breaking news
Tirupati
-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,353 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.65 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 4 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఆయుష్ సేవలు మరింత బలోపేతం
● తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి మంగళం : జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంటులో ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలపై వివరాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల తీసుకునే చర్యలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదేళ్లలో రూ.28.82 కోట్ల మేర కేంద్రం నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపినట్లు వివరించారు. ఈ నిధులతో కాకినాడ, విశాఖపట్నంలో 50 పడకల సమీకృత ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటు చేయాలని, మరో నాలుగు ఆయుష్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇచ్చిందని చెప్పారు. తిరుపతి ఆయుష్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎంపీ గురుమూర్తి కోరారు. -
నూతన ఆవిష్కరణలకు ఏఎన్ఆర్ఎఫ్ సహకారం
ఏర్పేడు : శాస్త్ర, సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు ఏఎన్ఆర్ఎఫ్ (అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్) నిబద్దతతో పనిచేస్తోందని సీఈవో శివకుమార్ కళ్యాణరామన్ అన్నారు. శుక్రవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీని సందర్శించి, సహకార పరిశోధనా కార్యక్రమాలు, ఆవిష్కరణ వ్యూహాలపై అధ్యాపకులతో చర్చించారు. సహకార, అంతర్ విభాగ పరిశోధన ప్రతిపాదనలను పెంపొందించడం, ప్రభావవంతమైన పరిష్కారాల కోసం లోతైన సాంకేతిక పరిశోధన, అభివృద్ధి, ఆర్ అండ్డీ వ్యూహాలను గురించి వివరించారు. పరిశోధకుల సామర్థ్య నిర్మాణం, అధునాతన పరిశోధన గ్రాంట్లు, కన్వర్జెషన్స్ హబ్–అండ్–స్పోక్ పరిశోధన నమూనాలు, పీఎం–ఈసీఆర్జీ పథకం, మెడ్టెక్లో సవాళ్లను పరిష్కరించడం వంటి అంశాలపై లోతుగా చర్చించారు. భారతీయ సంస్థలలో పరిశోధనా నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. -
వసతి గృహాలు దారుణం
● డీఆర్ఓకువైఎస్సాఆర్సీపీ విద్యార్థి విభాగం నేతల వినతితిరుపతి రూరల్ : జిల్లాలోని బాల, బాలికల ప్రభుత్వ వసతి గృహాలు దారుణంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఓబుల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా పలు ప్రభుత్వ, సంక్షేమ వసతిగృహాలను సందర్శించిన అనంతరం సమస్యల ప్రతిని శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి నర్సింహులును కలిసి అందజేశారు. అనంతరం విద్యార్థి నాయకులతో కలసి ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను పరిశీలించామని తెలిపారు. ప్రభుత్వం పెరిగిన ధరలకనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మరుగుదొడ్లు, బాత్ రూములు నిర్మించాలని డిమాండు చేశారు. అలాగే వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. ప్రతీ హాస్టల్లోనూ పిల్లలకు బెడ్స్, ప్లేట్లు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు అందించాలన్నారు. క్రమం తప్పకుండా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వసతిగృహాలలో సిబ్బందిని నియమించి, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యవర్గ, నియోజకవర్గ, యూనివర్సిటీ, మండల అధ్యక్షుడు భాను ప్రకాశ్ రెడ్డి, దినేష్ రెడ్డి, చంగల్ రెడ్డి, ప్రేమ్ కుమార్, జస్వంత్ కుమార్ రెడ్డి, మహమ్మద్ రఫీ, యశ్వంత్ కుమార్ రెడ్డి, హరిబాబు, ముని, వినోద్ కుమార్, ప్రదీప్ కుమార్, పార్థసారథి, శేషారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. -
అక్రమ స్కానింగ్ పార్ట్–2!
చేతులు మారిన స్కానింగ్ మిషన్! కాణిపాకం: చిత్తూరులోని భరత్నగర్లో మూడు నెలలక క్రితం అక్రమ స్కానింగ్ సెంటర్ను కలెక్టర్ సుమిత్కుమార్ సీజ్ చేశారు. ఇక్కడ దొరికిన స్కానింగ్ మిషన్ను విచారణ అనంతరంకలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగించారు. ఈ మిషన్ కంపెనీ ఆధారంగా తమిళనాడు నుంచి బయటకు వచ్చినట్లు తెలుసుకున్నారు. ముఠా సభ్యులు స్కానింగ్ మిషన్ను ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారో తెలుసుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా స్కానింగ్ మిషన్ 16 మంది చేతులు మారినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. కాణిపాకం/తిరుపతి తుడా: మళ్లీ తెరపైకి అక్రమ స్కానింగ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. గతంలో చిత్తూరు కలెక్టర్ పట్టుకున్న అక్రమ స్కానింగ్ వ్యవహారం పార్ట్–2 కథను తలపిస్తోంది. చిత్తూరులో గుట్టు రట్టు కావడంతో ఈ ముఠా తిరుపతికి మక్కాం మార్చింది. అక్కడ అక్రమ స్కానింగ్ను గుట్టుగా నడిపించింది. వీరిచ్చిన తప్పుడు రిపోర్టుతో ఓ గర్భిణి, గర్భిణి కుమార్తెను బలితీసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ముఠాను అరెస్ట్ చేసి... భవానీ నగర్లోని అక్రమ స్కానింగ్, ఓ ప్రైవేటు ఆస్పత్రిని సీజ్ చేశారని రెండు జిల్లా అధికారులు వెల్లడించారు. ఇందులో చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ఓ సిబ్బంది పాత్ర కీలకమని తెలిసింది. దీనిపై చిత్తూరు కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ సుమిత్కుమార్, డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి, వన్టౌన్ పోలీసులు చర్చించినట్లు సమాచారం. గర్భిణితో పాటు ఆడ బిడ్డను చంపేశారు! వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకి చెందిన ఓ గర్భిణికి తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మించింది. రెండో సారి గర్భవతి కావడంతో ఆగర్భిణి ముఠా వలలో పడింది. నెల కిందట తిరుపతికి వచ్చింది. స్కానింగ్ చేయించుకుని కడుపులో ఉన్నది ఆడ బిడ్డగా తెలుసుకుంది. ఇంటికెళ్లి అబార్షన్ చేయించుకుంటానని పట్టుపట్టింది. కుటుంబీకులు ఇందుకు ఒప్పుకోకపోవడంతో కుమార్తెతో పాటు ఆ గర్భిణి బావిలో దూకి చనిపోయింది. దీనిపై భర్త ఇచ్చిన ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గర్భిణి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా..క డుపులో ఉన్నది మగబిడ్డగా నిర్థారణ అయ్యింది. దీంతో అక్రమ స్కానింగ్ సెంటర్పై అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరు సిబ్బందిదే కీలక పాత్ర చిత్తూరులో పట్టుబడ్డ అక్రమస్కానింగ్ ముఠా సభ్యులే.. ఈ గర్భిణి మృతికి కూడా కారణమని తమిళనాడు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. వీళ్లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ముఠాకు .గుడిపాల మండలంలో పనిచేసే ఓ అటెండర్ (డీఎంఅండ్హెచ్ఓ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది) ముందుండి నడిపిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతనిని కూడా తమిళనాడు పోలీసులు రిమాండ్కు తరలించగా.. అతను మూడు రోజుల క్రితమే బయటకు వచ్చినట్లు కార్యాలయమంతా గుసగుసలు మొదలయ్యాయి. ఇతనే ముఠాకు స్కానింగ్ మిషన్లను కొనుగోలు చేసి ఇచ్చినట్లు చిత్తూరు శాఖలో చర్చ సాగుతోంది. ఇతనితో పాటు జీడీనెల్లూరుకు చెందిన ఓ ఆశా వర్కర్, పాలసముద్రంకు చెందిన ఓ ఏఎన్ఎం పాత్ర కూడా ఉందని చిత్తూరు వైద్య ఆరోగ్యశాఖలో చర్చించుకుంటున్నారు. అయినా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. ఈ మేరకు పోలీసులు చిత్తూరు కలెక్టర్, డీఎంఅండ్హెచ్ఓతో చర్చించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆశావర్కర్పై రెండు రోజుల్లో చర్యలు ఉంటాయని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా తిరుపతి భవానీ నగర్లో నడిపిస్తున్న స్కానింగ్ సెంటర్ను తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు ఒక మెటర్నిటీ ఆస్పత్రిని కూడా సీజ్ చేశామని తిరుపతి డీఎఅండ్హెచ్ఓ తెలిపారు. మళ్లీ తెరపైకి అక్రమ స్కానింగ్ చిత్తూరు కలెక్టర్ పట్టుకున్న అక్రమ స్కానింగ్లో ఇది పార్ట్–2 చిత్తూరులో గుట్టురట్టు కావడంతో తిరుపతిలో ముఠా మక్కాం ఓ క్లినిక్ అడ్డాగా లింగనిర్థారణ తప్పుడు నిర్థారణతో తమిళనాడుకు చెందిన గర్భిణితోపాటు కుమార్తె ఆత్మహత్య! భర్త ఫిర్యాదుతో కేసు నమోదు! అక్రమ స్కానింగ్ ఇలా.. మూడు నెలలకు క్రితం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ చిత్తూరు నగరంలోని భరత్నగర్లో అక్రమ స్కానింగ్ సెంటర్ నిర్వహణ ముఠాను.. రెడ్హ్యాండ్గా పట్టుకున్నారు. 22 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా దీని పార్ట్–2 కథ బయటకు వచ్చింది. చిత్తూరులో పట్టుబడ్డ ముఠానే మళ్లీ తిరుపతి భవానీ నగర్లో అక్రమ స్కానింగ్ను ఏర్పాటు చేసుకుని లింగనిర్థారణను కొనసాగిస్తూ వచ్చింది. దీనిపై చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్రమ స్కానింగ్ సెంటర్పై వారు నిఘా పెట్టారు. తమిళనాడు నుంచి గర్భిణులను తీసుకొచ్చి తిరుపతిలో లింగనిర్థారణ చేయిస్తూ జేబులు నింపుకుంటున్నారని గుర్తించారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి ఫీజుగా రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు గుంజుకుంటున్నారని తెలుసుకున్నారు. వీళ్ల నిర్థారణలో ఓ గర్భిణికి ఇచ్చిన రిపోర్టు తప్పు అని తేలడంతో వీళ్ల బండారం మొత్తం బయటపడింది. -
● ఇంటింటికీ మంగళం
సప్తగిరి నగర్ లో చెట్టు చెంత లబ్ధిదారులకు పింఛన్ ఇస్తున్న సచివాలయ ఉద్యోగులుజీడి నెల్లూరులోని పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తూ...చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పింఛన్ల పంపిణీ మళ్లీ మొదటికొచ్చింది. గత టీడీపీ పాలనలో వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ల కోసం పడ్డ కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఎన్నికల ముందు వలంటీర్లు లేకపోయినా ఇంటి వద్దకే పింఛన్ల ఇస్తామన్న కూటమి పెద్దలు సోమవారం సచివాలయాలు, నడివీధుల్లో గంటలు తరబడి నిల్చోబెట్టి పంపిణీ చేశారు. ఈ పరిస్థితిని చూసి లబ్ధిదారులు ఇందుకేనా మేము ఓట్లేసింది’ అంటూ నిట్టూర్చడం కనిపించింది. ఈ దృశ్యాలను శుక్రవారం తిరుపతి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో కనిపించిన చిత్రాలను సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ తిరుపతి -
ఫెర్టిలిటీ సెంటర్లలో వరుస తనిఖీలు
తిరుపతి తుడా: తిరుపతి నగరంలోని ఫెర్టిలిటీ సెంటర్లలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వరుస తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్లలో సంతానోత్పత్తి పేరుతో జరిగే మోసాలు, వైద్యంపై ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక మాతృత్వ ఫెర్టిలిటీ సెంటర్, అంకుర ఎస్ ఫెర్టిలిటీ సెంటర్లను తనిఖీచేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శాంతకుమారి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రులను నడపాలని, నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని నిర్వాహకులను ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డాక్టర్ త్రివేణి, సిబ్బంది కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
9 నుంచి సప్త మోక్ష క్షేత్ర యాత్ర రైలు సేవలు
తిరుపతి కల్చరల్ : సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ 9న రైలు ద్వారా దేశంలోని పలు పుణ్య క్షేత్రాల సందర్శనకు మంచి ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ పిలుపు నిచ్చారు. శుక్రవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సప్తమోక్ష క్షేత్ర యాత్ర రైలు ప్యాకేజీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఏడు నదులు, నాలుగు జ్యోతిర్లింగాల ప్రాంతాలను ఈ ప్యాకేజీ ద్వారా చూపించి తిరిగి వారి స్వస్థలాలకు తీసుకురావడం జరుగుతుందన్నారు. 650 మంది ప్యాసింజర్లను ఈ యాత్ర రైలు ద్వారా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. మూడు విభాగాలుగా ఈ ప్రత్యేక రైలులో ప్యాకేజీ టికెట్ ధరను నిర్ణయించామని తెలిపారు. థర్డ్ ఏసీ(కంఫర్ట్) రూ.45,750, సెకండ్ ఏసీ(డీలక్స్) రూ.54,100, ఫస్ట్ ఏసీ(లగ్జరీ) రూ.69,500గా ఉన్నాయన్నారు. -
నకిలీ మీడియాను అరికట్టేందుకే స్టిక్కర్ల పంపిణీ
తిరుపతి క్రైమ్: జిల్లా వ్యాప్తంగా నకిలీ మీడియాను అరికట్టేందుకు ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్టులందరికీ స్టిక్కర్లను పంపిణీ చేశామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్లు కూడా మీడియా ప్రతినిధులుగా చెలామణి అవుతున్నారని తెలిపారు. అంతేకాకుండా చాలామంది వాహనాలపై ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారని తెలిపారు. దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి కొన్ని వందల వాహనాలకు స్టిక్కర్లు తొలగించామన్నారు. నిజాయితీగా వర్కింగ్ జర్నలిస్ట్గా ఉన్న వారందరికీ గుర్తింపు ఇచ్చేందుకు పోలీస్ విభాగం తరఫున ద్విచక్ర వాహనాలు, కార్లకు స్టిక్కర్లను పంపిణీ చేశామన్నారు. ఈ స్టిక్కర్ తగిలించుకున్న మీడియా ప్రతినిధులు ఎలాంటి ప్రోగ్రాములకై నా పోలీసుల ద్వారా ఇబ్బంది లేకుండా అనుమతి ఇస్తామన్నారు. అంతేకాకుండా ఈ స్టిక్కర్ స్కాన్ చేస్తే ఆ మీడియా ప్రతినిధి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఎడిషన్లో పనిచేసే పాత్రికేయుల వాహనాలకు వున్న ఈ స్టిక్కర్లను చూసి పోలీసులు అనుమతి ఇస్తారని వెల్లడించారు. ఈ స్టిక్కర్లను కాపీ చేయకుండా పకడ్బందీగా తయారు చేశామన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మురళి, సెక్రటరీ బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కాలువ ఆధునీకరణ పనులపై నివేదిక ఇవ్వండి
వరదయ్యపాళెం: శ్రీసిటీ మీదుగా వెళ్లే ఇరిగేషన్కు చెందిన కరిపేటి కాలువ ఆధునీకరణ పనులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీసిటీలోని కరిపేటి కాలువను కలెక్టర్ సందర్శించారు. ఇటీవల శ్రీసిటీలోని ట్రిపుల్ ఐటీ కళాశాల సమీపంలో కరిపేటి కాలువ సంబంధించి శ్రీసిటీ యాజమాన్యం కాలువ పూడికతీత పనులతో పాటు కట్టను బలోపేతం చేసే పనులను చేపట్టారు. అయితే ఈ పనులకు సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాలువలో పూడికతీత పనులకు సంబంధించి తవ్విన మట్టిని బయటకు తరలిస్తున్నారని కేవీబీపురం మండలం మద్రాసు బాబు హైకోర్టులో కేసు వేశారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు పూర్తి వివరాలను అందించాలని కలెక్టర్కు సూచించడంతో ఆయన పనులు జరిగిన కరిపేటి కాలువను సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం శ్రీసిటీ పరిధిలోని ఈస్ట్ మల్లవారిపాళెం చెరువును పరిశీలించారు. -
సమాచార హక్కు చట్టంతో ప్రజాస్వామ్యం బలోపేతం
పాకాల : సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం కళాశాలలో విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రాజనీతి శాస్త్రం అధ్యాపకులు ఆదిశేఖర్రెడ్డి సమాచార హక్కు చట్టం గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన ఎస్.కె.జాస్మిన్ను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మాశిలామణి, చిట్టికళావతి, కార్యక్రమ కన్వీనర్ ఈశ్వర్బాబు, రమణమ్మ, రేఖ పాల్గొన్నారు. -
మోసం బాబు నైజం
● చంద్రగిరిలో ‘బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ’ ● జగనన్న హయాంలో సంక్షేమం.. బాబు పాలనలో సంక్షోభం ● అక్రమ అరెస్టులతో చెవిరెడ్డిని భయపెట్టలేరు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి తిరుపతి రూరల్ : జగనన్న పాలనలో ప్రజలకు సంక్షేమం అందింది.. బాబు ప్రభుత్వంలో సంక్షోభం మిగిలింది.. సూపర్ సిక్స్ పథకాలను అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఏడాది గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు.. ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు.. తుస్సు మనిపించారు.. ఇదిగో అమ్మకు వందనం అన్నారు.. ఎవరికీ అందకుండా చేశారు.. ఆడబిడ్డ నిధి అన్నారు.. ఆ పథకాన్ని ఆమడదూరం చేసేశారు.. నిరుద్యోగులకు శఠగోపం పెట్టారు.. ఉద్యోగుల హామీలను గాలికి వదిలేశారు.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు 143 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారు.’ అంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో గురువారం ‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని భూమన చేతులు మీదుగా ప్రారంభించారు. వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆరు మండలాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో బాబు చేసిన మోసాలతో పాటు చెవిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, కక్ష సాధింపు చర్యలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలన్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక మోసం చేయడానికి ప్రతిపక్షంపై నిందలు వేయడం బాబుకు వెన్నతోపెట్టిన విద్య అని భూమన విమర్శించారు. బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు మోసాన్ని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అప్పుడే చంద్రబాబు మళ్లీ మోసం చేశారన్న నిజం ప్రజలకు తెలుస్తుందన్నారు. అండగా నిలబడ్డ వారందరినీ గుర్తు పెట్టుకుంటా చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబానికి కష్టం వస్తే ఆ కుటుంబానికి మేమున్నామని అండగా నిలబడి రోడ్డెక్కిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటా.. రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ చేయగలిగినంత సాయం చేసి రుణం తీర్చుకుంటానని చెవిరెడ్డి మోహిత్రెడ్డి మాట ఇవ్వడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చంద్రగిరి నుంచి తాను ప్రాతినిధ్యం వహించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నా.. ఏ మాత్రం భయపడకుండా తమకు అండగా నిలిచి అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళనలు చేయడం చూస్తుంటే పార్టీ శ్రేణుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేమనిపిస్తోందన్నారు. జగనన్న ఆదేశాలు మేరకు పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త తమ గ్రామాల్లోకి వెళ్లి బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం చేసిన మోసం, చెప్పిన అబద్ధాలను వివరించాలన్నారు. అంతేకాక ఆ నాడు ఏం చెప్పారన్న విషయాలు అందరికీ తెలిసేలా బాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ ఆ కుటుంబం ఎంత నష్టపోయారో వివరించాలన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి అందలమెక్కిన చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు చొక్కా పట్టుకుని అడగాలని సూచించారు. అనంతరం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూ ఆర్ కోడ్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, ఆరు మండలాల నుంచి వచ్చిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సీనియర్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా నేతలు పాల్గొన్నారు. కట్టుకథలు అల్లి అక్రమ కేసులు జగనన్నకు అతి దగ్గరగా ఉన్నందునే తన తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలులో 44 రోజులుగా బధించారని, అదే కేసులో భాస్కర్ బిడ్డ చెవిరెడ్డి మోహిత్రెడ్డిని కూడా ఇరికించడం దుర్మార్గమన్నారు. ఇలాంటి విషయాలు పచ్చ పత్రికలు ముందే రాస్తాయని, ఎల్లో మీడియా ఓ కట్టు కథను అల్లుతాయని.. పోలీసుల ఆ కథను క్రైంగా అమలు చేస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. పాతికేళ్లు నిండిన చెవిరెడ్డి మోహిత్రెడ్డిని జైలుకు పంపాలని ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అంతా ఇంతా కాదని, అయితే ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన వారు రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతుండగా అక్రమంగా జైలుకు పంపిన వారి జీవితాలు మాత్రం పతనం కాక తప్పవని హెచ్చరించారు. గతంలో సోనియాగాంధీ, చంద్ర బాబు ఇద్దరు కుట్రలు చేసి వైఎస్ జగన్పై 18 రకాల కేసులు పెట్టి 18 నెలల పాటు జైలులో బంధిస్తే, ఆ తరువాత బయటకు వచ్చిన జగన్ విక్రమార్కుడిలా దూసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారన్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం మళ్లీ జగన్ను జైలుకు పంపుతుందని.. అందులో భాగమే ఆయన చుట్టూ ఉన్న వారిని అక్రమ కేసుల్లో ఇరికించారన్నారు. చంద్రబాబు మోసాలు, చెవిరెడ్డి కుటుంబంపై ఆయన ప్రభుత్వం చేస్తున్న కుట్రలను చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన బాధ్యత పార్టీ క్యాడర్ తీసుకోవాలని సూచించారు. -
ఎంఈఓల నియామకంపై ఉపాధ్యాయుల నిరసన
తిరుపతి సిటీ : రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి సీనియారిటీని పక్కన పెట్టి ఇష్టానుసారంగా ఎంఈఓ–1ను నియమించడం దారుణమని ఏపీ ఉపాధ్యాయ సంఘం (అపస్) రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుచానూరు ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో అపస్ నేతలు, ఉపాధ్యాయులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి సర్వీస్ నిబంధనల అమలు కోసం ప్రత్యేక కమిటీ ద్వారా నియామకాల విషయంపై ఉపాధ్యాయ సంఘాలు ప్రయత్నిస్తున్న తరుణంలో మండల విద్యాశాఖ అధికారి–1గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. ఎంఈఓ పోస్టులను కేవలం ప్రభుత్వ పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అవమానపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్కు సంబంధించి కోర్టు కేసు పెండింగ్లో ఉండగా ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని హితవు పలికారు. శుక్రవారం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అలాగే భోజన విరామ సమయంలో ప్రతి పాఠశాలలో నిరసనలు తెలపాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన ఎంఈఓ–1 పోస్టులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణపై ఉపాధ్యాయులతో చర్చించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అపస్ రాష్ట్ర కార్యదర్శి గజ్జల వెంకట సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేటి నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు -
అన్నదాత సుఖీభవ జాబితా ప్రదర్శించాలి
చంద్రగిరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్నదాత బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్న అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి అన్నదాత సుఖీభవ, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవం చేపట్టడం కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ కింద 1,54,807 మంది రైతులు అర్హత కలిగి ఉండగా, అందులో ఇప్పటి వరకు 1,50,161 మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేయడం జరిగిందని, 3,114 మంది ఈకేవైసీ రిజెక్ట్ అయిందన్నారు. 1,532 మంది ఈకేవైసీ పెండింగ్ ఉందని, ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పథకం కింద ఏడాదికి రైతుకు రూ.20,000 నగదును 3 విడతలుగా ప్రభుత్వం ఇవ్వనుందని, మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2,000 చొప్పున ఆగస్టు 2న విడుదల చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల జాబితా ప్రదర్శించాలన్నారు. -
ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయండి
మీకు తల నొప్పి వస్తుందా?.. తరచూ జ్వరం బారినపడుతున్నారా?.. కడుపు, ఒళ్లు నొప్పులతో భరించ లేకపోతున్నారా?.. నిద్ర పట్టడం లేదా?.. మీకు భయమేమీ లేదు.. అనారోగ్య సమస్య గురించి చెబితే చాలు.. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో అన్నిరకాల మందులు ఇచ్చేస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా విక్రయిస్తారు. ఏ మందు వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో.. ఎన్ని రోజులు వాడాలో కూడా వారే సూచిస్తారు. ఇలా జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. అధికారులు ఏదో ఓ సారి తనిఖీ చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.చిత్తూరు రూరల్ (కాణిపాకం): డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులు అంటగడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. సేమ్ ఫార్ములా.. కంపెనీ మాత్రమే వేరు.. ఇది కూడా దానిలాగే పనిచేస్తుంది.. అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. జిల్లాలో సుమారు 2,000 వరకు రిటైల్, హోల్సేల్ మెడికల్ షాపులున్నాయి. అలాగే చాలామంది క్లినిక్లోనే మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ప్రతి చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.5 వేల నుంచి రూ.లక్ష దాకా వ్యాపారం సాగుతోంది. ఈ వ్యాపారం ఇష్టానుసారంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.తారుమారుడ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్టు– 1940, ఫార్మసీ యాక్టు– 1948 ప్రకారంగా బీ ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ పూర్తిచేసిన వారే మెడికల్ షాపులు నిర్వహించాలి. షాపు పర్మిషన్ తీసుకునే సందర్భంలో సంబంధిత ఫార్మసిస్టుల సర్టిఫికెట్లతోపాటు వ్యక్తి గత గుర్తింపుకార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో జతచేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు సమర్పించాలి. అనుమతి మంజూరైన తర్వాతే షాపులు నిర్వహించాలి. జిల్లాలో మెడికల్ షాపులు చాలామంది బినామీలే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితోనే దుకాణాలను నిర్వహించాలి. చాలామంది తక్కువ వేతనంతో యువకులను పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి సర్కిల్లోని ఓ మెడికల్ షాప్లో నిబంధనలకు విరుద్ధంగా మందులు, మాత్రలు విక్రయిస్తున్నారు. నిషేధిత మందులు, డాక్టర్ చీటీ లేకుండా మందులు, మాత్రలను విక్రయిస్తున్నారు. ఆ షాపుపై ఫిర్యాదులు వెలువెత్తాయి. దీంతో అధికారులు నిఘా పెట్టి పర్యవేక్షించారు. అలాగే విజిలెన్స్ అధికారులు కూడా ఆ షాపుపై దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో పలు రకాల మందులు, మాత్రలు అనుమతి లేకుండా విక్రయిస్తున్నారని సీజ్ చేస్తున్నారు.ఇదోరకమైన దందా..జనరిక్, నాన్ జనరిక్ తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసిన మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్నారు. యాంటీబయాటిక్ మందులను డాక్టర్ల సూచనల మేరకు ఇవ్వాలి. కానీ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అనవసరంగా యాంటిబయాటిక్ మందులు వాడిన వారు సైడ్ ఎఫెక్ట్తో కొత్తరోగాల బారిన పడుతున్నారు. ఇక బెంగళూరు నుంచి పలు రకాల బ్రాండ్ల పేరుతో అనధికారికంగా మందులు, మాత్రలు సరఫరా అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇవీ తక్కువ రేటుకు ఇస్తుండడంతో మార్కెట్లో విచ్ఛలవిడిగా లభ్యమవుతున్నట్టు తెలుస్తోంది. -
క్షుద్ర పూజల కలకలం
సైదాపురం : మండలంలోని తోచాం గ్రామంలో గురువారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం గ్రామ పొలిమేరలో బుధవారం క్షుద్ర పూజలు చేసి పురాతన శ్రీకృష్ణుని ఆలయంలో తవ్వకాలు చేశారు. మండలంలోని తోచాం గ్రామ సమీపంలో పురాతనమైన శ్రీకృష్ణుని ఆలయం ఉంది. పురాతనమైన ఆలయం కావడంతో అక్కడ గుప్త నిధులుంటాయనే అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాలను ఆ ప్రాంతం నుంచి తొలగించి తవ్వకాలు జరిపారు. తోచాం పొలిమేరల్లో బుధవారం రాత్రి అమ్మవారి బొమ్మను వేసి పసుపు, కుంకమలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాలు లభ్యం అయ్యాయి. దీంతో గ్రామస్తులకు అనుమానం రావడంతో ఆలయాన్ని పరిశీలించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి విగ్రహాలను తొలగించారు. కొద్ది రోజుల నుంచి సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ పరిసర ప్రాంతంతో పాటు గ్రామంలో సంచరిస్తుండటంతో అనుమానం కలిగి అతడిని పట్టుకుని విచారణ చేస్తుండగా వారి నుంచి తప్పించుకుని పారిపోయాడన్నారు. దీంతో గ్రామస్తులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్షుద్ర పూజలు జరగడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు భయాందోళన చెందుతున్న స్థానికులు -
అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా నియామకం
తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఏఏఓలుగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా తిరిగి పదవులు పొందారు. వీరిలో జితేంద్ర నాయక్, మహమ్మద్ రఫీ, కవిత, వెంకటరమణ, విజయ్కుమార్, సురేష్ కుమార్, లోకనాథం ఉన్నారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులను ఎస్వీయూ వీసీ, రిజిస్ట్రార్ అభినందించారు. నేడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంప్ తిరుపతి ఎడ్యుకేషన్ : బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన సేవలందించాలని సెంట్రల్ జోన్ ప్రిన్సిపల్ సీసీఏ అశోక్కుమార్ తెలిపారు. తిరుపతిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. బీఎస్ఎన్ఎల్ సీసీఏ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులకు నేడు నిర్వహించనున్న డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపు ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాల ని కోరారు. పెన్షనర్ల సౌకర్యార్థం శుక్రవారం నిర్వహించే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపునకు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాయింట్ సీసీఏ అంకుర్ కుమా ర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జీఎం అమరేంద్రరెడ్డి, డెప్యుటీ జీఎం వెంకోబరావు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు, నాగమహేష్, నీరజ, గురుమూర్తి, ఉద్యోగులు పాల్గొన్నారు. -
సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై ఉద్యమం
● నేడు కలెక్టర్కు సమస్యలపై వినతిపత్రం తిరుపతి అర్బన్ : సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి మొదలెట్టిన యుద్ధం ఆపలేరని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ ఎస్వీ యూనివర్సిటీ అధ్యక్షుడు మన్నం ప్రేమ్కుమార్ స్పష్టం చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన సంక్షేమ హాస్టళ్ల బండారం బయటపడి కూటమి ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటోందని ఆరోపించారు. నాలుగో రోజు వైఎస్సార్ విద్యార్థి సంఘం నేతలు గురువారం తిరుపతిలోని ఎస్సీ, బీసీకి చెందిన పలు హాస్టల్స్ను పరిశీలించారు. అక్కడి సమస్యల గురించి స్వయంగా పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన సంక్షేమ హాస్టళ్ల బాట, కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిందని పేర్కొన్నారు. పరిశీలనలో గుర్తించిన సమస్యలను శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్కు వినతిపత్రం ద్వారా అందజేస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ముని, రాజా, మహేష్, హేమంత్, మధు, జగదీష్, తదితరులు పాల్గొనడం జరిగింది. -
ప్రజాభిమానం ఓర్వలేక ఆంక్షలు
వెంకటగిరి(సైదాపురం) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజలు చూపుతున్న ఆదరణను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తెలిపారు. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో నెల్లూరు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం జగన్ పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు విధించడం తగదన్నారు. ముళ్ల కంచెలు వేయడం, రోడ్లకు అడ్డంగా గోతులు తవ్వడం, ప్రజలపై లాఠీచార్జీ చేయడం వంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. జగన్ను చూసేందుకు వచ్చే వారిని అడ్డుకోవాలంటే అరచేతితో సూర్యుడిని ఆపాలనుకోవడమేనని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వెంకటగిరి పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్రెడ్డి, మండల కన్వీనర్ కాల్తిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సైదాపురం మండల కన్వీనర్ ఎం.రవికుమార్, బాలయపల్లి మండల కన్వీనర్ వెందోటి కార్తీక్రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు, నేతలు, అభిమానులు నెల్లూరుకు తరలివెళ్లారు. -
జాతీయ స్థాయిలో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: చత్తీస్గడ్ రాష్ట్రం వసంత్ విహార్ బిలాస్పూర్లోని బత్రాయ్ ఇండోర్ స్టేడియం వేదికగా జూలై 26 నుంచి 29వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి గ్రాప్లింగ్ (కుస్తీ) పోటీల్లో పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించారు. జాతీయస్థాయిలో రాణించిన విద్యార్థినులను ప్రిన్సిపల్ డాక్టర్ సి.భువనేశ్వరి గురువారం అభినందించారు. ఇదే స్ఫూర్తితో కళాశాలలకు, టీటీడీ సంస్థకు మరింత పేరుప్రతిష్టలు తేవాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కోచ్ సాయి సమితిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థుల్లో సౌమ్య బంగారు, కాంస్య పతకాలు సాఽధించగా, ఆర్.లావణ్య వెండి పతకం, ఆర్.దీపిక, శశిరేఖ, పూజశ్రీ, వైష్ణవి కాంస్య పతకాలు సాధించారు. -
కూటమి నేత ఇంటి వద్దే ఇసుక విక్రయాలు
● స్వర్ణముఖి నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాక్షి, టాస్క్ఫోర్స్ : పట్టపగలే ఓ కూటమి నేత ఇంటి వద్ద భారీ ఇసుక డంపు చేసి, యథేచ్ఛగా ఇసుక విక్రయాలు చేస్తుండడం విశేషం. మండల పరిధిలోని ఏ.రంగంపేటకు చెందిన పంచాయతీ నాయకుడు అనే చెప్పుకునే ఓ నేత రాత్రి వేళల్లో జేసీబీ సాయంతో స్వర్ణముఖి నదిలో యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాడు. అధికార పార్టీ అండ దండలతో వందల లోడ్లు అక్రమంగా దోచుకోవడంతో పాటు ఇసుకను తన స్వంత ఇంటి వద్దే డంపు చేస్తున్నారు. అలా డంపు చేసిన ఇసుకను డిమాండ్ బట్టి భారీగా విక్రయాలు సాగిస్తున్నట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నేతల ఇసుక అక్రమ రవాణాలో పోలీసు, రెవెన్యూ శాఖలోని కొంత మంది సహకారం సంపూర్ణంగా అందుతోందనే ఆరోపణలు లేకపోలేదు. వారం వారం అధికారులకు వాటాలు వెళ్లడంతోనే జాతీయ రహదారికి ఆనుకుని జరుగుతున్న ఇసుక స్మగ్లింగ్పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సంజన బుచ్చినాయుడుకండ్రిగ : మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సంజన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు రమణయ్య తెలిపారు. జులై 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని చంఢీగఢ్లో జరిగిన అండర్–17 విభాగంలో ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయికి ఎంపిక అయినట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని సంజనను హెచ్ఎం రమణయ్య, పీడీలు మస్తానయ్య, హరిబాబు అభినందించారు. విద్యార్థిని కబడ్డీ పోటీలలో పాల్గొనడానికి సహకారం అందించిన మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. పొదుపు సంఘాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తిరుపతి అర్బన్ : అవినీతి అక్రమాలకు తావులేకుండా మహిళా పొదుపు సంఘాలు అభివృద్ధి చెందాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి రామానుజ సర్కిల్లోని ఓ హోటల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో పొదుపు సంఘాల శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత జూన్కు రాష్ట్రంలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిందని గుర్తు చేశారు. ఆగస్టు చివరిలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని డీఆర్డీఏ అధికారులకు సూచించారు. పొదుపు సంఘాల నిర్వహణ పటిష్టంగా ఉండాలని సూచించారు. డీఆర్డీఏ పరిధిలో (రూరల్) 34 వేల సంఘాల్లో 3.40 లక్షల మంది సభ్యులు, మెప్మా పరిధిలో(అర్బన్) 13వేల సంఘాల్లో 1.30 లక్షల మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో వారి అభివృద్ధిపై డీఆర్డీఏతోపాటు మెప్మా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శోభనబాబుతోపాటు పలువురు డీఆర్డీఏ ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 1200 ఓట్లు దాటితే కొత్త పోలింగ్ కేంద్రం తిరుపతి అర్బన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 1200 ఓట్లు దాటితే కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఉన్నాయని డీఆర్వో నరసింహులు తెలిపారు. గురువారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1200 ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలు గుర్తించి...162 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా జిల్లాలో 33 పోలింగ్ కేంద్రాలను మార్పు చేస్తున్నామని, 8 పోలింగ్ కేంద్రాలకు పేర్లు మార్చుతున్నామని, ఓట్లు తక్కువగా ఉన్న రెండు పోలింగ్ కేంద్రాల్లో ఒక్కటిగా చేయడానికి నాలుగు పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వివరించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఏ రాజకీయ పార్టీకి అయినా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మాత్రమే ఎప్పటికప్పుడు సరిచేస్తామని స్పష్టం చేశారు. -
వాకాడు తహసీల్దార్ సస్పెన్షన్
వాకాడు: వాకాడు తహసీల్దార్ రామయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ రామయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపిస్తూ పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. బాధిత మహిళా వీఆర్వో కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రామయ్యను సస్పెండ్ చేశారు. ఆరోపణలపై విచారణ అధికారిగా లీగల్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్ను నియమించారు. ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ల వితరణ చంద్రగిరి : స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు ఓ దాత గురువారం కంప్యూటర్లు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థినుల ఉన్నతి కోసం ప్రముఖ పారిశ్రామిక వేత్త, అమ్మార్ట్స్ సంస్థ చైర్మన్ దశరథ రెడ్డి కొన్నేళ్లుగా తన ఔదర్యాన్ని చాటుకుంటున్నారన్నారు. దాత దశరథ రెడ్డి తన సొంత సంస్థ ద్వారా 15 కంప్యూటర్లు, 15 కంప్యూటర్ డెస్క్లు, 15 కుర్చీలను విరాళంగా అందజేయడం సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా చంద్రగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు 5 కంప్యూటర్లు వితరణ చేశారన్నారు. అనంతరం దాత దశరథరెడ్డి మాట్లాడుతూ. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపల్ ప్రకాష్, బాలికల కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. 8న సామూహిక వరలక్ష్మి వ్రతంశ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఉపాలయమైన బ్రహ్మగుడి ఆవరణలో 8వ తేదీ శుక్రవారం సామూహిక వ్రతం నిర్వస్తున్నట్లు ఈఓ బాపిరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 7 గంటల నుంచి వ్రతం ప్రారంభమవుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి తిరుపతి క్రైమ్ : తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు వేరువేరు ప్రాంతాల్లో మృతి చెందిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూ పార్క్ రోడ్లోని అటవీ ప్రాంతంలో సుమారు 55 నుంచి 60 సంవత్సరాలు గల ఓ పురుషుడు చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు అన్నది.. తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా అలిపిరి లగేజీ సెంటర్ వద్ద సుమారు 55 సంవత్సరాలు గల ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందింది. ఈ రెండు వేర్వేరు ఘటనలపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుల ఆచూకీ తెలిస్తే.. వెస్ట్ పోలీసులను సంప్రదించాలన్నారు. నీటి సంపులో పడి కార్మికుడి మృతి నాయుడుపేట టౌన్: మేనకూరు సెజ్ పరిధి ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు శ్రీరామ్(21) గురువారం ప్రమాదవఽశాత్తు నీటి సంపులో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. గుంటూరుకు చెందిన శ్రీరామ్ రెండేళ్లుగా బ్రేక్స్ ఇండియా పరిశ్రమలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతను వెంకటగిరిలో నివాసం ఉంటూ ప్రతిరోజూ పరిశ్రమకు వస్తుంటాడు. గురువారం విధులకు హాజరై నీటి సంపు సమీపంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. చాలా పైనుంచి సంపులో పడిపోయిన శ్రీరామ్ను అక్కడి కార్మికులు గుర్తించి బయటకు తీసి హుటాహుటిన ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. శ్రీరామ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ బాబి వైద్యశాలకు వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం పరిశ్రమ వద్దకు వెళ్లి నీటి సంపు తదితర ప్రాంతాలను పరిశీలించారు. పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యాన పంటలకు ప్రాధాన్యం
చంద్రగిరి : రైతు ఉత్పత్తిదారులు(ఎఫ్పీఓ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక ఆదాయాన్ని పొందాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉద్యానవన పంటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జేసీ శుభం భన్సల్తో కలిసి రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్ఓపి) అభివృద్ధి కోసం జిల్లా స్థాయి పర్యవేక్షణలో కమిటీ సమావేశం, అగ్రిస్టాక్ వర్కషాప్ను మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్పిఓ) సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎఫ్పీఓ సభ్యుల కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి వారి అభివృద్ధికి కావాల్సిన సహకారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా డ్రోన్లను అధిక శాతం వినియోగించుకోవాలన్నారు. ఆయిల్ ఫాం, ఆక్వా రంగంలో ఇటీవల మంచి రాబడులు వస్తున్నాయని, ఆక్వా రంగం వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. అగ్రిస్టాక్, ఏఐపై వర్కషాప్..! అగ్రిస్టాక్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తీసుకువచ్చే నూతన వ్యవసాయ మార్పులపై వ్యవసాయ, అనుబంధ శాఖ అధికారులకు కలెక్టర్ వర్క్షాప్ నిర్వహించారు. అగ్రిస్టాక్ అనేది రైతు రిజిస్ట్రీ, జియో–రిఫరెన్స్ విలేజ్ మ్యాప్స్, క్రాప్ ఫోన్ రిజిస్ట్రీతో సహా ముఖ్యమైన వ్యవసాయ డేటా సెట్లను ఏకీకృతం చేసే సమాఖ్య అన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ప్రసాద రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి దశరథరామిరెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి రవి కుమార్, ఎల్డీఎంలు రవి కుమార్, సునీల్, నాబార్డ్ డీడీఎం సతీష్ కుమార్, జిల్లా సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాసులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ జగదీశ్, రీజనల్ మేనేజర్ భాస్కరయ్య, రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యులు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఏఓలు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో తడుకు విద్యార్థుల ఘనత
తిరుపతి సిటీ : ఢిల్లీ వేదికగా జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన వర్క్షాపులో తిరుపతి జిల్లా వడమాల పేట మండలం, తడుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. గత మాసం 28 నుంచి 31వరకు నిర్వహించిన పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందనలు పొందారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ విద్యార్థులకు ఇన్నోవేషన్ కోటాలో ఉత్తమ ప్రదర్శన అవార్డును అందజేశారు. దీంతో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఐఐటీ, నిట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్ విద్యాసంస్థలలో ప్రత్యేక కోటా కింద సీట్లు కేటాయిస్తామని తెలిపారు. తడుకు చెందిన విద్యార్థులు హేమశ్రీ, గీతిక, హేమంత్ సోలార్ మిని పాస్ట్ కంపోస్టర్ను తయారు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. జిల్లా సైన్స్ అధికారి భాను ప్రసాద్ను ప్రత్యేకంగా అభినందించారు. -
తహసీల్దార్.. మహిళా వీఆర్వో పరస్పర ఫిర్యాదులు
సాక్షి టాస్క్పోర్స్: మహిళా వీఆర్వో హనీట్రాప్లో తాను చిక్కుకున్నానని తహసీల్దార్.. కోరిక తీర్చమని తహసీల్దార్ తనను వేధిస్తున్నారని వీఆర్వో ఇద్దరూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. మహిళా వీఆర్వో ఇంటికి వెళ్లి నగ్నంగా దొరికిపోయిన తహసీల్దార్.. వీఆర్వో తల్లితో పాటు పలువురి చేతిలో చావుదెబ్బలు తిని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వాకాడు తహసీల్దార్ రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్గా పనిచేశారు. గత నెల 24న నాయుడుపేటలో ఉంటున్న మహిళా వీఆర్వో ఇంట్లోకి వెళ్లిన తహసీల్దార్ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు కలెక్టర్, ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేశారు.కాగా.. తాను పెళ్లకూరులో తహసీల్దార్గా పనిచేసినప్పుడు తనతో చనువుగా ఉన్న మహిళా వీఆర్వో పథకం ప్రకారం తనపై వలపు వల విసిరి (హనీట్రాప్ చేసి) ఇంటికి పిలిపించుకుందని.. తనపై దాడి చేయడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి నగదు కోసం బెదిరిస్తున్నట్టు తహసీల్దార్ కలెక్టర్కు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ మహిళా వీఆర్వోపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తహసీల్దార్ చెప్పినట్టు తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై గురువారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఐ బాబీ చెప్పారు. -
కోరిక తీర్చాలంటూ VRO ఇంటికి వెళ్లిన MROకు దేహశుద్ధి!
