, త్యాగాన్ని స్మరించుకుంటూ, ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకాలను గౌరవంగా తలచుకుంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, దేశ సరిహద్దు భద్రత, అంతర్రాష్ట్ర నేరాలు, టెరర్రిజం, నక్సలిజం నిర్మూలన, అంతర్గత ముప్పులను ఎదుర్కొనడంలో అనేక మంది భద్రతా దళాలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి కర్తవ్యనిబద్ధత, ధైర్యం, త్యాగం ఫలితంగానే ఈ రోజు మనం శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ‘పోలీసు సేవ అనేది కేవలం ఉద్యోగం కాదని, అది ఒక మహత్తరమైన బాధ్యత అన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా కేదారీగౌరీదేవి వ్రతం
శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కేదారీగౌరీదేవి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారి ముందు కలశస్థాపన చేసి కేదారీగౌరీదేవి వ్రతం జరిపారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, కేదారీగౌరీదేవి వ్రతం సందర్భంగా నోములు నోచుకున్నారు. నోముదారాలు స్వీకరించారు. అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయంలో రద్దీ పెరిగింది. ఈ కార్యక్రమంలో ఈఓ బాపిరెడ్డి, ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బతుకు వేటలో గిరిజనం
సూళ్లూరుపేట: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పులికాట్లో నీరు చేరడంతో గిరిజన జాలర్లకు బతుకు పంట పండింది. వేటలో నిమగ్నమై చేపలు తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో వారికి ఆదాయం చేకూరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రంలో ఆటుపోట్ల కారణంగా కడలి కల్లోలంగా మారింది. పెద్దపెద్ద ఆలలు వస్తుండడంతో సముద్రం నుంచి నీరు భారీగా పులికాట్ సరస్సుకు చేరుతోంది. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో ఉండే గిరిజన జాలర్లుకు చేతి నిండి పనిదొరికినట్లు అయ్యింది. చేపలవేట జీవనాధారంగా బతుకుతున్న గిరిజన జాలర్లు నాలుగు డబ్బులు సంపాదించేందుకు విసురుడు వలలతో చేపల వేటలో నిమగ్నమై బతుకు పోరాటం సాగిస్తున్నారు. పులికాట్ సరస్సు వెంబడి తడ మండలం నుంచి చిట్టమూరు మండలం వరకు ఉన్న సుమారు ఐదారు వేల గిరిజన కుటుంబాలకు చేపల వేటే ప్రధానవృత్తి. గిరిజనులకు పడవలు, పెద్ద పెద్ద వలలు కోనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేక పోవడంతో విసురుడు వలలను వారే స్వయంగా అల్లుకుని చేపల వేట సాగిస్తారు. ఈక్రమంలో సూళ్లూరుపేట–శ్రీహరికోట మార్గంలో ఉన్న చిన్న బ్రిడ్జిలపై నిలబడి వల విసిరి చేపల వేట సాగిస్తున్నారు. -
సినీ ఫక్కీలో చోరీ
పాకాల:మండల కేంద్రంలో సోమవారం గొలుసు దొంగల ముఠా సినీ పక్కీలో చోరీ చేసిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలి కథనం మేరకు.. పాకాల మండలం గాదంకి వద్ద కమలమ్మ(84) వృద్ధురాలు ఆర్టీసీ బస్సు ఎక్కి పాకాల బస్స్టాండ్లో దిగింది. అదే సమయంలో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు కమలమ్మ వద్దకు చేరుకుని ఆమెతో కలిపారు. తమది కూడా మీ పక్క ఊరే అంటూ కుశల ప్రశ్నలు అడిగారు. మెడలో వేసుకున్న బంగారు నగలు వైపు చూస్తూ పట్టపగలు ఇలా ఎందుకు నగలు వేసుకొచ్చావ్, అసలే పాకాలలో దొంగలు ఎక్కువగా తిరుగుతున్నారంటూ వృద్ధురాలికి నమ్మకం కలిగేలా మాటలు చెప్పారు. ఏమీ కాదులే అన్న వృద్ధురాలితో లేదు లేదు ఈ మధ్యనే తమ బంధువులు ఒకావిడ ఇలాగే నగలు వేసుకొస్తే నగలు దొచుకెళ్లారని నమ్మబలికింది. వారి మాటలు వినిన వృద్ధురాలు వారితో మాటలు కొనసాగింది. ఇదే అదునుగా భావించిన ఆ గుర్తు తెలియని మహిళలు వృద్ధురాలి మెడలోని గొలుసుని తీసుకుని, వృద్ధురాలి వద్ద ఉన్న బ్యాగులో వేసుకోవాలని సూచించారు. వారి మాటలు నమ్మిన కమలమ్మ మెడలోని సుమారు 3 సవర్ల బంగారు గొలుసును తీసి బ్యాగులో పెట్టే ప్రయత్నం చేసింది. అలా కాదంటూ గుర్తు తెలియని మహిళలు తమ వద్ద ఉన్న ఓ పేపర్లో చుట్టి ఇలా బ్యాగులో పెట్టాలని నమ్మించారు. నమ్మిన కమలమ్మ పాకాలలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లి పోయింది. అనంతరం తన బ్యాగులో బంగారు గొలుసు కోసం బ్యాగులో ఉన్న పేపర్ను తెరవగా అందులో అసలు బంగారు గొలుసు బదులు నకిలీ గొలుసు ఉండడం చూసి షాక్కు గురైంది. తనను ఆ ఇద్దరు మహిళలు మోసం చేశారని గుర్తించిన కమలమ్మ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు పాకాల పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. సీఐ సుదర్శన్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయానికి ఇచ్చిన నగలు మాయం!
పుంగనూరు : పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చిన నగలు మాయం చేశారంటూ దాత అని చెబుతున్న ఆదినారాయణ అనే వ్యక్తి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. వివరాలిలా ఉ న్నాయి.పుంగనూరు మండలంలోని ఉలవలదిన్నెకి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి తన తల్లి కోరిక మే రకు 352 గ్రాముల బంగారు నగలను 2008లో శ్రీవారికి విరాళంగా ఇచ్చినట్లు, ఆ నగలను అప్పటి ఈవో, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ ఏకాంబరంకు అందజేయగా, తనకు ఆ సమయంలో రశీదు ఇచ్చారని ఆరోపించారు. ఆ నగలు ప్రస్తుతం గరుడసేవలో వినియో గించకపోవడంతో ప్రస్తుతం పుంగనూరులోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి టీటీడీ ఆధీనంలో ఉంది. దీంతో టీ టీడీ వారిని ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా అలాంటి ఆభరణాలు టీటీడీ వద్ద లేవని తెలిపినట్లు దాత ఆది నారాయణ తెలిపారు. తన నగలు మాయం చేసిన ఈఓ, ఇప్పటి డీసీ ఏకాంబరంపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై డిప్యూటీ క మిషనర్ ఏకాంబరం విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ ఆదినారాయణ ఎలాంటి నగలు విరాళంగా స్వామివారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నకిలీ రశీదు సృష్టించి తనపై ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై చ ర్యలు తీసుకో వాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 21పిజిఆర్ 04 : పుంగనూరులో నగలు మాయం చేశారని ఆరోపిస్తున్న ఆదినారాయణ 21పిజిఆర్ 05 : నగలు ఇవ్వలేదని తెలుపుతున్న డీసీ ఏకాంబరం -
లారీ బోల్తా
చంద్రగిరి: ప్రమాదవశాత్తు భాకరాపేట ఘాట్లో లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కలకడ నుంచి టమాట లోడ్తో లారీ విశాఖపట్నం నగరానికి మంగళవారం బయలుదేరింది. భాకరాపేట కనుమలో పెద్ద మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ యజమాని నాగేశ్వరరావు, లారీ డ్రైవర్ ప్రసాద్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. భూసేకరణ వేగవంతం చేయండి తిరుపతి అర్బన్: జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి, నెల్లూరు, చైన్నె నేషనల్ హైవే పీడీలు, తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు, రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి సంబంధిత మండలాల తహసీల్దార్లు, తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులపై రేణిగుంట, పూడి, గూడూరు, పాకాల, తిరుపతి టౌన్ సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఆరులేన్ల రహదారులు నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని, రేణిగుంట నుంచి చైన్నె రహదారి పనులు పూర్తి చేయాలని, భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్భరత్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ఏపీకి వాయుగుండం టెన్షన్.. తిరుమలలో భారీ వర్షం
సాక్షి, అమరావతి: ఏపీని వాయుగుండం టెన్షన్ పెడుతోంది. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్’, మరికొన్ని జిల్లాలకు ‘ఎల్లో’ ఎలర్ట్లను జారీ చేసింది. మరోవైపు.. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశముందని ఐఎండీ తెలిపింది. క్రమంగా నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. తర్వాత 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది. ఇది తుపానుగా బలపడే అవకాశముందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో శుక్ర, శనివారాల్లో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని కొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి. అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బుధవారానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.రానున్న5రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు,ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపారు.దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 21, 2025తిరుమలలో భారీ వర్షం.. తిరుమలలో రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు టీటీడీ సిబ్బంది సూచనలు అందిస్తోంది.Most parts of #tirupati,#Chittoor districts will get light-moderate rains meanwhile intense bands from sea will cover #nellore district during next 2-3hrs. #NEM2025 #Monsoon2025 pic.twitter.com/EWnva4lHw3— tirupati weatherman (@TPTweatherman) October 22, 2025ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రాయచోటి ప్రాంతంలో పూర్తిగా నిండిన పింఛా ప్రాజెక్టు.. రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షాల కారణంగా జలాశయాలు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతున్నాయి. దీంతో, కడప, అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.ఐదు రోజులు వానలే.. రాబోయే ఐదు రోజులూ రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థలు తెలిపాయి. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నాయి. RAINFALL ALERT TILL MORNING ⚠️Rounds of Heavy to Very Heavy rains to continue along #Tirupati and #Nellore districts while Prakasam district along with coastal areas of Konaseema, Kakinada, Anakapalle, Krishna and even #Visakhapatnam city to see a spell of rains around Early… pic.twitter.com/JAqpDj7HFv— Andhra Pradesh Weatherman (@praneethweather) October 21, 2025 -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 26 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,343 మంది స్వామిని దర్శించుకున్నారు. 18,768 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.34 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి అర్బన్: ఈశాన్య రుతుపవనాలతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులు, డీఆర్వో నరసింహులుతో కలిసి వర్షాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షంతో ఇబ్బందులుంటే వెంటనే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0877–2236007 నంబర్కు సమాచారం ఇ వ్వాలని సూచించారు. అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాలు పడుతున్న తరుణంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి అధికారులు సమష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. ప్రధానంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించి, వరదనీరు పంపించే వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే అవసరం అయితే సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖ వ్యాధులు సోకకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఆ విభాగానికి చెందిన జేడీ ఆధ్వర్యంలో సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు సరైన అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా పాఠశాల, అంగన్వాడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు చెందిన పాత భవనాలను పరిశీలించి, ప్రమాదకరమైన స్థితి ఉంటే తగు జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. అత్యధికంగా వాకాడులో 104.6 మి.మీ. జిల్లాలో 117.6 మిల్లీమీటర్ల వర్షపాతం మంగళవారం నమోదైనట్లు సీపీఓ కార్యాలయ అధికారులు వెల్లడించారు. అయితే సరాసరిగా జిల్లాలో 32.9 మిల్లీమీటర్లుగా పేర్కొన్నారు. ప్రధానంగా వాకాడు మండలంలో 104.6 మి.మీ, సూళ్లూరుపేటలో 74.4 మి.మీ, ఓజిలిలో 62.8 మి.మీ, కోటలో 56.6 మి.మీ, దొరవారిసత్రంలో 53.8 మి.మీ, చిట్టమూరులో 53.6 మి.మీ, ఎర్రావారిపాళెంలో 5.2 మి.మీ, నారాయణవనంలో 4.6 మి.మీటర్ల నమోదైనట్లు పేర్కొన్నారు. -
అమరుల సేవలు చిరస్మరణీయం
అమరవీరుల సేవలు చిరస్మరణీయమని, వారి సేవలను ప్రతి పౌరుడు స్మరించుకోవాలని కలెక్టర్ వేంకటేశ్వర్ అన్నారు.ఔషధ మొక్కలపై పీజీ కోర్సులు తిరుపతి సిటీ: ఎస్వీయూ ఔషధ మొక్కల పెంపు, హెర్బల్ చికిత్సలపై ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా రు. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలోపు రెండేళ్ల పీజీ కోర్సు, ఏడాది పీజీ డిప్లొమో కోర్సుల ప్రా రంభం దిశగా కసరత్తు మొదలైంది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సు గంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికా రి ఆవుల చంద్రశేఖర్ యూనివర్సిటీని సందర్శించారు. నూతన వీసీ ప్రొఫెసర్ తాతా నరసింహరావుతోపాటు అధికారులను కలిసి సమీక్ష సమా వేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కోర్సుల ప్రారంభానికి వర్సిటీ అధికారులు చొరవ చూపాలన్నారు. ఎస్వీ యూ ప్రాంగణంలో ఔషధ మొక్కల నర్సరీని పెంచడానికి రూ.6.50 లక్షల నిధులను విడుదల చేసినట్లు బోర్డు సీఈఓ చంద్రశేఖర్ ప్రకటించారు. హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలను పంపితే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చా రు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, బోటనీ విభాగం ప్రొఫెసర్లు ప్రొఫెసర్ టీ విజయ, ప్రొఫెసర్ కామాక్షి, అధికారులు పాల్గొన్నారు. స్కిట్, జేఎన్టీయూలో విలీనం జీఓ విడుదల శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న స్కిట్ కళాశాలను జేఎన్టీయూలో విలీనం చేస్తూ మంగళవారం జీఓ విడుదలైంది. అయితే ఆలయానికి సంబంధించిన స్కిట్ కళాశాల భూములు, భవనాలను 33 ఏళ్ల పాటు లీజుకి ఇస్తున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ఎకరాకు రూ.వెయ్యి, భవనాలకు రూ.50 వేల చొప్పున అద్దె చెల్లించేలా జీఓలో ఉంది. బోధన, బోధనేతర సిబ్బంది సంబంధించిన నియామకాలకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి డైలామాలో పడింది. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 72,026 మంది స్వామివారిని దర్శించుకోగా 23,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల తిరుపతిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంటనే ఆలయం వెలపులకు వచ్చిన భక్తులు పరుగులు తీస్తూ చలువపందిళ్ల వద్దకు చేరుకుంటున్నారు. తిరుమల దుకాణాల్లో కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. తిరుమలలో నిర్మానుష్యంగా ఆలయ ప్రాంగణం -