సాక్షి,తిరుపతి: జిల్లాలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ నాయుడుపేట ఎంఆర్వోకు (MRO) దేహశుద్ధి జరిగింది. గత కొద్ది రోజులుగా మహిళా వీఆర్వ్వోను (VRO).. ఎంఆర్వో లైగింకంగా వేధిస్తున్నాడు. ‘మీ ఇంటికి వస్తా.. కోడి కూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా?’ అని మెసేజ్లు పెట్టాడు. ఆపై ఆమె ఇంటికే వెళ్లాడు. బరితెగించిన ఎంఆర్వో..దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ మహిళా వీఆర్వోను వేధించాడు. అయితే అప్రమత్తమైన బాధితురాలి కుటుంబసభ్యులు.. తహసీల్దార్ పట్టుకుని మరీ దేశశుద్ధి చేశారు. -
అంతరిక్షంలో ఇస్రో అసామాన్య విజయాలు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): జీఎస్ఎల్వీ–ఎఫ్16 రాకెట్ ప్రయోగం విజయవంతం అయినందుకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి పంపడంలో ఘన విజయం సాధించినందుకు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధ్యక్షులు డా.వి.నారాయణన్, షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్, షార్ శాస్త్రవేత్తలు, ఇతర ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. జీఎస్ఎల్వీ ద్వారా మరో అత్యాధునిక ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడం ద్వారా అంతరిక్ష రంగంలో అసమాన విజయం ఇస్రో సాధించడం దేశానికి గర్వ కారణమన్నారు. ఈ ప్రయోగం, అంతరిక్ష రంగంలో భారత్–అమెరికా దేశాల పరస్పర సహకారంలో ఒక మైలు రాయిగా నిలుస్తుందని అభివర్ణించారు. బాధ్యతల స్వీకరణ తిరుపతి లీగల్: తిరుపతి ఎరచ్రందనం కేసుల విచారణ ప్రత్యేక సెషన్స్ కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఏ.అమరనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే ఆయనను ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు సైదాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుండడంతో సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు బుధవారం ముందస్తుగా నోటీసులు జారీచేశారు. సైదాపురం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్యాదవ్, సొసైటీ మాజీ అధ్యక్షుడు శివకుమార్, మోహన్రావు, వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు యోగిరాజుతోపాటు పలువురికి నోటీసులు అందజేశారు. అందులో ‘‘గతంలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో గొడవలు, తొక్కిసలాటలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలు ఉన్నాయి.. దీంతో మీరు, మీ అనుచరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లకూడదు’’ అని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమల క్యూకాంప్లెక్స్లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,183 మంది స్వామివారిని దర్శించుకోగా 25,906 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. జీవశాస్త్రంపై ఆసక్తి పెంచాలి తిరుపతి సిటీ: భవిష్యత్ తరాలకు జీవశాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు అధ్యాపకులు, మేధావులు చొరవ చూపాలని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు సూచించారు. బుధవారం ఎస్వీయూ స్టూడెంట్స్ వెల్ఫేర్, సాంస్కృతిక వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో టీటీడీకి చెందిన ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో జీవశాస్త్రం, సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో భౌతిక, రసాయన శాస్త్రాల వంటి మూలశాస్త్రాలపై విద్యార్థులకు ఆసక్తి పెంచేందుకు కృషి చేయాలన్నారు. జీవశాస్త్రం వంటి కోర్సులను విద్యార్థులు ఆసక్తితో చదవాల్సిన అవసరం ఉందని, అందులో ప్రావీణ్యం సాధించిన అభ్యర్థులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ మలేషియాకి చెందిన సీనియర్ అధ్యాపకులు డాక్టర్ మన్నూర్ ఇస్మాయిల్ షేక్, ఎస్వీయూ అధ్యాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్, సభ్యులు డాక్టర్ మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు. యోగిరాజు, శివకుమార్కు నోటీసులు అందజేస్తున్న పోలీసులు -
వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం
● నెల్లూరు పర్యటనలో ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత ● వైఎస్ జగన్మోహన్రెడ్డికి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలి ● భూమన అభినయ్రెడ్డి డిమాండ్ తిరుపతి మంగళం : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి చూపుతోందని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్ పర్యటనల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బుధవారం తిరుపతి పద్మావతిపురంలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద వందలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుని చరిత్రలో నిలిచిందన్నారు. అధికారం ఉన్నా.. లేకపోయినా జనాదరణ కలిగిన ఏకై క నాయకుడు జగనన్న అని..ఆయన్ను చూసేందుకు వచ్చే జనప్రవాహాన్ని చూసి తట్టుకోలేక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ జనం రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న పర్యటనలో కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా జనప్రవాహాన్ని ఆపలేరన్నారు. జనాదరణ కలిగిన నాయకుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్ యార్డ్లో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన ఆయనకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందన్నారు. నెల్లూరు పర్యటనలో కూడా సరైన భద్రత కల్పించకుండా ఏదైనా జరగరాని సంఘటన జరిగితే అందుకు కూటమి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నెల్లూరులో ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను, అభిమానులను నిర్బంధించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావన్నారు. కార్యక్రమంలో మేయర్ శిరీష, పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డితో పాటు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
ఒక రైలు.. రెండు టికెట్లు
తిరుమల ఎక్స్ప్రెస్ రైలు ఎక్కే ప్రయాణికులు రెండుసార్లు తీసుకోవాల్సి వస్తుండడంతో ప్రయాణం ఇబ్బందిగా మారింది.షార్ కేంద్రం నుంచి ‘నిసార్’.. జీఎస్ఎల్వీ ఎఫ్–16 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ గగన తలంలోకి విజయవంతంగా దూసుకెళ్లడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశంలో మొట్టమొదటిసారి ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన ‘నిసార్ 102 ప్రయోగం విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లడంతో జయహో భారత్ అంటూ షార్లోని గ్యాలరీ వీక్షకుల కరతాళధ్వనులతో హోరెత్తింది. శాస్త్రవేత్తలకు దేశం నలుమూలల నుంచి అభినందనలు మిన్నంటాయి.ఇస్రో, నాసా సంయుక్త ప్రయోగం ● భూమి ఉపరితల పరిశీలన, వాతావరణ మార్పులపై అధ్యయనం ● విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు ● భారత్–అమెరికా దేశాల సహకారంలో ఇదో మైలురాయి ● గ్యాలరీలో వీక్షకుల కేరింతలతో సందడి గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025– 8లోఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్16 ప్రయోగం విజయవంతం కావడంతో ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో–నాసా కలిసి చేసి మొదటి ప్రయోగాన్ని విజయవంతం చేయడంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ.నారాయణన్, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్కు ఇతర శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రపంచమే గర్వించదగిన రాకెట్ కేంద్రం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉండడం దేశానికి గర్వకారణమన్నారు. నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్సూళ్లూరుపేట : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్–16 ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం 5.40 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయో గాన్ని 18.40 నిమిషాల్లోనే ముగించి 2,392 కిలోలు బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భూమి ఉపరితలం పరిశీలన, వాతావరణ మార్పులపై అధ్యయనం లాంటి వాటికి వినియోగించుకునేందుకు ఈ డ్యూయెల్ సింథటిక్ అపార్చర్ రాడార్ ఉపగ్రహాన్ని ప్రయోగించా రు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) మొదటిసారిగా కలిసిన చేసిన ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రం నుంచి బుధవారం నిర్వహించిన జీఎస్ఎల్వీ ఎఫ్–16 ప్రయోగంతో జీఎస్ఎల్వీ సిరీస్లో 18 ప్రయోగాలను పూర్తి చేశారు. ఇస్రో ప్రయోగాల పరంపరలో ఎన్నో మైలురాళ్లు దాటినప్పటికీ వంద ప్రయోగాల మైలురాయిని దాటి 102 ప్రయోగాలను పూర్తి చేశారు. – 8లోన్యూస్రీల్జీఎస్ఎల్వీ ఎఫ్–16 ప్రయోగ తీరును పరిశీలిస్తే.. జీఎస్ఎల్వీ ఎప్–16 రాకెట్కు మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించారు. 27.30 గంటల కౌంట్డౌన్ సమయంలో రాకెట్లోని లిక్విడ్ స్ట్రాపాన్ బూస్టర్లు, రెండోదశలో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రకియను చేపట్టారు. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగాన్ని ప్రారంభించి 18.40 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేశారు. కౌంట్డౌన్ ముగిసిన వెంటనే 0.00 నిమిషాలకు కోర్ అలోన్ దశలో 139 టన్నుల ఘన ఇంధనం, రాకెట్కు చుట్టూరా ఉన్న నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 160 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి మొదటిదశను 152 సెకెండ్లకు పూర్తి చేశారు. మొదటి దశకు రెండో దశకు మధ్యలో రాకెట్ శిఖరభాగంలో ఉపగ్రహాన్ని అమర్చిన హీట్షీల్డ్స్ 171.8 సెకెండ్లకు విడిపోయాయి. రాకెట్లోని రెండోదశను 149.6 సెకెండ్లకు మండించి 284.1 సెకెండ్లకు పూర్తి చేశారు. రాకెట్లోని మూడోదశ అంటే క్రయోజనిక్ దశను 294.06 సెకెండ్లకు మండించి 1100 సెకెండ్లకు కటాఫ్ చేశారు. ఆ తరువాత 1120 సెకెండ్లకు (18.40 నిమిషాలు) 2,292 కిలోలు బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. -
యువతకు నైపుణ్య శిక్షణ కల్పించండి
తిరుపతి మంగళం : తిరుపతి జిల్లాలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమకు మద్దతు, ప్రోత్సాహకాలు ఇచ్చారా ? ఇండస్ట్రీ 4.0, డిజిటల్ తయారీ వంటి జాతీయ కార్యక్రమాల ద్వారా తిరుపతి యువతకు ప్రత్యక్ష లాభాలు వచ్చేలా కేంద్రం ఎటువంటి ప్రణాళికలు రూపొందించారో చెప్పాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆధునిక సాంకేతిక రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కేంద్రబడ్జెట్లో ప్రవేశ పెట్టిన ఇండస్ట్రీ 4.0 అమలు కోసం తీసుకుంటున్న చర్యలపై లోక్సభలో ప్రశ్నించారు. వీటికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ సమాధానమిస్తూ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రాం కింద 2.79 లక్షలకు పైగా అభ్యర్థులను చేర్చుకుందన్నారు. ఈ కార్యక్రమం నాస్కామ్ సహకారంతో నడుస్తోందని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, త్రీడి ప్రింటింగ్, సైబర్ సెక్యూరిటీ మొదలైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యమన్నారు. ఇటీవల తిరుపతిలో ఏర్పాటైన నైలెట్ నైలెట్ కేంద్రంలో పైన పేర్కొన్న కోర్సులే కాకుండా పైథాన్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి కార్యక్రమాలను అందిస్తోందని తెలియజేశారు. -
ఒక రైలు.. రెండు టికెట్లు
● తిరుమల ఎక్స్ప్రెస్లో జర్నీ ఇక్కట్లు ● గుంతకల్లుకు వెళ్లేటప్పుడు కడపలో ప్యాసింజర్ టికెట్ కొనాలి ● ప్రయాణికులకు తప్పని తిప్పలుతిరుపతి అన్నమయ్యసర్కిల్: రైలు ఒక్కటే.. కానీ అందులో ప్రయాణించాలంటే మాత్రం రెండు టికెట్లు కొనాలంట.. ఇదీ తిరుమల ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేయాలంటే నిబంధన. విశాఖ–తిరుపతి–కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ను నెల రోజుల కిందట గుంతకల్లు జంక్షన్ వరకు పొడిగించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ పొడిగింపు ప్రక్రియ విధానంలో రైల్వే అధికారులు మార్పులు చేశారు. ఇదేమిటంటే కడప నుంచి గుంతకల్లు వరకు ప్రత్యేక ప్యాసింజర్ రైలుగా మార్చారు. ప్రయాణ టికెట్ విషయంలో మాత్రం గజిబిజి విధానాన్ని అమలు చేశారు. కడప–గుంతకల్లు మధ్య మాత్రం ప్యాసింజర్ (జనరల్) టికెట్ తీసుకోవాలి. అయితే గుంతకల్లు వైపు నుంచి తిరుపతికి రావాలంటే కడపలో దిగి, అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ టికెట్ కొనాలని నిబంధన పెట్టారు. కాకపోతే కడపలో ట్రైన్ అరగంట ఆగుతుంది. చాలామందికి విషయమే తెలియదు.. జనరల్ టికెట్లు తీసుకున్న ప్రయాణికులు గుంతకల్లు–కడప మధ్య జనరల్ బోగీలతో పాటు స్లీపర్లో సైతం ప్రయాణించడానికి మాత్రం వెసులుబాటు కల్పించారు. ఈ రైలు గుంతకల్లు నుంచి తిరుపతికి కడప మీదుగా వెళ్తుందనే విషయం చాలావరకు ప్రయాణికులకు తెలియడం లేదు. ఈ విషయం సూచించే విధంగా బోర్డులో మార్పులు, చేర్పులు లేకపోవడంతో తిరుమల ఎక్స్ప్రెస్ రైలును గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని కొందరు ప్రయాణికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. టికెట్లను కొనుగోలు చేసే విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారనే హామీలు ఇస్తున్నారు. ప్రస్తుతం రైలును గుంతకల్లు వరకు పొడిగించి పరీక్షిస్తున్నామని, త్వరలో రైలు నేమ్బోర్డులో మార్పులు చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు తప్పని కష్టాలు.. తిరుమల ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణంలో ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గమ్యస్థానం చేరుకోవడానికి ఒకే రైల్లోనే రెండు టికెట్లు కొనాల్సి రావడం సినిమా కష్టాలను తలపిస్తోంది. గతంలో తిరుమల ఎక్స్ప్రెస్ కడప నుంచి తిరుపతి, విశాఖ మీదుగా కొర్బా వెళ్లేది. తిరుపతి నుంచి వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం గుంతకల్లు వరకు పొడిగించారు. -
నేషనల్ హైవే భూ సర్వే
రేణిగుంట: మండలంలోని గాజులమండ్యంలో ఉన్న తిరుపతి–చైన్నె నేషనల్ హైవేకు సంబంధించి బుధవారం రెవెన్యూ అధికారులు, హైవే అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. నేషనల్ హైవే భూ సేకరణలో భాగంగా గ్రామంలో 200 అడుగుల వెడల్పు ప్రకారం గతంలో సర్వే నిర్వహించి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించారు. కొందరు నష్టపరిహారం తీసుకున్నప్పటికీ ఆ స్థలాన్ని వదులుకోలేదు. దీంతో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వే చేసి రెండు రోజుల్లో స్థలాలు ఖాళీ చేసి, హైవే అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామ పెద్దలతో కృష్ణ మందిరం, సాయిబాబా మందిరం తొలగింపుపై చర్చించారు. దేవాలయాలను మరొకచోటకి మార్చేందుకు సమ్మతించారు. డీ అడిక్షన్ సెంటర్ల నిర్మాణం అవసరం తిరుపతి తుడా: మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయట పడడానికి ప్రధాన చికిత్స అయిన డీ అడిక్షన్ సెంటర్ల నిర్మాణం అవసరమని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు.జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన వైద్యులు, ఎన్జీఓల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యసనం అనేది ఒక తీవ్రమైన సమస్య అని ఇది ఒక వ్యక్తి మెదడు, ప్రవర్తనను ప్రభావితం చేసే వ్యాధి అని తెలిపారు. మద్యపానం, గంజాయి, కొకై న్, నికోటిన్ వంటి మాదక ద్రవ్యాలు మెదడు పై ప్రభావం చూపి స్వీయ నియంత్రణను బలహీన పరుస్తుందని అన్నారు. ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే మెడికల్ కేర్, సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరమని, ఆ దిశగా బాధితులను ప్రోత్సహించాలని తెలిపారు. సమావేశంలో డీపీఎంఓ డాక్టర్ శ్రీనివాసరావ్, ఏఓ డాక్టర్ మురళి కృష్ణ, సీతారామ్ నాయుడు, అధికారులు, వైద్యులు, రాస్, పాస్ ఎన్జీఓల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తిరుపతి క్రైమ్: రాత్రి పూట తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పుత్తూరు డీఎస్పీ రవికుమార్, పుత్తూరు సీఐ ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులున్న తమిళనాడుకు చెందిన మనీ అలియాస్ కోవిల్ మనీ (38), సురేష్ అలియాస్ గుణ(35), తిరుపతి మంగళంకు చెందిన కుమార్(29), మణికంఠ(25), పట్టుబడ్డారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ప్రభు(26), మణిగండన్(47) ఇద్దరు పరారీలో ఉన్నారని వివరించారు. వీరంతా పలుమార్లు జైలు కెళ్లి జైల్లో పరిచయాల వల్ల ముఠాగా ఏర్పడ్డాయని చెప్పారు. వీరి నుంచి 190 గ్రాముల బంగారు, 2.3 కిలోల వెండి ఆభరణాలను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.20.4లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసును ఛేదించడంలో పుత్తూరు పోలీసులు ఎంతగానో కృషి చేశారన్నారు. నిందితులందరిపై షీట్ ఓపెన్ చేస్తామన్నారు. -
అక్షరాస్యతే ‘ఉల్లాస్ అక్షరాంధ్ర’ లక్ష్యం
● డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శోభన్ బాబు తిరుపతి రూరల్ : నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘‘ఉల్లాస్ అక్షరాంధ్ర’’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్డీఏ పీడీ శోభన్బాబు పేర్కొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి అక్షరాంధ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2023లో నిర్వహించిన సర్వే ద్వారా జిల్లాలో గుర్తించిన 88,687 మంది వయోజనులైన నిరక్షరాసులను అక్షరాస్యులుగా చేయడానికి డీఆర్డీఏ, డ్వామా, మెప్మాల ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ మహమ్మద్ ఆజాద్ మాట్లాడుతూ జిల్లాకు ఇచ్చిన టార్గెట్లో 67,170 మందిని డీఆర్డీఏకి, 7,280 మందిని డ్వామాకు, 14,237 మందిని మెప్మాకు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. అభ్యసన పూర్తయిన తరువాత అభ్యాసకులందరికీ 2026 మార్చిలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నోడల్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ అక్షరాంధ్ర కార్యక్రమం విజయ వంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. ఎంపీడీఓ రామచంద్ర, ఏపీఎంలు, ఏపీవోలు పాల్గొన్నారు. -
తమ్ముళ్లు..పెద్ద భూమాయగాళ్లు
● కలువాయి మండలంలో 10 ఎకరాల భూకబ్జా ● అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తొలగించి మరీ ఆక్రమణ ● భూకబ్జాలతో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి భూములు కొల్లగొట్టడంలో తెలుగు తమ్ముళ్లు తలమునకలయ్యారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో 130 ఎకరాల్లో పది ఎకరాలను భూకబ్జా చేయడం బుధవారం వెలుగు చూసింది. ఆ గ్రామ ప్రజలు అందించిన వివరాల మేరకు.. కలువాయి మండలం తెలుగురాయపురంలో 582, 586, 590, 593, 576, 577, 578 తదితర సర్వే నంబర్లలో సుమారు 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని కాజేందుకు కూటమి నేతలు పలు రకాల కుట్రలు పన్నారు. గత ఏప్రిల్ 25న సాక్షిలో ‘బాబాయ్.. భూచోల్లు’ అనే కథనం కూడా ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు. హెచ్చరిక బోర్డులను తొలగించి ఆక్రమణ ఈనేపథ్యంలో మే7న మళ్లీ ఆ భూముల్లో ఉన్న హెచ్చరిక బోర్డులను తొలగించి ఇటాచీ వాహనంతో భూమిని చదును చేసేందుకు తమ్ముళ్లు రంగం సిద్ధం చేశారు. మే 8న తెలుగురాయపురం సర్పంచ్ రమణమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యులు బి.నారాయణరెడ్డితో పాటు మరో 150 మంది గ్రామస్తులంతా ఐకమత్యంగా కలిసి చదును చేస్తున్న భూముల వద్దకు వెళ్లడంతో అక్కడి నుంచి చిత్తగించారు. తాజాగా తెలుగురాయపురం, తోపుగుంట అగ్రహారానికి చెందిన మరో ఇద్దరు నేతలు కలసి దర్జాగా 10 ఎకరాల భూమిని చదును చేసుకున్న విషయం బుధవారం వెలుగుచూసింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. 10 ఎకరాల భూమిని ఆక్రమించి చదును చేసిన టీడీపీ నేతలు -
మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్బీఏ అక్రిడిటేషన్
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు 2028వ సంవత్సరం వరకు నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు లభించింది. టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతమ్మ, అధ్యాపకులు, సిబ్బంది సమష్టి కృషితో నేషనల్ బోర్డ్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించిందన్నారు. గత నెలలో న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన ఎన్బీఏ నిపుణుల బృందం కళాశాలలోని ప్రయోగశాలలు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలు, రికార్డులు, మౌళిక సదుపాయాలను పరిశీలించారు. కళాశాలలో బోధన, ల్యాబ్స్, లైబ్రరీ తదితర అంశాలపై విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించారు. నేషనల్ బోర్డ్ నిబంధనల మేరకు పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తుండడంతో ఎన్బీఏ గుర్తింపు ఇచ్చారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
గూడూరురూరల్ : గూడూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్ సమీపంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ మనోజ్కుమార్ వివరాల మేరకు.. ఇందిరమ్మ కాలనీ 5వ వీధిలో ఓ మహిళ చనిపోయిందని స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించగా గూడూరు పట్టణంలోని నలజాలమ్మ వీధిలో నివాసం ఉంటున్న షేక్ సాహేరా భాను(33)తేలిందన్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. ఈ మేరకు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి శవాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో బోల్తా పడి.. తిరుపతి రూరల్ : జాతీయ రహదారిపై ప్యాసింజర్ ఆటో బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడిన ఘటన బుధవారం వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీ పరిధిలోని బాలాజీ డెయిరీ సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరి నుంచి తిరుపతి వైపునకు వెళ్లే ప్యాసింజర్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పాతకాల్వకు చెందిన డ్రైవర్ కనికాచలం (50) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే గాజులమండ్యంకు చెందిన రామయ్యకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆటో డ్రైవర్ అజాగ్రత్త వల్లే బోల్తా పడినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాణ్యతా ప్రమాణాలను పాటించండి
● ప్రతిసారి జరిమానాలు వేయడం కాదు..లైసెన్స్ రద్దు చేస్తాం ● ఆహార సంబంధిత కేసుల విచారణ సందర్భంగా జేసీ శుభం బన్సల్ తిరుపతి అర్బన్: ఆహార సంబంధిత షాపులు, దుకాణాలు, హోటళ్లు తదితర వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో ఆహార పరిరక్షణ, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఆహార సంబంధిత పాత కేసులను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఆహార భద్రతాధికారుల ఆధ్వర్యంలో వ్యాపారులను కలెక్టరేట్లో సమావేశపరిచారు. ఆ మేరకు జేసీ విచారణ అనంతరం ఆయన ఆహార ప్రమాణాలను పాటించని పలువురు వ్యాపారులకు జరిమానా విధించారు. ప్రధానంగా తిరుపతిలోని ఓ ఐస్క్రీమ్ ఏజెన్సీ షాపునకు రూ.50 వేలు, రెస్టారెంట్, డాబాలు, హోటళ్లకు రూ.1.15 లక్షలు, సరైన లేబుల్ వివరాలు లేకుండా వాటర్ బాటిల్స్ విక్రయిస్తున్న ఓ వ్యాపారికి రూ.30 వేలు, ఓ రెసిడెన్షియల్ విద్యాసంస్థకు రూ.30 వేలు, నాణ్యతలేని నెయ్యి విక్రయించిన వ్యాపారికి రూ.15 వేలు, బేకరీ నిర్వాహకుడికి రూ.10వేలు, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా వివిధ ఆయిల్ స్టాల్స్ ప్యాకెట్లు ముద్రించిన వారికి రూ.2 లక్షలు, ఓ వ్యాపారి కాలపరిమితికి మించిన ఆహార పదార్థాలను దుకాణంలో ఉంచినందుకు రూ.15వేలు జరిమాన విధించారు. మొత్తంగా 20కేసులకు సంబందించి 4,92,000 జరిమాన వేశారు. ఇకపై వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను పాటించడంతోపాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పొందిన తర్వాతే వ్యాపారం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతిసారి జరిమానాతో సరిపెట్టడం కుదరదని.. మరోసారి ఇలా చేస్తే లైసెన్స్ రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ఆగని గజరాజుల దాడులు
చంద్రగిరి: పంట పొలాలపై గజరాజుల దాడులు ఆగడం లేదు. 24 గంటలు గడవకముందే మరోసారి పంట పాలాలపై ఏనుగులు దాడికి పాల్పడిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రైతుల వివరాల మేరకు.. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల మంద నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని పంట పొలాలపై దాడులకు తెగబడ్డాయి. అక్కడ నుంచి రూటు మార్చి శ్రీవారిమెట్టు కాలినడక మార్గం వైపు వెళ్లాయి. దీంతో టీటీడీ విజిలెన్స్, అటవీ అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించారు. అయితే అర్ధరాత్రి సమయంలో సుమారు 13 ఏనుగులు నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని పంట పొలాల్లోకి చొరబడి బీభత్సం సృష్టించాయి. వరి పంటను పూర్తిగా నాశనం చేయడంతో పాటు అరటి చెట్లను ధ్వంసం చేశాయి. అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు ఏనుగులు తిష్ట వేయడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యా రు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని బాణసంచాలు పేల్చుతూ, డప్పులు వాయిస్తూ అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు. అయితే ఏనుగులతో పాటు గున్న ఏనుగులు ఉండడంతో అవి అక్కడ నుంచి కదలకపోవడంతో వారు చేసేదేమీ లేక వెనుదిరిగారు. ఆపై ఉదయం ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు. నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని పంట పొలాలపై దాడి 24 గంటల గడవక ముందే మరోసారి బీభత్సం లబోదిబోమంటున్న రైతన్నలు పంట చేతికొచ్చే సమయంలో ఇలా.. ఆరుగాలం కష్టపడి పండించిన వరి, అరటి పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు వచ్చినట్లు అటవీ అధికారులకు సమాచారం అందిస్తే, సిబ్బంది మాత్రమే వచ్చి.. నామమాత్రంగా బాణసంచా పేల్చారన్నారు. అయితే ఏనుగులు వెనుదిరగకపోవడంతో తామేమీ చేయలేమని వెళ్లిపోయార ని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నెలన్నర రోజుల్లో పంట చేతికొస్తుందనుకునే లోపు ఏనుగుల దాడులతో కన్నీళ్లు మిగిలుతున్నాయని వాపోయారు. -
ఈ బదిలీలతో మార్పు అసాధ్యం మేడమ్
● అందరినీ బదిలీ చేస్తేనే ప్రక్షాళన చేసినట్లు అవుతుంది ● పదోన్నతి పొందిన వ్యక్తి..కింద పోస్టులో తిష్ట వేయడం మన కార్పొరేషన్లోనే సాధ్యం ● కమిషనర్కు ఓ అధికారి బహిరంగ లేఖ తిరుపతి తుడా: ‘‘తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో ప్రక్షాళన చేయాలని మీరు కంకణం కట్టుకున్నారు.. నాలుగైదేళ్లుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఉద్యోగులను మాత్రమే బదిలీ చేశారు..అదే శాఖలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ అధికారిని మాత్రం కదిలించలేకపోయారు.. ఆ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలంటే రెవెన్యూ ఆఫీసర్ నుంచి గుమస్తా వరకు బదిలీ చేస్తేనే మీరు అనుకున్న లక్ష్యానికి అర్థం ఉంటుంది.. అలాకాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏళ్ల తరబడి తిష్ట వేసిన వ్యక్తిని బదిలీ చేయకుండా కిందిస్థాయిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లను బదిలీ చేసినంత మాత్రాన ఆ శాఖ ప్రక్షాళన జరిగినట్టు కాదన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా’’ అంటూ ఓ అధికారి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్యకు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. అలాగే ఆ లేఖను చీఫ్ సెక్రటరీ, పురపాలక శాఖ మంత్రికి, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపించారు. ఇంకా ఆ లేఖలో.. ‘కమిషనర్గా మీరు బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రక్షాళన చేయాలని భావించారు.. మార్పు తీసుకురావాలన్న మీ ఆలోచన మంచిదని అందరూ భావించారు.. ఉద్యోగులు కూడా అందరికీ సమన్యాయం దక్కుతుందని సంతోషపడ్డారు. కానీ ఆ స్థాయిలో ప్రక్షాళన జరగకపోగా 15 ఏళ్లకు పైగా ఒకే పోస్టులో ఉన్న అధికారిని మీరు కదిలించకపోవడం ఉద్యోగులందరి నమ్మకాన్ని దెబ్బతీసింది’ అంటూ ఆయన ఆవేదన వెళ్లగక్కారు. మరొకరికి అవకాశం ఇవ్వరా? సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్గా పదోన్నతి పొంది చాలామంది ఉద్యోగులు కార్యాలయంలోని అన్ని పోస్టుల్లోనూ పనిచేయాలని భావిస్తున్నారని.. రిటైర్ అయ్యే లోపు రెవెన్యూ ఆఫీసర్గా.. మేనేజర్గా పని చేయాలనే కోరిక ఉంటుందని లేఖలో వివరించారు. 15 ఏళ్లుగా రెవెన్యూ ఆఫీసర్గా ఒకే వ్యక్తి కొనసాగడం వల్ల అనేకమంది ఉద్యోగులు ఆ పోస్టులో పని చేయకుండానే రిటైర్డ్ అయిపోయారన్నారు. అతి తక్కువ కాలంలో మరికొందరు రిటైర్ అయ్యేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. సీనియర్లకు ముఖ్యమైన పోస్టుల్లో పనిచేసే అవకాశాన్ని ఇవ్వండి.. మేనేజర్గా పదోన్నతి పొందిన రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవను ఆ పోస్టులోకి పంపించి, మరో సీనియర్ సూపరింటెండెంట్కు ఆర్ఓగా అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది మేడమ్ అని కోరారు. ప్రస్తుతం ఈ లేఖ తీవ్ర దుమారం రేగడంతో పాటు చర్చనీయాంశంగా మారింది. -
హోరాహోరీగా ముగిసిన క్రికెట్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : తుమ్మలగుంట క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహించిన అండర్–14, 17 జిల్లాస్థాయి టెన్నీస్ బాల్ క్రికెట్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీలకు రెండు విభాగాల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన 14 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో అండర్–14 విభాగంలో లిటిల్ ఏంజెల్స్ పాఠశాల జట్టు విజేతగా నిలువగా, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జట్టు రన్నరప్గా, సోక్రటీస్, నాగార్జున పబ్లిక్ స్కూల్ జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే అండర్–17 విభాగంలో ఇంటర్ నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జట్టు విజేతగా, రెయిన్బో స్కూల్ టీం రన్నరప్గా, జీఎస్ఆర్ మాగ్నటిక్, లిటిల్ ఏంజెల్స్ స్కూల్స్ జట్లు తృతీయ స్థానం సాధించాయి. గెలుపొందిన జట్లకు, బెస్ట్ క్రికెటర్లకు లక్ష్మీ చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ కొప్పర్ల దివాకర్ చేతుల మీదుగా ట్రోఫీలు, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో టెన్నీస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ.దేవరాజ్, ప్రధాన కార్యదర్శి మనోహర్, కోశాధికారి కె.హేమంత్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
నింగిలోకి నైసార్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఉమ్మడి ఉపగ్రహం నైసార్ జీఎస్ఎల్వీ ఎఫ్16 నిప్పులు చిమ్ముతూ బుధవారం నింగిలోకి దూసుకెళ్లింది. నిర్ణిత కక్ష్యలోకి చేరుకున్న తర్వాత భూమిని స్కాన్ చేయడం ప్రారంభించడంతో ప్రయోగం విజయవంతమైంది. భూమి ఉపరితలం లోతు గా పరిశీలన.. వాతావరణ మార్పులపై అధ్యయనం లాంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇస్రో, నాసాలు మొట్ట మొదటిసారిగా సంయుక్తంగా 2,392 కేజీల బరువు కలిగిన నైసార్ (నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్) ఉపగ్రహాన్ని రూపొందించాయి.జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎప్16) ఉపగ్రహ వాహక నౌక ద్వారా భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య సమకాలిక కక్ష్యలో నైసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇది ప్రత్యేకంగా భూమి ఉపరితల పరిశీలన ఉపగ్రహం కావడం విశేషం. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నాసాది ఎల్–బ్యాండ్, ఇస్రోది ఎస్–బ్యాండ్) భూమిని అత్యంత దగ్గరగా పరిశీలించే ఉపగ్రహం. దీనికి 12 మీటర్ల అన్ఫర్లబుల్ మెష్ రిఫ్లెక్టర్ యాంటెన్నాను అమర్చారు. ఈ ఉపగ్రహం తొలిసారిగా స్వీప్సార్ టెక్నాలజీని ఉపయోగించి 242 కిలోమీటర్లు అ«ధిక స్పేషియల్ రిజల్యూషన్తో భూమిని పరిశీలిస్తుంది. ఈ ఉపగ్రహం భూగోళాన్ని మొత్తం స్కాన్ చేసి 12 రోజుల వ్యవధిలో అన్ని వాతావరణ పరిస్థితుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా డేటాను అందిస్తుంది. భూమి ఉపరితలంలో నేల వైకల్యం, మంచు పలకాల కదలిక, వృక్ష సంపద, డైనమిక్స్ వంటి చిన్న మార్పులను కూడా గుర్తిస్తుంది. సముద్రపు మంచు వర్గీకరణ, ఓడల గుర్తింపు, తీర ప్రాంత పర్యవేక్షణ, తుపాన్ లక్షణం, నేల తేమలో మార్పులు, ఉపరితల నీటి వనరుల మ్యాపింగ్, పర్యవేక్షణతో పాటు విపత్తుల సమయంలో హెచ్చరికలకు సంబం«ధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. రూ.11,200 కోట్లతో రూపొందించిన ఈ ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందిస్తుంది. ప్రయోగంలో అన్ని దశలు అద్భుతం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్16 ప్రయోగాన్ని నిర్వహించారు. ఎరుపు, నారింజ రంగుతో నిప్పులు చిమ్ముతూ నింగివైపునకు అత్యంత వేగంగా దూసుకెళ్లింది. మూడు దశల్లో ప్రయోగించిన రాకెట్లో అన్ని దశలు అద్భుతంగా పని చేయడంతో 18.40 నిమిషాలకు కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. బెంగళూరు సమీపంలో హాసన్లో ఉన్న గ్రౌండ్స్టేషన్కు సిగ్నల్స్ అందడంతో ఉపగ్రహం చక్కగా పని చేస్తోందని వారు ప్రకటించారు. ఇది షార్ నుంచి 102వ ప్రయోగం. ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ రూంలో శాస్త్రవేత్తలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం జరిగింది ఇలా.. ⇒ 51.70 మీటర్లు పొడవున్న జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ 420.5 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది. ⇒ నాలుగు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో మొదటిదశ ప్రారంభమైంది. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్లో 40 టన్నుల ద్రవ ఇంధనం.. స్ట్రాపాన్ బూస్టర్లకు మధ్యలోని కోర్ అలోన్ దశలో 139 టన్నుల ఘన ఇంధనాలను (మొత్తం 299 టన్నుల ద్రవ, ఘన ఇంధనాలు) మిళితం చేసి 152 సెకన్లలో మొదటి దశ పూర్తి చేశారు. ⇒ రాకెట్ శిఖర భాగంలోని ఉప గ్రహానికి అమర్చిన హీట్ షీల్డ్స్ 171.8 సెకన్లకు మొదటి – రెండో దశకు మధ్యలోనే విజయవంతంగా విడిపోయాయి. ⇒ రెండో దశను 294.1 సెకన్లకు పూర్తి చేశారు. ⇒ ఆ తర్వాత అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశలో 15 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,100 సెకన్లకు మూడో దశను కటాఫ్ చేశారు. ⇒ అనంతరం 1,120 సెకన్లకు (18.40 నిమిషాలకు) 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి నిసార్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ⇒ అక్కడి నుంచి ఉపగ్రహాన్ని బెంగళూరుకు సమీపంలోని హసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ తన ఆధీనంలోకి తీసుకుని ఉపగ్రహ పనితీరును పర్యవేక్షించడం ప్రారంభించింది. ఉపగ్రహం సంతృప్తికరంగా ఉందని ప్రకటించారు. ఇక భారీ ప్రయోగాలే లక్ష్యం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇక ఆకాశమే హద్దుగా భారీ ప్రయోగాలే లక్ష్యంగా పని చేస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ అన్నారు. బుధవారం సాయంత్రం నిసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన అనంతరం మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మే నెల 18న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగం అపజయం కొంత కుంగదీసినా, ఈ ప్రయోగ విజయంతో మరిన్ని ప్రయోగాలను విజయవంతం చేయగలమనే నమ్మకం వచి్చందన్నారు. ఈ ప్రయోగం తనకు తొలి విజయమని, ఇస్రో బృందానికి అభినందనలు తెలియజేశారు.ఇది ఇస్రో సాధించిన సమష్టి విజయమని చెప్పారు. ఇస్రో–నాసా మధ్య కుదిరిన ఒప్పందంతోనే ఇరు దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలు మొట్టమొదటిసారి చేసిన ప్రయోగం విజయంతం కావడం ఆనందంగా ఉందన్నారు. నాసాతో మరిన్ని ఒప్పందాలు చేసుకుని రాబోయే రోజుల్లో మరో మూడు ప్రయోగాలను నిర్వహించేందుకు నాసా–ఇస్రో సన్నద్దమవుతున్నాయని తెలిపారు. ఇస్రోకు వాణిజ్య సంస్థగా ఉన్న న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కు పీఎస్ఎల్వీ రాకెట్ను అప్పగించడంతో ఈ ఏడాది ప్రయివేట్గా పీఎస్ఎల్వీ–ఎన్1 పేరుతో నూతన ప్రయోగాన్ని చేపట్టనున్నామని తెలిపారు. ఈ ఏడాది ఇస్రో నిర్ణయించిన షెడ్యూల్లో నిసార్తో కలిపి ఏడు ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.ఎల్వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా వాణిజ్యపరంగా బ్లూబర్డ్–6 అనే ఉపగ్రహ ప్రయోగం వుంటుందన్నారు. ఆ తర్వాత పీఎస్ఎల్వీ ఎన్1 రాకెట్ ద్వారా టీడీఎస్–1 అనే ఉపగ్రహాన్ని, హెచ్ఎల్వీఎం (గగన్యాన్–1) ద్వారా అన్ క్రూయిడ్ అర్బిటల్ టెస్ట్ పైలట్–1, జీఎస్ఎల్వీ ఎఫ్17 ద్వారా ఐడీఆర్ఎస్ఎస్–1 అనే ఉపగ్రహాన్ని, గగన్యాన్ టీవీ–డీ2 ద్వారా టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్–2 అనే ప్రయోగాత్మక ప్రయోగంతో పాటు పీఎస్ఎల్వీ సీ62 ద్వారా ఓషన్శాట్–3జీ అనే ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. అనంతరం 2026లో వరుసగా గగన్యాన్–2, గగన్యాన్–3 ప్రయోగాలే లక్ష్యంగా పెట్టుకున్నామని, చంద్రయాన్–4 ప్రయోగానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. కాగా, నిసార్ ప్రయోగాన్ని ఇస్రో, నాసా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఇస్రో మాజీ చైర్మన్లు డాక్టర్ కే రాధాకష్ణన్, ఏఎస్ కిరణ్కుమార్లు మిషన్ కంట్రోల్ సెంటర్లోని గ్యాలరీ నుంచి వీక్షించారు. ఇస్రో సహకారం మరువలేనిది నిసార్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ–ఎఫ్16 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తీరు ఆమోఘం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. నాసా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, జేపీఎస్ ఇంజినీర్ల పట్ల చూపించిన సహకారం మరువలేనిది. నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ ఉపగ్రహాన్ని (నిసార్) ఇరుదేశాలకు చెందిన ఇంజినీర్లు, నాసా శాస్త్రవేత్తలు కలిసికట్టుగా చేయడం ఆనందంగా ఉంది. ఇస్రో చూపించిన అభిమానం, సహకారంతో భవిష్యత్తులో మరో రెండు మూడు ప్రయోగాలు చేయడానికి మేము ముందుకొస్తున్నాం. ఈ ప్రయోగంలో పాలు పంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు. – నాసా మహిళా శాస్త్రవేత్త -
GSLV-F16 ప్రయోగం సక్సెస్
సాక్షి,నెల్లూరు: ఇస్రో, నాసాల ఉమ్మడి ఉపగ్రహమైన నిసార్ శాటిలైట్ GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. నింగిలోకి వెళ్లిన నిస్సార్ ఉపగ్రహం భూమిని స్కాన్ చేయడం ప్రారంభించింది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) అనే ఉపగ్రహం నిసార్ శాటిలైట్ GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ఈ ప్రయోగం ప్రారంభమైంది జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్16) రాకెట్ ద్వారా 2,392 కేజీల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు ఇస్రో సైంటిస్టులు . 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి నిసార్ను ప్రవేశపెట్టారు. భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్లు పాటు సేవలు అందిస్తుంది. భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు... దాదాపు 11 వేల 200 కోట్ల రూపాయలతో వ్యయంతో నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.భవిష్యత్తులో ఇస్రో–నాసా కలిసి మరిన్ని ప్రయోగాలు.. ఈప్రయోగం సందర్భంగా ఇస్రో, నాసా బంధం బలపడి రాబోయే కాలంలో మరో మూడు ప్రయోగాలను సంయుక్తంగా నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ పేర్కొన్నారు. అలాగే, చంద్రయాన్–4 ప్రయోగ పనులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి గగన్యాన్–1 పేరుతో ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పీఎస్ఎల్వీ సిరీస్లో కూడా మరో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. -
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
వాహనాల రద్దీ అత్యధికంగా ఉండే తిరుపతిలోని రామాపురానికి వెళ్లే రోడ్డులో ఓ ఊసరవెల్లి ఒక్కసారిగా ఇలా దూసుకొచ్చింది. బిడ్డా.. ఇది నా అడ్డా, నువ్వే కాస్త చూసుకుని వెళ్లు అన్నట్లు రోడ్డు మధ్యలో కాసేపు ఆగి నిదానంగా పక్కకి వెళ్లింది. వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా నడిపి ఊసరవెల్లి రోడ్డు దాటేవరకూ ఆగడం కనిపించింది. సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి -
చుక్కల జింక మృతి
దొరవారిసత్రం : అటవీ ప్రాంతంలో చుక్కల జింక మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు వివరాలు.. దొరవారిసత్రం నుంచి పూలతోట గ్రామం వైపు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో గాయపడి ఓ జింక మృతి చెందినట్లు కొందరు గుర్తించారు. ఈ జింకను వాహనాలు ఢీకొనడంతో గాయపడి అడవిలోకి వెళ్లి మృతి చెందిందా ? లేక వేటగాళ్లు వేటాడే సమయంలో గాయపరిస్తే చనిపోయిందా ? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్లేస్మెంట్లపై అవగాహన చంద్రగిరి: విద్యార్థులకు అందిస్తున్న ప్లేస్మెంట్లపై మంగళవారం ఎంబీయూ క్యాంపస్లోని దాసరి ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్లోబల్ డెలివరీ భాగస్వామి రాఘవేంద్ర కులకర్ణి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. కొత్త ఐటీ ట్రెండ్లు, నియామక ప్రక్రియలు, సేల్స్ఫోర్స్, సర్వీస్, జావా వంటి ప్లాట్ఫామ్లలో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్ గురించి వివరించారు. సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ జితేందర్ సింగ్ మాట్లాడుతూ జెన్సీ ప్రోగ్రాం ద్వారా కాగ్నిజెంట్ 2026 ఫ్రెషర్స్ నియామకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ నాగరాజ్ రామారావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సారథి, కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.ఢిల్లీబాబు పాల్గొన్నారు. వేధింపుల కేసులో భర్తకు ఏడాది జైలు తిరుపతి లీగల్: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో చిత్తూరు, టీవీ నాయుడు వీధికి చెందిన కరణం ఉపేంద్రకు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తిరుపతి, యశోద నగర్కు చెందిన కరణం పరమేశ్వరిని 2015లో కరణం ఉపేంద్ర వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో అతను కర్ణాటకలో ఆంధ్రా బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు. వివాహమైన కొన్నాళ్లకు అతను, కుటుంబ సభ్యులు ఆమెను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె మహిళా పోలీసులకు భర్త ఉపేంద్రతో పాటు, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. కేసు పూర్వపరాల పరిశీలించిన జడ్జి నిందితుడు కరణం ఉపేంద్రకు మాత్రం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మిగతా నలుగురిపై కేసును కొట్టి వేస్తూ తీర్పులో పేర్కొన్నారు. -
స్వచ్ఛందంగా ముందుకు రావాలి
జిల్లాలో ఇప్పటి వరకు 872 మంది పారిశ్రామిక వేత్తలు 11,009 మంది కుటుంబాలను దత్తత తీసుకున్నారు. పీ4 ప్రాజెక్టు బాధ్యతల ప్రణాళిక, గణాంకాల శాఖకు అప్పగించారు. ఈ క్రమంలో అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. సచివాలయ ఉద్యోగుల సర్వేలో జిల్లాలో పేదలు 80 వేల మందికి పైగా ఉన్నట్లు జాబితాను ఇచ్చారు. ఈ క్రమంలో మరోసారి ఎంపీడీవోల నేతృత్వంలో ఈ నెల 15 నుంచి 25 వరకు గ్రామ సభలు నిర్వహించి వాస్తవాలను నిగ్గు తేల్చుతున్నాం. పేదలకు సాయం చేయడానికి సంపన్నులు ముందుకు రావాలని కోరుతున్నాం. ఎవరిపైనా ఒత్తిడి పెట్టడం లేదు. స్వచ్ఛందంగా వారే ముందుకు రావాలని కోరుతున్నాం. – వెంకటేశ్వర్లు, జిల్లా ప్రణాళిక, గణాంకాలశాఖ అధికారి -
స్కిట్ పూర్వవైభవానికి సహకరిస్తాం
శ్రీకాళహస్తి: స్కిట్ కళాశాలతో తనకు ఎంతో అనుబంధం ఉందని 2010–11 ప్రాంతంలో మిస్మేనేజ్మెంట్, పాలిటిక్స్తో కళాశాల విహీనంగా మారిందని జేఎన్టీయూ వైస్చాన్స్లర్ సుదర్శన్రావు అన్నారు. కళాశాల మూతపడడం చాలా బాధ కలిగించిందన్నారు. స్కిట్ కళాశాల పూర్వవైభవానికి పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. మొదటి కౌన్సెలింగ్లో అనుమతి వచ్చి ఉంటే బాగుండేదని, రెండవ కౌన్సెలింగ్లో రావడం సంతోషకరమన్నారు. ఇందుకు విద్యాశాఖమంత్రి మంత్రి నారా లోకేష్, ఓఎస్డీలు ప్రసాద్, రమణ, కార్యదర్శి శశిధర్ పునఃప్రారంభానికి కృషి చేశారన్నారు. రెండు నెలల్లో దీనిపై అనేకసార్లు నివేదికలు ప్రభుత్వానికి పంపించి ఎట్టకేలకు తేగలిగామని తెలిపారు. రెండు మూడేళ్లలో స్కిట్ ఉత్తమమైన ఫలితాలు సాధించే విధంగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమలు ఇండియాలోకి వస్తున్నాయని ఈ స్కిట్లో వచ్చే విధంగా చూస్తామన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. -
హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించండి
తిరుపతి అర్బన్: జిల్లాలోని హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రం అందించారు. ప్రధానంగా పుత్తూరు బీసీ హాస్టల్ ప్రైవేటు అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని.. అయితే ఆ భవనాన్ని ఖాళీ చేయాలని చెప్పడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారన్నారు. అలాగే చంద్రగిరి బీసీ హాస్టల్లో అవసరమైన గదులు లేకపోవడంతో ఒక్కో గదిలో 20 నుంచి 25 మంది విద్యార్థులు ఉంటున్నారని చెప్పారు. సత్యవేడులోని ఎస్సీ కళాశాల హాస్టల్ భవనం శిథిలం కావడంతో బీసీ హాస్టల్లో విద్యార్థులు తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సూళ్లూరుపేట, వెంకటగిరి, నాయుడుపేటలో విద్యార్థులకు సరైన హాస్టళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తిరుపతిలోని హాస్టళ్లను మెరుగుపరచాల్సి ఉందని తెలియజేశారు. ఆ మేరకు విచారణ చేపట్టి పిల్లలకు న్యాయం చేస్తామని కలెక్టర్ వారికి వివరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, భగత్ రవి, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, జిల్లా నాయకులు శివ తదితరులు ఉన్నారు. -
పేదలను చంద్రబాబే దత్తత తీసుకోవాలి
● సంపన్నులను ఒప్పించాలంటూ ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది ● పీ–4 పేరుతో టీడీపీ ఎమ్మెల్యేల వసూళ్ల పర్వం ● ఒక్క మంత్రి కూడా పీ–4లో ఎందుకు దత్తత తీసుకోలేదు ? ● పేదలను ముష్టివాళ్లుగా చిత్రీకరించకండి ● ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమనసాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘‘కూటమి ప్రభుత్వం పీ–4 పేరిట ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి చేస్తుంది. సచివాలయ సిబ్బందికి సరిగా జీతాలే ఇవ్వకుండా.. వారిపై ఒక్కొక్కరు ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని విపరీతమైన ఒత్తిడి తెస్తోంది. రాష్ట్రంలో ఉన్న పేదలందరినీ సీఎం చంద్రబాబే దత్తత తీసుకోవాలి’’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన చంద్రబాబు వారి దృష్టి మరల్చేందుకు కొత్తగా పీ–4 కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా దత్తత తీసుకోవాలని కలెక్టర్ల ద్వారా ఒత్తిడి చేయించడాన్ని ఆక్షేపించారు. పీ–4 పేరుతో కూటమి ఎమ్మెల్యేలు దోపిడీకి తెరతీశారని భూమన మండిపడ్డారు. ఉద్యోగుల్లో అలజడి.. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నాడు–నేడు ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పిల్లలకు నాణ్యమైన విద్య, అర్హులైన పేదలందరికీ ఇళ్లు వంటి గొప్ప కార్యక్రమాలను చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా చెరిపేసే కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. పీ–4 కార్యక్రమం రాష్ట్రంలో అలజడి సృష్టిస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఒక్కరు కూడా దత్తత తీసుకున్నది లేదని.. వాళ్ల అనుకూల పత్రికల్లోనే ఎమ్మెల్యేలు పీ–4 కార్యక్రమంలో భాగంగా వసూళ్లు కార్యక్రమం ప్రారంభించారని వార్తలు రాశారని గుర్తు చేశారు. సమావేశంలో మేయర్ శిరీష, పార్టీ నేతలు పాల్గొన్నారు. పీ–4 అంటూ చంద్రబాబు కొత్త ప్రవచనాలు .. సీఎం చంద్రబాబు నాయుడు గత రెండు, మూడు నెలలుగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తానని భీకర, భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నాడని.. ప్రపంచాన్ని మార్చడానికి పీ–4 అనే కొత్త సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వదలడానికి సంసిద్ధులయ్యారని భూమన అన్నారు. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టనర్ షిప్ (పీ–4) కార్యక్రమాన్ని ప్రచారంతో ఊదరగొడుతున్నారని.. ఇందులో భాగంగా ధనికులంతా పేదవారికి సహాయం చేయాలని ఆయన ప్రవచిస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో కేవలం 20 లక్షలు పేద కుటుంబాలు మాత్రమే ఉన్నట్టు.. వారిలో 5.80 లక్షల మందిని గుర్తించగా.. ఇంకో 15 లక్షల మందిని గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ల మీద ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్లు దిగువనున్న ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలమీద విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ దేశంలో 80 శాతానికిపైగా ఆర్థిక (సంపద) కేవలం 20 శాతం మంది చేతుల్లోనే ఉందని.. చంద్రబాబు చెబుతున్నట్టు పేదరికంలో 20 లక్షల కుటుంబాలే కాదు.. రెండు మూడు రెట్లకు పైగా ఉన్నారని, అలా రాష్ట్రంలో ఉన్న దాదాపు కోటి కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో తన ఐదేళ్ల పాలనలో రూ.2.85లక్షల కోట్లు అందించి వారిని ఆర్థికంగా ఉన్నతస్థితిలోకి తీసుకురావడానికి కృషి చేశారని గుర్తు చేశారు. దాదాపు రూ.55 వేల కోట్లతో 25 లక్షల ఇళ్లు నిర్మించే బాధ్యత కూడా వైఎస్ జగన్హన్ రెడ్డి తీసుకున్నారని.. అది నిజమైన రాజకీయ తత్వవేత్త ఆలోచన చేయాల్సిన విషయం అన్నారు. మరోవైపు ఎకై ్సజ్ ఉద్యోగులపై ఒత్తిడి పెట్టి బార్, వైన్ షాపుల యజమానులను మార్గదర్శకులుగా మార్చే కార్యక్రమం చేయడం అత్యంత ఆశ్చర్యకరం అన్నారు. ఎకై ్సజ్ ఉద్యోగుల ద్వారా షాపు యజమానులపై ఒత్తిడి పెడితే వాళ్లు మద్యం ధరలను మరింత పెంచుకుంటూ పోతారని ఆరోపిచంచారు. -
బలవంతపు మార్గదర్శులు
● బంగారు కుటుంబాలకు ‘సంక్షేమం’ కోత? ● పీ4 మొదటి విడత సర్వేలో 80,350 ఎంపిక ● ముగిసిన రెండో విడత సర్వే ● 872 మంది మార్గదర్శులు ● 11,009 బంగారు కుటుంబాల దత్తత తిరుపతి అర్బన్ : పీ4 పథకం (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్) ద్వారా అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని..అందుకు సంపన్న కుటుంబాలు ముందుకు రావాలని అధికారులు వారిపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బలవంతంగా దత్తత తీసుకోమని చెప్పడం ఎంటీ అంటూ పలువురు మండిపడుతున్నట్లు చర్చ సాగుతోంది. సచివాలయ ఉద్యోగులు చేపట్టిన మొదటి సర్వేలో జిల్లా వ్యాప్తంగా 80,350 కుటుంబాలు పేదలు ఉన్నట్లు నివేదికలను అధికారులకు ఇచ్చారు. అయితే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని తేలడంతో వడపోతకు మరోసారి ఎంపీడీవోల నేతృత్వంలో గ్రామసభలు నిర్వహించి ఈనెల 15 నుంచి 25 వరకు సర్వేలు నిర్వహించారు. అయితే రెండో విడత జాబితాను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. పీ4 స్కీమ్కు సాయం చేసే సంపన్నులను మార్గదర్శులుగాను, సాయం పొందే పేదలను బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం నామకరణ చేసింది. దీంతో అధికారులు అలానే పిలుస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి, కొందరు మార్గదర్శులుగా సాయం అందించేందుకు వెనుకాడుతున్నారు. మార్గదర్శులుగా ఉండకపోతే ప్రభుత్వం తమపై రాజకీయ కక్షలకు పాల్పడుతుందేమోననే ఆందోళన మరికొందరిలో ఉంది. పారిశ్రామిక వేత్తలను మార్గదర్శులను ఒప్పించి ముందుకు తీసుకురావాలని, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులే మార్గదర్శులుగా మారాలని చంద్రబాబు సర్కారు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు డోలాయమానంలో పడ్డారు. గెజిటెడ్ అధికారి కనీసం ఒక కుటుంబం దత్తత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, గెజిటెడ్ ర్యాంకు కలిగిన అధికారి కనీసం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి. ప్రతి ఆసుపత్రి నుంచి ఐదుగురు మార్గదర్శులుగా మారాలని స్పష్టం చేసింది. ఉద్యోగులు కూడా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తోంది. తమ కుటుంబాలనే ఆర్ధికంగా బలోపేతం చేసుకోలేకపోతున్నామని, ఇప్పుడు ఇతరులను దత్తత తీసుకోవడంపై ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పక్షుల సంరక్షణకు మాస్టర్ ప్లాన్
తిరుపతి అర్బన్: పక్షుల సంరక్షణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం రాత్రి ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా నేలపట్టు పక్షి అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటుకు సంబంధించి జేసీ శుభం బన్సల్, అటవీ సంరక్షణాధికారి శెల్వం, డీఎఫ్ఓ వివేక్తో కలసి చర్చించారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతౌల్యం సాధించడానికి అన్ని శాఖల సమన్వయం అత్యంత అవసరమన్నారు. ఈ ప్రక్రియలో ప్రజల జీవనోపాధి, భద్రత, భవిష్యత్ తరాల కోసం ప్రకృతి పరిరక్షణ రెండూ ముఖ్యమైనవిగా వెల్లడించారు. జిల్లాలోని పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షి అభయారణ్యం, పరిసర ప్రాంతాల్లో 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. ప్రతి శాఖ తమ పాత్రను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ నరసింహులు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు, డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ హారిక, డీపీఓ సుశీల దేవి, డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు, డ్వామా ిపీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ.. తిరుపతి సిటీ: డిగ్రీ నోటిఫికేషన్ ఊసేలేదు కానీ ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో ఆఫ్లైన్లో వందలాదిమంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. గత వారం ఉన్నత విద్యామండలి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధాలుగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత రెండు రోజులుగా పద్మావతి డిగ్రీ కళాశాలలో ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ మాట్లాడుతూ విద్యార్థులు తమకు ప్రవేశాలు దక్కవేమోనని ఇప్పటి నుంచే ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం తాము ప్రవేశాలు చేపట్టనున్నామని చెప్పారు. -
శేషాచలంలో గజరాజుల ఘీంకారం
● తొలుత నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలో పంటపొలాల్లో బీభత్సం ● ఆపై శ్రీవారిమెట్టు మార్గంలోకి ప్రవేశం ● స్మగ్లర్ల కోసం ఎగుర వేసిన డ్రోన్లో 17 ఏనుగుల కదలికలు ● అప్రమత్తమైన అఽధికార యంత్రాంగం చంద్రగిరి: ఇన్నిరోజులూ అటవీ సమీప గ్రామాలపై దాడులు చేస్తున్న గజరాజులు రూటుమార్చాయి. పంట పొలాలను ధ్వంసం చేయడంతో పాటు భక్తులు అధికంగా కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలోకి చేరు కోవడంతో అప్రమత్తమైన అధికారులు వాటిని అటవీ ప్రాంతంలోకి తరిమేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మండల పరిధిలోని నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని పంట పొలాల్లోకి సు మారు 17 ఏనుగులు చేరుకున్నాయి. వరిపంటతో పాటు అర టి తోటలను తొక్కి నాశనం చేశాయి. అందినకాడికి పంటలను ఆరగించి బీభత్సం సృష్టించాయి. స్మగ్లర్ల కోసం డ్రోన్లతో గాలిస్తుండగా! నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని పంటలను నాశనం చేసిన గజరాజులు తెల్లవారుజామున శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం డ్రోను కెమెరాలతో గస్తీ కాస్తున్న అధికారులు ఏనుగుల మందను గుర్తించారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి టోకెన్లు పొందిన భక్తులు వాహనాలతో పాటు కాలినడకన వెళ్తున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం విజిలెన్స్, అటవీ, పోలీసు శాఖ అధికారులు మార్గంలోని శ్రీవినాయక స్వామివారి ఆలయం వద్ద భక్తులను నిలువరించారు. అనంతరం అటవీ అధికారులు ఏనుగుల మందను అడవులోకి తరిమేశారు. తరువాత భక్తులను టీటీడీ ఉచిత బస్సు ద్వారా శ్రీవారిమెట్టుకు తరలించారు. ఏనుగుల దాడుల్లో దెబ్బతిన్న పంటలను అటవీ అధికారులు పరిశీలించారు. ఏనుగుల దాడులతో పంటలు తీవ్రంగా నష్టపోయాయని, అధికారులు తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. -
స్కూళ్ల విలీనం పేరిట భ్రష్టు పట్టించారు
● కేవీబీపురం ఎంఈఓ, సీఆర్పీపై చర్యలు తీసుకోండి ● డీఈవైఓకు పాతపాళెం, ఏపీపురం గ్రామస్తుల ఫిర్యాదుకేవీబీపురం: ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని ఏపీ పురం(అప్పనిగుంట), పాతపాళెం గ్రామానికి చెందిన సుమారు 60 మంది దళితులు కేవీబీపురం విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా తమ గ్రామాల్లో నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్లను 117 జీఓ విలీనం పేరుతో ఎంఈఓలు భ్రష్టు పట్టించారని ఆరోపించారు. స్కూళ్ల విలీనంలో భాగంగా మ్యాపింగులు చేసే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, గ్రామస్తులకు కనీసం సమాచారం లేకుండా, కమిటీ మెంబర్ల సంతకాలను కూడా ఉపాధ్యాయులు, సీఆర్పీలే ఫోర్జరీ చేసి అడ్డగోలుగా మ్యాపింగులు చేశారని ఆరోపించారు. కమిటీ మెంబర్ల సంతకాల ఫోర్జరీపై తక్షణమే విచారణ జరిపి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీవైఈఓ మహేశ్వరయ్యకు వినతిపత్రం అందించారు. మండలంలోని అనేక గ్రామాల్లో సమస్యలు తలెత్తడానికి కారణమైన ఎంఈఓతో పాటు బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సీఆర్పీపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం జిల్లా నాయకుడు దాసరి జనార్ధన్ డీవైఈఓకు వినతి పత్రాన్ని అందించారు. సమస్యలు పరిష్కరించకపోతే సోమవారం నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై డీవైఈఓ మహేశ్వరయ్య స్పందిస్తూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో పాతపాళెం గ్రామస్తులు ప్రవీణ్, నాగరాజు, ఏపీ పురం గ్రామస్తులు అక్కులయ్య పాల్గొన్నారు. -
ఆంక్షలతో జననేత జగన్ను అడ్డుకోలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్టయిన కాకాణిని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు. జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ను చూసేందుకు జనం భారీగా వస్తారు. అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు’ అని భూమన అన్నారు. పీ-4 పేరుతో చంద్రబాబు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారని.. పేదలను ధనికులను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు’’ అంటూ భూమన దుయ్యబట్టారు.పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు భయపడంనెల్లూరు జిల్లా: ఆంక్షలతో జననేత వైఎస్ జగన్ను అడ్డుకోలేరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ‘‘వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. ప్రజలు ఎవ్వరూ పర్యటనలో పాల్గొనకూడదు అంటున్నారు. 31న నెల్లూరు పర్యటన విజయవంతం చేసి తీరుతాం’ అని చంద్రశేఖర్రెడ్డి తేల్చి చెప్పారు. పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరన్నారు. -
ప్లాస్టిక్మయం..వ్యాదుల భయం
నిద్రలేచింది మొదలు పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్తో చేసిన వాటినే అందరూ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్లనే అధికంగా వాడుతున్నారు. వేడి వేడిగా పెట్టిన ఆహారం ప్లాస్టిక్ బాక్స్ల్లో పెట్టిన కొన్ని గంటలకే రసాయనాలు ఆహారంలో కలిసి క్యాన్సర్ మహమ్మారికి దారితీస్తున్నాయి. ఇంత ప్రమాదకరమని తెలిసినా ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్లనే కొనుగోలు చేసి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావడంలో విద్యా, వైద్యశాఖలు విఫలమవుతున్నాయి.తిరుపతి సిటీ : రంగు రంగుల డిజైన్లు, కార్టూన్ క్యారెక్టర్స్, గ్లిట్టర్ ఎఫెక్ట్స్తో పిల్లలను ఆకట్టుకునే విధంగా ప్లాస్టిక్ బాటిళ్లు, లంచ్ బాక్స్లు మార్కెట్ను ముంచెతు్తతున్నాయి. ప్రతి విద్యార్థి బ్యాగుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్లు దర్శనమిస్తున్నాయి. విద్యార్థులను తమ వైపు తిప్పుకునే విధంగా ఆకర్షణీయంగా ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. వీటి అమ్మకాలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. పలు రకాల వెరైటీలు, తక్కువ ధర, బరువు తక్కువగా కనిపించే ప్లాస్టిక్ బాటిళ్ల వైపే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆకర్షితులై ప్రాణాంతకమైన రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.అనారోగ్యం, పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిసినా విద్యావంతులు, ఉన్నత వర్గాలు సైతం వీటి వినియోగాన్ని వదలకపోవడం గమనార్హం. ప్లాస్టిక్ వినియోగం మనిషి జీవితంలో భాగమైపోయింది. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా, పెద్దలు విధులకు హాజరు కావాలన్నా టిఫిన్, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్వే వాడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం ప్లాస్టిక్ బాక్సులలో ప్యాక్ చేసిన ఆహారం మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసే సమయానికి ఆహారంలో చాలా తేడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రసాయనాలు కరిగి విషపూరితం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులతో ప్రమాదమని తెలిసినా మార్కెట్లో దొరికే పలు రకాల డిజైన్లు చూసి విద్యార్థులు అటు తల్లిదండ్రులు మోజుపడి కొనుగొలు చేసి వాడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేస్తే రోగాలను కొనుగోలు చేసినట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరిగించిన వాటర్ను, అత్యంత శీతలమైన పదార్థాలను ప్లాస్టిక్ పాత్రలలో నింపితే సుమారు 90శాతం కెమికల్స్ అందులో కరిగి ఆ పదార్థాలను విషపూరితం చేస్తాయి.దీంతో రోగాలు శరీరాన్ని కబళిస్తాయి. అలాగే ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలు భూమిలో కరగాలంటే కనీసం 450 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి వినియోగం ఆరోగ్యానికే కాక పర్యావరణానికి ప్రమాదకరం. పాఠశాలలు, కళాశాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సామాజిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉందని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్తో ప్రాణాంతక వ్యాధులు ప్లాస్టిక్లో బిస్ఫినాల్–ఏ (బీపీఏ), మైక్రో ప్లాస్టిక్స్ అనే రసాయనం అధికంగా ఉండటంతో కొద్ది మోతాదులోనైనా శరీరంలో చేరే ప్రమాదం ఉంది. దీంతో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. శరీరంలోని గ్రంథులపై ప్రభావం చూపి వాటి పనితీరును మందగిస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. అతిశీతలం, అధిక వేడి పదార్థాల కోసం వీటిని వినియోగిస్తే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ మహమ్మారి కాటేసే ప్రమాదం ఉంది.ప్లాస్టిక్ను ఇలానే వినియోగిస్తే 2030 నాటికి ఆంధ్రప్రదేశ్లో 27 శాతం మంది క్యాన్సర్ బారీన పడే ప్రమాదం ఉందని నిపుణులు, మేధావుల గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 25 ఏళ్ల లోపు పిల్లలు, యువతలోనూ ప్లాస్టిక్ వినియోగంచడంతో కలిగే అనర్థాలు ప్రాణాంతక వ్యాధులకు గురి చేస్తున్నాయి. గత 10 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వినియోగం అధికమవడమే ఇందుకు ప్రధాన కారణంగా వైద్యులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి పిల్లలకు టిఫిన్ బాక్స్లు, వాటర్ బాటిళ్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రమాదమే. వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాలలో ఉంచడం ద్వారా రుచి, వాసన కోల్పోడంతో పాటు కొన్ని రకాల విష పదార్థాలు ఏర్పడతాయి. ఇవి చిన్నారుల అవయవాలపై ప్రభావం చూపుతాయి. నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉండే వాటర్ బాటిళ్లు, లంచ్ బ్లాక్స్లు వాడటంతో అందులోని కెమికల్స్ పొరలుగా ఆహారంలో కలిసి ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. – డాక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, చిన్న పిల్లల వైద్యనిపుణులు, తిరుపతి పేరెంట్స్ మీటింగ్ల్లో అవగాహన కల్పించాలి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో పేరెంట్స్ మీటింగ్లంటూ హడావుడి చేస్తుంటారు. కానీ అందులో విద్యార్థులకు అవసరమైన విషయాలను తల్లిదండ్రులతో చర్చించడం లేదు. తల్లిదండ్రులకు గేమ్స్ ఏర్పాటు చేసి, టీలు, కాఫీలు ఇచ్చి సంతోషపెట్టి పంపుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై యాజమాన్యాలు శ్రద్ధ చూపకపోవడం ఆశ్చర్యమేస్తోంది. పిల్లల ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని, నివారణా చర్యలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలేదు. విద్య, వైద్య శాఖాధికారులు దీనిపై దృష్టి పెట్టాలి. – రాజశేఖర్రెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు, తిరుపతి స్టీలు, రాగి వస్తువుల వినియోగం శ్రేయస్కరం ఆధునిక యువత, చిన్నారుల ఆరోగ్యం పెను ప్రమాదంలో పడింది. నిద్రలేచిన మొదలు పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్తో చేసిన వాటినే వినియోగిస్తున్నారు. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులతో పాటు దీర్ఘకాలిక సమస్యల చిన్న వయస్సు నుంచే వెంటాడుతున్నాయి. ప్లాస్టిక్ బాక్సులలో ఆహారం భద్రపరిచి కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఆరగించడంతో అదికాస్త విషంగా మారుతోంది. పలు పరిశోధనలలో ఈ విషయం బయటపడినా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం దారుణం. – ప్రశాంతి, ప్లాస్టిక్ వినియోగం–అనర్థాలపై పరిశోధన చేస్తున్న విద్యారి్థని, తిరుపతిక్యాన్సర్ విజృంభించే ప్రమాదం సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు ప్లాస్టిక్ భూతం చుట్టుముట్టింది. తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పూరీ్వకులు పాటించిన నియమాలు, అలవాట్లలో ఎంతో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని నేటి తరం అనుసరించాలి. ప్లాస్టిక్ బాటిళ్లు, లంచ్ బాక్సుల వినియోగంతో కాన్సర్ మహమ్మారి దగ్గరవుతోంది. దీన్ని నుంచి బయట పడాలంటే ప్లాస్టిక్ వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పరంగా పలు రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య వంతులను చేయడం జరిగింది. – కే. భానుప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి, తిరుపతి -
ఎస్వీయూలో ఉద్యోగుల ముష్టియుద్ధం
● తీవ్రగాయాలతో రుయాస్పత్రిలో చికిత్స ● ఆర్థిక లావాదేవీతోనే ఒకరిపై ఒకరు దాడి తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఉద్యోగుల గొడవ రణరంగాన్ని తలపించింది. వర్సిటీలోని ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సోమవారం పరిపాలనా భవనం ఎదుట ముష్టి యుద్ధాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. తీవ్ర గాయాలపాలైన ఉద్యోగులు రక్త స్రావంతో రుయాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలలోకి వెళితే.. ఎస్వీయూ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్న సుబ్రమణ్యం, శ్రీనివాసరావు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవులు జరుగుతుండేవని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో భాగంగా సుబ్రమణ్యం అనే ఉద్యోగికి తోటి ఉద్యోగి శ్రీనివాసరావు రూ.2 లక్షలు వరకు అప్పు ఉన్నాడని, గత రెండేళ్లుగా చెల్లించకుండా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నాడని తెలిసింది. దీంతో పలుసార్లు సదరు ఉద్యోగి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆర్థిక లావాదేవీలతో పాటు ప్రమోషన్ విషయంలో తనకే రావాలి..అడ్డు తగలవద్దు..అంటూ ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం నెలకొనేదని తెలిసింది. దీంతో సోమవారం వర్సిటీ ఆవరణలో ఇద్దరూ తారస పడిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల కారణంతో పాటు ప్రమోషన్కు అడ్డువస్తున్నారనే కోపంతో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి, ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. తోటి ఉద్యోగులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాలతో రుయాలో చేరిక ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఉద్యోగులు తీవ్రగాయాలతో స్థానిక రుయాస్పత్రిలో చేరారు. శ్రీనివాసరావుకు తలపై గాయం కావడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. అలాగే మరో ఉద్యోగి సుబ్రమణ్యంకు సైతం బలమైన లో గాయాలు తగలడంతో ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇరువురు ఎస్వీయూ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
విలీనం వద్దు
● మా ఊరిలోనే స్కూలు కొనసాగించండి ● కలెక్టరేట్ వద్ద తంబూరు ఎస్సీకాలనీ వాసుల ధర్నా తిరుపతి అర్బన్: మాకు విలీనం వద్దు.. మా పాఠశాలను మా ఊరిలోనే ఉంచాలని నారాయణవనం మండలంలోని తుంబూరు ఎస్సీకాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. సోమవారం కలెక్టరేట్ వద్ద తమ పాఠశాలను తమ గ్రామంలోనే ఉంచాలంటూ నినాదాలు చేశారు. ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తుంబూరు హరిజనవాడ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 117ను తీసుకువచ్చి మూడు కిలోమీటర్ల లోపల ఉన్న పాఠశాలలను విలీన ప్రక్రియను ప్రారంభించిందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. వందలాది మంది విద్యార్థులకు విద్యను అందించే పాఠశాలలను విలీనం పేరుతో మూసి వేయడం చాలా దారుణమని పేర్కొన్నారు. తంబూరు హరిజనవాడ పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతుండగా కేవలం పదిమంది విద్యార్థులు ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కుమార్, నాయకులు హరికృష్ణ, వినయ్, విష్ణు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పేదల పక్షాన నిరంతరం పోరాటం
సైదాపురం: పేద రైతుల పక్షాన నిరంతరం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. సైదాపురం మండలంలో పేదలు సాగు చేసుకుంటున్న నిమ్మతోటలను అధికారులు నేలమట్టం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన కమ్మవారిపల్లె గ్రామానికి వెళ్లారు. నిమ్మతోటలు ధ్వంసం చేసిన పొలాలను పరిశీలించారు. పేద రైతులతో మాట్లాడారు. తాను నిరంతరం అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. నిమ్మచెట్ల తొలగింపుపై అధికారులకు సోమవారం హైకోర్టు అక్షింతలు వేయడంపై ఆయన స్పందించారు. కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి, అధికారులకు కూడా ఓ కనువిప్పులాంటిదన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లును నరికివేయడం ఏమిటని ప్రశ్నించారు. పేదలకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం ఏమిటన్నారు. ఇకనైనా అధికారులు నేతలు మాటలకు స్వస్తి పలికి పేదలకు సహాయం చేయాలని కోరారు. తాము ఎప్పుడు కోర్టులను గౌరవిస్తామన్నారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేద్దాం వెంకటగిరి(సైదాపురం): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 31వ తేదీన నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నెల్లూరు పర్యటన ఖరారైనట్లు తెలిపారు. తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్రెడ్డితో నెల్లూరు సెంట్రల్ జైలులో ములాఖత్ అయి, పరామర్శించనున్నారని చెప్పారు. అనంతరం రోడ్డు మార్గంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసం వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారని పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి, జగనన్న పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
పోలీసు కుటుంబానికి రూ.కోటి బీమా
తిరుపతి క్రైమ్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎస్ఐ కుటుంబానికి బీమా మొత్తం రూ.కోటి మొత్తానికి సంబంధించిన డీడీని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం బాధితులకు అందజేశారు. ఈ ఏడాది మార్చి 12వ తేదీన ఏఎస్ఐ గురుస్వామి వరమాలపేట వద్ద విధుల నిర్వహిస్తూ ఇంటి కెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే స్టేట్ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగి ఉండడంతో ప్రమాద బీమా రూ.కోటి మంజూరు అయ్యింది. ఆ మొత్తానికి సంబంధించిన డీడీని జిల్లా ఎస్పీ చేతుల మీదుగా మృతుడు భార్య చిట్టెమ్మకు అందజేశారు. 3న బాల్బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపికశ్రీకాళహస్తి: పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో ఆగస్టు 3వ తేదీ ఉదయం 8 గంటలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బాలాజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు జనవరి 2, 2010 తరువాత జన్మించి ఉండాలన్నారు. సెలక్షన్కు వచ్చే క్రీడాకారులు తమ వెంట ఆధార్కార్డు, బ్లడ్ గ్రూప్ తప్పని సరిగా తీసుకురావాలన్నారు. డ్రెస్కోడ్ పాటించాలని తెలిపారు. ఎంపికలో చిత్తూరు జిల్లా బాల్బ్మాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటస్వా మి, చైర్మన్ జగన్నాథంనాయుడు, అసోసియేషన్ సభ్యులు పాల్గొంటారని చెప్పారు. మరిన్ని వివరాలకు 7013754776, 9848295471 నంబర్లలో సంప్రదించాలన్నారు. భూసేకరణ వేగవంతం చేయండి తిరుపతి అర్బన్: చైన్నె– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో సోమ వారం ఆయన జేసీ శుభం బన్సల్తో కలసి భూసేకరణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ పనుల్లో పురోగతి చూపాలని ఆదేశించారు. ప్రధానంగా రోడ్ల పనులను పూర్తి చేసి, అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటికి పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్భరత్రెడ్డి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. మామిడి రైతుల ఏడాది శ్రమ అడవి కాచిన వెన్నెలగా మిగిలింది. కర్షకులు మామిడిని కంటికి రెప్పలా కాపాడి, దిగుబడి సాధించినా ఆశించిన ధరలు లేకపోగా.. జిల్లా ఉన్నతాధికారులు చెప్పిన మాటలు అమలుకు నోచుకోక.. ఫ్యాక్టరీ యాజమాన్యాల దోపిడీతో ఆశించిన ధరల్లేక విలవిల్లాడిపోయాడు. ఏ వస్తువుకై నా ధర నిర్ణయించే అధికారం ఉత్పత్తిదారుడికే ఉంది. అయితే ఆ పరిస్థితి రైతులకు లేదు. దీంతో పుడమిపుత్రులు దగా పడ్డారు. ఫలరాజైన మామిడికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు తక్కువ ధర నిర్ణయించి, రైతులను దోపిడీ చేశాయి. -
15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత..మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలనే అంశం గుర్తు కొచ్చింది. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామంటూ మంత్రులు పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటికే ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో 350 గ్రామాలకు పైగానే ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాలకే కాకుండా కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు తదితర ఆలయాలకు అవసరం మేరకు ఆర్టీసీ సర్వీసులు లేవు. దీంతో 50 వరకు అద్దె బస్సులను తీసుకుని పలు మార్గాల్లో నడుపుతున్నారు.ఉమ్మడి జిల్లాలో మాత్రమే..ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రమే ఆర్టీసీ కేటాయింపు చేసిన బస్సుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జిల్లా దాటితే టిక్కెట్ తీసుకోవాల్సి ఉంది. మరోవైపు తిరుమలకు అవకాశం కల్పించలేదు. రోజుకొసారి మాత్రమే ఓ మహిళ ప్రయాణం చేయడానికి వీలుంటుందని ఆర్టీసీ అధికాకారులు చెబుతున్నారు. ఈ నెల 29వ తేదీన ఎండీ నిర్వహిస్తున్న డీఎంల సదస్సులో పూర్తి వివరాలను వెల్లడిస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.ఆదాయం రాని మార్గాల్లో పల్లె వెలుగు కట్ఆదాయం రాని మార్గాల్లో పల్లెవెలుగు బస్సులను నిలుపుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పవని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే 350 మార్గాల్లో పల్లెవెలుగు బస్సులు నడవడం లేదు. ఉన్న పల్లెవెలుగు సర్వీసులను ఉచిత బస్సు స్కీమ్కు వినియోగిస్తే జిల్లాలోని ఏ గ్రామీణ ప్రాంతానికి పల్లెవెలుగు బస్సులు నడిచే పరిస్థితులు ఉండవని అంతా భావిస్తున్నారు.కొత్త బస్సుల ఊసేదీ?జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులు 300 మాత్రమే ఉన్నాయి. జిల్లాలో 12.50 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఉచితం అంటే 12.50 లక్షల మందికి మహిళలకు 300 బస్సుల్లో సర్దుబాటు చేయడం వీలుకాదని ఆర్టీసీ అధికారులే బాహటంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళుతున్న పల్లెవెలుగు సర్వీసులను ఉచిత బస్సుల కోసం ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే.. ఇక గ్రామీణ ప్రాంతాలకు ఒక్కటంటే ఒక్క ఆర్టీసీ సర్వీసులు ఉండదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో కొత్త బస్సుల ఊసేలేదు. పాడైన పది సర్వీసులను మాత్రమే కొత్త బస్సులుగా మార్పు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో డిపోకు 50 కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని పచ్చనేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆ ఊసేలేదు. మంగళం డిపో కేంద్రం 150 విద్యుత్ బస్సులను ఏర్పాటు చేస్తామంటూ కూటమి సర్కారు ఏడాదిగా చెబుతూనే ఉంది. అయితే ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి. తిరుపతి జిల్లాలో 11 డిపోలున్నాయి. రాష్ట్రంలోనే డిపోలు ఎక్కువగా ఉన్న జిల్లానే కాకుండా రాబడిలోనూ ముందు వరుసలో ఉన్న జిల్లాగా తిరుపతికి పేరుంది. అయితే కొత్త బస్సులను ఏర్పాటు చేయకుండా ఉన్న పల్లెవెలుగు బస్సులను ఉచిత బస్సు పథకానికి వాడేస్తే అంతా గందరగోళం తప్పదంటూ పలువురు చర్చించుకుంటున్నారు.నేటి ఎండీ సమావేశంలో స్పష్టమైన సమాచారంమహిళలకు ఉచిత బస్సు స్కీమ్పై మంగళవారం తిరుపతిలో జరగనున్న డీఎంల సమావేశంలో రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టమైన సమాచారాన్ని తెలియజేస్తారు. జోన్–4 పరిధిలోని 54 డిపోలకు చెందిన రాయలసీమ డీఎంలు ఈ సమావేశాన్ని హజరుకానున్నారు. ఆ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రధానంగా డీఎంలకు ఉచిత బస్సు స్కీమ్ నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. సమావేశం అనంతరం పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తాం.– జగదీష్, జిల్లా ప్రజా రవాణా అధికారి -
జిల్లా ఆర్టీసీ సమాచారం
డిపోలు సర్వీసులు తిరుపతి 102 తిరుమల 91 మంగళం 89 శ్రీకాళహస్తి 97 పుత్తూరు 79 సత్యవేడు 50 గూడూరు 54 సూళ్లూరుపేట 44 వెంకటగిరి 58 వాకాడు 43 మొత్తం డిపోలు 11 మొత్తం బస్సులు 707 విద్యుత్ బస్సులు 100 -
వైఎస్సార్సీపీ కార్యకర్త ఇల్లు కూల్చివేత
● దౌర్జన్యంగా ధ్వంసం చేయించిన కూటమి నేతలు చిట్టమూరు: మండలంలోని పెళ్లకూరు అరుంధతీయవాడలో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఇంటిని సోమవారం కూటమి నేతల ప్రోద్బలంతో దౌర్జన్యంగా కూల్చివేశారు. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పారిచర్ల రమణయ్య, నాగజ్యోతి దంపతులు 15 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో పూరి గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. గత ఎన్నికల్లో రమణయ్య వైఎస్సార్ సీపీ తరఫున గ్రామంలో పని చేశాడు. దీనిని జీర్ణించుకోలేక గ్రామంలోని కూటమి నేతలు రమణయ్యపై కక్ష గట్టారు. 20 సంవత్సరాల క్రితం గ్రామం నుంచి వెళ్లిన కస్తూరయ్య, ఏడు కొండలు అనే ఇద్దరు గూడూరు మండలం తిప్పగుంటపాళెంలో నివాసం ఉంటున్నారు. గ్రామంలోని కూటమి నేతలు గ్రామం నుంచి వెళ్లిన వారి వద్దకు వెళ్లి పెళ్లకూరులో మీ ఇంటి స్థలం ఉందని, దాన్ని మీకు ఇప్పిస్తామని, వారిని గ్రామానికి తీసుకువచ్చారు. వారం క్రితం కస్తూరయ్య, ఏడుకొండలు వచ్చి ఇది తమ స్థలమని ఖాళీ చేయాలని రమణయ్యను హెచ్చరించి వెళ్లారు. దీంతో రమణయ్య ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇంటి నివేశ స్థలం సర్టిఫికెట్, ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్లు తమ పేరుతో ఉన్నాయని, వేరే వారు వచ్చి తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని చిట్టమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సోమవారం కస్తూరయ్య, ఏడుకొండలు మరో నలుగురితో కలిసి పెళ్లకూరు గ్రామానికి చేరుకున్నారు. రమణయ్య నివాసం ఉంటున్న పూరింటిని ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న వస్తులను కూడా రోడ్డు పడేశారు. అడ్డుపడిన రమణయ్య భార్య నాగజ్యోతిని కూడా పక్కకు నెట్టేసి ఇంటిని నామరూపాలు లేకుండా చేసి వెళ్లిపోయారు. ఆ సమయంలో కూలి పనులకు వెళ్లిన బాధితుడు రమణయ్య ఇంటికి చేరుకుని తనకు జరిగిన అన్యాయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలాగే తన దగ్గర ఉన్న ఇంటి స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్లతో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశాడు. అయితే తను కూలి పనులు చేసుకుని దాచుకున్న నగదు, తన భార్య, కుమార్తెకు సంబంధించి బంగారు నగలు కూడా కనిపించడం లేదని పోలీసులకు తెలిపామన్నాడు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. రమణయ్య, భార్య, పిల్లలు ఇంట్లో సామాను రోడ్డుపై పారేయడంతో ఏమి చేయాలో పాలుపోక కుటుంబ సభ్యులు రోడ్డుపైనే బాధ పడుతూ గడుపుతున్నారు. రమణయ్య ఇంటిని పీకేస్తున్న దృశ్యం -
వరలక్ష్మీవ్రతానికి విస్తృత ఏర్పాట్లు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం నిర్వహణ కు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. ఆయన సోమవారం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీవ్రతం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 8వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో రూ.వెయ్యి చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతారని వెల్లడించారు. వ్రతం సందర్భంగా అభిషేకం, అభి షేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెరుగైన ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం వరలక్ష్మీవ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబు స్వామి, మణికంఠ స్వామి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, అన్నదానం డిప్యూటీ ఈఓ సెల్వం, వీజీవో సురేంద్ర పాల్గొన్నారు. -
భావి ఇంజినీర్లుగా ఎదగాలి
ఏర్పేడు : తిరుపతి ఐఐటీలో నూతనంగా బీటెక్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు బాగా చదువుకుని భావి ఇంజనీర్లుగా ఎదగాలని ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆకాంక్షించారు. సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో యువంతర్– 2025 ఓరియంటేషన్ నిర్వహించారు. డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది మొత్తం 254 మంది విద్యార్థులు బీటెక్ ప్రవేశం పొందినట్లు వెల్లడించారు. విద్యా వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ రామకష్ణ గోర్తి , విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ ఎన్ ఎన్ మూర్తి ప్రసంగించారు. -