నేడు పాఠశాలలకు సెలవు
తిరుపతి సిటీ: జిల్లాలో భారీ వర్షాలు కురు స్తున్న కారణంగాఈ నెల 22 తేదీన జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు బుధవా రం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. జిల్లాలో వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నందున తి రుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మే రకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రై వేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పే ర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీవైఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తమ పరిధి లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ సమాచారాన్ని వెంటనే చేరవేయాలన్నారు. విద్యాసంస్థలు పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరీక్షా విభాగం పనితీరుపై ఆ వర్సిటీ వీసీ నరసింగరావు మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా విభాగంలోని ఉద్యోగులు తమ పనితీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫలితాలు నిర్ణీత సమయంలో విడుదలయ్యేలా సంబంధిత అధికారులు చొర వ చూపాలని ఆదేశించారు. ఉద్యోగులు విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని, క్రమశిక్షణతో నిజాయితీగా వ్యవహరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. పరీక్షకు సంబంధించిన పనిలో నిర్లక్ష్యం, అలసత్వం, ఆలస్యం, క్రమశిక్షణా రాహిత్యం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు. ఏదైనా లోపాలకు సంబంధిత సిబ్బంది వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారని, ఎక్కడ నిర్లక్ష్యం గమనించినా కఠిన చర్యలకు వెనుకాడబోమనని హెచ్చరించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, పరీక్షల డీన్ ఆచార్య సురేంద్ర బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాజమాణిక్యం, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, పరీక్ష విభాగం సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలపై శ్రద్ధ పెట్టండి తిరుపతి అర్బన్: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. సమీక్షకు జూమ్ కా న్ఫరెన్స్ ద్వారా తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడు తూ మండల, డివిజన్, కలెక్టరేట్లో జరు గుతున్న పీజీఆర్ఎస్కు క్రమం తప్పకుండా అధికారులు హాజరుకావాలని చెప్పారు. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించే దిశగా పనిచేయాలని పేర్కొన్నారు. మండల, డివిజన్ స్థా యిలో పీజీఆర్ఎస్ నిర్వహించడంలో నిర్లక్ష్యం చూపితే వారిపై శాఖాపరమైన చర్యలు తప్ప వని హెచ్చరించారు. ప్రధానంగా కలెక్టరేట్లో తాగునీరు, వీధి లైట్లు, దారి సమస్య, శ్మశానం సమస్య తదితర అనేక అంశాలకు సంబంధించి కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో అర్జీలు ఇస్తున్నారని చెప్పారు. కలెక్టరేట్లో అ ర్జీలు ఇవ్వడం తప్పులేదని, అయితే చిన్న చిన్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కారిసత్తే, అర్జీదారులు వ్యయప్రయాసాలకోర్చి కలెక్టరేట్కు రావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ను ప్రతిష్ట్మాకంగా భావించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి కల్చరల్ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో భాగంగా ఈనెల 28వ తేదీన జరిగే జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలకు యువ కళాకారులను ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్ సీఈఓ య శ్వంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఈనెల 28న ఉదయం 9.30 గంటలకు నరసింహతీర్థం రోడ్డులోని ఎమరాల్డ్స్ డిగ్రీ, పీజీ కళాశాల జరుగుతాయన్నారు. జానపద గ్రూపు నృత్యాలు, జానపద గ్రూపు గీతాలు వాయిద్య కళాకారులతో సహా 10 మంది చొప్పున పాల్గొనవచ్చని తెలిపారు. కవిత్వం, ఇంగ్లీషు, హిందీ భాషలో ప్రకటన పోటీలు ఉంటాయని తెలిపారు. ప్రథమ స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీలలో 16 నుంచి 29 ఏళ్ల వయస్సులోపు కలిగిన యు వత పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 27వ తేదీ లోపు తమ పేర్లను పుట్టి తేదీ, పోటీలో పాల్గొనే అంశాలతో కూడి దరఖాస్తులను వాట్సాప్ నంబర్ 8341111687లో సంప్రదించాలని తెలిపారు. వైఎస్సార్సీపీలో నియామకాలు చిత్తూరు అర్బన్ : వైఎస్సార్ సీప్టీలో జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా యువత విభాగం కార్యదర్శిగా కె.కళ్యాణ్కుమార్ (పలమనేరు), అసెంబ్లీ ని యోజకవర్గ ఉద్యోగులు–పెన్షనర్ల విభాగం అ ధ్యక్షులుగా చీకాల శివప్రసాద్ (పూతలపట్టు), కె.నాగభూషణం (పలమనేరు), పి.సుబ్రమణ్యం (సత్యవేడు) నియమితులయ్యారు. -
తీరంలో రెడ్ అలర్ట్
వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో దీని ప్రభావంతో వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో మంగళవారం అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దాదాపు 5 నుంచి 7 మీటర్లు ఎత్తుకు ఎగసి పడుతూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంపై వేటకు ఎవరూ వెళ్లవద్దని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రెడ్డి నాయక్ ఆదేశించారు. మండలంలోని సముద్ర తీర మత్స్యకార గ్రామాలైన తూపిలిపాళెం, కొండూరుపాళెం, దుగ్గరాజపట్నం, అంజలాపురం, శ్రీనివాసపురం, ఓడపాళెం, వైట్కుప్పం, మొనపాళెం, చినతోట, పూడికుప్పం, పూడిరాయిదొరువు, నవాబుపేట గ్రామాల వద్ద హోరుగాలితోపాటు భారీ వర్షంతో సముద్రం ఉధృతంగా ఎగసి పడుతుంది. మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తగా రెండు రోజుల ముందుగానే వేటకు పోవడం మానుకున్నారు. తమ వేట సామగ్రిని ఒడ్డున భద్రపరిచి బోట్లకు లంగరు వేశారు. ఈ ఏడాది వేట నిషేధం తరువాత గత నాలుగు నెలల నుంచి అల్పపీడనాలు, వాయుగుండాలతో చేపల వేట సక్రమంగా జరగడం లేదు. దాదాపు ఈ నాలుగు నెలల్లో 45 రోజులుపాటు వేట నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మత్స్యకారులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
అపాయం.. అందని అభయం
అవి సరస్వతీ నిలయాలు.. ఆ విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో చిరుతల సంచారం.. ఈ పరిష్కారానికి శాశ్వత చర్యలు లేమి.. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళనలో విద్యార్థులు.. అయినా అటవీ, వర్సిటీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్యం.. హెచ్చరిక బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్న వైనం.. వెరసి ఆ వర్సిటీల్లో విద్యార్జనకు వచ్చిన వేలాది మంది యవతీ యువకులు.. కోటి ఆశలతో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. తిరుపతి సీటీ: శేషాచలం అడవులకు సమీపంలోని యూనివర్సిటీల్లోని విద్యార్థులు చిరుతల సంచారంతో కొన్నేళ్లుగా బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. గత ఏడాదిగా ఎస్వీయూ, ఎస్వీ వేదిక్, ఎస్వీ వెటర్నరీ, ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాల ప్రాంతాల్లో పలుసార్లు చిరుతలు సంచరించినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అలిపిరి నుంచి జూపార్క్ రోడ్డులో గతంలో పలుసార్లు ఉద్యోగులు, యాత్రికులపై చిరుతలు దాడి చేసి గాయపరిచినా అటు అటవీశాఖ అధికారులు, వర్సిటీ అధికారులు తేలికగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వర్సిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు సమాచారం వర్సిటీల్లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ అటవీశాఖ అధికారులు మాత్రం ఎస్వీయూ, ఎస్వీ వేదిక్, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీల్లో కేవలం మూడు బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, విద్యార్థులను అప్రమత్తం చేస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. చిరుతలు సంచరించే ప్రాంతాలపై అటవీ శాఖ రాత్రి సమయాల్లో పర్యవేక్షించకపోవడంతో చిరుతల సంచారం అధికమవుతోంది. ప్రస్తుతం వర్సిటీల్లో సుమారు రెండు చిరుతలు సంచరిస్తున్న పక్క సమాచారం ఉంది. కానీ తూతూ మంత్రంగా తాత్కాలిక బోన్లను ఏర్పాటు చేసి చిరుత బోనులో దొరికితే తాము ఏదో సాధించినట్లు వ్యవహరించి, బోనులో చిక్కుకున్న చిరుతలను మామండూరు, కోడూరు పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో వదులుతున్నారు. దీంతో తమ పని పూర్తి అయ్యిందని వర్సిటీ అధికారులకు, ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు.శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించరా? వర్సిటీల్లో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతలకు అటవీశాఖ, వర్సిటీ అధికారులు చెక్ పెడతారా? లేదా? దీనిపై పోరాటం చేయాలా అని వర్సిటీ విద్యార్థులు అధికారుల ను హెచ్చరిస్తున్నారు. అలిపిరి నుంచి వర్సిటీల సరిహద్దుల్లో తక్షణం కంచె ఏర్పాటు చేసి, చిరుతల సంచారానికి చెక్ పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కంచె ఏర్పాటు చేయకుంటే చిరుతల సంచారంతో జరగరాని సంఘటనలు జరిగి ప్రాణనష్టం జరిగితే వర్సిటీల అధికారులే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పట్టపగలు తిరగాలన్నా భయం ఎస్వీ వెటర్నరీ వర్సిటీ సమీపంలో గెస్ట్హౌస్ ప్రాంతంలో చిరుత ఓ శునకాన్ని చంపినట్లు అక్కడి విద్యార్థులు, ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అటు అటవీ శాఖ అధికారులు, ఇటు వర్సిటీ అధికారులు ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు వర్సిటీల్లో చిరుతలు హల్ చల్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పరిధిలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. ఈ విషయంపై వర్సిటీ అధికారులకు పలుసార్లు విన్నవించినా పట్టించుకోలేని విద్యార్థులు చెబుతున్నారు. పట్టపగలు వర్సిటీలో తిరగాలన్నా భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు.. భూమనకు నోటీసులు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి ఎస్వీ వర్శిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు. -
చిన్నారి అప్పగింత
తిరుపతి క్రైమ్ : తల్లిదండ్రుల నుంచి దూరమైన చిన్నారిని మహిళా పోలీసులు తిరిగి అప్పగించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. శనివారం రాత్రి 7 గంటల సమయంలో గోవిందరాజస్వామి ఆలయం వద్ద సుమారు 6 నెలల పాప ఏడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో రాత్రి అంతా ఓ మహిళ తన ఇంటికి తీసుకెళ్లి పాపను జాగ్రత్తగా చూసుకుంది. ఆదివారం ఉదయం మహిళా పోలీసుల వద్దకు చేర్చింది. ఈ క్రమంలో చిన్నారి అదృశ్యంపై ఈస్ట్ పోలీస్స్టేషన్కు ఫిర్యాదు అందిందని తెలియడంతో వెంటనే అక్కడకు వెళ్లి తల్లిదండ్రుల వివరాలను సేకరించి పాపను అప్పగించారు. పోలీసులకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
ముక్కంటి సేవలో కల్వకుంట్ల కవిత
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా సేవించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆమె ప్రత్యేకంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి ఆదిదంపతుల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రంమలో వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు, నేతలు పగడాల రాజు, వయ్యాల కృష్ణారెడ్డి, కంఠా ఉదయ్కుమార్, గున్నేరి కిషోర్రెడ్డి, మున్నా రాయల్, మునికృష్ణారెడ్డి, కూనాటి రమణయ్యయాదవ్, పఠాన్ ఫరీద్, పసల కృష్ణయ్య, ముని, శివకుమార్యాదవ్, పులి రామచంద్ర, శ్రీను, సాగీరాబీ, షర్మిల ఠాగూర్, పెరుమాళ్ చౌదరి, ఫజల్ పాల్గొన్నారు. -
పోలీసుల తీరుపై పాత్రికేయుల నిరసన
చిల్లకూరు : మీడియా ప్రతినిధులపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆదివారం గూడూరు టవర్ క్లాక్ వద్ద పలువురు పాత్రికేయులు నిరసన తెలిపారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు అధికమవుతున్నాయని, వాటిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై యథేచ్ఛగా దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఫూటుగా మద్యం తాగి బైక్పై వెళుతూ కిందపడిపోయారని, వారిని పైకి లేపినందుకు విలేకర్లపైన దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పోలీసుల దృష్టికి తీసుకెళితే హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ తిరుపతయ్య వెంటనే అక్కడకు చేరుకుని విలేకర్లకు నచ్చజెప్పారు. డీఎస్పీతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు. రోడ్డుపై భైఠాయించిన మీడియా ప్రతినిధులు -
కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం
కోట : కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుట్టిందని, దీంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిందేనని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ స్పష్టం చేశారు. ఆదివారం కోట మండలంలోని అల్లంపాడు, వంజివాక, పుచ్చలపల్లెలో పార్టీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన మోసపూరితంగా సాగుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పంగనామాలు పెట్టారని ఆరోపించారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా కేంద్రంతో పోరాడి 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే, వాటిని కుట్రపూరితంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేందుకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్రవర్మ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చారని కొనియాడారు. సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ యూరియా కోసం రైతులు క్యూలో బారులు తీరిన ఘటనలు గతంలో ఎప్పుడూ లేవన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పలగాటి సంపత్కుమార్రెడ్డి, కోట, చిల్లకూరు మహిళా కన్వీనర్లు రేష్మ, లలిత, నేతలు రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, సర్పంచ్ ఈశ్వర్రెడ్డి, ఉప సర్పంచ్ రాంబాబు, సాయిరెడ్డి, ప్రసాద్గౌడ్, సురేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు కోటయ్య పాల్గొన్నారు. -
కమీషన్ల వైద్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరఫ్ పసి ప్రాణాలను బలిగొంది. అలాగే రాజస్థాన్లోని మరణాలు సంభవించాయి. సిరఫ్ తీసుకున్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, పొట్ట ఉబ్బిపోయి...మూత్రపిండాలు దెబ్బతినడంతో మరణాలు సంభవించాయి. ఈ విషయం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ఆందోళనకు దారి తీసింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వైద్యంలో భద్రతను ప్రశ్ని స్తోంది. కాసుల కక్కుర్తి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. ఇష్టారాజ్యంగా తమిళనాడు, కర్ణాటక నుంచి జిల్లాలో మందులు, మాత్రల వ్యాపారాన్ని నడిపిస్తోంది. కాసుల కక్కుర్తికి పాల్పడుతోంది. నాణ్యత లేని వాటిని అంటగడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అతిక్రమిస్తోంది. ప్రధానంగా పసి వైద్యం పెనుగండంగా మారింది. పసి ప్రాణాలను బలి తీసుకుంటోంది. అయినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఇలా.. జిల్లాలో అధికారికంగా 1200 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. అనాధికారికంగా 1000పైగా నడస్తున్నాయి,. ఆర్ంఎపీ క్లీనిక్లు 2వేల వరకు ఉంటున్నాయి. ఇటీవల 150 వరకు నకిలీ ఆర్ఎంపీలు పట్టుబడగా..ఇంకా వేల మంది నకిలీ ఆర్ఎంపీల అవతారాన్ని గుట్టు రట్టు చేయాల్సి ఉంది. దీనికి తోడు మెడికల్ షాపులు 1500 వరకు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలు అతి క్రమిస్తున్నాయి. ఇష్టానుసారంగా మందులు, మాత్రలు అమ్మేస్తున్నాయి. అనుమతి లేని ఏజెన్సీలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి జిల్లాకు అత్యధికంగా మందులు, మాత్రలు సరఫరా అవుతున్నాయి. నిత్యం రూ. కోటి విలువ చేసే మెడిషన్లు జిల్లాకు దిగుమతి అవున్నాయి. రోజు వారీగా రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వ్యాపారం నడుస్తోంది. ఇదే అదునుగా చేసుకుని మెడికల్ ఏజెన్సీలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. జిల్లాలో 40పైగా ఏజెన్సీలు ఉండగా...అనుమతులు లేని ఏజెన్సీలు పదుల సంఖ్యలో ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా కొన్ని నాణ్యత లేని మందులు, మాత్రలు మార్కెట్లోకి చేరిపోతున్నాయని అంటున్నారు. కంపెనీలు కొత్తగా తయారు చేసిన మందులు, మాత్రలు డ్రగ్స్ కంట్రోల్ అనుమతులు రాకముందే మార్కెట్లోకి వచ్చేస్తున్నాయని వెల్లడిస్తున్నారు. చాలా మంది వైద్యులు కమీషన్లకు కుక్కర్తి పడి... నాణ్యత లేని మందులను రెఫర్ చేస్తున్నారని, ఇది ప్రజానీకానికి ప్రమాదం పొంచి ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోల్డ్రిఫ్లో ఏముంది.. మధ్యప్రదేశ్లో దగ్గు సిరఫ్ తీసుకున్న పిల్లలు మరణించారు. అక్కడి ప్రభుత్వం చేపట్టిన పరిశీలనలో పలు విషయాలు బయటకొచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం సైతం ఆ సిరఫ్పై పరిశీలన చేయగా వాస్తవాలను బయటపెట్టి..ఉత్పత్తిని ఆపేసింది. కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరఫ్లో (బ్యాచ్ నంబర్ –ఎస్ఆర్ –13), డై ఇథైలిన్ గ్లైకాల్ (డీఈజీ–48.6శాతం) అనే ప్రమాదకర రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఇదంతా పిల్లలను హరించేలా పనిచేస్తాయని వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఇదీ కిడ్నీపై ప్రభావితం చేస్తోందని బయటపడింది. కట్టడి చర్యలు ఏమాత్రం... మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటనలు చూసి కూడా జిల్లా అధికారుల్లో కనీస చలనం లేదు. జిల్లా లో అనధికారిక ఆస్పత్రులు కుప్పలు తెప్పలుగా ఉన్న చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. జిల్లాలో పలు ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకుని పిల్లలు మృతి చెందిన ఘటనలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డ్రగ్స్ నియంత్రణ శాఖ అధికారులకు కనువిప్పు కలిగించడం లేదు. ఇలానే వదిలేస్తే..మరో మధ్యప్రదేశ్ వంటి ఘటనలను జిల్లాలో చూడక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లల మందులు సైతం... జిల్లాలో ప్రధానంగా గుండె, బీపీ, షుగర్, క్యాన్సర్, తదితర సమస్యలకు సంబంధించిన మందులు, మాత్రలు మాత్రమే ఎక్కువగా అమ్ముడుబోతున్నాయి. తర్వాత గర్భిణులు, చిన్నపిల్లలకు సంబంధించిన మాత్రలు అధిక మొత్తంలో విక్రయాలు జరుగుతున్నాయి. కానీ పిల్లల విష యంలో చాలా మంది వైద్యులు సరైన నిబంధన లు పాటించడం లేదు. చికిత్స చేయడంతో పాటు జ్వరం, జలుబు వంటి వాటికి కూడా ఇంజెక్షన్లు, సిరఫ్ ఇచ్చేస్తున్నారనేది ఇప్పుడు ప్రధానమైన వాదనగా నడుస్తోంది. అందులోనూ అధికంగా కమీషన్ ఇచ్చే మందులు, మాత్రలను మాత్రమే రెఫర్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్లో తరహాలో జిల్లాలో కూడా చాలా మంది వైద్యులు చిన్న పిల్లల దగ్గు, జలుబు నివారణకు కోల్డ్రిఫ్ను రెఫర్ చేశారని పలువురు అంటున్నారు. ఈ కోల్డ్రిప్ తయారీ కంపెనీ తమిళనాడులోని చైన్నెలో ఉండడం గమనార్హం. -
గ్రామదేవత విగ్రహ ధ్వంసం
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని కుక్కంబాకం పంచాయతీ తానిగిల్లు గ్రామ దేవత వేమలమ్మ విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం ఈ మేరకు పోలీసుస్టేషన్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గేట్ల తాళాలు పగులగొట్టి ఆలయంలోకి చొరబడి అమ్మవారి ప్రతిమను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. పరిపూర్ణం.. పవిత్రోత్సవం చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో పరిపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం ఆలయ మాడ వీధుల్లో దేవదేవేరులను ఊరేగించారు. ఈ క్రమంలోనే యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్ బాబు, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,136 మంది స్వామివారిని దర్శించుకోగా 29,023 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. వీధి కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు బుచ్చినాయుడుకండ్రిగ : స్థానిక ఈబీసీ కాలనీలో ఆదివారం వీధి కుక్కలు దాడి చేయడంతో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. కాలు విరిగిపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రైలు కిందపడి వ్యక్తి మృతి తిరుపతి క్రైమ్ : తిరుపతి–రేణిగుంట మార్గంలోని రిలయన్స్ అండర్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించామని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించామని వెల్లడించారు. మృతుడు వివరాలు తెలిసిన వారు 9440627638 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
సెల్ఫోన్ దొంగలు అరెస్ట్
తిరుపతి క్రైం: సెల్ఫోన్ దొంగలను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కథనం.. సెల్ఫోన్ దొంగల సమాచారం మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రామాంజినేయులు, సిబ్బంది తిరుపతిలోని విష్ణునివాసం, రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర పరిసరాల్లో నిఘా పెంచారు. అక్కడ తచ్చాడుతున్న అనంతపురం జిల్లాకు చెందిన పవన్కుమార్నాయక్, హైదరాబాద్కు చెందిన మందాల దినేష్, ప్రకాశం జిల్లాకు చెందిన మోగానందరెడ్డి, మదనపల్లికి చెందిన అశోక్, కడపకు చెందిన శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భక్తులు, యాత్రీకులు, ప్రయాణికుల వద్ద సెల్ఫోన్లు చోరీ చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో విష్ణునివాసం వద్ద బెంగళూరుకు చెందిన యాత్రికుల రెండు సెల్ ఫోన్లు, 30 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్టు అంగీకరించారు. అలాగే టీటీడీ శ్రీనివాసం వద్ద యాత్రికుల రూమ్లో మూడు సెల్ఫోన్లు, రూ.10 వేల నగదు దొంగతనం చేసి పట్టుబడ్డారు. ఈ మేరకు వారి నుంచి 18 సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఆపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 30 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. అదివారం అర్ధరాత్రి వరకు 84,017 మంది స్వామివారిని దర్శించుకోగా 30,097 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.97 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ప్రాణం తీసిన గుంత
వరదయ్యపాళెం: మండలంలోని శ్రీకాళహస్తి–తడ మార్గంలో ఆర్ అండ్ బీ రహదారిపై పడిన గుంత నిండు ప్రాణాన్ని బలిగొంది. సత్యవేడు మండలం, జడేరి పంచాయతీ, కేవీకండ్రిగకు చెందిన ఎం.వెంకటేశులు (35) శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ తడలో నివాసముంటున్నారు. ఈ నెల 6న రాత్రి 10 గంటల సమయంలో వరదయ్యపాళెంలో తన స్నేహితుడిని కలుసుకుని తిరిగి తడలోని ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలోని బత్తలవల్లం సమీపంలో ఇనమాలగుంట వద్ద ఆర్ అండ్ బీ రోడ్డుపై ఉన్న గుంతలో దిగి అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్ల దుస్థితి కారణంగా నిండు ప్రాణం గాల్లో కలిసింది. ఈ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
24న చైన్నెలో కార్గో వస్తువుల వేలం
తిరుపతి అర్బన్ : చైన్నెలోని మాధవరం బస్టాండ్లో ఉన్న తిరుపతి కార్గో పాయింట్ వద్ద డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను ఈ నెల 24వ తేదీన వేలం వేయనున్నట్లు ఆర్టీసీ కార్గో ఇన్చార్జి నిర్మల తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు వేలం ఉంటుందని, పాట దక్కించుకున్నవారు వెంటనే మొత్తం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే వస్తువులను సైతం తక్షణమే తీసుకువెళ్లాల్సి ఉంటుందని వివరించారు. పారా మెడికల్ కోర్సులకు ఫైనల్ కౌన్సెలింగ్ రేపు తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాలలో అలైడ్ హెల్త్ సైన్స్ ప్రొఫెషనల్ కౌన్సిల్ డిప్లొమా, పారామెడికల్ కోర్సుల్లో మిగులు సీట్లకు మంగళవారం తుది కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిప్లొమా, పారామెడికల్ కోర్స్లలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇప్పటికే ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు 9440879943 నంబర్లో సంప్రదించాలని సూచించారు. అంధకారంపై విజయమే దీపావళి తిరుపతి అర్బన్ : అంధకారంపై వెలుగు సాధించిన విజయమే దీపావళి పండుగని కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈఓ అనిల్కుమార్ సంఘాల్ తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ జిల్లావాసులందరూ సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని కోరారు. ఏపీ లాసెట్, పీజీఎల్సెట్ అడ్మిషన్లు ప్రారంభం తిరుపతి రూరల్ : ఏపీ లాసెట్– పీజీఎల్సెట్–2025 అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీల ప్రకారం ప్రక్రియను పూర్తిచేసి క్లాసులకు హాజరు కావలసిందిగా కన్వీనర్ సీతాకుమారి తెలిపారు. అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. 23న వెబ్ ఆప్షన్లు మార్పు, 25న సీటు అలాట్మెంట్, 27 నుంచి 29 వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశం ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు httpr://cetr.aprche.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. రేపు తుమ్మలగుంటలో నరకాసుర వధ తిరుపతి రూరల్ : దీపావళి వేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం సోమవారం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద నరకాసుర వధ నిర్వహించనున్నారు. ఇందుకోసం రూ.2లక్షల వ్యయంతో 20 అడుగుల నరకాసుర ప్రతిమను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు నరకాసుర వధ కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. -
అధ్యాపకుల కొరత
శాశ్వత అధ్యాపకుల కొరత వర్సిటీని తీవ్రంగా వేధిస్తోంది. సుమారు 400 మందికి పైగా శాశ్వత అధ్యాపకులు అవసరం ఉండగా కేవలం 130మంది మాత్రమే ప్రస్తు తం ఉన్నారు. తాత్కాలిక అధ్యాపకులను సైతం ఇటీవల తొలగించడంతో నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమవుతున్నారు. భాషా ప్రాతిపదిక కోర్సులైన సంస్కృతం, తెలుగుపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో పాటు హిస్టరీ, పొలిటికల్ సైనం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, హోంసైన్స్ వంటి కోర్సులలో ఈ ఏడాది కనీసం 15శాతం సైతం అడ్మిషన్లు కూడా లేకపోవడం దారుణం. ఎస్వీయూ పరిపాలనా భవనం -