పోలీసు గ్రీవెన్స్కు 100 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 100 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. రైల్లో నుంచి పడి వ్యక్తి మృతి దొరవారిసత్రం : స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం కోరమాండల్ ఎక్స్ప్రెస్ నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే గ్యాంగ్ సిబ్బంది గుర్తించి సూళ్లూరుపేట జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉచిత శిక్షణ తిరుపతి అర్బన్: ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీ భాష నేర్చుకోవడం కోసం ఆఫ్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే అన్ని కులాలకు చెందిన వారికి అన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి, రెండేళ్లుపాటు క్లినికల్ అనుభవం ఉండాలని చెప్పారు. జీఎన్ఎం నర్సింగ్ పూర్తి చేసి 3 ఏళ్లు క్లినికల్ అనుభవం ఉండాలని తెలిపారు. 35 ఏళ్లు మించకూడదని స్పష్టం చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జర్మనీభాషపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 8 నుంచి 10 నెలలు శిక్షణ తర్వాత బీ2 స్థాయి పరీక్ష ఉత్తీర్ణత సాధించాలని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు ఏపీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, అంతేకాకుండా ఆధార్కార్డు, కులధ్రువీకరణ పత్రం, నర్సింగ్ డిగ్రీ సర్టిఫికెట్ కాపీ, క్లినికల్ అనుభవం పత్రం ఉండాలని స్పష్టం చేశారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహంలో శిక్షణ ఉంటుందని చెప్పారు. డీఎస్సీడబ్ల్యూ ఈఓటీపీటీ జీమెయిల్.కామ్ ద్వారా దరఖాస్తులను పంపాలని చెప్పారు. అదనపు సమాచారం కోసం 916091 2690 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
అమానుష ఘటనపై ఆగ్రహం
కోట : స్థానిక జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినులతో గుంజిళ్లు తీయించిన అమానుష ఘటనపై ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పాఠశాలకు సందర్శనకు విచ్చేశారు. విద్యార్థినులతో మాట్లాడేందుకు యత్నించగా పోలీసులు పాఠశాలలోకి అనుమతించలేదు. దీంతో ఉపాధ్యాయులను బడి బయటకు పిలిపించి ఘటనపై ఆరా తీశారు. హెచ్ఎం భారతి మాట్లాడుతూ ఎస్సీ హాస్టల్ విద్యార్థినులతో గుంజిళ్లు తీయించిన పీడీ సుభాన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బాలికలు గుంజిళ్లు తీస్తుంటే ఉపాధ్యాయులు ఎందుకు అడ్డుకోలేదని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. పీడీ వ్యవహారంపై కమిటీ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నేరం రుజువైతే నిందితుడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చే యాలని కోరారు. పిల్లలతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. ఎస్ఐ పవన్కుమార్ మాట్లాడుతూ పీడీపై ఇప్పటికే కేసు నమోదు చేసినటు వెల్లడించారు. అనంతరం ఎస్సీ బాలికల హాస్టల్ను ఎమ్మెల్సీ మేరిగ సందర్శించారు.వార్డెన్ ఉషారాణితో మాట్లాడారు. పిల్లలకు తగిన భద్రత కల్పించాలన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు అశ్విత్రెడ్డి, మండల కన్వీనర్ పలగాటి సంపత్కుమార్రెడ్డి, మధుసూదన్రెడ్డి, షనీల్రెడ్డి, ప్రసాద్గౌడ్, సుధారెడ్డి, పి.సురేంద్ర, శశిరెడ్డి, సాయిరెడ్డి, కోటారెడ్డి, నాగూర్యాదవ్ పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి
● గ్రీవెన్స్కు 260 అర్జీలు ● రెవెన్యూ సమస్యలపై 125 అర్జీలు తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు 260 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపై 125 అర్జీలను వచ్చాయి. కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోస్మాండ్, దేవేంద్రరెడ్డి, శివశంకర్నాయక్, సుధారాణి, పలువురు జిల్లా అధికారులు గ్రీవెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని ఆదేశించారు. గ్రీవెన్స్కు ప్రతి విభాగానికి చెందిన జిల్లా అధికారి హాజరుకావాలని ఆదేశించారు. హజరైన అధికారి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉండాలని చెప్పారు. మరోవైపు గ్రీవెన్స్కు వచ్చిన అర్జీదారులకు అవసరం అయిన మేరకు కుర్చీలను ఏర్పాటు చేయాలని, టీ, కాఫీ అందించాలని, తాగునీటి వసతులు కల్పించాలని వైద్యా ఆరోగ్యశాఖ వారు వైద్యశిబిరాన్ని నిర్వహించాలని ఆదేశించారు. మాకు న్యాయం చేయండి ! నా పేరు మంకు మునెమ్మ, మాది శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి గ్రామం. మా గ్రామంలోనే సర్వే నంబర్ 283లో 1.93 ఎకరాల భూమి దశాబ్దాలుగా నా ఆధీనంలో ఉంది. 1994లో కరెంట్ సర్వీస్ తీసుకున్నాను. ప్రభుత్వం ఉచితంగా బోరు కూడా వేసింది. అయితే మా గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు అదే ప్రాంతంలో 20 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. దాంతోపాటు 1.93 ఎకరాల నా భూమిని ఆక్రమించుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మా మండల రెవెన్యూ అధికారులకు తెలియజేసినప్పటికి వారు అధికారపా ర్టీకి చెందిన నేతకే మద్దతు తెలుపుతున్నారు. మా భూమి ఆక్రమణకు గురి కాకుండా కాపాడి, మా న్యాయం చేయండి. – మంకు మునెమ్మ, రాచగున్నేరి, శ్రీకాళహస్తి మండలం రెవెన్యూ అధికారులు అమ్ముడుపోయారు! నా పేరు విజయమ్మ, మాది వాక్యం గ్రామం, బాలాయపల్లి మండలం. 8.80 ఎకరాల మా భూమిని అధికారపార్టీకి చెందిన నేతలు ఆక్రమించారు. ఈ విషయంపై మా మండల రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకుంటే వారు పట్టించుకోవడం లేదు. మరోవైపు నేతలకు మా మండలంలోని పలువురు రెవెన్యూ అధికారులు అమ్ముడుపోయారు. గట్టిగా ప్రశ్నిస్తే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. మాకు న్యాయం చేయండి సారూ అంటూ పలువురు మహిళలు సోమవారం గ్రీవెన్స్లో ఆవేదన చెందారు. – విజయమ్మ, ఆమె కుటుంబ సభ్యులు -
స్కిట్ కళాశాలలో అడ్మిషన్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధంగా ఉన్న స్కిట్ కళాశాలను మూడు సంవత్సరాల కిందట ఆలయ ఆర్థిక భారంతో మూత వేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్కిట్ కళాశాల జేఎన్టీయూ, స్కిట్ అనుసంధానంతో సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ఇంజినీరింగ్కు సంబంధించిన విద్యార్థుల ప్రవేశానికి ఆన్లైన్లో అనుమతించారు. ఇందులో మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సీఎస్సీ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ అండ్ మెషన్ లెర్నింగ్, సీఎస్టీ(డేటా సైన్స్), ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ సంబంధించి 66 సీట్లు చొప్పున మొత్తం 330 సీట్లు అలాట్ చేసినట్లు ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒకో పోస్టుకు రూ.70 వేలుగా ఫీజు నిర్ణయించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, మంత్రి నారా లోకేష్ సహకారంతో కళాశాల ప్రారంభం చేసినట్లు ప్రకటించారు. దీనిపై స్కిట్ కళాశాల వద్ద మంగళవారం సంబరాలు చేసుకోనున్నట్లు తెలిసింది. అయితే కోర్టు కేసులు, నాన్టీచింగ్, టీచింగ్కు సంబంధించి 90 మంది గతంలో పనిచేవారుండగా వారిలో కొంతమంది కోర్టు స్టే తెచ్చుకోనున్నారు. అలాగే నాన్ టీచింగ్ కింద 36 మంది, 24 మంది కాంట్రాక్టు పద్ధితిలో పనిచేశారు. వారి పరిస్థితి ఏమిటన్నది వెల్లడి కావాల్సి ఉంది. జేఎన్టీయూ ఏ ప్రాతిపదికన స్కిట్ కళాశాలతో అనుసంధానం అయిందో అనే విషయంపై త్వరలోనే వెల్లడి కావల్సి ఉంది. గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చంద్రగిరి:గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శ్రీనివాసమంగాపురం రైల్వేగేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అనిత తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని, 20 అడుగుల ఎత్తులో చెట్టుపైన వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు ఉరివేసుకుని సుమారు 10 రోజులకుపైగా కావడంతో గుర్తు పట్టలేనంతగా ఉందని తెలిపారు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. మృతుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేక హత్యచేసి చెట్టుకు వేలాదీశారా..? అన్న కోణంలో విచారిస్తున్నట్లు ఎస్ఐ అని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో భక్తుడి మృతి నారాయణవనం: మండలంలోని జాతీయ రహదారిలో సొమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమలకు కాలినడకన వెళుతున్న గోవిందమాల భక్తుడు బాలసుబ్రమణ్యన్(51)మృతి చెందా డు. తోటి భక్తుల కథనం మేరకు.. చైన్నె సమీపంలోని అంబత్తూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో బాలసుబ్రమణ్యన్ సేల్స్మన్గా పనిచేస్తున్నాడు. స్నేహితుల తో కలిసి ఈనెల 26వ తేదీన శనివారం గోవిందమాల ధరించి కాలినడకన తిరుమలకు బయలుదేరాడు. సోమవారం సాయంత్రం మండలంలోని జాతీయ రహదారి బైపాస్లోని మండల కాంప్లెక్స్ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో పుత్తూరు వైపు వస్తున్న వాహనం వేగంగా బాలసుబ్రమణ్యన్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలసుబ్రమణ్యన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ లోకనాథం తెలిపారు. -
పారదర్శకంగా ఉపాధి పనుల తనిఖీ
చంద్రగిరి: ఉపాధి హామీ పథకంలో జరిగిన ప నుల తనిఖీలను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్ఆర్ఈజీఎస్ పీడీ రెడ్డెప్ప సూచించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనుల సోషల్ ఆడిట్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఏప్రిల్1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు రూ.21.64 కోట్ల మేరకు ఉపాధి పనుల ద్వారా పనులు జరిగినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారం నుంచి మండలవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో జరిగిన పనులపై సిబ్బంది గ్రామస్తులు, ఉపాధి కూలీల సమక్షంలో తనిఖీలను చేపట్టడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సిబ్బంది పారదర్శకంగా తనిఖీ చేపట్టాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పథకం కింద పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్, నీటి సరఫరా, హౌసింగ్, అటవీశాఖ, పశు సంవర్థక శాఖ, సర్వశిక్షా అభియాన్, సామాజిక పెన్షన్లపై తనిఖీలను చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం తనిఖీల్లో రాజీ పడకుండా చేయాలని, అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి నివేదిక సమర్పించాలన్నారు. అనంతరం రామిరెడ్డిపల్లి, అగరాలలో జరిగిన అవకతవకలపై సర్పంచ్లు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, అగరాల భాస్కర్ రెడ్డి అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం, ఎస్ఆర్పీ వెంకయ్య, ఏపీఓ భార్గవి, పీఆర్ ఏఈ రాజాజీ తదితరులు పాల్గొన్నారు. బావిలో మృతదేహం నాగలాపురం: మండలంలోని కృష్ణాపురంలో రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. పోలీసులు కథనం మేరకు.. కృష్ణాపురం గ్రామానికి చెందిన తిప్పారెడ్డి, వెంకటేశ్వరరావు పొలంలో బావి ఉంది. ఆ బావిలో మృతదేహం ఉండగా గ్రామస్తులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చే రుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఆ మృతదే హం సుమారు 40–45 ఏళ్లు ఉంటుంది. మృతు డు నీటిలో పడి సుమారు నాలుగు రోజులు అయి ఉండచ్చని, అలాగే మృతుడు తెలుపు రంగు చొ క్కా ధరించి ఉన్నాడని, చొక్కా మీద జీవీ సెన్ అ నే స్టిక్కర్ ఉందని ఎస్ఐ తెలిపారు. కాగా ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహం తన కుమారుడు గజేంద్రుడిదిగా గుర్తించారు. మృతుడికి మద్యం అలవాటు ఉన్న కారణంగా మద్యం మత్తులో బావిలో పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
విద్యావ్యవస్థ నిర్వీర్యం
చంద్రగిరి: కూటమి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఓబుల్ రెడ్డి ఆరోపించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టళ్ల పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం చంద్రగిరి మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో చంద్రగిరిలోని ప్రభుత్వ హాస్టళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేవని, నాణ్యతలేని భోజనం, బోరు నీళ్లను అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కిటికీలకు మెస్లు లేకపోవడంతో విద్యార్థులు దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యావ్యవస్థపై దృష్టి సారించాలి విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యావ్యవస్థలో మెరుగైన సౌకర్యాలు కల్పించామని చెప్పుకునే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను తెలుసుకోవాలని ఓబుల్ రెడ్డి సూచించారు. సీఎం చంద్రబాబు సొంత మండలంలో ప్రభుత్వ హాస్టళ్లు దుస్థితికి చేరుకున్నట్లు గుర్తించామన్నారు. విద్యార్థులు తాగేందుకు కనీసం మినరల్ వాటర్ను సైతం అందించలేదంటే ఈ ప్రభుత్వం విద్యార్థులపై ఎంత శ్రద్ధ వహిస్తోందో ఆర్థం చేసుకోవచ్చన్నారు. హాస్టళ్ల దుస్థితిపై విద్యార్థుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించి, హాస్టళ్ల దుస్థితిపై నివేదిక సిద్ధం చేస్తామన్నారు. ఆపై దుస్థితికి చేరిన హాస్టళ్లలో నాణ్యమైన సౌకర్యాలు అందించాలని ఆగస్టు ఒకటో తేదీన జిల్లా కలెక్టర్కు నివేదికతో పాటు అర్జీ సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్రెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు, హరి, యశ్వంత్ రెడ్డి, రఫి, జిల్లా కార్యదర్శి ప్రదీప్, కార్యవర్గ సభ్యులు పార్థసారథి, శేషారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓబుల్ రెడ్డి -
అట్టహాసంగా గోదాంకితావధానం
● పృచ్ఛకుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అవధాని మేడసాని మోహన్ తిరుపతి రూరల్: పద్మా వతి మహిళా వర్సిటీలోని సావేరి సెమినార్ హాలులో సోమవారం గోదాదేవి అవతారోత్సవం సందర్భంగా తెలుగు అధ్యాయన శాఖ, తిరుపతి శ్రీకృష్ణ దేవరాయ సత్సంగ్ సంయుక్తంగా గోదాంకితావధానాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో అవధానిగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కలియుగంలో శ్రీమన్నారాయణుని ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని భక్త లోకానికి తెలిపేందుకు గోదాదేవి అవతరించిందని తెలిపారు. అనంతరం పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలను సమన్వయం చేసుకుంటూ అవధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. వీసీ ఆచార్య ఉమ మాట్లాడుతూ భగవంతుడిని కీర్తిస్తూ గోదాదేవి గానం చేసిన పాశురాలు తిరుప్పావై పాశురాలుగా ప్రసిద్ధి పొందాయని తెలిపారు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి ఆలయం ఉందని, ఆమె ధరించిన మాలను శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజున మలయప్ప స్వామికి ధరింప చేస్తారని పేర్కొన్నారు. తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ గోదాదేవి భక్తిని కొనియాడుతూ కావ్యంగా మలిచిన శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసనీయులన్నారు. ఆచార్య నిర్మలా తమ్మారెడ్డి మాట్లాడుతూ మేడసాని మోహన్తో తనకున్న గురు శిష్యుల బంధాన్ని తెలియజేశారు. స్వర్ణభారత్ ట్రస్ట్ అధినేత్రి ఇమ్మని దీపావెంకట్ మాట్లాడుతూ తన తండ్రి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తెలుగు భాషపై ఎనలేని మక్కువ ఉందన్నారు. పృచ్ఛక వి దుషీమణులుగా నిషిద్ధాక్షరి – ఆచార్య సి.లలితారాణి, న్యస్తాక్షరి – డాక్టర్ యువశ్రీ, దత్తపతి – డాక్టర్ వై సుభాషిణి, సమస్య – డాక్టర్ సి.లత, వర్ణన – డాక్టర్ సి.స్వరాజ్యలక్ష్మి, అప్రస్తుత ప్రసంగం – డాక్టర్ జయమ్మ, పురాణ పఠనం – డాక్టర్ జి సుహాసిని, ఆశువు–డాక్టర్ బి.కృష్ణవేణి వ్యవహరించారు. -
ఇస్రో–నాసా ప్రయోగానికి నేడు కౌంట్డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్టేషన్ (నాసా) తొలిసారి సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్–16) రాకెట్ ద్వారా 2,392 కేజీల బరువైన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం రాత్రి మిషన్ రెడీ రివ్యూ (ఎంఆర్ఆర్) నిర్వహించారు. రాకెట్లోని అన్ని వ్యవస్థలకు తుది తనిఖీలు నిర్వహించి రాకెట్ సంసిద్ధం చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ ఆధ్వర్యంలో రాకెట్కు లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. 27.30 గంటల కౌంట్డౌన్ అనంతరం బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధం చేశారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,486 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.85 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఈనెల 30న జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ నుంచి ప్రయోగం
సూళ్లూరుపేట : తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ ఎ్ఫ్16 రాకెట్ ద్వారా 2,392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగ సమయానికి 25 గంటల ముందు కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహాన్ని 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.మూడు దశల్లో జీఎస్ఎల్వీ ఎఫ్16 ప్రయోగంపీఎస్ఎల్వీ రాకెట్ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జీఎస్ఎల్వీ రాకెట్ను మూడు దశల్లోనే ప్రయోగిస్తారు. 51.7 మీటర్లు పొడవు ఉన్న జీఎస్ఎల్వీ ఎఫ్ 16 రాకెట్ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి బయలు దేరుతుంది. ఈ ప్రయోగంలో 2,392 కిలోలు బరువు గల నిసార్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం పూర్తి చేసి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు రాకెట్ను వ్యాబ్ నుంచి ప్రయోగ వేదిక మీదకు నెమ్మదిగా తరలించే ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ను దశల వారీగా అనుసంధానించే దృశ్య మాలిక ఇది. జీఎస్ఎల్వీ మార్క్2 సిరీస్లో 18వ ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రం నుంచి 102వ ప్రయోగం కావడం విశేషం.మూడో దశ ఇలామూడో దశను మహేంద్రగిరిలోని ఇస్రో ప్రపోల్షన్ సెంటర్లో రూపొందించి, అందులో 14.5 టన్నుల క్రయోజనిక్ ఇంధ నాన్ని నింపి మూడోదశను పూర్తి చేస్తారు. ఈ దశకు పైభాగంలోనే ఉపగ్రహాన్ని అమర్చుతారు.రెండో దశ ప్రక్రియరెండో దశలో 42.1 ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఈ దశలో ఇంధనాన్ని కౌంట్డౌన్ సమయంలోనే నింపే ప్రక్రియను చేపడతారు.మొదటి దశ ఇలాకోర్ అలోన్ దశలో 138.1 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. రాకెట్కు చుట్టూ నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లుకు కలిపి 170.7 టన్నుల ద్రవ ఇంధనంతో మొదటి దశను పూర్తి చేస్తారు. -
పీడీపై కఠిన చర్యలు తీసుకోవాలి
● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ కోట : కోట జిల్లా పరిషత్ హైస్కూల్లో బాలికలపై జరిగిన దాడి ఘటన సమాజం సిగ్గుపడేలా చేసిందని, ఈ దారుణానికి బాధ్యుడైన వ్యాయామ ఉపాధ్యాయుడు సుభాన్ను విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్విత్రెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం ఎస్సీ బాలికల వసతి గృహానికి విచ్చేసి జరిగిన సంఘటనపై బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యూనిఫామ్ వేసుకురాలేదనే కారణంతో ఒక్కొక్కరి చేత 120 గుంజిళ్లు తీయించాడని, గుంజిళ్లు తీయని వారిని బెత్తంతో కొట్టారని, బాలికలు తమ సామాజిక సమస్యలు ఉన్నాయని ప్రాధేయపడ్డా కనికరించలేదని వాపోయారు. గుండెల్లో నొప్పిగా ఉందని ఒక బాలిక కాళ్లు పట్టుకున్నా వినలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అశ్విత్రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ బాలికలపై జరిగిన దాడి హేయమైన చర్య అన్నారు. జిల్లా కలెక్టర్ విచారణ జరిపి పీఈటీతో పాటు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గారా వంశీ, మధు, సన్నీ, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎంబేటి గిరి, మండల ప్రధాన కార్యదర్శి పాముల సురేంధ్ర, పెంచలయ్య, రాజేష్ పాల్గొన్నారు. పీడీపై కేసు నమోదు కోట బాలికల జెడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు సుభాన్ అలియాస్ మాబాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పవన్కుమార్ ఆదివారం తెలిపారు. ఎస్సీ బాలికల వసతిగృహం విద్యార్థినులకు యూనిఫామ్లో హాజరు కాని కారణంగా గుంజిళ్లు తీయించి అస్వస్థతకు కారణమయ్యారు. బాధిత కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
నిమ్మ..కన్నీటి చెమ్మ!
● ఆక్రమణల పేరుతో నిమ్మ చెట్ల తొలగింపు ● లబోదిబోమంటున్న గిరిజనులు ● అధికారుల తీరుపై దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు సైదాపురం మండలం, గద్దలతిప్ప వద్ద సర్వే నం.793లో నలుగురు పేదలు సాగు చేసుకుంటున్న సుమారు 500 నిమ్మ చెట్లను అధికారులు తొలగించేశారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు సంఘాల నాయకులు అధికారుల తీరును ఎండగడుతున్నారు. 30 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నా పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు కూటమి నేతలకు కట్టబెట్టేలా చర్యలు చేపడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆక్రమణ పేరుతో నిమ్మ చెట్లు తొలగించేశారని మండిపడుతున్నారు. ఈ దౌర్జన్యం ఇంకా ఎంతకాలం..? అంటూ నిలదీస్తున్నారు. – సైదాపురం -
ఫుట్బాల్ విజేతగా అనంతపురం జట్టు
నాయుడుపేటటౌన్ : అంతర్ జిల్లా స్థాయిలో నాయుడుపేట పట్టణంలోని ఏఎల్సీఎం గ్రౌండ్లో అండర్–15 జానియర్ బాలికల విభాగంలో ఆదివారం జరిగిన ఫుట్బాల్ ఫైనల్స్ పోటీలో అనంతపురం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. నాయుడుపేట పుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా ఫుట్బాల్ కమిటీ ఆధ్వర్యంలో అండర్–15 బాలికల విభాగంలో అంతర్ జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి 9 జోన్ల పరిధిలోని 15కు పైగా జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు పోటీలు జరగగా ఫైనల్ పోటీలో అనంతపురం, వైఎస్సార్ కడప జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. విన్నర్స్గా అనంతపురం, రన్నర్స్గా వైఎస్సార్ కడప జిల్లా జట్లు నిలిచినట్లు తెలిపారు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది. ట్రోఫీల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథాగా నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బాలికలు విద్యతో పాటు క్రీడల్లో మేటిగా రాణిం చాలని సూచించారు. పుట్బాల్ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న జాతీయస్థాయి క్రీడాకారులు, కోచ్ గౌస్బాషతో పాటు నాయుడుపేట ఫుట్బాల్ క్లబ్ సభ్యులు ఎంతో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విజేతలుగా నిలిచిన విన్నర్స్, రన్నర్స్తో పాటు మూడో స్థానంలో నిలిచిన జట్లుకు ట్రోఫీలను అందించారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పుట్బాల్ పోటీలకు జిల్లా జట్టును సైతం ఎంపిక చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఫుట్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రెడ్డిప్ప, చర్చి పీసీసీ చైర్మన్ కారల్ మధు, బీజే ప్రసాద్, కళాచంద్, ఆనంద్, ఎన్ఎఫ్సీకు చెందిన కాళహస్తి భావిన్ అనుదీప్, టైసన్, రాఖీ, ఏలిష, సిరాజ్, భాను విజయ్ పాల్గొన్నారు. -
రైలులో నుంచి జారిపడి కానిస్టేబుల్ మృతి
వెంకటగిరి రూరల్ : రైలులో నుంచి జారి పడి కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన వెంకటగిరి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు డక్కిలి మండలం సంగనపల్లి గ్రామానికి చెందిన సద్దికూటి అశోక్ (33) వెంకటగిరి పట్టణంలోని పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. వెంకటగిరిలో విధులకు హాజరయ్యేందుకు గూడూరు– వెంకటగిరి మార్గంలోని రైల్లో వస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రైల్వేపోలీసులు తెలియజేశారు. అశోక్ మృతదేహానికి డీఎస్పీ నివాళి వెంకటగిరి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అశోక్ అంత్యక్రియల్లో గూడూరు డీఎస్పీ గీతా కుమారి, సీఐ ఏవీ రమణ, ఎస్సైలు, పోలీసులు పాల్గొని అశోక్ మృతదేహానికి నివాళి అర్పించారు. -
తిరుమలలో మాజీ ఉపరాష్ట్రపతి
తిరుమల : భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడుతో కలిసి ఆదివారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో ముచ్చటించారు. అన్నప్రసాదాలు రుచికరంగా, శుభ్రంగా ఉన్నాయని భక్తులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదం ఎంతో శుచిగా, రుచిగా ఉందని తెలిపారు. శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సహ భక్తులకు సేవలందించడం ఆనందదాయకమైన విషయమని తెలియజేశారు. దీనికి ముందు తిరుమల చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బాలింత మృతి చిల్లకూరు : మండలంలోని తిమ్మనగారిపాళెంలోని గిరిజన కాలనీకి చెందిన కుడుముల మీనా (25) పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు మీనా మూడోసారి గర్భిణిగా ఉండగా నెలలు నిండడంతో గూడూరులోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యులు ఆమెకు సీజేరియన్ చేసి పండంటి మగ్గబిడ్డను బయటకు తీశారు. అయితే ఆ సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను వైద్యులు, సిబ్బంది, 108 వాహనంలో నెల్లూరులోని సర్వజన ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి, ఆదివారం వేకువజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అటు తరువాత ఆమె మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు చిన్న బిడ్డలను పెట్టుకుని ఎలా జీవించాలని ఆమె భర్త కుడుముల అంకయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. బాలింత మృతి చెందడంపై చిల్లకూరు వైద్యుడు అరాఫత్ను వివరణ కోరగా మీనా మరణంపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తరువాతే విషయం తెలుస్తుందన్నారు. గాయపడిన కార్మికుడి మృతి రేణిగుంట: మండలంలోని గాజులమండ్యం పారిశ్రామిక వాడలోని క్రోమో మెడికేర్ కంపెనీలో ఈనెల 14వ తేదీ రియాక్టర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు కార్మికులకు చైన్నె ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం అందిస్తుండగా చిట్టమూరు మండలానికి చెందిన వెంకటేష్ శనివారం రాత్రి మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించి ఆదివారం బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్లు గాజుల మండ్యం పోలీసులు తెలిపారు. మరో కార్మికుడు రవీంద్ర పరిస్థితి విషమంగా ఉందనే సమాచారం. -
నూతన ఎస్ఐలకు దిశా నిర్దేశం
తిరుపతి క్రైమ్: విధి నిర్వహణలో నిజాయితీగా వుండాలని, బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వం వహించరాదని ఎస్పీ హర్షన్వర్ధన్రాజు ప్రొబేషనర్ ఎస్ఐలకు సూచించారు. పోలీసు గెస్ట్ హౌస్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తిరుపతి జిల్లాకు 36 మంది ప్రొబేషనరీ ఎస్ఐలను కేటాయించిందని తెలిపారు. వారిలో కర్నూలు రేంజ్ నుంచి 32 మంది, గుంటూరు నుంచి నలుగురు ఉన్నాయని పేర్కొన్నారు. వారిలో 21 మంది ఎస్ఐలు, 15 మంది ఉమెన్ ఎస్ఐలు ఉన్నారని వివరించారు. విధి నిర్వహణలో సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్లాలని, ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ప్రతిభ చాటాలని తెలిపారు. పోలీసు శాఖలో హోంగార్డు నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు అందరూ ఒకటేనని, ప్రతి ఒక్కరినీ గౌరవించాలన్నారు. ఉన్నతాధికారులతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ, కింద స్థాయి సిబ్బందిని కలుపుకుంటూ పనిచేయాలన్నారు. ముగిసిన క్యాన్సర్ గ్రిడ్ వార్షిక సమావేశం తిరుపతి తుడా: స్థానిక జూపార్క్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్న్స్టిట్యూట్(స్వీకార్)లో రెండు రోజుల పాటు కొనసాగిన జాతీయ క్యాన్సర్ గ్రిడ్ ఏపీ స్టేట్ చాప్టర్ 3వ వార్షిక సమావేశం ఆదివారం ముగిసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన వార్షిక సమావేశానికి ఆన్లైన్ ద్వారా ఏపీ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, రాష్ట వ్యాప్తంగా కాన్సర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు. క్యాన్సర్ గుర్తింపు, నివారణ, నాణ్యమైన చికిత్స, పరిశోధనలను ప్రోత్సహించడం, వైద్యులకు అధునాతన చికిత్సలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాటా మెమోరియల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్, డాక్టర్ కై లాష్ శర్మ, డాక్టర్ ఉమేష్ మహంత్శెట్టి, దినేశ్ కుమార్లు, వైద్యనిపుణలు, డాక్టర్లు పాల్గొన్నారు. బాలసదనంలో ఉద్యోగాలకు దరఖాస్తులు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని బాలసదనంలో అవుట్సోర్సింగ్, పార్ట్టైం ప్రతిపాదికన ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు బాలసదనం సూపరింటెండెంట్ తెలిపారు. కుక్–2 పోస్టులు, హెల్పర్, హెల్పర్ కం నైట్వాచ్మెన్–2, హౌస్ కీపర్–1 ఆర్ట్ అండ్ క్రాప్ట్కు మ్యూజిక్ టీచర్–1, పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన వారు సంబందిత వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను పొందాలన్నారు. మరిన్ని వివరాలకు 9000106774 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. శ్రీవారిసేవలో సీఎస్ తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదివారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ను ఈవో జె.శ్యామలరావు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి, చైర్మన్ బీ.ఆర్.నాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల టీటీడీలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన సీఎస్కు వివరించారు. భక్తులకు టీటీడీ మరింత మెరుగైన సేవలు అందిస్తోందని సీఎస్కు వివరించారు. -
అయ్యా.. బాబూ!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బదిలీల సమాచారం ● ఉమ్మడి చిత్తూరులో అయ్యోర్లకు జీతాల సమస్య ● పొజిషన్ ఐడీ లేక అయోమయం ● రెండు నెలలుగా అవస్థలు యాజమాన్యం ఖాళీలు ప్రభుత్వ 125 ఎంపీపీ/ జెడ్పీ 1,583 మున్సిపల్ కార్పొరేషన్ 135 మున్సిపల్ 75 5/8 ఏళ్లు ఒకే చోట పనిచేసిన టీచర్లు 3,000 మిగిలు పోస్టులు 500 రీ అపోర్షన్/షిప్టెడ్ 1,582 మొత్తం 7,000చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 4,737 ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, నగరపాలక, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 18,540 మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో నిర్వహించిన బదిలీల కసరత్తులో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7 వేల మంది టీచర్లను బదిలీ చేశారు. అదేవిధంగా హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు 800 వరకు ఉన్నారు. బదిలీలు, ఉద్యోగోన్నతులు పొందిన పలు కేడర్ల టీచర్లు రెండు నెలలుగా జీతాలు లేక అవస్థలు ఎదుర్కుంటున్నారు. జీతాల కోసం నిత్యం డీఈవో కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తమ చేతుల్లో ఏమీ లేదని విద్యాశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పొజిషన్ ఐడీ పేరుతో కక్ష పొజిషన్ ఐడీ పేరుతో టీచర్ల పట్ల కూటమి ప్రభుత్వం జీతాలు మంజూరు చేయకుండా కక్ష సాధింపులకు దిగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెరపైకి పొజిషన్ ఐడీ పేరును తీసుకొచ్చింది. ఏదో ఒక విధంగా టీచర్లను ఇబ్బందులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. కేబినెట్ ఆమోదం అవసరమట పొజిషన్ ఐడీలకు కేబినెట్ ఆమోదం అవసరమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఉపాధ్యాయ సంఘ నేతలు మండిపడుతున్నారు. కేబినెట్ ఆమోదం పేరుతో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టించడం సబబు కాదని హెచ్చరిస్తున్నారు. అసలు పొజిషన్ ఐడీల ఫైల్ కేబినెట్లో ఆమోదం పొందిందో...లేదో అనే విషయం తెలియడం లేదని, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 వేల మంది టీచర్లు జీతాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వాపోతున్నారు. పెండింగ్ జీతాల బిల్లులు పెట్టుకునేందుకు ఈ నెల 27 వరకు రాష్ట్ర ట్రెజరీ అధికారులు అవకాశం కల్పించారని, అయితే పొజిషన్ ఐడీలు లేకపోవడంతో టీచర్లు బిల్లులు నమోదు చేయలేక మిన్నకుంటున్నట్టు తెలిపారు. అయ్యోర్ల నిరసన జీతాల కోసం ఉపాధ్యాయులు శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనకు దిగారు. వేతనాల సమస్యను వెంటనే పరిష్కరించాలని రోడ్డెక్కారు. బదిలీలు చేపట్టి రెండు నెలలు కావొస్తున్నా పొజిషన్ ఐడీలు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. తాజాగా కేబినెట్ భేటీ నిర్వహించినప్పటికీ అందులో పొజిషన్ ఐడీల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయం పొజిషన్ ఐడీలు ఇవ్వకుండా ఆలస్యం చేయడం అన్యాయం. నెలల తరబడి ఐడీల పేరుతో జీతాలు ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదు. ఈ సమస్య రాష్ట్ర మొత్తం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది టీచర్లు పొజిషన్ ఐడీ సమస్యతో రెండు నెలల జీతాలు పొందలేకపోయారు. పలు మార్లు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా అలసత్వం వహించడం సబబు కాదు. – బాలాజీ, ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడుపొజిషన్ ఐడీలు మంజూరు చేయాలి పొజిషన్ ఐడీలు ఇచ్చేందుకు నెలల సమయం అవుతుందా..?. టీచర్ల పట్ల ఇంత చులకన భావన ఎందుకో. రెండు నెలల జీతాలు లేకపోవడంతో టీచర్లు అవస్థలు పడుతున్నారు. కేడర్ స్టెన్త్ నివేదికలు సిద్ధం చేసి పొజిషన్ ఐడీలు ఇవ్వడం పట్ల అలసత్వం వహించడం దారుణం. ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారని అనిపిస్తోంది. – జీవీ రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
ప్లాస్టిక్మయం..
మార్కెట్లో పలు రకాల డిజైన్స్తో విద్యార్థులను ఆకర్షిస్తున్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు ప్లాస్టిక్తో ప్రాణాంతక వ్యాధులు ప్లాస్టిక్లో బిస్ఫినాల్–ఏ (బీపీఏ), మైక్రో ప్లాస్టిక్స్ అనే రసాయనం అధికంగా ఉండటంతో కొద్ది మోతాదులోనైనా శరీరంలో చేరే ప్రమాదం ఉంది. దీంతో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. శరీరంలోని గ్రంథులపై ప్రభావం చూపి వాటి పనితీరును మందగిస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. అతిశీతలం, అధిక వేడి పదార్థాల కోసం వీటిని వినియోగిస్తే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ మహమ్మారి కాటేసే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ను ఇలానే వినియోగిస్తే 2030 నాటికి ఆంధ్రప్రదేశ్లో 27 శాతం మంది క్యాన్సర్ బారీన పడే ప్రమాదం ఉందని నిపుణులు, మేధావుల గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 25 ఏళ్ల లోపు పిల్లలు, యువతలోనూ ప్లాస్టిక్ వినియోగంచడంతో కలిగే అనర్థాలు ప్రాణాంతక వ్యాధులకు గురి చేస్తున్నాయి. గత 10 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వినియోగం అధికమవడమే ఇందుకు ప్రధాన కారణంగా వైద్యులు సూచిస్తున్నారు. నిద్రలేచింది మొదలు పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్తో చేసిన వాటినే అందరూ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్లనే అధికంగా వాడుతున్నారు. వేడి వేడిగా పెట్టిన ఆహారం ప్లాస్టిక్ బాక్స్ల్లో పెట్టిన కొన్ని గంటలకే రసాయనాలు ఆహారంలో కలిసి క్యాన్సర్ మహమ్మారికి దారితీస్తున్నాయి. ఇంత ప్రమాదకరమని తెలిసినా ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్లనే కొనుగోలు చేసి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావడంలో జిల్లాలోని విద్యా, వైద్యశాఖలు విఫలమవుతున్నాయి.స్టీలు, రాగి వస్తువుల వినియోగం శ్రేయస్కరం ఆధునిక యువత, చిన్నారుల ఆరోగ్యం పెను ప్రమాదంలో పడింది. నిద్రలేచిన మొదలు పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్తో చేసిన వాటినే వినియోగిస్తున్నారు. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులతో పాటు దీర్ఘకాలిక సమస్యల చిన్న వయస్సు నుంచే వెంటాడుతున్నాయి. ప్లాస్టిక్ బాక్సులలో ఆహారం భద్రపరిచి కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఆరగించడంతో అదికాస్త విషంగా మారుతోంది. దీంతో జీర్ణాశయం, రక్తనాళాలలు, పేగులు, కిడ్నీలపై విష పదార్థాలు దాడి చేస్తున్నాయి. పలు పరిశోధనలలో ఈ విషయం బయటపడినా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం దారుణం. పిల్లలకు రాగి, స్టీల్ వంటి వస్తువులను లంచ్ బాక్సులకు, తాగునీటికి వినియోగించడం శ్రేయస్కరం. – ప్రశాంతి, ప్లాస్టిక్ వినియోగం–అనర్థాలపై పరిశోధన చేస్తున్న విద్యార్థిని, తిరుపతి క్యాన్సర్ విజృంభించే ప్రమాదం సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు ప్లాస్టిక్ భూతం చుట్టుముట్టింది. ఇది ప్రమాదకర సంకేతం. తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పూర్వీకులు పాటించిన నియమాలు, అలవాట్లలో ఎంతో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని నేటి తరం అనుసరించాలి. ప్లాస్టిక్ బాటిళ్లు, లంచ్ బాక్సుల వినియోగంతో కాన్సర్ మహమ్మారి దగ్గరవుతోంది. దీన్ని నుంచి బయట పడాలంటే ప్లాస్టిక్ వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పరంగా పలు రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య వంతులను చేయడం జరిగింది. – కే. భానుప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి, తిరుపతిప్లాస్టిక్ లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లతో ప్రమాదం ● 90 శాతం విద్యార్థులు ప్లాస్టిక్ భూతాన్ని మోస్తున్న వైనం ● ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్సుల వినియోగంతో ప్రాణాంతక వ్యాధులు ● అవగాహన కల్పించడంలో విద్య, వైద్యశాఖ విఫలం ● మొక్కుబడిగా తల్లిదండ్రుల సమావేశాలు ● చైతన్యం చేయాలంటున్న నిపుణులు తిరుపతి సిటీ : రంగు రంగుల డిజైన్లు, కార్టూన్ క్యారెక్టర్స్, గ్లిట్టర్ ఎఫెక్ట్స్తో పిల్లలను ఆకట్టుకునే విధంగా ప్లాస్టిక్ బాటిళ్లు, లంచ్ బాక్స్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ప్రతి విద్యార్థి బ్యాగుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్లు దర్శనమిస్తున్నాయి. పాఠశాల, కళాశాలల విద్యార్థులను తమ వైపు తిప్పుకునే విధంగా ఆకర్షణీయంగా ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. వీటి అమ్మకాలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. పలు రకాల వైరెటీలు, తక్కువ ధర, బరువు తక్కువగా కనిపించే ప్లాస్టిక్ బాటిళ్ల వైపే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆకర్షితులై ప్రాణాంతకమైన రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. అనారోగ్యం, పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిసినా విద్యావంతులు, ఉన్నత వర్గాలు సైతం వీటి వినియోగాన్ని వదలకపోవడం గమనార్హం. ప్లాస్టిక్ వినియోగం మనిషి జీవితంలో భాగమైపోయింది. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా, పెద్దలు విధులకు హాజరు కావాలన్నా టిఫిన్, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్వే వాడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం ప్లాస్టిక్ బాక్సులలో ప్యాక్ చేసిన ఆహారం మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసే సమయానికి ఆహారంలో చాలా తేడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి పిల్లలకు టిఫిన్ బాక్స్లు, వాటర్ బాటిళ్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రమాదమే. వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాలలో ఉంచడం ద్వారా రుచి, వాసన కోల్పోడంతో పాటు కొన్ని రకాల విష పదార్థాలు ఏర్పడతాయి. ఇవి చిన్నారుల అవయవాలపై ప్రభావం చూపుతాయి. నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉండే వాటర్ బాటిళ్లు, లంచ్ బ్లాక్స్లు వాడటంతో అందులోని కెమికల్స్ పొరలుగా ఆహారంలో కలిసి ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. – డాక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, చిన్న పిల్లల వైద్యనిపుణులు, తిరుపతి పేరెంట్స్ మీటింగ్ల్లో అవగాహన కల్పించాలి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో పేరెంట్స్ మీటింగ్లంటూ హడావుడి చేస్తుంటారు. కానీ అందులో విద్యార్థులకు అవసరమైన విషయాలను తల్లిదండ్రులతో చర్చించడం లేదు. తల్లిదండ్రులకు గేమ్స్ ఏర్పాటు చేసి, టీలు, కాఫీలు ఇచ్చి సంతోషపెట్టి పంపుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై యాజమాన్యాలు శ్రద్ధ చూపకపోవడం ఆశ్చర్యమేస్తోంది. పిల్లల ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని, నివారణా చర్యలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలేదు. విద్య, వైద్య శాఖాధికారులు దీనిపై ప్రత్యక దృష్టి పెట్టాలి. – రాజశేఖర్రెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు, తిరుపతి రసాయనాలు కరిగి విషపూరితం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులతో ప్రమాదమని తెలిసినా మార్కెట్లో దొరికే పలు రకాల డిజైన్లు చూసి విద్యార్థులు అటు తల్లిదండ్రులు మోజుపడి కొనుగొలు చేసి వాడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేస్తే రోగాలను కొనుగోలు చేసినట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరిగించిన వాటర్ను, అత్యంత శీతలమైన పదార్థాలను ప్లాస్టిక్ పాత్రలలో నింపితే సుమారు 90శాతం కెమికల్స్ అందులో కరిగి ఆ పదార్థాలను విషపూరితం చేస్తాయి. దీంతో రోగాలు శరీరాన్ని కబళిస్తాయి. అలాగే ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలు భూమిలో కరగాలంటే కనీసం 450 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి వినియోగం ఆరోగ్యానికే కాక పర్యావరణానికి ప్రమాదకరం. పాఠశాలలు, కళాశాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సామాజిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉందని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. -
వేతనాలు చెల్లించండి మహాప్రభో.!