విహంగాల విహారం
దొరవారిసత్రం: ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాలకు అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా బాసిల్లుతున్న తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విహంగాల ఆగమనం మొదలైంది. దీంతో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నీటితో నిండి ఉంటే ఈ పాటికే అన్ని రకాల పక్షుల విచ్చేసి వాటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కాని ఈ దఫా విహంగాల సీజన్(అక్టోబర్లో మొదలై ఏప్రిల్లో ముగుస్తుంది) మొదలైనప్పటికీ విదేశీ వలస విహంగాలు సందడి ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో పదుల సంఖ్యలో పక్షుల్లో రారాజుగా పిలిచే గూడబాతుల(పెనికాన్స్)తోపాటు తెల్లకంకణాయిలు(వైట్ ఐబీస్) వందల సంఖ్యలో నత్తగుళ్లకొంగలు విచ్చేసినట్లు స్థానిక వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలియజేశారు. పక్షుల కేంద్రంలో ఈపాటికే... వర్షాలు సకాలంలో కురిసి ఉంటే పక్షుల కేంద్రం పరిధిలోని అత్తిగుంట చెరువు, నేరేడుగుంట చెరువు, మారేడుగుంట చెరువుల్లో నీరు చేరి ఉంటే వలస విహంగాల్లో ప్రధాన పక్షులు అన్ని ఈ పాటికే చేరి, చెరువుల్లో ఉన్న కడప చెట్లపై చేరి ఆడ, మగ పక్షులు ఒకదాని ఒక్కటి స్నేహం కుదుర్చుకుని పుల్లలతో గూళ్లు కట్టుకుంటూ ఉండాలి. కాని వానలు సక్రమంగా కురవకపోవడంతో వలస విహంగాల సీజన్ ఆలస్యం కాకతప్పలేదు. ఇప్పుడైన పుష్కలంగా వానలు కురవందే వలస విహంగా పూర్తి స్థాయిలో కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదు.ఇప్పటి వరకు కురిసిన వానలకు చెరువుల్లోకి అరకొరగానే సాగు నీరు చేరాయి. కేంద్రంలో విదేశీ వలస విహంగాలకు పూర్తి స్థాయిలో వాతవరణం అనుకూలిస్తేనే వేల సంఖ్యలో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, స్వాతికొంగలు, వందల సంఖ్యలో తెడ్డుముక్కుకొంగలు, నీటికాకులు, బాతుజాతికి చెందిన పలు రకాల పక్షుల విచ్చేసి వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోలేవు. స్వదేశీ విహంగాలైన నత్తగుళ్లకొంగలు పక్షుల కేంద్రంలోకి గత నెలలోనే వందల సంఖ్యలో విచ్చేశాయి. ఈపక్షుల్లో కొన్ని జత కట్టె పనుల్లో ఉండగా మరి కొన్ని కడప చెట్లపై గూళ్లు కట్టుకునే పనిలో ఉన్నాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్ జామ్
సాక్షి, తిరుమల: తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డాయి. బండ రాళ్లు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. తిరుమలలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డులో తొమ్మిదో కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ బండరాళ్లు రోడ్డు మీద పడిపోవడంతో వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది కలిగింది. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు విరిగిపడిన కొండ చరియలను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్కి అంతరాయం లేకుండా జేసీబీలతో బండరాలను తొలగిస్తున్నారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 82,136 మంది స్వామివారిని దర్శించుకోగా 29,023 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుపతి చేరుకున్న కల్వకుంట్ల కవిత...తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(mlc-kalvakuntla-kavitha) తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర నేపథ్యంలో తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కవిత తిరుపతి చేరుకున్నారు. తన భర్త అనిల్, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారితో కలిసి శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి(tirupati) కి ప్రయాణమయ్యారు. కవితకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.. శనివారం హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత. -
కూటమి అరాచకాలపై సమరం
శ్రీకాళహస్తి : కూటమి అరాచకాలపై ఉద్యమించాలని, రెడ్బుక్ ఆగడాలను డిజిటల్ బుక్లో నమోదు చేద్దామని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో శనివారం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్ని మండలాలు, పట్టణం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ముందుగా గ్రామ, వార్డు, మండల కమిటీల నియామకాలపై వైఎస్సార్సీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. అక్రమ కేసుల అరెస్టుపై పోరాటం చేసేందుకు జగనన్న సైన్యం సిద్ధంగా ఉండాలని కోరారు. కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని నిరంకుశ పాలనకు మంగళం పాడే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. జగనన్న చేసే యజ్ఞంలో మనం క్రియాశీల పాత్రదారులం కావాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని బూతు స్థాయిలో నిత్యం పరిశీలిస్తూ ఉండాలన్నారు. టీడీపీ ఎల్లో మీడియా, సోషల్ మీడియా చేస్తున్న గ్లోబెల్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యమని జగనన్న మాటగా గ్రామస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ముక్కంటి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎంపీ గురుమూర్తి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం -
వైద్య విద్యను కాపాడుకుందాం
పుత్తూరు: కోటి సంతకాల ప్రజాఉద్యమంతో వైద్య విద్యను కాపాడుకుందామని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఏడీకే కల్యాణ మండపంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన పాలనలో మొత్తం 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో ఐదింటిని పూర్తిచేసి ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అన్ని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెల్టుషాపులపై ఉన్న శ్రద్ధ.. మెడికల్ కాలేజీలపై లేదా? గల్లీగల్లీలో బెల్ట్ షాపులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, మెడికల్ కాలేజీలపై ఎందుకు లేదని చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. వైద్య విద్య ప్రైవేటీకరణను ప్రజాఉద్యంతోనే అడ్డుకోవాలని, దీనికి ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకుడు కంకణధారుడు కావాలని పిలుపునిచ్చారు. జగనన్న సీఎంగా తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలను సైతం తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘సూపర్గా’ మోసం! సూపర్ సిక్స్ పేరిట ప్రతి ఒక్కరినీ మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ, చేయూత, ఆసరా వంటి పథకాలను అటకెక్కించారన్నారు. రైతు భరోసా కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు ఇచ్చి మోసం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. కోటి సంతకాలతో అడ్డుకుందాం మెడికల్ కళాశాలల వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు వివరించి సంతకాలు చేయించాలని మాజీ మంత్రి రోజా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయించే కోటి సంతకాల పేపర్లతో జగనన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలసి వెళ్లి గవర్నర్కు అందజేస్తారని తెలిపారు. తద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకొందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎ.హరి, వైస్ చైర్మన్లు డి.జయప్రకాష్, డీ.శంకర్, వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకాంబరం, రూరల్ పార్టీ ఆధ్యక్షుడు అన్నా లోకనాథం, ఎంపీపీ మునివేలు, వైస్ ఎంపీపీ మునస్వామిరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ముగిసిన యువ తరంగ్
తిరుపతి సిటీ : ఎస్వీయూలో మూడు రోజులుగా ఎస్వీ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చర్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యువ తరంగ్ కార్యక్రమం శనివారం ముగిసింది. శ్రీనివాసా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ విజయ భాస్కరరావు మాట్లాడుతూ.. మనిషి జీవన వికాసానికి కళలు మూలాధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు మాట్లాడుతూ.. ఎన్నో గొప్ప చారిత్రక సాంస్కతిక కార్యక్రమాలను యూనివర్సిటీ చేపట్టిందని గుర్తు చేశారు. శనివారం శ్రీనివాస ఆడిటోరియం, అన్నమయ్య భవనం, సేనెట్ హాల్ వంటి కేంద్రాల్లో నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ బీవీ మురళీధర్, కల్చర్ అఫైర్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, న్యాయ నిర్ణేతలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
30న ముగియనున్న సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు
తిరుపతి సిటీ: 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఈనెల 30వ తేదీ చివరి గడువుని విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడే డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష విధానం, నమూనా ప్రశ్నలు, మాక్ టెస్టులు, కోచింగ్ వంటి మరిన్ని వివరాలకు వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రాన్ని సంప్రదించాలని, లేదా 8688888802 /9399976999 నంబరులో సైతం సంప్రదించవచ్చని తెలిపారు. సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల శిక్షణలో విశ్వం విద్యార్థులు గత కొన్నేళ్ల నుంచి అగ్రగామి సీట్లు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మద్యం మత్తులో మీడియా ప్రతినిధిపై దాడి చిల్లకూరు : తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బనిగేసాహెబ్ పేట కూడలి వద్ద ముగ్గురు యువకులు స్థానికంగా ఉండే ఓ టీవీ రిపోర్టర్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గూడూరు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదివే ముగ్గురు విద్యార్థులు మద్యం తాగి గురువారం రాత్రి బైక్ నడుపుతుండగా బనిగేసాహెబ్ పేట కూడలి వద్ద అదుపు తప్పి కింద పడిపోయారు. తాగి అంత వేగంగా వెళ్లడం ఎందుకని అక్కడే ఉన్న ఓ టీవీ రిపోర్టర్ వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్ని మీడియా ప్రతినిధి తన సెల్ఫోన్తో వారిని వీడియో తీసేందుకు ప్రయత్నించగా అతడి సెల్ఫోన్ లాక్కుని ముగ్గురు యువకులు మూకుమ్మడిగా మీడియా ప్రతినిధిపై దాడికి తెగబడ్డారు. దీంతో స్థానికులు వారిపై తిరుగుబాటు చేయడంతో మద్యం మత్తులో ఉన్న యువకులు అక్కడ నుంచి పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు రోజుల తరువాత స్పందించి యువకులను స్టేషన్కు పిలిచి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తాగి వాహనం నడిపిన 26 మందిపై కేసు నాయుడుపేటటౌన్ : నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 26 మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. దీనిపై న్యాయమూర్తి విచారించి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం 26 మందికి రూ.2.60 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ బాబి తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి మృతి చంద్రగిరి : రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి మామండూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఒడిస్సాకు చెందిర రుద్రప్రసాద్(33) ముంగళిపట్టు సమీపంలోని జగనన్న కాలనీలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి రుద్ర ప్రసాద్ మామండూరు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఢీకొనడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తిరుపతి సిటీ : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని యువజన, విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. శనివారం వైఎస్సార్సీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గంధమనేని శివయ్య భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కాసులకు కక్కుర్తి పడి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన 17 మెడికల్ కళాశాలలో 7 కళాశాలలు నిర్మాణం పూర్తి చేసుకొని, 5 కళాశాలలో అడ్మిషన్లు పూర్తయ్యి, మిగిలిన కళాశాలల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూరే వేసలుబాటు ఉన్నా చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నామని, ఇందులో స్వచ్ఛందంగా ప్రజలు భాగస్వామ్యంకావాలని పిలుపునిచ్చారు. కోటి సంతకాల కార్యక్రమానికి మద్దుతు ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తన బినామీల కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో తీసుకొస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు రామకృష్ణ, ప్రవీణ్. వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు జ్ఞానేంద్ర, నరేష్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు చెంగల్ రెడ్డి, వినోద్, యశ్వంత్, ఏఐవైఎఫ్ నాయకులు రామకృష్ణ, విక్రమ్, నేషనల్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్ రాజు, జై భారత్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు భార్గవ్, పలు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. -
జేసీగా మౌర్యకు బాధ్యతలు