తిరుపతి అర్బన్, పార్వతీపురం టౌన్, ఆరిలోవ(విశాఖ): తమకు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. శనివారం ఆయా కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాల విషయంలో కేడర్ స్ట్రెంగ్త్ వివరాలు, పొజిషన్ ఐడీలు లేకపోవడంతో జూన్, జూలై జీతాలకు ఆటంకం ఏర్పడిందని ఆవేదన చెందారు.యుద్ధ ప్రాతిపదికన బదిలీలు చేసిన ప్రభుత్వానికి జీతాన్ని చెల్లించడం కష్టమేమీ కాదన్నారు. ఈ నెలాఖరులోగా సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఉపాధ్యాయులు న్యాయపోరాటం చేయాల్సి వస్తుందని, డీఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయా కలెక్టరేట్లు, డీఈఓ కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించారు. యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
నేడు బిల్లుల చెల్లింపునకు అవకాశం
చిత్తూరు కార్పొరేషన్ : ఆదివారం ప్రభుత్వ సెలవురోజు అయినప్పటికీ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విద్యుత్ బిల్లులు కట్టవచ్చని అధికారులు తెలిపారు. రెండు జిల్లాల్లోని అన్ని విద్యుత్ బిల్లుల కేంద్రాలు పనిచేస్తాయని చిత్తూరు, తిరుపతి జిల్లాల ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్అహ్మద్, సురేంద్రనాయుడు తెలిపారు. వినియోగదారులు ఈ మార్పును గమనించాలని కోరారు. ముఖ్యంగా హెచ్టీ సర్వీసుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 12 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,576 మంది స్వామి వారిని దర్శించుకోగా 25,227 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. ప్రసూతి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స తిరుపతి తుడా : స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా చేశారు. వివరాలు ఇలా.. నెల్లూరుకు చెందిన వనిత (46) గర్భం ముఖద్వారం నందు 12–8 సి.ఎం పరిమాణం గల పెద్ద సైజు కణితి ఏర్పడింది. అరుదైన కణితిని ఆసుపత్రి వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి చాకచక్యంగా తొలగించారు. వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీల అభినందించారు. 29న రాయలసీమ డిపో మేనేజర్ల సదస్సు తిరుపతి అర్బన్ : ఈనెల 29న తిరుపతిలోని భారతీ విద్యామందిరంలో నిర్వహిస్తున్న రాయలసీమ ఆర్టీసీ డీఎంల సదస్సుకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హాజరు కానున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని ఆర్టీసీ జోన్–4 పరిధిలోని 54 డిపోలకు చెందిన డీఎంలకు శనివారం సమాచారం అందించారు. జోన్–4 పరిధిలోని రాయలసీమ జిల్లాలకు చెందిన డిపో మేనేజర్లతో ఎండీ సమీక్షిస్తారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారని వివరించారు. 28న ఎండీ తిరుపతి జిల్లాలోని వాకాడు డిపోను పరిశీలన చేస్తారని, ఆ తర్వాత తిరుపతికి చేరుకుంటారన్నారు. అనంతరం 29న సదస్సులో పాల్గొంటారని తెలిపారు. -
జనవాసాల్లోకి చిరుతలు రాకుండా చర్యలు
● జూపార్క్ ప్రాంతాల్లో మూడు చిరుతల కదలికలు ● రాత్రివేళ్లల్లో ఒంటరిగా వెళ్లకూడదు ● వైల్డ్లైప్ సబ్ డీఎఫ్వో నాగభూషణం వెల్లడితిరుపతి మంగళం : శేషాచల అటవీ ప్రాంతం నుంచి చిరుతలు జనవాసాల్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నామని తిరుపతి వైల్డ్ లైఫ్ సబ్ డీఎఫ్వో నాగభూషణం తెలిపారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని అటవీశాఖ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్వీ జూపార్క్ రోడ్డులో నిన్నటి రాత్రి చిరుత సంచారం కలకలం రేపిందన్నారు. ఆ మార్గంలో వెళుతున్న వాహనదారుడిపై చిరుత దాడి చేసేందుకు యత్నించిందని తెలిపారు. అయితే అటు మార్గంలో రాత్రి సమయంలో వెళ్లే వాహనదారులు నలుగురు, ఐదుగురు అలిపిరి సర్కిల్ వద్ద నుంచి కలిసి వెళ్లాలని సూచించారు. ఎస్వీ జూపార్క్ రోడ్డులో అధికంగా ఫుడ్స్టాల్స్ ఉన్నాయని, వారు అక్కడే పడవేసే ఫుడ్వేస్టేజ్ కోసం కుక్కలు, పందులు, జింకలు వస్తుంటాయని, వాటి కోసం చిరుతలు అక్కడి వస్తున్నాయని తెలిపారు. ఫుడ్స్టాల్స్ నిర్వాహకులు వేస్టేజ్ను అక్కడ పడవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ రోడ్డు మార్గంలో ఫుడ్స్టాల్స్కు ఎలాంటి అనుమతి లేదని, వాటిని తొలగించేందుకు టీటీడీ అటవీ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో పాటు ఎస్వీ యూనివర్సిటీ కళాశాల వద్ద గుట్టలుగా పడవేసే ఫుడ్ వ్యర్థాల కోసం ఇటీవల చిరుతలు ఆ ప్రాంతంలో సంచరించాయన్నారు. దాంతో అక్కడ బోను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం ఎస్వీ యూనివర్శిటీ, జూపార్క్ రోడ్డు ప్రాంతాల్లో మూడు చిరుతలు సంచరిస్తున్నట్లు సీసీ ఫుటేజ్ల ద్వారా తెలిసిందన్నారు. మూడు చిరుతలతో పాటు వాటి పిల్లలు కూడ ఉన్నట్లు గుర్తించామన్నారు. అలిపిరి సర్కిల్ వద్ద నుంచి రాత్రి వేళల్లో టీటీడీ, అటవీ శాఖ సిబ్బందిని ఏర్పాటు చేసి జూపార్క్ రోడ్డులో వాహనదారులను గుంపులుగా పంపేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే చిరుత కదలికలను తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలో 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎస్వీ యూనివర్సిటీ, జూపార్క్ రోడ్డులో రెండు బోన్లును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిరుతలు జనవాసాల్లోకి రాకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు. బోన్లు ఏర్పాటు శేషాచల అడవుల్లో నుంచి జన వాసాల్లోకి వస్తున్న చిరుతలను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన్రెడ్డి తెలిపారు. ఎస్వీయూనివర్శిటీ ప్రాంతంలో రెండు బోన్లు, ఎస్వీ జూపార్క్ రోడ్డులోని అరవింద కంటి ఆసుపత్రి సమీపంలో ఒక బోను ఏర్పాటు చేశామని తెలిపారు. -
గాజులమండ్యంలో భూవివాదం
రేణిగుంట : మండలంలోని గాజుల మండ్యంలోని ప్రధాన రహదారికి ఆనుకొని గ్రామానికి చెందిన దొరై రాజుకు 1047 చదరపు అడుగుల స్థలం ఉంది. అందులో 927 చదరపు అడుగుల స్థలం తిరుపతి చైన్నె హైవే విస్తరణ కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నష్ట పరిహారం చెల్లించింది. హైవే పనులు పూర్తయిన అనంతరం మిగిలిన స్థలంలో షాప్ పెట్టుకోవాలని ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఇంతలో వీరికి వెనుక నివాసం ఉన్న టీడీపీ నేత కన్ను ఆ స్థలంపై పడింది. ఆ స్థలాన్ని ఆక్రమిస్తే తన ఇల్లు రోడ్డుకు వస్తుందన్న దురాశతో రెండు నెలలుగా ఆ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి భూమిని సొంతం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ సీఐ మంజునాథరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి జేసీబీతో బాధితుడి స్థలంలో ఉన్న గోడను కూల్చేందుకు ప్రయత్నించారు. బాధితుడి భార్య మునెమ్మ జేసీబీకి అడ్డుగా కూర్చోవడంతో గ్రామస్తులు అధికారుల చర్యలను తప్పుపట్టి బాధితురాలికి అండగా నిలిచారు. బాధితుడి కుమారుడు మునేంద్ర మాట్లాడుతూ.. స్థలానికి సంబంధించి తమ వద్ద పత్రాలు ఉన్నాయన్నారు. అధికార బలంతో ఆక్రమించాలని ప్రయత్నిస్తే ఊరుకోమన్నారు. -
అంతర్ జిల్లాల ఫుట్బాల్ టోర్నీ ప్రారంభం
నాయుడుపేట టౌన్ : పట్టణంలోని ఏఎల్సీఎం ఆటస్థలం ఆవరణలో శనివారం నుంచి రెండు రోజుల పాటు అంతర్ జిల్లాల ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ముందుగా ఎస్ఏఎల్సీ మాజీ బిషప్ మైఖెల్ బెన్హర్తో పాటు ఫుట్బాల్ జిల్లా సంబంధిత అధికారులు ప్రారంభించారు. ఈ పోటీలలో తిరుపతి, నెల్లూరు,వె వైఎస్సార్ కడప తదితర జిల్లాలకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారిణులు పాల్గొంటున్నట్లు కోచ్ గౌస్బాషా తెలిపారు. ఈ పోటీలను నాయుడుపేట ఫుట్బాల్ క్లబ్ సారథ్యంలో జిల్లా అధికారులతో కలిసి పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు, క్లబ్కు చెందిన భావన్ అనుదీప్, సభ్యులు పాల్గొన్నారు. నవోదయ ఫలితాల్లో ‘విశ్వం’ ప్రతిభ తిరుపతి సిటీ : జాతీయ స్థాయిలో 2025–2026 విద్యా సంవత్సరానికి జరిగిన జవహర్ నవోదయ విద్యాలయ 3వ జాబితా ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశ్వం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 69 మంది విశ్వం విద్యార్థులు సీట్లు సాధించారని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఆయన అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్ రెడ్డి, కరస్పాండెంట్ ఎన్ తులసీ విశ్వనాథ్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ వంటి పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తోందన్నారు.2026 నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల కోసం 8688888802 / 9399976999 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. -
అన్నయ్య ఆరాటం..
తల్లిదండ్రుల్లేక అనాథలుగా మారిన తోబుట్టువులకు అండగా నిలబడిన గూడూరు గిరిజన సోదరుడి జీవన పోరాటం.తిరుపతి : అన్నం వడ్డించుకుంటున్న బాలికలు జిల్లాలోని వసతి గృహాల వివరాలు ఎస్సీ వసతి గృహాలు 62 ఎస్టీ వసతి గృహాలు 07 ఏపీఎస్డబ్ల్యూఆర్ గురుకులాలు 11 బీసీ వసతి గృహాలు 64 ట్రైబల్ గురుకులాలు 06 మహాత్మా గాంధీ పూలే గురుకులాలు 07 ఏపీ రెసిడెన్షియల్ గురుకులాలు 03 బీసీ వసతి గృహాల్లోని విద్యార్థులు 1,987 ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులు 3,007 – 8లో– 8లో -
అన్నయ్య ఆరాటం.. బతుకు పోరాటం
చిల్లకూరు : సాధారణంగా గిరిజనులు చిన్నప్పటి నుంచి ఎవరికి వారుగా జీవనం చేసుకునేందుకు భిక్షాటనను చేపట్టి ఇచ్చిన దాంతో తిని ఎక్కడ పడితే అక్కడ ఉండడం చేస్తుంటారు. అయితే గూడూరు మండలం విందూరు గిరిజన కాలనీకి చెందిన నలుగురు చిన్నారులు నిలువ నీడలేక పోయిన కాలనీలోనే పట్టలతో ఇంటిని నిర్మించుకుని గాలికి, వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఉంటున్నారు. వీరిలో అందరికన్నా పెద్దవాడు మూడో తరగతి వరకు చదువుకుంటున్న సమయంలో తండ్రి మృతి చెందడంతో మిగిలిన ముగ్గురి బాధ్యతను తీసుకుని చదువును వదిలి పనిబాట పట్టి వచ్చిన కూలీ డబ్బులతో ఇద్దరు తమ్ముళ్లతో పాటుగా చెల్లికి అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారి చెల్లికి క్షయ వ్యాధి సోకిందని తెలిసి అల్లాడిపోతూ కూలీ డబ్బుల్లోనే చెల్లికి మందులు తీసుకుని వచ్చి ఒకరికి ఒకరు అండగా నిలుస్తున్నారు. గూడూరు మండలం విందూరు గ్రామంలోని గిరిజన కాలనికి చెందిన ఈశ్వరయ్య, పంరటమ్మ అనే గిరిజన దంపతులు ఉన్నారు. వీరికి 15 ఏళ్ల క్రితం తొలుత శివ అనే బాలుడు జన్మించాడు. అటు తరువాత మూడేళ్లకు వసంత అనే అమ్మాయి పుట్టింది. అటు తరువాత కవల పిల్లలుగా రామ, లక్షణ్ అనే జన్మించారు. అప్పట్లో ఆమె రక్తహీనత ఉండడంతో కొంత కాలానికి మృతి చెందింది. అటు తరువాత బిడ్డలను తండ్రి ఈశ్వరయ్య చూసుకుంటూ పెద్ద వాడైన శివను బడికి పంపాడు. శివ మూడో తరగతిలో ఉన్నప్పడు తండ్రి కూడా కాలం చేశాడు. దీంతో నలుగురు పిల్లలు అనాథలయ్యారు. చెల్లి, తమ్ముళ్ల ఆకలితో అలమటించి పోతుండడంతో బడికి దూరమై కొద్ది రోజులు ఇంటింటికి వెళ్లి భోజనం తెచ్చి పెట్టేవాడు. ఇలా కుదరదని శివ కూలీ పనులకు వెళ్తూ వచ్చిన డబ్బుతో తమ్ముళ్లు, చెల్లికి భోజనం పెట్టి చూసుకుంటున్నాడు. అయితే చెల్లికి క్షయ వ్యాధి అని తెలియడంతో ఆ వచ్చిన డబ్బులతోనే మందులు తీసుకుని వచ్చి వాడుతున్నప్పటికీ నయం కాక పోవడంతో చెల్లి పరిస్థితి చూసి అల్లాడి పోతున్నాడు. ఇద్దరి తమ్ముళ్లను మంచి చదువులు చదివించాలని ఉందని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరిని మూడో తరగతి చదివిస్తున్నాడు. దాతలు ముందుకు వచ్చి బయట చదివించేందుకు సిద్ధమైనప్పటికీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోతున్నామని అందువల్ల గ్రామంలోనే ఉంటామని వాందరూ ఒకే మాట చెబుతున్నారు. ఐటీడీఏ అదికారులు వారి దీన స్థితిని గమనించి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అండగా నిలిచేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. -
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
తిరుపతి కల్చరల్ : చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్, శాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.రామకృష్ణయ్య తెలిపారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 400 మంది క్రీడాకారులు హాజరు కానున్నారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుధాకర్రావు, కోశాధికారి జి.శివయ్య, మునస్వామి పాల్గొన్నారు. రేపటి నుంచి రెండవ విడత వెబ్ ఆప్షన్లు తిరుపతి సిటీ : ఇంజినీరింగ్ తొలి విడత తొలి విడతలో ఎస్వీయూ పరిధిలో 14,352 మంది విద్యార్థులు సీట్లు సాధించి తమకు కేటాయించిన కళాశాలలో ప్రవేశాలు పొందారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో భాగంగా రెండవ విడత సీట్ల కేటాయింపు కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం నుంచి కొనసాగనుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రక్రియపై సందేహాలకు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ఏపీఈఏమ్సెట్–2025 కౌన్సెలింగ్ సెంటర్ నందు సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. -
ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అవుతా :విజయ్ దేవరకొండ
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది.‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "గత సంవత్సర కాలంగా 'కింగ్డమ్' గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం." అన్నారు. -
స్పోర్ట్స్ టీచర్ నిర్వాకం.. విద్యార్థినులకు అస్వస్థత
తిరుపతి జిల్లా: జిల్లాలోని కోట జడ్పీ బాలికల హైస్కూల్లో స్పోర్ట్స్ టీచర్ నిర్వాకంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్కు యూనిఫామ్తో రాలేదని విద్యార్థినులతో గుంజిళ్లు తీయించాడు స్పోర్ట్స్ టీచర్. అయితే పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయయారు. దాంతో వారిని కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలియడంతో హాస్పిటల్ వద్దకు చేరుకున్న తల్లి దండ్రులు ఆందోళన చేపట్టారు. ఆ విద్యార్థులంతా ఎస్సీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. సుమారు 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. -
సన్నిహితులకు రక్ష.. చిరుద్యోగులకు శిక్ష
● తొక్కిసలాటకు సంబంధం లేని ఉద్యోగులపై వేటు ● వైకుంఠ ద్వార దర్శన ఘటనలో బాధ్యులు వారేనా? ● ఉన్నతాధికారులు, పాలక మండలికి బాధ్యత లేదా? ● తొక్కిసలాట వెనుక ఎన్నో అనుమానాలు ? సాక్షి టాస్క్ఫోర్స్ : వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జనవరి 8న తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులను బాధ్యులను చేస్తూ వారిని బలిపశువులను చేసి చేతులు దులుపుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల విషయంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులపై ఎటువంటి చర్యలు లేకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన అనంతరం తిరుపతికి వచ్చిన సీఎం చంద్రబాబు చెప్పినట్టే నేడు చర్యలు తీసుకోవడంపై శ్రీవారి భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సన్నిహితులను కాపాడే కుట్రలో భాగంగా చిరుద్యోగులను బలిపశువులను చేశారంటూ మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. సీబీఐ చేత విచారణ చేయిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన డిమాండ్ చేశారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ఈ ఏడాది జనవరి 8న తిరుపతి పద్మావతి పార్కువద్ద నున్న రామానాయుడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించగా.. 40 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై నాడు ఎస్పీ, జేఈఓని బదిలీ చేశారు. మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఆ ఆ ఘటనపై విచారణ చేపట్టింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తితో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా 54 మంది ప్రత్యక్ష సాక్షులు, మృతుల కుటుంబీకులు, గాయపడ్డ వారు, వారి బంధువులు, పోలీసు, విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులను కమిషన్ విచారించినట్లు తెలిపారు. తొక్కిసలాటకు ఇద్దరు అధికారులదే ప్రధాన బాధ్యత అని కమిషన్ అభిప్రాయపడినట్లు వెల్లడించారు. అందులో భాగంగా డీఎస్పీ వి. రమణకుమార్, శ్రీవేంకటేశ్వర గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని బాధ్యులను చేస్తూ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఉన్నతాధికారులపై చర్యలు ఏవీ అంత పెద్ద ఘటన జరిగితే.. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లలో కీలక భూమిక పోషించే టీటీడీ ఈఓ, ఏవీఎస్ఓ, పాలకమండలి సభ్యుల్లో ఏ ఒక్కరిని బాధ్యులను చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు పర్యాయాలు వైకుంఠ ద్వార దర్శనానికి పదిరోజులు పెంచి భక్తులందరికీ అవకాశం కల్పించినా ఏ ఒక్క చిన్న పొరబాటు జరగకపోయినా.. పది రోజులు దర్శనం పెట్టిందే తప్పు అన్నట్టు కూటమి పెద్దలు ఆరోపణలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. తొక్కిసలాట వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నా.. నివేదికలో ఏముందనే విషయం కూడా బహిర్గతం చేయకపోవడంపైనా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సైతం అవే అనుమానాలను వ్యక్తం చేయడం గమనార్హం. సన్నిహితులను కాపాడేందుకేనా.. తొక్కిసలాట అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆ రోజే వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు సీఎం చంద్రబాబు ఏదైతే చెప్పారో.. అదే విషయాలు నివేదికలో పొందుపరిచినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సన్నిహితులను కాపాడేందుకే ఇద్దరు అధికారులను బలిపశువులను చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే తూతూ మంత్రంగా విచారణ జరిపినట్లు వెల్లడించారు. అప్పట్లో భక్తులు చెప్పిన బాధలు, సమస్యలను పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవేంకటేశ్వర గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలురని ప్రచారం చేసి.. తొక్కిసలాటకు సంబంధమే లేని వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అతడిని బలిపశువును చేశారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. -
థియేటర్ గొడవపై కేసు నమోదు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ఆర్ సినిమా థియేటర్ గొడవపై కేసు నమోదు చేసినట్లు 1వ పట్టణ సీఐ గోపి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గురువారం ఆర్ఆర్ సినిమా థియేటర్లో హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా కొంత మంది ఆకతాయిలు థియేటర్ యాజమాన్యంపై అసభ్యంగా ప్రవర్తించి గొడవ చేసి థియేటర్ ప్రధాన ద్వారం అద్దం పగులగొట్టారన్నారు. అద్దం పగులగొట్టింది చందు కాగా రవి, యేసు అనే వ్యక్తులు తాగి గొడవ చేశారన్నారు. శుక్రవారం చందు, రవిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం నిందితులను తహసీల్దారు ఎదుట హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. యేసు అనే వ్యక్తిని త్వరలో పట్టుకుని కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. షార్లో హిందీ భాషపై సదస్సు సూళ్లూరుపేట : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ఽ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని ఎంఆర్ కురూప్ ఆడిటోరియంలో శుక్రవారం హిందీ భాషపై ఒకరోజు సాంకేతిక సదస్సును షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ‘అభివృద్ధి చెందిన భారతదేశానికి ఇస్రో సహకారం’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఆర్ఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ అనిల్ భరద్వాజ్ ముఖ్య అఽతిథిగా హాజరయ్యారు. ‘ సౌరవ్యవస్థ అన్వేషణ’ అనే అంశంపై ఆయన హిందీలో ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఇన్–హౌస్ జర్నల్ ప్రజ్వల్ను, సెమినార్ కార్యకలాపాలతో కూడిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో షార్ అధికారులతో పాటు ఎన్ఆర్ఎస్సీ ఏడీఆర్ఐఎన్ సెంటర్లో పాటు ఇతర సెంటర్ల ఉద్యోగులు పాల్గొని తమ ప్రజెంటేషన్లను ఇచ్చారు. అంధ క్రీడాకారుడికి ఆర్థిక సాయం తిరుపతి అర్బన్: అంధ క్రీడాకారుడు ముప్పాళ్ల శేషగిరి ఇటీవల జరిగిన జాతీయ స్థాయి గోల్బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపాడు. సెప్టెంబర్ ఒకటిన ఈజిప్టు దేశంలోని అలెగ్జాండ్రియాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎన్నికయ్యాడు. ఆ పోటీల్లో పాల్గొనడానికి శేషగిరికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంధుల క్రీడా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంచల నరసయ్య తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ను గురువారం అభ్యర్థించారు. దీనిపై స్పందించిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్వర్ ద్వారా రూ.లక్ష సాయం అందించారు. వారు మాట్లాడుతూ అంతర్జాతీయ వీధుల్లో భారత దేశ జెండా రెపరెపలాడడం మన గర్వకారణమన్నారు. ప్రత్యేక ప్రతిభావంతుడైన శేషగిరిని అభినందించి ప్రోత్సహించడం దేశభక్తునిగా గర్వంగా ఉందని వారు తెలిపారు. ఎర్ర చందనం కేసులో నలుగురికి జైలు నాగలాపురం: ఎర్ర చందనం అక్రమంగా తరలించిన కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షలు జరిమానా విధించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు.. 2018వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన శ్రీకాళహస్తి నుంచి తమిళనాడుకు 44 ఎర్ర చందనం దుంగలను రెండు కార్లలో తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో గురువారం తిరుపతిలోని ఎర్ర చందనం ప్రత్యేక కోర్టు అడిషినల్ న్యాయమూర్తి నరసింహమూర్తి తమిళనాడులోని కాంచీపురం తాలూకా శంకరాపురం గ్రామానికి చెందిన ఎం.భాస్కర్(34), పుగయేంది(30), బి.ప్రభు(35), జె.హుస్సేన్(24) అనే నిందితులకు శిక్ష విధించినట్లు ఎస్ఐ వివరించారు. -
90 లక్షల పొదుపు డబ్బులు స్వాహా
● మెప్మాలో మేత ● విచారణలో బయటపడిన ఆర్పీ హేమలత అక్రమాలు ● సంఘాల డబ్బు బ్యాంకులో పొదుపు చేయకుండా చేతివాటం ● బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కు ● నకిలీ రసీదులతో మోసం ● 33 పొదుపు సంఘాలకు టోకరా తిరుపతి తుడా : తిరుపతి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి జలగ బండారం బయట పడింది. ఆర్పీ అక్రమాలు తొలుత రూ.70 లక్షలని ఆరోపణలు వచ్చినా ఆ మొత్తం ఇప్పుడు 90 లక్షలకు తేలింది. తిరుపతి మెప్మా భాగ్యలక్ష్మి స్లమ్ లెవెల్ ఫెడరేషన్ రిసోర్స్ పర్సన్ హేమలత పై వచ్చిన ఆరోపణలతో మెప్మా డైరెక్టర్ విచారణ కమిటీని నియమించారు. వారం రోజులపాటు ఈ కమిటీ లోతుగా విచారణ చేపట్టగా ఆమె డ్వాక్రా సంఘాల ద్వారా నొక్కేసి మెక్కిన మొత్తం రూ.90 లక్షలని తేలింది. ఈ మేరకు శుక్రవారం కమిటీ విచారణలో తేలిన వివరాలను మీడియాకు వివరించారు. అక్రమాలెన్నో.. భాగ్యలక్ష్మి స్లమ్ లెవెల్ ఫెడరేషన్ రిసోర్స్ పర్సన్ అక్రమాలు తవ్వేకొద్ది అనేకం వెలుగులోకి వచ్చాయి. డ్వాక్రా మహిళల సొమ్మును నొక్కేసేందుకు ఆమె అనేక ఎత్తులు వేశారని బహిర్గతమైంది. భాగ్యలక్ష్మి ఎస్ఎల్ఎఫ్ ఆర్పీగా ఉన్న హేమలత 33 పొదుపు సంఘాల సొమ్ము లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. ఈ పొదుపు సంఘాలకు సంబంధించి నెలవారీ పొదుపు మొత్తం, రుణాల రికవరీ డబ్బులను బ్యాంకులోకి జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. బ్యాంకులో ఈ నగదును చెల్లించినట్లు నకిలీ రశీదులను చూపిస్తూ మాయ చేస్తూ వచ్చింది. ఈ విషయం బ్యాంకు నుంచి బయటకు రాకుండా అక్కడ సిబ్బందితో కుమ్మకై ్కంది. కొన్ని నెలల పాటు డ్వాక్రా మహిళలు, బ్యాంక్ సిబ్బందిని మేనేజ్ చేస్తూ అక్రమాలకు పాల్పడింది. 33 సంఘాలకు సంబంధించి చేసిన మోసం రూ.90 లక్షల మేర ఉందని విచారణలో తేలింది. విచారణ కమిటీ సభ్యులు ఆర్పీ పరిధిలోని రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు, సభ్యుల రిజిస్టర్లు, పొదుపు పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించగా ఈ మొత్తాన్ని కాజేసినట్లు తేల్చారు. పక్కా ప్రణాళికలతోనే అందర్నీ మోసం చేస్తూ ఆమె పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడిందని నిర్ధారణ చేశారు. వెలుగు చూసింది ఇలా.... ఆర్పీ హేమలత పరిధిలోని ఓ సంఘం సభ్యులు నెలవారి రుణాలను పక్కాగా చెల్లిస్తూ వచ్చారు. మరోసారి రుణం తీసుకోవాలని ఆ సంఘం సభ్యులు నిర్ణయానికి వచ్చారు. ఆర్పీ నెలల తరబడి ఆ సంఘం లీడర్లను బ్యాంకు వైపు వెళ్లకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. రుణాలు ఎందుకు రావడం లేదో తెలుసుకునేందుకు ఆ సంఘం లీడర్లు బ్యాంకు వద్దకు వెళ్లారు. తమ సంఘానికి రూ.20 లక్షల రుణం కావాలని బ్యాంకు మేనేజర్ను సంప్రదించారు. రికార్డులను పరిశీలించిన బ్యాంకు మేనేజర్ గతంలో తీసుకున్న మొత్తం ఇంకా చెల్లించలేదని, మీకు కొత్త రుణం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. నెలవారిగా క్రమం తప్పకుండా పొదుపు, రుణ చెల్లింపులు చేశామని ఇందుకు సంబంధించిన రసీదులు ఉన్నాయని మేనేజర్కి చూపించగా అవి నకిలీవని తేల్చారు. దీంతో మోసపోయామంటూ ఆర్పీ హేమలతను నిలదీశారు. ఇలా మొత్తం 33 సంఘాల పరిధిలో 27 సంఘాలకు సంబంధించి హేమలత చేసిన అక్రమాలు బయటపడ్డాయి. బాండ్లు రాయించి చెల్లించేలా ఒప్పందం హేమలత అవినీతి అక్రమాలు నిర్ధారణ కావడంతో ఎట్టకేలకు ఆమె తాను డ్వాక్రా సొమ్ము కాజేశానని అంగీకారం తెలిపారు. తాను కాజేసిన మొత్తం వివరాలను, మొత్తం తిరిగి చెల్లిస్తానని సంఘాలకు సైతం అంగీకార పత్రాన్ని రాసిచ్చారు. నిర్ధారణ ప్రకారం ఏ సంఘానికి ఎంత డబ్బు ఇవ్వాలి అన్న వివరాలతో బాండ్లు, చెక్కులను రాసిచ్చారు.ఆర్పీ అవినీతితో ఉలిక్కిపడ్డ తిరుపతి ఒక ఆర్పీ రూ. 90 లక్షల మేర అవినీతికి పాల్పడిందని నిర్ధారణ కావడంతో తిరుపతి ఉలిక్కిపడింది. తిరుపతి పరిధిలో సుమారు 47 వేల మందికి పైగా డ్వాక్రా సంఘ సభ్యులు ఉన్నారు. ఆర్పీ అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వందల మంది కళ్ళు గప్పి బ్యాంకును సైతం మోసగించిన తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. తమ సంఘాల పరిధిలో ఏమైనా అక్రమాలు జరిగాయా అంటూ మిగిలిన పొదుపు సంఘాలు ఆరా తీసేపనిలో పడ్డారు. -
గోపాలన్నా.. నీబిడ్డకు బుద్ది ప్రసాదించిన్నా..
సాక్షి, టాస్క్ఫోర్స్ : ప్రపంచ దేశాలు ఆధ్యాత్మిక నగరమని గొప్పగా చెప్పుకునే తిరుపతి నగరంతో పాటు నగర శివార్లలో గంజాయి దందా గుట్టుగా సాగుతోంది. ఒక్క గంజాయే కాదు మత్తు ఎక్కించే మాదక ద్రవ్యాలు ఎన్నో యువత భవితను చిత్తు చేస్తున్నాయి.. నిన్న, మొన్నటి వరకు వైట్నర్, ఫ్లూయిడ్స్ను ఉపయోగించి మత్తులోకి వెళుతున్న యువత తాజాగా మత్తును కలిగించే ఇంజెక్షన్లకు అలవాటు పడుతున్నారు. గంజాయి దొరకలేదంటే మత్తు కోసం తహతహలాడే కుర్రాళ్లు మత్తు ఇంజెక్షన్లతో సరిపెట్టుకుంటున్నారు. గంజాయి బ్యాచ్ మాత్రం యువకులనే టార్గెట్గా పెట్టుకుని గుట్టుగా అమ్మకాలు చేస్తోంది. మత్తుకు బానిసలైన యువకులకు గంజాయి ఆశ చూపించి పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. మత్తుకు బానిసలైన కుర్రాళ్లు ఎంతకై నా తెగించేస్తున్నారు. హత్యలు, హత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతూ భయానక వాతావరణం తీసుకొస్తున్నారు.. గంజాయి ముఠాలకు రాజకీయ నేతలు అండగా నిలుస్తుండటంతో పోలీసులు సైతం ఏమీ చేయలేక వెనుదిరుగుతున్నారు.. ఒక దశలో గంజాయి బ్యాచ్ పోలీసులపైకే తిరగబడుతున్నట్టు సమాచారం. గంజాయి ముఠా పట్ల పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపితే తప్ప తిరుపతికున్న పరపతిని కాపాడలేరన్న మాట అందరి నోట వినిపిస్తోంది.గంజాయి బ్యాచ్ ఉండేది...తిరుపతి నగరంతో పాటు నగరానికి ఆనుకుని ఉన్న మఠం భూములు, కాలువ భూములు, చెరువులు, పాడుబడిన భవంతుల్లో గంజాయి ముఠాలు తిష్ట వేసినట్టుగా సమాచారం. దామినేడు, బాలాజీ డెయిరీ, పాడిపేట ప్రాంతాల్లో నిరుపేదలకు నిర్మించిన ఇందరమ్మ గృహాలు, రాజీవ్ గృహాల్లో గంజాయి బ్యాచ్ తలదాచుకుంటున్నట్టు సమాచారం. పోలీసులు పలుమార్లు ఆ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన గంజాయి బ్యాచ్ మాత్రం పట్టుబడలేదంటే ఏ స్థాయిలో వారికి సమాచారం అందుతుందో అర్థం చేసుకోవచ్చు. మత్తుకు బానిసలైన యువత అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ కిడ్నాప్లు, హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నా పోలీసులు వారిని పట్టుకునేందుకు సాహసించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తిరుపతి నగరంతో పాటు నగర శివార్లలో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి గంజాయి బ్యాచ్ నుంచి బెదిరింపులు కూడా వస్తున్నట్లు సమాచారం.కార్లు, అంబులెన్స్లు, రైళ్లలో తరలింపుతిరుపతికి సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి గంజాయిని తరలించేందుకు అక్రమార్కులు కార్లు, అంబులెన్స్లు, రైళ్లను వాడుకుంటున్నట్టు సమాచారం. రైల్వే పోలీసుల కళ్లు గప్పి గంజాయిని గుట్టుగా తీసుకురావడం, అంబులెన్స్ డ్రైవర్లకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి గంజాయి ప్యాకెట్లను అక్రమార్కులు అనుకున్న ప్రాంతాలకు చేరుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి అక్రమ రవాణాకు జాతీయ రహదారిని మార్గంగా ఎంపిక చేసుకున్నారు. జాతీయ రహదారిపై రాత్రివేళ వాహనాల తనిఖీ జరగదన్న తలంపుతో ఆ మార్గాన్ని గంజాయి వ్యాపారులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాక హైవే పెట్రోలింగ్ వ్యవస్థ లేకపోవడంతో అక్రమార్కులు తమ అక్రమాలకు రాచబాటగా చేసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జూలై 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నాలుగు ప్రాంతాల్లో గంజాయిని పెద్ద ఎత్తున పట్టుకున్నారంటే ఏ స్థాయిలో అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. శ్రీవారి పాదాల చెంత ప్రశాంతంగా ఉండాల్సిన తిరుపతి నగరం, పరిసర ప్రాంతాలు మత్తు పదార్థాల అలజడితో వణుకుతోందని చెప్పక తప్పదు.పాడుబడ్డ గృహాలే ముఠాకు అడ్డాతిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్, తిరుచానూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప పథకం కింద నిర్మించిన భవన సముదాయాల్లో పాడుబడ్డ గృహాలనే గంజాయి ముఠా అడ్డాగా చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల గంజాయి బ్యాచ్ చేస్తున్న అకృత్యాలు, అఘాయిత్యాలకు నగరవాసులే కాదు, శ్రీవారి భక్తులు సైతం రాత్రివేళ భయంభయంగా తిరిగే పరిస్థితి దాపురించింది. జాతీయ రహదారితో పాటు నిర్మానుష ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకున్న గంజాయి ముఠా పగలంతా ఎవరెవ్వరికి విక్రయించాలో గుర్తించి రాత్రిపూట గుట్టుగా తరలించేస్తున్నట్టు సమాచారం. పోలీసుల కళ్లు గప్పి అమ్మకాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయి ముఠా నివాసముంటున్న పాత భవనాలకు వెళ్లే దారుల్లో వీధి దీపాలను పగులగొట్టేస్తుండడంతో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు దీపాలు ఏర్పాటు చేయడం మానేసినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే రాత్రి వేళల్లో పోలీసులు డ్రోన్ల సాయంతో అసాంఘిక శక్తులను పట్టుకుంటామని పంపించే డ్రోన్లకు చిక్కకుండా పాడుబడిన ఇళ్లను అడ్డాగా చేసుకున్నట్టు సమాచారం. -
యువతకు నీలం సంజీవరెడ్డి ఆదర్శం
తిరుపతి సిటీ : నైతికత, విలువలతో కూడిన నాయకత్వం, నిజాయతీ, ప్రజాసేవ నీలం సంజీవరెడ్డి సొంతమని ఆయన నేటి యువతకు ఆదర్శమని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరామిరెడ్డి కొనియాడారు. ఎస్వీయూ రాజనీతి, పాలనాశాస్త్ర విభాగం సహకారంతో అగ్రశ్రీ సంస్థ ఆధ్వర్యంలో వర్సిటీ సెనేట్ హాల్లో శుక్రవారం నీలం సంజీవరెడ్డి 3వ స్మారక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రిగా వ్యవసాయ ఆవశ్యకతను తెలుసుకుని గ్రామీణ, వ్యవసాయ పురోగతికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.ఎస్వీయూ వీసీ అప్పారావు మాట్లాడుతూ.. డాక్టర్ నీలం సంజీవరెడ్డి దూరదృష్టితో స్థాపించిన ఎస్వీయూ వేల మంది విద్యావేత్తలను, ప్రజా నాయకులను తయారు చేసిందన్నారు.అనంతరం రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు మాట్లాడుతూ.. డాక్టర్ నీలం సంజీవరెడ్డి పేరిట రాష్ట్ర పురస్కారాలను ఏర్పాటు చేసి ఏటా కార్యక్రమాలను నిర్వహిస్తున్న అగ్రశ్రీ సంస్థకు ఆర్థికంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహరించాలని సూచించారు. అనంతరం నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కారాలను అందజేశారు. విశిష్టరత్న పురస్కారాన్ని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డికి, న్యాయ శిరోమణిని మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషసైనారెడ్డికి, విద్యాశిరోమణిని గీతం వర్సిటీ మాజీ వీసీ దయానంద్కు, వైద్య శిరోమణి పురస్కారాన్ని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పూర్ణచంద్కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కార గ్రహీతల గౌరవార్థం అగ్రశ్రీ సంస్థ ప్రచురించిన విశేష సంచికను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అగ్రశ్రీ సంస్థ సంచాలకులు డాక్టర్ డి సుందరరామ్, ఉపాధ్యక్షుడు సాయి కుమార్, ప్రొఫెసర్ మురళీధర్, మళ్లీశ్వరరావు, పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. -
మైనింగ్ సరిహద్దుల వివాదంపై సర్వే
సైదాపురం : మైనింగ్ సరిహద్దుల వివాదంపై శుక్రవారం ఉన్నతాధికారులు సర్వే చేపట్టారు. జిల్లా సర్వేయర్ రఘరామరాజు, సైదాపురం ఇన్చార్జి సర్వేయర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో మండలంలోని పొక్కందల గ్రామ సమీపంలోని 95 సర్వేలో ఉన్న వివాదాస్పదమైన మైనింగ్ భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వివరాలు ఇలా .. మండలంలోని పొక్కందల గ్రామంలోని సర్వే నంబర్లో సుమారు 200 ఎకరాల ఉమ్మడి భూమి ఉంది. ఈ భూముల్లో గతంలో మైనింగ్ లీజులు ఉండేవి. ప్రస్తుతం ముగ్గురికి ఆ భూములకు సంబంధించి మైనింగ్ లీజులు ఉన్నాయి. ఇద్దరు మైనింగ్ యజమానుల మధ్య భూ వివాదం ఏర్పడింది. దీంతో కొంత కాలం నుంచి తీవ్ర స్థాయిలో సరిహద్దులతో పాటు తమ భూములను ఓ యజమాని ఆక్రమించారంటూ ఉన్నతాఽధికారులతో పాటు కోర్టును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం జిల్లా సర్వే అధికారుల పర్యవేక్షణలో ఆ భూములకు సంబంధించిన రికార్డులతో పాటు హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐసీడీఎస్లో పార్ట్టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తులు తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్ పరిధిలో పార్ట్ టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పీడీ వసంత బాయి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా జిల్లాలోని శ్రీకాళహస్తి, కోటలోని చిల్ట్రన్ హోమ్స్లో కుక్, నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, పీటీ ఇన్స్ట్రక్టర్ యోగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పోస్టు ద్వారా లేదా కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. విద్యార్హత వివరాలు ఐసీడీఎస్ వెబ్సైట్లో ఉంచామని తెలిపారు. వయస్సు 30 నుంచి 45 లోపు వారు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తుకు ఓసీలు రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.200 డీడీ లేదా బ్యాంక్ చెక్కు రూపంలో ఇవ్వాలని తెలియజేశారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం విమాన, రక్షణ శాఖ గౌరవ సలహాదారుడు డాక్టర్ సతీష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. -
జర్మనీ భాషపై ఉచిత శిక్షణ
తిరుపతి అర్బన్: నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీ భాషపై ఉచితంగా శిక్షణ ఇచ్చి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన శుక్రవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, ఎమ్మెల్సీ కల్యాణ చక్రవర్తితో కలిసి శిక్షణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనన్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి విక్రమ్కుమార్రెడ్డి, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం తదితరులు పాల్గొన్నారు. -
పీ4పై సమీక్షల పర్వం
తిరుపతి అర్బన్ : అట్టడుగుస్థాయిలో ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పీ4 ప్రాజెక్టుపై ప్రతి రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో మూడు రోజులుగా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షిస్తున్నారు. ఓ వైపు అధికారులతో మరోవైపు పారిశ్రామిక వేత్తలతో ఇంకో వైపు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. తాజాగా శుక్రవారం ఇదే అంశంపై సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు డీఆర్వో నరసింహులు, ప్రణాళికశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఆగస్ట్ 5లోపు పీ4 మ్యాపింగ్ తిరుపతి అర్బన్: జిల్లాలో గ్రామాల వారీగా పీ4 సర్వే మ్యాపింగ్ను ఆగస్ట్ 5 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆయన శుక్రవారం రాత్రి అధికారులతో పీ4పై సమీక్షించారు. ఆయన మాట్లాడు బంగారు కుటుంబాలను గుర్తించి వారి కనీస అవసరాలకు తగ్గట్లుగా మార్గదర్శకులను మ్యాపింగ్ చేయాలన్నారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు తమ లాగిన్లో అర్హులైన బంగారు కుటుంబాల వారిని నమోదు చేసి అనర్హులను డిలీట్ చేయాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పీ4 ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో ప్రతి సమాచారాన్ని అధికారులు తమ లాగిన్లో అప్లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. -
తిరుమల: చిరుత దాడి నుంచి తృటితో తప్పించుకుని..