తిరుపతి అర్బన్:తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్యకు జాయింట్ కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించా రు. శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆమె ఇప్పటికే తుడా వీసీగా, తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. టీటీడీలో కొరవడిన పారదర్శకత తిరుపతి కల్చరల్: టీటీడీలో జవాబుదారీతనం, పారదర్శకత కొరవడిందని శివరామేశ్వరి శక్తి పీఠాధిపతి శివానందస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ భక్తులు కలవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకొని చెప్పినప్పుడు కలవాలని నిర్ణయం చేయడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి తిరుమల స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు పొంది వాటిని డబ్బులకు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈవోను కలిసేందుకు తాము శుక్రవారం వెళ్లడం జరిగిందన్నారు. అయితే ఈవోను కలవాలంటే అపాయింట్ మెంట్ తీసుకోవాలని చెప్పడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వానికి ఈవో వ్యవహార తీరుతో చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అనిల్కుమార్, జయరామిరెడ్డి, డిల్లీ, దీపక్, యజ్ఞేష్ పాల్గొన్నారు. -
ఏర్పేడు ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
● పనులు పరిశీలించిన ఎంపీ గురుమూర్తి ఏర్పేడు : ఏర్పేడు–వెంకటగిరి జాతీయ రహదారి బైపాస్ మార్గం ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి సూచించారు. శనివారం ఆయన ఏర్పేడు సమీంలోని రోడ్డు పనులను పరిశీలించారు. ఏర్పేడు ఎల్.సి 36 రైల్వే క్రాసింగ్ కారణంగా ఏర్పేడు–వెంకటగిరి మార్గం వాహనాల రాకపోకలకు రహదారిపై తరచూ ట్రాఫిక్ స్తంభించి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 2023లో రూ. 98.76 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదలైనా కాంట్రాక్టర్లు ఇంకా పూర్తి చేయకుండా నత్తనడకన సాగిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ ఐఐటీ, ఐసర్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, అలాగే వెంకటగిరి, రాపూరు ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఏర్పేడు సమీపంలో రైల్వే క్రాసింగ్ వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతోనే తాను ఆగిపోయిన వంతెన పనులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. అనంతరం సంబంధిత జాతీయ రహదారుల ఇంజినీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడిన ఎంపీ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పత్రికలపై కక్ష సాధింపు చిల్లకూరు : ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న పత్రికలపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడం సమంజసం కాదని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాస్తే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి భయపెట్టడం తగదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక వార్త ప్రచురించారని కక్ష కట్టి సాక్షి ఎడిటర్పై కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ శిరీషాను కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన జర్నలిస్టులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
విహంగాల విహారం
దొరవారిసత్రం: ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాలకు అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా బాసిల్లుతున్న నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విహంగాల ఆగమనం మొదలైంది. దీంతో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నీటితో నిండి ఉంటే ఈ పాటికే అన్ని రకాల పక్షుల విచ్చేసి వాటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కాని ఈ దఫా విహంగాల సీజన్(అక్టోబర్లో మొదలై ఏప్రిల్లో ముగుస్తుంది) మొదలైనప్పటికీ విదేశీ వలస విహంగాలు సందడి ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో పదుల సంఖ్యలో పక్షుల్లో రారాజుగా పిలిచే గూడబాతుల(పెనికాన్స్)తోపాటు తెల్లకంకణాయిలు(వైట్ ఐబీస్) వందల సంఖ్యలో నత్తగుళ్లకొంగలు విచ్చేసినట్లు స్థానిక వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలియజేశారు. పక్షుల కేంద్రంలో ఈపాటికే... వర్షాలు సకాలంలో కురిసి ఉంటే పక్షుల కేంద్రం పరిధిలోని అత్తిగుంట చెరువు, నేరేడుగుంట చెరువు, మారేడుగుంట చెరువుల్లో నీరు చేరి ఉంటే వలస విహంగాల్లో ప్రధాన పక్షులు అన్ని ఈ పాటికే చేరి, చెరువుల్లో ఉన్న కడప చెట్లపై చేరి ఆడ, మగ పక్షులు ఒకదాని ఒక్కటి స్నేహం కుదుర్చుకుని పుల్లలతో గూళ్లు కట్టుకుంటూ ఉండాలి. కాని వానలు సక్రమంగా కురవకపోవడంతో వలస విహంగాల సీజన్ ఆలస్యం కాకతప్పలేదు. ఇప్పుడైన పుష్కలంగా వానలు కురవందే వలస విహంగా పూర్తి స్థాయిలో కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు కురిసిన వానలకు చెరువుల్లోకి అరకొరగానే సాగు నీరు చేరాయి. కేంద్రంలో విదేశీ వలస విహంగాలకు పూర్తి స్థాయిలో వాతవరణం అనుకూలిస్తేనే వేల సంఖ్యలో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, స్వాతికొంగలు, వందల సంఖ్యలో తెడ్డుముక్కుకొంగలు, నీటికాకులు, బాతుజాతికి చెందిన పలు రకాల పక్షుల విచ్చేసి వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోలేవు. స్వదేశీ విహంగాలైన నత్తగుళ్లకొంగలు పక్షుల కేంద్రంలోకి గత నెలలోనే వందల సంఖ్యలో విచ్చేశాయి. ఈపక్షుల్లో కొన్ని జత కట్టె పనుల్లో ఉండగా మరి కొన్ని కడప చెట్లపై గూళ్లు కట్టుకునే పనిలో ఉన్నాయి. పక్షుల కేంద్రంలో గూడబాతులు తెల్లకంకణాయిలునత్తగుళ్లకొంగలు -
రేపు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు
తిరుపతు తుడా: దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం స్విమ్స్ ఆస్పత్రి ఓపీ, ఓటీలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,675 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,681 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.32 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. అట్టహాసంగా ‘దీక్షారంభం’ చంద్రగిరి : శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని డైరీ టెక్నాలజీ కళాశాలలో శనివారం సాయంత్రం నిర్వహించిన దీక్షారంభం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దీక్షారంభం కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు నూతన విద్యార్థులను డైరీ టెక్నాలజీపై క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. దీంతో పాటు బీటెక్ (డైరీ టెక్నాలజీ) 43వ బ్యాచ్ ఫ్రెషర్స్డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ జేవీ రమణ, ప్రత్యేక అతిథిగా డైరీ సైన్స్ డీన్ డాక్టర్ నాగేశ్వరరావు, అధ్యక్షుడు డాక్టర్ వైకుంఠరావు, అసోసియేట్ డీన్ డాక్టర్ గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ జేవీ రమణ మాట్లాడుతూ.. దీక్షారంభం కార్యక్రమం ద్వారా వ్యక్తిత్వ వికాసం, విద్యా అవకాశాలపై అవగాహన పొందారని పేర్కొన్నారు. 15 రోజుల కార్యక్రమానికి సంబంధించిన నివేదికను విద్యార్థులు వీసీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ వెటర్నరీ ఆడిటోరియంలో ఫ్రెషర్డే సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వెటర్నరీ సైన్స్ డీన్ డాక్టర్ ఆర్వి. సురేష్ కుమార్, డాక్టర్ శోభారాణి, కళాశాల అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా
– నవంబర్ 5వ తేదీకి మార్పు సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబర్ 5న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా జీశాట్–7ఆర్ అనే సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. అయితే ఈ ప్రయోగాన్ని ఈనెల 16న చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక పరమైన కారణాలతో 25వ తేదీకి వాయిదా పడింది. మళ్లీ 25 నుంచి నవంబర్ 5కి వాయిదా వేశారు. దీనికి తోడు ఈ ప్రయోగంలో అమెరికాకు చెందిన బ్లాక్–2 బ్లూబర్డ్ అనే ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా ప్రయోగించాల్సి ఉన్నప్పటికీ ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతో జీశాట్–7ఆర్ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని అనుకున్నారు. ఇందులో కూడా కొన్ని సాంకేతిక కారణాలతో 25న అనుకున్న జీశాట్–7ఆర్ ప్రయోగాన్ని నవంబర్ నెల 5న ప్రయోగించనున్నారని తెలుస్తోంది. 2013 ఆగస్టు 30న ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి పారిస్కు చెందిన అరైన్–5 రాకెట్ ద్వారా జీశాట్–7 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహం కాలపరిమితి అయిపోవడంతో దాని స్థానంలో జీశాట్–7ఆర్ పేరుతో ఉపగ్రహాన్ని పంపనున్నారు. రేపు విద్యాసంస్థలకు సెలవు తిరుపతి సిటీ:జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లకు సోమవారం మాత్రమే దీపావళి పర్వదినానికి సంబంధించి ప్రభుత్వ సెలవు ప్రకటించిందని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నోములు ఉన్న ఉపాధ్యాయులు స్థానిక అధికారు ల అనుమతితో అదనంగా లోకల్ హాలీడేకి అను మతి పొందాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. -
టీటీడీ ఉద్యోగిని... హోం మంత్రికి చాలా క్లోజ్
తిరుమల: ‘నేను టీటీడీలో ఉద్యోగిని. రాష్ట్ర హోం మంత్రి అనితకు బాగా క్లోజ్. ఆమె తరఫున వచ్చే వీఐపీలకు నేనే ప్రొటోకాల్ దర్శనం చేయిస్తా’ అంటూ భక్తులకు మాయమాటలు చెప్పి మోసం చేసిన టీడీపీ నాయకుడి గుట్టు రట్టయ్యింది. తిరుపతి జిల్లా, చంద్రగిరి రెడ్డివీధికి చెందిన బురిగాల అశోక్ రెడ్డి గత టీడీపీ హయాం నుంచి తిరుమలలో దళారీగా చలామణి అవుతున్నాడు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు, హోం మంత్రి వంగల పూడి అనితతోపాటు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ భక్తులను మోసగిస్తుంటాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. తెలంగాణకు చెందిన భజరంగ్ అమన గోయల్, పది మంది కుటుంబ సభ్యులకు సుప్రభాతం, తోమాల, అభిõÙకం సేవలతో పాటుగా బ్రేక్ దర్శనం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ దర్శనాలకు చాలా ఖర్చవుతుందని నమ్మించాడు. తిరుమలకు రాకముందే బేరసారాలు సాగించాడు. ఫైనల్గా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల భక్త బృందం తిరుమలకు రాగానే అదనంగా రూ.10 వేలు తీసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. బయటకు వెళ్లిన వెంటనే మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఎన్ని సార్లు చేసినా ఫోన్ తీయకపోవడంతో మోసపోయామని గ్రహించి భక్తులు శుక్రవారం ఈ–మెయిల్ ద్వారా టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ వింగ్ ఏవీఎస్ఓ ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదు చేశారు. -
వసూళ్ల పండగ!
చిత్తూరులో తాత్కాలిక టపాసుల షాపులు ఏర్పాటు చేస్తున్న వ్యవసాయమార్కెట్ స్థలం చిత్తూరు కలెక్టరేట్ : దీపావళిని కూటమి నేతలు, అధికారులు కాసుల వసూళ్ల పండుగా మార్చేశారు. టపాసుల దుకాణాలకు నిబంధనలను పక్కాగా పాటించినా తమ చేతులు తపడకుంటే అనుమతులు జారీచేసేది లేదని అగ్నిమాపకశాఖ అధికారులు తెగేసి చెబుతున్నారు. దీపావళి సందర్భంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక దుకాణాల ఏర్పాటులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారుల తీరు ఇలా ఉంటే.. దుకాణాల యజమానులు మాత్రం అడిగినంత లంచం ఇచ్చి అందినకాడికి దోచుకుందామనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు జిల్లాల్లోనూ లంచాల పర్వం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దాదాపు 283 వరకు తాత్కాలిక టపాసుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. టపాసుల విక్రయాల్లో మార్జిన్ 50 శాతం కంటే ఎక్కువగా ఉండడంతో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటుకు పోటీ పెరిగింది. నిబంధనలు పాటించకున్నా మామూళ్లు ఇస్తే ఏమైనా చేసుకోవచ్చని, ఏ రేట్లకై నా అమ్ముకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈ ఏడాది దుకాణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖలో ఇద్దరు అధికారులకు రెగ్యులర్ దుకాణాలకు ఒక్కొక్క ఏడాదికి రూ.10 వేల చొప్పున ఐదేళ్లకు రూ.50 వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. తాత్కాలిక దుకాణాలకు ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా కేంద్రంలో తాత్కాలిక టపాసుల దుకాణాలకు అనుమతులు కావాలంటే ప్రతి షాపునకు రూ.25 వేల చొప్పున స్థానిక కూటమి ప్రజాప్రతినిధికి ముట్టుజెప్పుకోవాల్సిందే. దీంతో పాటు అగ్నిమాపక, ఇతర శాఖల అధికారులకు సైతం అదనంగా లంచం ఇచ్చుకుంటేనే అనుమతులు దక్కే పరిస్థితి నెలకొంది. తనిఖీలు తూచ్ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగుతున్న అక్రమ టపాసుల వ్యాపారాలను అరికట్టడంతో పాటు అనుమతులు జారీచేస్తున్న ఆయా శాఖల్లో జరుగుతున్న లంచగొండుతనాన్ని అరికట్టడంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాల్సిన అవసరం ఉంది. సేల్స్ ట్యాక్స్ అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని టపాసుల గోడౌన్లలో ఎంత మేరకు నిల్వలు ఉన్నాయి.. ఎంత మొత్తానికి ట్యాక్స్లు చెల్లించారు..? అన్న విషయాలను అధికారులు పట్టించుకోవడం లేదు. టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసుకునే వారు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. విద్యుత్, అగ్నిమాపక, శానిటేషన్, మున్సిపాలిటీ, నగరపాలక శాఖల నుంచి ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేప్టీ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అనుమతులను జారీచేస్తారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, నగరి, చిత్తూరు, పుంగనూరుతో పాటు తిరుపతి జిల్లాలోని తిరుపతి, గూడూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చంద్రగిరి, నాయుడుపేట, సత్యవేడు, వెంకటగిరిలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 40 వరకు తాత్కాలిక షాపులను పెడుతున్నారు. వీటన్నింటికీ అధికారుల నుంచి తాత్కాలిక అనుమతులు పొందాల్సి ఉంటుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తాత్కాలిక టపాసుల దుకాణాల ఏర్పాటుకు అందిన కాడికి దోచుకుంటున్నారు. లంచం ఇవ్వకపోతే ఏదో ఒక కారణంతో కొర్రీలు వేసి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. అనుమతి పేరుతో భారీగా వసూళ్లు -