తిరుమలలో మరోసారి చిరుత పులి అలజడి రేగింది. అలిపిరి-ఎస్వీ పార్క్ జూ రోడ్డులో వెళ్తున్న బైకర్లపై చిరుత దాడికి యత్నించింది. అయితే బైకర్లు తృటిలో తప్పించుకోగా.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తిరుమలలో శుక్రవారం సాయంత్రం బైకర్ల మీద ఓ చిరుత దాడికి యత్నించింది. రోడ్డు పక్కన కల్వర్టు మాటున దాక్కుని.. బైక్ రాగానే వాళ్ల మీదకు దూకింది. అయితే వాళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే చిరుత పొదల్లోకి వెళ్లింది. వెనక కారులో వస్తున్నవాళ్లు ఆ ఘటనను వీడియో తీశారు. అందకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది. అయితే ఈ వీడియోపై అధికారులు స్పందించాల్సి ఉంది. View this post on Instagram A post shared by Non Resident Tirupatian (NRT) (@non_resident_tirupatian) తిరుపతి ఎస్వీ జూ పార్క్ రోడ్లో ద్విచక్రవాహనం పై చిరుత దాడి చేసింది. #Tirupati #zooparkroad #tirupatizooparkroad #LeopardAttack #leopard #tirupatiupdates pic.twitter.com/IBiwvW2lpr— Tirupati Updates (@TirupatiUpdates) July 25, 2025 తిరుమలలో ఈ మధ్యకాలంలో వన్యమృగాల సంచారం పరిపాటిగా మారింది. జూలై 2025: అన్నమయ్య భవనం వెనుక చిరుత గేటుపై కూర్చొన్న ఘటన భక్తులను ఆందోళనకు గురిచేసింది.జూన్ 2025: అదే ప్రాంతంలో మరో చిరుత ఇనుప కంచె దాటి ప్రవేశించింది. సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి.2024లో: అలిపిరి కాలిబాట మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్లు సంచారం కారణంగా భక్తులపై దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో TTD అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు.వన్యమృగాల కదలికలను గుర్తించేందుకు అధునాతన GSM టెక్నాలజీతో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో.. రాత్రి నడక మార్గం మూసివేతతో పాటు సిబ్బందితో గుంపులుగా పంపించడం వంటి చర్యలు తీసుకున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే థామస్కు బిగ్ షాక్
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన పీఏ చంద్రశేఖర్పై టీడీపీ నేతలే జిల్లా కలెక్టర్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది.థామస్ పీఏ చంద్రశేఖర్ను విధులు నుంచి తొలగించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ నాయకులంతా కలిసిగట్టుగా వెళ్లి జిల్లా కలెక్టరేట్లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే థామస్ పీఏ చంద్రశేఖర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీడీపీ నేతలు కోరారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, టీడీపీ పార్టీ వ్యవహారాల్లో దూరి రాజకీయాలు చేస్తున్నాడు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీలో ప్రతి మండలానికి తన వర్గాన్ని ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నాడు’’ అంటూ టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.‘‘టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే పీఏ చంద్రను వెంటనే తొలగించాలి. అతని ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కలెక్టర్ను కోరుతున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏ నలుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకుని కోట్లు దోచుకుంటున్నారు’’ అంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. -
తిరుమల తొక్కిసలాట ఘటన.. అసలు దోషులెక్కడా చంద్రబాబు
సాక్షి,తిరుపతి: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ మూర్తి కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. ‘‘ శ్రీరంగ పట్టణం ఆదర్శంగా తీసుకుని ఆ వైష్ణవ సంప్రదాయం తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అవకాశం కల్పించాము. 23 మంది పీఠాధిపతులు హర్షించారు. జనవరి 8 న జరిగిన జరిగిన తొక్కిసలాట పై కంటి తుడుపు చర్యలు కు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసింది.సంఘటన జరిగిన తర్వత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన పై ఈవో ఛైర్మన్ల మధ్య అవగాహన లేదు, క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఆరోజు గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారు.చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తమకు కావాల్సిన వారితో సాక్షులు ఇప్పించారు హరినాథ్ రెడ్డి, రమణ కుమార్లను బలి ఇచ్చారు. అసలు నిందితులను వదిలి వేశారు. ఆరు మంది చనిపోయి, 50 మందికి పైగా తీవ్ర గాయాలు ఐతే పాక్షికంగా నివేదిక ఇచ్చారుఆ నివేదికను దురుద్దేశ పూర్వకంగా ఇచ్చిన నివేదికగా వైఎస్సార్సీపీ భావిస్తోంది. విజిలెన్స్ నివేదికలు బట్టి చూస్తే.. చంద్రబాబు నియమించిన ఏ విచారణ అయిన ఒక కేస్ స్టడీగా చేశారు. ఆయన కోరుకున్నట్లుగానే విచారణ కమిషన్ ఫలితం వస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ.హరినాధ రెడ్డికు 21.12.24 నా జరిగిన సమావేశంలో సూర్య ప్రకాష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు సమాన బాధ్యత ఇచ్చారులా అండ్ ఆర్డర్, విజిలెన్స్ వాళ్లకు క్యూ లైన్ బాధ్యతలు ఇచ్చారు. అండ్ ఆర్డర్ బాధ్యత ఎస్పీ, సీవీ అండ్ ఎస్వో ది కూడా బాధ్యత. వైఎస్సార్సీపీ పాలనలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగలేదు.జనవరి 10, 11, 12 తేదీలు మాత్రమే ఎస్ఎస్డీ టోకెన్లు ఇస్తామని చెప్పారు. అధికార యంత్రాంగం ఈ ఘటనకు కారణం, దీనికి సమాధానం లేదు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాట ఘటన జరిగితే ఈవోనే బాధ్యత వహించాలని గతంలో చందన ఖాన్ ఒక నివేదిక ఇచ్చారు. కౌంటర్ల వద్ద విధుల్లో ఉన్న వారిని ఎలా చర్యలు తీసుకుంటారు? క్యూ లైన్లో హోల్డింగ్ పాయింట్ అనేది ఎందుకు పెట్టారు.తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు చోద్యం చూశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీ బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమీషన్ నివేదిక సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. మా పాలనలో వైకుంఠ ఏకాదశికు పదిలక్షలు మందికి దర్శనం చేయించాము. 23 మంది పీఠాధిపతులు స్వహస్తాలతో ఇచ్చిన సూచన ప్రకారం పదిరోజుల దర్శనం జరిగింది.పీఠాధిపతులు ఆలోచనలను పక్కన పడేస్తారా.. కేసులు పెట్టాలనే , జైలుకు తరలించాలని చూస్తున్నారు.నా గొంతు కోస్తే తప్ప నేను పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 68,838 మంది స్వామిని దర్శించుకున్నారు. 22,212 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.49 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
అక్రమ అరెస్టులతో భయపెట్టలేరు
తిరుపతి రూరల్ : వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, అక్రమ అరెస్టులతో ఎవ్వరినీ భయపెట్టలేరని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్న ఆయన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. లిక్కర్ స్కాం కేసులో నెల రోజులుగా చెవిరెడ్డిని జైలులో బంధించడాన్ని ఆయన తప్పుబట్టారు. చెవిరెడ్డి, మిథున్రెడ్డి వంటి వ్యక్తులను జగనన్నకు దూరం చేయాలని కుట్రలు పన్నుతూ తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ● మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి -
అద్భుతం.. అభినయోత్సవం
తిరుపతి కల్చరల్ : అభినయ ఆర్ట్స్ జాతీయ నాటక పోటీలలో భాగంగా మహతి కళాక్షేత్రంలో గురువారం ప్రదర్శించిన శాసీ్త్రయ, జానపద నృత్యాలు, పౌరాణిక, సాంఘిక నాటికలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. మధిర శ్రీసుమిత్ర యూత్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన శ్రీయయాతిశ్రీ పౌరాణిక పద్యనాటకం సందేశాత్మకంగా సాగింది. చైతన్య కళాభారతి వారు ప్రదర్శించిన శ్రీ స్వప్నం రాల్చిన అమృతంశ్రీ సాంఘిక నాటిక వీక్షకులను చైతన్యపరిచింది. గురజాడ కళామందిర్ వారు ప్రదర్శించిన శ్రీమహాప్రస్థానం శ్రీ సాంఘిక నాటిక అలరించింది. ఈ సందర్భంగా కళాకారులను అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బీఎన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. -
అభిమానం.. అగ్రపథం
ఉమ్లింగ్లా రహదారి పక్కన ఎగురుతున్న వైఎస్సార్సీపీ జెండావైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం జెండాతో మనోజ్ రెడ్డిజననేత జగనన్నపై అభిమానం ఉప్పొంగింది. పేదలకు అండ వైఎస్సార్సీపీ జెండాను అగ్రపథాన నిలిపింది. ప్రపంచంలోనే ఎత్తయిన జమ్ము పరిధిలోని ఉమ్లింగ్లా రహదారిపై పార్టీ పతాకాన్ని రెపరెపలాడించింది. వివరాలు.. నాయుడుపేటకు చెందిన వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి భాస్కర్రెడ్డి తనయుడు మనోజ్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆయన రెండు రోజుల కిందట జమ్మూ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో సముద్ర మట్టానికి 19,024 అడుగుల్లో నిర్మించిన ఉమ్లింగ్లా రహదారిపై ప్రయాణం సాగించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి పార్టీపై మమకారం చాటుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమంటూ హర్షం వ్యక్తం చేశారు. – నాయుడుపేట టౌన్ -
మట్టి అక్రమ రవాణా
● ప్రైవేటు వెంచర్లకు తరలింపు ● ఎమ్మెల్యే అనధికార పీఏ హస్తం టాస్క్ఫోర్స్ : మట్టి మాఫియా కాసులు కురిపిస్తోంది. అధికారం మాటున అక్రమ రవాణా సాగుతోంది. మైనింగ్ , రెవెన్యూ, పోలీసు అధికారుల కళ్లెదుటే పెద్ద సంఖ్యలో వాహనాల్లో మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తొట్టంబేడు మండలంలో విరుపాక్షపురం చెరువులో మట్టి తవ్వి ట్రాక్టర్లతో శ్రీకాళహస్తి మండలంలోని పెనుబాకలో ఓ ప్రైవేట్ వెంచరుకు వందల ట్రాక్టర్లు తరలిస్తున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండడతో అక్రమ రవాణాను అడ్డుకునే వారే లేకుండా పోయారు. సాక్షాత్తు ఎమ్మెల్యే అనధికారిక పీఏ ఈ అక్రమ రవాణాలో పాత్ర ఉండడంతో అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయడం లేదు. చెరువుల నుంచి వందల ట్రాక్టర్లు మట్టి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. దరఖాస్తుల ఆహ్వానం తొట్టంబేడు: కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ పరిధిలో పనిచేస్తున్న బీడీ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాళహస్తి బీడీ కార్మికుల వైద్యాధికారి డాక్టర్ వెంకట భాస్కర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 31లోపు, ఇంటర్ డిగ్రీ, ఐఐటీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులు అక్టోబరు 31న నాటికి సంబంధిత వైబ్సెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
సిబ్బందిని భర్తీ చేయాలని రైతుల నిరసన
వరదయ్యపాళెం : మండల వ్యవసాయ కార్యాలయంలో ఖాళీగా ఉన్న సిబ్బందిని తక్షణమే భర్తీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం మండల వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది లేని కారణంగా ఈ–క్రాప్ నమోదు సకాలంలో జరగడం లేదని రైతులు వాపోయారు. ఈ–క్రాప్ నమోదు కానందున రైతులు గిట్టుబాటు ధర కోల్పోతున్నారని ఆవేదన చెందారు. ప్రస్తుతం సీఎల్ఎన్పల్లి, ముస్లింపాళెం, మరదవాడ, లక్ష్మీపురం, కళత్తూరు ప్రాంతాల్లో వరి పంట సాగు చేసి ఉన్నారని, ఆ పంటకు సంబంధించి ఈ–క్రాప్ నమోదు చేయడంలో వ్యవసాయశాఖ అలసత్వం వహిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత కారణాన్ని చూపుతున్నారని రైతులు తెలిపారు. దీని వల్ల రైతులు ఒక్కో బస్తా మీద రూ. 300 వరకు రేటు కోల్పోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందారు. రైతు సేవా కేంద్రాలకు క్షేత్రస్థాయి సిబ్బందిని నియమింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తూ మండల వ్యవసాయశాఖ అధికారిణి గౌరికి వినతిపత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమంలో సీఎల్ఎన్పల్లి మాజీ సర్పంచ్ రవిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మోహన్ తదితరులు ఉన్నారు. రమణమూర్తికి పురస్కారం చంద్రగిరి : తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల గణాంక శాస్త్రం కంప్యూటర్ అనువర్తనాలు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రమణమూర్తికి మెరిటోరియస్ టీచర్ అవార్డు లభించింది. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 57వ వార్షిక స్నాతకోత్సవం గురువారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా డాక్టర్ రమణమూర్తి మెరిటోరియస్ టీచర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎంవీ రమణ, బోధనా, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఉల్లాస్–అక్షరాంధ్రను పటిష్టం చేద్దాం తిరుపతి అర్బన్ : తిరుపతి జిల్లాలో ఉల్లాస్–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పటిష్టం చేద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్ నుంచి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2029 నాటికి జిల్లాలో వంద శాతం అక్షరాస్యతను సాధించాలన్నారు. 2025–26లో జిల్లాలో 88,687 మంది నిరక్ష్యరాస్యులను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. 2024–25లో 12,085 మందిని అక్ష్యరాస్యులుగా తయారు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 15 –59 ఏళ్లలోపు మహిళలు, పురుషులకు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుని అక్ష్యరాస్యతను పెంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య శాఖ అధికారి మహమ్మద్ ఆజాద్, జిల్లా వయోజన శాఖ నోడల్ అధికారి ప్రసాద్, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, మెప్మా పీడీ రవీంద్ర, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఈవో కేవీఎన్ కుమార్, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి పాల్గొన్నారు. ఆటో బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు – మానవత్వం చాటిన కలువాయి జెడ్పీటీసీ కలువాయి(సైదాపురం) : ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో అటు వైపు వెళుతున్న కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్కుమార్రెడ్డి స్పందించి గాయపడిన మహిళలను ఆస్పత్రిలో చేర్పించి.. మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన మండలంలోని తోపుగుంట సమీపంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల మేరకు.. మండలంలోని తోపుగుంట సమీపంలో ఓ ఆటో బోల్తా పడటంతో అందులోంచి వెంకటరెడ్డిపల్లికి చెందిన జంగాల కాలనీకి చెందిన విభూధి పుల్లమ్మ తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలోనే అటు వైపు వెళుతున్న కలువాయి జెడ్పీటీసీ అనిల్కుమార్రెడ్డి ఘటనా స్థలం వద్ద ఆగి ఆటోను పక్కకు తీసియించారు. 108కు కాల్ చేయగా ఆ వాహనం మరమ్మతులకు గురి అయిందంటూ సమాచారం అందజేయడంతో మరో ఆటో ద్వారా గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ కోటయ్య సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
పాఠశాల విలీనం ఆపాలని ఆందోళన
నారాయణవనం : మండలంలోని తుంబూరు దళితవాడ ప్రాథమిక పాఠశాల విలీనాన్ని విరమించుకోవాలని పిల్లలతో కలిసి తల్లిదండ్రులు, ఏఎస్ఎఫ్ఐ నేతలు గురువారం తహసీల్దార్, మండల విద్యాధికారి కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. ఊరి బడిలోనే పిల్లలు చదువుకునే వెసులుబాటును కల్పించాలని, పిల్లలను చదువుకు దూరం చేయొద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీటీ భాను ప్రకాష్, ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వేర్వేరుగా వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఉదయ్ కుమార్, మహేష్, తల్లిదండ్రులు మాట్లాడుతూ.. విలీనం పేరుతో పాఠశాలలను మూసివేయడం, డీ గ్రేడ్ చేయడం దారుణమన్నారు. తుంబూరు డళితవాడ పాఠశాలలో చదు వుతున్న 56 మంది విద్యార్థులను పది మంది విద్యా ర్థులే ఉన్న పాఠశాలలో విలీనం చేయడం సరైన విధా నం కాదన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యాసాగర్, ఇందుమతి, సారా,భాగ్యరాజ్, గోవిందయ్య, ప్రసాద్, మునివేలు, కుప్పలు, చంద్రయ్య, రవి, రాము, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
అత్తతో పాటు భార్యనూ కడతేర్చేందుకు వ్యూహం
నాయుడుపేటటౌన్ : భార్య కాపురానికి రాలేదని దీనికి అడ్డుగా ఉన్న అత్త సగటూరు చెంగమ్మ(47)తో పాటు భార్య స్వాతిని హత్య చేసేందుకు భర్త బోడెద్దుల వెంకయ్య పథకం రూపొందించుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. పోలీసుల కథనం మేరకు.. వెంకయ్య పథకం ప్రకారమే మంగళవారం నెల్లూరులోని కుమార్తె ఇంటి వద్ద ఉన్న అత్త చెంగమ్మకు ఫోన్ చేసి తాను పురుగుమందు తాగి చనిపోతున్నట్లు చెప్పాడన్నారు. దీంతో చెంగమ్మ నెల్లూరు నుంచి బయలు దేరి మంగళవారం మధ్యాహ్నం పండ్లూరు గ్రామం వద్ద దిగి అక్కడ నుంచి ఆటోలో వచ్చి తుమ్మూరు గ్రామ స్వర్ణముఖి నది బ్రిడ్జి సమీపంలోని నది కట్ట మీద నిలబడి ఉన్న అల్లుడు వెంకయ్య వద్దకు చెంగమ్మ చేరుకున్నట్లు తెలిపారు. ఆమైపె కోపంతో ఉన్న వెంకయ్య ఒక్కసారిగా అతడి వద్ద ఉన్న కత్తితో అత్తను కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నది కట్టపై నుంచి చెంగమ్మ మృతదేహాన్ని కిందకు తోసేసి తిరిగీ పండ్లూరు గ్రామానికి వచ్చి పార తీసుకుని రాత్రి స్వర్ణముఖి నది వద్దకు వెళ్లి చెంగమ్మ మృతదేహాన్ని నదిలో పూడ్చి పెట్టాడన్నారు. మంగళవారం రాత్రి అయ్యప్పరెడ్డి పాళెం గ్రామంలోని చెంగమ్మ ఇంటి వద్దకు వచ్చి భార్య స్వాతి కోసం వెతికాడన్నారు. భార్య ఇంటి వద్ద ఉండి ఉంటే ఆమెను కూడా హత్య చేసేవాడని పోలీసులు తెలిపారు. వెంకయ్యను బుధవారం ఉదయం గ్రామస్తులు పట్టుకుని నిలదీయడంతో జరిగిన విషాయాన్ని వెల్లడించినట్లు మృతురాలి కుమార్తెలు స్వాతి , అనిత, సుకన్యతో పాటు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముఖ్యంగా వెంకయ్యతో పాటు మరో ఇద్దరు లేక ముగ్గురు కలిసి చెంగమ్మను హత్య చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తూ సీఐ బాబికి వారు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు చెంగమ్మ హత్యపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. నిందితుడు వెంకయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వెల్లడించారు. కుటుంబ సభ్యుల రోదనలు అల్లుడి చేతిలో హత్యకు గురైన అత్త చెంగమ్మ మృతదేహానికి పోస్టుమార్టం జరిపి గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహానికి పోస్టుమార్టం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలి
తిరుపతి అర్బన్ : బాల్యవివాహాల నిర్మూలనకు ఽఅధికారులు సమష్టిగా కృషి చేయాలని బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యురాలు పద్మావతి వెల్లడించారు. కలెక్టరేట్లో గురువారం ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ పరిధిలో వారు బాల్య వివాహాలకు ఎక్కడికక్కడే అడ్డుకట్టవేయాలని పేర్కొన్నారు. బాలికతో పాటు వారి తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థి దశ నుంచే బాల్య వివాహాలతో వచ్చే అనర్థాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని చెప్పా రు. మరోవైపు బాలల హక్కులను వందశాతం అమ లు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్ల ల ట్రాఫింగ్, డ్రాప్ అవుట్స్, అశ్రద్ధ, బాల కార్మికుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు అన్వేషణ చేయాల్సి ఉందని తెలిపారు. పాఠశాల పరిధిలోనే 12 రకాల కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ అండ్ హైజీన్, స్కూల్ మానిటరింగ్, పీడీఏ కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ గౌరీశంకర్రావు, ఐసీడీఎస్ పీడీ వసంత బాయి, కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
క్షేత్ర సహాయకుడిపై హత్యాయత్నం
రేణిగుంట : మండలంలోని కరకంబాడి పంచాయతీ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న నవీన్పై బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించారు. అర్బన్ సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అర్బన్ పోలీసుల కథనం మేరకు.. కరకంబాడి పంచాయతీ పరిధిలోని దొడ్ల మిట్టలో నివాసం ఉంటున్న నవీన్ ఉపాధి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు నవీన్తో పలుమార్లు ఘర్షణ పడినట్లు తెలిపారు. అందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నవీన్ నూతనంగా రిలీజ్ అయిన ఓ సినిమాకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి బెడ్ రూమ్లో కిటికీ తీసి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గమనించిన నవీన్ కేకలు వేస్తూ బయటకు పరుగులు తీయగా నిప్పు పెట్టి వెళుతున్న వారిని గుర్తించాడు. ఘటనపై అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు నవీన్ మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకే ఇంటికి నిప్పు పెట్టారని , రామాంజనేయులు, ఆదినారాయణ, అనురాధ ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధం అనుమానమే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
మిథున్రెడ్డి అరెసుపై నిరసనలు
కేవీబీపురం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని వైఎస్సార్సీపీ సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్ అన్నారు. ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ కేవీబీపురం మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి నూకతోటి రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అమలు చేయలేక వాటిని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అక్రమ కేసుల్లో జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు నీరుపోసి పెంచి పోషిస్తున్న కేసులే రేపటి రోజున వారిని చుట్టు ముట్టి ఊపిరాడనీయకుండా చేస్తాయని హెచ్చరించారు. టీడీపీ కవ్వింపు చర్యల పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని రాజేష్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు గవర్ల కృష్ణయ్య, ధనుంజయరెడ్డి, బొర్రా మాధవీరెడ్డి, లాల్బాబుయాదవ్, దశరథరామిరెడ్డి, చందురెడ్డి, నంద కుమార్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీలు అయ్యప్పరెడ్డి, సర్పంచ్ గిరిబాబు, మైనారిటీ సెల్ నేతలు, బీసీ సెల్ నేతలు పాల్గొన్నారు. -
అంధ క్రీడాకారుడికి కలెక్టర్ అభినందన
తిరుపతి అర్బన్ : బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏపీ తరపున గోల్బాల్ భారత్ జట్టుకు ఎంపికై న ముప్పాళ్ల శేషగిరిని కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు. గురువారం కలెక్టరేట్లో బ్లైండ్ స్పోర్ట్స్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి పెంచల నరసయ్య ఆధ్వర్యంలో ముప్పాళ్ల శేషగిరి కలెక్టర్ను కలిశారు. ఈ క్రమంలో కలెక్టర్ వారిని అభినందించి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. శ్రీవారి దర్శించుకున్న ప్రముఖులు తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. టీటీడీ అధికారు లు లడ్డూ ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. -
సుదర్శన్ నాయుడు కుటుంబానికి ఆర్కే రోజా పరామర్శ
సాక్షి, చిత్తూరు జిల్లా: నగరి రూరల్ మండలం వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ సుదర్శన్ నాయుడు కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. సుదర్శన్ నాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. మేలపట్టు గ్రామంలో ఆయన నివాసానికి వెళ్లిన ఆర్కే రోజా.. సుదర్శన్ నాయుడు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.సుదర్శన్ నాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదర్శన్ నాయుడు పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని.. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు. రోజా వెంట మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధం విభాగ అధ్యక్షులు ఉన్నారు. -
దారి కల్పించే వారేరీ?
● ఎంపీపీ ఆదేశాలతో గ్రామానికి వెళ్లిన అధికారులు ● రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక వెనుదిరిగిన వైనం సాక్షి, టాస్క్ఫోర్స్: పట్టా భూముల్లో దారి కావాలంటే కుదరదని చెప్పినందుకు ఆ ఇంటికి రాకపోకలు లేకుండా చేశారు.. కూటమి నేతలందరూ ఏకమై ఆ కుటుంబాన్ని వారం రోజులుగా బయటకు రానీయకుండా ని ర్భందించారు. అత్యవసరానికి సైతం వెళ్లడానికి వీలు లేకుండా గ్రామంలోని సిమెంటు రోడ్డుకు అడ్డుగా ఇ నుప కంచెను నిర్మించారు. ఆ ఇంటికి దారి కల్పించే బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో ఆ పనిచేయలేకున్నారు. గ్రామంలోకి వెళ్లి కళ్లారా అక్క డ జరుగుతున్న దుశ్చర్యలను చూసినప్పటికీ రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక దారి సమస్యను అలాగే వదిలేసి వెనుదిరిగారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లి పంచాయతీ బడగనపల్లిలో నివాసముంటున్న వెంకటరమణ ఇంటికి రాకపోకలు లేకుండా చేశారు. వారం రోజులకు పైగా ఆ ఇంట్లోని సభ్యులు ఎవరు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మండలస్థాయి అధికారులకు విన్నవించినా ఏ ఒక్కరు పట్టించుకోలేదు. దీంతో బుధవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రెడ్డెమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు కరుణాకర్రెడ్డి అధికారులను నిలదీశారు. బడగనపల్లిలో ఓ ఇంటికి దారి లేకుండా ఇనుప కంచె ఏర్పాటు చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజకీయ కక్షలతో ఓ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడం, అందుకు అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్వసభ్య సమావేశం ము గిసిన తరువాత ఎంపీడీఓ మదన మోహన్రెడ్డి, తహసీల్దార్ పరమేశ్వరస్వామి, ఎస్ఐ బాలకృష్ణలు ఆ గ్రా మానికి చేరుకుని దారికి అడ్డుగా ఏర్పాటు చేసిన ఇను ప కంచెను పరిశీలించారు. అసలు ఆ కంచె ఏర్పాటు చేయడానికి గల కారణాలను తెలుసుకుని పట్టా భూ ముల్లో శాశ్వత రోడ్డు కావాలంటే పట్టాదారు అనుమ తి కావాల్సిందేనని, అలా ఇవ్వనందుకు ప్రభుత్వ ని ధులతో నిర్మించిన సిమెంటు రోడ్డుపై కంచె ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని సూచించారు. అయినా సరే కంచెను తీసేదిలేదని కూటమి పార్టీలకు చెందిన వారు భీష్మించుకున్నారు. ఇంతలో స్థానిక ముఖ్యప్రజాప్రతినిధి నుంచి ఫోన్లు రావడంతో అధికారులు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. అనంతరం కొంతసేపటికి ఇనుపకంచెను తొలగించకుండానే వెనుదిరిగారు. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక వెనుదిరగాల్సి వస్తోందని బాధిత కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లడం గమనార్హం. -
నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి
తిరుపతి కల్చరల్:బ్లడ్ క్యాన్సర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన బిడ్డ వైద్యం కోసం దాతలు ఆర్థిక సాయం చేసి, తన బిడ్డ ప్రాణాలను కాపాడాలని చిన్నారి తల్లిదండ్రులు చెంగమ్మ, దేశయ్య మీడియా ముందు వేడుకున్నారు. బుధవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నారాయణవనం మండలం, నాగిలేరు గ్రామం యానాదిసెంటర్లో కాపురముండే తాము నిత్యం కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నామన్నారు. అయితే తన కుమారుడు మురళి(8)కు తీవ్ర జ్వరంతో అనారోగ్యం బారిన పడడంతో రుయా ఆస్పత్రిలో చికిత్స చేయించామని తెలిపారు. అయితే తన బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ అని గుర్తించిన వైద్యులు స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు రెఫర్ చేశారని తెలిపారు. స్విమ్స్లో తమ బిడ్డను పరీక్షించిన వైద్యులు బాబుకు టెస్ట్ చేయించాలని, అందుకు రూ.40వేలు ఖర్చు అవుతుందని, అంతేకాక బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యేందుకు సుమారు రూ.20 లక్షలు ఖర్చు పెట్టాలని వైద్యులు సూచించారని వాపోయారు. రోజువారీ కూలీ చేస్తే కాని బతుకు సాగని తమకు అంత డబ్బులు పెట్టి బిడ్డకు వైద్య చేయించే స్తోమత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు స్పందించి తగిన ఆర్థిక సాయం అందించి, తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని కన్నీటి పర్యవంతమయ్యారు. సాయం అందించే దాతలు తమ ఫోన్ నంబర్ 7780253548ను సంప్రదించి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
జాతీయ రహదారిపై అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్!
● ఆటోలో తరలించి విచక్షణా రహితంగా దాడి ● చికిత్స కోసం రుయాకు తరలించిన స్నేహితులు ● తిరుపతి రూరల్ పోలీసులపై జిల్లా ఎస్పీ ఆగ్రహం ● బాధితుని వాంగ్మూలంతో కేసు నమోదు చేసిన సీఐ సాక్షి, టాస్క్ఫోర్స్: పూతలపుట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై వందలాది వాహనాలు సంచరిస్తున్నా అర్ధరాత్రి ఓ యువకుడుని కిడ్నాప్ చేసి ఆటోలో తరలించారు. ఆపై విచక్షణా రహితంగా అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్ పంచాయతీకి చెందిన శశి యాదవ్, అతని స్నేహితుడు తాహిర్బాబాతో కలసి జాతీయ రహదారి వద్ద ఉన్న నిధి కేఫ్కు మంగళవారం అర్ధరాత్రి సమయంలో వెళ్లాడు. అక్కడ వాటర్ బాటిల్ తీసుకుని తాగుతుండగా కొందరు యువకులు అక్కడకు చేరుకుని శశియాదవ్ను బలవంతంగా కిడ్నాప్ చేసి ఆటోలో చంద్రగిరి మండలం తొండవాడ వద్ద ఉన్న ఓ ప్రైవేటు వెంచర్కు తీసుకెళ్లారు. శశియాదవ్ను కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్న ఆటోను కొంత దూరం నుంచి వెంబడించిన తాహిర్బాబా విషయాన్ని తమ స్నేహితులకు చేరవేశాడు. ఆ విషయం తెలుసుకున్న శశియాదవ్ స్నేహితులంతా తొండవాడ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కిడ్నాపర్లు శశి యాదవ్ను చచ్చేలా కొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంతలో శశియాదవ్ స్నేహితులు సంఘటన స్థలానికి చేరుకోవడాన్ని గమనించిన కిడ్నాపర్లు అక్కడ నుంచి పరారయ్యారు. శశియాదవ్ను స్నేహితులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. రాత్రంతా అంత గొడవ జరిగినా తెలుసుకోలేని తిరుపతి రూరల్ పోలీసులు బుధవారం ఉదయం కిడ్నాప్ వ్యవహారాన్ని తెలుసుకుని రుయా ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న శశియాదవ్ ద్వారా వివరాలు తెలుసుకుని స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. కిడ్నాప్నకు ప్రధాన కారణం ఇటీవల జాతరలో జరిగిన పాత కక్షలేనని నిర్ధారించుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించారు. శశి యాదవ్ను కిడ్నాప్ చేసిన వారిలో సంతు, తేజ, అజయ్, పునీత్తో ఆటు మరో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్టుగా గాయపడిన శశియాదవ్ పోలీసులకు వివరించడంతో వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. బాధితుని ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్ పోలీసులపై ఎస్పీ ఆగ్రహం జాతీయ రహదారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ బలవంతంగా ఒక యువకుడిని కిడ్నాప్ చేసి ఆటోలో తరలించి చచ్చేలా కొడుతున్నప్పటికీ గుర్తించలేకపోవడం, కనీస సమాచారం కూడా పోలీసులకు రాకపోవడంపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు తిరుపతి రూరల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అసలు రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై తిరగాల్సిన పెట్రోలింగ్ సిబ్బంది ఏమయ్యారు? జాతీయ రహదారిపై రాత్రి వేళ ఏం జరిగినా ఇలాగే వదిలేస్తారా? కనీసం ఆ నిధి కేఫ్ వారు కూడా పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్పీ ఆగ్రహంతో అప్రమత్తమైన తిరుపతి రూరల్ పోలీసులు హుటాహుటిన ఆ కేఫ్ వద్దకు చేరుకుని అక్కడ ఏం జరిగిందన్న దృశ్యాలను అక్కడి సీసీటీవీ పుటేజీ ద్వారా తీసుకుని బాధితుని వద్దకు వెళ్లి వాంగ్మూలం తీసుకున్నట్టు సమాచారం. -
ఖాళీ బిందెలతో ఆందోళన
రాపూరు: మండలకేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద గిరిజన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాపూరు సమీపంలోని ఆంజనేయపురం గిరిజనవాడలో రెండు వారాలు కిందట ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, ఈ విషయమై పలుసార్లు అధికారులకు విన్నవించినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విద్యుత్ లేకపోవడంతో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సుదూరంలోని బోరు వద్దకు వెళ్లి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీంతో ఖాళీ బిందెలతో సబ్స్టేషన్కు చేరుకుని, ధర్నా చేపట్టామన్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పా టు చేస్తామని ట్రాన్స్కో ఏఈ కార్తీక్ హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు. గొడ్డేరు వాగులో మృతదేహం వెంకటగిరి రూరల్: మండలంలోని చింతగుంట సమీపంలో ఉన్న గొడ్డేరువాగులో వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. ఎస్ఐ ఏడు కొండలు కథనం మేరకు.. చింతగుంట వాగు లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స మాచారం అందింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించగా పట్టణంలోని మూలసాలివీధికి చెందిన దొంతు మునెయ్య (50)గా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు. మునెయ్య వాగులోకి దిగి ప్రమాదవశా త్తు మునిగిపోయి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కేజీబీవీని సందర్శించిన సమగ్రశిక్ష ఏపీసీ గౌరీ శంకర్
తడ: జిల్లా సమగ్ర సర్వశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జీ గౌరీ శంకర్రావు ఇతర అధికారులతో కలిసి బుధవారం తడ కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల సిబ్బందితో సమావేశం నిర్వహించి, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, పదో తరగతిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా చూడాలని కోరారు. పిల్లలకు చక్కటి భోజనం, పరిశుభ్రమైన వాతావరణంలో పెట్టాలని, శుభ్రమైన తాగునీటిని అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ భువనేశ్వరి, జీసీడీఓ పుష్పలత, ఎంఈఓ మల్లి కార్జునరావు, అభయ హస్తం పల్లవి పాల్గొన్నారు. అన్యాయంగా జైల్లో పెట్టించారు! చిట్టమూరు: కూటమి నేతలు తనని అన్యాయంగా రెండు నెలలు సెంట్రల్ జైల్లో పెట్టించారని చిట్టమూరు మండలంలోని గునపాటిపాళేనికి చెందిన చిప్పల లక్ష్మమ్మ వాపోయింది. గ్రామంలో బుధవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ –మోసం గ్యారంటీ కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి నె ల్లూరు జిల్లా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వద్ద లక్ష్మమ్మ తన గోడు వెళ్లబోసుకుంది. గ్రామంలో తండ్రి కొడుకులు, గొడవలు చేసుకుంటే వారికి సర్ధి చెప్పేందుకు వెళ్లిన తనపై కూటమి నేతలు నాన్ బెయిలబుల్ కేసు పెట్టించి, ఏ తప్పు చేయకపోయినా వైఎస్సార్ సీపీ సానుభూతి పరులమైన తమ ముగ్గురిని జైల్లో పెట్టించారని కన్నీటీ పర్యంతమైంది. వైఎస్సార్ సీపీ మండల నాయకు లు, గ్రామంలోని నాయకుల సహాయ సహకారాలతో తాము బెయిల్పై బయటకు వచ్చామని వారికి కృతజ్ఙతలు తెలియజేసింది. -
చంద్రగిరి కోటలో అసెంబ్లీ స్పీకర్
చంద్రగిరి: మండలకేంద్రంలోని రాయలవారి కో టను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం సందర్శించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతి నగరంలో జరగనున్న జాతీయస్థాయి మహిళా సాధికారత కమిటీ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ మహిళా సాధికారత కమిటీ సభ్యులు, పార్లమెంటు మహిళా సాధికారత కమిటీ సభ్యులు, పార్లమెంట్ స్పీకర్, రాష్ట్రగవర్నర్, ముఖ్యమంత్రి ఇత ర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక కట్టడమైన చంద్రగిరి కోటను మహి ళా సాధికారత కమిటీ సభ్యులు సందర్శించునున్నారు. ఈ సమావేశాల ఏర్పాట్లపై తిరుపతికి వి చ్చేసిన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో కలిసి చంద్రగిరి కోటను సందర్శించారు. చంద్రగిరి కోట ప్రాశస్త్యాన్ని, విశేషాలను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్కు వివరించారు. చంద్రగిరి కోటను సందర్శించే మహిళా సాధికారత కమిటీ సభ్యులకు చంద్రగిరి కోటలో మ్యూజికల్ లైట్స్ షోను ఏర్పాటు చేస్తామని, అలాగే ఆ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వారికి పసందైన విందును ఏర్పాటు చేస్తామని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే అతిథుల కోసం ఏర్పాటు చేసే ఆంధ్ర ఆతిథ్యం అదిరిపోవాలని స్పీకర్ సూచించారు. చంద్రగిరి కోట ఆవరణలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. -
ఇల్లరికం అల్లుడు.. అత్తను చంపేశాడు
తిరుపతి జిల్లా: తల్లిదండ్రులు లేని వ్యక్తికి కూతురిని ఇచ్చి ఇల్లరికం తెచ్చుకుని కొడుకుతో సమానంగా చూస్తున్న అత్తనే అల్లుడు హతమార్చాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని తుమ్మూరులో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అయ్యప్పరెడ్డిపాళేనికి చెందిన సగటూరు చెంగమ్మ(47) మూడో కుమార్తె స్వాతిని పండ్లూరుకి చెందిన బోడెద్దుల వెంకయ్యకు ఇచ్చి వివాహం చేసింది. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే వెంకయ్యను చెంగమ్మ ఇల్లరికం పెట్టుకుని కుమార్తెతో కలిసి ఉంటోంది. వెంకయ్యకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. వెంకయ్యకు మూడు నెలల క్రితం కొన్ని వ్యాధులు సోకడంతో ఇంటి నుంచి పంపించేశారు. అయితే అల్లుడికి అన్ని విధాలుగా అత్త సహాయ సహకారాలు అందిస్తోంది. భార్యతో కాపురం చేయనివ్వడం లేదని కక్ష పెట్టుకున్న వెంకయ్య.. మంగళవారం మధ్యాహ్నం చెంగమ్మకు ఫోన్చేసి మాట్లాడాలని రమ్మన్నాడు. నెల్లూరు నుంచి వస్తున్న చెంగమ్మ స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో అల్లుడితో మాట్లాడేందుకు దిగింది. అత్త మీద కోపంగా ఉన్న వెంకయ్య ఒక్కసారిగా కత్తితో ఆమెపై విచక్షణారహితంగా గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఎవరూ గుర్తించకుండా ఆమెను స్వర్ణముఖి నది కట్టమీద నుంచి కిందకు తోసేశాడు. మంగళవారం రాత్రి ఆమెను నదిలో పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్టు బుధవారం ఉదయం అయ్యప్పరెడ్డిపాళేనికి వెళ్లాడు. అనుమానం వచి్చన గ్రామస్తులు వెంకయ్యను నిలదీయడంతో చెంగమ్మను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. నాయుడుపేట పోలీసులు వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అత్త మృతదేహాన్ని స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో నదిలో పూడ్చిపెట్టినట్లుగా పోలీసులకు వివరించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మహాశక్తికి
సంస్కృత వర్సిటీలో అనిర్బన్ జాతీయ సంస్కృత వర్సిటీని కేంద్ర హోం మంత్రిత్వశాఖ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయ అధికార భాష డీడీ సందర్శించారు. దారి కల్పించే వారేరీ? రోడ్డుకు కంచె వేయడంతో ఓ ఇంటికి దారి లేకుండా పోయింది. మాకు దారి కల్పించేవారేరీ అని బాధితులు అంటున్నారు.రేపటి నుంచి టీటీడీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు సర్వదర్శనానికి 12 గంటలుగురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025– 8లోనేను మారిన మనిషిని.. మహిళలను మహారాణులను చేస్తాను.. మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకంతో అతివలను అందలమెక్కిస్తాను.. అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటాను.. నా మాట నమ్మండి.. ఇదీ నాటి చంద్రబాబు మాట. మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రను అమ్మేయాల్సిందే.. ఇదీ నేటి వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట.. అంటే కూటమి సర్కారు ఆ పథకానికి మంగళం పాడేసినట్టేనన్న సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. అయితే అతివలు మాత్రం దీనిపై ఆగ్రహం వక్తం చేస్తున్నారు. ఆడబిడ్డల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని మండిపడుతున్నారు.హామీలు గుప్పించినప్పుడు తెలియలేదా మంత్రివర్యా! అధికార దాహంతో అలి వికాని హామీలను గుప్పించి మహిళలను మభ్యపెట్టి అధికారం చేపట్టారు. నా ఆడబిడ్డలకు అండగా ఉంటానంటూ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి తీరుతా అంటూ చంద్రబాబు ఎన్నికల సభల్లో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు మా వల్లకాదు అంటున్నారు. సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రాను అమ్మితేగాని ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమంటూ తేల్చిచెప్పడం విడ్డూరంగా ఉంది. హామీలు గుప్పించిన నాడు ఈ విషయం మంత్రి వర్యులకు తెలియదా.. కచ్చితం పథకం అమలు చేసి తీరాలి. లేదంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. –డాక్టర్ సాయిలక్ష్మి, ఐద్వా, జిల్లా కార్యదర్శి, తిరుపతి మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు కూటమి సర్కార్ ఎన్నికల హామీలను అమలు చేయకుంటే మహిళల ఆగ్రహానికి గురికాకతప్పదు. అధికారం కోసం మహిళలను మభ్యపెట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని షరతులు లేకుండా అమలు చేస్తామని చెప్పారు. నేడు అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నట్లు సైటెర్లు వేయడం కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనం. జిల్లాలో లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఎదురు చూస్తున్నారు. తక్షణం పథకాన్ని అమలు చేసి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేనిపక్షంలో మహిళలోకం తిరగబడే పరిస్థితి ఉంది. –ఆర్ ఆషా, పీడీఎస్ఓ, జిల్లా కార్యదర్శి, తిరుపతి మహిళలను మోసం చేయడం దారుణం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమని సాక్షాత్తు మంత్రి ప్రకటించడం ఆశ్చర్యమేసింది. ఎన్నికల సమయంలో అమలు చేయలేమని తెలిసీ హామీ ఇచ్చారంటే మహిళలను వంచించి మోసం చేసి ఓట్లు దండుకుని అధికారం చేపట్టాలనే ఏకై క లక్ష్యంతో హామీలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలోని ప్రతి ఇంట్లో మహిళ ఈ పథకం అమలు చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ కూటమి ప్రభుత్వం ఆశలపై నీళ్లు చల్లేసినట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలు చేపడితే ఏ ప్రభుత్వమైన మనుగడ సాగించడం కష్టమే. –శ్రవంతి, విద్యార్థి సంఘం నాయకురాలు, తిరుపతి తిరుపతి–కువైట్కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించాలి ● ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈఓతో ఎంపీ గురుమూర్తి భేటీ తిరుపతి మంగళం : తిరుపతి విమానాశ్రయం నుంచి కువైట్కు అంతర్జాతీయ విమాన సర్వీసు లు ప్రారంభించాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మ ద్దిల గురుమూర్తి కోరారు. బుధవారం ఢిల్లీలో ఎ యిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్తో ఆయన భేటీ అయ్యారు. తిరుపతి విమానా శ్రయం ప్రాధాన్యతను, అలాగే రాయలసీమకు చెందిన వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఎక్కువ గా ఉన్నారని, వారికి మేలు జరుగుతుందని ఆయనకు ఎంపీ వివరించారు. తిరుపతి నుంచి నేరుగా కువైట్కి వెళ్లే విమానం నడిపితే గల్ఫ్ వలసదారులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని, దీంతో ప్రయాణ సమయం, ఖర్చు తగ్గుతాయని ఆయనకి విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తికి అలోక్ సింగ్ సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. ఎట్టకేలకు ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు తిరుపతి సిటీ:ఎట్టకేలకు ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరిగింది. తొలి విడత జాబితా మంగళవారం విడుదల చేస్తామంటూ ప్రకటించిన అధికారులు సాంకేతిక కారణాలతో జాబితా విడుదల లో జాప్యమైనట్లు ప్రకటించారు. దీంతో మంగళవారం అంతా ఫోన్లకే పరిమితమైన తల్లిదండ్రు లు, విద్యార్థులకు నిరాశే మిగిలింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు తొలివిడత సీట్ల కేటా యింపు జాబితా విడుదలైంది. దీంతో తల్లిదండ్రు లు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తాము ఎంపిక చేసుకున్న కళాశాలలో సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 27వ తేదీలోపు సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. విధులకు హాజరు కాకుంటే తొలగిస్తాం తిరుపతి సిటీ: రేణిగుంట మండలం గుండ్రాలకాలువ పాఠశాలలో ఎస్జీటీగా విధుల నిర్వహిస్తున్న పి.దేవరాజులు 2022 జూన్ 27వ తేదీ నుంచి విధులకు హాజరుకావడం లేదని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ నుంచి పలుసార్లు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎంఈ ఓ లేఖలు పంపినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారన్నారు. సదరు టీచర్ మరో మూడు రోజుల్లోపు ఎంఈఓ కార్యాలయంలో హాజరై సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో వి ధుల నుంచి శాశ్వతంగా తొలిగిస్తామన్నారు. జిల్లాలో రూ.2,500 కోట్ల బకాయిలు జిల్లాలో 2024 గణాంకాల ప్రకారం 18 ఏళ్ల పైబడిన మహిళలు మొత్తం 10,23,177 మంది ఉన్నారు. బాబు సర్కార్ ఆడబిడ్డ నిధికి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గత ఏడాది కాలానికి రూ.2513.02 కోట్లు బకాయి పడింది. అంటే సరాసరి ఒక్కో మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు చెల్సించాల్సి ఉంటుంది. అయితే ఏడాదిగా పథకాల అమలులో గోల్మాల్ చేస్తూ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాల అమలుపై నోరుమెదపలేదు. ఇటీవల మంత్రి చాలా స్పష్టంగా ఆడబిడ్డనిధి పథకం అమలు చేసే పరిస్థితి లేదని బాహాటంగా చెప్పడంతో కూట మి సర్కార్ నైజం బయటపడిందని, రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేఖతను బాబు సర్కార్ ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు. తిరుపతి సిటీ: గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మారిన మనిషినంటూ జనాన్ని నమ్మించాడు. అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి.. అధికారం చేజిక్కించుకున్నాడు. అనంతరం హామీలను గాలికొదిలేసి నమ్మి ఓటు వేసిన మహిళలకు శఠగోపం పెట్టేశాడు. ఆడబిడ్డ నిధి పథకంతో ప్రతి కుటుంబంలోని 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తానని ప్రగల్భాలు పలికాడు. అయితే నేడు ఆడబిడ్డ నిధికి మంగళం పాడేస్తున్నట్లు మంత్రి ద్వారా సంకేతాలు పంపుతున్నారు. ఆడబిడ్డ నిధి పథకమా.. ఆంధ్రాను అమ్మాల్సిందే! సూపర్ సిక్స్ హామీల్లో ఆడపడుచులకు సంబంధించి మహాశక్తిలో భాగంగా బాబు ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ఏడాది గడుస్తున్నా నోరు మెదపలేదు. దీంతో ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారులే అన్న ఆశతో ఎదురు చూస్తున్న మహిళలకు ఒక్కసారిగా బాబు సర్కార్ ఝలక్ ఇచ్చింది. స్వయానా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఓ సభలో ఆడబిడ్డ నిధి అమలుపై ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రరాష్టాన్ని అమ్మే యాల్సిన పరిస్థితి వస్తుందని బహిరంగంగా ప్రకటించేశారు. దీంతో ఆడబిడ్డ నిధికి మంగళం పాడేశారని, తమను నమ్మించి మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలు మహిళలను బాధించాయి సార్వత్రిక ఎన్నికల్లో అధికార వాంఛతో కూటమి నేతలు మహిళలను మభ్యపెట్టి పథకాలను ప్రకటించి అమలు చేసి తీరుతామంటూ ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా పథకాల ప్రస్తావనే రావడంలేదు. ఆడబిడ్డ నిధిని నిర్వీర్యం చేశారు. లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న తరుణంలో మంత్రి బహిరంగ సభలు పథకం అమలు చేయాలంటే ఆంధ్రను అమ్మేయాలంటూ వెటకారంగా మాట్లాడటం మహిళలను ఎంతో బాధించింది. పథకం అమలు చేయకపోతే ఆంధ్రలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం కథ కంచికే. – శోభారాణి, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని, తిరుపతి ఆడబిడ్డ నిధిపై సైటెర్లు దారుణం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చకుండా మహిళలను వంచించడం దారుణం. ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలోని ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని కూటమి నేతలు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు ఆ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారు. మహిళలు ఎంతో నమ్మకంగా ఇచ్చిన అధికారాన్ని అంతే నమ్మకంతో ఇచ్చిన మాటకు కట్టుబడి పథకాలను అమలు చేయాలి. మంత్రి ఆడబిడ్డ నిధిపై సైటెర్లు వేస్తూ ఆంధ్రాని అమ్మాలంటూ మాట్లాడటం దారుణం. – సావిత్రి, గృహిణి, తిరుపతి ●తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండాయి. క్యూ నారాయణగిరి వరకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 79,467 మంది స్వామివారిని దర్శించుకోగా 28,642 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.42 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. ● 31 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు– 8లో– 8లోన్యూస్రీల్ఆడబిడ్డకు అధోగతేనా? అని అతివల మండిపాటు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రను అమ్మాల్సిందేనంటూ సైటెర్లు మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళాలోకం మహిళలను నమ్మించి మోసం చేసిన బాబు సర్కార్ ప్రజా తిరుగుబాటు ఖాయమని హెచ్చరిస్తున్న మహిళలు జిల్లాలో ఆడబిడ్డ నిధి వివరాలు నియోజకవర్గం ఆడబిడ్డ నిధికి అర్హులు ఏడాదిగా అందాల్సిన మొత్తం(కోట్లలో) తిరుపతి 1,22,357 220..24 చంద్రగిరి 1,32,553 238.59 శ్రీకాళహస్తి 1,19,650 215.37 వెంకటగిరి 1,12,321 202.17 సత్యవేడు 1,03,757 186.76 సూళ్లూరుపేట 1,10,990 199.78 గూడూరు 99,845 179.62 -
ప్రజాభిమానాన్ని ఆపలేరు
వరదయ్యపాళెం: అక్రమ అరెస్టులతో ప్రజాభిమానాన్ని ఆపలేరని వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ అన్నారు. బుధవారం వరదయ్యపాళెం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద ఆయన పార్టీ శ్రేణులతో కలసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అసలు మద్యం స్కాం ఎక్కడ జరిగిందని, ఎంపీ మిథున్రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి బీరేంద్ర వర్మ, మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు దయాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, చేనేత విభాగ రాష్ట్ర కార్యదర్శి బొప్పన తిలక్బాబు, రాష్ట్ర యువజన కార్యదర్శి శిబి చక్రవర్తి, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అబ్దుల్, జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి శోభన్ యాదవ్, సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు బందిల సురేష్ (బూత్ కమిటీ), వినోద్ యాదవ్ (యువజన), దుడ్డు వేణు (ఎస్సీ సెల్), దేవళ్ల మహేంద్ర (బీసీ సెల్), శివా యాదవ్ (ప్రచార కమిటీ), గిరిరెడ్డి (గ్రీవెన్స్ సెల్), మాజీ సర్పంచ్ కవిత తదితరులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ రాజకీయ కక్షతోనే మిథున్ రెడ్డి అరెస్టు సత్యవేడు: రాజకీయ కక్షతోనే రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ అన్నారు. బుధవారం సత్యవేడులో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సమీపంలో నిరసన తెలిపి, నేతాజీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ లేని మద్యం కేసు సృష్టించి.. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారన్న అక్కసుతో మిథున్ రెడ్డిని ఆ కేసులో ఇరికించారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, మండల కన్వీనర్ కే. సుశీల్కుమార్ రెడ్డి, పార్టీనాయకులు భానుప్రకాష్ రెడ్డి, కేవి. నిరంజన్రెడ్డి, ఏవీఎం బాలాజీ రెడ్డి, సర్పంచ్ పి. మంజుల, రమేష్, మస్తానీ, బి. సోమశేఖర్, సెంథిల్, పునిదకుమార్, కృష్ణయ్య, ఎంపీ రవి, వీడీ శరవనన్, పళణి, దయాళన్, శ్రీధర్ రెడ్డి, ఇస్మాయిల్, జోషఫ్, సోము, రాబిన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్కు సుస్తీ
తిరుపతి తుడా: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వ్యవస్థకు చంద్ర గ్రహణం పట్టింది. పాడైన ఎక్స్ప్రెస్ వాహనాలు, డ్రైవర్ల కొరత, చాలీచాలని వేతనాలు, ఆపై వేతనాల చెల్లింపులో అలసత్వం తదితర సమస్యలతో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో తల్లీబిడ్డ సురక్షితంగా ఇళ్లకు చేరడం అసాధ్యంగా మారింది. ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లపై దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.వేధిస్తున్న డ్రైవర్ల కొరతతల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను నడిపేందుకు సరిపడా డ్రైవర్లు లేరు. దీంతో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 29 వాహనాలు ఉండగా కేవలం 18 మంది మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. డ్రైవర్లకు చెల్లించే వేతనాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఒకటి రెండు నెలలకే డ్రైవర్లు నిలిచిపోతున్నారు. దీంతో తరచూ డ్రైవర్ల కొరత వేధిస్తోంది. ఉన్న డ్రైవర్లపై పనిఒత్తిడి పెరుగుతోంది. ఒక డ్రైవర్కి నెలకు రూ.8 వేల లోపే వస్తుండడంతో ఆవైపు మొగ్గు చూపడం లేదు. కనీసం రూ. 15 వేలు ఇవ్వకుంటే డ్యూటీలు చేయ లేమంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతాలు, పని ఒత్తిడితో సతమతమవుతున్నామని వారు తమ గోడును వెళ్లబోసుకున్నా రు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.వాహనాలు షెడ్డుకే పరిమితంతల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు చిన్నచిన్న రిపేర్లు రావడంతో మొరాయిస్తున్నాయి. దీంతో అవి మరమ్మతులకు నోచుకోక షెడ్డుకే పరిమితం అవుతున్నాయి. ఉన్న ఎక్స్ప్రెస్ వాహనాలను ఎక్కితే తల్లీబిడ్డలు సురక్షితంగా ఇళ్లకు చేరుతామా? లేదా అన్న భయం నెలకొంది. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సెల్లార్లో 8 వాహనాలు రిపేర్లతో మూలనపడ్డాయి. ఇం.ఇన్ నుంచి ఆయిల్ లీక్, టైర్లు అరిగిపోవడం వంటి ఇతర మరమ్మతులకు గురైన ఈ వాహనాలు తుప్పుపడుతున్నాయి. నిర్వహణ లోపంతో వాహనాలు కండిషన్లో లేవని డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఈ వాహనాల్లో తల్లీబిడ్డను ఇళ్లకు చేర్చడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తల్లీబిడ్డలకు అవస్థల ప్రయాణండ్రైవర్లు, వాహనాల కొరత కారణంగా ఉదయం పూట డిశ్చార్జ్ అయినా మధ్యాహ్నం తరువాత డిశ్చార్జ్ అయిన తల్లీబిడ్డలను ఒకేసారి ఒక్కొక్క వాహనంలో ఇద్దరు లేదా ముగ్గురిని తరలిస్తున్నారు. దీంతో వారు క్షేమంగా ఇంటికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వాహన డ్రైవర్లకు వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారు వాహనంలో ప్రయాణించిన బాలింతల బంధువులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా పలు రకాల అవస్థలు భరించలేక తల్లీబిడ్డలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి, ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సి వస్తోంది.డ్రైవర్ల వేతనాల చెల్లింపులో అలసత్వంతల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు నడపడానికి డ్రైవర్లు అసలే అరకొరగా ఉన్నారు. వారికి ఇచ్చే వేతనాలు చాలీచాలకుండా ఉన్నాయి. వాటి చెల్లింపులోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నెలనెలా జీతాలు అందకపోవడంతో పనిచేస్తున్న డ్రైవర్లు అవస్థ పడుతున్నారు. 4 నెలలుగా వేతనం అందకపోవడంతో ఉన్న డ్రైవర్లు సైతం విధులు నిర్వహించడానికి సుముఖత చూపడం లేదు. ఫలితంగా తల్లీబిడ్డ క్షేమంగా ఇల్లు చేరడం కష్టం అవుతోంది. దీంతో బాలింతలు, వారి బంధువులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. -
పురుగుల అన్నం ఎలా తినాలి?
మద్దిలపాలెం (విశాఖ)/తిరుపతి సిటీ: పురుగుల అన్నం ఎలా తినాలంటూ ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు మండిపడ్డారు. మెస్ నాణ్యత, ఇతర సమస్యలపై మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం వర్సిటీ ముఖ ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. మూడు రోజుల కిందట చికెన్లో పురుగులు కనిపించాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ల్లో నాణ్యత లేని, పురుగులు, కీటకాలతో కూడిన భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యుత్ బిల్లు, కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాలు మెస్ బిల్లుతో కలిపి విద్యార్థులపై భారం మోపుతున్నారని చెప్పారు. బయటి వ్యక్తుల చొరబాటు, అసాంఘిక కార్యకలాపాలతో మహిళా వసతి గృహాల వద్ద భద్రత కరువైందని వాపోయారు. ప్రహరీల నిర్మాణం, సెక్యూరిటీ పెంపునకు డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా తరగతులు ప్రారంభం కాలేదని, గెస్ట్ అధ్యాపకుల రెన్యూవల్ ప్రక్రియ జాప్యమే దీనికి కారణమని తెలిపారు. ఆర్వో ప్లాంట్లు, ఆధునిక కిచెన్, డైనింగ్ హాల్, కొత్త మంచాలు, కుర్చీలు, డిస్పెన్సరీలలో మందుల లభ్యత, గ్రంథాలయ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం వంటి అనేక సమస్యలను విద్యార్థులు ఏకరువు పెట్టారు. ‘ఇదేం రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. వీసీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరిస్తామని వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఇది నమ్మశక్యంగా లేదంటూ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు జోక్యం చేసుకుని, ఆగస్టు 21వ తేదీలోగా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.ఎస్వీయూ డీ మెస్ అన్నంలో వాన పాము!ఎస్వీయూ డీ మెస్లో బుధవారం రాత్రి భోజనంలో వాన పాము కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. 200 మందికిపైగా పీజీ విద్యార్థులు ప్రతి రోజు డీ మెస్లో ఆహారాన్ని స్వీకరిస్తారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా, విచారణ జరుపుతామంటూ దాటవేత ధోరణితో వ్యవహరిస్తుండటం పరిపాటిగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పరిస్థితి ఇలా తయారైందని చెబుతున్నారు. గతంలో పలుమార్లు ఆహారంలో జెర్రులు, పురుగులు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. వందల మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నాసిరకం భోజనాలను అందించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నేను సైతం ద్వారా మహిళకు ఇంటి నిర్మాణం
చిల్లకూరు:ఓ చానల్లో నిర్వహించిన నేను సైతం కార్యక్రమం ద్వారా ఓ మహిళకు ఇంటిని నిర్మించి ఇచ్చారు. గూడూరు రెండో పట్టణంలోని తిలక్నగర్ ప్రాంతానికి చెందిన ఉష అనే పేద మహిళ రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకోవడంతో పాటుగా భర్తను కోల్పోయింది. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో జీవనం కష్టంగా మారడంతో ఓ చానల్లో ప్రముఖ సినీ నటి మంచి లక్ష్మి చేపట్టిన నేను సైతం అనే కార్యక్రమంలో పాల్గొని, తన బాధను తెలియజేసింది. దీంతో ఆమెకు అండగా ఉండేలా ఇంటిని నిర్మించి ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం ఉష ఇంటికి సినీ నటి మంచు లక్ష్మి చేరుకుని, ఉష కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఉష మాట్లాడుతూ తన బాధలను గుర్తించి మంచు లక్ష్మి, మనోజ్ తనకు అండగా నిలిచి ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇచ్చారన్నారు. అలాగే తన కుమారుని చదువుకు సహాయం చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందుగా మంచు లక్ష్మి పట్టణంలోని సనత్నగర్లో ఉన్న బంధువులైన రవీంద్రరెడ్డి నివాసంలో కొంత సేపు గడిపి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. -
ఘాట్ సర్వీసులు వందశాతం కండీషన్లో ఉంచుకోండి
తిరుపతి అర్బన్: తిరుమల ఘాట్రోడ్డులో నడుపుతున్న ఆర్టీసీ సర్వీసులు వందశాతం కండీషన్లో ఉండేలా చూసుకోవాలని డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజనీర్ టి.బాలాజీ తెలిపారు. తిరుపతిలోని ఆర్టీసీ డీపీటీఓ కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని 11 డిపోలకు చెందిన మెకానికల్ ఇంజినీర్లు, మెకానికల్ సూపర్వైజర్లకు బస్సుల కండీషన్ను గుర్తించడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ సెప్టెంబర్ చివరి వారంలో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రతి డిపోలో 100 శాతం కండీషన్లో ఉండే సర్వీసులపై దృష్టి పెట్టాలని చె ప్పారు. తిరుమల ఘాట్లో 310 డీజిల్ బస్సులు, 50 విద్యుత్ బస్సులు తిరుగుతున్నాయని చెప్పారు. ఈ 360 సర్వీసులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనంతరం పలు ప్రైవేటు కంపెనీల నుంచి హజరైన ఇంజినీర్లు మాట్లాడుతూ బస్సుల కండిషన్పై ప్రత్యే క జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందుగా బస్సు కండీషన్ ఏలా ఉందో సులభంగా గుర్తించడానికి పలు చిట్కాలను ఆర్టీసీ ఇంజినీర్లకు తెలియజేశారు. అంతేకాకుండా ప్రమాదాల నివారణలో డ్రైవర్లతోపాటు మెకానిక్ల పనితనం చాల ఉందని చెప్పారు. వందశాతం బస్సును కండిషన్లో ఉంచడం ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. ఘాట్లో నడుస్తున్న సర్వీసుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్న కొత్త విడిభాగాలను ఏర్పాటు చేయడమే ఉత్తమంగా పేర్కొన్నారు. అవసరం అయిన మేరకు ఆర్టీసీ కొత్త విడిభాగాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అశోక్ లేలాండ్ కంపెనీ రీజినల్ సేల్స్ మేనేజర్ సూర్యనారాయణ బోనీ, సర్వీస్ ఇంజినీర్ వడివేలు, రామే పవర్ స్టీరింగ్ సిస్టమ్ ప్రతినిధులు అర్జున్, నాగరాజు, సర్వీస్ ఇంజినీర్ లూకాస్, టీవీఎస్ నుంచి సర్వీస్ ఇంజినీర్లు శ్రీనివాస్, జెడ్ఎఫ్ ఈఎంఆర్ నుంచి కన్నదాసన్, అమర్రాజా బ్యాటరీస్ నుంచి మధు, డబ్ల్యూఏబీసీఓ సంస్థ నుంచి సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
నిందితుని ఆచూకీ తెలిపితే రూ. 5లక్షలు నజరానా
వరదయ్యపాళెం: తమిళనాడులో సంచలనం కలిగించిన బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుని ఆచూకీ తెలిపిన వారికి రూ.5లక్షలు నజరానా ఇవ్వనున్నట్లు గుమ్మిడిపూండి డీఎస్పీ జయశ్రీ తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యల్లో భాగంగా వరదయ్యపాళెం మండలంలో పర్యటించిన డీఎస్పీ పత్రికా ప్రకటన ద్వారా వివరాలను తెలిపారు. తమిళనాడు రాష్ట్రం ఆరంబాకంలో ఓ బాలికను అపహరించి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. నలుగురు ఎస్పీల పర్యవేక్షణలో నాలుగు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం తరఫున రూ. 5లక్షలు నజరానా ఇస్తామని ఆమె వివరించారు. 9952060948 నంబర్కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుని చిత్రం -
వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువయ్యాయి!
వరదయ్యపాళెం: ‘దళిత నియోజకవర్గమైన సత్యవేడులో ఇటీవల వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి. సంపన్న వర్గాలు పెత్తనం చెలాయించేందుకు ఆత్రుత పడుతున్నారు. వారి కుతంత్రాలకు, కుట్రలకు నేను వెరవను. అన్నీ భగవంతుడు చూసుకుంటాడు.’అని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆవేదన చెందారు. వరదయ్యపాళెం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం జరిగిన అధికారుల సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 15 ఏళ్లుగా నియోజకవర్గంలో ప్రజాసేవకే పరిమితమయ్యానే తప్ప, ఇతర వ్యాపకాలు, వ్యాపారాలకు ఏనాడు కక్కుర్తి పడలేదన్నారు. అయితే తాను నియోజకవర్గంలో రెండో సారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో తనను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిందని, ఈ తరుణంలో నియోజకవర్గంలో ఎన్నికల పరిశీలకులని ఒకరు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్ అని మరొకరు, తాజాగా ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ అని ఇంకొకరు ఇలా సంపన్న వర్గాల వారు నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు తహతహలాడుతున్నారని విమర్శించారు. ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్గా నియమితులైన శంకర్రెడ్డి పదవి చేపట్టిన పది రోజులకే ఉన్న విభేదాలను ఇంకాస్త రెట్టింపు చేసి, ఇబ్బంది పెడుతున్నారే తప్ప సమన్వయం చేసి ఏకతాటిపై పార్టీని నడిపేందుకు ఏమాత్రం చొరవ చూపడం లేదన్నారు. తనకు, ఆయనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తామిద్దరం మంచి స్నేహితులే అయినప్పటికీ ఆయన వెంట ఉన్నవారు చెడు మార్గంలో నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేని శంకర్రెడ్డి ఆలోచనతో ముందుకు పోవాలని సూచించారు. 15ఏళ్లుగా నియోజకవర్గంలో ఒక్కో గ్రామాన్ని నాలుగు నుంచి ఐదు సార్లు తిరిగిన అనుభవం తనకుందని, అలాంటి తన ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో పర్యటిస్తూ వర్గవిభేదాలకు ఆద్యం పోస్తున్నారని ఆరోపించారు. తాను ఎక్కడా గ్రావెల్ గానీ, కాంట్రాక్ట్ పనులు గానీ, ఇసుక అక్రమ రవాణా గానీ, ఇతర అక్రమాలకు గానీ పాల్పడలేదని, అందుకు ఎక్కడైనా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తాను నిస్వార్థ సేవకుడిగా నియోజకవర్గ ప్రజలకు, అభివృద్ధికి కృషి చేస్తానే తప్ప ఇతర కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు తనకు చేతకావని ఎమ్మెల్యే ఆదిమూలం తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆవేదన -
సమష్టిగా పనిచేయాలి
● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతిని సాధించేలా పనిచేయాలి ● డీఈఓ కేవీఎన్ కుమార్ నాయుడుపేటటౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాలని తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్ సూచించారు. నాయుడుపేట విశ్వం జూనియర్ కళాశాలలో మంగళవారం గూడూరు డివిజన్లోని ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. ప్రభుత్వ సూచించిన మేరకు నూతన విద్యావిధానాలను విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వంద శాతం ఉత్తీర్ణతతో పాటు మంచి ఫలితాలు సాధించేందుకు ముందు నుంచే ప్రణాళికలను రూపొందించాలన్నా రు. పాఠశాలలో విధి విధానాలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ సమావేశంలో గూడూరు డీవైఈఓ సనత్ కుమార్, జిల్లా అడిషన ల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ గౌరీ ఽశంకర్, అకడమిక్ మానిటరింగ్ అధికారి శివశంకర్ పాల్గొన్నారు. -
స్వచ్ఛతలో మరింత ముందుకు
తిరుపతి తుడా: స్వచ్ఛ తిరుపతి పరపతిని మరింత ఇనుముడింపజేసేందుకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో మంగళవారం స్వచ్ఛత విజయోత్సవ సభ నిర్వహించారు. గత వారంలో స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తిరుపతి సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డును కై వసం చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తిరుపతి అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నూతన భవనం పూర్తి చేసేందుకు మరింత సమయం పడుతుందని, భవన నిర్మాణానికి అవసరమయ్యే నిధులను ఇప్పట్లో కేటాయించలేమని ఆయన చెప్పారు. తిరుపతిని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని, అవార్డు రావడం వెనుక అధికారుల కృషి, సిబ్బంది పనితీరు బాగుందని కొనియాడారు. అనంతరం కమిషనర్ మౌర్యాను గజమాలతో సత్కరించారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్లు, సిబ్బందిని వేదికపై సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి యువకుడి బలి
తిరుపతి రూరల్: మండలంలోని సాయి నగర్లో నివాసముంటున్న ఓ యు వకుడు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. సాయినగర్లో నివాసముంటున్న అశోక్కుమార్ (25) తిరుపతి నగరంలో ఎలక్ట్రీషియన్గా పనిచేసి, జీవనం సాగిస్తున్నా డు. దినసరి కూలీగా వెళ్లి వచ్చిన డబ్బులతో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లకు అలవాటు పడి అధిక అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి అతని తండ్రి చంద్రబాబుకు తెలియజేయగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ ఎస్ఐ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం దుకాణంలో చోరీ రాపూరు: కోటూరుపాడు మార్గంలో ఉన్న మద్యం దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం కేస్లను చోరీ చేసినట్లు నిర్వాహుకులు తెలిపారు. సోమవారం రాత్రి యథావిధిగా దుకాణానికి తాళాలు వేసి, వెళ్లామని, సిబ్బంది మంగళవారం ఉదయం షాపు తెరిచేందుకు రావడంతో తాళాలు పగలకొట్టి ఉండగా గుర్తించారు. షాపులోనికి వెళ్లి పరిశీలించగా 4 కేసుల 29 మద్యం సీసాలు, రూ.11,800 నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నిర్వాహుకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్వకేట్.. అడ్డంగా బుక్ అయ్యాడు! తిరుపతి రూరల్:ఆన్లైన్లో ఫేక్ మెసేజ్లు పంపి, సైబర్ చోరీలకు పాల్పడే నేరగాళ్లకు ఓ అడ్వకేట్ అడ్డంగా చిక్కాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ విద్యానగర్ కాలనీలో నివాసముంటున్న ఓ న్యాయవాది సెల్ఫోన్ నంబర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆ తరువాత అదే నంబర్కు ఏపీకే అప్లికేషన్ పంపడం, ఆ అప్లికేషన్ ఓపెన్ చేయగా మూడు అకౌంట్లకు సంబంధించిన నగదు 8 అకౌంట్లకు బదిలీ కావడంతో సదరు అడ్వకేట్ కంగు తినాల్సి వచ్చింది. ఆ వెంటనే బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ సైబర్ నేరగాళ్లు చాకచక్యంగా అడ్వకేట్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.3.50 లక్షలు కాజేశారు. ఆ వెంటనే సదరు అడ్వకేట్ 1930కు ఫిర్యాదు చేయగా మిగతా బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయించి, సైబర్ నేరగాళ్లు డబ్బులు డ్రా చేయకుండా చర్యలు తీసుకున్నారు. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● నెలరోజులకే...చిరిగిపోయిన స్కూల్ బ్యాగులు ● సొంత బ్యాగులతో పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులు ● ప్రభుత్వ బ్యాగులకు పిన్నులు వేసుకుని వెళుతున్న మరికొందరు
తిరుపతి సిటీ: ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నాణ్యమైన బ్యాగులు ఇచ్చామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కూటమి సర్కార్ డొల్లతనం బయటపడింది. విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసి కనీసం పట్టుమని నెలరోజులు కాకముందే బ్యాగులు చిరిగిపోయి మూలన పడేసి, సొంత బ్యాగులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. మరికొందరి బ్యాగులకు కుట్లు ఊడిపోవడం, జిప్లు పోవడంతో గుండుపిన్నులు వేసుకుని పాఠశాలకు వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏదో చేసేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం మాయమాటలు చెబుతూ ఇంత అధ్వాన్నంగా నాసిరకం బ్యాగులను సరఫరా చేయడం దారుణమని తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఇదే పరిస్థితి నెలకొంది. నెలరోజులకే సుమారు 40 శాతం మంది విద్యార్థులు తమ సొంత బ్యాగులను పాఠశాలకు తీసుకువెళ్లుతున్నారు. -
తిరుపతికి రిక్తహస్తం
రక్షణ ఛత్రం.. ● ప్రధాన రైల్వేస్టేషన్లలో ముఖగుర్తింపు సాంకేతికత అమలు ● తిరుపతికి లభించని చోటు ● ప్రస్తుత పాలకుల తీరుకు నిదర్శనం ప్రయాణికుల భద్రత..రక్షణతోపాటు నేర నియంత్రణ.. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా.. ఉగ్రవాద మూకలకు అడ్డుకట్ట వేయడంలో ముఖగుర్తింపు సాంకేతికత అమలు ఎంతో కీలకం. ఈ టెక్నాలజీని రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలు చేస్తోంది. అయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి రైల్వేస్టేషన్లో మాత్రం ఆ సాంకేతికత అమలు చేయడం లేదు. ఇందుకు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం.. ఉదాశీనతే కారణమని తిరునగరి వాసులు ఆరోపిస్తున్నారు. తిరుపతి అన్నమయ్యసర్కిల్: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని ఏడు ప్రధాన రైల్వేస్టేషన్లలో ముఖగుర్తింపు సాంకేతికతను ప్రవేశపెట్టింది. న్యూఢిల్లీ, ముంబై, చైన్నె, హౌరా స్టేషన్లలో అ మలు చేశారు. ఈ టెక్నాలజీ అనుమానితులను గుర్తించి, భద్రతను పటిష్ట పరచడంలో సహాయపడుతుంది. ముఖ గుర్తింపు సాంకేతికత ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచి, టికెట్ తనిఖీలను వే గవంతం చేస్తుంది. అయితే ఈ సాంకేతికత అమలులో తిరుపతికి చోటు దక్కలేదు. తిరుపతికి లభించని చోటు ముఖ గుర్తింపు సాంకేతికత అమలులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి రైల్వేస్టేషన్కు చోటు ల భించలేదు. ఇది ప్రస్తుత పాలకుల తీరుకు అద్దం పడుతోంది. శ్రీవారి దర్శనార్థం నిత్యం దేశ నలుమూలల నుంచి ప్రతిరోజు సుమారు లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తిరుపతి రైల్వేస్టేషన్ ప్రయాణిలకుతో నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికితోడు ఇటీవల దీన్ని ప్రపంచ ప్రఖ్యాత మోడల్ స్టేషన్గా తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి ప్రముఖ రైల్వేస్టేషన్కు ముఖగుర్తింపు సాంకేతికతను ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ ఎందుకు మౌనంగా ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. క్రిమినల్స్ను గుర్తించే అవకాశం రైల్వే స్టేషన్లు రోజూ లక్షలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి చోట్ల దొంగతనాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరా లు, ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఎక్కువ. అందుకే ఈ టెక్నాలజీని ఉపయోగించడంతో క్రిమినల్స్ను ముందుగానే గుర్తించడం, అనుమానితుల్ని ట్రాక్ చేయడం, భద్రతను పెంపొందించడం సాధ్యమవుతుంది. ముఖ గుర్తింపు టెక్నా లజీ సాంకేతిక పురోగతిలో ఒక పెద్ద అడుగు. ఇది భద్రత పెంపొందించడంలో సహాయపడుతుంది. అయితే దీనికి సంబంధించిన గోప్యతా సమస్యలు, ఖర్చును, సాంకేతిక లోపాలను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖగుర్తింపు సాంకేతికత అంటే.. ఈ టెక్నాలజీ మన ముఖంలో ఉన్న లక్షణాలు, అందులో ముఖ్యంగా కళ్ల స్థానం, ముక్కు, నోరు, ముఖం ఆకారాన్ని గుర్తించి, వాటిని ఒక డేటాబేస్లో ఉన్న ఫొటోలతో పోల్చుతుంది. ఇది కృత్రిమ మేధస్సు (ఎ1), మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లపై ఆధారపడుతుంది. దీంతో నేర చరిత ఉన్నవారిని గుర్తిస్తుంది. -
మా పిల్లలకు చదువు వద్దు
నారాయణవనం: విలీనాన్ని నిరసిస్తూ మండలంలోని తుంబూరు దళితవాడ బడికి తల్లిదండ్రులు మంగళవారం తాళం వేసి, ఎవరూ ప్రవేశించకుండా ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. మా ఊరి బడిలో మా పిల్లలు చదువుకునే అవకాశం లేనప్పుడు మా పిల్లలకు చదువు అవసరం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇకపై టీచర్లు మా బడికి రావద్దంటూ పంపివేశారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ దళితవాడ ప్రాథమిక పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం బడుల విలీనంలో భాగంగా దళితవాడ పాఠశాలను ఫౌండేషన్ స్కూల్గా మార్చిందన్నారు. మా ఊరి పిల్లలు 46 మందిని కేవలం 16 మంది మాత్రమే చదువుతున్న సమీపంలోని గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు పంపివేశారని పేర్కొన్నారు. గ్రామంలోని బడిలో పిల్లలు లేకుంటే దళితవాడ బడి పిల్లలను ఎలా పంపుతారని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల పునఃప్రారంభంలో మూడు సార్లు నిరసన తెలిపినా అధికారులు స్పందించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే కేసులు పెడుతామని ఎంఈఓ హెచ్చరించడంతో మంగళవారం తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి, ఎవరూ లోపలికి ప్రవేశించకుండా ముళ్ల కంప వేశారు. పేద దళిత పిల్లల చదువు కోసం తామే స్వచ్ఛందంగా అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. ● బడికి ముళ్ల కంచె వేసిన తల్లిదండ్రులు -
పాలిటెక్నిక్ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు
స్నాతకోత్సవం నిర్వహించండి ఎస్వీయూ స్నాతకోత్సవం నిర్వహించాలని జీఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ నాయక్ కోరారు.పాలిటెక్నిక్.. ఇది సాంకేతిక విద్య.. విద్యార్థి ఉపాధికి చక్కని మార్గం.. అయినా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. మౌలిక వసతులు, ల్యాబ్లు, అవగాహన లేమి.. అధ్యాపకుల కొరత.. ప్రోత్సాహం కరువు తదితర కారణాలతో విద్యార్థులు ఆ కోర్సులో ప్రవేశానికి మొగ్గు చూపడం లేదు. ఫలితంగా పలు కళాశాలల్లో సీట్లు భర్తీకి నోచుకోక మిగిలిపోతున్నాయి. దీంతో కాలేజీల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ● పలు కళాశాలల్లో ప్రవేశాలు సింగిల్ డిజిట్కే పరిమితం ● అయోమయంలో పలు కళాశాలల భవితవ్యం బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025– 8లో●వంద శాతం ప్లేస్మెంట్ అవకాశాలు తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని బ్రాంచ్ల్లో పూర్థిస్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. లేటరల్ ఎంట్రీ సీట్లు మాత్రమే కొంత మేర మిగిలియాయి. ఇతర కళాశాలల బదిలీపై వచ్చే విద్యార్థులతో ఆ సీట్లు సైతం పూర్తి స్థాయిలో భర్తీ కానున్నాయి. కళాశాలలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికీ క్యాంపస్డ్రైవ్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత ఏడాది అన్ని బ్రాంచ్ల్లోని విద్యార్థులు వంద శాతం ప్లేస్మెంట్స్ సాధించారు. దీంతో పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. – వై.ద్వారకనాథరెడ్డి, ప్రిన్సిపల్, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తిరుపతి తిరుపతి సిటీ: అతి పిన్నవయస్సులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందే వృత్తి విద్యగా పేరుగాంచిన పాలిటెక్నిక్ కోర్సులకు ఆదరణ క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఏపీ పాలిసెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 6 ప్రభుత్వ కళాశాలలో అంతంత మాత్రంగానే అడ్మిషన్లు జరిగాయి. గూడూరు, సత్యవేడు కళాశాలలో 90 శాతం సీట్లు ఖాళీగా ఉండడం విశేషం. కేవలం తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే పూర్తి స్థాయి ప్రవేశాలు జరిగాయి. జిల్లాలో ప్రైవేటు కళాశాలలు సుమారు 11 వరకు ఉండగా అందులో 5 కళాశాలు ఇప్పటికే మూతపడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్న ఆరు కళాశాలలోనూ అడ్మిషన్లు 20 శాతం దాటకపోవడం గమనార్హం. నేటి నుంచి తుది విడత ప్రవేశాలు జిల్లాలోని పలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీ పాలిసెట్ ద్వారా ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో భాగంగా సోమవారం వరకు విద్యార్థులకు బ్రాంచ్, కళాశాల మార్పునకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ ఈ నెల 23వ తేదీ నుంచి తుది విడత ప్రవేశాల్లో భాగంగా కొనసాగనుంది. అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి వచ్చేనెల మొదటి వారంలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. తిరుపతి మహిళా పాలిటెక్నిక్లో సైతం దాదాపు అన్ని సీట్లు భర్తీ కాగా లేటరల్ ఎంట్రీ సీట్లు 15 మిగిలినట్లు సమాచారం. అలాగే పుత్తూరులోని పిల్లారిపట్టు, చంద్రగిరి పాలిటెక్నిక్ కళాశాలలో 80 శాతం సీట్లు భర్తీ కాగా గూడూరు, సత్యవేడు ప్రభుత్వ కళాశాలలో దాదాపు 90 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న ఆరు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో కళాశాలలోని కొన్ని బ్రాంచ్ల్లో ఒక్క అడ్మిషన్ జరగపోవడం విశేషం. న్యూస్రీల్నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కొరతే కారణం జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకులు కొరతతోపాటు, మెకానికల్, సివిల్, ట్రిపుల్ఈ, ఈసీఈ, సీఎస్ఈ వంటి కోర్సులకు అధ్యాపకుల కొరత వేధిస్తోంది. దీంతో పాటు అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు, స్కిల్డెవలప్మెంట్పై విద్యార్థులకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వకపోవడం, మౌలిక సదుపాయాల కొరతతో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్లేస్మెంట్ కల్పించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులు మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది. కోర్సు పూర్తి చేసుకున్న మెరిట్ విద్యార్థులకు బీటెక్లో ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా అడ్మిషన్లు చేపడితే తప్ప వృత్తి విద్య కోర్సు పాలిటెక్నిక్కు మునుపటి ఆదరణ లభించదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. అవగాహన లోపంతోనే అడ్మిషన్లు తగ్గుముఖం పాలిటెక్నిక్ విద్యపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు చాలావరకు అవగాహన లేకపోవడంతో ఆ దిశగా ఆలోచించడం లేదు. నీట్, ఎంసెట్ అంటూ కొన్ని ప్రైవేటు సంస్థలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మాయలో పడేసి వ్యాపారం చేసుకుంటున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులకు వంద శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్నాయి. ఎంబీబీఎస్, బీటెక్ చేసిన విద్యార్థుల కంటే డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు త్వరగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. –వాణిశ్రీ, కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారి, తిరుపతి క్యాంపస్ డ్రైవ్లు లేమి పాలిటెక్నిక్ డిప్లొమో చేసిన విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో అద్భుత అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీలలో మంచి ప్యాకేజ్తో ఉపాధి లభిస్తుంది. అయితే పలు కళాశాలల్లో క్యాంపస్ డ్రైవ్లు లేక ఉద్యోగాలు దొరకడం లేదు. దీనికితోడు డిప్లొమో కోర్సులను నడుపుతున్న విద్యాసంస్థల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు. ఈ దిశగా చర్యలు తీసుకుంటే ప్రతి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలు పెరుగుతాయి. –పరమేశ్వర్రావు, రిటైర్డ్ అధ్యాపకులు, తిరుపతి ప్రోత్సహించాలివృత్తి విద్యను అభ్యసించిన విద్యార్థులు 19, 20 ఏళ్లకే ఉద్యోగం సాధిస్తున్నారు. విద్యారంగంలో ఇంత చిన్న వయస్సులో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం సాధించేందుకు అవకాశం ఉన్న కోర్సు పాలిటెక్నిక్ ఒక్కటేనని చెప్పవచ్చు. అయితే ఈ విద్య వైపు విద్యార్థులను ప్రోత్సాహించాలి. ఆ దిశగా కిందిస్థాయి విద్యాసంస్థలు, తల్లితండ్రులు విద్యార్థులను ప్రోత్సహించడం లేదు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు నీట్, జేఈఈ శిక్షణ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. పాలిటెక్నిక్ విద్యను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – ప్రభాకర్రెడ్డి, ఓ ప్రైవేటు సంస్థ యజమాని, బెంగళూరు -
పీ4 లక్ష్యం దిశగా అడుగులు
తిరుపతి అర్బన్: ీప–4 లక్ష్యం దిశగా అడుగులు వేయడానికి సంపన్నులు ముందుకు రావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సర్కార్ పీ–4 ప్రాజెక్టును తీసుకొచ్చిందని వెల్లడించారు. సర్వేలో తేలిన లెక్క ప్రకారం జిల్లాలోని అన్ని బంగారు కు టుంబాలను దత్తత తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి పీ–4 లక్ష్యానికి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అట్టడుగు పేదరికంలోని 20 శాతం మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి మార్గదర్శకులు(దాతలు) ముందుకు రావాల ని కోరారు. అలాగే ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలకు తప్పకుండా పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలని చెప్పారు. ప్రధానంగా మండల, డివిజన్ స్థాయిల్లోను తప్పకుండా ప్రతి సోమ వారం గ్రీవెన్స్ నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోస్మాండ్, ప్రణాళిక విభాగం జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో బాలకృష్ణనాయక్, డీఏఓ ప్రసాద్రావు, డీఎస్వో శేషాచలం రాజు పాల్గొన్నారు. వైద్యసేవల ధరలు నోటీస్ బోర్డులో ఉంచాలి తిరుపతి తుడా: జిల్లా లోని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లు, ల్యా బ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహించే యజమానులు ప్రజలకు తెలిసేలా వైద్యసేవల ధరల పట్టికను నోటీసు బోర్డుల్లో తప్పక ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలో ఆ సంస్థ వారు అందించే ప్రతి సేవకు వసూలు చేసే ధరల వివరాలను స్థానిక, ఆంగ్ల భాషల్లో రిసెప్షన్ కౌంటర్లో కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించా రు. ఆస్పత్రి యాజమాన్యం వసూలు చేస్తే రేట్ల వివరాలను వారంలోపు demotirupati @gmail.comకు ఈమెయిల్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి విధిగా అందజేయాలని సూచించారు. వారం లోపు వివరాలను పంపని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ ఏటీ జీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 77,481 మంది స్వామివారిని దర్శించుకోగా 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.96 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల మ్యాగజైన్ ఆవిష్కరణ తిరుపతి సిటీ:ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘ఆరా ఆఫ్ ఆర్ట్స్ మ్యాగజైన్’ను వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, ప్రిన్సిపల్ ఆచార్య సుధారాణి మంగళవారం వర్సిటీలో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఎంతో గణనీయమైన చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఆర్ట్స్ వి భాగం కార్యాలయం ప్రకాశం భవనంలో ఉండడం, అలాగే ఆర్ట్స్ కళాశాల పేరు ప్రతిబింబించే లా ఆరా పేరుతో ఈ మ్యాగజైన్ తీ సుకుని రావ డం హర్షణీయమన్నారు. మ్యాగజైన్లో విద్యార్థు ల కవితలు, వ్యాసాలు, వివిధ శాఖల పురోభివృద్ధి, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో సాధించిన విజయాలు వంటి వాటితో ప్రకాశిస్తుందని, ఇది దాదాపు 200 పైచిలుకు పుటలు కలిగిన డాక్యు మెంటరీ వంటి పుస్తకమన్నారు. వైస్ ప్రిన్సిపల్ ఆచార్య భాస్కర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు ఆచార్య సుమకిరణ్, వార్డెన్ ఆచార్య ప్రయాగ, ఆచార్య రాజేశ్వరమ్మ, ఆచార్య అమీనుల్లా, డాక్టర్ ఓబులేసు, రాజు, శ్రీధర్ పాల్గొన్నారు. -
అక్రమ అరెస్టులతో అణచివేయలేరు
● ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు అనైతికం ● వైఎస్సార్ సీపీ సత్యవేడు సమన్వయ కర్త నూకతోటిబుచ్చినాయుడుకండ్రిగ: అక్రమ అరెస్టులతో వైఎస్సార్సీపీని అణచివేయలేరని వైఎస్సార్ సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ అన్నారు. మంగళవారం బుచ్చినాయుడు కండ్రిగలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆయన ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యలతో వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ప్రతీకారం, కోపం, పట్టుదలను మరింత పెంచి, కసితో ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొనేలా చేస్తాయని తెలిపారు. రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక సీఎ చంద్రబాబు తప్పుడు కేసులతో వారిని అణచివేయాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నా యకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పోరాటాలు, ఉద్యమాలు, నిరసనల ద్వారా కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి, కేవటం రాజకీయ వేధింపులతో అక్రమ అరెస్టులు చేస్తూ కూటమి నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు. -
ఇది ముమ్మూటికీ కల్పిత స్కామే.. ప్రభుత్వ కుట్రను బయటపెట్టిన భూమన