రైతు సభను అపహాస్యం చేయడం విడ్డూరం
తిరుపతి కల్చరల్ : రైతుల గోడుపై పూతలపట్టులో ఆక్రందన సభ పెట్టుకుంటే దానిని పూతలపట్టు ఎమ్మెల్యే ఆపహాస్యం చేయడం దుర్మార్గమని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ జాగీరు కాదని రైతు సంఘాల నేతలు పి.హేమలత, టి.జనార్దన్, సీపీఐ రాష్ట్ర నేత రామానాయుడు ఎమ్మెల్యేకు ఘాటైన సమాధానం చెప్పారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నీ ప్రతాపం మామిడి రైతులపై కాదు, ఫ్యాక్టరీలపై చూపించాలని హితవు పలికారు. మామిడి రైతుకు రూ.8 , సబ్సిడీ రూ.4 కలిపి మొత్తం సొమ్ములు రైతులకు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం రూ.4 సబ్సిడీ మాత్రమే చెల్లించిందన్నారు. అది కూడా ఆక్రందన సభకు ముందు రోజు విడుదల చేయడం అంటే అది రైతు సంఘం విజయమని తెలిపారు. బంగారు పాళ్యంలో రైతు సభను జరగనీయకుండా ఎమ్మెల్యే అధికారులతో, ప్రవేటు వ్యక్తులతో భయపెట్టి సభ అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.40 ఫ్యాక్టరీలను నియంత్రించలేక 40 వేల మంది రైతులకు అన్యాయం చేయడం మీకు తగదన్నారు. మామిడి రైతులకు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి పూనుకోవడం బాధాకరమన్నారు. బెదిరింపులతో మామిడి రైతుల ఉద్యమాన్ని అడ్డుకోలేరని హితవు పలికారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన రూ.370 కోట్ల బకాయిలను తక్షణం ఇప్పించకపోతే జరగబోయే ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
మార్కెట్లోకి న్యూ విక్టరీస్ కారు
తిరుపతి కల్చరల్ : మారుతీ సుజికీ సరికొత్త ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన న్యూ విక్టరీస్ కారును శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేశారు. రేణిగుంట రోడ్డులోని భార్గవి ఆటో మొబైల్స్ షోరూంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రవాణా శాఖ అధికారి కె.మురళీమోహన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ శ్రీనివాస కుమార్ హాజరై నూతన విక్టరీస్ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సరికొత్త కారు అత్యధిక సేప్టీతో అత్యాధునిక టెక్నాలజీతో చాలా బాగుందని తెలిపారు. మొదటి సారిగా భారత్ ఎన్సీఏపీ గ్లోబల్ ఎన్సీఏపీ, 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. భార్గవి ఆటో మొబైల్స్ చైర్మన్ బలరామిరెడ్డి మాట్లాడుతూ.. ఎంఐడీఎస్యూవీ రేంజ్ కారులో ఏడీఏఎస్ లెవల్–2 ప్రవేశపెట్టారని తెలిపారు. షోరూం ఎండీ కె.నిరంజన్ మాట్లాడుతూ.. ఈ కారు డైనామిక్ ఇన్ మోషన్ డిజైన్తో ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఇందులో 4 ఇంజన్ ఆప్షన్స్తో స్మార్ట్ లైబ్రడ్, స్ట్రాంగ్ బైబ్రో, 5 సీఎన్జీ ఆల్ గ్రిప్తో మార్కెట్లో అందుబాటులో ఉందన్నారు. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.10.49 లక్షల నుంచి రూ.19,93,900 వరకు లభిస్తుందన్నారు. అంతేకాక ఈ కారు ఆకర్షణీయమైన పది రంగులలో అందుబాటులో ఉందని తెలిపారు. భార్గవి ఆటో మొబైల్స్ ఈడీ కొండా ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ కొత్త కారులో యువత మెచ్చే ఎంతో ఇష్టమైన మ్యూజిక్, డాల్బీ ఆటోమొడ్స్ హార్మన్ ఆలాంగ్ విత్ అండ్ స్పీకర్స్, సౌండ్ సిస్టమ్స్ సౌలభ్యం ఉందన్నారు. యువతను ఆకర్షించేలా 360 డిగ్రీ కెమెరా సదుపాయంతో పాటు అత్యధిక మైలేజీ వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భార్గవి సీజీఎం రమేష్ బాబు, డీజీఎం మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
బినామీల కోసమే ప్రైవేటీకరణ
వెంకటగిరి (సైదాపురం) : ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తగ్గరలోనే ఉన్నాయని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ఆంధ్ర రాష్ట్ర పేద బతుకులకు తలరాతలని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు వైద్యం అందేలా గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించేందుకు కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు దేశంలో ఇంకెవరూ లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలనతో అరాచకాలు పెరిగిపోతున్నాయని వాటికి పదింతలు బుద్ధి చెప్పే విధంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ 2.0 డిజిటల్ బుక్ను ప్రవేశ పెట్టారన్నారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదలిపెట్టే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను కూటమి సర్కార్ మోసం చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా పీ–4 అంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అనంతరం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పార్టీతో సంబంధం లేకుండా కోటి సంతకాల కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. దీనికి అధికారులు కూడా సమాధానం చెప్పే రోజులు తగ్గరలోనే ఉందన్నారు. తాజాగా జనసేన నేత గూడూరు వెంకటేశ్వర్లు తప్పును ఎత్తిచూపించినందుకు ఆయనపై కూడా కేసు నమోదు చేశారన్నారు. అనంతరం కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మొదటి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ బొలిగర్ల మస్తాన్యాదవ్, పాపకన్ను మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, మండల కన్వీనర్లు, రాష్ట్ర విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను రాజకీయ కక్షతో ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతోందని కూటమి ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం మొదలైందని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి 26వ డివిజన్లోని బండ్లవీధిలో శుక్రవారం కార్పొరేటర్ తాజిన్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భూమన అభినయ్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేసి పేదలకు ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్య అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలను పక్కన పెట్టి కేవలం రూ. 6 వేల కోట్లను ఖర్చుపెట్టి మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, కోటూరు ఆంజినేయులు, బోకం అనిల్కుమార్, ఆదిలక్ష్మి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
ఏర్పేడు : ఏర్పేడు మండలంలోని కందాడ దళితవాడకు చెందిన సచివాలయ ఉద్యోగి కుటుంబ కలహాలతో గురువారం రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు. ఏర్పేడు మండలం కందాడ దళితవాడకు చెందిన బొంద మునెయ్య, సాయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో రెండవ కుమారుడు బొంద నిరంజన్(27) శ్రీకాళహస్తి మండలం బీవీపురం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. కందాడ దళితవాడకు చెందిన సుబ్రమణ్యం, చంద్రికల కుమార్తె విద్యప్రియను నిరంజన్ ఈ ఏడాది మార్చి 12న వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నిరంజన్ భార్య విద్యప్రియ గర్భిణి. పెళ్లైన తర్వాత కొంత కాలం సజావుగా జరిగిన వీరి కాపురం అత్తమామలు, భార్య వేధింపులకు తోడు అప్పులు ఎక్కువ కావడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో నిరంజన్ గురువారం రాత్రి గ్రామ శివారున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. అమ్మా.. నాన్నా ఇక సెలవు.. మృతుడు నిరంజన్ వద్ద లభించిన సూసైడ్ నోట్ను బట్టి అత్తమామలు, భార్య వేధింపులు, అప్పులు ఎక్కువ కావడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. లేఖలో.. ‘పోలీసు వారికి మనవి.. నాకు పెళ్లైనప్పటి నుంచి మా భార్య, వాళ్ల అమ్మ, హేమలత(పెద్దమ్మ) నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాభార్య కూడా నన్ను చంపేదాక తీసుకొచ్చారు. దానికి రిలేటెడ్గా కాల్డేటా తీయండి సార్.. దయచేసి నాకు న్యాయం చేయండి సార్.. వీళ్లు నన్ను టార్చర్ పెట్టి చంపేసి నా భార్యకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు.. మా అమ్మా,నాన్న, అన్న, వదిన, తమ్ముడును కాపాడండి సార్.. ‘అమ్మా.. నాన్నా సారీ నాన్నా.. ఇక సెలవు.. ఇంకో జన్మలో మిమ్మల్ని బాగా చూసుకుంటా..’ వాళ్లు నా దగ్గర చాలా అప్పులు చేయంచారు. నేను కట్టలేని అప్పులు చేపించారు. దయచేసి వీళ్లను వదలొద్దు అంటూ సూసైడ్నోట్లో నిరంజన్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో మృతుని భార్య, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
భూరికార్డుల మార్పుపై ఒంటిపై డీజిల్ పోసుకుని నిరసన
బుచ్చినాయుడుకండ్రిగ : ఆన్లైన్లో భూ రికార్డులు మార్పు చేయడంపై తహసీల్దారు కార్యాలయంలోని చాంబర్ వద్ద బాధితుడు పాండురంగయ్య శుక్రవారం డీజిల్ పోసుకుని నిరసన తెలపడంతో రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ.. మండలంలోని పల్లమాల గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 79–3లో తన తల్లి అనసూయమ్మ పేరున ఆన్లైన్లో 5 ఎకరాల భూమి ఉందన్నారు. దీన్ని తహసీల్దారు పల్లమాల గ్రామానికి చెందిన రవీంద్రబాబు పేరుతో ఈనెల 8వ తేదీన మార్చారని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే అనుసూయమ్మ పేరున ఉన్న భూమిని రవీంద్రబాబు పేరుతో మార్చారని ఆరోపించారు. ఈ ఘటనపై తహసీల్దారు శ్రీదేవి స్పందిస్తూ పల్లమాల గ్రామానికి చెందిన గోవిందమ్మ పేరుతో 5 ఎకరాల భూమి ఉందన్నారు. అయితే శ్రీకాళహస్తి రాజీవ్నగర్కు చెందిన పాండురంగయ్య గోవిందమ్మ పేరుతో ఉన్న భూమిని తన తల్లి అనసూయమ్మ పేరుతో ఆన్లైన్లో 2020లో మార్చుకున్నారని తెలిపారు. దీనిపై గోవిందమ్మ కొడుకు రవీంద్ర తనవద్ద ఉన్న రికార్డులతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు భూ రికార్డులను మార్చామని తెలిపారు. -
కలెక్టరేట్కు మళ్లీ బాంబు బెదిరింపు
తిరుపతి అర్బన్ : తిరుపతి కలెక్టరేట్ కార్యాలయానికి మళ్లీ బాంబు బెదిరింపులు తప్పలేదు. శుక్రవారం ఏకంగా కలెక్టరేట్ భవనాన్ని పేల్చి వేస్తామంటూ సంక్షిప్త సందేశాలు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలో బెదిరింపులు వచ్చిన సందర్భంగా బాంబు పెట్టామని సమాచారం ఇచ్చారు. ఈ సారి పేల్చి వేస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో పాటు ఉదయం 10 గంటల సమయంలో మెసేజ్ పెట్టారు. దీంతో ఉద్యోగులు భయం భయంగా డ్యూటీలు చేశారు. కొందరు అయితే డ్యూటీకి వచ్చి చిన్న పని ఉందంటూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న వెంటనే బాంబు నిర్వీర్య దళం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణం అంతటా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రతి విభాగాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది తప్పుడు సమాచారంగా నిర్ధారించారు. ఈ సంఘటనతో కొంతసేపు కలెక్టరేట్ ప్రాంగణంలో మొత్తం హడావుడి పరిస్థితి నెలకొంది. అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. మెసేజ్ చేసిన వ్యక్తి వివరాలు కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ వెల్లడించారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,675 మంది స్వామివారిని దర్శించుకోగా 24,681 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.32 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 4 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
చిత్తూరులో కదం తొక్కిన పాత్రికేయులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తున్న పత్రికలపై కేసులు నమోదు చేయడం.. వేధింపులకు గురిచేయడం.. ప్రశ్నించే కలానికి సంకెళ్లు వేయడం ఏమిటని ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, వేధింపులు మానుకోవాలని డీఆర్ఓ మోహన్కుమార్కు వినతి పత్రం అందజేశారు. -
‘శ్రీనివాసా’ ఇదేంది స్వామీ?
● ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిపై ఆరోపణలు ● వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు దుర్వినియోగం చేశారని లేఖలు సాక్షి టాస్క్ఫోర్స్: ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శివకామేశ్వరి శక్తి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివానందస్వామి టీటీడీ ఈఓ, టీటీడీ సీవీ అండ్ ఎస్ఓకు లేఖ రాశారు. టీటీడీ కేటాయించిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు విక్రయంపై విచారణ చేయాలని ఆలేఖ ద్వారా కోరారు. ఆ లేఖలో ఏమని పేర్కొన్నారంటే.. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను దుర్వినియోగం చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. టీటీడీ నుంచి పొందిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఆయన వనం శ్రీనివాస్ అనే దళారీ ద్వారా భక్తులకు ఒక్కో లెటర్ను రూ.20వేల చొప్పున విక్రయించినట్లు తనకు సమాచారం లభించినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉండడంతో పాటు, టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయన్నారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామికి టీటీడీ ద్వారా ఎన్ని వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు జారీచేశారో, ఆ టికెట్లు ఎవరెవరికి ఇచ్చారో, వాటి వినియోగం ఎలా జరిగిందో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. భక్తుల వద్దకు టికెట్లు విక్రయించినట్లు నిరూపణ అయితే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. స్వామీజీ ముసుగులో దళారీతో ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారని శ్రీశ్రీశ్రీ శివానందం స్వామి వివరించడం గమనార్హం. ఈమేరకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. -
కొల్లగొట్టు.. అడిగేదెవరు!