సాక్షి,తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు అల్లిన కథ తప్ప మరొక్కటి కాదని టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసారు. వాస్తవానికి చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే దేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరుగుతోందని ఆయన తేల్చి చెప్పారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన 3760 లిక్కర్ షాపుల్లో అధిక శాతం కూటమి పార్టీలకు చెందిన వ్యక్తులకే చెందేలా కథ నడిపించారని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో అక్రమాల మీద కేసు నమోదైన నేపధ్యంలో.. కేవలం కక్ష సాధింపుతోనే లేని స్కామ్లో వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టులు చేస్తున్నారని భూమన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..లిక్కర్ స్కాం పేరుతో జరుగుతున్న అరెస్టులు కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రతీకారేచ్ఛతో చేస్తున్న కార్యక్రమం. చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం మాఫియా యధేచ్చగా దోపిడీ చేస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యాన్ని దశలవారీగా నిషేధించుకుంటూ వెళ్లాలన్న సామాజిక స్పృహతో పరిపాలన చేస్తే... చంద్రబాబు మాత్రం తాను అధికారంలోకి వస్తే తక్కువ ధరకే మందు ఇస్తానని ఎన్నికలకు మందు ప్రచారం చేశాడు. నేను తక్కువ ధరకే మద్యం ఇస్తానని చంద్రబాబు తీసుకొచ్చిన మద్యం పాలసీ కారణంగా రాష్ట్రంలో ఇవాళ 3760 బ్రాందీ షాపులును ఆయన తన పార్టీకి, జనసేనపార్టీకి చెందిన ప్రయివేటు వ్యక్తులకే దాదాపు 95 శాతానికి వచ్చేటట్టుగా చేశారు. ఇతరులు ఎవరైనా ఆ షాపులకు పోటీపడితే వాళ్లను బెదిరించి, టెండర్లలో పాల్గొనకుండా చేసి.. తమ పార్టీ వాళ్లకే వచ్చేటట్టు చేయడమే కాకుండా ప్రతినెలా ఒక్కో షాపు నుంచి రూ.1లక్ష వసూలు చేస్తున్నారు. అంటే దాదాపు రూ.370 కోట్లు ప్రభుత్వ ముఖ్యులకు ఈ డబ్బులు ముడుతున్నాయి. ఇంతకంటే పెద్ద స్కామ్ మరొక్కటి లేదు. దానికి పరిహారంగా రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటి గంటకు వెళ్లినా ఆ బ్రాందీ షాపు తెరిచే ఉంచేటట్టుగా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం నిబంధన మాత్రం ఉదయం 10 గంటల తర్వాతే బ్రాందీ షాపు తెరవాలని ఉన్నా... 24 గంటలు షాపులు అందుబాటులో ఉంటున్నాయి. అలా అనుమతి ఇచ్చినందుకే ప్రతి షాపు నుంచి నెలకు రూ.1లక్ష కమిషన్ బిగ్ బాస్ లకు ముట్టుతుంది. రాష్ట్రమంతటా ఇదే పద్దతి కొనసాగుతుంది. టెండర్లు వేసిన తర్వాత నిన్న మొన్నటి వరకు బ్రాందీ షాపు యజమానులకు 9 శాతం కమిషన్ ఇవ్వగా.. ఈ మధ్యనే దాన్ని 14.5 శాతం కమిషన్ పెంచారు. 24 గంటల షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు కమిషన్ కూడా పెంచారు. ఇలా కమిషన్ 5.5 శాతం పెంచడం వల్ల వీరి ఆదాయం రూ.1680 కోట్ల ఆదాయం పెరుగుతుంది. తద్వారా దాదాపు మరో రూ.800 కోట్లు బిగ్ బాస్ జేబులోకి వెళ్తున్నాయని మద్యం షాపులు యజమానులే చెబుతున్నారు.దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3760 బ్రాందీ షాపుల వెనుక ఒక మినీబార్ను ప్రారంభించారు. ఈ బార్లలో 24 గంటలు పాటు అమ్మకాలకు తెరతీసి... తాగే ఏర్పాటుచేస్తున్నారు. ఇదే విషయాన్ని తిరుపతిలో టైమింగ్స్ తో సహా నిరూపించాం. తిరుపతిని రోల్ మోడల్ గా చూపించి.. రాష్ట్రవ్యాప్తంగా చూపించారు. ఇదే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరోవైపు ప్రతి బాటిల్ పైన రూ.10 నుంచి రూ.20 అదనంగా ఇప్పుడు అమ్మడం ప్రారంభించారు. దీని ద్వారా మరలా కొన్ని వందల కోట్ల రూపాయలు టీడీపీ అధినేతకు, మద్యం షాపుల యజమానులకు అందుతుంది. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా మరలా 60 వేల మద్యం బెల్టు షాపులను తెరిచారు. ఈ బెల్టుషాపుల యజమానుల నుంచి కూడా నెలకు రూ.50 నుంచి రూ.60 వేలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. దీనిద్వారా కూడా వందలాది కోట్ల రూపాయాలు చేతులు మారుతున్నాయి. ఇక ఈ బెల్టుషాపులు యజమానులైతే రూ.30 నుంచి రూ.40 ఎక్కువ ధరకు మద్యం బాటిల్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలన్నీ వైఎస్ జగన్ హయాంలో మద్యం విక్రయాల్లో దారుణం జరిగిందని అబద్దాలు చెబుతున్నారే తప్ప.. చంద్రబాబు హయాంలో జరుగుతున్నఅతి పెద్ద మద్యం స్కామ్ దారుణం గురించి ఏ ఒక్కరూ మాట్లాడ్డం లేదు. వైఎస్సార్ హాయంలో కొత్త డిస్టలరీలు ఏర్పాటు చేసి నాసిరకం మద్యం అమ్మకాలు చేశామని..చంద్రబాబు ఆయన్ను మోసే పత్రికలు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ వాస్తవానికి చంద్రబాబు హయాంలో గతంలో ఆయన అనుమతులు ఇచ్చిన 14 డిస్టలరీలే జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా చేశాయి. ఒక్క డిస్టలరీకి జగన్ హయాంలో అనుమతి ఇవ్వలేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలోనూ కనీసం 2-3 బెల్టుషాపులను చంద్రబాబు ప్రభుత్వం తెరిచింది.వైద్యనిపుణులు చెప్పిన మాట ప్రకారం ఏ రకమైన మద్యపానం అయినా ఆరోగ్యానికి హానికరమని చెపుతున్నారు. చంద్రబాబు మాత్రం నేను నాణ్యమైన మందు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు.కానీ వాస్తవంగా ఇవాళ ఆయన పాలనలో రూ.99లకు అత్యంత నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారు. తద్వారా విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. చంద్రబాబునాయుడు నాణ్యమైన మద్యం అందిస్తానని చెబితే.. జగన్ మాత్రం మద్యపానం సామాజిక దురాచారం కాబట్టి దాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తాపత్రయపడ్డారు. అందుకే చంద్రబాబు హయాంలో ఉన్న 4800 పైగా ఉన్నమద్యం షాపులను 2,900 కే కుదించడంతో పాటు మద్యం ధరలు పెంచి ప్రజలను మద్యపానం నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. పెంచిన ధరల ద్వారా ఖజానా ఆదాయం పెరిగింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం- పారదర్శక లిక్కర్ పాలసీ.చంద్రబాబు హయాంలో ఈ ఆర్ధిక సంవత్సరంలోనే విస్కీ, బ్రాందీ బాటిల్స్ గత ప్రభుత్వ హయాం కంటే 25 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. బీరు బాటిల్స్ 16 లక్షల కేసులు అత్యధికంగా అమ్ముడైనా.. ప్రభుత్వ ఆదాయం పడిపోగా.. చంద్రబాబు ఆయన పార్టీకి చెందిన ప్రయివేటు మద్యం షాపుల యజమానుల ఆదాయం కొన్ని వందల రెట్లు పెరిగింది. వేలాది కోట్ల రూపాయాలు వీరి జేబుల్లోకి పోతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు ఓట్లు వేయకపోయినా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పిన థీశాలిగా నిలబడ్డారు. చంద్రబాబు హాయంలో వారు చెప్పిన కొన్ని బ్రాండ్లకు అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చే సంస్కృతి ఉండేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవ్వరికీ అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వలేదు. వాస్తవానికి చంద్రబాబుకి కావాల్సిన 5 మంది డిస్టలరీ యజమానులు 2014-19 మధ్యలో ఏకంగా 69శాతం మద్యం విక్రయించారు. తిరిగి జగన్ హయాంలో వాళ్లకి అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వకపోవడం, మద్యం ధరలు పెంచడంతో ఆ 5 డిస్టలరీల యాజమాన్యం ఇండెంట్ వేయడం ఆపేశారు. చంద్రబాబు హయాంలో ఉన్న 14 డిస్టలరీలే తిరిగి జగన్ హయాంలోనూ మద్యం అమ్మకాలు చేశారే తప్ప కొత్తవాటికి జగన్ అనుమతి ఇవ్వలేదన్నది పచ్చి నిజం. ఈ విషయాన్ని మరుగున పెట్టి... వైస్ జగన్ హయాంలో దోపిడి జరిగినట్టుగా ప్రచారం చేశారు.వాస్తవానికి జగన్ హాయంలో క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి బ్యాటిల్ మద్యాన్ని వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ దుకాణాలకు మందు సరఫరా అయ్యింది తప్పే.. చంద్రబాబు హాయంలో కాదు. జగన్ ప్రభుత్వంలో డిస్టలరీల నుంచి నేరుగా 30శాతం మద్యం ప్రభుత్వ సీళ్లు లేకుండా ప్రభుత్వ షాపుల్లోకి వెళ్లిందని మందు చంద్రబాబు ఆయన్ను మోసే ప్రచార మాధ్యమాల ముఠా అతిపెద్ద ప్రచారం చేసింది. ఐదేళ్ల పాటు మా ప్రభుత్వంపై అంత దాడి చేసిన ఈ ప్రచార మాధ్యమాలు... ఒక్క బాటిల్ అయినా ప్రభుత్వ సీలు లేకుండా బయటకు వస్తే ఎందుకు కనిపెట్టలేకపోయారు. అదే ఇప్పుడు మీ ప్రభుత్వంలో 24 గంటలు మద్యం షాపులు తెరుస్తున్నారు... ప్రతి మద్యం షాపు వెనుక బార్ ఉందని... మీ షాపుల్లో ఇంత ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మేం స్వయంగా వెళ్లి పరిశీలించి రాష్ట్రానికంతటికీ తెలియజెప్పాం. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే ఆ రోజు ఎందుకు మీరు నిరూపించలేకపోయారు. కారణం మీరు చెప్పింది పచ్చి అబద్దం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క బాటిల్ కూడా క్యూఆర్ కోడ్, వెరిఫికేషన్ లేకుండా ప్రభుత్వ దుకాణానికి రాలేదన్నది పచ్చి నిజం. కానీ మేం ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో మీరు జగన్ మీద విషప్రచారం చేశారు.అడుగడుగునా ఎల్లో మీడియా విషప్రచారం.వైఎస్ జగన్ రైతుల కోసం వస్తే ఏకంగా దండుపాళ్యం బ్యాచ్ దాడిచేసిందన్నారు. ఇవాళ అదే ఎల్లో మీడియా మహిళల మీద ఇష్టం వచ్చినట్లు రాశారు. జగన్ మందు తాగి అది కూడా ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం పురుషులు 8810 అయితే మహిళలు 3833 మందికి నరాలు దెబ్బతిన్నాయి అని రాశారు. అంటే మహిళలు తాగుబోతులని చెప్పడం కాదా మీ అవసరాల కోసం, జగన్ మోహన్ రెడ్డిని హననం చేయడం కోసం మహిళల నరాలు పాడయ్యాయని రాశారు. 2,500 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టే.. చంద్రబాబు హయాంలో జరిగిన దారుణాలకు, ఘోరాలకు అనారోగ్యం పాలైన వాళ్లే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ పొంది తమ అనారోగ్యాన్ని నయం చేసుకున్నారన్నది ముమ్మూటికీ నిజం.జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా ఒక్క తాగుబోతు రోడ్లమీద కనబడలేదు... మీ పత్రికల్లో కూడా రాయలేదు. కానీ ఇవాళ నడిరోడ్లలో రాష్ట్రమంతా తాగుబోతులు విపరీతంగా దౌర్జన్యాలు, అల్లర్లు చేస్తూ చివరికి తిరుమలలోనే వేంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరే ఎంత మందు కావాలి అని తాగుబోతు సవాల్ చేస్తే.. మరో నలుగురు తాగుబోతులు అక్కడే నృత్యం కూడా చేశారు. అంటే చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఎంత పచ్చిగా తాగుడు ఉద్యమాన్ని పెంచి పోషిస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.మద్యం కేసులో మీడియా ట్రయిల్స్..మద్యం పాలసీ దర్యాప్తు వ్యవహారంలో ఈ అవినీతి పత్రికలు వంటే ఎక్కువగా ఉంది. దాన్నే మరుసటి రోజు సిట్ అందుకుని కథ నడిపిస్తోంది. ఒక్క రూపాయి అవినీతి జరగకపోయినా.. ఒక్క రూపాయి పట్టుబడకపోయినా.. పట్టుబడి రూ.63 కోట్లు సొమ్ము మద్యం కుంభకోణానికి సంబంధించింది కాకపోయినా .. దాన్ని మద్యం కుంభకోణానికి సిట్ జోడించ తప్పుడు కేసులు బనాయించింది. గతంలో చంద్రబాబు హాయంలో మద్యం కుంభకోణంలో ఆయన మీద కేసులు నమోదైతే.. గౌరవ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తో బాబు బయటపడ్డాడు. దీంతో తన మీద కేసులు పెట్టారన్న కక్షతో ఇవాళ వైఎస్సార్ సీపీ నేతలు, అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎక్సైజ్ సీల్ లేకుండా మా హయాంలో ఒక్క బ్యాటిల్ కూడా పట్టుబడలేదు.మా నాయకుడు వైఎస్ జగన్ ఎల్లప్పుడూ మనిషికి అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయం,మహిళా సాధికారత వంటి మహోన్నతంశాలే ప్రాధాన్యంగా పనిచేస్తే... చంద్రబాబుకి విస్కీ, బ్రాందీ అమృత తుల్యమైనవి. ప్రజలతో ఎంత మందు తాగిస్తే.. చంద్రబాబు ఆదాయం అంతలా పెరుగుతుంది కాబట్టే దేశంలోనే లేని విధంగా మద్యం కుంభకోణం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. జగన్ హాయంలో అప్పటి మద్యం పాలసీ వల్ల ప్రభుత్వానికి ఒక్క నయాపైసా కూడా ఆదాయం తగ్గలేదు. అదే చంద్రబాబు ఇంతపెత్త ఎత్తున మద్యం అమ్మకాలు చేస్తున్నా.. ప్రజలందరినీ తాగుబోతులుగా మార్చడానికి ఉద్యమ రూపంలో పోరాటం చేస్తున్నా మద్యం అమ్మకాలు పెరిగాయే తప్ప.. ప్రభుత్వానికి ఆదాయాలు తగ్గుతున్నాయి కారణమేమిటంటే.. చంద్రబాబు ఆయన పార్టీ పెద్దలు, టీడీపీకి చెందిన మద్యం షాపులు యజమానుల జేబుల్లోకి రూ.1000 కోట్ల పైగా ఆదాయం పోతుంది.మా హయాంలో మద్యం పాలసీ వల్ల రూ.50 వేల కోట్ల స్కాం అని, దాన్ని రూ.30 వేల కోట్లకు మార్చి.. చివరకు రూ.5 వేల కోట్లు అని చెపితే అది కాస్తా ఇప్పుడు రూ.2,500 కోట్లకు జారింది. అదే చంద్రబాబు హాయంలో వేలాది కోట్ల రూపాయాలు స్కామ్ జరుగుతున్నా దాని గురించి మాత్రం ఆయన్ను మోసే ప్రచార మాధ్యమాలు ఎక్కడా మాట్లాడవు. ఎదుట వారి మీద ఆరోపణలు చేయడం కాదు.. మీ వాళ్లు చేస్తున్న తప్పులను ఎండగడితేనే పత్రికావిలువలు. కానీ మీరు ఇష్టమొచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి పాలన మీద చేస్తున్న దాడి, మీ రాతల ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలకు అర్ధం అయింది. మీరే ముందు ఫలానా స్కామ్ అని రాస్తారు. కొద్ది రోజుల తర్వాత ఫలానా వ్యక్తి మాస్టర్ మైండ్ అని రాస్తారు. ఆ తర్వాత మరో ఇద్దరు కలిసారు అని రాస్తారు. దానిపై కేసు నమోదు చేస్తారు. అందులో భాగంగానే మిధున్ రెడ్డి లాంటి సౌమ్యడును, తమ జీవిత కాలమంతా నిజాయితీ పరులై అధికారులుగా పేరు తెచ్చుకున్న కృష్ణమోహనరెడ్డి, ధనంజయ్ రెడ్డి లాంటి అధికారులను, జీవితకాలంలో లిక్కర్ వాసన చూడని చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి వాళ్లను అరెస్టు చేస్తారు. ఇదంతా రాజకీయ పూరితమైన కుట్ర. ఇది రాజకీయ ట్రయిల్ తప్ప మరొక్కటి కానే కాదు.బాబు లిక్కర్ స్కామ్పై మరింత ఉద్యమం...చంద్రబాబునాయుడు ఇవాళ మద్యం పాలసీ ద్వారా చేస్తున్న దోపిడీ మీద వైఎస్సార్సీపీ మరింత ఉద్యమిస్తుంది. మీ పాలనలో జరుగుతున్నవంచనను ప్రజలకు తెలియజేస్తాం. మిమ్నలని మోసే పత్రికలు.. మద్యం ప్రియలకు వెసులుబాటు,ఊరట అని రాసే రాతలు వార్తలు ప్రపంచానికి అవసరం లేదు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు.. సూపర్ సిక్స్ సహా కూటమి పార్టీలు ఇచ్చిన 143 హామీల అమలు ఇవీ ప్రజలకు అవసరమైనవి. ఇవాళ మంత్రి అచ్చన్నాయుడు ఓ సభలో మాట్లాడుతూ... సూపర్ సిక్స్ హామీలో ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలన్నాడు. మరి ఆ రోజు మీ పార్టీ ఎందుకు ఈ హామీ ఇచ్చింది. కేవలం ఓట్లు దండుకోవడానికి అబద్దాలు చెప్పి... ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్నాడు.మామిడి కొనుగోళ్లు- చేతకాని పాలన జూలై 21న కేంద్ర ప్రభుత్వ వ్యవసాయమంత్రిత్వ డిప్యూటీ కమిషనర్ రాష్ట్ర వ్యవశాయశాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీకి లేఖ రాస్తూ... 1.62 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కిలోకు రూ.3.85 కు మద్ధతు ధర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తుందని చెప్పారు. తోతాపురి కాగడా పెట్టి వెదకని రోజులలో ఈ లేఖ రాశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం వస్తున్నాడంటే.. తోతాపురి మామిడి ఎక్కడుంది, అంతా కొనుగోలు చేశారని ఊదరగొట్టి రాసిన తెలుగుదేశం పార్టీ పత్రికలు, ఛానెళ్లు ఇప్పుడు ఏం చెబుతాయి. ఈ స్ధాయిలో కొనుగోళు చేయాలంటే వచ్చే ఏడాది కావాలే తప్ప.. ఈ ఏడాది లేవు. ఇప్పుడు మద్ధతు ధర ప్రకటించి ఏం ప్రయోజనం. గతంలో కేజీకి రూ.4 ఇస్తానన్న చంద్రబాబు ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.3.85 కు చెరిసగం భరిస్తూ కొనుగోలు చేస్తామని రాశారు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామికి సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి లేఖ రాస్తే... పదవీ విరమణ చేసిన ఎక్స్ అఫిషియో సెక్రటరీకి కేంద్ర వ్యవసాయశాఖ డిప్యూటీ కమిషనర్ లేఖ రాశారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఏ స్థాయి గౌరవం ఉందో ఈ లేఖను బట్టి తెలుస్తోందని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన్ను రాజకీయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం బలంగా ప్రతిఘటిస్తుంది కాబట్టి వారిని కావాలనే ఇరికించారని చెప్పారు. ఈ లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు ప్రభుత్వం అల్లిన ప్యాబ్రికేటెడ్ స్కామ్ అని ఇప్పడు తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతున్నదే అసలైన అతిపెద్ద మద్యం స్కామ్ అని భూమన స్పష్టం చేశారు. -
ప్రత్యేక పరిషత్తులతో సంపూర్ణ జ్ఞానం
సంపూర్ణ జ్ఞానం అందించడానికే సంస్కృత వర్సిటీలో ప్రత్యేక పరిషత్తులు ఏర్పాటు చేసినట్లు వీసీ కృష్ణమూర్తి తెలిపారు.– 10లోస.హ. చట్టంపై అవగాహన అవసరం తిరుపతి అర్బన్: సమాచార హక్కు చట్టంపై అందరికీ అవగాహన ఉండా ల్సిన అవసరం ఉందని ఉద్యానశాఖ జిల్లా అధి కారి దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని తమ కార్యాలయంలో సోమవారం మండల ఉద్యానశాఖ అధికారులతో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన పరిపాలనకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ప్రకారం, ప్రతి భారత పౌరుడికి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న సమాచారాన్ని పొందే హక్కు ఉందన్నారు. జిల్లాసూక్ష్మ నీటిపారుదల విభాగం జిల్లా అధికారి సతీష్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ విభాగం తమ వద్ద ఉన్న సమాచారాన్ని పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆగస్టు 11 నుంచి బీఈడీ పరీక్షలు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 11 నుంచి 14వ తేదీ వరకు రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించి 30లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు కోసం జ్ఞానభూమి పోర్టల్ను సందర్శించాలని సూచించారు. – 10లో -
సమస్యలన్నీ పరిష్కరించండి
● గ్రీవెన్స్కు 329 అర్జీలు ● ఒక్కో అర్జీదారునిది..ఒక్కో ఆవేదన తిరుపతి అర్బన్: ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ను కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసు కుంది.. ప్రతి అర్జీకి సంబంధించిన సమస్యను పరిష్కారించాలని జేసీ శుభం బన్సల్ పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలకు కొందరు కలెక్టరేట్కు వస్తున్నారని, స్థానికంగా అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించి న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 329 అర్జీలు వచ్చాయి. అందులో 165 అర్జీలు రెవెన్యూ సమస్యలు కాగా వివిధ సమస్యలపై 100 మందికి పైగా ది వ్యాంగులు గ్రీవెన్స్లో అర్జీలు అందజేశారు. గ్రీవెన్స్ సమయంలో కొందరు అధికారులు కలెక్టరేట్ ప్రాంగణంలో తిరుగుతూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాలయాపన చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ సోమవారం మధ్యాహ్నం వరకు అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దామినేడులో నాగాలమ్మ ఆలయాన్ని ఓ నేత కూల్చివేశారని, అయితే తిరిగి నిర్మిస్తామని రెవెన్యూ అధికారుల వద్ద హామీ ఇచ్చిన పట్టించుకోవడం లేని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. డక్కిలి మండలం దగ్గువోలులో ఈ నెల 25, 26, 27 తేదీల్లో తాళమ్మ కొలుపు నిర్వహిస్తున్నందన గ్రామంలోని మద్యం దుకాణాన్ని మాసివేయాలన్నారు. రోడ్డు విస్తరణ లో ఇల్లు తొలగింపునకు అధికారులు మార్కింగ ఇ చ్చి రెండు నెలలైనా తమకు పరిహారం అందలేదని రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీకి చెందిన మంగమ్మ (78), వెంకటసుబ్బయ్య(81) దంపతులు జేసీకి విన్నవించారు. తాము లేచి నిలబడలేని స్థితి అని, తమ గ్రామస్తుడు శివప్రసాద్ తమను కలెక్టరేట్కు తీసుకొచ్చారన్నారు. వారిద్దరు కలెక్టరేట్లో నిర్వహించిన మెడికల్ క్యాంప్లో బీపీ, షుగర్ పరీక్షలతోపాటు మందులు స్వీకరించారు. -
జేసీ ఆదేశించినా..ఎంపీడీఓ కనికరించరా?
సాక్షి, టాస్క్ఫోర్స్: ‘పంచాయతీ నిధులతో నిర్మించిన సిమెంటు రోడ్డుపై కంచె ఏర్పాటు చేసి ఓ ఇంటికి రాకపోకలు లేకుండా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు.. తక్షణం ఆ గ్రామానికి వెళ్లి ఆ ఇంటికి అడ్డుగా నిర్మించిన ఇనుప కంచెను తొలగించండి.. ఆ దారిలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయండి..’ అని జేసీ శుభం బన్సల్ ఎర్రావారిపాళెం ఎంపీడీఓ సీహెచ్ మదనమోహన్ రాజును ఆదేశించారు. అయినా ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లి పంచాయతీ బడగనపల్లిలో నివాసముంటున్న వెంకటరమణ ఇంటికి అదే గ్రామానికి చెందిన చరణ్కుమా ర్, మంజుల, రాజేశ్వరి దారి లేకుండా అడ్డుకోవడాన్ని సోమ వారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో వినతిపత్రం అందించారు. తమ ఇంటికి వెళ్లడానికి వీలు లేకుండా పంచాయతీకి చెందిన సిమెంటు రోడ్డుపై ఇనుప కంచెను కట్టిన ఫొటోలు, సాక్షి పత్రికలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను చూపించారు. దీనిపై శుభం బన్సల్ వెంటనే స్పందించి ఎర్రావారిపాళెం ఎంపీడీఓ మదనమోహన్రాజుకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడగనపల్లిలో సమస్యను తక్షణం పరిష్కరించి తన కు ఫోన్ చెయాలని ఆదేశించారు. అయినా ఆ ఎంపీడీఓ ఏ మాత్రం లెక్క చేయకపోవడం, పైగా రాజకీయ ఒత్తిళ్లతో తా ను ఆ సమస్య పరిష్కరించలేనని బాధితుడు వెంకటరమణ కు చెప్పడం విశేషం. కాగా ఇనుప కంచెను తొలగించడానికి పోలీసులు ముందుకు వచ్చినా ఎంపీడీఓ ముఖం చాటేయడంతో వారు కూడా వెనుదిరిగి వెళ్లక తప్పలేదు. గత వారం రోజులుగా తమ ఇంటికి దారి లేకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఆ దారిలో రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
ఆకట్టుకున్న అభినయ ఆర్ట్స్ నాటకోత్సవాలు
తిరుపతి కల్చరల్: అభినయ ఆర్ట్స్ జాతీయ నాటక పోటీల్లో భాగంగా మహతి కళాక్షేత్రంలో సోమ వారం ప్రదర్శించిన శాసీ్త్రయ, జానపద నృత్యాలు, పౌరాణిక, సాంఘిక నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన శాసీ్త్రయ, జానపద బృంద నృత్య పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొని, తమదైన శైలిలో చక్కటి హావభావాలు, అభినయంతో నృత్య ప్రదర్శనలతో సభికులను అలరింపజేశారు. ఈ సందర్భంగా కళాకారులను అభినయ ఆర్ట్ కార్యదర్శి బీఎన్.రెడ్డి, సంస్థ ప్రతినిధులతో కలిసి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి అభినందించారు. -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ హేయమైన చర్య
సూళ్లూరుపేట: ఎంపీ పెద్దిరెడ్డి మిఽథున్రెడ్డిని అరెస్ట్ హేయమైన చర్య అని, ఇది కూటమి ప్రభు త్వ కుట్రపూరిత, కక్షపూరిత రా జకీయంలో భాగమేనని సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కిలివేటివ సంజీవయ్య ధ్వజమెత్తారు. సోమవారం ఆ యన సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘అక్రమ మద్యం కేసు అని.. దాని కి ఎలాంటి మూలాలు లేకుండా, సాక్ష్యాధారా లు లేకుండా బోడిగుండుకు మోకాలికి ముడివేసినట్టుగా ఉంది. జగనన్నకు అండగా నిలిచిన వారి పేర్లును రెడ్బుక్లో రాసుకుని వారినే టా ర్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారు. సిట్ అధికారులు చంద్రబా బు, లోకేష్ చెప్పింది చెప్పినట్టుగా విని అక్రమ అరెస్ట్లకు పాల్పడుతున్నారు. చంద్రబాబు మద్యం వ్యాపారాన్ని అక్రమంగా చేసిన వ్యక్తి కాదా!. డిస్టలరీలు, వివిధ రకాలైన బ్రాండ్లు తీసుకొచ్చి ప్రైవేట్ ముసుగులో మోసం చేయలేదా?. బెల్టుషాపులు నిర్వహించి గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదా..? దీనిపై ఆయనపై కేసు పెడితే ప్రస్తుతం ఆయన బెయిల్ మీదే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి’ అని అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేయలేదా? ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అధికారంలో వచ్చాక రెడ్బుక్ పాలన చేస్తున్న పెద్ద బాబు, చిన్నబాబుకు ముందుంది ముసళ్ల పండుగ అని సంజీవయ్య అన్నారు. నేతలు జెట్టి వేణుయాదవ్, చిన్న సత్యనారాయణ, స్వామిరెడ్డి, బందిలి మహేష్ అయితా శ్రీధర్, వాకాటి బాబురెడ్డి, నందారెడ్డి, హుస్సేన్, జయకుమార్, పర్వతరెడ్డి రవిరెడ్డి, చిలకా యుగంధర్, సురేష్, బద్దెపూడి మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
పరిహారం.. పరిహాసం
● పూర్తిస్థాయి పరిహారం చెల్లించకనే భూమి స్వాధీనానికి యత్నం ● ఏపీఐఐసీ చిన్నపాండూరు సెజ్లో అధికారుల అత్యుత్సాహంవరదయ్యపాళెం : మండలంలోని చిన్న పాండూరుకు చెందిన డి.రత్నయ్య పేరిట సర్వే నంబర్ 83/3లో 1.73 ఎకరాలు, డి.శకుంతలమ్మ పేరిట సర్వే నంబర్ 83/2లో 1.48 ఎకరాల డీకేటీ భూమి ఉంది. 2015లో చిన్న పాండూరు ప్రాంతంలో అపోలో టైర్స్ పరిశ్రమ, మరికొన్ని ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం ఏపీఐఐసీ సెజ్ ఏర్పాటైంది. ఆ సమయంలో రైతులు డి.రత్నయ్య, బి.శకుంతలమ్మకు చెందిన భూములను భూ సేకరణకు నోటిఫై చేశారు. ఎకరాకు రూ. 6.50 లక్షలను పరిహారం కింద కేటాయించారు. అయితే అధికారుల తప్పిదంతో రత్నయ్య, శకుంతలమ్మ భూములకు బి కేటగిరీ కింద ఎకరాకు రూ.3.25 లక్షలు మాత్రమే కేటాయిస్తూ పరిహారాన్ని మంజూరు చేశారు. దీన్ని వ్యతిరేకించిన రైతులు ఇద్దరూ భూమి పూర్తి స్థాయిలో తమ అనుభవంలో ఉందని, అంతేకాక సాగు చేసుకుంటున్నామని భూములకు సంబంధించి డీ పట్టా, ఇతర పాసు పుస్తకాలు, రికార్డులు అన్నీ తమపైన ఉన్నా పూర్తిస్థాయి పరిహారం ఎందుకు ఇవ్వరని వారు కలెక్టర్ కు విన్నవించారు. అయితే అప్పటి నుంచి గత పదేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా నేటికీ పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. ఇప్పటి వరకు రైతులు ఇద్దరూ వారికి చెందిన భూముల్లో ఏటా పంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్లుగా పోరాటం రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదానికి ఆ రైతులకు పదేళ్లుగా పోరాటమే మిగిలింది. తమ భూమికి ఎకరాకు ప్రభుత్వం కేటాయించిన రూ. 6.50 లక్షలు అందాల్సి ఉండగా అందులో బి కేటగిరీ ద్వారా సగం పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. 2016లో పరిహారం చెల్లించే ప్రక్రియ జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు వృద్ధాప్యంలో ఉన్న రైతులు రత్నయ్య, శకుంతలమ్మ గత పదేళ్లుగా తిరుగుతూనే ఉన్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. ఇప్పటికీ రైతు రత్నయ్యకు రూ. 5.61 లక్షలు, శకుంతలమ్మకు రూ.4.81 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది. రైతులు రాకుండా ట్రెంచ్ల ఏర్పాటు రైతు రత్నయ్య, శకుంతలమ్మ భూమి చుట్టూ దారి లేకుండా రైతులు పొలంలోకి రాకుండా ట్రెంచ్లు ఏర్పాటు చేశారు. కందకాలను తక్షణమే పూడ్చివేసి భూములకు దారి సౌకర్యం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై వరదయ్యపాళెం మండలం తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని వారు చెబుతున్నారు. తక్షణమే ఏపీఐఐసీ ఉన్నతాధికారులు స్పందించి తాము సాగు చేసుకునేందుకు వీలుగా దారి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.ఏపీఐఐసీ నుంచి పరిహారం అందజేశాం వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు ఏపీఐఐసీ సెజ్కు సంబంధించి రెండో విడతలో 17.16 ఎకరాలను భూసేకరణ ద్వారా ఏపీఐఐసీకి స్వాధీన పరిచారు. అయితే ఆ భూములకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన విధంగా పరిహారం మొత్తాన్ని భూ సేకరణ విభాగానికి అందజేశాం. అయితే రైతులకు రికార్డుల ఆధారంగా భూసేకరణ అధికారులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో రైతులకు పరిహారం అందించాల్సి ఉంది. భూసేకరణ అధికారులు ఇచ్చిన మేరకు ఏపీఐఐసీ ఆ భూములను స్వాధీనం చేసుకుంది. త్వరలో ఆ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అందు కోసం రైతులు సాగు చేసుకునేందుకు వీలు లేకుండా ట్రెంచ్లు తవ్వించాం. పరిహారం అందని రైతుల వివరాలను మరోసారి పరిశీలన చేసి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తాం. అప్పటి దాకా రైతులు సహకరించాలి. – విజయ్ భరత్ రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, తిరుపతి -
ఏబీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా రాస్ వెంకటరత్నం
తిరుపతి కల్చరల్: స్వర్గీయ పద్మవిభూషణ్ డాక్టర్ నిర్మలాదేష్ పాండే స్థాపించిన అఖిల భారత రచనాత్మక సమాజ్(ఏబీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడిగా రా ష్ట్రీయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.వెంకటరత్నం నియమితులయ్యారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో సేవాధామ్ ఆశ్రమంలో ఈనెల 20వ తేదీన ఏబీఆర్ఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎస్.వెంకటరత్నంను ఏబీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసి, ఆలిండియా హరిజన సేవక్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు శంకర్ కుమార్ సన్యాల్, బీహార్ మాజీ ఎంపీ నరేశ్ యాదవ్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు. రాస్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులు, జనరల్ బాడీ సభ్యులు, ఇతర సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఎస్వీయూ సైన్స్ కళాశాలకు ఎన్పీటీఈఎల్ ప్రశంసలు తిరుపతి సిటీ: జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా వర్సిటీలో విద్యార్థులు స్వ యంగా ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందే కోర్సులను ‘స్వయం’ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ కోర్సుల రూపకల్ప న, బోధనలో ఐఐటీ, ఎన్ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్వీయూ పీజీ కోర్సుల్లో స్వయం కోర్సులను ప్రవేశపెట్టింది. 2025 జనవరి – ఏప్రిల్ సెమిస్టర్లలో వర్సిటీ సైన్స్ కళాశాల గణిత విభాగానికి చెందిన ఆచార్య భారతి కీలక భూమిక పోషించారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తూ ఎన్పీటీఈఎల్ సంస్థ ప్రశంసా పత్రాలు పంపింది. ఈ సందర్భంగా వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పద్మావతి ఆమెను అభినందించారు. ఔట్ సోర్సింగ్ శానిటరీ సిబ్బందికి జీతాలు పెంపు తిరుపతి తుడా: నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ శానిటరీ సిబ్బందికి వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు ఆయా మున్సిపల్ కార్యాలయాల సొంత నిధుల నుంచే ఇవ్వాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వదని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. కేటగిరి–1 కింద పనిచేస్తున్న శానిటరీ వర్కర్లకు రూ.21,500 నుంచి రూ.3 వేలు పెంచుతూ రూ.24,500 వేతనం చెల్లించనున్నారు. అలాగే కేటగిరీ–2 వర్కర్లకు ప్రస్తుతం అందిస్తున్న రూ.18,500 నుంచి రూ.21,500 పెంచారు. కేటగిరీ–3 వర్కర్లకు రూ.15 వేల నుంచి రూ.18, 500 చెల్లించాలని నిర్ణయించారు. చెక్ బౌన్స్ కేసులో కింది కోర్టు తీర్పు అమలు తిరుపతి లీగల్:చెక్ బౌన్స్ కేసు తీర్పుపై దాఖలు చేసిన అపీల్ను కొట్టి వేస్తూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి సోమవారం తీర్పు చెప్పినట్టు ఫిర్యాది తరపు న్యాయవాది ముని భాస్కర్ తెలిపారు. తిరుపతి, పీకే లేఅవుట్కు చెందిన కే వెంకట్ రెడ్డి వద్ద తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, సీఆర్పీఎఫ్లో ఉమెన్ హెడ్ కానిస్టేబుల్గా ఉన్న పి విజయదుర్గ అలియాస్ జీవి దుర్గ భర్త 2012 అక్టోబర్ 25వ తేదీ రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము చెల్లించే క్రమంలో 2016 నవంబర్ నెలలో రూ.5.50 లక్షల విలువచేసే రెండు చెక్కులను ఆమె వెంకట్రెడ్డికి ఇచ్చారు. అతను ఆ రెండు చెక్కులను బ్యాంకులో వేయగా బౌన్స్ అయ్యాయి. దీనిపై అతను విజయదుర్గపై తిరుపతి ఆరో అదనపు ప్రత్యేక జూనియర్ జడ్జి కోర్టులో చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి మూడు నెలల్లోపు ఆమె రూ.15,60,000 అతనికి చెల్లించాలని, లేకుంటే ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు చెప్పారు. ఆ తీర్పుపై ఆమె స్థానిక నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కింది కోర్టు తీర్పును అమలు చేయాలంటూ తీర్పులో పేర్కొన్నారు. -
30న జీఎస్ఎల్వీ ఎఫ్16 ప్రయోగం
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ ద్వారా 2,392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ ఉపగ్రహాన్ని 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. -
ఐఐటీ పట్టభద్రుల పట్టాభిషేకం
418 మందికి పట్టాలతో సత్కారం స్నాతకోత్సవంలో ఐఐటీలో చదివిన మొత్తం 418 మంది విద్యార్థులకు ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ చేతుల మీదుగా పట్టాలను అందించి ఘనంగా సత్కరించారు. అందులో మొత్తం 212 మంది విద్యార్థులకు బీటెక్ డిగ్రీ పట్టాలు, 91 మందికి ఎంటెక్ డిగ్రీ పట్టాలు, 53 మందికి ఎంఎస్సీ డిగ్రీ పట్టాలు, 16 మందికి ఎంపీపీ డిగ్రీ పట్టాలు, 13 మందికి ఎంఎస్ (రీసెర్చ్) డిగ్రీ పట్టాలు, 28 మందికి పీహెచ్డీ డిగ్రీ పట్టాలు, ఒకరికి ఎంటెక్, పీహెచ్డీ డ్యూయెల్ డిగ్రీ పట్టా, ఒకరికి డిప్లొమా పట్టా, మరొకరికి సర్టిఫికెట్ ఆప్ ఫౌండేషన్ పట్టాలను ప్రదానం చేశారు. విద్యార్థులు పట్టాలు అందుకుంటుండగా సభికులు కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. ● అట్టహాసంగా తిరుపతి ఐఐటీ 7వ స్నాతకోత్సవం ● కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆనందోత్సవాలు ఏర్పేడు : వారంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అత్యున్నత ప్రతిభావంతులు... ప్రఖ్యాత జాతీయ విద్యాసంస్థ శ్రీఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి ప్రాంగణంలో సీటు సంపాదించి దిగ్విజయంగా కోర్సును పూర్తి చేశారు. ఏళ్ల తరబడి తాము పుస్తకాలతో కట్టిన దోస్తీ.. మెదడులో కదలాడిన విభిన్న ఆలోచనలతో ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు.. తాము ఎంచుకున్న కోర్సులో అత్యుత్తమ ప్రతిభను కనబరచి గొప్ప మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకునేందుకు తెల్లకోటు ధరించి..తిరుపతి ఐఐటీ లోగోతో కూడిన వస్త్రాన్ని కప్పుకుని తల్లిదండ్రులు, ఆప్తులు, అనుయాయుల కరతాళ ధ్వనుల మధ్య ఆచార్యుల చేతుల మీదుగా అందుకున్న ‘పట్టా’ వారందరిని ఆనందంలో ముంచెత్తింది. పట్టాను అందుకుని భవిష్యత్తులో తాను చేరాల్సిన గమ్యాన్ని మదిలో తలచుకుని సంతోషంలో మునిగితేలారు. ఆదివారం సాయంత్రం జరిగిన తిరుపతి ఐఐటీ 7వ స్నాతకోత్సవ వేడుక వారందరి జీవితాల్లో ఓ మరపురాని ఘట్టంగా నిలిచింది. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఆదివారం సాయంత్రం ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ అధ్యక్షతన 7వ స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రియా యూనివర్శటీ చాన్సలర్, కాగ్నిజెంట్ కో ఫౌండర్ లక్ష్మీనారాయణన్, జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ గవర్నింగ్ బాడీ చైర్మన్గా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏర్పేడు సమీపంలోని శాశ్వత ప్రాంగణంలో నడుపుతున్న ఐఐటీలోని వసతులు, కోర్సులలో ఉన్న విద్యార్థులు, సాధించిన విజయాలు, అధిగమించిన సవాళ్లను గురించి వివరించారు. స్నాతకోత్సవ వేడుకలో విద్యార్థులతో కలసి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్లనున్న విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగానికి ఉన్న ప్రాధాన్యం గుర్తించి అవకాశాలను అందిపుచ్చుకుని గొప్ప ఆవిష్కర్తలుగా మారి దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్నారు. ముఖ్య అతిథి లక్ష్మీనారాయణన్ మాట్లాడుతూ.. గొప్ప ఇంజినీర్లుగా రాణించి నూతన ఆవిష్కరణలతో దేశాన్ని ముందు వరుసలో నిలపాలన్నారు. జీవితంలో ప్రతి దశలోనూ సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన ఎంతో అవసరమన్నారు. ప్రణాళికతో కూడిన కఠోర శ్రమతోనే పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారన్నారు. ప్రెసిడెంట్, గవర్నర్ పతకాలు ప్రదానం తిరుపతి ఐఐటీలో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు సర్వతోముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. బీటెక్ (సీఎస్ఈ) విద్యార్థి అరవింద్ శ్రీనివాసన్కు బెస్ట్ అకడమిక్ పెర్ఫామెన్స్ ఇన్ ద బీటెక్ ప్రోగ్రాం కింద స్నాతకోత్సవ సభలో ప్రెసిడెంట్ మెడల్, బంగారు పతకం అందించి సత్కరించారు. అలాగే ఆల్రౌండ్ ప్రొఫెసియెన్సీ ఇన్రికులర్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇన్ బీటెక్ ప్రోగ్రాంలో ప్రతిభను కనబరిచిన బీటెక్(కెమికల్ ఇంజనీరింగ్) విద్యార్థిని మేఘవర్షిణి గవర్నర్ పతకంతో సత్కరించారు. మేఘవర్షిణి కమతం కృష్ణయ్య అవార్డును కూడా అందుకున్నారు. అలాగే ఆర్వీ అసోసియేట్ ప్రైజ్ను కొత్తపల్లి ఈశ్వర్ వెంకటసాయి వర్మ, ఫస్ట్ డీన్ ప్రైజ్ను షేక్ మహ్మద్ అల్లాబక్షి ఇన్స్టిట్యూట్ ప్రైజును పింకేష్కుమార్ మిశ్రా, అరవింద్ శ్రీనివాసన్, టి.ఆదిత్యన్, గౌరవ్ త్రిపాఠి, బి.గాయత్రి, కె.మదన్మోహన్, జయదీప్రాయ్, రితిక్ మండల్, అమరరాజ ప్రైజ్ను సుధాకర్ వెంకటాచలం, ఐటీసీ లిమిటెడ్ ప్రైజ్ను శృతి షజి, రామకృష్ణన్ అండ్ లక్ష్మీకాంతన్ మెమోరియల్ ప్రైజ్ను చిరంజీవి, శ్రీనివాసన్ నటరాజన్ అవార్డును ఆకాష్ ఉనియల్, ఆకురతి కుమారస్వామి ప్రదానం చేశారు.