గూడూరు నియోజకవర్గంలో ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండికొడుతున్నారు. గనుల లీజుల కాల పరిమితి దాటిపోయినా తవ్వకాలు ఆగడంలేదు. లీజు కాలం ముగిసిందని అడిగే అధికారి లేరు. ప్రభుత్వ సంపదను అక్రమంగా దోచేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులకు చెవికెక్కడంలేదు. స్థానికంగా ఉన్న ఓ కూటమి నేత అండ దండలతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి ఖనిజ సందను కొల్లగొడుతున్నారు. అధికారుల నుంచి నేతల వరకు ముడుపులు ముట్టుజెబుతుండడంతో తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఉన్నతాధికారులైనా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే.! సాక్షి టాస్క్ఫోర్సు : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఖనిజ సంపదపై కన్నెసి అక్రమ మార్గంలో తవ్వి పచ్చనేతలు జేబులు నింపుకుంటున్నారు. అక్రమంగా ఖనిజ సంపదను తరలించడంలో స్థానిక నేత అండ దండలు ఉండడంతో గూడూరులో దొరికే ఖనిజ సంపద అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. 2024లో కాలం ముగిసినా.. 50 ఏళ్లకు గూడూరు మండలం కందలిలోని మైన్స్కు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం 2024 నవంబర్ నాటికి కాల పరిమితి పూర్తి అయ్యింది. అయితే మైనింగ్ యజమానులు రెండవ సారి దరఖాస్తు చేసుకున్న 20 ఏళ్ల కాల పరిమితిని బూచిగా చూపుతూ స్థానిక కూటమి నేతల అండ దండలతో గనుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి తెల్లరాయితో పాటుగా ఇతర ఖనిజాలను తరలించేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే గనుల్లో గతంలో తవ్విన గుంతల్లో మట్టి నింపేందుకు పనులు చేస్తున్నామని చెబుతున్నారు. రాత్రి పూట తవ్వకాలను చేపట్టి మెటీరియల్ను మరోచోట డంప్ చేసి తరలించేస్తున్నారు. చెక్ పోస్టులు పెట్టినా .. మైనింగ్కు సంబంధించిన ప్రతి ఖనిజానికి లీజుదారులు ప్రభుత్వానికి రాయిల్టీ చెల్లించాల్సి ఉంది. ఈ రాయిల్టీ ప్రభుత్వానికి అందడం లేదని ఇటీవల ఓ ప్రవేటు ఏజెన్సీకి రాయిల్టీ వసూళ్లకు అనుమతి ఇచ్చింది. వారు పలు ప్రాంతాలలో చెక్ పోస్టులు పెట్టారు. అయితే కందలిలోని మైనింగ్ యజమానులు గతంలో తవ్వి నిల్వ ఉంచిన తెల్లరాయిని తరలించుకునేందుకు అనుమతులు లేకపోయినా ఉన్నట్లు చెబుతూ అక్రమంగా తెల్లరాయిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఉన్నట్లా..లేనట్లా..! గూడూరు మండలం కందలి గ్రామ సమీపంలో కాలం చెల్లిన మైన్లో ప్రతి రోజు అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేపడుతున్నారని రెవెన్యూ, గనులశాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా ఏ ఒక్క అధికారి అటు వైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో కూటమి నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారులు పట్టించుకోకపోవడపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.నిబంధనలకు తూట్లు మైనింగ్ లీజు పొందిన వారు కాల పరిమితి తీరి పోయిన తరువాత తవ్వకాలు చేపట్టిన భూమికే కాకుండా అదనంగా ఉండే ప్రాంతానికి కూడా డెడ్ రెంట్ చెల్లించాల్సి ఉంది. అయితే అలాంటివి ఏమి చెల్లించకుండా ఖాళీగా ఉండే భూమిలో తవ్వకాలు చేసి గతంలో తవ్విన గుంతలను నింపి వేస్తున్నారు. ఇలాంటి వాటిపై గనుల శాఖాధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చినా స్థానిక నేత అండ దండలు మెండుగా ఉండడంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. స్థానిక నేతల అండదండలు గూడూరు నియోజకవర్గంలో దొరికే తెల్లరాయి, సిలికా, ఇసుక, లాంటి ఖనిజాలు అక్రమ తవ్వకాలు ఆగకుండానే కొనసాగుతున్నాయి. తెల్లరాయిని రాత్రి సమయంలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెల్లరాయి తవ్వకాలను పూర్తి స్థాయిలో కట్టడి చేసినట్లు కనికట్టు చేసినా లోపల జరిగే తంతు మాత్రం అడ్డుకోలేకపోతోంది. గూడూరు మండలం కందలి గ్రామంలో ఉన్న ఓ మైన్కు లీజుల కాల పరిమితి అయిపోయినా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి తెల్లరాయిని దర్జాగా తరలించేసి సొమ్ము చేసుకుని జేబులు నింపుకుంటున్నారు. -
19 నుంచి జనవరి శ్రీవారి దర్శన కోటా విడుదల
తిరుమల: కొత్త ఏడాది జనవరికి సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్ల జనవరి కోటాను 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎల్రక్టానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. 23న ఆర్జిత సేవా టికెట్ల విడుదల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 23న టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది. 24న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తుంది. ఇక 25న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటాను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనున్నది. https:// ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. -
టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం!
సాక్షి, విజయవాడ: తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. -
బొజ్జల సుధీర్ను ప్రశ్నిస్తూ పోస్టు.. జనసేన నేత అరెస్ట్
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతిలోని(Tirupati) వెంకటగిరిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై(Bojjala Sudhir Reddy) పోస్ట్ పెట్టినందుకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, టీడీపీ, జనసేన మధ్య రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు అరెస్ట్ను అతడి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.తిరుపతిలో కూటమి రాజకీయం మరో మలుపు తిరిగింది. కొద్దిరోజుల క్రితం శ్రీకాళహస్తి మాజీ జనసేన(janasena) ఇన్చార్జ్ కోటా వినుతకు(Kota Vinutha) న్యాయం చేయాలి అని సోషల్ మీడియా వేదికగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పోస్ట్ పెట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. దీంతో, ఆ పోస్టు వైరల్గా మారింది. సుధీర్ రెడ్డి వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. అనంతరం, కూటమి ఎమ్మెల్యేపైనే పోస్టు చేశారన్న కారణంగా జనసేన నేత వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇలా పోస్టు పెట్టినందుకే అరెస్ట్ చేస్తారా?.. ఏంటి ఈ అన్యాయం అని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా(Vinutha Kotaa) అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి(bojjala sudheer reddy) తన ద్వారా వినుత.. ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చర్చకు దారి తీసింది.ఈ క్రమంలో.. వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారు. మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిల్ ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. .. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు శివయ్యకు తెలుసు. ధైర్యంగా పోరాడుతాం. ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్తో బయటకు వస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే.. మీడియా ముందుకు రాలేక పోతున్నాను. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్ అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలుగానీ, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం చర్చనీయాంశమైంది. -
శాస్త్రోక్తం..అంకురార్పణం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు గురువారం అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన చేశారు. ఉదయం ఆచార్య రిత్వికరణం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం జరిపారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ డిప్యూటీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాల్లో నేడు పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్రవారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 నుంచి 6 గంటలకు గ్రామోత్సవం, 7 నుంచి 8.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించి, పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. -
భూ చోళ్లు
ప్రభుత్వాలు అడవుల పెంపకానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే కూటమి నేతలు ఉన్న అడవులు నరికివేసి, కొండలను చదును చేసి, మామిడి తోటల పెంపకం పేరుతో కబ్జా చేస్తున్నారు. కొంత కాలం తరువాత గుట్టు చప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అటవీ, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ.. కూటమి నేతలకు వంతపాడుతున్నారు. ఫలితంగా పచ్చదనం కరిగిపోతోంది. కొండను చదును చేస్తూ, వాహనాల్లో మట్టిని లోడ్ు చేస్తున్న హిటాచీరామచంద్రాపురం: రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే అటవీభూములు కనుమరుగైపోతాయి. 2014–19 నాటి ఆక్రమణలు ఏడాదిన్నర కాలంగా మళ్లీ ఊపందుకున్నాయి. కూటమి నేతలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ పెట్రేగిపోతున్నారు. అధికారం ఉంది.. అవకాశం ఉన్న మేర అటవీ భూములను ఆక్రమించేద్దాం.. దొంగ పట్టాలు సృష్టించుకుని ఇనుప కంచెలతో హద్దులు ఏర్పాటు చేసుకుని, కేంద్ర పథకం ఎన్ఆర్జీఎస్ నిధులతో మామిడి తోటలు పెంపకం, ఆపై రూ.కోట్లకు ఎన్నారైలకు భూములను విక్రయించేస్తున్నారు. అనుపల్లి, సి.రామాపురం, గుండోడు కనం, చిట్టత్తూరు, రాయలచెరువు, పిల్లారి కొండలు కబ్జా కోరల్లో చిక్కి భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని మండల ప్రజలు లబోదిబోమంటున్నారు. ప్రజల ఆస్తులను ప్రకృతి సంపద కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు విధులను విస్మరించి, పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు. విద్యుత్ శాఖ సహకారం రైతులు, సామాన్య ప్రజలకు విద్యుత్ కనెక్షన్లు కావాలంటే నెలలు తరబడి కార్యాలయల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అధికారుల చేయి తడపనిదే సామాన్యుల పనులు ముందుకు సాగవు. అయితే అటవీ భూముల అక్రమణదారులకు, కూటమినేతల నివాసాల వద్ద అధికారులే పడిగాపులు కాసి, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్న సందర్భాలను చూసి ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. రెవెన్యూ మౌనమెందుకు? రామచంద్రాపురంలో జరుగుతున్న అటవీ భూములను, ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటూ.. ప్రజా సంపదను లూటీ చేస్తున్న రూ.కోట్ల విలువచేసే మట్టిని, భూములను కొల్లగొడుతున్న పట్టీపట్టనట్టు చోద్యం చూస్తున్న రెవెన్యూ సిబ్బందిపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. చట్టాలు, శిక్షలు సామాన్యులకేనా? కూటమి నాయకులకు వర్తించవా? అంటూ బహిరంగంగా నే ప్రజలు విమర్శిస్తున్నారు. సామాన్య రైతులు పట్టా భూములను ఆన్లైన్, పాస్ బుక్ చేసుకోవాలన్న ఏళ్ల తరబడి తహసీల్దార్ కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ ఫైళ్లు ముందుకు కదలవని, అక్రమణ దారులకు, కూటమి నేతలకు మాత్రం అన్నీతామై కబ్జాదారుల పనులు సజావుగా సాగేలా అధికారులు విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అటవీ భూముల్లో మట్టి చదును చేస్తున్న జేసీబీరెవెన్యూ వ్యవస్థపై మండిపాటు మండలంలో రెవెన్యూ వ్యవస్థ పనితీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటవీ భూములు ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేక భూ బకాసురుల చేతులో బందీలుగా మారారు. అనుపల్లి సర్వే లెక్కల దాఖలాలో 411, 480లో గతంలో ఎన్నడూ లేని పట్టాలను సృష్టించుకుని అటవీ భూములను అదును చూసి చదును చేస్తున్నారు. గతంలో అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వ అనుకూల పత్రికలో ప్రచురితమైన కథనాల మేరకు అప్పటి జిల్లా అధికారులు స్పందించి బోగస్ పట్టాలను రద్దు చేసి, ఆక్రమణలను అడ్డుకున్నారు. మండల కేంద్రానికి 15 మైళ్ల దూరంలో అనుపల్లి అటవీ భూములున్నాయి. భారీ యంత్రాలతో రేయింబవళ్లు చదును చేస్తున్నారని, జిల్లా అధికారులకు సమాచారం తెలిసి వారువచ్చే సమయానికి మండల అధికారులు కూటమి నేతలకు సమాచారం చేరవేయడంతో అక్రమణదారులు అప్రమత్తమై యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రాత్రి సమయంలో పనులను సజావుగా సాగిస్తున్నారని అనుపల్లి, కూనేపల్లి ప్రజలు మండిపడుతున్నారు. నిరసన చేపడతాం తమ పశువులు, జీవాలు మేతకు అటవీ భూములు ఆశ్రయంగా ఉండేవని ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకొని ఇనుప కంచెలు నిర్మించేశారని, భారీ యంత్రాల శబ్దాలకు జంతువులు అడవులు విడిచి జనావాసాలకు వస్తున్నాయని, ఈ ఆక్రమ ణలు ఇలాగే కొనసాగితే భావితరాల భవిష్యత్తు కనుమరుగుతుందని, ఒకప్పుడు అడవులు ఉండేవని చెప్పుకొనే పరిస్థితి వస్తుందని, వర్షాలు పడక రైతులు వలసి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న వారిపై జి ల్లాస్థాయి అధికారులు, కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున అనుపల్లి కునేపల్లి ప్రజలు నిరసన చేపడతామని తెలియజేశారు. -
కేసులతో మీడియాను భయపెట్టలేరు
వార్తల్లో ఏవైనా అభ్యంతరం ఉంటే సరైన ఖండన ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా కేసులు పెట్టి మీడియాను భయపెట్టాలని చూడడం సరైనది కాదు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. సాక్షి ఎడిటర్పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదు. పోలీసుల ద్వారా మీడియాను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిది కాదు. మీడియా పైన కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలి. – కె. గిరిబాబు, రాష్ట ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ -
ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యం
● సౌత్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు తిరుపతి కల్చరల్: ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని సౌత్ ఇండియా ఓబీసీ వె ల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఈనెల 12వ తేదీన జరిగిన సౌత్ ఇండి యా ఓబీసీ సెమినార్లో దక్షిణాదితోపాటు ఉత్తరాది రాష్ట్రాల ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని, ఓబీసీ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయడంతోపాటు సౌత్ ఇండియా ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో జనగణనలో కులగణన శాసీ్త్రయ పద్ధతిగా చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన తమ వాటా హక్కు లను తమకు కేటాయించాలన్నారు. తెలంగాణ తరహాలో 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు -
పత్రికా స్వేచ్ఛపై దాడి హేయమైన చర్య
ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పత్రికలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపితే పత్రికలపై ప్రభుత్వం దాడి చేసి భయభ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్య. సాక్షి దినపత్రిక ఎడిటర్పై కక్ష సాధింపు చర్యలు ఆపాలి. విచారణ పేరుతో హైదరాబాద్లోని కార్యాలయంలో గంటల తరబడి పోలీసులు హల్చల్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తే ఖండిచాలి తప్ప ఇలాి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే. – కల్లుపల్లి సురేందర్రెడ్డి, ఏపీ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి -
బాలుడి ఆత్మహత్యపై విచారణ
చంద్రగిరి: బాలుడి ఆత్మహత్యపై గురువారం పోలీసు, ఎకై ్సజ్ అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు. మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన బాలుడిని మందలించడంతోపాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పారిపోయిన బాలుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణాధికారులు బాలుడు పాఠశాలకు ఎన్ని గంటలకు వచ్చాడు. మద్యం సేవించి ఎందుకు వచ్చాడు. మద్యం బాటిల్ బ్యాగులో పెట్టుకుని ఎందుకు వచ్చాడన్న కోణంలో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉదయం 8.30 గంటలకు పాఠశాల వచ్చిన బాలుడు మద్యం సేవించడంతోపాటు బ్యాగులో మద్యం బాటిల్ను పెట్టుకుని వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆపై బాలుడిని హెచ్ఎం వద్దకు తీసుకెళ్లామని, కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో బాలుడు పరుగులు తీస్తూ పాఠశాలలో గోడ దూకి పారిపోయినట్లుగా అధికారులకు తెలిపారు. మా బిడ్డను మాకు ఎందుకు అప్పగించలేకపోయారు మద్యం సేవించి పాఠశాలకు వచ్చినట్లు పాఠశాల నుంచి హెచ్ఎం ఫోన్ ద్వారా సమాచారం అందించాడని బాలుడు బంధువులు తెలిపారు. తాము వస్తున్నామని చెప్పిన 10 నిమిషాలకు పాఠశాలకు చేరుకున్నట్లు తెలిపారు. అయితే అప్పటికే తమ బాలుడు పాఠశాల నుంచి పారిపోయినట్లుగా ఉపాధ్యాయులు చెప్పడం వారి విధులు నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. తమ బిడ్డకు ఎలాంటి దుర అలవాట్లు లేవని, బాలుడిపై అసత్యప్రచారం చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు ఇలాగే ప్రవర్తిసారా? అంటూ మండిపడ్డారు. తమ బిడ్డను తమకు అప్పగించలేకపోవడంలో ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. బాలుడు తప్పు చేస్తే, వారికి తెలియకుండా సమాచారం ఇవ్వాలే తప్ప, ఇలా బాలుడి ముందే ఎలా ఫోన్ చేస్తారంటూ మండిపడ్డారు. కేవలం 20 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు దృష్టి సారించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డ మద్యం సేవించి ఉంటే పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడవుతుందని, ఇలా ఉపాధ్యాయులు మద్యం సేవించాడని చెప్పడం దారుణమన్నారు. బెల్టు దుకాణం ద్వారా మద్యం కొనుగోలు చేసినట్లు ఆరోపణలు సీఎం చంద్రబాబు సొంత మండలంలో విచ్చల వి డిగా బెల్టు దుకాణాలు వెలిశాయి. 24 గంటలూ మద్యం లభిస్తుండడంతో ఇప్పటికే పేదల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ఈ క్రమంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన బాలుడు బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. పనపాకం నుంచి చంద్రగిరి వరకు 12 కిలోమీటర్ల దూరంలో సుమారు 15కు పైగా బెల్టు దుకాణాలను నడుపుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకోకుండా, అధికారులు మామూళ్లకు అలవా టు పడి వారికి సహకరిస్తున్నారంటూ మండిపడ్డా రు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి బెల్టు దుకాణాలపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
2026 డిసెంబర్కు పనులు పూర్తి
చిల్లకూరు: గ్రీన్ఫీల్డ్ రహదారుల పనులు నాలుగు ప్యాకేజీల్లో మూడు ప్యాకేజీలను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకునివచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. చిల్లకూరు మండలంలో శరవేగంగా జరుగుతున్న సాగరమాల,(గ్రీన్ఫీల్డ్)రహదారి పనులను ఆయన 35 కి.మీ. మేర పరిశీలించారు. అలాగే చిల్లకూరు, కోట మండలాల పరిధిలో ఏర్పాటు కానున్న క్రిస్ సిటీలో అభివృద్ధి పనులను పరిశీలించి, తీర ప్రాంతంలోనే ఏర్పాటు కానున్న సోలార్ ప్లాంట్ వివరాలను పరిశ్రమ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగరమాల నిర్మాణ సంస్థ ప్రతినిధులు, క్రిస్ సిటీ ప్రతినిధులతో వేర్వేరు సమీక్ష నిర్వహించి, వారికి ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తరువాత కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే పను లు నాలుగు ప్యాకేజీలుగా అమలు అవుతున్నాయన్నా రు. ఇందులో ఒకటి నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు, ఒకటి అంతర్గత రహదారి ప్రాజెక్టు, మరొకటి వరగలి క్రాస్ రోడ్డు నుంచి కృష్ణపట్నం వర కు, నాలుగోది నెల్లూరు జిల్లా ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వరకు మొత్తంగా 125 కి.మీ. మేర రహదారు ల నిర్మాణం జరుగుతుందన్నారు. వీటిలో మూడు ప్రా జెక్టు పనులు 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నాయుడుపేట నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న రహదారి పనులు 2027 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సుమారు రూ.3 వేల కోట్లతో చేపడుతున్న ర హదారుల నిర్మాణ పనులు పూర్తయితే, తీర ప్రాంతం సుందరంగా ఉంటుందని తెలిపారు. చిల్లకూరు, కోట మండలాల మధ్యలో ఏర్పాటు అవుతున్న క్రిస్ సిటీకి సంబంధించి తొలివిడతగా 2,500 ఎకరాల్లో ప నులు చేపడుతున్నామన్నారు. ఇందుకుగాను రూ.1200 కో ట్లు వెచ్చించనుండగా ప్రస్తుతం రూ.200తో పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఆయన వెంట గూడూరు ఎఫ్ఏసీ ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, నేషనల్ హైవే పీడీ నెల్లూరు చౌదరి, జిల్లా మైనింగ్ అదికారి బాలాజీ నాయక్, చిల్లకూరు, కోట తహసీల్దార్లు శ్రీనివాసులు, జేజే రావు ఉన్నారు. -
బైకును ఢీకొన్న టిప్పర్
● నాగలాపురం మండల సర్వేయర్ సునీత మృతి ● గ్రామ సర్వేయర్ దినేష్కు స్వల్పగాయాలు నాగలాపురం: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ డీకొన్న ఘటనలో మండల సర్వేయర్ సునీత మృతి చెందగా గ్రామ సర్వేయర్ స్వల్పంగా గాయపడ్డారు. మండలంలోని బైటకొడియంబేడులో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. నాగలాపురం మండలంలో సర్వేయర్గా పనిచేస్తున్న సునీత, గ్రామ సర్వేయర్ దినేష్తో కలిసి సురుటుపల్లిలో సర్వే పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో బైటకొడియంబేడు హైవేపై తిరుపతి వైపు వెళుతున్న ఓ టిప్పర్ బైకును ఓవర్టైక్ చేసే ప్రయత్నంలో వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెనుక కూర్చొని ఉన్న మండల సర్వేయర్ సునీత టిప్పర్ చక్రాల కింద పడి అక్కడిక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న దినేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రైవేటు అంబులెన్స్లో మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన దినేష్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనింగ్ ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ షణ్ముగం తెలిపారు. -
సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపును సద్వినియోగం చేసుకోండి
తిరుపతి మంగళం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి పిలుపునిచ్చారు. సూపర్ జీఎస్టీ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో గురువారం రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, జిల్లా రవాణాశాఖాఽధికారి కొర్రపాటి మురళీమోహన్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జీఎస్టీ అధికారులు రాజ్యలక్ష్మి, నవీన్కుమార్రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, మోహన్ కుమార్, రమణా నాయక్, ఆంజనేయ ప్రసాద్, స్వర్ణలత, పరిపాలన అధికారులు విజయ ప్రశాంతి, విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
యువతే దేశ సంపద
తిరుపతి సిటీ: యువతే మన దేశానికి నిజమైన సంపదని ఎస్వీయూ వీసీ తాతా నరసింగరావు అభిప్రాయపడ్డారు. ఎస్వీయూ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలో శ్రీనివాస ఆడిటోరియం వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న యువతరంగ్ – 2025 కార్యక్రమంలో గురువారం వీసీ పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితానికి కళలు, సాహిత్యం వంటివి అవసరమని అభిప్రాయపడ్డారు. మన సంస్కృతి సంప్రదాయాలకు కళలు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా కళలు, సంగీతంపై ఆసక్తి ఉన్నా, సాధన చేయడం సాధ్యం కాలేదని తెలిపారు. క్రీడా, సాంస్కృతిక రంగాల్లో యూనివర్సిటీ మంచి గుర్తింపును సంతరించుకోవడం శుభపరిణామన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా సాంస్కృతిక అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. ర్యాలీలో అలరించిన వేషధారణ యువతరంగ్–2025లో భాగంగా వర్సిటీలోని అన్నమయ్య భవన్ నుంచి శ్రీనివాస ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఆకట్టుకునే వేషధారణలో ర్యాలీలో పాల్గొన్నారు. కోలాటాలతో భక్తిరస గీతాలతో ఆలపిస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు ప్రదర్శించిన శ్రీవారి, అమ్మవారి వేషధారణలో వీక్షకులను అలరించాయి. ర్యాలీలో కోలాట ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థినులు హల్చల్ చేసిన సినీనటుడు కిరణ్ అబ్బవరం ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం సందడి చేశారు. యువతరంగ్– 2025 ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని, హల్చల్ చేశారు. విద్యార్థుల కేరింతల నడుమ ఆయన మాట్లడుతూ తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఎంతో ఉత్తేజం పొందానని తెలిపారు. తనకు వచ్చిన గుర్తింపునకు యువ త ముఖ్యకారణం అన్నారు. భవిష్యత్తులోనూ తనను ఇలాగే ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. తొలినాళ్లలో తనకు లక్ష్యం ఏమిటో అర్థం కాలేదని తెలిపారు. పాతికేళ్ల వయసులో జీవిత లక్ష్యం అర్థమైందని, కళాకారుడిగా రాణిస్తానని నమ్మకం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్, డీన్ ఆచార్య చెండ్రాయుడు, ఆర్ట్స్, కామర్స్, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు సుధారాణి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ ఆచార్య బీవీ మురళీధర్, కల్చరల్ అఫైర్స్ కో– ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ ఉదయ్, రాజశేఖర్, ప్రసన్న, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
కలానికి సంకెళ్లు!
ప్రశ్నిస్తే కేసులు.. వేధింపులు చిత్తూరు అర్బన్ : ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా సమాజంలో జరుగుతున్న పొరపాట్లను పాత్రికేయులు ఎత్తిచూపితే అధికారులు, పాలకులు పొరపాట్లను సరిచేసుకోవాలి. బాధితులకు న్యాయం చేయాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రశ్నించే పత్రికలపై కేసులు పెడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ హక్కుకు సంకెళ్లు వేస్తున్నారు. మద్యంపై వార్తలు రాస్తున్నందుకు ‘సాక్షి’ పత్రికపై కక్షగట్టి కేసులు పెడుతున్నారు. జిల్లాలో కేసులు ఇలా.. పత్రికలో ఏదైనా కథనం ప్రచురితమైతే అందులో ఉన్న విషయాన్ని గుర్తించి, లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. తప్పుచేసిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోచ్చు. కథనంలో ఏదైనా తప్పుగా ఉందనిపి స్తే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించవచ్చు. న్యాయపరంగా ముందుకు వెళ్లొచ్చు. ఇవన్నీ వదిలేసి వార్తలు రాసిన పాత్రికేయులే లక్ష్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జర్నలిస్టులపై కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనూ దారుణ పరిస్థితి.. ములకలచెరువులో కల్తీ మద్యం తయారుచేయడం పై ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్కు నోటీసులు ఇవ్వాలని బుధవారం ఏకంగా హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రశ్నల పేరిట ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు. నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్చార్జ్ మస్తాన్రెడ్డికు సైతం నోటీసులు ఇచ్చి, విచారణ పేరిట స్టేషన్కు పిలిపించారు. -
మద్యం తాగిన మైనర్.. రైలుకింద పడి ఆత్మహత్య
చంద్రగిరి: కూటమి నాయకుల ‘బెల్టు’ దాహం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో మద్యం మంచినీళ్లలా దొరుకుతోంది. అంతేకాదు... మైనర్లనూ బలి తీసుకుంటోంది. తాజాగా తిరుపతి జిల్లాలో ఓ విద్యార్థి మద్యం సేవించి పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు మందలించారు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలోని ముంగళిపట్టు గ్రామానికి చెందిన బాలుడు జస్వంత్ (15) ఎం.కొంగరవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు మద్యం తాగి రావడంతో తోటి విద్యార్థులు గుర్తించి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జశ్వంత్ బ్యాగ్ను తనిఖీ చేయగా, మద్యం బాటిల్ లభ్యమైంది. ఉపాధ్యాయులు వెంటనే హెచ్ఎం భాస్కర్ నాయుడుకు సమాచారం ఇవ్వగా, ఆయన జశ్వంత్ను మందలించారు. ఆపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంతలో జశ్వంత్ పాఠశాల గోడ దూకి పారిపోయాడు.అనంతరం అతడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఉన్నాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో స్కూల్ వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. పాకాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.బెల్టు దుకాణమే కారణమా? చంద్రగిరి మండలంలో బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జస్వంత్ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అసలు జస్వంత్కు మద్యం ఎక్కడ నుంచి వచి్చంది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. వాస్తవంగా 21 ఏళ్లు నిండని వారికి మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం. జస్వంత్ వద్ద దొరికిన బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా మద్యం ఏ దుకాణంలో కొనుగోలు చేశాడో తెలుసుకోవచ్చు. మరి ఎక్సైజ్ అధికారులు ఆ దిశగా విచారణ చేపడతారా? లేక బెల్టు దుకాణాలకు అండగా కేసును నీరుగారుస్తారా? అనేది తేలాల్సి ఉంది. -
ఫీజు చెల్లింపులు.. తప్పని పడిగాపులు
తిరుపతి సిటీ : ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ రాజ్యమేలుతోంది. చివరకు తోపుడు బండ్ల వ్యాపారులు సైతం ఆన్లైన్ చెల్లింపులను అందిపుచ్చుకున్నారు. అయితే డిజిటల్ టెక్నాలజీ, ఏఐ, డేటా సైన్స్, కోడింగ్, సైబర్ సెక్యూరిటీ అంటూ ఆధునిక కోర్సులను బోధించే ఎస్వీయూనివర్సిటీలో మాత్రం ఫీజుల చెల్లింపులకు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఫీజు కట్టాలంటే వర్సిటీలోని యూనియన్ బ్యాంకులో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. గంటల తరబడి నిరీక్షణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల క్రితమే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఎస్వీయూలో మాత్రం కళాశాల, హాస్టల్ ఫీజులు చెల్లించాలంటే విద్యార్థులు బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. వర్సిటీలోని యూనియన్ బ్యాంక్లో ఒకే క్యాషియర్ ఉండటంతో సాధారణ కస్టమర్లతో పాటు విద్యార్థులు వందల సంఖ్యలో సేవల కోసం ఎదురు చూస్తుంటారు.దీంతో ఫీజులు చెల్లించాలంటే గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఫీజు చెల్లింపులకు ఒక రోజు కళాశాలకు సెలవు పెట్టాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసీ చొరవ చూపాలి ఎస్వీయూలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ను తక్షణం అమలులోకి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకులో సిబ్బంది కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. వీసీ నర్సింగరావు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.


